breaking news
East Godavari
-
భారం లేని ఉపాధి ద్వారం!
● పాలిసెట్కు నోటిఫికేషన్ విడుదల ● ’పది’ విద్యార్థులకు చక్కని అవకాశం ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష రాయవరం: సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్బీఏ గుర్తింపు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దరి చేర్చేలా కళాశాలలకు అనుబంధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేయడం ద్వారా ఏటా కళాశాలల్లో క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించారు. నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కూడా దక్కాయి. గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు లభించింది. భావిజీవితానికి బాటలు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సు్ోల్ల చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా ప్రకటించారు. పాలిసెట్ ఎంట్రెన్స్ ఇలా.. 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. విద్యార్థులకు ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్లో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.లభించే కోర్సులివీ.. పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలుచోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా, జిల్లా వ్యాప్తంగా మరో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. జిల్లాలో 1,560 వరకు వివిధ ట్రేడ్స్లో సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలుండగా, కాకినాడ జిల్లాలో కాకినాడలో రెండు, పిఠాపురంలో ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 17 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలుండగా, దాదాపుగా 4,500 సీట్లు ఉన్నట్లు సమాచారం. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్ల క్వాలిఫై మార్కులు 35 గా నిర్ణయించారు. కోచింగ్, మెటీరియల్ ఉచితం త్వరితగతిన ఉపాధి పొందేందుకు పాలిటెక్నిక్ చక్కని అవకాశం. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత కోచింగ్తో పాటు, సంబంధిత మెటీరియల్ కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – ఆకుల మురళి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, పాలిసెట్–2026, రాజమహేంద్రవరం హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు పాలిటెక్నిక్ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలున్నాయి. పాలిసెట్కు సంబంధించిన వివరాల కోసం కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు పొందేలా విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం – జీవీవీఎల్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనపర్తి -
‘నన్నయ’లో ఖోఖో పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఖోఖో వుమెన్ ఇంటర్ కాలేజీయేట్ కం చాంపియన్ షిప్ అండ్ యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్స్ గురువారం జరిగాయి. గోదావరి జిల్లాలోని అనుబంధ కాలేజీల నుంచి 16 జట్లు, 240 మంది క్రీడాకారుల మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. ఈ పోటీలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా ద్వితీయ స్థానంలో గొల్లల మామిడాడలోని డీఆర్ రెడ్డి కళాశాల, తృతీయ స్థానంలో ఏలూరులోని సెయింట్ థెరిసా కళాశాల జట్లు నిలిచాయని రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. వీరి నుంచి యూనివర్సిటీ టీమ్ని ఎంపిక చేసి, కర్ణాటకలోని దేవాంగరే యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపిస్తామన్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి.విజయనిర్మల, సెక్రటరీ డాక్టర్ ఎంవీవీఎంయూ ఫణీంద్ర, పరిశీలకులు డాక్టర్ ప్రమీలారాణి, సెలెక్షన్ కమిటీ సభ్యులు ధర్మేంద్ర, పట్టాభి పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
92 కేజీల గంజాయి పట్టివేత
పిఠాపురం రూరల్: పిఠాపురం మండలం పి.దొంతమూరు శివారున జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న పామాయిల్ తోటలో 92 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి ఉందని వచ్చిన సమాచారం మేరకు పిఠాపురం రూరల్ ఎస్సై, సిబ్బంది, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, వీఆర్వోల సమక్షంలో పామాయిల్ తోట వద్ద గాలింపు చేపట్టామన్నారు. పామాయిల్ తోటలో ఒక చోట గంజాయి బస్తాలను గుర్తించామని దాని బరువు 92 కేజీలు ఉందన్నారు. ఆ గంజాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా వాహనంలో తీసుకుని వచ్చి అక్కడ దాచి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. దొరికిన గంజాయిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
ధవళేశ్వరం: స్థానిక బత్తిన సుబ్బారావు కాలనీకి చెందిన వివాహిత శీలంశెట్టి నాగవర్ష(30) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బత్తిన సుబ్బారావు కాలనీకి చెందిన శీలంశెట్టి శరత్, నాగవర్షకు 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి స్నానానికి వెళ్ళిన నాగవర్ష ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెళ్ళి చూడగా సీలింగ్కు ఉరివేసుకొని ఉంది. ఉరి వేసుకొని ఉన్న నాగవర్షను భర్త, అటుగా వెళుతున్న మరొక వ్యక్తి కిందకు దించి స్థానిక డాక్టర్ను పిలవగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు అన్నయ్య బైరిశెట్టి శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీఐ టి.గణేష్ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం స్వాధీనం తాళ్లపూడి: కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రం పక్కన గల రజకులు దుస్తులు ఉతికే రేవులో గోదావరి నది ఒడ్డున మృతదేహాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ పి విశ్వం ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహానికి సమీపంలో మోటార్ సైకిల్ ఉండగా దానిపై పి వెంకటేశ్వరరావు అని రాసి ఉందని చెప్పారు. అతని వివరాల కోసం ఇతర సేష్టన్లకు సమాచారం పంపామని తెలిపారు. మృతుడు పొకలి వెంకటేశ్వరావుగా అతనిది కృష్ణా జిల్లా కృటివేణు మండలం సీతనపల్లిగా తెలిసిందని తెలిపారు. అతని బంధువులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మోసగించిన కేసులో పురోగతి లేక నష్టపోతున్నాం కపిలేశ్వరపురం (మండపేట): మండపేట ఐశ్వర్య నగర్లో కార్యకలాపాలు సాగిస్తున్న గుప్తా చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ తమతో డిపాజిట్లు చేయించుకుని మోసగించిందని, ఆ నేపథ్యంలో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నాలుగు నెలలు కావస్తున్నా కేసులో పురోగతి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో నిందితులను అదుపులోకి తీసుకోలేదని పోలీసుల తీరును బాధితులు తప్పుబట్టారు. మండపేట పట్టణంలో గురువారం బాధితుడు గ్రంధి సూర్య వెంకట ప్రకాష్రావు విలేకరులకు తన గోడు చెప్పుకున్నారు. చిట్ అండ్ ఫైనాన్స్ సంస్థలో చేసిన డిపాజిట్లు కాలపరిమితి ముగిసిందని, త్వరలో మీ సొమ్ము తిరిగి ఇస్తామని తమ వద్ద నుంచి డిపాజిట్లు బాండ్లను సంస్థ నిర్వాహకులు వాకచర్ల గుప్తా బంధువు చెక్కా సత్యనారాయణ తీసుకెళ్లారన్నారు. తమ సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో ఫిర్యాదు చేయగా మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కేసు నమోదు చేసి నాలుగు నెలలు అయినప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకోలేదన్నారు. 90 రోజుల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు సుమారు రూ.ఏడు కోట్లు నష్టపోయారని, ఆ సొమ్మును నిందితులు వేర్వేరు ప్రాంతాలకు తరలించారని ఆరోపించారు. కేసును త్వరితగతిన విచారించి బాధితులకు న్యాయం చేయాలని సూర్య వెంకట ప్రకాష్రావు పోలీసులను కోరారు. -
నిరాధార ఆరోపణలు తగవు
ఎమ్మెల్సీ సోము వ్యాఖ్యలపై జయలక్ష్మి సొసైటీ చైర్మన్ త్రినాథరావు కాకినాడ రూరల్: వేలాది మంది డిపాజిటర్లతో ముడిపడి ఉన్న జయలక్ష్మి సొసైటీపై శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిరాధార ఆరోపణలు చేయడం తగదని చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు తెలియజేశారు. సర్పవరం జంక్షన్ వద్ద జయలక్ష్మి సొసైటీ మెయిన్ బ్రాంచ్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీ ప్రస్తుత పాలకవర్గం రూ.7కోట్లు దుర్వినియోగం చేసినట్టు తీవ్రమైన ఆరోపణలను ఎమ్మెల్సీ మండలిలో చేశారన్నారు. పెద్దల సభలో నిజాలు మాట్లాడాలని, జయలక్ష్మి సొసైటీపై చేసిన ఆరోపణలకు సంబంధించి సమాచారం మీరు ఎవరు వద్ద తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల సమాచారం తీసుకున్నారా లేదా సొసైటీ ఆఫీసులో సమాచారం తీసుకున్నారా తెలియజేయాలన్నారు. ఇటు వంటి ఆరోపణలు వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయని, 20వేల మంది సభ్యులు, డిపాజిట్లరు మనో వేదనకు గురవుతున్నారన్నారు. మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జయలక్ష్మి సొసైటీ గత పాలకవర్గం బోర్డు తిప్పేయడంతో కేసులు సీఐడీ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. తమ పాలకవర్గం 67మంది సభ్యుల నుంచి వసూలు చేసిన రూ.7.60 కోట్లు ఉన్నాయని, వారి నుంచి మరో రూ.3కోట్లు వరకు రావల్సి ఉందన్నారు. రూ.7కోట్లు సీఐడీ కేసుల వలన సీజ్ చేసిన వాటిలో ఉన్నాయన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, గౌరవ ఎమ్మెల్సీ వీర్రాజుకు తాము వివరాలు అందజేస్తామన్నారు. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మా బాధలు గుర్తించి ట్రిబ్యునల్లో కేసులు పరిష్కారం చేసి ముందుగా సొమ్ము చెల్లించాలన్నారు. సొసైటీ పాలక వర్గ వైస్ చైర్మన్ పీవీ రమణమూర్తి, డైరెక్టర్లు గౌరీ శంకరరావు, సీహెచ్. సుబ్బారావు, శరణార్థి రవిశంకర్ పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న జయలక్ష్మి సొసైటీ చైర్మన్ త్రినాథరావు -
కోనసీమ స్నోబగులు!
గోదావరి తీరంలో ఆకట్టుకునే మంచు అందాలు వైనతేయ తీరంలో మంచు అందాల నడుమ పడవ ప్రయాణం మామిడికుదురు: వైనతేయ గోదావరి నదీ తీరం పెదపట్నంలంకలో గురువారం ఉదయం మంచు ముసుగులో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మంచు అందాల నడుమ గోదావరి నదిలో పడవపై తిరిగి ఇంటికి వస్తున్న రైతులు, గోదావరి నదీ తీరంలో లంగరు వేసిన పడవలు, వర్షం తరహాలో కురుస్తున్న మంచు అందాల నడుమ పచ్చని కొబ్బరి చెట్లు, పంట పొలాలు, పంట కాలువలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి. -
టీడీపీ పతనం ప్రారంభం
● అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ● ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ ● వైఎస్సార్ సీపీ మద్దతుదార్ల ఓట్లు అధికం ● అందుకే ఎన్నిక డిక్లేర్ చేయలేదని విమర్శ రంగంపేట: మండలంలో జరిగిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల నుంచి టీడీపీ పతనం ప్రారంభమైందని వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. మండలంలోని దొడ్డిగుంట గ్రామంలో గురువారం జరిగిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికను కోరం ఉన్నప్పటికీ నాటకీయ పరిణామాల నడుమ అధికారులు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో దొడ్డిగుంట గ్రామానికి చేరుకున్న డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి ఎన్నిక వాయిదా పడటానికి గల కారణాలను స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీలో దొడ్డిగుంట, ముకుందవరం, సుభద్రంపేట, వెంకటాపురం గ్రామాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ నాలుగు గ్రామాలకు చెందిన ఓటర్లు ఎన్నికకు హాజరయ్యారని తెలిపారు. కోరం కూడా సరిపోయిందన్నారు. ఎన్నిక నిర్వహించగా టీడీపీకి 64 మంది, వైఎస్సార్ సీపీకి 140 మందికి పైగా మద్దతుదారులు ఉన్నారని వివరించారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించాల్సి ఉండగా.. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుయుక్తుల కారణంగా, శాంతిభద్రతలు లేవని, ఎన్నిక నిర్వహించే ప్రదేశం సరిపోలేదనే సాకులు చెప్పి, అధికారులు ఈ ఎన్నికను వాయిదా వేశారని చెప్పారు. శుక్రవారం తాను దొడ్డిగుంట వస్తానని, దమ్ముంటే ఎమ్మెల్యే కూడా రావాలని, ఇద్దరి సమక్షంలో ఎన్నిక నిర్వహిస్తే ఏ పార్టీ మద్దతుదారులు నెగ్గుతారో తేల్చుకుందామని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి సవాలు విసిరారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని అన్నారు. -
తూర్పు సరిహద్దుకు చేరిన పులి
● మల్లవరం సమీపాన సంచారం ● పులికొండ వద్ద మకాం ● మళ్లీ విశాఖ జూ పార్కుకు తరలించేందుకు యత్నం అడ్డతీగల/గోకవరం: పోలవరం జిల్లాలో గత 15 రోజులుగా సంచరిస్తూ అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తూ, గిరిజనులను హడలెత్తిస్తున్న పులి తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతానికి చేరింది. ఇక్కడి ఏలేరు పరీవాహక ప్రాంతంలోని పులికొండ వద్ద మకాం వేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. అడ్డతీగల సబ్ డివిజన్ సూదికొండ అటవీ క్షేత్రం పరిధిలోని మొల్లేరు – తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం శివారు అటవీ ప్రాంతం వద్ద గంగవరం మండలం ట్యాంకుబీడు వద్ద పులి పాదముద్రలను గురువారం ఉదయం గుర్తించారు. దీంతో, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మల్లవరం శివారు ఏలేరు పరీవాహక ప్రాంతం కావడంతో నీటి కోసం పులి తమ గ్రామానికి వస్తోందని భావిస్తున్నారు. మొల్లేరు, మల్లవరం, భూపతిపాలెం, సూరంపాలెం, వడ్డిచెరువు, రాముల్దేవపురం ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. మరోవైపు మల్లవరం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని కొలువైన సింగారమ్మ తీర్థం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పులికి ఇదివరకే అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా దాని కదలికలను ఎప్పటికప్పుడు అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. పులి కదలికలను బట్టి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్రమే ఎక్కువగా సంచరించే పులి ఎటువైపు వెళ్తుందనే విషయాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. సూదికొండ అటవీ క్షేత్రంతో పాటు అడ్డతీగల, రాజవొమ్మంగి, గోకవరం అటవీ క్షేత్రాల సిబ్బంది అప్రమత్తంంగా ఉండాలని రంపచోడవరం డీఎఫ్ఓ శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ సూచనలు పాటించాలని ఫోక్స్పేట రేంజర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టుకునేందుకు యత్నం ఇదిలా ఉండగా, నెల రోజులకు పైగా తూర్పు గోదావరి, పోలవరం జిల్లాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ పులిని మళ్లీ పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. ఈ మేరకు పులిని పట్టుకునేందుకు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా అటవీ సిబ్బందిని రప్పిస్తున్నారు. ఈ పులిని పట్టి, బంధించి తిరిగి విశాఖ జూ పార్కుకు తరలించనున్నట్లు అధికారులుచెబుతున్నారు. -
ఆగని మరణ మృదంగం
● కల్తీ పాల ఘటనలో తాజాగా మరొకరి మృతి ● 10కి పెరిగిన మరణాలు ● విషమంగా మరో 11 మంది పరిస్థితి ● నిజనిర్ధారణలో అంతులేని నిర్లక్ష్యం ● నేటికీ రాని ల్యాబ్ రిపోర్టులు ● రోజుకొకరి మృతితో ఆందోళనలో బాధిత కుటుంబాలు సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కల్తీ పాల దుర్ఘటన రాజమహేంద్రవరంలో ఇంకా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది. మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. దీనికి తోడు జిల్లాకు చెందిన మంత్రి సైతం బాధితులు కోలుకోవడం కష్టమంటూ ఓ సందర్భంలో అన్నారు. ఈ పరిణామాలు బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన నింపుతోంది. ఇప్పటి వరకూ 10 మంది.. కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి చెందగా.. తాజాగా లాలాచెరువుకు చెందిన జి.వెంకటలక్ష్మి (69) స్థానిక కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. అధికారులు మాత్రం తొమ్మిదిగానే చూపుతున్నారు. గత నాలుగు రోజులుగా వరుసగా ప్రతి రోజూ ఒక్కొక్కరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరో 11 మంది బాధితులు నాలుగు వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురిని వెంటిలేటర్పై ఉంచి, డయాలసిస్ చేస్తున్నారు. మరో నలుగురికి డయాలసిస్ జరుగుతోంది. వీరి ఆరోగ్య పరిస్థితి గంటగంటకూ ఆందోళనకరంగా మారుతోంది. ఎవరు కోలుకుంటారో వైద్యులకే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదన్న తలంపుతోనే అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని, కొంత మంది వైద్యానికి అసలు స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, మృతుల కుంటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బాధితుల బంధువులు కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. భిన్న వాదనలు పాల కల్తీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూలెంట్లోని ఇథలిన్ గ్లైకాల్ లీకై పాలల్లో కలవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే, బాధితుల శరీరాల్లో యూరియా అవశేషాలున్నాయని, మరేదైనా కల్తీ జరిగి ఉండవచ్చన్న వైఎస్సార్ సీపీ శ్రేణుల సందేహంపై అధికారులు స్పందించడం లేదు. కల్తీ ఎలా జరిగిందనే నిజం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యాడు. ఇదిలా ఉండగా పాలల్లో ఇథలిన్ గ్లైకాల్ కలవడం వల్లనే సమస్య తలెత్తిందని ఎప్పటిలానే అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. మరో ల్యాబ్కు పంపిన నమూనాలు పరిశీలించగా.. పాలల్లో డిటర్జెంట్ కలిసినట్లు నివేదిక వచ్చిందని సమాచారం. దీనిని ఎందుకు బహిర్గతం చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజాలు దాచేందుకు ఇలా చేస్తున్నారా.. లేక విషయం చల్లబడిన అనంతరం నివేదికలు స్పష్టం చేద్దామనే భావనలో ఉన్నారా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి. విచారణ ఏమైందో..? కల్తీకి కారకుడైన పాల వ్యాపారి గణేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు అతడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయినప్పటికీ కల్తీ పాలకు సంబంధించిన నిజాలు రాబట్టలేకపోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. పాల వ్యాపారి పోలీసులకు నిజం చెప్పలేదా.. లేక తప్పు ఒప్పుకున్నా పోలీసులు దాస్తున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు గణేష్ను అత్యంత వేగంగా కోర్టులో ప్రవేశపెట్టి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించారు. రెండు రోజుల వ్యవధిలో పోలీసులు రాబట్టిందేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మృతుల వివరాలు పేరు, వయసు ఆస్పత్రిలో మృతి చేరిన తేదీ చెందిన తేదీ కృష్ణవేణి (76) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 22 టి.రమణి (58) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 23 రాధాకృష్ణమూర్తి (74) ఫిబ్రవరి 17 ఫిబ్రవరి 23 శేషగిరిరావు (72) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 23 బత్తిన మనోహర్ (6) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 24 కె.సత్యనారాయణ (76) ఫిబ్రవరి 17 మార్చి 2 జి.సూర్యారావు ఫిబ్రవరి 17 మార్చి3 ఆర్.సూర్యకుమారి (62) ఫిబ్రవరి 17 మార్చి 4 జి.వెంకటలక్ష్మి (69) ఫిబ్రవరి 17 మార్చి 5 బి.కనకరత్నం ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 20వీడని కల్తీ గుట్టు ఈ ‘పాల’కూట విషం ఘటన వెలుగులోకి వచ్చి పక్షం రోజులవుతున్నా అందులో దాగున్న విషం ఏమిటనే గుట్టు వీడటం లేదు. కల్తీ పాలు తాగి పలువురు ఆస్వస్థతకు గురైన సమయంలో అధికారులు హడావుడి చేసి, బాధితుల వద్ద రక్తం, పాల నమూనాలు సేకరించారు. వాటిని పుణేలోని ల్యాబ్కు పంపామని చెప్పారు. ఆ నివేదికలు వస్తే కల్తీ ఎలా జరిగిందో నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. కానీ, రోజులు గడుస్తున్నా నేటికీ ఆ ల్యాబ్ నివేదికలు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో, కల్తీ ఎలా జరిగిందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆ రిపోర్టులు ఐదు నుంచి ఏడు రోజుల్లో వస్తాయని అధికారులు చెబుతూనే ఉన్నారు. నేడు, రేపు అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. గురువారం వస్తాయని భావించారు. కానీ, ఇప్పటి వరకూ వాటి జాడే లేదు. ఈ రిపోర్టులు ఎప్పుడొస్తాయనేది అంతు చిక్కని ప్రశ్నగానే ఉంది. ఆ రిపోర్టులు వస్తేనే పాలల్లో ఏం కల్తీ జరిగింది.. బాధితులపై అంత ప్రభావం చూపడానికి కారణమేమిటి.. ఇథలీన్ గ్లైకాల్ లీకేజీ వల్లనేనా.. లేక యూరియా, డిటర్జెంట్లు కలవడం కారణమా.. బాధితుల అవయవాలు, కిడ్నీలపై అంత ప్రభావం ఎలా చూపిందనే ప్రశ్నలకు జవాబులు లభించే అవకాశాలున్నాయి. -
మాంగల్యం త్వరితనానేనా!
● మాటకలిస్తే చాలు.. పెళ్లి ముహూర్తాలు ● వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ● ఆ సమయంలో ఏడాది పాటు పెళ్లిళ్లకు బ్రేక్ ● అందుకే ఇప్పుడు తొందర ● ఈ నెలలో భారీగా వివాహాలు సాక్షి, అమలాపురం: గోదావరిలో పుష్కరుడు ప్రవేశించడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ప్రభుత్వం ఆలస్యంగానైనా కళ్లు తెరచి పుష్కర సన్నాహాలకు నెమ్మదిగానైనా సిద్ధమవుతోంది. కానీ ఏడాది ముందుగానే పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. పుష్కరాలు జరిగే ఏడాది కాలం పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల వాసులు పెళ్లిళ్లకు దూరంగా ఉండటం సంప్రదాయంగా వస్తోంది. ఈ కారణంగానే తమ పిల్లలకు ఈ ఏడాది చివరి నాటికి ఎట్టి పరిస్థితులలోను పెళ్లిళ్లు చేయాలని ఆతృత చూపుతున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో నదీ పరీవాహక ప్రాంతంలో ఏడాది పాటు పెళ్లిళ్లు చేయరాదని నమ్మే వారు. పెళ్లికి ఎదిగిన తమ బిడ్డలకు ఈలోగానే సంబంధం కుదిరి పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు. దీంతో కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు వివాహం చేసేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 8వ తేదీ వరకు పలు వివాహ ముహూర్తాలు ఉన్నా ఇప్పుడు మాట కలిస్తే చాలు ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. పుష్కరాలకు నెల రోజుల ముందు నుంచి అంత్య పుష్కరాల వరకూ వివాహాలు చేయరు. గోదావరి జిల్లా వాసులలో చనిపోయిన పితృ దేవతలకు పుష్కర సమయంలో రాజమహేంద్రంలోని అఖండ గోదావరి, ధవళేశ్వరం బ్యారేజీ దిగువన సప్త నదీపాయల వద్ద పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశ దానాలు చేస్తారు. కాబట్టి పరీవాహక ప్రాంతంలో ఏడాదిపాటు శుభకార్యాలు చేయకూడదని నమ్మకం. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా మంది పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు. వచ్చే ఏడాది శూన్యమాసం తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు మిగిలిన రాయలసీమ జిల్లాలకు ఈ ప్రాంత వాసులు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే అవకాశముంది. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఉభయ గోదావరి జిల్లా వాసులు పుష్కరాలకు ముందే పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నారు. పుష్కరాల సమయంలో చాలా తక్కువ మంది విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేస్తూంటారు. కానీ ఇది శాస్త్ర విరుద్ధంగా భావించేవారు పుష్కరాల ఏడాది సమయం పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు. ఈ నమ్మకం కారణంగానే తమ పిల్లల పెళ్లిళ్ల కోసం బంధువులు, మిత్రులను, మ్యారేజ్ బ్యూరోల వారిని, ఆన్లైన్ వివాహ వేదికల వారిని సంద్రించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముహూర్తాలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఎందుకై నా మంచిది కుదిరితే చాలు వివాహం చేసేద్దామనే వారు కూడా ఉన్నారు. పుష్కరాల సమయంలో ఏడాది పాటు వివాహాలు చేయడంపై పరస్పర విరుద్ధ వాదనలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఎందుకైనా మంచిదని ఈ ఏడాది పెళ్లిళ్లు చేసేద్దాం అనేవారు ఎక్కువగా ఉన్నారు. ముహూర్తాలు తక్కువే.. ప్రస్తుతం ఈ నెల 5, 6, 7 తేదీల్లో వివాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇదే నెలలో మరికొన్ని ముహూర్తాలు కూడా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్తో పాటు మే 18 వరకూ వివాహాలు నిర్వహించేందుకు అనువైన కాలం. మే 19 నుంచి జూన్ 16వ తేదీ వరకూ అధిక జ్యేష్ట మాసం కారణంగా శుభ ముహూర్తాలు లేవు. జూన్ 17 నుంచి జూలై 9 వరకూ తిరిగి ముహూర్తాలుండగా, జూలై 14 నుంచి ఆగస్టు 13 వరకూ గురు మౌఢ్యమి, ఆషాఢ మాసం వస్తున్నాయి. ఆ సమయంలో వివాహాలు చేయరు. కొత్త అల్లుళ్లను అత్తవారిళ్లకు రానివ్వరు. తిరిగి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 8 వరకూ పెళ్లి ముహూర్తాలుండగా, సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకూ భాద్రపద మాసం కారణంగా ముహూర్తాలు లేవు. అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 9 వరకూ ఆశ్వయుజ మాసంలో ముహూర్తాలుండగా, అక్టోబర్ 19 నుంచి 29 వరకూ శుక్ర మౌఢ్యమి కారణంగా వివాహాలు జరగవు. తిరిగి నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకూ కార్తికం, డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకూ మార్గశిర మాసాల్లో ముహూర్తాలున్నాయి. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 6 వరకూ శూన్యమాసం. కాబట్టి పెళ్లిళ్లు చేయరు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ మాఘం, మార్చి 9 నుంచి ఏప్రిల్ 6 వరకూ ఫాల్గుణ మాసాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది ఉగాది తరువాత మే నెల వరకూ ముహూర్తాలున్నాయి. అంటే ఇంచుమించు ఏడాది మీద రెండు నెలల సమయం ఉంది. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్లకు హడావుడి పడుతున్నారు. -
టుబాకో బోర్డు ఆర్ఎంగా సురేంద్ర కుమార్
దేవరపల్లి: టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజినల్ మేనేజర్(ఆర్ఎం)గా జె.సురేంద్ర కుమార్ నియమితులయ్యారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం నిర్వహణాధికారిగా పని చేస్తున్న ఆయన ఉద్యోగోన్నతి బదిలీపై వచ్చి, బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఆర్ఎంగా పని చేసిన జీఎల్కే ప్రసాద్ను ఒంగోలు రీజియన్కు బదిలీ చేశారు. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెంతో పాటు జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాలున్నాయి. అసెంబ్లీ సాక్షిగా యనమల అబద్ధాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు వల్లె వేయడం తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తొమ్మిది అంశాలపై సమాధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే ఉద్దేశంతోనే తుని ఎమ్మెల్యే చంద్రబాబు మాదిరి డైవర్షన్ రాజకీయాలు ఆచరిస్తున్నట్లున్నారని విమర్శించారు. ఈ మేరకు లక్ష్మీ శివకుమారి గురువారం ఒక వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే అయి రెండేళ్లవుతున్నా తన నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాల నిర్మాణం, అనుమతులు ఎలా వస్తాయి, ఎవరిస్తారనే కనీస అవగాహన దివ్యకు లేకపోవడం అన్యాయమన్నారు. ఒక పంచాయతీలో అంగన్వాడీ భవనం మంజూరుకు అక్కడి సర్పంచ్తో పాటు పాలకవర్గం సీడీపీవో ద్వారా జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన అందజేయాలని, స్థలం మంజూరు నుంచి పనులు అప్పగించే వరకూ కలెక్టర్దే తుది నిర్ణయమనే విషయాలు తెలియనందువల్లనే దివ్య అసెంబ్లీలో అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నామన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నాటి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై లేని పోని రాజకీయ ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమారి హితవు పలికారు. నియోజకవర్గంలో నలుగురికి ఉపయోగపడే అంగన్వాడీ భవనాలు నిర్మిస్తే పేరు చిరస్థాయిగా ఉండిపోతుందని అభిలషించే రాజా.. అసంపూర్తి భవనాలతో నిధులు కాజేశారంటూ సత్యదూరమైన ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీలకు మంచి చేయాల్సిందిపోయి అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. వాస్తవాలపై అవగాహన పెంచుకోవాలని దివ్యకు హితవు పలికారు. వైఎస్సార్ సీపీపై లేని పోని ఆరోపణలు చేయడం బాధ్యత అనిపించుకోదని, ఇప్పటికై నా ఆ పద్ధతి మార్చుకోవాలని ఆమె సూచించారు. -
రాజమండ్రిలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి నగరం పేకాట అడ్డాగా మారుతోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా పెరిగిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. రాజమండ్రి క్వారీ ఏరియాలో టీడీపీ నేత.. పేకాట క్లబ్బులను భారీగా నిర్వహిస్తుండగా.. స్పెషల్ పార్టీ పోలీసుల దాడుల్లో కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి.జూదంలో పాల్గొన్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సంఘటన స్థలంలో కోట్ల రూపాయలు దొరికితే అధికారికంగా వేల రూపాయలు మాత్రమే చూపించే ప్రయత్నం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాజకీయ నేతలు, పోలీసుల సహకారంతో రాజమండ్రిలో పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. పట్టుబడిన డబ్బు గోల్మాల్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ
రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులోని GAP-2 ఎర్త్ కోర్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ రూపకల్పనలో వ్యత్యాసాలు, భద్రతా పరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు.సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళుతున్నట్టు ఉండవల్లి స్పష్టం చేశారు.ఉండవల్లి లేఖలో ప్రధాన అంశాలు..పూర్తి సాంకేతిక, డిజైన్ అనుమతులు లేకుండా పనులు కొనసాగించడం డ్యామ్ పటిష్టతకు, ప్రజా భద్రతకు ముప్పునది మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోంది డ్యామ్ కింద ఉండే డయాఫ్రమ్ వాల్ కేవలం నీటి సీపేజీని అడ్డుకోవడానికి (Cut-off wall) మాత్రమే, అది డ్యామ్కు పునాది కాదు .పునాది లోపభూయిష్టంగా ఉంటే భవిష్యత్తులో ఇసుక కోతకు గురై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది . ఎటువంటి సరైన కారణం లేకుండా టెయిల్ వాటర్ లెవల్ను +25 మీటర్ల నుండి +16.0 / +13.5 మీటర్లకు మార్చడంపై CWC అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ కన్సల్టెంట్ AFRY నుండి రావాల్సిన ఫిల్టర్ డిజైన్, స్లోప్ స్టెబిలిటీ వంటి కీలక పత్రాలు ఇంకా CWCకి అందలేదు. ఇవి లేకుండా పనులు ముందుకు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధం భూకంపాలను తట్టుకునే సామర్థ్యం (Seismic resilience) విషయంలో పాత మరియు కొత్త ప్రమాణాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి, వీటిని సరిచేయాల్సి ఉందిభవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది . -
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మరో మహిళ మృతి
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మరో మహిళ మరణించింది. లాలాచెరువుకు చెందిన వెంకటలక్ష్మి (69) కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో, కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే, అనధికారికంగా ఇప్పటివరకు పదిమంది మృతి చెందినట్టు సమాచారం.ఇక, రాజమండ్రి కల్తీ పాల బాధితులు వరుసగా నాలుగు రోజులుగా రోజుకొకరు చొప్పున ప్రాణాలు విడుస్తున్నారు. కల్తీ పాలతో అనారోగ్యం పాలై ఇంకా 11 మంది నాలుగు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురికి వైద్యులు..వెంటిలేటర్పై డయాలసిస్ చేస్తున్నారు. అలాగే, మరో నలుగురికి డయాలసిస్ కొనసాగుతోంది. -
గుదిబండలు
కూలి కూడా రావడం లేదు ప్రస్తుతం సర్వే రాళ్లకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. రెండేళ్లుగా మాకు వ్యాపారం సాగడం లేదు. కూలి డబ్బులు కూడా రావడం లేదు. 1.5 అడుగుల రాయి తయారు చేసినందుకు కార్మికుడికి రూ.25 ఇవ్వాలి. మరో వైపు క్వారీలో బండల ఖరీదు పెరిగింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి. అమ్మకాలు లేక ఎక్కడ రాళ్లు అక్కడే ఉండిపోయాయి. దుద్దుకూరు సర్వే రాళ్లు నాణ్యతగా ఉండడం వల్ల ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గత ప్రభుత్వంలో వ్యాపారం లాభసాటిగా ఉండేది. తయారైన రాళ్లు ఎప్పటికప్పుడు అమ్ముడుపోయేవి. – షేక్ బాజీ, సర్వే రాళ్ల తయారీ దారుడు, దుద్దుకూరు, దేవరపల్లి మండలం సర్వే రాళ్లను తయారు చేస్తున్న కార్మికుడుదేవరపల్లి: పొలాలు, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసినప్పడు అందరికీ టక్కున గుర్తుకు వచ్చేవి సర్వే రాళ్లు. భూమిని కొలతలు కొలిచి, సరిహద్దులను గుర్తించి, అక్కడ ఈ రాళ్లను పాతిపెడతారు. ఇక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినప్పుడు హద్దులను నిర్ధారించడానికి ఇవి ఎంతో కీలకంగా ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన రాళ్లను తయారు చేసే కార్మికుల జీవితాలు అధ్వానంగా ఉన్నాయి. చంద్రబాబు పాలనలో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో రాళ్లకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో అవి కార్మికులకు గుదిబండలుగా మారాయి. కష్టం ఎక్కువే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంది సర్వే రాళ్ల తయారీ కార్మికుల పరిస్థితి. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని నల్లరాతి బండలను చెక్కి సర్వే రాళ్లను తయారు చేస్తారు. పొలాలు, ఇళ్ల స్థలాల సరిహద్దుల్లో పాతడానికి నల్లరాతి సర్వే రాళ్లను ఎక్కువగా వినియోగిస్తారు. 1.5 అడుగులు, 2 అడుగులు, 2.5 అడుగులు, 3 అడుగల పొడవైన రాళ్లను సరిహద్దు రాళ్లుగా వినియోగిస్తారు. పొడవును బట్టి రాయి ధర ఉంటుంది. ఒక్కొక్క రాయి రూ. 40 నుంచి 100 పలుకుతుంది. కానీ దాదాపు రెండేళ్లుగా గిరాకీ లేకపోవడంతో ఎక్కడ రాళ్లు అక్కడే పడి ఉన్నాయి. దుద్దుకూరులో తయారీ దేవరపల్లి మండలం దుద్దుకూరులో సర్వే రాళ్లు తయారు చేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలుగా ఈ పనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. బందపురం శివారు రంగరాయ కాలనీ వద్ద సర్వే రాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొవ్వూరు మండలం దేచర్ల రెవెన్యూ పరిధిలోని ఆర్లమ్మ క్వారీ, లక్ష్మీపురం క్వారీల నుంచి పెద్ద నల్లరాతి బండలను తీసుకు వచ్చి, వాటిని కార్మికులు సర్వే రాళ్లు తయారు చేస్తారు. ఒక లారీ బండలు సుమారు రూ.పది వేలు ఉండగా, వాటితో దాదాపు 500 రాళ్లు తయారు చేస్తారు. రాళ్ల తయారీకి సుమారు రూ.12,500 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రాళ్ల తయారీ గిట్టుబాటు కాకపోయినా, తాతల నాటి నుంచి వృత్తిగా వస్తున్నందున దీన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. ఒకప్పుడు సుమారు 100 కుటుంబాలు రాళ్లు తయారు చేస్తూ జీవనం సాగించేవి. వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో చాలామంది వేరే పనులకు మారిపోయారు. ప్రస్తుతం 20 కుటుంబాలు రాళ్లు తయారు చేసి విక్రయాలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సరఫరా ఇక్కడ తయారు చేసిన సర్వే రాళ్లను ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, నర్సీపట్నం, తుని, విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే సర్వే రాళ్లుకూ గిరాకీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లోని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే రాళ్లను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోవడంతో రాళ్లకు డిమాండ్ తగ్గిందని తయారీదారులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లాభాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సర్వే పనులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరగడంతో సర్వే రాళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో వారానికి ఇక్కడ నుంచి సుమారు 3 వేల రాళ్లు సరఫరా చేసేవారు. రాయి ఖరీదు లాభసాటిగా ఉండేది. రూ.150 నుంచి 200 ధరకు అమ్ముడు పోయేవి. అనంతరం రెండేళ్లుగా కొనుగోళ్లు లేక ఎక్కడ రాళ్లు అక్కడే ఉండిపోయాయి. అక్కడక్కడ భూముల రీసర్వే జరగడం, స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నందున రాళ్లు కొనుగోలు చాలా తక్కువగా ఉంటోంది. ఫ గిట్టుబాటు కాని సర్వే రాళ్ల తయారీ ఫ కష్టం ఎక్కువ, లాభం తక్కువ ఫ బండలు కొని రాళ్లుగా చెక్కుతున్న కార్మికులు ఫ గుట్టలుగా పేరుకుపోతున్న సరకు ఫ చంద్రబాబు పాలనలో పడిపోయిన రియల్ ఎస్టేట్ ఫ తగ్గిపోయిన సరిహద్దు రాళ్ల వినియోగం -
‘జీఎంఆర్’ పన్ను బకాయి రూ.1.47 కోట్లు
కడియం: వేమగిరిలోని జీఎంఆర్ సంస్థ ఆ గ్రామ పంచాయతీకి రూ.1,47,72,147 పన్ను బకాయి పడింది. పన్ను వసూలుపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఎంపీడీవో కె.రమేష్, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.శ్రీనివాస్, కార్యదర్శులు రూప్చంద్, ఎ.శ్రీనివాసరావు బుధవారం జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను కలిశారు. తక్షణమే పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. లభ్యం కాని రాహుల్ ఆచూకీ అనపర్తి: హోలీ సందర్భంగా అనపర్తిలో కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతైన తొమ్మిదేళ్ల కొమరపు రాహుల్ ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం 10 గంటలకు కాలువలో పడిపోయిన రాహుల్ కోసం పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రాత్రి వరకూ గాలించారు. చీకటి పడడంతో గాలింపును నిలిపివేసి, బుధవారం తెల్లవారు జాము నుంచి ప్రారంభించారు. అనపర్తి ఎస్సై ఎల్.శ్రీను నాయక్, ఫైర్ ఆఫీసర్ జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధవళేశ్వరం నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు కాలువలోని చెత్తను తొలగించి అణువణువూ జల్లెడపడుతున్నారు. అలాగే అనపర్తి పోలీసులు డ్రోన్తో కాలువ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయినా బుధవారం సాయంత్రం వరకు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం నీటి లెవెల్ తగ్గించి మళ్లీ వెతుకుతామని ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. దివ్యాంగ క్రీడాకారులకు అభినందనలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమీర్ దివ్య సాహిత్య ట్రస్ట్ నిర్వహణలో ఒడిశాలో ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగిన వీల్చైర్ క్రికెట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టర్ కీర్తి ఆ క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీల్లో పాల్గొని ఉత్తమ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) శేషగిరి, యోగా కోచ్ నాగేంద్ర, ఫుట్బాల్ కోచ్ నాగరాజు, చెస్ కోచ్ జగన్నాథరావు పాల్గొన్నారు. ఫ సహజ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహార ధాన్యాలను వినియోగించడం వల్ల కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవచ్చని కలెక్టర్ కీర్తి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అవగాహన – శిక్షణ నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న రైతు సాధికార సంస్థ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఆ ఉత్పత్తులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తే ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందన్నారు. -
పొగాకు క్యూరింగ్లో జాగ్రత్తలు అవసరం
దేవరపల్లి: పొగాకు క్యూరింగ్, గ్రేడింగ్ ముమ్మరంగా జరుగుతున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గోపాలపురం పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి బి.శ్రీహరి సూచించారు. పొగాకు సాగులో సస్యరక్షణ, పురుగు మందుల అవశేషాల నియంత్రణ, అన్య పదార్థాల నిర్మూలన, తలలు తుంచడం, పిలకల నివారణపై బుధవారం గోపాలపురంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ పొగాకు రంగులు, నాణ్యత ఆశాజనకంగా ఉందని, బోర్డు నిబంధనలకు లోబడి పంట సాగు చేయాలన్నారు. 150 కిలోలకు మించి బేలు తయారు చేయవద్దని, మండెలను ఎప్పటికప్పుడు పరిశీలించి, మార్పిడి చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని పలువురు రైతుల పొగాకు తోటలు, బ్యారన్ల వద్ద క్యూరింగ్ చేసిన పొగాకును బోర్డు అధికారులు, పలు కొనుగోలు సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పరిశీలించారు. సమావేశంలో ఐటీసీ లీఫ్ డెవలప్మెంట్ మేనేజర్ బసవరాజు పాటిల్, జీపీఎస్ కంపెనీ ప్రతినిధి రవి, పోలిశెట్టి కంపెనీ ప్రతినిధి శ్రీను, రైతు సంఘం ప్రతినిధులు కూసం రామ్మోహన్రెడ్డి, ముల్లంగి శ్యామ్సుందర్ రెడ్డి, ముల్లంగి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుల అరెస్టు సీతానగరం: బొబ్బిల్లంక గ్రామంలోని సుబ్బారావు పేటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన మాజీ భార్య, అత్త హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పర్చుతున్నట్లు కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తెలిపారు. ఆయన బుధవారం సీతానగరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్యకు పాల్పడిన చోడదాసి సీతారామరాజు (పండు), అతడికి సహకరించిన స్నేహితులు, అదే గ్రామానికి చెందిన చోడదాసి రమేష్ (చిన్న), చిత్రపు అజయ్ కుమార్, కన్నెం సురేష్ (పెద్ద)లను అరెస్ట్ చేశామన్నారు. ఎస్సై డి.రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాబూ.. అంగన్వాడి చూపుతాం
కపిలేశ్వరపురం/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఓట్లు దండుకునే వైఖరి సీఎం చంద్రబాబుది. 2000 సంవత్సరంలో శ్రామిక మహిళలను గుర్రాలతో తొక్కించిన ఆయన ప్రభుత్వం మరోసారి మహిళలపై విరుచుకుపడింది. ఎన్నికల హామీ అమలు చేయాలన్న డిమాండ్తో ‘చలో విజయవాడ’ చేపట్టిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంగన్వాడీలను అణచివేసి పలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పి వారిని కష్టాలు పెట్టారు. ఉద్యమానికి ఊపిరి ప్రధానంగా వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న డిమాండ్లతో ఆందోళనకు పిలుపునిచ్చిన అంగన్వాడీలను విజయవాడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి సుమారు ఐదు వేల మంది విజయవాడ ధర్నా చౌక్కు తరలివెళ్లారు. అక్కడి శిబిరంలో పోలీసులు చేపట్టిన దమనకాండలో కాకినాడకు చెందిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, మండపేటకు చెందిన కె.కృష్ణవేణితో పాటు అనేక మంది తీవ్ర అణచివేతకు గురయ్యారు. వారిని ప్రతిఘటిస్తున్న అంగన్వాడీలను పోలీసులు పిన్నులతో గుచ్చారు. ఈడ్చుకెళ్తుండగా జి.బేబీరాణి చేయికి తీవ్ర గాయమైంది. ఆమెను ఆసుపత్రికి కాకుండా ఆమెతో పాటు మండపేటకు చెందిన కె.కృష్ణవేణి తదితరులను అమానవీయంగా బస్సుల్లోకి ఎక్కించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వేమగిరికి చెందిన అంగన్వాడీ బేబీరాణి, మరి కొందరిని పోలవరం, బుట్టాయిగూడెం ప్రాంతాలకు తరలించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మొబైల్ను లాక్కున్నారు. ఆమె అప్పటికే తన మొబైల్లో పోలీసుల దురుసు ప్రవర్తనను చిత్రీకరించి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయడంతో సమాజానికి చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా అంతా నిరసనలతో దద్దరిల్లింది. కాకినాడలోని సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం, తదితర ప్రాంతాల్లోనూ, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద మానవహారం, ర్యాలీ, ధర్నాలు నిర్వహించారు. యాప్లతో పని భారం కేంద్ర ప్రభుత్వ యాప్ పోషణ ట్రాకర్లో వివిధ శాఖల వివరాలు నమోదు చేయడం కష్టతరంగా మారుతోంది. నెట్వర్క్ సరిగా లేకపోవడం, సర్వర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ఫేస్ రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోజంతా ఈ యాప్ల నమోదుతోనే సరిపోతుంది. ఇది కాకుండా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేయవలసి రావడంతో అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు పెంచాలి రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 400 మంది, రూరల్ పరిధిలో 250 మంది అంగన్వాడీలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది అంగన్వాడీలు పనిచేస్తున్నారు. తక్షణ ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది.. 2000 మార్చి 30న హైదరాబాద్లో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించింది. బాష్పవాయువు ప్రయోగించారు. ఆ ఉద్యమంలో మండపేట నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ గాయాలపాలైంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే సమయంలోనూ అంగన్వాడీలపై లాఠీ చార్జి చేయించారు. అంగన్వాడీలను బస్సులో తిప్పుతున్న పోలీసులు దగాకోరు హామీలు ఇక చెల్లవు నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పోలీసులతో ఈడ్పించారు మహిళా దినోత్సవానికి ముందు మంచి బహుమతే ఇచ్చారు అంగన్వాడీల అణచివేతపై ఉమ్మడి జిల్లా నాయకుల ఆగ్రహం గెలిస్తే జీతాలు పెంచుతానన్న జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనాలను రూ.11,500కు పెంచారు. తన పాలనాకాలంలో సమ్మె చేసిన అంగన్వాడీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగ విరమణ ప్రోత్సాహకాలను రూ.లక్షకు పెంచుతూ జీవో జారీ చేశారు. 2024లో అధికారంలోకి వస్తే 2024 జూన్ నుంచి వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే అందలం ఎక్కిస్తామని ప్రలోభ పెట్టిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాకా అంగన్వాడీలపై దమణకాండకు పాల్పడ్డారు. పాశవికంగా దాడి చేయించారు జీతాల పెంపుపై ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలిచ్చారు. ఫిబ్రవరిలో క్షేత్ర స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక చలో విజయవాడ చేపట్టాం. ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తించింది. – కె.కృష్ణవేణి, సీఐటీయూ జిల్లా నాయకురాలు, మండపేట అనేక ప్రాంతాల్లో తిప్పి వదిలారు నిద్రలో ఉన్న మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లి బస్సులో 27 మందిని కుక్కేశారు. తరువాత సత్తెనపల్లి, యాళ్లగడ్డ, చిలకలూరిపేట, నరసరావుపేట పిడుగురాళ్ల, చింతలపూడి తదితర ప్రాంతాల్లో తిప్పారు. ఆకలి వేస్తుందన్న, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా కూడా బస్సు ఆపలేదు. తిప్పి తిప్పి మరలా సత్తెనపల్లిలో కొంత మందిని, యాళ్లగడ్డలో కొంత మందిని వేర్వేరు ప్రాంతాల్లో దింపేశారు. అక్కడ నుంచి అనేక బస్సులు మారి జిల్లాకి చేరుకున్నాం. – మాణిక్యాంబ, అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఇచ్చిన హామీని నెరవేర్చాలి పనిభారం దృష్టిలో పెట్టుకుని వేతనం రూ.26 వేలు చేయాలి. ఎన్నికల ముందు చంద్రబాబు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. అంగన్వాడీ సెంటర్లను పాఠశాలల్లో విలీనాన్ని నిలుపుదల చేయాలి. అంగన్వాడీ బడ్జెట్ పెంచాలి. మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలన్నందుకు మహిళలని చూడకుండా చిత్రహింసలు పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. వాటిని నేరవేర్చలేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు. – బేబీ రాణి, కార్యదర్శి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా అంగన్వాడీలపై దాడికి దిగుతున్నారు. 2000లో హైదరాబాద్లో గుర్రాలతో తొక్కించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిలో అక్రమంగా అరెస్టు చేయించారు. ప్రస్తుత ఉద్యమంలో చర్చలు జరుపుతున్నట్టు నటిస్తూ అర్ధరాత్రి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం. – జి.బేబీరాణి, అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, కాకినాడ -
మర్యాద పూర్వకంగా..
వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు బుధవారం తాడేపల్లి కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, రాజమమహేంద్రవరం సిటీ ప్రచార విభాగం అధ్యక్షుడు పెద్దిరెడ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. – రాజమహేంద్రవరం సిటీ -
వేట్లపాలెం ఘటన.. 26కు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతు కాతేటి శ్రీను(33) మృతిచెందాడు. ఇవాళ ఒక్కరోజే(బుధవారం, మార్చి 4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.వేట్లపాలెంలో గత నెల ఫిబ్రవరి 28న(శనివారం) భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు.సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు.మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. -
జనసేన ఎమ్మెల్యేలు డమ్మీలేనా?
సాక్షి, అమలాపురం: ‘అధికారం ఒకరిది... పెత్తనం మరొకరిది’’ అన్నట్టుగా ఉంది రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో రాజకీయం. మిత్రధర్మాన్ని పక్కనబెట్టి టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న లీడర్ విత్ క్యాడర్ పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరిస్తున్నామనే వంకతో ప్రభుత్వ పథకాల పంపిణీలో జోక్యం చేసుకుంటున్నారు. అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేసేస్తున్నారు. తద్వారా స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేస్తున్నారు. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీలో ఉండి కూడా తమకు జరుగుతున్న అన్యాయం, అవమానంపై ఎవరిని అడగాలో తెలియని దైన్య స్థితిలో జనసేన శ్రేణులు మధనపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. రాజోలు నుంచి దేవ వరప్రసాద్, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ గెలిచారు. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాలకు చెందినవారే అయినా ఉద్యోగ రీత్యా ఎన్నికల ముందు వరకు స్థానికులతో పెద్దగా పరిచయాలు లేవు. అభ్యర్థులు ఎవరూ నియోజకవర్గ ఓటర్లకు తెలియకుండానే విజయాలు సాధించారు. ఆ తరువాత కూడా వారు స్థానికులతో పెద్దగా సంబంధాలు పెట్టుకున్న దాఖలాలు లేవు. కనీసం క్యాడర్తో కూడా సన్నిహిత సంబం«ధాలు లేవు. ఈ కారణంగానే టీడీపీకి చెందిన నాయకులు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను పక్కనబెట్టి నేరుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజోలులో.. రాజోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీలలో వర్గ పోరు అధికంగా ఉంది. ముఖ్యంగా రాజోలు జనసేనలో సామాజిక మాధ్యమాల ద్వారా సాగుతున్న వర్గ పోరు పోలీసు స్టేషన్ల వరకు చేరిన విషయం తెలిసిందే. దీనిని ఆసరాగా చేసుకుని ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. రాజోలు పార్టీ ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై స్వీకరించిన వినతులలో కొన్నింటిని మాత్రమే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళుతున్నారు. మరికొన్ని టీడీపీ అధిష్టానం వద్దకు తీసుకుని వెళ్లడం లేదా నేరుగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల పార్టీ కార్యక్రమం పేరుతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నేరుగా లబ్ధిదారులకు అందజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధ పల్లంరాజుల సమక్షంలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఈ ముగ్గురికి ఎటువంటి అధికార హోదా లేకపోవడం ఇక్కడ గమనార్హం. పి.గన్నవరంలో.. పి.గన్నవరంలో కూడా పరిస్థితి ఇంచుమించు ఇదే తీరుగా ఉంది. ఇక్కడ కూడా టీడీపీ నాయకులు పెత్తనం చేస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు వంటి పార్టీ సీనియర్ నాయకులకు పొగబెట్టిన ఇక్కడ నాయకులు అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్, నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్, నియోజకవర్గ పార్టీ కో కన్వీనర్ డి.వి.వి.సత్యనారాయణ వంటి వారు లీడర్ విత్ క్యాడర్ అంటూ నియోజకవర్గంలో కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కార్యక్రమాలు చక్కబెట్టేస్తున్నారు. ఫించన్లకు, ఇతర ప్రభుత్వ పథకాలకు నేరుగా అధికారులకే సిఫారసులు చేసేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ‘‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’’ను నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఇక్కడ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి కొన్నింటికైనా పరిష్కారం చూపిస్తున్నారు. కలెక్టరేట్తోపాటు తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంలో భాగమైన అధికారులే నేరుగా అర్జీలు స్వీకరిస్తుంటే టీడీపీ నాయకులు లీడర్ విత్ క్యాడర్ పేరుతో అవే సమస్యల పరిష్కారం కోసం అంటూ చేస్తున్న హంగామా, ప్రచార ఆర్భాటం చూసి సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. అక్కడ అణగిమణగి.. జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, పదవులు కూడా లేని నాయకులు పెత్తనం చేస్తుంటే పార్లమెంట్ పరిధిలో మిగిలిన ఐదు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు కూడా అణగిమణగి ఉండాల్సిందే. స్థానిక ఎమ్మెల్యేలను కాదని వీరు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, పెత్తనాలు చేయడమనేది కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించిన బండారు శ్రీనివాసరావు కొత్తపేటలోను, రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ మండపేటలోను, పవన్ కళ్యాణ్కు సన్నితంగా ఉన్న పార్టీ నాయకులు నల్లా శ్రీధర్ అమలాపురంలోను, నియోజకవర్గ ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ రామచంద్రపురంలోను కిమ్మనకుండా ఉండాల్సిందే. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కనీసం వీరి ఉనికిని కూడా గుర్తించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదే జనసేన నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట పెత్తనం చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీ సీనియర్లకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, పార్టీ పెద్దలకు చెప్పినా సర్దుకు పొమ్మంటున్నారే తప్ప పట్టించుకునే స్థితిలో లేకపోవడంతో లోలోనే మధనపడుతున్నారు. -
గుర్తుకొచ్చింది
కొన్ని ప్రదేశాలు కొండ గుర్తులతో ప్రాచుర్యం పొందుతుంటాయి. వాటిలో రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరులోని చింతచెట్టు సెంటర్ ఒకటి. ఆ ప్రాంతంలో దాదాపు 50 ఏళ్లుగా ఓ చింతచెట్టు ఉండేది. ఆటో, బస్సుల్లో వచ్చిన వారికి అదే కొండగుర్తుగా ఉండేది. ఆర్అండ్బీ రోడ్డు విస్తరణలో భాగంగా 2015 మార్చి 4వ తేదీన ఆ చెట్టును తొలగించారు. అయినా ఇప్పటికీ ఆ సెంటర్ను చింతచెట్టు సెంటర్గానే పిలుస్తారు. ఆ చెట్టును తొలగించినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడ్డారని మాజీ సర్పంచ్ అత్తిలి భీమశంకరం గుర్తు చేసుకున్నారు. – రాజమహేంద్రవరం రూరల్ ఇలా.. రీవర్స్ రఘుదేవపురం ర్యాంపు నుంచి ఇసుక లారీలు మంగళవారం రాజమహేంద్రవరం – సీతానగరం నాలుగు లేన్ల రోడ్డు ఎక్కాయి. అదే రోడ్డులో మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే ర్యాంపు నుంచి తిరిగి గోదావరి పరివాహక ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి ఇసుక ఎగుమతులను ర్యాంపు నిర్వాహకులు నిలిపేశారు. ప్రక్కిల్లంక, సీతానగరం రెవెన్యూ లంక భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొంది, నిబంధనలను తుంగలో తొక్కి అధిక లోడుతో లారీలపై ఇసుక తరలిస్తున్నారు. బిల్లులు లేకుండా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మైన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిసి ఇలా వెనక్కి తిప్పేశారు. అనంతరం రాత్రి సమయంలో తరలించారు. – సీతానగరం రఘుదేవపురం ర్యాంపు వద్ద గోదావరి తీరంలోనిలిపిన ఇసుక లారీలు -
మందలించారని మాయమైంది
ఫ ఇంటి నుంచి వెళ్లి పోయిన బాలిక ఫ ఐదు గంటల్లోనే పోలీసుల గుర్తింపు ఫ తల్లిదండ్రులకు అప్పగింత అనపర్తి: ఇంటి నుంచి అదృశ్యమైన మల్లిడి విహారికారెడ్డి అనే 14 ఏళ్ల బాలికను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఫిర్యాదు అందిన ఐదు గంటల్లోనే ఆమెను గుర్తించినట్టు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాలు ఇవీ.. బలభద్రపురానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని విహారికారెడ్డి నెల రోజులుగా స్కూల్కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. అలాగే ఎక్కువ సమయం సెల్ఫోన్ చూస్తూ గడుపుతోంది. దీంతో ఆ బాలికను తండ్రి సత్యనారాయణరెడ్డి సోమవారం మందలించాడు. అనంతరం పని మీద రాజమహేంద్రవరం వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికీ విహారికారెడ్డి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ సారథ్యంలో రంగంపేట, బిక్కవోలు ఎస్సై లు శివ ప్రసాద్, రవిచంద్ర కుమార్ మూడు టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం, బలబద్రపురం గ్రామస్తులు ఇచ్చిన సమాచారంపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ బాలిక విశాఖపట్నం వెళ్లినట్టు గుర్తించి, అక్కడి నుంచి బిక్కవోలు తీసుకుని వచ్చి మంగళవారం తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. -
ఎన్నాళ్లీ మరమ్మత్తులు!
