East Godavari
-
104, 108 వ్యవస్థల నిర్వీర్యం
అత్యవసర వైద్య సేవలు అందించే 104, 108 వ్యవస్థలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేసింది. ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన, వేతనాల కోసం ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని ఆందోళన చేస్తున్న ఉద్యోగులు సాక్షి, రాజమహేంద్రవరం: అత్యవసర సేవలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇప్పటికే 104, 108 వ్యవస్థలను నిర్వీర్యం చేసిన సర్కారు తాజాగా మూగజీవాలపై ‘పచ్చ’పాతం చూపుతోంది. పశువులకు అత్యవసర వైద్యం అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంచార వైద్య సేవలకు మంగళం పాడింది. ఉన్న పళంగా ఆరోగ్య సేవలు నిలిపివేసి వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 16 సంచార పశువైద్య వాహనాలు ఆగిపోయాయి. ఫేజ్–1లో వాహనాలు తిరిగి ఆయా పశువైద్య శాఖ ఏడీ కార్యాలయంలో అప్పగించి తమకు రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. వీటిలో పనిచేసే పైలట్, పారావిట్, డాక్టర్, పైలట్ రిలీవర్లు సుమారు 48 మంది విధులకు హాజరు కాకూడదని వాట్సాప్ మెసేజ్ ద్వారా సూచించారు. ఉద్యోగాలు తిరిగి ఇస్తారా? లేక ఇంతటితో ఆగిపోవాలా? అన్న స్పష్టత లేకపోవడంతో ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అకస్మాత్తుగా తొలగింపు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022 మే మాసంలో అంబులెన్స్ సేవలు ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒక వాహనం కేటాయించారు. అందులో డాక్టర్కు నెలకు రూ.37,000, పారావిట్స్కు రూ.13,400, డ్రైవర్కు రూ.10,500 వేతనం చెల్లిస్తున్నారు. గత మూడేళ్లుగా సిబ్బంది అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలు అందిస్తున్నారు. ఉన్నపళంగా వెళ్లమని.. పశు అంబులెన్స్ సేవలను జీవీకేఈఎంఆర్ఐ సంస్థ నిర్వహిస్తోంది. ఈనెల 16వ తేదీ నాటికి సంస్థ కాంట్రాక్ట్ గడువు ముగిసిందని, విధుల నుంచి తప్పుకోవాలంటూ ప్రభుత్వం ఉద్యోగులకు నోటీసులు పంపింది. ఒక్క సారిగా చెప్పడంతో ఉద్యోగులు అవాక్కవుతున్నారు. ఉద్యోగాల తొలగింపు అంశంతో రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెరుగుతాయని భావించిన తమకు చేదు అనుభవం ఎదురైందని వాపోతున్నారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. పశువైద్య శాఖ ఏడీ కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఉద్దేశం ఇదీ.. పశుపోషకుల ఇంటి ముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చింది. రూ.278 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్లు తీసుకురాగా.. తూర్పుగోదావరి జిల్లాకు 16 అంబులెన్సులు కేటాయించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బృహత్తర కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు 108 అంబులెన్సుల తరహాలో.. అత్యాధునిక సౌకర్యాలతో పశువుల ఆంబులెన్సులు తీర్చిదిద్దారు. వీటి నిర్వహణ ఖర్చులు సైతం ప్రభుత్వమే భరించింది. అంబులెన్స్ సేవలు పొందేందుకు ప్రత్యేకంగా 1962 అనే టోల్ ఫ్రీ నంబరు సైతం ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు.. అంబులెన్స్లో రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పశువును సమీపంలోని ఏరియా పశువైద్యశాల, వెటర్నరీ పాలీక్లినిక్కు తరలించి మరీ వైద్యం అందించారు. తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేర్చేవారు. సేవలు ప్రాంభించిన మూడేళ్లల్లో లక్షల సంఖ్యలో పశువులకు మెరుగైన వైద్యం అందించారు. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న వాహనాలను కూటమి ప్రభుత్వం ఉన్నపళంగా ఆపేయడంతో పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. వైద్యం పొందాలంటే కిలోమీటర్ల దూరంలోని పశువైద్య శాలలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. అంబులెన్స్లో అధునాతన వసతులుపశువుల అంబులెన్స్లో అధునాతన వసతులు కల్పించారు. అవసరమైన వైద్య సిబ్బంది నియామకం చేపట్టారు. ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రో స్కోప్తో కూడిన చిన్న ప్రయోగశాలను ఆ వాహనంలో ఏర్పాటు చేశారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతో పాటు పశువును వాహనంలోకి ఎక్కించేం దుకు హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యం ఉంది. ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్ర చికిత్స చేసే సౌలభ్యం వాహనాల్లో కల్పించారు. పశువులకు అత్యవసర వైద్య సేవలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్దపీట ఆయా గ్రామాల్లో వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా వాహనాలు కూటమి ప్రభుత్వం వచ్చాక సేవల నిర్వీర్యం సంచార వైద్య వాహనాలు ఆపేయాలని నిర్ణయం ఉన్నపళంగా ఉత్తర్వులు జిల్లాలో 16 వాహనాల ద్వారా సేవలు ఇప్పటికే 104, 108 వ్యవస్థల నిర్వీర్యం -
ఇసుక డ్రెడ్జింగ్ను అడ్డుకున్న కార్మికులు
కొవ్వూరు: భారీ డ్రెజ్జింగ్ యంత్రాలను వినియోగించి గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు తక్షణం నిలిపివేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ కొవ్వూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట బోటు కార్మికులు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. పౌర హక్కుల సంఘం నేతలు,ఐఎఫ్టీయు,దళి ప్రజా వేదిక నాయకులు ఈ ధర్నాకి సంఘీభావం ప్రకటించారు.గోదావరి నదిలో డ్రెజ్జింగ్ చేస్తున్న బోటును పట్టుకుని పోలీసులు,ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్పగించామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ ప్రకటించారు.వేలాది మంది కార్మికుల ఉపాధి ని దెబ్బతీస్తూ నది అక్రమంగా డ్రెజ్జింగ్ చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించు కోవడం లేదని దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు పేర్కోన్నారు.ఇసుక సేకరించే కార్మికులు చిన్న పడవల సాయంతో ఇసుక సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారని అన్నారు.పర్యావరణానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలను వినియోగించి నది గర్భంలో డ్రెజ్జింగ్ చేయడం మూలంగా కార్మికులు ఉపాధికి దూరమవుతున్నారని అన్నారు.శ్రీమన్నారాయణ మాట్లాడుతూ చట్ట విరుద్ధంగా నదిలో భారీ డ్రెజ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నరన్నారు.గ్రీన్ ట్రిబ్యూనల్ మార్గదర్శకాలను విస్మరించి భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారని,దీనిపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే గ్రీన్ ట్రిబ్యూనల్ను,హైకోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.అక్రమం గా తవ్వుతున్న యంత్రాలు ఎదురుగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు స్పందించి కేసులు నమోదు చేయకపోవడం బాధకరం అన్నారు.కార్మికులే స్వయంగా రంగంలోకి దిగి పట్టుకుని ఫిర్యాదు చేస్తే తప్పా స్పందించే పరిస్ధితి లేకపోవడం విచారకరం అన్నారు. చోళ్ల రాజు మాట్లాడుతూ కార్మికులు అర్ధరాత్రి భారీ బోటుని పట్టుకుని తెల్లవారేంత వరకు కాపలా ఉండి తీసుకోచ్చారన్నారు.అనంతరం నీటి పారుల శాఖ విభాగం ఆర్డీవోకి ఈ డ్రెజ్జింగ్ ప్రక్రియ పై రాతపూర్వకమైన ఫిర్యాదు ఇచ్చారు.ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ఇసుక పడవల కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని కోరారు.నది అక్రమంగా డ్రెజ్జింగ్ను ఆరికట్టడంతో పాటు డ్రెజ్జింగ్ ప్రక్రియ నిర్వహాకులపైన,ర్యాంపులపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ డ్రెజ్జింగ్ నిర్వహాకులపై చర్యలు తీసుకుంటామని, కార్మికులకు ఉపాధి కల్పనలో భాగంగా పడవల ర్యాంపులు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో రాణిసుస్మిత ప్రకటించారు.గోదావరి ఇసుక కార్మికుల సంఘం అధ్యక్షుడు చీరా అప్పారావు, ఇసుక కార్మికులు,భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా -
అర్ధరాత్రి దొంగల హల్చల్
షట్టర్లు పగులగొట్టి పది దుకాణాల్లో చోరీ తుని: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక రచ్చతో ఆందోళనకు గురైన ప్రజలకు దొంగలు కంటిపై కునుకు లేకుండా చేశారు. తుని పట్టణంలో రద్దీగా ఉండే జీఎన్టీ రోడ్డులో ఒకేసారి పది దుకాణాల షట్టర్లను పగులగొట్టి, అందిన కాడికి దోచుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక దొంగల ముఠా ఏకకాలంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆయా దుకాణాల్లో సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. తుని పట్టణంతో పాటు, పాయకరావుపేటలోనూ చోరీలకు యత్నించారు. పెద్ద ముఠాయే ఈ చోరీలకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చిన క్లూస్ టీం ఆయా దుకాణాల్లో సీసీ ఫుటేజ్తో పాటు, దొంగల వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ తెలిపారు. వస్త్ర దుకాణంలో దుస్తులు పట్టుకెళ్లారని, మిగిలిన దుకాణాల్లో నగదును దొంగిలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. చోరీలకు పాల్పడిన ముఠా ఒడిశా రాష్ట్రానికి చెందినదిగా సీసీ ఫుటేజ్లో గుర్తించామన్నారు. ప్రజలు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు తారసపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
ప్రతి ఒక్కరి పాత్ర కీలకమే..
జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూకే అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమేనని జేఎన్టీయూకే నూతన వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ ఆరో ఉప కులపతిగా బుధవారం మధ్యాహ్నం వీసీ చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన సీఎం, విద్యా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. విదేశీ వర్సిటీలతో కొత్త కోర్సులపై ఒప్పందం, అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు, పరిశోధనాంశాలు కీలకంగా ఉండేలా ప్రక్షాళన చేపడతానన్నారు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ టాప్–100లో ఉంచడంతో పాటు, మెరుగైన ఎన్బీఐ ర్యాంకింగ్ సాధనకు కృషి చేస్తామన్నారు. అధ్యాపకులు పరిశోధన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలని, విద్యార్థులను స్టార్టప్స్, ఆవిష్కరణలకు ఆసక్తి కలిగించేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం సెనెట్ హాల్లో సమీక్ష నిర్వహించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, మాజీ వీసీ ప్రసాదరాజు, పద్మరాజు, మురళీకృష్ణ, డైరెక్టర్లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలి
కోనసీమ జిల్లా డీఈఓ సలీం బాషా సాక్షి, అమలాపురం: రానున్న పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణతకు సమన్వయంతో పాటుపడాలని కోనసీమ జిల్లా డీఈఓ షేక్ సలీం బాషా ఉపాధ్యాయులు, ఎంఈఓలకు ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడాలన్నారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక, నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారు చేసి, విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలని సూచించారు. విద్యార్థులు అలసిపోకుండా స్నాక్స్ ఇవ్వాలని ఆదేశించారు. పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. టెన్నికాయిట్ పోటీలకు సర్వం సిద్ధం గోపాలపురం: రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీలకు చిట్యాల జెడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాలతో పాటు, రెండు కొత్తవి కలిపి మొత్తం 15 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పోటీల ఆర్గనైజింగ్ సెక్రటరీ గద్దే చంద్రశేఖర్, హెచ్ఎం ఎస్ఎల్ఎన్ శాస్త్రి తెలిపారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పోటీలు 22వ తేదీతో ముగుస్తాయని చెప్పారు. రేయింబవళ్లు పోటీలు జరుగుతాయని తెలిపారు. -
డిజిటల్ అసిస్టెంట్లకు రెండో రోజు శిక్షణ
సామర్లకోట: సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ రెండో రోజు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం(ఈటీసీ)లో బుధవారం కొనసాగింది. ఎన్ఐఆర్డీపీఆర్(హైదరాబాద్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని డిజిటల్ అసిస్టెంట్లకు సాంకేతిక నైపుణ్యంపై శిక్షణ ఇస్తున్నారు. గురువారంతో ఈ శిక్షణ ముగుస్తుంది. ప్రతి జిల్లా నుంచి నలుగురిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఈ.కృష్ణమోహన్ తెలిపారు. ఎన్ఐఆర్డీపీఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ రవిబాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేశ్వర్ శిక్షణ ఇస్తున్నారు. యువకుడి అదృశ్యం రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బైక్ లభ్యం కొవ్వూరు: దొమ్మేరు గ్రామానికి చెందిన గగ్గురోతు సాయి తేజ(25) బుధవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యాడు. ఇంటి నుంచి మోటార్ బైక్పై బయలుదేరిన అతడి వాహనాన్ని రోడ్డు కం రైలు బ్రిడ్జిపై బంధువులు గుర్తించారు. గోదావరి నదిలో దూకాడా, లేక బైక్ను ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికై నా వెళ్లాడా అన్నది తెలియడం లేదని, అతడి సెల్ఫోన్ కూడా స్విచాఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ఓ గేదెల ఫామ్లో సాయి తేజ పనిచేస్తున్నాడు. నిత్యం దొమ్మేరు నుంచి ఉదయాన్నే వెళ్లి, మళ్లీ 11 గంటల సమయానికి ఇంటికి తిరిగొస్తాడు. ఎప్పటిలాగే బుధవారం ఇంటి నుంచి వెళ్లిన అతడు మళ్లీ తిరిగిరాలేదు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న బంధువులకు స్థానికుల ద్వారా బైక్ వివరాలు తెలిశాయి. ఈ క్రమంలో గోదావరి నదిలో జాలర్ల సాయంతో గాలింపు చేపట్టారు. సాయితేజ సోదరుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. -
లిల్లీని పిండినల్లిపేస్తోంది
పెరవలి: తూర్పుగోదావరి జిల్లాలో లిల్లీపూల సాగు 300 ఎకరాల్లో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో జరుగుతోంది. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటలో వివిధ తెగుళ్లు ఆశించి ఉన్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి ఆశించి ఉన్నాయి. ఈ తెగుళ్ల నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులను కొవ్వూరు ఉద్యానవన అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరించారు. ఆకుమచ్చ లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకు వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండి వడలిపోతాయి. నివారణ చర్యలు ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతుంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి (మీల్బగ్) ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీదుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వలన తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లిపురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొగ్గ తొలుచు పురుగు పుష్పగుచ్ఛాన్ని మొగ్గతొలిచే పురుగులు ఆశించి, గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోయి గుచ్ఛ అలాగే ఉండిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగుల నివారణకు.. లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్డిజం గ్రాము లీటరు నీటికి పిచికారీ చేయాలి. క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే, రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు. 300 ఎకరాల్లో లిల్లీ పూల సాగు దుష్ప్రభావం చూపుతున్న తెగుళ్లు సస్యరక్షణ చర్యలు తప్పవంటున్న నిపుణులుఎరువుల యాజమాన్యం సేంద్రియ ఎరువులతో పాటు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఇలా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి, ఎకరాకి 60 వేల నుంచి 70 వేలు పుష్పగుచ్చాలొచ్చి 3 నుండి 7 టన్నుల పూల దిగుబడి వస్తుంది. -
రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ జట్ల ఎంపిక
తుని రూరల్: తిరుపతి బోనగిరిలో ఈ నెల 21 నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు ఎంపికయ్యాయి. బుధవారం తుని మండలం హంసవరం మోడల్ స్కూల్ మైదానంలో ఎంపికలు చేసినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిదిండి సత్యనారాయణరాజు తెలిపారు. ఇరు జట్ల నుంచి 24 మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. సంఘ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కేఎస్ జాబ్స్, జిల్లా కార్యదర్శి గంటా విక్టర్బాబు, స్కూల్ ప్రిన్సిపాల్ పద్మజ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. పురుషుల జట్టు: ఆర్.రాహుల్, వై.వెంకట సాత్విక్, టి.కార్తికేయ, ఎం.అరవింద్, జి.శ్రీనాగ వీరసాయితేజ, పి.దుర్గాఅరవింద్, కె.రామ్చరణ్, జి.జగన్ప్రకాష్, టి.ఉమేష్, ఎం.యశ్వంత్, జి.పవన్, జి.ఆకాష్. మహిళల జట్టు: ఎస్.రేణుక, పి.నవ్యశ్రీ, ఎస్.సాయిరేఖ, జె.హరిణి, కె.మౌనిక, సీహెచ్ దేవి, కె.కనకదుర్గ, వి.విజయ దుర్గాభవాని, జి.దుర్గాసత్యశ్రీ, ఎం.త్రినేత్రదేవి, బి.వెన్నెల, పి.గంగ. -
గామన్ బ్రిడ్జిపై కారు దగ్ధం
కొవ్వూరు: పట్టణ శివారున ఉన్న గామన్ ఇండియా బ్రిడ్జిపై 33వ పిల్లర్ వద్ద బుధవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో కారు దగ్ధమైంది. బ్యానెట్ నుంచి మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అప్రమత్తమై, వాహనాన్ని ఆపి సురక్షితంగా కిందకు దిగిపోయారు. కొద్దిసేపటికే మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన బందెల కృష్ణ ఆ కారులో రాజమహేంద్రవరానికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చోరీ కేసులో నిందితుడి అరెస్టు – రూ.1.77 లక్షల నగదు, బైక్ స్వాధీనం అమలాపురం టౌన్: పట్టణం సమీపంలోని పేరూరు వై.జంక్షన్లో ఈ నెల 4న ఓ బైక్ నుంచి రూ.1.50 లక్షల నగదును కాజేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అతని వద్ద నుంచి రూ.1.77 లక్షల నగదు, మోటార్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ పి.వీరబాబు తెలిపారు. వై.జంక్షన్లోని ఓ టిఫిన్ సెంటరులో అల్పాహారానికి ఇద్దరు వ్యక్తులు బైక్ పెట్టి వెళ్లారు. ఆ సమయంలో నిందితులు బైక్పై వచ్చి, పార్క్ చేసి ఉన్న బైక్ సైడ్ డిక్కీలో పెట్టిన రూ.1.50 లక్షల నగదును దొంగిలించి పరారైన విషయం తెలిసిందే. నిందితుల్లో ఒకరైన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీడివలస గ్రామానికి చెందిన మేకల బాలరాజును అరెస్ట్ చేసినట్టు సీఐ వీరబాబు తెలిపారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో సీఐ వీరబాబు పర్యవేక్షణలో, పట్టణ ఎస్సై టి.తిరుమలరావు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బాలరాజు రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో రెండు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మరో నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ చెప్పారు. -
రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇన్చార్జి డీఐజీగా భీమవరం జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కాకినాడ జాయింట్ సబ్రిజిస్ట్రార్–1 ఆర్వీ రామారావు, జాయింట్ సబ్రిజిస్ట్రార్–2 పీఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. వెంకటేశ్వర్లు 2022–24 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ఇక్కడ నుంచి భీమవరం జిల్లా రిజిస్ట్రార్గా బదిలీ అయ్యారు. ఉమ్మడి జిల్లా డీఐజీగా ఉన్న బి.శివరామ్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ జిల్లా కె.ఆనందరావుకు ఇన్చార్జి డీఐజీగా నియమించారు. అయితే అదనపు బాధ్యతలుగా ఉమ్మడి జిల్లా ఇన్చార్జి డీఐజీగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు ఈయన పరిధిలోకి వస్తాయి. -
