breaking news
East Godavari
-
రైతులకే మొదటి ప్రాధాన్యం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వ్యవసాయ రంగంలో రైతులకే తమ మొదటి ప్రాధాన్యమని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. కలవచర్ల కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఆధ్వర్యాన రాజమహేంద్రవరంలోని నిర్కా సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జాతీయ రైతు దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాణిజ్యం తరహాలో వ్యవసాయం చేయడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. కేవీకే అధిపతి వీఎస్జీఆర్ నాయుడు మాట్లాడుతూ, ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ జీ రామ్ జీ) ద్వారా ఉపాధి హామీ పని దినాలను 100 నుంచి 125కు పెంచారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, గిడ్డంగులు, మార్కెట్ సౌకర్యాల వంటి శాశ్వత ఆస్తులను సృష్టించేందుకు, జల సంరక్షణ పనులకు ఈ చట్టం పెద్దపీట వేసిందన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరిగే నాట్లు, కోతల సమయాల్లో ఉపాధి హామీ పనులకు బ్రేక్ వేయడం ద్వారా రైతులకు కూలీల కొరత లేకుండా చేసేందుకు ఈ చట్టం దోహదపడుతుందన్నారు. నిర్దిష్ట సమయంలో హామీ ఇచ్చిన పని దినాలు కల్పించకుంటే కూలీలకు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు మాట్లాడుతూ, అధిక మోతాదులో రసాయనిక ఎరువుల వాడకం వలన జరిగే నష్టాలను రైతులకు వివరించారు. వివిధ ప్రభుత్వ పథకాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వరి ఎగుమతిదారుల సదస్సు కూడా నిర్వహించారు. వివిధ కాలాల్లో ఎగుమతికి గిరాకీ ఉన్న వరి రకాల గురించి మార్టేరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. వివిధ సంస్థల ప్రతినిధులు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మాధవరావును, అమలాపురానికి చెందిన రైతు సోమరాజును అభ్యుదయ రైతుగా ఎంపిక చేసి సత్కరించారు. కార్యక్రమంలో డాట్ సెంటర్ ప్రధాన శాస్త్రవేత్త నరసింహారావు, ఏపీసీఎంఎఫ్ డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ బి.తాతారావు, కేవీకే అధికారులు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 100 మంది రైతులు పాల్గొన్నారు. ఫ నిర్కా డైరెక్టర్ శేషుమాధవ్ ఫ ఘనంగా జాతీయ రైతుల దినోత్సవం -
ఈ కుర్చీకో దండం
అన్నవరం: ఒకప్పుడు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పని చేయడానికి దేవదాయ శాఖ అధికారులు పోటీ పడేవారు. ఈ కుర్చీ కోసం ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున సిఫారసులు చేయించుకునేవారు. కానీ, నేడు పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఈఓ కుర్చీ అంటే.. వద్దు బాబోయ్.. దీనికో దండమని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానంలో నెలకొన్న పరిస్థితులు, పరిపాలనలో మితిమీరిన రాజకీయ జోక్యంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన వి.త్రినాథరావు సైతం తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలంటూ సంబంధిత శాఖ మంత్రిని వేడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అదే కనుక నిజమైతే రత్నగిరిపై పరిస్థితి ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయ జోక్యం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత దేవస్థానం ఈఓగా దేవదాయ శాఖ అధికారుల స్థానంలో గ్రూప్–1 అధికారి, డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును గత ఏడాది డిసెంబర్లో నియమించారు. దేవస్థానంపై ఆయనకు పెద్దగా అవగాహన లేకపోవడానికి తోడు దేవస్థానం పరిపాలన అంతా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టడం, పని చిన్నదైనా, పెద్దదైనా వారు చెప్తే చేయడమే పరిపాలననే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయి. అలాగే, ఆయన కుటుంబ సభ్యుల జోక్యం బాగా పెరిగిపోవడం దేవస్థానం సిబ్బందిలో అసంతృప్తికి కారణమైంది. సుబ్బారావు నియామకంపై ఈ ఏడాది మార్చి నాటికే దేవదాయ శాఖ ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో కొనసాగించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కాలంలో ఉన్నతాధికారులు తరచూ జోక్యం చేసుకుని, పరిపాలనను చక్కదిద్దాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అన్నవరం ఐదు, ఆరు, ఏడు ర్యాంకులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈఓ మారినా.. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు ఈఓలుగా నియమించిన డిప్యూటీ కలెక్టర్ల పదవీ కాలాన్ని ఇటీవల మరో ఏడాది పొడిగించారు. అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావును మాత్రం రెవెన్యూ విభాగానికి సరెండర్ చేశారు. ఆయన స్థానంలో దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) త్రినాథరావును ఇన్చార్జిగా నియమించారు. గతంలో మూడుసార్లు ఈఓగా పని చేసిన అనుభవం ఉండటంతో ఆయన పరిస్థితులను చక్కదిద్దుతారని ఉన్నతాధికారులు భావించారు. కానీ, ఎవ్వరూ చక్కదిద్దలేనంతగా ఇక్కడి పరిస్థితులు దిగజారిపోయాయనే విషయం ఇప్పుడిప్పుడే తేటతెల్లమవుతోంది. ఇక్కడ ఏ పని చేయాలన్నా ప్రజాప్రతినిధుల జోక్యం చేసుకుంటున్నారు. ప్రతి పనీ తమకు చెప్పిన తర్వాతే చేయాలనే విధంగా పరిస్థితులు మారిపోయాయి. దీంతో, ఇక్కడ స్వేచ్ఛగా ఏ పనీ చేయలేమనే నిర్ణయానికి అధికారులు వచ్చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ సీటు ఆశించిన వారందరూ ఇప్పుడు మిన్నకున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఈఓ త్రినాథరావు కూడా తనను ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని సంబంధిత మంత్రిని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానం అభివృద్ధి పథంలో పయనించింది. 2021–22 మధ్య కూడా త్రినాథరావు ఇక్కడ ఈఓగా ఉన్నారు. ఆ సమయంలో రత్నగిరి రామాలయం ముందు భక్తుల కోసం దాతల సహకారంతో సుమారు రూ.కోటితో విశ్రాంతి షెడ్డు నిర్మించారు. స్వామివారి వార్షిక కల్యాణ మండపం, ప్రసాద తయారీ భవనం నిర్మించి, ప్రారంభించారు. అలాగే, 2022–23లో కూడా దాతల సహకారంతో వనదుర్గ ఆలయం వద్ద డార్మెట్రీ నిర్మించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఈఓగా ఉన్న సమయంలో కేవలం 8 నెలల్లోనే సత్యగిరి రోడ్డు నుంచి నేరుగా మూడో ఘాట్ రోడ్డు మలుపులోకి చేరేలా ఆదిశంకర మార్గ్ రోడ్డు, కొండ దిగువన టూరిస్టు బస్సులలో వచ్చే భక్తుల కోసం 5 విశ్రాంతి షెడ్లు నిర్మించారు. జాతీయ రహదారి వద్ద ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని, అందులో సత్యదేవుని నూతన నమూనా ఆలయం, రత్నగిరిపై పార్కింగ్ స్థలాల అభివృద్ధి, సహజ, ప్రకాష్ సదన్ సత్రాల మధ్య నుంచి పశ్చిమ రాజగోపురం సమీపానికి వాహనాలు చేరుకునేలా రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టి పూర్తి చేశారు. శివసదన్ సత్రం కూడా 135 గదులతో త్వరితగతిన నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. దూర ప్రాంతాల భక్తులకు కనిపించేలా విద్యుద్దీపాలతో శంఖచక్ర నామాలు ఏర్పాటు చేశారు. పశ్చిమ రాజగోపురం ముందు విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్ ఫార్మా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, సత్యదేవ అతిథి గృహాన్ని కూల్చేశారు. వివిధ కారణాలతో ఆ షెడ్డు నిర్మాణం ఆలస్యమైనప్పటికీ ఇటీవల పూర్తి చేశారు. సుమారు 45 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వ్రత పురోహితుల పారితోషికాన్ని 30 నుంచి 40 శాతానికి పెంచారు. ఆ ఐదేళ్లూ ఎటువంటి వివాదాలూ లేకుండా దేవస్థానం పరిపాలన సాఫీగా సాగిపోయింది. ఫ రత్నగిరిపై మితిమీరిన రాజకీయ జోక్యం ఫ ఏ పనైనా తమకు చెప్పి చేయాల్సిందే నంటున్న ప్రజాప్రతినిధులు ఫ బెంబేలెత్తిపోతున్న అధికారులు ఫ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించాలని కోరిన ఈఓ ఫ మళ్లీ డిప్యూటీ కలెక్టర్నే నియమిస్తారంటూ ప్రచారం -
వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, సాధికార సంస్థ (మహిళా ప్రాంగణం) లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వివిధ కోర్సు లలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ (ఇన్చార్జి) పి.విమల ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ (8వ తరగతి ఆపైన), బ్యూటీషియన్ (10వ తరగతి), డేటా ఎంట్రీ ఆపరేటర్ (10వ తరగతి) కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే, షార్ట్ టర్మ్ కోర్సులైన టైలరింగ్ బేసిక్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మిల్లెట్స్ స్నాక్స్ మేకింగ్ (8వ తరగతి) అందిస్తున్నామన్నారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో శిక్షణ ఇస్తామన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు ఆసక్తి కలిగిన మహిళలు ఆధార్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రం, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువపత్రం, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులు బొమ్మూరు మహిళా ప్రాంగణంలో ఇస్తామని తెలిపారు. ఇతర వివరాలకు 83339 21340 నంబర్లో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, బ్యూటీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల దరఖాస్తులను ఈ నెల 31లోగా.. టైలరింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, మిల్లెట్స్ స్నాక్స్ మేకింగ్ కోర్సుల దరఖాస్తులను జనవరి 5లోగా మహిళా ప్రాంగణంలో అందజేయాలని విమల సూచించారు. పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ వైద్య కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ శివప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆఫీస్ సబార్డినేట్, అనస్తీషియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లు, జనరల్ డ్యూటీ, స్టోర్, ల్యాబ్ అటెండెంట్లు, ఈసీజీ టెక్నీషియన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఈ నెల 26 ఉదయం 10 గంటల నుంచి జనవరి 9వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో వ్యక్తిగతంగా మాత్రమే సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈస్ట్గోదావరి.ఏపీ.జీఓవీ.ఇన్, జీఎంసీరాజమహేంద్రవరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఏపీఎన్జీవోనూతన కార్యవర్గ ఎన్నిక ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఏపీఎన్జీవో సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక ఆ సంఘం కార్యాలయంలో మంగళవారం ఏకగ్రీవంగా జరిగింది. రాజమహేంద్రవరం యూనిట్ అధ్యక్షుడిగా పిచ్చుక అనిల్ కుమార్ (మున్సిపల్), కార్యదర్శిగా ఆర్.రాజేష్ (ఖజానా శాఖ), కోశాధికారిగా ప్రతాప్ (పంచాయతీరాజ్), సహాధ్యక్షుడిగా యర్రంశెట్టి సత్యమూర్తి (పంచాయతీరాజ్), ఉపాధ్యక్షులుగా ఎం.సత్యనారాయణరాజు (రిజిస్ట్రేషన్స్), డి.చటర్జీ (మెడికల్), రాఘవరావు (పబ్లిక్ హెల్త్), జి.కుమార్ (సెంట్రల్ జైలు) ఎన్నికయ్యారు. వీరితో పాటు మహిళా ఉపాధ్యక్షులుగా ఎం.సత్యవతి (మెడికల్), కార్యనిర్వాహక కార్యదర్శిగా జె.వెంకట్రావు (అగ్రికల్చర్), సంయుక్త కార్యదర్శులుగా డి.జగ్గారావు (వార్డ్ సచివాలయం), రోజారాణి (శిశు సంక్షేమం), ఎస్కే సహానా (ఖజానా శాఖ), వి.రత్నకుమార్ (కమర్షియల్ ట్యాక్స్), టి.శ్రీనివాస్ (విద్య), మహిళా సంయుక్త కార్యదర్శిగా పి.కామేశ్వరి (మున్సిపల్) ఎన్నికయ్యారు. డ్రమ్ సీడర్తో వరి విత్తనాలు వేయాలి పెరవలి: డ్రమ్ సీడర్ ద్వారా జిల్లావ్యాప్తంగా 3,500 ఎకరాల్లో రబీ వరి సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సేంద్రియ వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ తెలిపారు. మండలంలోని కాపవరంలో డ్రమ్ సీడర్ ద్వారా రైతులతో మంగళవారం విత్తనాలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రమ్ సీడర్తో విత్తనాలు వేస్తే ఎక్కువ కుదుళ్లు ఏర్పడి, దిగుబడి పెరుగుతుందని, కూలీల ఖర్చు తగ్గు తుందని చెప్పారు. ఎకరానికి 8 నుంచి 10 కిలోల విత్తనాలు సరిపోతాయన్నారు. డ్రమ్ సీడర్తో విత్తనాలు వేసే రైతులు కృషి ట్రాక్టర్కు రోటోవేటర్ను అమర్చి దమ్ము చేసి, నేలను చదును చేయాలని సూచించారు. నీరు పల్చగా ఉంచి, కోర వచ్చిన విత్తనాలను డ్రమ్ముల్లో వేసి నాటాలన్నారు. డ్రమ్ సీడర్లోని నాలుగు డ్రమ్ములుంటాయని, ఒక్కొక్క దానిలో కిలో చొప్పున విత్తనా లు వేస్తే, 10 నుంచి 12 సెంటీమీటర్ల ఎడంతో పడతాయని చెప్పారు. డ్రమ్ సీడర్ లాగినప్పుడు లైనుకు లైనుకు మధ్య 22 సెంటీమీటర్ల వ్యత్యా సం ఉంటుందన్నారు. ఎకరానికి 20 కిలోల విత్తనాలు ఆదా అవుతాయని తెలిపారు. పైగా, ఈ చేలు బాగా దుబ్బు చేసి, వారం ముందే కోతకు వస్తాయని, చీడపీడల సమస్య తక్కువగా ఉండి, దిగుబడి 3 నుంచి 5 బస్తాలు ఎక్కువ గా వస్తుందని, వివరించారు. ఎకరానికి ఖర్చు రూ.5 వేల వరకూ తగ్గుతుందని రామకృష్ణ చెప్పారు. 23ఎన్డిడి41: కాపవరంలో డ్రమ్ సీడర్ను లాగుతున్న రైతు -
● వెలుగులు నింపిన రోజు
మానవ హృదయాల్లో అంధకారాన్ని పారదోలి వెలుగులు నింపిన రోజు క్రిస్మస్. ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువు సుగుణాలైన పరిశుద్ధత, పవిత్రత, తగ్గింపు స్వభావం, ప్రేమ, దయ, త్యాగం అలవరచుకుని ఆచరించటమే నిజమైన క్రిస్మస్. – రెవరెండ్ పాస్టర్ వల్లభనేని రాంబాబు, ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ నిడదవోలు నియోజకవర్గ రీజినల్ చైర్మన్ ● దైవ, మానవ సంబంధాల పునరుద్ధరణే.. మానవ చరిత్రకు మరో మలుపు క్రిస్మస్. దేవ కుమారుడు మానవునిగా జన్మించడం దైవ, మానవ సంబంధాల పునరుద్ధరణకు నాంది. క్రీస్తు జననంతో పాపాంధకారంలో ఉన్న మానవాళికి విమోచన, నిత్య జీవం లభించాయి. – రెవరెండ్ పాస్టర్ పి.శ్యామ్పాల్, సమిశ్రగూడెం ● దేవునికి ఇష్టులుగా జీవించాలి పరిశుద్ధ గ్రంథంలో రాసినట్లు క్రైస్తవ విశ్వాసులు దేవునిపై పరిపూర్ణ భయభక్తులతో, ఆయనకు ఇష్టులుగా జీవించాలి. శాంతి సమాధానాలు పొందాలి. అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. – రెవరెండ్ పాస్టర్ ఎస్వీ డానియోల్, నిడదవోలు -
భంగపాటు చేయాలని భంగపడిన దుష్టచతుష్టయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వనవాసం చేస్తున్న పాండు సుతులకు ఘోష యాత్ర మిషతో భంగపాటు కలిగించాలని వచ్చిన ధార్తరాష్ట్రులు భంగపాటుకు గురయ్యారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారతంపై ప్రవచనాన్ని స్థానిక హిందూ సమాజంలో మంగళవారం ఆయన కొనసాగించారు. ‘‘గంధర్వుని చేతిలో దుర్యోధనుడు బందీ అయినప్పుడు.. కావలసిన కార్యాన్ని గంధర్వులే సరి చేశారని భీముడు ఆనందిస్తాడు. అతడిని ధర్మరాజు వారిస్తాడు. ‘ఇతరులతో విభేదాలు వస్తే మనం 105 మంది సోదరులం. ఇతర సందర్భాల్లో వారు వంద మంది, మనం ఐదుగురం. వెంటనే దుర్యోధనుడిని విడిపించు’ అని అర్జునుడిని ఆదేశిస్తాడు. తిరిగి వచ్చిన దుర్యోధనుడిని భీష్ముడు మందలిస్తాడు. ‘నీవు నమ్ముకున్న కర్ణుడు గంధర్వులతో జరిగిన పోరులో పలాయనవాదం చిత్తగించాడు. పాండవుల పరాక్రమంలో కర్ణుడు పావు భాగానికి సరిపోడు’ అని అంటాడ’’ని వివరించారు. భీష్ముడు దుష్టచతుష్టయాన్ని మందలించలేదని వచ్చే విమర్శల్లో సత్యం లేదని సామవేదం చెప్పారు. ‘‘తమ వద్దకు వచ్చిన దూర్వాస మహర్షిని దుర్యోధనుడుఅన్ని విధాలా సహనంతో సేవించాడు. ఆయన అర్థరాత్రీ, అపరాత్రీ వచ్చి భోజనం కావాలని ఆదేశించినా, చక్కని అన్నపానీయాలను అందించేవాడు. సంతృప్తి చెందిన దూర్వాసుడు వరం కోరుకోవాలని దుర్యోధనుడిని అడుగుతాడు. ‘మీరు పాండవుల వద్దకు వెళ్లి, సేవలు అందుకుని వారిని కూడా తరింపజేయాలి. ద్రౌపది కూడా భుజించిన తరువాత భోజనం పెట్టాల్సిందిగా వారిని ఆదేశించాలి’ అని దుర్యోధనుడు కోరుతాడు. వేలాది శిష్యులతో దూర్వాసుడు పాండుసుతుల వద్దకు వెళ్తాడు. ద్రౌపది భుజించిన తరువాత వెళ్లి, తనకూ, తనతో వచ్చిన వేలాది మంది శిష్యులకు భోజనం సిద్ధం చేయాలని కోరుతాడు. స్నానానికి వెళ్లిన దూర్వాసుడు, ఆయన శిష్యగణాలకు కృష్ణుని అనుగ్రహంతో మృష్టాన్న భోజనం చేసిన తృప్తి కలిగి, ధర్మరాజుకు చెప్పకుండా వెళ్లిపోతారు’’ అని కథా భాగాన్ని వివరించారు. హరి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే వచ్చే ప్రమాదాలు దూర్వాసునికి అంబరీషుని ద్వారా గతంలోనే అవగాహనకు వచ్చిందని చెప్పారు. అనంతరం, పాండవులకు మార్కండేయ మహర్షి రామకథ వివరిస్తాడని, పురాణాలు రామకథతో పవిత్రమవుతాయని, భాగవతంలో కూడా రామకథ కనిపిస్తుందని సామవేదం చెప్పారు. నలదమయంతుల కథ, సీతారాముల కథ, సావిత్రీసత్యవంతుల కథలతో కూడిన భారత కథా శ్రవణం ద్వారా యజ్ఞఫలం లభిస్తుందని అన్నారు. -
క్రీస్తు మందిరం.. నూత్న శోభితం
నిడదవోలు: ప్రేమ, శాంతి, క్షమ, దయ, త్యాగం వంటి సద్గుణాలనే ప్రపంచ మానవాళికి తన సందేశంగా ఇచ్చిన కరుణామయుడైన క్రీస్తు జన్మదినం.. క్రిస్మస్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు సిద్ధమయ్యారు. తమ ఇళ్లతో పాటు చర్చిలు, ప్రార్థనా మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్దీపతోరణాలతో అలంకరించారు. క్రిస్మస్ ట్రీలు, ఇతర అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. పాలస్తీనా దేశంలోని బేత్లెహేము గ్రామంలోని పశువుల పాకలో ఆ దైవ కుమారుడు జనియించిన వృత్తాంతాన్ని కళ్లకు కట్టేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీస్తు జాడను చూపిన నక్షత్రానికి సూచికగా విశ్వాసుల ఇళ్లు, చర్చిల వద్ద విద్యుద్దీపాలతో ఏర్పాటు చేసిన స్టార్లు ఇప్పటికే కొత్త కాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ మహనీయుని బోధను అనుసరించి.. దీన జనులకు కొంత మంది నూతన వస్త్రాలు, కానుకలు, ఆహార పదార్థాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. క్రీస్తు జననాన్ని వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సామూహికంగా స్తుతి ఆరాధనలు చేయనున్నారు. కేరల్స్ ఏసుక్రీస్తు జనన వర్తమానాన్ని ప్రకటిస్తూ ఆయా క్రైస్తవ సంఘాల ఆధ్వర్యాన క్రిస్మస్ వేడుకలకు ముందు సంఘ కాపరితో పాటు యువజనులు రాత్రి వేళ ఇంటింటికీ తిరిగి కేరల్స్ నిర్వహిస్తారు. సంగీత వాయిద్యాలతో క్రీస్తు స్తుతి గీతాలు ఆలపిస్తూ ఆయా ఇళ్లను సందర్శిస్తారు. కేరల్స్ వలన క్రైస్తవుల్లో ప్రేమ, ఐక్యత పెంపొందుతాయి. క్రిస్మస్ ట్రీ ఆధునిక జర్మనీ ఆవిర్భవించాక క్రిస్మస్ ట్రీ ప్రాచుర్యంలోకి వచ్చింది. 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ మొదటిసారి ఎవర్గ్రీన్ అనే చెట్టును కొవ్వొత్తులతో అలంకరించినట్లు చెబుతారు. ట్రీ వర్షిప్ అనేది యూరోపియన్లలో అతి సాధారణం. నిత్య జీవానికి సంకేతంగా క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఈజిప్షియన్లు, చైనీయులు, హీబ్రూస్ ఈ ట్రీని అలంకరించేవారు. ఈ సంప్రదాయం 20వ శతాబ్దంలో చర్చిలకు, కాలక్రమేణ అన్ని దేశాలకూ, 1982లో వాటికన్ సిటీలోని కేథలిక్ చర్చిలకు విస్తరించింది. ఈ ట్రీలో త్రికోణ ఆకారంలోని అగ్రభాగం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ ఐక్యరూపానికి ప్రతీకగా చెబుతారు. పైన అలంకరించిన నక్షత్రం క్రీస్తు జననానికి సూచన. అపవాదుని పారదోలేదిగా భావిస్తూ క్రైస్తవులు క్రిస్మస్ దినాల్లో ఇళ్లు, చర్చిల్లో ఈ ట్రీలు అలంకరిస్తారు. క్రిస్మస్ సంరంభం ఆరంభమైతే చాలు.. ఎర్రని రంగు దుస్తులు.. తెల్లని పండు జుట్టు, గెడ్డం, మీసాలతో క్రిస్మస్ తాత (శాంటాక్లాజ్) అనేకచోట్ల ప్రత్యక్షమవుతాడు. అతడిని చూస్తే చాలు.. పిల్లలు తెగ సంబరపడిపోతూంటారు. ఈ క్రిస్మస్ తాత ఎలా వచ్చాడంటే.. గ్రీకు బిషప్ సెయింట్ నికోలస్ స్ఫూర్తితో శాంటాక్లాజ్ పాత్ర రూపుదిద్దుకుంది. 1823లో అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో శాంటాక్లాజ్ వర్ణనపై రచించిన ‘ఏ విజిట్ ఫర్ సెయింట్ నికోలస్’ కవిత ఆధారంగా థామస్ నేస్ట్ అనే రాజకీయ, వ్యంగ్య చిత్రకారుడు శాంటాక్లాజ్ ఊహాచిత్రం గీశారు. ఈ చిత్రాన్ని కోకాకోలా కంపెనీ తమ ఉత్పత్తుల ప్రచారానికి వినియోగించుకుంది. ఆ క్రమంలో శాంటాక్లాజ్ వస్త్రధారణ ఇప్పుడున్న ఎరుపు, తెలుపు రంగుల్లోకి మారింది. క్రిస్మస్ రోజు రాత్రి వేళ.. దుప్పులతో నడిచే రథంపై ఆకాశ మార్గాన క్రిస్మస్ తాత వస్తాడని, మంచి ప్రవర్తన ఉన్న పిల్లలకు ఎన్నో బహుమతులు తెస్తాడని, చెడు ప్రవర్తన ఉన్న పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తాడని తల్లిదండ్రులు చెబుతూంటారు. దీనిని విశ్వసిస్తూ పిల్లలు మంచి ప్రవర్తన కనబరుస్తారు. దీనిని గుర్తు చేసేలా క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ తాత అలంకరణలో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడు. క్రీస్తు ప్రేమను ప్రదర్శిస్తూ.. కానుకలు పంచుతూ పిల్లలను, పెద్దలను అలరిస్తాడు. ఫ జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ సంరంభం ఫ వేడుకలకు ముస్తాబైన చర్చిలు ఫ పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు ఫ ఆకట్టుకుంటున్న విద్దుద్దీపాలంకరణలు -
బాహుబలి ఆనప
సాధారణంగా ఆనపకాయ 3 నుంచి 6 కేజీల వరకు బరువు ఉంటుంది. కానీ ఏకంగా 15 కేజీలు ఉంటే ఆశ్చర్యమే కదా. గంగలకుర్రుకు చెందిన అభ్యుదయ రైతు చిట్టావఝుల బాబూరావు కొబ్బరి తోటలో అంతర పంటలతో పాటు కూరపాదులు, తీగపాదులను సాగు చేస్తున్నారు. దేశవాళీ రకం ఆనపకాయ విత్తనాలను నాటారు. పూర్తిగా జీవమృతాన్ని వినియోగించి సాగు చేయడంతో ఆనప కాయ సుమారు 15 కేజీలు దాటి కాసింది. దీనితో పాటు పాదుకు మరో 6 ఆనప కాయలు 12 కేజీలు తూగాయి. – అంబాజీపేట గంగలకుర్రులో కాసిన 15 కేజీల ఆనపకాయ -
ఆవుదూడపై కుక్కల దాడి
అమలాపురం టౌన్: సుమారు ఐదు నెలల వయసున్న జెర్సీ ఆవుదూడపై కుక్కలు దాడి చేశాయి. ఏకంగా ఆ దూడ ఎడమ చెవిని పూర్తిగా తినేశాయి. అలాగే దాని శరీరంపై పలు చోట్ల తీవ్రంగా గాయాలు చేశాయి. ఇలా పాణప్రాయస్థితిలో ఉన్న ఆవు దూడను గుర్తు తెలియని వ్యక్తులు అమలాపురంలోని ప్రాంతీయ పశువైద్యశాల వద్ద మంగళవారం ఉదయం వదిలేసి వెళ్లిపోయారు. ఆస్పత్రి ప్రధాన వైద్యుడు, పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్.విజయరెడ్డి తీవ్రంగా గాయపడిన ఆ ఆవుదూడకు తక్షణమే వైద్యం అందించారు. అనంతరం కోలుకుంటున్న దూడను ప్రస్తుతానికి అమలాపురం రూరల్ మండలం ఇమ్మిడివరప్పాడు రైతు మారి భేతాళస్వామి సంరక్షణలో ఉంచారు. ఆవుదూడకు చెందిన సంబంధిత రైతు.. అమలాపురం ప్రాంతీయ పశువైద్యశాలను సంప్రదించాలని డాక్టర్ విజయరెడ్డి కోరారు. భర్త మృతి చెందిన వారానికే భార్య కన్నుమూతకడియం: భర్త మృతి చెందిన వారం రోజులకే భార్య కూడా మృతి చెందిన ఘటన బుర్రిలంకలో జరిగింది. గ్రామానికి చెందిన శివరామ నర్సరీ రైతు, శివరామ ఫ్లవర్ మర్చంట్స్ వ్యవస్థాపకుడు పాటంశెట్టి రామారావు (98) ఈ నెల 15న వృద్ధాప్యంతో కన్ను మూశారు. ఆయన దశదిన కార్యక్రమాలను నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భర్త మరణించిన నాటి నుంచి తీవ్ర దుఖంలో కూరుకుపోయిన ఆయన భార్య వెంకటలక్ష్మి (90) మంగళవారం ఉన్నట్టుండి ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని కుటుంబ సభ్యులు తెలిపారు. వారం వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ కన్నుమూయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్కె.గంగవరం: కోటిపల్లి శివారు ఏటిగట్టు వద్ద గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను కె.గంగవరం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై జి.సోమేంద్ర మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కోటిపల్లి శివారు ఏటిగట్టు రహదారి వద్ద గంజాయిని రవాణా చేస్తున్నారనే సమాచారంతో ఎస్సై, సిబ్బంది అక్కడకు వెళ్లారు. వీరి వాహనాన్ని చూసి పారిపోతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. వారిలో బ్రహ్మపూరి గ్రామానికి చెందిన కుమార స్వామి నుంచి 50 గ్రాముల గంజాయి, మోటారు సైకిల్, యానానికి చెందిన వెంకట కార్తిక్ నుంచి 130 గ్రాముల గంజాయి, రూ.2500 స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
తొమ్మిది నెలల గర్భిణికి న్యూరో సర్జరీ
● విజయవంతంగా నిర్వహించిన కాకినాడ వైద్యులు ● తల్లీబిడ్డా క్షేమం కాకినాడ రూరల్: రాజోలుకు చెందిన తొమ్మిది నెలల గర్భిణికి అత్యంత క్లిష్టమైన న్యూరో సర్జరీని కాకినాడ మెడికవర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఆ మహిళకు 12 ఏళ్ల వయసులో తీవ్రమైన జ్వరం రావడంతో మెదడులో నీరు చేరే (హైడ్రోసెఫలస్) సమస్య ఏర్పడింది. మెదడులో చేరిన నీటిని కడుపు భాగానికి మళ్లించేందుకు వీపీషెంట్ శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు సమస్య నుంచి అప్పట్లో ఉపశమనం కలిగించారు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణి. ప్రసవానికి రోజులు దగ్గరపడుతుండగా మెదడుపై ఒత్తిడి పెరగడంతో అప్పటి సమస్య తిరిగి తలెత్తింది. తీవ్రమైన వాంతులు, తలనొప్పి, చూపు మసకబారడం వంటి సమస్యలతో ఆమె మెడికవర్ ఆస్పత్రిలో చేరింది. స్కాన్ ద్వారా మెదడులో నీటి ఒత్తిడి పెరిగినట్టు వైద్యులు గుర్తించారు. ప్రసవంతో తల్లీబిడ్డలను కాపాడేందుకు, మెదడుకు శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులు అన్ని విభాగాల నుంచి ప్రణాళికతో ముందుకు సాగడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఈ వివరాలను మెడికల్ ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గైనకాలజిస్టు డాక్టర్ శ్రావణి సాక్షి, న్యూరో సర్జన్ చందు లింగోలు వెల్లడించారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ శుభాకరరావు మాట్లాడుతూ 24 గంటల పాటు వైద్యులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండడంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేయగలిగామని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారన్నారు. సమావేశంలో వైద్యుడు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణంపై గ్రామసభ
ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి కంచి స్వామీజీ సలహాలు, సూచనలకు అనుగుణంగా ముందుకు వెళుతున్నట్లు ఆలయ అర్చకుడు యనమండ్ర సత్య సీతారామశర్మ తెలిపారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు అధ్యక్షతన ఆలయ ఆవరణలో మంగళవారం గ్రామ సభ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని కోరారు. స్వామి, అమ్మవార్ల మూల విరాట్ను కదిలించకుండా నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్, ఈవో వి.సత్యనారాయణ మాట్లాడుతూ పునర్నిర్మాణ పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానించామన్నారు. అలాగే 2026 ఫిబ్రవరి 15న జరిగే మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సాహంగా ముగిసిన టీచర్స్ గేమ్స్కొత్తపేట: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, జెడ్పీ బాలికోన్నత పాఠశాలల క్రీడా మైదానాల్లో రెండు రోజులు జరిగిన జిల్లా స్థాయి టీచర్స్ గేమ్స్ మంగళవారం సాయంత్రం ముగిశాయి. మహిళల త్రోబాల్లో పి.గన్నవరం మండలం, పురుషుల క్రికెట్లో ఉప్పలగుప్తం మండలం విజేతలుగా నిలిచాయి. ఈ సందర్భంగా సాయంత్రం డీవైఈఓ పి.రామ లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఎంపీపీ గంగాధరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు గూడపాటి రామాదేవి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మిద్దే ఆదినారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రికెట్ విజేతలకు మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ వీరవల్లి శ్రీనివాస్ తన తల్లి జ్ఞాపకార్థం ట్రోపీలు సమకూర్చారు. అక్కిరెడ్డి సూర్యనారాయణ, కోలా సురేష్, తొత్తుపాడు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం కొపెల్ల భాస్కరశాస్త్రి షీల్డ్లు అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ మట్టపర్తి హరిప్రసాద్, జిల్లా సమగ్ర శిక్షా కోఆర్డినేటర్ డిప్యూటీ కలెక్టర్ జి.మమ్మీ పాల్గొన్నారు. -
రొయ్య పిల్లల సీడ్ వివాదంపై సమావేశం
అమలాపురం రూరల్: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక మత్స్యకారుల మధ్య ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రొయ్య పిల్లల సీడ్ సేకరణలో సరిహద్దుపరంగా నెలకొన్న వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆ జిల్లాల జాయింట్ కలెక్టర్లు వై.మేఘ స్వరూప్, టి.నిషాంతి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో జలవనరులు, మత్స్య, సర్వే శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీలు మాట్లాడుతూ 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదంపై శాఖల వారీగా సమీక్షించాలన్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం మత్స్యకార సహకార సంఘాల ప్రతినిధులు.. లీజు దరఖాస్తు అంశంపై కోర్టును ఆశ్రయించారన్నారు. ధవళేశ్వరం వద్ద 70 గేట్లను ధవళేశ్వరం మత్స్యకారులకు, బొబ్బర్లంక వద్ద 43 గేట్లను బొబ్బర్లంక మత్స్యకారులకు గతంలో లీజుకు ఇవ్వడం జరిగేదన్నారు. కాటన్ బ్యారేజీ వద్ద ఏ ప్రాంతం ఏ జిల్లా పరిధిలో ఉందో సరిహద్దులు కచ్చితంగా నిర్ధారించాలన్నారు. -
హత్య కేసు నిందితుల అరెస్ట్
రాజోలు: ఏడేళ్ల క్రితం హత్య చేసి పారిపోయిన ఇద్దరు నిందితులను మంగళవారం రాజోలు పోలీస్లు అరెస్ట్ చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ నరేష్ కుమార్, ఎస్సై రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పొదలాడ గ్రామంలో కొప్పాడి శ్రీనివాస్ ఇంటి ముందు ఆరబెట్టిన దుప్పటి 2018 ఏప్రిల్ 4న మాయమైంది. దాన్ని అదే గ్రామానికి చెందిన కామాడి వీర రాఘవులు తీశాడని, అతడిని బ్రాందీషాపులో శ్రీనివాస్ నిలదీశాడు. అలాగే రాఘవులును అక్కడే ఉన్న జగతాని పల్లంరాజు, కొప్పాడి శ్రీను (శ్రీనివాస్ స్నేహితులు) గట్టిగా పట్టుకున్నారు. అనంతరం రాఘవులు తలపై బీరు బాటిల్తో కొప్పాడి శ్రీనివాస్ బలంగా కొట్టాడు. దీంతో గాయాల పాలైన రాఘవులును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటి నుంచి నిందితులైన కొప్పాడి శ్రీనివాస్, జగతాని పల్లంరాజు, కొప్పాడి శ్రీను పరారయ్యారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో గడిపారు. ఈ ముగ్గురిలో జగతాని పల్లం రాజు చనిపోయాడు. ఏడేళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రాజోలు కోర్టులో హాజరుపర్చారు. -
ఉమ్మడి జిల్లా ఖోఖో జట్టు ఎంపిక
సామర్లకోట: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఉమ్మడి జిల్లా పురుషుల జట్టును మంగళవారం ఎంపిక చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలోని సుమారు 52 మంది క్రీడాకారులకు ఐదు రోజుల పాటు పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్లో శిక్షణ ఇచ్చారు. వారిలో ఉత్తమ ప్రతిభ చూపిన 15 మంది క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వారికి వెన్నా వెంకటేష్ సహకారంతో జెర్సీలు అందజేశారు. గుడివాడలో ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వెంకటేష్ తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులను డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు అభినందించారు. చదువు భారం.. బాలికల అదృశ్యంమలికిపురం: చదువుకోవడం భారంగా మారిందని భావించిన రాజోలుకు చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినులు మంగళవారం అదృశ్యం అయ్యారు. వారి బంధువుల ఫిర్యాదు మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్ ఆధ్వర్యంలో పోలీసులు గాలించి, నాలుగు గంటల్లోనే వారి ఆచూకీ కనుగొన్నారు. ఆ వివరాలను మలికిపురం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ విలేకరులకు తెలిపారు. రాజోలు చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులకు చదవుకోవడం భారంగా మారింది. ఇంట్లో చెప్పినా బలవంతంగా కాలేజీకి పంపుతుండడంతో పారిపోవాలని అనుకున్నారు. రాజమహేంద్రవరం వెళ్లి దుస్తుల దుకాణంలో పనిచేసుకుంటూ బతకాలని వెళ్లిపోయారు. వారి సెల్ఫోన్ల ఆధారంగా పోలీసులు ఆ బాలికలను గుర్తించారు. వారి తల్లిదండ్రులు విదేశాలలో ఉండడంతో ఇక్కడి బంధువులకు వీరి బాధ్యతలను అప్పగించారు. ఈ నేపథ్యంలో బాలికలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సమావేశంలో సీఐ టీవీ నగేష్ కుమార్, రాజోలు, మలికిపురం ఎస్సైలు రాజశేఖర్, పీవీవీఎస్ సురేష్ పాల్గొన్నారు. నల్లజర్లలో చోరీదేవరపల్లి: నల్లజర్లలోని ఒక ఇంట్లో దొంగలు పడి బంగారం ఆభరణాలు, నగదును దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల సెంటర్లో మెడికల్ షాపు మురళీకి చెందిన రెండు పోర్షన్ల ఇల్లు ఉంది. వాటిలో వల్లూరి శ్రీలక్ష్మి, వట్టికూటి వెంకటేశ్వరరావు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వారందరూ సోమవారం రాత్రి 8 గంటలకు తమ పోర్షన్లకు తాళాలు వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం 6 గంటలకు తిరిగి వచ్చే సరికి, తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా వెంకటేశ్వరరావు బీరువాలో 6.50 కాసుల బంగారం ఆభరణాలు, రూ.30 వేల నగదు, వెండి, శ్రీలక్ష్మి పోర్షన్లో సీసీ కెమెరాలు, డీవీఆర్ బాక్సు మాయమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం వచ్చి వేలిముద్రలను సేకరించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. పాల ట్యాంకర్ ఢీకొని యువకుడి మృతిరాజానగరం: పాల ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. జాతీయ రహదారిపై జీఎస్ఎల్ పెట్రోలు బంకు సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా మాకవారిపాలెం మండలం పెదపాడుకు చెందిన పైలా సత్య షణ్ముఖసాయి (22) మోటారు సైకిల్పై రాజమహేంద్రవరం వైపు వెళుతున్నాడు. అతడిని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో షణ్ముఖ సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకు మేనేజర్కు ఐదేళ్ల జైలు, జరిమానావిశాఖ లీగల్: ప్రభుత్వ సంస్థను మోసం చేసి, ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా వ్యవహరించిన బ్యాంకు మేనేజర్తో పాటు మరో నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పి.విజయదుర్గ మంగళవారం సంచలన తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు నిందితులు ఒక్కొక్కరూ రూ.1,10,000 జరిమానా చెల్లించాలని, ఒకవేళ చెల్లించని పక్షంలో అదనంగా మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో స్పష్టం చేశారు. ఇదే కేసులో ప్రమేయం ఉన్న మరో నలుగురికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.45,000 జరిమానా విధించారు. సీబీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్గా పనిచేసిన చాగంటి చలపతిరావు, అసిస్టెంట్ మేనేజర్ పూడూరు సుబ్బారావు 2010–2011 కాలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. లకిడేపల్లిలో చేపల చెరువుల సాగు పేరుతో ఎటువంటి నిర్దిష్టమైన తనిఖీలు, సరైన పత్రాలు లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు మూడు దఫాలుగా భారీగా రుణాలు మంజూరు చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రాజెక్టులు చేపట్టకుండానే కేవలం కాగితాలపైనే రుణాలను చూపి నిందితులు సత్తి సత్యనారాయణరెడ్డి, టి.శ్రీనివాస్రెడ్డిలతో కలిసి లక్షల రూపాయల బ్యాంకు నిధులను స్వాహా చేశారు. అలాగే లక్ష్మీప్రసన్న సీఫుడ్స్ పేరుతో మేడపాటి కనకదుర్గ ప్రసాద్, అతని భార్య ఝాన్సీ లక్ష్మీరాణి, చర్ల శ్రీ లక్ష్మీదేవి కూడా మరో నకిలీ ప్రాజెక్టును సృష్టించి బ్యాంకును మోసగించారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్షలు ఖరారు చేశారు. -
మహిళా దొంగల ముఠా అరెస్టు
జగ్గంపేట: జ్యుయలరీ షాపులో 350 గ్రాముల వెండి పట్టీలను చోరీ చేసిన ఐదుగురు మహిళలను జగ్గంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గోకవరం రోడ్డులోని కార్తికేయ జ్యుయలరీ షాపునకు ఈ నెల 9వ తేదీన 8 మంది మహిళలు వచ్చారు. వెండి పట్టీలు కొనుగోలు చేస్తున్నట్టు నటించి 350 గ్రాముల 8 జతల పట్టీలను చోరీ చేశారు. దీనిపై షాపు యజమాని ఫిర్యాదు మేరకు ఎస్సై రఘునందనరావు ఆధ్వర్యంలో పోలీసులు కృపారావు, జయరామ్ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు, ఇతర మార్గాల ద్వారా ఆ మహిళల ఆచూకీ గుర్తించారు. వారిలో కావిడి మహాలక్ష్మి (పాలకోడేరు), కావిడి చిన్న ధనమ్మ (పాలకొల్లు), కావిడి పార్వతి (నాగేంద్రపురం), కావడి భవాని (నాగేంద్రపురం), చుక్క నరసమ్మ (దర్శిపర్రు)లను జగ్గంపేట శివారు సత్తెమ్మతల్లి గుడి వద్ద అరెస్ట్ చేశారు. శ్యామల, రత్నం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరందరూ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు. -
ఉషోరుమంటూ..
