breaking news
East Godavari
-
శవమై కనిపించిన శ్రీనివాస్: జాడ చెప్పిన దర్శకుడి టాటూ
కోనసీమ జిల్లా: అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కారు డ్రైవర్ కంచిపల్లి శ్రీనివాస్ (37) ఘటన విషాదాంతమైంది. గత శనివారం అదృశ్యమైన అతడు బుధవారం పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగపల్లి గ్రామంలోని వైనతేయ నదీ పాయలో శవమై కనిపించాడు. అతడి సోదరుడు అంజి పుట్టు మచ్చల ఆధారంగా శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించాడు. ఈ కేసును అమలాపురం పట్టణం, పి.గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ మృతి చెంది దాదాపు ఐదు రోజులు అవుతుందని, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణాలు తెలుస్తాయని పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ భార్య దేవి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్కు వచ్చారు. తన భర్త అదృశ్యం కేసు ఎంత వరకూ వచ్చిందని ఆరా తీశారు. ఇదే విషయాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ ముందు విలేకరులకు తెలిపారు. ఆర్.ఏనుగపల్లిలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని తెలిసి ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆ మృతదేహం తన భర్తదే అని నిర్ధారణ కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. గత శనివారం శ్రీనివాస్ ఇంట్లో తాను రాజమహేంద్రవరం వెళుతున్నానని చెప్పి స్కూటీపై బయలు దేరాడు. అప్పటి నుంచి అతను తిరిగి రాలేదు. దర్శకుడు సుకుమార్ టాటూ ఆర్.ఏనుగపల్లిలో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైనప్పుడు అక్కడి పోలీసులు అతడి శరీరంపై సినీ దర్శకుడు సుకుమార్ చిత్రంతో పాటు పలు పేర్లను టాటూలుగా వేయించుకున్న విషయాన్ని గుర్తించారు. అతడి కుడి చేతిపై దేవి, రిషి, వినీత్ అనే పేర్లు ఇంగ్లిషులో ఉన్నాయి. నీలి రంగు ప్యాంట్ ఊడిపోయి అతని కాళ్ల వద్ద వేలాడుతోంది. నా భర్తను కాసుబాబే చంపాడు తన భర్తను పట్టణానికి చెందిన గంగుమళ్ల కాసుబాబు, అతడి అనుచరులు చంపినట్టు తనకు అనుమానంగా ఉందని మృతుడి శ్రీనివాస్ భార్య దేవి స్థానిక విలేకర్లకు తెలిపింది. తన భర్తపై కాసుబాబు కక్ష పెంచుకుని ఇదంతా చేశాడని ఆరోపించింది. కాసుబాబుతో పాటు శంకర్, సలాది అప్పన్న, కారు డ్రైవర్ కలిపి తన భర్తను చంపారన్న అనుమానం ఉందని తెలిపింది. పట్టణ పోలీసులు ఈ నలుగురి కదలికలపై నిఘా పెట్టారు. తాము కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. -
రైతులను ఏ విధంగా ఆదుకుంటారు?
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ● కడియం ఆవలో నష్టపోయిన పొలాల పరిశీలన కడియం: కూటమి ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించని కారణంగా పంట నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో చంద్రబాబు ప్రభుత్వం చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. బాధిత రైతులను పరామర్శించేందుకు, మండల కేంద్రమైన కడియంలో ఆవ ప్రాంతంలో బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలసి పర్యటించారు. వేణు మాట్లాడుతూ కడియం ఆవలో 1,800 ఎకరాల్లో పంట నేలనంటిందన్నారు. మెషీన్లతో కోత కూడా సాధ్యం కాదన్నారు. కూలీలను పెట్టి కోయిస్తే అయ్యే ఖర్చులను రైతులు తట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఈ విధంగా నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో కూటమి ప్రభుత్వం ప్రకటించాలన్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా పెట్టుబడి సాయం అందించడంతో ఉత్సాహంగా కౌలు రైతులు సాగు చేసేవారన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పెట్టుబడి సాయం ఏడాదికి 20వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో రైతులు నమ్మి వారిని గెలిపించారన్నారు. కానీ గెలిచి 17 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు ఒకే ఏడాది కేవలం రూ.5వేలు రైతులకు ఇచ్చి చంద్రబాబు మిన్నకుండిపోయారన్నారు. జగన్ హయాంలో ఆర్బీకేల ద్వారా వ్యవసాయ సహాయకులను నియమించి ప్రతి ఎకరంలోని పంట వివరాలను నమోదు చేసి, పంటల బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేందన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే తగిన కార్యాచరణను చేపడతామని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు, పార్టీ మండల అధ్యక్షుడు యాదల సతీష్చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు. సాయం వెంటనే ప్రకటించాలి నల్లజర్ల: మోంథా తుపానుకు దెబ్బతిన్న పంటలకు రైతులకు ప్రభుత్వం చేసే సాయం ఏమిటో వెంటనే ప్రకటించాలని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వేణు, మాజీ హోంమంత్రి తానేటి వనిత డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం నల్లజర్లలో తుపానుకు నేలకొరిగిన పంటలను వారు పరిశీలించారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ తుపాను, అకాల వర్షాల వల్ల వరి, వర్జీనియా పొగాకు రైతులు నష్టపోయారన్నారు. గతంలో జగనన్న సీఎంగా ఉండగా వర్జీనియాను కూడ ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలబడింది లేదని విపత్తుల సమయంలోనైనా వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల కన్వీనర్ వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంక అప్పారావు, జిల్లా కార్యదర్శి ముప్పిడి వెంకటరత్నం, వైస్ ఎంపీపీ అచ్యుత శివాజీ పాల్గొన్నారు. -
ముంచేసిన మోంథా
తుపాను పాడు చేసింది ఎకరాకు సుమారు రూ.30వేల చొప్పున పెట్టబడి పెట్టాను. 4 ఎకరాల్లో వరి సాగు చేశాను. తీరా చూస్తే పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను నా పంటను పాడు చేసింది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. – కర్రి గోపాల్రెడ్డి, రామవరం గ్రామం, అనపర్తి మండలం ప్రభుత్వం న్యాయం చేయాలి కౌలుకు 12 ఎకరాల భూమి తీసుకుని సాగు చేస్తున్నాను. ఎకరానికి రూ.32 వేలకు పైగా పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట నేలకొరిగి పూర్తిగా నష్టం వచ్చింది. ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలి. – జంగా వెంకటరెడ్డి కౌలు రైతు, ఊలపల్లి గ్రామం, బిక్కవోలు మండలం పెరవలి మండలం ఖండవల్లిలో నేలవాలిన దొండ పందిరిదేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో వర్షాలకు కూలిన ఇల్లుకోరుకొండ మండలం మునగాలలో నీటిలో వరి పంటసాక్షి, రాజమహేంద్రవరం: మోంథా తుపాను కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా వీచిన భారీ ఈదురు గాలులకు ప్రజలు, రైతులు అతలాకుతలం అయ్యారు. తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా చిగురుటాకులా మారింది. వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంటకు సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వర్షపు నీరు రహదారులపై ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. వరి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ ఈదురుగాలులు వీయడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. బుధవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంత వాతావరణం నెలకొంది. ఉదయం కాసేపు చిరు జల్లులు కురిశాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊపిరి పీల్చుకున్న ప్రజలు నాలుగు రోజులు ఆందోళనకు గురిచేసిన మోంథా తుపాను మంగళవారం రాత్రి కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద తీరాన్ని తాకింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులు వీచాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. పెనుముప్పు తప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 16,092 హెక్టార్లలో నేలకొరిగిన వరి మోంథా తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వరి, మినుము, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తం 18 మండలాల్లో వరి పంట, 5 మండలాల్లో మినుము పంట సాగు విస్తీర్ణం ఉంది. 70,046 హెక్టార్లలో వరి నాట్లు ఉండగా.. తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు 209 గ్రామాల పరిధిలోని 20,843 మంది రైతులకు చెందిన 16,092 హెక్టార్ల వరి నేలకొరిగింది. 896.3 హెక్టార్లలో పంట దెబ్బతింది. 1216 హెక్టార్లలో మినుము జిల్లా వ్యాప్తంగా ఏడు మండలాల పరిధిలో 35 గ్రామాల్లో మినుము పంట తుపాను ప్రభావానికి గురైంది. 1,658 మంది రైతులకు చెందిన 2,160.50 హెక్టార్లలో మినుము ఉండగా.. 80 హెక్టార్లలో నేలకొరిగింది. 1,216 హెక్టార్లలో పంట దెబ్బతింది. రంగంపేట, గోపాలపురం, తాళ్లపూడి, కొవ్వూరు, నిడదవోలులో పంట నష్టం జరిగింది. ● జిల్లాలో ముగ్గురు రైతులకు చెందిన 3.22 హెక్టార్లలో పొగాకు సాగులో ఉండగా.. 3.22 హెక్టార్లు నీటిలో మునిగింది. ఛిద్రమైన రహదారులు తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ప్రధాన, అంతర్గత, గ్రామీణ ప్రాంత రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 85.468 కిలో మీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. పెరవలి మండలంలో అత్యధికంగా ఛిద్రమయ్యాయి. ఈదురుగాలుల ప్రభావానికి 74 వృక్షాలు వివిధ ప్రాంతాల్లో పడిపోయాయి. 16 ఇళ్లు నేలమట్టం తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులు, వర్షానికి జిల్లా వ్యాప్తంగా 16 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. బిక్కవోలులో 5, తాళ్లపూడిలో 1, సీతానగరం 1 రాజమండ్రిలో 1 ఇల్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. ● కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలంలో వరి 1,484 ఎకరాలు, మినుము 172 ఎకరాలు, అరటి 138 ఎకరాలు, బొప్పాయి 8 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. కొవ్వూరులో 900 ఎకరాలు వరి, అరటి 291, బొప్పాయి 15 ఎకరాలు, మినుము 20 ఎకరాలు పంట నష్టం వాటిల్లింది. 7 విద్యుత్ స్తంభాలు విరిగి పోయాయి. తాళ్లపూడి, కొవ్వూరులో పలుచోట్ల చెట్లు విరిగి పోయాయి. ● సీతానగరంలో వరి 1,300 ఎకరాలు, అరటి, బొప్పాయి, కూరగాయలు సుమారు 100 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ● దేవరపల్లి మండలంలో 233 హెక్టార్లలో వరి, నల్లజెర్లలో 465 హెక్టార్లలో వరి నేలకొరిగింది. ● నిడదవోలు రూరల్ మండలంలో 2 వేల ఎకరాల్లో వరి నేలనంటింది. ● తాళ్లపూడి మండలం పెద్దెవం గ్రామంలో మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురు గాలుల ప్రభావంతో జొన్నకూటి వీర్రాజు (58) అనే వ్యక్తి మృతి చెందారు. చలికి తట్టుకోలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ● నిడదవోలు నియోజకవర్గం వ్యాప్తంగా 10,755 ఎకరాల్లో వరి, 1,275 ఎకరాల్లో అరటి పంటలకు నష్టం వాటిల్లింది. ఒక్క పెరవలి మండలంలోనే 900 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి లంకల్లో పండిస్తున్న అరటి పంట మొత్తం తుడిచిపెట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి ప్రాంతాల్లో సుమారు 1,000 ఎకరాల్లో బీర, అనబ, చిక్కుడు, దొండ నీటిలో కలిసిపోయాయి. 1.4 మిల్లీ మీటర్ల వర్షపాతం జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల సమయానికి జిల్లా సగటు వర్షపాతం 1.4 మిల్లీ మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా గోకవరంలో 6.0 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా దేవరపల్లిలో 0.2 మిల్లీ మీటర్లుగా నమోదైంది. మిగిలిన మండలాల్లో చిరుజల్లులు, ఓ మోస్తరు వర్షం కురిసింది. వైఎస్సార్ సీపీ శ్రేణుల పర్యటన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు విస్తృతంగా పర్యటించాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు జి. శ్రీనివాస్ నాయుడు, తలారి వెంకట్రావు రైతులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.జిల్లాలో నష్టం ఇలా..(హెక్టార్లలో)పంట సాగు నేల దెబ్బ కొరిగింది తిందివరి 70,046.3 16,092.1 896.3 మినుము 2,160.50 80 1,216.27 పొగాకు 3.22 0 3.22 కర్షకులకు కన్నీరు మిగిల్చిన తుపాను 13,213 హెక్టార్లలో దెబ్బతిన్న వరి, 1,041 హెక్టార్లలో మినుము నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు నష్టం అంచనాల్లో అధికారులు జిల్లా సగటున 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు -
సైనిక పాఠశాలల స్వాగతం
● ఆరు, తొమ్మిదో తరగతుల ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం ● నేటితో గడువు పూర్తి ● వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష రాయవరం: సైన్యంలో చేరి దేశ రక్షణలో పాలు పంచుకోవాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దాన్ని సాధించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో సైనిక్ పాఠశాలలు పిల్లలకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. దీనిలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరంలో సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు గురువారంతో గడువు ముగియనుంది. 6, 9 తరగతుల్లో ప్రవేశాలకు ఏటా నోటిఫికేషన్ను సైనిక్ స్కూల్ సొసైటీ జారీ చేస్తుంది. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీటీఏ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటా డిసెంబర్లో విడుదలయ్యే నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ రెండోవారంలోనే వచ్చింది. విద్యార్థులకు అవకాశం సైనిక్ పాఠశాలలో సీటు సాధిస్తే గుణాత్మకమైన విద్యతో పాటు సహ పాఠ్య కార్యక్రమాలు ఉంటాయి. ఆరో తరగతిలో బాలురతో పాటు బాలికలు ప్రవేశం పొందవచ్చు. 9వ తరగతిలో ప్రవేశాలకు బాలురు మాత్రమే అర్హులు. ప్రవేశ పరీక్ష, వైద్య పరీక్షల్లో విజయం సాధించాలి. ప్రవేశం పొందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకునే అవకాశముంది. వయో పరిమితి ఆరో తరగతిలో చేరే విద్యార్థులు 10 నుంచి 12 ఏళ్లు (01 ఏప్రిల్ 2014 నుంచి 31 మార్చి 2016), 9వ తరగతిలో చేరే విద్యార్థులు 13 నుంచి 15 ఏళ్లు (01 ఏప్రిల్ 2011 నుంచి 31 మార్చి 2013 మధ్య జన్మించాలి) ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివిన వారికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు విధానం 2026 జనవరి నెలలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఐఎస్ఎస్ఈఈ.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన ధ్రువపత్రాలు, ఫొటో, సంతకాలను అప్లోడ్ చేయాలి. జనరల్, డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీలు రూ.700, ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తవగానే రిజిస్టర్ చేసుకున్న సెల్ నంబర్కు మెసేజ్ వస్తుంది. ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల : 10.10.2025 దరఖాస్తుకు చివరి తేది: 30.10.2025 తప్పుల సవరణకు: నవంబరు 2 నుంచి 4 వరకు అడ్మిట్ కార్డు (హాల్ టికెట్) జారీ: 2026 జనవరి మొదటి వారం ప్రవేశ పరీక్ష: 2026 జనవరి రెండో వారం -
ఎలక్ట్రీషియన్ మృతి
సఖినేటిపల్లి: కడలి గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ యడ్ల సత్యశంకర్(44) ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో బుధవారం మృతి చెందాడు. మోంథా తుపాను కారణంగా సఖినేటిపల్లి సబ్స్టేషన్ సమీపంలో పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. సఖినేటిపల్లి గ్రామ లైన్మన్ వద్ద సత్య శంకర్ హెల్పర్గా పనిచేస్తున్నాడు. తుపాను కారణంగా దెబ్బతిన్న 11 కేవీ లైను మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తూ షాక్కు గురై స్తంభంపై నుంచి కిందకు పడి మృతి చెందాడు. మృతుడి బావమరిది గంటా రత్నకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు తెలిపారు. ఉరి వేసుకుని యువకుడు..కాకినాడ రూరల్: కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలోని ఇంద్రపాలెం గ్రామానికి చెందిన కందుకూరి నరేంద్ర స్వరూప్ (17) కూలి పనులు చేసుకునేవాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం ట్రైనీ ఎస్సై లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
ఆర్ఎస్ఎస్ సేవలకు ‘వంద’నం
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన రూ.100 విలువైన వెండి నాణేన్ని నగరానికి చెందిన నాణేల సేకరణకర్త పెద్దిరెడ్డి శ్రీనివాస్ బుధవారం పోస్టులో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సేవలకు గుర్తుగా కోల్కతా టంకశాల రూ.100 స్మారక ప్రూఫ్ నాణేన్ని విడుదల చేసిందన్నారు. దీనిపై ఒక వైపు జాతీయ చిహ్నం, ముఖవిలువ, మరో వైపు సింహం, భారతమాత చిత్రానికి వందనం చేస్తున్న స్వయం సేవకులు ఉన్నారన్నారు. భారతీయ కరెన్సీలో భారతమాత చిత్రం కనిపించడం ఇదే మొదటిసారని, ఈ నాణెం 40 గ్రాముల పూర్తి వెండితో తయారైందని తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో గో తులాభారం
బిక్కవోలు: ఇల్లపల్లి గ్రామంలోని 108 స్తంభాల శివాలయం (సత్యరామ రసలింగేశ్వరస్వామి ఆలయం)లో బుధవారం గో తులాభారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కార్తిక మాసంలో బియ్యంతో ఆవుకు తులాభారం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ. దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకుడు, ఆలయ నిర్వాహకుడు ముప్పిడి బాలచంద్ర గంగాధర తిలక్ దంపతులు ఏకాదశ రుద్రాభిషేకం, అష్టలక్ష్మి కుంకుమార్చన, పూజలు చేశారు. రాజీవ్ జమిందార్ దంపతులు చేతుల మీదుగా ఆవుకు తులాభారం నిర్వహించగా, 320 కిలోల బరువు తూగింది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొని తమ తోచిన విధంగా బియ్యం వేశారు. ఆ బియ్యాన్ని దేవస్థానం నిర్వహించే అన్నదాన కార్యక్రమాల్లో వినియోగిస్తారు. -
ఫ్రిడ్జి పేలుడుతో కలకలం
అనపర్తి: కొత్తూరు జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో బుధవారం ఫ్రిడ్జి పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ఫైర్ ఆఫీసర్ జీరి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కుక్కల దుర్గాభవాని అనపర్తిలోని బ్యాంకు పని చేస్తుంటారు. ఆమె బుధవారం యథావిధిగా విధులకు వెళ్లారు. ఇద్దరు ఆడపిల్లలూ ఆడుకోవడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఇంట్లోని ఫ్రిడ్జి పెద్దశబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఇన్వర్టర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే రెండు గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.1 లక్ష విలువైన గృహోపకరణాలు పాడైపోయాయని ఎస్ఎఫ్వో శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా.. వర్షంతో పాటు కాలనీలోని రోడ్లు పూర్తిగా ఛిద్రం కావడంతో అగ్నిమాపక వాహనం ప్రమాద స్థలానికి రాలేకపోయింది. దీంతో సిబ్బంది అతి కష్టంతో పాత్రికేయుల ద్విచక్ర వాహనాలపై అగ్ని నిరోధక పరికరాలు తీసుకుని వచ్చి మంటలను అదుపు చేశారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
రామచంద్రపురం: పట్టణంలోని కాకినాడ రోడ్డులో ఒక యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముచ్చుమిల్లి రాజీవ్ గృహకల్పకు చెందిన బూర్ల చైతన్య (25) ఎలక్ట్రికల్ పనిచేస్తూంటాడు. ఈ క్రమంలో కాకినాడ రోడ్డులోని ఒక ఇంట్లో బుధవారం పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చైతన్యకు తల్లి, తండ్రి ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. చైతన్య అయ్యప్ప మాలధారణ దీక్షలో ఉన్నాడు. గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం కాకినాడ రూరల్: మండలంలోని సూర్యారావుపేట పర కాలువ వద్ద సోమవారం గల్లంతైన పోలవరపు సాయి చరణ్ రుత్విక్ (11) మృత దేహం లభ్యమైంది. తుపాను ప్రభావంతో కాలువలో నీరు ఉధృతంగా రావడంతో సాయి చరణ్ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సూర్యారావుపేట న్యూ ఎన్టీఆర్ బీచ్లోని హరిత రిసార్ట్స్ వద్ద బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. అతడి కోసం రెండు రోజులుగా ఎస్డీఆర్ఎఫ్, అగ్ని మాపక సిబ్బంది, తిమ్మాపురం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్సై గణేష్ కుమార్ తెలిపారు. -
తుపాను బాధితులకు ‘వాడపల్లి’ భోజనం
కొత్తపేట: ఆత్రేయపురం మండల పరిధిలో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రాల్లోని నిర్వాసితులకు వాడపల్లి శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి అన్న ప్రసాదం (భోజన సదుపాయం) వితరణ చేస్తున్నారు. మోంథా తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కూడా అండగా నిలిచింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఈ నెల 27 నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాలను పునరావాస కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. మండల పరిధిలోని వివిధ కేంద్రాల్లో సుమారు వెయ్యి మందికి అందిస్తున్నారు. ఈదురు గాలులకు టెంట్లు ధ్వంసం తుపాను కారణంగా వీచిన ఈదురు గాలులు, కురిసిన భారీ వర్షాలకు వాడపల్లి దేవస్థానానికి ఒక మోస్తరు నష్టం వాటిల్లింది. ఏడు వారాలు ప్రదక్షిణలు చేసే మాడ వీధుల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఐరన్ పైపుల క్లాత్ టెంట్లు ధ్వంసమ య్యాయి. వాటిని డీసీ, ఈఓ చక్రధరరావు పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వెంటనే పునరుద్ధరించాలని సిబ్బందికి ఆదేశించారు. -
రైతులను ఆదుకుంటాం
పెరవలి: తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని, అధైర్య పడవద్దని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పెరవలి మండలం ముక్కామలలో బుధవారం దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తుపాను సమయంలో ఇళ్లు నష్టపోయిన, పంటలు కోల్పోయిన వారికి అండగా ఉంటామన్నారు. తహసీల్దార్ కె నిరంజన్, ఎంపీడీఓ పద్మజ, వ్యవసాయాధికారిణి మేరీ కిరణ్ పాల్గొన్నారు. నేటి నుంచి యథావిధిగా పాఠశాలలుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): తుపాను ప్రభావం తగ్గడంతో జిల్లాలోగల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా నిర్వహించాలని డీఈవో కే.వాసుదేవరావు బుధవారం ఆదేశించారు. తరగతి గదిలో ఉండే టేబుల్స్లో పాములు, విష పురుగులు చేరే అవకాశం ఉందని, తరగతి గదులన్నీ చెక్ చేయించిన తర్వాతే విద్యార్థులను లోనికి అనుమతించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఢిల్లీ సైన్స్ టూర్కి ఇద్దరు విద్యార్థుల ఎంపిక కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏపీ సైన్స్ సిటీ సహకారంతో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న ఢిల్లీ సైన్్స్ టూర్కు జిల్లా నుంచి ఇద్దరు విద్యార్థినులు ఎంపికై నట్టు జిల్లా సైన్స్ ఆఫీసర్ జి.శ్రీనివాస నెహ్రూ బుధవారం తెలిపారు. ఈ టూర్ నవంబర్ 6 నుంచి 8 వరకు ఉంటుందన్నారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని గంటా యశస్విని, ధవళేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీ ఈ ఢిల్లీ టూర్కి ఎంపిక అయ్యారన్నారు. ఈ టూర్లో విద్యార్థులు రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్, కల్చర్, నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియం లాంటి ప్రఖ్యాత సంస్థలను సందర్శిస్తారన్నారు. సైన్స్ టూర్కు ఎంపికై న విద్యార్థినులు యశస్విని, జెస్సీ -
లోకాన్ని వీడినా వెలుగులు పంచి..
● రోడ్డు ప్రమాదంలో యువకుడు బ్రెయిన్ డెడ్ ● అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ చెందిన యువకుడు అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడు. వివరాల్లోకి వెళితే.. అమలాపురానికి చెందిన జి.మహేష్ (23) ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ అచ్చంపేట జంక్షన్లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. మహేష్ను బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో బ్రెయిన్ డెడ్ చెందినట్టు మరుసటి రోజు వైద్యులు ప్రకటించారు. మహేష్ అవయవాలను దానం చేయడానికి అతడి తల్లిదండ్రులు సమ్మతించారు. దీంతో మెడికవర్ అస్పత్రిలో అవయవ సేకరణ నిర్వహించారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుడు ఫి.ఫణికిరణ్ పర్యవేక్షణలో డాక్టర్లు కళ్యాణ్ బాబు, రాజా అమరేంద్ర, కిశోర్ బాబు, అరవింద్, మెడికవర్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ సమన్వయంతో రెండు కిడ్నీలు, రెండు కళ్లు సేకరించారు. కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కు, రెండు కిడ్నీలను కాకినాడ నగరం, రూరల్లోని రెండు ఆస్పత్రిలో రోగులకు అమర్చేందుకు గ్రీన్ చానల్ ద్వారా మంగళవారం అర్ధరాత్రి తరలించారు. ఈ సందర్భంగా అవయదాన్ ప్రతినిధి కె.రాంబాబు మాట్లాడుతూ అవయవదానం అనేది జీవితానికి పరమార్థం లాంటిదని, ఒకరి జీవిత ప్రయాణం ముగిసినా అవయవాలు మరెందరికో కొత్త శ్వాసగా మారుతాయన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ శుభాకరరావు మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన మహేష్ కుటుంబ సభ్యులు అభినందనీయులన్నారు. -
ఏమైందో ఏమో..