పాత నేరస్తులపై నిఘా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, గ్రేవ్ ఎక్విటల్, మిస్సింగ్, పోక్సో, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎన్బీఎం మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్నవరం ఆలయానికి కోడ్ నుంచి మినహాయింపు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వివిధ నిర్మాణ పనులు, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంఎల్సీ ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మినహాయింపు కోరుతూ జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించిన లేఖకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ అనుమతి మంజూరు చేశారు. దానికి సంబందించిన ఆర్డర్స్ బుధవారం దేవస్థానానికి చేరాయి. అన్నవరం దేవస్థానంలో మార్చి 30 వ తేదీన జరుగనున్న ఉగాది వేడుకలు, ఏప్రిల్ ఆరో తేదీన శ్రీరామనవమి, మే నెల ఏడో తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. అయితే శాసనసమండలి ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికల కోడ్ మార్చి ఎనిమిదో తేదీ వరకు అమలులో ఉంది. దీంతో ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవడానికి వీలు లేదు. ఈ పనులు అత్యవసరంగా చేయాల్సినవి అయినందున వీటికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు లేఖ రాశారు. ఆ లేఖను జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి పంపించగా ఆ మేరకు ఎన్నికల సంఘం మినహాయింపు వచ్చింది. త్వరలోనే ఈ ఏర్పాట్లకు సంబంధించి టెండర్లు పిలవనున్నట్టు అధికారులు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు కాకినాడ సిటీ: తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతున్న దృష్ట్యా కాకినాడ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 163(2) ప్రకారం ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువ గుమికూడడం నిషిద్ధమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. సభలు సమావేశాలు పెట్టకూడదని, ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించామని కలెక్టర్ వివరించారు. ఈ ఉత్తర్వులు ఈనెల 25వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. ప్రజలు ఎవరు సమావేశాలు నిర్వహించడం, గుంపులు గుంపులుగా తిరగడం చేయకూడదన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వేగంగా డేటా నవీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సర్వే సమయంలో ఇంటి వద్ద లేని సిటిజన్ల హౌస్ హోల్డ్ డేటా పెండింగ్ లేకుండా ప్రతి శాఖకు చెందిన లబ్ధిదారుల, అర్హుల జాబితాను అనుసరించి క్రమబద్ధీకరించాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో మిస్సింగ్ హౌస్ హోల్ర్స్డ్ పై సమన్వయ శాఖల అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 1,65,278 మంది మిస్సింగ్ హౌస్ హోల్డ్ ఉన్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికీ ఇంకా 48,232 మంది వివరాలను గుర్తించి డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉందన్నారు. నూరుశాతం మిస్సింగ్ హౌస్ హోల్డ్ గుర్తించడంలో భాగంగా వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు సచివాలయాలు వారీగా గుర్తించి నవీకరించాలన్నారు. విద్యుత్ శాఖ 16,082, పౌర సరఫరాల శాఖ 7,889 , విద్యా శాఖ 5,799 , ఆరోగ్యశ్రీ 5,426 , డ్వామా 4,685 , సర్వే 4,677 పెండింగ్ ఉన్నట్లు తెలిపారు. ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఆధారంగా వారి వివరాలు సేకరించి నవీకరణ చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి టీ సీతారామమూర్తి , డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు పి వీణాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి చొరవ రానున్న ఆగస్టు నాటికి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం ప్రతిపాదించిన పనులు కార్యరూపం దాల్చే విధానం చొరవ తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పర్యాటక కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన నిర్వహించగా, ఇంచార్జి జిల్లా ఫారెస్ట్ అధికారి రవీంద్ర దామా, జిల్లా రెవిన్యూ అధికారి టి. సీతారామ మూర్తి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి వివిధ ఏజెన్సీలను గుర్తించి చర్యలను చేపట్టాల్సి ఉందన్నారు. జాతీయ రహదారి 216–ఏ పర్యాటక ప్రాంతంగా నర్సరీల స్టాల్స్ను అభివృద్ధి చేయడానికి ఆసక్తి చూపుతున్న వారిని గుర్తించాలన్నారు. కడియం నర్సరీలు, ఫ్లవర్ మార్కెట్ వర్గాలు, స్వయం సహక సంఘాలు, చేనేత కుటుంబాలను గుర్తించి లీజ్ పద్ధతిలో షాప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కడియపులంక ప్రాంతంలో బోటింగ్ సౌకర్యం ఒక కిలోమీటర్ తో చేపట్టి, దశల వారీగా నిడివి పెంచుకోవాలన్నారు. -
టీడీపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు
తుని: సుధీర్ఘ చరిత్ర కలిగిన టీడీపీ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు యనమల కృష్ణుడు విరుచుకుపడ్డారు. బుధవారం తుని యనమల కృష్ణుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. తుని మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీకి చెందిన ఒక్క కౌన్సిలర్ లేరని, బలం లేని చోట అధికార మదంతో పోలీసులు, అధికారులను ఉపయోగించుకుని బలవంతంగా లాక్కుకోవడానికి యత్నంచడం దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. టీడీపీలో మంత్రిగా, స్పీకర్గా ఉన్నత పదవుల్లో ఉన్న యనమల రామకృష్ణుడు నీచ రాజకీయాలకు పాల్పడి సభ్య సమాజం నివ్వెర పోయే విధంగా వ్యవహరించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 10 మంది కౌన్సిలర్లను బలవంతంగా టీడీపీలో చేర్చుకుని ప్రజా స్వామ్య వ్యవస్ధను నిర్వీర్యం చేశారన్నారు. మంగళవారం జరిగిన వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన 17 మంది కౌన్సిలర్లను టీడీపీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిందని, మాజీ మంత్రి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా టీడీపీ కుట్రను దీటుగా ఎదుర్కొన్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలో స్పీకర్గా ఉన్న యనమల రామకృష్ణుడు రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీకి చెందిన చోటా నాయకులతో నాపై విమర్శలు చేస్తున్నారని, ముందు మీరు నైతిక విలువలు పాటించి తర్వాత నీతులు చెబితే బాగుంటుందన్నారు. తుని వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో నాలుగు సార్లు వాయిదా పడేవిధంగా అధికారులను ప్రభావితం చేసిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం ఉంది కదా అని విర్ర వీగిపోతే రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని హితవు పలికారు. బలం లేకపోయినా వైస్ చైర్మన్కు పోటీ పడతారా? వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు -
ఉన్నపళంగా ఆగిపోమన్నారు
మూడేళ్లుగా సంచార అంబులెన్స్లో పనిచేస్తున్నాం. సీనియారిటీ ఉంది కదా వేతనాలు పెరుగుతాయని భావించాం. కానీ ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి వెళ్లిపోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఒక్కసారిగా రోడ్డున పడ్డాం. ఏ పనిచేసుకుని మా కుటుంబాలను పోషించాలో అర్థం కావడం లేదు. – రాజేష్, డ్రైవర్ 16వ తేదీ నుంచి రావద్దన్నారు పాత సంస్థ కాంట్రాక్ట్ అయిపోయింది. 16వ తేదీ నుంచి ఉద్యోగాలకు రావద్దన్నారు. ముందస్తు సమాచారం లేకుండా టెర్మినేషన్ లెటర్ ఇచ్చేశారు. జిల్లాలో 16 వాహనాల్లో 48 మంది పనిచేస్తున్నాం. మాకు ఉద్యోగాలు చూపించి ఆదుకోవాలి. –రాజారత్నం, డ్రైవర్ -
సొమ్ము కాజేసినట్టు ఇద్దరిపై కేసు నమోదు
కొవ్వూరు: తమను మోసం చేసి, సొమ్ము కాజేశారంటూ ధర్మవరం గ్రామానికి చెందిన బొజ్జా సింధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరిపై బుధవారం కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై కె.శ్రీహరిబాబు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా దుద్దుకూరు గ్రామానికి చెందిన కడిమి శ్రీనుబాబు, మెరిపో కృష్ణ వద్ద సింధు అప్పు తీసుకుంది. అప్పు తీర్చేందుకు ఇంటిపై రుణం ఇప్పిస్తామని చెప్పి శ్రీనుబాబు, కృష్ణ మోసపూరితంగా ఆమె వద్ద రూ.3.45 లక్షలు దఫాదఫాలుగా కాజేశారు. ఇంటిపై రుణం ఇప్పించకపోవడంతో ఆమె తన భర్తతో వెళ్లి వారిని ప్రశ్నించగా, తమపై దౌర్జన్యం చేసి, చంపుతామని బెదిరించినట్టు సింధు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. రూ.3.60 లక్షల ఎరువుల సీజ్ పిఠాపురం: గొల్లప్రోలు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి చెందిన మన గ్రోమోర్ రిటైల్ సెంటర్లో బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ సీఐ నాగవెంకటరాజు మాట్లాడుతూ, విజిలెన్స్ ఎస్పీ స్నేహిత ఆదేశాల మేరకు, డీఎస్పీ తాతారావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించి 14–35–14 రకం చెందిన 200 బస్తాల ఇన్వాయిస్ రికార్డులు సక్రమంగా లేకపోవడం, రైతుల కోసం ఫిర్యాదు బాక్స్ లేకపోవడం, స్టాక్ బోర్డ్ నిర్వహణ లేకపోవడం తదితర అంశాలను గుర్తించామన్నారు. షాపు యజమానిపై 6ఏ కేసు నమోదు చేసి, రూ 3.60 లక్షల విలువైన కాంప్లెక్స్ ఎరువులను సీజ్ చేశామన్నారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ మధుమోహన్, గొల్లప్రోలు ఏఓ సత్యనారాయణ, తూనికలు, కొలతల అధికారి సరోజ పాల్గొన్నారు. కాకినాడ, సామర్లకోట రైల్వే స్టేషన్లలో తనిఖీలు రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు వాణిజ్య విభాగం బృందంతో కలసి బుధవారం కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముందుగా కాకినాడ టౌన్ స్టేషన్లోని ప్లాట్ఫాంలు, టాయిలెట్లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణికుల సదుపాయాలు, లైటింగ్, పరిశుభ్రతను తనిఖీ చేశారు. స్టాళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలు, వాటర్ బాటిళ్లను పరిశీలించారు. నాణ్యమైన ఆహారం ఎమ్మార్పీకే విక్రయించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ టౌన్ స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకంలో రూ.31.37 కోట్లతో జరుగుతున్న పనులపై అధికారులతో సమీక్షించారు. ప్రయాణికులు, సిబ్బంది, స్టాళ్ల నిర్వాహకులతో మాట్లాడారు. కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలోనూ తనిఖీలు చేశారు. -
క్రీడా స్ఫూర్తిని చాటిన హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు బుధవారం క్రీడా స్ఫూర్తిని చాటాయి. పురుషుల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై 7–1 స్కోర్తో ఛత్తీస్గఢ్ సెక్టార్, ఆర్బీఎస్ భువనేశ్వర్పై ఆర్బీఎస్ ఉత్తరాఖండ్ 5–0తో, ఆర్బీఎస్ ఛండీగఢ్పై ఆర్బీఎస్ బెంగళూరు 4–1తో, గోవా సెక్టార్పై తెలంగాణ సెక్టార్ 21–0 స్కోర్తో విజయం సాధించాయి. మహిళల విభాగంలో రాజస్థాన్ సెక్టార్పై సెంట్రల్ సెక్టార్ 5–0 స్కోర్తో, కేరళ సెక్టార్పై ఛత్తీస్గఢ్ సెక్టార్ 13–0 స్కోర్తో, మధ్య ప్రదేశ్ సెక్టార్పై ఏపీ సెక్టార్ 18–0 స్కోర్తో గెలుపొందాయి. అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకుని, మ్యాచ్లను ప్రారంభించారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, సూరిబాబు పర్యవేక్షించారు. -
టీడీపీ తీరు దుర్మార్గం
రాజమహేంద్రవరం సిటీ: తునిలో టీడీపీ వ్యవరిస్తున్న తీరు పరమ దుర్మార్గంగా ఉందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. తుని మున్సిపాలిటీలో కూటమి నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా లేనప్పటికీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి దుశ్చర్యలకు పాల్పడటం శోచనీయమని మండిపడ్డారు. రాష్ట్ర మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి నిరసనగా చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు మంగళవారం ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీనిపై జక్కంపూడి రాజా స్పందించారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లూ వైఎస్సార్ సీపీ నుంచే గెలిచారని, టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కరు కూడా గెలవలేదని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌన్సిలర్లను భయపెట్టడం, బెదిరించడం ద్వారా అసలు ఎన్నిక జరగకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి తెగబడటం సరి కాదన్నారు. ఆయనకు అండగా నిలవాలనే ఉద్దేశంతో చలో తునికి పిలుపునిస్తే అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్లు, రేప్లు, మహిళలపై దాడుల వంటి ఘటనలపై పోలీసులు దృష్టి సారించాల్సింది పోయి, స్థానిక సంస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పార్టీలకు కొమ్ము కాయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రజలకు మేలు చేయడానికి, అభివృద్ధికి అధికారాన్ని ఉపయోగించుకోవాలనే తప్ప అక్రమాలకు వేదికగా చేసుకోరాదని అన్నారు. దొడ్డిదారిన వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇదే వైఖరి కొనసాగిస్తే వైఎస్సార్ సీపీ నుంచే కాకుండా ప్రజల నుంచి సైతం తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ, కూటమి శ్రేణులను జక్కంపూడి రాజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి గణేష్ అడ్డగింపు చలో తుని పిలుపు నేపథ్యంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ గణేష్ ఆధ్వర్యాన పార్టీ నేతలు, కార్యకర్తలు జేఎన్ రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ, తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు అధికార యంత్రాంగం, పోలీసులు రక్షణ కల్పించకపోగా, తిరిగి ఆయన పైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తుని వైస్ చైర్మన్ పదవి కోసం దుశ్చర్యలకు పాల్పడుతోంది వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకోవడం శోచనీయం వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా -
ప్రశాంతంగా ఈడీఎం రాత పరీక్ష
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్లో ఈ–గవర్నెన్స్ జిల్లా మేనేజర్ (ఈడీఎం) పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు కలెక్టరేట్లో మంగళవారం రాత పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని, మొత్తం 93 మంది హాజరయ్యారని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. పరీక్షను కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎండీ ఆలీ, సెక్షన్ సూపరింటెండెంట్ మహేశ్వరి పర్యవేక్షించారు. ఈ పోస్టుకు మొత్తం 115 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. వచ్చే నెల 8 వరకూ 144 సెక్షన్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున వచ్చే నెల 8వ తేదీ వరకూ జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని జిల్లా అడ్మిన్ ఏఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ, కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా నుంచి ఎవరూ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతులు లేవన్నారు. జిల్లావ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఎవ్వరినీ గృహనిర్బంధం చేయలేదని చెప్పారు. జిల్లాలో ఎవరిని హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చెయ్యలేదన్నారు. 1,556 మంది అంగన్వాడీలకు శిక్షణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు తెలిపారు. పూర్వ ప్రాథమిక విద్యపై అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి సర్టిఫికెట్ కోర్స్ మొదటి విడత శిక్షణను ఆర్యాపురంలోని నన్నయ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆయన మంగళవారం ప్రారంభించారు. తొలి విడతలో జిల్లాలోని 19 మండలాల్లోని 21 కేంద్రాల్లో 1,556 మందికి ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతి మండలానికి పాఠశాల విద్యా శాఖ నుంచి ముగ్గురు, మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి ముగ్గురు చొప్పున విషయ నిపుణులు శిక్షణ ఇస్తున్నారన్నారు. జిల్లా సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాలు, ఆరోగ్యంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పిల్లల నమోదు పెంచాలని, అభ్యసన ఫలితాల సాధనకు కృత్యాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు బి.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నేడు పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పెండింగ్ పెన్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించేందుకు అకౌంటెంట్ జనరల్ ఆధ్వర్యంలో బుధవారం అదాలత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 10 గంటలకు జిల్లా పరిధిలోని పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా, డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి కార్యాలయాల్లో, శాఖల పరిధిలో పెండింగ్లో ఉన్న పెన్షన్ కేసులు, పెన్షన్ అనుబంధ సమస్యల వివరాలతో హాజరు కావాలని సూచించారు. పెండింగ్లో ఉన్న పెన్షన్, జీపీఎఫ్ కేసులను సమీక్షించి అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు పదవీ విరమణ తేదీకి ముందే సంబంధిత జిల్లా డ్రాయింగ్ అండ్ పంపిణీ అధికారులు వారి పెన్షన్ పత్రాలను సమర్పించే విధంగా అవగాహన కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకూ విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, కడప, పాడేరు, తిరుపతి, ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి, మంగళగిరిలోని డీజీపీ కార్యాలయాల్లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని శాంతిప్రియ వెల్లడించారు. -
ప్రకృతి సాగు అనుసరణీయం
కొవ్వూరు: ఆరోగ్యకరమైన పంటల కోసం రైతులు ప్రకృతి సాగు పద్ధతులను అనుసరించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సూచించారు. దొమ్మేరు గ్రామంలో ప్రకృతి సాగు పంటలను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా 42 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు జరుగుతోందని అన్నారు. 12 డ్రోన్ల సాయంతో 3,800 మంది రైతులు 4,200 ఎకరాల్లో కషాయాలు వాడుతూ ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. కషాయాలు వాడుతూ పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం శుభ పరిణామమని అన్నారు. జిల్లావ్యాప్తంగా 7,300 మంది రైతులు పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. ప్రకృతి సాగుతో పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవచ్చన్నారు. దొమ్మేరుకు చెందిన రైతు నీరుకొండ సత్యనారాయణ తన 12 ఎకరాల్లో చెరకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ తదితర పంటలు పండించడం హర్షణీయమని అన్నారు. వరిలో డ్రోన్తో కషాయాల పిచికారీని కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, ఆర్డీఓ రాణి సుస్మిత, ఏపీసీఎన్ఎఫ్ డీపీఎం బి.తాతారావు, అదనపు డీపీఎం మహబూబ్ వలీ, వ్యవసాయ శాఖ ఏడీ పి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తునిలో గూండాగిరీ
టీడీపీ ‘అధికార’ దుర్వినియోగం గత మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత ప్రజాదరణతో 30కి 30 కౌన్సిలర్ స్థానాలనూ వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోని టీడీపీ.. ప్రస్తుతం తునిలో అరాచకాలకు పాల్పడుతోంది. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించినా ఎన్నిక ప్రశాంతంగా జరిపించలేక చేతులెత్తేయడం విచిత్రం. ఈ ఎన్నిక సందర్భంగా టీడీపీ అధికార దుర్వినియోగం తునిలో అడుగడుగునా కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్రజాస్వామ్యంపై తుని పట్టణంలో కొద్ది రోజులుగా క్రూర పరిహాసం జరుగుతోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కౌన్సిలర్ను కూడా గెలిపించుకోలేని స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకున్న టీడీపీ.. ఆ పురపాలికలో చిన్నపాటి ‘ఏలిక’ పదవి కోసం అడ్డమైన దారులూ తొక్కుతోంది. ప్రజాస్వామిక విలువలను, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని, ఎన్నికల నిబంధనలను అడ్డగోలుగా కాలరాసి.. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గూండాగిరీకి తెగబడుతోంది. ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లపై దాడులకు దిగుతూ, వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాగైనా మున్సిపాలిటీలో తిష్ట వేయడానికి కుట్రపూరితంగా ప్రయత్నాలు సాగిస్తోంది. కళ్ల ముందే ఇంత జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అధికార మదానికి తల వంచి, చేష్టలుడిగి చూస్తూండటం ప్రజాస్వామిక వాదులను నివ్వెరపరుస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: తునిలో తెలుగుదేశం పార్టీ గుండాగిరీ రాజ్యమేలుతోంది. పోలీసు సహా అధికార వ్యవస్థలన్నీ ఆ పార్టీ నేతలకు జీహుజూర్ అంటూ, వారు చెప్పినట్టే నడుచుకుంటున్నాయి. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని టీడీపీ నేతలు తమ చెప్పుచేతల్లో ఉంచుకుని, తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేయించిన విషయం తెలిసిందే. అదే క్రమంలో టీడీపీ అరాచకవాదులు మంగళవారం మరోసారి దౌర్జన్యకాండకు తెగబడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన వైస్ చైర్మన్ ఎన్నికను నాలుగోసారి కూడా వాయిదా వేయించారు. కౌన్సిలర్లపై మూకుమ్మడి దాడి తుని మున్సిపల్ కౌన్సిల్ వేదికగా జిల్లా స్థాయి అధికారులు, పోలీసులు, టీడీపీ నేతలు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా డ్రామాను రక్తి కట్టించారని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేలా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పోలీసు రక్షణ బాధ్యతలను జిల్లా అదనపు ఎస్పీ ఎంవీజే భాస్కరరావు, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి దేవరాజ్ మనీష్ పాటిల్, పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజుకు అప్పజెప్పారు. తద్వారా కౌన్సిలర్లు స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనేలా రక్షణ కల్పిస్తామని జిల్లా యంత్రాంగం చెప్పింది. ఆ భరోసాతో కౌన్సిల్ హాలుకు ఓటింగ్కు బయలుదేరిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై టీడీపీ శ్రేణులు తమ కుట్రలో భాగంగా మూకుమ్మడిగా దాడికి దిగాయి. దీనికి పోలీసులు కూడా సహకరించారనే విమర్శలు వస్తున్నాయి. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను కౌన్సిల్ హాలుకు 200 మీటర్ల దూరాన పోస్టాఫీసు వీధిలో ఉన్న పిఠాపురం డాక్టర్ ఆస్పత్రి దాటి ముందుకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ, టీడీపీ శ్రేణులను మాత్రం కౌన్సిల్ హాలు దగ్గర వరకూ అనుమతించి, ‘పచ్చ’పాత ధోరణి చూపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించి మరీ ‘పచ్చ’ గూండాలు.. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల పైకి దూసుకుపోతున్నా పోలీసులు చేష్టలుడిగి చూశారే తప్ప నిలువరించిన దాఖలాలు కనిపించ లేదు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లకు రక్షణ కల్పిస్తామన్న జిల్లా యంత్రాంగం మాటలు చివరకు గాలిలో కలసిపోయాయి. ‘చలో తుని’ అడ్డగింపు తునిలో అధికార టీడీపీ అరాచకాన్ని నిరసిస్తూ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఇచ్చిన ‘చలో తుని’ పిలుపునకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందించాయి. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు భారీ సంఖ్యలో తుని తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. సోమవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ ముఖ్య నేతలకు 41 నోటీసులు జారీ చేసి, తెల్లారేసరికి హౌస్ అరెస్టులు చేశారు. నియోజకవర్గాల నుంచి తుని బయలుదేరిన నేతలను మార్గం మధ్యలో అడ్డుకున్నారు. ● గొల్లప్రోలు టోల్ప్లాజా వద్ద పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి తదితరులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ నాయకులు అల్లి రాజబాబు, సుంకర విద్యాసాగర్, రావూరి వెంకటేశ్వరరావు, జమ్మలమడక నాగమణి తదితర నేతలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ● జగ్గంపేట నియోజకవర్గం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట ఇన్చార్జి తోట నరసింహం, యువ నాయకుడు తోట రాంజీ, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను తుని రైల్వే చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ● మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు పార్టీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తదితరులను తుని రైల్వే గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ● రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు తదితరులను సామర్లకోటలో పోలీసులు అడ్డగించారు. దీనిని నిరసిస్తూ కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి, నిరసన తెలిపారు. ● రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త జక్కంపూడి గణేష్లను పోలీసులు తుని వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని పార్టీ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకుని పోలీసుల తీరుపై నిరసన తెలిపారు. రాజాను హౌస్ అరెస్టు చేశారనే సమాచారంతో మాజీ మంత్రి, పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్లు ఆయన ఇంటికి వెళ్లగా వారిని పోలీసులు అక్కడే నిర్బంధించారు. ● రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును రావులపాలెం వద్ద, పి గన్నవరం కో ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును అయినవిల్లిలోను హౌస్ అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యంపై క్రూర పరిహాసం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికను మరోసారి అడ్డుకున్న టీడీపీ పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయిన ‘పచ్చ’ గూండాలు కౌన్సిలర్లపై దాడికి యత్నం భయంతో పరుగు తీసిన కౌన్సిలర్లు కోరం లేక నాలుగోసారీ ఎన్నిక వాయిదా -