ఫ పూర్తికాని వంతెనల మరమ్మతులు ఫ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ఫ వాహనాల రాకపోకలకు అవస్థలు ఫ ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం ఫ కంకర లారీపై రూ.3 వేల అదనపు భారం ఫ కొబ్బరి కాయకు రూ.2 తగ్గించి వ్యాపారుల కొనుగోలు మలికిపురం: గోదావరి పాయలు, సముద్ర తీరంతో కనువిందు చేసే రాజోలు దీవిలో ప్రజల రాకపోకలతో పాటు సరకుల రవాణాకు వంతెనలు ఎంతో కీలకం. బయటకు రావాలన్నా, లోపలకు వెళ్లాలన్నా వీటి మీదగానే ప్రయాణం సాగిస్తారు. అయితే ఈ వంతెనలను కొన్ని రోజులుగా మరమ్మతుల పేరుతో మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిండి – చించినాడ వంతెన ఎనిమిది నెలలు, పి.గన్నవరం వంతెన రెండు నెలల పాటు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల రవాణాతో పాటు వాణిజ్య పంటల ఎగుమతులకు కష్టం కలుగుతోంది. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో ఇప్పటికే ప్రజలు రూ.లక్షల అదనపు భారం మోశారు. ఇంకా మోస్తూనే ఉన్నారు. దూరాభారం రాజోలు దీవికి ఐరన్, ఎలక్ట్రికల్ తదితర వస్తువులు విజయవాడ, పాలకొల్లు, తణుకు తదితర ప్రాంతాల నుంచి వస్తాయి. కంకర, ఇనుము, నిత్యావసరాలు, దుస్తులు రాజమహేంద్రవరం, పంగిడి నుంచి దిగుమతి అవుతాయి. ఇవన్నీ రావాలంటే దిండి – చించినాడ, పి.గన్నవరం వంతెనలే దిక్కు. అలాగే ఇసుక రావాలన్నా ఈ రెండు వంతెనలే ఆధారం. ప్రస్తుతం ఈ వంతెనలను మరమ్మతుల పేరుతో నిలిపివేయడంతో పాలకొల్లు నుంచి రావులపాలెం, సిద్ధాంతం వంతెనల మీదుగా అమలాపురం సమీపంలోని పాశర్లపూడి వంతెన నుంచి రావాల్సి వస్తోంది. దీంతో దూరాభారం, లోల్గేట్ ఖర్చు అధికమై తడిసి మోపెడు అవుతుంది. ఇదంతా వినియోగదారులపైనే పడడంతో సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు వంతెనలు బాగాయ్యే దాకా పనులు చేయలేమని చేతులెత్తేశారు. ఇప్పటికే గిట్టుబాటు కాక, బిల్లులు రాక సతమతం అవుతున్న తమకు తీవ్ర నష్టం వస్తుందని స్పష్టం చేశారు. రైతుల అవస్థలు వంతెనల మరమ్మతుల ప్రభావం రాజోలు దీవిలో వాణిజ్య పంటలైన కొబ్బరి, సరుగుడు ఎగుమతులపై కూడా పడింది. కొబ్బరి కాయకు రూ.రెండు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమంటే వంతెనల వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, గతంలో ఇచ్చిన ధర తమకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. సరుగుడు రైతులదీ ఇదే పరిస్థితి. మూసివేతతో.. దిండి – చించినాడ వంతెన మూసివేత వల్ల అమలాపురం తదితర ప్రాంతాలపై కూడా భారం పడుతోంది. సాధారణంగా పశ్చిమ గోదావరి వైపు నుంచి వచ్చే లారీలు దిండి వంతెన మీదుగా పాశర్లపూడి వంతెన దాటి అమలాపురం వైపు వెళతాయి. ఇక్కడ వంతెన మూసివేతతో ఇవన్నీ సిద్ధాంతం వైపు వెళ్లి, తిరిగి అమలాపురం రావాల్సి వస్తోంది. ప్రధానంగా కొబ్బరి లారీల లోడ్ విషయంలో ఈ ఇబ్బంది కలుగుతోంది. అలాగే పాలకొల్లు – అమలాపురం మధ్య జరిగే వస్తు రవాణాకు కూడా అవస్థలు కలుగుతున్నాయి. ఇక విద్యార్థుల ఇబ్బందులు షరా మమూలే. వంతెనపై అరగంటకు పైగా ఎండ, మంచులలో నడవాల్సి వస్తోంది. ప్రజలపై అదనపు భారం వంతెనలను ఇలా ఒకేసారి మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలకు అడ్డంకితో పాటు, దిగుమతి చేసుకునే వస్తువులపై పెనుభారం పడుతోంది. సిమెంట్, ఇనుము, ఇసుక, కంకర వంటి నిర్మాణ వస్తువుల దిగుమతి విషయంలో లారీకి సుమారు రూ.3 వేల అదనపు భారం పడుతోంది. – సుందర పండు, గూడపల్లి కొబ్బరి రైతులకు నష్టం వంతెనల మూసివేత భారం రైతులపై పడింది. ముఖ్యంగా కొబ్బరి కాయకు రూ.2 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. వంతెనల మూసి వేత కారణంగా పాశర్లపూడి వంతెన నుంచి దూరం తిరిగి లారీలు వెళ్లాల్సి రావడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – దేశినీడి ఉదయ భాస్కరరావు, రామరాజులంక ఎనిమితి నెలలుగా మరమ్మతులు పూర్తి కాని దిండి – చించినాడ వంతెన ఆలస్యానికి కారణం వివాదమేనా! అధికారులు చెప్పిన ప్రకారం వంతెన మరమ్మతులు పూర్తి అవడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. అలాగే వారు ప్రతిసారీ గడువు పొడిగిస్తున్నారు. చించినాడ వంతెనకు ఎనిమిది నెలలుగా మరమ్మతులు పూర్తి కాలేదు. ప్రస్తుతం వంతెన పిల్లర్లకు అమర్చాల్సిన బేరింగ్ల కొలతలు తీసి ఆర్డర్ ఇచ్చిన కారణంగా అవి వంతెన వద్దకు చేరుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వంతెన నిర్మించిన సంస్థకూ ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఇలా వాయిదా పడినట్లు తెలుస్తోంది. -
కాలువలో మహిళ మృతదేహం
అనపర్తి: అనపర్తి కొత్తూరు శివారు కై లాస భూమి ఎదురుగా ఉన్న ఎర్ర కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. అనపర్తికి చెందిన పడాల వెంకట రామకృష్ణారెడ్డి తండ్రి ఏడాది క్రితం చనిపోయారు. అప్పటి నుంచీ తల్లి పుష్పవతి (75) శేషయ్య నగర్లోని సొంత ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె చాలా కాలంగా గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్లో మందులు వాడుతున్నారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనబడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాగా.. ఈ నెల ఒకటిన రామకృష్ణారెడ్డి తన తల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అనపర్తి కొత్తూరు శివారు కై లాస భూమి ఎదురుగా ఉన్న ఎర్ర కాలువలో ఆమె మృతదేహం ఉన్నట్టు సమాచారం అందింది. -
వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
ఫ ఆటో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలు ఫ బాసవాగు వద్ద ఘటన ఎటపాక: వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఆటోలో వస్తున్న యువకుడు మృతి చెందాడు. 30వ నంబర్ జాతీయ రహదారిపై బాసవాగు వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీదేవిపేటకు చెందిన పైల రమేష్, సీత దంపతుల కుమారుడు పైల సాయి (26) విస్సాపురం పంచాయతీ పరిధిలోని బండిరేవు గ్రామంలో బైక్ మెకానిక్ షెడ్డు నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే ఉదయం తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై మెకానిక్ షెడ్డుకు వెళ్లాడు. అయితే ద్విచక్ర వాహనాల స్పేర్ పార్టులు, ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు బండిరేవు గ్రామంలోని ఈశ్వర్ ఆటోలో భద్రాచలం వెళ్లాడు. అక్కడ సామగ్రి కొనుగోలు చేసుకుని అదే ఆటోలో మరో ఇద్దరు ప్రయాణికులతో కలిసి బండిరేవు వస్తున్నాడు. ఈ క్రమంలో బాసవాగు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న టోల్ప్లాజా వద్ద ఇరుకు రహదారిలో చింతూరు నుంచి భద్రాచలం వైపు వస్తున్న వ్యాన్ అతివేగంగా ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న సాయికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ ఈశ్వర్తో పాటు దుమ్ముగూడెం మండలం గద్దమడుగు గ్రామానికి చెందిన మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు 108లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. స్థానికులు ఆ వ్యాన్ డ్రైవర్ను పట్టుకుని ఘటన ప్రాంతానికి వచ్చిన పోలీసులకు అప్పగించారు. సాయి మృతదేహానికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
టీడీపీ నాయకుడి భార్య ఆత్మహత్య
రాజమహేంద్రవరం రూరల్: హుకుంపేట గణేష్నగర్ జీవీకే సిగ్నేచర్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 202లో టీడీపీ నేత, ఏపీ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సంక్షేమ సభ్యుడు తమ్మా రవి భార్య తమ్మా విజయలక్ష్మి(40) సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అల్లుడి వేధింపులతోనే తన కుమార్తె చనిపోయిందని విజయలక్ష్మి తల్లి, కొత్తపేటకు చెందిన కాసా సూర్యకుమారి మంగళవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. 2002లో తమ్మా రవితో విజయలక్ష్మికి వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విజయలక్ష్మితో తల్లి మాట్లాడటానికి రవి అనుమతించేవాడు కాదు. పైగా కట్నం తీసుకు రావాలని వేధించడంతో పాటు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. రవి తండ్రి సత్యనారాయణ కూడా మానసికంగా వేధించేవాడు. ఈ కారణాల వల్లే విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని సూర్యకుమారి ఫిర్యాదు చేశారు. బొమ్మూరు ఎస్సై కె.రమేష్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ ఫ్లాట్లో ఉరి వేసుకుని మృతి ఫ అల్లుడి వేధింపులే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు -
విజయదుర్గా పీఠంలో పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో మంగళవారం చంద్రగ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించారు. భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేతుగ్రస్త చంద్రగ్రహణ హోమం నిర్వహించారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) ఆదేశాల మేరకు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన హోమం సాయంత్రం 6.46 వరకూ కొనసాగింది. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గాడ్ మాట్లాడుతూ పీఠంలో భక్తుల సంక్షేమాన్ని ఆశించి ఈ హోమాన్ని నిర్వహించామన్నారు. గ్రహణానంతరం పీఠంలోని అమ్మవారితో పాటు పరివార దేవతలకు సంప్రోక్షణ అనంతరం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. బుధవారం ఉదయం నుంచి భక్తులకు అమ్మవారి పునఃదర్శనాన్ని, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయదుర్గా సేవాసమితి ప్రతినిధులు భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్య కనకదుర్గ, బుజ్జి, పీఆర్వో బాబీ పాల్గొన్నారు. త్రుటితో తప్పిన పెను ప్రమాదం సఖినేటిపల్లి: టేకిశెట్టిపాలెం సమీపంలో పి.గన్నవరం ప్రధాన పంట కాలువపై ఉన్న బళ్ల వంతెన వద్ద కొబ్బరి దుంగలు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ నుంచి దుంగలు జారి పడ్డాయి. ఆ దారిలో వెళుతున్న ప్రయాణికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొబ్బరి దుంగలు అధిక లోడుతో ఓ ట్రాక్టర్ మంగళవారం సఖినేటిలిపల్లి వైపు నుంచి పైవంతెన మీదుగా అప్పనరామునిలంక వైపు వెళుతోంది. ఆ క్రమంలో దుంగలకు కట్టిన తాళ్ల ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో దుంగలు చెల్లాచెదురై ఆకస్మాత్తుగా రోడ్డు మీద పడ్డాయి. అక్కడి నుంచి దొర్లుకుంటూ ప్రధాన రహదారిపైకి చేరాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
రంగుల పండగ వేళ తీరని విషాదం
ఫ కాలువలో స్నానానికి దిగిన బాలురు ఫ నీటి ఉధృతికి ఒకరి గల్లంతు అనపర్తి: రంగుల పండగ హోలీని చిన్నారులందరూ సరదాగా జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం ఒంటిపై రంగులను కడుక్కుందామని కాలువలో దిగిన చిన్నారుల్లో ఒక బాలుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొమరపు దేవా అలియాస్ విజయ కుమార్ పెయింటర్గా పనిచేస్తూ అనపర్తిలో కాపురం ఉంటున్నాడు. ఆయనకు రాహుల్ (9), బన్ను అనే ఇద్దరు కుమారులు, ఒక పాప ఉన్నారు. హోలీని పురస్కరించుకుని మంగళవారం అన్నదమ్ములు, మరో ఇద్దరు బాలురతో కలసి రంగులు చల్లుకున్నారు. అనంతరం ధరణికోట శివాలయం వద్ద ఉన్న కాలువ రేవులో స్నానానికి దిగారు. కాలువలో నీటి ఉధృతికి శేఖర్, రాహుల్ కొట్టుకుపోయారు. శేఖర్ను గుడి దగ్గర ఉన్న సత్తిబాబు అనే వ్యక్తి బయటకు లాగి కాపాడాడు. రాహుల్ నీటిలో కొట్టుకుపోతుండగా అతడి అన్న బన్ను కేకలు వేస్తూ కాలువ గట్టు మీద కొద్ది దూరం పరిగెత్తాడు. విషయం తెలుసుకున్న రాహుల్ తండ్రి దేవ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కాలువలో నీరు ఉధృతి ఎక్కువగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అదనపు ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. రాహుల్ ఆచూకీ కోసం ఎస్ఎఫ్వో జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది కాలువలో దిగి గాలింపు చేపడుతున్నారు. ఇప్పటి వరకు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. నీటి ఉధృతి నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. -
దైవ దర్శనాలకు గ్రహణం
కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. ఉదయం నిత్య కై ంకర్యాలు, దర్శనాల అనంతరం ఆలయాలకు తాళాలు వేశారు. దర్శనాలను నిలిపివేయడంతో నిత్యం భక్తులతో కిటకిటలాడే అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి, తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాల్లో సందడి తగ్గింది. సంప్రోక్షణ, నిత్య పూజలు నిర్వహించి బుధవారం ఉదయం యథావిధిగా భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. రాయవరం మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో చంద్రగ్రహణ సమయంలో హోమం నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
ప్రాణాలతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: లాభాల వేటలో పడి.. బాణసంచా తయారీ పరిశ్రమల యజమానులు భద్రతను గాలికొదిలేస్తూండటం నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఏటా ఏదో ఒక ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో 2014లో జరిగిన పేలుడులో దాదాపు 18 మంది మరణించారు. గత ఏడాది అక్టోబర్ 8న రాయవరంలో జరిగిన బాణసంచా విస్ఫోటంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల సామర్లకోట మండలం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో సంభవించిన భారీ పేలుడులో ఇప్పటి వరకూ 23 మంది మృతి చెందారు. ఈ అన్ని సంఘటనలకూ మానవ తప్పిదాలు, అధికారుల పర్యవేక్షణ లోపాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పక్కా చర్యలేవీ? ఈ ప్రమాదాల్లో బలైపోతున్న వారందరూ నిరుపేదలే. రోజంతా కష్టపడితేనే కానీ కుటుంబం గడవని వారే. ఈ ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. భర్తలను, పిల్లలను కోల్పోయి భార్యలు అనాథలుగా మిగులుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాధినేతలు హడావుడిగా వచ్చి, ఆర్థిక సాయం చేసి, అధికారులను బాధ్యులను చేసి చేతులు దులుపేసుకుని వెళ్లిపోతున్నారు. అంతే తప్ప ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామ్ కే వాస్తేగానే ఉంటున్నాయి. బాణసంచా తయారీ కేంద్రాల యాజమాన్యాలు పూర్తి భద్రతా చర్యలు పాటించేలా, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉంటున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. సర్కారు ఇటువంటి పక్కా చర్యలు తీసుకోనందువల్లనే వేట్లపాలెం విస్ఫోటం సంభవించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రతి బాణసంచా తయారీ కేంద్రంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తే ఇటువంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. కలత చెందుతూ.. కన్నీరు పెట్టుకుంటూ.. ఏకంగా 20 మంది సజీవ దహనానికి కారణమైన వేట్లపాలెం పేలుడు ఉమ్మడి జిల్లా చరిత్రలోనే అతి పెద్ద విషాద సంఘటన. మరో 11 మంది అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడినా.. వారిలో తొమ్మిది మందిని 60 నుంచి 80 శాతం కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. క్షతగాత్రుల్లో సామర్లకోట కుమ్మర వీధికి చెందిన దర్శిపాటి రాజు, దర్శిపాటి లోవరాజు, వేమగిరి లోవరాజు గడచిన మూడు రోజుల్లో మృతి చెందారు. ఆ కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ముగ్గురి మృతితో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. మరణాలు అందుకేనా!?తారాజువ్వల వంటి పేలుడు పదార్థాలు ఆకాశంలోకి వెళ్లాక రంగురంగుల కాంతులు విరజిమ్ముతూ, భారీ శబ్దాలు రావడానికి పలు రసాయనాలు వినియోగిస్తారు. వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో వినియోగించిన ముడి సరకుల్లో రసాయనాలు కలిపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి శరీర భాగాల్లోకి చొచ్చుకుపోవడం, మందుగుండు ప్రభావంతో శరీరమంతా మంటలు ఒకేసారి అంటుకుపోవడంతో క్షతగాత్రుల శరీరంలో ముఖ్యమైన వ్యవస్థలు దెబ్బ తిన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫ బర్న్ షాక్ అనే స్థితిలో చర్మం కాలిపోయి, రక్తంలోని ద్రవాలు బయటకు పోతాయి. దీనివలన రక్తపోటు తీవ్రంగా పడిపోతుంది. మెదడు, గుండెకు సరైన రక్తప్రవాహం జరకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఫ శరీరానికి రక్షణ కవచం చర్మం. అది కాలిపోతే బ్యాక్టీరియా లోపలకు సులభంగా ప్రవేశించి, రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వచ్చి, మరణానికి దారి తీస్తుంది. ఫ వీటితో పాటు క్షతగాత్రులకు శ్వాసకోశ సమస్యలు కూడా త్వరగా వస్తూంటాయి. భారీ విస్ఫోట సమయంలో వెలువడే పొగ, వేడి గాలి పీల్చితే ఊపిరితిత్తులు దెబ్బ తిని శ్వాస తీసుకోవడం కష్టమై, ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. ఫ కాలి, తీవ్రంగా గాయపడిన వారిలో గుండె, మూత్రపిండాల వంటి ముఖ్య అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. వాటి పనితీరు నెమ్మదించడం కూడా మరణానికి కారణమవుతుంది. ఫ తీవ్రమైన నొప్పితో పాటు శరీరంలోని ద్రవాలు తగ్గిపోతూండటం కూడా ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఫ క్షతగాత్రుల శరీరం 50 శాతం కన్నా ఎక్కువ కాలిపోతే ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. వేట్లపాలెం విస్ఫోటంలో జీజీహెచ్కు వచ్చిన తొమ్మిది మంది క్షతగాత్రుల్లో దాదాపు అందరూ 70 శాతం పైగా కాలిపోయిన వారే. ఫ మొదటి స్థాయి కాలిన గాయాలతో పెద్దగా ప్రమాదం ఉండదు. చర్మం పై పొర (ఎపిడెర్మిస్) మాత్రమే దెబ్బ తింటుంది. చర్మం ఎర్రబడి నొప్పి తక్కువగా ఉంటుంది. చర్మంపై నీటి బుడగలు ఏర్పడవు. సూర్యకిరణాల వల్ల చర్మం కాలినప్పుడే ఈ సమస్య ఉంటుంది. ఇది ప్రాణాపాయం కాదు. ఫ రెండో స్థాయి కాలిన గాయాలు కూడా పెద్దగా ప్రమాదకరమైనవి కావు. వీటి వలన చర్మం పై పొరతో పాటు లోపలి పొర (డెర్మిస్) కూడా దెబ్బ తింటుంది. నీటి బుడగలు వచ్చి, నొప్పి ఎక్కువగా ఉంటుంది. చర్మం తడిగా కనిపిస్తుంది. రెండు మూడు వారాల్లో మానిపోతుంది. కొన్నిసార్లు మచ్చలు మాత్రం మిగులుతాయి. ఫ మూడో స్థాయి కాలిన గాయాలతో చర్మం పొరలు మొత్తం నాశనమవుతాయి. లోపలి కండరాలు, నరాలు కూడా దెబ్బ తింటాయి. చర్మం తెలుపు, గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతుంది. నరాలు కాలిపోవడంతో నొప్పి ఉండకపోవచ్చు. కానీ, ఇది అత్యంత ప్రమాదకరం. ఒక్కోసారి శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. ఎక్కువ భాగం కాలిపోతే ప్రాణాపాయం ఎక్కువ. వేట్లపాలెం విస్ఫోటంలో ఈ స్థాయిని మించే క్షతగాత్రుల శరీరాలు కాలిపోయాయి. అందువల్లనే వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని వైద్యులు చెబుతున్నారు. ఫ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బాణసంచా తయారీ ఫ బలైపోతున్న నిరుపేదలు ఫ సంఘటన జరిగినప్పుడే సర్కారు హడావుడి ఫ ఆ తర్వాత ఉదాసీనత ఫ అందువల్లనే తరచుగా విస్ఫోటాలు -
కల్తీ పాల ఘటనతో మాకు సంబంధం లేదు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమండ్రి పాలు, పెరుగు వర్తక సంఘం 1946లో ఏర్పడి 70 ఏళ్లుగా నిర్విరామంగా పనిచేస్తోందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సూరంపూడి పనసయ్య, లంక రామకృష్ణ తెలిపారు. స్థానిక టి.నగర్లోని రాజమండ్రి పాలు, పెరుగు వర్తక సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిల్క్ డెయిరీలు ఏర్పాటు కాని నాటి నుంచి పాలవర్తకులే ఇంటింటికీ వెళ్లి పాలు పోస్తున్నారన్నారు. ఈ 70 ఏళ్ల కాలంలో ఎన్నడూ పాలకల్తీ ఘటన లాంటివి చోటు చేసుకోలేదన్నారు. ఇటీవల రాజమండ్రిలో పాలకల్తీ ఘటనలో పలువురు మరణించడం, అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చికిత్స పొందుతుండటం చాలా బాధాకరమన్నారు. అయితే ఈ ఘటనతో పాలవర్తక సంఘానికి సంబంధం లేదన్నారు. పాలకల్తీ ఘటనతో సంబంధం ఉన్న పాలవ్యాపారి గణేష్ తమ సంఘానికి చెందిన వ్యక్తి కాదన్నారు. తమ సంఘంలో 850 మందికి పైగా వ్యాపారులు ఉన్నారని, నగరానికి 60 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు పాలు సరఫరా చేస్తున్నామన్నారు. గణేష్ అనే పాలవ్యాపారి చేసిన తప్పునకు ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ ఘటనను ఆసరాగా తీసుకుని విజయ డెయిరీ అధ్యక్షుడు ప్రైవేట్ పాల వ్యాపారులు కల్తీ చేస్తున్నారని, వారి వద్ద పాలు కొనవద్దని ప్రకటన చేయడం సరికాదన్నారు. పాల వ్యాపారంపై ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. తాము స్వచ్ఛమైన గేదె పాలను సరఫరా చేస్తామని, స్వచ్ఛమైన గేదె పాలను 8 గంటల లోపు వేడి చేయని పక్షంలో విరిగి పోతాయని, అయితే పాలప్యాకెట్ పాలు మాత్రం 36 గంటల వరకు కూడా వేడిచేయకున్నా పాడుకావు అంటే అందులో ఏమి కలుపుతారో ఆలోచించాలన్నారు. విజయ డెయిరీ చైర్మన్ తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. తాము సంఘం తరఫున కలెక్టర్ను కలిసి, తమ సభ్యులకు గుర్తింపు కార్డులు అందించాల్సిందిగా కోరతామన్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ రాయుళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాతాదారుల నమ్మకంపైనే తమ వ్యాపారం సాగుతోందన్నారు. సంఘ సభ్యులు వరగోగుల గోవింద్, జగ్గు శ్రీనివాస్, కొత్త గడకరావు, నల్లజర్ల నాగు, నంద్యాల నాగవరప్రసాద్, పాలకుల గాంధీ, గనిశెట్టి రాంబాబు, పూసల వెంకట్రాజు, మన్నె నాగేశ్వరరావు, అడ్డగర్ల ఈశ్వరరావు, పెంటగళ్ళ సుబ్బారావు, అల్లాడ సత్తిబాబు, అద్దేపల్లి నాగరాజు పాల్గొన్నారు. 70 ఏళ్లుగా పాలు, పెరుగు వర్తక సంఘం నడుస్తోంది పాల వ్యాపారి గణేష్ మా సంఘ సభ్యుడు కాదు రాజమండ్రి పాల, పెరుగు వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు -
సబ్ రిజిస్ట్రార్ల ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ తూర్పుగోదావరి జిల్లా సబ్ రిజిస్ట్రార్లు, ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని రాజమహేంద్రవరంలో మంగళవారం ఎన్నికల అధికారి కాకినాడ సబ్ రిజిస్ట్రార్ రాయుడు వెంకటరామారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా ఎం.సత్యనారాయణ రాజు, వైస్ ప్రెసిడెంట్గా బీఎస్ఆర్ మూర్తి, జనరల్ సెక్రటరీగా ఎంవివి.కృష్ణ, కోశాధికారిగా పి.అజయ్శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా జి.కొండారాజు, లేడీకో ఆప్టెడ్గా పి. శ్రీదేవి, ఎలక్టడ్ మెంబర్స్గా ఎండీ షాజహాన్, బి.వెంకటేశ్వర రావు, ఈ. శివ గణేష్లు ఎన్నికయ్యారు. సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా రాయి రాంబాబు, రాజమహేంద్రవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్, కె.సుందరరావు, కొవ్వూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎం.రాజబాబు, నిడదవోలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎంవివి.త్రినాథరావు, పిడింగొయ్యి జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు ఎన్నికయ్యారు. వేట్లపాలెం బాధితులను ఆదుకోవాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలెక్టర్ షణ్మోహన్ను కాకినాడలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఉపాధి, పింఛను సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలిచి, అవసరమైన అన్ని సహాయ సహకారాలూ అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, డోకుబుర్ర భద్రం మాస్టారు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో మారేడుమిల్లి వైటీసీ మేనేజర్ మృతి రంపచోడవరం: మారేడుమిల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ) మేనేజర్ సుదీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన సోమ వారం మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వస్తుండగా దేవరపల్లి సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో కుడి కాలు విరిగిపోయింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించగా మంగళవారం మృతి చెందారు. -
ప్రైవేటుకే ఏటీఎస్ సెంటర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక (ఏటీఎస్) ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ మంజూరురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్ను సర్టిఫై చేసేవారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఆయా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ పనులన్నీ ప్రైవేటు సంస్థకు చెందిన వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్లో జరుగుతున్నాయి. ఈ ప్రైవేటు సంస్థకు అజమాయిషీ ఎవరూ ఉండరు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. దీంతో అడిగేవారు లేక ఇష్టానుసారంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా ఏ అధికారికీ తనిఖీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఈ విధానాన్ని వాహన యజమానులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర సాగడంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ నేతకు ఫిట్నెస్ సర్టిఫై చేసే అధికారాన్ని సర్కారు కట్టబెట్టేసింది. దీంతో ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయుడైన అతను ఎగిరి గంతేస్తున్నాడు! ● స్కూల్ బస్సులు, లారీలు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలి. ఇది వరకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి లోపం ఉంటే సర్టిఫికెట్ జారీని నిలిపివేసేవారు. ఫలితంగా వాహనాల కండీషన్ సక్రమంగా ఉండేది. ప్రస్తుతం ఆ ఆధికారాన్ని ప్రైవేటుకు అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణ ఉండటం లేదు. ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు ఫిట్నెస్ లేకపోయినా.. మామూళ్లు దండుకుని రైట్ అనేస్తున్నారన్న విమర్శలున్నాయి. ● వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి(ఆర్టీఏ) కార్యలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేది. ప్రస్తుతం అదేమీ నడవడం లేదు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చేస్తున్నారు. ● డ్రైవింగ్ లైసెన్స్ల జారీని సైతం ప్రైవేటు పరం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ● వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల అనుమతులను కార్యాలయ పరిపాలన స్థాయిలో మాన్యువల్గా చేసి జారీ చేసేవారు. వాటిలోకి ఆన్లైన్ సేవలను తీసుకురావడంతో.. రుసుం చెల్లించి కార్యాలయానికి వెళ్లకుండానే అనుమతులు పొందేస్తున్నారు. ఇలా ఒక్కో సేవను ప్రైవేటు పరం చేసి చివరకు ఆర్టీఏ శాఖను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
అ'భయారణ్యం'
ఆకలేస్తే తప్ప పులి వేటాడదు. ఏ జీవికీ హాని తలపెట్టదు. గత నెలలో తూర్పు గోదావరి జిల్లాలో సాగిన దాని సంచారమే దీనికి రుజువు. రెండు మూడు రోజులకోసారి తప్ప అది జంతువులను హతమార్చింది లేదు. చివరకు అది పట్టుబడిన రోజు కూడా రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాకలో దూరినా.. అందులో గేదెలున్నా వాటికి ఏమాత్రం హాని తలపెట్టలేదు. కానీ, మనిషి అలా కాదు.. తనకు అవసరమున్నా లేకపోయినా.. రేపటి కోసం దాచాలనే యావలో ప్రకృతికి చేటు తెస్తున్నాడు. తన మనుగడను కొనసాగించడంలో ఇతర జీవరాశులు, మొక్కల పాత్రను గుర్తించలేని దురవస్థలో ఉన్నాడు. ఫలితంగానే జీవ వైవిధ్యానికి ముప్పు తెస్తున్నాడు.రంపచోడవరం: విశిష్టమైన జీవ వైవిధ్యానికి, విభిన్న జంతుజాతులకు నెలవు మన మన్యసీమ. పోలవరం జిల్లా విస్తీర్ణం 6,528.52 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 53,771.85 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. ఇందులో పాపికొండలు నేషనల్ పార్కు 1,012.858 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. ఇందులో 2,531 జాతుల పుషి్పంచే మొక్కలు, అనేక రకాల వెదురు మొక్కలు, రకరకాల ఔషధ మొక్కలు, విలువైన వృక్షాలు ఉన్నాయి. అలాగే, హైనా, చిరుతపులి, గొర్రగేదెలు, సాంబార్, మచ్చల జింక వంటి అనేక జంతుజాలాలకు ఈ వనసీమ నెలవు. నెమళ్లు, అడవి కోళ్ల వంటి 92 రకాల పక్షి జాతులున్నాయి. కింగ్ కోబ్రా వంటి అనేక రకాల సర్పాలున్నాయి. ఇంతటి జీవవైవిధ్యానికి నెలవైన పాపికొండలు ప్రాంతంలో జీవజాలాన్ని, వృక్షజాలాన్ని సంరక్షించేందుకు వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద ఈ ప్రాంతాన్ని పాపికొండలు జాతీయ అభయారణ్యంగా 1972లోనే ప్రభుత్వం ప్రకటించింది. అఖండ గోదావరి నదికి ఇరువైపులా కాకినాడ, ఏలూరు, పాల్వంచ, భద్రాచలం అటవీ డివిజన్ల పరిధిలో పాపికొండలు విస్తరించి ఉన్నాయి. అయితే, విలువైన వృక్షాలపై మనిషి వేటు వేయడం.. వన్యప్రాణులను విచ్చలవిడిగా వేటాడుతూండటంతో అభయారణ్యం కాస్తా ఆయా జీవరాశులకు ‘భయారణ్యం’గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. యథేచ్ఛగా గొర్ర గేదెల వేట పాపికొండల ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో గొర్ర గేదెలున్నాయి. వీటి మాంసానికి డిమాండ్ ఉండటంతో వాటిని విచ్చలవిడిగా వేటాడుతున్నారు. గతంలో దేవీపట్నం మండలం పోతవరం, మద్దిరాతిగూడెం, నేలకోట తదితర ప్రాంతాల్లో ఉచ్చుల్లో పడి పలు గొర్ర గేదెలు మృత్యువాత పడ్డాయి. గొర్ర గేదెలు గుంపులుగా తిరగడంతో వాటిని విల్లుతో వేటాడే అవకాశం ఉండదు. అందువలన వీటి వేటకు నాటు తుపాకులు వాడుతున్నారు. ఇక్కడ గొర్ర గేదెలు ఎక్కువగా ఉండటంతో వాటిని నల్లమల అడవులకు తరలించి, అక్కడ పెంచే అవకాశాలను ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన బృందం పరిశీలించింది. అయితే, వీటి బరువు ఎక్కువగా ఉండటంతో తీసుకువెళ్లడం క్లిష్టతరం కావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు. జనారణ్యంలోకి జింకలు అడవుల నుంచి జింకలు అనేకసార్లు సమీపంలోని జనారణ్యంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలో వీటిపై కుక్కలు దాడి చేస్తున్న సంఘటనలు అనేకం జరిగాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీ అధికారులు వాటికి చికిత్స అందించి, అడవుల్లో వదిలిపెడుతున్నారు. అయితే, అడవుల విస్తీర్ణం తగ్గిపోవడమే ఆయా జంతువులు బయటకు రావడానికి ప్రధాన కారణమని పరిశీలకులు చెబుతున్నారు. కింగ్ కోబ్రాలు మన్యసీమలో కింగ్కోబ్రాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. గతంలో, రంపచోడవరం, మోతుగూడెం, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో కింగ్క్రోబాలు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు హడలెత్తిపోయిన సందర్భాలున్నాయి. మోతుగూడెంలోనైతే కింగ్కోబ్రా ఏకంగా పీహెచ్సీలోకే ప్రవేశించింది. రంపచోడవరం మండలం పెద్దగెద్దాడలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన కింగ్క్రోబాను స్థానికుడే పట్టుకుని గోనె సంచిలో వేసి అడవిలో వదిలిపెట్టారు. చిరుతలు అడ్డతీగల మండలం ఎల్లవరం వద్ద పొలాల మధ్య కాలువ వద్దకు వెళ్తున్న ఓ చిరుత పులి 2023 నవంబర్ 30న కోతులకు పెట్టిన వలలో చిక్కుకుంది. ఆ వలను లాక్కుంటూ వెళ్లి, చెట్టు ఎక్కడంతో వేలాడుతూ రోజుంతా అక్కడే ఉండిపోయింది. తీవ్ర జాప్యం అనంతరం ఉన్నతాధికారుల నుంచి అనుమతి రావడంతో అటవీ అధికారులు దానికి మత్తు మందు ఇచ్చి కిందకు దింపారు. ఆ తరువాత అది చనిపోయింది. అడవి పందులు రంపచోడవరం, మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో అడవి పందుల వేట విచ్చలవిడిగా సాగుతోంది. కరెంట్ ఉచ్చులు అమర్చి మరీ వాటిని కొంత మంది హతమార్చుతున్నారు. అడవి పందుల మాంసానికి కూడా మంచి డిమాండ్ ఉండటంతో వేటగాళ్లు వాటాలు వేసి మరీ విక్రయిస్తున్నారు. పొలాల్లోకి వస్తున్న అడవి పందులను ఒకవైపు తరుముకుంటూ వచ్చి వల అమర్చుతారు. ఆ వలలో చిక్కిన వాటిని కొట్టి చంపుతారు. కొంత మంది పందుల వేటకు విల్లుతో పాటు నాటు తుపాకులు కూడా ఉపయోగిస్తున్నారు.పులి.. దారి తప్పి.. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం వద్ద పట్టుకున్న పెద్దపులిని పాపికొండలు నేషనల్ పార్కు పరిధిలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టారు. అయితే, ఆ పులి అక్కడి నుంచి మారేడుమిల్లి, రంపచోడవరం మండలాలకు వచ్చి, పలు గ్రామాల్లో పశువులపై దాడి చేసి, హతమార్చింది. ప్రస్తుతం తాళ్లపాలెం, బోలగొండ అటవీ ప్రాంతంలోనే ఈ పులి ఉంది. ఈ పులి మైదాన ప్రాంతానికి రావడానికి అడవులు తగ్గిపోవడం కూడా ఓ కారణమని అంటున్నారు. పులులు సాధారణంగా తమ పరిధిని చాలా ఎక్కువగా విస్తరించుకుంటాయి. గతంలో ఛత్తీస్గఢ్, ఒడిశా ప్రాంతం నుంచి కూడా పులులు పాపికొండలు అభయరణ్యంలోకి వచ్చేవి. అయితే, వేటతో వాటి సంఖ్య తగ్గిపోయింది. జాతీయ పక్షి నెమలి ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో విరివిగా కనిపించేది. వాటి సంతతి చాలా వరకూ తగ్గిపోయింది.అవగాహన కల్పిస్తున్నాం జంతువుల ఆవశ్యకతపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. అడవులు, జంతువులు వలన కలిగే ప్రయోజనాలను వివరిస్తూ చైతన్యం కల్పిస్తున్నాం. పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించి, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంపొందిస్తున్నాం. – బి.కొండలరావు, అటవీ అధికారి, ఇందుకూరు రేంజ్ -
కల్తీ పాల ఘటనలో మరొకరు మృతి: 8కి చేరిన మృతుల సంఖ్య
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరింది. అయితే అధికారికంగా ఏడుగురే చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కిమ్స్లో చికిత్స పొందుతూ జి సూర్యారావు(80) మృతిచెందారు. మృతుడు రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్ వాసి. కల్తీ పాల బాధితుడు జి సూర్యారావు. మరో 13 మంది ఇంకా వెంటిలేటర్లపైనే చికిత్స పొందుతున్నారు. కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది. కిమ్స్ బొల్లినేని, రెయిన్బో చిల్డ్రన్ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్ ఆస్పత్రుల్లో 13 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. -
చెరకు సాగుకు.. పద ముందుకు
ఫ ఇదే అనుకూల సమయం ఫ సస్యరక్షణ చర్యలు అవశ్యం పెరవలి: తియ్యని దిగుబడులను ఇచ్చే చెరకు సాగుకు ఇదే అనుకూలం.. సరైన సమయంలో సాగు చేస్తే సిరుల పంటే. తూర్పు గోదావరి జిల్లాలో 850 హెక్టార్లలో చెరకు పంట వేస్తున్నారు. ఇందులో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, దేవరపల్లి, ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం రూరల్, కడియం, సీతానగరం మండలాలు ఉన్నాయి. ఈ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యల గురించి కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. ఆ వివరాలు ఇలా.. నేలల స్వభావం చెరకు పంటకు నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అనుకూలం. ఈ భూముల్లో 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకూ మెత్తని దుక్కు చేయాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కులో కలియ దున్నాలి. చేనును సమాంతరంగా చేయాలి. నాటే సమయం ఉభయ గోదావరి జిల్లాల్లో చెరకు పంటను జూన్ నుంచి జూలై వరకూ, డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకూ నాటుకోవచ్చు. మొదటిసారి పంట వేసే రైతులు చేలో పూర్తిగా నీరు పెట్టి నీరు ఇంకిన 3 రోజుల తరువాత విత్తనం చెరకు గడలను ముక్కలుగా చేసి 2.5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. కార్సీ తోటల రైతులు చేలో ఉన్న చెత్తకు నిప్పుపెట్టి అంటించిన తరువాత నీరు పెట్టాలి. నీటి యాజమాన్యం పంట వేసిన తరువాత ఆరు రోజులకు ఒకసారి 4 నెలల పాటు సాగునీటిని అందించాలి. పక్వానికి వచ్చిన దశలో 3 వారాలకొకసారి నీరు అందించవచ్చు. ఎరువులు ఇలా.. చెరకు తోట వేసిన 45 రోజులు, 90 రోజులు, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని 67 కిలోలు, భాస్వరం 40 కిలోలు, పొటాష్ 48 కిలోలు మూడు సమ భాగాలుగా చేసి వీటిని అందించాలి. వీటితో పాటు నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ ఎకరానికి రెండు కిలోల చొప్పున పశువుల ఎరువుతో కలిపి రెండు దఫాలుగా వేయాలి. నాటిన మూడో రోజు ఒకసారి, 45 రోజులకు మరోసారి వేసుకుంటే నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరానికి 4 కిలోలు పాస్ఫా బ్యాక్టీరియాను నాటిన ఆరో రోజున వేసుకుంటే భాస్వరం ఎరువును కూడా తగ్గించుకోవచ్చు. కార్సి తోటల సాగు మొక్కతోటల కన్నా కార్సి తోటలు త్వరగా పక్వానికి వస్తాయి. సాగులో ఖర్చు కూడా తగ్గుతుంది. నీటిని తట్టుకునే గుణం ఈ తోటలకు ఉంటుంది. కార్సి తోటల్లో దుబ్బుల నుంచి మొలకెత్తేటప్పుడు కలుపు నివారణ కోసం మందులను వాడకూడదు. కార్సి తోటలున్న రైతులు చేలో ఉన్న చెత్తను కాల్చడం కానీ లేదా ఆ చెత్తను కుళ్లబెట్టడానికి ట్రై కోడెర్మావిరిడి మందును పేడనీళ్లతో కలిపి చెత్తపై చల్లాలి. దీనితో పాటు 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా రెండు కలిపి చెత్తపై చల్లాలి. దీనివల్ల భూమిలో తేమశాతం నిలబడటమే కాకుండా చెత్త బాగా చివికి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పంటలపై ఎక్కువగా పీక పురుగు, కాండం తొలిచే పురుగు, పొలుసు పురుగు, తెల్లనల్లి, లద్ది పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు పంటను ఆశించకుండా చేలల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు అరికట్టవచ్చు. పంటపై కాటుక తెగులు, ఎర్రకుళ్లు తెగులు, మొవ్వకుళ్లు తెగులు ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి ఆశించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
మార్పు మన నుంచే రావాలి
సదస్సులో చాగంటి కోటేశ్వరరావు రాజమహేంద్రవరం రూరల్: ముందు మన నుంచే మార్పు వస్తే, సమాజం మారుతుందని ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నైతిక విద్యా సదస్సు నిర్వహించారు. దీనిని చాగంటి కోటేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకి మనం కట్టుబాటుతో బతకడం అనేది కేవలం విద్యతో మాత్రమే వస్తుందన్నారు. సెల్ఫోన్ అధిక వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక సామాజిక దుష్ప్రభావాలను వివరించి, సమయాన్ని వృఽథా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, యోగాభ్యాసం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. నైతిక విలువలు లేని ఏపనైనా విషంతో సమానమని స్పష్టం చేస్తూ, సత్యం, క్రమశిక్షణ, గౌరవం, సేవాభావం వంటి సద్గుణాలు ప్రతి విద్యార్థి జీవితానికి పునాది కావాలని తెలిపారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చాగంటి కోటేశ్వరరావు సమాధానలిచ్చారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ ఈ ప్రవచనాలను విద్యార్థులు పెద్దవారైనా పాటించాలన్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు విలువల విద్యను సమానంగా అందించడం అవసరమని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయన్నారు. ఈ సదస్సులో తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్పర్సన్ శ్రీరష్మి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, దాదాపు 1,200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. -
నిప్పుతో చెలగాఢాం..
ఫ బాణసంచా తయారీలో నిబంధనలు గాలికి ఫ వరుస ప్రమాదాలతో ఆరని నిప్పు ఫ ప్రమాదకర వృత్తిలో పేద కుటుంబాలు ఫ అవగాహన లేక ప్రాణాలకే ముప్పు పిఠాపురం: మిరుమిట్లు గొలిపే వెలుగులు.. భారీ శబ్దాలతో పేలే టపాసులు కొందరికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.. వాటి తయారీలో మాత్రం పేదల బతుకులు ‘కూలి’పోతున్నాయి.. లాభాల్లో మునిగి యజమానులు, పర్యవేక్షణా లోపంతో అధికారులు ఉండడంతో బడుగుల జీవుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. ఒకప్పుడు బాణసంచా కేవలం దీపావళికి మాత్రమే కాల్చేవారు. రానురానూ ఏ శుభకార్యం, పండగ, జాతర చివరకు అంతిమయాత్రల్లోనూ వాడుతున్నారు. దీనివల్ల టపాసుల తయారీ ఏడాది పొడవునా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ఫైర్ వర్క్స్లో పేదలు జీవనోపాధి పొందుతూ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ జీవితాలను మంటల్లోకి నెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలు చూస్తే పరిస్థితి అర్ధమవుతోంది. కొన్ని నెలల కిందట రాయవరం, ఇటీవల వేట్లపాలెంలో జరిగిన ఘటనల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయి అయినవారికి విషాదాన్ని మిగిల్చారు. ఈ పనిలోకి వెళ్తే తిరిగి వచ్చే వరకూ వారి ప్రాణాలకు రక్షణ ఉండడం లేదు. అయినా అదే వృత్తిని కొనసాగించడం వారి కుటుంబాలకు శాపంగా మారుతోంది. అన్నీ తెలిసినా తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రాణాన్ని ఫణంగా పెట్టి వచ్చే కొద్దిపాటి కూలి డబ్బుల కోసం వెళ్లి విలువైన తమ ప్రాణాలు కోల్పోయి వెనుక ఉన్న కుటుంబానికి ఆసరా లేకుండా చేసుకుంటున్నారు. దీంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికారికంగా 20 బాణసంచా తయారీ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా 50కు పైనే ఉన్నట్లు సమాచారం. కడచూపు కరువాయే.. మూడు రోజుల కిందట వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ వద్ద జరిగిన విస్ఫోటం కూలీల కుటుంబాలను కుదిపేసింది. కూలి డబ్బులు తెస్తా.. నీకు సామాన్లు తీసుకొస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన వారు ఇంటికి రాకుండా పోయారు. కడసారి చూపునకు కూడా వీల్లేకుండా కాలి బూడిదయ్యారు. గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా ఏడుద్దామన్నా ఏ శవం ఎవరిదో తెలియని హృదయ విదారకమైన పరిస్థితి. మృతదేహాలను నేరుగా మరుభూమికే తరలించడంతో బంధువులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేకపోయ్యింది. ఒకరా ఇద్దరా ఏకంగా 22 మంది చూడటానికి ఆకారం లేదు.. ఎవరో తెలుసుకుందామంటే ముఖాలు కనిపించడం లేదు.. గుర్తు పడదామంటే ఆనవాళ్లు లేవు.. ఈ పరిస్థితుల్లో తెల్లవస్త్రంలో కట్టిచ్చిన మూటలే వారి మృతదేహాలుగా భావించి ఖననం చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితి వచ్చింది. తల్లి.. తండ్రి.. భర్త.. భార్య, పిల్లలు ఇలా ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరిని కోల్పోయి పుట్టెడు దుఖఃలో బాధిత కుటుంబాలు ఉన్నాయి. అవగాహనా లోపమే శాపం బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులే. ఇక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే ముడిసరకుపై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి లేదు. బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇది కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలే స్వభావం ఉంటుంది. అయితే పనిచేసే వారికి ఈ అవగాహన ఉండదు. బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతి కార్మికుడి ముఖానికి మాస్క్ తప్పనిసరి ఉండాలి. అయితే ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. పొటాషియం నైట్రేట్, మెగ్నీషియం పౌడర్, సల్ఫర్ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. బాణసంచా తయారు కేంద్రాల్లో అన్ని రసాయనాలు కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తున్నాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అవగాహన కల్పించకుండా కూలీలతో పనులు చేయించడం పేలుళ్లకు దారి తీస్తోంది. అగ్ని బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతో పాటు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరి. కానీ ఎక్కడా అది జరగడం లేదు. వరుస ఘటనలు.. కలవరపాట్లు బాణసంచా తయారీ కేంద్రాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో అనేక మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. సాధారణంగా మందుగుండు సామగ్రి అతి తక్కువ పేలుడు పదార్థాలతో మాత్రమే తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాల్చే విధంగా, ప్రమాదం జరిగినా ప్రాణనష్టం లేకుండా చేయాలి. కానీ విదేశీ మందుగుండు రాకతో వాటిని పోటీగా చేసుకుని రంగు రంగుల బాణసంచా తయారీతో పాటు శక్తివంతమైన అతి పెద్ద శబ్దాలు వచ్చే పోటాపోటీగా మందుగుండు కొత్త పద్ధతుల్లో తయారీ చేస్తున్నారు. దీంతో వీటి పవర్ మందు పాతర మాదిరిగా తయారవుతోంది. ఎక్కడైనా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగితే అది మందుగుండు పేలినట్లు కాకుండా మందు పాతర పేలినట్లు విస్ఫోటం సృష్టిస్తుంది. తద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. అధికారులు ‘మామూళ్లు’ తనిఖీలే తప్ప పూర్తిగా దృష్టి సారించకోవడం పెను ప్రమాదాలకు కారణమవుతోంది. -
అడ్డు తొలగించుకోవడానికే హత్య
ఫ ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య ఫ అనపర్తిలో ఆసుపత్రి వద్ద నిందితుల అరెస్ట్ రంగంపేట: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన ప్రియుడితో కలసి భర్తనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెల 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య సోమవారం రంగంపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంట గ్రామానికి చెందిన బక్క నాగేంద్రకు ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన బక్క వీరలక్ష్మితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ పాప ఉంది. గత కొద్దికాలంగా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన తోరాటి శివతో నాగేంద్ర భార్య వీరలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా గత నెల 27న రాత్రి ప్రియుడు శివతో కలసి వీరలక్ష్మి తమ పుట్టింట్లో ఉంది. దీనిని గమనించిన భర్త నాగేంద్ర వారిని నిలదీశాడు. వారిద్దరూ ఆగ్రహానికి గురయ్యి నాగేంద్రపై కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతర తోరాటి శివ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, బంధువులు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న శివ, వీరలక్ష్మితో కలసి ఆదివారం పరారు కావడానికి ప్రయత్నించగా, పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, రంగంపేట ఎస్సై ఎస్.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ల ఆటోను ఢీకొన్న లారీ
ఒకరి మృతిపెరవలి: ఉసులుమర్రు వద్ద గ్యాస్ సిలిండర్ల ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెరవలి పోలీస్ స్టేషన్ ఏఎస్సై ప్రసాదరావు కథనం ప్రకారం.. నిడదవోలుకు చెందిన అంగర కృష్ణ ధనప్రసాద్ (38) అక్కడి హెచ్పీ గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్లతో ఆటోను కానూరు తీసుకొచ్చి వినియోగదారులకు పంపిణీ చేసి, అనంతరం ఉసులుమర్రు వచ్చారు. అక్కడ సిలిండర్లు దింపి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ నేపథ్యంలో ఆటో బోల్తా పడింది. రోడ్డుపై పడిపోయిన ధనప్రసాద్పై గ్యాస్ సిలిండర్లు పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని హుటాహుటిన నిడదవోలులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని భార్య సాయి రామతులసి ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఉదయం వరకూ కళ్లముందే తిరుగాడిన వ్యక్తి సాయంత్రానికి అచేతనంగా మారడంతో బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. రామతులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వివరించారు. యువకుడి దుర్మరణం అమలాపురం టౌన్: స్థానికంగా సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన రేవు దినేష్కుమార్ (27) బైక్ వెళ్తుండగా, స్థానిక ఎత్తు రోడ్డులోని హెచ్పీ గ్యాస్ గొడౌన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి రాజోలు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతని బైక్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని రాంగ్ రూట్లో వెళుతున్న దినేష్ కుమార్ ఈ ప్రమాదానికి గురైనట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న దినేష్ కుమార్ కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, ఏడేళ్ల లోపు ఇద్దరి పిల్లలతో అమలాపురం పట్టణం నారాయణపేటలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు
అల్లవరం: గోదావరి జిల్లాలోని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను సమగ్రంగా విశ్లేషించి, వాటి సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను అధ్యయనం చేయడమే లక్ష్యంగా చేసిన పరిశోధన ప్రాజెక్టుకు గాను అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో చోటు దక్కింది. ఆ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న అయ్యగారి నాగేశ్వరరావు, శ్రీపాద రామకృష్ణ, ఆకుల ప్రవీణ్లు చేసిన ‘గోదావరి జిల్లాల వైదిక వారసత్వంపై విశ్లేషణాత్మక అధ్యయనం’ ప్రాజెక్టుకు గుర్తింపు దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందని బీవీసీ చైర్ పర్సన్ బోనం కనకదుర్గ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో గోదావరి జిల్లాల వైదిక వారసత్వం మేటిగా నిలిచిందన్నారు. ఈ ప్రాజెక్టుతో తమ కళాశాల విద్యా పరిశోధన రంగాల్లో మైలురాయిని అధిగమించిందని ప్రిన్సిపాల్ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. పులిని పట్టుకోవాలిరంపచోడవరం: ఆదివాసీలకు జీవనధారమైన పంటలు, పశువులు, మేకలకు పులులు, వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యాన గిరిజనులు సోమవారం రంపచోడవరంలో ర్యాలీ నిర్వహించారు. పాపికొండలు నేషనల్ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్ మాట్లాడుతూ, మైదాన ప్రాంతానికి వచ్చిన పెద్ద పులిని రూ.కోట్లు ఖర్చు చేసి పట్టుకుని రంపచోడవరం గండి పైన గిరిజనులు నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో అటవీ అధికారులు వదిలి వెళ్లారని అన్నారు. ప్రస్తుతం పులి భయంతో ఎక్కడకూ వెళ్లలేని పరిస్థితిలో గిరిజనులున్నారని తెలిపారు. ఆదివాసీలు జాగ్రత్తగా ఉండాలంటూ గ్రామాల్లోకి వచ్చి చెబుతున్నారని, వన్యప్రాణులను చంపితే కఠినంగా శిక్షిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అధికారులపై గిరిజనులు తిరుగుబాటు చేయాలని అన్నారు. ఏజెన్సీలో సంచరిస్తున్న పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా గిరిజనులనుద్దేశించి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడారు. ఏజెన్సీలో పులి సంచారంపై ఆందోళన చెందవద్దని అన్నారు. అటవీ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామన్నారు. పులికి జియో ట్యాగ్ ఉందని, దీని సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఉంటుందని, ఆయా గ్రామాల వారిని అప్రమత్తం చేస్తారని తెలిపారు. పులి సంచారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఫ రంపచోడవరంలో గిరిజనుల ర్యాలీ ఫ ఇన్చార్జి కలెక్టర్కు వినతి -
వార్ంతా ఇబ్బందుల్లో...