● కారు డ్రైవర్ ఘటన విషాదాంతం ● ఆర్.ఏనుగుపల్లిలో శవమై కనిపించిన శ్రీనివాస్ అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కారు డ్రైవర్ కంచిపల్లి శ్రీనివాస్ (37) ఘటన విషాదాంతమైంది. గత శనివారం అదృశ్యమైన అతడు బుధవారం పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగపల్లి గ్రామంలోని వైనతేయ నదీ పాయలో శవమై కనిపించాడు. అతడి సోదరుడు అంజి పుట్టు మచ్చల ఆధారంగా శ్రీనివాస్ మృతదేహాన్ని గుర్తించాడు. ఈ కేసును అమలాపురం పట్టణం, పి.గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ మృతి చెంది దాదాపు ఐదు రోజులు అవుతుందని, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణాలు తెలుస్తాయని పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీనివాస్ భార్య దేవి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్కు వచ్చారు. తన భర్త అదృశ్యం కేసు ఎంత వరకూ వచ్చిందని ఆరా తీశారు. ఇదే విషయాన్ని పట్టణ పోలీస్ స్టేషన్ ముందు విలేకరులకు తెలిపారు. ఆర్.ఏనుగపల్లిలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని తెలిసి ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆ మృతదేహం తన భర్తదే అని నిర్ధారణ కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. గత శనివారం శ్రీనివాస్ ఇంట్లో తాను రాజమహేంద్రవరం వెళుతున్నానని చెప్పి స్కూటీపై బయలు దేరాడు. అప్పటి నుంచి అతను తిరిగి రాలేదు. దర్శకుడు సుకుమార్ టాటూ ఆర్.ఏనుగపల్లిలో శ్రీనివాస్ మృతదేహం లభ్యమైనప్పుడు అక్కడి పోలీసులు అతడి శరీరంపై సినీ దర్శకుడు సుకుమార్ చిత్రంతో పాటు పలు పేర్లను టాటూలుగా వేయించుకున్న విషయాన్ని గుర్తించారు. అతడి కుడి చేతిపై దేవి, రిషి, వినీత్ అనే పేర్లు ఇంగ్లిషులో ఉన్నాయి. నీలి రంగు ప్యాంట్ ఊడిపోయి అతని కాళ్ల వద్ద వేలాడుతోంది. బహిర్భూమికి వెళ్లి.. అంబాజీపేట: ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి శవమై కనిపించాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇసుకపూడి శివారు తురకలదొడ్డికి చెందిన గుబ్బల నాగరాజు (35) ఈ నెల 28 ఉదయం ఇంటి నుంచి సైకిల్పై బహిర్భూమికి వెళ్లాడు. అనంతరం ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు పలుచోట్ల వెతికారు. అయితే గ్రామానికి సమీపంలో ఉన్న మురుగు కాలువలో బుధవారం శవమై కనిపించాడు. మృతుడి భార్య లక్ష్మీనాగప్రసన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా భర్తను కాసుబాబే చంపాడు తన భర్తను పట్టణానికి చెందిన గంగుమళ్ల కాసుబాబు, అతడి అనుచరులు చంపినట్టు తనకు అనుమానంగా ఉందని మృతుడి శ్రీనివాస్ భార్య దేవి స్థానిక విలేకర్లకు తెలిపింది. తన భర్తపై కాసుబాబు కక్ష పెంచుకుని ఇదంతా చేశాడని ఆరోపించింది. కాసుబాబుతో పాటు శంకర్, సలాది అప్పన్న, కారు డ్రైవర్ కలిపి తన భర్తను చంపారన్న అనుమానం ఉందని తెలిపింది. పట్టణ పోలీసులు ఈ నలుగురి కదలికలపై నిఘా పెట్టారు. తాము కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. -
రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి
అమలాపురం: మోంథా తుపాను వల్ల వరి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) అన్నారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడు వద్ద దేశికోడు డ్రైయిన్ను రైతు విభాగ సభ్యులతో కలసి తుపాను నేపథ్యంలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో గోదావరి డెల్టాలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. గోదావరి సెంట్రల్ డెల్టా పరిధిలోని ప్రధాన డ్రెయిన్లో తూడు, చెత్త, చెదారం భారీ స్థాయిలో పేరుకుపోయాయని తెలిపారు. ప్రధాన డ్రెయిన్లో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయిందని, ముంపు నీరు స్తంభించిపోయినా ప్రభుత్వం, డ్రెయిన్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కోనసీమ జిల్లావ్యాప్తంగా వరి చేలు ఈనిక, పూత దశలో ఉన్నాయని, భారీ వర్షాలకు ముంపు నీరు స్తంభిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. సెంట్రల్ డెల్టా పరిధిలోని ప్రధాన డ్రెయిన్లో నిబంధనలకు విరుద్ధంగా మత్స్యకారులు వెదురు బొంగులతో వందలాది వలకట్లు ఏర్పాటు చేసి, ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారని బాబీ తెలిపారు. అల్లవరం మండలంలో లోయర్ కౌశిక, దేశికోడు, వాసాలతిప్ప, కూనవరం స్ట్రెయిట్ కట్లో పదుల సంఖ్యలో వలకట్లు ప్రవాహాన్ని అడ్డుకుని ముంపు నీటిని స్తంభింపజేస్తున్నాయని తెలిపారు. ఖరీఫ్లో వలకట్లను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. వలకట్లు తొలగిస్తే ముంపు తీవ్రత కొంత మేర తగ్గుతుందన్నారు. డ్రెయిన్ శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వలకట్లు తొలగించాలని డిమాండ్ చేశారు. వాసాలతిప్ప డ్రెయిన్ లో లెవెల్లో ఉండగా, ఎన్.రామేశ్వరం మొగ రెండడుగుల మేర మెరకగా ఉందని, దీనివల్ల ముంపు నీరు స్తంభించిపోతోందని తెలిపారు. ఎన్.రామేశ్వరం బ్రిడ్జి నుంచి మొగ వద్ద సుమారు రెండు కిలోమీటర్ల పొడవున పర్ర భూమిలో డ్రెడ్జింగ్ చేసి, పూడిక తొలగించాల్సి ఉందన్నారు. సెంట్రల్ డెల్టా డ్రెయిన్లో తూడు తొలగింపు పనుల నిర్వహణకు ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాసరావుకు రూ.2 కోట్లు ఇచ్చారని, ఆయన రోజుకు కేవలం పది మందితో తూడు తొలగింపు పనులు చేపడితే ఎప్పటికి పూర్తి చేస్తారని బాబీ ప్రశ్నించారు. ఒక్కరికే కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించడం ద్వారా నిధులు స్వాహా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తుపాను నేపథ్యంలో ఇప్పుడు పనులు ప్రారంభిస్తే ఎప్పటికి పూర్తి చేస్తారో డ్రెయిన్ అధికారులే సమాధానం చెప్పాలన్నారు. తూడు తొలగింపు పనులను డ్రెయిన్ల వారీగా విభజించి, శరవేగంగా పూర్తి చేస్తే ముంపు సమస్యను కొంత మేర పరిష్కరించవచ్చని సూచించారు. డ్రైనేజీ సమస్యపై బాబీ కలెక్టర్ మహేష్ కుమార్ను అమలాపురంలో మంగళవారం కలిసి మాట్లాడారు. వలకట్లు తక్షణమే తొలగించాలని, ఖరీఫ్లో వీటిని పూర్తిగా నిషేధించాలని కోరారు. ప్రాజెక్టు కంపెనీ చైర్మన్కు అప్పగించిన తూడు తొలగింపు పనులను డ్రెయిన్ల వారీగా విభజించి, చేపడితే పంటలు కాపాడుకోవచ్చని, తద్వారా రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని బాబీ కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కాండ్రేగుల జవహర్, ఇందుకూరి సత్యనారాయణరాజు, రైతు నాయకులు పాల్గొన్నారు.ఫ ప్రధాన డ్రైన్లో నిబంధనలకు విరుద్ధంగా వలకట్లు ఫ శరవేగంగా తూడు తొలగింపు పనులు చేపట్టాలి ఫ వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడి డిమాండ్ -
అప్రమత్తంగా ఉండాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మోంథా తుపాను నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. తుపాను ప్రభావం దృష్ట్యా కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన అత్యవసర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విపత్తు ముందు, తర్వాత అధికారులు పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉండాలని సూచించారు. రోడ్లు గండ్లు పడటం, చెట్లు కూలడం, ముంపు ప్రాంతాల వంటి సమస్యలను ముందుగానే గుర్తించి, చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక యువత, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విపత్తులను ఎదుర్కోవడంపై యువతకు శిక్షణ ఇచ్చి గ్రామాల వారీగా బృందాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా తుపాను ప్రత్యేక అధికారి కె.కన్నబాబు మాట్లాడుతూ, ఎర్ర కాలువ, కొవ్వాడ కాలువ, బురద కాలువల్లో ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైతే రిజర్వాయర్ల నుంచి నియంత్రణ విధానంలో నీటిని విడుదల చేయాలని సూచించారు. రహదారులపై గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఏ సమయంలోనైనా తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున శాఖల వారీగా చర్యలు అమలు చేయాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు పహారా కట్టుదిట్టం చేశామన్నారు. ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓలు రాణి సుస్మిత, కృష్ణనాయక్, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్రెడ్డి, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి పాల్గొన్నారు. -
తుపానును ఎదుర్కొనేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధం
రాజమహేంద్రవరం సిటీ: తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు మంగళవారం తెలిపారు. అవసరమైన చోట్ల మొబైల్ జనరేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏడు డివిజన్లలో ఏడు టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తుపాను సమయంలో నెట్వర్క్ ఇబ్బందులు తెలియజేసేందుకు 0883–2472200 నంబర్లో సంప్రదించాలని సూచించారు. విద్యా సంస్థలకు నేడు కూడా సెలవు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని విద్యా సంస్ధలకు బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు మంగళవారం ఈ విషయం తెలిపారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎవరైనా స్టడీ క్లాసులు, అదనపు తరగతుల పేరుతో పాఠశాల నిర్వహిస్తే సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావుకొత్తపేట: మోంథా పెను తుపాను నేపథ్యంలో పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చిన నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని, పలు గ్రామాలను మంగళవారం జెడ్పీ చైర్మన్ సందర్శించారు. అక్కడ ఉన్నవారి వివరాలు, వసతి సౌకర్యాలు, కేంద్రంలో వారికి అందిస్తున్న సేవల గురించి సెంటర్ పర్యవేక్షణ అధికారులు, సిబ్బందిని ఆరా తీశారు. వారికి పాలు, ఆహారం, అవసరమైన వైద్యం అందించాలని విప్పర్తి సూచించారు. తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సర్పంచ్, సచివాలయం, ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ప్రజలు నిర్లక్ష్యంగా ఉండవద్దని, ముఖ్యంగా చెట్లు, విద్యుత్ లైన్ల కింద, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, షెడ్లు, పూరిపాకల్లో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. లైన్లపై చెట్ల కొమ్మలు పడి, వైర్లు తెగినా ప్రమాదం జరగకముందే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు తీసుకునేలా సిద్ధంగా ఉండాలని వేణుగోపాలరావు సూచించారు. ఏలేరుకు వరద నీరు ఏలేశ్వరం: మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ఏలేరు రిజర్వాయర్కు వరద నీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో 5,175 క్యూసెక్కుల మేర నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, మంగళవారం 85.39 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వలు 21.74 టీఎంసీల మేర ఉన్నాయి. దిగువ ప్రాంతానికి 5 వేలు, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున నీటి నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. -
కన్నీరు రాకుండా..
ఫ ముంపు పంటలను కాపాడుకుందాం ఫ సస్యరక్షణ చర్యలు అవశ్యం ఫ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నందకిశోర్ ఐ.పోలవరం: వర్షం.. పుడమి పుత్రులకు కన్నీరు తెచ్చింది.. కష్టాన్ని నీట నాన్చింది.. బంగాళాఖాతంలో మోంథా తుపాను ప్రభావంతో పడుతున్న వర్షాలకు వందల ఎకరాల్లో వరి చేలు నేలకొరగడం, నీట మునగడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు పంటలను రక్షించుకునేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కన్వీనర్ డాక్టర్ ఎం.నంద కిశోర్ వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో 1.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ప్రస్తుతం పంట పూత, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే దశలలో ఉంది. ముఖ్యంగా ఎంటీయూ– 1318, స్వర్ణ, సంపద స్వర్ణ మొదలైన రకాలు పూత దశలో వర్షాలు కురిసినప్పుడు సంపర్కం జరగకపోవడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి. ఎంటీయూ– 1318 రకాలు గొలుసు కట్టు దగ్గరగా ఉండటం వల్ల గింజ రంగు మారడం, మాని పండు తెగులు వచ్చే అవకాశం ఉంది. నిరంతర వర్షాలతో గింజలో నిద్రావస్థ తొలిగి మొలక వచ్చే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు మరియు మాగుడు తెగులు వ్యాపించే ప్రమాదముంది. పాలు పోసుకునే దశలో ఉన్న రకాలు (స్వర్ణ, సంపద స్వర్ణ, మొదలైనవి) వర్షాల వల్ల పడిపోతే పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. చిన్న కాలువలను ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటోంది. ఎక్కువగా నీరు నిలిచిన చోట పెద్ద కాలువలు చేసి మోటార్ల ద్వారా తొలగించాలి. కోత సమయం ఉంటే.. ఫ గింజ తోడుకొని లేదా గట్టి పడే దశలో లేదా కోత దశలో అకాల వర్షాలతో మొక్క పడిపోయి నేలకొరిగే అవకాశం ఉంది. దీనితోపాటు పడిపోయిన చేనుల నుంచి వచ్చే ధాన్యం మిల్లింగ్ సమయంలో విరిగిపోయి నూక ఎక్కువ రావచ్చు. కోసిన పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లయితే నీరు పూర్తిగా బయటకు పోవటానికి కాలవలు ఏర్పాటు చేసుకోవాలి. ఫ గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి. నిద్రావస్థ లేనటువంటి సాంబ మసూరి వంటి రకాలు మరియు నిద్రావస్థ ఉన్న రకాలలో వారం రోజుల పాటు చేను పడిపోయి నీట మునిగినప్పుడు మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి చేనుకు సమతుల్యంగా ఎరువులు వేయాలి. ఫ వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తల సిఫారసు మేరకు పొటాష్ వేయడం, వెదజల్లిన పద్ధతిలో ఎక్కువ విత్తనం వేయకుండా ఉండటం, అవసరానికి మించి నీరు పెట్టకుండా ఉంటే చేసు పడటాన్ని తగ్గించవచ్చు. వారం రోజుల కన్నా ఎక్కువగా నీట మునిగినట్లయితే గింజలలో నిద్రావస్థ తొలిగి చేనుపైనే మొలక వచ్చే అవకాశం ఉంది. ఇలా చేద్దాం.. ఫ గింజలు రంగు మారడం, మాగుడు, మానిపండు తెగుళ్ల వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 మిల్లీలీటర్ల ప్రోపికోనాజోల్ మందును పిచికారీ చేయాలి. ఫ గింజ గట్టిపడే దశలో ఉన్న పంట అధిక వర్షాలకు ముంపు బారిన ఉంటే అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. ఫ నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపడితే 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు స్ఫటిక ఉప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకలు రంగు మార్పును తగ్గిస్తుంది. తెగుళ్ల నియంత్రణ ఇలా.. ప్రస్తుతం బ్యాక్టీరియా ఎండాకు తెగులు, మాగుడు తెగులు వ్యాపించే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటోమైసిస్ ఒక మిల్లీలీటరును లీటరు నీటిలో కలపాలి, అలాగే కొసైడ్ (కాపర్ ఆక్సి క్లోరైడ్) 2 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయాలి. నీరు తగ్గిన తరువాత హెక్సాకోనాజోల్ 400 మి.లీ/ఎకరాకు లేదా ప్రోపికోనాజోల్ 200 మి.లీ/ఎకరాకు పిచికారీ చేయడం ద్వారా మాగుడు తెగులు వ్యాప్తి తగ్గుతోంది. -
లారీ ఢీకొని బాలుడి మృతి
రాజానగరం: మండలంలోని శ్రీకృష్ణపట్నం – పాత తుంగపాడు మధ్య మంగళవారం జరిగిన ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్సై నారాయణమ్మ తెలిపిన వివరాలిలా వున్నాయి. పాత తుంగపాడుకు చెందిన నాగులాపల్లి జాన్వె వెస్లీ (14), తన స్నేహితుడు బోయిడి దుర్గాప్రసాద్తో కలిసి బైకుపై శ్రీకృష్ణపట్నం వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ ఢీ కొట్టిన వెంటనే బైకుపై వెనుక కూర్చున జాన్వెస్లీ కింద పడిపోవడంతోపాటు లారీ కొంతదూరం లాక్కుపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవ్ చేస్తున్న దుర్గాప్రసాద్కి స్వల్ప గాయాలయ్యాయి. కాగా మృతుడు ద్వారపూడిలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు. -
మత్స్యకార యువకుడి గల్లంతు
కాకినాడ క్రైం: మోంథా తుపాను కారణంగా సముద్ర అలల ఉధృతికి కాకినాడకు చెందిన ఓ మత్స్యకార యువకుడు గల్లంతయ్యాడు. వివరాలలోకెళితే కాకినాడ దుమ్ములపేటకు చెందిన 21 ఏళ్ల గందేపల్లి సాయిరాం తన బోట్ను కాకినాడలోని కుంభాభిషేకం తీరంలో లంగర్ వేసి ఉంచాడు. సముద్రలోని అలల ఉధృతితో లంగర్ తెగి బోట్ సముద్రంలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని గ్రహించి ఏటిమొగ కల్వర్టు వద్దకు తన బోట్ను తరలించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కుంభాభిషేకం తీరంలో లంగర్ వేసి ఉన్న బోట్పైకి ఎక్కి లంగర్ తాడును లాగబోతూ ప్రమాదవశాత్తూ సముద్రంలోకి జారిపడి గల్లంతయ్యాడు. సహ మత్స్యకారులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. కుటుంబ సభ్యులు కాకినాడ పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాయిరాంకు భార్య, కుమారుడు ఉన్నారు. -
స్వీట్ స్టాల్ పొయ్యిపై పడిన కొబ్బరి చెట్టు
● చెలరేగిన మంటలు ● తప్పిన ప్రమాదం పి.గన్నవరం: మండలంలోని నరేంద్రపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం స్వీట్స్ తయారీ షెడ్డుపై ఈదురు గాలులకు కొబ్బరిచెట్టు విరిగిపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న నలుగురు త్రుటిలో తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేంద్రపురం గ్రామంలో పప్పుల వెంకటేష్ స్వీట్ స్టాల్ నడుపుతున్నాడు. అతని షాపు వెనుక భాగంలోని షెడ్డులో స్వీట్, హాట్ తయారు చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం స్వీట్స్ తయారు చేస్తుండగా ఈదురు గాలులకు పక్కనే ఉన్న కొబ్బరిచెట్టు పెళ, పెళమని శబ్దం చేస్తూ విరిగి తయారీ కేంద్రంపై పడిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఈ శబ్దాలను గమనించిన నలుగురు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. రెండు కళాయిల్లో మరుగుతూ ఉన్న నూనె కూడా చెల్లాచెదురుగా పడిపోయింది. స్థానికులు మంటలు అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్వీట్ స్టాల్ యజమానికి నష్టం వాటిల్లింది. -
కాశీలో కోనసీమ గరగనృత్య కళా ప్రదర్శన
కొత్తపేట: కోనసీమ గరగనృత్య కళాకారులు వారణాశి (కాశీ)లో గరగనృత్య ప్రదర్శనతో జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేశారు. కాశీలో కాశీ విశ్వనాథ్ మందిర ప్రాంగణంలోని శ్రీత్య్రంబకేశ్వర్ హాలులో ఈ నెల 24 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు యజ్ఞోవైవిష్ణు పేరిట ఆదిత్య వైభవం, భారతీయ రుషి వైభవం, తెలుగు వైభవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వేద పండితుడు జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారు వేయి మంది వేద పండితులు ప్రత్యేక పూజలు, యాగాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా సోమవారం కోనసీమ కళాకారుల గరగనృత్యం ప్రదర్శన ఏర్పాటు చేశారు. కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన కళాకారుల టీమ్ లీడర్ కొమారిపాటి ఏసువెంకటప్రసాద్ ఆధ్వర్యంలో 15 మంది గరగనృత్యం ప్రదర్శించారు. కాశీ క్షేత్రంలో సోనాల్పుర నుంచి విశ్వేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం వరకు వేద పఠనంతో ఊరేగింపు నడుమ గరగనృత్య ప్రదర్శన నిర్వహించారు. రాత్రి జరిగిన అభినందన కార్యక్రమంలో టీమ్ లీడర్ ప్రసాద్ను నిర్వాహకులు సత్కరించారు. కళాకారులను అభినందించారు. -
యథావిధిగా జీతాలు ఆలస్యం!
● అన్నవరం దేవస్థానం శానిటరీ ఉద్యోగులకు తప్పని వేతన వ్యథ ● అక్టోబర్ 28 వచ్చినా 349 మందికి అందని వైనం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 349 మంది పారిశుధ్య సిబ్బందికి అక్టోబర్ 28వ తేదీ వచ్చినా ఇంకా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. వీరికి రూ.52 లక్షలు జీతాల రూపంలో చెల్లించాల్సి ఉంది. జీతాల చెల్లింపు ఆలస్యం కావడం ఇదే మొదటి సారి కాదు. ఈ ఏడాది నాలుగు సార్లు జీతాల చెల్లింపు ఆలస్యమైంది. అయితే సాక్షి దినపత్రికలో వార్తలు ప్రచురితమయ్యాక అధికారులు చర్యలు తీసుకొని జీతాలు చెల్లించారు. అయితే జీతాల చెల్లింపులో ఆలస్యానికి కారణం దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ కాంట్రాక్టర్ అని చెప్పేవారు. పాత కాంట్రాక్ట్ చివరి నెలలో కూడా తప్పని ఇబ్బంది హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ రెండేళ్లుగా దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తోంది. గత ఫిబ్రవరితో ఈ సంస్థ గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త టెండర్ ఖరారయ్యే వరకు మార్చి ఒకటో తేదీ నుంచి తాత్కాలికంగా శానిటరీ సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఏడు ప్రముఖ దేవస్థానాల శానిటరీ టెండర్ తిరుపతికి చెందిన పద్మావతి హాస్పటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్థ దక్కించుకుంది. దాంతో అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తోంది. కనకదుర్గా శానిటరీ కాంట్రాక్టర్ కింద పనిచేసిన 349 మంది సిబ్బందికి సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 28వ తేదీ వచ్చినా జీతాలు చెల్లించలేదు. జీతాల బిల్లు ఆడిట్కు పంపించాం శానిటరీ సిబ్బంది సెప్టెంబర్ నెల జీతాల బిల్లు ఆడిట్కు పంపించాం. ఆడిటర్ సెలవులో ఉన్నా రు. ఆయన రెండు మూడు రోజు ల్లో వచ్చేస్తారు. ఆయన బిల్లు క్లియర్ చేసి పంపించిన వెంటనే జీతాలు చెల్లిస్తాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానంఈసారి ఆలస్యానికి కారణం దేవస్థానం అధికారులే.. కనకదుర్గా ఏజెన్సీ ఈ నెల నాలుగో తేదీనే సిబ్బందికి చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాన్ని ముందుగా బ్యాంకులో జమ చేసి ఆ చలానాలు దేవస్థానానికి అందజేసింది. ఆ చలానాలు పరిశీలించి వెంటనే జీతాలు చెల్లింపునకు చర్యలు తీసుకోవాలి. వారం రోజుల వ్యవధిలోనే జీతాల మొత్తాన్ని కాంట్రాక్టర్ అకౌంట్కు జమ చేయాలి. అలా జమ చేసిన గంటలోపు సిబ్బంది ఖాతాలకు జీతం జమ అవుతుంది. అయితే కనకదుర్గా ఏజెన్సీ కాంట్రాక్టర్ పీఎఫ్ చెల్లించి 24 రోజులు గడచినా సిబ్బందికి జీతాలు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యంగానే పరిగణించాలి. -
తుపాను అయినా.. షాపు మూసేదేలే!
నల్లజర్ల: ఒక పక్క మోంథా తుపాను పెను ముప్పుగా దూసుకువస్తోంది. ఈ కారణంగా నల్లజర్ల మండలంలో భారీ ఈదురుగాలులు, ఎడతెరిపి లేని వర్షాలు పడుతుండటంతో వివిధ గ్రామాల్లో ప్రజల్ని పోలీసు శాఖ అప్రమత్తం చేసి ఇళ్లకు వెళ్లేలా అప్రమత్తం చేసింది. హోటళ్లు, షాపులను మూసి వేయించారు. కానీ, మద్యం షాపులు, దాబాల జోలికి పోలీసులు వెళ్లలేదని, వాటికి తుపాను ప్రమాదం ఉండదా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ మాత్రం అన్ని షాపులు, వ్యాపార సంస్థలు మూసి వేయించాలని ఆదేశాలు జారీ చేసినా.. మద్యం షాపులు, దాబాలు రాత్రి 8 దాటినా యథావిధిగా కొనసాగుతున్నాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
TDP Leader: డబ్బుల కోసం.. నా భర్త రోజూ నన్ను
కోనసీమ జిల్లా: భర్త తనను వేధిస్తూ అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నాడని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య రాజోలు (Razole) పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆమె భర్త దొమ్మేటి సునీల్పై రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ కేసు నమోదు చేశారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. చదువుకునే రోజుల్లో సహ విద్యార్థి అయిన సునీల్ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించాడని దీంతో పెద్దల సమక్షంలో 2009 మార్చి 4న తమకు వివాహమైందని, అప్పటి నుంచీ భర్త సునీల్ తనపై వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు అమూల్య ఫిర్యాదు చేశారు. తనపై రెండు పర్యాయాలు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడని, కొన్ని ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో (Social Media) పోస్టు చేస్తానంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఇదేం బాబోతం
సాక్షి, రాజమహేంద్రవరం: తెరచాటు బాగోతం నడుపుతున్నారు.. విద్యుత్ శాఖలో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్ట్ను యువగళం సభ్యులకు కట్టబెట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. దీనికిగాను ఖరారు చేయాల్సిన టెండర్లను సైతం అనూహ్యంగా రద్దు చేసేశారు. తిరిగి టెండర్లు పిలిచి చినబాబు అనుచరులకు కాంట్రాక్ట్ దక్కేలా పావులు కదుపుతున్నారు.విద్యుత్ పంపిణీ సంస్థలు కాంట్రాక్టు పద్ధతిలో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టులు ఇస్తుంటాయి. గ్రామీణ, పట్టణ, ఏజెన్సీ కేటగిరీల వారీగా తీసిన బిల్లులకు కాంట్రాక్టర్కు కమీషన్ ఇస్తాయి. ఇందులో భాగంగానే 2023–25లో నిర్ణయించిన ధరలతోనే ఈ ఏడాది సైతం టెండర్లు పిలిచారు. రాజమహేంద్రవరం సర్కిల్కు సంబంధించి గత నెల 12న ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించారు. అదే నెల 26న షెడ్యూల్ క్లోజ్, బిడ్ సబ్మిట్, హార్ట్ కాపీస్ తదితర ప్రక్రియకు చివరి తేదీగా ప్రకటించారు. గత నెల 26వ తేదీనే బిడ్ ఓపెన్ చేసి టెండర్ ఎవరికి దక్కిందో ప్రకటించాల్సి ఉంది. రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయంలో మాత్రం నేటికీ ఆ ప్రక్రియ జరగలేదు. బిడ్ ఓపెన్ చేయాల్సిన సమయం ముగిసి సుమారు నెల రోజులవుతున్నా.. టెండర్ల ప్రస్తావనే లేదు. ఒక్కసారిగా టెండర్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించడంతో కాంట్రాక్టర్లు అవాక్కవుతున్నారు. తాము అనుకున్న విధంగా టెండర్లు దాఖలు చేయలేదనే కారణంతో టెండర్లు రద్దు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే దీని వెనుక మతలబు దాగుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువగళం నేతలకు టెండర్ కట్టబెట్టేందుకు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నట్లు ఆరోపణలున్నాయి.నిబంధనలకు తిలోదకాలుస్పాట్ బిల్లింగ్ ప్రక్రియకు గత నెలలో జరిగిన టెండర్లలో నిబంధనలకు తిలోదకాలిచ్చారు. టెండర్లో పాల్గొనే కాంట్రాక్టర్కు క్లాస్–1 రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే టెండర్ దాఖలుకు అర్హత ఉంటుంది. సర్టిఫికెట్ లేకపోతే టెండర్ నుంచి డిస్క్వాలిఫై చేయాలి. టెండర్లు దాఖలు చేసిన గుంటూరు, విజయవాడ, ఒంగోలుకు చెందిన యువగళం సభ్యులకు అవేమీ లేవు. మంత్రి లోకేష్ అండదండలు మాత్రం పుష్కలంగా ఉండటంతో టెండర్లు దాఖలు చేసేశారు. తర్వాతైనా అధికారులు పరిశీలించి డిస్క్వాలిఫై చేయాల్సి ఉన్నా.. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. భీమవరంలో ఇలాంటి పరిస్థితి తలెత్తితే అక్కడి ఎస్ఈ వెంటనే డిస్క్వాలిఫ్ చేశారు. రాజమహేంద్రవరం సర్కిల్లో మాత్రం మిన్నకుండిపోవడం వెనుక ఆంతర్యం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.క్లాస్–1 కాంట్రాక్టర్లుగా అవతారంటెండర్ల దాఖలులో యువగళం సభ్యులకు అర్హతలు లేవు. అయినా వారికే టెండర్లు దక్కేలా చేసేందుకు అధికారులు నడుపుతున్న వ్యవహారం ఆ శాఖలోనే చర్చనీయాంశం అయ్యింది. క్లాస్–1 కాంట్రాక్టర్ సర్టిఫికెట్ ఎలాగైనా సంపాదించాలని, అప్పటి వరకూ టెండర్ల ప్రక్రియ పెండింగ్లో పెడతామని అధికారులు అభయం ఇచ్చినట్లు తెలిసింది. ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువగళం సభ్యులు ఈ నెల 7, 8వ తేదీల్లో క్లాస్–1 కాంట్రాక్టర్లుగా రిజిస్టర్ అయ్యారు. ఇంకే ముంది టెండర్లో పాల్గొనేందుకు అర్హత దక్కించుకున్నారు. స్వామిభక్తి ప్రదర్శించిన విద్యుత్ అధికారులు పాత టెండర్లను రద్దు చేశారు. తిరిగి కొత్త టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఆహ్వానించే టెండర్లలో యువగళం సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది. వీటిలో సైతం ముగ్గురూ రింగయ్యేలా ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. టెండర్ను సైతం వారిలో ఎవరికో ఒకరికి కేటాయించేలా తెర వెనుక కథ నడుస్తోందన్న విమర్శలున్నాయి. ముగ్గురు ఇప్పటికే రింగైనట్లు సమాచారం. అధికారుల సూచనలతో తక్కువ ధరకు టెండర్లు వేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. ఆ ముగ్గురికే ఇవ్వాలని చినబాబు పేషీ నుంచి విద్యుత్ అధికారులపై తీవ్రమైన ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. మిగిలిన జిల్లాల్లో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, టెండర్ దక్కించుకున్న వారికి కాంట్రాక్ట్ అప్పగించారు.స్పాట్ బిల్లింగ్ చేస్తున్న సిబ్బంది (ఫైల్) అన్ని శాఖల్లో వాలిపోయి..ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న నేతలు, సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో వాలిపోతున్నారు. గుంటూరు, ఒంగోలు, విజయవాడకు చెందిన వారు ఏ శాఖలో కాంట్రాక్ట్ అయినా తామే దక్కించుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇది వరకూ ఆర్టీఓ అధికారుల నేతృత్వంలో జరిగే వెహికల్ ఫిట్నెస్ టెస్ట్ (వాహన సామర్థ్య పరీక్షలు) సెంటర్లు సైతం కై వసం చేసుకున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ జిల్లాలో ఇదే తంతు జరుగుతుంది. ప్రైవేట్ సభ్యుల ఆధ్వర్యంలో ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తే.. వాహనాల భద్రత ఎలాగన్న ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ఇది చాలదన్నట్లు తాజాగా విద్యుత్ శాఖపై కన్నేశారు. స్పాట్ బిల్లింగ్ టెండర్లు దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.టెండర్ల రద్దు వాస్తవమేస్పాట్ బిల్లింగ్ టెండర్లు రద్దు చేసిన విషయం వాస్తవమే. టెండర్ల దాఖలులో ఆశించిన మేర ఎక్కువ మంది టెండర్లు వేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరిగి టెండర్లు ఆహ్వానిస్తాం. ఆన్లైన్ విధానంలో ఎవరైనా టెండర్లు వేసుకోవచ్చు. టెండర్ కేటాయింపులో నిబంధనల మేరకే వ్యవహరిస్తాం.– తిలక్కుమార్, ఎస్ఈ, ఏపీఈపీడీసీఎల్,రాజమహేంద్రవరం సర్కిల్జిల్లాలో విద్యుత్ కనెక్షన్లువిద్యుత్ డివిజన్ కేటగిరీ–1 కేటగిరీ–2నిడదవోలు 2,25,071 23,735రాజమహేంద్రవరం రూరల్ 1,98,390 20,528రాజమండ్రి అర్బన్ 2,12,425 32,761 -
అవుట్ ఫాల్ స్లూయిజ్లు తెరచి ఉంచాలి
● ఎంపీడీవోలతో జెడ్పీ చైర్మన్ విప్పర్తి టెలి కాన్ఫరెన్స్ సాక్షి, అమలాపురం: ‘గోదావరి నదీలో వరద సాధారణ స్థితికి వచ్చింది. ఇన్ఫ్లో గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు వరద వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇరిగేషన్ అధికారులు నదులకు అనుబంధంగా ఉన్న అవుట్ ఫాల్ స్లూయిజ్లను తెరచి ఉంచాలి. భారీ వర్షాలు కురిస్తే చేల నుంచి డ్రెయిన్లు, అక్కడ నుంచి అవుట్ ఫాల్ స్లూయిజ్ ద్వారా నదీ పాయలలోకి ముంపు నీరు దిగిపోతుంది’ అని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ రిటైర్డ్ ఎస్ఈ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. ఈ విషయంపై ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. మోంథా తుపాను నేపథ్యంలో సోమవారం ఆయన ఎంపీడీవోలు, జెడ్పీ సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకుముందు ఆయన ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో తూర్పు, మధ్య డెల్టా పరిధిలో పలు డ్రెయిన్ల నుంచి ముంపునీరు నదీపాయాల్లో కలుస్తుందని, ఇప్పుడు వరద లేనందున వాటిని తెరచి ఉంచాలని సూచించారు. రెండు డెల్టాల పరిధిలో వరి కోతలకు సిద్ధమవుతున్నందున ముంపుబారిన పడి ఎక్కువ రోజులు ఉంటే దెబ్బతినే అవకాశముందని, సాధ్యమైనంత త్వరగా ముంపునీరు బయటకు వెళ్లే చర్యలు చేపట్టాలన్నారు. కోనసీమ జిల్లా పరిధిలోని ఎంపీడీవోలు, జెడ్పీ అనుబంధ విభాగాలకు చెందిన సిబ్బందితో ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను ఎదుర్కొనేందుకు ఎంపీడీవోలు, జెడ్పీ సిబ్బంది సిద్ధంగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాలలో బాధితులకు ఆహారంతోపాటు చిన్న పిల్లలకు పాలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత మండలాలకు చెందిన ఎంపీడీవోలు చురుగ్గా ఉండాలని, అక్కడే తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశముందని జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు సూచించారు. -
కబడ్డీ జట్టుకు 14 మంది ఎంపిక