‘నన్నయ’ వీసీగా ఆచార్య ప్రసన్నశ్రీ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్గా సత్తుపాటి ప్రసన్నశ్రీని నియమించారు. ఆమె గురువారం ఉదయం నన్నయ వర్సిటీకి వచ్చి ఇన్చార్జి వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ డిపార్టుమెంట్ ఆఫ్ ఇంగ్లిష్ ప్రొఫెసర్గా ఉన్న ఆమెకు 38 సంవత్సరాల బోధనా అనుభవం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 10 సెమినార్లు నిర్వహించి, 60 సెమినార్లలో పాల్గొన్నారు. ఆమె రచించిన 125 పరిశోధన వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రచురితమయ్యాయి. 19 గిరిజన భాషల లిపికి రూపకల్పన అంతరించిపోతున్న గిరిజన భాషలను కాపాడేందుకు బగత, గదబ, కొలామి, కొండదొర వంటి 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించిన తొలి మహిళగా ఆచార్య ప్రసన్నశ్రీ పేరు పొందారు. 2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా నారీశక్తి పురస్కారం కూడా అందుకున్నారు. అవార్డుల పరంపర విద్యారంగంలో చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ మహిళా స్పీకర్, గిరిజన అరక బ్రహ్మ, దళిత సాహిత్య అకాడమీ, వుమెన్ అచీవర్స్, నారీశక్తి, ఇండియన్ ఇండిగోనెస్ స్క్రిప్టేర్ అవార్డు వంటి వాటితో పాటు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. విద్యావేత్తగా, సాహితీవేత్తగా, పరిశోధకురాలిగా, సెమినార్స్, వర్క్షాప్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు నిర్వహిస్తూ భాషా సాహిత్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు. -
టీడీపీ తీరు దుర్మార్గం
రాజమహేంద్రవరం సిటీ: తునిలో టీడీపీ వ్యవరిస్తున్న తీరు పరమ దుర్మార్గంగా ఉందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. తుని మున్సిపాలిటీలో కూటమి నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా లేనప్పటికీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి దుశ్చర్యలకు పాల్పడటం శోచనీయమని మండిపడ్డారు. రాష్ట్ర మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి నిరసనగా చలో తుని కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు మంగళవారం ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీనిపై జక్కంపూడి రాజా స్పందించారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లూ వైఎస్సార్ సీపీ నుంచే గెలిచారని, టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి ఒక్కరు కూడా గెలవలేదని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కౌన్సిలర్లను భయపెట్టడం, బెదిరించడం ద్వారా అసలు ఎన్నిక జరగకుండా అడ్డుకోవడం దారుణమని అన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై దాడికి తెగబడటం సరి కాదన్నారు. ఆయనకు అండగా నిలవాలనే ఉద్దేశంతో చలో తునికి పిలుపునిస్తే అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిడ్నాప్లు, రేప్లు, మహిళలపై దాడుల వంటి ఘటనలపై పోలీసులు దృష్టి సారించాల్సింది పోయి, స్థానిక సంస్థలను గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే పార్టీలకు కొమ్ము కాయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రజలకు మేలు చేయడానికి, అభివృద్ధికి అధికారాన్ని ఉపయోగించుకోవాలనే తప్ప అక్రమాలకు వేదికగా చేసుకోరాదని అన్నారు. దొడ్డిదారిన వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇదే వైఖరి కొనసాగిస్తే వైఎస్సార్ సీపీ నుంచే కాకుండా ప్రజల నుంచి సైతం తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ, కూటమి శ్రేణులను జక్కంపూడి రాజా హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి గణేష్ అడ్డగింపు చలో తుని పిలుపు నేపథ్యంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ను పోలీసులు అడ్డుకున్నారు. దీనిని నిరసిస్తూ గణేష్ ఆధ్వర్యాన పార్టీ నేతలు, కార్యకర్తలు జేఎన్ రోడ్డులోని ఆయన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గణేష్ మీడియాతో మాట్లాడుతూ, తునిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాపై టీడీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు అధికార యంత్రాంగం, పోలీసులు రక్షణ కల్పించకపోగా, తిరిగి ఆయన పైనే కేసులు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. తుని వైస్ చైర్మన్ పదవి కోసం దుశ్చర్యలకు పాల్పడుతోంది వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకోవడం శోచనీయం వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా -
ప్రతి మండలంలో రీసర్వేకు పైలట్ గ్రామం
దేవరపల్లి: జిల్లాలోని ప్రతి మండలంలోనూ ఒక గ్రామాన్ని పైలట్గా ఎంపిక చేసి భూముల రీసర్వే చేస్తున్నామని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తెలిపారు. మండలంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన చిన్నాయగూడెంలో భూముల రీసర్వే పనులను కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితతో కలసి ఆయన మంగళవారం పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సర్వే బృందానికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ, రీసర్వే సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అభ్యంతరాలుంటే పూర్తి వివరాలు తీసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. స్టాండర్డ్ ఆఫ్ ప్రాసెస్ (ఎస్ఓపీ) ప్రకారం సర్వే నంబరులోని ప్రతి రైతుకూ ముందుగా ఫామ్–19 అందజేస్తున్నామన్నారు. ముందుగా గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేసి, ప్రభుత్వ భూములను నమోదు చేశామని తెలిపారు. బ్లాక్లు ఏర్పాటు చేసి, ఆ బ్లాక్లోని రైతులందరికీ నోటీసులిచ్చి అందరి సమక్షంలో వారి అనుభవంలో ఉన్న భూముల విస్తీర్ణం వివరాలు నమోదు చేస్తున్నామని వివరించారు. రైతుల వద్ద ఉన్న కొత్త రికార్డులు, పట్టాదారు పాస్ పుస్తకాలను పరిశీలిస్తామని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.రాజ్యలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, మండల సర్వేయర్ దిల్లేష్, వీఆర్వోలు పాల్గొన్నారు. -
డిగ్రీ విద్యార్థిని అదృశ్యం
అమలాపురం టౌన్: అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అల్లవరం గ్రామానికి చెందిన వీరమల్లు హిమ రాజేశ్వరి అదృశ్యమైంది. ఆమె తాను చదువుతున్న కళాశాల నుంచి సాయంత్రం 3.10 గంటలకు వెళ్లిపోయినట్లు పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థిని తండ్రి వీరమల్లు దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. హిమ రాజేశ్వరి ఎత్తు 5 అడుగులు, ఎస్కేబీఆర్ కళాశాల యూనిఫాం ధరించింది. తెలుగు రంగు కలిగి ఉంటుంది. ఆమె ఆచూకీ తెలిసిన వారు అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు 9440796561, పట్టణ ఎస్సై శ్రీనివాస్ 9848132305, విద్యార్థిని తండ్రి దుర్గా ప్రసాద్ 9949729616 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పట్టణ పోలీసులు విజ్ఞప్తి చేశారు. యువతి ఆత్మహత్య కాకినాడ క్రైం: తల్లిదండ్రులు మందలించారనే వేదనతో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే కాకినాడ సూర్యనారాయణపురంనకు చెందిన అనపాల అరుణ (24) స్థానిక వెంకీ రెసిడెన్సీలో హౌస్ కీపర్గా పనిచేస్తోంది. ఈమె తరచుగా అప్పులు చేస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆవేదన చెంది ఈ నెల 16వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు కాకినాడ త్రీటౌన్ పోలీసుస్టేషన్లో కుమార్తె అరుణ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. కేసు విచారణ కొనసాగుతుండగా మంగళవారం సాయంత్రం జగన్నాథపురం వంతెన కింద ఉన్న ఉప్పుటేరులో మృతదేహం కొట్టుకొచ్చింది. -
జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షుడు విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన మంగళవారం జెడ్పీ సమావేశపు మందిరంలో 1, 2, 4, 7 స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా 3వ స్థాయీ సంఘ సమావేశం వైఎస్ చైర్పర్సన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన, 5వ స్థాయీ సంఘ సమావేశం సంఘ చైర్పర్సన్, జెడ్పీటీసీ సభ్యురాలు రొంగల పద్మావతి, 6వ స్థాయీ సంఘ సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత అధ్యక్షతన నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం నిర్వహించబోయే ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నిక దృష్ట్యా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సమావేశం నిర్వహించినట్లు చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు వివరించారు. ఏవిధమైన శాఖాపరమైన సమీక్షలుగాని, తీర్మానాలుగాని చేయకుండా, ఆమోదించకుండా సమావేశాలు ముగించారు. ఈ సమావేశాలకు జిల్లా పరిషత్ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, ఆయా జిల్లాల వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా ప్రజాపరిషత్ పరిపాలనాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏజెంట్ వేధింపులతో ఆత్మహత్య
మామిడికుదురు: ఏజెంట్ వేధింపుల వల్లే మా అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. మా అబ్బాయికి ఎదురైన పరిస్థితి మరెవ్వరికీ రాకూడదు. ఏజెంట్పై చర్య తీసుకోవాలంటూ మొగలికుదురుకు చెందిన నేదూరి సురేష్, రామలక్ష్మి దంపతులు కలెక్టర్ మహేష్కుమార్, ఎస్పీ కృష్ణారావుకు ఈ నెల 15వ తేదీన ఫిర్యాదు చేశారు. మొగలికుదురుకు చెందిన నేదూరి తారక ముత్యాలరాము (24) ఈ నెల 13వ తేదీన కువైట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహం సోమవారం స్వగ్రామం మొగలికుదురు చేరింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి తల్లిదండ్రులు, మృతుని అన్న ఫణీంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇవీ.. మొగలికుదురుకు చెందిన నేదూరి తారక ముత్యాలరాము బైక్ మెకానిక్గా పనిచేస్తూ కారు డ్రైవింగ్ కూడా చేసేవాడు. అతను గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన కువైట్ బయలు వెళ్లాడు. ఈ ఏడాది జనవరి 1వ తేదీన కువైట్ చేరుకున్నాడు. మామిడికుదురు మండలం కొమరాడకు చెందిన ఏజెంట్ వలవల నాగరాజు ద్వారా అతను కువైట్ వెళ్లాడు. శేఠ్ తనను బాగా చూసుకుంటున్నాడని, తన సహ ఉద్యోగి, రూమ్మేట్ అయిన ఏజెంట్ వలవల నాగరాజు తరచు వేధింపులకు గురి చేస్తున్నాడని ఫోన్లో తల్లిదండ్రులకు చెప్పేవాడు. రెండు, మూడు సార్లు కొట్టాడు. ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 1.20 గంటలకు మా అబ్బాయి తనతో మాట్లాడాడని తల్లి రామలక్ష్మి తెలిపారు. అదే రోజు సాయంత్రం 7.18 గంటలకు ఏజెంట్ నాగరాజు నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఏమీ మాట్లాడకుండా ఫోన్ కట్ చేశాడని చెప్పారు. 7.50 గంటల సమయంలో ఏజెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు కొమరాడ నుంచి వచ్చి మీ అబ్బాయి కనిపించడం లేదని, దీని వల్ల ఏజెంట్ నాగరాజు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడంటూ చెప్పారన్నారు. అప్పటి నుంచి తన కుమారుడి ఫోన్ పని చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ తేదీ ఉదయం 2 గంటల సమయంలో కువైట్లో ఉంటున్న తమ బంధువు ద్వారా రాము ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందని ఆవేదనతో చెప్పారు. ఏజెంట్ వేధింపులే తమ కుమారుడి మృతికి కారణమని ఆరోపించారు. మరో వ్యక్తికి ఈ పరిస్థితి ఎదురు కాకూడదని, ఏజెంట్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్, ఎస్పీకి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన -
హోరాహోరీగా ఆలిండియా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో సివిల్ సర్వీసెస్ ఆలిండియా హాకీ పోటీలు మంగళవారం హోరాహోరీగా జరిగాయి. గుజరాత్ సెక్టార్, రాజస్థాన్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 11–2 స్కోర్తోను, పుదుచ్చేరి సెక్టార్, ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఉత్తరాఖండ్ 6–4 స్కోర్తోను, ఆర్ఎస్పీబి సిమ్లా, ఆర్ఎస్పీడి జైపూర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్పీబి జైపూర్ 9–2 స్కోర్తోను విజయం సాఽధించాయి. ఆర్ఎస్పీబి ముంబయి, ఆర్ఎస్పీబి చైన్నె మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్పీబి ముంబాయి 5–1స్కోర్తో, ఆంధ్రప్రదేశ్ సెక్టార్, గోవా సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ 23–0 స్కోర్తోను గెలుపొందగా జట్టులోని శ్రీనివాస్రావు 6, ఉదయ్కుమార్ 7 గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మహిళల విభాగంలో ఒడిశా సెక్టార్, ఢిల్లీ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఒడిశా సెక్టార్ 16–0 స్కోర్ తోను, హర్యానా సెక్టార్, తెలంగాణ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా సెక్టార్ 18–0 స్కోర్తోను, బిహార్ సెక్టార్, ఉత్తరాఖండ్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో బిహార్ సెక్టార్ 7–1 స్కోర్తో విజయం సాధించాయి. మంగళవారం నిర్వహించిన మ్యాచ్లను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు, డిఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్లు పర్యవేక్షించారు. -
ఈఎస్ఐ ఆసుపత్రిలో ఐదుగురు వైద్యులతో సహా 9 మంది సస్పెన్షన్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన ఈఎస్ఐ ఆసుపత్రిలో 5 గురు వైద్యులతో సహా 9 మందిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెనన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన విషయం తెలిసిందే. విధులను సక్రమంగా నిర్వహించని కారణంగా ఐదుగురు వైద్యులు, నలుగురు కార్యాలయ సిబ్బంది సస్పెండ్కు గురయ్యారు. మంత్రి ఆకస్మిక తనిఖీలో కొందరు వైద్యులు, సిబ్బంది హాజరు నమోదు చేసుకుని విధులకు హాజరుకాకండా ఆసుపత్రి నుంచి వెళ్లిపోతున్నట్లు గుర్తించారు. హాజరు నమోదు పుస్తకాలను పరిశీలించగా, కొందరు హాజరు నమోదు చేయకపోవడం, కొందరు హాజరు నమోదు చేసి వెంటనే వెళ్లిపోవడం, మరికొందరు సమస్యలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం విచారణలో తేలింది. దీన్ని సీరియస్గా తీసుకున్న మంత్రి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ఈఎస్ఐ బీమా చందాదారులు, వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. -
నూనె తయారీపై ‘తేలి’ సినిమా
సామర్లకోట: తమ తెలుకుల, గాండ్ల కులస్తులు అనాధిగా తయారు చేస్తున్న నూనె తయారీపై ‘తేలి’ అనే పేరుతో ప్రత్యేక చిత్రం త్వరలోనే రూపొందించనున్నట్టు సీనియర్ సినీనటుడు మొల్లెటి బాలాజీ తెలిపారు. స్థానిక పంచారామ క్షేత్రాన్ని దర్శించుకున్న సందర్భంగా ఆయన మంగళవారం విలేకరులకు తన సినిమా అనుభవాలను వెల్లడించారు. 1983వ సంవత్సరంలో తాను ఓ ఆడది మగాడు చిత్రం ద్వారా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ప్రోత్సహంతో చిత్ర సీమలో అడుగుపెట్టానని తెలిపారు. మగమహారాజు, మంగమ్మగారి మనవడు వంటి చిత్రాలు గుర్తింపు తీసుకు వచ్చాయని వివరించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి అనేక చిత్రాలల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందడం ఆనందంగా ఉన్నదన్నారు. నూనె పుట్టుక, వినియోగం అన్ని వంటకాల్లోనూ, పూజల్లో నూనెకు అంతటి ప్రాధాన్యత దక్కడం వంటి అంశాలపై చిత్రంలో వివరించనున్నట్లు వివరించారు. త్వరలో త్రినేత్ర సినిమాలో కూడా తాను నటిస్తున్నట్లు చెప్పారు. బుచ్చిబాబు దర్శకత్వలో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్తో కలిసి నటిస్తున్నట్లు చెప్పారు. వశిష్ట చిత్రంలో పోలీసు ఆఫీసరుగా నటిస్తున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల తన సీనీ జీవితంలో అనేక విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ఇప్పటి వరకు రెండు పర్యాయాలు సామర్లకోట భీమేశ్వరస్వామి వచ్చానన్నారు. సామర్లకోటలో 100 సంవత్పరాలకు పైబడి అంబటి సుబ్బన్న ఆయిల్ పరిశ్రమలో తయారు అవుతున్న నూనె రాష్ట్ర వ్యాప్తంగా అందించడానికి చేస్తున్న సేవలను బాలాజీ కొనియాడారు. నృత్యకారుడికి అభినందన తెలుకుల గాండ్ల కులానికి చెందిన అలమండ ప్రసాద్ అంతర్జాతీయంగా కూచిపూడి నృత్యంలో రాణించడంపై బాలాజీ అభినందించారు. దేశ, విదేశాల్లో ప్రసాద్ నృత్యాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడం అభినందనీయమన్నారు. యోగం ఉంటేనే సామర్లకోటలోని యోగ లింగాన్ని దర్శించుకోగలుగుతామని అన్నారు. సీనియర్ నటుడు బాలాజీ -
27న ప్రత్యేక సెలవు
ఏలూరు(మెట్రో): తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె.వెట్రిసెల్వి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వేగంగా ఫీజుల వసూలు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీల ఫీజులు వసూలులో వేగం పెంచి, మార్చినాటికి టార్గెట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ పి.సుధాకర్ ఆదేశించారు. మంగళవారం రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాలోని మార్కెట్ కమిటీల కార్యదర్శులు, రైతుబజార్ల ఎస్టేట్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 50శాతం లోపు మార్కెట్ ఫీజు వసూలు చేసిన కార్యదర్శులు ఫీజులు వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. మార్కెట్యార్డుల్లో పెండింగ్ పనులును త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారులు సునీల్వినయ్, రాఘవేంద్రరావు, విశాలాక్షి, మార్కెట్ కమిటీ సెక్రటరీలు, ఎస్టేట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
బీసీ గురుకులాల్లో ప్రవేశ పరీక్షకు వేళాయె..