ఖతార్పై ఇరాన్ దాడి ● గల్ఫ్ దేశాల్లో యుద్ధంతో జిల్లా వాసుల్లో ఆందోళన ● ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లిన వందలాది మంది ● ఇంటర్నెట్పై ఆంక్షలతో మాటామంతీ కట్ ● ఆందోళనలో కుటుంబ సభ్యులు సాక్షి, అమలాపురం: సైరన్ మోతలు... దూసుకొస్తున్న క్షిపణులు... గంటకు ఒకసారి వినిపిస్తున్న భారీ పేలుళ్లు.. ఇళ్లు వీడి బయటకు రావద్దని గల్ఫ్ దేశాల్లో ప్రభుత్వ హెచ్చరికలతో అక్కడి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఉపాధి.. ఉన్నత ఉద్యోగాల కోసం స్వదేశాన్ని, సొంతవారిని వదులుకుని అరబ్ దేశాల బాట పట్టిన ఎంతోమంది కోనసీమ వాసుల పరిస్థితి ఇది. జరుగుతున్న యుద్ధంతో అక్కడ ఉండలేక భయకంపితులవుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నవారు గల్ఫ్, ఇజ్రాయిల్ దేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువుల క్షేమ సమాచారాల కోసం ఆందోళన చెందుతున్నారు. ‘‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చినట్టుగా’’ ఉంది ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన కోనసీమ వలసదారుల పరిస్థితి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడి చేయడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ దాడికి దిగింది. ఇజ్రాయిల్తో పాటు అమెరికన్ మిలటరీ బేస్ క్యాంప్లు ఉన్న ఖతార్, సౌదీ, కువైట్, యూఏఈపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఎప్పుడు ఏ క్షిపణి వచ్చి పడుతుందోనని.. ఏ బాంబు ఎక్కడ పేలుతుందోనని అనుక్షణం భయపడుతూ అక్కడ ఉన్నవారు కాలం వెళ్లదీస్తున్నారు. బంకర్లలో తలదాచుకుంటున్నారు. జిల్లాలోని రాజోలు దీవిని మినీ గల్ఫ్గా అభివర్ణిస్తారు. ఈ దీవిలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల నుంచి వందలాది మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. జిల్లా నుంచి అరబ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్కు సుమారు 15 వేల మంది వరకూ వెళ్లారు. వీరిలో సగం మంది కేవలం రాజోలు దీవి నుంచి ఉంటారు. గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా రాజోలు దీవి నుంచి అరబ్ దేశాలకు వెళ్తున్నారు. ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు తరాలకు చెందినవారు కూడా ఇక్కడ ఉపాధి కోసం వలస వెళ్లారంటే అతిశయోక్తి కాదు. ఆయా దేశాల్లో అన్స్కిల్డ్ పనులు చేసుకునేవారు 80 శాతం వరకూ ఉండగా, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చదువుకుని వృత్తి నైపుణ్యం ఉన్న పనిమంతులు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేవారిలో ఎక్కువ మంది కువైట్, ఖతార్, సౌదీలలో ఉంటున్నారు. రాజోలు దీవి నుంచే కాకుండా ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, అమలాపురం, రామచంద్రపురం రూరల్ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. జీరో క్రైమ్ రేటు, మంచి జీతాలు, ప్రశాంత జీవనం వల్ల చాలా మంది ఈ దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం పుణ్యమాని క్షిపణులు, బాంబుల మోతలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. నిన్నటి వరకూ నిశ్చింతంగా జీవనం సాగించిన వారి జీవితాల్లో యుద్ధం కల్లోలం రేపుతోంది. సమాచారానికి బ్రేకులు అక్కడున్న తమవారు ఎలా ఉన్నారో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఇంటర్నెట్, ఫోన్ల వినియోగంపై ఆంక్షలు పెడుతున్నారు. దీంతో స్థానికులకు అక్కడవారి క్షేమ సమాచారాలు పూర్తిగా తెలియడం లేదు. వీడియో కాల్స్కు దొరకడం లేదు. కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకపోవడంతో వారు భయపడుతున్నారు. యుద్ధం ముగిసిపోతోందనే ఆశతో గల్ఫ్లో నివాసముంటున్న వారే కాకుండా స్థానికులు కూడా కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. -
అవిశ్రాంత సేవకులపైచిన్నచూపు
● పెన్షనర్ల డిమాండ్లు పట్టించుకోని ప్రభుత్వం ● ఒకటో తేదీకి అందని పెన్షన్ సొమ్ము ● గాల్లో కలిసిన ఎన్నికల హామీలు కపిలేశ్వరపురం: ఆసక్తితో చదువుకుని, ఆశతో పోటీ పడి పొందిన ఉద్యోగాన్ని సుమారు 30 ఏళ్ల పాటు నిబద్ధతతో చేస్తారు. ఉద్యోగంలో చేరిన ఆరంభంలో ఆనందంగానే ఉన్నా మధ్యలో పెరిగిన కుటుంబ ఖర్చులతో అప్పులు చేస్తూ అవస్థలు పడుతూంటారు. వయస్సు మీద పడిన తర్వాత ఉద్యోగ విరమణ చేసే సమయానికి శేష జీవితం ఆందోళనకరంగా తలపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన జీవితానికి చుక్కానిలా పెన్షన్ ఆధారమవుతుంది. సకాలంలో పెన్షన్ అందితేనే రోజులు సుఖంగా గడుస్తాయి. కానీ, ఈ అవిశ్రాంత సేవకులను పాలకులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీకల్లా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ చెల్లిస్తామంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్లు 2024 ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలవుతున్నా పెన్షనర్ల సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఒకటి రెండు నెలలు తప్ప ఆ తర్వాత నుంచి ప్రతి నెలా వారం తర్వాతే పెన్షన్ చెల్లిస్తున్నారు. అత్యధిక పెన్షనర్లకు రూ.3 వేల లోపే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సేవలందించి, రిటైరైన వారు సుమారు 50 వేల మంది ఉన్నారు. వీరిలో అత్యధికులకు రూ.3 వేల లోపు మాత్రమే పెన్షన్ చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఉమ్మడి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన వారిలో 1,700 మంది డ్రైవర్లు, కండక్టర్లు, 150 మంది కార్యాలయ ఉద్యోగులు, 1,350 మంది మెకానికల్ విఽభాగానికి చెందిన వారు మొత్తం 3,200 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.2 వేల లోపు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. ఇంత తక్కువ పెన్షన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు పలుమార్లు నిరసన తెలిపారు. వృత్తి రీత్యా చెల్లిస్తున్న పెన్షన్కు తోడు వృద్ధులకు అందజేసే రూ.4 వేల సామాజిక పింఛను కూడా వర్తింపజేయాలని కోరుతూ ధర్నాలు చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలంటూ సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించాయి. పోరుబాటలో.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్లు పలు రూపాల్లో ఉద్యమిస్తున్నారు. గత నెల 9న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. గత జనవరి 18న ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం అమలాపురంలో నిర్వహించారు. ఆ సందర్భంగా ఉద్యోగుల వేతన సవరణతో సంబంధం లేకుండా 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యాన ఈపీఎఫ్–95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది డిసెంబర్ 9న ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. అదే నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఆయా కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లాలోని పెన్షనర్లు తరలి వెళ్లారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు–2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక పింఛన్ల కోసం.. తూర్పు గోదావరి జిల్లాలో 2,70,496 మందికి రూ.118.61 కోట్ల మేర సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. అవి ఎప్పటి నుంచో ఇస్తున్నవే తప్ప చంద్రబాబు 20 పాలనా కాలంలో కొత్తగా ఒక్క సామాజిక భద్రతా పింఛన్ కూడా మంజూరు చేయలేదు. పైగా పాత పింఛన్లకు సర్వే పేరుతో కోత పెట్టారు. కొత్త పింఛన్ కోసం ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేలు, రాష్ట్రంలో 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గీయులకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు గాలికొదిలేశారు. రూ.3 వేలతో ఎలా బతకాలి? దేశంలో 82 లక్షల మంది పెన్షనర్లున్నారు. వారిలో 36 లక్షల మంది రూ.వెయ్యి లోపు, మరో 36 లక్షల మంది రూ.2 వేల లోపు మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు. కేవలం 10 లక్షల మంది మాత్రమే రూ.3 వేలు పైగా పెన్షన్ పొందుతున్నారు. ఈ రూ.3 వేలతో కుటుంబం గడవడం సాధ్యం కాదు. ధరలు పెంచుతున్న పాలకులు అందుకు అనుగుణంగా పెన్షన్ కూడా పెంచాలి. – సీహెచ్ మోహనరావు, కార్యదర్శి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, ధవళేశ్వరం ఇవీ పెన్షనర్ల డిమాండ్లు ఇన్సూరెన్స్ ఆధారిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. 5 డీఏలు మంజూరు చేయాలి. 12వ పే కమిషన్ నియమించాలి. 2018 జూలై నుంచి పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలూ వెంటనే చెల్లించాలి. 2024 ఆగస్టు నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలి. 2020 తర్వాత మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు–2025 రద్దు చేయాలి. భిక్ష కాదు.. హక్కు పెన్షన్ ఇవ్వడాన్ని పాలకులు వారి గొప్పగా చెబుతూంటారు. వాస్తవానికి పెన్షన్ పొందడం ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కు. సుమారు 30 ఏళ్ల పాటు తమ శ్రమశక్తిని సమాజానికి ధారబోసి.. ఉద్యోగ విరమణానంతరం రోజువారీ జీవితం గడిపేందుకు పెన్షన్ పొందే హక్కు ఓ చారిత్రక నేపథ్యంలో ఉనికిలోకి వచ్చింది. 1889లో పెన్షన్ నామమాత్రంగా ఉండేది. 1920లో బ్రిటిషు కాలంలో రిటైర్డ్ బెనిఫిట్ పెన్షన్ ప్రవేశపెట్టారు. ఢిల్లీ మిలిటరీ అధికారి డీఎస్ నకారా పెన్షన్ కోసం న్యాయపోరాటం చేశారు. పలు పోరాటాల ఫలితంగా 80వ దశకంలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్–1980, 1981లో కుటుంబ పెన్షన్ అమలులోకి వచ్చాయి. అంతిమంగా 1982 డిసెంబర్ 17న అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ పెన్షన్ ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. -
పీజీఆర్ఎస్కు 313 అర్జీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 313 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వచ్చిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు సమర్పించేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ క్లినిక్లో 143, మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి అర్జీలు వచ్చాయని తెలిపారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 31 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పోలీసు అధికారులు అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. 14న జాతీయ లోక్ అదాలత్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ గంధం సునీత తెలిపారు. లోక్ అదాలత్ నేపథ్యంలో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి, బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా జిల్లా కోర్టులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్లో ఉన్న వివిధ సంస్థల సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను గుర్తించి, ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సూచించారు. రాజీ పడదగిన ఇతర కేసులను గుర్తించి, వాటిని త్వరగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి పాల్గొన్నారు. నేడు సత్యదేవుని ఆలయం మూసివేత అన్నవరం: చంద్రగ్రహణం కారణంగా అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు మూసివేయనున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులను ఉదయం 10 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకూ ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా సత్యదేవుని వ్రతాలను ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్యకల్యాణం, కేశఖండన టిక్కెట్లు ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. అలాగే, స్వామివారి ప్రసాదాలు ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా నిర్వహించే ఆయుష్య హోమం, స్వామివారి నిత్య కల్యాణం ఉదయం 9 గంటలకు బదులు ఉదయం 7 గంటలకూ ప్రారంభించి, 9.30 గంటల్లోపు పూర్తి చేస్తారు. గ్రహణానంతరం స్వామివారి ఆలయం, వ్రతమండపాలు, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి బుధవారం తెల్లవారుజాము నుంచి యథావిదిగా స్వామివారి దర్శనా లు, వ్రతాలు, పూజలు, కల్యాణం, ఆయుష్య హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేడే చంద్ర గ్రహణం వీరేశ్వరస్వామి ఆలయం మూసివేత ఐ.పోలవరం: ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం చంద్ర గ్రహణం సందర్భంగా రాత్రి జరిగే భక్తుల కల్యాణాలు రద్దు చేసినట్లు మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ వి.సత్యనారాయణ సోమవారం తెలిపారు. దేవస్థానం అనుసరించే పంచాంగం ప్రకారం ఆలయ అర్చకులు, పురోహితుల సూచనల మేరకు ఉదయం జరగాల్సిన అభిషేకాలు, దర్శనాలు, చండీ హోమం తదితర పూజలు జరిపించి ఉదయం 11.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు ఉంటాయన్నారు. -
విషాదం కుమ్మరించిన వేళ..
● వేట్లపాలెం పేలుడు మృతుల్లో నలుగురు కుమ్మర వీధి వాసులే ● సంఘటన స్థలంలో ఇద్దరు సజీవదహనం ● చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి ● నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ● గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులు సామర్లకోట: పట్టణంలోని కుమ్మర వీధిలో విధి పెను విషాదాన్ని కుమ్మరించింది. ఈ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గీయులు ఎక్కువగా నివాసం ఉంటారు. అందరూ రోజు కూలి చేసుకుంటూ జీవనం గడుపుతారు. వారికి తెలిసిన విద్య బాణసంచా తయారీయే. ఈ నేపథ్యంలో శనివారం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో పని చేయడానికి వెళ్లి.. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందారు. సంఘటన స్థలంలో కుమ్మర వీధికి చెందిన దర్శిపాటి నాని, ఏడిద శ్యామ్ కుమార్ సజీవ దహనం కాగా.. అదే ప్రాంతానికి చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మొత్తం కుమ్మర వీధికి చెందిన నలుగురు మృతుల్లో ముగ్గురు దర్శిపాటి కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి దుఃఖానికి అంతే లేకుండా ఉంది. దర్శిపాటి రాజు మృతదేహాన్ని మహాప్రస్థానం వాహనంలో సోమవారం తీసుకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు.ఆస్పత్రి నుంచి క్షేమంగా వస్తాడన్నారు బాణసంచా ప్రమాదం జరిగిన వెంటనే నా భర్త గురించి ఆరా తీశాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, త్వరలోనే ఇంటికి వస్తాడని బంధువులు, స్థానికులు చెప్పారు. 48 గంటలు గడవక ముందే నా భర్త మృతి వార్త వచ్చింది. ఆయన శవాన్ని సోమవారం అప్పగించారు. చివరి చూపు చూసుకునే అవకాశం కూడా దక్కలేదు. నా ఇద్దరు ఆడ పిల్లలకు ఆధారం లేకుండా పోయింది. మరిది, మామగారితో పాటు నా కుటుంబాన్ని నా భర్తే పోషించే వాడు. నేను ఇంటర్ వరకూ చదువుకున్నాను. కుటుంబ పోషణకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలి. – రాజేశ్వరి, దర్శిపాటి రాజు భార్య, సామర్లకోట ఇద్దరు పిల్లలు, మామగారిని పోషించాలి నా భర్త బాణసంచా షాపులో సజీవ దహనమయ్యాడు. అతని తండ్రితో పాటు కుటుంబాన్ని నా భర్త పోషించే వాడు. ఆయన చనిపోవడంతో ఇద్దరు పిల్లలు మానస, అఖిలలను ఏవిధంగా పోషించాలో అర్థం కావడం లేదు. వారిని చదివించుకోవాల్సి ఉంది. కుటుంబాన్ని నడిపే నాథుడు లేకుండా పోయాడు. ఎటువంటి ఆధారం లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. – గంగాభవాని, దర్శిపాటి నాని భార్య, సామర్లకోట -
ఉత్సాహంగా మారథాన్
కాకినాడ రూరల్: ఆమె భద్రత – మన బాధ్యత అనే నినాదంతో కాకినాడలో ఆదివారం మారథాన్ ఉత్సాహంగా జరిగింది. సూర్యారావుపేట వద్ద న్యూ ఎన్టీఆర్ బీచ్ నుంచి జరిగిన అఫెక్స్ కాకినాడ సీపోర్ట్స్ మారథాన్ – 2026 ఎనిమిదో ఎడిషన్ విజయవంతమైంది. పరుగో పరుగో అన్నట్టుగా కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతీ, యువకులు వచ్చి పోటీ పడ్డారు. కాకినాడ నుంచి ఉప్పాడ వరకూ ఆఫ్ మారథాన్గా 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. తొలుత బీచ్ వద్ద పోటీల్లో పాల్గొనే వారితో వార్మఫ్ నిర్వహించారు. తొలుత మారథాన్ను సీపోర్ట్స్ సీఓఓ మురళీధర్, అఫెక్స్ సీ ప్రోజోన్ ఫుడ్స్ కె.చౌదరి, ఓఎన్జీసీ ఈఈ ప్రభాల్ సేన్ గుప్తా, జీఆర్టీ హోటల్ జీఎం శివకిరణ్, సంకురాత్రి ఫౌండేషన్ జీఎం రమణమూర్తి, రెడ్క్రాస్ చైర్మన్ వైడీ రామారావు తదితరులు ప్రారంభించారు. నాలుగు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి కాకినాడ రన్నర్స్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ సుధా కేశవరాజు, ట్రస్టీ, మారథాన్ డైరెక్టర్ ఎన్ఎల్ శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో జ్ఞాపికలను అందజేశారు. -
తాటాకిళ్లు దగ్ధం
శంఖవరం: జి.కొత్తపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. వీఆర్వో సింహాచలం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బర్ల సింహాచలం, పల్లా నారాయణమ్మ, పెంటపాటి వరలక్ష్మి కుటుంబాలు మూడు తాటాకిళ్లలో పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. వారు నిద్రపోతుండగా విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆ తాటాకిళ్లు కాలిపోయాయి. నిత్యావసరాలు, నగదు పూర్తిగా కాలిపోయాయి. రూ.2 లక్షల ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సర్పంచ్ ఈగల విజయదుర్గ కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 16,000 – 17,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
కలవర్పాట్లు వద్దు!
● హోలీ వేళ రసాయన రంగులతో అనర్థాలు ● ఆనందంతో పాటు ఆరోగ్యం ముఖ్యం ● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు ● రేపే హోలీ పర్వదినం రాయవరం: ఆకాశంలోని ఇంద్ర ధనస్సు పుడమిపైకి దూసుకొస్తుంది. కేరింతలతో పులకించే యువతపై మెరవనుంది. ఆ రంగులన్నీ కుప్పలుగా పోశారా అన్నట్లుగా పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా చేసుకునేదే హోళీ పండగ. అయితే రంగుట మాటున కష్టాలున్నట్టు.. రసాయనాలు కలిపిన రంగులు వాడితే ప్రమాదం తప్పదు. సహజ రంగులతో వసంత రుతువుకు స్వాగతం పలకాలని నేత్ర వైద్యులు, పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువత హోలీ వేడుకలు నిర్వహించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు. వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా.. వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా హోలీ పండగను పేర్కొంటారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున హోలీ వేడుకలు జరుపుకొంటారు. ఈ పండగను కాముని పున్నమి, డోలోత్సవం తదితర పేర్లతో పిలిచినా సందడి మాత్రం ఒక్కటే అని చెప్పవచ్చు. ఏటా వసంత మాసంలో హోలీ పర్వదినం వస్తుంది. చలి కాలానికి వీడ్కోలు పలుకుతూ వెచ్చని వేసవికి స్వాగతం పలికే హోలీ పండగతోనే తెలుగు సంవత్సరం ముగుస్తుంది. ఉగాది పర్వదినంతో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. హోలి దుఃఖాన్ని పారదోలి సుఖశాంతులను కలిగిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే రంగులు చల్లుకుని, మిఠాయిలు తింటారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ● హోలీ సందడిలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ వేడుకల్లో పాత దుస్తులనే సాధ్యమైనంత వరకూ వాడాలి. చిన్నారులు, యువతను గమనిస్తూ ఉండాలి. రంగులను దుస్తులపైనే చల్లాలి. ● రసాయనిక రంగులతో కళ్లకు హాని కలగకుండా కళ్లద్దాలు ధరించాలి. దంతాలపై రంగులు పడకుండా పళ్లకు డెంటల్ కాప్స్ వేసుకోవాలి. తలకు, శరీరానికి ముందుగానే ఆయిల్ రాసుకుంటే మంచిది. ● రంగులు పూసుకునేటప్పుడు కళ్లు, పెదాలు తప్పనిసరిగా మూసుకోవాలి. జుత్తుపై రంగులు పడకుండా క్యాప్ పెట్టుకోవాలి. దీనివల్ల రంగుల నుంచి వెంట్రుకలను రక్షించుకోవచ్చు. ● హోలి తర్వాత గోరు వెచ్చని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ సమయంలో కూడా రంగు నీరు కళ్లు, నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ● రంగుల పొడులు కళ్లలో పడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. రంగులతో మంట, దద్దుర్లు వంటివి వస్తే వెంటనే శరీరాన్ని శుభ్రంగా కడిగి కొబ్బరి నూనెను రాసి చర్మ వైద్య నిపుణులను సంప్రదించాలి. అపశ్రుతులకు తావివ్వరాదు హోలీ పండగను ఆనందోత్సవాల మధ్య అపశ్రుతులకు తావులేకుండా జరుపుకోవాలి. స్నానం కోసం గోదావరి నది, చెరువుల్లోకి దిగరాదు. ముఖ్యంగా చిన్న పిల్లలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో లభించే రంగులు కల్తీగా ఉంటాయి. సహజ సిద్ధమైన రంగులు చల్లుకోవడం మంచిది. సిల్వర్ రంగు, ఇతర ప్రమాదకరమైన రంగులు చల్లుకుంటే చర్మ వ్యాధులు వస్తాయి. కోడిగుడ్లను వాడకుండా దూరంగా ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించరాదు. రంగులు శరీరంపై ఉన్నప్పుడు ఎక్కువ సేపు ఎండలో ఉండడం మంచిది కాదు. చల్లని నీటితో శుభ్రం చేయాలి కళ్లలో రంగులు పడితే కళ్లను నలపడం, రుద్దడం చేయకుండా చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఆలస్యం చేయకుండా సమీపంలోని నేత్ర వైద్యున్ని సంప్రదించాలి. హానికర రంగులతో కంటి రెటినా దెబ్బతినే ప్రమాదముంది. కంట్లో ఉండే కంజెక్టినా పొర రసాయనాలకు ప్రభావితం అవుతుంది. – రమ్య, వైద్యురాఉల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాయవరం -
దేశ భాషలందు తెలుగు లెస్స
● అమ్మ భాషను కాపాడుకుందాం ● రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ● అమలాపురంలో రెండో రోజు తెలుగు మహాసభలు అమలాపురం రూరల్: దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో గోదావరి గ్లోబల్ యూ నివర్సిటీ, కిమ్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు రెండో రోజు ఆదివా రం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు మహాసభల వేదికపై ప్రసంగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని గవర్నర్ అన్నారు. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా వికాసానికి మహత్తర పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యంగా వ్యవహారిక తెలుగు ప్రాచుర్యానికి కృషి చేసి, భాషను ప్రజలకు చేరువ చేశారన్నారు. సుమారు 100 మిలియన్ల తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారని, వారంతా మన భాష ఉనికిని కాపాడుకోవాలన్నారు. తెలుగు భాషలో తీర్పు చెప్పేవారికి సహనం, చదువు చెప్పేవారికి ఓర్పు ఉండాలని సూచించారు. మహాభారతం సంస్కృత శైలిని ఆదికవి నన్నయ ఆంధ్రీకరించారని అన్నారు. తిక్కన మహాభారతాన్ని కొనసాగించి, సులభమైన భాషలో రచనలు చేసి ప్రజల్లో తెలుగు ప్రాచుర్యం పొందేలా చేశారన్నారు. యర్రాప్రగడ మహాభారతాన్ని పూర్తి చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత బలపరిచారన్నారు. మూలాలు మరవద్దు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మాట్లాడుతూ తెలు గు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని అంటారని అన్నారు. మన భాష జీవిత విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు పిల్లలు మన భాషా మూలాలను మరువరాదన్నారు. భాషను కాపాడడం అంటే కేవలం పాఠ్య పుస్తకాల్లోనే కాదని, దానిని దైనందిన జీవితంలో ఉపయోగించడం, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేయడం, కొత్త తరాలకు అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. భాషను నేర్పించాలి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్ కుటుంబ సమేతంగా వచ్చి తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చలపతిరావు మాట్లాడుతూ తెలుగులో ఉన్న 56 అక్షరాలు నేర్చుకుంటే ఇంగ్లిష్ ఉన్న అక్షరాలు నేర్చుకోవడం ఎంతో సులువు అని అన్నారు. అమ్మ భాషను మరువరాదన్నారు. జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ మాట్లాడుతూ తెలుగు భాషపై ప్రేమతో ఈ మహాసభలో పాల్గొడం ఆనందంగా ఉందన్నారు. చిన్నతనం నుంచే పిల్లలతో పెద్ద బాలశిక్ష చదించి, తెలుగు భాషను బోధించాలన్నారు. న్యాయమూర్తి గాడి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ మన భాష తల్లి వంటిందని, చిన్నతనం నుంచి పాఠశాలల్లో పిల్లలకు నేర్పించాలన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలంటే ప్రాంతీయ భాష అవసరమన్నారు. జస్టిస్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భావితరాలు మన భాషా సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. శృంగేరీ పీఠం పండితుడు విశ్వనాథ గోపాలకృష్ణశర్మ, ప్రముఖ వేదపండితుడు బంగారయ్యశర్మ, హైకోర్టు ఏజీఏ నరసింహశర్మ, ధనంజయ ప్రసంగించగా.. ప్రముఖ కథా రచయిత తనికెళ్ల భరణి, ప్రముఖ దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలుగు భాషలో పాటలు పడుతూ ఉత్తేజపరిచారు. నిర్బంధ విద్య అవసరం అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నిర్బంధంగా కన్నడను కర్ణాటకలో బోధిస్తున్నారని, మనకు తెలుగు భాషలో విద్యా బోధన డిగ్రీ స్థాయి వరకూ జరగాలన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగు భాష వైభవం గురించి మాట్లాడారు. డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి ప్రసంగిస్తూ సాంకేతిక యుగంలో తెలుగు వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయన్నారు. సభకు అధ్యక్షతన వహించిన చైతన్యరాజు ప్రసంగిస్తూ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికి ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు ఆనందరావు, బండారు సత్యానందరావు, కిమ్స్ ఎండీ రవికిరణ్వర్మ, గైట్ ఎండీ కె.శశి, రిటైర్డ్ డీఏజీ ఏకే ఖాన్, నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీ ప్రసంగించారు. సినీ నటుడు చిరంజీవికి ప్రకటించిన జీవన సాఫల్య పురస్కారాన్ని అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి, అలాగే అంతర్జాతీయ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్కు ప్రకటించిన పురస్కారాన్ని ఆయన తల్లి రంగమణి అందుకున్నారు. సినీ నటుడు సుమన్, బ్యాండ్ మేళం సినిమా హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీదేవి పాల్గొన్నారు.పాల్గొన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు తదితరులుతెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మను సత్కరిస్తున్న కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు -
పంచాయతీ స్వీపర్ నిజాయతీ
మామిడికుదురు: పాశర్లపూడిలంక గ్రామ పంచాయతీ స్వీపర్ రాయుడు ప్రసాద్ తనకు దొరికిన రూ.లక్ష విలువైన ఎనిమిది గ్రాముల బంగారు గొలుసును బాధితుడికి ఇచ్చి నిజాయతీ చాటుకున్నారు. పంచాయతీ కార్యదర్శి దాకే సురేష్కు చెందిన బంగారు గొలుసు శనివారం పడిపోయింది. దాని కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. పంచాయతీ స్వీపర్ ప్రసాద్ ఆదివారం పంచాయతీని తుడుస్తుండగా అతనికి ఆ గొలుసు దొరికింది. దానిని బాధితుడి బంధువుకు అప్పగించి తన నిజాయతీని నిరూపించుకున్నారు. ప్రసాద్ను గ్రామ సర్పంచ్ తెలగారెడ్డి సూర్యప్రకాశరావుతో పాటు గ్రామస్తులు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన ఓసిపల్లి దుర్గాప్రసాద్ (17), మాయాపట్నానికి చెందిన ఓసిపల్లి జాన్లు మోటారు సైకిల్పై కోనపాపపేట వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ నుంచి కోనపాపపేట వైపు వెళుతున్న ఆటో పొన్నాడ శివారు శీలంవారిపాలెం బ్రిడ్జి సమీపంలో ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జాన్ను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇంతింతై సాగుతూ..
ఫ కూరగాయల సాగులో గిరిజన మహిళలు ఫ కష్టమైనా ఇష్టపడి వ్యవసాయం ఫ ఇంటి పంటలతో ఆర్థిక ఆదాయం చింతూరు: మహిళామణులు అన్నింటా రాణిస్తున్నారు.. ఏజెన్సీలో అతివలు ఇంటి పంటలను తమ ఆర్థిక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తమ ఇంటి పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు పండించి వాటిని విక్రయించడం ద్వారా కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఏజెన్సీలోని చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో గిరిజన మహిళలు ఇంటి పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు ఏడాది పొడవునా పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, కషాయాలు వినియోగించి పండిస్తున్న ఈ పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. ఇలా చాలామంది మహిళలు ఇంటి పంటలపై ఆసక్తి చూపుతున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలు లభ్యమవుతుండడంతో వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంటి పంటల ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.లక్ష వరకూ ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని అంచనా. పంట పండిస్తున్నారు ఇలా.. ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి దుక్కిదున్ని కూరగాయల సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను కొనుగోలు చేసి వాటిని చల్లుతున్నారు. ఇళ్లలోని మోటార్లు, చేతి బోర్ల సాయంతో తడులు పెడుతూ నీటి ఎద్దడి లేకుండా చూసుకుంటున్నారు. రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు, పురుగు మందులకు బదులు కషాయాలను వినియోగిస్తున్నారు. ఇంటిల్లపాదీ కలసి సేద్యం చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు మంచిగా పండేలా కష్టపడుతున్నారు. పంటను పశువులు పాడు చేయకుండా చుట్టూ కంచె నిర్మిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల్లో ఆనప, వంకాయ, బెండ, బీరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, టమాటా, కాకర, బరబోటి వంటివి పండిస్తున్నారు. ఆకుకూరల్లో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా వంటివి సాగు చేస్తున్నారు. నాలుగు ముంపు మండలాల్లో సుమారు వంద మంది మహిళలు కొన్నేళ్లుగా సుమారు 250 ఎకరాల్లో కూరగాయలను పండిస్తూ ఆర్థిక ఆదాయం పొందుతున్నారు. కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కుటుంబ పోషణ నిమిత్తం కూరగాయల సాగు చేస్తున్నాం. కష్టమైనా ఎంతో ఇష్టంతో కూరగాయలు పండిస్తు న్నాం. ప్రతి రోజూ ఉదయమే వాటిని మండల కేంద్రాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాం. దీని ద్వారా మా కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తోంది. – జయమ్మ, కుమ్మూరు, చింతూరు మండలం ప్రభుత్వం సహకారం అందించాలి కూరగాయల సాగు నిమిత్తం పెట్టుబడి అధికంగా అవుతోంది. అప్పులు చేసి పంట సాగుచేసిన పిదప వచ్చిన ఆదాయంతో అప్పులు తీరుస్తున్నాం. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు సరఫరా చేయడంతో పాటు రుణాలు అందిస్తే కూరగాయల సాగులో మరింత ప్రగతి సాధిస్తాం. – రాధాబాయి, చూటూరు, చింతూరు మండలం అతివలు అంతకంతకూ ఎదుగుతున్నారు.. కుటుంబ పోషణకు మేము సైతం అంటూ ముందుకు ‘సాగు’తున్నారు.. పురుషులకే సాధ్యమైన వ్యవసాయంలో తామేమీ తీసిపోమన్నట్టుగా కూరగాయల సాగుపై దృష్టి సారించారు.. ఇళ్ల వద్ద తమ కున్న కొద్దిపాటి భూముల్లో సాగు చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ, వాటి విక్రయాల ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. గిరి మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండల కేంద్రాల్లో విక్రయాలు గిరిజన మహిళలు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను మండల కేంద్రాలకు తీసుకొచ్చి ప్రధాన కూడళ్లలో విక్రయిస్తున్నారు. కూరగాయలను పోగులుగా, ఆకుకూరలను కట్టలుగా కట్టి పోగు రూ.20కి, కట్ట రూ.5 లేదా రూ.10కి విక్రయిస్తున్నారు. ఉదయమే తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభిస్తుండడంతో వినియోగదారులు అధిక శాతం వాటినే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన సెంటర్లు, బస్సులు నిలిపే ప్రదేశాల్లో కూరగాయలు, ఆకుకూరలు లభిస్తుండడంతో ఇతర ప్రాంతాలకు చెందిన వాహనదారులతో పాటు ప్రయాణికులు కూడా వాటిని కొనుగోలు చేస్తున్నారు. అప్పటికప్పుడు కోసి తీసుకు రావడం, సేంద్రియ ఎరువులతో పండిస్తుండడంతో ఇవి వండితే రుచికరంగా ఉంటున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. -
క్లీనర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం
సఖినేటిపల్లి: సఖినేటిపల్లికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు శనివారం అంతర్వేది రాంబాగ్ వద్ద చెట్టును ఢీకొన్న ఘటన జరగడానికి డ్రైవింగ్ అనుభవం లేని క్లీనర్ తప్పిదమే కారణమని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని క్లీనర్కు బస్ స్టీరింగ్ ఇచ్చిన క్రమంలో గేదె అడ్డుగా రావడంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోని కొబ్బరి చెట్టును ఢీకొన్నారన్నారు. కాగా రావులపాలెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఓలేటి శ్రీనివాస్ జరిపిన విచారణలో బస్సు కండీషన్ బాగానే ఉందని, క్లీనర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తేలిందన్నారు. ఇదిలా ఉండగా బస్సును సీజ్ చేయడమే కాకుండా డ్రైవర్ లైసెన్స్ మూడు నెలలు, బస్సు పర్మిట్ కూడా ఒక నెల సస్పెండ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. 25 వాహనాల సీజ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర, ఇతర చిన్న తరహా ఖనిజాల రవాణాపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. శని, ఆదివారాల్లో కడియం మండలం పరిధి, బొమ్మూరు నుంచి వేమగిరి వెళ్లే హైవే మధ్యలో రూట్ చెక్ నిర్వహించామన్నారు. పంగిడి నుంచి వస్తున్న 12 రోడ్ మెటల్ లారీలు, రంగంపేట నుంచి వస్తున్న 8 గ్రావెల్ లారీలు, రాఘవాపురం నుంచి వస్తున్న ఐదు ఆర్టీనరీ ఎర్త్ రవాణా చేస్తున్న లారీలు గుర్తించామని తెలిపారు. వాహనాల డ్రైవర్లు సరైన మైనింగ్ బిల్లులు చూపించక పోవడంతో మొత్తం 25 వాహనాలను స్వాధీనం చేసుకుని, కడియం పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిపారు. ఈ తనిఖీలో కార్యాలయ అసిస్టెంట్ జియాలజిస్ట్లు జి.విఘ్నేశ్వరుడు, డి.జ్యోతిర్మయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనీషా, టెక్నికల్ అసిస్టెంట్ ఎ.శైలజ పాల్గొన్నారు. -
సదరన్ ట్రావెల్స్ రిటైల్ బ్రాంచ్ ప్రారంభం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ రాజమహేంద్రవరంలో తన కొత్త రిటైల్ బ్రాంచ్ను ఆదివారం ప్రారంభించింది. నగర, పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ట్రావెల్ సేవలను సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తొలుత ఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. పలువురు ప్రముఖులు, సినీ తారలు, టూరిజం భాగస్వాములు, కస్టమర్లు హాజరయ్యారు. సదరన్ ట్రావెల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ అలపాటి మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రజలకు విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన సేవలను అందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. ఈ కొత్త బ్రాంచ్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ హాలీడే ప్యాకేజీలను మరింత విస్తృతంగా అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ సదరన్ ట్రావెల్స్ 45 లక్షలకు పైగా సంతృప్తి చెందిన కస్టమర్లకు సేవలందిస్తూ, 99 శాతం కస్టమర్ రిటెన్షన్ రేటును సాధించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకు పైగా గ్రూప్, కస్టమైజ్డ్ హాలిడే ప్యాకేజీలను అందిస్తుందన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి ఎనిమిది సార్లు ‘నేషనల్ టూరిజం అవార్డు’ను అందుకోవడంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల పర్యాటక శాఖలు, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల నుంచి కూడా అనేక పురస్కారాలను అందుకుందన్నారు. సదరన్ గ్రూప్ ఢిల్లీ, జైపూర్, వారణాసి (కాశీ విశ్వనాథ్ కారిడార్), విజయవాడలో హోటళ్లను నిర్వహిస్తూ 225కి పైగా రూమ్ ఇన్వెంటరీ కలిగి ఉందన్నారు. ఇతర వివరాలకు 99495 23236, 95057 26000 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అన్నారు. -
రోడ్డుపై పడిన రియాక్టర్
ఫ జనం లేని సమయంలో ఘటన ఫ కెమికల్స్ లేకపోవడంతో తప్పిన ముప్పు తుని: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని డెక్కన్ కెమికల్ పరిశ్రమకు చెందిన రెండు రియాక్టర్లను ట్రాలీపై తరలిస్తుండగా ఒకటి రోడ్డుపై జారిపడిన సంఘటన శనివారం తుని రాజా రాజబాబు మున్సిపల్ పార్కు సెంటర్లో చోటు చేసుకుంది. మధ్యాహ్నం కావడంతో వాహన రాకపోకలు లేని సమయంలో జరగడం వల్ల ప్రమాదం తప్పిందని లేకపోతే విషాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తుని పట్టణ ఎస్సై పాపారావు సంఘటన స్థలానికి చేరుకుని రియాక్టర్ను రోడ్డుపై నుంచి జేసీబీ సహాయంతో తొలగించి ట్రాలీపైకి ఎక్కించారు. మందుల తయారీకి రియాక్టర్లను వినియోగిస్తుంటారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పేలిపోయే ప్రమాదం ఉంది. డెక్కన్ కెమికల్స్ పరిశ్రమలో వినియోగించిన ఖాళీ రియాక్టర్లను వేరే ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కెమికల్స్ ఉంటే రియాక్టర్ పేలిపోయే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇలాంటివి తరలించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పుడు ఇందుకు భిన్నంగా ట్రాలీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్సై పాపారావు తెలిపారు. -
ట్యూనా.. చూడాముచ్చటేనా!
లోతైన సముద్ర జలాల్లో లభ్యమయ్యే ట్యూనా చేపల వేటకు కాకినాడ ప్రసిద్ధి. ఇక్కడ మత్స్యకారులు వలలతో పాటు గాలం కమ్మెల ద్వారా ఈ చేపలను వేటాడతారు. ప్రస్తుతం గాలం ద్వారా ఎల్లోపిన్ రకం ట్యూనా చేపలు లభ్యమవుతుండడంతో వాటిని కాకినాడలో విక్రయిస్తున్నారు. కుంభాభిషేకం వద్ద వీటి ధర కిలో రూ.130 వరకూ పలుకుతోంది. శనివారం విక్రయం కోసం మత్స్యకారులు ఇలా ఉంచారు. ఈ చేపలకు విదేశాల్లో మంచి కిరాకీ ఉంది. –కాకినాడ రూరల్ అపురూపం అమ్మా.. మురమళ్లలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి ఆలయంలో మాణిక్యాంబ అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. శివరాత్రి నుంచి మొదలై ఉగాది వరకూ ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం పండ్లతో అమ్మవారిని అలంకరించారు. పుచ్చకాయలు, స్వీట్కార్న్ మొక్కజొన్న, ద్రాక్ష, కమలా ఫలాలతో అలంకరణ విశేషంగా ఆకర్షించింది. –ఐ.పోలవరం ఆనబకాదు మారేడు పోతవరంలో పిచ్చుకల సత్తిబాబు (సత్యనారాయణ) వ్యవసాయ క్షేత్రంలో మారేడు చెట్టుకు కాసిన కాయలు అబ్బురపరుస్తున్నాయి. వీటిని ఆ గ్రామానికి చెందిన యేలేటి రాజశేఖర్ తీసుకువచ్చారు. సాధారణంగా మారేడు చెట్టుకు చిన్నసైజు కాయలు కాయడం చూస్తుంటాం. కానీ ఆనపకాయ సైజులో ఐదు కిలోల నుంచి తొమ్మిది కిలోల వరకూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. –నల్లజర్ల పోతవరంలో కాసిన మారేడు కాయలు ఇదేందిరొయ్యే పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారుల కు శనివారం మత్స్య సంపద తో పాటు రెండు మెగా రొయ్యలు చిక్కాయి. అర కేజీ చొప్పున బరువున్న ఈ రొయ్యలు వేలం పాటలో ఓ వ్యక్తి రూ.2 వేలకు చేజిక్కించుకున్నాడు. కాగా ఒడ్డుకు వచ్చే వరకూ ఇవి బతికి ఉండడం కష్టమని, బతికి ఉంటే ఈ రకం రొయ్యలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు అన్నారు. –సఖినేటిపల్లి పండ్లతో మాణిక్యాంబ అమ్మవారికి అలంకరణ -
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
రాజోలు: ఇంజినీరింగ్ ఇంటర్ యూనివర్సిటీ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రాజోలుకు చెందిన గెద్దాడ తేజోమయి హేమ శ్రీదేవి అర్హత సాధించినట్లు కోచ్ రాయుడు మణికుమార్ శనివారం తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తేజోమయి ఈ నెల 27న కాకినాడ జేఎన్టీయూలో జరిగిన తైక్వాండో పోటీల ఎంపికలో అర్హత సాధించిందన్నారు. మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఒడిశాలోని ఫకీర్మోహన్ యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతుందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో జేఎన్టీయూకే యూనివర్సిటీ తరఫున తైక్వాండో పోటీల్లో పాల్గొనే అవకాశం సాధించిన తేజోమయిని మణికుమార్ అభినందించారు. -
చంద్రబాబు పాలనలో కల్తీ ప్రదేశ్గా మారిన రాష్ట్రం
సీటీఆర్ఐ: రాష్ట్రాన్ని కల్తీ ప్రదేశ్గా చంద్రబాబు ప్రభుత్వం మార్చుతోందని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి అన్నారు. ఆయన శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా బతకడం కోసం పాలు, నీరు తాగుతారన్నారు. కానీ రాష్ట్రంలో ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయన్నారు. అన్నీ కల్తీమయంగా మారుతున్నా రాష్ట్ర మంత్రులు క్రికెట్ ఆడుకుంటూ గడుపుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారన్నారు. నిందితుల ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏసీబీ అధికారులు శనివారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. జనవరి 29, 30 తేదీల్లో కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అఽధికారులు సోదాలు నిర్వహించి ఎస్ఆర్వో ఇప్పిలి లక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ మనం వీర వెంకట కృష్ణ, ఆఫీస్ సబార్డినేట్ కొమ్మన వీరబాబులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల ఇళ్లపై దాడులు చేసి పలు ఆధారాలు, ఆభరణాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్వో ఇప్పిలి లక్ష్మికి సంబంధించి కాకినాడలో ఫ్లాట్, జీ ప్లస్ వన్ భవనం డాక్యుమెంట్లు, 46 గ్రాముల బంగారం, రూ.10 లక్షలు విలువ చేసే గృహోపకరణాలు, వీరబాబు ఇంటిలో కొన్ని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై దర్యాప్తు కొనసాగుతుందని, అవినీతిపై టోల్ ప్రీ నెంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు. కులాంతర వివాహమే హత్యకు కారణం కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారు వేములపల్లిలో ఈ నెల 26 అర్ధరాత్రి జరిగిన పోలిపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావు హత్యకు ఆయన కులాంతర వివాహం చేసుకోవడమే ప్రధాన కారణంగా ప్రాథమిక విచారణలో తేలిందని రాజమహేంద్రవరం ఈస్ట్ డివిజన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. హత్య తాలూకు వివరాలను వివరాలను శనివారం మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఆమె వెల్లడించారు. వేములపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి సూర్యప్రకాశరావు, జెడ్.మేడపాడుకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అయినవిల్లి సంధ్య ఈ నెల 26న అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న విషయం విధితమే. కులాంతర వివాహం చేసుకోవడాన్ని సహించలేని సంధ్య సోదరులు అయినవిల్లి చంద్రపాల్, అయినవిల్లి గిరిబాబు ఒక పథకం ప్రకారమే వరుడు సూర్యప్రకాశరావును బండరాయితో కొట్టి హతమార్చారన్నారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కేసు విచారణలో చొరవతో కృషి చేసిన సీఐ పి.దొరరాజు, ఎస్సై కిశోర్లను డీఎస్పీ విద్య అభినందించారు. ఆన్లైన్లో రవాణా శాఖ సేవలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని వాహన వినియోగదారులందరికీ రవాణాశాఖ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా రవాణాధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ సారతిపరివాహన్ అనే వెబ్సైట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవలు, వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్, ఇతర సేవలు పొందవచ్చన్నారు. ప్రజలు నేరుగా ఆన్లైన్లో లేదా ప్రభుత్వం గుర్తింపు పొందిన మీ సేవ, ఈ సేవ, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రవాణాశాఖ సేవలకు ఎటువంటి దళారులను సంప్రదించొద్దని సూచించారు. కాగా.. జిల్లాలోని కొందరు వాహన డీలర్లు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల సందర్భంలో ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అటువంటి అక్రమ వసూళ్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వాహనదారులు సంబంధిత రశీదులతో జిల్లా రవాణాధికారి మొబైల్ నెంబర్ 92816 07020ను సంప్రదించాలన్నారు. -
మృత్యుపంజా
బాణసంచా...ఆరని జ్వాలలు.. వరుస విషాదాలువేట్లపాలెం బాణసంచా కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగలుసాక్షి ప్రతినిధి, కాకినాడ/సామర్లకోట/పిఠాపురం: సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం సంభవించిన భారీ విస్పోటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉలికిపాటుకు గురైంది. ప్రజలను తీవ్ర విషాదంలో నింపింది. ఈ దుర్ఘటనలో 20 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయా యి. మరో 11 మంది క్షతగాత్రులై ఆస్పత్రుల్లో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతులందరూ రోజు కూలిపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్న వారే కావడం విషాదం. ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విస్ఫోటం కావడమే కాకుండా.. మృతుల సంఖ్య రెండు పదులకు చేరుకోవడంతో అందరినీ కలచివేస్తోంది. బాధిత కుటుంబాల ఆవేదన బాణసంచా పేలుడులో 20 మంది నిరుపేదలైన కూలీలు మృతి చెందడంతో వేట్లపాలెం, గూడపర్తి, పెద్దాపురం, సామర్లకోట, మేడపాడు తదితర గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 8న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరంలో జరిగిన సంఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. నాటి దుర్ఘటనకు శ్రీగణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్ యాజమాన్యం సరైన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకపోవడమే కారణమని తేల్చారు. ఆ దుర్ఘటనకు కొనసాగింపా అన్నట్టుగా.. ఇప్పుడు వేట్లపాలెంలో పెను విషాదం చోటు చేసుకుంది. బతుకులు బుగ్గి బాణసంచా తయారీ కేంద్రాలు ప్రజల గుండెలపై కుంపటిగా మారాయి. ఈ కేంద్రాల్లో పని చేస్తున్న నిరుపేదల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గడచిన రెండేళ్ల కాలంలో జరిగిన రెండు విషాదకర సంఘటనలు జిల్లా ప్రజలను కలచివేశాయి. రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలే ఈ ప్రమాదాలకు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదం సంభవించినప్పుడు అధికారులు హడావుడి చేసి, ఆనక చేతులు దులుపేసుకోవడమే కొంప ముంచుతోందనే వాదన వినిపిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం, నిబంధనలు కఠినతరం చేయగలిగితే ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కావడానికి ఆస్కారం ఉండేది కాదంటున్నారు. నిబంధనలు కఠినతరం చేయాలి నిబంధనలు కఠినతరం చేయడం, నిరంతరం పర్యవేక్షించడం ద్వారానే బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాల నివారించడం సాధ్యమవుతుంది. పెను ప్రమాదం జరిగిన ఒకటి రెండు రోజులు అగ్నిమాపక అధికారులు హడావుడి చేయడం.. ఆనక గాలికొదిలేయడం పరిపాటి. జనం కూడా ఆ రెండు రోజులూ గుర్తుంచుకుని జాగ్రత్త పడి ఆనక మరచిపోతున్నారు. తాజాగా జరిగిన వేట్లపాలెం సంఘటనలోనూ ఇలానే జరుగుతుందని స్థానికులు అనుమానిస్తున్నారు. అప్పుడే కళ్లు తెరచి ఉంటే.. సాంకేతిక అంశాల ఆధారంగా ఇటువంటి దుర్ఘటనల కు కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఐదు నెలల క్రితం రాయవరంలో బాణసంచా దుర్ఘటన జరిగినప్పుడే కళ్లు తెరచి ఉంటే ఇప్పుడు వేట్లపాలెం ప్రమాదం చోటుచేసుకునేదే కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డ’ సామెత చందంగా క్షతగాత్రుల పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సంఘటన జరిగినప్పుడు చేస్తున్న హడావుడి ఆ తరువాత వీసమెత్తు కూడా కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో లోపాలను గుర్తించి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మృతదేహాలను తరలిస్తున్న అగ్నిమాపక సిబ్బందిమృతదేహాలను ఒకచోటకు చేరుస్తున్న స్థానికులు, ఫైర్ సిబ్బంది చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు వారి పరిస్థితి విషమంకాకినాడ క్రైం: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. సప్పా సత్య వెంకటలక్ష్మి (వేట్లపాలెం దుర్గానగర్), చిటికెల లక్ష్మి (కొత్తపేట రామాలయం వీధి), కాలేటి శ్రీను, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, దర్శిపాటి లోవరాజు, పల్లపాటి వీర శ్రీను (సామర్లకోట కుమ్మరి వీధి), మోర్తా శ్రీను (పెద్దాపురం) క్షతగాత్రుల్లో ఉన్నారు. శరీరాలు నూరు శాతం కాలిపోవడంతో వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీరిని అత్యవసర విభాగంలోని ఎంఎల్సీ, ట్రామా కేర్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుండెలవిసేలా క్షతగాత్రుల కుటుంబీకులు రోదించిన తీరు ఆస్పత్రిలోని వారిని కలచివేసింది. క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి, వారికందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన వెంట మంత్రులు కందుల దుర్గేష్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు, ఎంఎల్ఏలు నానాజీ, వెంకటేశ్వరరావు తదితరులున్నారు. అప్పటికప్పుడు ముస్తాబు వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్న కాకినాడ జీజీహెచ్లో వైద్య సేవల తీరు అస్తవ్యస్తంగా ఉంటోందనడానికి శనివారం నాటి పరిస్థితే ప్రత్యక్ష ఉదాహరణ. ఊహించని ఘటన కావడంతో ఆసుపత్రి అధికారులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఏం చేయాలో తోచని గందరగోళంలో ఉక్కిరిబిక్కిరి అ య్యారు. మీడియా తాకిడి, నాయకుల హడావుడి మొదలవడంతో ఎంఎల్సీ వార్డును అప్పటికప్పుడు ముస్తాబు చేసేశారు. పచ్చటి డిస్పోజబుల్ బెడ్షీట్లు పరిచేసి సిబ్బంది, యాప్రాన్లు, యూనిఫాంఽ ధరించి వైద్యులు హడావుడి పడ్డారు. తిరగని ఫ్యాన్లను తిప్పేందుకు, వెలగని లైట్లు వెలిగేంచేందుకు ఎలక్ట్రీషియన్ల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఎంఎల్సీ వార్డు సహా ఎమర్జెన్సీ ఆరు బయట అప్పటికప్పుడు పది లైట్లు బిగించారు.న్యాయం చేయాలి సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా పేలుడు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. వేట్లపాలెంలో పేలుడు జరిగిన బాణసంచా తయారీ కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు. పెద్ద సంఖ్యలో కార్మికులతో పని చేయిస్తూంటే.. ఎంత పెద్ద మొత్తంలో బాణసంచా తయారు చేస్తున్నారో గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఆయనకు వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ మేరకు జగన్ రెండు రోజుల్లో వేట్లపాలెంలో పర్యటించి, మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉబా జాన్మోజెస్, నెక్కంటి సాయిప్రసాద్, పార్టీ నాయకులు బంగారు కృష్ణ, నిడదవోలు సురేష్ చౌదరి, వల్లూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. ● గతేడాది రాయవరంలో బాణసంచా పేలుడు ● ఇప్పుడు వేట్లపాలెంలో మరోసారి ● వరుస ఘటనలతో భయాందోళన రాయవరం: బాణసంచా కాల్చినప్పుడు విరబూసే వెలుగులు ఆకాశాన్ని కమ్ముకుంటాయి. కానీ అదే బాణసంచాను తయారు చేసే కార్మికుల కుటుంబాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన కార్మికుల బతుకులు ముగిసిపోతున్నాయి. జువ్వల కాంతుల వెనుక అంధకార విషాదం దాగుంటోంది. ఉమ్మడి జిల్లాలో ఇటీవల వరసగా జరుగుతున్న ఈ ఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి. గతేడాది అక్టోబరు 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో జరిగిన దుర్ఘటనను మరువక ముందే ఫిబ్రవరి 28న సామర్లకోట మండలం వేట్లపాలెంలో సంభవించిన బాణసంచా పేలుడు భయాందోళనను కలిగించింది. మానని గాయం రాయవరంలో బాణసంచా తయారు చేస్తుండగా గతేడాది అక్టోబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తితో సహా నలుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు ఇద్దరు చనిపోయారు. అనంతరం రోజుల వ్యవధిలో మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మొత్తం 10 మంది మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. నాటి ఘటన తాలూకు గాయం ఇంకా మానక ముందే రాయవరం గ్రామానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేట్లపాలెంలో ఇటువంటి ఘటనే చోటు చేసుకోవడంతో బాణాసంచా తయారీ వెనుక ఉన్న భయంకర పరిస్థితిని మరోసారి గుర్తుకు చేసింది. మరుభూమి నాడు రాయవరంలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని చూస్తే యుద్ధం తర్వాత మరుభూమిని తలపించింది. ఘటనా స్థలం అంతా బూడిదగా మారి అందులో మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి చేరాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా యజమాని ఆచూకీ కనుగొన్నారు. అసలు ఇంత పెద్ద ఎత్తున బాణాసంచా తయారు చేస్తున్నప్పుడు ప్రతి రోజూ ఎవరెవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని అధికారులు తెలుసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ప్రమాదం జరిగిన తర్వాత 7.30 గంటల వరకు పూర్తిగా మృతదేహాలను గుర్తించలేక పోయారు. ప్రాణాలు తోడేస్తున్న మందుగుండు తయారీ కేంద్రాలు నాలుగు నెలల్లో రెండు భారీ విషాద సంఘటనలు పేదల బతుకులు బుగ్గిపాలవుతున్నా పట్టించుకోని సర్కారు కొరవడిన అధికారుల పర్యవేక్షణ గతేడాది రాయవరంలో 10 మంది మృత్యువాత ఇప్పుడు వేట్లపాలెంలో 20 మంది సజీవ దహనం హృదయ విదారకంగా.. దీపావళి, దసరా, సంక్రాంతి వంటి పండగలతో పాటు పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు, చివరకు శవయాత్రల్లో సైతం వేట్లపాలెం బాణసంచా కొనుగోలుకే మొగ్గు చూపే అభిమానులు తాజా విషాద సంఘటనతో హతాశులయ్యారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఘటనా స్థలిలో పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మృతుల ఫొటోలు, వీడియోలు హృదయ విదారకంగా ఉండటం చూసిన సామాన్యుల కళ్లు చెమ్మగిల్లాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమై తునాతునకలై తలో పక్కగా ఎగిరిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు తమవారు బతికున్నారో చనిపోయారో తెలియక తమవారు బతికుండేలా చూడు దేవుడా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకపక్క అధికారులు, సిబ్బంది మృతదేహాల భాగాలను పోగు చేస్తూంటే.. అందులో తమ వారెవరైనా ఉన్నారా అంటూ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి అక్కడ నెలకొంది. బాణసంచా తయారీ పనికి వెళ్లిన వారి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వారి జాడ కోసం కాలువలు, చెట్లు, పుట్టలు, పొలాల్లో వెతుక్కుంటూ కనిపించారు. సంఘటన స్థలానికి దూరంగా ఉన్న కాలువల్లోనూ మృతదేహాల భాగాలు దొరకడంతో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు గాలింపు చేపట్టారు.ఒక్కసారిగా పిడుగు పడినట్లు భారీ విస్ఫోటం.. పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటలు.. వ్యాపించిన దట్టమైన పొగ.. ఘటనా స్థలం నుంచి ఐదు కిలోమీటర్ల మేర వినిపించిన భారీ శబ్దాలు.. తునాతునకలైన శ్రామికుల దేహాలు.. ఇవీ సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించిన బాణసంచా తయారీ కేంద్రం వద్ద నెలకొన్న భయానక పరిస్థితులు. ఆనందోత్సవాలకు మరిన్ని కాంతుల్ని అద్దే ఆ నిరుపేద శ్రామికుల జీవితాలు క్షణాల్లో బూడిదకుప్పగా మారిపోయాయి. వేడుకల వేళ వెలుగులు విరజిమ్మే బాణసంచా తయారీయే వారి జీవితాల్లో చీకట్లు నింపేసింది. మృత్యుపంజా విసిరింది. వేయి నాల్కలు చాచిన అగ్నికీలల్లో కొందరు సజీవ దహనమైపోయారు. మరికొందరు కాలిన గాయాలతో ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. ఇంకొందరు ఆస్పత్రుల్లో కన్ను మూశారు. చంద్రబాబు వైఫల్యం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంతోనే ఉమ్మడి జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్ 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్లో జరిగిన మందుగుండు సామగ్రి పేలుడు ఘటన నుంచి ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాన్ని నేర్చుకోలేదు. ఆ ఘటనను తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ దుర్ఘటన పునరావృతం అయ్యేది కాదు. రాయవరం ఘటనపై వేసిన కమిషన్ దర్యాప్తు మాటలకే పరిమితం కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ భద్రతను విస్మరించిన ప్రభుత్వం చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు. ఆయన వైఫల్యాలే ప్రజల పాలిట శాపాలుగా మారాయి. బాణసంచా తయారీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా అనుమతులు ఇవ్వడంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వేట్లపాలెం ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ రూ.కోటి పరిహారం ప్రకటించాలి బాణసంచా పేలుడులో అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – చింతా అనురాధ, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రూ.కోటి పరిహారం ఇవ్వాలి వేట్లపాలెం బాణసంచా మృతులు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున గాయపడిన వారికి రూ.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. లేబర్ కోడ్ల పేరుతో అధికారుల తనిఖీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం వల్లనే బాణసంచా పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణమైన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. – దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు -
చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు
సఖినేటిపల్లి: ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ వివరాల ప్రకారం.. అంతర్వేది రాంబాగ్ వద్ద శనివారం సఖినేటిపల్లికి చెందిన ఓ స్కూల్ బస్సు ప్రధాన రహదారి మార్జిన్లో కొబ్బరి చెట్టును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు ఉండగా, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సును డ్రైవర్ కాకుండా క్లీనర్ డ్రైవ్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గాయాలైన విద్యార్థులను సమీప ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
నూరేళ్లూ చల్లగా ఉండాలని..