యానాం: పర్యాటక ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల ఖర్చుతో చేపట్టిన నిర్మాణాలకు నిర్లక్ష్యపు గ్రహణం పట్టింది. వాటి నిర్వహణ లేకపోవడంతో అలంకారప్రాయంగా మారుతున్నాయి. ఎన్నో ఆశలతో వాటిని చూసేందుకు వచ్చిన పర్యాటకులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. యానాం పట్టణంలో బొటానికల్ గార్డెన్, దానిలో నిర్మించిన మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో ఈ కోవలోకే వస్తాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ నిర్మాణాలు ఇప్పుడు పనిచేయడం లేదు. బొటానికల్ గార్డెన్ నిత్యం తెరిచే ఉంటుంది. మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షోలను ఏటా సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజుల పాటు ప్రదర్శించేవారు. ప్రస్తుతంగా గార్డెన్ అధ్వానంగా మారింది. మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షోకు సంబంధించిన యంత్రాలు నిర్వహణ లేక మూలన పడ్డాయి. రూ.8 కోట్లతో నిర్మాణం బొటానికల్ గార్డెన్ను 2013లో సుమారు రూ.8 కోట్ల పర్యాటక శాఖ నిధులతో నిర్మించారు. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకు ఉపకరించేలా దాన్ని తీర్చిదిద్దాలని భావించారు. కానీ కేవలం ఒక భవంతిని నిర్మించి వదిలేశారు. గార్డెన్లో మొక్కలను మాత్రం ఏర్పాటు చేయలేదు. దాన్ని 2016లో సీఎం రంగసామి ప్రారంభించారు. అనంతరం మళ్లీ అదే స్థలంలో రూ.2 కోట్ల నిధులతో మ్యూజికల్ ఫౌంటెయిన్ ఏర్పాటు చేశారు. దానికి అనుసంధానంగా లేజర్ షోకు కూడా ఏర్పాట్లు చేశారు. 2019 జనవరిలో సౌండ్ అండ్ లైట్ షోను అప్పటి సీఎం నారాయణసామి ప్రారంభించారు. అప్పటి నుంచి కొంత కాలం పనిచేసిన తర్వాత మానేసింది. నిర్వహణ గాలికి.. మ్యూజికల్ ఫౌంటెయిన్కు సంబంధించిన యంత్రాలు, మోటార్లను సంబంధిత పీడబ్ల్యూడీ యంత్రాంగం నిర్వహణ చేయాల్సి ఉంది. ఎప్పటికప్పుడు ఆ యంత్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ రెండేళ్లుగా వాటిపై అధికారులు దృష్టి సారించలేదు. దీంతో యంత్రాలు పనిచేయని స్థితిలోకి వచ్చాయి. అక్కడ నీరు కూడా రంగు మారి అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. బొటానికల్ గార్డెన్ ప్రాంతం సంబంధిత పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది పర్యవేక్షణలో ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత అంతా వారిదే. అయితే సంబంధిత అధికారులు మాత్రం దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బొటానికల్ గార్డెన్లో మొక్కలు, పచ్చదనం సైతం లేకుండా కళావిహీనంగా మారింది. పర్యాటకులకు కనీస సౌకర్యాలు కూడా లేవు. దీంతో అక్కడకు వచ్చిన వారందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈసారి నిరాశే.. ప్రతి ఏటా సంక్రాంతి పండగ సమయంలో మూడు రోజుల పాటు మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో ప్రదర్శిస్తారు. అయితే ఈ ఏడాది మాత్రం ప్రదర్శనలు లేకుండా చేశారు. మ్యూజికల్ పౌంటెయిన్కు సంబంధించి యంత్రాలను సకాలంలో బాగు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్రాంతికి లేజర్ షో లేనట్టే మూలన పడిన మ్యూజికల్ ఫౌంటెయిన్ నిర్వహణ లేక పనిచేయని యంత్రాలు అధ్వానంగా మారిన యానాం బొటానికల్ గార్డెన్ పర్యాటకులకు నిరాశ -
గణిత మేధావి రామానుజన్
కె.పెదపూడిలో 1729 ఆకృతిలో కూర్చున్న విద్యార్థులు అంబాజీపేట: దేశానికి గణిత మేధావిగా శ్రీనివాస రామానుజన్ ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించారని హైస్కూలు హెచ్.ఎం, సీహెచ్.వేణుగోపాలకృష్ణ అన్నారు. కె.పెదపూడి జెడ్పీ హైస్కూల్లో గణిత దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్కు ఎంతో ఇష్టమైన సంఖ్య 1729 అని దీనిని రెండు ఘనముల మొత్తంగా రాయగల చిన్న సంఖ్య కావటంతో దీనిని ‘రామానుజన్ సంఖ్య‘ అంటారని వివరించారు. విద్యార్థులు రామానుజన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన 1729 ఆకృతి పలువురిని అలరించింది. -
ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వ స్థలాల్లో 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసి, పక్కా ఇల్లు నిర్మించాలని, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, ఏఐఎఫ్టీయూ, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి), ప్రజా సంఘాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వభరత్కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పెద్దాపురం ఒకటో వార్డు పరిధిలో గల ప్రభుత్వ స్థలంలో 30 ఏళ్ల క్రితం ఇల్లు లేని నిరుపేదలు పూరిగుడిసెలు వేసుకుని నివాసముంటున్నారన్నారు. ఆ కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వరదలు వచ్చిన, ఏలూరు కాలువ నీరు వదిలిన ఆ కాలనీ ముంపుకు గురవుతుందన్నారు. సర్వే నంబర్ 579లో గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాదారులకు ఇంటి రుణాలు మంజూరు చేయాలని, వారికి రోడ్లు డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.300 మంది శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు శ్మశాన వాటిక లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి శ్మశాన వాటికకు స్థలం కొనుగోలు చేసి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడు వల్లూరి రాజబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, జిల్లా నాయకులు కే రామలింగేశ్వర రావు, ఎల్లే సత్తిబాబు ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి కుంచ అంజిబాబు, అధ్యక్షుడు మడికి సత్యం, ప్రగతిశీల మహిళా సంఘం ( సీ్త్ర విముక్తి) నాయకులు రెడ్డి దుర్గాదేవి, యమునా, శిరీష, దమ్మ సీత పాల్గొన్నారు. -
చెడు అలవాట్లతో బీబీఏ విద్యార్థి ఆత్మహత్య
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఎదురుగా గల మెట్ల కాలనీకి చెందిన బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కొప్పన దీపక్ రాజన్ (18) ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఫ్యాన్ హుక్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీబీఏ చదువుతున్న దీపక్ రాజన్ చెడు అలవాట్లకు బానిసై ఈ అఘాయిత్యం చేసుకున్నాడని పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ తెలిపారు. తండ్రి మరణించడంతో అతని తల్లి అతి గారాబంగా పెంచింది. తరచూ డబ్బు కోసం తల్లిని బెదిరించడం, ఇచ్చిన డబ్బుతో మద్యం తాగడం అతనికి అలవాటుగా మారింది. కాకినాడకు చెందిన తన మామయ్య ఇటీవల చనిపోవడంతో అతని తల్లి అక్కడికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి మద్యం సేవించి ఇంటికి చేరుకున్న దీపక్ రాజన్ తన తండ్రి గతంలో చనిపోయాడు, ఇప్పుడు మామయ్య చనిపోయాడు. నేనూ చనిపోతానని ఇంట్లో ఉన్న తన తాతాయ్యకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. గంట సమయం దాటాక అనుమానం వచ్చి తాతాయ్య చూసేసరికి గదిలో దీపక్ రాజన్ ఉరి వేసుకుని వేలాడుతుండడాన్ని గమనించాడు. పోస్టుమార్టం కోసం విద్యార్థి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
రెండు తాటాకిళ్లు దగ్ధం
రూ.5 లక్షల ఆస్తినష్టం పి.గన్నవరం: మండలంలోని పోతవరం శివారు మాతావారిపేటలో ఆదివారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరొక డాబా ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. మొత్తం ఐదు కుటుంబాల వారు నిరాశ్రయులు కాగా, రూ.5 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు స్థానికులు చెబుతున్నారు. మాతా చంద్రరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగడంతో ఆ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ మంటలు పక్కనే ఉన్న మాతా శ్రీరాములు ఇంటికి వ్యాపించి, అతడి ఇల్లు కూడా అగ్నికి ఆహూతైంది. పక్కనే ఉన్న మాతా వెంకట్రావుకు చెందిన డాబా ఇల్లు దెబ్బతింది. అర్ధరాత్రి ఇళ్లల్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో బాధితులంతా కట్టుబట్టలతో ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రమాదం నుంచి బయట పడ్డారు. చంద్రరావు ఇంట్లో నివసిస్తున్న అతడి కుమారులు శ్రీనుబాబు, రాంబాబు కుటుంబాలవారు కూడా నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోని సామాన్లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, విద్యార్థుల సర్టిఫికెట్లు సర్వం కాలిపోవడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు. చంద్రరావు కోడలు పద్మ ఇటీవల కువైట్ నుంచి వచ్చింది. ఆమె ఇల్లు కట్టుకుందామని తెచ్చుకున్న రూ.90 వేలు, బంగారు వస్తువులు కాలిపోవడంతో బోరున విలపించింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని బాధితులు విలపించారు. అమలాపురం అగ్నిమాపక కేంద్ర సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధిత కుటుంబాలకు రెవెన్యూ అధికారులు బియ్యం పంపిణీ చేశారు. సర్పంచ్ వడలి కొండయ్య, వీఆర్వో పద్మావతి సహాయక చర్యలు చేపట్టారు. తహసీల్దార్ పి.శ్రీపల్లవి, ఆర్ఐ వెన్నపు డాంగే, గిడ్డి ఆనంద్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
ఆర్డీవో, డీఎస్పీ ఆఫీసులు కొనసాగించాలని వినతి
అమలాపురం రూరల్: రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, రామచంద్రపురం రెవెన్యూ సబ్ డివిజన్ను తరలించడం కూడదని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు పలువురు నాయకులు వినతిపత్రాలు అందించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలిపే ప్రతిపాదన ఉందని దీనివల్ల రామచంద్రపురం నియోజకవర్గంలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, సబ్ డివిజనల్ ఆఫీస్లు పొరుగు నియోజకవర్గాలకు తరలిస్తారు. వీటిని కొనసాగించాలని రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోర్టినేటర్ పిల్లి సూర్యప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పెమ్మిరెడ్డి మురళి, అమలాపురం పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, అఖిల పక్ష నాయకుడు సలాది సతీష్నాయుడుకలెక్టర్ను కలిసి వినిత పత్రం అందిచారు. ఈ ఆఫీస్ను మూసివేస్తే రైతులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, కూలీలు, సాధారణ ప్రజలకు కష్టాలు ఏర్పడతారయని అందువల్ల, వాటిని యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు. -
ఉప్పాడలో ఫుడ్ పాయిజన్
● ఎనిమిది మంది మత్స్యకారులకు అస్వస్థత ● పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాధితులు పిఠాపురం: చేపల ప్యాకింగ్ పనికి వెళ్లిన కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు ఫుడ్ పాయిజన్ అయిన బిర్యాని తినడంతో సోమవారం తెల్లవారుజామున తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పిఠాపురం ప్రభుత్వాసునత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైదద్యులు తెలిపారు. బాధితుల కథనం ప్రకారం కొత్తపల్లి మండలం ఉప్పాడకు చెందిన మత్స్యకారులు వంక కాలేబు, ఓసిపల్లి సంతోష్, పల్లెటి స్టాలిన్, ఉమ్మిడి జాన్, గోశల పీటర్ పాల్, రాచపల్లి ప్రసాద్, గోశల ప్రసాద్, కోడా నాగేంద్ర ఆదివారం తాళ్లరేవు మండలం భైరవపాలెం తీర ప్రాంతానికి చేపల ప్యాకింగ్ పనికి వెళ్లారు. తాళ్లరేవులో ఒక బిర్యానీ హోటల్ వద్ద ఎనిమిది మంది బిర్యానీ కొనుక్కుని ప్యాకింగ్ పూర్తయ్యాక దానిని తిన్నారు. తిరిగి రాత్రికి ఇంటికి చేరుకున్నాక బిర్యానీ తిన్న ఎనిమిది మందికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి రావడంతో వారందరిని కొత్తపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఇద్దరికి మినహా మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులను పరామర్శించిన మాజీ ఎంపీ గీత ఫుడ్ పాయిజన్ అవ్వడంతో అస్వస్థతకు గురైన బాధితులను మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యురాలు వంగా గీతావిశ్వనాఽథ్ పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు అంతా అండగా ఉంటామని ఆమె బాధితులకు ఽభరోసా కల్పించారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలని అవసరమైన సహకారం అందించాలని పిఠాపురం, కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షులు రావుల మాధవరావు, ఆనాల సుదర్శన్లకు ఆమె సూచించారు. ఆమె వెంట మత్స్యకార నాయకుడు ఉప్పాడ ఎంపీటీసీ మేరుగు ఎల్లాజీ కొత్తెం దత్తుడు తదితరులు ఉన్నారు. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై అధికారుల దాడులు
రెండు పొక్లెయిన్లు, లారీ సీజ్ గోకవరం: మండలంలోని రంపయర్రంపాలెం, గంగంపాలెం గ్రామాల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలపై జిల్లా మైన్స్శాఖ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి సోమవారం దాడులు నిర్వహించారు. రంపయర్రంపాలెంలో సర్వే నంబర్ 471లో బి.అర్జునుడికి చెందిన భూమిలో, గంగంపాలెంలో సర్వేనంబర్ 96/2లో కనిశెట్టి అచ్చియ్యమ్మకు చెందిన భూమిలో గ్రావెల్ అక్రమంగా తవ్వుతున్నట్టు ఆయన గుర్తించారు. ఆయా భూముల్లో గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు జేసీబీలను, లారీని సీజ్ చేశారు. రంపయర్రంపాలెంలో 1,104 క్యూబిక్ మీటర్లు, గంగంపాలెంలో 5,769 క్యూబిక్ మీటర్లు మేర గ్రావెల్ అక్రమంగా తవ్వినట్టు నిర్ధారించామన్నారు. ఆయన వెంట మైన్స్శాఖ సర్వేయర్ పి.శ్రీనివాస్, ఆయా గ్రామాల రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి తొండంగి: మండలంలోని ఏ.వి.నగరంలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై అనుమానాస్పద స్థితిలో మృతి కేసు నమోదు చేసినట్టు తొండంగి ఎస్సై జగన్మోహన్రావు సోమవారం తెలిపారు. ఏ.వి.నగరం గ్రామానికి చెందిన నరాల పాపారావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె కత్తిపూడిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఏ.వి.నగరం గ్రామంలోని తన ఇంటి నుంచి అదే గ్రామంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఇంటి దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని అదే గ్రామానికి చెందిన తాటిపర్తి వసంతు పాపారావు సమాచారం అందించాడు. ఘటనా స్ధలానికి వెళ్లి చూడగా కుమార్తె ఉరివేసుకుని వేలాడుతూ మృతిచెంది ఉంది. కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. బైక్ దొంగలకు 12 నెలల జైలు గండేపల్లి: బైక్ దొంగలకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన తోట వినయ్ (లోఫర్), ఐసెట్టి దివాకర్ (బన్నీ) కలిసి మండలంలోని సూరంపాలెంకు చెందిన వెలుగుల బాలాజీ జూలై 11న తన కూతురిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు కాలేజీలో దింపేందుకు వెళ్లి మోటార్ సైకిల్ను పార్క్చేసి కాలేజీలోకి వెళ్లి వచ్చే సరికి బైక్ మాయమైందన్నారు. ఎసై యూవి శివ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి బైక్ చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్చేసి కోర్టుకు తరలించగా పెద్దాపురం జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్ దేవి రత్నకుమారి ఒక్కొక్కరికి 12 నెలలు చొప్పున జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించినట్టు తెలిపారు. -
ఆరుగురు వ్రత పురోహితుల సస్పెన్షన్
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రతవిభాగంలో పనిచేస్తున్న ఆరుగురు వ్రత పురోహితులను సస్పెండ్ చేస్తూ దేవస్థానం ఈఓ వీ త్రినాధరావు సోమవారం ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆదివారం అన్నవరం దేవస్థానం సామూహిక సత్యదేవుని వ్రతాలు నిర్వహించింది. ఇందుకు ఆరుగురు రెగ్యులర్ వ్రత పురోహితులు, ముగ్గురు అదనపు పురోహితులు, వ్రత సామగ్రి, సత్యదేవుని ప్రచార రథంతో బయల్దేరి వెళ్లారు. ఈ వ్రతాలలో 300 జంటలు పాల్గొనగా మరో వేయి మంది భక్తులు తిలకించినట్టు అధికారులు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు వ్రతాలు నిర్వహించిన అనంతరం వ్రతకథ చెప్పిన మొదటి శ్రేణి వ్రతపురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రత దక్షిణగా భక్తులు వస్త్రదానం కింద రూ.501, అన్నదానం కింద రూ.251 ఇవ్వాలని మైకు ద్వారా డిమాండ్ చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్, కమిషనర్ కే రామచంద్రమోహన్లకు సంబంధిత వీడియోలను సాక్ష్యాలుగా చూపుతూ కొందరు ఫిర్యాదు చేశారు. వాటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓ త్రినాథ్రావును ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఆదేశించారు. దీనిపై ఈఓ ఆ వ్రతాల నిర్వహణకు వెళ్లిన గుమస్తా బీఎస్ఎన్ రాజును విచారించగా వ్రతాలనంతరం భక్తుల నుంచి దానాలు రూపంలో కానుకలు డిమాండ్ చేసిన మాట వాస్తవమేనని, తాను వారించినా వినలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. దీని ఆధారంగా స్పెషల్ గ్రేడ్ వ్రత పురోహితులు మంధా శ్రీరామ్మూర్తి, ప్రయాగ ఆంజనేయులు, తొయ్యేటి వేంకట నరసింహ హరిహర సుబ్రహ్మణ్యం, మొదటి శ్రేణి పురోహితులు మల్లాది గురుమూర్తి, పాలంకి సోమేశ్వరరావు, మూడో గ్రేడ్ పురోహితుడు మొక్కరాల సతీష్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. గుమస్తా బీఎస్ఎన్ రాజుకు మెమో ఇచ్చారు. ఈ వ్రత పురోహితులు కొందరు గతంలో ఇదే విధమైన ఆరోపణలతో సస్పెండ్ అయి మళ్లీ విధుల్లోకి వచ్చారు. దేవస్థానంలో పరిస్థితులు చక్కదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కంద పంటకు ఇదే అనువైన కాలం
పెరవలి: రాష్ట్రంలో కంద పంటను పశ్చిమ, తూర్పుగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో 10వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, నల్లజర్ల, ఉండ్రాజవరం, చాగల్లు మండలాల్లో సుమారు 400 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కంద పంట వేసే రైతులకు ఇదే సరైన సమయం కావడంతో రైతులు కందను నాటే విధానం, సాగు, సస్యరక్షణ చర్యలు, ఎరువుల యాజమాన్యం, ఆశించే తెగుళ్లు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొవ్వూరు ఉద్యావన శాఖ అధికారి డి.సుధీర్ కుమార్ వివరించారు. కంద నాటే సమయం ఆసన్నమవ్వడంతో రైతులు ఈ విధంగా సాగు చేపట్టాలని సూచించారు. నేల తయారీ నీటి వసతి కలిగి నీరు బయటకుపోయే సదుపాయం గల సారవంతమైన నేలలను ఎన్నుకోవాలి. ఈ పంట వేయడానికి దుక్కు లోతుగా దున్నాలి. ఆఖరి దుక్కులో 10 టన్నుల చివికిన పశువుల ఎరువును, 24కిలోల భాస్వరం ఎరువులను వేసి దుక్కి దున్నాలి. నాటే సమయం ఏడాదిలో రెండుసార్లు ఈ పంటను వేయవచ్చు. మే, జూన్ నెలల్లోను నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తనాన్ని నాటవచ్చు. విత్తనం నీడలో రెండుమూడు నెలలు ఆరబెట్టిన దుంపలనే విత్తనంగా ఉపయోగించాలి. విత్తన దుంపలు 500 నుండి 750గ్రాములు బరువు కలిగినవి వినియోగిస్తే వీటిని ముక్కలుగా కోసి వాడవచ్చు. ముక్కలుగా కోసేటప్పుడు దుంపకన్ను(మొలక భాగం) ప్రతీ ముక్కలోకి వచ్చే విధంగా కోయాలి. విత్తన దుంపలను కోసిన తరువాత వెంటనే నాటాలి. ఎకరానికి 6టన్నుల విత్తనం వాడాలి. నాటడం విత్తనదుంపలను 60 సెంటీమీటర్ల దూరంలో నాటాలి. దుంపలను భూమికి లోతుగా నాటి వెంటనే తడిపెట్టాలి. ఎరువుల యాజమాన్యం విత్తనం నాటిన 40, 80, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని, పొటాష్, యూరియాను 217 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 179 కిలోలను 3 సమాన భాగాలుగా చేసి పైన తెలిపిన రోజుల్లో అందించాలి. ఇనుప ధాతువు లోపం కంద పంటకు నీటితడులు సక్రమంగా ఇవ్వని చేలల్లో ఇనుపధాతువు లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధాతువు లోపం ఉన్న మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి తెలుపుగా మారతాయి. దీని నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల అన్నబేధి, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. జింక్ ధాతువు లోపం జింక్ ధాతువు లోపం ఉంటే కందమొక్కల ఆకుల ఈనెల మధ్య పసుపువర్ణంగా మారి ఆకు ముగ్గిపోయి ఎండిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల జింక్సల్ఫేట్ కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు ఆకులపై చిన్నచిన్న మచ్చలు ఏర్పడి అవి పెరిగి ఆకంతా వ్యాపించి ఆకులు ఎండిపోతాయి. ఈ తెగులు సోకడం వలన పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. కాండం లేక మొదలు కుళ్లు తెగులు ఈ తెగులు మొక్క మొదలు వద్ద కాండాన్ని ఆశించడంతో కాండం కుళ్లిపోయి చనిపోతుంది. ఈ తెగులు ఆశించినప్పుడు మొదలుకు నీరు వెళ్ళకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని నివారణకు లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపి కాండం మొత్తం తడిసేలా పిచికారీ చేయాలి. మొజాయిక్ తెగులు ఇది వైరస్ తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్రహరితం కోల్పోయి ఆకులపై తెలుపు, పసుపురంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగాను, ముడుచుకుపోయినట్లుగా ఉంటాయి. ఈ తెగులు విత్తన దుంపల ద్వారాను, పేనుబంక పురుగు ద్వారాను వ్యాపిస్తుంది. దీని నివారణకు డైమిథోయేట్ లేదా మిథైల్డెమటాన్ మందును 2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటిలో కలిపి ఆకులు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.అన్నవరప్పాడులో చేలో పరచిన విత్తనం కందఅన్నవరప్పాడులో విత్తనం కందను నాటుతున్న కూలీలు -
అబ్బురం.. సైన్స్ సంబరం
రాజమహేంద్రవరం రూరల్: చిట్టి మెదళ్లు గట్టి ఆలోచనలే చేశాయి. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు రూపమిచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయుల తోడ్పాటుతో రూపొందించిన ప్రాజెక్టులను.. బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. అందరినీ అబ్బురపరిచారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ప్రారంభించి, ఆయా ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఈ ప్రదర్శన దోహదపడుతుందని అన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల మేధస్సు మరింత వికసిస్తుందని చెప్పారు. డీఈఓ కంది వాసుదేవరావు మాట్లాడుతూ, విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేసి, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీవైఈఓ బి.దిలీప్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్ఎస్ నెహ్రూ, గురుకులం కరస్పాండెంట్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ గుర్రయ్య, రూరల్ ఎంఈఓ తులసీదాస్, డీసీఈబీ కార్యదర్శి దేవా అనిత, సీఎంఓ శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం సహాయ కార్యదర్శి కోలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలి విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలని ఇన్చార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ అన్నారు. సాయంత్రం జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు గ్రూపు ఫ సస్టెయినబుల్ అగ్రికల్చర్ విభాగంలో క్రాప్ మెయింటెయినింగ్ సిస్టమ్ (కె.నవీన, కె.గీతికశ్రీ, 9వ తరగతి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం, గోపాలపురం) ఫ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్ విభాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఎండీఎం (సీహెచ్ గురుసాయిరామ్, సీహెచ్ రియాజ్, 7వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రేగులగుంట). ఫ గ్రీన్ ఎనర్జీ విభాగంలో ఈ–వేస్ట్ కన్వర్ట్ టు ఎనర్జీ (డి.కీర్తన, కె.సత్య, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పురుషోత్తపల్లి) ఫ రీక్రియేషనల్ మేథమెటికల్ మోడలింగ్ విభాగంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్స్పైర్డ్ బై మ్యాథ్స్ (జి.భాస్కరి, ఎం.సీత, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట) ఫ హెల్త్ అండ్ హైజీన్ విభాగంలో హెల్త్ అండ్ హైజీన్ (కె.వర్షిత్ కుమార్, ఎస్.సిద్ధార్థ, జెడ్పీ హైస్కూల్, రామచంద్రపురం) ఫ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ విభాగంలో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్ (ఆర్.సంపత్, డి.జోసఫ్ చరణ్, 9వ తరగతి, లూథరన్ ఎయిడెడ్ హైస్కూల్, రాజమహేంద్రవరం) ఫ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో స్టూడెంట్ ఫ్రెండ్లీ పెన్ (బి.పల్లవి, ఎం.దీక్షిత, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట) వ్యక్తిగత విభాగం ఫ ఇంజినీరింగ్ టెక్నాలజీ విభాగంలో ఇన్ఫినెట్ (కె.పూర్ణ వసుధ, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట) ఫ వుమెన్ సేఫ్టీ హ్యాండ్ బెల్ట్ (ఎస్.సుమశ్రీసాయి, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఉండ్రాజవరం) టీచర్ విభాగం ఫ ఫిజిక్స్లో ఎ ఇన్నోవేటివ్ ఫిజిక్స్ ఎగ్జిబిట్స్ (కేఎస్ఆర్ ఆంజనేయులు, జెడ్పీ హైస్కూల్, పురుషోత్తపల్లి) ఫ ఎన్విరాన్మెంట్ సైన్స్ విభాగంలో ఎకో బ్రిక్స్ (బీబీ విజయకుమారి, ఎస్కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం) ఫ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో 209 ప్రాజెక్టులు ఫ ఆలోచింపజేసిన నమూనాలు ఫ ప్రతిభ చూపిన విద్యార్థులు -
రాజ్యలాభం కన్నా ధర్మలాభం గొప్పది
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘రాజ్యలాభం కన్నా ధర్మమార్గం గొప్పది. ధర్మానికి తపస్సే మార్గమని కృష్ణ పరమాత్మ ధర్మరాజుతో చెబుతాడు’ అని సామవేదం షణ్ముఖశర్మ తెలిపారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాసభారతం ప్రవచనాన్ని ఆయన సోమవారం కొనసాగించారు. ‘‘తీర్థయాత్రలు ముగించుకు వచ్చిన పాండవుల వద్దకు కృష్ణుడు వచ్చి ధర్మజ, భీములకు నమస్కరిస్తాడు. వారిద్దరూ వయసులో కృష్ణునికన్నా పెద్దలు. అర్జునుడిని ఆత్మీయంగా కౌగిలించుకుంటాడు. కృష్ణునికి నకుల సహదేవులు నమస్కరించారు. ధర్మరాజుతో కృష్ణుడు మాట్లాడుతూ, వనవాస సమయంలో నీలో ఎటువంటి సుగుణాలున్నాయో, రాజుగా ఉన్న సమయంలో కూడా అవే ఉన్నాయి. నీవు కర్మలను కామ్య దృష్టితో చేయవు’’ అని అంటాడని వివరించారు. సాధకుని దృష్టి ధర్మరాజుపై, లక్ష్యం కృష్ణునిపై ఉండాలని అన్నారు. ‘‘అనంతరం వారి వద్దకు మార్కండేయ మహర్షి వస్తాడు. ఆయన తపస్సా్ాధ్యయ సంపన్నుడు. జరామరణాలు లేనివాడు. వేల సంవత్సరాల వయసున్నా, పాతికేళ్ల యువకునిలా ఉండేవాడని వ్యాసుడు వర్ణించాడు. ప్రళయ కాలంలో సృష్టి అంతా జలమయమైన సమయంలో కూడా ఆయన అదే శరీరంతో ఉన్నారు’’ అని చెప్పారు. శకుని ప్రోద్బలంతో కౌరవులు ఘోష యాత్రకు ప్రయాణమవుతారన్నారు. గ్రంథావిష్కరణ విశ్రాంత ఓఎన్జీసీ అధికారి, ప్రముఖ సాహితీవేత్త కవితా ప్రసాద్ రచించిన సౌందర్యలహరి పద్య సంపుటిని ప్రవచనానంతరం షణ్ముఖశర్మ ఆవిష్కరించారు. శంకరభగవత్పాదులు అందించిన సౌందర్యలహరి శ్లోకాలను మధ్యాక్కర ఛందస్సులో కవితా ప్రసాద్ అనువదించిన తీరు అభినందనీయమని అన్నారు. ఆదిశంకరుల శ్లోకాలకు రచయిత ప్రామాణికమైన అనువాదాన్ని అందించారని చెప్పారు. -
అద్దేపల్లి ప్రభుకు సాహితీ వేదిక పురస్కారం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అనేక సంవత్సరాలుగా సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘రాజమండ్రి సాహితీ వేదిక’ కాకినాడకు చెందిన రచయిత అద్దేపల్లి ప్రభుకు 2025 సంవత్సరానికి ‘సాహితీ వేదిక పురస్కారం’ ప్రకటించింది. ఈ నెల 25న స్థానిక గౌతమీ గ్రంథాలయంలో జరిగే సంస్థ వార్షిక సమావేశంలో ప్రభుకు పురస్కారంతో పాటు రూ.20 వేల నగదు అందజేస్తున్నట్లు నిర్వాహకురాలు కుప్పిలి పద్మ తెలిపారు. క్లిష్టమైన వర్తమానాన్ని తన కథల్లో, కవితల్లో ఆవిష్కరిస్తూ, తెలుగు సాహిత్యానికి చేర్పునిస్తున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారం ఇస్తున్నట్లు వివరించారు. ప్రభు ఇప్పటికే ఆవాహన, పారిపోలేం, పిట్ట లేని లోకం, పర్యావరణ ప్రయాణాలు, దుఃఖపు ఎరుక కవితా సంపుటాలను, ‘సీమేన్’ కథా సంపుటిని ప్రచురించారు. -
ప్రాజెక్టు: వైర్లెస్ చార్జింగ్ వెహికల్
విద్యార్థినులు: బి.ప్రశాంతి, కె.కీర్తి, కె.గీతికశ్రీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం, గోపాలపురం వివరం: ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఫార్ములా ప్రకారం వైర్లెస్ చార్జింగ్ సిస్టమ్ పని చేస్తుంది. డైరెక్ట్ కరెంట్(డీసీ)ను ఆల్టర్నేటివ్ కరెంట్(ఏసీ)గా మార్చి ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తారు. వాహనాలను ఒక ప్లాట్ఫామ్ మీదకు తీసుకుని రాగానే వైరింగ్ అవసరం లేకుండా ఆటోమెటిక్గా చార్జి అయిపోతాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తూండగా.. సోలార్ ప్యానల్ వినియోగించుకుని వైర్ లేకుండా చార్జ్ చేసుకోవచ్చని వినూత్నంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. -
ట్రైనీ కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లు తమ 9 నెలల శిక్షణను చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ సూచించారు. ఈ శిక్షణను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎటువంటి నెగెటివ్ ఆలో చనలూ లేకుండా శిక్షణ పూర్తి చేయాలని అన్నారు. దురలవాట్ల జోలికి పోవద్దని, సమాజంలో ఉన్న కష్టాలను తెలుసుకుని, మానవత్వంతో స్పందించి, సహా యం చేయాలని సూచించారు. నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపడంలో ఏపీఎస్పీ పాత్ర కీలకమన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో తన అనుభవాలను వివరించారు. పోలీసు శిక్షణ కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా, నైతికంగా బాధ్యతాయుతమైన సిబ్బందిని తయారు చేసే ప్రక్రియని చెప్పారు. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షల్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే పోలీస్ కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారని స్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, ట్రైనింగ్ అడిషనల్ కమాండెంట్ వీవీవీ సత్యనారాయణ, అసిస్టెంట్ కమాండెంట్ టి.నాగ శ్రీనివాస్, ఆర్ఐలు కె.నరసింహరావు, జల్లు శ్రీనివాసరావు, బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశఋ విశ్వనాథం, డీటీసీ ఇన్స్పెక్టర్ ఆర్.సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రాజెక్టు: ఫ్లోటింగ్ హౌస్
విద్యార్థిని: అపర్ణాలక్ష్మి, 9వ తరగతి, డాక్టర్ ఎస్ఆర్కే హైస్కూలు, కొవ్వూరు వివరం: సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో ఉవ్వెత్తున అలలు, వరదలు వచ్చిన సమయంలో ఇళ్లు కోతకు గురవుతాయి. అటువంటి చోట్ల ఫ్లోటింగ్ హౌస్లు నిర్మిస్తే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. వరదలు, అలలు వచ్చిన సమయంలో ఈ హౌస్ 3 సెంటీమీటర్ల ఎత్తుకు లేస్తుంది. దీనివలన ఇంటికి ఎటువంటి నష్టమూ ఉండదు. పాస్కల్ సూత్రం, నీటి సాంద్రతపై ఆధారపడి ఇది పని చేస్తుంది. ప్రాజెక్టు: యానిమల్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ విద్యార్థినులు: ఎస్.అనన్య, టి.విజయదుర్గ, జెడ్పీ హైస్కూల్, కొంతమూరు వివరం: మనుషుల మాదిరిగానే జంతువులకు కూడా హెల్త్ మానిటరింగ్ చేయవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా జంతువుల హార్ట్ బీట్, శరీర ఉష్ణోగ్రతలను తెలుసుకుని, రోగాల బారి నుంచి కాపాడవచ్చు. -
జాతీయ స్థాయి సెపక్తక్రాలో కాంస్యం
దేవరపల్లి: రాజస్థాన్లోని జోథ్పూర్లో ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ జరిగిన 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో రాష్ట్ర బాలికల జట్టు అండర్–17 విభాగంలో ద్వితీయ స్థానంతో కాంస్య పతకం గెలుచుకుంది. జట్టు కోచ్గా దేవరపల్లి మండలం దుద్దుకూరు జెడ్పీ హైస్కూలు పీడీ ఆచంట వెంకటేశ్వరరావు, మేనేజర్గా బి.సంధ్య వ్యవహరించారు. ఈ జట్టులో వి.కావ్య, కె.లావణ్య (కృష్ణా), పి.మధురశ్రీ (పశ్చిమ గోదావరి), జి.రమ్య (తూర్పు గోదావరి), జి.చైతన్య కుమారి (అనంతపూర్) పాల్గొని అద్భుత ప్రతిభను కనబరిచారని కోచ్ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ జట్టులోని మధురశ్రీ దేవరపల్లి మండలం చిన్నాయగూడేనికి చెందిన క్రీడాకారిణి కావడం విశేషం. పీజీఆర్ఎస్కు 240 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 240 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్జీలను ఆర్థిక సంబంధిత, ఆర్థికేతరమైనవిగా విభజించామన్నారు. ఆర్థిక సంబంధిత అర్జీల పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగి నా సహించవచ్చని, అయితే ఆర్థికేతరమైనవి మా త్రం తప్పనిసరిగా గడువులోపే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో గతంలో వచ్చిన అర్జీలు ఎందుకు పెండింగ్లో ఉన్నా యో సంబంధిత అధికారులను ఆరా తీశారు. సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 37 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. డిజిటల్ భద్రతపై వర్క్షాప్కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డిజిటల్ భద్రత, ఆన్లైన్ మోసాలు, మహిళలపై నేరాలు, స్ట్రెస్ మేనేజ్మెంట్ అంశాలపై సీఐడీ కార్యాలయంలో సోమవారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐడీ అదనపు ఎస్పీ ఆస్మా ఫరీన్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగులు, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు సంబంధిత చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటే విధి నిర్వహణ మరింత సులభమవుతుందని చెప్పారు. బెట్టింగ్, లోన్ యాప్ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.కల్యాణ్ చక్రవర్తి వివరించారు. ఇన్వెస్ట్మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై అమరా వతి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కు చెందిన సాఫ్ట్వేర్ ట్రైనర్ సానబోయిన ఆశ్రిత్ కుమార్ అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై నేరాలు, పోక్సో చట్టం అమలు అంశాలపై జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పేరిచర్ల సూర్య ప్రభావతి మాట్లాడారు. ఒత్తిడి తగ్గింపు, సమ య నిర్వహణ అంశాలపై ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్కు చెందిన సైకాలజిస్ట్ ఎం.గోపాలకృష్ణ వివరించారు. సీఐడీ రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు లేఖన
అంబాజీపేట: జాతీయ వినియోదారుల రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలకు గంగలకుర్రు అగ్రహారం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని దొంగ లేఖన మహాలక్ష్మి ఎంపికై నట్లు హెచ్ఎం అక్కిరాజు శేషసాయి తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురంలో ఈ నెల 20న జరిగిన జిల్లా స్థాయి వ్యాసరచన (ఆంగ్లం) పోటీల్లో లేఖన ప్రతిభ కబర్చి ప్రథమ స్థానంలో నిలిచి రూ.5 వేలు నగదు బహుమతి గెలుపొందిందన్నారు. మంగళవారం విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీలో ఆమె పాల్గొననుందని ఆయన తెలిపారు. లేఖన మహాలక్ష్మిని ఎంఈఓలు కాండ్రేగుల వెంకటేశ్వరరావు, మోకా ప్రకాష్, సర్పంచ్ దొంగ నాగేశ్వరరావు, ఎంపీటీసీ విత్తనాల దుర్గాభవాని, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్, ఎస్ఎంసీ చైర్మన్ తొత్తరమూడి గోవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. -
జననేతకు జేజేలు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు.. సంక్షేమ ప్రదాత.. పేదల బాంధవుడు.. విద్యార్థులకు మావయ్యగా.. పింఛనర్లకు పెద్ద కొడుకుగా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిగా.. రాజకీయాల్లో సమున్నత విలువలకు పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు జననేత జన్మదిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని జేజేలు పలికారు. కేక్లు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. రక్తదాన శిబిరాలు, దుప్పట్లు, పండ్ల పంపిణీ తదితర రూపాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ప్రియతమ నేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ ప్రదాత జగన్ రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యాన వైఎస్ జగన్ పుట్టిన రోజు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల గుండెల్లో తనకంటూ ఒక స్థానాన్ని పదిలపరచుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు ఉప్పులూరి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శులు గొందేశి శ్రీనివాసరెడ్డి, నక్కా రాజబాబు, గిరిజాల బాబు, నక్కా శ్రీనగేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఫ జిల్లావ్యాప్తంగా సంబరాలు చేసుకున్న ప్రజలు ఫ విస్తృతంగా సేవా కార్యక్రమాలు -
అనపర్తి
నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తల కోలాహలం నడుమ.. అనపర్తిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు కేక్ను మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కేక్ కట్ చేశారు. రామవరంలో గ్రామ శాఖ ఆధ్వర్యాన పార్టీ నేతలు కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. బిక్కవోలు మండలం తొస్సిపూడి గ్రామంలో వస్త్ర, అన్నదానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెదపూడి మండలం జి.మామిడాడలో యువకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేశారు. -
పార్లమెంటరీ కార్యాలయంలో..
రాజమహేంద్రవరం తిలక్ రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యాన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చిన జగన్ నిజమైన సంక్షేమాన్ని ప్రజలకు అందించారని ఈ సందర్భంగా గూడూరి అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పోలు విజయలక్ష్మి, మానే దొరబాబు, ముప్పన ప్రభాకర్ చౌదరి, మార్తి లక్ష్మి, మారిమ నాగేశ్వరరావు, న్యాయవాది సాదిక్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు, తాళ్లపూడి మండలాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన ఆశ్రయ ఫౌండేషన్ వద్ద రోగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. పెద్దేవంలో 50 మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఒరిగేటి అశోక్ ఆధ్వర్యాన ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు వృద్ధులు, వితంతువులకు దుప్పట్లు, పండ్లు పంచారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. -
లెక్క లెక్కకో కిక్కు!