రాయవరం: మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో జిల్లావ్యాప్తంగా ఉన్న తొమ్మిది పాఠశాలల్లో 480 మంది విద్యార్థులకు ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు లభించనున్నాయి. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో 480 సీట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం వద్ద ఉన్న సమనస బాలుర పాఠశాలలో 80, రామచంద్రపురం బాలికల పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లా కరప బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో 80, తుని బాలుర పాఠశాలలో 40, పెద్దాపురం బాలుర పాఠశాలలో 40 సీట్లు, ఇటీవల నూతనంగా పిఠాపురంలో ప్రారంభించిన పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బాలుర గురుకుల పాఠశాలలో 40, రాజమహేంద్రవరం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 40, కొవ్వూరు బాలుర ఉన్నత పాఠశాలలో 40, గోపాలపురం బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 480 సీట్లకు ఎంట్రన్స్ నిర్వహిస్తారు. కోనసీమ జిల్లా సమనస పాఠశాలలో 40 శాతం (32 సీట్లు) మత్స్యకారులకు మాత్రమే కేటాయిస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఐదవ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి సంబంధించి ప్రవేశ పరీక్ష 4వ తరగతి స్థాయి పరీక్ష ఉంటుంది. తెలుగు, ఇంగ్లిషు, గణితం, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులపై 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ప్రశ్నపత్రం ఇస్తారు. తెలుగు–15, ఇంగ్లిషు–25, గణితం–30, పరిసరాల విజ్ఞానం నుంచి 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పరీక్షా సమయం రెండు గంటలు. విద్యార్థులు సమాధానాలను ఓఎంఆర్ షీట్లో గుర్తించాల్సి ఉంటుంది. జిల్లా యూనిట్గా ప్రవేశాలకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రం వివరాలను హాల్ టిక్కెట్లో తెలియజేస్తారు. అభ్యర్థులు అర్హతలు పరిశీలించుకుని దరఖాస్తు చేసుకున్న తర్వాత రూ.100 చెల్లించాలి. ఫీజు చెల్లించిన వారికి నంబరును కేటాయిస్తారు. నంబరు ఆధారంగా ఆన్లైన్లో హెచ్టీటీపీఎస్://ఎంజేపీఏపీబీసీడబ్లూఆర్ఈఐఎస్.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన కాలమ్లో నమోదు చేయాలి. వచ్చే నెల 15 తుది గడువు విద్యార్థులు దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 15 తుది గడువు. ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వత ఒక రిఫరెన్స్ నంబర్ ఇస్తారు. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకుని ఉంచుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థి కులధ్రువీకరణ, ఆదాయం, పుట్టినతేదీ, ప్రత్యేక కేటగిరి ధ్రువీకరణ, స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్ పత్రాలు ఒరిజనల్స్ కౌన్సిలింగ్ సమయంలో చూపవలసి ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించరాదు. సర్టిఫికెట్లు సమర్పించకుంటే విద్యార్థి ఎంపిక అయినప్పటికీ సీటు కేటాయించరు. పరీక్ష తేదీకి ఏడు రోజులు ముందుగా రిఫరెన్స్ నంబరు ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లు పోస్టులో లేదా నేరుగా పంపించరు. దరఖాస్తు నింపే సమయంలో ఈ సూచనలు పాటించాలి ఫ దరఖాస్తును ఆన్లైన్ లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తును పూరించాలి. ఫ దరఖాస్తుదారులు సొంత జిల్లాలో మాత్రమే పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేయాలి. ఫ పాఠశాల ప్రాధాన్యతాక్రమం ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టిక చూసుకుని పూరించాలి. ఫ పాస్పోర్టు సైజ్ ఫొటోను సిద్ధం చేసుకోవాలి. ఫ దరఖాస్తు పూరించే సమయంలో జరిగే పొరపాట్లకు విద్యార్థిదే పూర్తి బాధ్యత. ఫ ఒకసారి దరఖాస్తును ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎటువంటి మార్పులకు తావులేదు. సీబీఎస్ఈ విద్యా విధానం అమలు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన ఇంగ్లిషు మీడియం విద్య లభిస్తుంది. 9వ తరగతి నుంచి సీబీఎస్ఈ అమలు చేస్తున్నాం. ప్రాథమిక తరగతుల్లో ప్రాజెక్టు బేస్డ్ లెర్నింగ్ అమలు పరుస్తున్నాం. – డాక్టర్ వైటీఎస్ రాజు, ప్రిన్సిపాల్, ఎంజేపీఏపీబీసీడబ్ల్యుఆర్ స్కూల్, సమనస సద్వినియోగం చేసుకోవాలి వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విడుదలైన నోటిఫికేషన్ను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ద్రాక్షారామలో బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతికి 40 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఎంట్రన్స్ పరీక్షలో పాల్గొని విద్యార్థులు మెరిట్ ద్వారా సీటును సంపాదించుకోవాలి. – వి.పావన్య, ప్రిన్సిపాల్, ఎంజెపీఏపీబీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, ద్రాక్షారామదరఖాస్తు చేయాలిలా.. బీసీ, ఈబీసీ, ఇతర విద్యార్థులకు 9–11 సంవత్సరాల వయసు మించి ఉండాలి. 2014 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి 2016 ఆగస్టు 31 తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9–13 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 2013 సెప్టెంబరు ఒకటి నుంచి 2016 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలి. విద్యార్థులు జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశం పొందడానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. గత రెండేళ్లుగా నిరంతరంగా (2023–24, 2024–25) చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతిలో 2024–25 విద్యా సంవత్సరంలో చదువుతూ ఉండాలి. ఎంజేపీఏపీ బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల 480 మంది విద్యార్థులకు 5వ తరగతిలో ప్రవేశాలకు అవకాశం మార్చి 15 దరఖాస్తుకు తుది గడువు ఎంపిక విధానం ఇలా.. అర్హులైన విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరి, అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేస్తారు. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకుంటారు. సమానమైన ర్యాంక్ ఒకరి కంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేదీ ప్రకారం అధిక వయసు ఉన్న వారికి ప్రాధాన్యమిస్తారు. సమానమైన ర్యాంకు వస్తే, గణితంలో పొందిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణలోనికి తీసుకుంటారు. ప్రవేశానికి ఎంపికై న వారికి మాత్రమే కాల్ లెటర్స్, ఫోన్ ద్వారా సమాచారం ఇస్తారు. మెరిట్ లిస్టు మార్కుల ఆధారంగా మొదటి, రెండవ, మూడవ జాబితాను ఖాళీలను బట్టి ప్రకటిస్తారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
గుండెపోటుతో ఇంటలిజెన్స్ హెచ్సీ మృతి
కొవ్వూరు: ఇంటలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ఈ డేవిడ్రాజు (47) మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు చాగల్లులోని స్వగృహంలో తెల్లవారు జామున గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు నిడదవోలులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి ఈసీజీ తీసిన వైద్యుల సూచనల మేరకు గుండెపోటుగా నిర్ధారించుకుని రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతుండగా మధ్యాహ్నం మరోసారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆయనకి భార్య, ముగ్గురు కుమారులున్నారు. ఈయన స్వస్థలం ఏలూరు సమీపంలోని మముడూరు. ఉద్యోగ రీత్యా కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తూ చాగల్లులో స్వగృహం నిర్మించుకున్నారు. -
తుని మున్సిపల్ వైఎస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా
సాక్షి, కాకినాడ జిల్లా: నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలతో తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తునిలో టీడీపీ గూండాల దౌర్జన్యకాండకు దిగారు. తునిలో 30కి 30 మంది కౌన్సిలర్లు వైఎస్సాస్పీ వారే. ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మంది టీడీపీ లాక్కుంది. వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాలు దాడి చేసి.. మున్సిపల్ ఆఫీస్లో వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.దీంతో ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద కర్రలతో టీడీపీ గూండాలు మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నాటీడీపీ గూండాలు పట్టించుకోలేదు. తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గుండాలు.. నాలుగోసారి అడ్డుకున్నారు.తునిలో పోలీస్ బందోబస్తు లేదంటూ వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా మండిపడ్డారు. ‘‘తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు’’ అని దాడిశెట్టి పేర్కొన్నారు. తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలను పిఠాపురం టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. -
తుని: వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ గూండాల దాడి
తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా👉నాలుగోసారి ఎన్నికను అడ్డుకున్న టీడీపీ గూండాలు👉బలం లేకపోవడంతో అడ్డుకున్న టీడీపీ గూండాలు👉ఎన్నిక జరిగితే ఓడిపోతామన్న భయంతో కూటమి సర్కార్ కుట్రతునిలో టీడీపీ నేతల దౌర్జనకాండ👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై టీడీపీ నేతల దాడి👉మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం👉ప్రాణభయంతో వెనుదిగిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు👉మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీగా టీడీపీ గూండాలు👉కర్రలతో భారీగా టీడీపీ గూండాలు మోహరింపుతునిలో ప్రజాస్వామ్యం ఖూనీ👉మున్సిపల్ ఉప ఎన్నికల్లో కూటమి అరాచకాలు👉నిస్సిగ్గుగా చంద్రబాబు సర్కార్ దౌర్జన్యాలు, అరాచకాలు👉తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కుట్రలు👉తునిలో 30కి 30 కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ వారే👉ప్రలోభపెట్టి, భయపెట్టి 10 మందిని లాక్కున్న టీడీపీ👉వైఎస్సార్సీపీ చేతిలో 17 మంది కౌన్సిలర్లు👉తునిలో ప్రజాస్వామ్యం ఖూనీపై సర్వత్రా విమర్శలు👉144 సెక్షన్ అమల్లో ఉన్న పట్టించుకోని టీడీపీ గూండాలుతునిలో పోలీస్ బందోబస్తు లేదు: దాడిశెట్టి రాజా👉తునిలో టీడీపీ గూండాలే కనిపిస్తున్నారు👉వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు.👉ప్రాణభయంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వెనుదిరిగారు👉పిఠాపురం టోల్ గేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు👉తుని వెళ్తున్న మాజీ మంత్రి కన్నబాబు, ద్వారంపూడిని అడ్డుకున్న పోలీసులు👉పోలీసులతో వైఎస్సార్సీపీ కార్యకర్తల వాగ్వాదంనేడు తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నిక జరగకుండా టీడీపీ గుండాలు అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీపై కూటమి ప్రభుత్వం కక్షసాధిపు చర్యలు దిగుతోంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటుగా మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి, కౌన్సిలర్ల పై అక్రమ కేసు నమోదు చేశారు.దాడిశెట్టి రాజా.. నేడు ఛలో తునికి పిలుపునిచ్చారు. ‘చలో తుని’కి పోలీసుల అనుమతి లేదని. వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ వైఎస్సార్సీపీ హౌస్ అరెస్ట్లు చేస్తున్నారు.చలో తుని కార్యక్రమంలో భాగంగా తుని వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునివ్వగా, ఇవాళ తెల్లవారుజామునుంచి జక్కంపూడి రాజా ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ ప్రత్తిపాడులో వైఎస్సార్సీపీ నేత మురళీకృష్ణ రాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.మున్సిపల్ వైస్ ఛైర్మన్-2 ఎన్నికకు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సిద్ధమయ్యారు. ఎన్నికల కోసం కలెక్టర్ షాన్ మోహన్తో దాడిశెట్టి రాజా మాట్లాడారు. మరికాసేపట్లో మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి నివాసం నుంచి 17 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాకినాడ ఎఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అక్రమ కేసులు బనాయింపు, బెదిరింపులను దాడిశెట్టి రాజా ఖండించారు. బీసీ మహిళ అయిన తనపై అక్రమ కేసు బనాయింపుపై మున్సిపల్ ఛైర్మన్ సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ⇒కూటమి కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. లేని అధికారం కోసం వెంపర్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్జేస్తోంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలు తూచా తప్పకుండా అమలుచేసి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నికలు నిర్వహించాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం కాలరాస్తోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలోకి తొక్కి కరెన్సీ కట్టలు, అధికార బలాన్ని వినియోగించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తుని మున్సిపల్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది.⇒జంటిల్మెన్ ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన మున్సిపల్ వైస్చైర్పర్సన్–2 పీఠాన్ని పోలీసులను కీలు»ొమ్మలుగా మార్చి రౌడీలు, సంఘవ్యతిరేక శక్తులను వెంటేసుకుని తెలుగుదేశం పార్టీ నేతలంతా కట్టకట్టుకుని ఎగరేసుకుపోదామని వేసిన ఎత్తులకు పై ఎత్తులను ఆ నియోజకవర్గ కోఆర్డినేటర్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా నాయకత్వంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. చేసేది లేక చివరకు అధికారబలంతో ఈ నెల 3, 4 తేదీలలో జరగాల్సిన ఎన్నికలను రెండు సార్లు వాయిదా వేయించుకున్నారు.⇒ఇలా రెండు పర్యాయాలు టీడీపీ నేతల కుట్రలు బెడిసికొట్టడంతో మూడోసారి సోమవారం వ్యూహాలకు పదునుపెట్టి వైస్చైర్పర్సన్ పీఠంపై పాగా వేద్దామని గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రలోభాలకు గురిచేసి అక్రమ మార్గంలో వైఎస్సార్ సీసీ నుంచి 10 మంది కౌన్సిలర్లకు టీడీపీ కండువాలు కప్పి నిస్సిగ్గుగా కౌన్సిల్ హాలులో సమావేశపరిచారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేని టీడీపీ నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలనుకున్న తెలుగు తమ్ముళ్ల కుట్రలకు రాజా పక్కా వ్యూహంతో మూడోసారి కూడా చెక్ పెట్టారు. ⇒అడ్డదారిలో తెచ్చుకున్న పది మంది కౌన్సిలర్లను కౌన్సిల్ హాలులో సమావేశపరిచి ప్రలోభాలకు లొంగని వైఎస్సార్ సీపీ వెన్నంటి నిలిచిన నలుగురు కౌన్సిలర్లను బలవంతంగా తీసుకువచ్చి కోరం చూపించి వైస్ చైర్పర్సన్ పోస్టు కొట్టేద్దామని పెద్ద ప్లానే వేశారు. రాజకీయంగా పరిణతి చెందిన రాజా టీడీపీ వ్యూహాలను పసిగట్టి గట్టి ఎదురుదెబ్బ కొట్టడంలో ఆ పార్టీ పాచిక పారలేదు. తొలి నుంచి వైఎస్సార్ సీపీ వెంట ఉన్న18 మంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేసైనా కౌన్సిల్లో కోరం సాధించి వైస్ చైర్పర్సన్ పీఠాన్ని తన్నుకుపోవాలని టీడీపీ కుట్ర చేసింది. ఇందులో భాగమే మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి భర్త, కో–ఆప్షన్ సభ్యుడు బాబు సహా పార్టీ నేతలను పోలీసుల బలప్రయోగంతో గృహనిర్బంధం చేశారు.⇒ఈ దురాఘతాలతో కూటమి ప్రభుత్వం తునిలో ఒక రకంగా భయానక వాతావరణాన్ని సృష్టించింది. చివరకు మున్సిపల్ చైర్పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి సహా పలువురు నేతలపై టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ తదితరులతో దౌర్జన్యాలకు కూడా పురిగొలి్పంది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు కౌన్సిల్కు వెళ్లకుండా దీటుగా స్పందించడంతో తెలుగు తమ్ముళ్లు తోక ముడిచారు. రౌడీ మూకలతో నింపేసిన కౌన్సిల్హాలులో భౌతిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం, కోర్టు చెప్పినట్టు ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుందనే నమ్మకం లేక కౌన్సిలర్లు ఎవరూ వెళ్ల లేదు.⇒తునిలో టీడీపీ జరుపుతోన్న అరాచకాలను నిరసిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్థాయి అధికారులు రక్షణ కలి్పస్తేనే మంగళవారం జరిపే ఎన్నికకు రాగలుగుతామని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా జిల్లా యంత్రాంగానికి అల్టిమేటమ్ ఇచ్చారు. ఇందుకోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి ‘చలో తుని’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రజా మద్ధతుతో తునిలో అధికారపార్టీ నేతల ఆగడాలు, అధికార యంత్రాంగం ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న తీరును ఎండగట్టేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు చలో తునికి సమాయత్తమవుతున్నాయి. ⇒వైస్ చైర్పర్సన్ అందునా జంటిల్మెన్ ఒప్పందంలో రెండున్నరేళ్ల కాలానికి రెండో వైస్ చైర్పర్సన్ పోస్టు నూటికి నూరుశాతం మెజార్టీ కలిగిన వైఎస్సార్ సీపీదే. ఆ పోస్టు కోసం అధికారపార్టీ నేతలు ఇన్ని రోజులుగా ఇన్ని కుప్పిగంతులు వేయాలా అని విజ్ఞులు ఆక్షేపిస్తున్నారు. ఒకప్పుడులో టీడీపీలో నంబర్–2గా వెలిగిన యనమల రామకృష్ణుడు ఇలాకాలో ఆయన కనుసన్నల్లోనే ఇన్ని రోజులుగా కుట్ర రాజకీయం జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.⇒అసెంబ్లీ స్పీకర్, పీఏసీ చైర్మన్, ఆర్థిక మంత్రి వంటి పదవులు అలంకరించిన యనమల వైస్ చైర్పర్సన్ పోస్టు కోసం ప్రజలు ఒక్క సీటు కూడా కౌన్సిల్లో ఇవ్వకుండా తిరస్కరించినా ఇంతలా దిగజారిపోవాలా అని తుని జనం ఆక్షేపిస్తున్నారు. ఎన్నిక పర్యవేక్షించేందుకు జేసీ రాహూల్మీనాను కలెక్టర్ షన్మోహన్ సగిలి నియమించారు. ఎన్నికల అధికారిగా డీపీఓను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కోరం లేక పోవడంతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశామని కలెక్టర్ ప్రకటించారు. -
యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు
● రోడ్డున పడ్డ 10 వేల కుటుంబాలు ● అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తున్న అధికార యంత్రాంగం ● కలెక్టరేట్ వద్ద బోట్స్మెన్ సొసైటీల కార్మికుల ఆందోళన సీటీఆర్ఐ: డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో బోట్లపై ఇసుక ఒడ్డుకు చేర్చే కార్మికులు రోడ్డున పడ్డారని జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు అన్నారు. సోమవారం బోట్స్ మెనన్ సొసైటీ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాలో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీలను తొంగలో తొక్కుతోందని విమర్శించారు. బోట్స్ మెన్ సొసైటీ కార్మికులతో ఇసుక తవ్వకాలు జరిపితే రెండు మూడు అడుగులు మాత్రమే ఇసుక తవ్వకాలు జరుగుతాయని, అయితే అధికార పార్టీ నాయకులు డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు నిర్వహించడం వలన 40 అడుగులు లోతుగా తవ్వకాలు జరుపుతున్నారని అన్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జిలకు, ఆనకట్టకు పెను ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం గమన్ బ్రిడ్జి పిల్లర్కు ప్రమాదం పొంచి ఉండడంతో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారని తెలిపారు. రోడ్ కం రైల్వే బ్రిడ్జి పిల్లర్లు కూడా బలహీనపడ్డాయని తెలిపారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడం వలన గోదావరి నదిలో 40 అడుగుల లోతు వరకు గోతులు ఏర్పడడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు మృత్యవాత పడుతున్నారని వివరించారు. డ్రెడ్జింగ్ యంత్రాలతో ఇసుక తవ్వకాలు వెంటనే నిలుపుదల చేసి బోట్స్ మెన్ సొసైటీ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేబర్ యూనియన్ నాయకులు వారా ప్రభాకర్, దేవన వెంకటకృష్ణ, శ్రీకృష్ణ దేవరాయల ఇసుక బోట్స్ మెన్ సొసైటీ నాయకులు మామిడి కృష్ణ, మట్టపర్తి శ్రీను పాల్గొన్నారు. -
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది భక్తులు ● ముత్తంగి అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి, అమ్మవారు అన్నవరం: వివాహాల సీజన్ సందర్భంగా నవ దంపతులు, వారి బంధుమిత్రులు, ఇతర భక్తులతో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సోమవారం రద్దీ నెలకొంది. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అదే ముహూర్తాలకు వివిధ ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు కూడా సత్యదేవుని సన్నిధికి తరలివచ్చారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో రద్దీ పెరిగింది. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. సత్యదేవుని దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు గోశాలలో సప్తగోవులను దర్శించి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 1,500 నిర్వహించగా అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో నాలుగు వేల మందికి భోజనం పెట్టారు. ముత్తంగి అలంకరణలో సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాలతో చేసిన కవచాల (ముత్తంగి) అలంకరణలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరుడు భక్తులకు కనువిందు చేశారు. -
డీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరవేయడానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం బొమ్మూరులోని వైటీసీ ఆవరణలో ఉన్న భవనంలోకి నూతనంగా వచ్చిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ(డీఆర్డీఏ) కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు స్థిరమైన జీవనోపాధికి ప్రాధాన్యమివ్వడంలో డీఆర్డీఏ సిబ్బంది కీలక పాత్ర పోషించాలన్నారు. కలెక్టర్ వైటీసీ కాంపౌండ్లో ఉన్న డ్వామా, జిల్లా పరిశ్రమలు, మైక్రో ఇరిగేషన్, సమాచార పౌర సంబంధాలు, జిల్లా స్పోర్ట్స్ కార్యాలయాన్ని సందర్శించి వారికి ఉన్న వసతులను అడిగి తెలుసుకున్నారు. డీఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, జిల్లా సమాఖ్య అధ్యక్షులు కె.సుజాత, సెక్రటరీ టి. సత్యవతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అప్పలకొండ, జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి దుర్గేష్, డ్వామా పీడీ ఎ.నాగమహేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతామణి, జిల్లా స్పోర్ట్స్ అధికారి శేషగిరి, ఎల్డీఎం ప్రసాద్ పాల్గొన్నారు. ప్రైవేట్ టోర్నీలో ఆడడం నిషిద్ధంనాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్లో నమోదయిన ఆటగాళ్లు, కోచ్లు, అంపైర్లు, స్కోరర్లు ప్రైవేట్ టోర్నమెంట్లలో పాల్గొనడం నిషేధం అని జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి పి.సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఎవరైనా ప్రైవేట్ టోర్నమెంట్లలో పాల్గొనాంటే 10 రోజుల ముందు అసోసియేషన్కు లిఖిత పూర్వకంగా తెలిపి అనుమతి తీసుకోవాలని, లేదంటే వారిని జిల్లా స్థాయి పోటీల నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. వైద్యులు అలసత్వం వహిస్తే చర్యలు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ హాస్పిటల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ఉద్యోగుల హాజరు పట్టీని పరిశీలించి సక్రమంగా విధులకు హాజరు కాని, గైర్హాజరైన ఉద్యోగుల తీరుపై మండిపడ్డారు. రోగులకు అందాల్సిన సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే తీవ్రస్థాయిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈఎస్ఐ హాస్పిటల్ సూవరింటెండెంట్ డాక్టర్ హుస్సేన్, మరి కొంతమంది సిబ్బంది అందుబాటులో లేక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు చార్జ్ మెమోలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంగోకవరం: తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని వీర్లంకపల్లి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 2025–26 సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎంయూవీ రాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి ఇంగ్లిషు మీడియం ప్రవేశాలకు 80 సీట్లు, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 40 సీట్లు, బైపీసీ గ్రూపులో40 సీట్లు ఖాళీలు ఉన్నాయన్నారు. విద్యార్థులు సంబంధిత వెబ్సైట్లో మార్చి 3 నాటికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రవేశపరీక్ష ఉంటుందన్నారు. -