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ మహిళా కబడ్డీ జట్టుకు 14 మందిని ఎంపిక చేశామని స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. సోమవారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ గొల్లలమామిడాడలో నిర్వహించిన ఇంటర్ కాలేజీయెట్ పోటీల ద్వారా వీరిని ఎంపిక చేశారన్నారు. ఈ నెల 29 నుంచి నవంబర్ 2 వరకూ తమిళనాడులోని సేలంలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు వీరు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, డాక్టర్ ఎ.మట్టారెడ్డి, డాక్టర్ ఎంవీఎస్ఎన్ మూర్తి, కోచ్ పీవీవీ లక్ష్మి, మేనేజర్ కె.లోవరాజు పాల్గొన్నారు. ఇంటర్ పరీక్ష ఫీజుకు 31 గడువుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): మార్చి 2026లో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఫీజు గడువు ఈ నెల 30 తేదీతో ముగుస్తుందని ఇంటర్బోర్డు ఆర్ఐఓ ఎన్ఎస్వీఎల్ నరసింహం సోమవారం తెలిపారు. పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే జనరల్, వృత్తి విభాగాల మొదటి, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు, రెగ్యులర్, ఫెయిల్ అయిన (ప్రైవేట్) అభ్యర్థులు తమ పరీక్ష రుసుము గడువు తేదీలోగా చెల్లించాలన్నారు. రూ.వెయ్యి ఆలస్య రుసుంతో నవంబర్ 6వ తేదీ వరకూ గడువు ఉంటుందన్నారు. విద్యార్థులు గడువు తేదీలోపు రుసుము చెల్లించాలన్నారు. విఘ్నేశ్వరునికి పంచ హారతి సమర్పణ అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి రాయచూరుకు చెందిన కరుటూరీ వెంకట రామకృష్ణ సోమవారం వెండి పంచ హారతి సమర్పించారు. దీని బరువు ఒక కేజీ 421గ్రాములు ఉంటుందని, దీని విలువ రూ. లక్ష తొంభై వేలని ఆలయ సిబ్బంది తెలిపారు. పంచ హారతిని ఆలయ ప్రధానార్చకుల మాచరి వినాయకరావుకు అందజేశారు. దాతను ఆలయ వేద పండితులు, అర్చకులు వేదాశ్వీర్వాదం పలికి, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
గోదావరి ఘాట్ల మూసివేత
రాజమహేంద్రవరం సిటీ: మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో రామహేంద్రవరంలోని అన్ని గోదావరి ఘాట్లను మూసివేస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా ప్రకటించారు. పుష్కర ఘాట్, లక్ష్మీగణపతి ఘాట్లలో నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. మోంథా తీవ్ర తుపానుగా మారుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్నానఘట్టాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తులు, ప్రజలు ఘాట్ల వద్దకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట నగర ఆరోగ్యశాఖాధికారి వినూత్న, ఎస్ఈ (ఇన్చార్జి) రీటా, ఈఈ మాధవి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
తుపాను నుంచి పశువులను ఇలా కాపాడాలి
పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ విజయరెడ్డి అమలాపురం టౌన్: మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో పశువులను మేపే రైతులంతా తమ పశువుల పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని పశు సంవర్ధక శాఖ అమలాపురం సహాయ సంచాలకులు డాక్టర్ ఎల్. విజయరెడ్డి సూచించారు. తన పరిధిలో ఉన్న రైతులను, పశు వైద్యాధికారులు, సహాయకులను ఆయన అప్రమత్తం చేశారు. పశువులను పెంచే పలు ప్రాంతాలకు డాక్టర్ విజయరెడ్డి సోమవారం వెళ్లి పశు పోషణ రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. తుపాను కారణంగా పశువుల్లో అస్వస్థత, మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. జాగ్రత్తలు ఇలా.. ● పశువుల షెడ్లు గాలి వానకు కూలి పోకుండా మరమ్మతులు చేయించాలి. ● పశువులకు నట్టల నివారణ మందులను వాడి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ● బాహ్య పరాన్న జీవుల నిర్మూలన మందులను వాడాలి. ● విష సర్పాల నుంచి కాపాడుకోవాలి. ● అధిక వర్షాలు, తుపాను సమయంలో పశువులను రాటకు కట్టకుండా వదిలేయాలి. ● లేగ దూడలు చలి బారిన పడకుండా వెచ్చని వాతావరణం కల్పించాలి. ● అవసరాలకు అనుగుణంగా దాణాను, మేతను నిల్వ ఉంచుకోవాలి. ● పశువులను విద్యుత్ తీగలకు, కరెంట్ స్తంభాలకు దూరంగా ఉంచాలి. ● వాతావరణ కేంద్రం సూచనలకు అనుగుణంగా యాజమాన్య పద్ధతులు పాటించాలి. ● పశువుల మేత తడిసిపోకుండా భద్ర పరుచుకోవాలి. ● పశువుల దాణా తడిస్తే బూజు పడుతుంది కాబట్టి జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ● పశువులను వర్షంలో మేతలకు తోలకూడదు. ● కూలిపోయే అవకాశం ఉన్న చెట్ల కింద, గోడల దగ్గర, పాకల దగ్గర పశువులను కట్టకూడదు. ● పశువులు వర్షంలో తడిస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి జబ్బు పడి చనిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దూడలు, గొర్రెలను తడవకుండా కాపాడుకోవాలి. ● పశువులకు ఏమైనా జబ్బుగా ఉంటే దగ్గరలోని పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే తక్షణమే వైద్యం అందుతుంది. ● పశువులు ఎక్కడైనా చనిపోతే పశు వైద్య సిబ్బందికి తెలియజేస్తే పై అధికారులకు వివరాలు పంపేందుకు వీలు ఉంటుంది. ● గేదెలు, ఆవులకు పచ్చిక దొమ్మ, జబ్బ వాపు రాకుండా, గొర్రెలకు నేల మరక రాకుండా టీకాలు వేయించుకోవాలి. ● పశువులకు తుపాను కారణంగా ఏ చిన్న సమస్య ఎదురైనా తక్షణమే ఆ సమాచారాన్ని రైతులకు సమీపంలో ఉన్న పశు వైద్యాలయం లేదా పశు వైద్యాధికారులకు అందజేస్తే తమ సిబ్బంది తక్షణమే స్పందిస్తారని సహాయ సంచాలకులు డాక్టర్ విజయరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
రత్నగిరిపై మోంథా ఎఫెక్ట్
● కార్తిక సోమవారం 80 వేల మంది వస్తారని అంచనా ● తుపాను ప్రభావంతో 40 వేలకే పరిమితమైన భక్తులు అన్నవరం: రత్నగిరిపై మోంథా తుపాను ప్రభావం పడింది. కార్తిక మాసంలో తొలి సోమవారం కావడంతో సుమారు 80 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేసి, ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. అయితే తుపాను హెచ్చరికలతో భక్తుల సంఖ్య 40 వేలకే పరిమితమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాత్రమే ఆలయంలో రద్దీ నెలకొనగా, ఆ తరువాత నుంచి దేవస్థానం క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. సత్యదేవుని వ్రతాలు ఏడు వేలు జరుగుతాయని అధికారులు భావించగా 4,500 మాత్రమే జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.35 లక్షల ఆదాయం సమకూరింది. ఆలయంలో ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షించారు. తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కూడా భక్తులు పెద్దగా రకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. వర్షంతో ఇబ్బందులు తుపాను ప్రభావంతో రత్నగిరిపై కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. దేవస్థానంలో పలుచోట్ల విశ్రాంతి షెడ్లు నిర్మించినప్పటికీ ఆలయం చుట్టూ ఉన్న రథం పాత్, పశ్చిమ రాజగోపురం ముందు గ్రీన్ షేడ్ నెట్తో ఏర్పాటు చేసిన షెల్టర్లే ఉన్నాయి. వీటి ద్వారా ఎండ నుంచి రక్షణ ఉంటుంది తప్ప వర్షం వస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు. దీంతో, వర్షం కురిసిన సమయంలో వీటి కింద ఉన్న భక్తులు తడిసిపోయారు. పశ్చిమ రాజగోపురం లోపలకు వెళ్లేందుకు నిర్మించిన ర్యాంపు మీద కూడా షెల్టర్ లేక భక్తులు వర్షంలో తడవాల్సి వచ్చింది. ఇక్కడ పొడవాటి షెల్టర్ నిర్మించినా అది ర్యాంపు వరకూ లేకపోవడంతో ఇబ్బంది తప్పలేదు. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున దేవస్థానంలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు వారి బంధువులు, ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు సత్యదేవుని దర్శనానికి వచ్చి, వర్షంలో ఇబ్బంది పడ్డారు. వర్షానికి తడిసిపోకుండా పలువురు గొడుగులు వేసుకుని, వ్రత మండపాలు, ఆలయానికి వెళ్లారు. కార్తిక మాసం సందర్భంగా దేవస్థానంలో పలుచోట్ల వేసిన రేకులతో షెడ్లు నిర్మించి, వాటిని క్లాత్తో అలంకరించారు. తుపాను గాలులకు ఆ షెడ్డు రేకులు ఎగిరిపోయే అవకాశం ఉండటంతో, వాటిని తాళ్లతో గట్టిగా కట్టి రక్షణ చర్యలు చేపట్టారు. మొత్తం అన్ని షెడ్ల మీద ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఈఈ రామకృష్ణ తెలిపారు. ఇలా చేస్తే మేలు రథం పాత్లో తూర్పు రాజగోపురానికి ఇరువైపులా టెన్సిల్ షెడ్లు భక్తులకు వర్షం నుంచి రక్షణ కల్పించాయి. ఇదేవిధంగా రథం పాత్ చుట్టూ కూడా గ్రీన్ షేడ్ నెట్ స్థానంలో టెన్సిల్ షెడ్లు నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షం కురిస్తే శని, ఆదివారాల్లో నిర్వహించే స్వామివారి తిరుచ్చి, రథ సేవలను నిలిపివేస్తున్నారు. టెన్సిల్ షెడ్లు నిర్మిస్తే వర్షం వచ్చినా ఆ సేవలు యథాతథంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. -
మొత్తమోంథా ముంచేసి..
● తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ● అప్రమత్తమైన అధికారులు ● సహాయక చర్యలకు కంట్రోల్ రూముల ఏర్పాటు ● నేడు కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు సాక్షి, రాజమహేంద్రవరం: ‘మోంథా’ ముంచుకొస్తోంది.. తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ ప్రభావం మరింత పెరుగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ సమీపంలో రాత్రికి తీరం దాటనున్నట్లు అంచనా వేసింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వర కూ ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. కూలి పనులు, వివిధ వ్యాపారాల నిమి త్తం వెళ్లే ప్రజలకు అవస్థలు తప్పలేదు. ఉదయం నుంచే వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది. ఆకాశం మేఘావృతమైంది. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మోంథా తుపాను నేపథ్యంలో అధికారులు అ ప్రమత్తమయ్యారు. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో నిల్చోరాదని, విద్యుత్ ఉపకరణాలను డిస్కనెక్ట్ చేసి భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి ప్రజలను కోరారు. రైతులు ఉరుములు, మెరుపులు ఉ న్న సమయంలో పొలాలకు వెళ్లకూరాదన్నారు. వ్యవసాయ పరికరాలను భద్రపరచుకోవాలని కలెక్టర్ సూ చించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. అన్ని శాఖాధికారులు, క్షేత్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండి తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను ప్రభావం దృష్ట్యా జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. ప్రత్యేకాధికారి పర్యటన మోంథా తుపాను చర్యలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక అధికారిగా కన్నబాబును నియమించింది. ఆయన సోమవారం నిడదవోలు మండలంలో పర్యటించారు. అక్కడి అధికారులతో చర్చించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నిడదవోలు మండలం కంసాలిపాలెంలోని ఎర్ర కాలువ పరిస్థితి పరిశీలించారు. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోందని, ఇది ప్రమాదకర స్థాయి కాదని ఆయన స్పష్టం చేశారు. ఎర్రకాలువ ఉప్పొంగే పరిస్థితి లేదని, నిడదవోలు పట్టణం సురక్షితమని వివరించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖాధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, లోతట్టు ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. నీటి మునగడంతో నష్టం మోంథా తుపాను నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వరి పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే దశలో ఉంది. ఇలాంటి తరుణంలో తుపాను హెచ్చరికలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వరి పంట కోతలు చేపట్టగా, వర్షాలతో ఇబ్బందిగా మారింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 52,929 హెక్టార్లలో పంట ప్రభావితమైంది. 356 హెక్టార్లలో పంట నీట మునగగా.. 384 హెక్టార్లలో దెబ్బతింది. 12 మండలాల్లో 105 గ్రామాల్లో వర్ష ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయి. 5,207 మంది రైతులు నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. తుపాన్ ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు మరింత వరి పంట నేలకొరిగి తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యాన రైతుల్లో ఉలికిపాటు జిల్లాలో సుమారు 1.62 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉద్యాన రైతులు ఉలికిపాటుకు గురవుతున్నారు. అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల పంటలు దెబ్బతినే అవకాశం ఉండటంతో రైతులు ముందుగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, తోటల్లో నిల్వ నీటిని వెంటనే బయటకు పంపించి, చెట్లకు ఊతం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. బ్రాహ్మణగూడెంలో నిడదవోలు – పంగిడి రహదారిపై నిలిచిన వర్షపునీరు కంట్రోల్ రూముల ఏర్పాటు తుపాను నేపథ్యంలో జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కంట్రోల్ రూములను ఏర్పాటు చేసి 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే సంబంధిత కంట్రోల్ రూములకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. తూర్పుగోదావరి జిల్లా కంట్రోల్ రూమ్ : 0883–2944455రాజమహేంద్రవరం డివిజన్ : ఆర్డీఓ కార్యాలయం, రాజమహేంద్రవరం: 0883–2442344 రాజమహేంద్రవరం అర్బన్: 0883–2940695 రాజమహేంద్రవరం రూరల్: 98499 03860 కడియం: 63015 23482 రాజానగరం : 94945 46001 రంగంపేట : 93939 31667 కోరుకొండ : 91544 74851 అనపర్తి : 94413 86920 బిక్కవోలు : 98499 03913 సీతానగరం : 91770 96888 గోకవరం : 94913 85060 కొవ్వూరు డివిజన్ : ఆర్డీఓ కార్యాలయం, కొవ్వూరు: 79953 67797 కొవ్వూరు: 98667 78416 చాగల్లు: 94412 93856 తాళ్లపూడి: 79936 36666 పెరవలి: 08819–232179 ఉండ్రాజవరం: 94910 41474 నల్లజర్ల: 94910 41451 దేవరపల్లి: 97058 18045 గోపాలపురం: 75698 56778 నిడదవోలు: 94405 80856 -
ఉద్యాన పంటల రక్షణకు చర్యలు తీసుకోండి
పెరవలి/ దేవరపల్లి: మోంథా తుపానుతో తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఉన్నందున ఉద్యాన పంటలను రక్షించుకోవటానికి రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఉద్యాన అధికారి ఎన్.మల్లికార్జునరావు తెలిపారు. జిల్లాలోని దేవరపల్లి, కొవ్వూరు, పెరవలి, నిడదవోలు మండలాల్లో సోమవారం ఆయన పర్యటించి రైతులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ జిల్లాలో 1.62 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉండగా, తుపాను కారణంగా బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంటలను రక్షించుకోవాలని సూచించారు. అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. తోటల్లో నిల్వ నీటిని వెంటనే బయటకు పంపించి, చెట్లకు ఊతం (వెదురు) ఇవ్వాలని ఆయన సూచించారు. వర్షం ఆగిన వెంటనే యూరియా, పొటాషియం, వంటి ఎరువులను వేయడం, సస్యరక్షణ మందులు పిచికారీ చేయడం, గాలి ప్రసరణకు తగిన ఏర్పాట్లు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని ఆయన తెలిపారు. రైతులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా హెచ్చరికలు, సూచనలు పంపించడమే కాకుండా మండల, గ్రామ స్థాయిలో సహాయక వ్యవస్థలు ఏర్పాటు చేశామన్నారు. తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లు, కూరగాయలను యుద్ధప్రాతిపదికన మార్కెట్లకు తరలించాలని, లేనిపక్షంలో నష్టాలు చవిచూడాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారి సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తుపాను నేపథ్యంలో పలు రైళ్ల రద్దు
రాజమహేంద్రవరం సిటీ: తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను మంగళవారం రద్దు చేసినట్లు అధికారులు సోమవారం ప్రకటించారు. తిరుపతి– విశాఖపట్నం(08584), మహబూబ్నగర్– విశాఖపట్నం (12862), చైన్నె– విశాఖపట్నం స్పెషల్ (22802), రాజమహేంద్రవరం– విశాఖపట్నం(67286), భువనేశ్వర్ – బెంగళూరు ఎక్స్ప్రెస్ (18463), భువనేశ్వర్ – సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్(17015), భువనేశ్వర్ –పాండిచ్చేరి (20851) రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు టికెట్ పూర్తి మొత్తాన్ని అందించేందుకు అవసరమైన కౌంటర్లను స్టేషన్లో ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని 24 గంటలు అందుబాటులో ఉండేలా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు రైల్వే స్టేషన్ సీటీఐ సుంకర చంద్రమౌళి తెలిపారు. ప్రయాణికులు రైళ్ల రాకపోకల వివరాలను తెలుసుకునేందుకు 83319 87657 నంబర్లో సంప్రదించాలన్నారు. -
బెల్టుపై జవాబు చెప్పమంటే కోపమెందుకు?
ఎమ్మెల్యే గోరంట్లకు వైఎస్సార్ సీపీ నేత వేణు సూటి ప్రశ్నరాజమహేంద్రవరం రూరల్: నియోజకవర్గంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై నియంత్రణ గురించి చెప్పాలని కోరితే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కోపమెందుకని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. శాటిలైట్ సిటీ గ్రామంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి మద్యం షాపులోను బాటిల్పై రూ.10 ఎక్కువగా వసూలు చేస్తున్నారని, ప్రతి గ్రామంలోనూ బెల్టు షాపుల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. బెల్టు షాపులను నియంత్రించాలని కోరితే తాను మద్యం వ్యాపారం మానేశానంటూ గోరంట్ల కోపంగా చెబుతున్నారన్నారు. బెల్టు షాపుల అమ్మకాలపై సాక్ష్యం అడిగారని, అందుకే బెల్టు షాపులో రూ.120 బాటిల్ రూ.150కి, రూ.190 బాటిల్ రూ.240కి విక్రయిస్తున్న విషయాన్ని ప్రజల సాక్షిగా చూపిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం వ్యవహారం గుట్టు రట్టవడంతో మద్యం, బెల్టు షాపుల్లో ఏ మందు విక్రయిస్తున్నారో తెలియక మద్యపాన ప్రియులు భయాందోళన చెందుతున్నారన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా బెల్టు షాపులు అరికట్టలేని బుచ్చయ్య అసమర్థ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మద్యం షాపులు సిండికేట్గా మారి ఎకై ్సజ్ పోలీసులకు, పోలీసులకు ఇంత వాటాలివ్వాలంటూ ఫోన్ రికార్డింగ్ వాయిస్లు ఇటీవల హల్చల్ చేసిన విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. నియోజకవర్గంలో బెల్టు షాపులు ఎవరి అనుమతితో నిర్వహిస్తున్నారో సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే గోరంట్లను వేణు డిమాండ్ చేశారు. బెల్టు షాపు చట్టవిరుద్ధం కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లాలాచెరువు, బుర్రిలంకల్లో భారీగా ఉన్న ఇసుక గుట్టలను ఆ పార్టీల నేతలు అమ్మేసుకున్నారన్నారు. ప్రస్తుతం ఉచితం పేరుతో 25 టన్నుల లారీల్లో 40 టన్నుల ఇసుక అమ్ముకుంటూ దోచేస్తున్నారన్నారు. నగరంలో ఇసుక లారీలు తిరగకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం చూసీ చూడనట్లు వదిలేస్తోందని మండిపడ్డారు. డ్రెడ్జింగ్ పేరుతో ఇసుక దోపిడీ భారీగా జరుగుతోందని ఆరోపించారు. రేషన్ బియ్యం సైతం పక్కదారి పడుతున్నాయన్నారు. గోరంట్ల దత్తత గ్రామమైన శాటిలైట్ సిటీలో ఎక్కడ చూసిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయని చెప్పారు. పేదలు జీవించే ఈ గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టకపోవడం గోరంట్ల అసమర్థ పాలనకు నిదర్శనమని వేణు దుయ్యబట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఏలేరు.. డేంజర్!
● రిజర్వాయర్లో పెరుగుతున్న నీటిమట్టం ● దిగువకు అదనపు జలాల విడుదల ● అధిక మొత్తంలో ఒకేసారి వదిలేస్తే ముంపు ముప్పు ● పరీవాహక ప్రాంత ప్రజల్లో కలవరం పిఠాపురం: జిల్లాలోని ఏలేశ్వరం వద్ద ఉన్న ఏలేరు జలాశయం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నీటిమట్టం దాదాపు గరిష్ట స్థాయికి చేరుకుంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, శనివారం నాటికే 85.57 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు సుమారు 23 టీఎంసీలకు చేరుకున్నాయి. ఈ తరుణంలోనే మోంథా తుపాను దూసుకొస్తూండటంతో మరింతగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే ఏలేరు రిజర్వాయర్ లోనికి వరద నీరు భారీగా వచ్చి చేరుతూండటంతో అధికారులు రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఎక్కువ మొత్తంలో అదనపు జలాలు వదిలేందుకు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో, తమకు మరోసారి ముంపు ముప్పు తప్పదేమోనని పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు కలవరపడుతున్నారు. గత ఏడాది అపార నష్టం గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఏలేరు అదనపు జలాలను కాలువ సామర్థ్యానికి మించి ఒక్కసారిగా వదిలేయడంతో పిఠాపురం, గొల్లప్రోలు, యు.కొత్తపల్లి మండలాల్లో అపార నష్టం సంభవించింది. ఈ మూడు మండలాల్లోనూ వరి, వాణిజ్య పంటలు పూర్తిగా నీట మునిగి, పనికి రాకుండా పోయాయి. మొత్తం 42 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 36 వేల ఎకరాల్లో పంట ముంపు బారిన పడింది. ఎకరానికి రైతులు రూ.25 వేల పెట్టుబడి పెట్టగా, అంతా వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది. నాటి ఏలేరు వరదల కారణంగా సుమారు రూ.150 కోట్ల మేర నష్టం సంభవించింది. ఏలేరు కాలువకు గండి పడిన ప్రాంతాల నుంచి భారీగా ఇసుక, మట్టి వచ్చి పొలాల్లో మేటలు వేసింది. పిఠాపురం మండలం రాపర్తి, రాయవరంతో పాటు గొల్లప్రోలు మండలంలోని వివిధ గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో ఇసుక మేటలు వేసింది. రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నారు. రాపర్తి ప్రాంతంలోని వరి పొలాల్లో సుమారు 2 అడుగుల మేర ఇసుక మేటలు వేసింది. ఆ ఇసుక తొలగించుకోడానికి సైతం రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరోవైపు నాడు రూ.కోట్లు వెచ్చించి, ఏలేరు, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ) గండ్ల పూడ్చివేత పేరుతో కూటమి నేతలు తూతూమంత్రంగా పనులు చేసి, చేతులు దులిపేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పటికీ ఎక్కడి గండ్లు అక్కడే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో వరి పైరు చిరుపొట్ట దశలో ఉంది. ఈ తరుణంలో ఇప్పుడు మళ్లీ ఏలేరు నుంచి నీటిని ఒక్కసారిగా వదిలేస్తే తమకు మరోసారి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, మరోసారి వరద ఖాయమని భావిస్తున్న అధికారులు ముందు జాగ్రత్త చర్యల పేరిట కాలువల్లో పూడికల తొలగింపు చేపట్టారు. పెద్దాపురం మండలం కాండ్రకోటలో రెగ్యులేటర్ మీదుగా ప్రవహిస్తున్న ఏలేరుపిఠాపురం మండలం మాధవపురం వద్ద ఏలేరు కాలువకు గత ఏడాది సెప్టెంబర్లో గండి పడటంతో నీట మునిగిన ఇసుకపల్లి గ్రామం, పంట చేలుగత ఏడాది ఏలేరు కాలువకు మాధవపురం వద్ద పడిన గండి (దీనిని నేటికీ పూడ్చలేదు) ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు మాధవపురం గండి పూడ్చి మా పంటలు కాపాడాలని ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) అధికారులకు గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేశాం. అయినా ఫలితం లేదు. ఇది పెద్ద గండి కాదని వదిలేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. వరద వచ్చినప్పుడు ఏలేరు అదనపు జలాలు, పీబీసీ నీరు ఒకేసారి వచ్చి పడటంతో ఈ కాలువకు గండి పడింది. దీనివల్లే గత ఏడాది సుమారు 2 వేల ఎకరాల్లో వరి పంట, వందలాదిగా ఇళ్లు నీట మునిగా యనే విషయం గుర్తించాలి. అటువంటిది ఇది పెద్ద గండి కాదనడం ఎంతవరకూ సమంజసమో అధి కారులే చెప్పాలి. అన్ని గండ్లూ పూడ్చివేస్తున్నామ ని అధికారులు, నేతలు చెబుతున్నారు. కానీ, అవసరమైన, ప్రమాదకరమైన ఇలాంటి గండ్లను ప ట్టించుకోవడం లేదు. మాధవపురం గండిని ఇప్ప టికై నా పూడ్చి, గట్టును పటిష్టపరచకపోతే వేలాది ఎకరాలు మరోసారి నీట మునగడం ఖాయం. – వై.ప్రసాదరెడ్డి, రైతు, నాగులాపల్లి, యు.కొత్తపల్లి మండలం -
రాజకీయ బలోపేతమే శెట్టిబలిజల లక్ష్యం
● సందడిగా శెట్టిబలిజ కార్తిక వన మహోత్సవం, ఉచిత వివాహ పరిచయ వేదిక ● మంత్రులు, ఎమ్మెల్సీలు, ప్రముఖుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: శెట్టిబలిజ సామాజిక వర్గం రాజకీయంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. రాష్ట్ర శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం హైవే పక్కనున్న చెరుకూరి తోటలో శెట్టిబలిజ కార్తిక వన మహోత్సవం, శెట్టిబలిజ వధూవరుల ఉచిత వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, విశిష్ట అతిథులుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ, శెట్టబలిజలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ, శెట్టిబలిజ సామాజిక వర్గ సంక్షేమానికి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో ఆదరణ పథకంలో గీత సామాజిక వర్గం వారికి ఉపకరణాలు అందిస్తామని, బీసీ కార్పొరేషన్ రుణాలూ అందుతాయని చెప్పారు. ఈ సందర్భంగా శెట్టిబలిజ సంఘానికి సేవలు చేసిన ప్రముఖుల స్మారక అవార్డులను పది మందికి ప్రదానం చేశారు. సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ను మంత్రి సుభాష్ ఆవిష్కరించారు. అనంతరం సంఘ రాష్ట్ర నాయకుడు సానబోయిన రామారావును సత్కరించారు. సంఘ రాజమండ్రి నాయకులు, శెట్టిబలిజ ప్రముఖులను మంత్రి శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర శెట్టిబలిజ, గౌడ, ఈడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, సంఘ ప్రతినిధులు, సంఘీయులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
● నవంబర్ 4న ప్రజా ఉద్యమం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరం రూరల్: వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం కూటమి ప్రభుత్వం చేస్తున్న చరిత్రాత్మక తప్పిదమని, దుర్మార్గమైన చర్యని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండుతో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నవంబర్ 4న వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన ప్రజా ఉద్యమం చేపడుతున్నామన్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను శాటిలైట్ సిటీ గ్రామంలో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 28న జరగాల్సిన ఈ ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని మోంథా తుపాను నేపథ్యంలో నవంబర్ 4వ తేదీకి మార్చామని తెలిపారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రను తిరగరాసి, రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. వీటిని పీపీపీ విధానం పేరుతో ప్రైవేటీకరించడం ద్వారా కూటమి ప్రభుత్వం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకూ వైఎస్సార్ సీపీ ఆందోళన కొనసాగిస్తుందని వేణు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా శ్రీనగేష్, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
జాకీలతో ఇంటి ఎత్తు పెంపు
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం మారేడుబాక మహిళా నగర్లోని ఓ ఇల్లు ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షించింది. కొన్నేళ్లుగా పల్లంలో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు మూడు అడుగుల ఎత్తుకు పెరిగింది. సాధారణంగా ఇల్లు అనుకూలంగా లేకపోతే కూల్చి మళ్లీ కడతారు. ఇక్కడ ఇల్లు కూల్చకుండానే ఎత్తు చేశారు. పల్లంలో ఉంటున్న ఇంట్లో నివసించడానికి ఇబ్బందిగా భావించిన యజమాని మోటుపల్లి వీరగణేష్.. ఆ ఇంటిని కూల్చే సాహసం చేయలేకపోయారు. ఇంటిని ఎత్తు చేసేలా ప్రత్యామ్నాయ ఆలోచన చేశారు. జాకీల సాయంతో ఇంటి ఎత్తు పెంచే విజయవాడలోని ఓ సంస్థ ప్రతినిధులను సంప్రదించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మూడు అడుగులు ఎత్తు చేయవచ్చంటూ సంస్థ ప్రతినిధులు భరోసా ఇచ్చారు. అందుకయ్యే ఖర్చును చెల్లించేందుకు యజమాని సిద్ధపడటంతో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, జాకీలతో ఇంటిని మూడు అడుగుల ఎత్తు పెంచారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ పూర్తికావడంతో అనుబంధ పనులను చేస్తున్నారు. -
మోంథా హడల్
పెరవలి మండలం ఉసులుమర్రులో హడావుడిగా వరి కోతలు● తుపాను హెచ్చరికలతో వణుకు ● కాకినాడ వద్ద తీరం దాటనున్న తీవ్ర తుపాను! ● అదే జరిగితే జిల్లాపై తీవ్ర ప్రభావం ● రైతుల్లో ఆందోళన ● చేతికి అంది వస్తున్న పంట నోటికి అందదేమోనని ఆవేదనపెరవలి: నేల దున్ని.. మడి సిద్ధం చేసి.. తడులు పెట్టి.. ఇలా నారు వేశారో లేదో.. అలా కురిసిన కుండపోత వానలకు వేసిన నారు కాస్తా సర్వనాశనమైంది. నానా అగచాట్లూ పడి.. మళ్లీ కొందరు నారు వేశారు. మరి కొందరు వెదజల్లు సాగు చేశారు.. మొత్తం మీద ఎలాగోలా సాగుకు శ్రీకారం చుట్టారు. పంట కాస్త ఏపుగా పెరిగి.. ఈనిక దశకు చేరుతున్న తరుణంలో.. మేఘాలు బద్దలైనట్లు ఇటీవల రోజుల తరబడి భారీ వర్షాలు.. పంట చివరి దశకు చేరుకుని, కొద్ది రోజుల్లో చేతికందుతుందని ఆశ పడుతున్న తరుణంలో.. ఇప్పుడు మోంథా తుపాను హెచ్చరికలు.. దీంతో రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పంట ఏపుగా పెరిగి, పసిడి గింజలు పండించిన ప్రస్తుత తరుణంలో ఈ తుపాను విరుచుకుపడితే ఎంతటి విపత్తు సృష్టిస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. అధికారులు అప్రమత్తం మోంథా తుపాను తీవ్ర రూపం దాల్చి, కాకినాడ వద్ద తీరం దాటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను ప్రభావంతో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం తుపాను ప్రభావంతో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా కలెక్టర్, ఆయా శాఖల ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది గ్రామాల్లో నిత్యం పర్యవేక్షించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. తుపాను నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ హడావుడి చూసి ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట దక్కుతుందా.. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 74,793 హెక్టార్లలో వరి సాగు జరిగింది. ఇప్పటి వరకూ సుమారు 681 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయి. మిగిలిన పంట కో తకు సిద్ధంగా ఉంది. తుపాను అలజడి లేకపోతే ఇప్పటికే మరో 2 వేల హెక్టార్లలో కోతలు పూర్తయ్యేవని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తుపాను వస్తే ఈదురు గాలులు, భారీ వర్షాలకు పంటంతా గంగపాలవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారంలో రోజుల తరబడి కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా 37,028 హెక్టార్ల విస్తీర్ణంలో పంట నేలనంటేసింది. ఇప్పటికీ చేలల్లో నీరు లాగక, పంట నానిపోతోంది. ఈ తరుణంలో తుపాను విరుచుకుపడితే చేతికి అందుతుందనుకుంటున్న పంట నోటికి అందకుండా పోతుందని రైతులు దిగులు చెందుతున్నారు. వాతావరణ శాఖ చెబుతున్న స్థాయిలో తుపాను తీవ్రత ఉంటే.. కాకినాడ వద్దనే తీరం దాటితే తమకు కనీసం గింజ కూడా దక్కదని అంటున్నారు. ఉద్యాన రైతుల్లోనూ ఆందోళన జిల్లాలో వరితో పాటు అరటి, ఆయిల్పామ్, కొబ్బరి, బొప్పాయి, జామ, కోకో, చెరకు, కంద, మామిడి, కొబ్బరి, జీడిమామిడి, మిర్చి, కూరగాయలు, పూలు తదితర ఉద్యాన, వాణిజ్య పంటలు కూడా 64,536 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తుపాను ప్రభావం జిల్లాపై పడితే ముఖ్యంగా కొబ్బరి, బొప్పాయి, కోకో, అరటి, కూరగాయల పంటలు సర్వనాశనమవుతాయని రైతులు కలత చెందుతున్నారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు అన్ని పంటలూ ఇప్పటికే ముంపునకు గురయ్యాయి. ఈ పరిస్థితుల్లో తుపాను విరుచుకుపడితే తోటలు నేలమట్టమవుతాయని, పంట మొత్తం అందకుండా పోతుందని, నష్టం లెక్కలకు అందని విధంగా ఉంటుందని భావిస్తున్నారు. గతంలో 1986లో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా జిల్లాలోని ఏటిగట్లకు పలుచోట్ల గండ్లు పడ్డాయి. తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. అలాగే, 1996లో వచ్చిన తుపాను కారణంగా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి. రైతులు కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నారు. ఇప్పుడు మోంథా తుపానుతో అటువంటి ప్రళయం మళ్లీ చవిచూడాల్సి వస్తుందేమోనని వారు హడలెత్తుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి రాజమహేంద్రవరం సిటీ: మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కె.తిలక్ కుమార్ ఆదేశించారు. తుపాను దృష్ట్యా రాజమహేంద్రవరం సర్కిల్ కార్యాలయంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. ఇవి 24 గంటలూ 3 షిఫ్టుల్లో పని చేస్తాయన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తితే దగ్గరలోని విద్యుత్ సెక్షన్ కార్యాలయాన్ని లేదా 1912 టోల్ ఫ్రీ నంబరుకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. దీంతో పాటు రాజమహేంద్రవరంలోని జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో 73822 99960, 0883–2463354, రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ కార్యాలయం 94906 10093, రాజమహేంద్రవరం రూరల్ డివిజన్ 94931 78874, నిడదవోలు డివిజన్ 83329 73595 నంబర్లను సంప్రదిస్తే సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తిలక్ కుమార్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ సీజ్