రాయవరం: భవిష్యత్తుకు బాటలు వేసే గణితం మనిషి జీవితంలో ఓ అంతర్భాగం. లెక్కలు లేనిదే జీవితంలో ఏ వ్యవహారమూ గడవదు. రెండొకట్ల రెండు అనే ఎక్కాల ప్రారంభం నుంచే లెక్కలపై ఆసక్తి కలిగేలా బోధిస్తే ఏ విద్యార్థీ లెక్కలంటే భయపడరని గణిత మేధావులు సూచిస్తున్నారు. డిసెంబర్ 22వ తేదీ తమిళనాడుకు చెందిన గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతిని జాతీయ గణిత శాస్త్ర దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర ఫోరమ్లు కూడా ఆ శాస్త్రం అభివృద్ధికి కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనం. సర్వ శాస్త్రానాం గణితం ప్రధానం సర్వశాస్త్రానాం గణితం ప్రధానం అన్నది అక్షర సత్యం. గణిత శాస్త్రానికి పుట్టిల్లుగా భారతదేశాన్ని పేర్కొంటారు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు, భాస్కరాచార్యుడు తదితర శాస్త్రవేత్తలు అనేక గణిత భావనలు ప్రవేశపెట్టారు. ‘సున్న’, ‘దశాంశమానం’, ‘రుణ సంఖ్యలు’ కనుగొన్నది భారతీయులే కావడం గమనార్హం. సమయం, డబ్బు, చేసే పని, వినోదం, విజ్ఞానం, చివరకు తినే ఆహారం ఇలా ఎన్నో ప్రక్రియలలో గణితం తన వంతు పాత్ర పోషిస్తుంది. గణితం వల్ల విద్యార్థుల్లో తార్కిక ఆలోచన పెరుగుతుంది. లెక్కలు బుర్ర పాడు చేసేవి అన్నట్టు కాకుండా పదును పెట్టేవి అనే ఆలోచనతో చదివితే జీవితంలో ఎంతో ముందుకు దూసుకుపోవచ్చని గణిత ఉపాధ్యాయులు చెప్తుంటారు. ఒక ఫార్ములా ప్రకారం మెదడు ఉపయోగించి సమాధానాలు రాస్తే గణితంలో అత్యధిక మార్కులు సాధించవచ్చని పలువురు నిరూపించారు. అందుకే గణితాన్ని క్వీన్ ఆఫ్ సైన్స్గా పరిగణిస్తున్నారు. గణితాభివృద్ధికి మ్యాథ్స్ ఫోరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల నైపుణ్యాలను గణితంలో మెరుగు పరచడానికి గణిత ఉపాధ్యయుల (స్కూల్ అసిస్టెంట్) సంకల్పంతో 2016 అక్టోబరు 2న రాష్ట్ర స్థాయి మ్యాథ్స్ ఫోరమ్ ప్రారంభించారు. అదే ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మ్యాథ్స్ ఫోరం 1,200 మంది గణిత ఉపాధ్యాయులతో ప్రారంభించిన ఈ ఫోరం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గణిత ఉపాధ్యాయులను ఏకం చేసింది. ఈ ఫోరం సేకరించిన నిధులతో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, మెటీరియల్ అందజేయడంతో పాటు విద్యార్థులకు క్విజ్, వీడియో కాంపిటీషన్స్, వక్తృత్వం, టీఎల్ఎం తయారీలో పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు పేపర్ ప్రెజెంటేషన్, క్విజ్, టీఎల్ఎం, మహిళా గణిత టీచర్లకు గణిత రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు గణిత వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. లెక్కలంటే లంకణాలు చేసినట్టు డీలా పడిపోతారు విద్యార్థులు. పదో తరగతి ఎప్పుడు దాటేస్తామా.. ఈ లెక్కల బాధలు ఎప్పుడు తప్పుతాయా అని ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో కొంతమంది లెక్కలతో జిమ్మిక్కులు చేసేస్తుంటారు. స్టెప్ బై స్టెప్ చక్కగా వేసేస్తూ నూటికి నూరు మార్కులు కొట్టేస్తుంటారు. అదెలా అని ఇంకొందరు నోరెళ్లబెడుతుంటారు. చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే లెక్కల చిక్కులు ఇట్టే తీసేయవచ్చని.. అసలు లెక్కలంత సులభమైన సబ్జెక్టు లేనేలేదని లెక్కల మాస్టర్లు చెప్తుంటారు. ఆ మాటకొస్తే లెక్కల చిక్కుముళ్లు తీసి సరిచేసినపుడడల్లా వచ్చే ఆ కిక్కే వేరని.. మరో లెక్కకూడా సరిచేసేయాలనే ఉత్సాహం మరింత రెట్టింపవుతుంటుందని లెక్కల వీరులు చెప్తుంటారు.కీమో థెరపీలోనూ హార్డీ–రామానుజన్ నంబర్ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిన్న వయసులోనే గణితంపై అనేక వ్యాసాలు సూత్రీకరించారు. ఆయన కనుగొన్న సంఖ్య 1729 ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని ఆధారంగానే క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన చికిత్స కూడా సాధ్యమైనదని గణిత మేధావులు పేర్కొంటారు. కణాల పెరుగుదల ఎంత వేగంగా జరుగుతుంది, ఎలా చేస్తే ఆ విలువను తగ్గించవచ్చనే దానికి ఈ సంఖ్య ఆధారమైంది. ఇది కీమో థెరపీలోనూ కీలకమైంది. గణిత మేధావికి ఘన నివాళి 1729 ఆకృతిలో విద్యార్థులు రాయవరం: మండలం వి.సావరం ఎంపీయూపీ స్కూలులో రామానుజన్ పుట్టిన రోజును ఆదివారం ఘనంగా నిర్వహించారు. గణిత ఉపాధ్యాయుడు పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు, హెచ్ఎం లోవప్రసాద్, ఉపాధ్యాయులు పంపన వెంకటరమణ, రామలక్ష్మి రామానుజన్ గొప్పదనాన్ని కొనియాడారు. అనంతరం విద్యార్థులు ఇలా రామానుజన్ సంఖ్య 1729 ఆకృతిలో కూర్చుని ఘన నివాళులర్పించారు. ఏమిటీ ఈ సంఖ్య ప్రత్యేకం? రామానుజన్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో హార్డీ 1729 నంబరు గల కారులో రాగా తన కారు నంబరు అన్లక్కీ అని రామానుజన్తో చెబుతాడు. తీవ్ర అనారోగ్యంగా ఉన్న సమయంలో కూడా రామానుజన్ రెండు ఘనాల మొత్తంగా, రెండు రకాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అని 1729 గొప్పదనాన్ని వివరించాడు. ఒకటి నుంచి 1728 వరకు ఏ సంఖ్యను రెండు ఘనాల మొత్తంగా రాయడానికి వీలులేదని రామానుజన్ మొట్టమొదటిగా ప్రపంచానికి తెలిపాడు. అందుకే ఈ సంఖ్య రామానుజన్ సంఖ్యగా ప్రఖ్యాతి పొందింది. 1729 రెండు ఘనాలుగా, రెండు క్యూబ్లుగా రాసిన అతి చిన్న కనిష్ఠ సంఖ్య. దీన్ని 10క్యూబ్+9క్యూబ్ = 12క్యూబ్+1క్యూబ్గా రాస్తారు. ట్రిక్కు తెలిస్తే ఎంత పెద్ద లెక్కకై నా ఇట్టే పరిష్కారం గాబరా అవసరం లేని సులువైన శాస్త్రం గణితం ఆసక్తి కలిగేలా చెప్పడంలోనే గురువు నేర్పరితనం ఈ నెల 22న జాతీయ గణిత దినోత్సవం -
వీధి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
ధవళేశ్వరం: వీధి కుక్కల దాడిలో ధవళేశ్వరం సంజయ్నగర్ కాలనీకి చెందిన మూడేళ్ల బాలుడు కడలి జతిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నం జతిన్ కుటుంబం ఊరు వెళ్లేందుకు బయలుదేరారు. తొలుత జతిన్ ఇంటి బయటకు వచ్చి నిలబడ్డాడు. సమీపంలో ఉన్న వీధి కుక్క జతిన్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలుడి అరుపులు విన్న కుటుంబ సభ్యులు బాలుడిని రక్షించారు. తీవ్రంగా గాయపడిన జతిన్ను తొలుత రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్య సేవలకు రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జతిన్ తండ్రి కడలి శివ స్థానిక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. -
సందడి చేసిన చాంపియన్
● 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ప్రకటించిన హీరో రోషన్ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): చారిత్రక ఘటనల ఆధారంగా తెరకెక్కిన చాంపియన్ చిత్ర బృందం ఆదివారం నగరంలో సందడి చేసింది. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోందని హీరో రోషన్ వెల్లడించారు. చిత్ర ప్రమోషన్లలో భాగం రాజమహేంద్రవరం వచ్చిన రోషన్, హీరోయిన్ అనశ్వర రాజన్ స్థానిక ప్రసాదిత్య మాల్లో విలేకరులతో మాట్లాడారు. స్వాతంత్య్రానంతరం 1948లో బైరాన్ పల్లె అనే గ్రామంలో జలియన్ వాలాబాగ్ లాంటి సంఘటన చోటు చేసుకుందని, ఆ ఘటన ఆధారంగా చాంపియన్ చిత్రాన్ని దర్శకుడు ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారని తెలిపారు. పుట్ బాల్ క్రీడ బ్రాక్ డ్రాప్ లో, యాక్షన్, అద్భుతమైన రొమాంటిక్ లవ్ స్టోరీతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన అన్నారు. మిక్కీ జె మేయర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారన్నారు. కొరియోగ్రాఫర్లు మంచి నృత్యరీతులు సమకూర్చారని తెలిపారు. వైజయంతి వంటి పెద్ద బ్యానర్లో ఇంత పెద్ద సినిమా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్కు మంచి హైప్ వచ్చిందని సినిమా అంతకు మించి ఉంటుందన్నారు. హీరోయిన్ అనశ్వర రాజన్ అద్భుతంగా నటించిందని, ఈ చిత్రం తర్వాత తనకు తెలుగులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. కథ ఎంపిక నుంచి అన్ని విషయాలలో తన తండ్రి శ్రీకాంత్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. ట్రైలర్ రిలీజ్కు రామ్ చరణ్ రావడం ఆనందంగా ఉందన్నారు. మరో రెండు చిత్రాలు ఒకే అయ్యాయని త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. హీరోయిన్ అనశ్వర రాజన్ మాట్లాడుతూ తెలుగులో తన తొలి చిత్రమే వైజయంతి వంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో పనిచేయడం తన అదృష్టం అన్నారు. ఛాంపియన్ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అభిమానులతో ఫొటోలు దిగారు. హీరో, హీరోయిన్లకు గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూటర్ మేనేజర్ వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. -
నేడు జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం జరగనున్న జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయని డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. ఈ ప్రదర్శన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ప్రదర్శనను తిలకించడానికి జిల్లాలోని విద్యార్థులను సంబంధిత ప్రధానోపాధ్యాయులు సరైన రక్షణతో తీసుకురావాలని సూచించారు. మొత్తం 290 ఎగ్జిబిట్లను ఇందులో ప్రదర్శిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కొవ్వూరు డీవైఈఓ దిలీప్కుమార్, రూరల్ ఎంఈఓ తులసీదాస్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్ఎస్ నెహ్రూ, పలువురు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, సత్యసాయి గురుకులం ప్రిన్సిపాల్ గుర్రయ్య పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణితో ప్రభుత్వ విద్య బలహీనం తాళ్లపూడి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణ ధోరణులతో ప్రభుత్వ విద్య రోజు రోజుకూ బలహీనపడుతోందని, ఈ విధానాలను తిప్పికొట్టాలని ఉపాధ్యాయులకు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని బల్లిపాడులోని కార్ల రామయ్య ఫంక్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) నాలుగో జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. తొలుత జాతీయ పతాకాన్ని, యూటీఎఫ్, స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) జెండాలను ఆవిష్కరించారు. పలు ఉద్యమ గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం వలన పేద ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు. పలువురు నేతలు మాట్లాడుతూ, ప్రభుత్వ ధోరణుల వల్ల రానున్న రోజుల్లో ప్రభుత్వ బడులు ఏమైపోతాయోననే ఆందోళన కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్, నాయకులు షరీఫ్, డి.మనోజ్, ఎన్.అరుణ కుమారి తదితరులతో పాటు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 98 శాతం మందికి పోలియో చుక్కలు రాజమహేంద్రవరం రూరల్: పల్స్పోలియో చుక్కల మందు కార్యక్రమం ఆదివారం విజయవంతంగా జరిగిందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కె.వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని కంబాలపేట, ఆనంద్ నగర్, క్వారీ మార్కెట్ వద్ద ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. జిల్లావ్యాప్తంగా 1,89,550 మంది ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కల మందు వేయాలన్నది లక్ష్యం కాగా.. ఒక్క రోజులో 1,85,759 మందికి (98 శాతం) వేశామని తెలిపారు. మిగిలిన పిల్లల ఇళ్లకు వైద్య సిబ్బంది సోమ, మంగళవారాల్లో వెళ్లి పోలియో చుక్కల మందు వేస్తారని వెంకటేశ్వరరావు వివరించారు. -
లోవరాజు మృతదేహం లభ్యం
గుర్రపు డెక్కలో చిక్కుకుని తేలిన వైనం సామర్లకోట: గోదావరి కాలువలో గుర్రపు డెక్క తొలగిస్తూ గల్లంతైన చేవూరి లోవరాజు (40) మృతదేహం ఆదివారం గుర్రపు డెక్కలో చిక్కుకుని తేలింది. శుక్రవారం లోవరాజు గుర్రపుడెక్క తీస్తున్న సమయంలో గల్లంతు అయిన విషయం తెలిసిందే. నీటి పంపిణీ దారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుర్రపుడెక్క తొలగింపు పనుల్లో ఎటువంటి జాగ్రత్త చర్యలూ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నీటి మట్టం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతుని కుటుంబ సభ్యులకు పట్టణ వైఎస్సార్ సీపీ మాజీ అధ్యక్షుడు మద్దాలి శ్రీను ఆర్థిక సహాయం అందజేశారు. -
భారతం సమగ్ర వేదవాజ్మయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) భారతం సమగ్ర వేదవాజ్ఞ్మయమని, విజ్ఞాన సర్వస్వమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాసభారత ప్రవచన యజ్ఞాన్ని స్థానిక హిందూ సమాజంలో ఆయన ఆదివారం కొనసాగించారు. భారతంలోని కథలు, ఉపదేశాలు, ఉపాఖ్యానాలు, పాత్రల మధ్య కానవచ్చే సంవాదాల్లో విస్తారమైన ధర్మబోధ ఉంటుందని చెప్పారు. ధర్మం లేనప్పుడు జ్ఞానం వికసించదన్నారు. ‘భారతంలో ముఖ్యంగా మూడు విచారధారలు కనపడతాయి. జీవవిచారం– నేను ఎవరు అనే ప్రశ్న. ధర్మవిచారం– ఏది ధర్మం అనే ప్రశ్న, బ్రహ్మవిచారం– బ్రహ్మం అంటే ఏమిటి? ఈ మూడు విభాగాలకు సంబంధించిన రహస్యాలకు భారతం పరిష్కారం చూపుతుంది’ అని అన్నారు. ‘బ్రాహ్మణుడంటే ఎవరు అని ధర్మరాజును నహుషుడు అడుగుతాడు. సత్యం, దానం, క్షమ, శీలం, క్రూరత్వం లేకపోవడం, తపస్సు, దయ ఇత్యాది లక్షణాలు కలవాడే బ్రాహ్మణుడని ధర్మరాజు సమాధానం చెబుతాడు’ అని వివరించారు. వేదాలు, పురాణాలతో పాటు భారతంలో అనేక సందర్భాల్లో సరస్వతీ నది ప్రస్తావన కనబడుతుందని, అనేక పరిశోధనలు ఈ ప్రాచీన నది ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. పాశ్చాత్యులు కుట్రలతో ఈ పరిశోధనలను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘దివ్యాస్త్రాలతో తిరిగి వచ్చిన అర్జునుడు తన సోదరులను, ద్రౌపదిని కలుసుకుంటాడు. దివ్యాస్త్రాలను ప్రదర్శన కోసం వినియోగించరాదని, అల్పులపై ప్రయోగించరాదని అతడికి నారదుడు హితోపదేశం చేస్తాడు. అలాగే, క్రోధం పాపహేతువని, దీనిని నియంత్రించుకోవాలని భీముడికి కుబేరుడు చెబుతాడు’ అని సామవేదం చెప్పారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, సౌగంధికా పుష్పాలను తీసుకురావడానికి వెళ్లిన భీముడి ద్వారా మనకు హనుమద్దర్శనం జరిగిందని, ఇక రామ దర్శనమే తరువాయని అన్నారు. -
రాజమండ్రి సిటీలో రక్తదానం
ఇచ్చిన మాటకు కట్టుబడే నిజమైన నాయకుడు వైఎస్ జగన్ అని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి సిటీలో నాయకులు, కార్యకర్తల కోలాహలం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ధన్వంతరి బ్లడ్ బ్యాంక్లో యువజన విభాగం సిటీ అధ్యక్షుడు బిల్డర్ చిన్నా ఆధ్వర్యాన సుమారు 100 మంది రక్తదానం చేసి, జననేత పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. ఇందులో భరత్రామ్ స్వయంగా రక్తదానం చేశారు. కోటగుమ్మం వద్ద ఉమ, మిత్ర బృందం ఆధ్వర్యాన కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మోరంపూడి జంక్షన్ వద్ద 40 అడుగుల జననేత ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసిన భరత్.. అనంతరం కేక్ కట్ చేసి, పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కవులు అభ్యుదయ రచనలు చేయాలి
● శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ● ఘనంగా జాతీయ శతాధిక కవి సమ్మేళనం అమలాపురం టౌన్: సామాజిక చైతన్యంతో, అభ్యుదయ భావాలతో కవిత్వం రాయాలని శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కవులకు పిలుపునిచ్చారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ. కోనసీమ రచయితల సంఘం, జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం వడ్డిగూడెంలోని వేమన కోనసీమ రెడ్డి జన సమైక్య కమ్యూనిటీ హాలులో ఆదివారం జరిగిన 160వ జాతీయ శతాధిక కవి సమ్మేళనానికి డాక్టర్ ప్రతాప్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. కవి సమ్మేళనంతో పాటు, పాటల స్వర వేదిక కూడా రస రమ్యంగా జరిగింది. రాజమహేంద్రవరం కమాండర్ ఏపీ ఎస్పీఎఫ్ ఎస్పీ డాక్టర్ కొండా నరసింహారావు దంతపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి శంఖారావంతో సమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్తిమండ సేవలను నరసింహారావు కొనియాడారు. మరో ముఖ్య అతిథి నిడదవోలు శ్రీశ్రీ కళా వేదిక ప్రతినిధి అరవెల్లి నరేంద్ర 160 సమ్మేళనాలు నిర్వహించడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 126 మంది కవులు హాజరై తమ కవితా గానాలను వినిపించారు. అలాగే 30 మంది వివిధ కళలకు చెందిన కళాకారులు పాల్గొని తమ కళలను ప్రదర్శించారు. తొలుత మహా కవులు శ్రీశ్రీ, బోయి భీమన్న, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదిక జిల్లా అధ్యక్షుడు, కవి నల్లా నరసింహమూర్తి రచించిన నడక విజయం పుస్తకాన్ని డాక్టర్ నరసింహరావు దంపతులు ఆవిష్కరించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన కవి డాక్టర్ ఆర్.మణి భూషణం రచించిన చందనోత్సవం ఏఐ గీతాన్ని నల్లా నరసింహమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవులను వేదిక తరఫున సత్కరించారు. అలాగే డాక్టర్ ప్రతాప్, వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.పార్థసారధి, ఎస్పీ డాక్టర్ నరసింహరావు దంపతులను కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, వేదిక జాతీయ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ ఘనంగా సత్కరించారు. సభకు వ్యాఖ్యాతగా బాలార్జున సత్యనారాయణ వ్యవహరించారు. ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ సబ్బెళ్ల మహాలక్ష్మి సమ్మేళనం వివరాలను నివేదించారు. -
రజకులను ఎస్సీల్లో చేర్చాలి
● రజకులకు రక్షణ చట్టం చేయాలి ● పలువురు వక్తలు డిమాండ్ ● ముమ్మిడివరంలో రజక ఆకాంక్ష సభముమ్మిడివరం: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మాదిరిగా రాష్ట్రంలో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, వారి రక్షణకు చట్టం చేయాలని జిల్లా రజకులు ఆకాంక్ష సభ–4 సమావేశం తీర్మానించింది. ముమ్మిడివరం డీఎల్ఎఫ్ సంక్షన్ హాలులో ఆదివారం ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సి.సావిత్రి అధ్యక్షతన ఈ సభ నిర్వహించారు. సభలో వక్తలు మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన రజకులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జీవో 27 ప్రకారం ధోబి పోస్టులను రజకుల తోనే భర్తీ చేయాలని తీర్మానించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్మే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ రజకుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామన్నారు. మరో ముఖ్య అతిథి శాసన మండలి ఉప సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలోని మురికిని వదల గొట్టడానికి రజకులంతా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత ముమ్మిడివరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన రజకులు భారీ ర్యాలీ చేశారు. -
జాతీయ స్థాయి కరాటే పోటీలు ప్రారంభం
సామర్లకోట: స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని డీఎన్ఆర్ కల్యాణ మండపంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక కరాటే కోచ్ డి.శంకర్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ పోటీల్లో 10 రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ మొదటి వైస్ గవర్నర్ చిట్టినీడి శ్రీనివాసరావు, కరాటే ఇండియా చీఫ్ మల్లికార్జునగౌడ్ ఈ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ ఈదల ఈశ్వర కుమార్, జిల్లా చైర్మన్ చిత్తూలూరి వీర్రాజు, క్లబ్ అధ్యక్షుడు డాక్టరు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుబు బాబీ, కోశాధికారి ఏలేటి రమేష్ పాల్గొన్నారు. -
ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతం
ప్రకృతిలో దాగి ఉన్న అద్భుతమైన అందం గణితం. విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ శాస్త్రం ప్రేరేపిస్తుంది. గణితం ప్రత్యేక భాషగా పిల్లలకు సరైన ఉదాహరణలతో పరిచయం చేయాలి. నిత్య జీవిత సమస్యలకు గణితాన్ని అన్వయించి బోధించాలి. పజిల్స్, అబాకస్, బోర్డులు, పూసల చట్రం వంటి బోధన విధానంతో గణితంపై భయాన్ని పోగొట్టి ఆసక్తి కలిగేలా చేయాలి. – ఎం.నాగ సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, గణిత ఫోరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
చోరీలు, చైన్ స్నాచింగ్లలో ఆరితేరారు
● పోలీసులకు చిక్కిన ముగ్గురు నిందితులు ● అంతర్రాష్ట్ర స్థాయిలో కేసులు నమోదు ● 4 కేసుల్లో రూ.35.5 లక్షల సొత్తు రికవరీఅమలాపురం టౌన్: అమలాపురం టౌన్, రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధుల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో నిందితులు ముగ్గురు పోలీసులకు చిక్కారు. అమలాపురం టౌన్లో చోరీకి పాల్పడిన దొంగ 70 కేసుల్లో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర నేరగాడు. కొత్తపేటలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ మరో అంతర్రాష్ట దొంగ, రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ల పరిధుల్లో పలు చైన్ స్నాచింగ్లకు పాల్పడిన నిందితుడు పోలీసులకు వేర్వేరుగా దొరికిపోయారు. వీరి నుంచి ఆ నాలుగు పోలీస్ స్టేసన్ల సీఐలు, ఎస్సైలు మొత్తం రూ.35.5 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఎస్పీ రాహుల్ మీనా స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ‘అమలాపురం’ అంతర్రాష్ట దొంగ 70 చోరీలు: అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన పతివాడ లోవరాజు (31) అంతర్రాష్ట దొంగ. పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు చోరీలు, పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, తెలంగాణ రాష్ట్రం హయత్నగర్లో ఒక చోరీకి పాల్పడ్డాడు. అతడి నుంచి 185 గ్రాముల బంగారం, 1750 గ్రాముల వెండి, ఒక బైక్ను మొత్తం రూ. 25 లక్షల సొత్తును రికవరీ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 70 చోరీ కేసులు అతనిపై ఉన్నాయి. తాళాలు వేసి ఇళ్లను తలుపులను ఐరెన్ రాడ్తో బద్దలు కొట్టడంలో అతడు దిట్ట. చైన్ స్నాచర్ నుంచి రూ.6 లక్షల రికవరీ: రావులపాలెం, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ల పరిధుల్లో రోడ్లపై నడిచి వెళుతున్న మహిళల మెడల్లో బంగారు నగలను పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం సీతలం కొండేపాడుకు చెందిన చైన్ స్నాచర్ కవురు మూర్తి (24)ని అరెస్ట్ చేశారు. రావులపాలెం, ఆత్రేయపురం పోలీసులు ఇతడిని వేర్వురుగా అరెస్ట్లు చూపారు. అతడి నుంచి 49.800 గ్రాముల బంగారు నగలు, ఒక బైక్ను మొత్తం రూ. 6 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. కొత్తపేటలో మరొకరి అరెస్టు కొత్తపేట బ్యాంక్ కాలనీలో ఓ ఇంట్లో పట్టపగలు చోరీకి పాల్పడ్డ అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన గంటి గౌతమ్ అంతర్రాష్ట్ర దొంగ. అతడు కూడా ఇంటి తాళాలను పగలగొట్టడంతో ఆరితేరాడు. అతడి నుంచి 39 గ్రాముల బంగారంతో మొత్తం రూ4.5 లక్షల సొత్తును రికవరీ చేశారు. పోలీసులకు అభినందన, రివార్డులు ఈ చోరీ కేసుల్లో దొంగలను చాకచక్యంగా పట్టుకుని రూ.35 లక్షలకు పైగా సొత్తు రికవరీ చేసిన పోలీసు అధికారులను ఎస్పీ మీనా అభినందించారు. అమలాపురం, కొత్తపేట డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, అమలాపురం టౌన్, రావులపాలెం రూరల్, క్రైమ్ సీఐలు పి.వీరబాబు, విద్యాసాగర్, ఎం.గజేంద్రకుమార్, కొత్తపేట, ఆత్రేయపురం ఎస్సైలు సురేంద్ర, రాము, క్రైమ్ ఏఎస్ఐ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
నువ్వే కావాలి.. మళ్లీ రావాలి
సాక్షి, రాజమహేంద్రవరం: ఆ ఐదు వసంతాలు.. రాష్ట్ర సంక్షేమ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి.. పల్లెపల్లెనా ప్రగతి గీతికను ఆలపించాయి.. ‘అన్నా.. నాకీ కష్టం వచ్చింద’ని చెప్పిందే తడవు.. గుండె కరగి.. కళ్లు చెమ్మగిల్లి.. ఆపన్నులకు అండగా నిలిచిన కాలమది. అది సంక్షేమ సారథి.. అభివృద్ధి వారధిగా నిలిచిన జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. పరిపాలనకు మానవత్వాన్ని జోడించిన తరుణమది. 2019కి ముందు.. ‘పచ్చ’పాలకుల తుచ్ఛ విధానాలతో కష్టాల కొలిమిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ను అడుగడుగునా స్పృశిస్తూ.. అన్ని వర్గాల ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ.. సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. నవరత్న పథకాలు అమలు చేశారు. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారు. ఫలితంగా నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. పేదలు, మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కొత్త పరిశ్రమలకు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) చేయూతనిచ్చారు. ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు లబ్ధి చేకూర్చారు. ఆ సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేక్ల కటింగ్తో పాటు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మళ్లీ ఆ జననేత ముఖ్యమంత్రి కావాలని, ప్రస్తుత పాలకుల హయాంలో ఎదుర్కొంటున్న కష్టాల నుంచి తమను గట్టెక్కించాలని ఆకాంక్షిస్తున్నారు.ఇదీ సంక్షేమం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ‘నవరత్నాలు’ పేరిట తొలుత అమ్మ ఒడి, విద్యాదీవెన, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, చేయూత, రుణమాఫీ, పింఛను కానుక తదితర 9 రకాల పథకాలను జగన్ తీసుకొచ్చారు. వాగ్దానం చేసినవే కాకుండా మరిన్ని పథకాలు అమలు చేశారు. తన పాలనా కాలంలో మొత్తం 33 పథకాల ద్వారా జిల్లా ప్రజలకు రూ.25,436 కోట్ల మేర సంక్షేమాన్ని అందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎక్కడా పైసా లంచం ఇవ్వనవసరం లేకుండానే.. పార్టీ, వర్గం, కులం అనే భేదం చూడకుండా.. కేవలం అర్హతే ప్రామాణికంగా.. వలంటీర్ల ద్వారా గడప వద్దనే సంక్షేమాన్ని అందించారు. వివిధ ధ్రువీకరణ పత్రాల జారీని సైతం సచివాలయాల ద్వారా సులభతరం చేశారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన సేవలు అందించారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆపద్బాంధవిగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.5 లక్షల నుంచి ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. ఇతర రాష్ట్రాల్లో సైతం చికిత్స పొందే వెసులుబాటు కల్పించారు. ప్రగతి గురుతులు పల్లెల ప్రగతికి ఎనలేని తోడ్పాటునందించారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు, జగనన్న కాలనీలు, సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలకు శాశ్వత భవనాలు రూపుదిద్దుకున్నాయి. మన బడి నాడు – నేడు పథకం ద్వారా 1,069 పాఠశాలల్లో భవనాల నిర్మాణానికి, ఇతర వసతుల కల్పనకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తొలిసారి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలు, జగనన్న విద్యా కానుక కింద నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, షూస్, సాక్స్, బెల్టులు, మంచి బ్యాగ్ల వంటి వస్తువులు అందజేశారు.68,518 మంది పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.1,233.34 కోట్లు ఖర్చు చేశారు. 3,079 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు, 279 రైతు భరోసా కేంద్రాలకు రూ.52.31 కోట్లు, 208 హెల్త్ క్లినిక్లకు రూ.38.17 కోట్లు వెచ్చించారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన 1,443 పనులకు రూ.52.89 కోట్లు ఖర్చు చేశారు. 15,369 చిన్న పరిశ్రమలకు రూ.670.85 కోట్ల మేర రాయితీలు అందజేశారు.గత టీడీపీ ప్రభుత్వంలో అధ్వానం 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు కావాలంటే వారు టీడీపీ వారో లేక ఆ పార్టీ సానుభూతిపరులో అయి ఉండాలి. టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యుల సిఫారసు తప్పనిసరి. ఆపై పథకానికి ఇంత అని రేటు నిర్ణయించి మరీ వసూలు చేసేవారు. ఆ తరువాత కూడా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి. వారు చెప్పిన మొత్తం ముట్టజెప్పకపోతే పథకం అందేది కాదు. రూపురేఖలు మారబడిదేవరపల్లి: దాదాపు 56 ఏళ్ల కిందట దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పాఠశాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకున్న వారే లేరు. ప్రహరీ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. పాడుబడిన తరగతి గదులు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ పాఠశాల రూపురేఖలు మారాయి. దీని అభివృద్ధికి 2022–23లో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో శిథిల భవనాల మరమ్మతులు, ప్రాంగణం లెవెలింగ్, ప్రహరీ నిర్మాణం, ప్రధాన ద్వారం ఏర్పాటు, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల వంటివి ఏర్పాటు చేశారు. అంతకు ముందు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒకే వాష్ రూమ్ ఉండేది. అటువంటిది నాడు–నేడు కార్యక్రమంలో బాలికలకు 7, బాలురకు 6 చొప్పున వాష్ రూములు టైల్స్తో నిర్మించి, రన్నింగ్ వాటర్ సౌకర్యం కలి్పంచారు. అప్పటి వరకూ యూపీ స్కూల్గా ఉండగా.. దీనిని జెడ్పీ హైసూ్కల్గా అప్గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలలో పదో తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి. పాఠశాల బాగుంది నాడు–నేడు కార్యక్రమానికి ముందు పాఠశాల అధ్వానంగా ఉండేది. శిథిలమై, పెచ్చులూడిన భవనాలతో, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు పాఠశాల ఎంతో బాగుంది. ఆటలకు అనువుగా ఉంది. – మల్లుల ఈశ్వర్ సత్య, 9వ తరగతి, జెడ్పీ హైసూ్కల్, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం -
ఐహెచ్ఆర్సీ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ థామస్
నియామక పత్రం అందచేసిన జాతీయ అధ్యక్షుడు సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్(ఐహెచ్ఆర్సీ) భారతదేశ ఉపాధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ అరుల్ థామస్ సెల్వనాథన్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కుందవరం రాజానందన్ విజ్ఞాన్ ఢిల్లీలో అందచేశారు. కొన్నేళ్లుగా మానవ హక్కులకు సంబంధించి డాక్టర్ థామస్ విశేషమైన సేవలను అందిస్తున్నారు. ఐహెచ్ఆర్సీ తరఫున ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇందుకు గాను ఇండియన్ చాప్టర్ (దేశ) ఉపాధ్యక్షుడిగా డాక్టర్ థామస్ను నియమించారు. ఈ పదవి తనకు మరింత బాధ్యతను పెంచిందని డాక్టర్ థామస్ పేర్కొన్నారు. -
థ్యాంక్యూ జగనన్నా..
మాది నిరుపేద కుటుంబం. మా తల్లిదండ్రులు, చెల్లి, నాన్నమ్మ కలిసుంటాం. మా తండ్రి దివ్యాంగుడైనప్పటికీ నిత్యం సైకిల్పై అన్ని ఊళ్లూ తిరుగుతూ, ఆకుకూరలు అమ్మి కుటుంబాన్ని పోషించేవారు. మా అమ్మ కూలి పనులు చేస్తూ కుటుంబ భారాన్ని పంచుకునేది. ఐదేళ్ల క్రితం నాన్న వీర్రాజుకు పక్షవాతం రావడంతో మా కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చదువు మధ్యలోనే ఆపేస్తానేమో అనుకున్న సమయంలో 2019లో జగనన్న ప్రభుత్వం ఏటా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో చదువు సాగించగలిగాను. విద్యా దీవెన రూ.30 వేలు, వసతి దీవెన రూ.15 వేలు రావడంతో 2023లో బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశాను. అనంతరం, కొవ్వూరులో జరిగిన సమావేశంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి సమావేశంలో మాట్లాడే అవకాశం నాకు వచ్చింది. జగనన్న నా కుటుంబ పరిస్థితి విని చలించిపోయి, ఇంటి స్థలం కేటాయించారు. డిగ్రీ పూర్తయిన తరువాత ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రాజమహేంద్రవరంలోని రాష్ట్ర జీఎస్టీ కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చారు. జనవరిలో చేరాను. నెలకు రూ.16,400 జీతం వస్తుంది. ఇంటి వద్దే ఉంటున్న మా నాన్నకు రూ.3 వేల పింఛన్ వచ్చేది. ప్రస్తుతం రూ.6 వేలు వస్తోంది. మా అమ్మ సంధ్యకు మాటలు రావు. ఆమెకు కూడా రూ.3 వేలు పింఛన్ వచ్చింది. నాన్నమ్మకు రూ.4 వేల వృద్ధాప్య పింఛన్ వస్తుంది. ఇప్పటి వరకూ మా కుటుంబానికి పింఛన్ రూపంలో రూ.4 లక్షల వరకూ లబ్ధి చేకూరింది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.4 లక్షల వరకూ ఉంటుంది. నాడు జగనన్న ప్రభుత్వం పెద్ద దిక్కుగా మారడంతో మా జీవితాలు పూర్తిగా మారాయి. మా ఆర్ధిక పరిస్థితి కుదుటబడింది. సాధారణ పేద కుటుంబమైన మాకు ఇంత పెద్ద మొత్తంలో లబ్ధి జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. థాంక్యూ జగనన్నా. – తిగిరిపల్లి దివ్య, పెద్దేవం, తాళ్లపూడి మండలం – తాళ్లపూడి -
వైఎస్సార్ సీపీ హయాంలో గ్రామాభివృద్ధి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి కృషి చేశాం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాం. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా గ్రామానికి రూ.51.07 కోట్ల లబ్ధి చేకూర్చాం. రూ.1.30 కోట్లతో పాఠశాలలు అభివృద్ధి చేశాం. ప్రస్తుతం పథకాలేవీ అందకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – మట్టా వెంకట్రావు, సర్పంచ్, ఊనగట్ల రూ.2.20 కోట్లతో పేదలకు ఇంటి స్థలాలు జగన్ ప్రభుత్వం హయంలో మా గ్రామంలో రూ.80 లక్షలతో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్ భవన నిర్మాణాలు చేపట్టాం. రూ.2.20 కోట్లు వెచ్చించి పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాం. 204 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికాం. రూ.1.03 కోట్లతో ఊనగట్ల – అమ్ముగుంట రోడ్డు పనులు నిర్వహించాం. రూ.50 లక్షలతో ఊనగట్ల – కలవలపల్లి రోడ్డు నిర్మాణం చేపట్టాం. – ఆత్కూరి గోపీచంద్, ఎంపీటీసీ, ఊనగట్ల -
రూపురేఖలు మారబడి
దేవరపల్లి: దాదాపు 56 ఏళ్ల కిందట దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పాఠశాలను ఎన్నో ఏళ్లుగా పట్టించుకున్న వారే లేరు. ప్రహరీ లేక అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఉండేది. పాడుబడిన తరగతి గదులు, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ ఉండేవారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఈ పాఠశాల రూపురేఖలు మారాయి. దీని అభివృద్ధికి 2022–23లో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.19 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో శిథిల భవనాల మరమ్మతులు, ప్రాంగణం లెవెలింగ్, ప్రహరీ నిర్మాణం, ప్రధాన ద్వారం ఏర్పాటు, విద్యార్థులకు అవసరమైన బెంచీలు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డుల వంటివి ఏర్పాటు చేశారు. అంతకు ముందు పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒకే వాష్ రూమ్ ఉండేది. అటువంటిది నాడు–నేడు కార్యక్రమంలో బాలికలకు 7, బాలురకు 6 చొప్పున వాష్ రూములు టైల్స్తో నిర్మించి, రన్నింగ్ వాటర్ సౌకర్యం కల్పించారు. అప్పటి వరకూ యూపీ స్కూల్గా ఉండగా.. దీనిని జెడ్పీ హైస్కూల్గా అప్గ్రేడ్ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఈ పాఠశాలలో పదో తరగతి అడ్మిషన్లు జరగనున్నాయి. పాఠశాల బాగుంది నాడు–నేడు కార్యక్రమానికి ముందు పాఠశాల అధ్వానంగా ఉండేది. శిథిలమై, పెచ్చులూడిన భవనాలతో, మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు పాఠశాల ఎంతో బాగుంది. ఆటలకు అనువుగా ఉంది. – మల్లుల ఈశ్వర్ సత్య, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, కృష్ణంపాలెం, దేవరపల్లి మండలం -
వీసీని కులం పేరుతో దూషిస్తారా?
● 8వ తరగతి పాస్ కాని మీకు ఆ స్థాయి ఉందా? ● వర్సిటీలో రాజకీయ కార్యకలాపాలేంటి? ● ఎమ్మెల్యే బత్తుల దంపతులపై వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజా ఫైర్ సాక్షి, రాజమహేంద్రవరం: ‘కనీసం ఎనిమిదో తరగతి కూడా పాస్ కాని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన భార్య అత్యున్నత విద్యావంతులైన నన్నయ వర్సిటీ వీసీ కులాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణం. ప్రతిష్టాత్మకమైన వర్సిటీలో అనుచితంగా వ్యవహరించడం సమంజసం కాదు.’ అని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హితవు పలికారు. రాజమహేంద్రవరం ప్రకాష్నగర్ కార్తికేయ అపార్ట్మెంట్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్సిటీలో రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు, రంగులు ప్రదర్శించకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోందని దుయ్యబట్టారు. అర్ధరాత్రి యూనివర్సిటీలోకి చొరబడి నాయకుల ఫ్లెక్సీలు, గ్లాస్, సైకిల్ గుర్తులు ఉన్న బ్యానర్లు కట్టడం ఏంటని ప్రశ్నించారు. అలా కట్టడం తప్పని చెప్పిన పాపానికి ఎమ్మెల్యే, ఆయన సతీమణి వర్సిటీ వీసీపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. వీసీని వివిధ రకాలుగా దూషించారన్నారు. ఎమ్మెల్యే సతీమణి చర్యలను అడ్డుకున్న వీసీ అటెండర్ చరణ్పై దారుణంగా దాడి చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుల సంకల్పంతోనే విశ్వవిద్యాలయం ఏర్పాటైందని గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వ పునాదిరాళ్లు, శిలాఫలకాల ఆనవాళ్లను కనిపించనీయకుండా అధికార పార్టీ వ్యక్తులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా తాము ఎలాంటి ఆందోళన చేయకుండా వినతి పత్రం ఇచ్చామన్నారు. ఏ హోదాలో ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి వర్సిటీకి వెళ్లి వీసీని ప్రశ్నించారో స్పష్టం చేయాలన్నారు. ఎమ్మెల్యే ప్రచార పిచ్చితోనే గొడవ జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యారంగం భ్రష్టు పట్టిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీసీలను భయపెట్టి, ఒత్తిడి చేయించి మరీ రాజీనామాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే అభివృద్ధి విశ్వవిద్యాలయంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగినదేనిని పేర్కొన్నారు. కూటమి పాలన వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకూ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు. విద్యారంగాన్ని బలోపేతం చేయాలని మాత్రమే ఆలోచించామని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ఘోరాలు దారుణాలు చూస్తున్నామని, నాయకుడు ఏ రకంగా ముందుకు వెళ్తాడో అదే మార్గాన్ని వారి అనుచరులు కూడా అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నన్నయ యూనివర్సిటీలో జరిగిన గొడవ చూస్తే అర్థమవుతుందని వెల్లడించారు. -
కనిపించని సంక్షేమం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, పింఛన్లు మాత్రం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ఒక్క సంక్షేమ పథకమూ సక్రమంగా అమలు చేయలేదు. అన్నదాత సుఖీభవను అర్హులైన రైతులందరికీ పూర్తి స్థాయిలో అందించలేదు. గ్రామంలో కొత్త ఫించన్లు నేటికి మంజూరు చేయలేదు. పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు కూడా ఇంతవరకూ మంజూరు చేయలేదు. జగనన్న కాలనీల్లో అంతర్గత రహదారులు, డ్రైన్లు నిర్మించకపోవడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. – మెరిపో సూర్యచంద్రం, ఊనగట్ల, చాగల్లు మండలం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
నవరత్నాలు నిలబెట్టాయ్..