భద్రతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న, భద్రత ప్రమాణాలు పాటించని ఇసుక రవాణా చేసే వాహనాలపై మోటార్ వాహన చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి హెచ్చరించారు. ఇందుకు సంబంధించి మినిట్స్లో కమిటీ సమావేశం నిర్ణయం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 15 ఓపెన్ సాండ్ రీచ్లలో నిర్దేశించుకున్న 10,39,350 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఇసుకకు సంబంధించి 7,35,766 లభ్యత ఉందన్నారు. వేమగిరి– కడియపులంక 1 కార్యకలాపాలు లేనందు వల్ల రద్దు చేస్తున్నట్లు, జీడిగుంట 13 కోర్ట్ కేసు వలన పెండింగ్లో ఉందని, ములకల్లంక– కాటవరం 9 ర్యాంపు నిర్మాణంలో ఉన్న దృష్ట్యా కార్యకలాపాలు జరగటం లేదని తెలిపారు. ఏడు ప్రాంతాల్లో 3.18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందన్నారు. ఫిబ్రవరి 13 నాటికి ఏడు రీచెస్ పబ్లిక్ హియరింగ్ పూర్తి అయిందని, సింగవరం, కాటవరం లో మార్చి 4 న, కుమారదేవరం మార్చి 5 న పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తగా కడియం, పెరవలి తీపర్రులో రెండు, నిడదవోలులో జీడిగుంట ఏ, బి ,పందలపర్రు డ్రాఫ్ట్ మైనింగ్ ప్లాన్ ఆమోదించామన్నారు. ఫిర్యాదులు అందిన వాటికి నోటీసులు... ఇసుక రవాణాపై పలు ఫిర్యాదులు అందాయని, నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. మోటార్ వాహన చట్టం ప్రకారం అటువంటి వాహనాలను గుర్తించి జరినామా విధించాలని స్పష్టం చేశారు. రీచ్ల నిర్వహణ ఏజెన్సీ ద్వారా ఆయా ప్రాంతాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా రహదారుల నిర్వహణ బాధ్యతలను చేపట్టాలని, వీటిని మినిట్స్లో నమోదు చేయాలని ఆదేశించారు. జేసీ ఎస్.చిన్న రాముడు, ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, మైన్స్ ఏడీ ఫణిభూషణ్రెడి పాల్గొన్నారు. -
కూ... చిక్కుచిక్కు
● కోనసీమ రైలుకు మరోసారి ‘రెడ్ సిగ్నల్’ ● భూ సేకరణకు అవాంతరాలు ● ఇప్పుడు, గతంలో సేకరించిన భూమిపై వివాదం ● ఇప్పటి ధరల ప్రకారం పరిహారం ఇవ్వాలంటున్న రైతులు సాక్షి, అమలాపురం: చుక్చుక్ బండి... కూత లేదండి. అడుగడుగునా ఆటంకమండి.. అన్నట్టుంది. కోనసీమ రైల్వే లైన్ పరిస్థితి. దీని నిర్మాణానికి ఓ అడుగు ముందుకు పడుతుంటే.. మూడు అడుగులు వెనకకు వెళ్తున్నాయి. దశాబ్దాలుగా నత్తనడకన సాగుతూ వస్తున్న కోనసీమ రైల్వే లైన్కు తాజాగా మరో అవాంతరం ఏర్పడింది. కొత్తగా చేపట్టిన భూ సేకరణకు అడుగడుగునా అడ్డంకులు రాగా.. ఇప్పుడు గతంలో సేకరించిన భూములపై సైతం వివాదాలు నెలకొనడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా నరసాపురం వరకూ నిర్మించాల్సిన రైల్వే ప్రాజెక్ట్ నత్తను తలపిస్తోంది. కోటిపల్లి వరకూ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయినా అది కూడా కొన్నేళ్లుగా వినియోగంలో లేదు. కోటిపల్లి నుంచి అమలాపురం మీదుగా నరసాపురం వరకూ నిర్మించాల్సిన రైల్వే లైన్కు తొలుత నిధుల కొరత పట్టిపీడించింది. 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయిస్తుండడంతో పనులు వేగం అందుకున్నాయి. గోదావరి నదీపాయలపై మూడు చోట్ల వంతెనల నిర్మాణాలకు సంబంధించి పిల్లర్లు పూర్తయ్యాయి. వీటిపై గెడ్డర్లు, ట్రాక్ నిర్మించాల్సి ఉంది. వైనతేయ వద్ద ఇటు బోడసకుర్రు, అటు పాశర్లపూడి వైపు ఏటిగట్టుకు లోపల (నదిలో పిల్లర్లు) పూర్తవడంతో, ఏటిగట్టుకు బయట ప్రాంతంలో ఇరువైపులా పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. గౌతమీ నదిపై పిల్లర్ల నిర్మాణాలు పూర్తి కాగా, వాటిపై గెడ్డర్ల నిర్మాణాలకు గత ఏడాది ఫిబ్రవరిలోనే రూ.275 కోట్లకు టెండర్లు ఖరారైనా ఇంకా పనులు మొదలు కాలేదు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టెండర్లు ఖరారైన 28 నెలలకు పనులు పూర్తి కావాల్సి ఉంది. భూ సేకరణకు ఆటంకాలు మొన్నటి వరకూ నిధుల కొరత.. ఇప్పుడు భూసేకరణ ఈ ప్రాజెక్టుకు అవరోధంగా మారింది. కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ 57 కిలోమీటర్ల మేర నిర్మించే రైల్వే ట్రాక్కు పాత అలైన్మెంట్ ప్రకారం 908 ఎకరాల భూమి అవసరం. ఇందులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 791 ఎకరాల భూమి సేకరించాలి. కొత్త అలైన్మెంట్ ప్రకారం ఇది స్వల్పంగా పెరగనుంది. కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్కు 2001లో మొదటి అలైన్మెంట్ వచ్చింది. 2003లోనే కోటిపల్లి నుంచి అమలాపురం మండలం భట్నవిల్లి వరకూ భూసేకరణ జరిగింది. తొలి అలైన్మెంట్ ప్రకారం భట్నవిల్లిలో రైల్వే స్టేషన్ నిర్మించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఇక్కడ భూమి సేకరించారు. అయితే ఇక్కడ నాడు భూములు ఇచ్చిన భట్నవిల్లి రైతులు ఇప్పుడు ఎదురు తిరిగారు. భూములు ఇచ్చినా పొజీషన్ తీసుకోనందున ఇప్పుడిస్తున్న తరహాలో పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక్కడ 40 ఎకరాలకు సంబంధించి 24 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు రైల్వే శాఖ కోర్టుకు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంది. అయితే ఈ భూములకు పరిహారం చెల్లించడం, రైల్వే శాఖకు అప్పగించామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది భట్నవిల్లి నుంచి జిల్లాలోని దిండి వరకూ కొత్తగా చేపట్టిన భూ సేకరణకు సైతం అవాంతరాలు వీడడం లేదు. గతంలో రైల్వే శాఖ ఇచ్చిన అలైన్మెంట్ను ఆనుకుని 216 జాతీయ రహదారి వెళ్లింది. 2014–19 మధ్యలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే లైన్కు ఇబ్బంది లేకుండా జాతీయ రహదారి 216లో భాగంగా అమలాపురం బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ఇలా చేయకపోవడంతో ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ఇచ్చి అందుకు అనుగుణంగా అమలాపురం మండలం భట్నవిల్లి, కామనగరువు, చిందాడగరువు, రోళ్లపాలెం, ఇమ్మిడివరప్పాడు, పేరూరుపేట మీదుగా బోడసకుర్రు వెళ్లనుంది. ఈ అలైన్మెంట్కు సైతం రైతులు తొలి నుంచీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైల్వే లైన్ తమ గ్రామాల మీదుగా వెళ్లేందుకు అంగీకరించమని, అలైన్మెంట్ మార్పు చేయాలని ఆ ప్రాంత వాసులు పలు సందర్భాల్లో నిరసనలు తెలిపారు. స్థానిక రెవెన్యూ అధికారులు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్కు వారు వినతిపత్రాలు అందజేశారు. మరి కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఇలా భూ సేకరణ అంశాలు కోర్టుల వరకూ వెళ్లడంతో ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త ఆలైన్మెంట్కు సంబంధించి రెవెన్యూ శాఖ చేపట్టిన సర్వే దాదాపు పూర్తయ్యింది. కొత్త అలైన్మెంట్లో అడ్డుగా వచ్చే రోడ్లు, పంట కాలువలు, విద్యుత్ లైన్లు, స్తంభాలు, ఓఎన్జీసీ, గెయిల్ సంస్థల పైప్లైన్లు, నివాసాలు, ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకం పైప్లైన్లను ఈ సర్వేలో గుర్తించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవాంతరాలు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. -
సమస్యల పరిష్కారానికి కృషి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలోని విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు డి.వేణు మాధవరావు అన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల కార్యవర్గ సమావేశం సోమవారం స్థానిక ఎన్జీవో హోమ్లో నిర్వహించారు. రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి పాపినాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర సంఘ అధ్యక్షులు వేణుమాధవ్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు, ముఖ్యంగా మెడికల్ క్లెయిమ్స్ తదితర క్లెయిమ్స్ పరిష్కారంలో ఏఈఓ సంఘం శ్రమిస్తుందన్నారు. సంఘం అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికై న వేణుమాధవరావును విశ్రాంత ఏఈవోలు సన్మానించారు. 75 సంవత్సరాలు నిండిన విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సత్కరించారు. జిల్లా ప్రభుత్వ పెన్షన్సంఘం అధ్యక్షులు కేజీకే మూర్తి, నగర ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షులు మీసాల మాధవరావు మాట్లాడారు. అధ్యక్షుడిగా శాంతికుమార్ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల విశ్రాంత వ్యవసాయ విస్తరణా అధికారుల సంఘం అధ్యక్షుడిగా రాజమహేంద్రవరానికి చెందిన జీఎం శాంతికుమార్ను కార్యవర్గం ఎన్నుకుంది. ప్రధాన కార్యదర్శిగా భీమవరానికి చెందిన కపర్దిని, కోశాధికారిగా ఎస్వీ శ్రీనివాస్, సహ అధ్యక్షుడిగా జి సింహాచలం, సంయుక్త కార్యదర్శిగా మురళిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి పలువురు అభినందనలు తెలిపారు. -
బాలిక కిడ్నాప్, అత్యాచారం
ముమ్మిడివరం: ముమ్మిడివరం మండలం అనాతవరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలిక (15)ను ఓ వివాహితుడు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. అనాతవరం గ్రామానికి చెందిన వివాహితుడు పరమట దుర్గాప్రసాద్ (బులి చంటి) సోమవారం స్కూల్కు వెళ్తున్న ఆ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. అనంతరం అమలాపురం ఎర్రవంతెన సమీపంలో ఒక నివాసానికి తీసుకువెళ్లి అక్కడ ఆమైపె బలవంతంగా అత్యాచారం చేశాడు. బాలిక కిడ్నాప్ అయిన విషయం ఆమె తల్లిదండ్రులు ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై డి.జ్వాలాసాగర్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయం తెలిసిన బులి చంటి ఆ బాలికను రూ.20 ఇచ్చి అమలాపురం ఎర్రవంతెన వద్ద అనాతవరం వెళ్లే బస్సు ఎక్కించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు బైక్ల ఢీ
ఆలమూరు/ కడియం: మండలంలోని మడికి నుంచి దుళ్ల వెళ్లే రహదారిలో రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం.. కడియం మండలం దుళ్లకు చెందిన గంటి రాజు (33), కుమారి దంపతులు తమ వ్యక్తిగత పనిపై కొత్తపేట మండలం మందపల్లి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. స్థానిక షణ్ముక నర్సరీ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యభర్తలిద్దరికి తీవ్ర గాయాలు కాగా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా మారడంతో మళ్లీ వారిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భర్త రాజు మృతి చెందగా, భార్య కుమారి మృత్యువుతో పోరాడుతుంది. ఢీకొట్టిన బైక్ యజమానికి కూడా తీవ్ర గాయాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై అశోక్ తెలిపారు. నాన్న లేడని ఎలా చెప్పేది వివాహానికి వెళ్లి పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకునే సమయంలో దుళ్ల గ్రామానికి చెందిన గంటి రాజు (33) మృతి చెందగా, అతని భార్య కుమారి ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేశవరంలోని ఒక ప్రైవేటు కూల్ డ్రింక్ కంపెనీలో పనిచేస్తూ గంటి రాజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య, రెండేళ్ల కుమార్తె ఉంది. ఇంటి వద్ద పాపను వదిలి భార్యతో కలిసి రాజు మందపల్లిలో వివాహానికి శనివారం రాత్రి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటి వద్ద ఉన్న రెండేళ్ల చిన్నారికి నాన్న ఎక్కడని అడిగితే ఏమని చెప్పాలని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రి మృత్యువాత పడి, తల్లి ఆసుపత్రిలో ఉండడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. ఫ ఒకరి మృతి ఫ ఇద్దరికి తీవ్ర గాయాలు -
ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కొత్తపేట: ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేంద్రాలు, విక్రయ దుకాణాలపై సోమవారం ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ) అధికారులు దాడులు చేశారు. కొంత కాలంగా పూతరేకులు తయారీలో నకిలీ నెయ్యి వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు జరిపారు. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్స్టెక్టర్లు గ్రామంలో పలు పూతరేకుల తయారీ కేంద్రాల్లో ఏకకాలంలో ఫుడ్ ఇన్స్పెక్టర్లు రొక్కయ్య, సుబ్బారావు, ప్రసాద్, శ్రీకాంత్ చౌదరి టీమ్లు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆయా కేంద్రాలు, దుకాణాల్లో పూతరేకులు తయారీకి వినియోగిస్తున్న నెయ్యిని, సీల్ ఫ్యాకెట్లను, ఇతర సరకులు, పరిసరాలు, పరిశుభ్రతను, షాపుల్లో పూతరేకులు, ఇతర తినుబండారాలను పరిశీలించారు. బ్రాండ్ నేమ్ లేబుల్ లేని నెయ్యి ప్యాకెట్లను గుర్తించారు. అలా ఒక తయారీ కేంద్రంలో 15 కిలోలు, మరో రెండు షాపుల్లో 142 కిలోల నెయ్యి ప్యాకెట్లు సీజ్ చేశారు. వీటికి సంబందించి 3 కేసులు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 7 దుకాణాల్లో పూతరేకుల శాంపిల్స్ సేకరించారు. ల్యాబ్ రిపోర్టులను బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. లైసెన్స్ లేని 10 షాపుల యజమానులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్ కంట్రోలర్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ బ్రాండ్ నేమ్ లేని నెయ్యి ప్యాకెట్లు గుర్తించి సీజ్ చేశామన్నారు. తయారీ దారులు లూజ్ ప్యాకెట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దన్నారు. ప్రతి ఒక్కరూ బ్రాండ్ నెయ్యినే వాడాలని చెబుతున్నామన్నారు. ప్రతి విక్రయదారుడు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకుని వ్యాపారం చేసుకోవాలన్నారు. తద్వారా నాణ్యమైన పూతరేకులు విక్రయించాలన్నారు. కాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రామంలో ప్రవేశించి దాడులు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మరికొన్ని షాపుల యజమానులు ఆ షాపులను మూసేశారు. ఫ ఆత్రేయపురంలో పూతరేకుల తయారీపై తనిఖీలు ఫ ఏడు షాపుల్లో శాంపిల్స్ సేకరణ -
అడుగులేద్దామిలా..
ఇంగ్లిషు ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. గ్రామర్, ఒకాబ్యులరీపై అధికంగా సాధన చేయాలి. సెక్షన్–ఏలో రీడింగ్ కాంప్రహెన్షన్, సెక్షన్–బీలో గ్రామర్ అండ్ ఒకాబ్యులరీ, సెక్షన్–సీలో క్రియేటివ్ రైటింగ్ ఉంటాయి. సెక్షన్–ఏలో 30 మార్కులకు 24 మార్కులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, ఆరు సాధారణ ప్రశ్నలుంటాయి. పేరాను బాగా చదివి అర్థం చేసుకుంటే కచ్చితంగా 24 మార్కులు స్కోర్ చేయవచ్చు. పాఠ్య పుస్తకాల చివర ఇచ్చే గ్రామర్ను బాగా చదివితే 25 మార్కులు ఈజీగా సాధించవచ్చు. క్రియేటివ్ రైటింగ్లో లెటర్ రైటింగ్, కాన్వర్సేషన్, స్పీచ్, డైరీ ఎంట్రీ, డబ్ల్యూహెచ్ వర్డ్ ప్రశ్నలు, పేరాగ్రాఫ్ రైటింగ్ ప్రశ్నలకు బాగా సాధన చేయాలి. కొత్త సిలబస్తో పాటు, నూతన విధానంలో ప్రశ్నపత్రం ఇస్తారు. నౌన్ మోడిఫయర్స్ కొత్తగా ప్రవేశపెట్టారు. – ఆర్.వెంకటేశ్వరరావు, జెడ్పీ హెచ్ఎస్, భీమనపల్లి, ఉప్పలగుప్తం మండలం గణితానికి ఓ లెక్కుంది గణిత భావనలు బాగా అవగాహన చేసుకుని సూత్రాలపై పట్టు సాధిస్తే గణితమంత సులువైన సబ్జెక్టు మరొకటి ఉండదు. 1, 3, 7, 13, 14 అధ్యాయాలను బాగా అధ్యయనం చేస్తే ప్రతి విద్యార్థి కచ్చితంగా 60 మార్కులు పొందే వీలుంది. ఈ ఐదు చాప్టర్లు గణితంలో పంచరత్నాలుగా భావించాలి. ఈ చాప్టర్ల నుంచే సులభమైన 8 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు మిగిలిన అధ్యాయాల్లో 1, 2, 4 మార్కుల ప్రశ్నలపై పట్టు సాధిస్తే 100 మార్కులు సులభంగా స్కోర్ చేయవచ్చు. –టీఎస్వీఎస్ సూర్యనారాయణమూర్తి (గణితావధాని), జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, అమలాపురం -
ఎమ్మెల్సీ ఎన్నికలకు రెడీ
సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల అనంతరం జరగనున్న పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లలో జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం తలమునకలైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. జిల్లాల కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా, డీఆర్ఓలు సహాయ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. కార్యాచరణ ప్రణాళిక ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు లాంటి ప్రక్రియకు చేసింది. ప్రత్యేక శిబిరాలు నిర్వహించి మరీ ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టారు. పట్టభద్రుల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని పరిశీలించారు. ఓటర్ల జాబితా రూపొందించి ఎన్నికల సంఘానికి పంపారు. ఎట్టకేలకు ఎన్నికలకు ఓటర్ల లెక్క తేల్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,97,945 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. పురుషులు 1,15,938, మహిళలు 82,033, ఇతరులు 10 ఉన్నారు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27వ తేదీ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 285 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 1,97,945 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు మార్చి 3వ తేదీ నిర్వహిస్తారు. అదే రోజు విజేతను ప్రకటిస్తారు. మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) తప్పకుండా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థుల ప్రచార వ్యయంపై నిఘా పెట్టారు. ఇప్పటికే కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్, జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్ రద్దు చేశారు. పట్టభద్ర ఓటర్లకు అర్హతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటు లిస్టులో ఉంటే సరిపోదు. అర్హత పత్రం కలిగుండాలి. ఓటరు ఐడీ కార్డు, పాన్కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ అర్హతా సర్టిఫికెట్లు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారి హోదాతో జారీ చేసే కార్డులు ఉండాలి. బీఎల్ఓలు ఇంటింటా పర్యటించి ఓటరు స్లిప్పులు అందజేస్తారు. స్లిప్లు కేవలం ఎంట్రీకి ఉపయోగపడతాయి. ఓటరు తన అర్హత పత్రాల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. ఇందుకు గాను ఫారం–12ను జిల్లా రిటర్నింగ్ అధికారికి ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా సమర్పించాల్సి ఉంది. ఫారంతో పాటు డ్యూటీ కేటాయింపులతో కూడిన ఉత్తర్వుల జిరాక్స్ కాపీలు జతపర్చాల్సి ఉంటుంది. 2 వేల మంది సిబ్బంది తూర్పు–పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్ర ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణకు ఆరు జిల్లాలకు 2 వేల మంది సిబ్బందిని నియమించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభధ్రుల నియోజవకర్గ పరిధిలో 3,14,984 మంది ఓటర్లు ఉన్నారు. 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 70 జోన్లు ఏర్పాటు చేసి.. 70 జోనల్ అధికారులను, 95 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. 456 పోలింగ్ కేంద్రాల్లో ఒక పీఓ, ఇద్దరు సపోర్టింగ్ స్టాఫ్ విధుల్లో ఉంటారు. ఆరు జిల్లాలకు కలిపి 456 ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 456 అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 456 మంది మైక్రో అబ్జర్వర్లు, 456 మంది వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. వీరితోపాటు 20 మంది రిజర్వ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. 26న పోలింగ్ సామగ్రి తరలింపు 26వ తేదీన ఉదయం పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లనున్నారు. ఆయా జిల్లాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో 25వ తేదీ రాత్రికే ఏర్పాట్లు చేయనున్నారు. 25న ప్రచారానికి తెర పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రచారాన్ని ఆపేయాలి. బరిలో 35 మంది అభ్యర్థులు పట్టబద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా కూటమి, పీడీఎఫ్ అభ్యర్థి మధ్య పోటీ నెలకొంది. మిగిలిన వారు స్వతంత్రులుగా బరిలోకి దిగుతున్నారు. సమర్థవంతంగా నిర్వహణ ఎన్నికల విధులు సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాలు ఏర్పాటు చేపట్టాం. ఎన్నికలు పారదర్శకంగా, శాంతీయుతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందుకు అవసరమైన అన్ని రకాలు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడైనా కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనలు జరిగినా, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినా వారి సమాచారాన్ని సీల్డ్ కవర్లో పెట్టి సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లనున్నాం. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలపై సిబ్బందికి మాస్టర్ ట్రైనర్స్ అవగాహన కల్పిస్తారు. 27న జరిగే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. – పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్ తేలిన ఓటర్ల లెక్క ఉమ్మడి ‘తూర్పు’లో 1,97,945 మంది ఓటర్లు ఈ నెల 27న పోలింగ్ 285 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లలో అధికారుల తలమునకలు ఉమ్మడి తూర్పులో ఓటర్ల వివరాలు.. జిల్లా పోలింగ్ కేంద్రాలు పురుషులు సీ్త్రలు ఇతరులు మొత్తం తూర్పుగోదావరి 92 36,361 26,606 3 62,970 కాకినాడ 98 42,463 28,072 5 70,504 కోనసీమ 95 37,114 27,355 2 64,471 -
తెలుగులో తొమ్మిది సూత్రాలు
తెలుగులో అవగాహన– ప్రతి స్పందనపై నాలుగు ప్రశ్నల ద్వారా 32 మార్కులు సాధించవచ్చు. వ్యక్తీకరణ – సృజనాత్మకత నుంచి నాలుగు మార్కుల ప్రశ్నలు మూడు, ఎనిమిది మార్కుల ప్రశ్నలు మూడు వస్తాయి. వీటి ద్వారా 36 మార్కులు పొందవచ్చు. ప్రధానంగా పద్యభాగంలో కవి పరిచయాలు, గద్యభాగంలో ప్రక్రియలు, రామాయణంలో పాత్రలు చదవడం ద్వారా 12 మార్కులు సాధించవచ్చు. 8వ ప్రశ్నగా కేవలం పద్యభాగ సారాంశాలు, 9వ ప్రశ్నగా రామాయణం, 10వ ప్రశ్నగా సృజనాత్మకత (లేఖ, కరపత్రం) ద్వారా 24 మార్కులు పొందవచ్చు. 32 మార్కులను కేవలం పాఠ్య పుస్తకం వెనుక ఉన్న అభ్యాసాల ద్వారా సాధించవచ్చు. అవగాహన ప్రతిస్పందన నుంచి పరిచిత పద్యం ఆటవెలది, తేటగీతి, కంద పద్యాలు మాత్రమే ఇస్తారు. – జి.ప్రభావతి, పాఠ్య పుస్తక రచయిత్రి, జెడ్పీహెచ్ఎస్, సఖినేటిపల్లిలంక బయాలజీలో ఈజీగా.. మారిన సిలబస్ను అనుసరించి బయాలజీ ప్రశ్న పత్రం 50 మార్కులకు 17 ప్రశ్నలతో ఉంటుంది. జవాబులు రాసే ముందు ప్రశ్న పత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి. సెక్షన్–4లో ప్రయోగాలపై 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. అందువల్ల జీవక్రియలు పాఠంపై అవగాహన అవసరం. అనువంశికత పాఠం నుంచి 8 మార్కుల ప్రశ్న వస్తుంది. ఈ రెండు పాఠ్యాంశాలు బాగా చదివితే 16 మార్కులు తప్పనిసరిగా పొందవచ్చు. సెక్షన్–3లో ఒక డయాగ్రామ్ వస్తుంది. ప్రత్యుత్పత్తి పాఠం నుంచి ఒక డయాగ్రామ్ తప్పనిసరిగా వస్తుంది. –మేకా రామలక్ష్మి, డీసీఈబీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, ఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాల, మండపేట -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 17,500 గటగట (వెయ్యి) 15,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రోడ్డు ప్రమాదంలో తోడి కోడళ్లు మృతి