రాయవరం: పశువులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పశువులను రక్షించిన ఘటన రాయవరం పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని రాయవరం ఎస్సై డి.సురేష్బాబు ఆదివారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి, అక్కడ నుంచి రామచంద్రపురం వరకు, అక్కడ నుంచి నెల్లూరుకు ఐషర్ వ్యాన్ (టీఎన్66 ఏబీ 8470)పై తరలిస్తున్నారు. కొత్తూరు సంసేన్ను, తమిళనాడు జిల్లా తిరువళ్లూరు ప్రాంతానికి చెందిన వ్యాన్ డ్రైవర్ వెట్రివేల్ను అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు, 14 చిన్నదూడలను సంరంక్షించి, సామర్లకోట గోశాలకు తరలించారు. అక్రమంగా పశువులను తరలిస్తున్న ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వ్యాన్ను సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రభుత్వమే ఆదుకోవాలి
రబీలో ధాన్యం అమ్మడానికి నానా పాట్లూ పడ్డాం. అది కూడా అమ్మి న ధాన్యం సొమ్ము చాన్నాళ్లకు కా నీ ఇవ్వలేదు. ఈ ఏడాదైనా ధా న్యం సక్రమంగా కొనుగోలు చేసి, రైతులకు ఎటు వంటి ఇబ్బందులూ లేకుండా చూస్తారని అనుకో నే లోపే తుపాను గండం వచ్చి పడింది. అదే కను క జరిగితే రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి. – చిట్టీడి వెంకట సత్యనారాయణ, వరి రైతు, పెరవలి తుపాను వస్తే పంట దక్కదు తుపాను ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో, ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు వరి పైరు నేలనంటింది. ఇప్పుడు తుపాను అంటున్నారు. అదే కనుక జరిగితే పంట దక్కదు. – పిల్లా శ్రీనివాస్, వరి రైతు, కొత్తపల్లి అగ్రహారం, పెరవలి మండలం ఆది నుంచీ ఇబ్బందులే.. ఈ ఏడాది ఖరీఫ్ సాగులో నాట్ల దశ నుంచే ఇబ్బందులు పడు తున్నాం, వర్షాలకు నారు రెండు సార్లు పోయింది. డెల్టాలో వరి కోతలు నవంబర్ నెలలో ప్రారంభమవుతా యి. ఇప్పుడు తుపాను అంటున్నారు. ఈ పరి స్థితుల్లో ఖరీఫ్ పంట దక్కుతుందనే నమ్మకం రైతులకు లేదు. పెట్టుబడి అంతా వృథా. – అధికారి పల్లపురాజు, రైతు, కానూరు అగ్రహారం, పెరవలి మండలం ● -
చెరువులో వృద్ధురాలి మృతదేహం
సీతానగరం: ఏం కష్టం వచ్చిందో.. ఏమిటో ఓ పండుటాకు చెరువులో నిర్జీవమై కనిపించింది. మండలంలోని కాటవరానికి చెందిన తెలగారెడ్డి నాగమణి (96) వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం చెరువులో ఆమె మృతదేహం కనిపించింది. ఆమె మనవడు, మనవడి భార్య బండారు బ్రహ్మం, అరుణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మతిస్తిమితం లేని వృద్ధురాలు నాగమణి ఎవరికీ చెప్పకుండా ఈ నెల 19న ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తమ బంధువులను ఆరా తీసినా.. ఆమె ఆచూకీ దొరకలేదు. దీనిపై ఈ నెల 20న స్థానిక పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. కాటవరంలోని మొండి పుంత చెరువులో సాయంత్రం 5 గంటలకు ఆమె మృతదేహం ఉన్నట్టు స్థానికుల ద్వారా తెలిసింది. అది నాగమణి మృతదేహంగా కుంటుంబ సభ్యులు గుర్తించారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రాంకుమార్ తెలిపారు. -
పేద కుటుంబంలో చిమ్మిన విషాదం
● ట్రాక్టర్ ఢీకొని తల్లి మృతి ● కుమారుడి పరిస్థితి విషమం ● కూలీ పనులకు వెళ్లొస్తుండగా ప్రమాదం గండేపల్లి/జగ్గంపేట: రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద కుటుంబంపై ట్రాక్టర్ రూపంలో పెనుకష్టం వచ్చి పడింది. కూలీ పనులే జీవనాధారంగా బతుకుతున్న ఆ కుటుంబంలో ఒకరిని మృత్యువు బలిగొనగా.. మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో తల్లి మృతి చెందగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుర్రప్పాలెం పంచాయతీ పరిధిలోని సగరపేటకు చెందిన తల్లీకొడుకులు నక్కా చిట్టమ్మ(40), బాపిరాజు ఆదివారం మోటార్ సైకిల్పై జగ్గంపేట కూలీ పనులకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా.. సగరపేట సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. బంధువులు, స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం గండేపల్లి మండలం జెడ్.రాగంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిట్టమ్మ మరణించినట్టు ధ్రువీకరించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాపిరాజును మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎసై టి.రఘునాథరావు తెలిపారు. రెక్కాడితే కానీ.. పేద కుటుంబం కావడంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. మృతురాలు చిట్టమ్మ, భర్త వెంకన్న, పెద్ద కొడుకు పురుషోత్తం, చిన్న కొడుకు బాపిరాజు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం కూలీ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతురాలి తలకు తీవ్ర గాయమై, కొంత భాగం ట్రాక్టర్ ట్రక్కుకు అంటుకున్నట్టు చెప్పారు. గ్రామంలో జన సంచారం ఉండే ప్రాంతంలో ట్రాక్టర్ను డ్రైవర్ అజాగ్రత్తగా, వేగంగా నడిపి ప్రమాదానికి కారణమయ్యాడన్నారు. ఇటువంటి వాటిపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మోంథా తుపాను ఎఫెక్ట్: కాకినాడ తీరానికి ఉప్పెన ముప్పు
సాక్షి, విశాఖపట్నం: మోంథా తీవ్ర తుపాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని.. విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో అలలు సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తున ఎసిగిపడనున్నాయని.. తీవ్ర తుపానుగానే తీరం దాటుతుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. గడిచిన 6 గంటల్లో గంటకు 6 గంటల వేగంతో వాయుగుండం కదులుతోంది. తీరంలో గాలుల ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 35 నుంచి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.సఖినేటిపల్లి-నర్సాపురం రాకపోకలు నిలిపివేతఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సఖినేటిపల్లి మండలం మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో సఖినేటిపల్లి -నర్సాపురం రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ రోజు నుండి తుపాను ఉధృతి తగ్గే వరకు రేవులో రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.తీర ప్రాంతాల్లో అలర్ట్..మొంథా తుపాన్ నేపథ్యంలో తీర ప్రాంతాలను కృష్ణా జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. మచిపలీట్నంలోని మంగినపూడి బీచ్, కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద హంసల దీవి బీచ్లను మూసివేశారు. మంగినపూడి బీచ్లో జిల్లా కలెక్టర్ డికే.బాలాజీ, మత్స్యశాఖ అధికారులు పర్యటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. సందర్శకులను బీచ్లోకి రాకుండా పికెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
గుండెల్లో గుబేళ్లు
దేవరపల్లి: పొగాకు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పులు చేసి, శిస్తులు కట్టి సాగు చేసిన పంటకు సరైన ధర రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. లోగ్రేడ్ పొగాకు అమ్ముడుపోక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన కాడికి సరి పెట్టుకుని ఏదో ధరకు అమ్ముకుందామన్నా కొనే నాథుడు దొరకడం లేదు. మార్కెట్లో లోగ్రేడు పొగాకు అమ్ముడు పోక అధికారులు, రైతులు అయోమయంలో పడ్డారు. దాదాపు 20 రోజుల నుంచి వేలం కేంద్రాల్లో ఈ పొగాకు అమ్మకాలు జరుగుతున్నాయి. బ్రైట్, మీడియం గ్రేడు పొగాకును కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు.. లోగ్రేడు పొగాకు కొనుగోలుకు ససేమిరా అంటున్నారు. తక్కువ ధరకు ఇచ్చినా మా కొద్దు బాబోయ్ అని ట్రేడర్లు చేతులెత్తేయడంతో మార్కెట్లో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. ముగింపు దశకు అమ్మకాలు బొగులు మాడు, సైలెన్, బాడవ భూముల్లో పండించిన లోగ్రేడు పొగాకు రైతుల ఇళ్ల వద్ద ఎక్కడకక్కడే ఉండిపోయింది. 2024–25 పంట కాలంలో పండించిన పొగాకు అమ్మకాలు ముగింపు దశకు చేరుకున్నాయి. బోర్డు పరిమితి మేరకు పండించిన పొగాకు అమ్మకాలు పూర్తి కాగా, అదనంగా పండిన పంటను రైతులు వేలం కేంద్రాల్లో అమ్ముకుంటున్నారు. అదనపు పొగాకు అమ్మకాలు కూడా ముగింపు దశకు చేరుకోగా, లోగ్రేడు పొగాకు అమ్మకాలు పెద్ద సమస్యగా మారాయి. మొన్నటి వరకూ లోగ్రేడు కిలో ధర రూ.80 పలకగా, కొనుగోలు దారులు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం రూ.59 నుంచి 60కి పడిపోయింది. అంటే కిలోకు సుమారు రూ.20 పతనమైనప్పటికీ కోనుగోలుదారులు నిరాకరిస్తున్నారు. చిన్న కంపెనీలు కూడా దీన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. అధికారుల సన్నాహాలు దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో ఈ నెలాఖరుకు పొగాకు వేలం ప్రక్రియను ముగించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్తర తేలిక నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో దాదాపు 84 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యింది. దీనిలో 4 మిలియన్ల కిలోలు లోగ్రేడు పొగాకు ఉత్పత్తి జరిగినట్టు అధికారులు లెక్కలు వేశారు. ఒక్కొక్క వేలం కేంద్రంలో 5 నుంచి 7 లక్షల కిలోల లోగ్రేడు పొగాకు ఉత్పత్తి అయినట్టు సమాచారం. గత రెండేళ్లుగా లోగ్రేడుకు మంచి ధర లభించింది. కిలో రూ.120 నుంచి రూ.170 వరకూ పలికింది. లోగ్రేడు పొగాకు అమ్మకాలు పూర్తయితే రైతుల వద్ద గల సూర కొనుగోళ్లు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు, మూడు రోజులు సూర పొగాకు కొనుగోళ్లు ఉంటాయని చెబుతున్నారు. అమ్ముడుపోని లోగ్రేడు పొగాకు బేళ్లు ఆందోళనలో రైతులు అయోమయంలో అధికారులు ధర తగ్గించినా ముందుకు రాని ట్రేడర్లు 4 మిలియన్ల లోగ్రేడు ఉత్పత్తి -
వచ్చే నెలలో అథ్లెటిక్స్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజీయెట్ అథ్లెటిక్స్ మెన్ అండ్ ఉమెన్ చాంపియన్ షిప్ పోటీలు నవంబర్ 10, 11వ తేదీల్లో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో జరుగుతాయని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను శనివారం విడుదల చేశారు. ఈ అథ్లెటిక్స్లో 26 రకాల క్రీడా పోటీలు ఉంటాయని, అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందికి సూచనలిచ్చారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి, అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ ఎంవీఎస్ఎన్ మూర్తి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్రరావు, ఆర్గనైజింగ్ మెంబర్లు ఎం.ప్రసాద్, పీవీవీ లక్ష్మి, టి.విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు. -
కంపెనీలు కొనడం లేదు
లోగ్రేడు పొగాకును కొనుగోలు చేయడానికి కంపెనీలు ముందుకు రావడం లేదు. కనిష్ట ధర కిలో రూ.60 ఉన్నా అమ్మకాలు లేవు. దేవరపల్లి వేలం కేంద్రంలో 11.5 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 12.8 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. దీనిలో 4 లక్షల కిలోల లోగ్రేడు ఉత్పత్తి అయ్యింది. బొగులు మాడు, సైలెన్ పొగాకు అమ్ముడు పోవడం లేదు. వేలానికి వచ్చన బేళ్లలో 50 శాతం కొనుగోలు జరగడం లేదు. – సీహెచ్ హేమస్మిత, వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి -
నాలుగు బస్సుల సీజ్
రాజానగరం: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో దివాన్ చెరువులో శనివారం నిర్వహించిన తనిఖీలో రెండు బస్సులను సీజ్ చేశారు. ఇదే విధంగా శుక్రవారం రాత్రి చేసిన తనిఖీలో మరో రెండు బస్సులను సీజ్ చేశామని రాజమహేంద్రవరం మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ శనివారం విలేకరులకు తెలిపారు. ఇంత వరకూ చేసిన తనిఖీలలో 17 కేసులు నమోదు చేసి, రూ.1,40,450 చలానాల ద్వారా వసూలు చేశామన్నారు. ఇక నుంచి ప్రతి వారంలో రెండు రోజులు తనిఖీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎం.రవికుమార్, సీహెచ్వీ రమణ, సహాయకులు చైతన్య సుమ, వీవీడీ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
నిడదవోలు రూరల్: పోలీసునని చెప్పి బెదిరించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకుంటున్న అంతర్ జిల్లా దొంగను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ నిడదవోలు మండలం శంకరాపురంలో ఈ నెల 6న కోలా నాగేశ్వరరావుకు చెందిన బంగారు ఉంగరం, 22న కాయల మంగకు చెందిన బంగారపు బొందును ఓ వ్యక్తి చోరీ చేశాడు. వీరిని బెదిరించి బంగారం దోచుకుపోయాడు. ఈ ఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయగా, విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఆదిరెడ్డి అప్పారావును నిందితుడిగా గుర్తించామని ఎస్సై తెలిపారు. గోపవరం వద్ద అప్పారావును అరెస్ట్ చేసి మూడు బంగారు ఉంగరాలు, రెండు కాసుల బొందు, కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడిపై వివిధ జిల్లాల్లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 పాత కేసులు ఉన్నాయని చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్సై బాలాజీ సుందరరావు, ట్రైనీ ఎస్సై జె.కల్పన, పోలీసులు జి.రామారావు, రాంబాబు, ధనుంజయ్లను ఎస్పీ డి.నరసింహకిశోర్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ అభినందించారు. -
అన్నప్రసాద పథకానికి రూ.88 వేల విరాళం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళా లు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం రామచంద్రపురం గ్రామానికి చెందిన కంటిపూడి సాయిరామ్చౌదరి – పుష్పావతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.50,116, రావులపాలేనికి చెందిన కూసుమంచి గంగాధరరావు, కామేశ్వ రి కావేరిలు రూ.38,116 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: కార్తిక మాసంలో తొలి శనివారం సందర్భంగా అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. తెల్లవారుజామునే కోనేరులో భక్తులు కార్తిక దీపాలు వదిలారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లో దాదాపు రెండు గంటల పాట నిలబడి స్వామిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. సుమారు వంద మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాతల ఆర్థిక సాయంతో 12 వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో అన్నసమారాధన, ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామన్నారు. తిరుపతికి పోటెత్తిన భక్తులు పెద్దాపురం(సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువైన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. కార్తిక మాసం కావడంతో జిల్లా నలుమూలల నుంచీ అనేక మంది కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. సుమారు 18 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,51,570, అన్నదాన విరాళాలకు రూ.67,918, కేశ ఖండన ద్వారా రూ.2,360 తులాభారం ద్వారా రూ.250, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.12,735లతో మొత్తం రూ.2,34,833 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశామన్నారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు.కమీషన్ పెంచకపోతే షాపులు మూసేస్తాం అమలాపురం టౌన్: ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన మద్యం షాపులకు మొదట్లో గెజిట్లో పేర్కొన్నట్లు 20 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని జిల్లాలోని మద్యం షాపుల యజమానులు డిమాండ్ చేశారు. తమకు 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే వ్యాపారాలు చేయలేమని వారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అమలాపురం బ్యాంక్ స్ట్రీట్లో డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయం ఎదురుగా ఉన్న మిడ్ టౌన్ అపార్ట్మెంట్స్లో మద్యం షాపుల యజమానులు శనివారం సమావేశమయ్యారు. తమకు కమీషన్ పెంచకపోతే షాపులను మూసివేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 13.5 శాతం కమీషన్ ఎంత మాత్రం సరిపోవడం లేదని తెగేసి చెప్పారు. జిల్లా వైన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అత్యవర సమావేశానికి దాదాపు 150 మంది మద్యం షాపుల యజమానులు పాల్గొని ప్రభుత్వానికి తమ అసహనాన్ని, నిరసనను తెలియజేశారు. 2024–26 మద్యం పాటదారులైన లైసెన్స్ షాపుల యజమానులు మూకుమ్మడిగా తమ గళాన్ని అటు జిల్లా ఎకై ్సజ్ అధికారులకు, ఇటు ప్రభుత్వానికి వినిపించారు. అలాగే గెజిట్లో లేని పర్మిట్ రూమ్ల కోసం వసూలు చేస్తున్న రూ.7.5 లక్షలను వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రానున్న 15 రోజుల్లో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులను మూసివేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ అధికారులకు జిల్లా వైన్ షాపుల అసోసియేషన్ తరఫున వినతిపత్రం అందించారు. సమావేశంలో జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు, మద్యం షాపుల లైసెన్స్దారులు తాడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు ● పెద్దాపురంలో జిల్లా మహాసభలు ప్రారంభం పెద్దాపురం (సామర్లకోట): కేంద్రం, రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజిన్ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. పెద్దాపురంలో శనివారం ప్రారంభమైన సీఐటీయూ జిల్లా మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు యాసలపు సూర్యారావు భవనంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ జెండాను ఆవిష్కరించారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి, అమర వీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు దోచిపెడుతున్నాయని, అంతర్జాతీయంగా చమురు రేట్లు తగ్గినప్పటికీ దేశంలో పెట్రోలు, డిజిల్, గ్యాస్ ధరలు పెరగడంతో ప్రజలపై భారం విపరీతంగా పడిందన్నారు. కార్పొరేట్ సంస్థల లాభాలపై పన్ను రేటును 33 నుంచి 20 శాతానికి తగ్గించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందన్నారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మాట్లాడుతూ దేశంలో పోర్టులు, ఎయిర్ పోర్టులను అదానీకి మోదీ అప్పగించారన్నారు. మహాసభలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగన్ ప్రభుత్వంలోనే డేటా సెంటర్కు ఒప్పందం
రాజమహేంద్రవరం సిటీ: జగన్ ప్రభుత్వంలోనే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం కుదిరిందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పార్టీ నగర అధ్యక్షుడు మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్కు మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లు అదానీ పేరు చెప్పకుండా, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకువచ్చామని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. బాబుకు ప్రచార పిచ్చి భరత్రామ్ మాట్లాడుతూ చంద్రబాబు తన మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి 1995లో ముఖ్యమంత్రి అయ్యారని, సత్య నాదేళ్ల మైక్రోసాఫ్ట్లో 1992లో చేరారన్నారు. కానీ చంద్రబాబు తానే హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తీసుకువచ్చానని చెబుతున్నారన్నారు. సుందర్ పిచాయ్ గూగుల్ డేటా సెంచర్ గురించి ప్రధానితో మాట్లాడానని చెబితే, అది కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఆదానీ కంపెనీ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు పునాదులు పడ్డాయన్నారు. సబ్ సీ కేబుల్ ఏర్పాటుకు సింగపూర్ ప్రభుత్వంతో ఆ రోజే చర్చించడం జరిగిందన్నారు. ఆదానీ, ఎయిర్ టెల్, గూగుల్ సంయుక్తంగా డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు సుందర్ పిచాయ్ చెప్పారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులకు వేధింపులు కర్నూలు వద్ద దహనమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు ఏడాదిన్నరగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదని, సుమారు 16 చలాన్లు ఉన్నాయని రికార్డులు చెబుతున్నాయని భరత్ అన్నారు. రాజమహేంద్రవరం హాస్టల్లో పదో తరగతి చదువుతున్న బాలికను దీపావళి రోజున హాస్టల్ నుంచి తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు లైంగికంగా లోబర్చుకుంటే పోలీసులు కంటితుడుపు చర్యలతో సరిపెట్టారన్నారు. బాధితురాలికి న్యాయం జరగాలని ధర్నా చేసిన తమపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపిన వైఎస్సార్ సీపీ నాయకురాలు అనూ యాదవ్ను అరెస్టు చేసి, మూడు గంటల పాటు నిర్బంధించారన్నారు. 41 ఏ నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలకు ఏరులై పారుతున్న మద్యమే కారణమని, 24 గంటలూ ఆ దుకాణాలు తెరిచే ఉంటున్నాయని భరత్రామ్ అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్న పేకాట క్లబ్లపై డిప్యూటీ సీఎం వపన్ కల్యాణ్ విచారణకు ఆదేశిస్తే, డిప్యూటీ స్పీకర్.. గోదావరి జిల్లాల్లో పేకాట సహజం అని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాజమహేంద్రవరంలో పేకాట క్లబ్బులు ఇసుక, మద్యం, భూ సెటిల్మెంట్లు, స్పా సెంటర్లు అన్నీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు అండదండలతో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న చేపట్టనున్న ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ నాయకులతో కలిసి భరత్ రామ్ ఆవిష్కరించారు. సబ్ సీకేబుల్ ఏర్పాటుకు సింగపూర్తో చర్చలు ఆ విషయాన్ని ప్రస్తావించని చంద్రబాబు, లోకేష్ అంతా తామే చేశామంటూ అబద్ధపు ప్రచారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిద్దాం విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ భరత్రామ్ -
కుక్కపిల్లకు గండం గడిచింది
● సూదిని మింగేసిన వైనం ● రెండు గంటలు సర్జరీ చేసిన పశువైద్యులు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): దారంతో ఉన్న సూదిని మింగేసిన కుక్కపిల్లకు పశు వైద్యులు ప్రాణం పోశారు. దాదాపు రెండు గంటల పాటు సర్జరీ చేసి సూదిని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామానికి చెందిన గాజుల వెంకటేశ్వరరావు ఇంట్లో ఎనిమిది నెలల సిజ్జు జాతి కుక్కపిల్ల ఉంది. అది శుక్రవారం రాత్రి చేతి కుట్లు వేసే సూదిని దారంతో కలిపి మింగేసింది. దీంతో యజమాని ఆ కుక్కపిల్లను శనివారం రాజమహేంద్రవరం ఏరియా పశువైద్యశాలకు తీసుకువచ్చారు. ప్రభుత్వ పశువైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ కల్లూరి సత్యనారాయణ, వైద్యుడు డాక్టర్ రాజశేఖర్ రెండు గంటల పాటు సర్జరీ చేసి దారంతో ఉన్న సూది తొలగించారు. ప్రస్తుతం కుక్కపిల్ల ఆరోగ్యంగా ఉంది. -
అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం
● క్లస్టర్ అభివృద్ధి, పారిశ్రామిక రాయితీలపై దృష్టి ● అధికారులతో కలెక్టర్ కీర్తి రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమలను స్థాపించే దిశగా అధికారులు ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లకు వ్యవసాయ, ఉద్యానవన శాఖలు, డెయిరీ, పాల ఉత్పత్తుల పరిశ్రమలకు పశుసంవర్ధక శాఖ, చేపల సీడ్స్, ఫీడ్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు మత్స్యశాఖ ప్రోత్సాహక చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం కింద రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో రూ.15 కోట్ల అంచనాతో ఫర్నిచర్ క్లస్టర్ ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేసి, ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రాజానగరం మండలం కలవచర్లలోని ఎంఎస్ఎంఈ పార్కులో గ్రాఫైట్, బంకమట్టితో క్రూసిబుల్స్ తయారీ పరిశ్రమతో పాటు సిరామిక్ క్లస్టర్ ఏర్పాటు కోసం అవసరమైన భూమిని ఏపీఐఐసీ ద్వారా కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా గత జూలై నుంచి అక్టోబర్ వరకు వివిధ శాఖల పరిధిలో 3,246 దరఖాస్తులు రాగా, వాటిలో 3,174 దరఖాస్తులను ఆమోదించామని, 71 పెండింగ్లో ఉండగా, ఒక్క దరఖాస్తును తిరస్కరించినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం అల్యూమినియం వర్కర్స్ కాలనీలో అల్యూమినియం సర్కిల్స్, పాత్రల తయారీ కోసం గోదావరి రోలింగ్స్ అసోసియేషన్ క్లస్టర్ ఏర్పాటు చేసుకోవటానికి కమిటీ అనుమతి మంజూరు చేసిందన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి వి.రామన్, ఏపీ ఈఈసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ బి.పద్మజా దేవి, డీఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ఎస్ మూర్తి, జిల్లా పంచాయతీ అధికారి శాంతామణి తదితరులు పాల్గొన్నారు. -
AP: కాకినాడ వైపు దూసుకొస్తున్న మోంథా తుపాను
ప.గో, కృష్ణా జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలుఒక్కో జిల్లాకు 30 మంది సిబ్బందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్రేపటి నుంచి 3 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ప్రకటించిన కలెక్టర్తుపాను నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు విజయవాడ: మోంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశంవాతావరణ హెచ్చరికల నేపధ్యంలో రేపట్నుంచి కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు27,28,29 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన రెండు జిల్లాల కలెక్టర్లుజిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు ఇళ్లకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలుకలెక్టర్ల ఆదేశాల మేరకు కృష్ణా,ఎన్టీఆర్ జిల్లాల్లోని హాస్టల్స్ నుంచి ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్ధులువిద్యార్ధులను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులుగుంటూరు: కలెక్టర్ కార్యాలయంలో మోంథా తుఫాన్ దృష్ట్యా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రత్యేక అధికారి సిసోడియా,జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాస్పెషల్ ఆఫీసర్ సిసోడియా కామెంట్స్రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిఅధికారులను అప్రమత్తం చేసాంలోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసాంప్రభుత్వ పాఠశాల ల్లో 16 పునరావాస కేంద్రాల్లో అధికారులు వుంటారుతుఫాన్ కి ఎక్కువ నష్టం జరగకుండా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాంజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా కామెంట్స్27,28,29 తేదీలలో భారీ వర్షం ఈదురుగాలులు ఉంటాయిగుంటూరు జిల్లాలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు18 మండలాల్లో అధికారులు దగ్గరనుండి పర్యవేక్షణ చేస్తున్నారుప్రజల కోసం కంట్రోల్ నెంబర్ కూడా ఏర్పాటు చేసాంవ్యవసాయ రంగానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలిరూరల్ ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాంఅత్యాసవసర పరిస్థితి ఉంటేనే ప్రజలు బయటకు రావాలికాలేజీ స్కూల్స్ అంగన్ వాడి కేంద్రాలు 3 రోజులు సెలవలు ప్రకటించాంప్రజలకు సమస్య ఉంటే తప్పకుండా కాల్ సెంటర్ కి కాల్ చేయండినగరంలో 12 లోతట్టు ప్రాంతాల ను తెలుసుకున్నాంప్రధానంగా ఉన్న పీకల వాగు పొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఏలూరు జిల్లా:ఏలూరు జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావం..ఈనెల27, 28న జిల్లాలో తీవ్రమైన గాలులు, భారీ వర్షాలు ఉండే అవకాశంజిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు 27, 28 తేదీలలో సెలవువాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసిన జిల్లా అధికారులుగోదావరి నదిలోనికి పర్యాటక లాంచీలను నిలిపివేతజిల్లా, అన్ని మండలాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుఏలూరు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9491041419, టోల్ ఫ్రీ నెంబర్ 18002331077ప్రజలకు అందుబాటులో గ్రామానికి ఒక నోడల్ అధికారి*తుఫాన్ తీవ్రతపై జిల్లా ఎస్పీతో కలిసి అధికారులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విపశ్చిమ గోదావరి జిల్లామోంథా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందస్తు విస్తృత ఏర్పాట్లు.జిల్లా కలెక్టరేట్ తో పాటు ఆర్డీవో కార్యాల యాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు..జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్.. 08816 299219,భీమవరం ఆర్డీవో కార్యాలయంలో .. 98484 13739, 87907 31315,నరసాపురం ఆర్టీవో కార్యాలయంలో 93911 85874,తాడేపల్లి గూడెం ఆర్డీవో కార్యాలయంలో 93817 01036, 98497 12358కాకినాడ:మోంథా తుపాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవు ప్రకటించిన కలెక్టర్ాకాకినాడలో 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటుకాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేతకాకినాడలో బీచ్లు మూసివేత విశాఖ:విశాఖ జిల్లాలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవుసోమ, మంగళవారాలు స్కూళ్లకు సెలవుబాపట్లమోంథా తుపాన్ నేపథ్యంలో స్కూళ్లకు సెలవులురేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవు ప్రకటించిన కలెక్టర్తుపాన్ ాకారణంగా బాపట్ల జిల్లాలోని బీచ్లు మూసివేతయాత్రికులు, భక్తులు బీచ్లకు రావొద్దని పోలీసుల హెచ్చరికలువిశాఖ:మోంథా తుపాన్ నేపథ్యంలో రైల్వే జోన్ హై అలెర్ట్రైల్వే వంతెనలు, పట్టాలు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థపై నిఘాఅత్యవసర సేవల కోసం రైళ్లు ిసిద్ధం చేసిన అధికారులుట్రాక్, సిగ్నలింగ్, విద్యుత్ పునరుద్ధరణ కోసం ప్రత్యేక బృందాలువిశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుతుపాను పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్న వాల్తేరు డీఆర్ఎమ్ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. తీవ్రవాయుగుండంగా కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కి.మీ వేగంతో వాయుగుండం కదిలింది. రాబోయే 24 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉందని.. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 610 కి.మీ, చెన్నైకి 790 కి.మీ, విశాఖపట్నంకి 850 కి.మీ, కాకినాడకి 840 కి.మీ, గోపాల్పూర్ కి 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని.. రేపు, ఎల్లుండి(సోమ, మంగళ కోస్తాంధ్రలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.మోంథా తుఫాన్.. కాకినాడ వైపు దూసుకొస్తోంది. అప్రమత్తమైన అధికారులు.. తుపాన్ను ఎదుర్కోనేందుకు సన్నద్ధమయ్యారు. కాకినాడ- ఉప్పాడ రోడ్డులో ఈనెల 30 వరకు రాకపోకలు నిలిపివేశారు. వాకలపూడి బీచ్, ఎన్టీఆర్ బీచ్ మూసివేశారు. హోప్ ఐలాండ్లో నివాసం ఉంటున్న మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు. సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అధికారులు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. తుపాను సహయక చర్యల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.అల్లూరి సీతారామరాజు జిల్లా: తుపాను ప్రభావంతో పాపికొండల విహార యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాగులు వద్దకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూయించివేసిన పోలీసులు.. సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు.విజయవాడ: భారీవర్షాల నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఈనెల 27, 28, 29వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 27, 28 ,29వ తేదీల్లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్ లోని విద్యార్ధులు రేపు సాయంత్రంలోగా (ఈనెల 26) ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులకు జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో ఇద్దరిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఐదో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిశోర్, సీఐ శివగణేష్ వెల్లడించారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థిని దీపావళి సామగ్రి కొనడానికి బయటకు వెళ్లింది. ఆ బాలికకు ముందుగా పరిచయం ఉన్న పాము అజయ్, అతని స్నేహితుడు కాగితపల్లి సత్యస్వామి అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడి తాము కూడా దీపావళి సామగ్రి కొనటానికి వెళ్తున్నట్లు మాయమాటలు చెప్పి మోటారు సైకిల్పై ఎక్కించుకున్నారు. ఆల్కాట్ గార్డెన్స్ రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీగురు రెసిడెన్సీకి ఆమెను తీసుకెళ్లి, ఇందులో సత్యస్వామి లాడ్జి కింద ఉండగా, అజయ్ లాడ్జి రూమ్లోకి తీసుకెళ్లి ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలికను వసతి గృహం వద్ద వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలి ప్రవర్తన గమనించిన వసతి గృహ నిర్వాహకురాలు, జరిగిన విషయం తెలుసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం నిందితుల కోసం గాలించింది. ఆల్కాట్ గార్డెన్స్ రైల్వే పార్సిల్ ఆఫీస్ ఎదురుగా నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న టూ టౌన్ సీఐ శివగణేష్, ఎస్సై శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుల్ భానుమూర్తి, కానిస్టేబుల్స్ షేక్ రబ్బానీ, మహేష్ కుమార్, నాగబాబు, బాలసుబ్రహ్మణ్యంలను ఎస్పీ డి.నరసింహకిశోర్ ప్రత్యేకంగా అభినందించారు. -