ఫ చల్లని వివాహ వేదికలకు క్రేజ్ ఫ ఏసీ కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఫ ఖర్చుకు వెనుకాడని పెళ్లి బృందాలు రాయవరం: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్లంటే ఇలానే మాట్లాడే వారు. ఫలానా వారి తోటలో కొబ్బరాకులు, పూలంటూ పురమాయించేవారు. ఇంటి వద్దే చలువ పందిళ్లు, మండపాల ఏర్పాటుతో ఐదు రోజుల పాటు చేసే పెళ్లిని పది కాలాల పాటు చెప్పుకొనేవారు. మళ్లీ ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేస్తూనే.. హంగూ ఆర్భాటాలు, అంగరంగ వైభోగాలతో దక్షిణాది సంప్రదాయానికి ఉత్తరాది మెరుగులు అద్ది, ఖర్చుకు వెనుకాడకుండా జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఏసీ కల్యాణ మండపాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జాబితా తయారీలో వధూవరులు పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? ఏ మండపంలో చేయాలి.. మెనూ ఏంటనేది వధూవరులే ఓ పెద్ద జాబితా తయారు చేసుకుంటున్నారు. జీవితకాలం గుర్తుండి పోయేలా వివాహాన్ని చేసుకోవాలని ఆశించే వధూవరులు పెళ్లికి వచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యుల రాకను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఏసీ కల్యాణ మండపంలోనే చేసుకోవాలని భావిస్తున్నారు. వాటి అద్దె, లంచ్, డిన్నర్, అలంకరణకు కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చేస్తున్నారని రాయవరం గ్రామానికి కల్యాణ మండపం నిర్వాహకుడొకరు చెప్పారు. ముందుగానే బుకింగ్ వివాహం నిశ్చయమైన వెంటనే ముందుగా పెళ్లి ఎక్కడ చేయాలనే దానిపై అధికంగా చర్చించుకుంటున్నారు. ఆలయాల వద్ద కాకుంటే కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఇస్తూ.. వెంటనే మండపాల బుకింగ్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల ముందుగా మండపం బుక్ చేసుకోకుంటే దొరకని పరిస్థితి ఉంది. విదేశాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అద్దె రెట్టింపు ఇస్తామని ఫోన్లు చేసి అడుగుతున్నారని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. పల్లెల్లో సైతం.. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడంటూ వివాహ వేడుకలకు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో పల్లెల్లో సైతం కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు కొత్త భవనాలను నిర్మిస్తుంటే.. మరికొందరు పాత భవనాలను కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఏ చిన్న శుభ కార్యం చేయాలనుకున్నా.. సమావేశాలు నిర్వహించాలనుకున్నా.. ఏసీ కల్యాణ మండపాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికల్లో సైతం ఏసీ కల్యాణ మండపం అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నారు. వచ్చిన బంధువులు, స్నేహితులు అధిక సమయం ఉండాలంటే ఏసీ కల్యాణ మండపాలే ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న కల్యాణ మండపాల్ని ఏసీ కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఆర్భాటానికే ప్రాధాన్యం ఓ కల్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమారుడికి ఇటీవల పెళ్లి జరిపించారు. సుమారు 10 రకాల స్వీట్లు, నాలుగైదు రకాల స్పెషల్ రైస్, ఆకుపై 20 రకాల కూరలు (పొడులు, పచ్చళ్లతో కలిపి) ఉండాలని చెప్పారు. 2 వేల మందికి ఆర్డర్ ఇచ్చారు. ప్లేటు రూ.500 అయ్యిందని కల్యాణ మండపం నిర్వాహకుడు చెప్పారు. ఒక్క భోజనాలకే ఖర్చు రూ.10 లక్షలు అయ్యిందని చెప్పుకొనే విధంగా చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద, చిన్న కలిపి 200 వరకూ కల్యాణ మండపాలున్నాయి. అతి పెద్ద ఏసీ మండపమైతే అద్దె రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటోంది. భోజనాలకు మెనూను బట్టి ఆకుపై వేసిన రకాలను బట్టి రూ.300 నుంచి 450 వరకూ పడుతుంది. ఇక కల్యాణ మండపంలో పచ్చిపూల మండపం ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల నుంచి నుంచి తీసుకొచ్చిన పూలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణకు మరో రూ.లక్షన్నర వరకూ పెడుతున్నారు. ఇవి కాకుండా బాజాభజంత్రీలకు ఖర్చులు అదనం. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
బీవీసీలో ముగిసిన యువజనోత్సవం అమలాపురం రూరల్: అమలాపురం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి యువజనోత్సవం మయూక–2026 ఘనంగా ముగిసింది. రెండో రోజు శనివారం జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ మేనేజ్మెంట్ విభాగాల్లో వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు రూ. 5 లక్షల విలువైన నగదు బహుమతులు, ట్రోఫీలను కళాశాల చైర్మన్ బోనం కృష్ణ సతీష్, బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలకి్ష్మ్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో బీవీసీ ఓడలరేవు ప్రథమ స్థానం, కిమ్స్ అమలాపురం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాస్కెట్ బాల్లో సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ ప్రథమ, ఆదిత్య డిగ్రీ కళాశాల ద్వితీయ, త్రోబాల్ మహిళా విభాగంలో బీవీసీ ఓడలరేవు ప్రథమ, బీవీసీ భట్లపాలెం ద్వితీయ స్థానాలు, కోకో మహిళా విభాగంలో సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రథమ, బీవీసీ భట్లపాలెం ద్వితీయ స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జేవీసీ రామారావు తెలిపారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల బృందం ఆలపించిన పాటలు అలరించాయి. బ్యాండు మేళం సినీ బృందం, హీరోయిన్ శ్రీదేవి, హీరో రోషన్, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు సతీష్ పాల్గొని సందడి చేశారు. బీవీసీ గ్రూప్ అధినేత బోనం కనకయ్య, ప్రిన్సిపాల్స్ మహేశ్వర దత్తు, టీవీ జనార్దనరావు, మయూక కన్వీనర్లు కె.శ్రీనివాస్, బీఎస్ఎస్ ఫణిశంకర్, క్రీడా, సాంస్కృతిక విభాగాల కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జక్కం కృష్ణారావు పాల్గొన్నారు. -
బడ్జెట్ అధికమైనా తప్పదు
ఏ శుభకార్యమైనా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నాం. ఇటీవల మా మనమరాలి ఓణీ ఫంక్షన్ను ఏసీ కల్యాణ మండపంలోనే నిర్వహించాం. ఒకప్పటి పరిస్థితికి, నేటి పరిస్థితికి చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా శుభకార్యాలు చేయాల్సిందే. –ద్విభాష్యం విజయప్రభాకర్, విశ్రాంత ఉద్యోగి, రాజమహేంద్రవరం ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు ఏ కార్యక్రమమైనా ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థిక పరిస్థితిని వెరవకుండా ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నారు. నాన్ ఏసీ అయితే ఏసీ కా దా.. అంటూ వచ్చిన వారు పెదవి విరుస్తున్నారు. –కొప్పిశెట్టి శ్రీనివాస్, వ్యాపారి, రాజమహేంద్రవరం డిమాండ్ ఎక్కువగానే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్యాణ మండపాలకు డిమాండ్ అధికంగానే ఉంది. రైస్ మిల్లును కల్యాణ మండపంగా మార్చాం. ముహూర్తాల సమయంలో డిమాండ్ మరింత అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటున్నారు. –మూర్తినీడి వెంకటరాజు, కల్యాణ మండపం నిర్వాహకుడు, రాయవరం -
దాడి.. ఆపై దోపిడీ
అంబాజీపేట: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసుతో గుర్తుతెలియని వ్యక్తి పరారయ్యాడు. అంబాజీపేట ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన ర్యాలి సత్యనారాయణ ఇంట్లో అతని అత్తయ్య దేవగుప్తపు లక్ష్మి నివాసం ఉంటున్నారు. శనివారం తెల్లవారు జామున ఇంటి ఆవరణలో ఉన్న బాత్రూమ్కి వెళ్లి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె తలపై గాయపరిచాడు. అనంతరం లక్ష్మి మెడలో ఉన్న 9 గ్రాముల బంగారు గొలుసుతో పరారయ్యాడు. సమీపంలో నివాసముంటున్న అతని అల్లుడు సత్యనారాయణకు జరిగిన సంఘటనను లక్ష్మి వివరించింది. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, ఎస్సై కె.చిరంజీవిలు పరిశీలించారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
విషమిస్తున్న కల్తీ పాల బాధితుల ఆరోగ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి రాజమహేంద్రవరం లోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతోంది. డయాలసిస్ చేయించుకుంటున్నా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తోంది. కిమ్స్ బొల్లినేని, రెయిన్బో చి్రల్డన్ ఆస్పత్రి, డెల్టా, రవి చైతన్య కిడ్నీ కేర్, రాక్ ఆస్పత్రుల్లో 15 మంది కల్తీ పాల బాధితులకు వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం శనివారం రాజమహేంద్రవరం వచ్చింది. అత్యవసర చికిత్స పొందుతున్న వారిని పరీక్షించి, ఇప్పటివరకూ అందించిన చికిత్స వివరాలు అడిగి తెలుసుకుంది. బాధితులకు ప్రస్తుతం అందిస్తున్న చికిత్స కంటే మెరుగైన చికిత్స అందించడానికి ఏమీ లేదని బృందం చేతులెత్తేసింది. హైదరాబాద్ కిమ్స్ సీనియర్ కన్సల్టెంట్లు డాక్టర్ సుభాష్ కౌల్ (న్యూరాలజీ), డాక్టర్ వెంకట కృçష్ణ చైతన్య కొడూరి (న్యూరాలజిస్ట్), అపోలో ఆస్పత్రి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ క్రాంతికుమార్, ఏఐజీ ఆస్పత్రి డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ డాక్టర్ ఆదర్శ్ సింగంశెట్టి ఈ బృందంలో ఉన్నారు. -
నిలదీసిన భర్తను నరమేధం చేసిన ప్రియుడు..!
తూర్పు గోదావరి జిల్లా: పెళ్లి బంధం ఎగతాళి అయ్యింది.. భార్య అక్రమ సంబంధానికి మూడుముళ్లు వేసిన భర్తే బలైపోవాల్సి వచ్చింది.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో నిలదీసిన భర్తను, ప్రియుడు దారుణంగా హత్యచేసిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంటకు చెందిన బక్కా నాగేంద్ర (32) భార్య వీరలక్ష్మితో రంగంపేట మండలం నల్లమిల్లికి చెందిన తోరాటి శివ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై నాగేంద్ర, వీరలక్ష్మి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన భార్య వీరలక్ష్మితో కలసి శివ ఉండటాన్ని నాగేంద్ర చూశాడు. ఆగ్రహానికి గురైన నాగేంద్ర.. శివను నిలదీయడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాట మాట పెరిగి గొడవ పడుతూ పక్కనే ఉన్న పంట బోదె వరకూ వచ్చేశారు. ఈ నేపథ్యంలో శివ బలమైన ఆయుధంతో నాగేంద్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నాగేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం కొద్దిపాటి గాయాలైన శివ కూడా పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా నాగేంద్ర మరణం వెనుక భార్య వీరలక్ష్మి, అత్త హస్తం కూడా ఉందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అనపర్తి సీఐ సుమంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి భార్య పాత్రపై వస్తున్న ఆరోపణలను కూడా విచారిస్తున్నామని సీఐ తెలిపారు. నిందితులకు తగిన శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుని కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.ఎన్నడూ లేని విధంగా హత్యలు, దాడులు : మాజీ ఎమ్మెల్యేపెద్ద దొడ్డిగుంట గ్రామంలో హత్య జరిగిన ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సందర్శించి, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలిచిన క్షణం నుంచే హత్యలు, దాడులు, మానభంగాలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. ఇటీవల పందలపాక, రంగాపురంలలో మహిళల హత్య, అదే గ్రామంలో బాలికపై అత్యాచారయత్నం, ఇప్పుడు దొడ్డిగుంటలో హత్య.. ఇవన్నీ కూటమి పాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనాలు అని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండ ఉందన్న ధైర్యం పెరిగిందని, నేరస్తులకు స్టేషన్ బెయిల్లు, బాధితులకు శిక్షలు పడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. నిందితుడు తోరాటి శివను, అతని బైకును రంగంపేట పోలీస్ స్టేషన్కు హత్యకు గురైన బక్క నాగేంద్ర అప్పగించినప్పటికీ, ఎస్సై కేసు నమోదు చేయకుండా అతనిని విడిచిపెట్టారని, అదే నిర్లక్ష్యం ఈ రోజు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని అని సూర్యనారాయణరెడ్డి అన్నారు. బిక్కవోలు, రంగంపేట మండలాల ఎస్సైలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏరికోరి తెచ్చుకున్నారని అన్నారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట ఎస్సై శివప్రసాద్పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనపర్తి నియోజకవర్గంలో నేరస్తులకు రాజకీయ అండ, పోలీసుల నిర్లక్ష్యం పెరిగి, ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని అన్నారు.ఎస్సైపై చర్యలకు డిమాండ్వివాహేతర సంబంధంపై ఈ నెల 6న రంగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మృతుడి నాగేంద్ర తండ్రి బక్కా వెంకటేశులు, తల్లి లక్ష్మి, చిన్నాన్న బక్కా వీర్రాజు, చిన్నమ్మ మంగ, సోదరుడు వీరబాబు తెలిపారు. ఫిర్యాదు చేయడంతో పాటు అక్రమ సంబంధం నడుపుతున్న తోరాటి శివకు సంబంధించిన బైక్ను కూడా పోలీస్ స్టేషన్లో అప్పగించి న్యాయం చేయమని ఎస్సై శివప్రసాద్ను వేడుకున్నామన్నారు. అయినా ఎస్సై పట్టించుకోలేదని, నిందితుడు శివ వద్ద లంచం తీసుకుని తాము అప్పగించిన బైక్ను కూడా ఇచ్చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో మరింత రెచ్చిపోయిన శివ విచ్చలవిడిగా వీరలక్ష్మి వద్దకు వచ్చేవాడని, తాము ఫిర్యాదు చేసినప్పుడే శివపై చర్యలు తీసుకుని ఉంటే తమ బిడ్డ బతికి ఉండేవాడని వాపోయారు. సంఘటనా స్థలం వద్దకు వచ్చిన సీఐ సుమంత్, డీఎస్పీ విద్య వద్ద కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసి ఎస్సై శివప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన చర్యలు తీసుకుంటామని వారికి సీఐ, డీఎస్పీ హామీ ఇచ్చారు. -
అన్నదాన పథకానికి విరాళాలు
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన పథకానికి పలువురు వివరాలు సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన నడింపల్లి కృష్ణ సూర్యవర్మ, కుటుంబ సభ్యులు రూ.లక్ష, ఈతకోటకు చెందిన కలిదిండి సాయిమణికంఠ, వెంకట కాశి హర్షిత్వర్మ రూ.50 వేలు, విశాఖపట్నం పెందుర్తి వాస్తవ్యులు మహాదేవ్ కార్తికేయ కుటుంబ సభ్యులు రూ.30 వేలు విరాళాలు అందించారు. దాతలకు స్వామివారి పటాలను అధికారులు, పాలకవర్గ సభ్యులు అందించారు. కల్తీ పాలను గుర్తించడంపై అవగాహనఅమలాపురం టౌన్: పాలు కల్తీ అయ్యాయో లేదో ఇంట్లోనే తెలుసుకోవడానికి సులభమైన కొన్ని పరీక్షలను అమలాపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు (ఏడీఏ) డాక్టర్ ఎల్.విజయరెడ్డి వివరించారు. స్థానిక పద్మినీ పేట ప్రాంతంలోని వీరన్న డైరీ వద్ద పాడి రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. నీటి శాతం, స్టార్చ్, యూరియా, డిటర్జెంట్ వంటి కల్తీలను సులభంగా పరీక్షించవచ్చని సూచించారు. తాజా పాలు తెల్లగా, చిక్కగా ఉండి ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆ పాలు మంచివని నిర్ధారించవచ్చన్నారు. ఇంట్లోనే పాలు నాణ్యతను పరీక్షించే విధానాలను ఆయన ఆయా పరికరాలతో ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. వాటర్, షేక్ టెస్ట్లు తదితర విధానాలను వివరించారు. తాజా పాలు మంచి సువాసన కలిగి ఉంటాయని, రసాయనాల వాసన రావని తెలిపారు. పాలు మరిగించినప్పుడు ఆ పాలు కల్తీ స్వభావం బయట పడుతుందన్నారు. సింథటిక్ పాలను మరిగించినప్పుడు నురగ వచ్చి మీగడ ఏర్పదని విజయరెడ్డి వివరించారు. -
బ్రెయిలీ నాణేల సేకరణలో అవార్డు
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన అంధురాలు, వాకర్స్ జోన్ చైర్పర్సన్ పుత్సా రాజేశ్వరి నాణేల సేకరణలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ –2026 సొంతం చేసుకున్నారు. లూయిస్ బ్రెయిలీ నాణేల సేకరణలో ఈ అవార్డుకు అర్హత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా బెల్జియం, బ్రెజిల్, ఈక్వెడార్, ఐల్ ఆఫ్ మ్యాన్, ఇటలీ, పోలెండ్, థాయ్లాండ్, అమెరికా దేశాలతో పాటు మన దేశానికి సంబంధించి 2009లో బ్రెయిలీ ముఖ చిత్రంలో విడుదలైన రూ.2, రూ.100తో పాటు మొత్తం పది దేశాలకు చెందిన 14 నాణేలను సేకరించడం ద్వారా ఆమె ఈ రికార్డు పొందారు. రాజేశ్వరి అవార్డు సాధించడం పట్ల వాకర్స్ జిల్లా గవర్నర్ తోలేటి సూర్యనారాయణ, సంస్కార భారతి జిల్లా అధ్యక్షురాలు శ్రీగిరి పద్మావతి, నాణేల సేకరణకర్తలు నడంపల్లి రామరాజు, ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం, పి.వెంకటనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన లిమ్కా బుక్ ఆఫ్ అవార్డును చూపుస్తున్న రాజేశ్వరి -
పుష్కరాలకు రైల్వే శాఖ సిద్ధం కావాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు రైల్వే శాఖ ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. పుష్కరాలకు రైల్వే శాఖ ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై తన క్యాంపు కార్యాలయంలో ఆమె శుక్రవారం విస్తృతంగా సమీక్షించారు. సాధారణ యాత్రికులకు సౌకర్యాలు, పుష్కర్ నగర ఏర్పాట్లు, టికెట్ల జారీ విధానం, యాత్రికుల రాకపోకల నిర్వహణ, విభాగాల వారీ సమన్వయం వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. 2003, 2015 పుష్కరాల సందర్భంగా వచ్చిన భక్తుల సంఖ్య, వివిధ మార్గాల ద్వారా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో నడిపిన రైళ్ల వివరాలను పరిశీలించారు. వచ్చే పుష్కరాలకు రైళ్లలో ప్రతి రోజూ సగటున 5.50 లక్షల మంది యాత్రికులు వస్తారనే అంచనాతో అదనపు రైళ్ల ప్రతిపాదనలు, అవసరమైన ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, నిఘా వ్యవస్థ బలోపేతం, సాధారణ టికెట్ల జారీకి అదనపు బుకింగ్ కౌంటర్ల ఏర్పాటు, అదనపు సిబ్బంది నియామకం, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై విభాగాల వారీగా అధికారులు వివరాలు సమర్పించారు. విజయవాడ జోన్ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ షణ్ముఖ వడివేల్ ఎస్ గత పుష్కరాల గణాంకాలను వివరించారు. 2003లో 13 రోజుల వ్యవధిలో మొత్తం 20.29 లక్షల మంది, 2015లో 15 రోజుల్లో 39.31 లక్షల మంది రైళ్ల ద్వారా రాకపోకలు సాగించారన్నారు. వచ్చే పుష్కరాలకు 12 రోజుల వ్యవధిలో సుమారు 64 లక్షల మంది రాకపోకలు సాగించవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ అధికంగా ఉండే అవకాశముంటుందని చెప్పారు. అదనపు ప్రత్యేక రైళ్లు నడపడం, ప్లాట్ఫామ్ల విస్తరణ, ప్రయాణికుల మార్గదర్శక సూచికల ఏర్పాటు, రైల్వే స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళికను వివరించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ, భద్రతా వ్యవస్థీకరణపై చర్చించారు. రైల్వే స్టేషన్లు, పుష్కర్ ఘాట్లు, ముఖ్య కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాల మోహరింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రత్యేక నియంత్రణ గదుల ఏర్పాటు, టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
నిడదవోలు: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన పెదపాటి సాయికిరణ్ (20) తాడేపల్లిగూడెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. రోజూ కళాశాల బస్సులో వెళ్లే సాయికిరణ్ శుక్రవారం నిర్వహించిన కళాశాల ఫెస్ట్కు ఇంటి నుంచి స్నేహితులతో కలసి బైక్పై వెళ్లాడు. అది పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో నిడదవోలు బసివిరెడ్డిపేటలో ఆర్ఓబీ నిర్మాణంలో భాగంగా భారీ వాహనాలు రాకుండా అధికారులు రోడ్డుకు అడ్డంగా మట్టి దిబ్బలను ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నిలువరిస్తున్నారు. అయితే ద్విచక్ర వాహనాలు మాత్రం రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలు రాకుండా బట్టి దిబ్బలు వేయడం, రాత్రి సమయంలో చీకటిగా ఉండటంతో విద్యార్థి సాయికిరణ్ మట్టి దిబ్బలను దాటించే క్రమంలో అదుపుతప్పి బైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మార్కొండపాడు గ్రామానికి చెందిన పెదపాటి శ్రీనివాస్, ఇంద్ర దంపతులకు ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడు సాయికిరణ్. కాగా రెండో కుమారుడు బాలు ఇంటర్ వరకు చదివి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. పెదపాటి శ్రీనివాస్ చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పెద్ద కుమారుడు సాయికిరణ్ను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. విషయం తెలుసుకున్న సాయికిరణ్ సోదరుడు బాలు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అన్నా లేరా.. అమ్మ తిడుతుందిరా.. వెళ్లిపోదాం అంటూ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. -
నమో భగవతే నారసింహాయ
● కన్నుల పండువగా కోరుకొండ లక్ష్మీనరసింహుని కల్యాణోత్సవం ● వైభవంగా రథోత్సవం ● వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం మధురపూడి: నమో భగవతే నారసింహాయ.. అంటూ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామిని భక్తజనం కొలిచింది. స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల సందర్భంగా శుక్రవారం కోరుకొండలో ఆధ్యాత్మిక కెరటం ఎగసిపడింది. గోవింద నామస్మరణ గ్రామమంతటా ప్రతిధ్వనించింది. బుగ్గన చుక్క.. పట్టు వస్త్రాలతో సర్వాలంకాలర భూషితులైన స్వామివారి పరిణయ మహోత్సవాన్ని కన్నులారా తిలకించిన భక్తులు ఆనందంతో పులకించిపోయారు. కోలాహలంగా రథోత్సవం స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే కోరుకొండకు తరలివచ్చారు. పలువురు భక్తులు ఉదయమే స్వామివారి కోనేటిలో పుణ్యస్నానమాచరించారు. అక్కడి నుంచి కొండపై స్వయంభువుగా కొలువుదీరిన స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.54 గంటలకు అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను రథంపై వేంచేయించారు. అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. కొండ వద్ద ప్రారంభమైన రథోత్సవం దేవస్థానం రోడ్డు, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్డీలపేట, మత్స్యకారులవాడ, సాయిబాబా గుడి, అంకాలమ్మవారి గుడి, శివాలయం మీదుగా సాగింది. గరగ నృత్యాలు, బ్యాండ్మేళాలు, కోలాటం, తీన్మార్, శక్తి వేషధారణలు, కేరళ చండా వాయిద్యాలతో రథోత్సవం ఆద్యంతం కోలాహలంగా జరిగింది. దారి పొడవునా భక్తులు రథం పైకి అరటి పండ్లు వేస్తూ భక్తితో స్వామికి మొక్కారు. సాయంత్రం 5.40 గంటలకు రథోత్సవం తిరిగి ఆలయానికి చేరింది. అనంతరం, మేళతాళాలతో స్వామి, అమ్మవార్లను ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. దీంతో, రాజమహేంద్రవరం – గోకవరం మార్గంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. రథంపై కొలువుదీరిన స్వామివారిన వైఎస్సార్ సిపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దర్శించుకున్నారు. అంతకు ముందు కొండపై కొలువుదీరిన స్వామి వారిని కూడా ఆయన దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, అదనపు ఎస్పీ చెంచురెడ్డి, నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, సీఐ మూర్తి, ఎస్సై ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అంగరంగ వైభవంగా... శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవం రాత్రి 9 గంటలకు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత వధూవరులకు శాస్త్రోక్తంగా మంగళస్నానాలు నిర్వహించారు. అనంతరం, దేవస్థానం కల్యాణ మండపంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్కుమార్ ఆచార్యులు కల్యాణ క్రతువు నిర్వహించారు, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్పీ రంగరాజ భట్టర్, అర్చకుల పర్యవేక్షణలో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. రెడ్డి పంతులు సత్రంలో అన్నసమారాధన స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా స్థానిక విరియాల రెడ్డిపంతులు సత్రంలో ఐదు రోజుల పాటు నిర్వహించే అన్న సమారాధన శుక్రవారం ప్రారంభమైంది. అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈదర సుబ్బారావు, సత్రం ఈఓ లక్ష్మీకుమార్, కోరుకొండ సర్పంచ్ లక్ష్మీ సరోజ తదితరులు అన్నసమారాధనను పర్యవేక్షించారు.రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రథోత్సవంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
బీవీసీలో కెవ్వు కేక..
అమలాపురం రూరల్: మయూక 2026 జాతీయ స్థాయి యువజనోత్సవాల ప్రారంభంతో భట్లపాలెం బీవీసీ కళాశాలలో సందడి నెలకొంది. కుర్రకారు ఆటపాటలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా కేరింతలు కొట్టి హోరెత్తించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి విద్యార్థుల జోష్తో కెవ్వు కేకలా కనిపించింది. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తొలిరోజు పోటీలను డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బోనం సతీష్ మాట్లాడుతూ విద్యతో పాటు యువజనోత్సవాలతో విద్యార్థులకు నూతన ఉత్సాహం వస్తుందన్నారు. వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీలను బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలక్ష్మి పర్యవేక్షించారు. ఈ పోటీలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన రిఫరీలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనా జైస్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రీడా పోటీలు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు దృఢ సంకల్పంతో సాగితే విజయం వరిస్తుందని ఉద్బోధించారు. విద్య నేర్పిన గురువును ఎన్నడూ మర్చిపోవద్దు.. ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు.. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు.. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు.. అవసరం తీరాక సహాయపడిన నేస్తాన్ని మరిచిపోవద్దని విద్యార్థులను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం ఆలోచింపజేసింది. అనంతరం పలు రకాల బైక్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బీవీసీ విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జేవీజీ రామారావు, మయూక కన్వీనర్లు డాక్టర్ కె.శ్రీనివాస్, బీఎస్ఎస్ ఫణిశంకర్, క్రీడా, సాంస్కృతిక విభాగాల కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జక్కం కృష్ణారావు పాల్గొన్నారు. -
రేపు అపెక్స్–కేఎస్పీఎల్ మారథాన్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ‘ఆమె భద్రత–మన బాధ్యత’ అనే నినాదంతో అపెక్స్–కాకినాడ సీపోర్ట్స్ (కేఎస్పీఎల్) మారథాన్–2026 నిర్వహిస్తున్నట్లు కాకినాడ రన్నర్స్ ట్రస్టు ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ సుధా కేశవరాజు తెలిపారు. ఎన్టీఆర్ బీచ్ నుంచి ఉప్పాడ వరకూ 4 కేటగిరీల్లో ఈ మారథాన్ రన్ జరుగుతుందన్నారు. ఈ రన్కు సంబంధించిన మెడల్స్, టీ–షర్ట్స్ ఆవిష్కరణ, కార్యక్రమ నిర్వహణ సన్నాహక సమావేశం స్థానిక జీఆర్టీ గ్రాండ్ హెూటల్లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా సుధా కేశవరాజు మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 5.30 గంటలకు మారథాన్ రన్ ప్రారంభమవుతుందని తెలిపారు. తొలుత 21.1 కిలోమీటర్ల పరిధికి, 6 గంటలకు 10 కిలోమీటర్లకు ఆఫ్ మారథాన్, 6.30 గంటలకు 5 కిలోమీటర్లకు మారథాన్, అదే సమయానికి 3 కిలోమీటర్ల ఫన్ రన్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి దాదాపు 1,500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మారథాన్ రన్లో పాల్గొనే వారి కోసం, హైడ్రేషన్, వైద్య సహాయం, రెడ్క్రాస్ వలంటీర్ల సహకారంతో పాటు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. మారథాన్ రేస్ డైరెక్టర్, కాకినాడ రన్నర్స్ ట్రస్టీ కమాండెంట్ ఎన్ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మారథాన్ రన్ను 50 ఏళ్లలోపు ఓపెన్ కేటగిరీలోను, 50 ఏళ్లు పైబడిన వారికి వెటరన్ కేటగిరీలోను నిర్వహిస్తామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని చెప్పారు. ఈ మారధాన్ ఎనిమిదోసారి ఇక్కడ జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కేఎస్పీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్ల మురళీధర్, అపెక్స్ సంస్థ ప్రతినిధి మాధవి, సంకురాత్రి ఫౌండేషన్ రమణమూర్తి, జీఆర్టీ గ్రాండ్ జీఎం రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎన్ఎం పరీక్షల్లో అవకతవకలపై విచారణ పూర్తి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జీజీహెచ్లో నిర్వహించిన జీఎన్ఎం నర్సింగ్ పరీక్షల్లో జరిగిన అవినీతిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ శుక్రవారం విచారణ చేపట్టింది. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఆర్ఎంసీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మునిరత్నమ్మ, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ల ఆధ్వర్యాన రాజమహేంద్రవరం జీజీహెచ్లోని నర్సింగ్ సూపరింటెండెంట్ చాంబర్లో 44 మందిని విచారించారు. వీరందరికీ 25 ప్రశ్నలు ఇచ్చారు. లంచాలు వసూలు చేసి కాపీయింగ్ నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ జీజీహెచ్ నర్సింగ్ స్కూల్ ట్యూటర్ సుజాత, ఒంగోలు నర్సింగ్ స్కూల్ ట్యూటర్ మాధవీలతలకు 50 ప్రశ్నలతో పత్రాలు ఇవ్వడంతో పాటు పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పరీక్షలు అయిన తర్వాత కూడా సుజాత పలు నర్సింగ్ స్కూళ్లకు ఫోన్లు చేసి డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని గుర్తించారు. విచారణకు ముందు నిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీ బృందం ప్రైవేటు నర్సింగ్ స్కూళ్ల నుంచి వివరణలు సేకరించింది. ఆయా ప్రిన్సిపాళ్లతో మాట్లాడి, డబ్బు చెల్లించిన ఆధారాలు సేకరించారు. అలాగే, ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి సుజాత బృందం పరీక్షల కాలమంతా ఆహారం, వసతి ఏర్పాటు వరకూ ప్రయోజనాలు పొందారని కమిటీ గుర్తించింది. థియరీ పరీక్షలతో పాటు అంతకు ముందు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఓఎస్డీలు సుజాత, మాధవీలతలతో పాటు పలువురు అధికారులను కూడా లోతుగా విచారించారు. ప్రతి ఒక్కరి నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 7 గంటల వరకూ సాగింది. ఇద్దరు స్టాఫ్ నర్సులు సహా మరో ఇద్దరు నాలుగో తరగతి ఉద్యోగులు వివిధ కారణాలతో ఈ విచారణకు హాజరు కాలేదు. పరీక్షల నిర్వహణకు ఏమాత్రం సంబంధం లేని పలువురు ఉద్యోగుల్ని విచారించడం వివాదానికి దారి తీసింది. విచారణ నివేదికను రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు సమర్పిస్తామని కమిటీ చైర్పర్సన్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు. అంతకు ముందు విచారణలో భాగంగా పరీక్షలు నిర్వహించిన హాళ్లతో పాటు నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో రహస్య సమావేశం నిర్వహించిన ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు. -
గళమెత్తుతూ.. కదం తొక్కుతూ..