రాజానగరం: రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు వారివి. భర్త సంపాదనకు భార్య సంపాదన కూడా తోడైతేనేగానీ గడవని పరిస్థితిలో భర్తకు సాయంగా కూలికి పోతున్న తోడి కోడళ్లు రోడ్డు ప్రమాదంలో అశువులు బాసి, ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. అంతేకాదు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తి ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మండలంలోని దివాన్చెరువులో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. కానవరానికి చెందిన కప్పల చంద్రమ్మ (51), కప్పల రిప్కో(55)లు తోడికోడళ్లు. రిప్కో భర్త నాగేశ్వరరావుతో కలసి వారిద్దరూ పాలచర్లలోని నర్సరీలో ప్రతిరోజు కూలి పనికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి బైక్పై తిరిగి వస్తుండగా దివాన్చెరువులో ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో కింద పడిన వారి పైనుంచి లారీ దూసుకుపోయింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చావులోనూ కలిసే.. తోడి కోడళ్లు అయిన చంద్రమ్మ, రిప్కోలు ఇద్దరు సొంత అక్కచెల్లెళ్ల కంటే మిన్నగా కలిసి మెలసి ఉండేవారని, చివరికి మృత్యులోనూ కలిసే ఉన్నారని ప్రమాద దృశ్యాన్ని చూసిన కానవరం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ నిమిత్తం దూరంగా కూలికి వెళ్లి, కొద్దిసేపట్లోనే ఇళ్లకు చేరుకుంటారనుకునే లోపే మృత్యువు కబళించడం అందరినీ కలచివేసింది. చంద్రమ్మ భర్త గ్రామంలోనే మేకలను కాస్తుంటాడు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు. ఇక రిప్కో భర్త నాగేశ్వరరావు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకరికి తీవ్ర గాయాలు -
పండ్ల మార్కెట్లో అగ్ని ప్రమాదం
రాజానగరం: మండలంలోని దివాన్చెరువు పండ్ల మార్కెట్లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఏఎస్ఆర్ ఫ్రూట్స్ గొడౌన్ నుంచి అకస్మాత్తుగా మంటలు వ్యాపించి, క్షణాలలో ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఆ సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు సైతం కంగారు పడ్డారు. ఇక మార్కెట్లో ఉన్నవారు చాలామంది ప్రాణభయంతో అటుఇటు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి కారణం స్పష్టంగా తెలియడంలేదు. గొడౌన్ వెనుక భాగంలో చెత్తను పోగేసి మంట పెట్టడంతో ప్రమాదం జరిగిందని కొందరు, షార్ట్ సర్క్యూట్ వల్ల అని మరికొందరు చెబుతున్నాయి. కాగా విషయం తెలుసుకున్న రాజమహేంద్రవరం అగ్నిమాపక దళాధికారి మార్టిన్ లూథర్కింగ్ ఆధ్వర్యంలో ఆర్యాపురం, ఇన్నీసుపేట, కొవ్వూరుల నుంచి మూడు అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది హుటహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గొడౌన్లో నిల్వ చేసిన యాపిల్స్, ఫైనాపిల్స్, ఖర్బూజా, దానిమ్మ, డ్రాగన్ వంటి వివిధ రకాల పండ్లు మంటలకు ఆహుతయ్యాయి. గొడౌన్ వద్ద పార్కు చేసిన రెండు పల్సర్ బైకులు కూడా కాలిపోయాయి. ఈ ప్రమాదం గురించి గొడౌన్ యజమాని ఆరాధ్యుల శ్రీనివాసరావు (ఏఎస్ఆర్) మాట్లాడుతూ రూ. 10 లక్షలతో కొనుగోలు చేసిన వివిధ రకాల పండ్లను గొడౌన్లో స్టోర్ చేశామని, అవి ఈ మంటలకు కాలిపోయాయన్నారు. అలాగే 15 వేల విలువైన ప్లాస్టిక్ ట్రేలు ఆనవాళ్లు లేకుండా బూడిదయ్యాయన్నారు. ఈ కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ మంటలకు ఆహుతైన గొడౌన్ ఫ సుమారు రూ.50 లక్షల నష్టం -
పదిలం.. విజయం
రాయవరం: పాఠశాల స్థాయిలో పదో తరగతి పరీక్షలు అత్యంత కీలకం. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ విద్యాభ్యాసం సాగించిన విద్యార్థి తొలిసారి ఎదుర్కొనే పబ్లిక్ పరీక్షలు పదో తరగతిలోనే. విద్యార్థుల భవితకు తొలిమెట్టు ఇదే. అలాంటి పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల్లో ఎలా ప్రిపేర్ కావాలో నిపుణుల సూచనలు ఇలా.. చరిత్రలో సమాచార విశ్లేషణ ముఖ్యం నూతన విధానంలో పటాలకు 15 మార్కుల వెయిటేజీ ఉంటుంది. చరిత్ర నుంచి ఒకటి, రెండు పాఠ్యాంశాల్లోని పటాలు, భూగోళం నుంచి 6, 7 పాఠ్యాంశాల్లోని పటాలు చదవాలి. పటాల గుర్తింపు విషయంలో చరిత్రలో 3, 5, భూగోళంలో 1, 6, పౌరశాస్త్రంలో 4, 5, అర్థశాస్త్రంలో 3వ పాఠం అత్యంత ప్రధానమైనవి. 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే భూగోళంలో మూడు నాలుగు పాఠాల్లో విషయ అవగాహన కింద వస్తాయి. చరిత్రలో 2, 5 పాఠ్యాంశాల నుంచి అకడమిక్ స్టాండర్డ్–2 కింద ప్రశ్నలు ఇస్తారు. పౌరశాస్త్రంలో ప్రజాస్వామ్యం పాఠ్యాంశం నుంచి సమకాలీన అంశాల్లో ప్రతిస్పందన (అకడమిక్ స్టాండర్డ్–4) అనే అంశంపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అర్థశాస్త్రంలో పట్టికలు, గ్రాఫ్లపై విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తాయి. పరీక్షలలో భారతదేశం మరియు ప్రపంచ పటం రెండు అవుట్లైన్ మ్యాప్లను తప్పనిసరిగా గుర్తించాల్సి ఉంటుంది. – కేఎస్వీ కృష్ణారెడ్డి, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్ఎస్, ఈతకోట, రావులపాలెం మండలంరాజభాషలో.. ద్వితీయ భాష హిందీ పరీక్ష పత్రం 6 విభాగాలుగా ఉంటుంది. ఆ విభాగాల నుంచి 100 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. మొదటి భాగం నుంచి 12 మార్కులకు పాఠ్య పుస్తకంలోని వ్యాకరణ అంశాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. భాగం–2లో కాంప్రహెన్షన్ నుంచి 4 పేరాగ్రాఫ్లు ఇచ్చి ఒక్కో పేరాగ్రాఫ్కు 5 మార్కుల చొప్పున 20 మార్కులకు ప్రశ్నలు వస్తాయి. పేరాగ్రాఫ్లను చదివి బాగా అర్థం చేసుకుని రాయాలి. భాగం–3లో కవి, రచయితల గురించి బాగా చదివి అవగాహన పెంచుకుంటే 10 మార్కులు పొందవచ్చు. 19వ ప్రశ్నగా ‘దోహా’ మొదటి పాఠం నాలుగు పద్యాల్లో ఒకటి ఇస్తారు. లేఖలో చుట్టీ పత్ర్ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది. – తాహెర్ పాషా, పాఠ్య పుస్తక రచయిత, జెడ్పీహెచ్ఎస్ (బాలికలు), రాజోలు భౌతికశాస్త్రం.. భయం వద్దు ఫిజిక్స్లో మొత్తం 8 పాఠ్యాంశాల్లో నాలుగు ఫిజిక్స్, నాలుగు కెమిస్ట్రీ పాఠ్యాంశాలున్నాయి. రెండు విభాగాల నుంచి 39 చొప్పున ఛాయిస్తో 78 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. కాంతి, ఆమ్లాలు–క్షారాలు పాఠాల నుంచి రెండు పటాలు వస్తాయి. నాలుగు మార్కులు స్కోర్ చేయవచ్చు. లోహాలు – అలోహాలు పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రయోగం వస్తుంది. విద్యుత్ పాఠం నుంచి 8 మార్కులకు ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. –అడబాల వీఎల్ నరసింహారావు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్, జెడ్పీహెచ్ఎస్, చింతల్లంక, అయినవిల్లి మండలం ఫ ప్రణాళికతో చదివితే మంచి మార్కులు ఫ విద్యార్థులకు సబ్జెక్టు నిపుణుల సూచనలు -
రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా : రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్లో మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ నుంచి ఎగిసి పడుతున్నాయి. మంటలు వ్యాపించడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే మంటలు వ్యాపించడంతో అగ్నికి ఆహుతైన పండ్లు నిల్వ ఉంచిన షెడ్డు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది.ఇతర షాపులకు వ్యాపించకుండా మంటల్ని పండ్ల వ్యాపారులు, స్థానికులు అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. -
చంద్రబాబు రాజకీయమంతా కుట్రలు, కుతంత్రాలే: చెల్లుబోయిన
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయం అంతా కుట్రలు, కుతంత్రాలతో నడుస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రతిపక్ష నేతలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం అంటూ మండిపడ్డారు.మాజీ మంత్రి చెల్లుబోయిన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతో రాష్ట్రంలో పౌర సమాజానికి ముప్పు పొంచి ఉంది. ఫిర్యాదు చేసిన వ్యక్తులను ముద్దాయిలుగా మారుస్తున్నారు. చంద్రబాబు రాజకీయం అంతా కుట్ర కుతంత్రాలతో నిండి ఉంది. స్థానిక సంస్థల్లో బలం లేకపోయినా బలవంతంగా దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.కొనుగోలు రాజకీయాలకు చంద్రబాబే ప్రధాన నిదర్శనం. హైదరాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల కొనుగోలుకు సంబంధించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్గా దొరికారు. ఉమ్మడి రాజధానికి పదేళ్ల కాలం ఉన్నా రాత్రికి రాత్రే చంద్రబాబు వచ్చేశారు. తెలంగాణ నుంచి రావాల్సిన ఆస్తులు విలువ లక్షా పదివేల కోట్లు చంద్రబాబు వల్లే రాలేదు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని అనేక ఆరోపణ చేశారు. కేవలం అధికారం కోసం విష ప్రచారం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు. -
చెందుర్తిలో 4,500 కోళ్ల మృతి
● బర్డ్ఫ్లూగా అనుమానం ● శాంపిల్స్ సేకరణ ● అధికారులు అప్రమత్తం పిఠాపురం: గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్లో ఒకేసారి 4,500 కోళ్లు మృతి చెందడం కలకలం రేపింది. దీంతో మండలానికి బర్డ్ఫ్లూ వ్యాపించిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వివరాలివీ.. చెందుర్తికి చెందిన బి.కృష్ణ కోళ్ల ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఇందులో ఐబీ కంపెనీకి చెందిన కోళ్లను ఒక్కో బ్యాచ్లో 2,500 చొప్పున సుమారు 10 వేల కోళ్లు పెంచుతున్నాడు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా 1,500 కోళ్లు మృతి చెందాయి. దీంతో ఆందోళనకు గురైన కృష్ణ చనిపోయిన కోళ్లను వెంటనే వేరు చేయడం ప్రారంభించారు. కొన్ని గంటల వ్యవధిలోనే సుమారు 4,500 కోళ్లు మృతి చెందాయని అతడు చెప్పాడు. కోళ్ల మృతిపై సంబంధిత కంపెనీకి, పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. ఆ కంపెనీ సిబ్బంది వెంటనే వచ్చి, చనిపోయిన కోళ్ల శాంపిల్స్ తీసుకుని వెళ్లారు. గొల్లప్రోలు పశు వైద్యాధికారి హిమజ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కోళ్ల మృతికి కారణాలను పరిశీలిస్తున్నారు. అన్ని పరీక్షలూ నిర్వహించిన అనంతరం కోళ్ల మృతికి కారణాలను నిర్ధారిస్తామని హిమజ తెలిపారు. బర్డ్ఫ్లూపై అనుమానాలు వ్యక్తమవుతూండగా ఆ దిశగా కూడా అన్ని పరీక్షలూ చేస్తామని చెప్పారు. -
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే యువకుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక యువకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గోరక్షణపేట వద్ద వాటర్ వర్క్స్ మరమ్మత్తుల నిమిత్తం రోడ్డుకు అడ్డంగా భారీ పైపు పడేసి, డైవర్షన్ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. చీకటిలో దానిని గుర్తించని యువకుడు విజయ్ తన ద్విచక్ర వాహనంతో అర్ధరాత్రి ఆ పైపును ఢీకొట్టి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. యువకుడి మృతికి ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగి, యువకుడు ప్రాణాలు కోల్పోతే ప్రజాప్రతినిధులు గానీ, కాంట్రాక్టర్ గానీ, అధికారులు గానీ రాకపోవడం దారుణమన్నారు. రోడ్డుకు అడ్డంగా పైపు పడేసి, కనీసం డైవర్షన్ కోసం హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. బారికేడ్లు పెట్టాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం దారుణమని భరత్రామ్ అన్నారు. పేరూరులో 22 అంగుళాల దూడఅమలాపురం రూరల్: 22 అంగుళాల ఎత్తు ఉన్న పుంగనూరు గిత్త దూడ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అమలాపురం ముండలం పేరూరుకు చెందిన పితాని రాధాకృష్ణకు చెందిన ఆవుకు ఇటీవల ఈ దూడ పుట్టింది. బుడి బుడి అడుగులతో ముద్దొస్తున్న ఈ పుంగనూరు గిత్తను చూసేందుకు పలువురు ఆసక్తి చూపించారు. పుంగనూరు గిత్త -
రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,500 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు తోడు ఇతర భక్తులు కూడా అధిక సంఖ్యలో రత్నగిరికి తరలివచ్చి, సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. ఎక్కువ మంది కార్లు, ఇతర వాహనాల్లో రావడంతో దేవస్థానంలోని పార్కింగ్ స్థలాలన్నీ వాహనాలతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని అన్న ప్రసాదాన్ని సుమారు 5 వేల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించారు. ఘనంగా రథసేవ ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథ సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకుని వచ్చి టేకు రథంపై వేంచేయించారు. స్వామి, అమ్మవార్లకు పూజల అనంతరం ఈఓ సుబ్బారావు దంపతులు కొబ్బరి కాయ కొట్టి రథ సేవను ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ ఆలయ ప్రాకారంలో రథంపై మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు పండితులు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా, రామారాయ కళా వేదిక మీద సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవారు సోమవారం ముత్యాల కవచాలు ధరించి (ముత్తంగి సేవ) భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
వ్యవసాయానికి ఈ–క్రాప్
● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూపొందించిన వినూత్న విధానం ● ప్రకృతి విపత్తుల్లో రైతులకు మేలు ● పక్కాగా పంటల నష్ట పరిహారం ● ఇతరత్రా లబ్ధికీ అవసరం ● కొనసాగిస్తున్న కూటమి సర్కార్ ● ఇప్పటికే 97 శాతం పైగా పూర్తి సాక్షి, రాజమహేంద్రవరం: రైతులకు పంట నష్టపరిహారం, పండించిన ఉత్పత్తులు విక్రయించాలంటే ఈ–క్రాప్ తప్పనిసరి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఈ విధానం ద్వారా రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేశారు. ప్రస్తుతం అదే విధానం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ–పంట నమోదు ప్రక్రియను వ్యవసాయ అధికారులు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ సహాయకులు, వీఆర్వోలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ ఏ రైతుకు ఎంత భూమి ఉంది, ఏయే పంటలు సాగు చేస్తున్నారనే వివరాలు నమోదు చేస్తున్నారు. ఉద్దేశం ఇదీ.. రైతులకు ప్రభుత్వ సేవలు చేరువ కావాలంటే ఈ–క్రాప్ తప్పనిసరి. ప్రతి రైతూ తాను సాగు చేసిన పంటను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. పంటల నమోదుకు రైతులు ఆధార్, ఫోన్ నంబర్, పొలం సర్వే నంబర్, పంట వివరాలను వ్యవసాయ అధికారులకు చెప్పాలి. పొలం వద్దకు వెళ్లి, తాను సాగు చేసిన పంట వద్ద ఫొటోలు తీయించుకోవాలి. ఈ ప్రక్రియ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. నేటికీ సాగుతూనే ఉంది. రైతులు అందుబాటులో లేకపోవడంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. రైతు సహాయ కేంద్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన సహాయకులు ప్రతి రోజూ వేల ఎకరాలకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు చేస్తున్నారు. పొలంలో ఏ పంట సాగు చేశారు? ఎవరు వేశారు? ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో సాగు చేపట్టారనే వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, ఆ వివరాలను సంబంధిత యాప్లో పొందుపరుస్తున్నారు. కౌలు రైతుల సాగు వివరాలను సైతం ఈ–క్రాప్లో నమోదు చేస్తున్నారు. కౌలు గుర్తింపు కార్డులు లేకపోయినా.. పంట సాగు చేయడాన్నే ప్రామాణికంగా తీసుకుని నమోదు చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, పరిహారం, రాయితీలు, మార్కెటింగ్ ఇలా రైతులకు ఏది కావాలన్నా.. ఈ–పంట నమోదు కీలకం కావడంతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ ఏడాది కొత్తగా రైతుల బయోమెట్రిక్ ద్వారా ఈ–క్రాప్ బుకింగ్ నిర్వహిస్తున్నారు. నమోదు అనంతరం గుర్తింపు పత్రాలను అందించనున్నారు. సిబ్బంది కొరతతో.. ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను పరిశీలించేందుకు వ్యవసాయ అధికారులు, సిబ్బంది, వీఆర్వోలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ లోగా ఈ–క్రాప్ చేయించుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ–క్రాప్ వివరాలతో పాటు రైతు సహాయ కేంద్రాలకు వెళ్లి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ (ఈ–కేవైసీ) కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. గత ప్రభుత్వ అభివృద్ధి ముద్రలను చెరిపివేసే లక్ష్యంతో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో అనేకచోట్ల సిబ్బంది కొరత నెలకొంది. దీనికి తోడు సాంకేతిక సమస్యలు కూడా చుట్టుముట్టడంతో ఈ–కేవైసీ ప్రక్రియ ఆలస్యమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. 25 వరకూ గడువు ఈ–క్రాప్ నమోదుకు ఈ నెల 25వ తేదీ వరకూ గడువు విధించారు. ఇప్పటికే జిల్లాలో 97 శాతం పైగా ఈ–క్రాప్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మిగిలింది సైతం రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. అనంతరం మార్చి 1 నుంచి 5వ తేదీ వరకూ రైతు సేవా కేంద్రాల్లో ఆ జాబితాను ప్రదర్శిస్తారు. దీనిపై 10వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్చి 15న తుది జాబితా ప్రదర్శించనున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లావ్యాప్తంగా ప్రస్తుత రబీలో 1,78,920 ఎకరాల్లో వరి, ఉద్యాన పంటలు సాగు చేశారు. ఇప్పటి వరకూ 1,73,843 ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు చేసినట్లు వ్యవసాయ అధికారులు వెల్లడిస్తున్నారు. 97.16 శాతం లక్ష్యాన్ని సాధించామని చెబుతున్నారు. మొత్తం 1,35,092 మంది రైతులకు ఈ–కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసి 79.89 శాతం లక్ష్యం సాధించామని చెప్పారు. సాంకేతిక సమస్యల కారణంగా నమోదు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. లక్ష్యాన్ని సాధిస్తాం ఈ–క్రాప్ ప్రక్రియ జిల్లాలో చురుకుగా జరుగుతోంది. రైతులు పంట నష్టపరిహారం, పంటల విక్రయం, ఎరువులు, పురుగు మందులు పొందాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలి. ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లాలో ఈ–క్రాప్ నమోదు ఇలా.. మండలం విస్తీర్ణం ఈ–పంట ఈ–కేవైసీ (ఎకరాల్లో) నమోదు (ఎకరాల్లో) బిక్కవోలు 13,533 13,226 8,656 అనపర్తి 9,105 8,750 5,776 సీతానగరం 16,099 14,508 9,093 దేవరపల్లి 13,071 12,042 8,343 కడియం 5,122 4,845 3,623 రాజానగరం 8,243 8,150 6,078 గోకవరం 6,913 6,912 5,262 కొవ్వూరు 11,069 10,898 8,295 నిడదవోలు 16,319 16,317 12,868 తాళ్లపూడి 8,672 8,670 7,011 పెరవలి 8,178 7,801 6,309 గోపాలపురం 14,720 14,718 11,970 కోరుకొండ 8,489 8,191 6,993 నల్లజర్ల 11,654 11,190 9,790 ఉండ్రాజవరం 11,449 11,448 10,089 చాగల్లు 8,597 8,515 7,660 రాజమహేంద్రవరం రూరల్ 3,416 3,386 3,192 రంగంపేట 4,050 4,267 4,076 -
గోసంరక్షణ ట్రస్ట్కు..
సత్యదేవ గో సంరక్షణ ట్రస్టులో డిపాజిట్లపై రూ.కోటి ఆదాయం వస్తూండగా ఆవుల మేత, ఇతర అవసరాలకు రూ.కోటి వ్యయమవుతుందని ప్రతిపాదించారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వ్యయాల్లో భారీ కోత బడ్జెట్ ప్రతిపాదనల్లో ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ విభాగాల వ్యయాల్లో భారీ కోత విధించారు. గత రెండేళ్లలో ఇంజినీరింగ్ విభాగంలో రూ.20 కోట్లు ఖర్చు చేశారు. దీంతో గత నవంబర్ నెలకే బడ్జెట్ కేటాయింపులు అయిపోయాయి. ఇంకా సుమారు రూ.3 కోట్లు చెల్లింపులు, చేపట్టాల్సిన పనులు మిగిలాయి. దీంతో వీటికి నిధులివ్వాలని సప్లిమెంటరీ బడ్జెట్లో ప్రతిపాదించారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇంజినీరింగ్ విభాగానికి రూ.5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎలక్ట్రికల్ విభాగానికి కూడా రూ.కోటి మాత్రమే కేటాయించారు. పేరుకుపోయిన సీజీఎఫ్ బకాయిలు గత ఏడాది కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) చెల్లింపులు రూ.16 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.2 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రూ.14 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలు, ఈ ఏడాది చెల్లింపులకు కలిపి బడ్జెట్ ప్రతిపాదనల్లో రూ.25 కోట్లు కేటాయించారు. -
కోటసత్తెమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టిక్కెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,22,202 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. లోవలో భక్తుల రద్దీ తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, ప్రసాదం, లడ్డూల విక్రయం ద్వారా రూ.1,10,115, పూజా టికెట్లకు రూ.44,930, కేశఖండన శాలకు రూ.9,600, వాహన పూజలకు రూ.5,100, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.21,910, విరాళాలు రూ.48,108 కలిపి మొత్తం రూ.2,39,763 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. రత్నగిరిపై 26న సరస్వతీ పూజఅన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన ఈ నెల 26వ తేదీన సరస్వతీ పూజ నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఆ రోజు ఉదయం 9 గంటలకు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పండితులు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం విద్యార్థులు ఉత్తమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలని ప్రార్థిస్తూ అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఈ పూజల్లో అన్నవరం, చుట్టుపక్కల విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు పాల్గొనాలని అధికారులు కోరారు. -
కనకధార కురవాలని!