వేధిస్తున్నారు
‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకతను ప్రచురిస్తున్నందుకు ఎడిటర్తో పాటు విలేకర్లపై అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచురిస్తే సంబంధిత శాఖ అధికారులు వివరణ ఇవ్వాలి. అంతే కానీ ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో పత్రిక ఎడిటర్ను, విలేకర్లను వేధించడం సరికాదు. – తోట నరసింహం, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ కక్ష సాధింపు తగదు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వానికి తగదు. ఆ పత్రిక విలేకర్లపై అక్రమ కేసులు నమోదు చేయడం ఖండనీయం. ప్రతిపక్షంపై బాబు వైఖరి, మీడియాతో వ్యవహరిస్తున్న తీరు సమర్థనీయం కాదు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న ‘సాక్షి’ మీడియాను అణచి వేయడం ఆమోదం యోగ్యం కాదు. ఇలాంటి అరాచక పాలనకు బాబు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – గొల్లపల్లి సూర్యారావు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ -
అవిశ్రాంత సేవకులు
● సహచరులకు భరోసాగా విశ్రాంత ఉద్యోగ సంఘం ● ‘మనం– మనకోసం’ పేరుతో అండగా.. నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): వారంతా విశ్రాంత ఉద్యోగులు.. ఓ సదుద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రెక్కలొచ్చిన కన్నబిడ్డలు ఉద్యోగాల పేరుతో దేశ విదేశాల్లో ఉండగా తమ సంఘ సభ్యులే కుటుంబీకులుగా సేవలందిస్తున్నారు. 1975లో ఐఏఎస్లు ఇ.వివేకానందమూర్తి, మొహిబుల్లా షరీఫ్, ఆదికేశవ నాయుడు కలసి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘాన్ని స్థాపించారు. తర్వాత సంఘ నాయకులు ఇస్మాయిల్, వడ్డమాని రామకృష్ణారావు, సలీముద్దీన్, ఎ.కనకారావు, అల్హజ్, కె.దుర్రాని బాధ్యత తీసుకున్నారు. వీరి హయాంలో కాకినాడ టౌన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూనిట్లుగా సంఘ కార్యకలాపాలు సాగేవి. అప్పటి రాష్ట్ర సంఘం ఆదేశాలతో కాకినాడ యూనిట్ తూర్పుగోదావరిగా పేరు మార్చుకుని సంఘ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2013లో జిల్లా అధ్యక్షుడిగా పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్యదర్శి ఎస్.ఇబ్రహీం, కోశాధికారి ఎన్.వెంకటరావుతో కలసి సంఘాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కె.పద్మనాభం అధ్యక్షుడిగా, టి.నూకరాజు సాధారణ కార్యదర్శిగా, వి.శేషగిరి కోశాధికారిగా కొనసాగుతున్నారు. జిల్లాలు విడిపోవడంతో ప్రస్తుతం కాకినాడ జిల్లా శాఖకు కాకినాడ, టౌన్ పోలీస్, ఏపీఎస్పీ పోలీస్, కరప, తాళ్లరేవు, పిఠాపురం, ప్రత్తిపాడు, ఎకై ్సజ్ ఫారెస్టు, రెవెన్యూ, ఏలేశ్వరం యూనిట్లు ఉన్నాయి. సంఘంలో ప్రస్తుతం నాలుగు వేల మంది సభ్యులకు పైబడి ఉన్నారు. సంఘానికి భవన నిర్మాణం కాకినాడలో శిథిలమైన సంఘ భవనం స్థానంలో కొత్త భవనాన్ని 2007లో అప్పటి కలెక్టర్ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ ఇచ్చిన రూ.10 లక్షలతో నిర్మించారు. కొత్త భవనంపై అంతస్తుకు మాజీ ఎంపీ పళ్లంరాజు రూ.2.5 లక్షలు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రూ.4 లక్షలు అందించగా, మిగిలినది సభ్యుల నుంచి వడ్డీలేని అప్పుగా తీసుకుని 150 మందికి సరపడా సమావేశ మందిరాన్ని, మూడు విశ్రాంత గదులను ఏర్పాటు చేసుకున్నారు. సేవ చేస్తూ.. అండగా ఉంటూ.. పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి ఆలోచనలతో మనం–మనకోసం అనే సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి నెలా ఐదో తేదీన పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చనిపోయిన సభ్యుల కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కోవిడ్ సమయంతో ప్రభుత్వంతో కలసి సభ్యులందరికీ వ్యాక్సినేషన్ చేయించారు. అవసరమైన సభ్యులకు పెన్షన్ పే స్లిప్ ఇస్తున్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ పండగలు, టీచర్స్ డే, వుమెన్స్ డే, యోగా డేలను నిర్వహిస్తూ సభ్యుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. కాకినాడలో ఈ నెల 26న సంఘ గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించడానికి సిద్ధం చేశారు. వేడుకలకు రండి బోట్క్లబ్: స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలోని పెన్షన్ భవనంలో ఈ నెల 26న ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బ్రాంచ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి స్థానిక పింఛనుదారుల భవనంలో జిల్లా అధ్యక్షుడు కె.పద్మనాభం, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు పీఎస్ఎస్ శాస్త్రిలు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 2026 జనవరి, ఫిబ్రవరిలో సభ్యులకు లైఫ్ సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. వేడుకలకు పింఛనుదారులు కుటుంబ సభ్యులతో హాజరు కావాలని కోరారు. జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి టి.నూకరాజు, రాష్ట్ర సంఘం కార్యదర్శి షేక్ ఇబ్రహీం, అసోసియేషన్ల ప్రెసిడెంట్లు ఎన్.వెంకట్రావు, సరోజిని, జిల్లా సంఘ కోశాధికారి వి.శేషగిరి, రాష్ట్ర కార్యదర్శి షాజిదా పాల్గొన్నారు. గోల్డెన్ జూబ్లీ చేసుకోవడం ఆనందం ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఏర్పడి 50 ఏళ్లు పూర్తి కావడం ఆనందంగా ఉంది. 26న గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకుంటాం. ఈ యాభై ఏళ్లలో సంఘం అనేక కార్యక్రమాలు నిర్వహించడం సంతృప్తి ఇచ్చింది. – కె.పద్మనాభం, ఏపీఆర్జీఈఏ జిల్లా అధ్యక్షుడు ప్రతి కుటుంబానికీ అండ మనం–మనకోసం అనే సంక్షేమ పథకాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక సభ్యత్వం పొందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి సాయం అందిస్తున్నాం. ఇది సభ్యత్వం తీసుకున్న ప్రతి కుటుంబానికి అండగా ఉంటుంది. – సీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు -
మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలి
రాజమహేద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వ అసమర్థ, అరాచక పాలనలో రాష్ట్రంలో మహిళలపై నిత్యం లైంగిక దాడులు జరుగుతున్నాయని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ కో ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని కూటమి ప్రభుత్వం తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని బాలికల సంక్షేమ హాస్టల్ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనను నిరసిస్తూ గురువారం ఆ వసతి గృహం వద్ద ధర్నా నిర్వహించారు. జోరు వానలో సైతం ధర్నా నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై ప్రతి రోజూ లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు. వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వం 24 గంటలూ మద్యం విక్రయించి, తాగిస్తున్నందు వల్లనే మహిళలపై లైంగిక దాడులు పెరిగాయని అన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేతకానితనం వల్ల నియోజకవర్గంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడే ఒక మహిళను ప్రేమ పేరుతో నమ్మించి, మోసగించి, గర్భవతిని చేసి, తర్వాత గర్భంలోని పిండాన్ని చిదిమేశారని భరత్రామ్ మండిపడ్డారు. ఇప్పుడు బాలికల వసతి గృహంలోని విద్యార్థినిని దీపావళి రోజు బయటకు తీసుకువెళ్లి ఓ యువకుడు లైంగికదాడికి ఒడిగట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లోని బాలికలకు రక్షణ లేదన్నారు. ఇదంతా ఎమ్మెల్యే చేతకానితనం వల్లనే జరుగుతోందని భరత్రామ్ ధ్వజమెత్తారు. ధర్నాకు పోలీసులు అభ్యంతరం చెప్పినా.. వైఎస్సార్ సీపీ శ్రేణులు తమ ఆందోళన కొనసాగించాయి. ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ ఫ జోరు వానలో వసతి గృహం వద్ద ధర్నా -
వాన.. హైరానా
సాక్షి, రాజమహేంద్రవరం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, జనజీవనానికి అంతరాయం కలుగుతోంది. భారీ వర్షాలకు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షాలతో అనేకచోట్ల రోడ్లు వాననీటి ప్రవాహంతో కాలువలను తలపించాయి. పలుచోట్ల వాన నీటితో కలసి డ్రైనేజీ నీరు రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కల‘వరి’పాటు రెండు రోజులుగా జోరుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలకు వరి పైరులు నేలనంటుతున్నాయి. కంద, అరటి, తమలపాకు తదితర తోటల్లోకి నీరు చేరింది. ముఖ్యంగా ఖరీఫ్ వరి రైతులను ఈ వర్షాలు కలవరపరుస్తున్నాయి. పంట చేతికొస్తున్న దశలో వర్షాలు కురుస్తూండటంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. పైరు నేలకొరిగితే గింజలు రాలిపోయి నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా 76,104 హెక్టార్లలో రైతులు ఖరీఫ్ వరి సాగు చేపట్టారు. చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు, నల్లజర్ల, నిడదవోలు, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ తదితర మండలాల్లో వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 681 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో వరి పైరు ఈనిక, గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఈ పరిస్థితుల్లో కురుస్తున్న వర్షాలకు కంకులు బరువెక్కి, పైరు నేల వాలిపోతే నష్టం భారీగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టామని, వర్షం ప్రభావంతో పంట తడిస్తే.. ఆశించిన దిగుబడి అందదని ఆవేదన చెందుతున్నారు. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నేటికీ ప్రారంభమైన దాఖలాల్లేవు. దీంతో, కోతలు పూర్తయిన పంటను భద్రపరచుకోలేక, ఒకవేళ అలాగే పెట్టుకుంటే వర్షానికి ఎక్కడ పాడవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేసేది లేక కొంత మంది దళారులకు తక్కువ ధరకే విక్రయించేస్తున్నారు. ఇదే అదునుగా దళారులు, వ్యాపారులు బస్తా ధాన్యానికి ధర రూ.300 వరకూ కోత పెడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం చేతికందే పరిస్థితి ఉండదని రైతులు వాపోతున్నారు. 27న ప్రారంభించేందుకు కసరత్తు ఈ నెల 27వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 221 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తామని తెలిపారు. ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రేడ్–ఎ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించింది. MøÆý‡$-Mö…yýl Ð]l$…yýl-ÌS…ÌZ ˘ వరి కోతలు చేపడుతున్న కూలీలు దేవరపల్లిలో వాన నీటితో కాలువను తలపిస్తున్న బాలదుర్గమ్మ ఆలయం రోడ్డుజిల్లాలో మండలాల వారీగా ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం (హెక్టార్లలో)మండలం వరి సాగు బిక్కవోలు 6,113 రాజమహేంద్రవరం రూరల్ 1,379 నల్లజర్ల 3,850 రాజానగరం 4,261 దేవరపల్లి 3,663 కొవ్వూరు 4,478 అనపర్తి 3,800 సీతానగరం 5,634 చాగల్లు 3,118 కడియం 2,137 నిడదవోలు 6,965 గోకవరం 5,493 పెరవలి 3,242 గోపాలపురం 4,918 ఉండ్రాజవరం 4,820 రంగంపేట 2,728 తాళ్లపూడి 3,738 కోరుకొండ 5,738 ఫ˘ hÌêÏÌZ Ð]l¬Ð]l$ÃÆý‡…V> ఖరీఫ్ వరి కోతలు ఫ˘ D ™èlÆý‡$׿…ÌZ gZÆý‡$V> Ð]lÆ>ÛË$ ఫ˘ ´÷ÌêÌZÏ ^ólÆý‡$™èl$¯]l² ±Æý‡$ ఫ˘ B…§øâýæ¯]lÌZ A¯]l²§é™èlË$ కోతలు ఆపితే మేలు ప్రస్తుత వర్షాలతో ఖరీఫ్ పంటలకు ఎలాంటి ప్రమాదమూ లేదు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు ఇలాగే కురిస్తే కొంత మేర పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కోతలు పూర్తయిన రైతులు ధాన్యం జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. వర్షం తగ్గుముఖం పట్టేంత వరకూ కోతలు ఆపితే మంచిది. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
తెలుగు విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం
రాజమహేంద్రవరం రూరల్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి కృషి చేస్తానని నూతన ఉప కులపతి (వైస్ చాన్సలర్ – వీసీ) ఆచార్య డి.మునిరత్నం నాయుడు అన్నారు. బొమ్మూరులోని విశ్వ విద్యాలయంలో ఆయన వీసీగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని కోర్సులూ వచ్చేలా చూస్తానని చెప్పారు. తమిళ విశ్వ విద్యాలయాన్ని చూసి, మనకు కూడా అటువంటిది ఉండాలనే ఆకాంక్షతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు విశ్వ విద్యాలయం నెలకొల్పారని అన్నారు. హైదరాబాద్లో ప్రధాన కేంద్రం, శ్రీశైలంలో చరిత్ర తదితర అంశాలతో పీఠం, రాజమహేంద్రవరంలో సాహిత్య పీఠం, వరంగల్లో గిరిజన అంశాలకు సంబంధించిన పీఠం పెట్టారని, 1989లోనే సిద్ధేంద్ర కళాక్షేత్రాన్ని తెలుగు విశ్వ విద్యాలయంలో విలీనం చేశారని వివరించారు. వర్సిటీ మొదటి వీసీగా ఉన్న ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతిని ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆచార్య మునిరత్నం నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్లో ప్రధాన కేంద్రం ఉండిపోవడం, ఆస్తుల పంపకం చేయకపోవడంతో తెలుగు విశ్వవిద్యాలయం ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పారు. నిధుల కొరతను అధిగమించి, విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. సాహిత్య పీఠంలో ప్రస్తుతం ఉన్న కోర్సులతో పాటు హైదరాబాద్ ఉన్న అన్ని శాఖలనూ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జోతిషం, చిత్రలేఖనం, పాత్రికేయం తదితర అన్ని కోర్సులూ ఉండేలా చూస్తానని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని తెలుగు సంస్థలతో విశ్వ విద్యాలయం అనుబంధం కలిగి ఉందని, విదేశాల్లోని తెలుగు సంస్థలతో సైతం ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఈ ఒప్పందాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. అమెరికాలో సిలికానాంధ్ర చొరవతో ఏటా 10 వేల మంది తెలుగు చదువుతున్నారని, ఇప్పటికి 1.20 లక్షల మంది చదువుకున్నారని తెలిపారు. మలేషియా, సింగపూర్లో కూడా తెలుగు బోధన నడుస్తోందని చెప్పారు. సంగీత , నృత్య పాఠశాలలన్నీ తెలుగు విశ్వవిద్యాలయ పరిధిలోకి వస్తాయని, తామే పరీక్షలు నిర్వహిస్తామని ఆచార్య మునిరత్నం నాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, తెలుగు విశ్వ విద్యాలయం మౌలిక సదుపాయాల కోసం రూ.50 లక్షలు సమకూరుస్తామని చెప్పారు. సరిహద్దులు తేల్చి, ప్రహరీ నిర్మించాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఫ్రాన్స్కు చెందిన తెలుగు చరిత్రకారుడు డేనియల్ నాదర్స్, శ్రీశైలం ప్రాంగణం పీఠాధిపతి ముసుగు శ్రీనివాసరావు, తెలుగు విశ్వ విద్యాలయం ఓఎస్డీ వి.నిరీక్షణబాబు, ప్రముఖ కవి, కళారత్న బిక్కి కృష్ణ, నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్, విజయ శంకర సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపాల్ పసుమర్తి శ్రీనివాసశర్మ, కూచిపూడి ప్రిన్సిపాల్ చింతా రవిబాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య మునిరత్నం నాయుడును పలువురు సన్మానించి, అభినందనలు తెలిపారు.ఫ హైదరాబాద్లో ఉన్న అన్ని శాఖలూ రప్పిస్తా.. ఫ వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి స్థాయి కోర్సులు ఫ విదేశాల్లోని తెలుగు సంస్థలతో ఒప్పందాలు విస్తృతం ఫ నూతన ఉప కులపతి ఆచార్య మునిరత్నం నాయుడు ఫ బొమ్మూరులోని వర్సిటీలో బాధ్యతల స్వీకరణ -
సేద తీరేందుకు రెడీ
● రత్నగిరిపై రూ.2.5 కోట్లతో విశ్రాంతి షెడ్డు ● నేడు ప్రారంభించనున్న అధికారులు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం వద్ద భక్తులకు విశ్రాంతి షెడ్డును శుక్రవారం ఉదయం ప్రారంభించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ‘లారెస్’ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్లతో ఈ షెడ్డును నిర్మించిన విషయం తెలిసిందే. గత నెల 3న ఈ నిర్మాణ పనులు ప్రారంభం కాగా 50 రోజుల వ్యవధిలోనే నిర్మించారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల కోసం పశ్చిమ రాజగోపురం ముందు ఖాళీ ప్రదేశంలో సుమారు మూడు వేల మంది ఉండేలా సదుపాయాలు కల్పించారు. 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పున నిర్మించిన ఈ షెడ్డు చుట్టూ ఐదు అడుగుల మేర షేడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తమంతా కలిపి సుమారు 10,625 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ షెడ్డులో వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం టిక్కెట్లు విక్రయించేందుకు వీలుగా 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాటి ముందు స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లైన్లు పెట్టారు. ఈ షెడ్డులో మూడు హెలికాఫ్టర్ (హై వాల్యూమ్ స్పీడ్) ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్ల స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా విశ్రాంతి షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. శుక్రవారం ఈ షెడ్డును ప్రారంభిస్తారని ఈఈ రామకృష్ణ తెలిపారు. ‘సాక్షి’ చొరవతో వేగం సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులకు పశ్చిమ రాజగోపురం వద్ద నిలువ నీడ లేని విషయాన్ని పలుమార్లు ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. ఈ షెడ్డు నిర్మించే ఉద్దేశంతో ఈ స్థలంలో ఉన్న సత్యదేవ వీఐపీ సత్రాన్ని 2023లో కూల్చేశారు. అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ కృషి మేరకు 2023 నవంబర్లో లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రతినిధులు పైకప్పు రేకులతో ఉండేలా విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే ఈఓ బదిలీ కావడంతో ఇది ఆలస్యమైంది. దీంతో పశ్చిమ రాజగోపురం వద్ద నీడ లేక భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ‘సాక్షి’ దినపత్రికలో పలుమార్లు కథనాలు వచ్చాయి. స్పందించిన అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ 2024లో లారెస్ ప్రతినిధులతో మాట్లాడి రేకుల షెడ్డుకు బదులు తెల్లని ‘టెన్సిల్’ క్లాత్తో షెడ్డు వేయడానికి నిర్ణయించారు. ఆ తరువాత కూడా ఆలస్యమవడంతో జూలై నాలుగో తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ‘నిలువ నీడేదీ!’ అనే శీర్షికన కథనం రావడతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ షెడ్డు నిర్మాణంపై జరుగుతున్న జాప్యంపై చర్చించి త్వరగా నిర్మించాలని కోరారు. దీంతో గత నెల 3న పనులు ప్రారంభించి షెడ్డు నిర్మాణం పూర్తి చేశారు. -
ఉపాధి హామీ పనుల్లో సాంకేతికత పెరగాలి
సామర్లకోట: ఉపాధి హామీ పనుల్లో సాంకేతికత పెరగాల్సిన అవసరం ఉందని జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ (ఎన్ఐఆర్డీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్ఎస్ఆర్ ప్రసాద్ అన్నారు. గురువారం సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు, అంబేఽడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏ) జూనియర్ ఇంజినీర్లకు మూడు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ప్రణాళికలో సాంకేతిక పరిజ్ఞానం పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా 30 శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తొలి బ్యాచ్ శిక్షణను ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ శిక్షణలో మెలకువలను తెలుసుకోవాలన్నారు. జీఐఎస్, జీపీఎస్, డ్రోన్లకు సంబంధించి సాంకేతిక పద్ధతులపై మూడు రోజుల శిక్షణ ఉంటుందన్నారు. దీనివల్ల పనుల్లో నాణ్యత పెరగడంతో పాటు పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నిర్దేశించిన కూలీ అందుతుందన్నారు. కొంత మంది పనులు చేయకుండా పని చేసిన వారితో సమానంగా కూలీ తీసుకుంటున్న విధానానికి చెక్ పెట్టడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ ఎన్ఎస్కే ప్రసాదరావు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా ఉద్యోగ నిర్వహణలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. చీఫ్ ఇన్స్ట్రక్టర్ డి.శ్రీనివాసరావు, డీడీఓ ఎస్ఎస్ శర్మ, ఉపాఽధి హామీ అధ్యాపకులు సాగర్, మంగాలక్ష్మి, సూర్యావతి శిక్షణ నిర్వహించగా ఫ్యాకల్టీలు నిహారిక, రామకృష్ణ, టీఏలు, జేఈలు హాజరయ్యారు. -
వీడియో వైరల్ బాధ్యులపై కఠిన చర్యలు
తుని రూరల్: బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా, ఇతరేతర మీడియాల్లో వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.చెన్నకేశవరావు హెచ్చరించారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సోషల్ మీడియా అకౌంట్లలో నిక్షిప్తం చేసిన వీడియోలను సాయంత్రం ఐదు గంటల్లోగా తొలగించాలని సూచించారు. సంబంధిత వీడియోలపై సమగ్ర పరిశీలన జరుగుతుందన్నారు. హంసవరం కేంద్రంగా వీడియోలు వైరల్ అవుతున్నాయన్నారు. తమ బృందాలు ఇప్పటికే అటువంటి గ్రూపులు, వ్యక్తులను గుర్తించాయన్నారు. దీనిపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలితో పాటు నిందితుడు తాటిక నారాయణరావు ఉన్న వీడియోలను ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టి ఉంటే తీసివేయాలన్నారు. ఈ వీడియోలతో తమ గౌరవానికి భంగం వాటిల్లుతుందని నిందితుడు నారాయణరావు కుటుంబ సభ్యులు మనస్థాపానికి గురవుతున్నారన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు. బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి రావులపాలెం: స్థానిక హైవేపై ఆర్టీసీ ఇన్గేట్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) తన సొంత పనిపై రావులపాలెం వచ్చింది. పని ముగించుకుని స్వగ్రామం వెళ్లేందుకు హైవేపై బస్టాండ్ ఇన్గేటు వద్ద రోడ్డు దాటుతుంది. ఈ నేపథ్యంలో తణుకు వైపు నుంచి రావులపాలెం బస్టాండ్కు వస్తున్న భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ కోటమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. మృతురాలి మనవడు ఉండవల్లి దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై జి.చంటి కేసు నమోదు చేశారు. 27న నిధి ఆప్కే నికట్ రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి నిధి ఆప్కే నికట్– డిస్ట్రిక్ట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ రాధానాథ్ పట్టానాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు ఈతకోటలో వీవీఎస్ సుబ్బరాజు, ఎన్ఏసీఎల్ కాంట్రాక్టర్లోనూ, కాకినాడ జిల్లాకు ఎ.అన్నవరంలో శ్రీశారదా ఎడ్యుకేషనల్ సొసైటీలో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు అమలాపురం భట్లపాలెంలో బీవీసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో, ఏలూరు జిల్లాకు గుండుగొలను నాగహనుమాన్ సాల్వెంట్స్లో, పశ్చిమగోదావరి జిల్లాకు వేండ్రంలో వెల్కమ్ ఫిషరీస్ లిమిటెడ్లో, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రంపచోడవరంలో గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్లో నిధి ఆప్కే నికట్ డిస్ట్రిక్ట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ జరుగుతుందని వివరించారు. ఈసీఆర్, రిటర్న్పై అవగాహన, కొత్తగా చేరిన ఉద్యోగులకు ఇవాల్సిన ముఖ్య సూచనలు, అడ్వాన్సుల రకాలు, అడ్వాన్సుల దాఖలు చేయడానికి అవసరాలు, పోర్టల్స్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా అడ్వాన్సులను ఎలా దాఖలు చేయాలో, క్లెయిమ్ తిరస్కరణ కారణాలు, దాఖలు చేసినప్పుడు చేసే సాధారణ తప్పులపై అవగాహన కల్పిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్మెంట్లు, కొత్తగా కవర్ చేయబడిన ఎస్టాబ్లిష్మెంట్లు వినియోగించుకోవాలన్నారు. నిధి ఆప్కే నికట్ అని తమ ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. పింఛనుదారులు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఈ క్యాంపును సందర్శించవచ్చని రాధానాథ్ పట్టానాయక్ తెలిపారు. -
ఇసుక అక్రమ వ్యాపారానికి ఇదే సాక్ష్యం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): తప్పుడు బిల్లులతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అడ్డుకున్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమానికి హాజరైన ఆయన తిరిగి వెళ్తూండగా.. స్థానిక ఐఎల్టీడీ రైతుబజార్ వద్ద భారీ ఇసుక లోడుతో వెళుతున్న లారీని ఆపి, బిల్లులు పరిశీలించారు. బిల్లు 25 టన్నుల ఇసుక రవాణాకు ఉండగా, దాదాపు 40 టన్నులు తరలిస్తున్నట్టు గుర్తించారు. అలాగే, నిబంధనలు ప్రకారం ఎటువంటి జాగ్రత్తలూ తీసుకోకపోవడంతో ఆ లారీ నుంచి ఇసుక రోడ్డుపై కారిపోతోంది. దీంతో, వెనుక వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వేణు గుర్తించారు. దీనిపై జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్కు, ఆర్టీఓ సురేష్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఇసుక అక్రమ రవాణాను తక్షణం అడ్డుకోవాలని కోరారు. అనంతరం స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ వ్యాపారానికి ఇదే సాక్ష్యమని అన్నారు. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, మద్యం, రేషన్ బియ్యం దోచేస్తున్నారని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడిగా చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నియోజకవర్గంలోనే ఇసుక దోపిడీ ఈ స్థాయిలో జరుగుతున్నప్పటికీ ఆయన ఉలుకూ పలుకూ లేకుండా ఉండటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దోపీడీదారుల నుంచి అందుతున్న ముడుపులే కారణమని ప్రజలు భావిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ర్యాంపును ఒక్కో కూటమి నాయకుడు పంచుకుని, ఇసుక దోపీడీకి పాల్పడుతున్నట్లుగా ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. ఉచితం పేరుతో గోదావరిలో డ్రెడ్జింగ్ చేసి మరీ ఇసుక తరలించుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 టన్నుల బిల్లుతో 40 టన్నుల ఇసుక రవాణా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమని వేణు అన్నారు. ప్రజలకు చెందాల్సిన వస్తువులను కూటమి నాయకులు దోచుకుపోతూంటే.. కేవలం అరకొర కేసులతో మభ్యపెట్టడానికే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, అక్రమాలను అడ్డుకునేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజలకు సక్రమంగా అందాల్సిన ఇసుక, రేషన్ బియ్యం అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఇకపై నేరుగా పోరాడుతుందని వేణు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల వీర్రాజు (బాబు), డివిజన్ ఇన్చార్జి, పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు చీకురుమిల్లి చిన్న, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి చొల్లంగి సత్యగిరి పాల్గొన్నారు. ·˘ OÐðlGÝëÞÆŠ‡ ïÜï³ hÌêÏ A«§ýlÅ„ýS$yýl$ Ðól׿$ ·˘ ™èl糚yýl$ ¼Ë$ÏÌS™ø వెళ్తున్న ఇసుక లారీ అడ్డగింపు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మరొకరికి గాయాలు కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలైన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తుని మండలం ఎన్ఎస్ వెంకటనగరానికి చెందిన రెగటి దేవుడు (33) కూలి పనుల నిమిత్తం తన బాబాయి యేందుకంద అప్పారావుతో కలసి గురువారం ఉదయం బైక్పై కోటనందూరు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కేఓ అగ్రహారం దాటిన తరువాత బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. దీంతో బైక్ నడుపుతున్న దేవుడు తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. వెనుక కూర్చున్న అప్పారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. వీరిద్దరినీ 108 అంబులెన్స్లో తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే దేవుడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అప్పారావుకు వైద్యం అందిస్తున్నారు. మృతుడి తల్లి రెగటి పాప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తిమ్మాపురం పోలీసుల వివరాల ప్రకారం.. నేమాం గ్రామ ఎల్విన్పేటకు చెందిన గంటా శివరామకృష్ణ (38) లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. తాను పని చేస్తున్న లారీ వద్దకు వెళ్లేందుకు ఏడీబీ రోడ్డులో అచ్చంపేట జంక్షన్ వైపు నుంచి లైట్హౌస్ వైపు బైక్పై పయనమయ్యాడు. మార్గ మధ్యంలో సూర్యారావుపేట పరిధి అదానీ ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి ఢీకొనడంతో శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని 108లో జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు. -
తలపై కత్తి పడి కార్మికుడి మృతి
నల్లజర్ల: పామాయిల్ గెలలను కోస్తుండగా గెడ కత్తి కార్మికుడి తలపై పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లజర్ల ఎస్సై కె.దుర్గాప్రసాద్రావు కథనం ప్రకారం.. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన పేర్ల నాగేశ్వరరావు (35) గురువారం ఉదయం సహచర కూలీలతో కలసి గంటావారిగూడెం రైతు పాకలపాటి సత్యసాయికి చెందిన దూబచర్లలో ఉన్న పామాయిల్ తోటలో గెలలు తీయడానికి వెళ్లాడు. గెడకు కత్తి అమర్చి గెలలు కోస్తుండగా ఆ కత్తి విడిపోయి అతని తలపైనే పడింది. ఈ ఘటనతో నాగేశ్వరరావుకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మ, కొడుకు (12), కుమార్తె (8) ఉన్నారు. ఎస్ఐ కె.దుర్గాప్రసాద్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాణసంచా తయారీ కేసులో వ్యక్తి అరెస్ట్ చాగల్లు: అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న కేసులో ప్రధాన నిందితుడిని గురువారం అరెస్ట్ చేసినట్టు ఎస్సై కె.నరేంద్ర తెలిపారు. ఈ నెల 17న చాగల్లు శివారులో అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేస్తున్న కేంద్రంపై దాడి చేసి ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడైన పండూరి అన్నవరాన్ని గురువారం చాగల్లు శివారులో పట్టుకున్నారు. నిడదవోలు కోర్టులో అన్నవరాన్ని హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై వివరించారు. -
టీచర్లకు టెట్ టెన్షన్
పిటిషన్ వేయాలి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ను జాతీయ ఉపాధ్యాయ సంఘాలు వేశాయి. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విధాన ప్రకటన విడుదల చేయాలి. ఉపాధ్యాయులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. – పి.సురేష్కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ ప్రభుత్వం స్పష్టం చేయాలి టెట్ నిర్వహణపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించాలి. సీనియర్ ఉపాధ్యాయులు టెట్ రాయడం సాధ్యం కాదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో టెట్ నిర్వహించడం సాధ్యం కాదని ఇప్పటికే తెలిపాయి. ఉపాధ్యాయుల తరఫున సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించాలి. – పోతంశెట్టి దొరబాబు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ ● అర్హత ఉండాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ● పదోన్నతులకు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు రాయవరం: ప్రభుత్వ ఉపాధ్యాయులను టెట్ టెన్షన్ పట్టుకుంది. ఐదేళ్లకు పైబడి సర్వీస్ ఉన్న టీచర్లు రెండేళ్లలోపు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో ఉత్తీర్ణులు కాని పక్షంలో ఉద్యోగాన్ని వదులుకోవాల్సిందేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీంకోర్టు గత నెల 1న ఇచ్చిన తీర్పులో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కొనసాగడానికి, పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారు రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలని పేర్కొంది. లేనిపక్షంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఉద్యోగ విరమణకు ఐదేళ్లలోపు సమయం ఉన్న టీచర్లకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, వారు పదోన్నతుల కోసం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఆర్టీఐ–2010 నిబంధనల ప్రకారం టెట్ తప్పనిసరి చేయగా, ఉమ్మడి రాష్ట్రంలో 2012 డీఎస్సీలో ఈ నిబంధన అమలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, మండల/జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. జిల్లాలో 5,400 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. 2010 ముందు చాలా మందికి టెట్ అర్హత లేదు. దాంతో తమకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం, విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది సీనియర్లు దశాబ్దాల తరబడి పాఠశాలల్లో బోఽధిస్తున్నారు. ఇప్పుడు వయసు, ఆరోగ్య సమస్యలు, ఇంటి బాధ్యతల వంటి కారణాలతో మళ్లీ పరీక్షకు సిద్ధమవ్వడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 10 వేల మంది వరకూ టెట్ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. చొరవ చూపాలి ప్రభుత్వ ఉపాధ్యాయుల సేవలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విధానాలు రూపొందించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. టెట్ అర్హతపై సడలింపులు లేదా ప్రత్యామ్నాయ పరిష్కారాలు అవసరమని ఒత్తిడి చేస్తున్నారు. ఎప్పుడో చదువుకున్న ఉపాధ్యాయులకు ఇప్పుడు టెట్ అర్హత చేయడం సరికాదంటున్నారు. గతంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారమే తాము కొనసాగుతున్నామని చెబుతున్నారు. -