నిడదవోలు మండలం కంసాలిపాలేనికి చెందిన సూరవరపు నాగలక్ష్మిది పేద రైతు కుటుంబం. ఎర్రకాలువ ఉధృతమైతే పంట నీట మునిగేది. దీంతో, పంట చేతికి అందక, అప్పుల బాధ భరించలేక భర్త నాగేశ్వరరావు 2009లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషించుకోవడం నాగలక్ష్మికి కష్టంగా మారింది. ఇంటి వద్దే చిన్న కిరాణా షాపు పెట్టుకుని వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. గత ప్రభుత్వాలు చాలా కాలం వితంతు పింఛన్ కూడా మంజూరు చేయలేదు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చి, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆ కుటుంబ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. భర్త చనిపోయి కష్టాలు వెక్కిరించిన ఆ కుటుంబాన్ని నవరత్నాల పథకాలు నిలబెట్టాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో నాగలక్ష్మి కుటుంబానికి వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఏకంగా రూ.3,92,500 మేర లబ్ధి చేకూరింది. 2021లో వచ్చిన ఎర్ర కాలువ వరదకు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.34 వేలు, ఇన్పుట్ సబ్సిడీ రూ.12 వేలు, రైతు భరోసా ద్వారా ఐదేళ్లలో రూ.13,500 చొప్పున రూ.67,500 ఇచ్చారు. వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.72,048 డ్వాక్రా రుణమాఫీ జరిగింది. నాగలక్ష్మి డ్వాక్రా రుణం తీసుకుని పెద్ద కుమార్తె పెళ్లి చేసింది. మరో కుమార్తె సత్య శ్రావణికి ఏటా అమ్మ ఒడితో పాటు ట్యాబ్ అందజేశారు. కొడుకు సాయికృష్ణ పీజీ చదవడంతో జగనన్న విద్యాదీవెన అందుకున్నారు. – నిడదవోలు రూరల్ -
‘భారత్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కలి ప్రభావం వలన మనలో విద్వేషాలు పెరుగుతున్నాయి. నలదమయంతుల చరిత్రను వినడం వలన కలి ప్రభావం నశించి, విద్వేషాలు అంతరించిపోతాయి. భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారతంపై 24వ రోజు ప్రవచనాన్ని ఆయన శనివారం కొనసాగించారు. ‘నాకన్నా భాగ్యహీనుడెవరైనా ఉన్నారా అని ధర్మరాజు అడిగినప్పుడు బృహదశ్వుడు అనే మహర్షి నలదమయంతుల చరిత్రను వివరిస్తాడు. నిన్ను నీ తమ్ములు సేవిస్తూనే ఉన్నారు. భార్య చెంతనే ఉంది. అన్నపానాలకు లోటు లేకుండా సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర ఉంది. మహర్షులందరూ నీ చెంతకు వస్తూనే ఉన్నారు. ఇక నీ కష్టం ఏపాటిదని ధర్మరాజుతో మహర్షి సాంత్వన వచనాలు పలుకుతాడు. కష్టాలకు మనం కుంగిపోరాదు. ధర్మ మార్గం తప్పరాదు. ఇదే మనకు నలదమయంతుల చరిత్ర అందించే నీతి’ అని సామవేదం వివరించారు. కర్కోటకుడు అనే సర్పరాజు, దమయంతి, నలుడు, రాజర్షి అయిన ఋతుపర్ణుడు అనే వారిని కీర్తిస్తే, కలి దోషం మనల్ని బాధించదని అన్నారు. ‘దివ్య వృత్తాంతాలను తరచూ వినాలని, సాధనా పథంలో శ్రవణ భాగ్యాన్ని మించిన మార్గం లేదని చెప్పారు. ‘బృహదశ్వుడు అస్త్రవిద్యను ధర్మరాజుకు బోధించాడు. ఆ విద్యతో ధర్మరాజు.. శకునితో ద్యూతమాడి తన రాజ్యాన్ని తిరిగి పొందగలడు. కానీ ధర్మరాజు ఆ పని చేయలేదు. అలా చేస్తే యుద్ధం రాదు. రాకపోతే కృష్ణుని అవతార లక్ష్యం నెరవేరదు’ అని చెప్పారు. వనవాస సమయంలో సైతం పాండవులు నిత్యనైమిత్తికాలను విస్మరించలేదని, పితృ కార్యాలు మానలేదని సామవేదం అన్నారు. రేపు జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు డీఈఓ కంది వాసుదేవరావు తెలిపారు. గురుకులంలో కమిటీ సభ్యులతో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ముందుగా ఇచ్చిన ఏడు అంశాల నుంచి మండలంలో ప్రథమ స్థానం పొందిన ప్రదర్శనను మాత్రమే జిల్లా స్థాయికి తీసుకుని రావాలని సూచించారు. విద్యార్థి వ్యక్తిగత ప్రదర్శనలో మొదటి, ద్వితీయ స్థానం ఇద్దరినీ జిల్లా స్థాయికి పంపాలన్నారు. ఉపాధ్యాయ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ స్థానం పొందిన వారు కూడా హాజరవ్వాలన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సత్యసాయి గురుకులంలో ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ చేయించి, తమకు కేటాయించిన ప్రదేశంలో ఉంచి వెళ్లాలన్నారు. మండల స్థాయి విజేతలందరూ తప్పకుండా జిల్లా స్థాయి ప్రదర్శనకు హాజరు కావాలన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి గ్రూపు విభాగంలో 7, విద్యార్థి వ్యక్తిగత విభాగం నుంచి 2, ఉపాధ్యాయ వ్యక్తిగత విభాగం నుంచి 2 చొప్పున ప్రాజెక్టులను ఎంపిక చేస్తామని వాసుదేవరావు తెలిపారు.నేడు పల్స్పోలియో రాజమహేంద్రవరం రూరల్: జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్పోలియో చుక్కల మందు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఐదేళ్ల లోపు చిన్నారులు 1,89,550 మంది ఉన్నారు. వీరిలో 3,274 మందికి వారు నివసించే ప్రాంతం, అనారోగ్య పరిస్థితులను బట్టి పోలియో సోకే అవకాశాలున్నాయని గుర్తించారు. మొత్తం చిన్నారులకు వ్యాక్సిన్ వేసేందుకు 1,084 పల్స్ పోలియో కేంద్రాలు, 62 ట్రాన్సిట్ టీములు, 62 మొబైల్ టీములు ఏర్పాటు చేశారు. పారా మెడికల్ సిబ్బందితో పాటు అంగన్వాడీ, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సహకారంతో వంద శాతం పిల్లలకు చుక్కలు మందు వేయనున్నారు. గోదావరి లంకలు, ఇటుక బట్టీలు, ఊరికి దూరంగా కాలువ గట్లు, వలస కార్మికులు, సంచార జాతుల వంటి వారు ఉంటున్న 472 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. వీరితో పాటు ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయం తదితర ప్రాంతాల్లో 62 మొబైల్ టీమ్ల ద్వారా ప్రతి చిన్నారికి పల్స్పోలియో వ్యాక్సిన్ వేస్తారు. దీనికోసం అన్ని శాఖలతో కలిపి 4,782 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాకు 2,31,250 డోసుల వ్యాక్సిన్ వచ్చింది. ఆదివారం పోలియో బూత్ల ద్వారా వ్యాక్సిన్ వేసిన చిన్నారుల గోళ్లపై సిబ్బంది సిరా గుర్తు పెడతారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ తిరుగుతూ గుర్తించి, వ్యాక్సిన్ వేస్తారు. -
ఊరు మారింది
చాగల్లు: మండలంలోని ఊనగట్ల గ్రామం మూడు గ్రామాలకు వ్యాపార కేంద్రం. జనాభా 7,500. ఓటర్లు 5,300 మంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఈ గ్రామం అధ్వానంగా, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. శిథిలావస్థలో ఉన్న పంచాయతీ భవనం, జెడ్పీ స్కూల్లో తరగతి గదుల కొరత, ఆరోగ్య ఉపకేంద్రం లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వైద్యానికి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊనగట్ల గ్రామం పూర్తిగా కొత్త రూపు సంతరించుకుంది. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు చేరాయి. ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు సమకూర్చారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకే చేర్చారు. నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చేపట్టారు. ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించారు. 33 పథకాల ద్వారా ఏకంగా రూ.51.07 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ప్రతి ఏటా ఏదో ఒక పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేవారు. దీంతో, ప్రజల వద్ద పుష్కలంగా డబ్బులుండేవి. వేడినీళ్లకు చన్నీళ్లు తోడన్నట్టు.. జనం కష్టపడి సంపాదించుకున్న దానికి ప్రభుత్వం అందించే సొమ్ము తోడయ్యేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
రాజమండ్రిలో వినూత్నంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. గోదావరి మధ్య బ్రిడ్జి లంకలో 40 వేల అడుగుల వైఎస్ జగన్ భారీ ఫ్లెక్స్ను ఆ పార్టీ కార్యకర్త కంటే వినయ్ తేజ ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా, వినయ్ తేజ వైఎస్ జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారుగోదావరిలో పడవలను అలకరించిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. సంబరాలు జరిపాయి. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో కక్ కట్ చేసి ఆ పార్టీ నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కుంచనపల్లిలో..తాడేపల్లి: కుంచనపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ను కట్ చేసిన పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు హాజరయ్యారు. జగన్ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
అతి వేగానికి ముగ్గురు బలి
● ఎదురెదురుగా బైక్లు ఢీకొని ఇద్దరు.. ● మంచు వల్ల రోడ్డు కనపడక ఒకరు మృతి ● మరో ఇద్దరికి తీవ్రగాయాలు తాళ్లరేవు/పి.గన్నవరం: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో అతివేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. 216 జాతీయ రహదారిపై కోరంగి వంతెన సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే పి.గన్నవరం మండలం కొత్త అక్విడెక్టు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేటకు చెందిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామానికి చెందిన కొండ్రు వినయ్కుమార్ ద్విచక్ర వాహనంపై కాకినాడ వైపు నుంచి యానాం వైపు వెళ్తున్నాడు. ధవళేశ్వరం వేమగిరికి చెందిన కుందు సతీష్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒకే స్కూటీపై యానాం వైపు నుంచి కాకినాడ వెళ్తున్న క్రమంలో ఆ రెండు వాహనాలూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వినయ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, కుందు సతీష్ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ధవళేశ్వరం సున్నంబట్టీ వీధికి చెందిన కొమర లక్ష్మీ నీలేకర్, కాకినాడ జగన్నాథపురం గోళీలపేటకు చెందిన సూరాడ అనిల్కుమార్లకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ సత్యనారాయణ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీలో ఉంచారు. అలాగే పి.గన్నవరం కొత్త అక్విడెక్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు కొత్తపేటకు చెందిన ఆరి సుమంత్ కుమార్ (25) గ్యాస్ కంపెనీ ఏజన్సీలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి అతడు మోటారు సైకిల్పై తాటిపాకలోని సోదరి ఇంటి వద్ద జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరై శుక్రవారం ఉదయం గ్యాస్ కంపెనీలో విధులకు వెళ్లాల్సిన నేపథ్యంలో తెల్లవారు జామున అక్కడి నుంచి కొత్తపేటకు మోటారు సైకిలుపై బయలుదేరాడు. కొత్త అక్విడెక్టు వద్దకు వచ్చేసరికి అతడి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొని పడిపోయాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మంచు వల్ల రహదారి కనపడక ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. సుమంత్ మృతదేహానికి కొత్తపేట ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆర్ట్స్ కళాశాల కామర్స్ బ్లాక్ ప్రారంభం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ఆ కళాశాలలో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ నిర్మాణానికి రూ.42 లక్షలు విరాళంగా ఇచ్చారు. శుక్రవారం ఐటీ, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఆర్ట్స్ కాలేజీలోని స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బ్లాక్ భవనాన్ని తిరుమలరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. లోకేష్ మాట్లాడుతూ మనం చదివిన విద్యా సంస్థలకు తోడ్పడడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ విషయంలో తిరుమల విద్యాసంస్థల అధినేత తిరుమలరావు ఎప్పుడూ ముందుంటారన్నారు. ఈ సందర్భంగా తిరుమలరావును సన్మానించి జ్ఞాపికను బహూకరించారు. తిరుమలరావు కుమార్తె, విద్యా సంస్థల వైస్ చైర్మన్ డా.శ్రీరష్మిని మంత్రి లోకేష్ అభినందించారు. కార్యక్రమంలో గవర్నమెంటు కాలేజీ (అటానమస్) ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామచంద్రరావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, కళాశాల విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేసీ వై.మేఘా స్వరూప్, ఆర్టీఐహెచ్ నోడల్ ఆఫీసర్ సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
సొమ్ము వారిది.. సోకు వీరిది
● ఆర్ట్స్ కళాశాలలో దాతల సహకారంతో పలు భవనాల నిర్మాణం ● వాటిని ప్రారంభించిన మంత్రి లోకేష్ ● చంద్రబాబు హయాంలో విద్యారంగం పరుగులు పెడుతోందని గొప్పలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అన్న చందంగా రాజమహేంద్రవరంలో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగింది. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో దాతల సహకారంతో నిర్మించిన భవనాలను ప్రారంభించిన ఆయన.. చంద్రబాబు హయాంలో విద్యారంగం పరుగులు పెడుతోందని, కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని గొప్పలు చెప్పుకోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏం జరిగిందంటే.. రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) ఆధ్వర్యాన రూ.32 లక్షలతో కళాశాల మెయిన్ అవుట్ గేట్ ఎలివేషన్ నిర్మించారు. పూర్వ విద్యార్థి, తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు, రూసా సహకారంతో రూ.70 లక్షలతో ఇండిపెండెంట్ కామర్స్ బ్లాక్ నిర్మించారు. అలాగే, పూర్వ విద్యార్థి డాక్టర్ ఏవీఎస్ రాజు (యూఎస్ఏ), సీపీడీసీ సహకారంతో రూ.11 లక్షలు వెచ్చించి సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పారు. హన్స సొల్యూషన్స్ రూ.1.2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ హబ్ నిర్మించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యాన రూ.55 లక్షలతో ఏఐ – డ్రివెన్ డిజిటల్ క్లాస్ రూములు, రూ.కోటితో రీసెర్చ్ అడ్వాన్సెస్ ఇన్ మెటీరియల్ సైన్స్ సెంటర్ అప్గ్రెడేషన్, కాలేజీ ఇంటర్నల్ ఫండింగ్ కింద రూ.2.2 కోట్లతో బుద్ధ భవన్ బ్లాక్ విస్తరణ, రూ.1.2 కోట్లతో టెక్నోస్పియర్ కంప్యూటర్ ల్యాబ్, రూ.27 లక్షలతో యాంఫీ థియేటర్, రూ.12 లక్షలతో ఇన్నర్ గేట్, సెంట్రల్ ఆర్చ్ నిర్మించారు. వీటిలో రుడా ఇచ్చిన రూ.32 లక్షలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.55 లక్షలు మినహా మిగిలినవన్నీ దాతల సహకారంతో నిర్మించినవే కావడం విశేషం. వీటినే లోకేష్ ప్రారంభించి, వాటిని తమ ప్రభుత్వమే నిర్మించినట్లు చెప్పుకోవడం విమర్శలకు తావిచ్చింది. స్వోత్కర్ష.. సానుభూతికి యత్నం తన పర్యటనలో ‘హలో లోకేష్’ పేరిట మంత్రి లోకేష్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆయన స్వోత్కర్షకే సరిపోయింది. స్టాన్ఫర్డ్లో తాను ఎలా చదివారో.. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో.. తన శరీర ఆకృతిపై వచ్చిన విమర్శలు.. తనను ఏవిధంగా ట్రోల్ చేశారు.. తన తల్లిని వైఎస్సార్ సీపీ నాయకులు ఎన్నో మాటలని అవమానించారనే సమాధానాలు తనను అడిగే ప్రశ్నలో ఉండేలా చూసుకున్నారు. తద్వారా సానుభూతి కోసం ప్రయత్నించారు. అవే ప్రశ్నలు.. అవే జవాబులు ఇదివరకు యువగళం పాదయాత్రలో లోకేష్ చాలాచోట్ల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అవన్నీ సోషల్ మీడియాలో వచ్చాయి. ఇప్పుడు ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలు సైతం అవే కావడం విశేషం. వాటికి ఇదివరకు చెప్పిన సమాధానాలనే లోకేష్ చెప్పడం గమనార్హం. ‘నన్నయ’లో నూతన భవనాలు ప్రారంభం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో రూ.33.80 కోట్లతో నిర్మించిన వివిధ భవనాలను రాష్ట్ర హెచ్ఆర్డీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రారంభించారు. రూ.20.05 కోట్లతో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, రూ.8.25 కోట్లతో ఎగ్జామినేషన్స్, రూ.5.50 కోట్లతో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనాలను నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్సలర్ ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ కేవీ స్వామి, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పేరాబత్తుల రాజశేఖరం, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కళాశాల విద్య కమిషనర్ నారాయణ భరత్గుప్తా, జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, ఆర్డీఓ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీ వివాదం రాజానగరం: మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదానికి దారి తీశాయి. ఉభయ గోదావరి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరి పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, స్థానికుడైన తమ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేరుతో ఫ్లెక్సీ ఎందుకు పెట్టలేదంటూ జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీనిపై వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీని ప్రశ్నించేందుకు లోపలకు వెళ్లబోయిన ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మిని వీసీ సిబ్బంది నెట్టివేశారంటూ వర్సిటీ పరిపాలన భవనం ముంగిట ఆందోళన చేశారు. ఎమ్మెల్యేను, ఆయన భార్యను అవమానించారంటూ వీరంగం సృష్టించారు. దీంతో, వర్సిటీలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అక్కడే ఉన్న ఎమ్మెల్యే బలరామకృష్ణ కొద్దిసేపటికి కలగజేసుకుని, ఆందోళనకారులను శాంతింపజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వైస్ చాన్సలర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆమె కావాలనే ఇలా చేశారని ఆరోపించారు. తనను, తన భార్యను అవమానించినప్పటికీ దీనిని వివాదం చేయదలచుకోలేదని, తమ నాయకుల పట్ల వర్సిటీ సిబ్బంది వ్యవహరించి తీరుకు నొచ్చుకున్న కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారని అన్నారు. వీసీ వైఎస్సార్ సీపీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వివాదానికి కారణం అదేనా? ఇదిలా ఉండగా కొన్ని నెలల క్రితం వర్సిటీ ప్రాంగణంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం భూమి పూజకు వచ్చిన ఎమ్మెల్యే బత్తులనుద్దేశించి వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీ అన్న మాటలే ఈ వివాదానికి ప్రధాన కారణంగా కొంతమంది వర్సిటీ అధికారులు చెబుతున్నారు. వర్సిటీ వ్యవహారంలో ఎమ్మెల్యే జోక్యం తగదని, ఆయన పేరు చెప్పి ఆయన అనుయాయులు తరచూ వర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆ సందర్భంగా ఎమ్మెల్యేతో వైస్ చాన్సలర్ అన్నారని అంటున్నారు. దానిని దృష్టిలో పెట్టుకునే ఈ గొడవ జరిగిందని చెబుతున్నారు. ఈ విషయమై వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీని వివరణ కోరగా.. ఈ రోజు ఎటువంటి వివాదమూ జరగలేదని, ఇంతకు మించి చెప్పేది లేదని అన్నారు. -
రేపు పల్స్పోలియో
రాజమహేంద్రవరం రూరల్: పల్స్పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కె.వెంకటేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నది లక్ష్యమన్నారు. దీనికోసం 2,31,250 డోసుల పోలియో వ్యాక్సిన్లు సిద్ధం చేశామన్నారు. వ్యాక్సిన్ వేసేందుకు 1,084 పల్స్పోలియో కేంద్రాలు, 62 ట్రాన్సిట్ టీములు, 62 మొబైల్ టీములను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం బస్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయంలో ట్రాన్సిట్ టీముల ద్వారా పోలియో చుక్కలు వేస్తామని వివరించారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందని, దీనికోసం 4,782 మంది సిబ్బందిని నియోగిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందరూ తమ ఇంట్లోని ఐదేళ్లలోపు పిల్లలను సమీప పల్స్పోలియో కేంద్రానికి తీసుకువచ్చి తప్పనిసరిగా పోలియో చుక్కల మందు వేయించాలని కోరారు. ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని పిల్లలను గుర్తించి, వ్యాక్సిన్ వేసేందుకు సిబ్బంది ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికీ వెళ్తారని డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పోలీసు విభాగానికి ఏబీసీడీ అవార్డు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా కీలక కేసుల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వారికి ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే అవార్డ్ ఫర్ బెస్ట్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ (ఏబీసీడీ) అవార్డు జిల్లా పోలీసు విభాగం సాధించింది. ఎస్పీ డి.నరసింహకిశోర్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ మూడు నెలలకు గాను కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్య కేసును ఛేదించినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చేతుల మీదుగా ఎస్పీ అందుకున్నారు. జిల్లాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కేందుకు, ఆ కేసును ఛేదించేందుకు కృషి చేసిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ స్ఫూర్తితో జిల్లావ్యాప్తంగా మరిన్ని కేసులను సమర్థవంతంగా ఛేదించేందుకు కృషి చేయాలని కోరారు. ‘అన్నవరం, వాడపల్లి’ నిర్వహణలో గోదావరి హారతి అన్నవరం: రాజమహేంద్రవరంలో నిత్యం నిర్వహిస్తున్న గోదావరి హారతి కార్యక్రమాన్ని ఇకపై అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మేరకు దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకూ అన్నవరం దేవస్థానం మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో ప్రతి రోజూ సాయంత్రం 6.30 నుంచి 7 గంటల వరకూ జరిగే గోదావరి హారతి కార్యక్రమానికి అన్నవరం దేవస్థానం ప్రతి నెలా రూ.2.50 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇకపై అన్నవరం దేవస్థానం రూ.1.5 లక్షలు (60 శాతం), వాడపల్లి దేవస్థానం రూ.లక్ష (40 శాతం) ఖర్చు చేయాలని కమిషనర్ ఆదేశించారు. తలుపులమ్మ తల్లికి రూ.49.58 లక్షల ఆదాయం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.49.58 లక్షల ఆదాయం సమకూరింది. లోవ దేవస్థానంలో హుండీలను శుక్రవారం తెరచి నగదు లెక్కించారు. మొత్తం 71 రోజులకు గాను రూ.45,76,941 నగదు, రూ.3,81,514 నాణేలు కలిపి రూ.49,58,455 ఆదాయం సమకూరిందని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. బంగారం 59.20 గ్రాములు, వెండి 1,156 గ్రాములు లభించిందన్నారు. ఆదాయం లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవకులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. -
మహానేతకు అపూర్వ గౌరవం
● డాక్టర్ వైఎస్సార్ స్మృతి మందిరం నిర్మించి మాట నిలబెట్టుకున్న మల్లాడి ● రేపు ప్రారంభోత్సవం ● తరలిరానున్న నాయకులు, అభిమానులు యానాం: ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నియోజకవర్గానికి చేసిన మేలుకు కృతజ్ఞతగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సొంత నిధులతో నిర్మించిన వైఎస్సార్ స్మృతి మందిరం నేడు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. పట్టణ పరిధిలో యర్రాగార్డెన్స్లో మల్లాడి నివాసం ఎదుటే రూ.లక్షల విలువైన స్థలాన్ని కొనుగోలు చేసి రెండస్తుల్లో నిర్మించారు. ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా మల్లాడి మాట్లాడుతూ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఈ నెల 21 నాటికి 36 ఏళ్లు అవుతోందని, దానిని పురస్కరించుకుని మహానేత రాజశేఖరరెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన పేరున నిర్మించిన ఈ మందిరాన్ని, గో నిలయాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ మందిరంలో మహిళలు, పురుషులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేలా నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటుచేిస్తున్నట్లు తెలిపారు. అలాగే మహానేతతో తనకున్న అనుబంధంపై రాజన్న స్మృతిలో అనే పుస్తకాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. వైఎస్సార్ దూరమై 16 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఆయన స్మృతులు యానాం నిండా ఉన్నాయన్నారు. యానాంకు సాగు, తాగునీటి కొరత లేకుండా శాశ్వత పరిష్కారం, సాగునీటిని 19 నుంచి 30 క్యూసెక్కులకు పెంచడం, మంచినీటి నిల్వ కోసం ఏపీ రైతుల నుంచి సేకరించిన 52.5 ఎకరాల భూమిని యానాంకు కేటాయిండం, ధవళేశ్వరం వద్ద పంప్హౌస్ నిర్మాణానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు, అక్కడి నుంచి యానాం వరకు 80 కిలోమీటర్ల మేర తాగునీటి పైప్లైన్ నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. యానం–ద్రాక్షారామ రోడ్డును బైపాస్ నాలుగు రోడ్లు జంక్షన్ వరకు యానాం ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకున్నారన్నారు. సీఎస్సార్ నిధులను సైతం ఆంధ్రాకు 70 శాతం, యానాంకు 30 శాతం కేటాయించారన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం, వైఎస్సార్ ఫ్రెంచి లింకింగ్ చానల్, వైఎస్సార్ భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు, వైఎస్సార్ కాలనీ వంటివి ఉన్నాయన్నారు. పుదుచ్చేరి క్యాబినెట్లో తనకు మంత్రి పదవి ఇచ్చేలా అఽధిష్టానాన్ని ఒప్పించడంతో అప్పటిలో తొలిసారిగా తాను మంత్రిగా ప్రమాణం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. మందిరంలో వైఎస్సార్ విగ్రహం -
మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి
● అనారోగ్యం పాలైన మహిళ ● కలెక్టర్ ఆదేశాలతో ● స్పందించిన కేసీఎం అధికారులు అమలాపురం రూరల్: ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడిన పి.జ్యోతి అనే మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. మండలం ఈదరపల్లి గ్రామానికి చెందిన జ్యోతి భర్త పి.దుర్గాప్రసాద్ వృత్తి రీత్యా వంట పని చేస్తూ జీవిస్తుంటాడు. కుటుంబ పరిస్థితులు బాగులేక తన భార్యను గల్ఫ్ దేశానికి పంపించాలని నిర్ణయించి కాకినాడకు చెందిన పి.శేషగిరిరావు అనే ఏజెంట్ ద్వారా మే నెలలో మస్కట్కు పంపించారు. అక్కడ 8 నెలలు పని చేసిన తర్వాత ఆరోగ్యం బాగోకపోవడంతో రెండు నెలలుగా పని చేయలేక ఇబ్బంది పడింది. ఈ మేరకు జ్యోతిని ఇండియాకు తీసుకురావాలని ఆమె భర్త మైగ్రేషన్ సెంటర్ను ఆశ్రయించాడు. ఈ మేరకు కలెక్టర్ అత్యవసర చర్యలు తీసుకుని సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకుని సురక్షితంగా ఇండియాకు చేర్చాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ సంస్థ జ్యోతిని స్వదేశానికి తీసుకువచ్చినట్టు ఆ కేంద్రం నోడల్ అధికారి మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ శుక్రవారం తెలిపారు. -
సుదర్శనం.. సకల ఫలప్రదం
● అంతర్వేదిలో నిత్య హోమాలు ● 2010 నుంచి దేవస్థానంలో అమలు ● ఎఫ్డీల రూపంలో భక్తుల విరాళాలు సఖినేటిపల్లి: దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన అంతర్వేది పుణ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జన్మ జన్మల పుణ్య ఫలం. నవ బుధవార నవ ప్రదక్షిణ దీక్ష చేసి నారసింహ సుదర్శన హోమం చేయించుకోవడం ద్వారా సకల అభీష్టాలు, సర్వ కార్యాలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఽఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో స్వయంభువుగా స్వామివారు వెలసినట్టు చరిత్ర చెపుతోంది. వశిష్ట మహర్షి ప్రార్థన మేరకు ఇక్కడ స్వామివారు పశ్చిమ ముఖంగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. నిత్య సుదర్శన హోమం స్వామివారి సన్నిధిలో అత్యంత పురాతనమైన 16 ఆయుధాలు, 16 భుజాలు కలిగిన సుదర్శన చక్రధారుడైన స్వామికి (శ్రీసుదర్శన పెరుమాళ్) నిత్యం సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. భక్తుల మనోవాంఛలు, ఫలసిద్ధికి, సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణం కోసం ఈ హోమాలను అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. పదిహేను సంవత్సరాలుగా స్వామివారి సన్నిధిలో నిత్య సుదర్శన హోమం ప్రారంభించక పూర్వం భక్తులు సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ సొంత ఖర్చులతో ప్రత్యేకంగా సుదర్శన హోమం నిర్వహించుకునేవారు. కాలక్రమంలో భక్తులందరికీ సుదర్శన హోమంలో పాల్గొనే అవకాశం కల్పించాలన్న సదుద్దేశంతో దేవస్థానం అధికారులు, వైదిక సిబ్బంది ఆలోచించి, నిత్య నారసింహ సుదర్శన హోమం నిర్వహణకు నిర్ణయించారు. ఇందుకు విధి విధానాలు రూపొందించిన అనంతరం 2010 సంవత్సరంలో హోమాలను ప్రారంభించి నిరంతరాయంగా నిర్వహిస్తున్నారు. రుసుములు ఇలా ఒక రోజుకు రూ.400 నెలకు రూ.4,000 మూడు నెలలకు రూ.10,000 ఆరు నెలలకు రూ.20,000 సంవత్సరానికి రూ.40,000 శాశ్వతం (పదేళ్లకు) రూ.1,00,000 -
పవన్ సభ కోసం.. పచ్చని చెట్లపై వేటు
పెరవలి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా ఉంది జనసేన నేతల తీరు. ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జాతీయ రహదారి పక్కన ఉన్న పలు చెట్లను నరికివేశారు. విషయం తెలియడంతో హైవే అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. చెట్లు ఎందుకు, ఎవరిని అడిగి నరుకుతున్నారని ప్రశ్నించారు. దీంతో, జనసేన కార్యకర్తలు వెనక్కు తగ్గారు. అయితే, అప్పటికే పచ్చగా ఉన్న సుమారు 10 చెట్లపై వేటు వేసేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కడైనా సభ నిర్వహిస్తే చెట్లు నరికివేస్తున్నారంటూ ఏమీ జరగకపోయినా కూటమి నేతలు రచ్చ చేసేవారు. అటువంటిది ఇప్పుడు జనసేన శ్రేణులు చెట్లు నరికివేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. టీడీపీ, బీజేపీ దూరం! మరోవైపు పవన్ సభకు కూటమి నేతల నుంచి పెద్దగా సహకారం అందడం లేదని తెలుస్తోంది. జాతీయ రహదారి పైన, సభా ప్రాంగణం వద్ద జనసేన జెండాలు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ జెండాలు, ప్లెక్సీలు మచ్చుకు కూడా కానరావడం లేదు. కొంత కాలంగా నిడదవోలు నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కందుల దుర్గేష్ కలసి మాట్లాడుకుంటున్నా మండల, నియోజకవర్గ నాయకుల్లో మాత్రం అంతర్గత విభేదాలు, వారి మధ్య దూరాలు బలంగానే ఉన్నాయి. అందువల్లనే జనసేన నేతలు తప్ప, కూటమిలోని మిగిలిన పార్టీల నాయకులెవ్వరూ సభా ప్రాంగణానికి రావడం లేదని పలువురు చెబుతున్నారు. -
రూ.1.26 కోట్ల ఎఫ్డీలు
అంతర్వేది దేవస్థానంలో నార సింహ సుదర్శన హోమంలో స్వామివారి శాశ్వత పూజల నిమి త్తం భక్తుల నుంచి ఇంత వరకూ రూ.1,26,47,912 ఆదాయం సమకూరింది. ఈ ఆదాయాన్ని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో భద్రపరిచాం. – ఎంకేటీఎన్వీ ప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్, అంతర్వేది దేవస్థానం మనోవాంఛా ఫలసిద్ధికి భక్తులు నారసింహ సుదర్శన హోమం నిర్వహించుకోవడం వల్ల మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది. అలాగే సర్వగ్రహ దోష నివారణకు, లోక కల్యాణం కూడా సుదర్శన హోమం వల్ల సిద్ధిస్తుంది. – పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, ప్రధాన అర్చకుడు, అంతర్వేది దేవస్థానం జన్మ, జన్మల పుణ్యఫలం ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి విశేష పూజల్లో పాల్గొంటే జన్మ, జన్మల పుణ్యఫ లం సిద్ధిస్తుంది. అభిషేకం, సుదర్శన హోమం, ఆర్జిత సేవగా క ల్యాణం వంటివి జరుగుతున్నాయి. నిత్య అన్నదాన పథకంలో స్వామి ప్రసాదం తీసుకోవడం మహాద్భాగ్యం. – బాలాజీ, భక్తుడు, హైదరాబాదు -
సదాచారమున్నచోట కలి ప్రవేశించలేడు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సదాచారమున్న చోట కలి ప్రవేశించలేడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన శుక్రవారం కొనసాగించారు. ‘స్వయంవరంలో నలుడిని దమయంతి వరించిందని తెలుసుకున్న కలి పురుషుడు వారిద్దరినీ కష్టాలపాలు చేయాలనుకున్నాడు. నలుడిలో ప్రవేశించడానికి కలి పురుషునికి 12 సంవత్సరాలు పట్టింది. మూత్రవిసర్జనానంతరం ఒకనాడు పాద ప్రక్షాళన చేసుకోకుండా సంధ్యోపాసన చేయడంతో నలుడిలోకి కలి ప్రవేశించగలిగాడు. ఎంత ఉపాసన, పాండిత్యం ఉన్నా సదాచారాన్ని వదిలిపెట్టరాదు. ఆచారాలు చాదస్తాలు కావు. అంటూసొంటూ, ఎంగిలీ అన్నిటినీ వదలి లలితా, విష్ణు సహస్రనామాలు చదివితే ప్రయోజనం ఉండదు’ అని చెప్పారు. ‘‘ద్యూతానికి నలుడిని పుష్కరుడు ఆహ్వానించగా, కలి ప్రభావంతో అతడు అంగీకరిస్తాడు. తన నేస్తమైన ద్వాపరుడి పాచికల్లో కలి ప్రవేశిస్తాడు. పరాజితుడైన నలుడు దమయంతీ సమేతంగా వనాలకు వెళ్తాడు. పిల్లలను పుట్టింటికి పంపించి భర్తను దమయంతి అనుసరిస్తుంది. ద్యూతమాడటం తన భర్త దోషం కాదని, అతనిలో ఏదో మోహం ప్రవేశించిందని గుర్తిస్తుంది. కష్టకాలంలో భర్తను అనుసరించాలి. దుఃఖ సమయంలో భర్తను ఓదార్చగల భార్యతో సమానమైన ఔషధం లేదని నలునితో అంటుంది. ‘నాస్తి భార్యా సమం మిత్రమ్’ అని ఆమె మాటను అంగీకరిస్తూనే, తనతో ఆమె కష్టాలు పడరాదని, పుట్టింటికి వెళ్లిపోవాలని నలుడు అంటాడు. అందుకు దమయంతి అంగీకరించదు. భార్యాభర్తల మాట తీరు ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే– రామాయణంలో సీతారాముల సంభాషణ, భారతంలో యుధిష్ఠిర ద్రౌపదీ సంవాదాలు, నల దమయంతుల మాట తీరును పరిశీలించాలి. ఎంతటి విపత్కర పరిస్థితుల్లో సైతం నోరు మూసుకుని పడి ఉండాలంటూ వారు ఒకరినొకరు గద్దించుకోలేదు. పటిష్టమైన వివాహ వ్యవస్థ ఉన్న మన దేశంలో భార్యాభర్తలు స్పర్థలతో విడిపోవడాలు, విడాకుల తగాదాలు బాధాకరం. అంతరించిపోతున్న మహాసంస్కృతి చివరి దశలో ఉన్నామేమో’’ అని సామవేదం ఆందోళన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను బట్టి భార్యాభర్తలు నిర్ణయాలు తీసుకోరాదని, అవి శాశ్వతం కావని, ధర్మమొక్కటే శాశ్వతమని అన్నారు. శకుంతల, దమయంతి, ద్రౌపది, కుంతి వంటి పాత్రలు భారత సీ్త్ర ఔన్నత్యాన్ని తెలియజేస్తాయని వివరించారు. -
అనుమతిపోయేలా..
● ఓపెన్ రీచ్లలో అధికారుల లీలలు ● సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో అనుమతులు ● గోదావరి నదీగర్భంలోకి నిషేధిత యంత్రాలు ● అవసరానికి మించి ఇసుక తవ్వేందుకు ‘పచ్చ’జెండా ● కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకేనని విమర్శలు సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు అధికార యంత్రాంగం అర్రులు చాస్తోందా.. అందులో భాగంగానే గోదావరి నదిలో ఇసుక ఓపెన్ రీచ్లకు ఇష్టానుసారం అనుమతులు ఇచ్చేస్తోందా.. అవసరానికి మించి ఇసుక తోడేసేందుకు మార్గం సుగమం చేస్తోందా.. ఒక రీచ్ పరిధిలో మరిన్న రీచ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా.. నిబంధనలు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తోందా.. అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నట్లు కనిపిస్తోంది. అడ్డగోలుగా అనుమతులు ● ఓపెన్ రీచ్ల అనుమతుల్లో అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. ఒక రీచ్ను పలు భాగాలుగా విభజించి మరీ కూటమి నేతలకు కట్టబెడుతున్నారు. కొవ్వూరు మండలం కుమారదేవంలోని ఒక ఓపెన్ రీచ్ను మూడు రీచ్లుగా మార్చారు. ● కుమారదేవం మెయిన్ రీచ్లో 72 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకానికి విస్సీ ఇంజినీరింగ్ సంస్థకు ఈ ఏడాది మార్చి 13 నుంచి అక్టోబర్ 18 వరకూ అనుమతులు ఇచ్చారు. ఆ గడువు ప్రస్తుతం ముగిసింది. ఇప్పుడు ఇదే రీచ్లో మరో మూడు రీచ్లు పుట్టుకొచ్చాయి. ● శ్రీ పవన్ ట్రాన్స్పోర్ట్ సంస్థకు 69,300 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వేందుకు కుమారదేవం–2 పేరుతో గత అక్టోబర్ వరకూ అనుమతులిచ్చారు. ఇదే రీచ్లో 63 వేల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వేందుకు ఈవీ వెంకటరావు అనే కాంట్రాక్టర్కు గత అక్టోబర్ 23వ తేదీ వరకూ అనుమతులివ్వడం గమనార్హం. ● ఇవి చాలవన్నట్లు గత ఏప్రిల్ 16న మరో 8,85,000 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వుకునేందుకు నాగేంద్ర ఇన్ఫ్రాకు అనుమతులు ఇచ్చారు. దీని గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు. ● కూటమి నేతలకు ఇష్టానుసారం దోచి పెట్టేందుకే ఈ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకే రీచ్లో మరిన్ని రీచ్లో ఎందుకు, ఎవరికి కేటాయిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనుమతి ముగిసినా.. కుమారదేవం రీచ్కు అనుమతులు ముగిసినా ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ రూ.లక్షలు గడిస్తోంది. రాత్రిళ్లు గుట్టు చప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు. ప్రతి రోజూ 200కు పైగా లారీలతో ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాత్రిళ్లు రహదారిపై ఇసుక లారీలు క్యూ కడుతున్నాయి. సాయంత్రమైతే చాలు ఈ ప్రాంతం జాతరను తలపిస్తోంది. రీచ్లకు అనుమతులున్నా రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు నిషేధం. అయినా అదేమీ పట్టనట్లు ఇసుక కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ‘వాల్టా’కు తూట్లు ఇసుకాసురులు ఏపీ నీరు, భూమి, చెట్ల చట్టానికి (వాల్టా) సైతం తూట్లు పొడుస్తున్నారు. నదీ గర్భంలో యంత్రాలతో తవ్వకాలు (సెమీ మెకనైజ్డ్) చేపట్టడం నిషేధం. అయినప్పటికీ, చట్టానికి తూట్లు పొడుస్తూ.. మైనింగ్ అధికారులే ఓపెన్ రీచ్లలో ఇసుక తవ్వకాలకు సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో అనుమతులు ఇస్తున్నారు. అలా ఎలా ఇస్తున్నారనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అన్ని అనుమతులతో రీచ్ను దక్కించుకుని.. సెమీ మెకనైజ్డ్ పద్ధతిలో చేపట్టాలన్నా.. నదిలోని ఇసుకను కూలీలతో మాత్రమే తవ్వించి ఒడ్డుకు తీసుకురావాలి. మూడు ఘనపు మీటర్ల ఇసుక మేట ఉంటే ఒక ఘనపు మీటర్ మాత్రమే తవ్వాలి. ఒడ్డుకు తెచ్చిన ఇసుకను యంత్రాలతో లారీల్లోకి లోడ్ చేసుకోవచ్చు. అదే సెమీ మెకనైజ్డ్ కాకపోతే ఇసుక తవ్వకాలు, లోడింగ్ కూడా కూలీలతోనే చేపట్టాలి. గోదావరి నదిలోకి యంత్రాలు, లారీలను తీసుకెళ్లరాదు. కానీ, కుమారదేవంతో పాటు కొవ్వూరు నియోజకవర్గంలోని పలు ర్యాంపుల్లో ఇష్టానుసారం యంత్రాలతో లోడింగ్ చేసేస్తున్నారు. వందలాదిగా లారీలను నదీ గర్భంలోకి తీసుకెళ్లి ఇసుక లోడింగ్ చేస్తున్నారు. అంత ఇసుక దేనికో? జిల్లావ్యాప్తంగా ప్రజలకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇసుక తవ్వుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓపెన్ రీచ్ల ద్వారా 20 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుంది. బోట్ ర్యాంపుల ద్వారా మరో 10 లక్షల మెట్రిక్ టన్నులు సమకూరే అవకాశం ఉంది. ఇది చాలదన్నట్లు కొత్త ర్యాంపులకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఇన్ని ర్యాంపుల ద్వారా తవ్వేస్తున్న లక్షల టన్నుల ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారు.. జిల్లా ప్రజల అవసరం ఎంత అనే ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు అనుమతులు ఇచ్చారు. ఆ ఇసుకే ప్రభుత్వ పనులకు, ప్రజలు, ప్రైవేటు అవసరాలకు సరిపోయింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క మన జిల్లాలోనే కోటి మెట్రిక్ టన్నుల తవ్వేందుకు గ్రీన్సిగ్నల్ ఇస్తున్నారు. ఇతర జిల్లాల అవసరాలకని అధికారులు చెబుతున్నా అంత స్టాక్ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం సైతం కుదేలైంది. భవన నిర్మాణాలు కూడా అనుకున్న రీతిలో సాగడం లేదు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, వ్యక్తిగత భవన నిర్మాణాలు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పరిమాణంలో ఇసుక దేనికనే మీమాంస నెలకొంది. రీచ్లలో సింహభాగం కూటమి నేతలకే కట్టబెట్టారు. తద్వారా అదనపు తవ్వకాలు, రీచ్లకు అనుమతులిచ్చి రూ.కోట్ల దోపిడీకి దారి చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
గోదారమ్మకు గర్భశోకం
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి నదీ తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. నిబంధనలకు నీళ్లోదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తోంది. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తమనెవరు ప్రశ్నిస్తారని రెచ్చిపోతోంది. గోదావరి నదీ గర్భాన్ని కుళ్లబోడుస్తోంది. పది అడుగుల లోతు వరకూ ఇష్టానుసారంగా తవ్వేస్తూ సహజ సంపదను దోపిడీ చేస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ దందా దర్జాగా సాగుతోంది. స్వయానా మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దోపిడీకి తెరతీసినా.. అటువైపు కన్నెత్తి చూసే నాథుడే కరవయ్యాడు. మూడు రోజులుగా దందా సాగుతున్నా.. ఏ ఒక్క అధికారీ అడ్డుకునేందుకు సాహసం చేయడం లేదు. నిత్యం లారీల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నా చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక మతలబు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంట్రాక్టర్కు గడువు ముగిసినా.. నిడదవోలు నియోజకవర్గం ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్లో మూడు రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ర్యాంపును గతేడాది దక్కించుకున్న కాంట్రాక్టర్కు గడువు ముగిసింది. ఈ ఏడాది ఇంకా అనుమతులు ఇవ్వలేదు. అయినా తమను ఆపేదెవరంటూ ఇసుక మాఫియా బరితెగిస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంపు నిర్వహిస్తుండడంతో అక్రమాల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి ఇసుకను తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించేస్తున్నారు. నిత్యం 400 లారీలకు పైగా ఇసుక భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలిçంచి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు జేసీబీలు ఉపయోగించి మరీ.. యంత్రాలతో దర్జాగా తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులు ఉండి.. రీచ్ దక్కించుకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల ద్వారా నదిలో ఉన్న మేటల నుంచి ఇసుకను తవ్వాలి. లోడింగ్కు సైతం కూలీలనే ఉపయోగించాలి. గోదావరిలోకి యంత్రాలు, లారీలు తీసుకెళ్లడం నిషేధం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు. ఇష్టానుసారంగా యంత్రాలతో లోడింగ్ చేసేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలో గోదావరిలోకి తీసుకెళ్లి ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ‘కానూరు–పెండ్యాల’ రీచ్లో ప్రతి రోజూ మూడు జేసీబీలు ఇసుక తోడేందుకు వినియోగిస్తున్నారు. రాత్రిళ్లు అయితే మరింత రెచ్చిపోతున్నారు. కిలో మీటర్ల మేర వందల వాహనాలు క్యూ కడుతున్నాయి. యంత్రాలను నదిలోకి దించి పది అడుగుల వరకు గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఒక్క ‘కానూరు–పెండ్యాల’ రీచ్ నుంచి ప్రతి రోజూ 400లకు పైగా లారీల ఇసుక అక్రమంగా తవి్వ, తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం.లోతుగా తవ్వేయడంతో పైకొచ్చిన నీరు నెలకు రూ.10 కోట్ల దోపిడీ అసలే అక్రమ తవ్వకాలు ఆపై అధిక ధరకు విక్రయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అనుమతులు ఉంటే.. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంప్లో 6 యూనిట్ల లారీ ఇసుక రూ.1,900 వందలకు విక్రయించాల్సి ఉంది. కానీ రూ.5,500 నుంచి రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి బయట మార్కెట్లోకి వెళ్లే సరికి కిరాయితో కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఇసుక లారీ ధర చేరుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఓపెన్ రీచ్లలో ఇసుక టన్ను రూ.35 నుంచి రూ.100 లోపు మాత్రమే ఉంది. బోటు ర్యాంపుల వద్ద టన్ను ఇసుక రూ.240 ధర పలుకుతోంది.6 యూనిట్లకు రూ.3,000 మాత్రమే తీసుకుంటున్నారు. అయితే కానూరు–పెండ్యాల రీచ్ వద్ద మాత్రం ఏకంగా రూ.6,500 దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క కానూరు–పెండ్యాల రీచ్ నుంచే ప్రతి రోజూ రాత్రి, పగలు 400కు పైగా లారీల ఇసుక అక్రమంగా తరలుతోంది. ఒక్కో లారీ ఇసుక రూ.6,500 చొప్పున రోజుకు 400 లారీలకు రూ.26 లక్షలు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోంది. బిల్లులు కావాలంటే మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. మూడు రోజులుగా రూ.78 లక్షలు దండుకున్నట్లు విమర్శలున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక్క ర్యాంప్ నుంచే నెలకు సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు దండుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. పరిమితులు లేకుండా.. అనుమతులు లేకుండా దర్జాగా తవ్వకాలు చేపడుతున్నా.. పరిమితులు లేకుండా లారీల ఇసుక తరలుతున్నా.. అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రహదారులపై లారీల ప్రవాహం కొనసాగుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. పైగా ఇసుక మాఫియాతో మైత్రి కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అనుమతులు లేకుండా ఎందుకు తవ్వుతున్నారు..?, ఎక్కడికి తరలిస్తున్నారు..? అని ప్రశ్నించిన సందర్భాలు లేవు. దీని వెనుక భారీ స్థాయిలో మామూళ్లు అందినట్లు ఆరోపణలున్నాయి. రీచ్ తెరిచే ముందే ఇసుక మాఫియా... అధికారులను మేనేజ్ చేసేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఇంత భారీ అక్రమం జరుగుతున్నా.. పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎవరాపుతారు? అనుమతులు లేకుండా తవ్వుతున్న వైనంపై మాఫియా తమకేమీ భయం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. తమకు ఓ ప్రజాప్రతినిధి, ఓ టీడీపీ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తమను ఆపేవారెవరన్న ధీమాతో ఉన్నట్లు తెలిసింది. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతుండటం, అధికారులకు ఇప్పటికే ఆమ్యామ్యాలు అందడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కలెక్టర్ స్పందిస్తేనే.. ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రీచ్లపై కలెక్టర్ స్పందిస్తే తప్ప తవ్వకాలు ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరపాలంటే భయపడేవారని, ప్రస్తుతం నిర్భీతిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. మైనింగ్ అధికారుల లీలలు ఇసుక మాఫియాను కాపాడేందుకు మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంపునకు 21.10.2024న టెండర్లు పిలిచారు. 13.03.2025 నుంచి 20.10.2025 వరకు ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు మైనింగ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రకటనను పరిశీలిస్తే.. కానూరు–పెండ్యాల ర్యాంపునకు అక్టోబర్ నెలలోనే తవ్వకాలకు గడువు ముగిసింది. అయినా ప్రస్తుతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కానీ మైనింగ్ అధికారులు మాత్రం పశ్చిమగోదావరి జిల్లాకు పెండ్యాల ర్యాంప్ను కేటాయించినట్లు తాజాగా ప్రకటనలో తెలిపారు. అయితే ఇసుక తవ్వకాలు పెండ్యాల ర్యాంపులోనే జరగాల్సి ఉన్నా.. కానూరు–పెండ్యాల ర్యాంప్లో తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్రమాలకు ఏ స్థాయిలో సహకారం అందుతుందో అర్థమవుతోంది. -
రాజమండ్రి: ‘నన్నయ్య’లో జనసేన కార్యకర్తల వీరంగం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో నన్నయ్య యూనివర్శిటీలో జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీలు తొలగించినవారి అంతుచూస్తామంటూ బెదిరింపులకు దిగారు. వీసీ ఆఫీసులో వెళ్లేందుకు జనసేన కార్యకర్తలు ప్రయత్నించారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భార్యను వీసీ పీఏ నెట్టేశారని ఆరోపిస్తున్నారు. -
పసికందును అనాథను చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం
సాక్షి, రాజమహేంద్రవరం: ‘ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల ఓ బాలింతకు సరైన వైద్య పరీక్షలు అందక ప్రాణాలు విడిచింది. ప్రసూతి సమయంలో డ్యూటీ డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమెకు ప్రాణాలు పోయేంత పరిస్థితి ఏర్పడితే, ప్రసవం అనంతరం మరో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆమె ప్రాణాలే పోయాయి. ఇదే విషయాన్ని స్వయంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ నివేదిక రూపంలో ఇచ్చారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులను చూస్తూంటే.. అసలు ప్రభుత్వం ఉన్నది ప్రజల ప్రాణాలు కాపాడేందుకా.. తీసేందుకా.. అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ప్రశ్నించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాలింత మృతి చెందిన రోజునే రాజమహేంద్రవరం నగరంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కోడలు నారా బ్రాహ్మణి వచ్చారని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రి మీద ఉన్న మక్కువ ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆసుపత్రుల మీద లేదని, పేదల ప్రాణాలు పోయినా పెద్దల జేబుల్లోకి డబ్బులు వెళ్లడమే ప్రధాన లక్ష్యంగా కనపడుతోందని దుయ్యబట్టారు. తల్లిని కోల్పోయి అనాథ అయిన పసికందుకు నష్టపరిహారం కింద రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత సొసైటీలకు బకాయిలు చెల్లించండి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చేనేత సహకార సంఘాలకు నూలు సబ్సిడీగా రూ.47 కోట్లు, రుణ మాఫీ కింద రూ.47 కోట్లు, ఇతర పథకాల ద్వారా రూ.175 కోట్లను వెంటనే చెల్లించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి నేత నల్ల రామారావు చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆప్కో బకాయిలు సుమారు రూ.108 కోట్లు వెంటనే చెల్లిస్తే సొసైటీల ద్వారా చేనేత కార్మికులకు పనులు కల్పించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 593 చేనేత సొసైటీలు మూత పడ్డాయని, మిగిలిన 448 సొసైటీలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులు పనుల్లేక అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సిన రూ.300 కోట్లను ప్రభుత్వం వెంటనే అందజేసి, లక్షలాదిగా ఉన్న కార్మికులను ఆదుకోవాలని కోరారు. హేమస్మితకు ఉత్తమ పురస్కారం దేవరపల్లి: పొగాకు బోర్డు దేవరపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మితకు ఉత్తర సేవా పురస్కారం లభించింది. 2024–25 పొగాకు అమ్మకాల కాలంలో ట్రేడర్లు, రైతుల మధ్య సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఆమె వేలం ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 177 రోజులు వేలం నిర్వహించి 13.18 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిపించారు. ఉత్తర తేలిక నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాలతో పోల్చితే దేవరపల్లిలో వేలం ప్రక్రియ త్వరితగతిన ముగించారు. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాలుండగా.. దేవరపల్లిలో కిలో పొగాకుకు అత్యధిక సగటు ధర రూ.311, గరిష్ట ధర రూ.453 పలికింది. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలబడి ఉత్తమ సేవలందించినందుకు గాను పొగాకు బోర్డు రాష్ట్రంలోని ఐదుగురు వేలం కేంద్రాల నిర్వహణాధికారులకు ఉత్తమ సేవా పురస్కారాలు అందజేసి, సత్కరించింది. గుంటూరులో బుధవారం సాయంత్రం జరిగిన సభలో హేమస్మితకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
లోకేష్ పర్యటనను అడ్డుకుంటాం
● విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు ● సీపీఐ, పీడీఎస్యూ నాయకులు‘యువగళం’లో కల్లబొల్లి కబుర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా కనీసం సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించకపోవడం, రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి విడుదల చేయకపోవడం, పీపీపీ విధానం పేరుతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చూడటం దారుణమని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ విమర్శించారు. నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామంటూ యువగళం పాదయాత్రలో లోకేష్ కల్లబొల్లి కబుర్లు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ సంక్షేమ హాస్టల్ సొంత భవనాల నిర్మాణానికి ఎక్కడా ఒక్క శిలాఫలకం కూడా వేసిన దాఖలాలు లేవన్నారు. మెస్, కాస్మెటిక్ చార్జీలు పెంచలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టళ్లలో పూర్తి స్థాయి మెనూ అమలు చేయడం లేదని, కనీసం సెంట్రల్ జైలు ఖైదీల మాదిరిగా కూడా ఆహారం పెట్టడం లేదని ఆరోపించారు. విద్యా వ్యాపారానికి రెడ్ కార్పెట్ పరిచారని దుయ్యబట్టారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నా కనీసం అధికారుల పరిశీలన కూడా లేకుండా పోయిందన్నారు. విద్యాశాఖ మంత్రి తన పని వదిలిపెట్టి పెట్టుబడులు కోసం కొత్త కంపెనీల చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నామని, కొత్త కంపెనీలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించబోమని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్లు చెప్పుకోవడం తప్ప ఆచరణలో ఏమీ సాధించలేదని కిరణ్ కుమార్ విమర్శించారు. సమావేశంలో కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.భానుప్రసాద్, నగర కార్యదర్శి దినేష్బాబు, రాష్ట్ర అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు. ‘పీపీపీ’ని రద్దు చేయాలి అధికారంలోకి వస్తే 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తామని గత ఎన్నికల ముందే చెప్పి ఉంటే టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. పీపీపీ పేరుతో ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలోని 10 నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం గత సెప్టెంబర్ 9న జీఓ నంబర్ 590 జారీ చేయడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. మార్కాపురం, మదనపల్లి, ఆదోని, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పరిధిలోకి తీసుకురావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ భూములు, భవనాలు, కాలేజీలు ఆస్పత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని అన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఉచిత వైద్య సేవలకు 70 శాతం పడకలు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మిగిలిన 30 శాతం చెల్లింపు పడకల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో పేదలకు వైద్యం అందని ప్రమాదం ఉంటుందన్నారు. దీంతోపాటు పేద విద్యార్థులకు వైద్య విద్య సీట్లు దక్కవని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరిస్తే ప్రజాగ్రహం ఎదుర్కొనక తప్పదని మధు హెచ్చరించారు. ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరరావు, సహాయ కార్యదర్శి కె.రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నగరానికి శుక్రవారం రానున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్కు నిరసన సెగ తగలనుంది. విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ లోకేష్ పర్యటనను అడ్డుకుంటామని సీపీఐ, పీడీఎస్యూ నేతలు రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన వేర్వేరు కార్యక్రమాల్లో ప్రకటించారు. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) -
పీడీలు ఏరీ..!
● ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కొరత ● ఉండాల్సింది ఏడుగురు ● ఉన్నది ఒక్కరు ● క్రీడల్లో వెనుకబడుతున్న విద్యార్థులురాజమహేంద్రవరం రూరల్: ఇప్పటి వరకూ ఎటువంటి రూపురేఖలూ లేని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ఘనంగా చెప్పారు. ఒలింపిక్స్ సంగతి అలా ఉంచితే.. అసలు క్రీడల అభివృద్ధిలో.. క్రీడాకారులకు తగిన శిక్షణ ఇచ్చి తయారు చేయడంలో ఫిజికల్ డైరెక్టర్ల (పీడీ) పాత్ర ఎంతో కీలకం. వీరు ఆయా కళాశాలల్లో క్రీడా కార్యకలాపాలు నిర్వహిస్తూంటారు. వివిధ క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. విద్యార్థి సలహా కమిటీల వంటి వాటిల్లో భాగస్వామిగా ఉంటూ అవసరమైన సూచనలు ఇస్తారు. వీరి విధుల్లో విద్యార్థులకు క్రీడా శిక్షణ ఇవ్వడం అత్యంత కీలకమైనది. ఇంతటి ప్రాధాన్యం పీడీలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు క్రీడల్లో వెనుకబడుతున్నారు. ఆరుచోట్ల ఇన్చార్జిలే.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బొమ్మూరు, అనపర్తి, ద్రాక్షారామ, కాకినాడ, ఎటపాక, పిఠాపురం, కాకినాడ(మహిళ)ల్లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. మరో 18 ప్రైవేటు కళాశాలలున్నాయి. మొత్తం ఏడు ప్రభుత్వ కళాశాలలకు గాను కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మాత్రమే ప్రస్తుతం రెగ్యులర్ పీడీ ఉన్నారు. మిగిలిన అన్నిచోట్లా ఆయా కళాశాలల లెక్చరర్లనే ఇన్చార్జి పీడీలుగా నియమించి, ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. దీంతో, ఆయా లెక్చరర్లు అటు సబ్జెక్టుల బోధనకు.. ఇటు క్రీడా శిక్షణకు సమయం కేటాయించలేని దుస్థితి నెలకొంది. రెండు విధులూ నిర్వహించాల్సి వస్తూండటంతో వారు పనిభారంతో సతమతమవుతున్నారని ఆయా సంఘాల నాయకులు చెబుతున్నారు. రెగ్యులర్ పీడీలు లేకపోవడంతో సరైన శిక్షణ లభించక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లోని విద్యార్థులు క్రీడా పోటీల్లో వెనుకంజ వేస్తున్న దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో పీడీలు ఉండటంతో అక్కడి విద్యార్థులకు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో మెరుగైన శిక్షణ లభిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో కూడా పూర్తి స్థాయిలో పీడీలను నియమిస్తే వివిధ క్రీడల్లో మరింత మంది విద్యార్థులు మెరికల్లా తయారయ్యే అవకాశం ఉంది. కానీ, దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. తేడా స్పష్టం పీడీలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ప్రస్తుతం బొమ్మూరు పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్, గేమ్స్ రీజినల్ మీట్లో స్పష్టంగా కన్పిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల్లో ఎక్కువ మంది వ్యక్తిగత నైపుణ్యంతో మాత్రమే వివిధ పోటీల్లో విజయం సాధిస్తున్నారు. నైపుణ్యం ఉన్నప్పటికీ తమకు తగిన మెళకువలు నేర్పాల్సిన పీడీలు లేకపోవడంతో వెనుకబడుతున్నామని పలువురు క్రీడాకారులు వాపోతున్నారు. ఈ మీట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం 25 కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు గట్టి పోటీ ఇవ్వాలంటే తమకు సరైన శిక్షణ, ప్రోత్సాహం ఉండాలని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. దీనికోసం అన్ని ప్రభుత్వ కళాశాలల్లోనూ పూర్తి స్థాయి పీడీలను నియమించాలని వారు కోరుతున్నారు. రీజినల్ స్పోర్ట్స్ మీట్కు వేదికగా నిలిచిన బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో సైతం రెగ్యులర్ పీడీ లేరు. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరరే ఇన్చార్జి పీడీగా వ్యవహరిస్తున్నారు. అయితే, రీజినల్ స్పోర్ట్స్ మీట్కు ప్రొఫెషనల్ పీడీ అవసరం కావడంతో కాకినాడ మహిళా పాలిటెక్నిక్ కళాశాల పీడీని ఇన్చార్జిగా రప్పించుకోవాల్సి వచ్చింది. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు పూర్తి స్థాయిలో పీడీలను నియమించాలని పలు సంఘాల నాయకులు కోరుతున్నారు. -
‘ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు’
● మంత్ర విద్య సంప్రదాయబద్ధంగా నేర్వాలి ● సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడంటూ ధర్మరాజు చెబుతాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆయన గురువారం కొనసాగించారు. ‘భీష్మ, ద్రోణ, కృపాచార్యులను, అశ్వత్థామ, కర్ణులను నిర్జించడానికి కావలసిన అస్త్ర సంపద మన వద్ద లేదని సోదరులకు ధర్మరాజు చెబుతాడు. ఆ సమయంలో వ్యాస మహర్షి వచ్చి ధర్మరాజును ఏకాంతంలోకి పిలిచి, ప్రతిస్మృతి విద్యను బోధించి, దీనిని అర్జునుడికి ఉపదేశించాలని చెబుతాడు. ఆయన స్వయంగా అర్జునుడికి ఉపదేశించకుండా అన్నగారికి ఎందుకు ఉపదేశించాడనే సందేహం మనకు రావచ్చు. మంత్రవిద్యకు కొన్ని సంప్రదాయాలు, మర్యాదలు ఉన్నాయి. కొడుక్కి తండ్రి, తమ్ముడికి అన్న, భార్యకు భర్త మంత్రాన్ని ఉపదేశించవచ్చు’ అని వివరించారు. ‘నాకు నా మొగుడితో పడటం లేదు.. ఏదైనా మంత్రం చెప్పండని అడగరాదు’ అంటూ చమత్కరించారు. ‘‘భూలోక కాలగణన ప్రకారం ఐదు సంవత్సరాలు అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్నాడు. అస్త్ర విద్యతో పాటు నీవు సంగీత నృత్యాలు నేర్చుకోవడం మంచిదని నాకు అనిపిస్తోదంటూ అతడికి ఇంద్రుడు చెబుతాడు. భారతీయ సంగీత నృత్యాలు దేవనిర్మిత కళలు. ఊర్వశి వంక అర్జునుడు ప్రత్యేకంగా చూశాడని గమనించిన ఇంద్రుడు.. అలంకరించుకుని అర్జునుడిని సేవించాలని ఆమెను ఆదేశిస్తాడు. అప్పటికే అర్జునుడిపై మరులుగొన్న ఊర్వశి సర్వాంగసుందరంగా అలంకరించుకుని అతడిని చేరుతుంది. ఆమెను చూసిన అర్జునుడు సిగ్గుతో తల వంచుకుని గురుభావంతో నమస్కరిస్తాడు. ఊర్వశి తన రాకలోని ఆంతర్యాన్ని వివరిస్తుంది. ‘నాకు కుంతి, మాద్రి ఎటువంటి వారో, శచీదేవి ఎటువంటిదో, నీవూ అటువంటి దానివే. నీవు నాకు తల్లిలా పూజ్యురాలివి. కొడుకులా నన్ను ఆదరించు’ అని అర్జునుడు అడుగుతాడు. దేవలోకంలో అటువంటి కట్టుబాట్లు లేవని ఊర్వశి అంటుంది. ‘నీవు కురువంశానికి మూలమైన పౌర వంశానికి చెందిన ఆదిజననివి. అందుకని నిన్ను అలా చూశాను కానీ, కామదృష్టితో కాద’ని అర్జునుడు చెబుతాడు. తనను తిరస్కరించినందుకు నీవు సిగ్గూ ఎగ్గూ లేకుండా సీ్త్రల మధ్య నపుంసకునిలా తిరుగుతావని ఆమె శపించింది. అజ్ఞాతవాస కాలంలో ఈ శాపం నీకు వరమవుతుందని అర్జునుడితో ఇంద్రుడు అంటాడు. పితృపితామహుల నుంచి వచ్చిన రాజ్య సంపదలపై నీ బుద్ధి ఎందుకు నిలవడం లేదని ధర్మరాజును వనాలలో ద్రౌపది ఆక్షేపిస్తుంది. తాను ఏదో ఫలాన్ని ఆశించి ధర్మాచరణకు పూనుకోనని ధర్మరాజు చెబుతాడు. స్వర్గాది భోగాల కోసం ధర్మాన్ని ఆశ్రయించడం లేదని స్పష్టం చేస్తాడు. ధర్మం పాటించాలి కనుకనే ధర్మాన్ని ఆశ్రయిస్తున్నానని, ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడని, ధర్మం వ్యాపార వస్తువు కాదని అంటాడు’’ అని సామవేదం వివరించారు. -
ఎరువు.. కరవు
పెదపూడి: రబీ సాగు చేపట్టిన రైతులకు ఓవైపు సాగునీటి ఇబ్బందులు వెంటాడుతూండగా.. మరోవైపు అదునుకు ఎరువులు లభించని దుస్థితి నెలకొంది. పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) వద్ద ఎరువుల కోసం అన్నదాతలు గురువారం ఇలా పడిగాపులు పడ్డారు. ప్రతి రైతుకు ఒక బస్తా యూరియా, ఒక బస్తా డీఏపీ ఎరువు ఇస్తున్నట్లు పీఏసీఎస్ సిబ్బంది చెప్పారు. దీంతో, అన్నదాతలు సాగు పనులు పక్కన పెట్టి ఉదయాన్నే పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. సిబ్బంది జాప్యం చేయడంతో మధ్యాహ్నం వరకూ అక్కడే పడిగాపులు కాశారు. చివరకు కొంత మంది రైతులకు ఎరువులు అందలేదు. పీఏసీఎస్కు మళ్లీ ఎరువులు వచ్చిన తరువాత ఇస్తామని సిబ్బంది చెప్పడంతో ఆ రైతులు నిరాశగా వెనుదిరిగారు. -
ఆకట్టుకున్న గణిత అష్టావధానం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో గురువారం ఎం.నాగార్జున గణిత అష్టావధానాన్ని నిర్వహించారు. పృచ్ఛకులుగా ద్వితీయ సంవత్సరం ఛాత్రోపాధ్యాయులు వ్యవహరించారు. వింత చదరం అంశానికి సర్తాజ్, వార గణన అంశానికి సౌందర్య, 325తో భాగాహారం అంశానికి శ్రావణి, కారణాంకాలు అంశానికి రమ్యశ్రీ, వర్గ భేదం అంశానికి మృదుల, గుణకారం అంశానికి రమ్యసుధ, 7తో నిషిద్దం అంశానికి మాధురి, అప్రస్తుత ప్రసంగం సీనియర్ లెక్చరర్ కొమ్ముల వెంకట సూర్యనారాయణ నిర్వహించారు. పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు నాగార్జున అవలీలగా సమాధానమిచ్చి ఆహుతులందరినీ అబ్బుర పరిచారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.వి.సూర్యనారాయణ పాల్గొన్నారు. -
శ్రీహరి ధామాలు.. నవ పారిజాతాలు
● గోదారి తీరంలో జనార్దనుడి తొమ్మిది ఆలయాలు ● ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు.. భక్తుల సందడి ● నవగ్రహాల ఆరాధన ఈ దేవళాల్లో ప్రత్యేకత ఆలమూరు: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గౌతమీ తీరంలో కొలువై ఉన్న నవ జనార్దనస్వామి ఆలయాలు సంక్రాంతి ముగిసే వరకూ దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తులతో సందడి చేయనున్నాయి. ధనుర్మాసంలో ఈ నవ జనార్దనులను దర్శించుకుంటే సకల పాపాలు తొలగి నవగ్రహ దోషాలు హరిస్తాయని భక్తుల ప్రగాడ విశ్వాసం. అందులో భాగంగా పలు రాష్ట్రాల నుంచి వచ్చే టూరిస్టులు ఈ దేవాలయాలను ఏటా దర్శించుకుంటారు. సాధారణంగా నవగ్రహ ఆలయాలు శైవ క్షేత్రాల్లో మాత్రమే ఉంటాయి. అందులో భక్తులు నవగ్రహ శాంతి పూజలు నిర్వహించుకుంటారు. అయితే ఈ నవ జనార్దనస్వామి ఆలయాల్లో కూడా నవగ్రహ పూజలు జరుగుతాయి. స్వయంభూగా భాసిల్లుతూ.. ఈ నవ జనార్దనులు స్వయంభూగా భాసిల్లుతున్నారు. సోమకాశురుడనే రాక్షసుడు చతుర్వేదాలను నాశనం చేసే క్రమం నుంచి రక్షించాలన్న దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు శ్రీమహావిష్ణువును వేడుకుంటాడు. క్షీరసాగరం నుంచి శ్రీమహావిష్ణువు భూమిపైకి వచ్చి రాక్షసుణ్ణి సంహరించి వేదాలను రక్షిస్తాడు. అదే సమయంలో నారద మహాముని ఆకాశం నుంచి భువికి తపస్సు చేసుకునేందుకు వస్తాడు. నవ గ్రహాల ప్రభావంతో జనులు కష్టాలు పడుతున్నారని గుర్తించిన నారద మహాముని వైకుంఠం వెళ్లి శ్రీమహావిష్ణువుకు వివరిస్తాడు. జనులను కష్టాల నుంచి విముక్తులను చేయాలని వేడుకుంటాడు. అందులో భాగంగానే శ్రీమహా విష్ణువు ప్రజల రక్షణార్థం గౌతమీ గోదావరి తీరం వెంబడి తొమ్మిది ప్రదేశాల్లో స్వయంభూగా వెలిశాడని పండితులు చెబుతున్నారు. స్వయంభూగా వెలసిన విగ్రహాల వద్ద నారద మహాముని ఆలయాలను నిర్మించాడని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ముద్రల రూపంలో దర్శనం నవ జనార్ధనస్వామి ఆలయాల్లో శ్రీమహావిష్ణువు ముద్రల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దర్శనంతో సుఖశాంతులు రాష్ట్రానికే గాక యావత్ భారతావనికి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఈ నవ జనార్దన క్షేత్రాలు విరాజిల్లుతున్నాయి. పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ఆలయాలను సందర్శిస్తే నవ గ్రహదోషాల నివారణ జరుగుతుంది. సుఖశాంతులు కలుగుతాయి. – అంగర గోపాల కృష్ణమాచార్యులు, శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు, సంధిపూడి -
ధవళేశ్వరంలో యోగ ముద్రలో..
నవ జనార్థనస్వామి ఆలయాల్లో ప్రథమమైన ధవళేశ్వరంలో బ్రహ్మచారిగా భాసిల్లుతున్న శ్రీజనార్దన స్వామి యోగ ముద్రలో దర్శనమిస్తాడు. ఉగ్రరూపంలో ఉన్న జనార్దనస్వామిని శాంతింపజేయాలన్న భక్తుల సంకల్పం మేరకు ఆలయంలో మహాలక్ష్మీదేవిని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఇక్కడ భీష్మ ఏకాదశి రోజున రథోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. మడికిలో సుదర్శన ముద్ర 216 ఏ జాతీయ రహదారిలోనున్న మడికిలో ద్వితీయంగా వెలసిన శ్రీజనార్దనస్వామి సుదర్శన ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. తూర్పు ముఖంగా వెలసి ఉన్న ఈ ఆలయంలో విగ్రహం పాదాలకు ప్రాతఃకాలంలో సూర్య కిరణాలు ప్రతి రోజు తాకుతుండటం విశేషం. -
వందే మాతరం స్మారక నాణెం సేకరణ
అమలాపురం టౌన్: వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ.150 స్మారక నాణేన్ని విడుదల చేసింది. ఈ నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని చాటి చెప్పేలా, దేశభక్తిని చాటే ఇలాంటి అరుదైన నాణేన్ని తాను సేకరించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 32 గ్రాముల బరువుతో ఉండే ఈ నాణేన్ని నికెల్, సిల్వర్ మిశ్రమంతో తయారు చేశారు. నాణేనికి ఓ వైపు రూ.150 ముఖ విలువ, మరో వైపు బ్రిటిష్ సైనికుల అరాచకాలను నిరసిస్తూ భారతీయులు ఏకతాటిపై నిలిచి ‘వంద మాతరం’ అని నినదిస్తున్న చారిత్రాత్మక దృశ్యం ముద్రించారు. ఆవుకు కవల దూడలు రాయవరం: సాధారణంగా ఆవుకు లేదా గేదెకు ఒక ఈతలో ఒక దూడ జన్మిస్తుంది. అయితే మండలంలోని లొల్లలో ఆవుకు కవల దూడలు జన్మించాయి. గ్రామానికి చెందిన పాడి రైతు జొన్నగంటి త్రిమూర్తులుకు చెందిన ఆవుకు రెండు పెయ్య దూడలు గురువారం జన్మించాయి. దీంతో రైతు కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు దూడలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపాడు. పత్ర గణపతి! పెద్దాపురం (సామర్లకోట) : లేత కొబ్బరి ఆకులతో పెద్దాపురం మరిడమ్మ ఆలయ సిబ్బంది తయారు చేసిన వినాయకుడి బొమ్మ ఆకట్టుకుంటోంది. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులు దర్శించుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. -
బీసీ సంక్షేమ కార్యాలయంపై ఏసీబీ దాడి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): లంచం తీసుకుంటూండగా కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి సహా ముగ్గురిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ కథనం ప్రకారం.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం అడవిపేట గ్రామానికి చెందిన గెద్దాడి చక్రవర్తి తండ్రి అంబేడ్కర్ ఈ ఏడాది జూలై నెలలో చనిపోయారు. ఈ నేపథ్యంలో కుటుంబ పెన్షన్ ఖరారు, కారుణ్య నియామకం కోసం బీసీ వెల్ఫేర్ అధికారులను చక్రవర్తి సంప్రదించగా వారు రూ.లక్ష లంచం డిమాండ్ చేశారు. చివరకు మధ్యవర్తి యాదల సత్యనారాయణ ద్వారా జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం లల్లి, సీనియర్ అసిస్టెంట్ కారపు ఎస్ఎస్ ప్రసాద్ రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్నారు. అయితే, లంచం ఇవ్వడం ఇష్టం లేని చక్రవర్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో మధ్యవర్తి ద్వారా గురువారం రూ.40 వేలు ఇస్తూండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిషోర్కుమార్, సీఐలు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్ ఆధ్వర్యంలో వారిని అరెస్టు చేశారు. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. వారిని రాజమహేంద్రవరంలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి సంబంధించిన సమాచారం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా మొబైల్ నంబర్ 94404 40057కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కిషోర్ కుమార్ ప్రజలకు సూచించారు. రెడ్ హ్యాండెండ్గా పట్టుబడిన ఇద్దరు ఉద్యోగులు, ఒక దళారి -
క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిత
రాజమహేంద్రవరం రూరల్: విద్యతో పాటు క్రీడలలో రాణించడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అన్నారు. బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడురోజుల పాటు నిర్వహించిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్–2025 బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ప్రిన్సిపాల్ ఆకుల మురళి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పలివెల రాజు మాట్లాడుతూ పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ప్రస్తుత ఆహార అలవాట్ల నేపథ్యంలో క్రీడలతో పాటు యెగా, మెడిటేషన్ చేయాలన్నారు. రాజమహేంద్రవరం మహిళాజైలు సూపరింటెండెంట్ వసంత కె.చెట్టి మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను నేర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎ.మురళి, ఆంధ్రా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్దనరావు, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు కమల్భాషా విజేతలను అభినందించారు. ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్న కాకినాడ ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్దనరావును, కోచ్ వెంకటరమణను సత్కరించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు. చాంపియన్స్ వీరే... మెన్స్ విభాగంలో ఇండివిడ్యువల్ చాంపియన్గా జి.అవినాష్కుమార్ (ఆదిత్య ఇంజినీరింగ్, సూరంపాలెం), స్పోర్ట్స్ విభాగంలో చాంపియన్గా ఆదిత్య ఇంజినీరింగ్ (సూరంపాలెం), గేమ్స్ విభాగంలో చాంపియన్ ఆంధ్రా పాలిటెక్నిక్ (కాకినాడ), ఓవరాల్ చాంచాయన్ ఆంధ్రాపాలిటెక్నిక్(కాకినాడ) నిలిచాయి. వుమెన్స్ విభాగంలో ఇండువిడ్యువల్ చాంపియన్గా వేగుల ప్రసన్న (ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్, కాకినాడ), స్పోర్ట్స్, గేమ్స్ చాంపియన్తో పాటు ఓవరాల్ చాంపియన్గా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ (కాకినాడ) నిలిచింది. వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ఓఎస్డీ, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మెన్స్ విభాగంలో ఓవరాల్ చాంపియన్గా నిలిచిన కాకినాడ ఆంధ్రా పాలిటెక్నిక్ టీమ్ వుమెన్స్ విభాగంలో ఓవరాల్ చాంపియన్గా నిలిచిన కాకినాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ టీమ్ ముగిసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్–2025 -
రాజమహేంద్రవరంలో రెయిన్బో ఆసుపత్రి సేవలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రెయిన్బో ఆసుపత్రి సేవలు రాజమహేంద్రవరంలో అందుబాటులోకి వచ్చాయని ఆ ఆసుపత్రి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల గురువారం తెలిపారు. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డులో ఆస్పత్రిని ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఉభయగోదావరి జిల్లా వాసులకు అధునాతన నియోనాటల్, పీడీయాట్రిక్ ఇన్సెంటివ్ కేర్, జనరల్ పీడియాట్రిక్, బర్త్ రైట్స్ ప్రసూతి, గైనకాలజీ, హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేర్, సంతానోత్పత్తి సంరక్షణ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, శిక్షణ పొందిన నర్సులు అధునాతన క్లినికల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఆవిష్కరణతో రాజమహేంద్రవరం ఒక కీలకమైన ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఉంటుందన్నారు. తమ సంస్థ 25 సంవత్సరాల వారసత్వ అనుభవంతో దేశంలో అతి పెద్ద నెట్వర్క్ కలిగి, తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసం చూరగొందన్నారు. గతంలో రెయిన్ బో ఆసుపత్రి సేవలు పొందాలంటే మెట్రో నగరాలకు వెళ్లవలసి వచ్చేదని, ఇప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయన్నారు. మరో ముఖ్య అతిథి తేజస్విని మతుకుమల్లి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఆసుపత్రి ప్రారంభించినందుకు రెయిన్ బో బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. అత్యున్నత నాణ్యతా చికిత్సలు ఈ ప్రాంత వాసులకు కల్పించడమే కాకుండా తల్లి, బిడ్డల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తుందన్నారు. డాక్టర్ దినేష్ చిర్లా, డాక్టర్ ప్రణతీరెడ్డి, నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. -
జొన్నాడలో అభయం
జొన్నాడలో వెలసిన శ్రీజనార్థనస్వామి అభయ ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా ఈ స్వామిని కొలుస్తారు. భక్తులు సమీపంలోని గోదావరిలో స్నానమాచరించి దేవతామూర్తులను దర్శించుకుంటారు. ఆలమూరులో ఉగ్ర రూపం ఆలమూరులో ఉగ్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ రథ సప్తమి రోజున భారీగా స్వామి రథోత్సవం నిర్వహిస్తారు. కపిలేశ్వరపురంలో పద్మాసనంలో.. పూర్వం ఇక్కడి ఆలయం దోపిడీకి గురైంది. దీంతో అప్పటి అర్చకులు జనార్దనస్వామి విగ్రహాన్ని భూమిలో భద్రపరిచారు. కొన్నేళ్లు కిందట ఈ విగ్రహం బయట పడటంతో ఆలయాన్ని భక్తులు పునర్నిర్మించారు. ఈఆలయంలో జనార్థునుడు పద్మాసనంలో దర్శనమిస్తాడు. మాచర జ్వాలాముద్ర నవ జనార్దన ఆలయాల్లో సప్తమ క్షేత్రంగా భాసిల్లుతున్న మాచరలో స్వామి జ్వాలాముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. రథ చక్రాకృతిలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పెద కోరుమిల్లిలో సాధక ముద్ర గౌతమీ నది చెంతన అష్టమ క్షేత్రంగా విరాజిల్లుతున్న పెద కోరుమిల్లిలోని స్వామి సాధక ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. -
మండపేటలో భోగ ముద్ర
మండపేటలో వేంచేసియున్న స్వామి భోగ ముద్రలో భక్తులకు దర్శనమిస్తాడు. కపిలేశ్వరపురం మండలంలోని దాతపురిగా ప్రఖ్యాతిగాంచిన తాతపూడిలోని గోదావరి చెంతన తొలుత ఈ ఆలయం ఉండేది. వరదల వల్ల దేవాలయం దెబ్బతినడంతో పండితుల సలహా మేరకు మాండవ్యపురం (మండపేట)కు ఆ విగ్రహాన్ని తీసుకు వచ్చారని పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ జనార్దనుడితో పాటు ఆగస్త్యేశ్వర, కై లాసేశ్వర స్వాముల ఆలయాలు ఉండటం ప్రత్యేకత. కోటిపల్లిలో సిద్ధ ముద్ర భారతదేశంలోనే మరెక్కడా లేని విధంగా గోదావరి నదీ తీరాన కోటిపల్లిలో వైష్ణ, శైవ క్షేత్రాలు ఒకే శిఖరం కింద, ఒకే ధ్వజస్తంభంతో వేర్వేరు గర్భ గుడుల్లో ఉన్నాయి. ఇక్కడ జనార్దనస్వామి సిద్ధ ముద్రలో కనిపిస్తారు. ఛాయా సోమేశ్వరస్వామిని దర్శించుంటే సకల పాపహరణం జరుగుతుందని భక్తుల నమ్మకం. -
పోలవరం.. మళ్లీ అదే తప్పు చేస్తున్న చంద్రబాబు!: ఉండవల్లి
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వంలో పోలవరం పనులు నత్తనడకనే సాగుతున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రులు తరచూ అక్కడ పర్యటిస్తుండడం వల్ల మొత్తం అధికార యంత్రాగం వాళ్ల చుట్టే తిరుగుతోందని.. తద్వారా పనులు త్వరగతిన సాగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ.. పోలవరంలో డయాగ్రమ్ వాల్ మళ్ళీ కడుతున్నారు. పనులు ఎలా జరుగుతున్నాయో మీడియం తీసుకెళ్లి చూపించాలి అనుకున్నాను. కాఫర్ డ్యామ్ ఫెయిల్యూర్కు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధమే లేదు. తెలుగు దేశం హయాంలో జరిగిన తప్పు వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని జగన్ స్పష్టం చేశారు. రూ.440 కోట్ల డయాఫ్రమ్ వాల్ ఫెయిల్ అయినా కూడా అదే కంపెనీ మళ్లీ పనులు చేస్తోంది.. ఇప్పుడు రూ.990 కోట్లతో అదే బావర్ కంపెనీ కొత్త డయాఫ్రమ్ వాల్ కడుతోంది. దీనిపై ఎందుకు ఎంక్వయిరీ జరగడం లేదు. పోలవరానికి సంబంధించి ప్యానల్ అఫ్ ఎక్స్పర్ట్స్(POE) ఇచ్చిన రిపోర్ట్ ఎక్కడ ఉంది?. అసలు ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది??.. రైట్ టు ఇన్ఫర్మేషన్ లో ప్రభుత్వాన్ని అడిగితే కాపీ రైట్ వర్తిస్తుందని చెప్పటం దారుణం. వాల్ కొట్టుకుపోవడం మానవ తప్పిదమా?.. ఫ్లడ్ భారీగా రావటం వల్ల జరిగిన సమస్యా? అనే విషయాన్ని స్పష్టం చేయాలి. ఢయాఫ్రం వాల్ మళ్ళీ కడుతున్నారు.. ఇదే ప్రమాదం ఎదురైతే ఏం చేస్తారో స్పష్టం చేయాలి. పోలవరంలో తరచూ చంద్రబాబు, మంత్రులు చేసే విజిట్లు వల్ల పనులు త్వరితగతిన సాగడం లేదనిపిస్తోంది. మొత్తం యంత్రాంగం అంతా వీరి చుట్టూనే తిరుగుతోంది. గత పుష్కరాల్లో జనం చనిపోవటానికి ముహూర్తం మూఢనమ్మకమే కారణమని కమిషన్ చెప్పేసింది. అప్పట్లో టిడిపితో బీజేపీ కలిసి ఉండటం వల్ల ఏం మాట్లాడలేదు. ముహూర్తం మూఢనమ్మకమా?.. అదే అనుకుంటే అన్ని మూఢనమ్మకాలే!’’ అని ఉండవల్లి అన్నారు. -
పుంజుకున్న పెంపకం..
నిడదవోలు: సంక్రాంతి.. ఈ పేరు అంటేనే గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు పెట్టింది పేరు. సామాన్యుల నుంచి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సైతం పందేలకు సై అంటారు. పండగ సమీపిస్తుండడంతో కోడి పుంజుల వేటలో పందెం రాయుళ్లు ఉంటే, మరోపక్క నిర్వాహకులు మూడు నెలల నుంచి పుంజుల పెంపకంలో నిమగ్నమవుతున్నారు. వీరు పుంజులకు రాజభోగాలతో మేత పెట్టి మరీ పందేలకు సిద్ధం చేస్తున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా ఏటా బరుల్లో రక్తపుటేరులు పారిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందేలకు అవసరమైన పుంజులను రెడీ చేస్తున్నారు. ఈ సీజన్లో పందెం కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. వీటిపై వ్యాపారం చేసే కొందరు ముందుగా పెంచిన పుంజులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే పందెం రాయుళ్లు పుంజుల వేట మొదలుపెట్టారు. వారికి కావాల్సిన రంగు, సైజుల్లో ఉన్న పుంజులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి సమీపిస్తుండడంతో పుంజులను కంటికి రెప్పలా చూసుకుంటూ వాటికి అవసరమైన సఫారీలు చేస్తున్నారు. ప్రధానంగా కాకి, డేగ, నెమలి, పరదా, పచ్చకాకి, పెట్టమారు, రసంగి, తీతువా, మైలియా, సింగాలి వంటి రకాల పుంజులను పెంచుతున్నారు. డిమాండ్ను బట్టి.. కత్తులు కట్టి బరిలో దింపే పుంజుల ధరలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. కోడి పుంజుల జాతులను పందెం రాయుళ్లు పలు రకాలుగా పిలుస్తారు. రకాన్ని బట్టి ఒక్కో పుంజు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతోంది. సరైన పందెం పుంజు దొరికితే ఎంత ధరైనా ముట్టజెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా సేతువు జాతి కోడి మీద పందేలు జోరుగా కాస్తారు. దీని ధర రూ.70 వేల వరకూ పలుకుతోంది. అలాగే వర్ల రకం కోడి ధర రూ. 50 వేలు ఉంది. నెమలి రకం కోడి పుంజు ప్రస్తుతం రూ.50 వేల నుంచి రూ.60 వేలు పలుకుతోంది. కాకి డేగ, పర్ల రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఎర్ర కెక్కిరాయి రూ.40 వేలు, పచ్చకాకి, డేగ రూ.30 వేల నుంచి రూ.40 వేలకు అమ్ముతున్నారు. డిమాండ్ను బట్టి పెంపకందారులు ధరను అమాంతం పెంచుకుపోతున్నారు. రసంగి, సేతువా, కెక్కరి, పూల, అబ్రాసు, రసంగి, మైయిలా, సింగాలి, పెట్టమారు, పింగళ వంటి రకాల కోడి పుంజులు రూ.25 వేల నుంచి రూ.30 వేల ధరకు పందెం రాయుళ్లు కొనుక్కుపోతున్నారు. పౌష్టికాహారం.. ఆపై వ్యాయామం పుంజులను రోజూ ఈత కొట్టించడంతో పాటు వేడి నీళ్లతో స్నానం చేయించి శక్తివంతమైన పుంజులుగా తయారు చేస్తున్నారు. నవంబర్ మాసం నుంచి వీటికి గంట్లు, చోళ్లు, గుడ్లు, పిస్తాలు, బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, నల్ల నువ్వులు, తాటి బెల్లం, మటన్ కై మా, నాస్తా వంటివి ఆహారంగా ఉదయం, సాయంత్రం ఇస్తున్నారు. పౌష్టికాహారం తీసుకున్న పుంజులకు అరుగుదలకు, బద్దకం, నీరసం రాకుండా రోజూ వ్యాయామాలు కూడా చేయిస్తున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా నీటి తొట్టెలను నిర్మించి వాటిలో రోజు ఉదయం ఊత కొట్టిస్తున్నారు. కోళ్ల పెంపకందారులు, పందెం రాయుళ్లు పుంజులకు రాజభోగాలతో మేత పెట్టి మరీ పందెలకు సిద్ధం చేస్తున్నారు. కొందరు అదనంగా విటమిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ప్రత్యేక ఆహారంతో పెంచుతూ సంక్రాంతి బరిలోకి సిద్ధం చేస్తున్నారు. అబ్రాసు జాతి పుంజు ముహూర్తాలు చూసి మరీ.. సేతువా, పచ్చకాకి, డేగ, కాకి పుంజు, పెట్టమారు వంటి జాతి పుంజులు బరిలో దిగితే నువ్వా.. నేనా అనేలా తలపడతాయి. సేతువు రకం తెల్ల కోడిపుంజు బరిలో ప్రత్యర్థి పుంజును మట్టి కరిపించేందుకు గాయాలతో రక్తం కారుతున్నా లెక్క చేయకుండా కొనఊపిరి వరకూ పోరాడుతుంది. డేగ మీద కూడా ఎక్కువగా పందేలు కడతారు. ఇది కూడా బరిలో పందెం రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తుంది. కొందరు కోడి పుంజుల జాతి పేర్ల ప్రకారం ముహూర్తాలు చూసుకుని మరీ పందేలు కాస్తారు. కోడి జాతిని బట్టి ఏ దిక్కుకు వెళ్లాలి, ఏ సమయంలో పుంజులను బరిలో దింపాలో ముందుగానే ముహూర్తాలు చూసుకుంటారు. రూ.కోట్లలో జూదం సంక్రాంతి పండగ మూడు రోజులూ ఈ కోళ్లతో ఏటా రూ.కోట్ల జూదం జరుగుతోంది. కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఐ.పోలవరం మండలం, కాట్రేనికోన, రావులపాలెం, తూర్పుగోదావరి జిల్లాలో నిడదవోలు, గోపాలపురం, నల్లజర్ల, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల్లో భారీ స్థాయిలో బరులు నిర్వహిస్తారు. నిడదవోలు పట్టణంలో ఫ్లడ్ లైట్లు, భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేసి మరీ పందేలు జరుపుతారు. పందెం కోళ్లకు రాజభోగాలు సంక్రాంతి బరిలో దింపేందుకు తర్ఫీదు రకాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ ధర -
ఏటీఎం మార్చి ఏమార్చి..
● జల్సాలకు అలవాటు పడి చోరీలు ● పోలీసుల అదుపులోకి నిందితుడు అనపర్తి: ఏటీఎంల వద్దకు వస్తున్న అమాయక ప్రజలే అతని టార్గెట్.. వారిని మాటల్లోకి దించి, ఆపై ఏటీఎంలు మార్చి చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకున్నారు.. మళ్లీ కటకటాల్లోకి పంపారు.. జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న అతన్ని అనపర్తి పోలీసులు మంగళవారం చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై బుధవారం అనపర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య వివరాలు వెల్లడించారు. నెల్లూరు పట్టణానికి చెందిన కందూకూరు ఫణీంద్ర బీటెక్ చదివాడు. అతను జల్సాలకు అలవాటు పడి చోరీల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏటీఎంల వద్ద చదువు రాని, వృద్ధులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేయడంలో సహాయం చేసినట్లు నటించి వారి ఏటీఎం కార్డును తస్కరిస్తాడు. తన వద్ద ఉన్న డూప్లికేట్ కార్డును వారికిచ్చి, అనంతరం అసలు ఏటీఎం ఉపయోగించి వారి ఖాతాల్లోని సొమ్ము డ్రా చేసి ఉడాయిస్తాడు. ఈ ఏడాది మార్చి నెల 13న అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల ముత్యాలు అనపర్తి కెనాల్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుండగా, మాటలు కలిపి ఏటీఎం కార్డును తస్కరించాడు. అనంతరం ఫణీంద్ర రూ.35 వేలు విత్ డ్రా చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనపర్తి ఎస్సై ఎల్.శ్రీనునాయక్ దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ తెలిపారు. పలు జిల్లాల్లో నమోదైన 7 కేసుల్లో శిక్ష అనుభవించినా, నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు. 2024 నుంచి తాడేపల్లిగూడెంలో ఉంటూ అనపర్తి, జగ్గంపేట, మండపేట టౌన్, రాజమహేంద్రవరం, అత్తిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ నేరాలకు పాల్పడగా, వచ్చిన సుమారు రూ.1.70 లక్షలతో కారును కొనుగోలు చేసి జల్సా చేస్తున్నాడని డీఎస్పీ వివరించారు. ఫణీంద్ర నుంచి కారు, నేరాలకు ఉపయోగించిన 10 ఏటీఎం కార్డులను సీజ్ చేశామన్నారు. సీఐ సుమంత్ ఆధ్వర్యంలో త్వరితగతిన కేసును ఛేదించడంలో శ్రమించిన ఎస్సై శ్రీనునాయక్ను, ఆయన బృందాన్ని డీఎస్పీ అభినందించారు. -
వెంకన్న హుండీ ఆదాయం రూ.1.56 కోట్లు
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,56,31,085 ఽఆదాయం వచ్చినట్టు దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 28 రోజుల అనంతరం బుధవారం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఆలయంలోని హుండీలను తెరిచి, వసంత మండపంలో లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామివారి హుండీల ద్వారా రూ.1,28,07,874, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.28,23,211 ఽఆదాయం వచ్చినట్టు వివరించారు. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి కిలో 150 గ్రాములు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు 43 వచ్చాయని ఈఓ తెలిపారు. పర్యవేక్షణ అధికారులుగా దేవదాయ శాఖ ఏసీ, అండ్ అంతర్వేది దేవస్థానం ఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, వెలిచేరు గ్రూపు దేవాలయాల గ్రేడ్– 3 ఈఓ ఎం.సత్యనారాయణ, అర్చకులు, దేవస్థానం సిబ్బంది, సేవకులు తదితరులు పాల్గొన్నారు. -
మట్టి... కొల్లగొట్టి
● ఆగని మట్టి అక్రమ తవ్వకాలు ● రెచ్చిపోతున్న మాఫియా కొత్తపేట: నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పలువురు మట్టి వ్యాపారులు ప్రైవేట్ భూముల్లోనే కాదు.. నదీ పరీవాహక ప్రభుత్వ భూముల్లో సైతం మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నా సంబంధిత అధికారులకు మాత్రం పట్టడం లేదనే విమర్శలున్నాయి. కొత్తపల్లి మండలం మందపల్లి, నారాయణలంక, కొత్తపేట సూర్యగుండాల పాయ ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. ఇక్కడ కొందరు నేతల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీలతో మట్టి తవ్వి, తరలిస్తున్నారు. రాత్రీ, పగలు అనే తేడా లేకుండా పక్క రోడ్లలోనే కాదు.. నిర్భయంగా ప్రధాన ఆర్అండ్బీ, జాతీయ రహదారులపై అధికారుల కళ్లముందే ట్రాక్టర్లపై మట్టి తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలకు మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా వాటిని ఖాతరు చేయడం లేదు. ‘కూటమి’గా ఏర్పడి మట్టి దందా నిర్భయంగా సాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది రైతులు నిబంధనలకు విరుద్ధంగా తమ చేలల్లో మట్టిని లోతుగా తవ్వుకునేందుకు పెద్ద మొత్తానికి విక్రయించగా, పక్క చేలు విరిగిపోతాయని బాధిత రైతులు వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని అందిన సమాచారంతో అధికారులు వెళ్లి నిలిపివేస్తున్నా, చర్యలకు పలువురి నేతల నుంచి ఫోన్లు రావడంతో వారు వెనుతిరుగుతున్నారని తెలుస్తోంది. పలుచోట్ల గౌతమి, వశిష్ట నదీ పరీవాహక లంక భూముల్లో ఎక్కువగా ఈ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా పుంత రోడ్లు, పక్క రోడ్లు వెంబడి తరలిస్తుంటే, కొన్నిచోట్ల ప్రధాన రహదారుల నుంచి తీసుకెళ్తున్నారు. -
పరమాత్మ తప్ప రక్షకులు లేరు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కృష్ణా! మహావీరులు అయిన అయిదుగురు పతులు నిస్సహాయులుగా మిగిలిపోయినప్పుడు నీవే నిండుసభలో నన్ను రక్షించావు’ అని ద్రౌపది వనవాసం చేస్తున్న తమను చూడటానికి వచ్చిన కృష్ణ పరమాత్మతో అంటుందని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతం, వనపర్వంలోని పలు అంశాలను వివరించారు. పరమాత్మ తప్ప రక్షకులు లేరని నాటి సభలో నిరూపణ అయిందని ఆమె అంటుంది. కృష్ణ పరమాత్మ ద్రౌపదిని పరాభవిస్తున్న సమయంలో తాను ద్వారకలో లేనని, ఉంటే ఇలా జరిగేది కాదని అంటాడు. ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ద్రౌపదికి అక్షయ వస్త్రాలు ఇచ్చి, ఆమెను కాపాడిన కృష్ణుడు తాను ద్వారకలో లేకపోవడం వలన ఈ అనర్థం జరిగిందని చెప్పడంలో అంతరార్థం మనం తెలుసుకోవాలని అన్నారు. నీలకంఠీయ వ్యాఖ్యానాన్ని అనుసరించి, ద్వారక అంటే నవద్వారాలు కల శరీరమని ఆయన వివరించారు. ద్రౌపదిని దుశ్శాసనాదులు అవమానిస్తుంటే, పాండవుల స్మరణలో కృష్ణుడు లేడు, వారు విధి బలీయమైందని అనుకున్నారే కానీ, కృష్ణ స్మరణ చేయలేదు. బుద్ధి ప్రపంచం వైపు తిరిగితే పరమాత్మ కనిపించడు, ఆయన వైపు తిరిగితే కనిపిస్తాడని సామవేదం అన్నారు. పాండవులు వనాలకు తరలిపోయాక, ధృతరాష్ట్రుడు కలత చెంది విదురుని పిలిచి, తనకు హితం ఏది కలిగిస్తుందో చెప్పమంటాడు. పాండవుల రాజ్యభాగం వారికి ఇచ్చి వేయాలి, దుశ్శాసనుడు తాను చేసిన అకృత్యానికి నిండు సభలో పాండవులను క్షమించమని అడగాలి. నీవు దుర్యోధనుని వదిలివేస్తే, అందరూ క్షేమంగా ఉంటారని విదురుడు చెబుతాడు. దానికి తీవ్ర కోపంతో ధృతరాష్ట్రుడు విదురుని నిందించి, నీవు ఉంటే ఉండు, పోతే పొమ్మని అంటాడు. విదురుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల వద్దకు వెడతాడు. ధృతరాష్ట్రుడు పశ్చాత్తాపంతో సంజయుని పంపి, విదురుని చేర తీసుకుంటాడని సామవేదం అన్నారు. దుష్టచతుష్టయం కుటిల పన్నాగాలు తెలుసుకున్న వ్యాసుడు వచ్చి ధృతరాష్ట్రునితో పాండవుల రాజ్యం వారికి ఇచ్చివేయమని, లేని పక్షంలో దుర్యోధనుని అడవులకు పంపి పాండవులతో చెలిమి చేయమని అంటాడు. సత్పురుషులతో వైరం ప్రమాదకరం, స్వజనులతో వైరం అంతకన్నా ప్రమాదకరమని హెచ్చరిస్తాడు. హితం ఉపదేశించడానికి వచ్చిన మైత్రే య మహర్షి మాటలను లక్ష్యపెట్టక, వినయరాహిత్యంతో దుర్యోధనుడు తన కాలిని ముందుకు చాచి తొడ మీద కొట్టుకుంటాడు. పాండవులతో శాంతియుతంగా జీవించకపోతే, ధర్మయుద్ధంలో భీముడు నీ తొడను పగలగొడతాడని మైత్రేయ మహర్షి దుర్యోధనుని శపిస్తాడని సామవేదం వివరించారు. వంచన చేసి సుఖపడాలనుకున్నవాడు వధ్యుడేనని సామవేదం అన్నారు. -