అన్నవరం: అనంతలక్ష్మీ సత్యవతీదేవి సమేతుడై భక్తులు కోరిన కోరికలు తీరుస్తున్న అన్నవరం సత్యదేవునిపై ఎందువల్లనో కానీ కొంత కాలం నుంచి లక్ష్మీ కటాక్ష వీక్షణాలు పూర్తి స్థాయిలో ప్రసరించడం లేదు. దీంతో దేవస్థానం ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది. అన్నవరం దేవస్థానం ఆర్థిక ఇబ్బందులపై ‘సాక్షి’ గత డిసెంబర్ 30న ‘లక్ష్మీ.. రావా.. రత్నగిరికి’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కార్యనిర్వహణాధికారి (ఈఓ) వీర్ల సుబ్బారావు దేవస్థానం ఆదాయం పెంచేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను, సిబ్బందిని కోరారు. దీనిపై ‘ఆదాయ మార్గాలు చెప్పండి’ శీర్షికన ‘సాక్షి’ జనవరి 28న వార్త ప్రచురించింది. కాగా, ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు అనే రీతిలో ఉన్న దేవస్థానాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించి, పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్కు రూపకల్పన చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి బడ్జెట్ ప్రతిపాదనల్లో ఖర్చులు తగ్గించి, ఆర్థిక క్రమశిక్షణ పాటించారు. మిగులు కూడా స్వల్పంగానే ఉంది. ఈ ప్రతిపాదనలను దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించారు. గత బడ్జెట్లో రూ.కోటి మిగులుతుందని అంచనా వేయగా.. అదికాస్తా తలకిందులైంది. పైగా, అదనపు బడ్జెట్ కోసం ప్రతిపాదించాల్సి వచ్చింది. ఈసారి మాత్రం కాస్తయినా మిగులు చూపాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు ఏదైనా అద్భుతం జరిగి, భక్తుల నుంచి దండిగా విరాళాలు, కానుకలు వస్తే మాత్రం దేవస్థానం ఆర్థికంగా ఒడ్డున పడుతుంది. ఆ మేరకు కనకధార కురిపించాలని సిరులమాతల్లి శ్రీమహాలక్ష్మిని అధికారులు వేడుకుంటున్నారు. మిగులు స్వల్పమే.. మొత్తం రూ.162.55 కోట్లతో 2025–26 బడ్జెట్ను రూపొందించారు. ఇందులో వ్యయం రూ.162.13 కోట్లుగా పేర్కొన్నారు. తద్వారా రూ.42 లక్షలు మాత్రమే మిగులు చూపించారు. గత ఏడాది రూ.160 కోట్లతో బడ్జెట్ రూపొందించగా, వ్యయం రూ.159 కోట్లు, మిగులు రూ.కోటిగా అంచనా వేశారు. అయితే, అయితే అంచనాలకు మించి వ్యయం అవడంతో అదనంగా రూ.10 కోట్లు కేటాయించాలని కోరుతూ దేవదాయ శాఖకు సప్లిమెంటరీ బడ్జెట్ ప్రతిపాదించారు. ఇది దేవదాయ శాఖ కమిషనర్ పరిశీలనలో ఉంది. నిత్యాన్నదాన ట్రస్టుకు.. రత్నగిరిపై సత్యదేవుని నిత్యాన్నదాన ట్రస్టుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లపై రూ.12 కోట్ల వడ్డీ వచ్చే అవకాశం ఉంది. అయితే, భక్తుల భోజనాల ఖర్చు, ఆ విభాగం సిబ్బంది జీతభత్యాలకు చెల్లింపులు అంతే మొత్తంలో అవుతాయని బడ్జెట్లో అంచనా వేశారు. భక్తుల సేవల్లో కుదింపు లేదు నూతన బడ్జెట్లో కొన్ని వ్య యాల్లో కోత విధించాం. అ యినప్పటికీ భక్తులకు అందించే సేవల్లో మాత్రం ఎటు వంటి కోతలూ విధించలే దు. ఆ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. ఇంజినీరింగ్ నిర్మాణాల విషయంలో కూడా ముందుగా నిర్ణయించినవన్నీ కొనసాగుతాయి. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం 2025–26 బడ్జెట్ ప్రతిపాదనలు (రూ.కోట్లలో) ఆదాయం షాపుల లీజులు, లైసెన్సుల ఆదాయం 14.50 సత్రాల అద్దెలు 15.00 హుండీల కానుకలు 20.00 ప్రసాదం విక్రయాలు 40.00 వ్రతాల ఆదాయం 50.00 డిపాజిట్లపై వడ్డీ 6.00 ఇతర ఆదాయ వనరుల ద్వారా 17.00 వ్యయం సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు 45.00 ముడిసరకుల కొనుగోళ్లు 35.00 ఉత్సవాల ఖర్చు 30.00 పారిశుధ్య విభాగం 8.00 ఇంజినీరింగ్ విభాగం 5.00 ఎలక్ట్రికల్ విభాగం 1.00 సీజీఎఫ్, ఆడిట్ ఫీజు వంటి చెల్లింపులు 25.00 ఇతర చెల్లింపులు 13.00 వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన రూ.162.55 కోట్లతో ప్రతిపాదనలు ఆర్థిక ఇబ్బందుల ప్రభావం ఖర్చుల్లో భారీగా కోత వ్యయం అంచనా రూ.162.13 కోట్లు -
చమురు సంపదపై హక్కుకు ఉద్యమం
23న కాకినాడలో సదస్సు కాకినాడ సిటీ: చమురు, సహజ వాయువు, ఖనిజాలు, ప్రకృతి వనరులపై రాష్ట్ర ప్రజల హక్కును కాపాడుకునేందుకు ఉద్యమించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఈ నెల 23న కాకినాడలో నిర్వహిస్తున్న సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కాకినాడ ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సముద్ర తీరంలోని చమురు, సహజవాయు నిక్షేపాలు మనకే దక్కాలని, దీనికోసం, అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని అన్నారు. సహజ వనరుల ఉత్పత్తిలో ఆ రాష్ట్రానికి 50 శాతం కేటాయించాలని 12వ ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పిందన్నారు. దీనిపై రాష్ట్ర శాసనసభ, శాసన మండలి ఏకగ్రీవ తీర్మానాలు చేసినా, గ్యాస్ కేటాయింపులు, ఆదాయంలో సగం పొందలేకపోయామని చెప్పారు. కువైట్, మన దేశంలోని ముంబై కన్నా గోదావరి బేసిన్లోనే సహజ వాయు నిల్వలు అధికంగా ఉన్నాయని ముప్పాళ్ల తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ, మన తీరంలోని సహజ వనరులను పాలకులు బడా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. విలేకర్ల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కోనసీమ జిల్లా కార్యదర్శి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సదస్సు కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. -
ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న సివిల్ సర్వీసెస్ ఆల్ఇండియా హాకీ పోటీలు ఆదివారం రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఆర్ఎస్బీ (హైదరాబాద్), ఆర్ఎస్బీ (కొచ్చి) మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ హైదరాబాద్ జట్టు 8–1 స్కోర్ తేడాతోను, ఆర్ఎస్బీ(చంఢీఘర్), ఆర్ఎస్బీ (ముంబయి) మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ ముంబయి 5–1 స్కోర్ తేడాతోను, ఆర్ఎస్బీ (సిమ్లా), ఆర్ఎస్బీ (రాయ్పూర్) మధ్య నిర్వహించిన మ్యాచ్లో ఆర్ఎస్బీ రాయ్పూర్ 6–2 స్కోర్ తేడాతో విజయం సాధించాయి. ఛత్తీస్గఢ్ సెక్టార్, గుజరాత్ సెక్టార్ మధ్య జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్ సెక్టార్ 13–0 స్కోర్తో గెలుపొందింది. మధ్యప్రదేశ్, తెలంగాణ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తెలంగాణ 4–3 స్కోర్ తేడాతోను, కేరళ సచివాలయం, ఢిల్లీ సచివాలయం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 9–0 స్కోర్తోను, పాండిచ్చేరి , ఒడిశా సచివాలయాల మధ్య జరిగిన మ్యాచ్లో ఒడిశా జట్టు 6–0 స్కోర్తోను, గోవా , మహారాష్ట్ర సచివాలయాల మధ్య జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర జట్టు 18–0 స్కోర్తోను విజయం సాధించాయి. శ్రీకృష్ణ కోలాట బృందం, శ్రీఽభరత్ లిఖిత ఆర్కెస్ట్రా, ఆర్ టెక్నో రాక్ బ్యాండ్ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
వక్క.. లాభాలు పక్కా
పిఠాపురం: ప్రకృతి వ్యవసాయం పరవళ్లు తొక్కుతుందనడానికి నిదర్శనమే కొత్త పంటల సాగు. వైవిధ్యమైన వ్యవసాయ విధానాలను రైతులు అవలంబిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎప్పుడూ ఎక్కడా సాగు చేయని పంటలపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే జాజికాయ, జాపత్రి వంటి అరుదైన పంటలను పరిచయం చేసిన స్థానిక రైతులు ఇప్పుడు పోకచెక్క సాగు చేపట్టారు. ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడులు ఇచ్చే సాగు పోక చెక్క. రసాయనక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పని లేకుండా తక్కువ నీటి వసతి ఉన్నా సాగు చేసుకునే ఈ పంటను కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడలో రైతులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. పంట సాగు చేసిన నాలుగేళ్ల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. దిగుబడి ప్రారంభం నుంచి వందేళ్ల వరకు ఎటువంటి పెట్టుబడి లేకుండా నిరంతరాయంగా ఆదాయం పొందే అవకాశం వక్క సాగులో మాత్రమే ఉంది. ఒక ఎకరం పొలంలో 450 నుంచి 500 వరకు మొక్కలు నాటుతున్నారు. పంట నాటిన నాలుగేళ్ల అనంతరం ఎకరానికి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఆదాయం సమకూరుతుంది. ఒక్కో చెట్టు నుంచి గరిష్టంగా సుమారు 100 కేజీల వరకు పోకచెక్క కాయల దిగుబడి వస్తుంది. దీని నుంచి 30 శాతం వరకు పోకచెక్క వస్తుంది. మార్కెట్లో ధరలు బాగుంటే రూ.లక్షల్లో ఆదాయం వస్తుంది. విత్తన కాయల నుంచి మొక్కలను పెంచి తోటలు వేస్తుంటారు. ఈ మొక్కలకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయాల్సిన పని లేదు. కేవలం అవసరమైనప్పుడు నీరు పెట్టుకోవడం, సేంద్రియ ఎరువులు ఏడాదికి రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఏడాదిలో వక్క దిగుబడి వచ్చే నాలుగు నెలలు మాత్రమే రైతుకు పని ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు చెట్ల సంరక్షణ చూసుకోవాల్సి ఉంటుంది. తక్కువ పెట్టుబడితో సేంద్రియ పద్ధతిలో సాగుకు అనుకూలంగా ఉండడంతో స్థానిక రైతాంగం వక్క తోటల పెంపకం చేపట్టింది. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే ఈ పంటను ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కాకినాడ జిల్లాలోని తొండంగి, రౌతులపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఒక్కసారి సాగు చేస్తే వందేళ్ల ఆదాయం సేంద్రియ విధానంలో ప్రయోగాత్మకంగా సాగు జిల్లాలో పోకచెక్క సాగు 15.20 హెక్టార్లు సాగు చేస్తున్న రైతులు 50 మంది సాగవుతున్న మండలాలు 5 సాగు బాగుంది ఇప్పటి వరకు పలు రకాల వాణిజ్య పంటలు సాగు చేశాను. అయితే కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, తెగుళ్లు పంటలను తీవ్రంగా దెబ్బతీయడంతో నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. రెండేళ్ల కిత్రం ఎకరం పొలంలో చెక్క సాగు ప్రారంభించాను. మరో ఏడాదిన్నరలో పంట ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతానికి అనువైనది కాకపోయినా ప్రస్తుతం పంట బాగానే ఉంది. – దేశినీడి నాగేశ్వరరావు, చెక్క సాగు చేసిన రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం రైతులు ఆసక్తి చూపుతున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే చెక్క సాగుకు స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా జిల్లాలో పోకచెక్క సాగు చేపట్టారు. ప్రస్తుతం మొక్కలు బాగానే ఎదుగుతున్నాయి. కొన్నింటి దిగుబడి ప్రారంభమైంది. మిగిలిన చోట్ల దిగుడులు బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. – ఎన్.మల్లిఖార్జునరావు, ఉద్యానశాఖాధికారి, కాకినాడ -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తుని: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి గాయాలతో బయటపడ్డ ఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై తుని వద్ద ఆదివారం జరిగింది. వివరాల్లోకెళితే..విజయనగరం జిల్లా వేపాడ మండలం, వేలుపర్తికి చెందిన గోకడ రవికుమార్(25), అనకాపల్లి జిల్లా రాంబిల్లికి చెందిన నాగిరెడ్డి కిల్లాడి ద్విచక్ర వాహనంపై అన్నవరం వచ్చారు. తిరుగు ప్రయాణంలో స్థానిక డీమార్టు సమీపంలో ఉన్న హవేలి రెస్టారెంటు దగ్గర నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న గోకడ రవికుమార్ అక్కడకక్కడే మృతి చెందగా అతనితో ప్రయాణిస్తున్న నాగిరెడ్డి కిల్లాడి గాయాలతో బయట పడ్డాడు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ ఘటనా స్థలిని పరిశీలించారు. యువకుడు మోటారు వాహనాన్ని నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా నడపడం వల్ల ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
క్రీడలతో ఉన్నత శిఖరాలు
రావులపాలెం: క్రీడలతో విద్యార్థులు ఉన్నత స్థానాలను చేరుకోవాలని డాన్బాస్కో ప్రిన్సిపాల్ ఐ.బల్తాజార్ అన్నారు. రాష్ట్ర స్థాయి పదో జూనియర్ నెట్బాల్ పోటీలు ఆదివారం డాన్బాస్కో స్కూల్ ఆవరణలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను బల్తాజార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అండర్ –19 విభాగంలో 13 జిల్లాలకు చెందిన బాల బాలికలు సుమారు 350 మంది నెట్బాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నట్టు నెట్బాల్ రాష్ట్ర అసోసియేషన్ సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. లీగ్ కం నాకౌట్ విధానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నెట్బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి తెలిపారు. బాలుర, బాలికల విభాగాల్లో 11 జట్లు లీగ్ దశలో పాల్గొంటాయన్నారు. రావులపాలెంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలు -
వ్యక్తిని కిడ్నాప్ చేసి దోపిడీ
పిఠాపురం: దారిలో గాయాలతో ఉన్న వ్యక్తికి సాయం చేసేందుకు ఆగిన ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అతనిపై దాడి చేసి అతని దగ్గర ఉన్న నగదు దోపిడీ చేసిన ఘటన గొల్లప్రోలులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11తేదీ రాత్రి పదిన్నర గంటల సమయంలో గొల్లప్రోలు దేవినగరానికి చెందిన ఉమ్మడి గంగాధర్ టైల్స్ పని చేసుకుని సురేష్ కల్యాణ మండపం మీదుగా దేవినగరంలోని తన ఇంటికి వెళుతున్నాడు. దారిలో అప్పటికే అక్కడ ఇరువర్గాలు కొట్లాడుకుంటుండగా, పిఠాపురం రథాలపేటకు చెందిన ఒక వ్యక్తికి గాయం అవడంతో మానవత్వంగా అతనికి సాయం చేయడానికి ఆగి నీరు అందిస్తున్నాడు. ఇంతలో పిఠాపురం రథాలపేటకు చెందిన పెద్ద, చిన్న, ఆకాష్ లతో పాటు గొల్లప్రోలుకు చెందిన గణేష్ ,అంజి బాధితుడు ఉమ్మడి గంగాధర్ను బలవంతంగా బండిమీద ఎక్కించుకుని పిఠాపురం రథాలపేట ఏరియాలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ బీరు సీసాలతో, ఇనుపరాడ్లతో బాధితుడిపై దాడి చేసి గాయపరిచి అతని జేబులో ఉన్న రూ.3,800లను దోచుకున్నారు. అతనిని అదే రోజు రాత్రి మూడు గంటల సమయంలో గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద వదిలివేసి వెళ్లిపోయారు. గాయాలతో ఉన్న బాధితుడు నడుచుకుంటూ ఇంటికి చేరుకుని జరిగిన విషయం బంధువులకు చెప్పాడు. ఈ ఘటనపై బాధితుడు ఆదివారం గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. -
డాబాపై నుంచి పడి వ్యక్తి...
పి.గన్నవరం: ప్రమాదవశాత్తూ డాబాపై నుంచి కిందపడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన పి.గన్నవరంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైవీపాలెంనకు చెందిన యర్రంశెట్టి వీరా స్వామినాయుడు (55) పి.గన్నవరం శివాలయం సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం రాత్రి డిష్ యాంటెన్నాను సరిచేసేందుకు డాబాపైకి ఎక్కాడు. ఈ క్రమంలో మెట్లపై ఉన్న చెత్తను తీసి కిందకు పడేస్తుండగా అదుపుతప్పి స్వామినాయుడు కిందకు పడిపోయాడు. తలకు గాయాలపాలైన అతడిని స్థానికి సీహెచ్సీకి తరలించగా ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి విషమించడంతో అమలాపురంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. మృతదేహానికి అమలాపురం ఏరియా ఆస్పత్రిలో ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
బైకులు ఢీకొని వ్యక్తి మృతి
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అన్నవరం పోలీసుల వివరాలు ప్రకారం గొల్లప్రోలు మండలం చెందుర్తి గ్రామానికి చెందిన నక్కా సత్యనారాయణ(50) కత్తిపూడిలో ఒక కార్యక్రమం నిమిత్తం బైక్పై వచ్చి తిరిగి చెందుర్తి వెళ్లుతుండగా వజ్రకూటం సమీపంలో ఎదురుగా జగ్గంపేట మండలం కాట్రపల్లి నుంచి కత్తిపూడి వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అన్నవరం ఎస్సై హరిబాబు తెలిపారు. విద్యుత్ వైర్లు తెగిపడి వ్యవసాయ కూలీ...నిడదవోలు రూరల్: విద్యుత్ వైర్లు తెగిపడి అరటితోటలో పురుగుమందు స్ప్రే చేస్తున్న వ్యవసాయ కూలీ కరెంట్షాక్తో అక్కడికక్కడే మృతిచెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు ఆదివారం తెలిపారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం మండలంలోని పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన దేశాబత్తుల నరేష్(35) పందలపర్రు శివారులోని అరటితోటలో ఆదివారం ఉదయం పురుగుమందు స్ప్రే చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తెగి మీద పడటంతో కరెంట్షాక్కు గురై ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. భార్య మౌనిక ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు చెప్పారు. కరెంట్షాక్కు గురై మృతిచెందిన దళిత యువకుడు నరేష్ కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారాన్ని విద్యుత్శాఖ అధికారులు ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. నరేష్ భార్య మౌనికకు ప్రభుత్వం తరుపున ఉపాధి కల్పించాలన్నారు. మార్కెట్లోకి సుజుకీ 125 సీసీ స్కూటర్ రాజమహేంద్రవరం రూరల్: నగరంలోని కంటిపూడి సుజుకీ షోరూంలో సుజుకి న్యూ యాక్సెస్ 125 సీసీ స్కూటర్ను వినియోగదారుల చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా కంటిపూడి సుజుకీ బ్రాంచ్ మేనేజర్ అశోక్ మాట్లాడుతూ టూ వీలర్ విక్రయ రంగంలో సుజుకీకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఈ స్కూటీ అన్ని వర్గాలతో పాటు యువతకు ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైందని, డ్రైవింగ్కు సులువైందని నాణ్యతలో సాటిలేని స్కూటర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ కె.వినయ్బాబు, ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణ మూర్తి (చినబాబు), కె.మన్మోహన్రామ్, సేల్స్ మేనేజర్ వెంకటేష్, బ్రాంచ్ మేనేజర్ అశోక్, అకౌంట్స్ జి.ఎం. రంగయ్య, సర్వీస్ ఏ.జి.ఎం భార్గవ్ పాల్గొన్నారు. -
చికెన్ షాపులు వెలవెల
ఆలమూరు/కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ఫ్లూ కలకలం రేగడంతో మాంసాహారం మార్కెట్ పూర్తిగా కుదేలైంది. మాంసాహారాన్ని ఉడికించి తింటే వైరస్ ప్రభావం ఏమీ ఉండదని పశుసంవర్ధకశాఖ, వైద్యారోగ్యశాఖ చెబుతున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. కొద్ది రోజులు ఈ రెండింటికి దూరంగా ఉంటే బెటర్ అనే అభిప్రాయం వినియోగదారుల్లో కన్పిస్తోంది. బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం అంతగా లేకపోవడంతో ఆదివారమైనా వ్యాపారం సజావుగా సాగుతుందని భావించిన చికెన్, మటన్ వ్యాపారులకు నిరాశే మిగిలింది. దీంతో మాంసాహారాన్ని కొనుగోలు చేసే వినియోగదారుల లేక వ్యాపారులు గగ్గోలు పెట్టారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రెండు వేల మటన్, చికెన్ దుకాణాల ద్వారా వారంతపు రోజైన ఆదివారం సుమారు వెయ్యి మేకలతో పాటు దాదాపు 50 వేల బ్రాయిలర్, ఫారం కోళ్ల మాంసం విక్రయాలు జరుగుతుంటాయి. మిగతా రోజుల్లో మాత్రం అందులో సుమారు 40 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుంది. కాని బర్డ్ ప్లూ వల్ల ఈ ఆదివారం ఆశించినంత స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కిరాణా షాపులు, హోల్సేల్ దుకాణాల్లో గుడ్లు కొనుగోలు చేసేందుకు సైతం వినియోగదారులు వెనకడుగు వేస్తున్నారు. గణనీయంగా పడిపోయిన చికెన్ విక్రయాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ప్లూ వైరస్ కల కలం అధికంగా ఉన్నా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఆ ప్రభావం లేదు. అయినా జిల్లావ్యాప్తంగా బ్రాయిలర్, ఫారం కోళ్ల ధరలు కొంతమేర తగ్గినా వినియోగదారులు మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఇప్పటి వరకూ చికెన్ కేజీ ధర రూ.300 నుంచి రూ.180కి పడిపోయినా వ్యాపారులకు ప్రయోజనం కలిగించలేదు. అమ్మకానికి తెచ్చిన కోళ్లు అలాగే ఉండిపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు కూడా మూతబడటంతో చికెన్ వ్యాపారానికి కోలుకోని దెబ్బ తగిలిందనే అభిప్రాయం వ్యాపారుల్లో వ్యక్తమవుతోంది. మటన్ విక్రయాలపై అదే ప్రభావం బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం చికెన్ విక్రయాలతో పాటు కొంత మేర మటన్ విక్రయాలపై పడింది. మటన్ ధర అధికంగా ఉండటంతో పాటు ఈ ఆదివారం పెళ్లి ముహుర్తాలు ఎక్కువగా ఉండటం కూడా మటన్ విక్రయాలపై ప్రభావం పడిందని తెలుస్త్తోంది. దాదాపుగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మటన్ అమ్మకాలు బారీగా తగ్గిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మటన్ బారీస్థాయిలో నిల్వ ఉండిపోవడంతో నష్టాలు తప్పవని వారు ఆవేదన చెందుతున్నారు. రెస్టారెంట్లలో చికెన్ స్థానంలో మటన్ ఐటమ్స్ తయారు చేస్తున్నా ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. 42 ఆర్ఆర్టీ బృందాల ఏర్పాటు కాకినాడ జిల్లాలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు వీలుగా పశుసంవర్థకశాఖ 21 మండలాల్లో మండలానికి రెండు బృందాలు చొప్పున 42 ఆర్ఆర్టీ బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పశువైద్యాధికారితో పాటు ఇద్దరు కాంపౌండర్లు, ఇద్దరు అసిస్టెంట్లు కలిపి మొత్తం ఐదుగురు సభ్యులు ఉంటారు. పీపీఈ కిట్స్, మాస్క్లు, స్ప్రేయింగ్ మందులు అందుబాటులో ఉంచారు. జాగ్రత్తలు తీసుకుంటే సరి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే యథేచ్ఛగా మాంసాహారాన్ని భుజించవచ్చు. ఇంట్లో హైజిన్ పాటించాలి. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి వంట చేసుకునే ముందు కచ్చితంగా కిచెన్ రూమ్ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పచ్చి మాంసం, కోడిగుడ్లు, చికెన్ పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేసుకోవాలి. మాంసాహారాన్ని 75 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో వేడి చేసి తినడం ద్వారా వైరస్ను నశింపజేయవచ్చు. ముడి మాంసం, సగం ఉడికించిన కోడి గుడ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు. మాంసాహారాన్ని ఉడకపెట్టిన తరువాత బయటకు తీసి శుభ్రపరచుకుని వండుకోవాలి. బర్డ్ఫ్లూ కలకలంతో దుకాణాల మూసివేత మాంసాహారం కొనుగోలుకు ప్రజలు దూరం వ్యాపారుల ఆదివారం ఆశలు గల్లంతు కోళ్లు, మాంసం వివరాలు పాత ధర (కేజీ) కొత్త ధర (కేజీ) రూపాయల్లో.. రూపాయల్లో.. బ్రాయిలర్ (లైవ్) 120 85 ఫారం (లైవ్) 80 50 బ్రాయిలర్ చికెన్ 300 180 ఫారం చికెన్ 200 130 కోడి గుడ్లు 07 4.50 అపోహలు వీడండి జిల్లాలో ఎక్కడా బర్డ్ ప్లూ వైరస్ కేసు నమోదు కానందున మాంసాహారాన్ని భుజించవచ్చునని జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారుల వరకూ చెబుతున్నారు. బర్డ్ ప్లూ వైరస్ 30 డిగ్రీల సెంటిగ్రేడ్కు మించితే జీవించే అవకాశం లేదని వివరిస్తున్నారు. ఉడికించిన మాంసాహారాన్ని తింటే ఏవిధమైన వ్యాధులు దరి చేరవని, బర్డ్ ప్లూ అసలు సోకదంటూ జిల్లా పశుసంవర్థకశాఖ, వైద్యారోగ్యశాఖ గ్రామాల్లో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి వివరిస్తున్న సంగతిని ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేయమని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. శీతాకాలం ముగిసి వేసవికాలంలోకి ప్రవేశించేటప్పుడు సాధారణంగా బర్డ్ ప్లూ వైరస్ ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అపోహలు వీడండి–యదేఛ్ఛంగా మాంసాహారం భుజించండి అంటూ స్వచ్ఛంద సంస్థలు, పౌల్ట్రీ యజమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ధరలు తగ్గినా వ్యాపారం లేదు బర్డ్ ప్లూ వైరస్ నిర్ధారణ కాకపోయినా ప్రచార మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగున్నందువల్ల చికెన్, కోడిగుడ్లు ధరలు తగ్గినా ఆ మేరకు వ్యాపారం జరగలేదు. వినియోగదారులు కూడా మాంసాహారంపై అంతగా ఆసక్తి చూపకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. చికెన్ వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి. – గాడ శివ, చికెన్ వ్యాపారి, ఆలమూరు మటన్ విక్రయాలు పడిపోయాయి బర్డ్ ప్లూ వ్యాధి వ్యాప్తి చెందుతుందంటూ పుకార్లు సృష్టించడం వల్ల చికెన్ విక్రయాలతో పాటు మటన్ విక్రయాలు కూడా దారుణంగా పడిపోయాయి. రెస్టారెంట్లలో కూడా చికెన్కు డిమాండ్ తగ్గగా ఆమేరకు మటన్ విక్రయాలు పెరగలేదు. మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితి వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. – రొట్టా సతీష్, మటన్ వ్యాపారి, రావులపాలెం -
నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
● రోడ్డుకు అడ్డంగా తూర ● చీకటిలో కనిపించక ఢీకొన్న టూవీలర్ ● యువకుడి దుర్మరణం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఉన్నత చదువులు చదువుకుని, చేతికి అందివస్తాడనుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ సంఘటన వివరాలివీ.. స్థానిక వీవీ గార్డెన్స్ ప్రాంతానికి చెందిన కొటికలపూడి విజయ్ రూపస్ (24) ఎంఏ చదువుకుని, ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంట్లో చేదోడువాదోడుగా ఉండేందుకు చిన్నచిన్న ఫంక్షన్లకు ఫ్లవర్ డెకరేషన్ పని చేస్తూంటాడు. వచ్చిన డబ్బులు కుటుంబానికి ఇస్తూంటాడు. రూపస్ ద్విచక్ర వాహనంపై శుక్రవారం అర్ధరాత్రి కడియపులంక వెళ్లి తిరిగి వస్తున్నాడు. మార్గం మధ్యలో గోరక్షణపేట వద్ద రోడ్డులో పైప్లైన్ మరమ్మతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి అక్కడ రోడ్డుకు అడ్డంగా భారీ తూరలను దింపారు. ఆ పైప్లైన్ నల్లగా ఉండటం, అక్కడ చీకటిగా ఉండటం, ఎటువంటి హెచ్చరిక బోర్డులూ లేకపోవడంతో రూపస్కు ఆ తూర కనిపించలేదు. దీంతో తన ద్విచక్ర వాహనంతో ఆ తూరను బలంగా ఢీకొన్నాడు. తలకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని, అతడి సెల్ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చేతికి అంది వచ్చిన రూపస్ నడి రోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి గుండెలు పగిలేలా విలపించారు. తమ కుమారుడి మృతికి పూర్తిగా నగరపాలక సంస్థ నిర్లక్ష్యమే కారణమని, రోడ్డుకు అడ్డంగా తూర లేకపోతే తమ కుమారుడు క్షేమంగా ఇంటికి వచ్చేవాడని తల్లిదండ్రులు రోదించారు. రూపస్ తండ్రి కర్నల్ రాజు పాస్టర్గా ఉన్నారు. రూపస్ అన్న చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు. న్యాయం చేయాలని ఆందోళన సంఘటన స్థలానికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు రూపస్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రమాద స్థలంలో బంధువులు ఆందోళనకు దిగారు. స్థానికులు వారికి మద్దతుగా నిలిచారు. మున్సిపల్ కాంట్రాక్టర్, ఉన్నతాధికారులు న్యాయం చేసేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని వారు హెచ్చరించారు. ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పోలీసులు మున్సిపల్ కాంట్రాక్టర్తో చర్చించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తానని కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో బంధువులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కె.సుమన్, సహాధ్యక్షుడు గంట సంపత్ కుమార్ కోరారు. శనివారం రాజమహేంద్రవరంలో వారు పర్యటించి పలు శాఖల్లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో మమేకమయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమన్, సంపత్కుమార్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెదపాటి గురునాథ్ పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు అయినప్పటికీ రాష్ట్రంలో మెప్మా, సెర్ప్లో పనిచేసే ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించిందన్నారు. ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారని, వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారన్నారు. అందరికీ హెచ్ఐర్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సుధాకర్, పి.లోవరాజు, ఎడ్ల బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. -
గోల్డ్ లోన్ బాధితులకు నెల రోజుల్లో న్యాయం
తుని రూరల్: తేటగుంట కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ల అవకతవకలు వాస్తవమేనని, బాధితులందరికీ నెల రోజుల్లో న్యాయం చేస్తామని ఇన్చార్జి బ్రాంచి మేనే జర్ ఏసుదాసు చెప్పారు. ‘కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్ల గోల్మాల్’ శీర్షికన ‘సాక్షి’ శనివారం వార్త ప్రచురించిన నేపథ్యంలో బంగారం తాకట్టు పెట్టి, రుణాలు పొందిన వారు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు చేరుకున్నారు. ఇన్చార్జి మేనేజర్ను కలసి వారి బంగారం గురించి ఆరా తీశారు. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని, ఈ ప్రక్రియ నాలుగైదు రోజుల్లో పూర్తవుతుందని వారికి ఏసుదాసు బదులిచ్చారు. ఇప్పటికే మేనేజర్ సహా ముగ్గురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా చూస్తామని చెప్పారు. సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. గోల్డ్ లోన్ల గోల్మాల్లో అప్రైజర్ ప్రధాన పాత్ర ఉండటంతో తుని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మొత్తం 160 ఖాతాల్లో గోల్డ్ లోన్ల అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది రుణం తిరిగి చెల్లించి, బంగారు నగలు తీసుకు వెళుతున్నారు. నగలు తక్కువ ఉన్న బాధితులు ఏయే వస్తువులు గోల్మాల్ అయ్యాయో పేర్కొంటూ బ్యాంకుకు ఫిర్యాదులు చేస్తున్నారు. కౌన్సిలర్ ఇంటిపై దాడి సామర్లకోట: స్థానిక 13వ వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు ఇంటిపై అదే ప్రాంతానికి చెందిన కొంత మంది గురువారం రాత్రి దాడి చేశారు. ఈ మేరకు హరిబాబు గురువారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటికి వస్తున్న సమయంలో కొంత మంది తన కారుకు అడ్డంగా వచ్చారని, కారు అద్దాలు పగులగొట్టారని తెలిపారు. దీనిపై ప్రశ్నిస్తే తనపై దౌర్జన్యానికి, తన ఇంటిపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల అండతోనే ఈ దాడి జరిగిందని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడిపై పూర్తి స్థాయి విచారణ జరిపి, న్యాయం చేయాలని హరిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మాక్సివిజన్’ కంటి ఆస్పత్రి ప్రారంభం
కంబాలచెరువు: స్థానిక దానవాయిపేట చిన్న ఆంజనేయస్వామి గుడి వీధిలో శనివారం మాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిని ఫౌండర్, చీఫ్ మెంటార్ డాక్టర్ కాసు ప్రసాద్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయాబెటిక్ రెటినోపతి, గ్లూకోమా, చిన్నపిల్లల దృష్టి లోపాల సవరణకు చికిత్సలు, అడ్వాన్స్ లేజర్ విజన్ కరెక్షన్ ఆపరేషన్స్ చేయనున్నట్టు తెలిపారు. తమ హాస్పటల్లో 10 వేల చదరపు అడుగులు కలిగిన మాడ్యూలర్ హెఫా ఫిల్టర్డ్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయన్నారు. పదేళ్ల అనుభవం కలిగిన వైద్య బృందంతో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. -
ర్యాంకుల డ్రామా!