వాడపల్లి వెంకన్నకు రూ.1.87 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,87,33,329 ఽఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆలయంలోని హుండీలను 35 రోజుల అనంతరం బుధవారం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో తెరిచి, వసంత మండపంలో లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ 1,41,69,487, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.45,63,842తో కలిపి మొత్తం రూ 1,87,33,329 వచ్చినట్టు ఈవో వివరించారు. వీటితో పాటు 47 గ్రాముల బంగారం, 1.240 కేజీల వెండి, యూఎస్ఏ, కువైట్, సింగపూర్, దుబాయ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా దేశాల కరెన్సీ నోట్లు 25 వచ్చాయన్నారు. పర్యవేక్షణ అధికారులుగా మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు, జిల్లా దేవదాయశాఖ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు, పలివెల గ్రూపు దేవాలయాల గ్రేడ్–2 ఈఓ పీవీవీఎస్ కామేశ్వరరావు పాల్గొన్నారు. 25న సాఫ్ట్బాల్ ఎంపికలుఐ.పోలవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 25న అండర్ 14, 17 విభాగాల్లో సాఫ్ట్బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా తెలిపారు. ఐ.పోలవరం మండలం జి.వేమవరం క్రీడా మైదానంలో బాలికలు, బాలురకు విడివిడిగా ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆ రోజు ఉదయం 9 గంటలలోపు రిపోర్టు చేయాలన్నారు. ఇతర వివరాలకు కోనసీమ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు 93469 20718, ఎన్ఎస్ రమాదేవి 94400 94984 లను సంప్రదించాలన్నారు. -
పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి..
● ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు ● క్యాబిన్లో ఇరుక్కుని యువకుడి మృతి ● కడియపులంకలో ఘటనకడియం: ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. జాతీయ రహదారిపై కడియపులంక వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా గాజువాక మండలం కొత్తపాలెం గ్రామంలోని అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (28) మంగళవారం మధ్యాహ్నం తన కారులో విజయవాడకు వివాహానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా బుధవారం మధ్యాహ్నం కడియపులంక గోకుల్ నర్సరీ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు క్యాబిన్లో ఇరుక్కుపోయిన కిరణ్ కుమార్ మృతి చెందాడు. నేషనల్ హైవే సేఫ్టీ అధికారులు క్రేన్ సహాయంతో లారీ నుంచి కారును లాగి, కిరణ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కిరణ్ కుమార్ తండ్రి నీలకంఠరావు ఫిర్యాదు మేరకు కడియం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు దాసరి నీలకంఠరావు, శాంతి దంపతులకు కిరణ్ కుమార్ ఒక్కడే కుమారుడు. అతడు ఫార్మా సిటీలోని ఫార్మా కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. కిరణ్ కుమార్ మృతి వార్త వినగానే ఆ దంపతులిద్దరూ సొమ్మసిల్లి పడిపోయారు. వివాహానికి వెళ్లిన కుమారుడు ఇలా మృత్యువాత పడడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కార్తికం.. శుభారంభం
పవిత్ర కార్తిక మాసం ప్రారంభమైన వేళ బుధవారం జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పరమ మంగళకరమైన బ్రాహ్మీ ముహూర్త కాలంలో భక్తులు పావన గోదావరితో పాటు కాలువలు, ఆలయాల పుష్కరిణుల్లో కార్తిక పుణ్యస్నానాలు ఆచరించారు. ‘ఓం నమఃశివాయ’, ‘హరహర మహాదేవ శంభోశంకర’ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు ప్రతిధ్వనించాయి. భక్తులు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి, గంగమ్మ తరగలపై విడిచిపెట్టారు. శివాలయాలకు వెళ్లి పరమేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. రేవులు, ఆలయాల్లో దీపారాధనలు చేశారు. ఆ దీపకాంతుల్లో దైవసన్నిధానాలు దేదీప్యమానంగా ప్రకాశించాయి. రాజమహేంద్రవరంలో గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి వారికి అభిషేకాలతో పాటు ధన్వంతరి సహిత రుద్రహోమం నిర్వహించారు. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం) -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
విద్యుత్ ఉచ్చుకు వ్యక్తి బలి
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ఇ.గోకవరం పంచాయతీ పరిధి ఆరళ్లధార అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు వ్యక్తి బలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దిపాలెం గ్రామానికి చెందిన బొందలపు వీర కుమార్ (నాగు) (31) వన్య ప్రాణులను వేటాడేందుకు రౌతుపాలెం నుంచి వంతాడ వెళ్లే మార్గంలో ఉచ్చును ఏర్పాటు చేశాడు. దానిలో అడవి జంతువులు పడ్డాయో లేదో చూసేందుకు బుధవారం తెల్లవారు జామున అక్కడకు బయలుదేరాడు. అయితే అదే మార్గంలో లంపకలోవ గ్రామానికి చెందిన చిన్న జయబాబు, నాతవరం గ్రామానికి చెందిన మామిడి నాగబాబు జంతువుల కోసం విద్యుత్ ఉచ్చును ఏర్పాటు చేశారు. దాన్ని గమనించని వీర కుమార్ ఆ ఉచ్చుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం గోకవరం మండలం సూడికొండ. పెద్దిపాలెం గ్రామానికి చెందిన రాళ్ల కాసులమ్మను 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం అత్తారింటికి కాపురం వచ్చేశాడు. ఈ దంపతులకు దుర్గాతేజ రాజ్కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిసరాలను పరిశీలించారు. విద్యుత్ ఉచ్చు అమర్చిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీర కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందని ఆరోగ్యసిరి
సాక్షి, రాజమహేంద్రవరం: ఒప్పందం ప్రకారం అందించిన వైద్య సేవలకు ప్రభుత్వం నెలల తరబడి నయాపైసా బిల్లు చెల్లించడం లేదు. వినతులు ఇస్తే స్పందించడం లేదు. పోరుబాట పట్టినా ఉలుకూపలుకూ లేనట్టుగా ఉండిపోయింది. ఫలితంగా పేదలకు ప్రాణ సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ (ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలను ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులు ఈ నెల 10వ తేదీ నుంచి నిలిపివేశాయి. రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు తమకు వెంటనే చెల్లించకపోతే ఈ పథకం కింద వైద్య సేవలు అందించలేమంటూ పోరుబాట పట్టాయి. దీంతో, ఆరోగ్యశ్రీ సేవలు అందక పేద, మధ్య తరగతి రోగులు తమ ఆరోగ్య పరిరక్షణకు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్సల కోసం వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. 600 నుంచి 150కి.. జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులు 81 ఉన్నాయి. వీటిలో ప్రతి రోజూ 600కు పైగా ఆరోగ్యశ్రీ కేసులు నమోదయ్యేవి. శస్త్రచికిత్సలు 300కు పైగా జరిగేవి. నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మెతో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. 40 ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ సేవలు స్తంభించాయి. ఫలితంగా ఈ పథకం కింద రోజువారీ రోగుల సంఖ్య 150కి పడిపోయింది. ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రుల్లో డయాలసిస్, కేన్సర్ చికిత్సలు మాత్రమే అందిస్తున్నారు. మిగిలిన వైద్య సేవల కోసం రూ.వేలు పోయలేక రోగులు అల్లాడుతున్నారు. పోరుబాటలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.180 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఏడాదిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బందికి జీతాల చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. బకాయిలు చెల్లించాలన్న డిమాండ్తో గత ఏప్రిల్లో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. అప్పట్లో సీఎం స్థాయిలో చర్చలు జరిపి, బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. ఇప్పటి వరకూ ఎలాంటి బిల్లులూ చెల్లించలేదు. గత్యంతరం లేక నెట్వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. ఇది జరిగి 12 రోజులు దాటుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ఆధ్వర్యాన ఎన్టీఆర్ వైద్యసే నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు. బిల్లులు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసినప్పటికీ ఆషా వివిధ పద్ధతుల్లో తన వంతు సాయాన్ని పేదలకు అందిస్తోందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నామని, దశల వారీ ఉద్యమం చేపడతామని నేతలు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో విజయవాడ నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లా నుంచి ఆస్పత్రుల యాజమాన్యాలు తరలివెళ్లి విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు. ఫ ఇటు రోగుల ఇక్కట్లు ఫ అటు నెట్వర్క్ ఆసుపత్రుల ఆందోళనలు ఫ ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిల కోసం రోడ్డెక్కిన వైద్యులు ఫ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంపై నిరసన పథం ఫ వైద్య సేవలు నిలిచిపోయి వారం దాటినా స్పందించని సర్కారు ఫ జిల్లా వ్యాప్తంగా 40 నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.180 కోట్లకు పైగా బకాయి వైద్య రంగాన్ని చులకనగా చూడొద్దు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఐసీయూలో ఉన్నాయి. పాత బకాయిలు చెల్లించి, వాటికి ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. పాత బకాయిలు కొంత చెల్లించి, మిగిలిన వాటి చెల్లింపునకు నిర్దిష్ట సమయం ప్రకటించాలి. ఎప్పుడు చెల్లిస్తారో రాతపూర్వకంగా చెప్పాలి. ఇవన్నీ చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. బకాయిలు అడుగుతూంటే వైద్యులను, వైద్య రంగాన్ని ప్రభుత్వం చులకనగా చూస్తోంది. దీంతో, ప్రజలకు తీరని నష్టం జరుగుతోంది. వైద్యులను రోడ్డుపాలు చేయడం ఎంతవరకూ సమంజసం? మావి గొంతెమ్మ కోర్కెలు కావు. ఒకేసారి బకాయిలు తీర్చమని చెప్పడం లేదు. రూపాయి విదిలించి నాలుగు రూపాయల పని చేయించుకుంటున్నారు. – డాక్టర్ విజయ్ భాస్కర్, అధ్యక్షుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజమహేంద్రవరం ప్రతి నెలా బిల్లులు చెల్లించాలి ఆస్పత్రుల్లో గైనిక్, ఇతర వైద్య సేవలు అందిస్తున్నాం. సేవలు ఆపాలన్న ఉద్దేశం మాకు లేదు. బిల్లులు చెల్లించాలని రెండు నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే సేవలు నిలిపివేస్తామని సమాచారం ఇచ్చాం. ప్రభుత్వం కొంతయినా స్పందించి ఉంటే బాగుండేది. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా ఆవేదన చెప్పుకునేందుకే రోడ్డెక్కాం. ప్రతి నెలా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలి. – డాక్టర్ లలిత, రాజమహేంద్రవరం -
నేడు మహాధర్నా
ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలనే డిమాండ్తో అన్ని వైద్య సంఘాల ఆధ్వర్యాన విజయవాడలో గురువారం పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహిస్తాం. సీఎం అప్రూవల్ అయిన రూ.670 కోట్ల ఆరోగ్యశ్రీ నిధులు వెంటనే విడుదల చేయాలి. మిగిలిన రూ.2 వేల కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో రాతపూర్వకంగా హామీ ఇవ్వాలి. ప్రభుత్వం తీసుకు రానున్న యూనివర్సల్ హెల్త్ స్కీములో మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేయాలనే డిమాండ్లతో ధర్నా జరుగుతుంది. – డాక్టర్ విజయ్ కుమార్, ఆషా అధ్యక్షుడు, రాజమహేంద్రవరం -
కక్ష సాధింపే..
‘సాక్షి’ దిన పత్రిక, ఎడిటర్, విలేకర్లపై పోలీసులు కక్ష సాధింపుతోనే వేధిస్తున్నారు. నకిలీ మద్యం వార్తలను జీర్ణించుకోలేకే కూటమి ప్రభుత్వం ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది. ‘సాక్షి’ రాసే వార్తల వల్ల ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులుంటే ఖండనలు లేదా వివరణలు ఇచ్చుకోవాలే తప్ప ఇలా పత్రిక ప్రధాన కార్యాలయానికి పోలీసులను పంపించి వేధించడం సబబు కాదు. ముఖ్యంగా ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిని, ఆయన స్థాయి, విలువను గుర్తించకుండా పోలీసులు కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం దారుణం. కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని చేస్తున్న ఈ కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ‘సాక్షి’పై ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయి. – పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి, అమలాపురం పైశాచికత్వానికి పరాకాష్ట ‘సాక్షి’ దినపత్రికపై దాడి ప్రభుత్వ పైచాచికత్వానికి పరాకాష్ట. ‘సాక్షి’ పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కూటమి ప్రభుత్వం, దాని తరఫున పోలీసు అధికారులు దాడులు, బెదిరింపులకు దిగడం వాస్తవాలపై, ప్రజలపై దాడి చేయడమే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈ సంస్కృతి సరి కాదు. ప్రజాస్వామ్యవాదులు అక్రమ కేసులను ఖండించాలి. ప్రభుత్వ దమన నీతిపై ప్రశ్నించాలి. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొత్తపేట, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు -
అసభ్యంగా ప్రవర్తించాడని అంతం చేశారు
● వీడిన వ్యక్తి హత్య కేసు మిస్టరీ ● ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులుపిఠాపురం: చిత్రాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఇటీవల దొరికిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. చుట్టపు చూపుగా వచ్చిన ఆ వ్యక్తి ఇంటి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే కక్షతోనే అంతమొందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. ఆ వివరాలను పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ జి.శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 8న పిఠాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని వాసంశెట్టి పెద్దిరాజు వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. వీఆర్వో మడికి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. పిఠాపురం టౌన్ ఎస్సై మణి కుమార్, రూరల్ ఎస్సై జాన్ బాషా, ఉప్పాడ ఎస్సై వెంకటేష్, క్రైమ్ సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలుగా విచారణ చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ పుటేజీల ఆధారంగా మృతుడిని తమిళనాడులోని తేని జిల్లా మనుతు గ్రామానికి చెందిన పాండేగా గుర్తించారు. పలకరించడానికి వచ్చి.. హనుమాన్ జంక్షన్లోని తినుబండారాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పాండే పనిచేసేవాడు. తనకు పరిచయస్తులు, అదే రాష్ట్రానికి చెందిన పౌల్ రాజ్ ఆండోనీ, లౌర్డు పకియం, మడసామి కారుప్పసామితో కలిసి ఈ నెల 6న పిఠాపురం జగ్గయ్య చెరువులో నివాసముంటున్న పూచి ధనలక్ష్మి అలియాస్ ధనమ్మ ఇంటికి వారు వచ్చారు. ధనమ్మ భర్త రామస్వామికి ఆరోగ్యం బాగాలేనందున అతడిని చూడటానికి వీరందరూ వచ్చారు. ఆ రోజు రాత్రి ఆ నలుగురూ ధనమ్మ ఇంటి వద్దే ఉన్నారు. ఈ నేపథ్యంలో ధనమ్మతో పాండే అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తులైన ధనమ్మ, పౌల్ రాజ్ ఆండోనీ, లౌర్డు పకియం, మడసామి కారుప్పసామి కలిసి, పిఠాపురం మండలం మాదాపురానికి చెందిన చాగంటి గణేష్ ఆటోలో ఈ నెల 7వ తేదీన పిఠాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని పంట పొలాల్లోకి పాండేను తీసుకెళ్లారు. అక్కడ బండ రాయితో కొట్టి హత్య చేసి, పరారయ్యారు. నిందితులను ఈ నెల 21న ఉప్పాడ కొత్తపల్లి గ్రామ శివారులో పోలీసులు అరెస్టు చేశారు. -
మన ఉత్తరం.. మళ్లీ రాసేద్దాం
● తపాలా శాఖ ఆధ్వర్యంలో పోటీలు ● వయో పరిమితి లేకుండా అందరూ అర్హులే ● డిసెంబర్ 8 వరకూ గడువుబాలాజీ చెరువు (కాకినాడ): సెల్ఫోన్ విజృంభణతో పోస్టుకార్డు కనుమరుగైంది. దాని గురించి నేటి తరం విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అయితే మారిన కాలానికి అనుగుణంగా తపాలాశాఖ అప్గ్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తపాలా సేవలు, ఆ కాలం నాటి పోస్టుకార్డుల గురించి విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏటా సరికొత్త అంశంతో పోటీలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది లెటర్ టూ మై రోల్ మోడల్ అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ధాయ్ ఆఖర్ పేరుతో ఈ పోటీలు జరుపుతోంది. ఆధునిక కాలంలో ఉత్తరాలు రాసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం పంపుకొంటున్నారు. అందుకే ఉత్తరాన్ని గుర్తు చేద్దామని తపాలా శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రియమైన నువ్వు.. ఓ ఉత్తరం పంపు అంటూ ప్రోత్సహిస్తూ పోటీలు పెడుతోంది. బహుమతులు విభాగాల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి (12 మందికి మించకుండా) నగదు బహుమతి అందజేస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు వరసగా రూ.25 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారిని జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో విజేతలకు ప్రథమ స్థానానికి రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు ప్రదానం చేస్తారు.అర్హులు ఎవరంటే.. ఉత్తరం రాసే వారు భారత పౌరులై ఉండాలి. వయో పరిమితి లేదు. 18 ఏళ్ల లోపు ఒక కేటగిరి, 18 ఏళ్లు పైబడిన వారిని మరో కేటగిరీగా విభజించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో వ్యాసం రాయవచ్చు. చేతితో రాసిన వ్యాసాన్ని మాత్రమే అనుమతిస్తారు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్లాండ్ లెటర్లో 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. వీటిని ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్, విజయవాడ – 520013 చిరునామాకు లేదా. సమీపంలోని తపాలా కార్యాలయాలకు డిసెంబర్ 8వ తేదీలోగా పంపాలి. -
నిందితుడి అరెస్టు
నారాయణరావు ఘాతుకం గురించి ఉదయం 11 గంటలకు తెలిసిందని, దీంతో, ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశామని పెద్దాపురం డీఎస్సీ శ్రీహరిరాజు విలేకర్లకు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని కోర్టుకు అప్పగిస్తామన్నారు. అతడిపై మూడు వేర్వేరు కేసులు నమోదు చేశామన్నారు. బాలిక వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత విచారణను వేగంగా పూర్తి చేసి, నారాయణరావుకు కఠిన శిక్ష పడేవిధంగా చార్జిషీటు దాఖలు చేస్తామని చెప్పారు. ఈ ఉదంతాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం, పార్టీలకు ఆపాదించడం నేరమేనని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆలయ కమిటీ సభ్యులకు ఆభరణాల అందజేత
సామర్లకోట: రోడ్డుపై పడి పోయిన వెండి, బంగారు ఆభరణాలను సామర్లకోట పోలీసులు గుర్తించి ఆలయ ధర్మకర్తలకు అందజేశారు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణ భగవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలేశ్వరం మండలం కంబాలపాలెంలోని సుబ్రహ్మణేశ్వరస్వామికి చెందిన వెండి, బంగారు ఆభరణాలు పాతబడి పోయాయి. దీంతో వాటిని మార్పు చేయడానికి ఆలయ కమిటీ సభ్యులైన కొప్పిశెట్టి సత్తిబాబు, శొంటెపు బాలకృష్ణ బుధవారం మోటారు సైకిల్పై కాకినాడ బయలు దేరారు. అయితే సామర్లకోట సమీపంలో బైక్కు తగిలించిన ఆభరణాల బ్యాగు తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. ఆ విషయాన్ని కమిటీ సభ్యులు గమనించలేదు. అలా కొంతదూరం వెళ్లిన తర్వాత చూస్తే బ్యాగు కనిపించలేదు. వెంటనే సామర్లకోట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సూచనల మేరకు హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్ నాగరాజు సామర్లకోట రోడ్డులో గాలింపు చేశారు. సామర్లకోట ప్రతిపాడు రోడ్డులో బ్యాగు మీదుగా లారీ వెళ్లి పొయిన విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు కేజీన్నర బరువున్న ఆభరణాలను సీఐకి అందజేయగా, వాటిని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. -
అంతర్జాతీయ సైన్స్ సెమినార్లో ప్రతిభ
రంగంపేట: అంతర్జాతీయ సైన్స్ సెమినార్లో రంగంపేట జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థిని ఆవుపాటి రమ్య సత్తా చాటింది. ఈ నెల 18, 19 తేదీల్లో మలేషియాలోని ఎంఎంయూ సైబర్జియా వేదికగా సైన్స్ కాస్టిల్ ఆసియా పేరిట అంతర్జాతీయ సైన్స్ సెమినార్, ప్రాజెక్టుల ప్రదర్శన జరిగింది. ఇందులో రష్యా, జపాన్ సహా ఆసియాకు చెందిన 10 దేశాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 2 వేలకు పైగా దరఖాస్తులు ఆసియా దేశాల నుంచి రాగా 393 ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు ఎంపిక చేశారు. దీనికి రమ్య, పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుని రమ్యసుధతో కలసి రూపొందించిన స్టూడెంట్ ఫ్రెండ్లీ పెన్ అనే ప్రాజెక్ట్ మన దేశం తరఫున ఎంపికై ంది. తద్వారా రమ్య కాంస్య పతకం సాధించింది. ఆమెను, గైడ్ టీచర్ రమ్యసుధను ఎంఈఓలు కె.శ్రీనివాసరావు, పి.మధుసూధనరావు, ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి, ఉపాధ్యాయులు బుధవారం అభినందించారు. -
వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
● తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు ● అప్పనపల్లి వెళ్లి వస్తుండగా ప్రమాదంముమ్మిడివరం: అప్పనపల్లి దైవ దర్శనానికి వెళ్లి మోటారు సైకిల్పై ఇంటికి తిరిగి వస్తున్న వారిని కోళ్లు తరలించే వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, అతడి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి గుత్తులవారిపాలెం సమీపంలో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. యానాం సుభద్ర నగర్కు చెందిన దింపు కార్మికుడు మట్టపర్తి నూకరాజు (50), భార్య నూకరత్నం (47), కుమారుడు రామ వెంకట కృష్ణ ప్రసాద్ (22) మోటారు సైకిల్పై అప్పనపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తున్న వారిని గుత్తులవారిపాలెం వద్ద కోళ్ల వ్యాన్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కృష్ణ ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఐటీడీఏ ఏపీడీ టి.విశ్వనాథం అంబులెన్స్కు ఫోన్ చేయగా, అది రావడానికి ఆలస్యం అవుతుందని భావించి, వెంటనే గాయపడిన వారిని ఆటోలో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలో ఆటవిక రాజ్యం
● ఆడబిడ్డలకు రక్షణేది? ● హాస్టల్ బాలికపై లైంగిక దాడి దారుణం ● విద్యార్థినిని ఒంటరిగా ఎలా పంపారు? ● జక్కంపూడి విజయలక్ష్మి సీటీఆర్ఐ: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని బీసీ హాస్టల్ బాలికపై జరిగిన లైంగిక దాడి నేపథ్యంలో బుధవారం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డితో కలిసి ఆ వసతి గృహానికి వెళ్లారు. బాలిక బయటకు వెళ్లిన విషయాన్ని రిజిస్టర్లో నమోదు చేయకపోవడంపై హాస్టల్ వార్డెన్ను ప్రశ్నించారు. అయితే వారు లోపలకు వెళ్లి, రిజిస్ట్రర్లో పేరు నమోదు చేసుకుని రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ బాలికను బయటకు పంపడం ఒక తప్పు, పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిలదీశారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి అదే ఆఖరు రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు కానీ, ఏ ఒక్కరికీ శిక్ష పడటం లేదన్నారు. దానికి రెడ్బుక్ రాజ్యాంగమే కారణమని చెప్పారు. అంబేడ్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతోందా అని ప్రశ్నించారు. పిల్లలు బాగా చదువుకోవాలని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద వంటి పథకాలు అందించారన్నారు. కూటమి పాలనలో ఈ రోజు హాస్టళ్లలో దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు కనిపించడం లేదని పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు గగ్గోలు పెట్టారని, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అనేక మంది మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్న విషయం హోం మంత్రి అనితకు తెలియడం లేదా ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆనంద్, ఆడపా అనిల్, సోము, న్యాయవాది తాడేపల్లి విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఇద్దరు నిందితుల అరెస్టుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికపై అత్యాచారం ఘటనకు సంబంధించి కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ అంబేడ్కర్ కాలనీకి చెందిన పాము అజయ్, అదే జిల్లా రావులపాలెం మండలం రావులపాడుకు చెందిన కాగితపల్లి సత్యస్వామిలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ శివ గణేష్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. అజయ్కు రూమ్ అద్దె కిచ్చిన రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీగురు రెసిడెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకునే దిశగా సబ్ కలెక్టర్కు సిఫారసు చేశారు. మైనర్లకు అద్దెకిస్తే చర్యలు హోటళ్లలో రూములను మైనర్లకు అద్దెకిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సౌత్జోన్ డీఎస్పీ భవ్య కిశోర్ ఆధ్వర్యంలో హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. రూమ్లు తీసుకున్న వారిపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. హాస్టల్ వార్డెన్ ఉమాదేవి సస్పెన్షన్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): బాలిక ఘటన విషయంలో హాస్టల్ వార్డెన్ ఉమాదేవి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణలో తేలడంలో ఆమెను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో పిల్లల సంరక్షణ, భద్రత విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాలిక ఘటనపై కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో సమగ్ర విచారణ చేపట్టగా, హాస్టల్ సంక్షేమ అధికారి ఉమాదేవి విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో ఆమెను తక్షణం విధుల నుంచి సస్పెండ్ చేశామన్నారు. వసతి గృహాల నుంచి పిల్లలను పంపించే ముందు, వారి బంధువుల వివరాలు, గుర్తింపు ఆధారాలు నమోదు చేయాలన్నారు. -
కూటమి పాలనలో రక్షణ కరవు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వంలో బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రతి రోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమహేంద్రవరంలోని గణేష్ చౌక్ వద్ద గల బీసీ హాస్టల్ బాలికపై లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో బుధవారం ఆ హాస్టల్ సిబ్బందిని, పోలీసులను నిలదీశారు. ముందుగా హాస్టల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ మద్యాన్ని పెంచి పోషిస్తూ.. కూటమి నాయకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్నారు. పోలీసులు కూడా కూటమి ప్రభుత్వ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆడియో క్లిప్పింగ్ బయటకు వచ్చినా కనీసం స్థానిక టీడీపీ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీన్ని బట్టి దందాలో స్థానిక టీడీపీ నాయకుల పాత్ర ఏమిటో అర్థం అవుతోందన్నారు. మద్యం అమ్మకాలను కూటమి ప్రోత్సహించడం వల్లే బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హాస్టల్ విద్యార్థులకు రక్షణ లేకపోవడంపై కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బెల్టు షాపులను విపరీతంగా పెంచి, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. ఎమ్మార్పీ కంటే అత్యధికంగా అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. మహిళలు, బాలికలపై పెరిగిన అఘాయిత్యాలు ప్రభుత్వ కార్యకర్తల్లా పోలీసులు మాజీ ఎంపీ భరత్ రామ్ ధ్వజం గూడూరి శ్రీనివాస్తో కలిసి ఆందోళన -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
దేవరపల్లి: మండలంలోని లక్ష్మీపురం వద్ద చాగ ల్లు రోడ్డులో జరిగిన ట్రాక్టర్ ప్ర మాదంలో పల్లంట్లకు చెందిన జాలపర్తి రాజు (37) మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్లంట్ల గ్రామానికి చెందిన జాలపర్తి రాజు లక్ష్మీపురంలో ఒక రైతు వద్ద వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం పొలంలో దుక్కు దున్నటానికి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతుండగా లక్ష్మీపురం–పల్లంట్ల రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజుపై ట్రాక్టర్ పడడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. ప్రత్తిపాడు: పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఐనెల్లి వాసు (23) అప్పుల బాధ తాళలేక సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడికి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.వృద్ధురాలి ఆత్మహత్యాయత్నంఅన్నవరం: స్థానిక పవర్ ఆఫీసు వద్ద గల పంపా ఘాట్లో బుధవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వృద్ధురాలు నది లోపలకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో సత్యదేవుని తెప్పోత్సవం కోసం అక్కడ పనిచేస్తున్నవారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. ఆమెను పేరు అడిగితే ఏమీ చెప్పకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్లిపోయిందని వారు వివరించారు. కాగా.. దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని అన్నవరం పోలీసులు తెలిపారు. -
సంక్షేమ హాస్టల్ బాలికపై లైంగిక దాడి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంక్షేమ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన బాలిక రాజమహేంద్రవరంలోని సంక్షేమ హాస్టల్లో ఉంటూ టెన్త్ చదువుతోంది. ఆమెకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన పాము అజయ్(22) పరిచయమయ్యాడు. ఆ బాలికను చెల్లి అని çసంబోధిస్తూ ఏదైనా అవసరమైతే తనకు చెప్పమనేవాడు.ఈ క్రమంలో సోమవారం సా.5 గంటల సమయంలో బాలిక సబ్బులు, ఇతర వస్తువులు తెచ్చుకుంటానని హాస్టల్ వార్డెన్ ఉమాదేవికి చెప్పి బయటకెళ్లింది. అయితే, అదేరోజు రాత్రి 7 గంటలకు బాలిక తల్లి హాస్టల్కు వచ్చింది. అదే సమయంలో బాలిక బయటి నుంచి రావడంతో ఎక్కడికి వెళ్లావని తల్లి నిలదీసింది. బాలిక జరిగినదంతా తల్లికి చెప్పింది. తనను అజయ్, రావులపాలెం మండలం రావులపాడుకు చెందిన అతడి స్నేహితుడు కాగితపల్లి సత్యస్వామి (21) కలిసి బైక్ మీద బయటకు తీసుకెళ్లారని, సత్యస్వామి తమను రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ వద్ద దింపి వెళ్లిపోయాడని తెలిపింది. ఆ తర్వాత అజయ్ హోటల్ గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని చెప్పింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు వెంటనే లాడ్జి వద్దకు వెళ్లి ఆరా తీయగా లాడ్జి నిర్వాహకులు జరిగిందంతా చెప్పారు. తాము వేరే ఊరు నుంచి పరీక్షలు రాయడానికి వచ్చామని, మర్నాడు వెళ్లిపోతామని యువకుడు చెప్పినట్లు వివరించారు. పోలీసులు అజయ్, సత్యస్వామిపై మంగళవారం కేసులు నమోదు చేశారు. అలాగే, మైనర్లకు గది ఇచ్చిన లాడ్జి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. నిందితులిద్దరినీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని గురువారం కోర్టులో హాజరుపర్చనున్నారు. మరోవైపు.. కలెక్టర్ కీర్తి చేకూరి హాస్టల్ వార్డెన్ ఉమాదేవికి షోకాజ్ నోటీసు జారీచేసి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కాకినాడ క్రైం: బేకరీలో పనిచేసే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ సంతచెరువు జంక్షన్లో ఉన్న ఎస్ఆర్కే బిల్డింగ్లో కర్ణాటకకు చెందిన కేఎస్ వెంకటేష్ అనే వ్యక్తి జై మారుతీ బెంగళూరు అయ్యంగార్ బేకరీ నడుపుతున్నాడు. ఈ భవనం కింద అంతస్తులో బేకరీ, మొదటి అంతస్తులో తయారీ కేంద్రం ఉంది. బాలాజీ చెరువుకు చెందిన ర్యాలీ లక్ష్మి (40) దాదాపు రెండు నెలలుగా ఈ తయారీ కేంద్రంలో పని చేస్తోంది. రోజూ మాదిరిగానే మంగళవారం ఆమె తయారీ కేంద్రానికి వచ్చింది. సాయంత్రం 5.30 సమయంలో అదే అంతస్తులో మరో దుకాణం నడుపుతున్న వ్యక్తి.. బేకరీ తయారీ కేంద్రంలో మహిళ పడిపోయి ఉండడాన్ని చూసి షాపు యజమాని వెంకటేష్కు సమాచారం అందించాడు. అతడు వెళ్లి చూసే సరికీ లక్ష్మి విగత జీవిగా కనిపించింది. ఆయన ఈ విషయాన్ని లక్ష్మి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెను కాకినాడ జీజీహెచ్కు తరలించగా, అప్పటికే లక్ష్మి మృతి చెందిందని వైద్యులు నిర్ధారణ చేశారు. ఈ ఘటనపై కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. భర్తతో వేరుపడిన లక్ష్మికి పదేళ్ల కుమార్తె ఉంది. బేకరీలో పనిచేసుకుంటూ బాలికను పోషిస్తోంది. -
తిన్నారంటే తిప్పలే..