వెంకటరమణ చౌదరికే పగ్గాలు
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష పదవి ఎన్నిక ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి నియామకం దాదాపు ఖాయమైంది. దీంతో ఆరు నెలలుగా అధ్యక్ష ఎంపికపై కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెర పడింది. అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి జిల్లా రథసారథిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వెంకటరమణ చౌదరికి పదవి కట్టబెట్టడంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. దళితులకు పదవి కేటాయించాలన్న డిమాండ్ సైతం తెరపైకి వచ్చింది. కానీ చౌదరికి అధిష్టానం అండదండలు, మంత్రి లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండటంతో పదవి వరించింది. ఇదిలా ఉంటే సీనియర్ నేతలకు అన్యాయం జరిగిందన్న వాదన ఆయా వర్గాల్లో వెల్లువెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కేఎస్ జవహర్ వ్యవహరించేవారు. ఆయనకు రాజ్యాంగ బద్ధమైన ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవి దక్కడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడి మార్పు అనివార్యమైంది. ఆరు నెలలుగా అధ్యక్షుడి స్థానం ఖాళీగానే ఉంది. సీనియర్లకు మళ్లీ భంగపాటు ● సైకిలెక్కేందుకు జిల్లాలో పలువురు నేతలు పోటీ పడ్డారు. వారి స్థాయిలో పావులు కదిపారు. సీనియర్ నేత గన్నికృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు పదవిని ఆశించి భంగపడ్డారు. సీనియర్ నేత గన్నికృష్ణ వర్గం నేతలు సైతం త్రిసభ్య కమిటీ ఎదుట ఆయన పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. గన్నికృష్ణ ఇప్పటికే రాజమహేంద్రవరం మేయర్ పీఠం ఆశిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్, సిటీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వర్గ విభేదాలతో ఇప్పట్లో కార్పొరేషన్ ఎన్నికల జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. సీనియర్ నేత కావడంతో పదవి దక్కుతుందన్న భావనలో ఆయన వర్గం నేతలు ఉన్నారు. ● టీడీపీలో సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా వ్యవహరించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. మూడు దశల నామినేటెడ్ పదవుల భర్తీలో ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవైనా ఇవ్వాలంటూ ఆయన వర్గీయులు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. ఈ పరిణాం టీడీపీ సీనియర్ నేతలకు మింగుడుపడటం లేదు. పార్టీ పటిష్టతకు పాటుపడే వారికి గుర్తింపు దక్కడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఎట్టకేలకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక కొలిక్కి అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి రేసులో సీనియర్ నాయకులు గన్ని కృష్ణ, ముళ్ళపూడి బాపిరాజు లోకేష్ ఆశీస్సులు ఉన్న వెంకటరమణ చౌదరికే పట్టం సీనియర్ నేతలకు మరోసారి మొండిచేయి ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లోనూ ఆశాభంగం -
గోదారమ్మకు గర్భశోకం
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి నదీ తీరం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. నిబంధనలకు నీళ్లోదిలి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తోంది. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా తమనెవరు ప్రశ్నిస్తారని రెచ్చిపోతోంది. గోదావరి నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోంది. పది అడుగుల లోతు వరకూ ఇష్టానుసారంగా తవ్వేస్తూ సహజ సంపదను దోపిడీ చేస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ దందా దర్జాగా సాగుతోంది. స్వయానా మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంతటి దోపిడీకి తెరతీసినా.. అటువైపు కన్నెత్తి చూసే నాథుడే కరవయ్యాడు. మూడు రోజులుగా దందా సాగుతున్నా.. ఏ ఒక్క అధికారీ అడ్డుకునేందుకు సాహసం చేయడం లేదు. నిత్యం లారీల కొద్దీ ఇసుక ఇతర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు కొల్లగొడుతున్నా చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తుండటం వెనుక మతలబు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాంట్రాక్టర్కు గడువు ముగిసినా.. నిడదవోలు నియోజకవర్గం ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్లో మూడు రోజులుగా అనుమతులు లేకుండా ఇసుక యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ర్యాంపును గతేడాది దక్కించుకున్న కాంట్రాక్టర్కు గడువు ముగిసింది. ఈ ఏడాది ఇంకా అనుమతులు ఇవ్వలేదు. అయినా తమను ఆపేదెవరంటూ ఇసుక మాఫియా బరితెగిస్తోంది. కూటమి నేతల కనుసన్నల్లో ర్యాంపు నిర్వహిస్తుండడంతో అక్రమాల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు తూట్లు పొడిచి ఇసుకను తవ్వేస్తున్నారు. పగలు, రాత్రి అని తేడా లేకుండా తవ్వకాలు చేసి తరలించేస్తున్నారు. నిత్యం 400 లారీలకు పైగా ఇసుక భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు జేసీబీలు ఉపయోగించి మరీ.. యంత్రాలతో దర్జాగా తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులు ఉండి.. రీచ్ దక్కించుకుంటే ప్రభుత్వ నిబంధనల మేరకు కూలీల ద్వారా నదిలో ఉన్న మేటల నుంచి ఇసుకను తవ్వాలి. లోడింగ్కు సైతం కూలీలనే ఉపయోగించాలి. గోదావరిలోకి యంత్రాలు, లారీలు తీసుకెళ్లడం నిషేధం. కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు. ఇష్టానుసారంగా యంత్రాలతో లోడింగ్ చేసేస్తున్నారు. వందల సంఖ్యలో లారీలో గోదావరిలోకి తీసుకెళ్లి ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ‘కానూరు–పెండ్యాల’ రీచ్లో ప్రతి రోజూ మూడు జేసీబీలు ఇసుక తోడేందుకు వినియోగిస్తున్నారు. రాత్రిళ్లు అయితే మరింత రెచ్చిపోతున్నారు. కిలో మీటర్ల మేర వందల వాహనాలు క్యూ కడుతున్నాయి. యంత్రాలను నదిలోకి దించి పది అడుగుల వరకు గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఒక్క ‘కానూరు–పెండ్యాల’ రీచ్ నుంచి ప్రతి రోజూ 400లకు పైగా లారీల ఇసుక అక్రమంగా తవ్వి, తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు సమాచారం. నెలకు రూ.10 కోట్ల దోపిడీ అసలే అక్రమ తవ్వకాలు ఆపై అధిక ధరకు విక్రయిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అనుమతులు ఉంటే.. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంప్లో 6 యూనిట్ల లారీ ఇసుక రూ.1,900 వందలకు విక్రయించాల్సి ఉంది. కానీ రూ.5,500 నుంచి రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. అక్కడి నుంచి బయట మార్కెట్లోకి వెళ్లే సరికి కిరాయితో కలిపి రూ.10 వేల నుంచి రూ.15 వేలకు ఇసుక లారీ ధర చేరుతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు ఓపెన్ రీచ్లలో ఇసుక టన్ను రూ.35 నుంచి రూ.100 లోపు మాత్రమే ఉంది. బోటు ర్యాంపుల వద్ద టన్ను ఇసుక రూ.240 ధర పలుకుతోంది. 6 యూనిట్లకు రూ.3,000 మాత్రమే తీసుకుంటున్నారు. అయితే కానూరు–పెండ్యాల రీచ్ వద్ద మాత్రం ఏకంగా రూ.6,500 దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఒక్క కానూరు–పెండ్యాల రీచ్ నుంచే ప్రతి రోజూ రాత్రి, పగలు 400కు పైగా లారీల ఇసుక అక్రమంగా తరలుతోంది. ఒక్కో లారీ ఇసుక రూ.6,500 చొప్పున రోజుకు 400 లారీలకు రూ.26 లక్షలు కూటమి నేతల జేబుల్లోకి వెళుతోంది. బిల్లులు కావాలంటే మరింత ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. మూడు రోజులుగా రూ.78 లక్షలు దండుకున్నట్లు విమర్శలున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఒక్క ర్యాంప్ నుంచే నెలకు సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు దండుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. పరిమితులు లేకుండా.. అనుమతులు లేకుండా దర్జాగా తవ్వకాలు చేపడుతున్నా.. పరిమితులు లేకుండా లారీల ఇసుక తరలుతున్నా.. అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రహదారులపై లారీల ప్రవాహం కొనసాగుతున్నా అడ్డుకున్న దాఖలాలు లేవు. పైగా ఇసుక మాఫియాతో మైత్రి కొనసాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అనుమతులు లేకుండా ఎందుకు తవ్వుతున్నారు..?, ఎక్కడికి తరలిస్తున్నారు..? అని ప్రశ్నించిన సందర్భాలు లేవు. దీని వెనుక భారీ స్థాయిలో మామూళ్లు అందినట్లు ఆరోపణలున్నాయి. రీచ్ తెరిచే ముందే ఇసుక మాఫియా... అధికారులను మేనేజ్ చేసేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే ఇంత భారీ అక్రమం జరుగుతున్నా.. పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఎవరాపుతారు? అనుమతులు లేకుండా తవ్వుతున్న వైనంపై మాఫియా తమకేమీ భయం లేదన్నట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. తమకు ఓ ప్రజాప్రతినిధి, ఓ టీడీపీ నేత అండదండలు పుష్కలంగా ఉన్నాయని, తమను ఆపేవారెవరన్న ధీమాతో ఉన్నట్లు తెలిసింది. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతుండటం, అధికారులకు ఇప్పటికే ఆమ్యామ్యాలు అందడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. కలెక్టర్ స్పందిస్తేనే.. ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రీచ్లపై కలెక్టర్ స్పందిస్తే తప్ప తవ్వకాలు ఆగే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గతంలో అనుమతులు లేకుండా తవ్వకాలు జరపాలంటే భయపడేవారని, ప్రస్తుతం నిర్భీతిగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొత్తగా జిల్లాకు వచ్చిన కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు. లోడింగ్కు రీచ్లోకి లారీలు, ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్లో ఇసుకను లారీల్లో నింపుతున్న జేసీబీమైనింగ్ అధికారుల లీలలు ఇసుక మాఫియాను కాపాడేందుకు మైనింగ్ అధికారులు ఆగమేఘాలపై రంగంలోకి దిగారు. ‘కానూరు–పెండ్యాల’ ఇసుక ర్యాంపునకు 21.10.2024న టెండర్లు పిలిచారు. 13.03.2025 నుంచి 20.10.2025 వరకు ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు మైనింగ్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వారి ప్రకటనను పరిశీలిస్తే.. కానూరు–పెండ్యాల ర్యాంపునకు అక్టోబర్ నెలలోనే తవ్వకాలకు గడువు ముగిసింది. అయినా ప్రస్తుతం యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. కానీ మైనింగ్ అధికారులు మాత్రం పశ్చిమగోదావరి జిల్లాకు పెండ్యాల ర్యాంప్ను కేటాయించినట్లు తాజాగా ప్రకటనలో తెలిపారు. అయితే ఇసుక తవ్వకాలు పెండ్యాల ర్యాంపులోనే జరగాల్సి ఉన్నా.. కానూరు–పెండ్యాల ర్యాంప్లో తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్రమాలకు ఏ స్థాయిలో సహకారం అందుతుందో అర్థమవుతోంది. నదీ గర్భాన్ని కుళ్లబొడుస్తోన్న ఇసుక మాఫియా పది అడుగుల లోతు వరకూ యంత్రాలతో తవ్వకాలు ‘కానూరు–పెండ్యాల’ ఓపెన్ రీచ్లో దర్జాగా దందా మూడు రోజులుగా నిరాటంకంగా అక్రమ బాగోతం అనుమతులు లేకపోయినా బరితెగింపు మంత్రి దుర్గేష్ నియోజకవర్గంలో సహజ సంపద దోపిడీ ప్రతి రోజూ 400 లారీలకు పైగా అక్రమ రవాణా రూ.కోట్లు దండుకుంటున్న కూటమి నేతలు మామూళ్ల మత్తులో కన్నెత్తి చూడని మైనింగ్, రెవెన్యూ అధికారులు -
ఆ అమ్మాయి.. అవధానంలో దిట్టోయి
తాళ్లరేవు: అవధానం అనేది తెలుగు సాహిత్య ప్రక్రియలో మేథో ప్రతిభను పరీక్షించే ఒక క్లిష్టమైన కళ.. పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అతి చిన్న వయసులోనే చందాన జయలక్ష్మి అవధాన రంగంలో ఔరా అనిపిస్తుంది. కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నిరూపిస్తోంది. అవధానం చేపట్టిన తొలి అడుగుల్లోనే తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంస్కృతం అనగానే క్లిష్టమైనదని భావించి నేర్చుకోవడానికి కూడా భయపడే నేటి రోజుల్లో, ఆంధ్రాలో పుట్టి కర్ణాటకలో స్థిరపడిన 13 ఏళ్ల బాలిక అవలీలగా సంస్కృతాన్ని ఉచ్చరించడంతో పాటు అత్యంత క్లిష్టమైన అష్టావధానాన్ని చేస్తూ ఘనాపాఠీలను సైతం ఔరా అనిపిస్తోంది. అంతటితో ఆగకుండా సంస్కృతంతోపాటు తెలుగు, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషలను అవలీలగా మాట్లాడుతూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ చిన్నారి చెప్పే మాటలు వినడానికి వేద పండితులు సైతం ఆసక్తి చూపడం గమనార్హం. ఇంజరంలో పుట్టి.. బెంగళూరులో పెరిగి.. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామానికి చెందిన నరసింహదేవర మైథిలీనాథ్ వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. ఆయన ప్రముఖ హెచ్ఏఎల్ కంపెనీలో సీనియర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన సతీమణి కిరణ్మయి గృహిణి. వీరి గారాల పట్టి నరసింహదేవర జయలక్ష్మికి చిన్నతనం నుంచి చదువులో ముందుండేది. కుటుంబ నేపథ్యం, బాల్య దశ నుంచే సంస్కృతం సాహిత్యాభిలాషతో, శాసీ్త్రయ శిక్షణతో అవధానంలో అడుగుపెట్టింది. తాత సుబ్బారావు సూచనతో బెంగళూరు పూర్ణ ప్రమతి గురుకుల పాఠశాలలో జయలక్ష్మిని చేర్చించి సంస్కృతం నేర్పించారు. కాశీలో తొలి అష్టావధానం ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ మహానగరంలో జయలక్ష్మి ఈ ఏడాది అక్టోబర్ 26న సంస్కృతంలో తొలి అష్టావధానం చేసింది. అలాగే మధునాపంతుల సత్యనారాయణమూర్తి సూచనలతో కాజులూరు మండలం పల్లిపాలెం గ్రామంలో రెండో అష్టావధానం చేసి అందరినీ ఆకట్టుకుంది. చిన్న వయసులో రాణిస్తున్న జయలక్ష్మిని ఘనంగా సత్కరించారు. విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు.. జయలక్ష్మిలో ఉన్న విశేష ప్రతిభను గుర్తించి తమ పాఠశాలకు తీసుకువచ్చి సత్కరించాం. తమ విద్యార్థులకు సంస్కృత భాషపై అవగాహన కల్పించడంతో పాటు స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఐదు భాషల్లో అవలీలగా మాట్లాడుతున్న జయలక్ష్మిని చూసి విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో స్ఫూర్తి పొందారు. –టీవీఎస్ఎస్వీ ప్రసాదరావు, హెచ్ఎం, రీజెన్సీ హైస్కూల్ ఫ సంస్కృతంలో అష్టావధానం చేస్తున్న బాలిక ఫ జయలక్ష్మికి ప్రశంసల వెల్లువ -
జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్లో ప్రతిభ
బాలాజీచెరువు: రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్ష ఫలితాల్లో కాకినాడ గంగరాజునగర్ ఆదిత్య హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారు. షేక్ అబ్దుల్ షాహుల్ నవాజ్ (7వ తరగతి) ప్రథమ ర్యాంకు, ధైర్య సుమిత్ రామ (9వ తరగతి) ప్రథమ ర్యాంకును సాధించారు. జిల్లా స్థాయిలో అన్నమదేవర అభిరామ్ (6వ తరగతి) ప్రథమ, మోతూరి క్రిమ్సన్ (8వ తరగతి) రెండో ర్యాంకు, గుడివాడ వెంకట శివరామ అఖిలేష్ (9వ తరగతి) మొదటి ర్యాంకు, దంగేటి రోహిత్బాబు (10వ తరగతి) రెండో ర్యాంకును సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జె.మొయినా తెలిపారు. ఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, విజయానికి కారకులైన ఉపాధ్యాయులను ఆదిత్య సంస్థల ఛైర్మన్ ఎన్.శేషారెడ్డి అభినందించారు. -
పలువురికి కారుణ్య నియామకాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తూ మరణించిన వారి వారసులు 31 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ 23 మందిని జూనియర్ సహాయకులుగా, 8 మందిని టైపిస్ట్లుగా నియమించినట్లు చెప్పారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు మాట్లాడుతూ ఈ నియామకాలను పారదర్శకంగా చేపట్టామన్నారు. కారుణ్య నియామక ఉత్తర్వులు అందుకున్న అభ్యర్థులు మాట్లాడుతూ తమ కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తమకు, ఈ ఉద్యోగ అవకాశం కల్పించడం ద్వారా కొండంత అండ ఇచ్చినట్లు అయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఖాళీలు ఏర్పడిన వెంటనే త్వరితగతిన ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసినందుకు జెడ్పీ చైర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఫొటోగ్రాఫర్ రాజ్కు జాతీయ స్థాయి బహుమతి
రాజమహేంద్రవరం సిటీ: గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే బ్లాక్ అండ్ వైట్ లైఫ్స్టైల్ ఫొటోగ్రాఫ్నకు రాజమహేంద్రవరానికి చెందిన ఫొటోగ్రాఫర్ రాజ్ జాతీయ స్థాయిలో రెండవ బహుమతి సాధించాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన హుస్సేన్ ఖాన్ (ఏఎఫ్ఐఏపీ) 8వ లంబాడా జాతీయ లైఫ్ స్టైల్ ఆర్ట్ ఫోటోగ్రఫీ పోటీలు ఈ నెల 13, 14, 15 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లెందు సమీపంలోని రూళ్లపాడులో జరిగాయి. ఈ పోటీలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. సహజమైన భావోద్వేగాలు, సంప్రదాయం, సాధారణ జీవిత క్షణాలను ఎంతో కళాత్మకంగా చిత్రీకరించిన విధానాన్ని జ్యూరీ ప్రత్యేకంగా గుర్తించి రెండో బహుమతికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా అవార్డును ప్రముఖ ఫొటోగ్రాఫర్ తమ్మా శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా రాజ్ అందుకున్నారు. బుధవారం నగరానికి వచ్చిన రాజ్ మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి గుర్తింపు తనకు మరింత ప్రేరణనిచ్చిందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మరొకరికి తీవ్ర గాయాలు అమలాపురం టౌన్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. దీనిపై అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు కథనం ప్రకారం.. అంబాజీపేట మండలం తొండవరం గ్రామానికి చెందిన ప్రస్తుతం అమలాపురంలో నివసిస్తున్న తోట వినయ్ (23), నిమ్మకాయల సాయివెంకట సత్యమూర్తిలు స్నేహితులు. మంగళవారం ఉదయం ఆ యువకులు అమలాపురం నుంచి మోటారు సైకిల్పై భీమవరం బయలు దేరారు. రోళ్లపాలెం 216 జాతీయ రహదారి బైపాస్లోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొంది. మోటారు సైకిల్ వెనుక వినయ్ కూర్చోగా, కాలు విరిగిపోయి తలకు గాయమైంది. అతడిని తక్షణమే రాజమహేంద్రవరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ బుధవారం మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. అతనిది సాధారణ కుటుంబం. ఎదిగి వచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. సత్య వెంకట సత్యమూర్తి అమలాపురంలోని ఓ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అమలాపురం పట్టణ ఎస్సై మనోహర్ జోషి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలుడిని చితకబాది బాలికపై అత్యాచారం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో ఎస్పీ బంగ్లా ఎదురుగా ఉన్న సెంట్రల్ జైలు పార్కు వద్ద బాలుడిని చితకబాది, బాలికను ఎత్తుకుపోయిన దుండగులు లైంగిక దాడికి ఒడిగట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొవ్వూరులో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలికకు అదే ప్రాంతానికి చెందిన బాలుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ బాలిక 10 రోజుల నుంచి స్థానిక రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్కు వచ్చి అక్కడే ఉంటోంది. ఈ నెల 15న ఆ బాలుడు రాజమహేంద్రవరం రావడంతో ఆ రాత్రి బాలిక, బాలుడు ఎస్పీ బంగ్లాకు ఎదురుగా ఉన్న సెంట్రల్ జైలు పార్కులో కలిశారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత మద్యం మత్తులో ఉన్న క్వారీ ప్రాంతానికి చెందిన పెద గంజా, మరో వ్యక్తి అక్కడకు వచ్చారు. బాలుడిని చితకబాదిన తర్వాత పెద గంజా అనే వ్యక్తి బాలికను క్వారీ ప్రాంతంలోని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. ఆమె 16వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయానికి ఈట్ స్ట్రీట్కు చేరుకుని విషయాన్ని బాలుడికి ఫోన్లో చెప్పింది. అనంతరం ఆ బాలుడు వచ్చి 112కు ఫోన్ చేసి విషయం తెలియజేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పెద గంజాతోపాటు బాలుడిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారం చేసిన పెద గంజాపై పలు చోరీ కేసులున్నాయి. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. -
ఒకే రోజు ఇద్దరికి అరుదైన గుండె శస్త్ర చికిత్సలు
కాకినాడ రూరల్: తీవ్రమైన ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి గుండె సంబంధిత లక్షణాలతో ఆస్పత్రికి వచ్చిన ఇద్దరికి అరుదైన, క్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్టు కార్డియాలజిస్ట్ ఓబుల్రెడ్డి తెలియజేశారు. సర్పవరం జంక్షన్లోని రమణయ్యపేట సంత మార్కెట్ వద్ద గల మిత్ర హార్ట్కేర్ ఇనిస్టిట్యూట్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. కాకినాడ ఆర్ఆర్నగర్కు చెందిన 65 ఏళ్ల ద్వారంపూడి వెంకయ్యమ్మ, బలభద్రపురానికి చెందిన 54 ఏళ్ల కర్రి శ్రీనివాసరెడ్డి తమ ఆస్పత్రికి రాగా ఇద్దరిలోనూ గుండె ధమనుల అవరోధం గుర్తించామన్నారు. తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తమ వైద్య నిపుణుల బృందంతో ఆప్టికల్ కోహిరెన్స్ ట్రోమోగ్రఫీ ఆధారిత కార్డియాక్ ఇంటర్వెన్షన్(ఓసీటీ గైడెడ్ పీసీఐ) అనే అరుదైన గుండె చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. కోస్తా జిల్లాల్లో ఈ అత్యాధునిక ఓసీటీ పరికర సదుపాయం తమ మిత్ర హార్ట్ కేర్ సెంటర్లో ఉందన్నారు. ఏఐ క్యాథ్ ల్యాబ్, ఏఐ ఆధారిత వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నట్టు ఓబుల్రెడ్డి తెలిపారు. -
సంక్రాంతి ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ప్రకటించింది. సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య 07288/ 07289 నంబర్ రైళ్లు జనవరి 9,10,11,12 తేదీలలో రాకపోకలు సాగించనున్నాయన్నారు. 07290/07291 నంబర్ రైళ్లు సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డు మధ్య జనవరి 10, 11, 12, 13, 16, 17, 18, 19 తేదీలలో అందుబాటులో ఉంటాయన్నారు. శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్కు 07295 రైలు జనవరి 14వ తేదీన, సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్డుకు 07292 నంబర్ రైలు జనవరి 17వ తేదీన, 07293 నంబర్ రైలు శ్రీకాకుళం రోడ్డు – సికింద్రాబాద్కు జనవరి 18వ తేదీన అందుబాటులో ఉంటాయని తెలిపారు. వికారాబాద్ – శ్రీకాకుళం రోడ్డుకు 07294 నంబర్ రైలు జనవరి 13న అందుబాటులో ఉంటుందన్నారు. ఇవి రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్లో ఆగనున్నాయని తెలిపారు. -
ఓపెన్గా దోపిడీ!
సాక్షి, రాజమహేంద్రవరం: ఓపెన్ రీచ్లలో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అనుమతులు ఇవ్వలేదు. కానీ, అధికార అండతో ఇసుక మాఫియా దోపిడీ ‘ఓపెన్’ చేసింది. కూటమి నేతల అండదండలతో నిబంధనలను గోదావరిలో తొక్కి మరీ అక్రమ తవ్వకాలతో చెలరేగుతోంది. ఇసుక అక్రమార్కులు నదిలోకి యంత్రాలను దించి, రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం వందల వేల టన్నుల ఇసుకను దర్జాగా తవ్వేసి, తరలించుకుపోతున్నారు. అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేసి మరీ నదీ గర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఆ ఇసుకను బిల్లులు సైతం లేకుండానే వందల లారీల్లో ఇతర జిల్లాలకు తరలిస్తూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలోనే ఈ ఇసుక దోపిడీ బహిరంగంగా జరుగుతున్నా.. రెవెన్యూ, మైనింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అను‘మతి లేకుండా’.. జిల్లావ్యాప్తంగా గోదావరి నదిలో 21 ఓపెన్ ఇసుక రీచ్లు ఉన్నాయి. వీటిలో కూలీలతో ఇసుక తవ్వి, విక్రయించుకునేందుకు గతంలో ఏడాది ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారు. వీటిలో కొన్నింటి గడువు గత నవంబర్లో ముగిసింది. మరికొన్నింటి గడువు ఈ నెలాఖరుకు ముగుస్తుంది. గత నెలలో గడువు ముగిసిన ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు తిరిగి తమకు అనుమతులు ఇవ్వాలంటూ వాటిని గతంలో దక్కించుకున్న వారు అధికారులకు విన్నవించుకున్నారు. ఇప్పటి వరకూ అధికారులు ఏ ఒక్క రీచ్కు అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ, నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు – పెండ్యాల, కొవ్వూరు నియోజకవర్గం కుమారదేవం ఓపెన్ రీచ్లలో అక్రమార్కులు దర్జాగా ఇసుక తవ్వేస్తున్నారు. అన్ని అనుమతులూ ఉన్న ర్యాంపులో మాదిరిగానే రేయింబవళ్లు ఇసుక తవ్వేస్తున్నారు. కానూరు – పెండ్యాల ర్యాంపులో సాగుతున్న ఇసుక దందా రాత్రయితే జాతరను తలపిస్తోంది. కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్నాయి. ఎలాంటి బిల్లులూ లేకుండానే ఇసుక లోడింగ్ చేసేసి, జాతీయ రహదారుల మీదుగా అధికారుల కళ్లెదుటే దర్జాగా తరలించుకుపోతున్నారు. ఈ ర్యాంపు నుంచి నిత్యం 50 నుంచి 100 లారీల్లో ఇసుకను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఏలూరు, కృష్ణా జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిబంధనలకు నీళ్లు ఫ నిబంధనల ప్రకారం గోదావరి నదిలో నీటి ప్రవాహానికి, ఏటిగట్టుకు 200 మీటర్ల పరిధిలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. కానీ, కానూరు – పెండ్యాల రీచ్లో దీనిని పట్టించుకోకుండా గోదావరిని ఇష్టానుసారంగా గుల్ల చేస్తున్నారు. ఫ ర్యాంప్లో యంత్రాలతో ఇసుక తవ్వకూడదు. కానీ, ఇక్కడ అందుకు విరుద్ధంగా పొక్లెయిన్లతో అడ్డగోలుగా తవ్వకాలు చేపడుతున్నారు. ఫ నదీ గర్భంలోకి లారీలు వెళ్లకూడదు. ట్రాక్టర్ల ద్వారా ఇసుకను బయటకు తీసుకొచ్చి లారీలకు నింపాలి. కానీ, లారీలను ఇష్టానుసారంగా గోదావరి నదిలోకి తీసుకెళ్తున్నారు. ఫ రీచ్ నుంచి ట్రాక్టర్లతో ఇసుక తెచ్చేందుకు మట్టితో మాత్రమే రహదారి వేయాలి. కానీ, ఇసుక మాఫియా బరితెగించి లారీలు తీరిగేందుకు వీలుగా గ్రావెల్ రోడ్లు వేసింది. ఫ నిబంధనల ప్రకారం ఇసుక మేట 3 ఘనపు మీటర్లు ఉంటే.. ఒక ఘనపు మీటర్ మాత్రమే కూలీలతో తీయించాలి. కానీ, యంత్రాలతో నదీగర్భాన్ని లోతుగా తవ్వేస్తున్నారు. ఎంత వీలుంటే అంత కుళ్లబొడిచేస్తున్నారు. దీంతో, నదీగర్భంలో ఎక్కడ చూసినా గోతులే కనిపిస్తున్నాయి. ఫ కుమారదేవం ఓపెన్ రీచ్ నుంచి సైతం నిత్యం వందల లారీల్లో ఇసుక అక్రమంగా తవ్వి, తరలించుకుపోతున్నారు. నిఘా శూన్యం రీచ్ల వద్ద ఎటువంటి నిఘా ఉండటం లేదు. సీసీ కెమెరాలతో పాటు, అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం ఇసుక మాఫియాకు వరంగా మారుతోంది. ఒకవేళ ఉన్నా.. మామూళ్ల మత్తులో పడి మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత కలెక్టర్ హయాంలో ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఎప్పుడు వచ్చి అధికారులు పట్టుకుంటారోననే భయం ఉండేది. ప్రస్తుత కలెక్టర్ కూడా ఇసుక అక్రమాలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఫ మంత్రిగారి ఇలాకాలో చెలరేగుతున్న ఇసుక మాఫియా ఫ కానూరు – పెండ్యాల రీచ్లో బరితెగింపు ఫ ప్రతి రోజూ వందల లారీల్లో ఇతర జిల్లాలకు తరలింపు ఫ కూటమి నేతల అండదండలతో దందా ఫ కుమారదేవంలోనూ అదే తంతు -
‘సినిమాలు చూసి సంతోషించండి.. నమ్మకండి’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘పురాణ కథలకు సంబంధించిన సినిమాలు చూసి సంతోషించండి. ఇంకా ఆనందం కలిగితే చప్పట్లు కొట్టండి, కానీ నమ్మకండి’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ వ్యాఖ్యానించారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాసభారత ప్రవచనంలో ఆయన మంగళవారం సభాపర్వం ముగించి, వనపర్వంలోకి ప్రవేశించారు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలను శకుని ఉపయోగించాడంటూ ఓ సినిమాలో ప్రధానంగా చూపారని, ఇటువంటి కథనం భారతంలో కానీ, ఇతర పురాణాలలో కానీ లేదని చెప్పారు. నిజం చెప్పినా ప్రజలు శంకించేంతలా అసత్యాలు ప్రాచుర్యం పొందుతున్న పరిస్థితులు దాపురించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ద్యూతానికి పాండవులను మళ్లీ పిలవాలని విదురుడిని ఆదేశించినప్పుడు భీష్మద్రోణ కృపాచార్యులు, గాంధారి తదితర పెద్దలందరూ ధృతరాష్ట్రుడిని వారించడానికి ప్రయత్నిస్తారు. అవినీతి, క్రౌర్యంతో సంపాదించుకున్న సంపద వినాశ హేతువు అవుతుందని హితైషులు హెచ్చరిస్తారు. కానీ, ధృతరాష్ట్రుని బుద్ధి వేరు. మామకాః పాండవాః.. అని ఆయన అనడంలో ఆంతర్యం బయటపడుతోంది. నా వాళ్లు వేరు, పాండవులు వేరు అని దీని భావం. ద్యూతానికి మళ్లీ వచ్చిన ఆహ్వానాన్ని ధర్మరాజు అంగీకరించడాన్ని కొందరు ఆధునికులు విమర్శిస్తారు. బంగారు లేడి ఉండదని తెలిసే, రాముడు దానిని తేవడానికి బయలుదేరినట్టు.. మాయాద్యూతమని తెలిసే, తండ్రి ఆనతి మీర లేక, ధర్మరాజు తిరిగి ఆడటానికి వస్తాడు. విధిని అనుసరించి బుద్ధి ఉంటుంది. పరాజితులైన పాండవులతో వెళ్తున్న ద్రౌపదిని చూసి దుశ్శాసనుడు పలుమార్లు ‘ఎద్దు, ఎద్దు’ అని ఆమెను హేళన చేస్తాడు. భీముడు ఉగ్రుడై దుశ్శాసనుడి రొమ్ము పగులగొట్టి, రక్తం తాగుతానని ప్రతిన చేస్తాడు. తన తొడను ద్రౌపదికి చూపిన దుర్యోధనుడితో తొడలు పగులగొడతానని, లేకపోతే తనకు పుణ్యగతులు కలగవని ప్రతిన చేస్తాడు. తొడలు పగులగొట్టడం యుద్ధనీతికి వ్యతిరేకమే అయినా, ధర్మబద్ధమైన ప్రతిజ్ఞా పాలన కోసం యుద్ధనీతిని అతిక్రమించవచ్చు’’ అని సామవేదం వివరించారు. పాండవులను వేదవేత్తలు అనుసరించారంటూ ఆయన వనపర్వాన్ని ప్రారంభించారు. వ్యాసుడు వనపర్వంగా పేర్కొన్న పర్వాన్ని నన్నయ అరణ్య పర్వమన్నాడని వివరించారు. తొలుత కంచి కామకోటి సంయమీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని, పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతి స్వామి సూచనల మేరకు రుద్రహోమం నిర్వహించి, అనుశాసన పర్వాంతర్గతమైన శివ సహస్రనామ పారాయణ నిర్వహించారు. -
పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంతర్ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్, గేమ్స్ మీట్ మంగళవారం ప్రారంభమైంది. బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ పోటీలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 25 పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 850 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని కళాశాల ప్రిన్సిపాల్ ఆకుల మురళి తెలిపారు. ఈ నెల 18న బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మంగళగిరికి చెందిన స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కార్యదర్శి జీవీ సత్యనారాయణమూర్తి, ఏయూ రీజియన్ ప్రాంతీయ సంయుక్త సాంకేతిక విద్యా సంచాలకుడు జీవీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కాంస్య పతక విజేతకు అభినందనలు రాజమహేంద్రవరం సిటీ: నగర పాలక సంస్థ కార్మికుడు అర్జి బాలకృష్ణ టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. 74 కేజీల విభాగం స్క్వాడ్లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ సందర్భంగా బాలకృష్ణను నగర పాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో కమిషనర్ రాహుల్ మీనా మంగళవారం ఘనంగా సత్కరించారు. రానున్న రోజుల్లో బాలకృష్ణ మరిన్ని ప్రపంచ పోటీల్లో పాల్గొని విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి వినూత్న, శానిటరీ సూపర్వైజర్ ఇంద్రగంటి శ్రీనివాస్, శానిటరి ఇన్స్పెక్టర్ ధనరాజ్ పాల్గొన్నారు. సాయుధ దళాల పతాక నిధికి విరాళంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సిబ్బంది రూ.8,00,700 విరాళాలు సేకరించారు. జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో ఉన్న 8 వేల మంది మెప్మా సిబ్బంది ఒక్కొక్కరు రూ.10 చొప్పున ఈ విరాళం సమకూర్చారు. దీనికి సంబంధించిన చెక్కును కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సమక్షంలో మెప్మా పీడీ బి.ప్రియంవదతో కలసి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎం.కృష్ణారావుకు మంగళవారం అందజేశారు. జేసీ భరత్ మాట్లాడుతూ, మాజీ సైనికుల పునరావాసం, సంక్షేమం, అమర సైనిక కుటుంబాల సంక్షేమానికి ఈ నిధులు ఉపయోగిస్తారని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా బాట తొలగింపు పి.గన్నవరం: మండలంలోని ఎల్.గన్నవరం శివారు నడిగాడి వద్ద వశిష్ట గోదావరి నుంచి ఇసుక తరలించేందుకు అక్రమార్కులు ఏర్పాటు చేసిన బాటలను మైన్స్ ఆర్ఐ సుజాత ఆధ్వర్యంలో మంగళవారం జేసీబీతో తొలగించారు. ర్యాంపు వద్ద గస్తీ నిర్వహించాలని వీఆర్వో కడలి వెంకటేశ్వరరావుకు మైన్స్ ఆర్ఐ సూచించారు. అంతకు ముందు పుచ్చల్లంక రేవును కూడా తనిఖీ చేశారు. అక్కడ లంకలో ఉన్న ఒక జేసీబీని సీజ్ చేసి, తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. దాడుల్లో మైన్స్ టెక్నికల్ అసిస్టెంట్ ఎండీ రెహ్మాన్ అలీ, సర్వేయర్ కె.శ్రీధర్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 21న పల్స్ పోలియో అమలాపురం రూరల్: ఈ నెల 21వ తేదీని పల్స్ పోలియో నిర్మూలన దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిందని, ఐదేళ్ల లోపు చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రోజు వేయించుకోలేని పిల్లలకు 22, 23 తేదీల్లో బృందాలు ఇంటింటికీ వెళ్లి వేస్తాయన్నారు. బస్ స్టాండ్లు, ఆస్పత్రులు, మేళాలు, బజార్లలో 21 నుంచి 23 వరకు మొబైల్ బృందాలు పర్యటిస్తాయన్నారు. -
మంచు కమ్మేసి.. మృత్యువు కాటేసి..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి ● కళ్లెదుటే తల్లిని, కొద్దిసేపటికి అన్నను కోల్పోయిన వైనం గండేపల్లి: అన్నను ఆస్పత్రిలో చేర్చేందుకు తల్లిని, బాబాయిని, మరో వ్యక్తిని వాహనంలో వెంట తీసుకువెళుతుండగా కమ్ముకొచ్చిన మంచు, తరుముకొచ్చిన కునుకు మృత్యు ఒడికి తీసుకుపోయాయి. కళ్లముందే కన్నతల్లిని, కొద్దిసేపటికే అన్నను కోల్పోయిన వ్యక్తి హృదయ విదారక ఉదంతమిది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు ఆత్రేయపురం మండలం వెలిచేరుకు చెందిన తొర్లపాటి శశికుమార్ (27) క్యాన్సర్తో బాధపడుతుండగా ఇతనికి మెరుగైన వైద్యం కోసం తమ్ముడు తొర్లపాటి సంజయ్, తల్లి తులసి (49), బాబాయి తొర్లపాటి పాపారావు, నాగబత్తుల శ్రీను కలిసి కారులో విశాఖ ఆస్పత్రికి వెళుతున్నారు. మండలంలోని గండేపల్లి శివారు బంక్ సమీపంలోకి వచ్చేసరికి మంగళవారం తెల్లవారుజాము సుమారు 3.40 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే నిలిచి ఉన్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తులసికి ముఖం, తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న శశికుమార్, నాగబత్తుల శ్రీనుకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సేఫ్టీ వాహన సిబ్బంది, నైట్ డ్యూటీ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శశికుమార్ మృతి చెందాడు. తులసి మృతదేహాన్ని జెడ్ రాగంపేట సీహెచ్సీకి తరలించి, ప్రమాదానికి గురైన కారును క్రేన్ సహాయంతో పక్కకు తీయించారు. కారు నడుపుతున్న తొర్లపాటి సంజయ్ స్వల్పగాయాలతో బయటపడగా ప్రమాద సమయంలో కారులో ఉన్న ప్రయాణికులు నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై యూవీ శివ నాగబాబు పరిశీలించి ప్రమాద ఘటన గురించి తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. రాజమహేంద్రవరంలో టీ తాగి ప్రయాణం ప్రారంభించగా వీరు ప్రయాణిస్తున్న కారు గండేపల్లిలో ప్రమాదానికి గురైంది. తీవ్రమైన మంచు, తెల్లవారుజాము ప్రయాణంలో డ్రైవర్కు కునుకుపాటుకు గురవడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆస్పత్రికి బదులు మృత్యుఒడికి.. కొత్తపేట: తొర్లపాటి వీరాస్వామి, తులసి దంపతులు తమ కుమారులు శశికుమార్, సంజయ్లతో కలసి వ్యవసాయ కూలీ పనులతో పాటు కొద్దిపాటి భూమి కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెద్ద కుమారుడు శశికుమార్కు అనారోగ్యం పాలయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం క్యాన్సర్గా నిర్ధారించారు. విశాఖపట్నంలో క్యాన్సర్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. చిన్న కుమారుడు సంజయ్కు కారు డ్రైవింగ్ రావడంతో రోజువారీ అద్దెకు కారు తీసుకుని మంగళవారం రాత్రి వెలిచేరులో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లారు. తెల్లవారు జామున ఈ ఘోరం జరిగిపోయింది. వెలిచేరులో విషాద ఛాయలు వెలిచేరు గ్రామ శివారు కాలనీకి చెందిన తొర్లపాటి తులసి, ఆమె కుమారుడు శశికుమార్ మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ కుటుంబ సభ్యులు కాలనీలో అందరితో కలసిమెలసి ఉంటారని, సహచర వ్యవసాయ కూలీలతో కలిసి పనులు చేసుకునేవారని స్థానికులు చెప్పారు. కొన్ని రోజులుగా శశికుమార్ అనారోగ్యానికి గురికాగా వారి కష్టార్జితంతోనే వైద్యం చేయిస్తూ వచ్చారని తెలిపారు. తల్లీ, కొడుకు చనిపోయారంటే జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
అన్ని సంఘాలకు ఆదర్శంగా..