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025బాబు గారిమా బాబే..! మీ వైఫల్యాలకు మమ్మల్ని బలి చేస్తారా?● ఇప్పటికే మంత్రుల పనితీరుపై ర్యాంకుల ప్రకటన ● ఇక ఎమ్మెల్యేలు, ఎంపీ, పీఏలపై చంద్రబాబు నజర్ ● ముగిసిన ఐవీఆర్ఏస్ సర్వే సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఎనిమిది నెలలు దాటింది. సూపర్ సిక్స్ హామీలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో చంద్రబాబు సర్కారుపై ఇప్పటికే ప్రజ ల్లో తీవ్ర స్థాయి వ్యతిరేకత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో వారి దృష్టిని మళ్లించే లక్ష్యంతో చంద్రబాబు రోజుకో గిమ్మిక్కు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రులకు ర్యాంకుల పేరుతో ఇప్పటికే ఆయన ఓ ప్రహసనం నడిపారు. దీనికి కొనసాగింపుగా ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ర్యాంకులు ప్రకటించి, మరో డ్రామాకు తెర లేపేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వారి పనితీరుపై సీఎం చంద్రబాబు ఇంటర్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం (ఐవీఆర్ఎస్) సర్వే నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరు ఎలా ఉంది? ఫర్వాలేదా? బాగుందా? ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారా? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? కొత్త రోడ్లు వేస్తున్నారా? వంటి అంశాలపై ఈ సర్వేలో ఆరా తీసినట్లు తెలిసింది. వారి పీఏల దందాలపై కూడా పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించినట్లు సమాచారం. ఇద్దరిపై అసంతృప్తి! ● ఎనిమిది నెలల పాలనలో కొంత మంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు, వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. తమకు మంత్రి లోకేష్ అండదండలున్నాయంటూ వారు, వారి అనుచరులు ఆయా నియోజకవర్గాల్లో ఇష్టమొచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. వారి వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. వారి విధానాలను ఆ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. ● జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురున్నారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐవీఆర్ఎస్ సర్వేలో తీవ్రమైన అవినీతి అరోపణలు వచ్చినట్లు సమాచారం. మద్యం, ఇసుక వ్యవహారాల్లో తలదూర్చడంతో పాటు, ప్రతి పనిలోనూ, ఉద్యోగుల బదిలీల్లోను వసూళ్లకు పాల్పడినట్లు సర్వేలో తేలింది. దీనిపై ఇది వరకే చంద్రబాబు అక్షింతలు వేసినా వారి వ్యవహార శైలిలో ఎలాంటి మార్పూ రాలేదనే విషయాన్ని కూడా సర్వే బృందాలు బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చు పెట్టామని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటామనే భావనతో ఆ ఎమ్మెల్యేలు అక్రమాలకు తెగబడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● ఓ ఎమ్మెల్యే అడ్డూ అదుపూ లేకుండా మద్యం, ఇసుక దందాలు సాగిస్తున్నట్లు సర్వేలో తేలింది. మద్యం వ్యాపారంలో సొంత పార్టీ నేతలకు షాపులు వచ్చినా.. వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏ పని కావాలన్నా ఆయన అనుచర నేతలకు కప్పం కట్టాల్సిందే. ఇసుక ర్యాంపులను ప్రతి నెలా ఒక కార్యకర్తకు కేటాయించి, అడ్డగోలు వ్యవహారానికి తెర తీసిన విషయం సైతం సర్వేలో వెల్లడైంది. ● మరో ఎమ్మెల్యే అనుచరులు ఇసుక మాఫియాగా మారారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక తవ్వేసి తరలించేస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు వెళ్తున్న అధికారులను సైతం లెక్క చేయని స్థాయికి మాఫియా ఎదిగిందని, వారికి ఆ ఎమ్మెల్యే అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నాయని సర్వే ద్వారా నిర్ధారణ అయ్యింది. ● మరో ఎమ్మెల్యే ఇసుక లారీకి ఒక ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. సదరు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ నేతలు ఈ తంతును దగ్గరుండి మరీ నడిపిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేకు తృణమో పణమో సమర్పించి, మిగిలింది దోచుకుంటున్నారు. ఈ విషయం సైతం ఐవీఆర్ఎస్ సర్వేలో బాబు దృష్టికి చేరింది. లోకేష్ బృందాల సర్వే? ఇదిలా ఉండగా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు కూడా సర్వేలు నిర్వహించాయని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా ఎమ్మెల్యేలు ఎంత వెనకేసుకున్నారనే విషయమై ఆయా నియోజకవర్గాల్లో రహస్య సర్వే నిర్వహించినట్లు సమాచారం. ఈ మేరకు చంద్రబాబుకు సైతం నివేదిక ఇచ్చినట్లు చెబుతున్నారు. అంతర్మథనం ఇదిలా ఉండగా అధిష్టానం నిర్వహిస్తున్న సర్వేలపై కూటమి ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైంది. ఎంతమంది, ఎన్నిసార్లు సర్వే నిర్వహిస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మంత్రులతో పాటే ఎమ్మెల్యేలకు కూడా ర్యాంకులు విడుదల చేయాలని భావించారు. అయితే, అత్యధిక శాతం ఎమ్మెల్యేల పనితీరు దారుణంగా ఉందని, ఇప్పుడు ర్యాంకులు ప్రకటిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందన్న భావనతో వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. అందువల్లనే ఎమ్మెల్యేలను పక్కన పెట్టి మంత్రుల ర్యాంకులు వెల్లడించినట్లు సమాచారం. ర్యాంకింగ్ ప్రక్రియ కొందరు ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరించి కూటమిని గెలిపించామని, తాము సంపాదించుకోకపోతే ఎలాగని వారు చర్చించుకుంటున్నారు. అయితే, చంద్రబాబు ర్యాంకులు త్వరలో ప్రకటించే అవకాశం ఉందని, తమకు ఏ ర్యాంక్ వస్తుందోననే ఉత్కంఠ వరాఇలో నెలకొంది. తక్కువ ర్యాంక్ వస్తే సహచర ఎమ్మెల్యేలతో పాటు, ప్రజల్లో సైతం విశ్వాసం కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. తాను బాగా పని చేస్తున్నా.. ఎమ్మెల్యేల పనితీరు బాగో లేదంటూ ప్రజల ముందు తమను తక్కువ చేసే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఈ ర్యాంకుల ప్రహసనం నడుపుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. లో8 -
ఆరోగ్యం.. మహాభాగ్యం
ఆరోగ్యం కోసం వస్తున్నారు అమలాపురంలో మాకు రెండు హెల్తీ జ్యూస్ హబ్లున్నాయి. వీటిలో కూరగాయలతో సహజ సిద్ధమైన జ్యూస్లు విక్రయిస్తున్నాం. వ్యాయామం చేసేవారితోపాటు మెడికల్ కాలేజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రెండేళ్లు నుంచి వీరి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల కాలంలో గోధుమ గడ్డి, మిక్సిడ్ వెజిటబుల్స్ జ్యూస్లు అధికంగా తాగుతున్నారు. – తులా లోకేశ్వరా రాంబాబు, అమలాపురం శరీరం తేలికగా ఉంటోంది ఇటీవల కొంత కాలంగా నేను టీ, కాఫీలు మానేసి గోధుమ గడ్డితోపాటు ఆరోగ్యకరమైన జ్యూస్లు తాగుతున్నాను. వ్యాయామం తరువాత తాగడం వల్ల శరీరం చాలా తేలికగా ఉంటోంది. ఇలా చేయడం వల్ల శరీరంలోకి అనారోగ్యరమైన షుగర్, ఇతర టాక్సిన్స్ వెళ్లడం చాలా వరకూ తగ్గుతోంది. వాటి స్థానంలో ఆరోగ్యకరమైన విటమిన్లు శరీరానికి అందుతాయి. – కుడుపూడి శాంతి భూషణం, సామాజిక కార్యకర్త, అమలాపురం సాక్షి, అమలాపురం: దైనందన జీవితం.. యాంత్రిక జీవనం.. మారిన ఆహార అలవాట్లు.. వద్దన్నా తన్నుకు వస్తున్న స్థూలకాయం.. చిన్నతనంలోనే రక్తపోటు.. మధుమేహం. ఆరోగ్యంగా ఉన్నా కొట్టుకునే గుండె ఎప్పుడు ఆగిపోతోందో తెలియకుండా పోతున్న రోజులు ఇవి. ఈ కారణంగా సామాన్యుల నుంచి ఉన్నత వర్గాల వరకూ.. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకూ.. పురుషులు.. మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. నడక.. వ్యాయామం.. యోగా వంటివే కాకుండా ఆహార అలవాట్లలో సైతం మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సెనగలు, పెసలు, సోయా, రాజ్మా, బఠానీ.. వీటిని మొలకెత్తించి ఆహారంగా తీసుకుంటున్న వారి సంఖ్య ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరుగుతోంది. వీటిని సలాడ్ల రూపంలో నేరుగా తినడమే కాదు.. వడలు, పునుగులు, అట్లు రూపంలో అల్పాహారంగా, కూరల రూపంలో తయారు చేసుకుని ఆహారంగా భుజిస్తున్నారు. వీటితోపాటు చిరు ధాన్యాల వినియోగం కూడా పెరుగుతోంది. ఆహారంగా, జావల రూపంలో తీసుకుంటున్నారు. మొలకల్లో విటమిన్లు ఏ, సీ, బీ1, బీ6, కే ఉంటున్నాయి. ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీసు, కాల్షియం, పీచు, ఫోలేట్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. చిరు ధాన్యాల్లో విటమిన్ బీ12, బీ17, బీ6 అధికంగా ఉంటాయి. గోధుమ గడ్డి జ్యూస్కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీనితోపాటు ప్రతి రోజూ ఉదయం ఆనబ, గుమ్మడి జ్యూస్లు తాగేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మైక్రోగ్రీన్స్గా గోధుమ గడ్డి జ్యూస్కు గుర్తింపు రావడంతో సహజ సిద్ధం ఆహారాన్ని ఇష్టపడేవారు అధికంగా తాగుతున్నారు. విటమిన్ ఏ, బీ, సీ, ఈ అధికంగా ఉంటాయి. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల రక్తం నేరుగా తీసుకున్నట్టేనని నిపుణులు చెబుతుంటారు. ఆరోగ్యం.. ఉపాధికి మార్గం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యకరమైన జ్యూస్లు, ఆహారం అందించే దుకాణాలు పెరుగుతున్నాయి. సాధ్యమైనంత వరకూ సేంద్రియ పద్ధతుల్లో పండించే కూరగాయలు, పండ్లు వంటి వాటిని సేకరించడంతోపాటు రంగుల, ఐస్, పంచదార వంటి వాటితో సంబంధం లేకుండా ఈ జ్యూస్లను తయారు చేస్తున్నారు. ప్రధానంగా ఉసిరి, సొరకాయ, క్యారెట్, గుమ్మడి, బూడిద గుమ్మడి, బీట్రూట్, కాకర, కీర వంటి వాటితోపాటు గోధుమ గడ్డి, కలబండ, మునగ ఆకులతో సైతం జ్యూస్లు తయారు చేస్తున్నారు. ఈ జ్యూస్లలో జీలకర్ర, అల్లం, మిరియాలు, వాము, మెంతులు, సబ్జాలు కలిపి అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ వంటి నగరాలు, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, పిఠాపురం, తుని వంటి పట్టణాలు, రావులపాలెం, అనపర్తి, ఏలేశ్వరం, కొత్తపేట, మలికిపురం, రాజానగరం వంటి ఒక మోస్తరు పట్టణ ఛాయలున్న గ్రామాల్లో వీటి సంఖ్య పెరిగింది. ఇటువంటి దుకాణాలు ఏర్పాటు చేసి ఉపాధి పొందుతున్నవారు అధికంగా ఉన్నారు. ఈ జ్యూస్లతోపాటు పండ్లు.. పండ్లతో తయారు చేసిన జ్యూస్లు, అలాగే డ్రై ఫ్రూట్లు, మిలెట్లతో తయారు చేసే మాల్ట్లు, ఆహార పదార్థాల వినియోగం సైతం పెరిగాయి. ఇక మొలకలైతే దుకాణాలతోపాటు జిమ్ సెంటర్లు, యోగా సెంటర్లలో నేరుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామాలకు, జిమ్లకు వచ్చేవారు వీటిని అధికంగా వినియోగిస్తున్నారు. పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కూరగాయలు, పండ్ల రసాలు, మొలకలు, చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో రోడ్ల వెంబడి వెలుస్తున్న దుకాణాలు -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రుల తో పాటు ఇతర భక్తులు కూడా తరలి రావడంతో రత్నగిరి కిటకిటలాడింది. స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని సుమారు 30 వే ల మంది దర్శించారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యే క దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించి న భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షి ణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 30 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఘనంగా ప్రాకార సేవ సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవార్ల ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను తిరుచ్చి వాహనం మీదకు వేంచేయించి, ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ పండితులు పూజలు చేసిన అనంతరం, దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కొబ్బరికాయ కొట్టి సేవను ప్రారంభించారు. పండితుల మంత్రోచ్చారణలు, బాజాభజంత్రీల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించారు. పునఃపూజల అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రధానాలయానికి చేర్చారు. నేడు సూర్య నమస్కారాలు రత్నగిరి కళావేదిక మీద ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సూర్య నమస్కారాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రుత్విక్కులు సూర్య భగవానుడికి పూజలు చేస్తారు. 11 గంటలకు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తారు. అలాగే, ఉదయం పది గంటలకు ఆలయ ప్రాంగణంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. -
గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కోవిడ్ అనంతరం గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. తన క్యాంపు కార్యాలయం నుంచి క్షేత్ర స్థాయి అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. గుండె జబ్బులు, వాటి లక్షణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. స్టెమి వైద్య సేవలపై మరింత చర్చ జరగాలన్నారు. గుండెపోటు లక్షణాలున్న వారికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, మొదటి గంటలోనే రూ.45 వేల విలువైన టెనెక్టిప్లెస్ ఇంజక్షన్ ఉచితంగా అందించి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. గుండెపోటుకు గురైనవారి బంధువులు 108కి ఫోన్ చేస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకుని వెళ్లి, చికిత్స అందిస్తారని తెలిపారు. మార్చి నెలాఖరుకు స్పెషలిస్టు వైద్యుల నియామకం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ రమేష్ కిషోర్ కొవ్వూరు: ఎన్నికల కోడ్ కారణంగా స్పెషలిస్టు వైద్యుల పోస్టుల భర్తీలో జాప్యం జరిగిందని, మార్చి నెలాఖరుకు 297 స్పెషలిస్టు పోస్టులు భర్తీ చేస్తామని జాయింట్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సి.రమేష్ కిషోర్ తెలిపారు. స్థానిక సామాజిక ఆసుపత్రిని శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, స్పెషలిస్టు వైద్యుల భర్తీకి 2,600 దరఖాస్తులందాయన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా అర్హత ఉన్న ఏ ఒక్కరి సదరం సర్టిఫికెట్ను తొలగించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15 వేల మంది పింఛన్దార్లను వైద్యుల బృందం ఇంటింటికీ వెళ్లి పరీక్షిస్తోందన్నారు. ఈ ప్రక్రియ వారం పది రోజుల్లో ముగుస్తుందన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీకి సంబంధించి కొత్తగా 6 వేల మందిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని తెలిపారు. రాత్రి డ్యూటీలో ఉన్న వైద్యులు.. రోగులకు అందుబాటులో ఉండేలా క్యూఆర్ కోడ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. డాక్టర్లు, నర్సులు సకాలంలో విధులకు హాజరవుతున్నారా, లేదా, నర్సుల ప్రవర్తన, ఆసుపత్రిలో పారిశుధ్యం, వైద్య పరీక్షలు జరుగుతున్న తీరు, ఓపీ నిర్వహణపై తాడేపల్లిలోని కంట్రోల్ రూమ్ ద్వారా రోగుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని రమేష్ కిషోర్ తెలిపారు. అంతకు ముందు ఆసుపత్రి ప్రాంగణంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంతో పాటు వార్డులను పరిశీలించారు. రికార్డులు పరిశీలించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ ఒ.పద్మశ్రీరాణి, ఆసుపత్రి సూపరింటెండెండ్ కె.సాయి కిరణ్, అడిషనల్ డైరెక్టర్ టి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సు ఢీకొని బాలుడి మృతి
గోకవరం: నిత్యం ప్రయాణిస్తున్న స్కూల్ బస్సే ఆ బాలుడి పాలిట మృత్యుకుహరం అయ్యింది. గోకవరం మండలం వెదురుపాక గ్రామంలో స్కూల్ బస్సు కింద పడి ఎల్కేజీ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. వివరాల ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన కుంచే రాంబాబు, మహేశ్వరి దంపతులకు లేకలేక పుట్టిన కుమారుడు వెంకట జితేంద్ర (5). అతన్ని గతేడాది కోరుకొండలోని ఓ ఇంగ్లిషు మీడియం స్కూల్లో చేర్పించారు. స్కూల్ బస్సు రోజూ ఉదయం ఉదయం 8.30 గంటలకు వచ్చి గ్రామంలో విద్యార్థులను ఎక్కించుకుని సాయంత్రం తిరిగి 5 గంటల లోపు తిరిగి తీసుకువస్తుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం స్కూల్కు వెళ్లిన వెంకట జితేంద్ర సాయంత్రం బస్సు దిగిన తరువాత డ్రైవర్ అజాగ్రత్తగా ఉండటంతో బస్సు కింద పడపోవడంతో తలపై నుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబ సభ్యులు తొలుత కోరుకొండకు తరువాత రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గోకవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై ఎస్సై పవన్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. పెళ్లైన ఐదేళ్లకు.. కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న రాంబాబు, మహేశ్వరి దంపతులకు పెళ్లయిన ఐదేళ్లకు వెంకట జితేంద్ర జన్మించాడు. లేకలేక పుట్టిన కుమారుడిని అల్లారుముద్దుగా పెంచారు. రోజులాగే ఎంతో ఉత్సాహంగా వెళ్లిన కుమారుడు స్కూల్ బస్సు చక్రాల కింద పడి మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో బాలుడి స్కూల్ బ్యాగ్, చెప్పులు రక్తంతో తడిచి ముద్దయి హృదయ విదారకంగా ఉండటాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. క్లీనర్ లేకపోవడంతో ఘటన రోజూ స్కూల్ బస్సు గ్రామంలోని రామాలయం చివరి వీధిలో ఓ కిరాణా షాపు వద్ద బస్సు ఆగుతుంది. ఆ ప్రాంతంలో నలుగురు విద్యార్థులు బస్సు దిగుతుంటారు. నిబంధనల ప్రకారం స్కూల్ బస్సులో డ్రైవర్తో పాటు క్లీనర్ ఉండాలి. పిల్లలు దిగిన తరువాత వారిని సురక్షిత ప్రాంతంలో దించి వెళ్లాల్సి ఉండగా శనివారం స్కూల్ బస్సులో క్లీనర్ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. విద్యార్థులు స్కూల్ బస్సు దిగిన తరువాత బాలుడు వెంకట జితేంద్ర బస్సు ముందు వెళ్లడంతో డ్రైవర్ నిర్లక్ష్యంతో ముందుకు వెళ్లడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వెదురుపాకలో ఘటన