రావులపాలెం/అమలాపురం టౌన్: ఇటీవల కాలంలో స్ట్రీల్ ఫుడ్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న చిన్న బళ్ల వద్ద ఆహార పదార్థాలను తీనేవారు ఎక్కువయ్యారు. పిల్లలతో సరదాగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు, షికారుకు వచ్చిన యువత, వాకింగ్ వచ్చిన పెద్దలు.. ఇలా అందరూ బండ్లపై అమ్మే పదార్థాలను ఇష్టంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రోడ్ల చెంతన, వీధుల్లో ఫాస్ట్ఫుడ్, టిఫిన్ సెంటర్లు, బజ్జీ దుకాణాలు, పానీపూరీ బండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటి నిర్వాహకుల్లో కొందరు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రతి వీధిలోనూ.. రావులపాలెంతో పాటు ప్రధాన జాతీయ రహదారి, ఆర్అండ్బీ రోడ్లు విస్తరించిన పరిసర గ్రామాల్లో రోడ్ల వెంబడి అనేక ఫాస్ట్ఫుడ్ సెంటర్లు వెలిశాయి. దీనికి తోడు మిరపకాయ బజ్జీలు, న్యూడిల్స్, పానీపూరీ, మాంసం పకోడీ విక్రయించే తోపుడు బండ్లు ప్రతి వీధిలోనూ దర్శనమిస్తున్నాయి. అయితే వీరిలో కొందరు వ్యాపారులు ఒకే నూనెను అనేకసార్లు మరిగించి, వాడడం వల్ల వినియోగదారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కారణవుతోంది. ఇలా ఆహార కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నది తొలుత యువతే. ఇటీవల ఏదైనా సుస్తీ చేసి ఆస్పత్రులకు వెళితే తొలుత డాక్టర్లు.. ఫాస్ట్ ఫుడ్, వీధి బళ్లమీద విక్రయించే ఆహారం తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. నిఘా కరవు ఫాస్ట్ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ, పంచాయతీ, పొల్యూషన్ కంట్రోల్ అధికారుల నిఘా కరవైంది. కేవలం పెద్ద హోటళ్లపై మాత్రమే దాడులు, తనిఖీ చేస్తున్నారు. తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో కేసులను నీరుగార్చేస్తున్నారు. రావులపాలెంలో ఇటీవల ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలను గుర్తించి కేసులు నమోదు చేశారు. అలాగే రాజకీయ, ఆర్థిక పలుకుబడులతో నామమాత్రపు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. కానీ స్ట్రీట్ ఫుడ్ దుకాణాలను ఏ అధికారులూ పట్టించుకున్న దాఖలాలులేవు. పొగతో కాలుష్యం కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, ఆత్రేయపురం పరిసర గ్రామాల రోడ్ల చెంత తాత్కాలికంగా ఫాస్ట్ ఫుడ్, న్యూడిల్స్, పానీపూరీ, మాంసం పకోడీ షాపులు, తోపుడు బండ్లు అనేక ఉన్నాయి. ఈ వ్యాపారులందరూ రోజూ సాయంత్రం నాలుగింటికి తమ వ్యాపారం మొదలు పెడతారు. మరిగించిన నూనెలోనే పదార్థాలను తయారు చేయడం వల్ల తిన్నవారి ఆరోగ్యం పెను ప్రమాదంలో పడుతోంది. న్యూడిల్స్, పానీపూరీ, ఫ్రైడ్ రైస్ కూడా ఈ కోవలోకే వస్తాయి. అలాగే ఈ షాపులు, తోపుడు బండ్లపై గ్యాస్ సిలిండర్ల వాడడం, నూనె మరగడం వల్ల వచ్చే పొగతో వెలువడే ఆయా ప్రాంతాల్లో కాలుష్యం కమ్ముకుంటోంది. రావులపాలెంలో హైవే సర్వీసు రోడ్డు, రింగ్ రోడ్డు, పార్కు వద్ద, మార్కెట్ సెంటర్, రైతు బజార్ సెంటర్, ఊబలంక రోడ్డు, అమలాపురం రోడ్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెడీమేడ్ ఆహార పదార్థాలు విక్రయించే తోపుడు బండ్లు అనేకం దర్శనమిస్తాయి. ఒక్క రావులపాలెం పంచాయతీ పరిధిలో స్ట్రీట్ పుట్ బండ్లు సుమారు 60 వరకూ ఉన్నట్టు సమాచారం. జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణంలో హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు రెట్టింపు అయ్యాయి. అయితే పలు హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఆహారం కలుషితం అవుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఒక మాంసాహార హోటల్లోని పలావులో మండ్ర కప్ప ఉందన్న విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో మున్సిపాలిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల్లో కదలిక మొదలైంది. అప్పటి వరకూ పలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో కొందరు కౌన్సిలర్లు పట్టణంలో కలుషిత ఆహారం అధికమవుతోందని ఆందోళన చెందినా కదలిక లేదు. అమలాపురం పట్టణం వ్యాప్తంగా పలు కూడళ్లలో దాదాపు 24 వరకూ పాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో పదార్థాల తయారీకి ఉపయోగించే పొయ్యిల గొట్టాలను రోడ్డు వైపు పెట్టేస్తున్నారు. వాటి నుంచి ఆయిల్ తుంపర్లు, పొగ విపరీతంగా వెలువడుతోంది. హోటళ్ల కంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనే ఆహార కలుషితం ఎక్కువ అవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంబాజీపేటలోని ఓ హోటల్లో టిఫిన్ తిన్న 20 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవడంతో కలుషిత ఆహారంపై ప్రజల్లో మరింత ఆందోళన పెరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు, తనిఖీలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విపరీతంగా పెరిగిన ఫాస్ట్ ఫుడ్ దుకాణాలు కొన్నింటిలో నాణ్యతకు తిలోదకాలు లైసెన్సులు లేకుండా వ్యాపారం ప్రమాదంలో ప్రజారోగ్యందృష్టి సారించని అధికారులు పంచాయతీ పరంగా శానిటేషన్, ఎన్విరాల్మెంట్ పరిశుభ్రత అంటూ అధికారులకు ఈ సెంటర్లు, షాపులను తనిఖీ చేసే అధికారం ఉన్నా వారు ప్లాస్టిక్ కవర్లు తదితర సామగ్రిపైనే దృష్టి పెడుతున్నారు. కల్తీ ఆహార విక్రయాలు, కాలుష్యాన్ని పట్టించుకోవడం లేదు. గతంలో పంచాయతీలకు శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండేవారు, ఇప్పుడు ఆ పోస్టులు లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు, గుమస్తాలపై ఈ భారం పడింది. జిల్లా స్థాయిలో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ తరహా దుకాణాలను తనిఖీలు చేస్తే నిర్వాహకులకు కనీసం భయమైనా ఉంటుంది. ఈ దుకాణాల నిర్వహణకు ఎవ్వరూ లైసెన్సులు తీసుకోవడం లేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రోడ్ల చెంత తిను బండారాలు విక్రయించే ప్రతి వీధి వ్యాపారి తప్పని సరిగా లైసెన్స్ పొందాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. -
ఆలయం.. కార్తిక వైభవం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం ప్రారంభం కానుంది. ఈ పవిత్ర మాసంలో భక్తులు నదీ స్నానాలు, దీపారాధనలు, విశేష పూజలు, అభిషేకాలు, దానధర్మాలు, ఉపవాసాలు, వ్రతాలు, నోములను భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. ముఖ్యంగా భక్తులు పావన గోదావరి నదీ జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించి, పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ మాసంలో ఆలయాలు భక్తులతో రద్దీగా మారుతాయి. గోదావరి తీరంలో అనేక ప్రాచీన సుప్రసిద్ధ శివాయాలున్నాయి. ఆయా ఆలయాల్లో కార్తిక మాస ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫ నేటి నుంచి కార్తిక మాసోత్సవాలు ఫ ముస్తాబైన ఆలయాలు ఫ రేవుల్లో సందడి చేయనున్న భక్తులు కోటిలింగేశ్వర స్వామి రాజమహేంద్రవరంలో గోదావరి తీరాన కోటిలింగాల పేటలో శ్రీ భువనేశ్వరీ సహిత ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం కొలువు తీరింది. ఇది అతి ప్రాచీనమైన, పురాణ ప్రశస్తి ఉన్న ఆలయం. బ్రహ్మదేవుడే విప్రుని వేషంలో వచ్చి, ఇక్కడ కోటిలింగాలు ప్రతిష్ఠించాడని, అందులో ఒక లింగం మాయం కావడంతో మహర్షులు కాశీ క్షేత్రం నుంచి తెచ్చి ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది. అదే ఆలయంలో ప్రస్తుతం పూజలందుకుంటున్న కోటిలింగేశ్వర స్వామి శివలింగమని చెబుతారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం త్రిపురాసుర సంహారం ఇక్కడే జరిగింది. కోటిలింగ క్షేత్రానికి అభినవ విరూపాక్ష పీఠమనే పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది.మార్కండేయేశ్వర స్వామి గోదావరి తీరాన ఉన్న శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి వారి ఆలయానికి ప్రాచీన చరిత్ర ఉంది. మార్కండేయుని భక్తికి మెచ్చి సాక్షాత్కరించిన పరమేశ్వరుడు ఇక్కడ లింగ రూపంలో కొలువు తీరాడని, ఆ స్వామికే మార్కండేయేశ్వరునిగా పేరు వచ్చిందని చెబుతారు. ప్రాచీన కాలంలో ఈ ఆలయం చందా సత్రం ఎదుట ఉన్న మసీదులో ఉండేది. ఈ స్వామికి 1072లో దీపదానం చేసి భీమన ప్రగడ శాసనం చేయించారు. ఈ శాసనం ప్రస్తుతం ఆలయం ఉత్తర ద్వారానికి కుడి వైపు ఉంది. గుండు శోభనాద్రి జమీందారు 1775లో ప్రస్తుతం ఉన్న స్థలానికి తరలించి, కొత్త ఆలయం నిర్మించారు. కార్తిక శుద్ధ పాడ్యమి మంగళవారం సాయంత్రమే రావడంతో మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో ఆకాశ దీపం వెలిగించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. -
బుధవారం శ్రీ 22 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
కేసులు ఉపసంహరించాలి పత్రికలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛను హరించేలా కొత్త సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెర తీసింది. ‘సాక్షి’ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. ఆ పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోంది. పత్రిక కార్యాలయంపై దాడులు తగవు. పత్రికలకు గౌరవం ఇవ్వాలి. కేసులు ఉపసంహరించాలి. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, కాకినాడ జిల్లా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే.. పత్రికలకు భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా అణచివేత ధోరణి అవలంబించడం సమంజసం కాదు. పత్రికల స్వేచ్ఛను హరించడానికి, హక్కులను నిర్మూలించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారు శిక్షార్హులు కూడా. పత్రికా స్వాతంత్య్రం అణచివేతకు ప్రయత్నించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. – పిల్లి సుభాష్చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు -
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
నిడదవోలు రూరల్: ఇళ్లు, దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. సమిశ్రగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్సై బాలాజీ సుందరరావు మంగళవారం వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 18న సమిశ్రగూడెంలోని శ్రీనివాస మెడికల్ షాప్ వీధిలో ఉన్న దంగుల కొండమ్మ ఇంట్లో రూ.80 వేలు, 26 తులా ల వెండి, అరకాసు బంగారం, అలాగే కాలువ గట్టుపై కొండేపూడి సుధీర్కు చెందిన టీ టైంలో రూ.20 వేలు, ఆరు గ్రాముల బంగారం, ఒక సెల్ఫోన్ చోరీకి గురయ్యా యి. బాధితులఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రాజమహేంద్రవరంలోని బాలాజీపేటకు చెందిన పల్లపాటి దుర్గాప్రసాద్తో మరో ఇద్దరు ఈ దొంగతనానికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ కేసులో దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసి రూ.50 వేలు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అతడిపై వివిధ జిల్లాల్లో 27 కేసులు ఉన్నాయి. కాగా.. దొంగను అరెస్ట్ చేసిన ఎస్సై బాలాజీ సుందరరావు, టైనీ ఎస్సై జె.కల్పన, పోలీసులు జి.రామారావు, జె.రెహ్మన్, జి.సాంబయ్య, రామశ్రీను, ధనుంజయ్లను ఎస్పీ డి.నరసింహ కిశోర్, కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ అభినందించారు. -
ఆకాశ దీపంతో శుభారంభం
ఫ రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం ఫ పూర్తయిన ఏర్పాట్లు అన్నవరం: ఆకాశ దీపం ఏర్పాటు ద్వారా రత్నగిరిపై కార్తిక మాసోత్సవాలకు అర్చకులు మంగళవారం శ్రీకారం చుట్టారు. సత్యదేవుని ప్రధానాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆకాశ దీపం ఏర్పాటు చేశారు. కార్తిక అమావాస్య అయిన నవంబరు 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. బుధవారం తెల్లవారుజాము నుంచి పాడ్యమి దీపాలు ఏర్పాటు చేయనున్నారు. కార్తిక అమావాస్య వరకూ వీటిని వెలిగిస్తారు. మార్గశిర పాడ్యమి తెల్లవారుజామున పోలిస్వర్గం దీపాలు వెలిగించి, నదుల్లో వదలడం ద్వారా కార్తిక మాసోత్సవాలు ముగియనున్నాయి. కార్తిక మాసం సందర్భంగా అన్నవరం దేవస్థానంలో చేపట్టిన ఏర్పాట్లు పూర్తి చేశారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెల్స్ ఫార్మాస్యూటికల్స్ చేపట్టిన భక్తుల విశ్రాంతి షెడ్డు నిర్మాణం పూర్తయింది. అలాగే, క్యూ లైన్లు, విశ్రాంతి మండపాలు, పార్కింగ్ స్థలాలు కూడా సిద్ధం చేశారు. కార్తిక మాసంలో శని, ఆది, సోమ, దశమి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తదితర పర్వదినాల్లో అర్ధరాత్రి 2 గంటల నుంచి మిగిలిన రోజుల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి సత్యదేవుని వ్రతాలు ప్రారంభిస్తారు. అలాగే, స్వామివారి దర్శనాలు కూడా పర్వదినాల్లో అర్ధరాత్రి నుంచి, మిగిలిన రోజుల్లో తెల్లవారుజాము నుంచి ప్రారంభమవుతాయి. వ్రతాలు, దర్శనాల టికెట్లు, ప్రసాదం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారుల నియామకం కార్తిక మాసంలో భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయడానికి, నవంబరు 2న తెప్పోత్సవం, 5న గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల పర్యవేక్షణకు గాను దేవదాయ శాఖ కాకినాడ డిప్యూటీ కమిషనర్ రమేష్బాబు, లోవ తలుపులమ్మ తల్లి, వాడపల్లి దేవస్థానం ఈఓలు పి.విశ్వనాథరాజు, ఎన్ఎస్ చక్రధర్రావు ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుతో కలసి వీరు కార్తిక మాసం ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. -
చర్యలు తీసుకుంటున్నాం
స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ దుకాణాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అనుసరించి ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా చిరు వ్యాపారులు చేస్తున్న రోడ్ల ఆక్రమణ, శానిటేషన్ విషయాల్లో అవగాహన సమావేశాలు పెట్టి హెచ్చరిస్తున్నాం. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి అంశంపై దృష్టి సారించడంతో పాటు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎల్.దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, రావులపాలెం ● -
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామ స్థాయిలో బలంగా విస్తరించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. పశు సంవర్ధక శాఖ ప్రగతిపై తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. పశు సంవర్ధక శాఖ కార్యక్రమాల అమలు, మండలాల వారీ పురోగతిపై సమీక్షించి, లక్ష్యాలను సమయానుసారం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోకులం షెడ్ల లక్ష్యాల సాధనకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటి ప్రకారం మంజూరు తీసుకోవాలని సూచించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో తెల్ల జాతి పశువుల ప్రాధాన్యాన్ని గుర్తించాలన్నారు. ప్రకృతి వ్యవసాయంపై పశు ఆరోగ్య కార్యకర్తలకు పూర్తి అవగాహన ఉండేలా శిక్షణ, మార్గదర్శకాలు నిరంతరం ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి టి.శ్రీనివాసరావు, శాఖాధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులు సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని వివిధ విభాగాల్లో నియమిస్తూ, పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. చొల్లంగి సత్యగిరి (రాజమహేంద్రవరం రూరల్) బీసీ విభాగం జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగాలకు అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులుగా బండి నాగేశ్వరరావు (రాజమహేంద్రవరం రూరల్), ఆరుగోలను ముసలయ్య(కొవ్వూరు)లను నియమించారు. -
యువకుడిపై కానిస్టేబుల్ దాడి
సామర్లకోట: కానిస్టేబుల్ తీవ్రంగా కొట్టడంతో ఓ యువకుడు ప్రాణాపాయస్థితికి చేరాడు. ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. దీపావళి సందర్భంగా ఏటా బ్రౌన్పేట – కోటపేటకు చెందిన యువకులు తారాజువ్వలను నేలబారున విడిచిపెట్టే పోటీ పెట్టుకుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రెండు వర్గాలకు చెందిన యువకులు జువ్వలు వేసుకోవడం ప్రారంభించారు. పోలీసులు అక్కడకు చేరుకుని రెండు పర్యాయాలు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో జువ్వల పోటీతో ఎటువంటి సంబంధం లేని దడాల అక్షయ కుమార్ అనే యువకుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతడిని కానిస్టేబుల్ సతీష్ కుమార్ కొట్టడం ప్రారంభించాడు. ఆ క్రమంలో అక్షయ కుమార్ వీపుపై లాఠీ బలంగా తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్షయ కుమార్కు చిన్నతనం నుంచి పక్షవాతం ఉంది. ఎప్పుడైతే కానిస్టేబుల్ లాఠీతో కొట్టాడో అతడు కోమాలోకి వెళ్లాడు. ఆస్పత్రి సిబ్బంది వైద్యం ప్రారంభించిన కొద్ది సేపటికి ఊపిరి ఆగి పోవడంతో అక్షయ కుమార్ చనిపోయాడని భావించారు. ఇంతలో డాక్టర్ వచ్చి సీపీఆర్ చేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే 108లో కాకినాడ తరలించడానికి ప్రయత్నం చేయగా దాదాపు గంటంపావు వరకూ అంబులెన్స్ అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత 108లో పోలీసుల సహకారంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బాధితుడికి న్యాయం చేయాలి అమాయకుడైన అక్షయ కుమార్ను కానిస్టేబుల్ లాఠీతో కొట్టడం దారుణమని దళిత సంఘాల నాయకులు సతీష్ బాబు, లింగం శివప్రసాద్, నేతల హరిబాబు, పిట్టా సత్యనారాయణ అన్నారు. ఆ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసి, అరెస్టు చేయా లని డిమాండ్ చేశారు. అక్షయ కుమార్కు అవుట్ సోర్సింగ్లో ఉద్యోగం ఇవ్వాలన్నారు. గతంలో కూడా ఒక దళిత యువకుడు చనిపోవడానికి పోలీసులే కారణమని గుర్తు చేశారు. దీనిపై విచారణ చేసి క్షతగాత్రుడికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ప్రాణాపాయ స్థితిలో బాధితుడు గంటంపావు వరకూ రాని 108 అంబులెన్స్ కాకినాడ ఆస్పత్రిలో చికిత్స తారాజువ్వల పోటీలో కలకలం -
సారంగధరేశ్వరుడు
రాజమహేంద్రిని రాజధానిగా చేసుకొని రాజరాజ నరేంద్రుడు వేంగి రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతడికి సారంగధరుడనే కుమారుడున్నాడు. రాజరాజ నరేంద్రుని రెండో భార్య చిత్రాంగి. ఆమెకు సంబంధించి ఓ తప్పుడు ప్రచారం జరిగిందని, దానిని నమ్మిన రాజు.. సారంగధరుని రెండు కాళ్లు, చేతులు తొలగించాలని ఆజ్ఞాపించాడని, ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని కోరుకొండ రోడ్డులో ఉన్న కొండ మీద అతడికి ఆ శిక్ష విధించారని చెబుతారు. శిక్షకు గురైన సారంగధరుడు ఆర్తితో ప్రార్థించగా పరమ శివుడు ప్రత్యక్షమై సారంగధరేశ్వరుడికి కాళ్లు, చేతులు పునఃప్రసాదించారని, అక్కడ వెలసిన పరమేశ్వరునికే సారంగధరేశ్వరుడనే పేరు వచ్చిందని చెబుతారు. ఫ ఇంకా నగరంలో శృంగేరి జగద్గురు శంకరమఠం, శారదా పీఠంలో వేంచేసియున్న శ్రీ చంద్రమౌళీశ్వర స్ఫటిక లింగం, గౌతమ ఘాట్ వద్ద నిర్మించిన రోటరీ మహాకాళేశ్వరాలయం (ఉజ్జయని ఆలయం) వంటి ప్రశస్తమైన ఆలయాలు ఈ నగరంలో కొలువు తీరాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 25,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 25,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
సమాజ భద్రతకు ప్రతీక పోలీసుల త్యాగం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సమాజ భద్రతకు ప్రతీకే పోలీసుల త్యాగమని, వారి సేవాస్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన అమరవీరుల దినోత్సవంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, సమాజంలో శాంతిభద్రతలను కాపాడే కీలక బాధ్యత పోలీసులు నిర్వర్తిస్తున్నారన్నారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, ప్రతి ఒక్క పోలీసు సిబ్బందీ ఆత్మ నిబద్ధతతో పని చేయాలని, వారి కుటుంబ సభ్యుల సహకారం విలువైనదని గుర్తించాలని అన్నారు. ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు, సింథటిక్ డ్రగ్స్ వంటి సామాజిక సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసు వ్యవస్థ మరింత కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఎల్.చెంచిరెడ్డి, డీఎస్పీలు బి.రామకృష్ణ, వై.శ్రీకాంత్, బి.విద్య, కిషోర్, దేవకుమార్, రవికుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ఆనందంగా ఉన్నారు..