ఐకమత్యంగా ముందుకు వెళితే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం సభ్యులు. పెన్షనర్లకు పలు సేవలు అందిస్తూ ఉమ్మడి జిల్లాలో అన్ని సంఘాలకు ఆదర్శంగా నిలిచారు. ఫంక్షన్ హాలుగా సంఘ భవనం పూర్వం తాలూకా వ్యవస్థ ఉన్న సమయంలో కొత్తపే ట తాలూకా పరిధిలోని కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, పి.గన్నవరం మండలాలకు చెందిన పలువురు పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు సంఘంగా ఏర్పడ్డారు. తొలుత 80 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం నేడు 1,620 మందికి చేరింది. గతంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన మంగిపూడి గౌరీశంకరం, అజ్జరపు వెంకట సుబ్బారావు హయాంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మొదట స్థలాన్ని సమకూర్చుకుని, ప్రభుత్వ గ్రాంటులు మంజూరు చేయించుకుని సంఘ భవనాన్ని నిర్మించుకున్నారు. దాతలు, సభ్యు ల విరాళాలతో దశల వారీగా రెండంతస్తు ల నిర్మాణంతో ఫంక్షన్ హాలుగా అభివృద్ధి చేసుకున్నారు. నేడు సీనియర్ పెన్షనర్లకు సన్మానం పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం 1946లో జన్మించిన సీనియర్ పెన్షనర్లు 20 మందిని సత్కరించేందుకు పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘంలో ఏర్పాట్లు చేశారు. -
అవిశ్రాంత సేవకులు
● సామాజిక బాధ్యతతో ముందుకు.. ● హక్కుల కోసం పోరాటం ● నేడు జాతీయ పెన్షనర్స్ డే కపిలేశ్వరపురం/కొత్తపేట: సమాజంలో శ్రామికులు, ఉద్యోగులు, కీలక పాత్రధారులు. ఉద్యోగ విరమణ తర్వాత వారికి సామాజిక భద్రత కల్పించేందుకు పెన్షన్ ఓ భరోసా. ప్రస్తుత పాలనలో ఆ పెన్షన్ మంజూరు కావాలన్నా, మంజూరైనది పొందాలన్నా ఓ ప్రహసనంగా మారింది. పెన్షనర్లు తమ హక్కుల కోసం పోరాడుతూనే సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేస్తున్నారు. నేడు పెన్షనర్స్ డే సందర్భంగా కథనం.. ఉద్యమ బాటలో... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫ్యాక్టరీ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సేవలందించిన రిటైర్డ్ పెన్షనర్లు సుమారు 50 వేలు మంది ఉన్నారు. అత్యధికులు రూ.3వేలు లోపు పెన్షన్ తీసుకుంటున్నవారే ఉన్నారు. ఉదాహరణకు ఉమ్మడి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగ విరమణ చేసిన వారిలో 1,700 మంది డ్రైవర్లు, కండక్టర్లు, 150 మంది కార్యాలయ ఉద్యోగులు, 1,350 మంది మెకానికల్ విఽభాగానికి చెందిన వారు మొత్తం 3,200 మంది ఉన్నారు. వారు నెలకు కేవలం రూ.2వేల లోపు మాత్రమే పెన్షన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ పలుమార్లు ఉమ్మడి జిల్లాలో నిరసన తెలిపారు. వృద్ధులకు అందజేసే రూ.4వేలు సామాజిక పింఛనును వర్తింపజేయాలని కోరుతూ ధర్నాలు చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలంటూ సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు ఉమ్మడి జిల్లాలో పలుమార్లు ధర్నాలు చేశాయి. ఆల్ ఇండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యంలో ఈపీఎస్ –95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న ఢిల్లీలోని సుజిత్ భవన్లో సదస్సును నిర్వహించారు. 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచి పెన్షనర్లు తరలివెళ్లారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు –2025ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఒకటో తేదీకి అందని పెన్షన్ ఒకటో తేదీకల్లా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ చెల్లిస్తామంటూ చంద్రబాబు, పవన్కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్నా పెన్షనర్స్ సమస్యలపై దృష్టి సారించలేదు. ఒకటో తేదీ దాటిన వారం తర్వాతనే చెల్లింపులు చేస్తున్నారు. సామాజిక సేవలో... రామచంద్రపురం, మండపేట, అమలాపురం, రాజోలు, కొత్తపేట, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో పెన్షనర్లు ప్రణాళికాబద్దంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నెల నెలా పెన్షనర్లకు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ లబ్ధి రాబట్టేందుకు సంబంధించిన పత్రాలను నింపడం, అధికారులకు నివేదించడం క్రమం తప్పకుండా చేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఉద్యోగి ఇంటికి వెళ్ళి పెన్షన్కు సంబందించిన ఆన్లైన్ ప్రక్రియకు సహకరిస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యుల చదువు, ఆరోగ్యాలకు తోచిన సాయం చేస్తున్నారు. సామాజిక పెన్షన్లును వర్తింపజేయాలి దేశంలో 82 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారిలో 36 లక్షల మంది రూ.వెయ్యి లోపు, మరో 36 లక్షల మంది రూ.రెండు వేల లోపు పెన్షన్ను తీసుకొంటున్నారు. కేవలం 10 లక్షల మంది మాత్రమే రూ.మూడువేలు దాటి పెన్షన్ను పొందుతున్నారు. వారందరికీ వృద్ధులు తదితర రకాల సామాజిక పింఛన్లను సైతం అమలు చేయాలి. హైయ్యర్ పెన్షన్ కోసం దేశంలో 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 50వేల మందికి న్యాయం జరిగింది. ఈపీఎఫ్ వద్ద రూ.10లక్షల కోట్లు కార్పస్ ఫండ్ ఉండగా దానికి రూ.60వేల కోట్లు నెలకు వడ్డీగా వస్తుంది. అందులోరూ.23 వేల కోట్లు పెన్షన్లుగా చెల్లిస్తున్నారు. మిగిలిన 37వేల కోట్లు తిరిగి ఈపీఎఎఫ్ కార్పస్ ఫండ్గా మళ్లిపోతుంది. ఈపీఎఫ్ ఫండ్ను షేర్మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం ప్రమాదకరమైన నిర్ణయం. – కంచపు సత్తిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీఆర్పీఏ, కాకినాడ ఉద్యమాలలో పాల్గొనడానికి మేము యువకులమే గతంలో పనిచేసిన నాయకుల కృషితో ఇతర సంఘాలకు దీటుగా మా పెన్షనర్ల సంఘం అన్నింటా ముందు ఉంది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పోరాట కార్యక్రమాలలో పాల్గొనడానికి మా వయసు అడ్డురాదు. ఉద్యమాలలో పాల్గొనడానికి మేము యువకులమే. – కాశీరాజేంద్ర ప్రసాద్, అధ్యక్షుడు, పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం డిమాండ్ల సాధనకు కృషి సంఘం బలోపేతంలో భాగంగా గత 18 నెలల్లో 361 మందిని నూతన సభ్యులుగా చేర్చాం. మా హయాంలో 61 మందికి అదనపు పెన్షన్ కలిసేలా చేయడం సంతృప్తినిచ్చింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఎరియర్స్ కూడా రావలసి ఉంది. అవి వచ్చేటట్టు చేయడానికి, రాష్ట్ర సంఘం అనుమతితో పోరాట కార్యక్రమానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. – యేడిద సత్తిరాజు, ప్రధాన కార్యదర్శి, పూర్వపు కొత్తపేట తాలూకా ప్రభుత్వ పెన్షనర్ల సంఘం మంజూరు కాని కొత్త పింఛన్లు 18 నెలల చంద్రబాబు పాలనా కాలంలో నూతన పింఛన్లు మంజూరు చేయలేదు. దీర్ఘకాలంగా ఇస్తున్న పింఛన్లలో కోత పెట్టారు. కాకినాడ జిల్లాలో 2,71,360 మందికి రూ.117.81 కోట్లు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2,36,284 మందికి రూ.101.86 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 2,35,060 మందికి రూ.1.03.27 కోట్లు ఎప్పటి నుంచో ఇస్తూ వస్తున్నారు. 18 నెలల చంద్రబాబు ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయకుండా పాత పింఛన్లను సర్వే పేరుతో కోత పెట్టింది. నూతన పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తులు ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేలు, రాష్ట్రంలో 2.5 లక్షలు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గీయులకు 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గాలికి వదిలేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, తుని మండలాల్లో ఇంటి పన్నుకు, పింఛన్లకు ముడిపెట్టడం చంద్రబాబు పాలనకే చెల్లింది. -
ఇక బడుల్లో అంగన్వాడీ కేంద్రాలు
రాయవరం: మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసిస్తారు. ఆరేళ్ల నుంచి 14ఏళ్ల లోపు చిన్నారులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతారు. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రయత్నం విద్యాశాఖ చేపట్టింది. సమీప ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్న అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలట్ ప్రాజెక్టులో ఎంపిక చేశారు. కోనసీమ జిల్లాలో పి.గన్నవరం మండలం దీనికి ఎంపికైంది. కో–లొకేషన్ ప్రక్రియ దిశగా.. మహిళ, శిశు అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ(ఐసీడీఎస్), విద్యాశాఖలు సంయుక్తంగా కో–లొకేషన్ ప్రక్రియ చేపడుతున్నాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు, ప్రాథమిక విద్యను సమర్థంగా అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా 200 నుంచి 500 మీటర్ల దూరంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల్లో కలిపి నిర్వహిస్తారు. పాఠశాలలో కనీసం రెండు తరగతి గదులున్నాయా? లేదా? మరుగుదొడ్లు, తాగునీరు, వంటగది, ఆటస్థలం, స్టోర్ రూమ్, ప్రహరీ, విద్యుదీకరణ తదితర వసతులను పరిశీలిస్తారు. మ్యాపింగ్ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిస్తారు. సాధ్యాసాధ్యాల పరిశీలన అనంతరం పూర్వ, ప్రాథమిక విద్యను ఒకే ప్రాంగణంలో అందించే ఏర్పాట్లు చేస్తారు. ఇదిలా ఉంటే 2023లోనే కోలొకేటెడ్ పాఠశాల ప్రక్రియ చేపట్టారు. అందులో భాగంగా జిల్లాకు ఒక పాఠశాలను ఎంపిక చేశారు. జిల్లాలో కపిలేశ్వరపురం మండలం టేకి బీసీ కాలనీలోని నంబర్ – 1 పాఠశాలను కో లొకేటెడ్ పాఠశాలగా ఎంపిక చేసి, పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, అంగన్వాడీ కార్యకర్తకు శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని కోలొకేషన్ పాఠశాలల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. పి.గన్నవరం మండలంలో 84 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మౌలిక వసతులు, భవనాల స్థితిగతులను పరిశీలించిన మండల స్థాయి కమిటీ 12 స్కూళ్లను కో లొకేటెడ్ పాఠశాలలుగా గుర్తించింది. -
‘మోగ్లీ’ చిత్ర యూనిట్ సందడి
ప్రేక్షకులతో మమేకమైన హీరో, హీరోయిన్అమలాపురం టౌన్: మోగ్లీ సినిమా హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి మండోల్కర్తో పాటు చిత్ర యూనిట్ ప్రతినిధులు అమలాపురంలో మంగళవారం సందడి చేశారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రం విడుదలై అమలాపుంలో ప్రదర్శితమవుతున్న లలిత థియేటర్కు చిత్ర యూనిట్ వచ్చి ప్రేక్షకులతో మమేకమైంది. సినిమా హీరో హీరోయిన్తోపాటు సినిమా దర్శకుడు సందీప్రాజ్ పాల్గొని సందడి చేశారు. తొలుత చిత్ర యూనిట్కు థియేటర్ యాజమాని తోట రాము, సిబ్బంది స్వాగతం పలికారు. సినిమా ప్రదర్శితమవుతున్న వేళ చిత్ర యూనిట్ థియేటర్లోకి వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్, దర్శకుడు సినిమా ఎలా ఉందని ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం థియేటర్ వద్ద హీరో రోషన్, హీరోయిన్ సాక్షి మండోల్కర్ అభిమానుల సమక్షంలో కేక్ను కట్ చేశారు. కోనసీమ ప్రజలు కొత్త వారమైన తమకు ఆశీర్వాదాలు అందించాలని ిహీరో, హీరోయిన్ రోషన్, మండోల్కర్ అక్కడికి వచ్చిన అభిమానులను అభ్యర్థించారు. థియేటర్ మేనేజర్ కడలి త్రినాథ్, అనుశ్రీ సినిమాస్ ఏజెంట్ వి.శ్రీనివాస్, టూర్ ఆర్గనైజర్ నిమ్మకాయల దుర్గాప్రసాద్, చిరంజీవి అభిమాన సంఘాల ప్రతినిధులు నల్లా చిట్టి, గుమ్మళ్ల సురేష్ పాల్గొన్నారు. -
గుత్తుల మురళీధరరావు ఆకస్మిక మృతి
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ రాజమహేంద్రవరం నగర ఉపాధ్యక్షుడు గుత్తుల మురళీధరరావు (56) ఆకస్మికంగా మృతి చెందారు. స్థానిక 50వ డివిజన్కు చెందిన ఆయన సోమవారం రాత్రి గుండెపోటుకు గురవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మురళీధరరావు తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. విషయం తెలియడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక సీటీఆర్ఐ సమీపాన చోడేశ్వర నగర్లోని ఆయన నివాసానికి మంగళవారం చేరుకున్నారు. మురళీధరరావు పార్థివ దేహానికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డితో పాటు మార్తి లక్ష్మి, కానుబోయిన సాగర్, పోలు విజయలక్ష్మి, బొంతా శ్రీహరి, బర్రే కొండబాబు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, సప్పా ఆదినారాయణ, సంకిస భవానీప్రియ, నక్కా శ్రీనగేష్, అజ్జరపు వాసు తదితర నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీధరరావు మృతికి ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రమణ్యం తీవ్ర సంతాపం ప్రకటించారు. మురళీధరరావు అంత్యక్రియలు కోటిలింగాల ఘాట్లోని రోటరీ కై లాస భూమిలో మంగళవారం నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రలో చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా పాల్గొని, స్వయంగా పాడె మోశారు. పార్టీకి విశేష సేవలు ఆవిర్భావం నుంచీ వైఎస్సార్ సీపీకి మురళీధరరావు విశేష సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్టానం గతంలో నగర పాలక సంస్థ కార్పొరేటర్గా అవకాశం ఇచ్చింది. కార్పొరేటర్గా గెలిచిన ఆయనను నగర పాలక సంస్థలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎంపిక చేసింది. మనసున్న మనిషిని కోల్పోయాం మురళీధరరావు ఆకస్మిక మరణం తీవ్ర బాధాకరమని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. మంచి నాయకుడిని, మంచి మనసున్న మనిషిని వైఎస్సార్ సీపీ కోల్పోయిందని సంతాపం వ్యక్తం చేశారు. మురళీధరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీధరరావు పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్న మార్గాని భరత్రామ్, మేడపాటి షర్మిలారెడ్డి మురళీధరరావు పాడె మోస్తున్న చెల్లుబోయిన వేణు, జక్కంపూడి రాజా తదితరులునేతల సంతాపం మురళీధరరావు మృతికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేసిన మురళీధరరావు ఆకస్మిక మరణం వైఎస్సార్ సీపీకి తీరని లోటని అన్నారు. 50వ డివిజన్ అభివృద్ధిలో ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, మురళీధరరావు మరణం పార్టీతో పాటు వ్యకిగతంగా తనకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపి, వైఎస్సార్ సీపీ జెండాను మురళీధరరావు పార్థివ దేహంపై కప్పి నివాళులర్పించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, సుశిక్షితుడైన సైనికుడిలా మురళీధరరావు పార్టీ కోసం నిరంతరం పని చేశారని అన్నారు. పార్టీతో పాటు తన డివిజన్ అభివృద్ధికి నిత్యం కృషి చేశారని శ్లాఘించారు. ఫ గుండెపోటుతో మరణించిన వైఎస్సార్ సీపీ నేత ఫ నేతల నివాళి -
విద్యుత్ పొదుపు పాటించాలి
రాజమహేంద్రవరం సిటీ: ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పాటించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా విద్యుత్ పొదుపు వారోత్సవాల పోస్టర్ను తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అవసరమున్న చోట మాత్రమే విద్యుత్ వినియోగించాలని, దుర్వినియోగాన్ని నివారించాలని ప్రజలకు సూచించారు. విద్యుత్ పొదుపు వల్ల బిల్లులు తగ్గడమే కాకుండా రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం తగ్గుతుందని, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. వారోత్సవాలను పురస్కరించుకుని ఏపీ ఈపీడీసీఎల్ ఉద్యోగులు స్థానిక వై జంక్షన్లోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దేవీచౌక్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈపీడీసీఎల్ ఎస్ఈ టి.తిలక్ కుమార్ మాట్లాడుతూ, విద్యుత్ పొదుపు అవసరంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పాఠశాలల్లో వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఈఈలు నక్కపల్లి శామ్యూల్, జీపీబీ నటరాజన్, ఎన్.నారాయణ అప్పారావు, పర్సనల్ ఆఫీసర్ పి.స్టీఫెన్, సీనియర్ అకౌంట్స్ అధికారి కె.ఆదినారాయణమూర్తి, సర్కిల్ ఆఫీస్ ఈఈ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
405 కేజీల గంజాయి స్వాధీనం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోకవరం పోలీసులు గోకవరం: మండలంలోని కామరాజుపేట గ్రామ శివారున ఆగిఉన్న వాహనంలో 405 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం వాహనం అనుమానాస్పద స్థితిలో ఆగి ఉండటాన్ని పిడతమామిడి ఫారెస్టు బీట్ ఆఫీసర్ వీరాబత్తుల రమణ గుర్తించారు. అతన్ని గుర్తించిన వాహనంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. దీనిపై ఆయన గోకవరం ఎస్సై పవన్కుమార్కు సమాచారం అందించగా ఎస్సై సిబ్బందితో అక్కడకు చేరుకుని వ్యాన్లో 22 బస్తాల్లో ఉన్న 405 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.2.05 కోట్లు ఉంటుంది. తహసీల్దార్ రామకృష్ణ ఆధ్వర్యంలో వాహనాన్ని, గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా...డ్రైవర్ మృతి
ముమ్మిడివరం: తవుడు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో డ్రైవర్ దాని కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన వరసాల సత్యనారాయణ(50) మంగళవారం ట్రాక్టర్పై తవుడు లోడుతో కూనవరం వెళుతుండగా ముమ్మిడివరం శివారు బొండాయి కోడు తూము వద్ద 216 జాతీయ రహదారిపై స్కూటీపై వెళుతున్న బడుగు రాణిని ఢీకొన్నాడు. ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సత్యనారాయణ ట్రాక్టర్ కింద పడి ఊబిలో కూరుకుపోయాడు. ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో ట్రాక్టర్ను తీయగా డ్రైవర్ సత్యనారాయణ ట్రాక్టర్ కింద ఊబిలో చిక్కుకుని మృతి చెందాడు. స్కూటీపై వెళుతున్న బడుగు రాణికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి, ఎస్ఈసీ మెంబర్ కాశి బాలమునికుమారి గాయపడిన బడుగురాణికి సపర్యలు చేసి, ఆమెను 108లో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సాహితీ సూర్యుడు బోయి భీమన్నఅమలాపురం టౌన్: ఆధునిక సాహిత్యాన్ని తేజోవంతం చేసిన మహా కవి పద్మశ్రీ బోయి భీమన్న సాహితీ సూర్యుడని శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. బోయి భీమన్న వర్ధంతి సందర్భంగా శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక వడ్డిగూడెంలోని వేమన కోనసీమ రెడ్డి జన సమైక్య కమ్యూనిటీ హాలులో మంగళవారం నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో డాక్టర్ ప్రతాప్ మాట్లాడారు. తొలుత బోయి భీమన్న చిత్రపటానికి డాక్టర్ ప్రతాప్తోపాటు కవులు, రచయితలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాకవి బోయి భీమన్న –వ్యక్తిత్వం–రచనలు అనే అంశంపై డాక్టర్ ప్రతాప్ మాట్లాడారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, కవయిత్రి సబ్బెళ్ల వెంకటమహాలక్ష్మి తదితరులు పాల్గొని బోయి భీమన్న సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. -
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
చాగల్లు: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం ఉదయం మృతిచెందినట్టు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. చాగల్లు–పశివేదల రైల్వేస్టేషన్ మధ్య రైలు నుంచి జారిపడిన వ్యక్తిని గుర్తించామన్నారు. మృతిచెందిన వ్యక్తి సుమారు 35 నుంచి 40 ఏళ్లు వయస్సు కలిగి, లైట్ బ్లూ కలర్ ప్యాంట్, తెలుపు నీలం పచ్చ పొడుగు చేతుల టీ షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాల కోసం 94906 17090 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఏఎంవో, ఎంఐఎస్ కో ఆర్డినేటర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో ఖాళీగా ఉన్న అకడమిక్ మానిటరింగ్ అధికారి, ఎంఐఎస్, ప్లానింగ్ కో ఆర్డినేటర్ పోస్టులకు ఆసక్తి గలిగిన స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్, ఎస్.సుభాషిణి మంగళవారం తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయం, సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం అనే చిరునామాకు పంపాలన్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు నమూనా, నియమావళికి సంబందిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయం, సమగ్ర శిక్ష, తూర్పు గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయం, రాజమహేంద్రవరం కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్ఎస్ఆర్జేవై.ఆర్గ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వివరాలకు ఫోన్ నంబర్ 98667 79398లో సంప్రదించాలన్నారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 23 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు (పీజీఆర్ఎస్) 23 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో నేరుగా ఫోనులో మాట్లాడారు. ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్కు 180 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 180 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సకాలంలో అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని అన్నారు. అర్జీల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయిలో సమీక్షిస్తున్నారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన, సరైన సమాచారం ఇవ్వని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పులి సంచారంపై ఆధారాల్లేవ్ గోపాలపురం: మండలంలోని భీమోలు మెట్టపై పులి సంచారానికి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లభించలేదని జిల్లా అటవీ శాఖ అధికారి కె.దావీదురాజు తెలిపారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పులి జాడను గుర్తించేందుకు ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మూడు రోజులుగా పులి జాడలు కనిపించలేదని చెప్పారు. పులి సంచారంపై ఎటువంటి అపోహలకూ గురి కావద్దని కోరారు. భీమోలు, సగ్గొండ, గోపవరం కొండలపై రెస్క్యూ టీము ద్వారా పులి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఎవరికై నా ఎటువంటి జంతువుల పాదముద్రలు లేదా అనుమానాలున్నా అటవీ శాఖ, గ్రామ రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు. 13.99 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయందేవరపల్లి: జిల్లాలో అక్టోబర్ 1 నుంచి సోమవారం వరకూ 13.99 వేల మెట్రిక్ టన్నుల యూరియా విక్రయాలు జరిగినట్టు జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న 17 రోజులకు 5.48 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 7.54 వేల మెట్రిక్ టన్నులు రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ నెలాఖరుకు మరో 8.29 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు రానున్నాయని తెలిపారు. రబీలో అన్ని రకాల ఎరువులూ కలిపి జిల్లాకు 1,15,781 మెట్రిక్ టన్నులు అవసరం కాగా, 43,686 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకూ 24,476 మెట్రిక్ టన్నులు విక్రయించినట్టు తెలిపారు. ప్రస్తుతం 19,216 మెట్రిక్ టన్నులు రైతులకు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు అన్నవరం: మార్గశిర బహుళ ఏకాదశిని పురస్క రించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ఉదయం స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర పూజ, తులసి దళాలతో సహస్ర నామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరచి సుప్రభాత సేవ నిర్వహించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుడు, అమ్మవారిని ముత్యాల కవచాలతో అలంకరించి పూజించారు. -
కోటిగళ గర్జన
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జన‘కోటి’ గళాలు గర్జించాయి. చేవ్రాలుతో తమ నిరసన తెలిపాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు.. పార్టీ శ్రేణులు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి అనూహ్య మద్దతు లభించింది. లక్షలాదిగా ప్రజలు, విద్యార్థులు, వివిధ వర్గాల వారు స్వచ్ఛంగా సంతకాలు చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి ఇటీవల వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి వచ్చిన ఈ కోటి సంతకాల ప్రతులను.. ఇక్కడి నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చే కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచీ ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన భారీ ర్యాలీలుగా రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి జెండా ఊపి, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం, సంతకాల ప్రతులను ఉంచిన వాహనం వెంట వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు ద్విచక్ర వాహనాలపై పెద్ద ఎత్తున ర్యాలీగా కదిలారు. 15 కిలోమీటర్ల మేర.. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి కొవ్వూరు నియోజకవర్గంలోని దొమ్మేరు వరకూ సుమారు 15 కిలోమీటర్ల మేర వేలాది ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సుమారు మూడు గంటలకు పైగా సాగింది. వైఎస్సార్ సీపీ శ్రేణులతో పాటు అంచనాలకు మించి ప్రజలు కదం తొక్కారు. గోదావరి చిన్నబోయిందా అనే రీతిలో.. రోడ్డు కం రైల్వే వంతెనపై సాగిన ఈ ర్యాలీ జనకెరటం ఎగసి పడింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద పెట్టున నినదించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వేలాది మంది ఈ కార్యక్రమానికి హాజరవడం చూస్తూంటే ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యుడు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర తెలికుల, గాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిన భవానీప్రియ, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నక్కా శ్రీనగేష్, నక్కా రాజబాబు, గిరజాల బాబు, గొందేశి శ్రీనివాసులురెడ్డి, అద్దంకి ముక్తేశ్వరరావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూరుగుపల్లి సుబ్బారావు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి, వివిధ విభాగాల జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 4.20 లక్షల సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల సంతకాలు సేకరించాం. విద్యార్థులు, యువత, మేధావులు, వెద్య వర్గాలు, పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా సంతకాలు చేసి, ఈ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. పేదలకు వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఎట్టి పరిసి్థ్తుల్లోనూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ జరగనివ్వం. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రూ.లక్షల కోట్ల అప్పులు చేస్తున్న చంద్రబాబు.. వైద్య కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఇవ్వకపోవడం దారుణం. ఇది ఆరంభం మాత్రమే. ఇకపై తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాం. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి సూపర్ సక్సెస్ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం సూపర్ సక్సెస్ అయ్యింది. ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజలు కదం తొక్కారు. పేదలకు వైఎస్ జగన్ అండగా నిలిస్తే.. కార్పొరేట్ సంస్థలకు దన్నుగా చంద్రబాబు నిలుస్తున్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు. – తిప్పల గురుమూర్తిరెడ్డి, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు, రాజమహేంద్రవరం ధనార్జనే చంద్రబాబు ధ్యేయం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల ల నిర్మాణాన్ని ప్రారంభించారు. కేవలం ధనార్జనే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తోంది. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెట్టారు. ఈ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని గవర్నర్కు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను చంద్రబాబు సర్కార్ వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో సర్కార్ మెడలు వంచైనా నిలుపు చేస్తాం. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, రాజానగరం చంద్రబాబుకు చెంపపెట్టు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టేలా ప్రజలందరూ తరలి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఇది చంద్రబాబుకు చెంప పెట్టు లాంటిది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఆ సంతకాలను గవర్నర్కు అందజేయనున్నాం. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేదు. అటువంటిది వైఎస్ జగన్ తెచ్చిన కళాశాలలను ప్రైవేటీకరించడానికి ఆయనెవరు? తన బినామీలకు మెడికల్ కళాశాలలను అందించే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నారు. ఏడాదికి 2,300 మంది డాక్టర్లు, పదేళ్లకు 23 వేల మంది పేద విద్యార్థులు డాక్టర్లు అవడాన్ని బాబు సహించలేకపోతున్నారు. – మార్గాని భరత్రామ్, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ చంద్రబాబు సర్కారుపై ఆగ్రహం కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన తాడేపల్లికి సంతకాల ప్రతుల తరలింపు 15 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు దొమ్మేరు వద్ద వాహనానికి వీడ్కోలు -
‘వస్త్రాపహరణ సూచనతో కర్ణుడి పుణ్యాలు నశించాయి’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ద్రౌపది, పాండవుల వస్త్రాలను ఊడబెరకమంటూ దుశ్శాసనుడికి చెప్పిన వాడు కర్ణుడని, ఈ సూచనతో అతడు చేసిన పుణ్యాలన్నీ నశించిపోయాయని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనాన్ని స్థానిక హిందూ సమాజంలో సోమవారం ఆయన కొనసాగించారు. ‘ద్రౌపదీ దేవిని ఈడ్చుకు వచ్చిన దుశ్శాసనుడితో కర్ణుడు పలికిన పలుకులు ఘోర పాపాలకు ప్రతిరూపాలు. ద్రౌపది ఏకవస్త్ర అయినా, వివస్త్ర అయినా పాపం లేదు. మానవ కాంతకు ఒకే భర్త. ఈమెకు ఐదుగురు భర్తలుండటంతో ఆమె బంధకి అయింది. ఈ మాటలు అన్నది దుర్యోధనుడు కాదు– కర్ణుడు’ అని చెప్పారు. ద్రౌపది కృష్ణ స్మరణ చేయడంతో.. ఆమె ధర్మమే ఆమెకు అక్షయ వస్త్రాలుగా వచ్చాయని అన్నారు. తాను ఇంతటి పరాభవానికి గురవుతున్నా, ధర్మరాజు ధర్మ మార్గం తప్పడని అనడం ద్రౌపది పాతివ్రత్య ధర్మానికి పరాకాష్ట అని చెప్పారు. ధర్మరాజు ద్యూత వ్యసనపరుడు కాదని, శకుని అలా చిత్రీకరించాడని, అతడి మాటలను ప్రమాణంగా తీసుకోరాదని అన్నారు. ధర్మరాజు.. ధృతరాష్ట్రుడిని తండ్రిగా భావించాడని, ఆయన ఆదేశాన్ని అనుసరించే ద్యూత క్రీడకు వచ్చాడని స్పష్టం చేశారు. తన బదులు శకుని ద్యూతమాడతాడని దుర్యోధనుడు చెప్పినప్పుడు, అది సరికాదని ధర్మరాజు చెబుతూనే, చివరకు అంగీకరిస్తాడని అన్నారు. ‘‘ద్రౌపదిని పణంగా పెట్టమన్న మాట శకుని నోట వచ్చిందని, అది ధర్మరాజు మాట కాదని భీష్ముడు అన్నాడు. ఇందులో ధర్మం గతి అతి సూక్ష్మమైనదని చెప్పాడు. జరిగిన దానిని భీష్ముడు సమర్థించాడని చెప్పడం సరి కాదు. పుట్టినది మొదలు భీష్ముడు ఎటువంటి పాపమూ చేయలేదని కృష్ణుడు అనుశాసన పర్వంలో అన్న మాటలను మనం విస్మరించరాదు. త్వరలో ధార్తరాష్ట్రులందరూ నశిస్తారనిపిస్తోందని భీష్ముడు అంటాడు. ద్రౌపదిని పరాభవిస్తున్న సమయంలో ‘సహదేవా, అగ్ని తీసుకురా. అన్నగారి చేతులను తగలబెడతాను’ అని భీముడు అన్నట్లు అనువాదకులు రాశారు. కానీ, భీముడు అన్న మాటలకు అర్థం అది కాదు. ఇక్కడ వ్యాసుల వారు చెప్పిన శ్లోకం– అస్యాఃకృతే మన్యురయం త్వయి రాజన్ నిపాత్యతే, బాహూ తే సంప్రదక్ష్యామి సహదేవాగ్ని మానయ’– ఇక్కడ ‘తే’ అన్న పదానికి నీ చేతులు అని అర్థం కాదు, నీ సమక్షంలో– నా చేతులు తగులబెట్టుకుంటానని శ్లోక భావం. నీలకంఠీయ వ్యాఖ్యానం కూడా ఇదే భావాన్ని సమర్థిస్తోంది’’ అని సామవేదం వివరించారు. ధృతరాష్ట్రుడు, దుష్టచతుష్టయం తప్ప మిగతావారందరూ తలలు వంచుకుని తీవ్ర ఆవేదనకు గురయ్యారని చెప్పారు. భీముడు ఆవేశపరుడే కానీ, ధర్మపాశానికి, అన్నగారి మాటకు కట్టుబడినవాడని సామవేదం స్పష్టం చేశారు. -
స్వచ్ఛందంగా పాల్గొన్నారు
పేదలకు సంబంధించి విద్య, వైద్య రంగాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంస్కరణలు తెచ్చారు. ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి అనుసంధానంగా వైద్య కళాశాల తీసుకొచ్చారు. వీటిని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు సర్కార్ జీఓ జారీ చేసింది. కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. – జి.శ్రీనివాస్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు సమన్వయకర్త వెన్నుపోటు చంద్రబాబు నైజం మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 2014లో అబద్ధపు హామీలతో గద్దెనెక్కారు. విద్యార్థులు, మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేశారు. ఇప్పుడు 2024లో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ తిరిగి ప్రజలను మోసం చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టేందుకే కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టాం. పేదలకు విద్య, వైద్యాన్ని దూరం చేసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రను ప్రజలు స్వచ్ఛందంగా తిప్పి కొడుతున్నారు. ఇప్పటికై నా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలి. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు సమన్వయకర్త ప్రైవేటీకరణను విరమించుకునే వరకూ పోరాటం ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకునేంత వరకూ వైఎస్సార్ సీపీ పోరాడుతుంది. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ పిలుపు మేరకు అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. జిల్లాలో లక్షలాది మంది సంతకాలు చేయడం ఒక రికార్డు. కోటి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించేందుకు పార్టీలకు అతీతంగా ప్రజలు వేలాదిగా ర్యాలీలో పాల్గొన్నారు. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, అనపర్తి సమన్వయకర్త ఉద్యమం.. మరింత ఉధృతం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్య, పేదలకు ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించారు. చంద్రబాబు సర్కార్ వ్యాపార ధోరణితో వీటిని ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిలుపు చేసేంత వరకూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త, రాజమహేంద్రవరం -
అనుమానాస్పద స్థితిలో సెల్ మెకానిక్ మృతి
నిడదవోలు: స్థానిక శాంతినగర్లో నివాసముంటున్న సెల్ఫోన్ మెకానిక్ మహ్మద్ హఫీజ్ బాషా (39) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. ఈ నెల 14న ఉదయం 9 గంటలకు సెల్ మెకానిక్ల మీటింగ్ ఉందని ఇంట్లో చెప్పి బయటకు వచ్చాడు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఇంటికి బిర్యానీ కూడా పంపించాడు. తర్వాత రెండు గంటలకు హఫీజ్ బాషాకు భార్య షామున్నిషా ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. రాత్రి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. సోమవారం ఉదయం 8:30 గంటలకు పట్టణంలోని కాపు కల్యాణ మండపం సమీపంలో ఖాళీ ప్రదేశంలో హఫీజ్ బాషా కిందపడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. అతని బంధువులు, స్నేహితులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ప్రైవేట్ వాహనంలో నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. హఫీజ్ బాషాకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీ చేయి పనిచేయదు.. పెన్షన్ రాద్దాంలే...
● జీజీహెచ్ వైద్యుల నిర్వాకంతో చేయి కోల్పోయిన బాధితుడు ● ఎందుకిలా చేశారని ప్రశ్నిస్తే పెన్షన్ రాస్తానని చెప్పిన డాక్టరు కాకినాడ క్రైం: సర్జరీ తేడాగా జరిగింది, నీ చేయి పనిచేయదు, పెన్షన్ రాద్దాంలే... ఇదీ వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన చేతిని కోల్పోయిన ఓ పేద రోగికి జీజీహెచ్ వైద్యులు ఇచ్చిన సమాధానం. నిక్షేపంగా ఉన్న తన చేతిని చచ్చుపడేలా చేశారని బాధితుడు వాపోయాడు. కలెక్టర్ను కలిసి ఆధారాలు అందించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి 18న పెదపూడి మండలం కై కవోలు గ్రామానికి చెందిన 42 ఏళ్ల పెరుగుల వెంకటరమణ ద్విచక్ర వాహనం స్టాండ్ వేస్తూ పడిపోయాడు. ఈ ఘటనలో అతడి కుడి చేతికి గాయమైంది. తన తమ్ముడు రాధాకృష్ణ సాయంతో కాకినాడ జీజీహెచ్లో చేరాడు. వైద్యులు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించి కట్టు కట్టారు. అదే రోజు వార్డులో ఉంచి తర్వాత రోజు ఉదయం డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో మళ్లీ రావాలని చెప్పారు. వైద్యుల సూచన మేరకు, వెంకటరమణ రెండు వారాల తర్వాత వస్తే ఏప్రిల్ 7న శస్త్రచికిత్స నిర్వహించారు. అప్పటి నుంచి బాధితుడి కుడి చేయి మెల్లగా అచేతనంగా మారుతూ వచ్చింది. చిటికెన వేలు అయితే పూర్తిగా ముడుచుకుపోయింది. మరుసటి రోజు నుంచి నొప్పి తీవ్రమవడం మొదలు పెట్టింది. వైద్యులు ఫర్వాలేదు సర్దుకుంటుంది అని చెప్పి ఏప్రిల్ 12న డిశ్చార్జి చేశారు. కట్టు విప్పడానికి మే 2న రమ్మంటే వెళ్లాడు. కట్టు విప్పిన తర్వాత తన చేయిని కదపలేకున్నానని, చిటికెన వేలు పూర్తిగా ముడుచుకుపోయిందని చెబితే ఫిజియో థెరపీ అవసరం అన్నారు. జీజీహెచ్ సహా స్వగ్రామంలో ఉన్న ఫిజియోథెరపీల వద్దకు ఎన్నిసార్లు వెళ్లినా ఫలితం లేకపోయింది. నెలలు గడుస్తున్న కొద్దీ చేయి పూర్తిగా నిస్సత్తువతో కదల్లేని స్థితికి చేరింది. చివరికి బాధితుడు రాయవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు సర్జరీ సమయంలో పెద్ద పొరపాటే జరిగిందని, మోచేతిలో బాల్ వంటి నిర్మాణాన్ని తీసేశారని చెప్పారు. దీంతో కంగుతిన్న బాధితుడు ఆందోళనతో ఈ నెల 8న జీజీహెచ్ సూపరింటెండెంట్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి, ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును ఆర్థోపెడిక్ వైద్యుడు శివానందంకు పంపించారు. శివానందం నివేదికలు పరిశీలించి సర్జరీలో తేడా జరిగింది. నీ చేయి రాదు, కావాలంటే పెన్షన్ పెడదాం లే అన్నారు. కంగుతిన్న బాధితుడు సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్లో తన సమస్యను కలెక్టర్కు నివేదించాడు. కలెక్టర్ దీనిపై విచారించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు. శస్త్రచికిత్స వేళ తనను ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డుకు తరలించేందుకు రూ.600 వసూలు చేశారని వాపోయాడు. తనకు 12,10 ఏళ్ల వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని తెలిపాడు. తన కుడి చేయి పూర్తిగా పనిచేయడం మానేయడం వల్ల బతుకుదెరువు కోల్పోయి తన కుటుంబం రోడ్డున పడిందని బాధితుడు రోదించిన తీరు కలచి వేసింది. -
ఈ ‘తిక్క’కు లెక్కుందా?
సచివాలయ భవనానికి సర్పంచ్ పేరు ఏర్పాటుపై గ్రామస్తుల విస్మయం అల్లవరం: సోషల్ మీడియాలో నిత్యం పోస్టులు పెడుతున్న ఎంట్రుకోన సర్పంచ్ తిక్కిరెడ్డి నాగవెంకట శ్రీనివాసరావు పబ్లిసిటీ పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన సచివాలయ భవనానికి ఏకంగా తన పేరును చెక్కించుకుని గ్రామస్తులను విస్మయానికి గురి చేశారు. ప్రహరీకి ఆర్చీ నిర్మించి, తను సర్పంచ్ పదవిలో బాధ్యతలు తీసుకున్న తేదీని ముద్రించారు. మాజీ సర్పంచ్ పేరిట ఉన్న ఇనుప గేటుని తొలగించి తన పేరిట ఇనుప గేటు పేరుని ఏర్పాటు చేశారు. గతంలో ఈ సర్పంచ్ జనసేన జెండాను సచివాలయం భవనంపై ఏర్పాటు చేయగా అధికారులు స్పందించి వెంటనే తొలగించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం సుమారు రూ.24 లక్షలతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సచివాలయ భవనాన్ని నిర్మించి ప్రజలకు అంకితం చేశారు. ప్రహరీ కూడా ప్రభుత్వ నిధులతోనే నిర్మించారు. ప్రభుత్వ భవనానికి సర్పంచ్ తన పేరుని ఎలా ఏర్పాటు చేసుకుంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి దీన్ని వెంటనే తొలగించారు. అయితే అది ప్రభుత్వ భవనమా? సర్పంచ్ నిధులతో నిర్మించిన భవనమా? తేల్చాలని ప్రజలు నిలదీస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ గౌరికుమారిని వివరణ కోరగా ఈ విషయంపై కార్యదర్శి జ్యోతిని ఇప్పటికే అడిగానని, తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. వలస కార్మికురాలిని ఇంటికి చేర్చిన కేసీఎం అమలాపురం రూరల్: ఉపాధి నిమిత్తం మస్కట్ వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురైన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వలస కార్మికురాలు పళ్ళ సోమలమ్మను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) అధికారులు క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. సోమలమ్మ ఫిబ్రవరి 2025లో మస్కట్ దేశానికి వెళ్లగా అక్కడ పనిచేసే చోట తీవ్ర శారీరక, మానసిక వేధింపులకు గురయ్యారు. సరైన ఆహారం, విశ్రాంతి లేకుండా చిత్రహింసలు పెట్టారని, ఇంట్లో నిద్రపోవడానికి అనుమతించకపోవడంతో బయట దోమల మధ్య, తేళ్ల భయంతో తన తల్లి విదేశాల్లో అవస్థలు పడుతున్నారని ఆమె కుమారుడు అరుణ్కుమార్ కలెక్టర్ మహేష్కుమార్కు అర్జీ సమర్పించారు. స్పందించిన కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్కు ఆదేశాలు జారీ చేశారు. కేసీఎం బృందం సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సోమలమ్మను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు కేంద్ర నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ళ రమేష్ సోమవారం తెలిపారు. -
స్మార్ట్ ఇండియా హాకథాన్లో ప్రతిభ
గండేపల్లి: స్మార్డ్ ఇండియా హాకథాన్లో సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్టు చైర్మన్ పి కృష్ణారావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 8,9 తేదీలలో ముంబై వేస్కూల్లో ప్రతిష్టాత్మకగా జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 కార్యక్రమానికి తమ కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థులు కె.సుచిత్ర, వి హేమంత్ శంకర్, వి మధు, బి ఆకాశ్, ఎస్ వేణు కౌశిక్, సాయి ప్రసాద్రాయ్ పాల్గొని మాగ్జిమైజింగ్ సెక్షన్ త్రూ ఫుట్ యూజింగ్ ఏ1–పవర్డ్ ప్రిసైజ్ ట్రైన్ ట్రాఫిక్ కంట్రోల్ అనే అంశంపై సవాల్తో కూడిన సమస్యను పరిష్కరించి జాతీయస్థాయిలో ఎంపికై న ఆరు జట్లలో ఒకటిగా ప్రగతి నిలిచిందన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎంవీ హరనాథబాబు, వైస్ ప్రెసిడెంట్ సతీష్, కె సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జి నరేష్, ఎంవీ రాజేష్, సీహెచ్ వీర గాయత్రి విద్యార్థులకు అభినందనలు తెలిపారు. -
కోడింగ్ నైపుణ్యంతో ఉపాధి అవకాశాలు
ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ శేషారెడ్డి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కోడింగ్ నైపుణ్యాలతో ఉపాధి అకాశాలు విస్త్రృతంగా ఉంటాయని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి పేర్కొన్నారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో సోమవారం డిగ్రీ, పీజీ విద్యార్థులకు కోడింగ్ కాంటెస్ట్–25 పోటీలు నిర్వహించారు. శేషారెడ్డి మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులకు దీటుగా ప్రస్తుత సాంకేతిక రంగంలో నిలబడాలంటే కోడింగ్ తప్పనిసరని, కోడింగ్ వల్లే సాధారణ డిగ్రీ విద్యార్థులు సైతం సాఫ్ట్వేర్ రంగంలో రాణించగలుగుతున్నారన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వీడన్ ఎస్ఈబీ బ్యాంక్ క్లౌడ్ ఇంజినీర్ కారుమంచి మహేష్ మాట్లాడుతూ ఐటీ రంగంలో ఉద్యోగాలు సాధించడానికి ముందుగా కోడింగ్ అవసరమని, ఇటువంటి పోటీలు నిర్వహించిన ఆదిత్య విద్యాసంస్థలను అభినందించాలన్నారు. అనంతరం ప్రతి కళాశాల నుంచి ముగ్గురిని ఎంపికచేసి 250 మందిని ఉత్తమ కొడర్లుగా ఎంపిక చేసి రూ.2లక్షల 50వేల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి సుగుణారెడ్డి, డాక్టర్ బీఇవీఎల్ నాయుడు, ప్రిన్సిపాల్ కె.కరుణ, బ్యూలా, కోడింగ్ ట్రైనర్ రాజేష్, ఐటీ మేనేజర్ కార్తీక్ పాల్గొన్నారు. -
ఆప్కో బకాయిలు విడుదల చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆరు సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకు ఆప్కో బాకీ ఉన్న డబ్బు వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు పప్పు దుర్గారమేష్ అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చేనేత సహకార సంఘాల సమావేశం సోమవారం స్థానిక ఉమారామలింగేశ్వర స్వామి కల్యాణ మండపంలో నిర్వహించారు. సుమారు 40 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలన్నారు. చేనేతల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వానికి చేనేతలకు అడ్డంకిగా వ్యవహరిస్తూ, అన్యాయం చేస్తున్న ఆప్కో ఎండీ, హ్యాండ్లూమ్ కమిషనర్ రేఖారాణిని ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి లోపు ఆప్కో బకాయిలు విడుదల చేయకపోతే రిలే నిరాహార దీక్షలతో మొదలు పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఆప్కో డైరెక్టర్ మాజీ ముప్పన వీర్రాజు, చేనేత కార్మిక సంఘం నాయకులు నల్లా రామారావు, అల్లక రాజు, దొంతంశెట్టి సత్యప్రకాష్ పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం
అనపర్తి: స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై ఎల్ శ్రీనునాయక్ తెలిపారు. సోమవారం స్థానికు ల సమాచారం మేరకు ఘట నా స్థలానికి వెళ్లి విచారణ చేయగా మూడు రోజుల నుంచి అనపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేసుకుంటూ, రాత్రి సమయంలో స్థానిక వజ్ర కాంప్లెక్స్ బయట పడుకునేవాడని, అనారోగ్యంతో మృతి చెంది ఉంటాడని తెలిసిందన్నారు. సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి చామన ఛాయ కలిగి ఉన్నాడని లేత పసుపు రంగుపై నిలువు చారలు కలిగిన ఫుల్ హ్యాండ్ షర్టు, బూడిద రంగు ప్యాంటు, తెలుపు నలుపు రంగు కలిగిన చలి కోటు ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని అనపర్తి ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరచినట్టు చెప్పారు. తెలిసినవారు గాని, బంధువులు గాని అనపర్తి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్సై నాయక్ కోరారు. -
విద్యుత్ వైర్లు తగిలి కూలీ మృతి
రాజానగరం: మండలంలోని కానవరంలో పామాయిల్ గెలలు కోస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో అదే గ్రామానికి కూలీ బొర్రా నాగేశ్వరరావు (49) సోమవారం మృతి చెందాడు. సాయంత్రం 4 గంటల సమయంలో పొడవాటి ఇనుప గొట్టానికి బిగించి ఉన్న కత్తితో ఆయిల్ పామ్ చెట్ల నుంచి గెలలు కోస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మాజీ సర్పంచ్ ఎస్.సత్యనారాయణ మీడియాకు తెలిపారు. చెట్లపై నుంచి వెళ్లిన విద్యుత్ వైర్లు కత్తికి తగులుకొని విద్యుత్ ప్రవహించి, షాక్ కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లెంత తుళ్లింత కావాలిలె!