● అంగన్వాడీల సమరభేరి ● ఉద్యోగ భద్రత కల్పించాలి ● కనీస వేతనాలు రూ.26 వేలకు పెంచాలి ● హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి ● యాప్ల భారం తగ్గించాలి ● డిమాండ్ల సాధనకు పోరుబాట ● మార్చి 2న మహాధర్నా దిశగా అడుగులు సాక్షి, రాజమహేంద్రవరం: అధికారం దక్కించుకునేందుకు అరచేతిలో వైకుంఠం చూపించి.. తీరా గద్దెనెక్కాక తమను నిలువునా వంచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై అంగన్వాడీలు సమరభేరి మోగించారు. ఇప్పటికే వివిధ స్థాయిల్లో దశల వారీ ఆందోళనలు చేపట్టి, గళమెత్తి తమ సమస్యలు వినిపించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో.. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా వచ్చే నెల 2న విజయవాడలో మహాధర్నా నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. బాలలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పసి పిల్లలు, గర్భిణులు, బాలింతల సంరక్షణ, పౌష్టికాహారం పంపిణీ వంటి కార్యక్రమాల నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్నారు. అంగన్వాడీ విధులకు తోడు ప్రభుత్వం వీరిపై ఇతర భారాలు సైతం మోపుతోంది. గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ అధికారులుగా ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పనులు సైతం వీరికి అప్పగిస్తోంది. ఇంతగా శ్రమిస్తున్న తమపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతోందని, కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఇతర పనులు అంటగట్టి వేధిస్తోందని అంగన్వాడీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అంగన్వాడీలకు అనేక హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత షరా మామూలుగానే వాటిని తుంగలో తొక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సమరభేరి మోగిస్తున్నారు. కనీస వేతనాలేవీ.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా 8 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 1,798 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 24,879 మంది చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నారు. మొత్తం 43,259 మంది పిల్లలు, 16,926 మంది గర్భిణులు, బాలింతలకు సమగ్ర పోషణ సేవలు అందజేస్తున్నారు. జిల్లాలో సుమారు 3 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారు. చాకిరీ ఎక్కువ.. జీతం తక్కువ అన్న చందంగా తమ పరిస్థితి తయారైందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విధులు నిర్వహించే అంగన్వాడీ, ఆశా కార్యకర్తల వంటి వారికి కనీస వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. పనిభారం పెరిగిందిలా.. కనీస వేతనం ఇవ్వకపోగా.. రోజువారీ విధులకు తోడు వివిధ యాప్ల పేరిట తమపై పని భారం పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ యాప్ పోషణ ట్రాకర్లో డైలీ అటెండెన్స్ ఇవ్వాలి. వీహెచ్ఎన్డీ యాప్లో పిల్లల బరువులు, రిజిస్ట్రేషన్లు, హౌస్ విజిట్లు, హెల్త్ చెకప్లు, టేక్ హోమ్ రేషన్ వివరాలు నమోదు చేయాలి. దీని కోసం లబ్ధిదారుల ఫేస్ రిజిస్ట్రేషన్ (ముఖ ఆధారిత నమోదు) తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా బాల సంజీవని యాప్, ఏడబ్ల్యూసీ డైలీ ట్రాకర్ వంటి యాప్లలో వివరాల నమోదు కష్టతరంగా మారుతోంది. నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం, సర్వర్లు సక్రమంగా పని చేయక పోవడంతో ఫేస్ రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బందికరంగా మారుతోంది.పనిభారం తగ్గించాలి అంగన్వాడీ సిబ్బందికి పనిభారం పెరిగిపోయింది. రోజంతా యాప్లతోనే కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఒక్కోసారి నెట్వర్క్ పని చేయకపోవడం, సర్వర్ బిజీగా ఉండటంతో ఆ రోజు పని మర్నాడు చేయాల్సి వస్తోంది. అన్నింటినీ కలిపి ఒక్క యాప్గా చేస్తే పనిభారం తగ్గుతుంది. ఉద్యోగ భద్రత కల్పించాలి. – మాణిక్యాంబ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు హామీలు నెరవేర్చాలి సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలి. పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల విలీనాన్ని నిలుపు చేయాలి. మా డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగనున్నాం. – బేబీరాణి, కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఇవీ డిమాండ్లు అంగన్వాడీ వ్యవస్థ అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా వారి జీతాల విషయంలో న్యాయస్థానాలు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం తమకిస్తున్న రూ.10 వేల వేతనం ఏ మూలకూ చాలడం లేదని అంగన్వాడీ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. రోజువారీ కూలి పనులకు వెళ్లినా నెలకు రూ.15 వేలు లభిస్తాయని, అటువంటిది గొడ్డు చాకిరీ చేస్తున్నా రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగానే వేసవి సెలవులివ్వాలి. అంగన్వాడీలు మరణిస్తే ప్రభుత్వం నుంచి వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి బెనిఫిట్స్ అందడం లేదు. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. -
విజ్ఞానంతో ముడిపడి
గతమెంతో ఘనం గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యలో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ అమలు చేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు నిర్వహించడంతో పాటు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. కోనసీమ జిల్లాలో 2022–23లో 4,561 మంది విద్యార్థులు, 2,478 మంది ఉపాధ్యాయులకు, 2023–24లో 13,340 మంది విద్యార్థులకు ట్యాబ్లను ఇచ్చారు. 2022–23లో 191 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 264 స్మార్ట్ టీవీలు, 142 ఉన్నత పాఠశాలలకు 951 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇచ్చారు. 2023–24లో 517 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 558 స్మార్ట్ టీవీలు, 197 ఉన్నత పాఠశాలలకు 873 ఇంటరాక్టివ్ ఫ్లాట్ప్యానల్స్ అందజేశారు. ఫ ఉమ్మడి జిల్లాలో విస్తారంగా సైన్స్ ప్రచార సేవా సంస్థలు ఫ చంద్రయాన్–3 విజయంలో వల్లూరివాసి సహకారం ఫ నేడు జాతీయ సైన్స్ దినోత్సవం కపిలేశ్వరపురం: శాస్త్ర విజ్ఞానం.. అదో అద్భుతం. మానవాళికి మార్గదర్శకం.. ఆధునిక కాలమంతా సాంకేతికమయం.. ప్రయోగాలు, పరిశోధనలే కాదు సామాన్యుడి రోజువారీ జీవితం సైన్స్తో ముడిపడింది. మానవాళి అభ్యున్నతికి అది ఎంతగానో దోహదపడుతోంది. గతకాలపు అజ్ఞానాన్ని వీడి ఆధునిక మానవ అవసరాలు ప్రాతిపదికగా సైన్స్ దినదినాభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా సాంకేతిక విద్యా సంస్థలు, సైన్స్ ప్రచార సేవా సంస్థలు నడుస్తున్నాయి. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. శాస్త్ర సాంకేతిక ఉద్యమంలో తూర్పుగోదావరి జిల్లాకు మంచి పేరు ఉంది. ఇక్కడి నుంచి ఎందరో శాస్త్రవేత్తలు పేరు ప్రఖ్యాతలు సాధించారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇండియన్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇంజినీర్ వేగుళ్ల కోటేశ్వరరావు సైన్స్ అభ్యున్నతికి విశేష కృషి చేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సైతం ఇస్రో సంస్థ ఆయన సూచనలు, సలహాలను స్వీకరించింది. వల్లూరులో పాఠశాల విద్య, మండపేటలో ఇంటర్మీడియట్, కాకినాడ జేఎన్టీయూకేలో ఇంజినీరింగ్, బెంగళూరులో పీహెచ్డీ చేశారు. ఇస్రోలో చేరి శాసీ్త్రయ ప్రయోగాల్లో తనదైన శైలిలో సేవలందించారు. బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో 1978–83 మధ్యకాలంలో ఇంజినీర్గా పనిచేశారు. 2023 జూలై 14న భారత చంద్రయాన్– 3 అంతరిక్ష ప్రయోగంలో శాస్త్రవేత్తల బృందానికి కోటేశ్వరరావు సూచనలు, సలహాలు ఇస్తూ విజయవంతానికి కృషి చేశారు. సైన్స్ ప్రచార సేవా సంస్థలు ఇలా.. మానవుల్లో విజ్ఞాన వికాసాన్ని పెంచేందుకు పలువురు మేథావులు 1988 ఫిబ్రవరి 28న స్థాపించిన జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి జిల్లాలో సైన్స్ ప్రచారానికి కృషి చేస్తోంది. విద్యార్థి చెకుముఖి పేరుతో 1990 డిసెంబర్ నుంచి సైన్స్ మాస పత్రికను, 2010 నుంచి చెకుముఖి సైన్స్ సంబరాలను నిర్వహిస్తోంది. కాకినాడ జేఎన్టీయూ వేదికగా 2025 డిసెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సంబరాలు నిర్వహించి శాస్త్రవేత్తలతో విద్యార్థులను మమేకం చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి 54 బృందాలుగా 162 మంది విద్యార్థులు, 150 మంది తల్లిదండ్రులు సంబరాలకు హాజరయ్యారు. ఫ రామచంద్రపురానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కె.కృష్ణసాయి ప్రజల్లో మూఢ విశ్వాసాలను తొలగించడం, పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్ బీజాలు నాటడం లక్ష్యంగా రేవతి సైన్స్ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. ఫ కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన వాకా దివ్యశేఖర్ భూమి కదలికలపై పరిశోధన చేసి శాసీ్త్రయ విజ్ఞానాన్ని సమాజానికి పంచారు. ముంబయి ఐఐటీలో శాటిలైట్ రాడార్ చిత్రాలను ఉపయోగించి పరిశోధనను చేశారు. భూకంపాల్లో వచ్చే భూకదలికలు, భూగర్భ జలాల అతి వినియోగం వల్ల భూమి కుంగిపోవడమనే అంశాలపై పలు పరిశోధనా పత్రాలను పబ్లిష్ చేశారు. విస్తరిస్తున్న‘కూటమి’ చంద్రబాబు ప్రభుత్వం శాసీ్త్రయ విద్యను విస్మరిస్తోంది. ఈ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.34,875 కోట్లు మాత్రమే కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం విద్యకు కేటాయించాలన్న ప్రజా సంఘాల డిమాండ్ను ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా ఇబ్బంది ఎదురవుతోంది విజ్ఞానంతో మూఢ నమ్మకాలు దూరం సమాజం అభివృద్ధి పథాన నడవాలంటే సైన్స్ ప్రచారమే ఏకై క మార్గం. సైన్స్ సంగతులను వివరించడం ద్వారా పెరిగే విజ్ఞానం వల్ల ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలు తొలగిపోతాయి. ఆ దిశగా జిల్లాలో ప్రచారం చేస్తున్నాం. సైన్స్ అభివృద్ధికి పాటుపడుతున్నాం. –శ్రీకృష్ణసాయి, రేవతి ఫౌండేషన్ అధ్యక్షుడు, రామచంద్రపురం జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యం నోబెల్ పురస్కార గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట్రామన్ (సీవీ రామన్) కాంతిపై ‘రామన్ ఎఫెక్ట్’ కనుగొన్న రోజు 1928 ఫిబ్రవరి 28. ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని కలిగించాలన్నది జాతీయ సైన్స్ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. -
బాధితుల నరకయాతన.. సర్కారు కాలయాపన
సాక్షి, రాజమహేంద్రవరం: కల్తీ పాల బాధితులు నరకయాతన అనుభవిస్తుండగా.. చంద్రబాబు సర్కారు కాలయాపనతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా పాల వ్యాపారి గణేష్ తల్లి కల్తీకి కూలెంట్ కారణం కాదని వాదిస్తున్నారు. అందులోని పాలను తాము కూడా తాగామని, వాటితోనే మజ్జిగ చేసి ఓ ఆలయానికి సైతం పంపించినట్టు చెబుతున్నారు. అవే పాలు తాగిన తమకు ఏమీ కాలేదని, రాజమహేంద్రవరంలో అస్వస్థతకు గురయ్యారంటే.. దీనివెనుక ఏదో కుట్ర దాగుందని ఆరోపిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి కల్తీ పాలకు కారణమేమిటనేది నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పటికే కొన్ని ప్రచార మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఆ వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడిన అధికారులు, ప్రజాప్రతినిధులు రక్షణ చర్యలకు ఉపక్రమించినట్టు తెలిసింది. బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు కాగా.. కల్తీ పాల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు ఉన్నాయనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. రాజమహేంద్రవరంలో కల్తీ పాలకు కోరుకొండ మండలం నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీలో ఫ్రీజర్ (కూలెంట్) కారణమని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కూలెంట్ పాడై అందులోని ఇథలీన్ గ్లైకాల్ పాలల్లో కలవడంతో కిడ్నీ సమస్యలు తలెత్తినట్టు భావిస్తున్నామని అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ డెయిరీలో తనిఖీలు చేపట్టిన ఫోరెన్సిక్ బృందం పాల సేకరణ కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పాలు, వెనిగర్, కొన్ని ఖాళీ సీసాలు, పౌడర్ సేకరించారు. కూలెంట్ను నిశితంగా తనిఖీ చేశారు. అయితే, కల్తీ పాల బాధితుల శరీరంలో యూరియా అవశేషాలు ఉండటం, వైఎస్సార్సీపీ శ్రేణులు సైతం కూలెంట్ లీకేజీపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఫోరెన్సిక్ సిబ్బంది ఇప్పటికే తనిఖీ చేసిన కూలెంట్ను మరోసారి పరిశీలించేందుకు మంగళగిరి తీసుకెళ్లారు. అక్కడి ఫోరెన్సిక్ లేబొరేటరీలో మరోసారి పరీక్షించనున్నట్టు తెలిసింది. అనంతరం ఓ నిర్ధారణకు రానున్నట్టు సమాచారం. తర్వాత అయినా స్పష్టమైన ప్రకటన చేస్తారా.. ల్యాబ్ రిపోర్టుల మాదిరిగా ఈ అంశంలోనూ వాయిదాల పద్ధతి అవలంభిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విషమంగానే బాధితుల ఆరోగ్యం కల్తీ పాలు తాగి కిడ్నీ సమస్యలతో రాజమహేంద్రవరంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్యం రోజురోజుకూ విషమంగా మారుతోంది. కల్తీ పాలకు 21 మంది ప్రభావితం కాగా.. ఇప్పటికే ఆరుగురు మరణించారు. 15 మంది వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 8 మందిని వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఆరుగురికి డయాలసిస్ చేస్తుండగా.. ఒకరికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇంకా అందని ల్యాబ్ రిపోర్టులుబాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాల ల్యాబ్ రిపోర్టులు శుక్రవారం నాటికి కూడా రాలేదు. తొలుత పుణే నుంచి రావాల్సి ఉందని అధికారులు వెల్లడించగా.. తాజాగా తిరుపతి పంపించినట్టు చెబుతున్నారు. రెండు రోజులవుతున్నా ఇంకా రాకపోవడంపై బాధితుల్లో ఆందోళన నెలకొంది. కల్తీపాలు తాగి చనిపోయిన వారి పోస్టుమార్టం నివేదికలు సైతం అందలేదు. పోస్టుమార్టం శాంపిల్స్ను విజయవాడలోని రీజినల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అవి ఎప్పుడు వస్తాయో అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కాలయాపన చేసి కేసును నీరుగార్చేందుకే ప్రభుత్వం ఇలా చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
డిప్యూటీ ఎమ్మార్వో సంధ్య ప్రేమ వివాహం.. వరుడి దారుణ హత్య
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ద్వారపూడి శివారు వేములపల్లిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంధ్య భర్త దారుణ హత్యకు గురయ్యాడు. కులాంతర వివాహం చేసుకున్న కోపంతో యువతి కుటుంబ సభ్యులు ఆమె భర్తను తీవ్రంగా కొట్టి హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జెడ్ మేడపాడకు చెందిన సంధ్య డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తోంది. అయితే, సంధ్య.. వేములపల్లికి చెందిన బట్టల వ్యాపారి సూర్య ప్రకాష్ రావును ప్రేమించింది. ఈ క్రమంలో వీరిద్దరూ అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, పెళ్లి అయిన కొన్ని గంటలకే అర్ధరాత్రి వేములపల్లిలో సూర్య ప్రకాష్ రావుపై సంధ్య అన్నదమ్ములు విచక్షణ రహితంగా దాడి చేశారు.తమ చెల్లెలు సంధ్య కులాంతర వివాహం చేసుకున్న కారణంగా కోపంతో సూర్య ప్రకాష్ను రాళ్లతో కొట్టి చంపారు. రాళ్ల దాడి కారణంగా సూర్య ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
నిమ్మండి.. దిగులేనండి
దేవరపల్లి: నిమ్మ పంట దిగుబడి పులుపెక్కింది.. ఈ ఏడాది దారుణంగా పడిపోయింది.. కాయలు లేక తోటలు కళావిహీనంగా మారి, రైతన్నలకు కష్టం తెచ్చింది.. ధర బాగున్నా, దిగుబడి లేకుండా పోయింది.. ఎకరాకు 2.5 టన్నులు రావాల్సి ఉండగా, టన్ను కాయలూ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి, కౌలు సొమ్ము వచ్చేట్టు కనిపించడం లేదు. ధర బాగున్నా దిగుబడులు తగ్గడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని ఎర్రనేలల్లో నిమ్మకాయల తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు.కొవ్వూరు డివిజన్ దేవరపల్లి, గోపాలపురం, చాగల్లు, తాళ్లపూడి, పెరవలి, నిడదవోలు మండలాల్లో సుమారు 2,200 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగవుతున్నాయి. దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ మండలంలో సుమారు 800 ఎకరాలు ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పూత రాగా, ఫిబ్రవరి నెల నుంచి దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన పూతతో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దిగుబడి ఉంటుంది. ఈ ఐదు నెలలు నిమ్మకాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంటోంది. వేసవిలో పండిన కాయలకు గిరాకీ ఉండి గిట్టుబాటు ధర లభిస్తోంది. వర్షాకాలంలో పండిన కాయలకు డిమాండ్ ఉండదు. వర్షాకాలంలో పూత శీతాకాలంలో కాపుఉంటోంది. అయితే నిమ్మకాయల వినియోగం తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగా ఉంటాయి. కిలో రూ. 8 నుంచి రూ.10 పలుకుతాయి. అయినా కొనుగోలు చేసే నాధుడు కనిపించక రైతులు చెట్ల కిందే వదిలేస్తారు. ప్రస్తుతం కిలో రూ.80మార్కెట్లో నిమ్మకాయల ధర ఆశాజనకంగా ఉంది. మొన్నటి వరకూ కిలో కాయలు రూ. 8 నుంచి రూ.10 పలికగా, ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కు చేరింది. ఎండల తీవ్రత పెరగడంతో పాటు తోటలు కాపులు లేక దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో ధర పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో కిలో రూ. 40 ఉంది. అయినప్పటికీ వేసవి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో గిట్టుబాటు అయ్యింది. కిలో కాయలు రూ. 35 నుంచి రూ.50 నిలకడగా కొనసాగడంతో పెట్టుబడి పోను రైతులు నాలుగు డబ్బులు మిగిలాయి. ఈ ఏడాది వేసవి సీజన్లో మార్కెట్లో ధర రూ.120 దాటవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతులకు తప్పని నష్టంనిమ్మ సాగు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులున్నారు. వీరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కొక్కరు 5 నుంచి 10 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరం కౌలు రూ. 90 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండగా, పెట్టుబడి మరో రూ. 25 వేలు అవుతుంది. నిమ్మతోటకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఎక్కువగా సేంద్రియ ఎరువులను వేయాలి. ప్రస్తుత పరిస్థితిలో దిగుబడులు లేక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.యాదవోలు మార్కెట్లో విక్రయాలుయాదవోలు మార్కెట్లో రైతులు పంటను అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్కు రోజుకు 20 నుంచి 25 టన్నుల కాయలు వస్తున్నాయి. కాపులు బాగుంటే రోజుకు 60 నుంచి 70 టన్నుల విక్రయాలు జరుగుతాయి. దేవరపల్లి మండల పరిసర గ్రామాల నుంచి పంటను రైతులు యాదవోలు మార్కెట్కు తీసుకువస్తారు. ఏలూరు తర్వాత పెద్ద మార్కట్ యాదవోలు. ఇక్కడ మార్కెట్లో కొనుగోలు చేసిన కాయలను ఒడిశా, కోల్కతా, విశాఖ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కలుపు మందుల ఎఫెక్ట్ నిమ్మ తోటలకు విచ్చలవిడిగా కలుపు మందు పిచికారీ చేస్తున్నారు. దీని ప్రభావం మొక్కలపై పడి దెబ్బతింటున్నాయి. తోటలు నిగనిగలాడడంలేదని, ఎర్రబడి కొమ్మలు ఎండిపోతున్నట్టు రైతులు తెలిపారు. కలుపు మందులతో పాటు క్రిమిసంహారక మందుల వాడకం ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో కాయలు గుత్తులుగా ఉండేదని, చెట్టుకు 100 కిలోల కాయల దిగుబడి వచ్చేవని రైతులు తెలిపారు. ఎకరాకు ఏడాదికి 40 క్వింటాళ్లు దిగుబడి వచ్చేవని అన్నారు. పెట్టుబడి కూడా రాదునిమ్మ ధర బాగుంది. అయితే దిగుబడి లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటలు కాపులు కాయలేదు. ఎకరాకు 3 టన్నుల కాయలు దిగుబడి రావాల్సి ఉండగా, టన్ను కూడా లేవు. పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 100 కిలోల కాయలు కోయడానికి రూ. 2,200 ఖర్చు అవుతుంది. వేసవి పంటలపై ఆశలు పెట్టుకుంటాం. ఈ సారి ఆశాజనకంగా లేదు. – గడా రాంబాబు, నిమ్మ రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలంవేసవి పంటపైనే ఆశలువేసవి పంటపై ఆశలు పెట్టుకున్నాం. ప్రస్తుతం దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం యాదవోలు మార్కెట్లో కిలో కాయలు రూ. 80 పలుకుతున్నాయి. డిసెంబర్, జనవరిలో కిలో ధర రూ. 8 ఉంది. ఈ నెలలో ధర పెరిగింది. ధర ఉన్నప్పటికీ దిగుబడులు లేవు. నిమ్మ రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులు ఉన్నారు. వారంతా ఇబ్బంది పడుతున్నారు.– లకంసాని శ్రీనివాసరావు, నిమ్మరైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం -
కోరుకొండ తీర్థం ప్రారంభం
● దేవుని కోనేరు నుంచి పుట్టమన్ను సేకరణ ● ఏర్పాట్లను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు కోరుకొండ: కోరుకొండలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి తీర్థం గురువారం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో స్థానిక అర్చకస్వాములు స్వామివారి కోనేరు వద్ద నుంచి పుట్టమన్నును ఆలయానికి తీసుకొచ్చారు. అంకురార్పణ, ధ్వజారోహణం, నిత్య గ్రామ బలిహరణ, సేవాకాలం నిర్వహించారు. కొండపైన, కింద ఆలయాల్లో ఆరగింపు, జయగంట కార్యక్రమాలు జరిగాయి. తీర్థం సందర్భంగా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రథోత్సవం సాగే ప్రాంతాలను అదనపు ఎస్పీ చెంచురెడ్డి, డీఎస్పీ రామ కృష్ణ పరిశీలించారు. స్వామి మాలధారణ నారసింహుని ఉత్సవాల సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు మాలధారణ చేశా రు. వీరంతా స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మండపంలో తొమ్మిది రోజులుగా దీక్షలు నిర్వహించా రు. శుక్రవారం స్వామివారి రథోత్సవం, రాత్రి కల్యా ణం అనంతరం, శనివారం దీక్ష విరమించనున్నారు. నేటి నుంచి విశిష్టాద్వైత సభలు స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక రంగనాథస్వామి దేవాలయంలో ఎస్పీ నరసింహరాజభట్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి విశిష్టాద్వైత సభలు నిర్వహించనున్నారు. దీనికి భద్రాచలం, సింహాచలం నుంచి పండితులు హాజరవుతారు. వీరంతా స్వామి ఔన్నత్యాన్ని తెలియజేస్తారు. పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త యస్.పి.రంగరాజ భట్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు, కోరుకొండ ఎస్సై ఎస్.శ్రీనివాసు పాల్గొన్నారు. -
పీపీ.. పీపీపై కూపీ
తాళ్లపూడి: ఉగాది నాటికి అంటే 15 రోజుల్లో పోశియ్య ఇంటి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని జిల్లా హౌసింగ్ పీడీ నాతి బుజ్జి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మలకపల్లికి వచ్చిన సమయంలో చర్మకారుడు సమండ్ర పోశియ్య(పోశిబాబు)కు ఇచ్చిన హామీ నెరవేరలేదని వివరిస్తూ ‘పీపీ.. పీపీ.. ఢాంఢాం’ అనే శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు తక్షణం స్పందించారు. పోశియ్య ఇల్లు బాగు చేయించడంతో పాటు, చెప్పుల కొట్టు పెట్టుకోవడానికి సాయమందిస్తామని అప్పట్లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరలేదనే పోశియ్య ఆవేదనకు సాక్షి అక్షర రూపమిచ్చింది. దీంతో గురువారం హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, కొవ్వూరు హౌసింగ్ ఈఈ వేణుగోపాలరావు, ఇతర శాఖల అధికారులు పోశియ్య ఇంటిని పరిశీలించారు. పోశియ్యను అడిగి ఇప్పటి వరకు చేసిన పనులు, ఇంకా ఏం చేయాలన్న వివరాలు తెలుసుకున్నారు. తన పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి అన్ని పనులు చేయించి పెడతానని చెప్పారని పోశియ్య అన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరారు. అయితే గ్రామంలో కొట్టు పెట్టుకోవడానికి ఇప్పటి వరకు స్థలం చూపించలేదని తెలిపారు. సరకులు, బడ్డీ కొట్టు సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లా హౌసింగ్ పీడీ బుజ్జి మాట్లాడుతూ ఇప్పటి వరకు పోశియ్య ఇంటికి ప్లాస్టింగ్, ఇంటి ఎలివేషన్, కబోర్డులు, బాత్రూం నిర్మాణం తదితర పనులు చేశామన్నారు. ఫ్లోరింగ్కు టైల్స్, కిచెన్లో కిటికి, ఇంటి వద్ద పరిసరాల లెవలింగ్, బాత్రూంకు ప్లాస్టింగ్, పైకప్పు వంటి పనులు కలెక్టర్ ఆదేశాల మేరకు ఉగాది నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ.2.60 లక్షలు ఖర్చు చేశామని, మరో రూ.20 వేలు ఉపాధి హమీ ద్వారా ఖాతాలో వేశామన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. చెప్పులు దుకాణం పెట్టుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష చెక్కు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే పోశియ్య సరకులు, కొట్టు కొనుగోలు చేశారని, కొట్టు పెట్టుకోవడానికి రెవెన్యూ అధికారులు స్థలం గుర్తిస్తారని తెలిపారు. హౌసింగ్, డీఆర్డీఏ డ్వామా, రెవెన్యూ అధికారులు కలిసి పనిచేస్తారని పీడీ తెలిపారు. మొత్తంగా రూ.5 లక్షల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇన్చార్జి ఏఈ దాదాసాహెబ్, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ‘సాక్షి’ కథనానికి తక్షణ స్పందన చర్మకారుడు పోశియ్యతో మాట్లాడిన హౌసింగ్ పీడీ, ఇతర అధికారులు ఉగాది నాటికి ఇంటి పనులు పూర్తిచేసి ఇస్తామని ప్రకటన -
కంటైనర్, కారు ఢీ
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై కంటైనర్, కారు ఢీకొన్నాయి. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. సీతంపేట సమీపంలో కంటైనర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆ వాహనాలను తనిఖీ చేశారు. బాలికపై అత్యాచారయత్నం రాజానగరం: తండ్రి వయసులో ఉన్న ఓ వ్యక్తి కామంతో అభం శుభం తెలియని బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడి, కటకటాల పాలయ్యాడు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్థానిక ఎస్సై మురళీకృష్ణ గురువారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. కలవచర్లలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక ఆరోగ్యం బాగోలేదని బుధవారం స్కూల్కు వెళ్లలేదు. ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలి, తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. అదే అదునుగా భావించి, పొరుగింట్లో ఉంటున్న 42 ఏళ్ల కొల్లి విష్ణు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపులు వేసి, ఆ బాలికపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో, బాలిక భయంతో గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో కూలి పనులు ముగించుకుని వచ్చిన ఆ బాలిక తల్లితో పాటు, ఇరుగుపొరుగు రావడంతో నిందితుడు పరారయ్యాడు. విష్ణు ఇద్దరు పిల్లల తండ్రి కూడా. అతడిని అరెస్టు చేసి, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, గురువారం రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు. మాస్ కాపీయింగ్ ఆరోపణపై నేడు విచారణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాకినాడ జీజీహెచ్లో ఈ నెల 5 నుంచి 13 వరకూ నిర్వహించిన జీఎన్ఎం పరీక్షల్లో లంచాలు, మాస్ కాపీయింగ్ జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం విచారణ జరగనుంది. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 12న ‘నాడి కాదు..నోటు పడితే నర్సింగ్’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం కదిలింది. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఓఎస్డీలు సహా మరికొంత మందిని విచారించేందుకు కమిటీని నియమించింది. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఆర్ఎంసీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మునిరత్నమ్మ, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లతో కూడిన త్రిసభ్య కమిటీని ఇందుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ చేపట్టనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. రూ.లక్షల మొత్తం చేతులు మారాయన్న ఆరోపణలు, ఓఎస్డీలు పరీక్షల వేళ ప్రైవేటు నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో రహస్య సమావేశాలు నిర్వహించడం, తమకు అనుకూలమైన విద్యార్థులతో తలుపులు మూసి మరీ కాపీయింగ్ నిర్వహించారని సహ విద్యార్థులే ఆరోపించడం, కీలక అధికారికి ఇప్పటికే స్థానచలనం కల్పించిన నేపథ్యంలో తాజా విచారణ అత్యంత కీలకం కానుంది. -
పాము కాటుకు చిన్నారి మృతి
నల్లజర్ల: పాము కాటుకు గురై ఓ చిన్నారి మృతి చెందింది. ఆ వివరాల ప్రకారం.. అనంతపల్లిలో చోడవరం రహదారి పక్కన నివాసం ఉంటున్న తీగల ప్రకాష్, ధనలక్ష్మి దంపతుల కుమార్తె వన్సిక (3) బుధవారం సాయంత్రం ఆరుబయట మూత్ర విసర్జనకు వచ్చింది. పక్కనే చెత్తలో ఉన్న తాచుపాము ఆమెను కాటేసింది. జరిగిన సంఘటన తల్లికి చెప్పి ఆ బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు సమీప బంధువులు తెలిపారు. ఆ బాలిక తండ్రి ప్రకాష్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. కుమార్తె మరణ వార్త విని స్వస్థలానికి తిరిగి వస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.గీత కార్మికుడి మృతిచాగల్లు: పాము కాటుకు గురై ఓ కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లుకు చెందిన దొంగ వెంకటేశ్వరరావు (51) గీత కార్మికుడు. నెలటూరు గ్రామ పరిధిలోని రుద్రబోయిన బుల్లిరాజుకు చెందిన పొలంలో తాటిచెట్ల వద్దకు వెళ్లి కల్లు తీయడానికి వెళ్తుండగా విష సర్పం కాటేసింది. అతన్ని వెంటనే బంధువులు చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, మార్గం మధ్యలోనే మృతి చెందారు. మృతుడి అతని భార్య దొంగ పద్మ ఫిర్యాదు మేరకు ఎస్సై కె.నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
క్షణికావేశానికి పసికందు బలి
జగ్గంపేట: ఆ చిన్నారి ఏం చేసిందో.. అమ్మా నాన్న అనడం కూడా రాని ఆ పసి ప్రాయాన్ని కన్న తండ్రే కడతేర్చాడు.. క్షణికావేశంలో కన్న బంధాన్నే మరిచాడు.. మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయంతో ఓ చిన్నారి ప్రాణాలను హరించాడు. ఈ సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది. జగ్గంపేటలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు, జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఓడిబోయిన మణికంఠ (23), అతని భార్య ఓడిబోయిన సాయి (25) నివాసం ఉంటున్నారు. వీరిది కులాంతర వివాహం. అయితే సాయికి గతంలోనే వివాహం జరగడం ఆరేళ్ల కూతురు ఉండగా, భర్తతో విడిపోయింది. అనంతరం మణికంఠతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుంది. వీరికి ఆడపిల్ల ఉంది. ఆ పాపకు 11 నెలలు. అయితే భర్త తరచూ మద్యం తాగడం, సంపాదన గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరగడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సాయి రెండు రోజుల క్రితం స్థానిక గోకవరం రోడ్డులోని పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం మద్యం తాగి అత్తవారింటికి వెళ్లిన మణికంఠ భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో అత్తింటివారు చివాట్లు పెట్టి, నీ కూతురిని తీసుకుని వెళ్లి పోషించుకో అని అనడంతో మద్యం మత్తులో ఉన్న మణికంఠ 11 నెలల చిన్నారితో సహా అక్కడి నుంచి మోటారు సైకిల్పై వచ్చేశాడు. మత్తు దిగిన తరువాత తిరిగి వస్తాడని భావిస్తున్న భార్య, అత్తకు పిడుగులాంటి వార్త తెలిసింది.మోటారు సైకిల్తో సహా కాలువలోకి..11 నెలల తన కూతురుతో సహా ఆవేశంగా బయలు దేరిన మణికంఠ, నేరుగా జగ్గంపేట నుంచి గుర్రంపాలెం వెళ్లే రహదారిలో ఉన్న పోలవరం కాలువలోకి మోటారు సైకిల్తో సహా దూసుకుపోయాడు. అయితే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి తక్షణం కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. మణికంఠను కాపాడి గట్టుపైకి తీసుకువచ్చారు. పోలవరం కాలువకు సమీపంలో ఉన్న వివేకానంద విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర వైఎస్సార్ సీపీ నేత ఒమ్మి రఘురామ్కు సమాచారం తెలియడంతో తక్షణం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని తన కారులో చిన్నారిని, మణికంఠను జగ్గంపేట సీహెచ్సీకి తీసుకువెళ్లారు. అయితే డాక్టర్లు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.బోరున విలపించిన కుటుంబ సభ్యులుఆవేశంగా వెళుతుంటే కొద్ది సేపటికి తిరిగి వస్తాడని భావించానని, కానీ కూతురి ప్రాణాలు తీస్తాడని అనుకోలేదని తల్లి సాయి, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. స్థానికులు ఆగ్రహంతో మణికంఠకు దేహశుద్ధి చేశా రు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘు నాథరావు తెలిపారు. -
అర్తమూరు మాజీ సర్పంచ్ భూలక్ష్మి మృతి
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం అర్తమూరు గ్రామ మాజీ సర్పంచ్ పడాల భూలక్ష్మి (61) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. 2001–06 మధ్య ఆమె సర్పంచ్గా పనిచేసి గ్రామానికి విశేష సేవలందించారు. ఆమెకు భర్త పడాల సుబ్బారెడ్డి, కుమారుడు భాస్కరరెడ్డి, కుమార్తె సత్యశ్రీ ఉన్నారు. భర్త పడాల సుబ్బారెడ్డి ప్రాంతీయ కోళ్ల రైతుల సంఘం అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడుకు భూలక్ష్మి సోదరి. అర్తమూరులో భూలక్ష్మి పార్థివదేహాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పలువురు రాజకీయ, వ్యాపార, నియోజకవర్గ ప్రముఖులు సందర్శించారు. పడాల సుబ్బారెడ్డిని పరామర్శించారు. -
వైద్యుల మల్లగుల్లాలు
● విషమంగా కల్తీపాల బాఽధితుల పరిస్థితి ● విరుగుడు ఇంజెక్షన్లు ఎంత డోసు ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్న వైనం ● ఆ ఎనిమిది మంది గురించి రెండు రోజులు ఆగితేనే కానీ ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు ● పాల వ్యాపారి గణేష్ను విచారించేందుకు పోలీసుల సిద్ధం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై రాజమహేంద్రవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 15 మందిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యకుమారి అనే బాధితురాలికి బుధవారం అర్ధరాత్రి గుండె సమస్య రావడంతో వైద్యులు ఆందోళన చెందారు. సకాలంలో స్పందించి ఆమెకు సీపీఆర్ చేసి అత్యవసర మందులు అందించడంతో తిరిగి కోలుకుంది. విషమంగా ఉన్న ఎనిమిది మంది పరిస్థితి మరో రెండు రోజులు దాటితే కానీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. రెయిన్బో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల్లోనూ ఒకరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కిడ్నీలు విఫలమైన ఇద్దరికి డెల్టా ఆసుపత్రిలో డయాలసిస్ జరుగుతోంది. బొల్లినేని ఆసుపత్రిలో ఎనిమిది మందిలో ఐదుగురు వెంటిలేటర్, డయాలసిస్ మీద ఉండగా, మరో ముగ్గురికి డయాలసిస్ జరుగుతోంది. ఫోమోఫైజోల్ ఇంజెక్షన్లపై తర్జన భర్జన బాధితులకు మెరుగైన వైద్యం అందించే దిశగా ముంబై నుంచి రప్పించిన ఫోమోఫైజోల్ ఇంజెక్షన్లు ఏ విధంగా, ఎంత డోసు ఇవ్వాలనే దానిపై వైద్య బృందం మల్లగుల్లాలు పడుతోంది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి అక్కడ వైద్య బృందంతో ఇంజెక్షన్ల డోసులపై చర్చించారు. వీటిని బాఽధితులకు శుక్రవారం నుంచి అందించనున్నట్టు సమాచారం. ఈ ఇంజెక్షన్లు వ్యాధి ప్రాథమిక దశలో ఉన్న వారికి మెరుగ్గా, కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ జరుగుతున్న వారికి అంతంత మాత్రంగా ఫలితాలు ఇస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదీ ప్రిడ్జి లీకేజీ వల్ల పాలలో ఇథనాల్ గ్లైకాన్ కలిస్తేనే ఈ ఇంజెక్షన్లు పనిచేస్తాయి. వేరే ఏ రసాయనాలు కలిసినా ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. పాలలో ఏ విధంగా కల్తీ జరిగిందో తెలియడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు రావడానికి మరో మూడు రోజులు సమయం పట్టవచ్చు. దీంతో బాధితులకు రికవరీ డోసు ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది. ఇంజెక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ రావని నిర్ధారణ అయ్యాక, రిపోర్టుతో పనిలేకుండా వాటిని బాఽఽధితులకు అందించేందుకు డాక్టర్లు సిద్ధమయ్యారు. విషమంగా ఉన్న 8 మందికి అత్యవసర వైద్యం అందిస్తున్నా, ఇంజెక్షన్లు ఇస్తే కానీ వారు ఎంతమేరకు కోలుకుంటారనేది అంచనా వేయలేమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఘటన జరిగి 11 రోజులు కావడం, బాధితుల పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని, మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జైలులో ఉన్న గణేష్ను విచారించనున్న పోలీసులు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న పాల వ్యాపారి గణేష్ను మరోసారి సమగ్రంగా విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. న్యాయస్ధానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని ఘటన వివరాలపై నివేదిక తయారు చేయనున్నారు. ఇథనాల్ గ్లైకాన్ లీకయి పాలు కలుషితం అవడంతో పాటు, పాలల్లో కలిపిన రసాయనాల కారణంగా మరింత విషతుల్యమయ్యాయా, లేక ఇథనాల్ లీకేజీ వల్లే జరిగిందా అన్నది గణేష్ నిర్ధారించాల్సి వుంది. అతని వాంగ్మూలంతో.. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టులు సరిచూసుకుని ఎంతమేరకు నిజం చెప్పాడన్నది నిర్ధారణ చేసుకుంటారు. ఈ ఘటనపై గణేష్ తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. తాము కూడా అదే పాలు తాగామని, తమకు ప్రమాదం జరగలేదని ఆమె అంటోంది. నా కుమారుడంటే గిట్టని వారు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చునని చెబుతోంది. కల్తీ పాల వినియోగదారుల ఆరోగ్యంపై ఆరా పాల వ్యాపారి గణేష్ సరఫరా చేసిన పాల వినియోగదారుల చిట్టా ఆధారంగా 110 కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. మరో వారం రోజుల పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కల్తీ పాల వినియోగదారుల ఆరోగ్య స్థితిని రికార్డు చేస్తారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మినహా గణేష్ వద్ద పాలు తీసుకున్న వారి శరీరంలో ఎటువంటి మార్పులు కనిపించలేదు. -
దౌర్జన్యంగా గుడిసెల పీకివేత
● రక్షణ కల్పించాలంటూ వలస కూలీల వినతి ● ఫిర్యాదు చేసి ఐదు రోజులైనా పట్టించుకోని పోలీసులు నల్లజర్ల: పోరంబోకు భూమిలో తాము వేసుకున్న తాత్కాలిక గుడిసెలను పీకేశారని, తమకు రక్షణ కల్పించాలంటూ వలస కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి ఐదురోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబరుపేట గ్రామానికి చెందిన 30 మంది వలస కార్మికులు వర్జీనియా పొగాకు (బ్యారను) రెల్చే పనుల కోసం నల్లజర్ల మండలం పోతవరం వచ్చారు. ఏటా మాదిరాగానే బహిరంగ ప్రదేశంలో తాటాకులతో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని పగలు పనులకు వెళ్లి రాత్రిళ్ళు ఇక్కడ పడుకుంటారు. ఈ పనులన్నీ నాలుగు మాసాలలో ముగుస్తాయి. అపుడు వీరు తమ స్వగ్రామాలకు వెళ్లిపోతారు. గత నెల 19న వచ్చిన వీరు గ్రామంలో ఏలేటి శ్రీను పొలంపక్క గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఈ నెల 14న అదే గ్రామానికి చెందిన రైతులు అట్టూరి సత్యనారాయణ, అట్టూరి వంశీ మగ కూలీలు పొలం పనులకు వెళ్లిన సమయంలో వారి తాత్కాలిక గుడిసెలు పీకేశారు. వండు కున్న ఆహార పదార్థాలను చిందర వందర చేసి నేలపై పడేశారు. గుడిశెలు ఇక్కడ తీయకపోతే మిమ్మల్ని కూడ పెట్రోలు పోసి తగులబెడతామని హెచ్చరించి వెళ్లిపోయారు. అయ్యా మేం పర్మినెంట్గా ఇక్కడ ఉండిపోమని, పనులు పూర్తయ్యాక ఖాళీ చేసి వెళ్లిపోతామని చెప్పినా వినకుండా మమ్మల్ని కులం పేరుతో దూషించారని బాధిత మహిళలు మొగులూరి చిట్టెమ్మమొగులూరి నాగలక్ష్మి,శ్రావణి తదితరులు వాపోయారు. ఒకపక్క రైతుల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాం పనులు పూర్తి చేసిపోతామన్నా వినలేదని చెప్పారు. ఇప్పటికే చాలామంది కూలీలు తమ ఊళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. మిగిలిన తమపై ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక భయంతో ఉన్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 22న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని, కనీసం ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయలేదని వాపోయారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు చిడిపి చింతయ్య బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఎస్సై ఆంజనేయబాబును ‘సాక్షి’ వివరణ కోరగా సమస్యను పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించినట్టు చెప్పారు. -
ఎడాపెడా.. దేవడా!
● ఎమ్మెల్యే దేవ వరప్రసాద్పై సొంత పార్టీ జనసేన నేతల తిరుగుబాటు ● సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శల వెల్లువ ● కొత్తగా సామాజిక వర్గాల వారీగా చీలిక ● అదే బాటలో టీడీపీ క్యాడర్ ● ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు సాక్షి, అమలాపురం: రాజోలు కూటమిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. జనసేన శాసనసభ్యుడు దేవ వరప్రసాద్పై అటు సొంత పార్టీకి చెందిన జనసేన, మిత్రపక్షమైన టీడీపీ వర్గాలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. సామాజిక మాధ్యమాల వేదికగా బురద జల్లుతుండడంతో దేవ వరప్రసాద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాజోలులో గడిచిన రెండు ఎన్నికల్లో జనసేన విజయం సాధించింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ ఒక మోస్తరు నాయకుడు కూడా చిన్నచిన్న విషయాలను పార్టీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టడంతో స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఉక్కబోతకు గురవుతున్నారు. తామే వరప్రసాద్ను నియోకజకవర్గానికి పరిచయం చేశామని, తాము లేకుంటే ఆయనకు ఇక్కడ స్థానమే లేదంటూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. జనసేన పార్టీలో ఉన్న గ్రూపుల నాయకులతో స్వయంగా పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడినా ఫలితం లేదు. ఆయన రాజోలు పర్యటన తరువాత ఇక్కడ విభేదాలు తార స్థాయికి చేరడం గమనార్హం. కలిసి పనిచేయాలని పవన్ చెప్పిన తరువాత అసంతృప్తి జ్వాలలు మరింతగా ఎగసిపడుతున్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్పై జనసేనలో రెండు,మూడు వర్గాలు బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నాయి. పార్టీలోను, నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ పార్టీని బజారును పడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే మౌన ముద్ర దాల్చుతుండడం పార్టీలో మిగిలినవారికి మింగుడు పడడం లేదు. అధిష్టాన పెద్దలు కూడా ఆయా వర్గాలను ప్రోత్సహించడం, తాను ఎన్నిసార్లు అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినా పెద్దలు సర్దుబాటు చేయకపోవడంతో ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక మిన్నకుండా పోయారని వినికిడి. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ నాయకుడు యెనముల వెంకట పతిరాజు సామాజిక మాధ్యమం వేదికగా ఎమ్మెల్యేపై పరుష పదజాలంతో వీడియో పెట్టడం వివాదం సామాజిక వర్గాల మధ్య పోరుకు దారితీసింది. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కించపరచడంపై వారు మండిపడుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు పట్టుపడుతుండడంతో రాజోలు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. జనసేనతోపాటు టీడీపీకి చెందిన దళిత వర్గానికి చెందిన నాయకులు సామాజిక మాధ్యమాలలో మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన గెడ్డం సింహ, చాగంటి స్వామి వంటి నేతలు మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే కాబట్టే ఇలా వ్యక్తగత దూషణకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. జనసేనకు చెందిన దళిత నాయకులు జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విరుచుకు పడ్డారు. జనసేన అసంతృప్తి నాయకునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మలికిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీలో సైతం అసంతృప్తి సెగలు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్పై కూటమి పార్టీకి చెందిన నియోజకవర్గ టీడీపీ నాయకులు సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో తమను కలుపుకుని వెళ్లడం లేదని, ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వద్ద తమ అక్రోశాన్ని వెళ్లగక్కారు. దీనితో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా గొల్లపల్లి అమూల్యను నియమించారు. ఈ నియామకం ఆ పార్టీలో కొత్త విభేదాలకు, గ్రూపులకు దారి తీసింది. ఇదే సమయంలో అమూల్య, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ల మధ్య కూడా కొత్త వివాదాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గ కార్యక్రమాలలో తమను పట్టించుకోవడం లేదని ఆమూల్య ఆరోపిస్తున్నారు. దీనిపై ఇటీవల అమలాపురంలో రాజోలు టీడీపీ కీలక నాయకులు సమావేశమై పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇటు జనసేన, అటు టీడీపీ వర్గాలుగా వీడిపోయి రాజోలు కేంద్రంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్పై విమర్శలకు దిగుతున్నారు. -
కొవ్వూరు ఇన్చార్జి ఆర్డీవోగా రాజారమేష్
తాళ్లపూడి: కొవ్వూరు ఇన్చార్జి ఆర్డీవోగా ఎం.రాజారమేష్ ప్రేమ్కుమార్ను గురువారం నియమించారు. ఆయన ప్రస్తుతం గెయిల్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆర్డీవో రాణి సుస్మిత బదిలీ కావడంతో ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ల్యాబ్ రిపోర్టు వచ్చాక పరిస్థితిపై స్పష్టత కల్తీ పాల బాధితులు ఆరోగ్యంపై కలెక్టర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితుల వాస్తవ పరిస్థితిపై ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని కలెక్టర్ కీర్తి చేకూరి చెప్పారు. అమరావతి నుంచి సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వరలక్ష్మి మిల్క్ డైరీ, నరసాపురం గ్రామం, కోరుకోండ మండలం నుంచి పాల సరఫరా నిలిపివేశామన్నారు. క్షేత్ర స్థాయిలో 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామన్నారు. 14 సర్వైవల్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజూ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల వద్ద ధర్నాలు రేపు ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని, డ్రగ్ కంట్రోల్ విభాగంలో అవినీతిని అరికట్టాలని కోరుతూ శనివారం బల్క్ డ్రగ్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నామని సీపీఐ రాష్ట్ర వర్గ సభ్యులు తాటిపాక మధు పేర్కొన్నారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మందులు తయారీ కంపెనీలకు కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెడితే వీటిని మింగిన రోగులకు మాత్రం ఎక్కడా లేని కష్టాలు వచ్చిపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మందుల తయారీ వెనుక ఒక పెద్ద మెడికల్ మాఫియా ఉందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాటడానికి మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు గడప గడపకూ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరావు, సహాయ కార్యదర్శి కె.రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు పాల్గొన్నారు. నామినల్ రోల్లో సవరణలకు అవకాశం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి (ఎస్ఎస్సీ) మార్చి 2026 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాల్లో (నామినల్ రోల్స్ ) తప్పులు సరిదిద్దుకోవడానికి పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించిందని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు గురువారం తెలిపారు. శనివారం వరకు సవరణలు చేసుకోవచ్చన్నారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవచ్చన్నారు. ఆధార్ తో ధృవీకరించిన వివరాలను మాత్రమే యూ డైస్ ప్లస్ పోర్టల్లో అప్డేట్ చేయాలన్నారు. ఈ మూడు రోజుల్లో రికార్డులు ఇంకా సరిపోలని వారికి మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో వివరాలు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. జనగణనపై శిక్షణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణకు సంబంధించి అధికారులకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27, 28, మార్చి 1 తేదీలలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ శిక్షణ జరగనుందని వెల్లడించారు. జనాభా గణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో, సంబంధిత అధికారులకు డిజిటల్ అప్లికేషన్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2027 జనాభా గణనను రెండు దశల్లో చేపడతామని తెలిపారు. -
దేవుడా.. ఏంటీ దుస్థితి!
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు: కల్తీ పాలు తాగి మూత్రపిండాల సమస్యల బారినపడిన వారిలో 8 మంది ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉంది. రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన కల్తీ పాల ఘటనలో 21 మంది బాధితులను గుర్తించగా.. వీరిలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందారు. మరో 15 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం పొందుతున్నారు. కిమ్స్ ఆస్పత్రిలో 8 మంది, రెయిన్బో ఆస్పత్రిలో ముగ్గురు, డెల్టా ఆస్పత్రిలో ఇద్దరు, రవిచంద్ర ఆస్పత్రిలో ఒకరు, రవి చైతన్య ఆస్పత్రిలో మరొకరు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరిని వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వైద్యాధికారులు తెలిపారు. 8 మందిని వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్ అందిస్తున్నారని, వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. రెయిన్బో ఆస్పత్రిలో మూడేళ్లలోపు చిన్నారులు ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఇందులో 5 నెలల చిన్నారికి సైతం డయాలసిస్ చేస్తున్నారు. కొనసాగుతున్న రక్త నమూనాల సేకరణ కల్తీ పాల బాధితులను గుర్తించేందుకు వైద్యాధికారులు రక్త నమూనాలు సేకరిస్తున్నారు. 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామని కలెక్టర్ కీర్తి సీఎంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో వెల్లడించారు. 14 సరై్వలైన్స్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజూ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. నివేదికలు ఎప్పుడొస్తాయో కల్తీ పాల బాధితుల్లో 12 మంది నుంచి రక్తం, ముగ్గురి నుంచి మూత్ర నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం తిరుపతి ఐఐటీకి పంపారు. ఆ నివేదికలు గురువారం సాయంత్రానికి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికీ రాకపోవడంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. ప్రత్యేక ఇంజెక్షన్ల వినియోగం ఎప్పుడో? ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజ్ సూచనల మేరకు ముంబై నుంచి 50 ప్రత్యేక ఇంజెక్షన్లు తెప్పించారు. వాటిని వినియోగించాలంటే రక్తం, పాల నివేదికలు ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. వీటిని పంపించి ఐదు రోజులు దాటుతున్నా నేటికీ రాలేదు. మరో మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇంజెక్షన్లను వినియోగించాలంటే ల్యాబ్ రిపోర్టులు తప్పనిసరి. పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ కలిసి ఆస్పత్రి పాలైన బాధితులకు మాత్రమే ఈ ఇంజెక్షన్లు ఇస్తారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో క్రియాటినిన్, యూరియా అవశేషాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. వాటిని డయాలసిస్ చేస్తున్న వారికి వినియోగిస్తామని వైద్యులు వెల్లడించడమే తప్ప.. నేటికీ వాడిన దాఖలాలు లేవు. గణేష్ కస్టడీ కోరుతూ పిటిషన్ పాల వ్యాపారి గణేష్ ను అరెస్టు చేసిన పోలీసులు జడ్జి ఎదుట హాజరుపరచడంతో న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో అతడిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. గణేష్ ను 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ జిల్లా పోలీసులు రాజమహేంద్రవరం న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. ఇప్పటికే 2 రోజులపాటు పోలీసుల వద్ద ఉన్న గణేష్ ను ఏం విచారించారో అంతుచిక్కని రహస్యంగా ఉంది. విచారణలో కల్తీపాల నిజాలు రాబట్టారా?, నిజాలు నిగ్గుతేలి ఉంటే ఎందుకు బహిర్గతం చేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ చర్యలు గణేష్ ను కాపాడేందుకు, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమేనని వైఎస్సార్సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. -
వడలు, గార్లు కాదు.. వడగర్లు!
కోనసీమ జిల్లా: పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారులకు బుధవారం భారీగా మత్య్స సంపద లభించింది. వడగర్లు రకం చేపలు సుమారు రెండు టన్నులు వలకు చిక్కడంతో గంగపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేజీ రూ.50 చొప్పున ఉంటుందని వారు తెలిపారు. మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారని తెలిపారు. ఈ మేరకు వీటి ఎగుమతికి ఐస్ బాక్సుల్లో భద్రపరిచే పనులను కొనుగోలుదారులు చేపట్టారు. అలాగే వలకు చిక్కిన భారీ సొర చేప 10 కేజీలు రూ.10 వేలకు పాటదారుడు చేజిక్కించుకున్నాడు. -
కల్తీ పాల ఘటన.. బాధితుల హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వివిధ ఆసుపత్రిలో 15 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బాధితుల పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బాధితులకు చికిత్స కోసం యాంటీడోట్ తెప్పించామని అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలో వెంటిలేటర్పై ఇద్దరు, ముగ్గురికి డయాలసిస్, మరో ముగ్గురిని వెంటిలేటర్పై ఉంచి డయాలసిస్, ఏడుగురిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు సిబ్బంది చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాలలో ఏ పదార్థాలు కలిశాయో ఇప్పటివరకు ల్యాబ్ రిపోర్టులో స్పష్టం కాలేదు. ల్యాబ్ రిపోర్ట్ రాకుండా యాంటీ డోట్ ఎలా ఇస్తారో అర్థం కాని పరిస్థితిలో బాధిత కుటుంబాలు ఉన్నాయి. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఇద్దరికి అనూరియా లక్షణాలు బయటపడ్డాయి.ఇదిలా ఉండగా.. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల్లో చేరగా.. ఇప్పటికే ఆరుగురు మృతి చెందిన విషయం విదితమే. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. రక్త నమూనా నివేదికలు వచ్చేదెప్పుడో! నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో 110 కుటుంబాలకు కోరుకొండకు చెందిన గణేష్ పాలు పోశారు. ఈ కుటుంబాల పరిధిలో 315 రక్త నమూనాలు తీసుకున్నారు. పాల శీతలీకరణ యంత్రంలో లీకేజీ ఏర్పడి ఇథలీన్ గ్లైకాల్ పాలలో కలిసి ప్రమాదం జరిగిందంటూ ఆ పాలను, అస్వస్థతకు గురైన వారి రక్త నమూనాలు పరీక్షల నిమిత్తం ముంబైలోని ఫోరెనిక్స్ ల్యాబ్కు పంపారు. బాధితులకు అత్యవసరంగా ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను రూ.లక్షలు వెచ్చించి ముంబై నుంచి హుటాహుటిన రప్పించారు.అయితే.. ఆ ఇంజెక్షన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కల్తీపాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితుల శరీరంపై ఇథలీన్ గ్లైకాల్ ప్రభావం ఉంటే మాత్రమే ఆ ఇంజెక్షన్లు చేయాలి. అలా కాకుండా కల్తీ జరిగి ఉంటే ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. రక్త నమూనాలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతుండటంతో ఆ ఇంజెక్షన్లు ఉపయోగించలేని పరిస్థితి. ఈ సందిగ్ధ స్థితి బాధితులకు ప్రాణ సంకటంగా మారుతోంది. పాల కల్తీపై నేటికీ స్పష్టత రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి ల్యాబ్కు రక్త నమూనాలు ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టులు రావడం ఆలస్యం అవుతుండటంతో అధికారులు బాధితుల నుంచి మరోసారి రక్త నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్కు పంపారు. వాటి నివేదిక గురువారం సాయంత్రానికి అందే అవకాశం ఉంది. దానిని బట్టి వైద్యం ఏవిధంగా చేయాలో నిర్ణయిస్తారు. -
H½-ïÜyîl çœ#yŠæ MøÆý‡$tMýS$ ˘ రూ.11 వేల జరిమానా
అమలాపురం టౌన్: అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టు (హోటల్)లో నిల్వ మాంసంతో ఆహారం పెట్టారంటూ వచ్చిన ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ బుధవారం ఆ హోటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిపై ఒక వినియోగదారుడు మంగళవారం రాత్రి మున్సిపాలిటీ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆ హోటల్ను తొలుత మున్సిపల్ ఇన్విరాల్మెంట్ ఏఈ వెంకటేష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సిబ్బంది తనిఖీ చేశారు. లోపల పలు విభాగాల్లో అపరిశుభ్రత ఉందని పేర్కొంటూ హోటల్ యాజమాన్యానికి రూ.వెయ్యి జరిమానా విధించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్యతో మున్సిపల్ కమిషనర్ నిర్మల్కుమార్ ఫోన్లో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో జరిగిన పాలు కల్తీ ఘటన నేపథ్యంలో కోనసీమ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్య అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ రంగంలోకి దిగి ఏబీసీడీ ఫుడ్ కోర్టును స్వయంగా తనిఖీ చేశారు. ఫుడ్ కోర్టులో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ కోర్టులో నూనెను రీయూజ్డ్ చేస్తున్నారని, మాంసాన్ని ఫ్రిజ్ల్లో ఉంచి వాడుతున్నారని, మసాలా దినుసుల ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఐ ముద్ర లేదని గుర్తించారు. ఈ తప్పిదాలపై అధ్యయనం చేసిన కమిషనర్.. హోటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి రామయ్య తనిఖీ అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టు హోటల్ను జిల్లా ఫుడ్ సేఫ్టీ అదికారి వై.రామయ్య బుధవారం రాత్రి తనిఖీ చేశారు. అక్కడి మాంసాహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. వాటిని హౌదరాబాద్లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. -
జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ కెనడీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్గా జీఎంసీ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్ కెనడీని నియమించారు. ఇప్పటి వరకూ పనిచేసిన పీవీవీ సత్యనారాయణను ఆకస్మికంగా తొలగించారు. గత ఏడాది నవంబర్ 3న జీఎంసీ రాజమహేంద్రవరం జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ కం హెచ్వోడీగా పనిచేస్తున్న డాక్టర్ పీవీవీ సత్యనారాయణను సూపరింటెండెంట్గా నియమించారు. నాటి నుంచి రాజమహేంద్రవరం జీజీహెచ్ అనేక వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అక్రమ వసూళ్ల వ్యవహారంపై ప్రభుత్వం ఈ నెల 27న విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈలోపే డాక్టర్ పీవీవీ సత్యనారాయణను తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 1న ‘అంబేడ్కర్ గురుకులం’ ప్రవేశ పరీక్ష రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరం (బొమ్మూరు)లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం (బాలికలు)లో ఐదో తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేరడానికి ప్రవేశ పరీక్షను మార్చి 1వ తేదీన నిర్వహించనున్నారు. ప్రిన్సిపాల్ అన్నం వాణీకుమారి బుధవారం ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఐదో తరగతి, మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు జూనియర్ ఇంటర్ (జనరల్), మధ్యాహ్నం 3 నుంచి 4.30 వరకు జూనియర్ ఇంటర్ (ఐఐటీ, నీట్) ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. 6, 7, 8, 9, 10 తరగతులలో బ్యాక్లాగ్ ఖాళీలకు మార్చి 2న జరగాల్సిన పరీక్షను మార్చి 8వ తేదీకి మార్పు చేసినట్టు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ సకాలంలో హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, ఆధార్కార్డు జిరాక్స్, ఒక పాస్పోర్టు సైజ్ ఫొటో తీసుకుని పరీక్షకు హాజరు కావాలని కోరారు. ఆలయానికి రూ.లక్ష విరాళం దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నంలో వేంచేసిన గౌరీ సమేత మహాలింగేశ్వరస్వామి దేవస్థానానికి చాగల్లు మండలం బ్రాహ్మణగూడెంకు చెందిన ఆత్కూరి వెంకటకృష్ణ దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. వారిని ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. లండన్లో పెద్దాపురం యువకుడి సజీవ దహనం కాకినాడ క్రైం/సామర్లకోట: ఇంగ్లండ్ దేశ రాజధాని లండన్లో కాకినాడ జిల్లాకు చెందిన ఓ యువకుడు సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయాడు. లండన్ ఫైర్ బ్రిగేడ్, మెట్రోపాలిటన్ పోలీసుల కథనం మేరకు, పెద్దాపురానికి చెందిన గొంతి అభిషేక్(26) ఏ232 క్రోయిడాన్ ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఓ రెండు అంతస్తుల భవనంలో వాటిల్లిన అగ్ని ప్రమాదంలో మరణించాడు. ఈ ప్రమాదం ఈ నెల 23 తెల్లవారుజామున 1.30 సమయంలో, భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు చోటు చేసుకుంది. ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే చనిపోగా మరో భారతీయ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే భవంతిలో కింది అంతస్తులో ఉన్న మరో విదేశీ యువకుడు అగ్నికీలల్ని గుర్తించి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. సుమారు రెండు గంటల పాటు శ్రమించిన సౌత్ లండన్ అగ్నిమాపక సిబ్బంది తెల్లవారుజామున 2.47 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. యువకుల నివాసం అధిక భాగం చెక్కతో నిర్మితం కావడం ప్రమాద తీవ్రతను పెంచిందని తెలిపారు. అభిషేక్ మూడేళ్ల క్రితం హోం సైన్స్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి స్థానికంగా ఉద్యోగం చేస్తున్నాడు. అభిషేక్ తండ్రి ఆస్కార్రావు ఏలూరు జిల్లా అగిరిపల్లి ఆరోగ్య కేంద్రం పరిధిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఈయన ఉద్యోగ వేదిక చైర్మన్గా, ఏపీజీఈఏ జనరల్ సెక్రటరీగా, ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కీలక హోదాల్లో పనిచేశారు. ఆస్కార్రావు, రాధిక దంపతుల ఏకై క కుమారుడు అభిషేక్, ఇతడికి ఇద్దరు అక్కలు ఉన్నారు. వీరిలో షమీమా కెనడాలో వైద్యురాలిగా స్థిరపడ్డారు. షకీనా వైద్యురాలిగా విజయవాడలో పనిచేస్తున్నారు. అభిషేక్ మృతదేహం దేశానికి చేరేందుకు కనీసం వారం రోజులు పట్టవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా..ఆస్కార్రావుకు పలువురు సానుభూతి తెలిపారు. -
సహకార ఉద్యోగుల సమ్మె విరమణ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సహకార ఉద్యోగుల జీతాలు 20 శాతం పెంపు, గ్రాట్యూటీని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచడంతో పాటు, ప్రతి ఉద్యోగికి రూ.5 లక్షల కవరేజీతో సమగ్ర గ్రూప్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సమ్మె విరమించినట్లు ఏపీ రాష్ట్ర సహకార ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలోని డీసీసీబీ బ్రాంచ్ వద్ద జరిగిన సహకార ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. పీఏసీఎస్ ఉద్యోగులకు ప్రకటించిన ప్రయోజనాల అమలు విధానాలను ఉన్నత స్థాయి కమిటీ అతి త్వరలో ప్రకటిస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారన్నారు. పీఏసీఎస్ యూనియన్లకు సంబంధించిన ఇతర డిమాండ్లను కూడా కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుందన్నారు. ఉద్యోగులు ఎటువంటి అపోహలకు, అధైర్యానికి గురి కాకుండా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు కె.వీరభద్రరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.రామచంద్రరావు, డైరెక్టర్లు బి.సత్యనారాయణ, ఎస్.అప్పారావు, బి.రాంబాబు పాల్గొన్నారు. -
ఉప్పొంగి.. ఉజ్వలమై..