● నేటి నుంచి ధనుర్మాసం ● గ్రామాల్లో ఇక సంక్రాంతి సందడి ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● ఆకట్టుకోనున్న రంగవల్లులు ● కోనసీమ ప్రత్యేకతగా ప్రభల ఉత్సవం ● దేశ విదేశాల నుంచి స్వగ్రామాలకు రానున్న తెలుగువారు ఆలమూరు/బిక్కవోలు: తెలుగు సంస్కృతికి, సనాతన సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు, గ్రామ ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలిచే మకర సంక్రాంతి పండగకు పల్లె సీమలు ముస్తాబవుతున్నాయి. మార్గశిర కృష్ణ పక్ష ద్వాదశి, మూల కార్తీ రోజైన మంగళవారం మధ్యాహ్నం 1.23 గంటలకు సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడంతో శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ధనుర్మాసాన్ని నెల పట్టుట లేదా నెలగంట అంటారు. జనవరి 14న జరిగే భోగి పండగ వరకూ నెల రోజుల పాటు ఈ ధనుర్మాసం ఉంటుంది. విష్ణాలయాల్లో ధనుర్మాస పూజలు చేసేందుకు దేవదాయశాఖ ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉన్న విష్ణాలయాల్లోని దేవతామూర్తులు ప్రతి రోజూ పల్లకిలో ఊరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనివ్వనున్నారు. సంప్రదాయ కళల కోలాహలం సంక్రాంతి ధనుర్మాసం ప్రారంభం కావడంతో సంప్రదాయ కళల కోలాహలం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. తెల్లవారుజామున ఇంటి ముంగిట ఆడపడుచుల రంగు రంగుల హరివిల్లులు, హరిదాసు కీర్తనలతో మేలుకొలుపు, సంప్రదాయ పిండివంటలతో లోగిళ్లు కళకళలాడనున్నాయి. సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు, కోడి, ఎడ్ల పందేలను నిర్వహించేందుకు పల్లెలు సమాయత్తం అవుతున్నాయి. భోగి పండగను పురస్కరించుకుని చిన్నారులు ఆవు పేడను సేకరించి భోగి పిడకలను తయారు చేసే పనిలో నిమగ్నమవుతున్నారు. ఏడాదికోసారి వచ్చే కొమ్మదాసులు, గంగిరెద్దుల వారు, కోయదాసులు వంటి కళాకారులు గ్రామాల్లో సందడి చేయనున్నారు. సంప్రదాయ కళలుగా భావిస్తున్న కోడిపందేలను పోలీసుల కళ్లు గప్పి ఏవిధంగా నిర్వహించాలనే ఆలోచనలో ెపందెం రాయుళ్లు ఉన్నారు. ఇప్పటికే పందెం కోళ్లను జీడిపప్పు, బాదం పప్పు వంటి పౌష్టికాహారంతో ఇంటి ఆవరణలో పెంచుతున్నారు. పాకశాలలుగా పల్లె లోగిళ్లు సంక్రాంతి నెల ప్రారంభం కావడంతో గ్రామాల్లోని లోగిళ్లు పిండివంటల తయారు చేస్తూ పాకశాలలుగా మారనున్నాయి. ఇంటికి వచ్చే కొత్త అల్లుళ్లు, దేశ విదేశాల నుంచి వచ్చే కుటుంబ సభ్యులు, బంధువులకు తెలుగు సంప్రదాయ వంటకాలైన సున్నుండలు, గజ్జికాయలు, జంతికలు, గవ్వలు, పోకుండలు తయారు చేసేందుకు మహిళలు సమాయత్తమవుతున్నారు. రైతులకు పంట చేతికందడంతో సంక్రాంతిని మరింత ఉత్సాహంగా జరుపుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సంక్రాంతికి నూతన వస్త్రాలు కొనుగోలు చేయడంతో పాటు తమ లోగిళ్లను సుందరంగా అలంకరించే పనిలో నిమగ్నమవ్వనున్నారు. ఇతర దేశాల్లో కాని, రాష్ట్రాల్లో కాని నివసించే తెలుగు ప్రజలు స్వగ్రామానికి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే విమానం, రైలు, బస్ టికెట్లు బుక్ అయిపోయాయి. పోటాపోటీగా ప్రభల ఉత్సవాలు సంక్రాంతి పండగను పురస్కరించుకుని రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కోనసీమలోని సుమారు 15 మండలాల్లో ప్రభల తీర్థ మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఏకాదశ రుద్రులుగా భావించే ప్రభల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రభల ఉత్సవాలకు ప్రత్యేకత ఉంది. ఈ ప్రభలను పండగ మూడురోజుల పాటు ఊరేగించి పొలిమేరలు దాటిస్తే ఆ గ్రామానికి శుభం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే గ్రామాలు, పట్టణాల్లో పోటీ పడి ప్రభల ఉత్సవాలను జరుపుతున్నారు. బాణసంచా పేలుళ్లు, కోలాటాలు, బ్యాండుమేళాలు వంటివి ఏర్పాటు చేసి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గొబ్బెమ్మకు పూజలు పండగ నెల ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఇంటి ముందు ఉదయాన్నే కళ్లాపు చల్లి అందమైన ముగ్గులు వేసి వాటి మధ్యన గొబ్బెమ్మను పెట్టి పూజిస్తారు. తెలుగు సంప్రదాయం ప్రకారం గొబ్బెమ్మలను గోదాదేవి, లక్ష్మీ దేవి, గౌరీ మాతగా భావిస్తారు. గోవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో ఉంచి గుమ్మడి, తంగేడు, గురుగు పూలు, పసుపు కుంకుమ సమర్పించి పూజిస్తారు. ధనుర్మాసం పొడవునా గొబ్బెమ్మను పూజించడం ఆనవాయితీ. -
కూటమి సర్కార్ విధానాలపై ప్రజాగ్రహం: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వం మెడికల్ కళాశాలు ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీలో పార్టీ కోఆర్డినేటర్లు జక్కంపూడి రాజా, మార్గాన్ని భరత్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, షర్మిలరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: జాతీయ జాతీయ రహదారిపై ప్రతిపాడు వద్ద జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎన్హెచ్పై నరేంద్రగిరి సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, రోడ్డు పక్కన పడి ఉన్నాడు. ఆ దారిన వెళ్లే వ్యక్తులు 108కు ఫోన్ చేయడంతో క్షతగాత్రుడిని స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. ఎరుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94407 96570, 94407 96530 ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కోరారు. -
వచ్చే నెల 12న బాడీ బిల్డింగ్ పోటీలు
అమలాపురం టౌన్: జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా క్రీడాకారుడు, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ దివంగత రంకిరెడ్డి కాశీ విశ్వనాథం (అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాయిరాజ్ సాత్విక్ తండ్రి) పేరుతో వచ్చే జనవరి 12న అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో ఉభయ గోదావరి జిల్లాల స్థాయి బాడీ బిల్డింగ్, ఫిజిక్ స్పోర్ట్స్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వంటెద్దు వెంకన్నాయుడు వెల్లడించారు. అమలాపురంలోని వంటెద్దువారి వీధిలో ఈ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ పోటీల వివరాలను అసోసియేషన్ కార్యదర్శి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు తెలిపారు. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరవుతారని అన్నారు. మొత్తం 12 కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నామని వివరించారు. విజేతలకు నేషనల్ షీల్డ్లు, మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్లు, క్యాష్ అవార్డులు ప్రదానం చేయనున్నామన్నారు. పోస్టర్ల విడుదల కార్యక్రమంలో జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు నగభేరి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సభ్యులు మట్టపర్తి వెంకట సముద్రం, నార్ని శ్రీను, చిక్కం రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
రెండు మోటారు సైకిళ్ల చోరీ
సామర్లకోట: రెండు మోటారు సైకిళ్ల చోరీపై ఆదివారం బాధితులు సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక పెద్దబజార్కు చెందిన శ్రీశైలపు బుజ్జి శనివారం స్టేషన్ సెంటర్లోని ఆటో స్టాండ్ వద్ద తన మోటార్ సైకిల్ నిలిపి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి కనిపించ లేదని ఫిర్యాదు చేశాడు. అదే విధంగా జి.మేడపాడు గ్రామానికి చెందిన మాదాసు వెంకటరమణ రైల్వే గేటు వద్ద నిలిపిన మోటార్ సైకిల్ చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎస్సై మూర్తి కేసు దర్యాప్తు చేస్తున్నారు. శిలాఫలకం ధ్వంసం చేశారని ఫిర్యాదు ముమ్మిడివరం: గత ప్రభుత్వంలో రహదారి నిర్మాణ నిమిత్తం ఏర్పాటు చేసిన శంకుస్థాపన శిలాఫలకాన్ని స్థానిక జనసేన నాయకుడు ధ్వంసం చేశారంటూ వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని గేదెల్లంక ఉత్తరవాహినికి వెళ్లే రహదారి నిర్మాణం కోసం గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్కుమార్ రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనివార్య కారణాలతో రోడ్డు నిర్మాణ పనులు జరగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ రోడ్డు నిర్మాణానికి రూ.1.86 లక్షల నిధులు మంజూరు చేశారు. ఆ పనులు మొదలు పెట్టే ఉద్దేశంలో కనీసం గ్రామ సర్పంచ్కు గాని, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలికి గాని సమాచారం ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని జేసీబీతో స్థానిక జనసేన నాయకుడు గుద్దటి రమాకేశవ బాలకృష్ణ ధ్వంసం చేశారని అంటున్నారు. అదేవిధంగా పంచాయతీ తీర్మానం లేకుండా అడ్డు వచ్చిన కొబ్బరి చెట్లను తొలగించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సానబోయిన పల్లయ్య, వైఎస్సార్ సీపీ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు జంపన శ్రీనివాసరాజు, కోలా వెంకటరత్నం (బాబ్జీ) తదితరులు ఆదివారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అమ్మో పులి
ఫ మెట్ట ప్రజలను వణికిస్తున్న వైనం ఫ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్న అధికారులు దేవరపల్లి: మెట్ట ప్రాంత ప్రజలను పులి వణికిస్తోంది. రెండు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భీమోలు గ్రామంలోని పంట పొలాల్లో శుక్రవారం ఓ పులి, రెండు పిల్లలతో తిరుగుతున్నట్లు చూసినట్లు రైతు కె.రామకృష్ణ చెబుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీ అధికారులు రంగలోకి దిగారు. పులి సంచరిస్తున్నట్టు రైతు చెప్పిన ప్రాంతంలో రెండు రోజులుగా అధికారులు గాలిస్తున్నారు. అటవీ ప్రాంతంలో జంతువు పాదముద్రను గుర్తించారు. అయితే అది పులి పాద ముద్రా? లేక ఏదైనా జంతువుదా అనేది నిర్ధారించాల్సి ఉంది. ఆదివారం జిల్లా అటవీ అధికారి దావీద్రాజు నాయుడు, డిప్యూటీ రేంజ్ అధికారి జి.వేణుగోపాల్, సిబ్బంది అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆరు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు దావీద్రాజు నాయుడు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ఎవరూ పొలాలకు వెళ్లవద్దని సూచించారు. గతేడాది ఇదే పరిస్థితి.. గత ఏడాది కూడా గోపాలపురం నియోజకవర్గంలో ప్రజలకు దాదాపు రెండు నెలలు పులి కంటి మీద కునుకు లేకుండా చేసింది. 2024 ఫిబ్రవరిలో ద్వారకాతిరుమల మండలంలో కొద్ది రోజులు సంచరించిన పులి నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లోని పొగాకు తోటల్లోనూ తిరిగింది. రెండు మండలాల్లో పులి తెల్లవారు జామున పొలాలకు వెళ్లిన రైతుల కంట పడడంతో భయంతో వణికిపోయారు. దాని ఆచూకీ కోసం అటవీ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. పొలాల్లో పాదముద్రలను సేకరించి పులి సంచరిస్తున్నట్టు నిర్ధారించారు. ఫిబ్రవరి 3న పులి దేవరపల్లి మండలం యాదవోలు నుంచి గోపాలపురం మండలం వాదాలకుంట, కోమటికుంట, కరిచర్లగూడెం గ్రామాల మీదుగా మాతగమ్మ మెట్టపైకి చేరుకుని సంచరించింది. అక్కడ నుంచి గోపాలపురం మండలం కరగపాడు గ్రామ శివారున గల రిజర్వ్ ఫారెస్ట్కు చేరుకుంది. ఫారెస్ట్కు సమీపంలో కరగపాడుకు ఆనుకుని ఉన్న రైతు జక్కు అచ్చయ్య మొక్కజొన్న తోటలో పెంచుకుంటున్న పందిపై పులి దాడి చేసింది. ఆ పులి ఆచూకీ కోసం రిజర్వ్ ఫారెస్ట్లో పలు ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా ఫలితం దక్కలేదు. మళ్లీ ఇప్పుడు పులి జాడలు కనిపించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. -
మాజీ ఎంపీ కృష్ణమూర్తికి అంతిమ వీడ్కోలు
అమలాపురం టౌన్/ అయినవిల్లి: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి అంతమ యాత్ర అమలాపురంలో ఆదివారం సాయంత్రం విషాద వాతావరణంలో జరిగింది. తొలుత కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి నేరుగా అయినవిల్లి మండలం విలస గ్రామం రావిగుంట చెరువులోని ఆయన స్వగృహానికి తీసుకు వచ్చారు. అక్కడ రాజకీయ ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎంపీ కృష్ణమూర్తి చిరస్మరణీయుడని అన్నారు. చిర్ల జగ్గిరెడ్డితో పాటు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్లు గన్నవరపు శ్రీనివాసరావు, పినిపే శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరీదేవి, వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్రాజు, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ పాముల దేవీప్రకాష్, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, గిడ్డి సత్యనారాయణ, మాజీ ఎంపీలు చింతా అనురాధ, బుచ్చి మహేశ్వరరావు, మాజీ మంత్రి పరమట వీరరాఘవులు, ఎంపీపీ మార్గాని గంగాధర్లు కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫ అనంతరం అంతిమ యాత్రలో భాగంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కొద్దిసేపు ప్రజల సందర్శనార్థం ఆపారు. తర్వాత అమలాపురం నల్ల వంతెన సమీపం కలెక్టరేట్ రోడ్డులోని కృష్ణమూర్తి సొంత గొడౌన్ల వెనుక అంత్యక్రియలు జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కృష్ణమూర్తి పార్థివ దేహంపై పార్టీ జెండాను వేసి నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రి పరమట రాఘవులు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, వైఎస్సార్ సీపీ నాయకులు డీఎంఆర్ రాజశేఖర్, వంటెద్దు వెంకన్నాయుడు, ఉండ్రు వెంకటేష్, సరెళ్ల రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు ముషిణి రామకృష్ణారావు, దేవరపల్లి రాజేంద్రబాబు, అయితాబత్తుల సుభాషిణి, యార్లగడ్డ రవీంద్ర, జిల్లా దళిత ఐక్య వేదిక నాయకులు డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబు, గెడ్డం సురేష్బాబు, పెనుమాల చిట్టాబాబు, నాతి శ్రీను, పెయ్యల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని కృష్ణమూర్తి పార్థివ దేహాన్ని కడసారి చూసి నివాళులర్పించారు. ఏ తల్లి కన్న బిడ్డో.. ఫ పెంట కుప్పపై ప్రత్యక్షం ఫ చేరదీసిన మానవత్వం కపిలేశ్వరపురం (మండపేట): ఏ తల్లి కన్న బిడ్డో.. కాన్పు కాగానే పెంట కుప్ప పాలయ్యాడు. జనమంతా చలికి వెచ్చని దుప్పటి మాటున నిద్రలో ఉన్న సమయమది. మంచు కురిసే వేళ ఎముకలు కొరికే చలిలో ఆరుబయట పశువుల పాక పక్కన పెంట కుప్పపై ఓ బిడ్డ కనిపించిన దృశ్యం అందరినీ కలచివేసింది. కుక్కలు చుట్టుముట్టినా మృత్యుంజయుడిలా ఊపిరిపోసుకున్న ఆ ఆబిడ్డను మానవత్వం అక్కున చేర్చుకుంది. మండపేట పట్టణంలోని సత్యశ్రీ రోడ్డు కోళ్లఫారం ఎదురుగా గేదెల పాక వద్ద మగ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు వదలివెళ్లారు. ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్తున్న రైతు ఏడుపును విని ఆ బిడ్డను చూశాడు. చెంతనే ఉన్న కుక్కలను బెదరగొట్టి పిల్లాడిని చేరదీసి పట్టణంలోని సీహెచ్సీలో చేర్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో శిశువును పరీక్షించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు నిర్ధారించారు. పట్టణ ఎస్సై ఎన్.రాము ఆదేశాలపై హెచ్సీ కాంతారావు ఆసుపత్రిని సందర్శించారు. ఐసీడీఎస్ సీడీపీఓ యు.పూర్ణిమ ఆదేశాలపై సెక్టార్ సూపర్వైజర్ సీహెచ్ నాగశ్రీదేవి, అంగన్వాడీ సీహెచ్ రాణి ఆసుపత్రికి వెళ్లారు. అమలాపురంలోని శిశుగృహ నిర్వాహకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో శిశువు సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. మరో బాలికపై అత్యాచారం ముమ్మిడివరం: వరుసగా బాలికలపై అత్యాచారాలు జరుగుతుండడంతో కోనసీమ జిల్లాలో కలకలం రేపుతుంది. నెల రోజుల క్రితం ఐ.పోలవరం మండలం బాణాపురంలో జనసేన నాయకుడు ఓ బాలికపై అత్యాచారం చేయగా, వారం క్రితం ముమ్మిడివరం గురుకుల పాఠశాలలో పదో తరగతి బాలికపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల కిందట ఉప్పలగుప్తం మండలంలో ఓ తండ్రే కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఇది మరువక ముందే ముమ్మిడివరంలో ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదు కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ముమ్మిడివరం ఓ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముమ్మిడివరం పోలీసులు కేసు నమోదు చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు చిన అగ్రహారానికి చెందిన కాలాడి సతీష్ రెండేళ్లుగా ఆ బాలికను ప్రేమ పేరుతో మోసగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ ఎం.మోహన్కుమార్ పర్యవేక్షణలో ఎస్సై డి.జ్వాలాసాగర్లు సతీష్పై అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు. -
భయం పోయేలా.. భవితకు బాట వేసేలా
● ఆంగ్ల భాషపై పట్టుకు స్పెల్బీ దోహదం ● ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్బీ సెమీ ఫైనల్స్ ● ఉత్సాహంగా పాల్గొన్న 490 మంది విద్యార్థులురాజమహేంద్రవరం రూరల్: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్బీ సెమీ ఫైనల్స్ పరీక్షలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. రాజమహేంద్రవరంలోని ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఈ పరీక్షకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి 490 మంది విద్యార్థులు నాలుగు కేటగిరీల్లో పరీక్షలు రాశారు. తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్షలు ఎంతగానో దోహదపడతామని తల్లిదండ్రులు పేర్కొన్నారు. స్పెల్బీ ద్వారా ఆంగ్ల భాషపై మంచి పట్టు సాధించడానికి అవకాశం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగింది. కేటగిరీలుగా విభజించి.. కేటగిరీ–1లో 1, 2 తరగతులకు చెందిన విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పరీక్షల్లో పాల్గొనడం ద్వారా నూతనోత్తేజం తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. స్పెల్బీ నిర్వహించిన ‘సాక్షి’ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరీక్షలను ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ (అడ్మిన్) ఎస్.రమేష్రెడ్డి, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కోఆర్డినేటర్ వి.రాజేష్, ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ లీజా పర్యవేక్షించారు. పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పెల్బీకి డ్యూక్స్ వేఫీస్ మెయిన్ స్పాన్సరర్గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమహేంద్రవరం) అసోసియేట్ స్పాన్సరర్గా వ్యవహరిస్తున్నాయి. ఆదిత్య ఇంటర్నేషనల్ స్కూల్ సహకారం అందించింది. ●భవిష్యత్కు బాటలు ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ భాషపై సంపూర్ణ అవగాహన ఏర్పడింది. పోటీ పరీక్షలు అంటే భయం పోయింది. స్పెల్లింగ్, వ్యాకరణంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఇది నా భవిష్యత్కు బాటలు వేస్తోంది. – వేగుంట నమస్వి, ఆరో తరగతి, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్, రాజమహేంద్రవరం ●ఎంతో ఉపయుక్తం ఇంగ్లిష్ భాషలో ఒకాబులరీ పట్ల అవగాహన ముఖ్యం. ఇది ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ద్వారా అవగతం చేసుకున్నాను. పరీక్ష ద్వారా తర్ఫీదు పొందాను. వర్డ్స్, స్పెల్లింగ్స్ పట్ల అవగాహన కలిగింది. ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంది. – గారపాటి రుద్రనాగ్చౌదరి, 9వ తరగతి, లారల్ హైగ్లోబల్ స్కూల్, గాడాల ●ఎంతో ఉత్సాహం వచ్చింది విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ‘సాక్షి ’స్పెల్బీ పరీక్ష బాట వేస్తోంది. ఇంగ్లిష్లో స్పెల్లింగ్, ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిని నేర్చుకోవడానికి ఈ పరీక్ష దోహదపడుతుంది. పరీక్ష బాగా రాశాను. దీనివల్ల ఎంతో ఉత్సాహం వచ్చింది. – కాసర ప్రతిభ, 8వ తరగతి, ప్రతిభ స్కూల్, జంగారెడ్డిగూడెం ●రాణించేందుకు మంచి అవకాశం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేలా ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఉంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి ఇదో మంచి మార్గం. ఈ పరీక్షతో అనేక అంశాలు తెలుసుకున్నాను. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే అనేక పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటడానికి మార్గం సుగమమైంది. – పెన్మెత్స సాత్విక, 8వ తరగతి, ఆదిత్య స్కూల్, తాడేపల్లిగూడెం ●సులభంగా నేర్చుకునేందుకు.. ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ భాష అంటే భయం పోయింది. పలకడం, రాయడం సులభతరం అయ్యింది. ఇక నుంచి సులభంగా ఇంగ్లిష్ నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ పరీక్ష రాయడంతో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. – కఠారి చరిష్మా, 9వ తరగతి, కోనసీమ విద్యాశ్రమ్, ముక్తేశ్వరం ●థ్యాంక్యూ ‘సాక్షి’... నేను ముందుగా స్పెల్బీ నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి థ్యాంక్స్ చెబుతున్నా. నాలో ఉన్న నైపుణ్యాలను బయటకు తీసేందుకు ఈ పరీక్ష దోహదపడింది. నేను స్పెల్బీ పరీక్ష రాశాను. సెమీ ఫైనల్లో మంచి మార్కులు వస్తాయని ఆశిస్తున్నాను. పరీక్ష నా భవిష్యత్తుకు పునాది లాంటిది. – దాట్ల దీక్షిత, 7వ తరగతి, ఆదిత్య నగర్, శ్రీనగర్, కాకినాడ ●అవగాహన పెరిగింది స్పెల్బీ పరీక్ష ద్వారా ఇంగ్లిష్పై అవగాహన పెరిగింది. గతంలో ఈ భాష అంటే భయంగా ఉండేది. చదవాలన్నా, రాయాలన్నా అయిష్టంగా ఉండేది. స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్ పదాలను స్పెల్లింగ్తో సహా నేర్చుకున్నాను. ప్రస్తుతం ఏ సబ్జెక్టయినా సునాయసంగా చదవగలుగుతున్నా. – ఎన్ఎస్ఎస్ ఆరాధ్య, 8వ తరగతి, దిప్యూచర్ కిడ్స్ స్కూల్, రాజమహేంద్రవరం ●భవిష్యత్తుకు నిర్దేశంగా.. విద్యార్ధుల భవిష్యత్తును నిర్దేశించడానికి ‘సాక్షి’ స్పెల్బీ పరీక్ష ఉపయోపడుతుంది. ఇంగ్లిష్ భాషంటే భయం దూరం చేస్తోంది. పోటీతత్వం అలవాటు పడుతుంది. ఇంగ్లిష్లో ఒకాబులరీ చాలా ముఖ్యం. దీనిపై అవగాహన పెరుగుతుంది. ‘సాక్షి’ యాజమాన్యం ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాలి. – డాక్టర్ టీవీ ప్రసాద్, విద్యార్థిని తండ్రి, రాజమహేంద్రవరం ●ఆంగ్లంపై పట్టు సాధించవచ్చు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరిగింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచి ఆంగ్లంపై పట్టు సాధించేందుకు స్పెల్బీ పరీక్ష దోహదపడుతుంది. సాక్షి స్పెల్బీ ద్వారా ఇంగ్లిష్లో ఒకాబులరీ, లాంగ్వేజ్ స్కిల్స్ పెంపొందుతాయి. విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. – డాక్టర్ దీప్తి చిగుళ్లపల్లి, విద్యార్థి తల్లి, రాజమహేంద్రవరం ●విద్యార్థులకు ప్రయోజనం ‘సాక్షి’ మీడియా గ్రూప్ నిర్వహిస్తున్న స్పెల్బీ పరీక్ష విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ పరీక్షతో స్పెల్లింగ్లు, పదాలకు అర్థాలు చెప్పే సామర్థ్యం పెరుగుతుంది. ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గత పదేళ్లుగా ‘సాక్షి’ స్పెల్బీ పరీక్షల్లో పాల్గొంటున్నాయి. అలాగే తమ ఆదిత్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ‘సాక్షి’ స్పెల్బీ ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహం పెరుగుతోంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి దోహదపడుతుంది. – వి.రాజేష్, కోఆర్డినేటర్, ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, రాజమహేంద్రవరం -
ముగిసిన వాలీబాల్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంతో కాకినాడ జేఎన్టీయూలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్న్మెంట్ ఆదివారం రాత్రితో ముగిసింది. జేఎన్టీయూకే క్రీడా మైదానంతో పాటు రాజీవ్గాంఽధీ ఏంబీఏ కళాశాల, ఆదిత్య సూరంపాలెం కళాశాలలో పోటీలు నిర్వహించారు. ఫైనల్స్లో చెన్త్నె మద్రాస్ యూనివర్సిటీపై చైన్నె ఎస్ఆర్ఏం యూనివర్సిటీ గెలిచింది. రన్నర్గా మద్రాస్ యూనివర్సిటీ నిలవగా, కేరళ కాలికట్ యూనివర్సిటీ తృతీయ, భారతీయర్ యూనివర్సిటీ నాల్గో స్థానంలో నిలిచాయి. అంతర్జా తీయ వాలీబాల్ క్రీడాకారుడు ఎంసీహెచ్ఆర్ కృష్ణంరాజు, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్లు విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ శ్రీనివాసరా వు, స్టూడెంట్స్ ఎఫైర్ డైరెక్టర్ కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్యామ్ కుమార్, డాక్టర్ జీపీ రాజు పాల్గొన్నారు. -
పుడమి తల్లికి పచ్చబొట్లు
● రబీ వరి నాట్లకు శ్రీకారం ● బోర్ల కింద ప్రారంభించిన రైతులు ● సాగు విస్తీర్ణం 61,326 హెక్టార్లు ● ఇప్పటి వరకూ 895 హెక్టార్లలో నాట్లు దేవరపల్లి: ఖరీఫ్ ధాన్యం అమ్మకాలు పూర్తి కాకుండానే రైతులు రబీ వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతంలోని పలు గ్రామాల్లో.. ముందుగా ఖరీఫ్ కోతలు పూర్తయిన పొలాల్లో.. బోర్లు, కాలువల కింద వారం రోజులుగా వరి ఆకుమడులు ముమ్మరంగా వేస్తున్నారు. రాజానగరం, దేవరపల్లి, నల్లజర్ల, కొవ్వూరు, తాళ్లపూడి చాగల్లు, మండలాల్లో వరి నాట్లు సైతం ప్రారంభించారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందుకోనున్నాయి. ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ఖరీఫ్ దిగుబడులు ఆశాజనకంగా లేక పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. సార్వాలో ఎకరాకు 32 నుంచి 38 బస్తాల ధాన్యం దిగుబడి రావలసి ఉండగా, 25 నుంచి 28 బస్తాలు మాత్రమే వచ్చాయి. దీంతో, పెట్టుబడి కూడా రాక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో దాళ్వా పైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వాతావరణం అనుకూలిస్తే దాళ్వాలో ఎకరాకు 55 నుంచి 60 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తుంది. ఈసారి కూడా అలాగే జరిగి, దండిగా దిగుబడులు వచ్చి, నాలుగు డబ్బులు మిగలాలని ఆశ పడుతున్నారు. అధిక దిగుబడులిచ్చే వంగడాలపై మొగ్గు దాళ్వాలో అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా 120 రోజుల పంట కాల పరిమితి వండగాలయిన ఎంటీయూ–1121, ఆర్ఎన్ఆర్–15048, ఎంటీయూ–1156, ఎంటీయూ–1153 రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు డీసీఎంఎస్, సొసైటీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తూండగా.. ఎక్కువ మంది రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలనే సాగు చేస్తున్నారు. ఈ నెల మొదటి వారంలో నారు పోసుకుని, 25వ తేదీలోగా నాట్లు వేస్తే మార్చి నెలాఖరుకు 60 శాతం పంట కోతకు వస్తుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తద్వారా మూడో పంట వేసుకునే అవకాశం కూడా ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెంలో రైతులే విత్తనాలు తయారు చేసి, అవసరమైన ఇతర రైతులకు సరఫరా చేస్తున్నారు. నెలాఖరుకు సాగు జోరు ఇప్పటికే ఆకుమడులను రైతులు సిద్ధం చేస్తున్నారు. పొలాలు దమ్ములు చేస్తున్నారు. ఈ నెలాఖరుకు నాట్లు ఊపందు కుంటాయి. రైతులకు అవసరమైన యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచాం. యూరి యా కొరత ఎక్కడా లేదు. రాజమహేంద్రవరం డివిజన్లో 1,555 మెట్రిక్ టన్నులు, కొవ్వూరు డి విజన్లో 3,439 మెట్రిక్ టన్నుల యూరియా సొసైటీ లు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు, రిటైల్, హోల్సేల్ డీలర్ల వద్ద అందుబాటులో ఉంది. – ఎస్.మాధవరావు,జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం రబీలో వివిధ పంటల సాగు ప్రణాళిక (హెక్టార్లు) వరి 61,326 మొక్కజొన్న 8,646 పెసర 434 మినుము 771 శనగ 806 వేరుశనగ 241 నువ్వులు 224 పొద్దుతిరుగుడు 187 పొగాకు 5,544 చెరకు 402 జిల్లావ్యాప్తంగా అన్ని పంటలూ కలిపి రబీ సాధారణ సాగు విస్తీర్ణం 78,592 హెక్టార్లు. ఇప్పటి వరకూ 7,302 హెక్టార్లలో ఆయా పంటలు వేశారు. వరి 895, మొక్కజొన్న 2,800, పొగాకు 3,333 హెక్టార్లు, శనగ 254 హెక్టార్లలో వేశారు. -
లక్ష్మీ గణపతి స్వామి సన్నిధిలో న్యాయమూర్తులు
బిక్కవోలు: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్రాయ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత బిక్కవోలులో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామిని ఆదివారం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఈఓ ఆధ్వర్యాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నేడు పీజీఆర్ఎస్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జిల్లా కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. విజయవాడ భవానీ దీక్షల విరమణకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని దర్శించుకున్నారు. వారు వచ్చిన టూరిస్టు బస్సులతో దేవస్థానం కళాశాల మైదానం నిండిపోయింది. ఆ భక్తులందరూ నడక దారిన సత్యదేవుని ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రత్నగిరిపై పార్కింగ్ స్థలం కూడా భక్తుల వాహనాలతో నిండిపోయింది. స్వామివారి వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. నేడు సత్యదేవుని మెట్లోత్సవం సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రత్నగిరి దిగువన తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న 450 మెట్లకు భక్తులతో పూజలు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభిస్తారు. తొలుత రత్నగిరి పైనుంచి దిగువకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి, గ్రామంలో పల్లకీపై ఊరేగించి, తొలి పావంచా వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం, తొలి మెట్టుకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పూజలు చేసి, మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొండపై సత్యదేవుని ఆలయం వరకూ ఉన్న మెట్లకు భక్తులు పసుపు, కుంకుమ రాసి, హారతి ఇచ్చి, నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్తారు. -
ఉండాల్సిన వారు 27.. ఉన్నది 9 మంది
పెరవలి మండలంలోని కాకరపర్రు కెనాల్పై ఉన్న పెరవలి లాకు పరిధిలో 37,357 ఎకరాల సాగు భూమి ఉంది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని నిడదవోలు, ఆచంట, తణుకు నియోజకవర్గాల్లో ఏడు మండలాల్లోని 51 గ్రామాలకు దీని ద్వారా సాగు, తాగునీరు అందుతోంది. పెరవలి లాకు పరిధిలో మొత్తం 27 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం ఒక ఏఈ, ఒక గుమస్తా(పర్మినెంట్ ఉద్యోగులు)తో పాటు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 9 మంది లస్కర్లు మాత్రమే ఉన్నారు. ఈ లాకుల పరిధిలోని ఉండ్రాజవరం, రామయ్యగుంట, అజ్జరం, భూపయ్య కాలువ, ఈస్ట్ విప్పర్రు, ఖండవల్లి, పేకేరు కాలువలపై ఏడుగురు డెల్టా లస్కర్లు ఉండాల్సి రాగా మొత్తం ఏడు పోస్టులూ ఖాళీగానే ఉన్నాయి. అలాగే, కెనాల్ లస్కర్లు ఐదుగురు ఉండాలి. ఈ పోస్టులు కూడా మొత్తం ఖాళీ. వైరు లస్కర్లు ఇద్దరికి గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. వైర్ సూపరింటెండెంట్, లాకు లస్కర్లు 4, లాకు సూపరింటెండెంట్, గుమస్తాలు 2, వర్క్ ఇన్స్పెక్టర్లు 2, వాచ్మన్ 1, ఎవెన్యూ లస్కర్ 1 చొప్పున పోస్టులుండగా అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీరందరి విధులను కేవలం 9 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోనే కానిచ్చేస్తున్నారు. -
నేడు కోటి సంతకాల ర్యాలీ
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు ప్రజలు చేసిన కోటి సంతకాల ప్రతులను సోమవారం ఉదయం 10 గంటలకు బొమ్మూరులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కేంద్ర కార్యాలయానికి పంపించనున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదివారం ఈ విషయం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీపై ప్రజల్లో చర్చ జరగాలని, జిల్లా మొత్తం హోరెత్తేలా ఉండాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం దేశంలోని ప్రజలందరి దృష్టికీ వెళ్లాలన్నారు. కోటి సంతకాల ప్రతులున్న వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తామని, బొమ్మూరు నుంచి కొవ్వూరు వరకూ ర్యాలీ జరుగుతుందని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో జరిగిందన్నారు. గ్రామాలు, డివిజన్లు, వార్డుల్లో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలు మద్దతు కూడగట్టామని చెప్పారు. దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. లక్ష్యానికి మించి సంతకాలు సేకరించామన్నారు. జిల్లావ్యాప్తంగా 4.20 లక్షల సంతకాలు సేకరించామని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరచి, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచన విరమించుకోవాలని వేణు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి, పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రి తానేటి వనిత, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస్నాయుడు హాజరవుతారని వివరించారు. పార్టీ, వివిధ అనుబంధ విభాగాల నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వేణు కోరారు. బొమ్మూరు నుంచి కొవ్వూరు వరకూ నిర్వహణ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల ప్రతుల తరలింపు శ్రేణులు రాజమహేంద్రవరానికి భారీగా తరలి రావాలి దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు -
లస్కర్లను చూసి పుష్కరం
● ఏళ్ల తరబడి భర్తీ కాని పోస్టులు ● జిల్లావ్యాప్తంగా ఉండాల్సిన లస్కర్లు 1,500 మంది ● ఉన్నవారు 600 మంది ● వీరిలో అవుట్ సోర్సింగ్ 550 మంది ● ఏడాదిగా అందని జీతాలు ● సిబ్బంది కొరతతో లాకులు, కాలువలపై పర్యవేక్షణ లోపంపెరవలి: ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా ఖ్యాతికెక్కిన గోదావరి డెల్టాలో కీలకమైన లస్కర్ల వ్యవస్థ తగినంత మంది సిబ్బంది లేక నానాటికీ నీరసించిపోతోంది. ఏయే కాలువల కింద ఏయే పంటలు సాగవుతున్నాయి.. నీటి అవసరం ఎంత.. లాకుల పరిస్థితి ఏమిటి.. నీటి సరఫరా క్రమబద్ధీకరణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించే బాధ్యత లస్కర్లది. అటువంటి లస్కర్ల నియామకాలు ఏళ్ల తరబడి జరగకపోవడంతో కాలువలు, లాకుల స్థితిగతులను పట్టించుకుంటున్న వారే కరువవుతున్నారు. పూర్తి స్థాయిలో లస్కర్లు ఏరీ! జిల్లాలో అన్ని పంటలూ కలిపి మొత్తం సాగు భూమి 3,53,692 ఎకరాలు. ఇందులో 11 మండలాల్లో కాలువల కింద 1,63,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువలపై ఉన్న లాకుల వద్ద సాగునీటి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించే లస్కర్ల నియామకాలు 12 సంవత్సరాలుగా జరగడం లేదు. జిల్లావ్యాప్తంగా గోదావరి డెల్టా కాలువలపై 22 ప్రధాన లాకులున్నాయి. వీటిపై ఒక్కోచోట 30 మంది చొప్పున మొత్తం 660 మంది లస్కర్లు ఉండాలి. అలాగే, మరో చిన్న లాకులు 172 ఉన్నాయి. ఒక్కో లాకు నుంచి సుమారు 30 వేల నుంచి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ వ్యవస్థలో ప్రధాన కాలువ, డెల్టా, ఎవెన్యూ అనే మూడు కేటగిరీలుగా లస్కర్లు ఉంటారు. ప్రధాన కాలువ లస్కర్లు డెల్టాలోని ప్రధాన కాలువలను పర్యవేక్షిస్తూంటారు. ఈ ప్రధాన కాలువలకు అనుసంధానమైన చిన్న కాలువలపై డెల్టా లస్కర్లు విధులు నిర్వహిస్తారు. ఎవెన్యూ లస్కర్లు కాలువ గట్లు, లాకుల వద్ద పిచ్చి మొక్కలు పెరగకుండా.. గట్లు దెబ్బ తినకుండా పర్యవేక్షిస్తారు. ఈ మూడు రకాలూ కలిపి మొత్తం 1,500 మంది లస్కర్లు ఉండాలి. కానీ, అన్ని రకాలూ కలిపి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 600 మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరిలో 50 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు కాగా, మిగిలిన 550 మందీ అవుట్ సోర్సింగ్ విధానంలోనే పని చేస్తున్నారు. ప్రస్తుతం 900 మంది లస్కర్లకు కొరత ఉంది. మరోవైపు ఏఈల కొరత కూడా ఇరిగేషన్ వ్యవస్థను వేధిస్తోంది. రెండు మూడు లాకుల బాధ్యతను ఒక్కరే చూడాల్సి వస్తోంది. సిబ్బంది కొరత కారణంగా కాలువలు, లాకులపై పర్యవేక్షణ పూర్తి స్థాయిలో జరగడం లేదు. ముఖ్యంగా లస్కర్లు లేకపోవటంతో ఏలూరు, బ్యాంక్ కెనాల్, కాకరపర్రు, నరసాపురం, అమలాపురం, కాకినాడ, జొన్నాడ తదితర కాలువల నుంచి నీటి ప్రవాహం సక్రమంగా జరగక రైతులు కిబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఆక్రమణలతో పెద్ద కాలువలు పంట కాలువల్లా.. పంట కాలువలు పంట బోదెల్లా మారిపోతున్నాయి. గట్లు కుచించుకుపోతున్నాయి. ఒక్కో లాకు వద్ద 20 నుంచి 30 మంది వరకూ లస్కర్లు పని చేయాల్సి ఉండగా చాలాచోట్ల కనీసం 10 మంది కూడా లేని దుస్థితి నెలకొంది. ఇచ్చేదే తక్కువ.. ఏడాదిగా అదీ లేదు అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న లస్కర్లకు నెలకు రూ.5,500 మాత్రమే చెల్లిస్తారు. అది కూడా ఏడాది నుంచి జీతాలు చెల్లించకపోవడంతో వారు నానా ఇబ్బందులూ పడుతున్నారు. వేతనాలు వెంటనే చెల్లించాలి డెల్టాలోని రబీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఆయకట్టు చివరి వరకూ నీరు చేరాలంటే లస్కర్ల వ్యవస్థ కీలకం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వ్యవస్థలోని లస్కర్లకు వేతనాలు పెండింగ్లో ఉంచటం సరి కాదు. వారికి వెంటనే వేతనాలు విడుదల చేసి, లస్కర్ల పర్యవేక్షణలో రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలి. – విప్పరి్త్ వేణుగోపాలరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్ఈ, ధవళేశ్వరం -
‘దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వలేదు’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) మయసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్విందనే మాట పచ్చి అబద్ధమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ చెప్పారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని ఆదివారం ఆయన కొనసాగించారు. ఈ సందర్భంగా శిశుపాల వధ, రాజసూయ యాగ నిర్వహణ, దుర్యోధనుని భంగపాటు తదితర అంశాలను వివరించారు. ‘త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ.. రాజసూయం తరువాత 13 సంవత్సరాల్లో నీ కారణంగా, దుర్యోధనుని అపరాధం చేత, భీమార్జునుల బలము చేత గొప్ప క్షత్రియ వినాశనం జరుగుతుందని ధర్మరాజుకు వ్యాసుడు చెబుతాడు. ఈ మాటలకు ధర్మరాజు తీవ్రంగా కలత చెందాడు. అప్రమత్తుడవై, ఇంద్రియాలపై పట్టు కలిగి ఉండాలని వ్యాసుడు ఆదేశిస్తాడు’ అని చెప్పారు. జ్ఞానం సంఘటనలను మార్చుకోవడానికి కాదని, ప్రతికూల సంఘటనలను సైతం తట్టుకోవడానికేనని అన్నారు. ‘‘వ్యాసుని మాటలు విన్న ధర్మరాజు ‘ఇకపై నేను పరుష వాక్యాలు పలకను, జ్ఞాతులు చెప్పినట్లు ప్రవర్తిస్తాను. ఎవరి పట్లా భేద భావం కలిగి ఉండను. ఇది నా ప్రతిజ్ఞ’ అని తమ్ములకు వివరిస్తాడు. కృష్ణుడు అప్పటికే ద్వారకకు వెళ్లిపోయాడు. రాజలోకం తిరిగి వెళ్లింది. శకుని, దుర్యోధనుడు మాత్రం మరో రెండు రోజులు మయసభలో ఉండాలనుకున్నారు. దుర్యోధనుని భంగపాటు చూసి ద్రౌపది నవ్వినట్లు వ్యాసుడు చెప్పలేదు. భీమసేనుడు, అతని సేవకులు మాత్రమే నవ్వినట్లు వ్యాస భారతం చెబుతోంది’’ అని సామవేదం స్పష్టం చేశారు. ‘‘పాండుసుతుల వైభవాన్ని చూసి అసూయా రోగానికి గురైన దుర్యోధనుడితో శకుని.. ధర్మరాజును ద్యూత క్రీడకు ఆహ్వానించాలని చెబుతాడు. దీంతో, దుర్యోధనుడు తన తండ్రి ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి ‘నేను నిప్పులలో దూకుతాను, విషం మింగుతాను’ అని బెదిరిస్తాడు. ద్రౌపది, కృష్ణుడు తనను చూసి నవ్వారని ధృతరాష్ట్రుడికి అబద్ధం చెబుతాడు. ఈ అబద్ధాన్ని పట్టుకొని కొందరు ద్రౌపది నవ్విందంటూ తప్పుడు ప్రచారం చేశారు’’ అని వివరించారు. ‘‘రాజసూయ యాగంలో మరుగుజ్జులు, భిక్షకులు కూడా భోజనం చేశారో లేదో కనుక్కున్న తరువాతనే ద్రౌపది భోజనం చేసేది. ఆమె గృహిణీ ధర్మాన్ని పాటించిన తీరును వ్యాసుడు అనేక సందర్భాల్లో వర్ణించాడు’’ అని చెప్పారు. శిశుపాల వధ వత్తాంతాన్ని వివరిస్తూ, కృష్ణుడు తన దివ్యత్వాన్ని, నారాయణ తత్త్వాన్ని అనేక సందర్భాల్లో వ్యక్తం చేశాడని, దీనికి విరుద్ధంగా రామావతారంలో రాముడు తన అవతారతత్త్వాన్ని గోప్యంగా ఉంచాడని సామవేదం అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభకు శుభారంభం పలికారు. -
షటిల్ బ్యాడ్మింటన్లో ఆదిత్య రామ్ ప్రతిభ
అమలాపురం టౌన్: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన షటిల్ బ్యా డ్మింటన్ ఇంటర్ యూనివర్సిటీ సెలక్షన్స్లో అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బీబీఏ విద్యార్థి బొంత ఆదిత్య రామ్ సౌత్ జోన్ (సౌత్ ఇండియా) పోటీలకు ఎంపికయ్యాడు. విజయవాడ కేఎల్యూలో వచ్చే ఏడాది జనవరిలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్ పోటీలకు అర్హత సాధించాడు. విశాఖపట్నంలోని బుల్లయ్య కాలేజీలో ఆదిత్య రామ్ బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అపురూపం.. రూ.108 నాణెం అమలాపురం టౌన్: సత్య ప్రమోద తీర్థ స్వామీజీ 108వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం రూ.108 ముఖ విలువతో వెండి నాణేన్ని విడుదల చేసింది. అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ ఈ నాణేన్ని సేకరించారు. దీన్ని 40 గ్రాముల బరువుతో 99.90 శాతం శుద్ధ వెండితో తయారు చేశారు. తొలిసారిగా రూ.108 ముఖ విలువతో ఈ నాణేన్ని భారత ప్రభుత్వం ముద్రించింది. దేశ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ ఉత్తరాది మఠం 41వ పీఠాధిపతిగా సేవ చేసిన సత్య ప్రమోద తీర్థ స్వామీజీ పేరుతో నాణేన్ని ముద్రించారు. నాణేనికి ఒక వైపు రూ.108 ముఖ విలువ, మరో వైపు సత్య ప్రమోద తీర్థ స్వామీజీ చిత్రం కనిపిస్తాయి. డాబా పైనుంచి పడి మహిళ మృతి కొత్తపేట: డాబాపై దుస్తులు ఆరేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడి ఓ మహిళ మృతి చెందింది. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గణేష్ నగర్కు చెందిన గొల్లపల్లి వెంకటలక్ష్మి (40) శనివారం ఉదయం తన డాబాపై దుస్తులు ఆరవేస్తోంది. ఈ క్రమంలో కాలుజారి కిందపడిపోయింది. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. -
పాఠం వింటూ.. ప్రాణం వదిలింది
● తరగతి గదిలో విద్యార్థిని హఠాన్మరణం● కార్డియాక్ అరెస్టుగా భావిస్తున్న వైద్యులు ● రామచంద్రపురంలో ఘటన రాయవరం: తరగతిలో గదిలో పాఠాలు వింటున్న విద్యార్థిని హఠాత్తుగా బెంచీపై నుంచి పడిపోయి మృతి చెందింది. హుషారుగా వెళ్లిన బాలిక.. విగతజీవిగా రావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివ రాల్లోకి వెళితే.. పసలపూడి గ్రామానికి నల్లమిల్లి వెంకటరెడ్డి, సుజాత దంపతుల కుమార్తె సిరి (16) రామచంద్రపురంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో ఆమె తమ్ముడు 8వ తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం పాఠశాలకు యథావిధిగా వెళ్లిన సిరి మొదటి పిరియడ్ జరుగుతుండగా ఒక్కసారిగా కుడివైపునకు పడిపోయింది. వెంటనే ఉపాధ్యాయుడు, సహ విద్యార్థులు ఆ బాలికకు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్టుతోనే సిరి మృతి చెందిందని వారు భావిస్తున్నారు. -
చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి
కొత్తపేట: స్థానిక మద్దులమెరక గ్రామానికి చెందిన చుట్టుగుళ్ల ఏడుకొండలు (64) అనే కల్లుగీత కార్మికుడు ప్రమాదవశాత్తూ తాటిచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుకొండలు చెట్ల నుంచి కల్లు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. దానిలో భాగంగా శనివారం గ్రామంలోని తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు సురేష్ బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేగా జ్యుయలర్స్లో అద్భుత ఆఫర్లు
రాజమహేంద్రవరం సిటీ: పండగల సందర్భంగా వేగా జ్యుయలర్స్లో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు నిర్వాహకులు శనివారం తెలిపారు. రెండు రాష్ట్రాల్లోని వినియోగదారులకు డిసెంబర్ 15 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు. వీటి బ్రౌచర్లను మిరాయ్ సినిమా ఫేమ్ రితిక నాయక్ ఆవిష్కరించారన్నారు. క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండగలను వినియోగదారులు మరింత ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ సువర్ణవకాశం కల్పించామని తెలిపారు. ఫ్యాషన్ ఆభరణాల నుంచి ప్రాచీన సంప్రదాయ ఆభరణాల వరకూ తమ షోరూమ్లలో అందుబాటులో ఉంచామన్నారు. బంగారు ఆభరణాల తరుగులో 50 శాతం తగ్గింపు ఇస్తున్నామని, పోల్కి ఆభరణాలపై తయారీ, తరుగు చార్జీలు ఉండవన్నారు. వజ్రాభరణాల క్యారట్ ధర కేవలం రూ.49,999 మాత్రమే ఉంటుందన్నారు. -
అంగరంగు వైభవం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసోత్సవం ప్రారంభానికి ముందు రోజు స్వామివారి మెట్లోత్సవం నిర్వహించడం, ఆ తర్వాత రోజు నుంచి కనుమ పండగ వరకూ సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవారిని గ్రామంలో ఊరేగించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన (సోమవారం) సత్యదేవుని మెట్లోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ రోజు రత్నగిరి కొండ దిగువన గల తొలి పావంచా నుంచి కొండ మీద సత్యదేవుని ఆలయం వరకూ గల 450 మెట్లకు భక్తులు పూజలు నిర్వహించనున్నారు. దీని కోసం రత్నగిరి మెట్ల మార్గంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి మెట్టుకూ రంగు వేసి ముస్తాబు చేస్తున్నారు. పల్లకీలో ఊరేగింపు సోమవారం ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ముందుగా రత్నగిరి నుంచి కొండ దిగువకు సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువస్తారు. గ్రామంలో వందల మంది భక్తుల నడుమ పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం తొలి పావంచా వద్ద స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఉన్న తొలి మెట్టుకు దేవస్థానం అధికారులు, మహిళలు పూజలు చేసి మెట్లోత్సవాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి స్వామివారి ఆలయం వరకు గల మెట్లకు భక్తులు పూజలు చేసి హారతి ఇస్తారు. ఆ మెట్ల మీదుగా స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువెళతారు. 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ఈ నెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 16వ తేదీ కనుమ పండగ వరకూ ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతి అమ్మవారిని ప్రతి రోజూ ఉదయం ఏడు నుంచి పది గంటల వరకూ అన్నవరం పుర వీధుల్లో పల్లకీలో ఊరేగిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ఆలయానికి చేరుస్తారు. నెల రోజులు జరిగే ధనుర్మాసోత్సవాలకు స్వామివారి పల్లకీ కూడా ఉండేందుకు దేవస్థానం వేద పండితులు, వ్రత పురోహితులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశారు. 30న ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ నెల 30వ తేదీ తెల్లవారుజాము ఐదు గంటల నుంచి ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అలంకరణలో ఉండే సత్యదేవుడు, అమ్మవారిని దర్శించేందుకు భక్తులను అనుమతిస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు వెండి రథంపై ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారి ప్రాకార సేవ, అదే రోజు రాత్రి కొండ దిగువన వెండి గరుడ వాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. జనవరి 14న భోగి ఉత్సవాలు భోగి పండగ సందర్భంగా జనవరి 14న రత్నగిరి రామాలయం వద్ద భోగి మంట వేస్తారు. పల్లెటూరి వాతావరణం ప్రతిబించించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16న కనుమ పండగ సందర్భంగా కొండ దిగువన పురగిరి క్షత్రియుల రామకోవెల వద్ద సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రభోత్సవం నిర్వహిస్తారు. కాగా.. సత్యదేవుని మెట్లోత్సవం, ధనుర్మాసంలో ఊరేగింపు కోసం స్వామివారి వెండి పల్లకీని ముస్తాబు చేస్తున్నారు. వెండి శంఖ, చక్రాలకు కూడా మెరుగు పెట్టి సిద్ధం చేస్తున్నారు. రేపు సత్యదేవుని మెట్లోత్సవం మెట్లకు రంగులు వేసి ముస్తాబు చేసిన దేవస్థానం సిబ్బంది 16 నుంచి ధనుర్మాసోత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
భీమోలులో పులి సంచారం!
గోపాలపురం: మండలంలోని భీమోలు మెట్టపై పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పులి పాదముద్రలను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభించారు. రాజమహేంద్రవరం అటవీ శాఖ రేంజ్ అధికారి ఎన్.దావీదురాజు, డీఆర్ఓ జి.వేణుగోపాల్, ఎఫ్బీఓ వై.శ్రీను ఆ ప్రాంతాన్ని శనివారం సాయంత్రం పరిశీలించారు. దావీదురాజు మాట్లాడుతూ భీమోలు కొండపై వ్యవసాయం చేస్తున్న కె.రామకృష్ణ తన పొలంలో పులి, రెండు పిల్లలు కనిపించాయంటూ ఈ నెల 11న సమాచారం ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు భీమోలు కొండపై సర్వే చేస్తున్నామన్నారు. పులికి సంబంధించి ఎటువంటి జాడలూ కనిపించలేదని, ప్రస్తుతం కొండపై ఆరు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామస్తులు, రైతులు, కూలీలు ఒక్కొక్కరిగా కాకుండా ఇద్దరు లేదా ముగ్గురు కలసి సంచరించాలని సూచించారు. -
హుండీ సొమ్ము చోరీచేసిన ఇద్దరి అరెస్ట్
దేవరపల్లి: సంగాయగూడెం గంగానమ్మ ఆలయంలో హుండీ సొమ్ములను దొంగిలించిన ఇద్దరిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ దేవత గంగానమ్మ గుడిలోని హుండీని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు బద్దలు కొట్టి, దానిలో నగదును దొంగిలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడిన అదే గ్రామానికి చెందిన బల్లే దుర్గాపండు, తొర్లపాటి రాజును అరెస్ట్ చేసి కొవ్వూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. స్థానిక పోలీసుల కథనం మేరకు.. పిఠాపురం మండలం పి. రాయవరం గ్రామానికి చెందిన శెట్టి సత్యనారాయణ (54) కూలి పనికి వస్తూ జాతీయ రహదారిని దాటుతున్నాడు. అతడిని అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు ఢీకొంది, ఈ ఘటనలో శెట్టి సత్యనారాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. యువతి అదృశ్యం పి.గన్నవరం: నాగుల్లంక గ్రామానికి 18 ఏళ్ల యువతి శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి అదృశ్యమైందని ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. ఆ యువతి ఐదు నెలల పాటు రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసిందని, అనంతరం నెల రోజుల క్రితం మానేసిందన్నారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఇంటి నుంచి అదృశ్యమైందని తెలిపారు. పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఆచూకీ తెలియక పోవడంతో ఆమె తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.