ఆశాజనకంగా వర్షాలు ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవడంతో లోయర్ సీలేరు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరకుని కళకళలాడుతున్నాయి. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసింది. సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలు మార్చి నాటికి లక్ష్యానికి చేరుకున్నాయి. 5, 6 యూనిట్లు అనుసంధానం పనుల వల్ల లక్ష్యానికి మించి జలవిద్యుత్ ఉత్పత్తి జరగలేదు. – కేవీ రాజారావు, చీఫ్ ఇంజినీర్, పొల్లూరు లక్ష్యానికి దగ్గరలో.. ఏపీ జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఏడాది పొడవునా కష్టపడుతున్నారు. ఈ ఏడాది కూడా లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. – బాలకృష్ణ, డీఈ, ఏపీ జెన్కో పొల్లూరు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం మోతుగూడెం: సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలు మూడేళ్లుగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మాచ్ఖండ్, అప్పర్ సీలేరు, డొంకరాయి, పొల్లూరు, లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి సాధిస్తూ ఇటు జెన్కోకు, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు కట్టి సుమారు 50 ఏళ్లు దాటుతున్నా, పూర్తిస్థాయిలో ఆధునీకరించకపోవడంతో ఇంజినీర్లు, కార్మికుల సమష్టి కృషితో విద్యుత్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో సాగుతోంది. గత మూడేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాలకు లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయి. చవకగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఇటు రైతులకు గృహ అవసరాలకు వెలుగులు నింపుతున్నాయి. మూడేళ్లుగా వర్షాలు సరిపడినంత పడడంతో రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి విద్యుత్ ఉత్పత్తి బాగుంది. మూడేళ్లుగా రబీ సీజన్కు సుమారు 250 టీఎంసీల వరకు నీరు అందించాయి. ఏటా సీలేరు జల విద్యుత్ కేంద్రాలకు లక్ష్యాలు విధిస్తున్నప్పటికీ అంతకు మించే ఉత్పత్తి చేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేసే జల విద్యుత్ కేంద్రాలుగా ఇవి రికార్డు సాధించాయి. సాగర్, శ్రీశైలం మన రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. ఈ నాలుగు కేంద్రాల నుంచి సుమారు 975 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడం విశేషం. ఏపీ జెన్కో సంస్థకు ధర్మల్ కేంద్రాలు ఉన్నప్పటికీ ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి సుమారు రూ.7 వరకు ఖర్చు అవుతుండగా జల విద్యుత్ కేంద్రాల్లో యూనిట్కు రూ.3 ఖర్చు అవుతుంది. ఈ నాలుగు జల విద్యుత్ కేంద్రాలు పీక్ లోడ్ అవర్స్ లో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ భారీగా ఆదాయం సమకూరుస్తున్నాయి. ప్రస్తుతం ఒడిస్సా ఆంధ్ర ఉమ్మడి జలాశయాలు అయినా జోలాపుట్, బలిమెల జలాశయాల్లో ఆంధ్ర వాటాగా సుమారు 60 టీఎంసీల వరకు వస్తుండగా ఆ నీరు గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు వస్తాయి. ప్రస్తుతం వాటిలో సుమారు 14 టీఎంసీల వరకు నిల్వ ఉన్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. ఈ వేసవిలో కూడా రిజర్వాయర్లలో నీటిమట్టాలు ఆశాజనకం ఉండడంతో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయినట్టు వారు తెలిపారు. ఒక్క మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రమే ఈ ఏడాది లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు వారు అధికారులు తెలిపారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాలు మార్చి నాటికి లక్ష్యానికి చేరుకుంటాయని తెలిపారు. ఈ మూడు కేంద్రాలు సైతం ఈ ఏడాది లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, పొల్లూరు రెండో దశలో కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు సాగుతుండడంతో సుమారు మూడు నెలల పాటు జల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. లేకుంటే ఈ మూడు ప్రాజెక్టులూ లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసేవి. అంతే కాకుండా రెండో దశ నిర్మాణంలో భాగంగా పొల్లూరు జల విద్యుత్ కేంద్రం వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఐదు ఆరు యూనిట్లు నిర్మాణం పూర్తయితే మరో 230 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి రానుంది. దీంతో సీలేరు కాంప్లెక్స్ ఉత్పత్తి సామర్థ్యం మొత్తం 1205 మెగావాట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద జల విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా రూపొందనుంది. ఈ కొత్త యూనిట్లు మరో ఏడాదిలో పూర్తికానున్నాయి. జల విద్యుత్ కేంద్రాల్లో మూడేళ్ల విద్యుత్ ఉత్పత్తి మిలియన్ యూనిట్లలో.. జల విద్యుత్ కేంద్రం 2023–24 2024–25 2025–26 లక్ష్యం – ఉత్పత్తి లక్ష్యం – ఉత్పత్తి లక్ష్యం – ఉత్పత్తి మాచ్ఖండ్ 626 535.576 630 554.698 657 747.52 అప్పర్ సీలేరు 470 485 477 495.7 477 388 పొల్లూరు 1084 1090 1095 1120.63 1084 944 డొంకరాయి 99 105.732 95 105.224 95.94 84.612 సీలేరు కాంప్లెక్స్ పరిధిలో రికార్డు స్థాయిలో జలవిద్యుత్ నాలుగు విద్యుత్ కేంద్రాల నుంచి 975 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టులు నిర్మించి 50 ఏళ్లు అయినప్పటికీ ఆధునీకరణ అంతంతే ఘనతంతా అధికారులు, సిబ్బందిదే మూడేళ్లుగా లక్ష్యానికి మించి ఉత్పత్తి ఉభయ గోదావరి జిల్లాలకు సమృద్ధిగా తాగు, సాగునీరు చౌక ధరలకు విద్యుత్ సరఫరా -
కల్తీ పాల ఘటనకు చంద్రబాబే బాధ్యత తీసుకోవాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కల్తీ పాల వల్ల రాజమహేంద్రవరంలో జనం మృతి చెందిన ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబే తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం, అధికారుల అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. పాల కేంద్రాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. కానీ సంవత్సరాల తరబడి తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ఈ మరణాలు సంభవించాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులను ఈ పాటికే సస్పెండ్ చేయాలన్నారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు అతి ప్రచారం వల్ల 29 మంది చనిపోయారన్నారు. ఇటీవల సింహాచలం, తిరుమల, శ్రీకాకులం వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు చనిపోయారన్నారు. ఇటువంటి వరస ఘటనలు చూస్తూ ఉంటే చంద్రబాబు సైకో మైండ్ సెట్ అర్థమవుతుందన్నారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ ప్రభుత్వాలు చేసిన హత్యేనని హర్షకుమార్ అన్నారు. ప్రవీణ్ను ఎవరు హత్యచేశారో, ఎందుకు చేశారో కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలుసునన్నారు. ఒక పాస్టర్ తాగుతూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే, దానిపై మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు పలుమార్లు వ్యాఖ్యానించడం కోర్టును ప్రభావితం చేయడమేనన్నారు. ప్రవీణ్ కేసు కోర్టులో నడుస్తుండగా సీఎం ఎలా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్టు చూస్తే ఆయన హత్యకు గురయ్యారని తెలిసిపోతుందన్నారు. ప్రవీణ్ పగడాల మరణించి 11 నెలలు గడచినా కోర్టులో ఎందుకు ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. -
ప్రకృతి సాగుకు ఉత్సాహాన్నిచ్చారు
● జిల్లా కలెక్టర్ కీర్తి ● మాజీ స్పెషల్ సీఎస్ విజయ కుమార్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రకృతి వ్యవసాయానికి కొనుగోలుదారులు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారని కలెక్టర్ కీర్తి అన్నారు. బుధవారం ప్రకృతి వ్యవసాయంపై స్థానిక జేఎన్రోడ్డు లోని సూర్య గార్డెన్స్లో కొనుగోలుదారులు – విక్రేతల అనుసంధాన సమావేశం నిర్వహించారు. తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కోనసీమ, కృష్ణా, కాకినాడ (డెల్టా ప్రాంతం) జిల్లాలకు చెందిన బీఆర్సీ (బయో రిసోర్స్ సెంటర్) ఉత్పత్తులు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ డెల్టా ప్రాంత రైతులు, అగ్రిగేటర్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్లు పరస్పర అనుసంధానం కావడానికి ఈ సమావేశం వేదికగా నిలిచిందన్నారు. రైతు ఉత్పత్తులకు ప్రత్యక్ష మార్కెటింగ్ కల్పించడమే లక్ష్యంగా ఈ నెట్ వర్కింగ్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రకృతి సాగు ద్వారా రసాయన రహిత, నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించవచ్చన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి మాత్రమే కాకుండా మార్కెటింగ్ వైపు కూడా దృష్టి సారించాలని సూచించారు. వినియోగదారుడికి నేరుగా అనుసంధానం ఏర్పడితే రైతు ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. మాజీ స్పెషల్ ప్రధాన కార్యదర్శి, రైతు సాధికార సమితి కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు, టి.విజయ్కుమార్ జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొని రైతులు, వ్యాపారవేత్తలు, కొనుగోలు దారులతో ప్రత్యక్షంగా మాట్లాడి విత్తనం నుంచి పంట కోత వరకు ప్రకృతి సాగు విధానాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్ ప్రతి రైతు ఉత్పత్తి దశతో పాటు మార్కెటింగ్ దశలోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. రైతు ఒక ఉత్పత్తిదారుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా ఆలోచించే దిశగా ముందుకు రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పంపాలో కొండచిలువ హల్చల్
అన్నవరం: స్థానిక పంపా ప్రాజెక్టు గేట్లు, పరిసరాలలో బుధవారం భారీ కొండచిలువ హల్చల్ చేసింది. పంపా ప్రాజెక్టు గేట్లు, బ్యారేజీ వద్ద బుధవారం సుమారు పది అడుగుల కొండచిలువను స్థానిక యువకులు గుర్తించారు. అక్కడికి దగ్గరలోనే పలు కుటుంబాలు గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ సమాచారంతో వారు ఆందోళన చెందారు. కొండచిలువ సంచారం విషయాన్ని యువకులు ప్రాజెక్టు సిబ్బందికి తెలియజేయగా వారు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. శంఖవరం ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ నాగేశ్వరరావు తన బృందంతో వచ్చి దానిని చాకచక్యంగా గోనెసంచెలో బంధించారు. దాని బరువు 12 కిలోలు ఉండగా పొడవు 8.2 అడుగులు ఉందని తెలిపారు. దానిని పాండవుల కొండ రిజర్వ్ఫారెస్ట్లో వదిలిపెట్టినకుట్టు అటవీ సిబ్బంది తెలిపారు. రాయి పడి కార్మికుడి మృతి దేవరపల్లి: మండలంలోని గౌరీపట్నంలో నల్లరాతి క్వారీలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం గౌరీపట్నం పంచాయతీ శివారు కొండగూడెంలోని ఓ క్వారీలో బుధవారం కార్మికుడు అవిటి యేసు (42) డ్రిల్లింగ్ చేస్తుండగా, పై నుంచి రాయి తలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. యేసుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ స్తంభం పడి సైక్లిస్టు మృతి
మామిడికుదురు: మండలం పెదపట్నంలంకలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. సైకిల్పై వెళ్తున్న వ్యక్తిపై విద్యుత్ స్తంభం విరిగి పడి అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి తృటిలో తప్పించుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో కుల వృత్తి చేసుకునే మానేపల్లి శ్రీమన్నారాయణ (65) రెండు వివాహాల నిమిత్తం అవిరేడు కుండలు ఇచ్చి సైకిల్పై ఇంటికి వెళ్తుండగా గిడుగువారిపాలెంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న కొబ్బరి చెట్టు విద్యుత్ తీగలపై పడింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడి ట్రాన్స్ఫార్మర్తో సహా స్తంభం విరిగి శ్రీమన్నారాయణపై పడింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి గొల్లమందల నాగరాజు పరుగులు పెట్టడంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని శ్రీమన్నారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని కుమారుడు మానేపల్లి దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అందరితో అప్యాయంగా ఉండే శ్రీమన్నారాయణ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్తో..అంబాజీపేట: కొబ్బరికాయల దింపునకు కొబ్బరి చెట్టు ఎక్కుతుండగా విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందంపూడి గ్రామానికి చెందిన నేదునూరి జనార్దనరావు (55) బుధవారం కొబ్బరికాయలు దింపు తీసేందుకు చెట్టు ఎక్కుతున్నాడు. కొబ్బరిచెట్టుకు సమీపంలో విద్యుత్ వైర్లపై ఉన్న ఎండు కొబ్బరి ఆకు జనార్దనారావుకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై చెట్టుపైనే విగతజీవిగా వేలాడిపోయాడు. జనార్దనరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రిజర్వాయర్లో మునిగి.. గంగవరం: మతి స్థితిమితం లేని ఓ వృద్ధురాలు సూరంపాలెం రిజర్వాయర్లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. ఎస్సై వెంకయ్య బుధవారం రాత్రి తెలిపిన వివరాల మేరకు మండలం మొల్లేరు గ్రామానికి చెందిన చొప్పా కృష్ణవేణి (70) చిన్నతనం నుంచి మతి స్థిమితం లేక పలు చోట్లకు నడిచి వెళ్లిపోతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఆమె సూరంపాలెం రిజర్వాయర్ నీటిలో మునిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బుధవారం సాయంత్రం ఆమె మృతదేహం తేలినట్లు గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నట్టు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీయించి ఆమెను గుర్తించి మొల్లేరు గ్రామస్తురాలిగా నిర్ధారించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వాహనం ఢీకొని..రంగంపేట: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో మహిళ మృతి చెందినట్టు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. బుధవారం రాత్రి ఆయన తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని కోటపాడు శివారు రామేశంపేట వద్ద బిక్కవోలు వెళ్లే దారిలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయంలో సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు గల మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలైన ఆమెను స్థానికులు 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే ఆమె మృతి చెందినట్టు చెప్పారని తెలిపారు. కోటపాడు ఇంచార్జి వీఆర్ఓ పుప్పాల రుద్రమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు 94409 04854, 94407 96538 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. -
కిక్ బాక్సింగ్లో నిహారిక ప్రతిభ
ఖేలో ఇండియా సౌత్ జోన్ పోటీలకు ఎంపిక అమలాపురం రూరల్: న్యూఢిల్లీలోని కేడీ జావేద్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ కప్–20 పోటీలలో రామచంద్రపురానికి చెందిన కారుమూరి లేఖా నిహారిక అద్భుత ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలను సాధించింది. ఈ సందర్భంగా ఆమె బుధవారం కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసింది. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని, కోనసీమ ఖ్యాతిని చాటాలని పేర్కొన్నారు. లైట్ కాంటాక్ట్ విభాగంలో రెండు స్వర్ణ పతకాలను గెలుచుకోగా, క్రియేటివ్ ఫామ్ వెపన్ విభాగంలో రజత పతకాన్ని కై వసం చేసుకుందన్నారు. ఆమె ప్రతిభతో బెంగళూరులో నిర్వహించనున్న ఖేలో ఇండియా సౌత్ జోన్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్లు బీకే రత్నం, అంజనీకుమార్లను, ఆమె తల్లిదండ్రులను కలెక్టర్ అభినందించారు. -
వడలు, గార్లు కాదు.. వడగర్లు!
సఖినేటిపల్లి: పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్య్సకారులకు బుధవారం భారీగా మత్య్స సంపద లభించింది. వడగర్లు రకం చేపలు సుమారు రెండు టన్నులు వలకు చిక్కడంతో గంగపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేజీ రూ.50 చొప్పున ఉంటుందని వారు తెలిపారు. మాంసాహార ప్రియులు ఈ రకం చేపల కోసం ఎదురు చూస్తుంటారని తెలిపారు. ఈ మేరకు వీటి ఎగుమతికి ఐస్ బాక్సుల్లో భద్రపరిచే పనులను కొనుగోలుదారులు చేపట్టారు. అలాగే వలకు చిక్కిన భారీ సొర చేప 10 కేజీలు రూ.10 వేలకు పాటదారుడు చేజిక్కించుకున్నాడు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరిపై నల్లి తెగులు, తెల్లదోమ పోటు చర్యలకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ అల్లవరం: ఉభయ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వేలాది ఎకరాల్లో కొబ్బరిని నల్లి తెగులు, తెల్లదోమ పోటు తీవ్రంగా నష్టపరుస్తోందని శాసనమండలిలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రస్తావించారు. నల్లి తెగులు, తెల్లదోమ విస్తారంగా వ్యాప్తి చెందిందని, దీంతో రైతులకు దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోతున్నారని వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెల్లదోమ వల్ల ఆకుపై నల్లటి మచ్చలు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ అడ్డంకిగా మారి దిగుబడి తగ్గడం, పిందెలు రాలిపోవడం జరుగుతున్నాయన్నారు. దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోందో తెలపాలని ప్రశ్నించారు. కొబ్బరితో పాటుగా అరటి, కోకో వంటి వాణిజ్య పంటలపై తీవ్ర ప్రభావం ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నల్లి తెగులు, తెల్లదోమ నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3న దర్శనాలు నిలిపివేత మామిడికుదురు: చంద్ర గ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీ మంగళవారం అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తామని ఈఓ ఎం.రాంబాబు రెడ్డి బుధవారం తెలిపారు. 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 4వ తేదీ బుధవారం ఉదయం సంప్రోక్షణ, నిత్య కై ంకర్యాలు అనంతరం ఉదయం 10 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. -
కనుమరుగై కాదు.. కంటిపాపగా ఉందాం!
● మనసులు విరిగితే మాటలు కలపాలి ● కోపాలు పెరిగితే కాస్తంత సమయం ఆగాలి ● విషాదాంతాలు కాదు.. విరహాంతాలే ముద్దు ● లేకుంటే పిల్లల జీవితాలపై ప్రభావం రాయవరం: రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఆరంభమయ్యే దాంపత్య జీవితం కలకాలం పచ్చగా ఉండాలనే అందరూ ఆకాంక్షిస్తారు. పరిస్థితుల ప్రభావం, మనస్పర్థలు వంటివి ఆ పచ్చని సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ సూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఏమైపోతారో అనే ఆలోచించకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. భర్తను భార్యో, భార్య భర్తనో చంపడమో లేదా చంపించడమో జరుగుతున్నాయి. మనిషి నైతిక విలువలను మరచి దిగజారిపోతున్నాడు. అలా కాకుండా సమస్యను సానుకూలంగా ఆలోచించి నా మనిషేకదా అనుకుంటే సగం పరిష్కారం అయినట్టే. ఆ తరువాత మనసులు నెమ్మదించి మాటలు కలిసి చిలక పలుకులతో చర్చించుకుంటే మళ్లీ ఆ పాత రోజులు నిత్య నూతనాలవుతాయి. అనుమానం పెనుభూతమై బిక్కవోలు మండలం రంగాపురంలో ఒకడు తన భార్యను ఈ నెల 19న హత్య చేశాడు. దీంతో వారి చిన్నారులు తల్లిలేని వారయ్యారు. అలాగే ఈ నెల 17న ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మరొకడు అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేశాడు. సమస్యలు ఎదురైనప్పుడు వీరిని సంప్రదించవచ్చు గృహ హింస నిరోధక చట్టం (2006): మహిళలను శారీరకంగా హింసించడం, గాయపర్చడం, ప్రాణా లకు హాని తలపెట్టడం, మాటలతో మానసికంగా ఒత్తిడి పెంచడం తదితర ఇబ్బందులకు గురి చేస్తే గృహ హింస అవుతుంది. ఇలాంటి సమయంలో బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచితంగా న్యాయసేవలు : కుటుంబాల్లో గొడవలు, వివాదాలను పరిష్కరించుకునేందుకు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. వన్స్టాప్ సెంటర్ : సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం కాకినాడ, అమలాపురంలో వన్స్టాప్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ భార్యభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తారు. గృహ హింసకు పాల్పడితే శిక్షలు, చట్టాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. బాధిత మహిళలకు తాత్కాలికంగా షెల్టర్ ఇస్తారు. గొడవలకు కారణాలివీ.. పని ఒత్తిడిలో భాగస్వామితో సమయం కేటాయించకపోవడం. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో మొదలైన గొడవలు దంపతుల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. ఎవరికి వారే గొప్ప అనుకునే స్వభావం. చిన్న సమస్యలకు కూడా ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకోవడం. ఆర్థిక పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు, అనుకోని ఘటనలతో అప్పుల పాలవడం, వాటిని తీర్చే మార్గంలేక ఇంట్లో వారిపై కోపం చూపడం. సామాజిక మాధ్యమాలు, ఇతర పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీయడం. ఇంట్లో కుటుంబ కలహాలు.. తల్లిదండ్రులు, అత్తామామలను సరిగా చూసుకోక పోవడం. సెల్ఫోన్లో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడుతున్నా భార్య లేదా భర్తపై అనుమానాలు పెంచుకోవడం. ఇద్దరి మధ్య సమన్వయం లేక పోవడం. పరిష్కారాలు ఇలా సమస్య ఎదురైనపుడు సమన్వయం అవసరం. కోపాలు తగ్గించుకోవాలి. గొడవ సద్దుమణిగేలా ఎవరూ తగ్గకపోవడం.. ఒకరినొకరిపై ప్రేమభావం కలిగేలా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇద్దరం సమానమనే భావన కలిగి ఉండాలి. ఆదాయ, ఖర్చులు ఇద్దరికి తెలిసే ఉండాలే చూసుకోవాలి. జీవిత భాగస్వామి ప్రవర్తనకు తగినట్లుగా నడుచుకుంటూ.. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి.. వేర్వేరు కాదు.. ఒకటే అనే భావన ఇద్దరిలో కలగాలి. పిల్లలతో విహార యాత్రకు వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని చూరం చేసుకోవచ్చు. బాధితులు ముందుకు రావాలి క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. దంపతుల కలహాలు, గృహహింస తదితర బాధితులు ముందుకు వచ్చి, పోలీసుస్టేషన్లను సంప్రదించాలి. కుటుంబ సమస్యలతో వచ్చిన భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. సమస్య పరిష్కారం కాకుంటే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. – డి.సురేష్బాబు, ఎస్సై, రాయవరం సానుకూల దృక్పథం అవసరం జీవన విధానంలో మార్పులు వచ్చాయి. సమస్య చిన్నదే అయినా వ్యతిరేక ఆలోచనలతో ఉంటున్నారు. పరిష్కార మార్గాల వైపు కాకుండా సహనం కోల్పోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో అధిక సమయం గడపాలి. – డాక్టర్ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం ప్రశాంతంగా ఆలోచించాలి సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేర సంబంధ ఘటనలను పదేపదే చూడటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మద్యానికి బానిసైన వారిలో మానసిక స్థితి లోపించి భార్యలపై అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదే గొడవలకు, అనర్ధాలకు దారి తీస్తాయి. – డాక్టర్ అఖిలేంద్ర శ్రీనివాస్, సైకియాట్రిస్ట్, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, రాజమహేంద్రవరం -
మిరపలో కొత్తరకం చీడ
● ఐసీఏఆర్–నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి ● నియంత్రణపై అవగాహన సదస్సు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): త్రిప్స్ పార్విస్పినస్గా పిలిచే చీడ పురుగు ఆగ్నేయాసియా మిరపకాయలలో కొత్తగా పుట్టుకొస్తోందని ఐసీఏఆర్–జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. రాజమండ్రిలోని ఐసీఏఆర్–నిర్కా సమావేశ మందిరంలో బుధవారం మిరప పంటలో సస్యరక్షణపై కార్యక్రమం నిర్వహించారు. శేషుమాధవ్ మాట్లాడుతూ మిరప ఉత్పత్తిలో 30–50% నష్టపరిచే సామర్థ్యాన్ని ఈ చీడపురుగు కలిగి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఐసీఏఆర్–నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎన్ సుశీల్, పంట రక్షణ విభాగం అధిపతి డాక్టర్ కె.రాజశేఖరరావు బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ నిర్వహించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.కందన్, డాక్టర్ ఆర్ఆర్ రచన ఈ చీడను నియంత్రించే పద్ధతులపై చర్చించారు. డాక్టర్ టీవీకే సింగ్, డాక్టర్ వి.శ్రీధర్, డాక్టర్ యు.శ్రీధర్ వంటి శాస్త్రవేత్తలు ఈ తెగులు నివారణకు విలువైన సూచనలిచ్చారని నిర్వహణ కార్యదర్శి డాక్టర్ శైలజ జయశేఖరన్ తెలిపారు. -
ఎన్నాళ్లుగా.. ఈ పాపాలు?
రాజమహేంద్రవరం రూరల్/కడియం: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అని ప్రజాకవి వేమన ఏనాడో ప్రశ్నించాడు. అయితే పాలను విషపూరితం చేస్తారని ఆయన కూడా ఊహించలేదు. లేదంటే ‘కడివెడైననేమి గరళ పాలు’ అనే వాడేమో! రాజమహేంద్రవరంలో ఆరుగురు మృతి చెందడంతో పాటు, 15 మంది ఆస్పత్రిపాలు కావడానికి పాలే కారణమని తేలడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అసలు మనం ప్రతి రోజూ తాగుతున్నవి పాలేనా! అన్న అనుమానం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలను పట్టి పీడిస్తోందీ. ఎన్నాళ్లుగా లేక ఎన్నేళ్లుగా ఈ కల్తీపాలను మనం వినియోగిస్తున్నాం? మన ఆరోగ్యాలపై ఇప్పటికే వాటి ప్రభావం మొదలైందా? సంపాదనే ధ్యేయంగా ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి పాలను విషపూరితం చేస్తూ ఎన్నాళ్ల నుంచి వ్యాపారులు ఈ పాపాలను కొనసాగిస్తున్నారు? అన్న సందేహాలు కలుగుతున్నాయి. కల్తీ ప్యాకెట్ పాల కారణంగా క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామన్న అభిప్రాయంతో.. ఎంతోమంది స్వచ్ఛమైన పాలకోసం ఆరా తీస్తుంటారు. తమ సమీపంలో పాల అమ్మకందారుల నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు. ఇంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ప్రస్తుతం కల్తీ పాలు మరణాలకు కారణమయ్యాయంటే.. అసలు ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితిలోకి ప్రజలు వెళ్లిపోయారు. కల్తీ కా నామ్ పాడి! కల్తీ జరిగేదాన్నే పాడి అంటారు! అని జనం సరిపెట్టుకోవాలేమో! ఎందుకంటే జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా పాల ఉత్పత్తి జరగడం లేదన్నది వాస్తవం. డిమాండ్, సప్లయిల మధ్య ఉంటున్న భారీ వ్యత్యాసాన్ని కల్తీ పాల ద్వారానే పూడుస్తున్నారన్నది పచ్చినిజం! వివిధ సంస్థల ద్వారా సరఫరా అయ్యే పాల ప్యాకెట్లను పక్కన పెడితే అనాపాల సరఫరాదారులు ఎంతమంది ఉంటారు? వారు ఎన్ని పాలు అమ్ము తున్నారు? వారు ఎక్కడ నుంచి ఆ పాలను సేకరిస్తున్నారన్న సమాచారం కూడా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటకెక్కిన మిల్క్ యాక్ట్ వినియోగదారులు, సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మిల్క్ యాక్ట్ను రూపొందించారు. ఈ యాక్టు ద్వారా పాల సరఫరాదారులను గుర్తించడం, పాల స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను రూపొందించారు. స్వచ్ఛమైన పాలు వినియోగదారులకు చేరే విధంగా వ్యవస్థకు రూపకల్పన చేశారు. పాల సరఫరాదారులను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే అమూల్ సంస్థను రాష్ట్రానికి తీసుకొచ్చారు.మిల్క్ యాక్ట్ ద్వారా మహిళాసంఘాల బలోపేతానికి కృషి చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యాక్టును అమలును పట్టించుకోలేదు. దీంతో ప్రజలు వినియోగించే పాలు ఎన్ని? వాటిని సరఫరా చేసేవారు ఎంతమంది? వీటి నాణ్యత ఏపాటిది? తదితర అంశాలన్నీ గాల్లో లెక్కలుగానే మిగిలిపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. బ్రాండెడ్ డెయిరీలు కొంత నయం పాలను సేకరించే సమయంలో బ్రాండెడ్ డెయిరీలు పలు జాగ్రత్తలు తీసుకుంటాయి. వాటి సొంత ల్యాబ్లలో పరీక్షలు చేసి మాత్రమే పాలను సేకరిస్తాయి. దీంతో అక్కడికి చేరే పాలల్లో కల్తీ జరిగేది తక్కువేనంటున్నారు. అంటే ప్రజలకు మాత్రం కల్తీ పాలనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లుగా భావించాల్సి వస్తోంది. భారీ స్థాయిలో మోసం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గేదెలు 1,85,000, ఆవులు 74వేలు ఉన్నట్టుగా పశు సంవర్ధకశాఖ లెక్కలు చెబుతున్నాయి. అంటే మొత్తం 2,59,000కు గాను పాలిచ్చే పశువులు 50 శాతం మాత్రమే ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 1,29,500 పశువుల నుంచి రోజుకు 4.61 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా జనాభా సుమారు 22 లక్షలు. సరాసరిన ప్రతి ఒక్కరూ రోజుకు సుమారు 300 మిల్లీలీటర్ల పాలు వినియోగిస్తారని అంచనా వేస్తే.. జిల్లా ప్రజల అవసరాలకే 6.60 లక్షల లీటర్ల పాలు కావాల్సి ఉంటుంది. కానీ ఉత్పత్తి అవుతున్న పాలు 4.61 లక్షల లీటర్లు మాత్రమేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంటే రెండు లక్షల లీటర్ల పాలు కల్తీ చేసే ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కలు ప్రజల రోజూ వినియోగించే పాలకు సంబంధించినవి. ఇవి కాకుండా ప్రయివేటు డెయిరీలు సేకరించేవి, ఇతరత్రా అవసరాలకు సరఫరా అయ్యే పాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే కల్తీ మరింత భారీగా పెరుగుతుందంటున్నారు. సాధారణ కల్తీ ఇలా.. పాల లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వ్యాపారులు కల్తీకి తెగబడుతున్నారు. పాలకు రంగు, చిక్కదనం, నురుగును రప్పించేందుకు యూరియా, మైదా, డిటర్జెంట్లను వినియోగిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఇవి కాకుండా పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు కూడా పలు రసాయనాలను వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇది కాకుండా వెన్న తీసేసిన పాలకు కూడా జిడ్డును రప్పించేందుకు కూడా పలు పదార్థాలను వాడుతున్నారంటున్నారు. ప్రస్తుతం ఈ కల్తీ గుట్టును తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపైనే ఉంది. -
వీడని కల్తీ పాల ఆందోళన
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కల్తీపాల కలకలం కొనసాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు మృత్యువాత పడతారో అన్న ఆందోళన నెలకొంది. కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల్లో చేరగా.. ఇప్పటికే ఆరుగురు మృతి చెందిన విషయం విదితమే. ప్రస్తుతం 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. శనివారం నుంచి ముగ్గురికి డయాలసిస్ చేస్తుండగా బుధవారం నాటికి ఆ సంఖ్య 6కు పెరిగింది. వెంటిలేటర్, డయాలసిస్ సేవలు పొందుతున్న వారు ముగ్గురు ఉండగా.. బుధవారం ఆ సంఖ్య 8కి చేరింది. మరొకరు వెంటిలేటర్ మీద ఉన్నారు. దయనీయ స్థితిలో ముగ్గురు చిన్నారులు రాజమహేంద్రవరంలోని కిమ్స్ ఆస్పత్రిలో 8 మంది బాధితులకు.. రెయిన్బో ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులకు వైద్యం అందిస్తున్నారు. వీరిలో 5 నెలల పసికందు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. బొడ్డు నుంచి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. అచేతనావస్థలో ఉన్న చిన్నారులను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ‘ఎప్పటికి లేచి తిరుగుతారు కన్నా..’ అంటూ ఆందోళన చెందుతున్నారు. రక్త నమూనా నివేదికలు వచ్చేదెప్పుడో! నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్ తదితర ప్రాంతాల్లో 110 కుటుంబాలకు కోరుకొండకు చెందిన గణేష్ పాలు పోశారు. ఈ కుటుంబాల పరిధిలో 315 రక్త నమూనాలు తీసుకున్నారు. పాల శీతలీకరణ యంత్రంలో లీకేజీ ఏర్పడి ఇథలీన్ గ్లైకాల్ పాలలో కలిసి ప్రమాదం జరిగిందంటూ ఆ పాలను, అస్వస్థతకు గురైన వారి రక్త నమూనాలు పరీక్షల నిమిత్తం ముంబైలోని ఫోరెనిక్స్ ల్యాబ్కు పంపారు. బాధితులకు అత్యవసరంగా ఇవ్వాల్సిన ఇంజెక్షన్లను రూ.లక్షలు వెచ్చించి ముంబై నుంచి హుటాహుటిన రప్పించారు. అయితే.. ఆ ఇంజెక్షన్లు నిరుపయోగంగా ఉన్నాయి. కల్తీపాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితుల శరీరంపై ఇథలీన్ గ్లైకాల్ ప్రభావం ఉంటే మాత్రమే ఆ ఇంజెక్షన్లు చేయాలి. అలా కాకుండా కల్తీ జరిగి ఉంటే ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. రక్త నమూనాలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు రావడంలో జాప్యం జరుగుతుండటంతో ఆ ఇంజెక్షన్లు ఉపయోగించలేని పరిస్థితి. ఈ సందిగ్ధ స్థితి బాధితులకు ప్రాణ సంకటంగా మారుతోంది. పాల కల్తీపై నేటికీ స్పష్టత రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి ల్యాబ్కు రక్త నమూనాలు ముంబై ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి రిపోర్టులు రావడం ఆలస్యం అవుతుండటంతో అధికారులు బాధితుల నుంచి మరోసారి రక్త నమూనాలు సేకరించి తిరుపతిలోని ల్యాబ్కు పంపారు. వాటి నివేదిక గురువారం సాయంత్రానికి అందే అవకాశం ఉంది. దానిని బట్టి వైద్యం ఏవిధంగా చేయాలో నిర్ణయిస్తారు. భయం గుప్పిట్లో బాధితులు కల్తీ పాల ఘటన జరిగి ఇప్పటికే 10 రోజులు అవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. విషమంగా ఉన్న 8 మంది ఆరోగ్యంపై బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో చేరిన వారే కాకుండా గణేష్ వద్ద పాలు వినియోగించిన వారినీ భయం వెంటాడుతోంది. తమపై కల్తీ పాలు దుష్ప్రభావం చూపిస్తాయా అన్న ఆందోళనతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. నేతల కూలెంట్ లీకేజీ ప్రచారం ల్యాబ్ రిపోర్టులు ఇంకా బహిర్గతం కాలేదు. అయినా.. కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ ఒకే పాట అందుకున్నారు. వరలక్ష్మి డెయిరీలో ‘కూలెంట్ లీకేజీ’ జరిగి పాలల్లో ఇథలీన్ గ్లైకాల్ కలిసిందంటూ బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అధికారుల దర్యాప్తులోనూ ఇదే వెల్లడైనట్టు ఎంపీ పురందేశ్వరి సహా ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ల్యాబ్ రిపోర్టులు అందకముందే ఇలాంటి ప్రచారం విస్తృతం చేయడం వెనుక ఏదో ఆంతర్యం దాగుందని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పొరపాటుగా కల్తీ జరిగిందని, ఇందులో ప్రభుత్వ పాత్ర లేదని చెప్పేందుకే కూలెంట్ వాదన తెరపైకి తెచ్చారన్న ఆరోపణలున్నాయి. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలన్న ఉద్దేశంతో కూలెంట్ లీకేజీ ప్రచారం చేస్తున్నారన్న అనుమానాన్ని వైఎస్సార్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన వెలుగు చూసిన వెంటనే అధికారులు బాధితుల రక్తంలో యూరియా, క్రియాటినిన్ అవశేషాలు ఉన్నాయని చెప్పారు. వైద్యుల నివేదికల్లోనూ ఇదే స్పష్టమైనట్టు వెల్లడించారు. తాజాగా ఇథలీన్ గ్లైకాల్ కలిసిందంటూ ప్రచారం చేస్తున్నారు. -
ఇది ఆ పులి కాదు
సీటిఆర్ఐ (రాజమహేంద్రవరం): పాపికొండల అభయారణ్యంలో ఇటీవల విడిచిపెట్టిన పులి మళ్లీ రంప ప్రాంతంలోకి వచ్చిందంటూ అక్కడి అధికారులు చెబుతుండగా.. ఆ పులి ఇది కాదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠనాథరెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ప్రాంతీయ అటవీ శాఖ కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో హడలెత్తించిన పెద్ద పులి.. మళ్లీ జనావాసాల్లోకి వచ్చిందన్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని చెప్పారు. కూర్మాపురం వద్ద పట్టుకున్న పులిని ఈ నెల 14న పాపికొండల నేషనల్ పార్కులో విడిచిపెట్టామన్నారు. ముందుగా దానికి జీపీఎస్ రేడియో ట్రాకర్ సిస్టం అమర్చామన్నారు. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణం గల ఆ పార్కులో అది ఎక్కడ ఉందో తమకు తప్ప ఎవరికీ తెలియదన్నారు. దాన్ని విడిచిపెట్టిన ప్రాంతంలో ఆహారంగా జింకలను కూడా వదిలామన్నారు. అది మగ పులి కాబట్టి, రెండు ఆడ పులులను తీసుకువచ్చి ఆ ప్రాంతంలో విడిచిపెట్టనున్నట్లు తెలిపారు. తాజాగా పులి తిన్న ఒక జంతు కళేబరాన్ని ఆయన మీడియాకు చూపించారు. రంపచోడవరం వద్ద పులి సంచరిస్తుందంటూ వచ్చిన వీడియో నిజం కాదన్నారు. రాజమండ్రి పెద్దపులికి ఎక్స్ ఫ్లోరర్ అని పేరు పెట్టామని, అది మంచి ప్రవర్తన కలిగిన పులి అన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ సెకండియర్ పరీక్షలు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లాలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పార్ట్ 2 సెకండ్ లాంగ్వేజ్లో తెలుగు, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. జనరల్ విభాగంలో 18,888 మంది పరీక్షలు రాయాల్సి వుండగా 18, 617 మంది హాజరయ్యారు. 271 మంది పరీక్షలు రాయలేకపోయారు. వృత్తి విద్యాకోర్సుల్లో 1,885 మందికి 1,794 మంది పరీక్షలు రాశారు. 91 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయని ఇంటర్బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఐ.శారద తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందజేత సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పాల కల్తీ కారణంగా మృతిచెందినవారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం చెక్కులు ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున అందించామని కలెక్టర్ కీర్తి అన్నారు. మంగళవారం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు. స్థానిక ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆనాల ఎన్క్లేవ్ వద్ద తాడి కృష్ణవేణి, తాడి రమణిలకు సంబంధించిన రూ.20 లక్షల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు, లాలాచెరువు గ్లో గార్డెన్ సమీపంలో మృతుడు నీలా శేషగిరిరావు కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చెక్కును అందించారు. అనంతరం కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ చికిత్స పొందుతున్న బాధితుల ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందన్నారు. రేపటి నుంచి సీ పోర్టు రోడ్డు మూసివేతకాకినాడ రూరల్: కాకినాడ డీప్ వాటర్ పోర్టు (సీ పోర్టు) నాలుగో గేటు – కుంభాభిషేకం ఆలయం మధ్య ఏడీబీ రోడ్డుపై (ఎన్హెచ్–216ఎఫ్) లెవెల్ క్రాసింగ్ గేట్ మేజర్ మరమ్మతులు, ట్రాక్ రిపేర్లు చేపడుతున్నారు. ఈ దృష్ట్యా గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ రోడ్డును మూసివేస్తున్నట్లు సీ పోర్టు మేనేజర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 7 నుంచి శనివారం సాయంత్రం 7 గంటల వరకూ మరమ్మతులు చేపడుతున్నందున ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లిస్తామన్నారు. వాహనదారులు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. -
కల్తీ పాల బాధితులకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ
సాక్షి, రాజమహేంద్రవరం: కల్తీ పాలు తాగి ఆస్పత్రి పాలైన బాధితులను వైఎస్సార్ సీపీ నేతల బృందం మంగళవారం పరామర్శించింది. చికిత్స పొందుతున్న కిమ్స్, రెయిన్బో తదితర ఆస్పత్రులకు వెళ్లి బాధితుల ఆరోగ్య పరిస్థితిని నేతలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారు.. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. వైద్యం అందుతున్న తీరును పరిశీలించారు. బాధితుల కుటుంబాలను పలకరించారు. ఎలాంటి సమయంలోనైనా వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా పోరాటం చేస్తామన్నారు. పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ నేతలు మేడపాటి షర్మిలారెడ్డి, చందన నాగేశ్వర్ ఉన్నారు. -
ర్యాంకుల ప్రహసనం
అన్నవరం: ఒక వారం ఒక రాశికి వచ్చిన ఫలితం తరువాతి వారం మరో రాశికి కనిపిస్తుంది. ఇలా 12 రాశుల వారఫలాలు అటూ ఇటూ మారతాయి తప్ప పెద్దగా మార్పు ఉండదని కొంతమంది చమత్కరిస్తూంటారు. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ఐవీఆర్ఎస్ సర్వే పేరిట ప్రభుత్వం ఇస్తున్న ర్యాంకులు కూడా ఇలాగే ఉంటున్నాయి తప్ప పెద్దగా మార్పు కనిపించడం లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సర్వే పేరిట ప్రతి నెలా ప్రభుత్వం ర్యాంకులు విడుదల చేసి చేతులు దులిపేసుకుంటోంది తప్ప.. దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ఈ సర్వేలు ఓ ప్రహసనంగా మిగిలిపోతున్నాయి. అన్నవరం.. ఈసారి నాలుగో స్థానం జనవరి 25 నుంచి ఈ 21వ తేదీ వరకూ రాష్ట్రంలోని ఏడు దేవస్థానాలపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం దేవస్థానం 75 శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. గత జనవరిలో మూడో స్థానంలో నిలవగా ఈసారి ఒక ర్యాంకు తగ్గింది. అయితే, అన్ని విభాగాల్లోనూ సంతృప్తి శాతం పెరగడం విశేషం. జనవరిలో 25.9 శాతం మంది భక్తులు అన్నవరం దేవస్థానంపై అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఈసారి అది 25 శాతానికి తగ్గింది. ద్వారకా తిరుమల దేవస్థానం కేవలం ఒక్క శాతం అంటే 76 శాతం మంది భక్తుల సంతృప్తితో ఈసారి ప్రథమ స్థానంలో నిలిచింది. 67.2 శాతంతో శ్రీశైలం దేవస్థానం ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. విశేషమేమిటంటే మిగిలిన ఐదు దేవస్థానాల్లో కూడా భక్తుల సంతృప్తి శాతంలో ఒకటి రెండు పాయింట్లు తప్ప పెద్దగా తేడా ఏమీ లేదు. దీనినిబట్టి ఈ ఏడు దేవస్థానాల్లోనూ అందిస్తున్న సేవలపై 25 శాత మందికి పైగా భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టే. కానరాని దిద్దుబాటు ఫ వాస్తవానికి ఐవీఆర్ఎస్ సర్వేల పేరుతో ప్రభుత్వం హడావుడి చేసి, ర్యాంకులు ప్రకటిస్తోందే తప్ప తక్కువ ర్యాంకులు వచ్చిన దేవస్థానాల్లో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా ఈ సర్వేల వలన ఎటువంటి ఉపయోగమూ ఉండటం లేదు. ఫలితంగా దీనికోసం చేస్తున్న ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది. ఫ ఈ ఏడు దేవస్థానాల్లోనూ పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టును సీఎం బంధువు అయిన భాస్కర నాయుడుకు చెందిన పద్మావతి హాస్పిటాలిటీ సంస్థ దక్కించుకుంది. దీంతో, ఆ సంస్థ ఏం చేస్తే అదే పారిశుధ్యం అనే పరిస్థితి నెలకొంది. ఏ దేవస్థానంలోనైనా ఆ సంస్థపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తే వెంటనే సీఎంఓ నుంచి ఫోన్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేనప్పటికీ ఏ ఒక్క అధికారి ప్రశ్నించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణకు నాసిరకం శానిటరీ మెటీరియల్ వాడుతున్నారనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఫ తక్కువ ర్యాంకులు వస్తున్న దేవస్థానాలపై కనీసం నెలకొకసారైనా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి సమీక్షలు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్లు, ప్రధాన కార్యాలయంలో సమావేశాలతో పెద్డగా ప్రయోజనం ఉండటం లేదు.అన్నవరం దేవస్థానంలో ఈ నెలలో భక్తుల సంతృప్తి శాతం ఇలా.. సేవలు జనవరి ఫిబ్రవరి సత్యదేవుని దర్శనం 69.9 77.8 మౌలిక వసతులు 71.4 71.4 గోధుమ నూక ప్రసాదం నాణ్యత 82.3 81.6 పారిశుధ్యం 66.9 69.6 ఫ దేవాలయాల్లో ఐవీఆర్ఎస్ సర్వే పేరిట హడావుడి ఫ ర్యాంకుల విడుదల ఫ పలు సేవలపై ప్రతిసారీ భక్తుల అసంతృప్తి ఫ దిద్దుబాటు చర్యలు చేపట్టని ప్రభుత్వం అన్ని విభాగాల్లోనూ తనిఖీలు అన్నవరం దేవస్థానంలో ప్రతి విభాగాన్నీ తనిఖీ చేసి, భక్తులకు మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి వారం అన్నదానం, ప్రసాద విభాగాలను తనిఖీ చేసి, నాణ్యతపై పరిశీలన చేసి, తగు ఆదేశాలిస్తున్నాం. పారిశుధ్య విభాగంలో కూడా భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సేవలందించాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించాం. రానున్న రోజుల్లో దేవస్థానం ర్యాంకు మరింత మెరుగు పడేలా చర్యలు తీసుకుంటాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
యంత్రాంగం స్పందన అభినందనీయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి అనారోగ్యం పాలైన ఘటనపై కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా అధికారుల తక్షణ స్పందన అభినందనీయమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. స్థానిక కిమ్స్ బొల్లినేని, రెయిన్బో, ఆదిత్య ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె మంగళవారం పరామర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గణేష్ అనే పాల వ్యాపారి వద్ద పాల శీతలీకరణ యంత్రం నుంచి ఇథిలిన్ గ్లైకోల్ అనే రసాయనం లీక్ కావడం వల్లే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. పాడి పశువులకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కేసుల్లో బాఽధితులకు అందిస్తున్న వైద్య సేవలను విశాఖపట్నం నుంచి వచ్చిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రవిరాజు పరిశీలించారు. ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అంచనా వేశారు. -
ఆగని కల్తీ పాల మరణాలు
సాక్షి, రాజమహేంద్రవరం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం)/మహారాణిపేట (విశాఖ): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలకూట విష ప్రభావం రోజు రోజుకూ మరింతగా పెరుగుతోంది. తాజాగా స్వరూప్ నగర్కు చెందిన చిన్నారి డి.మనోహర్ (6) విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అ బాలుడిని మూత్రపిండాల సమస్యతో తొలుత రాజమహేంద్రవరం జీజీహెచ్కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి నుంచి ఆదివారం మధ్యాహ్నం విశాఖకు తరలించారు. పరీక్షించిన వైద్యులు మనోహర్ కిడ్నీ ఫెయిలైందని వెల్లడించారు. డయాలసిస్ చేశారు. కల్తీ పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆ బాలుడి కుటుంబ సభ్యులకు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మనోహర్ మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రస్తుతం అక్కడి మార్చురీలోనే ఉంచారు. ఆస్పత్రిలో చేరిన మరో బాధితురాలు ఇప్పటికే కల్తీ పాలు తాగి 19 మంది అస్వస్థతకు గురవగా.. మంగళవారం మరో కేసు నమోదైంది. రాజమహేంద్రవరం నగరానికి చెందిన రెడ్డి అనంతలక్ష్మి (55) మూత్రపిండాల వ్యాధితో డెల్టా ఆస్పత్రిలో చేరారు. ఆమెను తొలుత కిమ్స్ ఆస్పత్రిలో చేర్చేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే ఆ ఆస్పత్రిలో ఇప్పటికే ఇదే కేసు బాధితులు ఎక్కువ మంది ఉండటంతో డెల్టా ఆస్పత్రికి మార్చారు. ప్రస్తుతం ఆమెకు డయాలసిస్ చేస్తున్నారు. దీంతో బాధితుల సంఖ్య 21కి చేరింది. వీరిలో ఆరుగురు ఇప్పటికే మృతి చెందగా.. మిగిలిన 15 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. రెయిన్బో ఆస్పత్రిలో మూడేళ్లలోపు చిన్నారులు ముగ్గురు చికిత్స పొందుతున్నారు. వారికి రోజుకు రెండుసార్లు డయాలసిస్ చేస్తున్నారు. ఈ దృశ్యాలు చూపరులను కలచివేస్తున్నాయి. హెల్త్ బులెటిన్ విడుదల కల్తీ పాల ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం నివేదిక విడుదల చేసింది. లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన పలువురు వృద్ధులు అనూరియా, వాంతులు, పొత్తికడుపు నొప్పి, తీవ్ర మూత్రపిండ వైఫల్యంతో ఆసుపత్రిలో చేరినట్టు గుర్తించారు. రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు అధికంగా ఉండటంతో విషపూరిత ప్రభావం ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. పాల వినియోగమే దీనికి ప్రధాన కారణమని తేలింది. నెఫ్రాలజిస్టులతో కూడిన 14 ఫీల్డ్ సర్వేలెన్స్ బృందాలు 679 ఇళ్లను సందర్శించి 957 కుటుంబాలను స్క్రీనింగ్ చేశాయి. 110 కుటుంబాల్లో 293 మందిని గుర్తించి 315 రక్త నమూనాలు సేకరించారు. వాటిలో 313 సాధారణంగా ఉండగా ఇద్దరిలో యూరియా, క్రియాటినిన్ స్థాయిలు పెరిగినట్లు వెల్లడైంది. సెంట్రల్ జైలుకు పాల వ్యాపారి తరలింపు కల్తీ పాల వ్యాపారి అడ్డాల గణేష్ అరెస్టుపై హైడ్రామా నడిచింది. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గణేష్ ను అరెస్టు చేసిన పోలీసులు జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీసుల అదుపులో ఉన్న అతడికి కడుపు నొప్పి రావడంతో మంగళవారం కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం మధ్యాహ్నం అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడు కోలుకోవడంతో కోర్టులో హాజరుపర్చగా.. మార్చి 10 వరకూ రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వీడని కల్తీ గుట్టు కల్తీ పాల గుట్టు ఇంకా వీడలేదు. కల్తీపై స్పష్టత రావాలంటే రక్తం, పాల నమూనాల నివేదికలు రావాల్సి ఉంది. ఇవి మంగళవారం వచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించినా.. మరికొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు వస్తేగాని.. మరణాలు ఎలా సంభవించాయి.. పాలు పూర్తిస్థాయిలో కల్తీ జరిగాయా.. లేక వేరే ఏమైనా కలుషితం జరిగాయా అనే విషయం స్పష్టమవుతుంది. కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అత్యుత్సాహంతో కూలెంట్ లీకేజీ సంభవించి ‘ఇథలీన్ గ్లైకాల్’ కలవడంతో పాల కల్తీ జరిగి ఈ మరణాలు సంభవించాయనే వాదన వినిపిస్తున్నారు. ల్యాబ్ రిపోర్టులు అందకుండానే దీనిపై ఎలా నిర్ధారిస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. పాల వ్యాపారి అడ్డాల గణేష్ డెయిరీ వద్ద పాల కల్తీకి ఉపయోగించే అనుమానిత పౌడర్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఆ పౌడర్ ఏమిటనేదానిపై ల్యాబ్ నివేదికలు రావాల్సి ఉంది. అప్పుడే కల్తీ గుట్టు వీడుతుంది. మెలమైన్ కూడా కలిసే అవకాశం పాలల్లో ఇథలీన్ గ్లైకాల్తోపాటు యూరియా, మెలమైన్ కలిసే అవకాశం ఉందని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ రవిరాజు, విశాఖపట్నం కేజీహెచ్కు చెందిన డాక్టర్ గుళ్లపల్లి ప్రసాద్, డాక్టర్ సుధాకర్ వెంచురి, పి.శశాంక పాకలపాటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కల్తీ పాల కేసులను వీరే సమన్వయం చేస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన రక్త నమూనాలకు పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ల్యాబ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని, ఫలితాలు 2 నుంచి 4 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. 63 సార్లు డయాలసిస్ చేసినా.. రాజమహేంద్రవరంలోని స్వరూప్ నగర్కు చెందిన ఆరేళ్ల బాలుడు డి.మనోహర్కు కేజీహెచ్లో ఆరు రోజుల్లో ఏకంగా 63 సార్లు డయాలసిస్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఆ బాలుడు మంగళవారం ప్రాణం వదిలాడు. ఈ నెల 18న అతడిని కేజీహెచ్కు తీసుకొచ్చారు. అతడికి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోడాక్టర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వైద్యులు కిడ్నీ సమస్య ఉందని వైద్యులు గుర్తించి, అప్పుడే వైద్యం ప్రారంభించారు. చివరకు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా బాలుడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అసలు ఊహించలేదు కల్తీ పాలు తాగటం వల్లే మా అబ్బాయి చనిపోయాడు. మూడేళ్లుగా గణేష్ వద్దే పాలు తీసుకుంటున్నాం. ఇంట్లో మా బాబు ఒక్కడే పాలు తాగుతున్నాడు. మహా శివరాత్రి నుంచి మా అబ్బాయికి ఆరోగ్యం బాగోలేదు. ఆ రోజు నుంచే యూరిన్ ఆగిపోయింది. రాజమండ్రి ఆస్పత్రి నుంచి కాకినాడ పంపారు. అక్కడి నుంచి 18న వైజాగ్ తీసుకొచ్చాం. మంగళవారం మధ్యాహ్నం చనిపోయాడని తెలిపారు. మనోహర్ను నమ్ముకునే బతుకుతున్నాం. ఇలా జరుగుతుందని ఊహించలేదు. – అర్చన, బాలుడి తల్లి, రాజమహేంద్రవరం రెండింటి వల్ల కిడ్నీ పాడవుతుంది పాలు కల్తీ ఎలా జరిగాయనేది ల్యాబ్ రిపోర్టులు వస్తేనే కానీ చెప్పలేం. ఫ్రిజ్ నుంచి ఇథలీన్ గ్లైకాల్ లీకై పాలలో కలిసినా కిడ్నీ సమస్యలు వస్తాయి. అలా కాకుండా పాలలో యూరియా వంటి రసాయనాలు కలిపినా కిడ్నీ ఫెయిలయ్యే అవకాశం ఉంటుంది. గణేష్ వద్ద పాలు తీసుకున్న వారంతా కిడ్నీ పనితీరును నిర్ధారించే క్రియాటినిన్ పరీక్షలు తప్పక చేయించుకోండి. తేడా వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే చికిత్సలు పొందండి. – డాక్టర్ శశాంక్, నెఫ్రాలజిస్ట్, రాజమహేంద్రవరంబాధ్యులపై చర్యలేవీ? మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో జనం చచి్చపోతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా చూస్తూ కూర్చుందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజమండ్రిలో కల్తీ పాలు తాగి ప్రజలు చనిపోవడానికి ప్రభుత్వ అవినీతి, పర్యవేక్షణ లేకపోవడమే ప్రధాన కారణమని అన్నారు. ‘ఓ వ్యక్తిపై చర్య తీసుకుని చేతులు దులుపుకుంటారా.. బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. కొన్ని నెలలుగానో, అంతకు ముందు నుంచో కల్తీ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు. జనం చచి్చపోతుంటే పట్టించుకోకుండా, ప్రశి్నంచే వారిపై మాత్రం కక్ష సాధింపు చర్యలపై మాత్రమే ఈ ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని, ఇదేంటని ఎవరినైనా అడిగితే పెదబాబు, చినబాబులకు ముడుపులు ఇస్తున్నామని చెబుతున్నారని చెప్పారు.‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏవో తప్పులు జరిగినట్లు సభలో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడటం సరికాదు. తన తండ్రిని ప్రత్యర్థులు పొట్టన పెట్టుకున్నా, ఆ బాధను దిగమింగుకుని వైఎస్సార్ పరిపాలన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల సమయంలో ప్రధాని పర్యటనలను పట్టించుకోలేదని మాట్లాడుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ప్రధాని పర్యటనలను చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే కదా.. మహిళలు ఉన్నారని కూడా చూడకుండా సత్యదూరమైన మాటలను సభలో మాట్లాడుతున్నారు. సోము వీర్రాజుకు వయసొచ్చిందే గానీ దానికి తగ్గట్టు మాట్లాడటం లేదు. మేం ఏం అడిగినా ప్రభుత్వం బాధ్యతగా సమాధానం చెప్పడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి. దానికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశాం. సభలో ఏ అంశంపై అయినా చర్చించడానికి ఎంత సమయం అయినా ఎన్ని గంటలైనా మేం సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు. -
ఈ ప్రభుత్వమే కల్తీ
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కల్తీ సర్వసాధారణంగా మారిందని, ఈ ప్రభుత్వమే కల్తీదని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. పాలు, నీళ్లు, ఆహారం, మద్యం.. ఇలా అన్నింటా కల్తీ విలయ తాండవం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితులను మంగళవారం వారు పరామర్శించారు. అనంతరం కిమ్స్ బొల్లినేని ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పాలనపై సీఎం చంద్రబాబు పట్టు కోల్పోయారన్నారు. 20 నెలల పాలనలో మొత్తం 36 కల్తీ ఘటనలు జరిగితే.. 900 మందికి పైగా ఆస్పత్రి పాలయ్యారని, 40 మంది చిన్నారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి సంపాదనపై దృష్టిపెట్టిన చంద్రబాబు పాలనను పూర్తిగా గాలికొదిలేశారని, ఫలితంగానే కల్తీలతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని అన్నారు. మాజీ మంత్రులు విడదల రజిని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, పార్టీ నేత డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఏమన్నారంటే.. 20 నెలల్లో 36 ఘటనలు ‘కల్తీ పాల వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. 2024 జూలైలో తొలిసారి శ్రీకాకుళం కేజీబీవీ హాస్టల్లో డయేరియా ప్రబలినప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవి కావు. 20 నెలల్లో 36 ఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పేదలే బలైపోతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో సింథటిక్ మిల్క్ తయారీ యూనిట్ వెలుగులోకి వచ్చినా కనీసం పట్టించుకోలేదు. కల్తీ పాల ఘటనను డైవర్ట్ చేసి, ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించడానికి ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. ఇష్యూను డైవర్ట్ చేసేందుకు కూలెంట్ లీకేజీ అయిందంటూ కథనాలు అల్లుతోంది. రక్తం, పాల నివేదికలు రాక ముందే ఇలా ఎలా ప్రకటిస్తారు? మీరేమైనా సీసీ కెమెరాలో చూశారా? రాష్ట్రంలో 200 లక్షల లీటర్ల పాలు అనధికారంగా సరఫరా అవుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ, ఆ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం కల్తీ మాటలతో అధికారంలోకి వచ్చింది. అందుకే పాలు, తిండి, నీరు, ఆఖరికి కల్తీ మద్యం.. ఇలా ప్రతిదాన్నీ కల్తీ చేస్తూ దోపిడీ చేసేవారి ఆగడాలు ఎక్కువైపోయాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా డయేరియాతో 900 మంది ఆస్పత్రుల్లో చేరారు. సంక్షేమ హాస్టళ్లలో చదివే ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. కల్తీ పాలతో అస్వస్థతకు గురైన బాధితులు రాజమహేంద్రవరం, కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే వైద్యం నిరాకరిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు రూ.లక్షల ఫీజులతో దోపిడీ చేస్తున్నాయి. రితిక్ అనే బాలుడిని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఆస్పత్రిలో రూ.8.50 లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి కల్తీ పాల దారుణాలు వెలుగు చూసినా స్పందించాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. బాధితులకు ఏకంగా డయాలసిస్ చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఘోరంగా ఉందని అర్థమవుతోంది. రాజమహేంద్రవరం చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం ఇది. ఏమవుతుందో తెలుసుకునే లోపే ఐదుగురు చనిపోయారు. ఎంతోమంది వెంటిలేటర్ల మీద చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందించాలి. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి. బాధితులందరికీ ఉచితంగా వైద్యం అందించాలి. ఇప్పటికే ఆస్పత్రులు తీసుకున్న ఫీజులు వెనక్కివ్వాలి’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. -
బాబు సర్కార్ ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసింది: వైఎస్సార్సీపీ
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో కల్తీ పాల బాధితులను వైఎస్సార్సీపీ నేతలు విడదల రజని, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్, జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడారు.మెరుగైన వైద్యం అందించాలి: వేణుగోపాలకృష్ణపాలలో కల్తీ జరిగి ఐదు ప్రాణాలు పోయాయి. ప్రతిపక్షం స్పందించిన తరువాతే ప్రభుత్వ స్పందించింది. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమైపోయింది. సంబంధిత మంత్రులు ఎవరూ ఇప్పటివరకు స్పందించలేదు. విషయం తెలిసిన వెంటనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి... వైఎస్సార్ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్లందరికీ పూర్తిస్థాయిలో వైద్యం అందించాలి. చనిపోయిన వారికి రూ.25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి. తిరుపతి లడ్డూ కల్తీ అనే మాట ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు కల్తీకి తెర తీశారు. ఇంకా చాలామంది పేషెంట్లు ఉన్నారు. వారిని కూడా ఆస్పత్రిలో చేర్చి మెరుగైన వైద్యం అందించాలి.ముందే ఎందుకు స్పందించలేదు?: విడదల రజనికల్తీ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ఘటన 19 మంది బాధితులయ్యారు. ఐదుగురు చనిపోయారు. ఈ వ్యవహారంపై వైఎస్సార్సీపీ నిలదీస్తే ప్రభుత్వ స్పందించింది. ప్రభుత్వానికి బాధ్యత ఉంటే ఎందుకు ముందే స్పందించలేదు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిద్రపోతుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పని చేస్తుందా?. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆసుపత్రుల్లో చేరారు. అనేక మంది చనిపోయారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తిగా విఫలమైంది. కల్తీ పాలతో అనారోగ్యంతోనే రాజమండ్రి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యం దొరికే పరిస్థితి కనిపించలేదు.రెయిన్బో ఆస్పత్రిలో రితిక్ అనే బాలుడికి సంబంధించి ప్రైవేట్ ఆస్పత్రిలో ఇప్పటివరకు వైద్యం కోసం ఎనిమిదిన్నర లక్షలు బిల్లు కట్టాల్సి వచ్చింది. మిగిలిన వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగింది. ఈ పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారు. చనిపోయిన వారికి పది లక్షలు ఇస్తారట.. ఏమూలకు సరిపోతుంది.ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఉపయోగకరంగా ఉంటాయని గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 17 మెడికల్ కళాశాల ప్రారంభించారు. చంద్రబాబు తన వ్యాపారం స్కాముల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు.. ప్రజారోగ్యం గురించి పట్టించుకోవడం లేదు. తప్పు జరిగిందన్న విషయం వాళ్ళ మాటల్లోనే బయటపడింది. రాష్ట్రంలో అనేక హాస్టల్లో విద్యార్థులు కూడా బాధితులు అవుతున్నారు. హెరిటేజ్ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చాము ప్రజలన్నీ గమనిస్తున్నారుబాధితులకు అండగా ఉంటాం: తానేటి వనితఒకే ఫ్యామిలీకి చెందిన అనేకమంది బాధితులు ఆసుపత్రిలో చేరడంతో వైద్యులకు అనుమానం రావడంతోనే పాల కల్తీ వ్యవహారం బయటపడింది. బాధితులకు అండగా ఉంటాం. గత ప్రభుత్వ హయాంలో సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ అండగా ఉండేది. చికిత్స పొందుతున్న బాధితులకు భవిష్యత్తులో ఎంత బిల్లు అవుతుందో తెలియని పరిస్థితి. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించాలి. బాధిత కుటుంబాలకు పరిహారం 25 లక్షల రూపాయలు చెల్లించాలి. -
అంతోటా తెగుళ్లు
● లిల్లీ పంటకు చీడపీడలు ● వాతావరణ మార్పులే కారణం ● సస్యరక్షణ చర్యలు అవశ్యం పెరవలి: ఒకపక్క చలి.. మరోపక్క వేడి.. ఈ వాతావరణంతో పంటలపై చీడపీడల ప్రభావం అధికమవుతోంది.. ఇలా లిల్లీ పంట కష్టాలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సస్యరక్షణ చర్యలు అవశ్యమని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 300 ఎకరాల్లో లిల్లీ తోటల సాగు జరుగుతోంది. ప్రధానంగా పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో సాగు చేస్తున్నారు. వాతావరణంలో తేమ, వేడి శాతం అధికంగా ఉండటంతో ఈ పంటకు వివిధ తెగుళ్లు ఆశిస్తున్నాయి. ముఖ్యంగా మచ్చతెగులు, పిండినల్లి, తామర పురుగులు, మొగ్గతొలుచు పురుగు, నిమటోడులు వంటివి సోకుతున్నాయి. ఈ తెగుళ్ల నివారణపై కొవ్వూరు ఉద్యాన అధికారి డి.సుధీర్కుమార్ వివరించారు. వెంటనే చర్యలు చేపడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఆ వివరాలు ఇలా.. ఆకుమచ్చ తెగులు లిల్లీపూల ఆకులపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే ఆకు చివరి భాగం నుంచి దుబ్బు వరకూ వ్యాపించి మాడిపోతాయి. దీంతో ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు అధికంగా ఉంటే పంట మొత్తం పాడైపోతోంది. దీని నివారణకు మాంకోజెబ్ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి (మీల్బగ్) ఈ తెగులు పంటను ఆశిస్తే లిల్లీ మొక్కల దుబ్బు మొదలు నుంచి ప్రారంభమై ఆకులను ఆశిస్తుంది. ఈ పురుగు పిండి వంటి పదార్థాన్ని వదలడం వల్ల తెల్లగా కనిపిస్తుంది. ఈ పదార్థంలో నల్లి పురుగులు ఉండి ఆకులలో రసాన్ని పీల్చివేస్తాయి. ఆకులు ఎండిపోయి దుబ్బు చనిపోతుంది. దీని నివారణకు ఎసిటామీఫ్రిడ్ 40 గ్రాములు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయడం ఉత్తమం. మొగ్గతొలుచు పురుగులు మొగ్గతొలిచే పురుగులు పుష్పగుచ్ఛాన్ని ఆశించి గుచ్ఛాల్లోని పువ్వులకు రంధ్రాలు చేసి లోపలకు వెళ్తాయి. అక్కడ కణజాలాన్ని తినేయడంతో మొగ్గలు వాడిపోతాయి. చిన్న పుష్పగుచ్ఛాన్ని ఈ పురుగులు ఆశిస్తే మొగ్గలు విచ్చుకోకుండా ఎదుగుదల నిలిచిపోతుంది. తెగులు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు ఈ గుచ్ఛాలు వాడిపోయి విరిగిపోతాయి. దీని నివారణకు ఒక గ్రాము ఎసిఫేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తామర, పేనుబంక పురుగులు లిల్లీపూల తోటలపై తామర పురుగులు, పేనుబంక ఎక్కువగా ఆశిస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులను అనుసరించి కాండం కుళ్లు తెగులు, పూ మొగ్గ కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు కార్బన్డిజం ఒక గ్రాము లీటరు నీటికి పిచికారీ చేస్తే నివారించవచ్చు. ఇలా క్రమం తప్పకుండా సస్యరక్షణ చర్యలు చేపడితే రైతులకు లాభాలు అందించడంతో పాటు నాణ్యమైన పూలను పొందవచ్చు. ఎరువుల యాజమాన్యం సేంద్రియ ఎరువులతో పాటు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఎకరానికి 80 కిలోల చొప్పున వేయాలి. నత్రజని ఎరువును 3 దఫాలుగా దుంపలు నాటిన 30, 60, 90 రోజులకు వేయాలి. నీటితడులు అవసరం మేరకు 7–10 రోజులకు ఒకసారి పెట్టాలి. ఈ విధంగా సాగు చేస్తే మొక్కలు మంచి బలంగా వచ్చి ఎకరాకు 60 వేల నుంచి 70 వేల పుష్పగుచ్ఛాలు వచ్చి 3 నుంచి 7 టన్నుల పూల దిగుబడి సాధించవచ్చు. -
మద్యం మత్తులో పూరింటికి నిప్పు
అనపర్తి: మద్యం మత్తుతో తాను నివాసం ఉంటున్న ఇంటికే ఓ వ్యక్తి నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటన బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఊలపల్లి జెడ్పీ హైస్కూల్ ప్రహరీని ఆనుకుని ఉన్న పూరింట్లో ముత్యాలు అనే సంచార జాతికి చెందిన వ్యక్తి ఒక మహిళతో కలసి ఉంటున్నాడు. ముత్యాలు సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చి ఇంట్లో ఉన్న మహిళతో వాగ్వాదానికి దిగాడు. తర్వాత మత్తులో తాను ఉంటున్న పాకకు నిప్పు పెట్టుకున్నాడు. మంటలు ఎగసిపడడంతో పక్కనే ఉన్న మరో పాక, సెలూన్ షాపు, రెండు గడ్డి మేట్లకు మంటలు వ్యాపించాయి. పూరింట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనపర్తి అగ్నిమాపక అధికారి జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బిక్కవోలు పోలీసులు నిందితుడు ముత్యాలును పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల వరకూ నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి గొల్లప్రోలు (పిఠాపురం): గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం కాకినాడకు చెందిన డి.కుమార్ (22), డి.నాగేంద్ర అన్నదమ్ములు. ఇద్దరూ మోటారు మెకానిక్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ తమ బుల్లెట్ మోటార్ సైకిల్పై చేబ్రోలు నుంచి కాకినాడకు 216 జాతీయ రహదారిపై వస్తున్నారు. చేబ్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోని కల్వర్ట్ వద్దకు వచ్చేసరికి బైక్ అదుపు తప్పడంతో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్లో పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గాయపడిన నాగేంద్రను మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
● సంబరం.. అంబరం
రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో వేంచేసి ఉన్న వీరభద్రస్వామి ఆలయం ఆధ్వర్యంలో మహా వీరభద్ర సంబరం సోమవారం అట్టహాసంగా జరిగింది. ఇది పుష్కరాల రేవు నుంచి రంగ్రీజుపేట, జెండాపంజా రోడ్డు, లక్ష్మీవారపుపేట, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సాగి తిరిగి ఆలయానికి చేరుకుంది. వేలాది మంది భక్తులు వీరభద్రుని ప్రతిమలను శిరస్సుపై పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా వివిధ వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఏర్పాట్లను ఆలయ ప్రధాన అర్చకులు మేడ బ్రహ్మాజీ పర్యవేక్షించారు. – ఫొటోలు: గరగ వరప్రసాద్, సాక్షి, రాజమహేంద్రవరం -
టీడీపీకి సుంకరపాలెం సర్పంచ్ రాజీనామా
పార్టీ నాయకుల వేధింపులే కారణమని వెల్లడి తాళ్లరేవు: మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు, సుంకరపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ టిళ్లపూడి నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. సోమవారం ఆయన స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టిళ్లపూడి మాట్లాడుతూ తాను వైఎస్సార్ సీపీ మద్దతుతో సర్పంచ్గా గెలుపొందానన్నారు. అయితే 2024 ఎన్నికల ముందు గ్రామాభివృద్ధే ధ్యేయంగా స్థానిక నాయకులు, ప్రజల ఆకాంక్షల మేరకు టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఐదేళ్లపాటు సర్పంచ్గా విశేష సేవలందించానన్నారు. అయితే స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు కొందరు తనపై లేనిపోని బురద జల్లుతూ, దాడికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తనపై పోటీచేసి ఓటమి పాలైన టీడీపీ సీనియర్ నాయకుడు మోపూరి వెంకట రెడ్డినాయుడు గ్రూపు రాజకీయాలతో తనపై అనేక ఫిర్యాదులు చేస్తూ మానసికంగా కుంగదీస్తున్నట్లు తెలిపారు. తన సొంత స్థలంలో నిర్మాణాలు చేయకుండా అడ్డుకోవడంతో పాటు దుర్భాషలాడుతూ వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది టీడీపీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తి ఆత్మహత్య రామచంద్రపురం: స్థానిక కమ్మవారి సావరానికి చెందిన గుత్తుల భీమేశ్వరరావు (55) ఆదివారం రాత్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం పొదల్లో కాలిన గాయాలతో మృతదేహం ఉందని సమాచారం రావడంతో, ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టామన్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను రప్పించి దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన తరువాత కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం రాత్రి బంకులో పెట్రోలు కొనుగోలు చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బైక్లు ఢీ: వ్యక్తి మృతి అనపర్తి: మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, భార్యాభర్తలకు తీవ్ర గాయాల ఙయ్యాయని అనపర్తి ఎస్సై ఎల్.శ్రీనునాయక్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పార్వతీపురం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం రేగిడి గ్రామానికి చెందిన పువ్వల కై లాసరావు (24) మండపేట మండలం అర్తమూరులోని డైరీఫారంలో పని చేస్తున్నాడు. అతని భార్య చెల్లూరులోని ఉండడంతో అర్తమూరు నుంచి బైక్పై బయలు దేరాడు. ఈ నేపథ్యంలో పెడపర్తిరేవు నుంచి పులగుర్త గ్రామానికి వెళ్లే రోడ్డులో భార్యాభర్తలు దివ్యజ్యోతి, రామకృష్ణారెడ్డిలు బైక్ వెళ్తున్నారు. వీరి బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. పువ్వల కై లాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. దివ్యజ్యోతి, రామకృష్ణారెడ్డిలకు తీవ్ర గాయాలు కావడంతో మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అనపర్తి ఏఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
ఆస్పత్రులకు నాయకులు, అధికారులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అనూరియా బాధితులకు పూర్తి వైద్య ఖర్చుల భారం ప్రభుత్వం భరిస్తుందని, క్షేత్ర స్థాయిలో పర్యటించి, ధైర్యం కల్పించామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీరపాండ్యన్ తెలిపారు. అనూరియా బాధితులు చికిత్స పొందుతున్న బొల్లినేని కిమ్స్, రెయిన్బో ఆసుపత్రులకు ఆయన, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాతో సోమవారం వెళ్లారు. అంతకు ముందు వైఎస్సార్ సీపీ నాయకులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరిస్థితిపై ఆరా తీశారు. రాజమహేంద్రవరంలో అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను నియమించామని, పరిస్థితిని ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కారణాలపై సాంకేతిక నిపుణుల కమిటీ పరిశీలన కొనసాగుతోందన్నారు. -
ఇంటర్ పరీక్షలు ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ పరీక్షలు సోమవారం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పార్ట్ 2లో తెలుగు, హిందీ, సంస్కృతం, వొకేషనల్ విభాగం జనరల్ ఫౌండేషన్ కోర్సు పరీక్షలు జరిగాయి. ఆ వివరాలను ఇంటర్మీడియేట్ ప్రాంతీయ పర్యవేణాధికారి ఐ.శారద ఆ వివరాలను తెలిపారు. ఈ పరీక్షలను మొత్తం 20, 875 మంది రాయాల్సి వుండగా 20, 370 మంది హాజరయ్యారు. 505 మంది పరీక్షలు రాయలేకపోయారు. 52 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. సీసీ కెమెరాల నిఘాతో పర్యవేక్షించారు. జిల్లాలో ని 38 పరీక్షా కేంద్రాలను స్క్వాడ్, కస్టోడియన్లు, హైపవర్ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. 218 అర్జీల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను నాణ్యతతో నియమిత సమయంలో పరిష్కరించాలని డీఆర్ఓ సీతారామమూర్తి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 200 అర్జీలను స్వీకరించారు. దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో డీఆర్ఓ సీతారామమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లు నియోజకవర్గానికి 25 చొప్పున అందజేయాలన్నారు. దివ్యాంగులకు జిల్లాలోని ఆర్టీవో కేంద్రాల వద్ద డ్రైవింగ్ లైసెన్సు మేళా నిర్వహించి చలానా రూ.260. డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు 770 రూపాయలను ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంద్రధనస్సులో ప్రకటించిన ఏడు పథకాలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దివ్యాంగుల విభాగం తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు ఆదం పకీర్ పాల్గొన్నారు తరమండల్తో ‘నన్నయ’ ఒప్పందం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీకి తరమండల్ టెక్నాలజీతో ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి, తరమండల్ సీఈఓ వినీల్ జడ్సన్ సోమవారం సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. బీటెక్, పీజీ విద్యార్థులకు స్పేస్, డిఫెన్స్, క్వాంటం టెక్నాలజీస్లో మైనర్/స్పెషలైజేషన్ కోర్సులు తీసుకురావడానికి ఈ ఎంఓయూ ఉపయోగపడుతుందని వీసీ తెలిపారు. -
ఇంటర్ పరీక్షలు షురూ..
రాజమహేంద్రవరం కందుకూరి రాజ్యలక్ష్మి కళాశాలలో పరీక్ష గది నంబరు చూసుకుంటున్న విద్యార్థినులుకాస్త టైముందిగా: రాజమహేంద్రవరంలో పరీక్ష రాసే ముందు చదువుతున్న విద్యార్థులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల హడావుడి కనిపించింది. పరీక్ష సమయం ముందు కొంతమంది చదువుతూ కనిపించగా, దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సమయం అయిపోవడంతో పరుగు పెడుతూ కేంద్రాల్లోకి వెళ్లారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొచ్చి పరీక్షకు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపారు. అమ్మో సమయం లేదుగా: పరీక్ష సమయం దగ్గర పడుతుండడంతో పరుగు పెడుతూ.. -
విచ్చలవిడిగా పాలాహలం!
● పొదుగులోనే విషాన్ని పొదుగుతున్న వైనం ● కృత్రిమ రసాయనాలతో తయారీ ● జాగ్రత్త తీసుకోవాలంటున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాల కల్తీ ఐదు ప్రాణాలను పొట్టన పెట్టుకొని, 19 మందిని ఆస్పత్రి పాలు చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. యావత్తు రాష్ట్రాన్ని రాజమహేంద్రవరం వైపు చూసేలా చేసింది. లాలాచెరువు ప్రాంతం చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలో కల్తీ పాల విక్రయాలు విచ్చలవిడిగా జరిగాయనే వార్తల నేపథ్యంలో పాలు చూస్తేనే జనం అనుమానించే పరిస్థితి నెలకొంది. మనం తాగే పాలలో అసలు, నకిలీని పోల్చుకొనేదెలా అనే సందేహాలు ఏర్పడుతున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు పాలను సైతం విచ్చలవిడిగా కల్తీ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడడం ఆందోళన కలిగించే అంశం. అధిక దిగుబడి కోసం ఆవులకు ఇంజెక్షన్లు పాల అధిక దిగుబడి కోసం ఆక్సిటోసిన్ మందును ఆవు పొదుగు నుంచే ఇస్తున్నారు. పాడి పశువులకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు చేయించేవారికి అవి ఇచ్చే పాలధారలు కాసులు కురిపించవచ్చు. కానీ అవే ధారలు తాగినవారి ఆరోగ్యాన్ని కాటేసే పాము కోరలుగా మారిపోతాయని వైద్యులు చెబుతున్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ చేసిన పశువు ఇచ్చే పాలు తాగిన వారికి కేన్సర్ వచ్చే అవకాశం అధికం. కిడ్నీలు పాడవుతాయి. నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. 19 ఏళ్లు వచ్చినా బాలికలు రజస్వల కారు. చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. మహిళలకు రుతుస్రావ ఇబ్బందులు ఏర్పడతాయి. పశువులు ఇచ్చే పాల దిగుబడిని పెంచడానికి వాటికి చేసే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు అత్యంత ప్రమాదకరమైనవి. పాలను విషంగా మార్చి, ప్రాణాంతక వ్యాధులు కలిగిస్తాయి. అయితే లాభమే ధ్యేయంగా పాలు అమ్ముకునే కొందరు రైతులు, పాల విక్రయానికే వ్యాపార స్థాయిలో పశువులను పెంచే వారు ఈ ఇంజెక్షన్లను నిస్సంకోచంగా పశువులకు చేయిస్తున్నారు. రాష్ట్రంలో నిషేధం ఉన్న ఈ ఇంజెక్షన్లను కొందరు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై గతంలో పలుమార్లు సాక్షి దినపత్రిక కథనాలు ప్రచురించడంతో ఔషధ నియంత్రణ శాఖాధికారులు దాడులు నిర్వహించి అధిక సంఖ్యలో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు. ఇలా కనిపెట్టవచ్చు కొద్ది పాలను తీసుకుని అయోడిన్ రెండు చుక్కలు వేస్తే పాలంతా నీలం రంగులోకి మారితే ఆ పాలలో కల్తీ జరిగినట్టే. చేతిలోకి కొన్ని పాలు తీసుకుని రెండు చేతులతో రుద్దుకుంటే మధ్యలో పిండిలా వస్తే కల్తీ జరిగినట్టే. పాలు చిన్న బాటిల్లో వేసి గట్టిగా ఊపినప్పుడు నురగ వచ్చినా, పాలు పొయ్యి మీద కాస్తున్నప్పుడు ఎక్కువగా నురగ వచ్చినా అందులో డిటర్జెంట్ కలిసినట్టే. స్పాట్ కిట్లు వస్తున్నాయి కల్తీ పాలను కనిపెట్టేందుకు పుడ్ సేఫ్టీ విభాగం కిట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. మ్యాజిక్ బాక్స్ పేరుతో కిట్లను ఆహార తనిఖీ అధికారులకు అందిస్తున్నారు. ఇవి బయట తక్కువ ధరకే లభించనున్నాయి. త్వరలో ప్రజలు వాడుకోవడానికి ఇవి అందుబాటులోకి రానున్నాయి.లూజుగా అమ్మే పాలకే కల్తీ అవకాశం లూజుగా అమ్మే పాలలో కల్తీ జరిగే అవకాశం అధికంగా ఉంటుంది. యూరియా, నూనెలు, డిజర్జెంట్లు కలిపి పాలను తయారు చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. పాలు పాడైపోకుండా ఫార్మాల్ డిహైడ్ లిక్విడ్ను కలుపుతారు. దీనివల్ల పాలు తొందరగా పాడవకుండా, విరిగి పోకుండా ఉంటాయి. దీంతో ఆ పాలు రెండు రోజులైనా పాడవ్వవు. వీటిపైనా తనిఖీలు నిర్వహిస్తాం. – నందాజీ, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, కాకినాడపాల కల్తీ ఇలా.. గేదె పాలు, ప్యాకెట్ పాలు మాత్రమే మనకు తెలు సు. అయితే ఇప్పుడు కొందరు పాల వ్యాపారులు సింథటిక్ పాలు విచ్చలవిడిగా పోస్తున్నారు. వీటిని కేవలం రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తున్నారు. పాలలో ప్రధానంగా యూరియా కలుపుతారు. నీళ్ల పాలను చిక్కదనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. పాలు పుల్లగా అయిపోతే ఆ రుచి ని మార్చడానికి డిటర్జెంట్లు, సబ్బులు, షాంపులు వా డుతున్నారు. పాలు జిడ్డుగా, కొవ్వుగా ఉండటానికి నూనెలు కలుపుతున్నారు. పాల సాంద్రతను పెంచడానికి గంజి వాడుతున్నారు. పాలు అధిక రోజులు నిల్వ ఉండటానికి, అందులో బ్యాక్టీరియా పెరగకుండా ఉండటానికి హైడ్రోజన్ పెరాకై ్సడ్ వాడుతున్నారు. లాక్టోమీటరులో పాల ఉత్తీర్ణత శాతం చూపించడానికి అమ్మోనియా సల్ఫేట్, తెల్లగా ఉండటానికి తెలుపు పెయింట్ వాడుతున్నారు. పాలలో పొటాషియం క్రోమేట్, సిల్వర్ నైట్రేట్ కలిపితే పసువు రంగు వస్తే వాటిలో సోడియం క్లోరైడ్ కలిపినట్లే. -
చోరీల్లో కిలేడీ
అమలాపురం టౌన్: ఆ కి‘లేడీ’ చోరీలకు మహిళా ప్రయాణికులే టార్గెట్.. ఆటోలు, బస్సుల్లో వెళ్తూ తోటి ప్రయాణికులతో మాటలు కలిపి బంగారు నగలు, నగదు ఉన్న బ్యాగ్లను అవలీలగా తస్కరిస్తుంది. తాజాగా అమలాపురం పట్టణం, తాలూకా (రూరల్) పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ తరహా చోరీలకు పాల్పడింది. ఎట్టకేలకు అమలాపురం పోలీసులకు చిక్కింది. దీనిపై సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్తో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల ప్రకారం.. ఇటీవల అమలాపురం హైస్కూల్ సెంటర్ నుంచి గోఖిలే సెంటర్కు తాటికొండ సత్యదేవి ఆటోలో వెళ్తుండగా, ఆమె బంగారు నగల హ్యాండ్ బ్యాగ్ చోరీకి గురైంది. ఆమె ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, గోకవరం గ్రామ శివారు డ్రైవర్స్ కాలనీకి చెందిన బండి శివపార్వతిని అరెస్ట్ చేశారు. ఆమెను విచారించగా దొంగతనాల చిట్టా బయటపడింది. పట్టణంలో ఇదే మహిళ మరో చోరీతో పాటు అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకో చోరీ చేసింది. ఈ మూడు చోరీలకు సంబంధించి శివ పార్వతిని అరెస్ట్ చేసి, రూ.20.50 లక్షల విలువైన 141.350 గ్రాముల బంగారు నగలు, సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన డీఎస్పీ ప్రసాద్, సీఐలు వీరబాబు, గజేంద్రకుమార్, క్రైం ఎస్సై పరదేశి, ఏఎస్ఐ రాజు, హెడ్ కానిస్టేబుల్ రమణ, కానిస్టేబుళ్లు శ్రీను, అర్జున్, హరి, సాయి, శుభాకర్, ప్రసాద్, నాగరాజులను ఎీస్పీ మీనా ప్రత్యేకంగా అభినందించారు. అంతే కాకుండా వారికి నగదు రివార్డులు అందజేశారు. మరో కేసులో బంగారం రికవరీ అమలాపురంలో ఆదివారం రాత్రి ఉప్పలగుప్తానికి చెందిన పెయ్యల శాంతి ఆటోలో వస్తూ పోగొట్టుకున్న రూ. 4.50 లక్షల విలువైన 4 కాసుల బంగారు నగలను మర్నాడు అంటే సోమవారం సాయంత్రానికి నూరు శాతం అమలాపురం పోలీసులు రికవరీ చేశారు. ఈ బంగారు నగలను జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఎస్పీ కార్యాలయంలో బాధితురాలు శాంతి కుటుంబీకులకు సోమవారం సాయంత్రం అందించారు. -
కూటమికి పచ్చవాతం!
కష్టపడిన వారికి ప్రాధాన్యమేదీ? రాజమహేంద్రవరంలో టీడీపీ బలోపేతానికి పనిచేసిన నేతలకు ప్రాధాన్యం కరవైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షో చేసే వారికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే వాసు వ్యవహార శైలితో టీడీపీ సీనియర్ నేతలు లబోదిబోమంటున్నారు. పార్టీ పటిష్టతకు బుడ్డిగా ఒక్కరే కృషి చేశారా? మేము కష్టపడలేదా? అని మండిపడుతున్నారు. ● జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వని టీడీపీ ● నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీజేపీకీ మొండిచెయ్యి ● కొన్ని నియోజకవర్గాల్లో తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు ● రాజమహేంద్రవరంలో ఒకే నేతకు ఆరు పదవులు! ● గోపాలపురంలో జనసేన వర్సెస్ టీడీపీ ● నిడదవోలులోనూ అదే తంతు సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. జనసేన నేత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీకి ప్రాధాన్యం దక్కడం లేదు. టీడీపీ ప్రాతినిధ్య నియోజకవర్గంలో జనసేన నేతలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహార శైలి టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. టీడీపీ నేతల వ్యవహార శైలిని జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతగా అంటే టీడీపీ నేతలపై జనసేన నాయకులు బహిరంగ విమర్శలు గుప్పించే పరిస్థితి తలెత్తింది. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ టీడీపీ పెత్తనాన్ని జనసేన, బీజేపీ నేతలు భరించలేకపోతున్నారు. పదవులన్నీ బుడ్డిగకేనా? రాజమహేంద్రవరం సిటీ టీడీపీలో పదవుల పంచాయితీ రచ్చ లేపుతోంది. జిల్లా, సిటీ స్థాయి పదవులన్నీ బుడ్డిగ రవికే కట్టబెట్టడం టీడీపీ కేడర్కు మింగుడుపడటం లేదు. ఇప్పటికే రాజమహేంద్రవరం సిటీ 38వ వార్డు ఇన్చార్జి, రాజమహేంద్రవరం సిటీ క్లస్టర్ ఇన్చార్జి, రాజమహేంద్రవరం సిటీ బీసీ సెల్ ప్రెసిడెంట్, ఆర్యాపురం కోపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పదవుల్లో రవి కొనసాగుతున్నారు. జిల్లా టీడీపీ మెయిన్ కమిటీలోనూ బుడ్డిగా రవి భార్య వెంకటరమణికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం కల్పించారు. ఒకే కుటుంబానికి ఇన్ని పదవులు ఉండగా.. టీడీపీ రాజమహేంద్రవరం నగర ప్రధాన కార్యదర్శి పదవి సైతం తనకే దక్కాలంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వద్ద పావులు కదుపుతుండటంపై టీడీపీ శ్రేణులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఆ పదవిని సైతం బుడ్డిగ కుటుంబానికే కట్టబెట్టేందుకు ఎమ్మెల్యే వాసు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. రేపో మాపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉండటంతో టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు టెంట్హౌస్, కుర్చీలు, టేబుళ్లు సమకూర్చే కాంట్రాక్ట్ సైతం బుడ్డిగ రవి నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ కుటుంబానికి ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే కుటుంబానికి అన్ని పదవులు కట్టబెట్టడం ఏమిటన్న చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అడుగులకు మడుగులు ఒత్తుతున్నారన్న కారణంగా ఇదంతా చేశారా? అన్న ప్రశ్న టీడీపీ శ్రేణుల్లో తలెత్తుతోంది. గోపాలపురంలో టీడీపీ వర్సెస్ జనసేన గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. నువ్వెంతంటే నువ్వెంత అన్న స్థాయికి చేరింది. చివరకు ఎమ్మెల్యేను నిలదీసే పరిస్థితి తలెత్తింది. టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనసేన నేతలకు కనీస విలువ ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. కూటమి తరఫున నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమాలకు జనసేన నేతలను, చివరికి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజును సైతం ఆహ్వానించకపోవడంపై పార్టీ కేడర్ గుర్రుగా ఉంది. ఫ్లెక్సీల్లో ఆయన ఫొటో సైతం వేసేందుకు ఇష్టపడటం లేదంటే జనసేనకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం అవుతోంది. ఈ విషయాన్ని పార్టీ దృష్టికి, ఆ పార్టీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలకు సైతం కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఎమ్మెల్యే అన్నీ తానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. మంత్రి వద్ద పంచాయితీ గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు వ్యవహరిస్తున్న తీరుపై జనసేన నేతలు మంత్రి కందుల దుర్గేష్ వద్ద పంచాయితీ పెట్టారు. రాజమహేంద్రవరంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయమై మంత్రి, ఎమ్మెల్యేలను నిలదీశారు. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో గ్రామ దేవత గుడి సమస్య పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఆచారం ప్రకారం తుమ్మలమ్మ గుడి పర్యవేక్షణ బాధ్యతలు తలంశెట్టి వంశీయులు నిర్వహిస్తున్నారు. వారితో పాటు గ్రామానికి చెందిన జనసేన, బీజేపీ నేతలు అమ్మవారి పూర్వ ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆ ఆలయంతో తమకు సంబంధం లేదని గ్రామ టీడీపీ నేతలు బహిరంగంగా ప్రకటించడంతో నాలుగేళ్లుగా ఈ పాత గుడిని జనసేన పార్టీకి చెందినవారే సంరక్షిస్తున్నారు. ప్రస్తుతం పూర్వపు అమ్మవారి ఆలయానికి ప్రాధాన్యం రావడంతో కొత్త గుడి నిర్మించిన టీడీపీ వర్గం.. పాత గుడి కూడా తమదేనంటోంది. ఇది వివాదంగా మారింది. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మద్దిపాటి దృష్టికి తీసుకెళ్లినా.. లాభం లేకపోవడంతో మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ● రాజానగరంలో పార్టీ ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, సీఎం పర్యటన వ్యవహారాల పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ వర్గాల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గ ఇన్చార్జి పదవికి ఏర్పడ్డ పోటీతో ఈ వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. ● నిడదవోలులో సార్వత్రిక ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు, జనసేనకు ఎమ్మెల్యే స్థానం కేటాయించినప్పుడు తలెత్తిన వైషమ్యాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేగా జనసేన నేత దుర్గేష్ నెగ్గి మంత్రి వర్గంలో స్థానం సాధించినా అసమ్మతి జ్వాలలు మాత్రం ఆరడం లేదు. జనసేన నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహార శైలి టీడీపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. అసాంఘిక కార్యక్రమాలకు కేరాఫ్గా నిలిచిన వారిని సైతం జనసేనలో చేర్చుకుంటున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జనసేన, బీజేపీ నేతలకు నిరాశే? చంద్రబాబు ప్రభుత్వం భర్తీ చేసిన వివిధ దశల నామినేటెడ్ పదవుల భర్తీలో జనసేన, బీజేపీ నేతలకు మొండిచెయ్యి చూపారు. టీడీపీలోనే నామినేటెడ్పై ఆశావహుల సంఖ్య పెరిగిపోవడంతో బీజేపీ, జనసేనకు ఇస్తే కొత్త తలనొప్పి ఎదురవుతుందని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. తమ కృషితో అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు తమనే విస్మరిస్తున్నారని జనసేన, బీజేపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
చాగల్లు: నిడదవోలు – ఐ.పంగిడి రహదారిలో ఎస్.ముప్పవరం వద్ద ఎదురెదురుగా మోటారు సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చాగల్లు ఏఎస్సై ఎస్కే హుస్సేన్ కథనం ప్రకారం.. చాగల్లు గ్రామానికి చెందిన రాయుడు చరణ్బాబు (19) తన స్నేహితుడు పీతల హర్షతో కలసి ఆదివారం రాత్రి బైక్పై బ్రాహ్మణగూడేనికి కేటరింగ్ పనులకు వెళుతుండగా, నిడదవోలు వైపు నుంచి తాడిమళ్ల గ్రామానికి చెందిన చిక్కం నాని, కోరుమామిడికి చెందిన మాధవితో కలసి స్కూటీపై వెళుతూ ఎస్.ముప్పవరం వద్ద ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ఘటనలో చరణ్బాబు, నాని, మాధవికి తీవ్ర గాయాలు కావడంతో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అత్యవసర వైద్య సేవల నిమిత్తం రాజమహేంద్రవరం తరలిస్తుండగా, మార్గం మధ్యలో చరణ్బాబు మృతి చెందాడు. నాని పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మాధవికి రాజమహేంద్రవరంలో వైద్య సేవలందిస్తున్నారని పోలీసులు తెలిపారు. కుటుంబానికి ఆసరాగా ఉంటూ.. చరణ్బాబుకు తండ్రి లేకపోవడంతో కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు కేటరింగ్ పనులు చేస్తున్నాడు. అతని తల్లి వెంకటలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్కు వెళ్లింది. పది రోజుల క్రితమే ఇంటికి వచ్చింది. వెంకటలక్ష్మికి నలుగురు పిల్లలు కాగా, చరణ్బాబు చిన్న కుమారుడు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ కేటరింగ్ పనులకు వెళ్తున్నాడు. అతను మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ● ఇద్దరికి తీవ్రగాయాలు ● ఎస్.ముప్పవరంలో ఘటన -
ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టదా?
అల్లవరం: రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి ఐదుగురు మృత్యువాత పడటం, పలువురు ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉండడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్తీ పాలు, కల్తీ మద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అంతా కల్తీమయమైపోయిందన్నారు. కల్తీ పాల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బాధితుల్లో కొందరు రెండు కిడ్నీలూ పాడై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారని, మరి కొందరు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యూరియాలో రసాయనాలు కలిపి, కల్తీ పాలు తయారు చేస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సరైన తనిఖీలు చేయకపోవడం, సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఇటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాల ప్యాకెట్ల వినియోగం భారీగా పెరిగిందని, ఇటువంటి పరిస్థితుల్లో నాణ్యతా పరీక్షలు చేయకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానిదే నైతిక బాధ్యతని తెలిపారు. కల్తీ పాలు తాగి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి డైరీలో నాణ్యతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించి, సురక్షితమైతేనే ప్రజలకు సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. -
పాడి పశువుల పాలు, రక్తం నమూనాల సేకరణ
కోరుకొండ: స్థానిక నర్సాపురంలో పాడి పశువుల పాలు, రక్తం, ఆహారం నమూనాల సేకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. స్థానికుడు అడ్డాల గణేష్ విక్రయిస్తున్న పాలు కలుషితమవ్వడంతో ఐదుగురు మృతి చెందగా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. దీంతో గణేష్కు చెందిన పాడి పశువుల పాలు, రక్తం నమూనాలు సేకరించారు. నిందితుడు పాలు సేకరిస్తున్న రైతుల పశువుల నుంచి నమూనాలు సేకరించడానికి అధికారులు వచ్చారు. నర్సాపురంలో 43 మంది రైతులకు చెందిన 46 పశువుల నుంచి నమూనాల సేకరణ జరిగింది. రాజమహేంద్రవరం ఆర్డీవో కృష్ణనాయక్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు, ఏడీ ప్రభావతి, ఆ శాఖ వైద్యులు, సిబ్బంది 17 మంది సేకరణలో పాల్గొన్నారు. 43 మంది రైతుల రక్త నమూనాలను కూడా కోరుకొండ పీహెచ్సీ డాక్టర్ జ్ఞానచంద్ర ఆధ్వర్యంలో సేకరించారు. ఈ నమూనాలను పరీక్షల నిమిత్తం విజయవాడ ల్యాబ్లకు పంపుతామని, ఫలితం రెండు రోజుల్లో వస్తుందని ఆర్డీవో కృష్ణనాయక్ విలేకరులకు తెలిపారు. -
మరణ మృదంగం మోగిస్తున్న ‘పాల’కూట విషం
దేవుడి ప్రసాదంలో కల్తీ అంటూ డెయిరీలను భయపెట్టి సొంత డెయిరీలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంపై చంద్రబాబుకు ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలు తీస్తున్న పాల కల్తీపై లేకపోయింది. పాల కల్తీ బయటపడి వారం రోజులవుతున్నా.. వరుసగా ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం నిర్ఘాంతపరుస్తోంది. ప్రజారోగ్యం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తోందో తెలుసుకోవడానికి రాజమహేంద్రవరం పాల కల్తీ ఉదంతమే ప్రత్యక్ష నిదర్శనం. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మృత్యువుతో పోరాడుతున్నారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం విచారకరమని ప్రజలు విమర్శిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాల దుర్ఘటన మరణ మృదంగం మోగిస్తోంది. లాలాచెరువు సమీపంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలో చోటుచేసుకుంటున్న మరణాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ పాలు తాగి చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) ఇప్పటికే మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం ఎన్.శేషగిరిరావు (72), రాధాకృష్ణమూర్తి (74), తాడి రమణి (58) మరణించారు. ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందగా.. అధికారులు మాత్రం నలుగురు మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాలకు హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికలు రావాల్సి ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లకు పైబడిన వృద్ధులు, మూడేళ్లలోపు చిన్నారులు ఉన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇద్దరు చిన్నారులు సహా 8 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 17 మంది బాధితులు ఒక్కసారిగా మూత్రం ఆగిపోవడం (అనూరియా), వాంతులు, విరేచనాలు కావడం, కిడ్నీ ఫెయిల్ కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారు అధికారిక లెక్కల ప్రకారం 17 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా.. మరో 12 మంది కిమ్స్, రెయిన్బో, రవి చైతన్య, సన్స్టార్ తదితర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కిమ్స్లో ఏడుగురు చికిత్స పొందుతుండగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రెయిన్బోలో ముగ్గురు చిన్నారులు చికిత్స పొందుతుండగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఐదు నెలల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. పరిస్థితి హృదయ విదారకంగా మారింది. అభం శుభం తెలియని పసివాడికి చికిత్స అందిస్తున్న దృశ్యం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆదిత్య ఆస్పత్రిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. రవి చైతన్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరికొందరు జయ కిడ్నీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కిమ్స్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేకుండా ఉంది. బాధితుల్లో ఎక్కువ మంది మధుమేహంతో బాధపడుతున్నారు. కాగా.. వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నదాని ప్రకారం కల్తీ పాల బాధితులు 19 మంది ఉన్నారు. వీరిలో ఐదుగురు మంది మృతి చెందగా.. మరో 14 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అధికారులు మాత్రం మొత్తం బాధితులు 17 మందేనని స్పష్టం చేశారు. వీరిలో నలుగురు మృతి చెందారని చెబుతున్నారు. కల్తీ నిర్ధారణకు మరో రెండు రోజులు పాలల్లో కల్తీని నిర్ధారించేందుకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. పాల వ్యాపారి గణేష్ నుంచి పాలు పోయించుకుంటున్న 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్లకు పంపించారు. ఈ నివేదికలు ఇంకా రావాల్సి ఉంది. వీటితో పాటు పశు సంవర్ధక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి ఆ నమూనాలను వైజ్ఞానిక, పశు సంవర్థక శాఖ ప్రయోగశాలలకు పంపించారు. ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు, పాల ఉత్పత్తులను హైదరాబాద్, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపినట్టు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు సైతం పంపించామన్నారు. వెలుగులోకి కీలక విషయాలు కల్తీ పాల కలవరానికి కారణమని భావిస్తున్న పాల వ్యాపారి గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో కీలక అంశాలు బహిర్గతమైనట్లు తెలిసింది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, వెంకటేశ్వర నగర్లలోని 106 కుటుంబాలకు కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన అడ్డాల గణేష్ అనే వ్యాపారి ప్రతిరోజూ పాలు పోస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ శివరాత్రి కావడంతో పాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో రోజూ పాలుపోసే వారితో కలిపి మొత్తం 126 కుటుంబాలకు గణేష్ ఆ రోజు పాలు పోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని సమాచారం. 16వ తేదీన పోసిన పాలు కొంచెం చేదుగా ఉన్నాయని వినియోగదారులు గణేష్ దృష్టికి తీసుకెళ్లగా.. మరునాటి నుంచి అలా జరగదని అతడు చెప్పడంతో మిన్నకుండిపోయారు. తిరిగి సాధారణంగా ఎప్పుడూ ఉండే రుచే ఉండటంతో వినియోగదారులు పట్టించుకోలేదు. ఆ రోజు గణేష్ నరసాపురం గ్రామ పరిసరాల్లో పాలను సేకరించినట్లు సమాచారం. దీనిని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. పాలు ఎక్కడెక్కడ, ఎవరెవరి నుంచి సేకరించాడనే విషయమై ఆరా తీస్తున్నారు. అనధికార డెయిరీ సీజ్ పాల వ్యాపారి గణేష్ నరసాపురంలో అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని పోలీసులు సీజ్ చేశారు. పాలు సేకరించే పరికరాలను స్వాదీనం చేసుకున్నారు. వెనిగర్, పాలు, కెమికల్స్ స్వాదీనం చేసుకున్నారు. పాలు, నీళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపారు. పశువుల రక్త నమూనాలు సైతం సేకరించారు. కారణాలు బయటకొచ్చిన వెంటనే గణేష్తో పాటు ఇతర బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. కాలనీల్లో వైద్య బృందాలు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లలో వైద్య బృందాలు పర్యటిస్తున్నాయి. పాలు వినియోగించిన వారి రక్త నమూనాలు తీసుకుంటున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అధికారులు 18 బృందాలుగా విడిపోయి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అనారోగ్యానికి గురైన వారిలో వికారంతో కూడిన వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలు కనిపించాయని డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారేనని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు.వైఎస్సార్సీపీ నేతల పరామర్శ కల్తీ పాల బాధితులను, బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పరామర్శించారు. రాజమహేంద్రవరం చౌడేశ్వరి నగర్లో పర్యటించి ఏం జరిగిందనే విషయంపై బాధిత కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కల్తీ పాల ఘటనపై వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరా తీశారు.మా ఇంట్లో ముగ్గురి పరిస్థితి విషమం మా ఇంట్లో నా తల్లి, తండ్రితో పాటు నా కుటుంబ సభ్యులు నలుగురికి కిడ్నీ విఫలమైంది. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. శివరాత్రి నాడు మా పాల వ్యాపారి అందించిన పాలు తీసుకున్న తర్వాత ఈ అనర్థం జరిగింది. ఆ పాలు తాగిన తర్వాత వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. వారం తర్వాత అంటే.. ఈ నెల 22న అందరికీ మూత్రం ఆగిపోయింది. కుటుంబంలో అందరికీ ఒకే సమస్య రావడంతో ఆందోళనకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. – మధు, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరంశరీరమంతా దద్దుర్లు వచ్చేశాయి మా మనవరాలు నాలుగు రోజుల క్రితం పాలు తాగిన వెంటనే శరీరంపై దద్దుర్లు వచ్చాయి. ఆ పాల వ్యాపారికి మేం ఈ విషయం చెప్పాం. పాలు చేదుగా ఉన్నాయని తెలిపాం. కొత్తగా గేదె ఈనిందని, అందుకే పాల రుచిలో తేడా వచ్చిందన్నాడు. ఆ తర్వాత మా చుట్టుపక్కల అతను పాలు పోసిన ఇళ్లలో కిడ్నీ బాధితులు బయటపడుతుండటంతో ఆందోళనకు గురవుతున్నాం. మా మనవరాలిని ఆస్పత్రిలో చేర్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. వారు చేసిన వైద్య పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. – షేక్ సిరాజుద్దీన్, చౌడేశ్వరినగర్, రాజమహేంద్రవరంమిగతా వారిలోనూ సమస్యలు రావొచ్చు ఈ నెల 14న రాత్రి మూత్ర సమస్యతో నా వద్దకు కొందరు వచ్చారు. అందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో మంచినీటి సరఫరాపై అనుమానం కలిగింది. మంచినీటి సరఫరా బాగానే ఉందని మున్సిపల్ అధికారులు స్పష్టంచేయడంతో రోగులు తీసుకున్న ఆహారంపై ఆరా తీయగా పాలు తాగిన తర్వాత ఈ సమస్య వచ్చినట్లు తెలిసింది. ముందుగా బలహీనంగా ఉండే వృద్ధులు, చిన్నారులపై కల్తీ పాలు ప్రభావం చూపించాయి. మిగతా వారిలో కూడా భవిష్యత్లో అనారోగ్య సమస్యలు కలగవచ్చు. అందుకే ఆ పాలు తాగిన వారందరూ కిడ్నీకి సంబంధించి క్రియాటినిన్ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ శశాంక్, కిడ్నీ వ్యాధుల నిపుణుడు, రాజమహేంద్రవరంఅందని ప్రభుత్వ వైద్యంబాధితులకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. మూత్ర విసర్జన స్తంభించడం, కిడ్నీ సమస్యలు, వాంతులు, విరేచనాలతో రాజమహేంద్రవరం జీజీహెచ్కు మూడేళ్ల చిన్నారిని తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడకు తీసుకెళ్లగా తమవద్ద వైద్య సదుపాయాలు లేవని వైద్యులు చెప్పడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు లబోదిబోమంటూ తిరిగి రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే విధంగా మరో చిన్నారి రితిక్ చికిత్స కోసం ఇప్పటివరకు ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.8.50 లక్షలకు పైగా ఖర్చయింది. మిగిలిన బాధితులకు సైతం వైద్య ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. -
ఘోర ప్రమాదం: రెయిలింగ్లోకి దూసుకెళ్లిన కారు
తూర్పు గోదావరి జిల్లా: మండలంలోని సింగన్నగూడెం వద్ద జాతీయ రహదారి–30లో ఆదివారం కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన పురేష్గౌడ్ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన 9 మంది కూలీలు తమిళనాడుకు కూలి పనుల నిమిత్తం వెళ్లి కారులో తిరిగి స్వరాష్ట్రం వెళుతున్న క్రమంలో సింగన్నగూడెం వద్ద కొత్తగా నిర్మించిన రహదారి పక్కనే ఉన్న రెయిలింగ్ను బలంగా ఢీకొన్నారు. రెయిలింగ్ విరిగిపోవడంతో పాటు కారు ముందు భాగం నుంచి మధ్యలోని సీటు భాగంలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పురేష్ గౌడ్ కడుపులోకి రెయిలింగ్ గుచ్చుకోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి గాయాలు కాగా, ఇందులో జన్మతి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన వైద్యం నిమిత్తం భద్రాచలం తరలించారు. ఘటనా స్థలాన్ని ఏఎస్పీ బొడ్డు హేమంత్, ఎస్ఐ సురేష్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన.. ఐదుకు చేరిన మరణాలు
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఈ ఘటనలో తాజాగా దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు మృతి చెందగా.. అంతకుముందు, చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనక రత్నం సహా మరొకరు చనిపోయారు. మరో నలుగురు చిన్నారులు.. రాజమండ్రి పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇద్దరు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారికి వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నారు. వీరికి ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు.గణేష్ అరెస్ట్..ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని,అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ల్యాబ్కు నమూనాలుకల్తీ పాలతో నలుగురు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.5 రోజుల్లో 12 మంది బాధితులు?చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఇదిగో టమాట!
ఇదిగో ట‘మాట’ అండి.. చెర్రీ పండ్లను పోలిన చెర్రీ టమాటాలు. వీటినే పూర్వం ఎక్కువగా వాడేవారు. కానీ హైబ్రీడ్ రకాలు అందుబాటులోకి రావడంతో పాటు పెద్ద సైజు టమాటాలకు జనం అలవాటు పడ్డారు. అయితే ప్రస్తుతం దేశవాళీ రకం చెర్రీ టమాటాలను గొల్లప్రోలు మండలం దుర్గాడ గుండ్ర శివచక్రం ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు. ఈ రకం టమాటా మొక్క పాదులా విస్తరించి గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తోంది. ఇవి గుండ్రని (గోళీల సైజులో), ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు, లేదా నారింజ రంగులో ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషక విలువలు ఉంటాయని చెబుతాయి. విటమిన్ ఏ, సీ, ఈ, కే, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిలోని లైకోపీన్ మరియు పొటాషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిని సలాడ్లు, సలాడ్ డ్రెస్సింగ్లు, పాస్తా, ఇతర వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. –పిఠాపురం -
సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా సమ్మె చేస్తున్న సహకార ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఉమ్మడి జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.సత్తిబాబు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి వీరి డిమాండ్లను పరిష్కరించి సమ్మెను తొందరగా విరమింపజేయాలని సూచించారు. సమ్మె కారణంగా సహకార ఉద్యోగులు విధులు నిర్వర్తించక, సహకార సంఘాలు తెరుచుకోక అన్నదాతలు అవస్థఽలు పడుతున్నారని సత్తిబాబు గుర్తు చేశారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన జీఓ నంబరు 36ను ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని అన్నారు. రైతు పభుత్వం అని చెప్పుకొనే కూటమి ప్రభు త్వం సహకార ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సహకార ఉద్యోగుల సమ్మెకు రైతులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత, సంఘటిత కార్మికుల సంఘీభావం కూడగడతామని సత్తిబాబు అన్నారు. రోడ్డుపై పడి వ్యక్తి మృతి నల్లజర్ల: ఫిట్స్ కారణంగా రోడ్డుపై పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముసుళ్లగుంట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నూజివీడు మండలం శోభనాపురం గ్రామానికి చెందిన పెద్దబోయిన గంగరాజు (44) గొర్రెలు కొనుగోలు చేయడానికి శనివారం ముసుళ్లగుంట గ్రామానికి వచ్చాడు. ఆదివారం ఆ గ్రామ వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఫిట్స్ రావడంతో రోడ్డుపై పడిపోయాడు. అతని తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు వెంకటకిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఆంజనేయబాబు తెలిపారు. -
ప్రపంచ తెలుగు మహాసభలకు ఏర్పాట్లు
కాకినాడ రూరల్: మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు అమలాపురం వేదిక కానుంది. ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో రెండు రోజుల పాటు కిమ్స్ వైద్య కళాశాల వేదికగా నిర్వహించనున్న తెలుగు మహాసభలకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులు హాజరవుతారని గోదావరి గ్లోబల్ విశ్వ విద్యాలయం చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) తెలిపారు. సర్పవరం గ్రామంలోని ఆవాస వన్ అపార్ట్మెంట్ ఆవరణలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్న వయసు నుంచే తెలుగు భాషపై మక్కువ చూపాలని, ఈసారి తెలుగు మహాసభలను గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం, కిమ్స్ వైద్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని ఆయన కోరారు. నేడు ‘డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీ’ సాక్షి, విశాఖపట్నం: డిస్కమ్ పరిధిలోని విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో సోమవారం ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి ప్రకటించారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి సంస్థ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, ఏఎస్ఆర్ పాడేరు, రాజమహేంద్రవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన విద్యుత్ వినియోగదారులు 86884 00499 ఫోన్ నంబర్ ద్వారా విద్యుత్ సంబంధిత సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు, హెచ్చుతగ్గులు, కొత్త సర్వీసుల జారీలో, విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం, ట్రాన్న్స్ఫార్మర్ల మార్పిడి, తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని సంస్థ పరిధిలోని 11 జిల్లాల వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 16,000 – 17,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
శెట్టిబలిజలు రాజ్యాధికారం చేపట్టాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అంబాజీపేట: రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టే కులగణన ద్వారా శెట్టిబలిజలు రాజ్యాధికారం చేపట్టేలా పోరాటం చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. గంగలకుర్రు అగ్రహారంలో శెట్టిబలిజ సంఘ ఆహ్వాన కమిటీ నాయకులు విత్తనాల ఇంద్రశేఖర్, మట్టపర్తి సతీష్, రాయుడు షణ్ముక్, సంసాని మురళి, దొంగ హరి, మట్టపర్తి విజయ్ తదితరుల పర్యవేక్షణలో శెట్టిబలిజ స్థూపాన్ని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు గుత్తుల మీరాకుమార్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఎంఎం శెట్టి అధ్యక్షతన జరిగిన శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళన సభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రభుత్వాలు బీసీలకు భయపడి కులగణన చేపట్టాయని, దీంతో పాటు జాతి గణన చేయాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికల్లో ఇతర బీసీ కులాలను కలుపుకొని శెట్టిబలిజలు రాజ్యాధికారం చేపట్టాలన్నారు. శెట్టిబలిజ ఆత్మీయ సమ్మేళనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముఖ్యభూమిక వహిస్తుందనడంలో సందేహం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు గుత్తుల మీరాకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శెట్టిబలిజలు రాజ్యాధికారాన్ని శాసించే విధంగా అడుగులు వేయాలన్నారు. అలనాటి నుంచి గంగలకుర్రు అగ్రహారం శాసించే రాజకీయాలకు పేరుగాంచిందన్నారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో బీసీ సామాజిక వర్గంలో శెట్టిబలిజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. శెట్టిబలిజలంతా ఐక్యంగా సాగాలన్నారు. నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, చెల్లుబోయిన శ్రీనివాసరావు, కుడుపూడి భరత్భూషన్, రెడ్డి నాగేంద్రమణి మాట్లాడుతూ శెట్టిబలిజ కులస్తులంతా సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. ఆత్మీయ సమ్మేళన సభ వద్ద ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు దొమ్మేటి వెంకటరెడ్డి, రాయుడు సత్తిబాబు చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, సర్పంచ్లు దొంగ నాగేశ్వరరావు, కాండ్రేగుల శ్రీనివాసరావు, బొంతు పాపయ్య, కుడుపూడి సత్తిబాబు, రాయుడు కృష్ణమహేష్, రాయుడు మీరయ్య, గుత్తుల సాయి, పిల్లి నాగ గోపాలకృష్ణ, వాసంశెట్టి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. -
ద్వాదశ గ్రంథావిష్కరణ మహోత్సవం
సీటీఆర్ఐ: రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాల్లో సాహితీ గౌతమీ వ్యవస్థాపకుడు పి.విజయ్కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ సంగాడి వీర రాఘవేంద్రరావు రచించిన 12 గ్రంథాలను ప్రముఖ సాహితీవేత్తలు ఆదివారం ఆవిష్కరించారు. అలాగే గ్రంథకర్త సంగాడి వీర రాఘవేంద్రరావు, భార్య కామేశ్వరికి సహస్ర చంద్రదర్శన మహోత్సవం జరిగింది. విజయ్కుమార్ మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు – వాహన వైభవాలు, ఉగ్ర – శాంతి, సాహితీ మంజూష, గోష్ఠీ పత్ర స్రవంతి, మనసిక్కిం, కరోనా కథ, పుడమీ తల్లి, ప్రసంగ తరంగణి – 2, ద్రాక్షారామ క్షేత్ర సాహిత్య సమీక్ష, ప్రసంగ తరంగణి – 1, కబీరు బోధనామృతం వంటి అత్యుత్తమ గ్రంథాలను రచించిన వీర రాఘవేంద్రరావు అభినందనీయుడన్నారు. కార్యక్రమంలో మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆదిత్య సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, డాక్టర్ బీహెచ్వీ రమాదేవి, జీఎన్మూర్తి, డాక్టర్ అరిపిరాల నారాయణరావు, తాతా సందీప్శర్శ పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
భద్రతే బంగారం కాను
ఫ ఆభరణాలు ధరించాలంటే హడల్ ఫ వెంటాడుతున్న దొంగల భయం ఫ లాకర్లలో భద్రపరుచుకుంటున్న వైనం రాయవరం: ప్రస్తుతం భద్రత బంగారానికి ఎంతో అవసరమైంది.. పసిడి ధరలు రోజురోజుకూ కొండెక్కడంతో దొంగతనాల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో రూ.లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఆభరణాలను లాకర్లలో భద్రపరుచుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.. ఇటీవల జరుగుతున్న ఘటనలే అందుకు ఉదాహరణ. ఇటీవల రాయవరంలో పులగం లకి్ష్మ్ అనే మహిళ తన షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా, ఆమె మెడలోని 11 కాసుల బంగారం గొలుసును ఐదుగురు యువకులు తెంచుకుని పరారయ్యారు. అలాగే కపిలేశ్వరపురం మండలం వల్లూరులో మానుపాటి గణేష్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బంగారు ఆభరణాలు చోరీ చేశారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో 50 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి చోరీకి గురయ్యాయి. ఇటువంటి ఘటనలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి. బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ ధరించలేని పరిస్థితి నెలకొంటుంది. పసిడి.. ప్రాణాలతో ముడిపడి హుందాతనం, అందం కోసం మహిళలు బంగారు ఆభరణాలు ధరిస్తారు. అయితే ఇప్పుడు పెరిగిన ధరలు బంగారం ధరించాలంటేనే హడలిపోతున్నారు. అన్ని వర్గాలకు చెందిన మహిళలు మంగళ సూత్రాలను బంగారంతో చేయించుకుంటారు. ప్రస్తుతం కాసు బరువున్న బంగారు సూత్రాలు రూ.1.20 లక్షలు ఉంది. ఇలా రూ.లక్షలు ఖరీదు చేసి బంగారు నగలు ధరించాలంటేనే భయపడి పోతున్న పరిస్థితి అంతటా నెలకొంది. తరచూ జరుగుతున్న చోరీల భయంతో మహిళలు హడలిపోతున్నారు. ఒకప్పుడు పట్టణాల్లో వినిపించే చోరీ ఘటనలు ఇప్పుడు గ్రామాలకు సైతం విస్తరించాయి. కొన్నిచోట్ల మహిళల మెడలోని బంగారు ఆభరణాలను దుండగులు తెంచుకునే ప్రయత్నాల్లో బాధితుల ప్రాణాల మీదకు వస్తోంది. ఇటీవల రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. రద్దీగా ఉన్న బస్సుల్లోనే కొందరు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాగే ఒంటరిగా నడిచి వెళ్లే సమయంలో, ఇంటి వాకిలి శుభ్రపర్చడం, ముగ్గులు వేయడం, ప్రయాణ సందర్భంలో, దేవాలయాలు, మార్కెట్కు వెళ్లేటప్పుడు, మోటార్ సైకిల్పై అజాగ్రత్తగా వెనుక కూర్చున్న సందర్భాల్లో దోపిడీలు జరుగుతున్నాయి. అటువైపు చూడాలంటేనే.. పెరిగిన బంగారం ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బంగారం షాపు మెట్లెక్కడానికి జంకుతున్నారు. ఒక కాసు బంగారం కొనాలంటే పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెరిగిన ఽబంగారం, వెండి ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. చోరీల నేపథ్యంలో అతివలు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలను సొంత బీరువాలకు పరిమితం చేయడం.. లేదంటే బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవడం చేస్తున్నారు. లాకర్లలో ఉన్న బంగారు ఆభరణాలకు బదులుగా ఇమిటేషన్ జ్యూయలరీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఏడాది వారెంటీతో ఇప్పుడు మార్కెట్లో వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు బంగారం స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి. మహిళలు రూ.లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు భద్రంగా దాచుకుంటూ తమ నగలనే పోలిన ఇమిటేషన్ జ్యూయలరీ ఆభరణాలను వాడుతున్నారు. వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఆభరణాలు ధరించి ఆడంబరంగా ఉండాలనుకునే ఆలోచన విరమించుకోవాల్సిన పరిస్థితులు సమాజంలో నెలకొన్నాయి. బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో దొంగతనాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. –చింతా స్వప్న, గృహిణి, అనపర్తి ఈజీ మనీకి అలవాటు పడి బంగారం ధరలు పెరగడం ఒక కారణమైతే, చాలా మంది యువకులు ఈజీ మనీకి, చెడు వ్యసనాలకు బానిసై చోరీల బాట పడుతున్నారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు. బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆభరణాలు ధరించడం ప్రాణాంతకమవుతున్న పరిస్థితి ఏర్పడింది. –గరగ సీతాదేవి, ఉపాధ్యాయురాలు, సోమేశ్వరం, రాయవరం మండలం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సెలవులకు లేదా దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్)ను సద్వినియోగం చేసుకోవాలి. తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. – బి.విద్య, డీఎస్పీ, ఈస్ట్జోన్, రాజమహేంద్రవరం అంతకంతకూ పెరిగి.. నాలుగైదు నెలల వ్యవధిలో బంగారం ధరలు 60 శాతం వరకూ పెరిగాయి. బంగారు ఎప్పుడు పెరుగుతుందో.. ఎంత మేర పెరుగుతుందో.. ఎప్పుడు దిగుతుందో తెలియని అయోమయ మార్కెట్లో ఉంది. కాసు బంగారం ధర గతేడాది సెప్టెంబర్లో రూ.80 వేలు ఉంటే, ఇప్పుడు రూ.1.20 లక్షలకు చేరింది. నెల రోజులకు ముందు కాసు ధర రూ.1.33 లక్షలకు చేరగా మళ్లీ ఇప్పుడు కొంతమేర తగ్గింది. -
నర్సింగ్ పరీక్షల్లో అవకతవకలపై విచారణకు చర్యలు
ఫ త్రిసభ్య కమిటీ ఏర్పాటు ఫ ‘సాక్షి’ కథనానికి స్పందన కాకినాడ క్రైం: రాజమహేంద్రవరంలో ఈ నెల 9 నుంచి నిర్వహించిన జీఎన్ఎం నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేయించారనే ఆరోపణల నేపథ్యంలో 12న ‘సాక్షి’ దినపత్రికలో ‘నాడి కాదు.. నోటు పడితే నర్సింగ్’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు, రాష్ట్ర డీఎంఈ డాక్టర్ రఘునందన్ గంభీర లోతైన విచారణకు ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సరెళ్ల లావణ్యకుమారి ఆధ్వర్యంలో ఆర్ఎంసీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మకం మునిరత్నమ్మ, అడ్మినిస్ట్రేటర్ నూకతోటి శ్రీధర్లతో కూడిన త్రిసభ్య కమిటీని విచారణకు నియమించారు. ఈ నెల 27న రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ నిర్వహించాలని సూచించారు. ఓఎస్డీల హోదాల్లో చీఫ్ ఇన్విజిలేటర్లుగా వ్యవహరించిన కాకినాడ జీజీహెచ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ట్యూటర్ సుజాత, ఒంగోలు స్కూల్ ఆఫ్ నర్సింగ్ ట్యూటర్ మాధవీలతలను విచారించేందుకు అధికారులు 50 ప్రశ్నలను సిద్ధం చేశారు. వీరితో పాటు ఇతర సిబ్బందిని విచారణలో భాగం చేయనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్గా వ్యవహరించిన రాజమహేంద్రవరం సూపరింటెండెంట్కి తెలియకుండా, నర్సింగ్ పరీక్షలు నిర్వహించిన గత అనుభవాన్ని అవకాశంగా మలుచుకుని ప్రైవేటు నర్సింగ్ కళాశాలలతో కాపీయింగ్ కోసం ఖరీదు కట్టడం, అందుకు మంతనాలు చేయడం తుదకు వారితో పరీక్షలకు సరిగ్గా మూడు రోజుల ముందు ఈ నెల 6న రహస్య సమావేశం నిర్వహించిన తంతు ఆధారాలతో సహా రాష్ట్ర ఉన్నతాఽధికారులకు చేరింది. వసూళ్లు, కాపీయింగ్ వ్యవహారం ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసింది. ఈ నేపథ్యంలో ఓఎస్డీల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని విచారణకు ఆదేశించామని డీఎంఈ తెలిపారు. అలాగే, కాకినాడలో నిర్వహించిన నర్సింగ్ పరీక్షల్లో తొలి రోజు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇవ్వడం, చీఫ్ ఇన్విజిలేటర్ హోదాలో రాష్ట్రం మొత్తం నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాళ్లను నియమిస్తే ఒక్క కాకినాడలోనే ఏకపక్షంగా నిబంధనలకు విరుద్ధంగా అడ్మినిస్ట్రేటర్ని నియమించడం వివాదాస్పదమైంది. ఈ అంశాలపై కూడా వివరణ కోరుతూ డీఎంఈ ఆదేశాలు వెలువడ్డాయి. -
‘చలో విజయవాడ’ జయప్రదం చేయాలి
రంగంపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు మేనిఫెస్టో సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఈ నెల 25న నిర్వహిస్తున్న ‘చలో విజయవాడ’కు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని ఎస్టీయూ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీసీ జాకబ్ కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాన డిమాండ్లుగా ఉన్న 12వ వేతన సంఘాన్ని నియమించాలని, వేతన సవరణ సంఘం రిపోర్టు వచ్చే వరకు 30% మధ్యంతర భృతి ఇవ్వాలనారు. కంట్రిబ్యూటరీ పెన్షన్, గ్యారెంటీ పెన్షన్ పథకాలను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యాన్ని విడుదల చేయాలన్నారు. పీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, రిటైర్ అవుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ సౌలభ్యాలు విడుదల చేయాలని కోరారు. అలాగే ఎంటీఎస్, సాంఘిక సంక్షేమ శాఖలోని ఉపాధ్యాయులకు పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. 2025లో బదిలీ కోరుకున్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, నాలుగు దశాబ్దాల నుంచి పెండింగ్లో ఉన్న సర్వీస్ రూల్స్ను వెంటనే విడుదల చేయాలని, సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ చేసి, ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ద్వారా రిఫరల్ ఆస్పత్రులలో నగదు రహిత ట్రీట్మెంట్ ఇవ్వాలని వారు తెలిపారు. -
అరణ్యరోదన
అంతుచిక్కని కారణాలు? ఈ గ్రామ ప్రజల అవసరార్థం మూడు రక్షిత మంచి నీటి పథకాలు ఉన్నారు. అలాగే 20 చేతి పంపులు ఏర్పాటు చేశారు. తాగునీటి కుళాయిల ద్వారా వచ్చిన నీటిని వాడకానికి, చేతిపంపుల నీటిని తాగేందుకు వాడుతున్నారు. ట్యాంకు నీటిని క్లోరినేషన్ చేయకపోవడంతో తాగేందుకు వినియోగించడం లేదు. చేతిపంపు నుంచి వచ్చిన నీటిని రెండు రోజులు నిల్వ ఉంచుకుంటే అడుగు భాగాన శుద్ధగా వస్తుందని ప్రజలు అంటున్నారు. ఇది వ్యాధులకు కారణమని ప్రజలు చెబుతున్నారు. నీటి పరీక్షలు చేస్తే అసలు కారణాలు తెలుస్తాయి. గిరిజనులకు ‘అరణ్య’రోదనే మిగిలింది.. చంద్రబాబు సర్కారు పట్టించుకోక ఉర్లాకులపాడు మరో ఉద్దానంలా మారుతోంది.. ఫలితంగా ఏడాదిన్నరగా మృత్యుఘంటిక మోగుతోంది.. కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఆ పల్లెలో జనం సతమతమవుతున్నా ఎవరికీ పట్టకుంది.. అసలు వ్యాధులకు కారణాలేంటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కనీసం మెరుగైన వైద్యం అందించడంలోనూ ప్రభుత్వం విఫలం అవుతోంది.. ఆ మరణ మృదంగం గురించి తెలుసుకుందాం రండి.. రాజవొమ్మంగి: ఉర్లాకులపాడు.. రాజవొమ్మంగి మండలంలో ఓ కుగ్రామం. మండల కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రాజవొమ్మంగి– ఏలేశ్వరం ప్రధాన రహదారిని ఆనుకుని ఉంటోంది. ఈ గ్రామంలో 185 కుటుంబాలు, 701 మంది జనాభా ఉన్నారు. ఇక్కడంతా ఆదివాసీలు (కొండరెడ్డి) నివసిస్తున్నారు. ఏం జరుగుతుందో గాని ఇక్కడి గిరిజనులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇలా ఏడాదిన్నగా పది మందికి పైగా మృత్యువాత పడ్డారని గిరిజనులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ ఆరోగ్యం గురించి కనీసం పట్టించుకునే వారే లేకపోయాయని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం దృష్టికి వెళ్లకపోవడం విచారకరమని సర్పంచ్ తొంటా ఆదిరాజు అన్నారు. ప్రజాప్రతినిధిని అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఆయన బాధను వ్యక్తం చేశారు. ఒక్కసారిగా మంచాన పడి.. కోసూరి తమ్మారావు ( 47) గత ఏడాది డిసెంబర్లో ఒక్కసారిగా మంచాన పడ్డాడు. వ్యవసాయం కూలీగా ఉంటూ కుటుంబానికి ఆధారమైన అతను కిడ్నీ సమస్య బారిన పడ్డాడు. అతనికి భార్య భద్ర, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను చదివించుకుంటూనే తన భర్తను డయాలసిస్ కోసం, వారానికి మూడు సార్లు వంద కిలోమీటర్ల దూరంలోని కాకినాడకు తీసుకు వెళ్తున్నట్లు భద్ర చెబుతోంది. ఇందుకు గాను నెలకు రూ.7,200 ఖర్చు అవుతోందని తెలిపింది. ఇలా గత 13 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నట్లు కన్నీటి పర్యంతం అయ్యింది. యజమాని మంచాన పడడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని వివరించింది. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంది. అనేక మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో మందులు వేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కాని, ప్రభుత్వ పెద్దలు కాని కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం. అసలు సమస్య ఎందువల్ల వచ్చిందనే దానిపై ఇంకా ఓ అంచనాకు రాకపోవడం దారుణం. వెలుగులోకి రావడంతో.. ఉర్లాకులపాడులో కిడ్నీ సమస్యతో పలువురు మృత్యువాత పడ్డారన్న విషయం వెలుగు చూడడంతో అధికారులు శుక్ర, శనివారాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. శుక్రవారం 43 మందికి రక్త పరీక్షలు చేసి కాకినాడ ల్యాబ్కు పంపగా, ఆరుగురికి అసాధారణ ఫలితాలు వచ్చాయని రంపచోడవరం నుంచి వచ్చిన డాక్టర్ డేవిడ్ అన్నారు. వీరిని తదుపరి పరీక్షల నిమిత్తం సోమవారం ప్రత్యేక వాహనంలో కాకినాడకు తరలిస్తామన్నారు. శనివారం మరో 66 మందికి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపామన్నారు. ఈ గ్రామంలో సంభవిస్తున్న మరణాలకు కారణం ఏంటో తప్పకుండా కనుగొని తక్షణ వైద్య సహాయం అందజేస్తామని రంపచోడవరం నుంచి వచ్చిన ఆర్బీఎస్కే – ఎన్సీడీసీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగార్జున ‘సాక్షి’తో అన్నారు.ఫ ఉర్లాకులపాడులో మృత్యుఘోష ఫ కిడ్నీ సమస్యలతో గ్రామస్తులు ఫ ఏడాదిన్నరగా ఆగని ఆక్రందనలు ఫ పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్కరూ పట్టించుకోలేదు ఉర్లాకులపాడులో అనారోగ్య సమస్యలను ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. మరణాలు వెలుగు చూస్తుండడంతో ఇప్పుడు వచ్చి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మా గ్రామంలో ఎంతో మంది మరణించారు. కుటుంబ యజమాని చనిపోవడంతో వీధిన పడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఎంతో బాధాకరం. – కోసూరి భద్ర, ఉర్లాకులపాడు కష్టకాలం నుంచి ఆదుకోవాలి మా గ్రామంలో కిడ్నీ సమస్యల కారణంగా డయాలసిస్ చేయించుకుంటూ మరణించిన వారి సంఖ్య 20కి పైనే ఉంటోంది. ఇందులో పెళ్లికాని యువకులూ ఉన్నారు. భార్య, పిల్లలు ఉన్న పురుషులు ఉన్నారు. నేటికి ఉర్లాకులపాడులో అనేక మంది అనారోగ్యంతో మంచాన పడ్డారు. మా గ్రామాన్ని ఈ కష్టకాలం నుంచి ప్రభుత్వం ఆదుకోవాలి. – కోసూరి బూరమ్మ నమూనాలు సేకరిస్తున్నాం.. ఈ గ్రామంలో మూడు రక్షిత మంచి నీటి పథకాలు, మరో 20 చేతి పంపులున్నాయి. చేతి పంపు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారని తెలుసుకున్నాం. ఆ నీటి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపాం. నీటి కారణంగా వ్యాధులు సంభవిస్తున్నాయా? ఇతర కారణాలు ఉన్నాయా అనేదానిపై అధ్యయనం చేస్తున్నాం. ఉర్లాకులపాడులో సాధారణ పరిస్థితులు వచ్చేలా కృషి జరుగుతోంది. – డేవిడ్ ప్రభుత్వ వైద్యాధికారి, రంపచోడవరం -
విద్యార్థీ.. విజయోస్తు
సమన్వయంతో విజయవంతం చేస్తాం విద్య, పోలీస్ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలను విజయవంతం చేస్తాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు. పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశాం. విద్యార్థులు చాలా సౌకర్యవంతంగా పరీక్షలు రాసుకునేలా అన్ని ఏర్పాట్లు చేశాం. హాల్ టిక్కెట్ల విషయంలో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఏ మాత్రంఇబ్బంది పెట్టవద్దు. అలా ఎవరైనా చేసినట్టు సమాచారం ఇస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఐ.శారద, ఆర్ఐఓ, తూర్పుగోదావరి డీఈసీ కన్వీనర్ 12 వరకూ గదిలో ఉండాల్సిందే 3 గంటల పరీక్షా సమయంలో అరగంట ముందు బయటకు వచ్చేసే వెసులుబాటును రద్దు చేశారు. విద్యార్థి మూడు గంటలు పూర్తిగా పరీక్ష గదిలో ఉండాలి. 9 గంటలకు కచ్చితంగా పరీక్ష ప్రారంభమవుతుంది. సమయ పాలనను పాటించి తీరాలి. – కేశవరావు, డీఈసీ కన్వీనర్, కాకినాడ జిల్లా జిల్లాలో ఇలా.. జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 21,738 మంది, వృత్తి విద్యాకోర్సుల్లో 762 మంది మొత్తం 22,500 మంది విద్యార్థులు తొలిరోజు పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 19,895 మంది, ఓకేషనల్లో 798 మంది మొత్తం 20,603 మంది విద్యార్థులు పరీక్షలు రాయన్నారు. రెండు సంవత్సరాలకు కలిపి మొత్తం 43,103 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ● నేటి నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 160 కేంద్రాల్లో నిర్వహణ ● సన్నద్ధమవుతున్న విద్యార్థులు ● అరగంట ముందే బయటకు వచ్చే వీలు లేదు ● మొదటి ఏడాది విద్యార్థులకు 32 పేజీల బుక్లెట్ కపిలేశ్వరపురం/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి మార్చి 24 వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొదటి సంవత్సరం 60,260 మంది, రెండో సంవత్సరం 56,574, మొత్తంగా 1,16,834 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలో ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా సూచనలిచ్చారు. అదేరోజు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడలలో ఆయా జిల్లాల పరీక్షల నిర్వహణ అధికారులు, సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు. టైమ్ టేబుల్ మార్పులు ఇలా మార్చి 3న జరగాల్సిన ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్, సివిక్స్ పేపర్లు 4న, మార్చి 20న జరగాల్సిన ప్రథమ సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పేపర్లు 21న నిర్వహించనున్నారు. మార్చి 3న హోలీ, మార్చి 20న రంజాన్ రావడంతో ఈ మార్పులు చేశారు. పర్యవేక్షణాధికారులు ఇలా తూర్పుగోదావరి జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్గా ఆర్ఐఓ ఐ.శారద, కోనసీమ జిల్లా డీఐఈఓ కె.చంద్రశేఖర్బాబు, పోలవరం జిల్లా డీఐఈఓ ఎస్.భీమశంకరరావు, కాకినాడ జిల్లా కన్వీనర్గా డీఐఈఓ కేశవరావు పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. సమయపాలనకు ప్రాధాన్యం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల ఈ వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. 8.30కి పోలీస్ స్టేషన్ నుంచి పేపర్లు తెచ్చి 8.45కి తెరుస్తారు. విద్యార్థి 12 గంటల వరకూ పరీక్ష గదిలో విధిగా ఉండాలి. గతంలో అరగంట ముందే వెళ్లిపోయే వెసులుబాటును రద్దు చేశారు. నిర్వహణ ఏర్పాట్లు ఏపీ పబ్లిక్ పరీక్షల చట్టం 1997 ప్రకారం నిబంధనలు రూపొందించారు. కలెక్టర్, ఎస్పీ, ఆర్జేడీ, డీవీఈఓ, డీఐఈఓ, ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ అధ్యాపకులు, సబ్జెక్ట్ నిపుణులతో హైపవర్ కమిటీ ఈ పరీక్షలను పర్యవేక్షించనుంది. కేంద్రాల వద్ద భారత న్యాయ సంహిత సెక్షన్ 163 అమలులో ఉంటుంది. స్టేట్ టోల్ఫ్రీ నంబరు 1800–425–1531తో పాటు జిల్లాకు ఒక కంట్రోల్ రూం నంబర్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రంలోని సూపరింటెండెంట్తో సహా కింది స్థాయి సిబ్బంది వరకూ ఎలాంటి వ్యక్తిగత ఫోన్లు వాడకూడదు. బోర్డు సమకూర్చిన ఫోన్, సిమ్కార్డులను మాత్రమే వాడుతారు. కేంద్రాల వద్ద మట్టికుండలో తాగునీరు, నిరంతర విద్యుత్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలకు సంబంధించి పేపర్లు ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. వాటికి సీసీ కెమేరాలతో నిఘా పెట్టారు. ప్రతి పరీక్షా కేంద్రానికి జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. అలాగే విద్యార్థుల సౌకర్యం కోసం నో యువర్ సెంటర్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రిన్సిపాల్, జూనియర్ లెక్చరర్, డిప్యూటీ తహసీల్దార్. పోలీసులతో కలిసి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, జిల్లా హైపవర్ కమిటీ ఈ పరీక్షలను పర్యవేక్షించనుంది. జిల్లా విద్యాశాల నుంచి 317 మందిని ఇన్విజిలేటర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. పోలీస్స్టేషన్ నుంచి ప్రశ్నా పత్రాలను ఆయా కేంద్రాలకు రెండు చక్రాల వాహనాలపై తీసుకెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. హాల్ టికెట్ల జారీ ఇలా.. కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే హాల్ టికెట్లు జారీ చేయాలి. తీసుకోని వారు బీఐఇ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. అందుకోసం మొదటి సంవత్సరం విద్యార్థులు పదో తరగతి హాల్ టికెట్ నంబరు లేదా ఆధార్ నంబరు, పుట్టిన తేదీ వివరాలతోనూ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం హాల్ టికెట్ నంబర్తోనూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009కు హాయ్ అని మెసేజ్ చేస్తే వచ్చే వివరాల ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ బుక్లెట్లలో మార్పులు ఇవీ ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు 24 పేజీలు, మిగిలిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్లను ఇవ్వనున్నారు. ద్వితీయ సంవత్సరంలో అన్ని సబ్జెక్టులకూ 24 పేజీల బుక్లెట్లే ఇస్తారు. అన్ని పేజీలు ఉన్నాయో లేదో విద్యార్థులు ముందుగానే చూసుకోవాలి. పేజీలను చించినట్టయితే విద్యార్థిపై మాల్ ప్రాక్టీస్గా కేసు రాస్తారు. పరీక్ష పేపరులో.. ఇప్పటి వరకూ జువాలజీ, బోటనీలకు చెరొక 60 మార్కుల చొప్పన థియరీ పరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది రెండింటికీ కలిపి బయాలజీ పేరుతో 85 మార్కులకు నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రం ఒకటే అయినప్పటికీ జవాబులకు రెండు సబ్జెక్టులకు రెండు ఓఎంఆర్ షీట్లు ఇవ్వనున్నారు. గణితంలో 12, బోటనీలో 5, జువాలజీలో 4, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఒక మార్కు ప్రశ్నలు 9 చొప్పున ఇవ్వనున్నారు. పాస్ మార్కులు ఎలా ఏ సబ్జెక్టుకై నా ఉత్తీర్ణత శాతం 35. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులకు ప్రథమ సంవత్సరంలో 85 మార్కులకు 29, ద్వితీయ సంవత్సరంలో 85 మార్కులకు 30 మార్కులు కచ్చితంగా రావాలి. ద్వితీయ సంవత్సరం 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండగా 11 పాస్ మార్కులు రావాలి. అంశం తూర్పు గోదావరి కాకినాడ అంబేడ్కర్ కోనసీమ పోలవరం మొత్తం ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 22,500 22,010 13,131 2,619 60,260 సెకెండ్ ఇయర్ విద్యార్థులు 20,603 20879 12,756 2,336 56,574 మొత్తం విద్యార్థులు 43,103 42,889 25,887 4,955 1,16,834 పరీక్షా కేంద్రాలు 52 58 40 10 160 ఇన్విజిలేటర్లు 317 465 332 150 1,264 డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 52 58 40 10 160 సూపరింటెండెంట్లు 52 58 40 10 160 ఫ్లయింగ్ స్క్వాడ్లు 3 3 2 3 11 సిట్టింగ్ స్క్వాడ్లు 3 3 3 1 10 స్టోరేజీపాయింట్లు 17 22 14 7 60 కంట్రోల్ రూమ్ నంబర్ 08832473430 9063553377 9550335191 9493259259 -
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్థానిక కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) నిర్వహిస్తున్నామని కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. రెవెన్యూ క్లినిక్ కూడా నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మండల స్థాయిలలో కూడా పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లు నిర్వహిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు ఆయా ప్రధాన కార్యాలయాల నుంచి హాజరవుతారని ఆమె వివరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చన్నారు. అకాల వర్షం దేవరపల్లి: మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి అకాల వర్షం కురిసింది. సాయంత్రం 6.45 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు బలమైన ఈదురుగాలులతో కూడిని వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు పంటలు నేలకొరిగినట్టు సమాచారం. రోడ్లపై వర్షపు నీరు చేరింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేవరపల్లి, సంగాయగూడెం, చిన్నాయగూడెం, బందపురం, దుద్దుకూరు, చాగల్లు, సీతానగరం, పోలవరం జిల్లా దేవీపట్నం తదితర మండలాల్లో వర్షం కురిసింది. తోటలమ్మకు రూ.30 లక్షలతో మకర తోరణాలు అమలాపురం రూరల్: మండలంలోని పాలగుమ్మి గ్రామదేవత తోటలమ్మ అమ్మ వారికి రూ.30 లక్షల విలువైన 6 కిలోల వెండి తొడుగు, మకరతోరణం, 111 కిలోల పంచలోహ మకరతోరణాలను దాత సమర్పించారు. గ్రామానికి చెందిన బొక్కా వెంకటరత్నం (తాత), సత్యనారాయణ (తండ్రి)పేరున కుమారుడు బొక్కా రవి కుమార్ అమ్మవారికి మకరతోరణాలు చేయించారు. తోటలమ్మ అమ్మవారికి ఎంత చేయించినా తక్కువే అని భావోద్వేగానికి గురై ఆభరణాలు సమర్పించారు. ఏకదంతుని దర్శనానికి తండోపతండాలు అయినవిల్లి: భక్తుల కోర్కెలు తీర్చే అయినవిల్లి గణపయ్యను దర్శించేందుకు ఆదివారం భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి తెల్లవారు జామున మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. ఆర్చకులు స్వామి వారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 39 మంది పాల్గొన్నారు. 16 మంది భక్తులు లక్ష్మీగణపతి హోమం చేయించుకున్నారు. ఓ చిన్నారికి నామకరణ, ఎనిమిది మందికి అక్షరాభ్యాసాలు చేశారు. ఇద్దరికి తులాభారం, 52 మందికి అన్నప్రాశన, 58 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 5218 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.4,24,197 ఆదాయం లభించినట్లు ఈఓ, ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. బాలాజీకి రూ.2.14 లక్షల ఆదాయం మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి దర్శనానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. గోవిందా గోవిందా అంటూ బాలబాలాజీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.2,14,453 ఆదాయం వచ్చింది. 6,300 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 2,100 మంది స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్య అన్న ప్రసాదం ట్రస్టుకు భక్తులు రూ.88,463 విరాళాలుగా అందించారు. వంశ పారంపర్య ధర్మకర్త మొల్లేటి చక్రపాణి, ఈఓ ఎం.రాంబాబురెడ్డి పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
మాజీ హోం మంత్రి తానేటి వనిత దేవరపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు, మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత ఆరోపించారు. మండలం యాదవోలులో నాలుగేళ్ల బాలికలపై 70 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన హృదయ విదారక సంఘటన తెలిసిందే. విషయం తెలుసుకున్న వనిత, వైఎస్సార్ సీపీ నాయకులు ఆదివారం బాధిత బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. బాఽధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చి బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. ఆమె మాట్లాడుతూ వయసుకు మించిన దుర్మార్గపు ఆలోచన వృద్ధుడికి రావడం బాధాకరమని అన్నారు. ఇందుకు కారణం రాష్ట్రంలో వీధికో ఐదారు మద్యం బెల్టు దుకాణాలు, గంజాయి లభ్యమవడం అన్నారు. స్వలాభం కోసం, సంపాదన కోసం కూటమి నేతలు ఇటువంటి వ్యాపారాలు చేస్తూ ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నారన్నారు. పోలీసులు ఏదైనా చర్యలు తీసుకుందామనుకున్నా ప్రభుత్వం చేయనీయడం లేదని పేర్కొన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు చెప్పినట్టు నడుచుకోవలసిన పరిస్థితి పోలీసులది అని వనిత పేర్కొన్నారు. బాలికను ప్రభుత్వం ఆదుకుని పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సున్నం వర ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు కూచిపూడి సతీష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలికే నాగ శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి గడా జగదీష్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఆచంట అనసూయ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి గడా రాంబాబు, ఆరేటి సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ఏపీలో కల్తీ పాల కలకలం.. ఇద్దరు మృతి
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగర శివారు లాలాచెరువు పరిధిలోని చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్లో కల్తీపాలు తాగి పలువురు అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చౌడేశ్వరినగర్కు చెందిన తాడి కృష్ణవేణి (85), కనకరత్నం (70) మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 8 మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులున్నారు. ఒక్కసారిగా మూత్రం బంద్ కావడం, వాంతులు కావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. వీరిలో మూడేళ్ల చిన్నారికి డయాలసిస్ చేస్తున్నారు. మరో ఇద్దరు ప్రైవేటు ఆస్పత్రుల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు, కొంతమంది చిన్నారులకు డయేరియా, కిడ్నీ ఫెయిలైన సమస్యలు తలెత్తినట్టు వైద్యాధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. వారికి సరఫరా అవుతున్న పాల వల్లే ఈ సమస్య తలెత్తిందని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాలకు పాలు పోస్తున్న కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎన్ని ఇళ్లకు పాలు అందజేస్తున్నారు.. ఎవరి ఆధ్వర్యంలో సరఫరా జరుగుతోంది.. ఏయే గ్రామాల నుంచి రాజమహేంద్రవరానికి పాలు వస్తున్నాయనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గణేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో 150కి పైగా ఇళ్లలో పాలు పోస్తున్నట్టు తెలిసింది. ప్రజలు అస్వస్థతకు గురైన కాలనీల్లో వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేసున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని,అక్కడ పరిస్థితులను లోతుగా పరిశీలిస్తున్నామని చెప్పారు. మూత్రం నిలిచి.. వాంతులతో ప్రారంభమై..రాజమహేంద్రవరంలో అనూరియా (మూత్రం ఆగిపోవడం) కేసులు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నలుగురు వ్యక్తులు అనూరియా లక్షణాలతో స్థానిక కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ జిల్లా సర్వైలెన్స్ అధికారికి సమాచారం అందించడంతో అత్యవసరంగా విచారణ ప్రారంభించారు. కిమ్స్ ఆస్పత్రిని డీఎంహెచ్వో, జిల్లా సర్వైలెన్స్ అధికారి, జిల్లా ఎపిడమాలజిస్ట్తో పాటు ఎపిడమిక్ సెల్ బృందం బాధితులను పరిశీలించింది. వైద్యుల ప్రాథమిక నివేదికలు, కుటుంబ సభ్యుల వివరాలు, కేసు హిస్టరీ ఆధారంగా ఆకస్మికంగా మూత్రపిండాలు వైఫల్యం చెందినట్టు అనుమానం వ్యక్తమవుతోందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి విచారణలో బాధితులందరూ ఒకే పాల విక్రేత నుంచి పాలు కొనుగోలు చేసి వినియోగించినట్టు గుర్తించామన్నారు. ఇటువంటి మరో నలుగురు బాధితులను ఇతర ప్రైవేటు ఆస్పత్రుల్లో గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని కాకినాడ ఆస్పత్రికి కూడా తరలించారు. బాధితులందరూ 60 సంవత్సరాలు పైబడిన వారు కాగా.. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని నాలుగు కుటుంబాలకు చెందిన వారుగా గుర్తించారు. అధికారులు స్థానికంగా పాలు, నీళ్ల నమూనాలు సేకరించారు. దీనిపై నివేదిక వచ్చిన తరువాత ఏం జరిగిందనే విషయమై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.ల్యాబ్కు నమూనాలుకల్తీ పాలతో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అప్రమత్తం చేశారు. ఆహారం, నీరు, మల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. అనుమానిత పాల వనరును ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తోంది.5 రోజుల్లో 12 మంది బాధితులు?చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, రెవెన్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి గడచిన 5 రోజుల్లో సుమారు 12 మంది ఆస్పత్రుల పాలైనట్టు తెలిసింది. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అనధికారిక సమాచారం. లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు. -
బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ముగ్గురికి గాయాలు ఆత్రేయపురం: మండలం వద్దిపర్రు వద్ద బొబ్బర్లంక నుంచి వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా అందులో ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానిక ఎస్సై ఎస్.రాము కథనం ప్రకారం శనివారం ఉదయం బొబ్బర్లంక వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వద్దిపర్రు గ్రామ సమీపంలో ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా వైద్య నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న నెల్లూరు జిల్లా కావలి గ్రామానికి చెందిన చేబ్రోలు పురుషోత్తం రావు(60) తలకు బలమైన గాయం కావడం వల్ల చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. -
ప్రభుత్వ రోదనాస్పత్రి
● రాజమహేంద్రవరం బోధనాస్పత్రిలో రోగుల అవస్థలు ● ప్రాణమంటే లెక్కలేదు.. కుర్చీకి దిక్కు లేదు ● చక్రాల కుర్చీ లేక క్షతగాత్రుడి ఆర్తనాదాలు ● అంబులెన్స్లో వచ్చిన వృద్ధుడి అవస్థలు ● అందుబాటులో లేని వైద్య సిబ్బంది సాక్షి, రాజమహేంద్రవరం: ‘బాబ్బాబు.. సక్రాల కుర్చీ తీసుకురండయ్యా.. నా బిడ్డ బయట రక్తమోడుతున్నాడు.. కదల్లేక కుప్పకూలిపోయాడు... ఒక్కగానొక్క బిడ్డయ్యా.. ఆడి కంట్లో నీళ్లు సూత్తే.. నా కంట్లో నెత్తురొత్తందయ్యా... అదిగోండయ్యా... ఆ కేకలు ఆడివే.. తట్టుకోలేక ఏడుస్తున్నాడు.. రండయ్యా, వచ్చి సాయం సేయండి బాబూ.. పోనీ సక్రాల కుర్చీ అయినా ఇవ్వండయ్యా’ అంటూ ఓ తల్లి తన బిడ్డకు వైద్యం అందించేందుకు రోదించిన తీరు అక్కడున్న వారిని కన్నీళ్లు తెప్పించింది. ఆమె కుమారుడు కాలికి గాయంతో కదల్లేని స్థితిలో అత్యవసర విభాగం ఎదుటే కూలబడ్డాడు. తన బాధను డాక్టర్లు పోగొడతారని నమ్మకంతో వచ్చి దిక్కుతోచని దీనస్థితిలో ఒంటరి వాడై రోదించాడు. తనను తరలించే సాయం లేక, మండుటెండలో చర్మం కాలిపోతున్నా రక్తమోడుతున్న కాలికి తెల్లబట్ట చుట్టుకుని వైద్యమో రామచంద్రా అంటూ విలపించాడు. గంటకు పైగా ప్రత్యక్ష నరకం చూశాడు.. ఈ ఘటన రాజమహేంద్రవరం బోధనాస్పత్రిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... మండుటెండలో కుప్పకూలి.. రాజమహేంద్రవరానికి చెందిన 36 ఏళ్ల మణికంఠ పెయింటర్గా పనిచేస్తూ భార్య, బిడ్డలు, తల్లిని పోషించుకుంటున్నాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వచ్చి మణికంఠను ఢీకొట్టడమే కాకుండా కాలిపై నుంచి వాహనాన్ని పోనిచ్చేశాడు. దీంతో అతడి ఎడమ కాలి పాదం నుజ్జునుజ్జు అయింది. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, గాయం చూసిన వైద్య సిబ్బంది తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు. దీంతో బాధితుడు తన తల్లి, భార్యతో కలిసి రాజమహేంద్రవరం జీజీహెచ్కు వచ్చాడు. ధర్మాసుపత్రిలో రక్తమోడుతున్న అతడి గాయాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అత్యవసర విభాగం ఎదురుగా వచ్చి సత్తువ లేక మండుటెండలోనే కూప్పకూలిపోయాడు. తాను కదల్లేకపోతున్నానని చక్రాల కుర్చీ తీసుకురండని బోరున విలపించాడు. చివరికి, వృద్ధురాలైన తల్లి, అనారోగ్యంతో ఉన్న అతడి భార్య వార్డులన్నీ తిరిగి ఓ వీల్ చైర్ తీసుకొచ్చారు. ఇద్దరూ కలిసి అతి కష్టం మీద మణికంఠను వీర్ చైర్లోకి ఎక్కించి వైద్యం కోసం తీసుకెళ్లారు. మరో ఘటన పై ఘటన చోటు చేసుకున్న కొద్ది సేపటిలోనే మరో అత్యవసర కేసు వచ్చింది. 108 అంబులెన్సులో ఓ వృద్ధుడిని వైద్యం కోసం తీసుకొచ్చారు. అతడి వెంట భార్య, కుమార్తె ఉన్నారు. రాజమహేంద్రవరం జీజీహెచ్లోని అత్యవసర విభాగంలో వైద్యం అందించాల్సి ఉండగా అంబులెన్సు డ్రైవరు ఎమర్జెన్సీ ఎదుట వాహనాన్ని నిలిపి చక్రాల కుర్చీ, తరలించే సిబ్బంది కోసం ఎదురు చూశారు. అంబులెన్సు వచ్చి ఆగినా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో అంబులెన్సు డ్రైవరు ఆసుపత్రి లోపలికి వెళ్లి స్ట్రెచ్చర్ తీసుకొచ్చాడు. ఆ పెద్దాయనను ముగ్గురు కలిసి స్ట్రెచర్లో వైద్య సేవల కోసం తీసుకెళ్లారు. కాలి గాయంతో అత్యవసర విభాగం ఎదుటే కుప్పకూలిన మణికంఠ వీల్ చైర్ తీసుకువచ్చి మణికంఠను వైద్యం కోసం తరలిస్తున్న భార్య, తల్లినిబంధనలు ఇవీ.. రాజమహేంద్రవరం బోధనాస్పత్రిలో అత్యవసర వైద్యం అందని ద్రాక్షగా మారింది. నిబంధనలు అనుసరించి అత్యవసర విభాగం బయట ప్రమాదకర స్థితిలో వచ్చే రోగుల కోసం చక్రాల కుర్చీ, స్ట్రెచర్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓలు అందుబాటులో ఉండాలి. అయినా ఇక్కడ మాత్రమే అలాంటివేమీ కనిపించడం లేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చిన వారిని వారి బంధువులే తీసుకెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందుకు పై రెండు ఉదాహరణలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. మరో వైపు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాత్రం ఆస్పత్రిలో అన్ని వసతులు కల్పిస్తున్నామని, ప్రతి వారం ఆస్పత్రిని సందర్శించి సమస్యలు పరిష్కరిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వెరసి పేదలకు ప్రభుత్వ వైద్యం అందడం లేదు. అత్యవసర విభాగానికి వచ్చే కేసులన్నీ దాదాపు ప్రాణాపాయంతోనే వస్తాయని, అలాంటి బాధితులను ఆస్పత్రి సిబ్బంది, అధికారులు వహిస్తున్న అలసత్వం ఏమాత్రం సరికాదని రోగులు, వారి కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. -
సొసైటీల రుణాలే రైతులకు ఆధారం
● సమ్మెతో వారికి ఇబ్బందులు ● సహకార ఉద్యోగుల డిమాండ్లను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చాలి ● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (ఏపీఏఎస్) ద్వారా రైతులు రుణాలు పొంది, పంటలు పండిస్తూ జీవనం సాగిస్తారని, అటువంటి సొసైటీల్లో పనిచేసే ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో వారి మనుగడ కష్టంగా మారుతోందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు, ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరం శ్యామలా సెంటర్లోని డీసీసీబీ కార్యాలయం వద్ద సహకార ఉద్యోగులు మూడో రోజు శనివారం చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొని సహకార ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. ఆమె మాట్లాడుతూ సహకార ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకూ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ జీవో నంబర్ 36ను అమలు చేసే వరకు సహకార ఉద్యోగుల పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. కాంగ్రెస్ జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జేటీ రామారావు సహకార ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట రామయ్య, ఏఐబీఈఏ మాజీ నాయకులు తోట రామారావు, జిల్లా అధ్యక్షుడు కేవీవీ సత్యనారాయణ, కోశాధికారి సుధాకర్వర్మ, ఉపాధ్యక్షుడు వీరభద్రం, వెంకటేశ్వరరావు, సీహెచ్ సూర్యచంద్రశేఖర్, ఎస్.అప్పారావు, డివిజన్లోని సహకార ఉద్యోగులు పాల్గొన్నారు. -
అక్రమంగా తరలిస్తున్న 320 తాబేళ్ల స్వాధీనం
ఇద్దరి అరెస్టు ఏలేశ్వరం: అక్రమంగా రవాణా చేస్తున్న తాబేళ్లను శనివారం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అటవీశాఖ రేంజర్ దుర్గా రాంప్రసాద్ తెలిపిన వివరాల మేరకు కోనసీమ జిల్లా రామచంద్రపురం పరిసరాల గ్రామాల నుంచి 18 గోనె సంచుల్లో 320 తాబేళ్లను బోలెరో వాహనంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ప్లాజా వద్ద వాహనంతో పాటు తాబేళ్లు, ఇద్దరు నిందితులను స్వాధీనం చేసుకున్నారు. తాబేళ్లను ఏలేరు ప్రాజెక్టులో వదిలిపెట్టారు. నిందితులను ప్రత్తిపాడు కోర్డులో హాజరు పరిచినట్టు ఆయన తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో కార్మికుడి మృతి కాకినాడ రూరల్: ఎన్హెచ్ 216 బ్రిడ్జి నిర్మాణ పనుల్లో పొల్గొన్న పశ్చిమ బెంగాల్కు చెందిన కార్మికుడు నాబా ముండా (51) మృతి చెందడంతో సర్పవరం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సర్పవరం ఆటోనగర్ వెనక భాగంలోని హైవే వంతెన నిర్మాణ పనులు జరుగుతుండడంతో నాబా ముండా ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు జీజీహెచ్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పెద్దిరాజు తెలియజేశారు.