ఫ పొగాకు నారుకు మంచి రేటు ఫ ఆశాజనకంగా మడులు ఫ ముందుముందు ధర పెరుగుతుందని ఆశ దేవరపల్లి: పొగాకు నారుమడులు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో పాటు నారుకు మంచి రేటు పలుకుతూండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2025–26 పంట కాలానికి పొగాకు నాట్లు ప్రారంభం కావడంతో నారు తీతలు మొదలయ్యాయి. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్లోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 90 వేల ఎకరాల్లో పొగాకు సాగు జరుగుతుంది. దీనికి అవసరమైన పొగాకు నారును దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు మండలాల్లో మడులు కట్టి పెంచారు. ఆరోగ్యంగా ఉండటంతో నారుకు డిమాండ్ ఏర్పడింది. ఎగువ ఉత్తర తేలిక నేలల (ఎన్ఎల్ఎస్) ప్రాంతమైన జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 20 రోజులుగా, లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతమైన దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో 10 రోజులుగా మెరక పొలాల్లో ముమ్మరంగా నాట్లు పడుతున్నాయి. అయితే, ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తూండటంతో నాట్లు వేయడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు. దుక్కులు సిద్ధం చేసి అనుకూల వాతావరణం కోసం ఎదురు చూస్తున్నారు. ఏటా సాధారణంగా అక్టోబర్ 15 నుంచి నాట్లు ప్రారంభించి డిసెంబరు 15 నాటికి 90 శాతం పూర్తి చేస్తారు. అప్పర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో దసరాకు నాట్లు ప్రారంభిస్తారు. 125 హెక్టార్లలో.. రీజియన్ పరిధిలో ఈ ఏడాది సుమారు 125 హెక్టార్లలో నారుమడులు వేశారు. దేవరపల్లి మండలం పల్లంట్ల, లక్ష్మీపురం, బందపురం, దుద్దుకూరు; కొవ్వూరు మండలం ఐ.పంగిడి, కాపవరం, దొమ్మేరు, ధర్మవరం, మలకపల్లి ప్రాంతాల్లో పొగాకు నర్సరీలు ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, అశ్వారావుపేట ప్రాంతాలతో పాటు ఒంగోలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి రైతులు ఈ ప్రాంతానికి వచ్చి నారు కొనుగోలు చేసి తీసుకు వెళతారు. నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ ప్రాంతం రైతులతో కళకళలాడుతూంటుంది. అధిక దిగుబడులు ఇచ్చే 1353, ఎల్వీ–7 రకాల వంగడాలతో ఇక్కడి రైతులు నర్సరీలు వేశారు. ఎకరం రూ.80 వేలు పొగాకు నర్సరీలు వేసే భూముల కౌలు ఎకరానికి రూ.80 వేలు పలుకుతోంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ 15 వరకూ కౌలు వర్తిస్తుంది. అనంతరం భూమిని ఖాళీ చేసి యజమానికి అప్పగించాలి. గత ఏడాది ఎకరా కౌలు రూ.50 వేల నుంచి రూ.60 వేలు పలికింది. ఇప్పుడు మరింత పెరిగిందని కౌలుదారులు వాపోతున్నారు. సుమారు 250 మంది కౌలుదారులు ఏటా నర్సరీలు వేసి, మంచి ఆదాయం పొందుతున్నారు. మూడేళ్లుగా మార్కెట్లో పొగాకుకు అత్యధిక ధర పలుకుతూండటంతో నారుకు కూడా డిమాండ్ ఏర్పడింది. ఎకరం నారుకు రూ.5 వేలు ఎకరం విస్తీర్ణంలో నాటడానికి 6 వేల మొక్కలు అవసరమవుతాయి. వీటి ధర ప్రస్తుతం రూ.5 వేలు పలుకుతోంది. గత ఏడాది నారు ప్రారంభ ధర రూ.2 వేల నుంచి రూ.2,500 ఉండగా, ఈ ఏడాది ఏకంగా రెట్టింపైందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ ధర ఇలాగే కొనసాగితే మంచి ఆదాయం వస్తుందని అంటున్నారు. ముందుముందు ధర మరింత పెరుగుతుందని కౌలుదారులు ఆశిస్తున్నారు. 2023–24 సీజన్లో ఎకరం నారు రూ.17,500 పలకగా, 2024–25 సీజన్లో రూ.20 వేలు పలికింది. దీంతో నారుమడుల యజమానులు ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆదాయం పొందారు. పెట్టుబడులు పోను ఎకరాకు సుమారు రూ.15 లక్షల ఆదాయం రావడంతో కౌలు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల విస్తీర్ణంలో నారుమడులు వేశారు. మడులను రెండు విడతలుగా కట్టి అమ్మకాలు జరుపుతారు. పెట్టుబడులు రాని రైతులు కూడా ఉంటారు. నారు వ్యాపారం గాలిలో దీపం వంటిదని కౌలుదారులు చెప్పారు. పెట్టిన పెట్టుబడి చేతికి వచ్చేదాకా నమ్మకం ఉండదని అంటున్నారు. మంచి రేటు పలుకుతోంది పొగాకు నారుకు మంచి రేటు పలుకుతోంది. ఎకరం నారుకు ప్రస్తుతం వస్తున్న రూ.5 వేల ధర నిలబడితే పెట్టుబడులు పోను కొద్దిపాటి లాభాలతో బయటపడతాం. పదేళ్లుగా నారుమడులు కడుతున్నారు. పెట్టుబడులు రాని రోజులు కూడా ఉన్నాయి. రెండేళ్లుగా నారు వ్యాపారం బాగుంది. కౌలుకు 3.5 ఎకరాలు తీసుకుని, దాదాపు రూ.12 లక్షల పెట్టుబడి పెట్టి, నారుమడులు కట్టాను. మడులు ఆశాజనకంగా ఉన్నాయి. భూమి కౌలు, కూలీల ఖర్చు పెరిగింది. గతంలో కిలో విత్తనం రూ.15 వేలు ఉండేది. రెండేళ్లుగా రూ.25 వేలు పలుకుతోంది. నాట్లు ఊపందుకుంటే నారు రేటు పెరగవచ్చు. – తంగేళ్ల వేములరాజు, కౌలు రైతు, దేవరపల్లి పెట్టుబడి రూ.4.50 లక్షలు ఎకరం నారుమడి పెంచడానికి కౌలుతో కలిపి సుమారు రూ.4.50 లక్షల పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 3 కిలోల విత్తనం అవసరమవుతుంది. కిలో విత్తనం ఖరీదు రూ.25 వేలు. ఎకరం విస్తీర్ణంలో పోసిన నారు సుమారు 450 ఎకరాల్లో నాటడానికి సరిపోతుంది. నారుమడికి నల్లరేగడి భూములు అనుకూలం. నారుమడులు కట్టి కుబేరులైన రైతులతో పాటు కనీసం పెట్టుబబడులు రాక కుదేలైన రైతులు కూడా ఉన్నారు. ఎక్కువగా ట్రే నారుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. దీని రేటు ఎక్కువైనప్పటికీ రైతులు కొనుగోలు చేసి నాట్లు వేస్తున్నారు. ఈ నారు కాండం బలంగా ఉండి, చీడపీడలు ఉండవని చెబుతున్నారు. పెద్ద రైతులందరూ సొంతంగా ట్రే నారు సిద్ధం చేసుకున్నారు. -
300 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం
అమలాపురం టౌన్: ముమ్మిడివరం గేటు సెంటర్లోని శ్రీలలిత రైస్ స్టోర్స్పై మంగళవారం సివిల్ సప్లయిస్ అధికారులు దాడి చేశారు. ఆ షాపు యాజమాని రాంబాబు నుంచి 300 కేజీల (ఏడు బస్తాలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని, అతడిపై 6ఏ కేసు నమోదు చేశారు. సివిల్ సప్లయిస్ రాష్ట్ర డైరెక్టర్ కడలి ఈశ్వరి, జిల్లా కార్యాలయం ఏఎస్వో శరత్ సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు. షాపులో రికార్డులను తనిఖీ చేసి, స్టాక్కు అదనంగా రేషన్ బియ్యం ఉన్నట్టు గమనించారు. రాంబాబు తన షాపులో అమ్మకం కోసం తరచూ రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తునట్లు గుర్తించారు. -
కాకినాడ జిల్లా: దీపావళీ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట బ్రౌన్ పేటలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డు మీద బాణాసంచా కాలుస్తున్న యువకులను పోలీసులు చెదరగొట్టారు. బాణాసంచా కాల్పులను చూసేందుకు వచ్చిన అక్షయ్ కుమార్ గాయపడ్డాడు.ఆ యువకుడిని సామర్లకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ సతీష్ కుమార్.. అక్షయ్ కుమార్ మెడపై లాఠీతో కొట్టారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆసుపత్రి వద్ద దళిత సంఘాలు అందోళన చేపట్టాయి. పోలీసు వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకున్నారు. -
విజయమివ్వు విఘ్నేశ్వరా..
అయినవిల్లి: ప్రసిద్ధి చెందిన అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారు జామున మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామివారిని వివిధ పుష్పాలతో అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహా నివేదన చేశారు. సాయంత్రం ఎనిమిది గంటలకు స్వామికి విశేష సేవలు చేసి ఆలయం తలుపులు మూసివేశారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 100 మంది పాల్గొన్నారు. ముగ్గురికి తులాభారం నిర్వహించారు. శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 23 జంటలు పాల్గొనగా, స్వామికి ఒక భక్తుడు తలనీలాలు సమర్పించారు. 27 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1,480 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు ఆలయానికి వివిధ పూజా టిక్కెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.2,05,396 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
ఒక్క క్లిక్తో సమగ్ర సమాచారం
● పాఠశాలల అభివృద్ధికి యూ డైస్ ప్లస్ ● 23 నుంచి ఆధార్ నవీకరణ శిబిరాలు వేగవంతం చేయాలి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యూ డైస్ ఫ్లస్ నమోదు, అప్డేషన్ను ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాల్స్ వేగవంతం చేయాలి. ఈ నెలాఖరులోగా నూరు శాతం పూర్తి చేయాలి. ఇప్పటికే ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు అవగాహన కల్పించాం. గడువుకు ముందే నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి. – డి.తాతారావు, ఏఎస్ఓ, జిల్లా విద్యాశాఖ కార్యాలయం, ముమ్మిడివరం సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాల నమోదు ప్రక్రియ, అప్డేషన్ నిరంతరాయంగా జరుగుతోంది. ఈ నెల 23 నుంచి నిర్వహిస్తున్న ఆధార్ అప్డేషన్ను పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. యూ డైస్ ఫ్లస్ సమాచారం ఆధారంగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల సదుపాయాలకు నిధులు కేటాయిస్తున్నారు. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరం: విద్యా వ్యవస్థ సమగ్ర సమాచారాన్ని ఒకేచోట నిక్షిప్తం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందుకుగాను యూ డైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) వెబ్సైట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక్క క్లిక్తో ప్రభుత్వ పాఠశాలల పూర్తి సమాచారం వెబ్సైట్లో ప్రత్యక్షమవుతోంది. పాఠశాలల స్థితిగతులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల సమాచారంతో పాటు మౌలిక వసతులు ఏ పాఠశాలలో ఎలా ఉన్నాయో, ఎంతమంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యారన్న విషయాలు స్పష్టంగా తెలుసుకునే వీలుంది. ఇప్పుడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యూ డైస్ ఫ్లస్ను అప్డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. గతంలో యూడైస్ నమోదు మాన్యువల్గా ఉండగా 2022–23 నుంచి యూడైస్ ప్లస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్)గా ఆధునికీకరించారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని సేకరించి, అప్డేట్ చేస్తున్నారు. గతంలో ఏడాదికోసారి సమాచారం అప్డేట్ చేయగా.. ఇకపై నిరంతరం సాంకేతికత ఆధారంగా సమాచారాన్ని అప్డేట్ చేసే అవకాశం ఉంది. పాఠశాలలో మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మాడ్యుల్స్గా వెబ్సైట్ను మూడు భాగాలుగా విభజించి సమాచారం నిక్షిప్తం చేస్తున్నారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయుల నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వివరాలు కీలకం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న ప్రతి విద్యార్థి వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలు నమోదు చేయగా, ప్రస్తుత సమాచారంతో అప్డేట్ చేస్తున్నారు. అలాగే పాఠశాలల్లోని తరగతి గదులు, మరుగుదొడ్లు, వంట గదులు, తాగునీరు తదితర సదుపాయాల వివరాలతోపాటు వాటి స్థితిగతులపై తాజా సమాచారాన్ని పొందుపరుస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందుతున్న వసతుల కల్పనకు యూడైస్ ఫ్లస్లోని వివరాలు కీలకం కానున్నాయి. అవినీతికి పాల్పడకుండా ఈ విధానం ఉపయోగపడనుంది. వెబ్సైట్లో నమోదైన విద్యార్థులకే యూనిఫాం, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర వాటిని అందించనున్నారు. ప్రతి విద్యార్థికి నంబర్ కేటాయింపు యూ డైస్ ప్లస్ పోర్టల్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది. ప్రతి ఏడాది అన్ని పాఠశాలల సమగ్ర వివరాలను ప్రధానోపాధ్యాయులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో నమోదు చేసిన ప్రతి విద్యార్థికి ఒక పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పీఈఎన్) కేటాయిస్తారు. దీని ద్వారా ఆ విద్యార్థి దేశ వ్యాప్తంగా ఏఏ పాఠశాలల్లో ఏఏ తరగతులు చదివాడు అనేది కచ్చితంగా తెలుస్తుంది. పదో తరగతి విద్యార్థి బోర్డు పరీక్షలు రాయాలంటే ఇందులో నమోదై ఉండాల్సిందే. అలాగే ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు మాదిరిగానే జారీ చేయాలి. జిల్లాలో 2.40 లక్షల మందికి అపార్ కార్డులు జనరేట్ చేయాల్సి ఉండగా, 2.25 లక్షల మందికి పూర్తయ్యింది. ఇంకా 15 వేల మందికి అపార్ కార్డులు జనరేట్ చేయాలి. 23 నుంచి ఆధార్ శిబిరాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా 5 నుంచి 15 ఏళ్లు పైబడి ఉన్న విద్యార్థుల వేలిముద్రల అప్డేషన్ చేయనున్నారు. జిల్లాలో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 2.40 లక్షల మంది విద్యార్థుల ఆధార్ అప్డేషన్ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 1.98 లక్షల మంది అప్డేట్ కాగా, ఇంకా 42 వేల మంది విద్యార్థులకు ఆధార్ వేలిముద్రల అప్డేషన్ చేయాల్సి ఉంది. దీనికోసం పాఠశాలల్లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆధార్ అప్డేషన్ శిబిరాలను ఈ నెల 23 నుంచి 30 వరకూ నిర్వహించనున్నారు. -
శ్రీప్రకాష్లో ధన్వంతరి జయంతి వేడుకలు
తుని: స్థానిక శ్రీప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రిలో ఆయుర్వేద మూల పురుషుడు ధన్వంతరి జయంతి, జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్, రీసెర్చ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్, రీసెర్స్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సీహెచ్వీకే నరసింహారావు, రామసీత దంపతులు ధన్వంతరి హోమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖ ఆయుర్వేద వైద్యులు కన్నాలయం గోపాలన్ రవీంద్రన్, ప్రవచనకర్త, ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు హాజరయ్యారు. రవీంద్రన్ను చాగంటి కోటేశ్వరరావు సత్కరించారు. డాక్టర్ గోపాలన్ రవీంద్రన్ మాట్లాడుతూ ఆరోగ్యరమైన జీవనానికి ఆయుర్వేదం దిక్సూచి లాంటిదన్నారు. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పొందుతామన్నారు. ఉన్నత స్థితికి చేరడానికి గురువు దిక్సూచి అన్నారు. నరసింహారావు మాట్లాడుతూ ఈ ప్రాంత వాసులకు ఆయుర్వేద వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఆయుర్వేద చికిత్సాలయం స్థాపించామన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. అకాడమీ ఆయుర్వేద ఆసుపత్రి ట్రస్టీ డాక్టర్ యు.ఇందులాల్, సైకాలజికల్ కౌన్సిలర్ అపర్ణశర్మ, శ్రీప్రకాష్ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ప్రకాష్, ఆయుర్వేద చికిత్సాలయ సలహాదారుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రధాన వైద్యులు టి.రమేష్బాబు, ఎంఏ సుమయ్య పాల్గొన్నారు. -
ముంపే మేజర్ సమస్య
ఫ అభివృద్ధికి దూరంగా శంకరగుప్తం డ్రైన్ ఫ ఏళ్ల కాలంగా పట్టించుకోని పాలకులు ఫ ముంపు నుంచి రక్షించాలని రైతుల మొర మలికిపురం: రాజోలు దీవిలో బంగాళాఖాతానికి కాస్త పైన, రెండు గోదావరి పాయల మధ్య సహజ సిద్ధంగా రక్తతుల్య నది ఏర్పడింది. ఇది క్రీక్ అని భౌగోళిక నదీ పరివాహక మ్యాప్లో ఉంది. ఈ క్రీక్కు బంగాళాఖాతానికి మధ్య ఏడు గ్రామాలతో మరో దీవి ఉంది. ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించాక కాటన్ మహాశయుడు ఈ క్రీక్కు శంకరగుప్తం మేజన్ డ్రైన్గా పేరు పెట్టారు. ఆనకట్ట నిర్మించిన సమయంలో ఏర్పడిన పలు కొత్త మేజర్, మైనర్ డ్రైన్లు, ప్రధాన కాలువల నుంచి శివారు కాలువలు ఈ డ్రైన్లలో కలిసేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వైనతేయ మీదుగా సముద్రంలో కలుస్తుంది. అయితే మేజర్ డ్రైన్లోకి మురుగునీరు రావడం, ఒకవైపు సముద్ర పోటు పాట్లు, వరదల వేళ పోటెత్తడంతో యాభై ఏళ్లుగా ఈ క్రీక్ రైతులకు దుఃఖదాయినిగా మారింది. సుమారు 80 గ్రామాలతో కూడిన రాజోలు దీవి కి మూడు వైపులా గోదావరి నది, మరోవైపు బంగాళాఖాతం ఉన్నాయి. మొత్తం గోదావరి నదికి వచ్చే వరద నీటిలో ఏటా సుమారు 90 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు అంటే మూడొంతుల్లో రెండొంతుల నీరు వశిష్ఠ, వైనతేయ పాయల మధ్యే సముద్రంలో కలుస్తుంది. సరిగ్గా ఈ రెండు పాయల మధ్యే శంకరగుప్తం డ్రైన్ ఉంది. క్రీక్ వైనతేయ నదిలో కలిసే ముఖ ద్వారానికి ఎదురుగా కూనవరం మేజర్ డ్రైన్ ఉంటుంది. అటు నుంచి వచ్చే ముంపునీరు కూడా ఈ డ్రైన్కు ఎదురు కావడం వల్ల శంకరగుప్తంపై భారీ ఒత్తిడి పడుతోందని డ్రైనేజీ శాఖ ప్రస్తుత అంచనా. శంకరగుప్తం డ్రైన్కు బంగాళాఖాతం వైపు ఉన్న ఏడు గ్రామాల దీవికి, రాజోలు దీవితో 1970 వరకూ వంతెనలే లేవు. పి.గన్నవరం అక్విడెక్ట్ కట్టిన తర్వాత నుంచి ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థపై ప్రభుత్వ శాఖలు శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా నేటికీ డ్రైన్లకు హద్దులు లేక ఆక్రమణలతో, ముంపు సమస్యలతో ఆనకట్ట రైతాంగం వ్యవసాయానికి దూరమవుతోంది. అప్పటి నుంచీ ఇలా.. రాజోలు దీవిలో శంకరగుప్తం డ్రైన్తో అవస్థలు తొలగించాలని 1960 నుంచి ఆందోళనలు మొదలయ్యాయి. ఫలితంగా 1971–72 మధ్య కేశనపల్లి సర్పంచ్ యెనుముల బాపిరాజు హయాంలో రూ.లక్షతో శంకరగుప్తం డ్రైన్కు మరమ్మతులు చేశారు. అప్పట్లో తూర్పుపాలెం వైపు అడ్డుకట్ట వేసి సుమారు 400 మంది కార్మికులు కొన్ని నెలల పాటు పూడిక తీసి ఏటిగట్లు వేశారు. కనుమరుగైన ఆ ఏటిగట్లనే నేడు పునర్నిర్మించాలని అంతా కోరుతున్నారు. తిరిగి 1980లో డ్రైన్లో ముంపునీటి పారుదల మెరుగుకు డ్రైన్ చివరి భాగం అయిన కేశవదాసుపాలెం నుంచి నేరుగా సముద్రంలోకి స్ట్రెయిట్ కట్ తవ్వారు. ఇక్కడ మెరక వల్ల, సముద్ర కెరటాల ఉధృతి వంటి సాంకేతిక సమస్యలతో స్ట్రెయిట్ కట్ మూసుకుపోయి మురుగు కిందకు దిగని దుస్థితి నెలకొంది. తిరిగి 2006లో కేశవదాసుపాలెం నుంచి కత్తిమండ వరకూ అప్పట్లో రూ. 40 లక్షలతో పూడికతీసి గట్లు వేశారు. ఇది చాలా ఉపయోగపడింది. గట్లు వేయడం వల్ల ఉప్పునీరు పొలాలకు చేరకపోవడంతో రైతులకు మేలు జరిగింది. అనంతరం 2016లో రూ.15 కోట్లతో డ్రైన్ ముఖ ద్వారం కరవాక నుంచి కేశనపల్లి వరకూ 8 కిలోమీటర్ల మేర డ్రెడ్జింగ్ చేశారు. అప్పట్లో డ్రెడ్జింగ్ మట్టిని గట్లుగా వేయాలని ప్రతిపాదనలు ఉన్నా ఇంజినీర్లు, అప్పటి పాలకులు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. గట్లు వేయకుండా, పూడిక మట్టిని నేరుగా రైతుల పొలాల్లోకి తరలించడంతో వేలాది ఎకరాలలో కొబ్బరి తోటలు దెబ్బతిన్నాయి. నిధుల బట్టి చర్యలు డ్రైన్ పొడవునా ప్రత్యేక బృందంతో అధ్యయనం చేశాం. ఇందులో ఇరిగేషన్కు చెందిన జీడీఎస్, సీడీఓ ఇంజినీర్ల బృందం ఉన్నారు. ముంపు నుంచి రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై నివేదికను ప్రభుత్వానికి అందజేశాం. నిధుల లభ్యతను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. –ఎంవీవీ కిషోర్, డ్రైనేజీ శాఖ ఈఈ, కాకినాడ పార్టీలకతీతంగా ఏకమై.. శంకరగుప్తం డ్రైన్ ముంపు రాజోలు దీవిలో పది వేల మంది రైతులకు చెందిన సుమారు 20 వేల ఎకరాల్లో 1.50 లక్షల కొబ్బరి చెట్లను నాశనం చేసింది. ప్రస్తుతం ఈ ప్రాంత రైతులు, ప్రజలు పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తున్నారు. అయినా ఈ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో చేసిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర ఇరిగేషన్ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావుతో పర్యటించి తిరిగి ప్రతిపాదనలు చేయాలని సూచించారు. ఈ నెలలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ డ్రైన్ను పరిశీలించనున్నారు. కొత్త ప్రతిపాదనలతో అంచనాలు రూ.30 కోట్ల వరకూ చేరే అవకాశం ఉంది. డ్రెడ్జింగ్ చేసి ఇరువైపులా ఆరు మీటర్ల వెడల్పుతో ఏటిగట్లు వేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనికిగాను ప్రస్తుత డ్రైన్వ వాస్తవ పరిస్థితిపై ఉన్నతాధికారులు సర్వే చేస్తున్నారు. -
కార్తిక స్నానాలకు గోదావరి ఘాట్లు సిద్ధం
రాజమహేంద్రవరం సిటీ: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం రామహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరి ఘాట్లను సిద్ధం చేస్తున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల భక్తులు వేలాదిగా వచ్చే అవకాశం ఉంది. మొత్తం 7 ఘాట్లలో పుణ్య స్నానాలకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రసిద్ధి చెందిన కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, దుర్గాదేవి ఘాట్, పుష్కర ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమ ఘాట్లలో స్నానాలు ఆచరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నదిలో దిగి స్నానం చేయలేని వృద్ధులు, చిన్నారులు, మహిళల కోసం దుర్గాదేవి ఘాట్ మినహా జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను సిద్ధం చేశారు. పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు కార్మికులను అదనంగా నియమించారు. రెండు షిఫ్ట్లలో సుమారు 80 మంది పని చేయనున్నారు. స్నానాలు ఆచరించే సమయంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యం లేకుండా ఘాట్లలో ఇసుకను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. కార్త్కి సోమవారం, పౌర్ణమి సమయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నగరపాలక సంస్థ శానిటరీ సూపర్వైజర్ ఐ.శ్రీనివాస్ వెల్లడించారు. -
పెట్రోల్కు బదులు వర్షం నీరు
తుని రూరల్: తుని మండలం తేటగుంట శివారు ఎర్రకోనేరు వద్ద ఓ పెట్రోల్ బంకులో యాజమాన్యం నిర్వాకంతో పెట్రోల్కు బదులుగా మోటార్ సైకిళ్లకు వర్షపు నీరు పోశారు. ఆదివారం ఉదయం పెట్రోల్ కోసం పలువురు వాహనదారులు వెళ్లారు. పెట్రోల్ నింపినా వాహనాలు స్టార్ట్ కాకపోవడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. చివరికి బంకులో నింపిన పెట్రోల్ను బయటకు తీసి చూడగా ఎర్రగా నీరు వచ్చింది. ఆందోళన వ్యక్తం చేసి వాహనదారులు బంకు యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో డబ్బు తిరిగి ఇచ్చేస్తామనడంతో వాహనదారులు శాంతించారు. బంకులో పెట్రోల్ ట్యాంకు పైపులైన్కు మరమ్మతులు చేస్తుండడం, శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో వర్షపునీరు చేరి ఈ పరిస్థితి నెలకొన్నట్టు యాజమాన్యం సర్థి చెప్పింది. ఆరేళ్ల కిందట ఇదే పరిస్థితి తలెత్తడంతో ఈ విషయం జిల్లా అధికారులకు వెళ్లడంతో తనిఖీలు చేశారు. ఈ మేరకు జరిమానాలు విధించారు. ఇప్పుడు డబ్బులు తిరిగి చెల్లించడంతో వాహనదారులు అధికారులకు ఫిర్యాదు చేయకపోవడంతో సమస్య సద్దుమణిగింది. -
విధుల్లోనే ఉండమంటారు!
● దీపావళికి నోచుకోని అగ్నిమాపక శాఖ ● కుటుంబాలకు దూరంగా ఉండాల్సిందే! ● ఖాళీ పోస్తులు భర్తీకాక మరింత ఇబ్బంది కొత్తపేట: దీపావళి.. అందరికీ ఎంతో అమితమైంది. టపాసులు పేల్చుతూ, ఆ వెలుగులను చూసి కుటుంబంతో సంతోషంగా గడిపే రోజు అది. అలాంటి పండగకూ అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడూ దూరమే.. ఎందుకంటే ఆ పండగ రోజునే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో, ఆ రాత్రంతా మేల్కొని విధులు నిర్వహిస్తామని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి అగ్నిమాపక కేంద్రం వద్ద విధుల్లో ఉండే ఫైర్మెన్ల పరిస్థితి దయనీయమనే చెప్పాలి. దీనికితోడు ఈ శాఖలో ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే ఒత్తిడి పెరిగి పండగ రోజుల్లోనూ అందరూ విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వ శాఖలకు దీపావళి రోజు సెలవు అయినప్పటికీ, కానీ ఒక్క అగ్నిమాపక శాఖకు మాత్రం సెలవు ఉండదు. కచ్చితంగా విధులకు హాజరు కావాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం సంభవిస్తుందోనని అప్రమత్తంగా ఉంటూ డ్యూటీ చేయాలి. అంతేకాదు దీపావళికి వారం, పది రోజుల ముందు నుంచే ఆఫ్ కూడా తీసుకోకుండా ఆన్ డ్యూటీలో ఉండాలి. ఈ విధంగా వారు దీపావళి పండగకు దూరమవుతున్నారు. సిబ్బంది లేక.. ఇబ్బంది రాష్ట్రంలో పోలీసు, జైళ్ల శాఖ, ఏపీఎస్పీ, ఏఆర్ డిపార్ట్మెంట్లలో అన్ని ఖాళీలు భర్తీ చేశారు. కానీ అగ్నిమాపక శాఖలో మాత్రం ఖాళీలను మాత్రం భర్తీ చేయలేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 17 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి లీడింగ్ ఫైర్మెన్, ఫైర్మెన్, డ్రైవర్లు, ఇలా సుమారు 15 మంది ఉండాలి. అలా జిల్లాలో సుమారు 255 మంది సిబ్బంది అవసరం. కానీ ప్రస్తుతం 147 మంది మాత్రమే ఉండడం గమనార్హం. ఇందులో అమరావతి, కూనవరం తదితర డ్యూటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సిబ్బందినే పంపిస్తున్నారు. అలా డ్యూటీ పడిన సిబ్బంది ప్రతి నాలుగు నెలలకు 15 రోజులు అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తుందని ఆ శాఖ జిల్లా యూనియన్ నాయకులు చెబుతున్నారు. సిబ్బంది లేక ఇబ్బంది ఎదురవుతోందని, అగ్నిమాపక శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని వారు కోరుతున్నారు. ఏ పండగ వచ్చినా ఇంతే.. ఒక్క దీపావళి మాత్రమే కాదు.. ఏ పండగకు నోచుకోం.. దీపావళి అంటే అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉన్న పండగ. సంక్రాంతి పండగ అంటే ఎక్కడికక్కడ ప్రభల ఉత్సవాలు, ఊరేగింపులు, బాణసంచా కాల్పులు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా ప్రతి పండగ మా శాఖతో ముడిపడి ఉంటుంది. కుటుంబ ఆనందాలు వదులకుని ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణ కర్తవ్యంగా పనిచేస్తున్నామని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెబుతున్నారు. ప్రతి ఏడాది దీపావళికి ముందురోజు డ్యూటీ ఆఫ్ వస్తే టపాసులు కొని ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చి జాగ్రత్తగా కాల్చుకోమని చెప్పి తిరిగి డ్యూటీకి వచ్చేవాళ్లమని, ఈసారి రాయవరంలో భారీ విస్ఫోటం కారణంగా ఆ అవకాశం కూడా లేకుండా పోయిందని వారు వాపోయారు.వరుసగా మూడు రోజులూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్ అండ్ ఆఫ్ డ్యూటీలు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో దీపావళికి రెండు రోజుల ముందు నుంచీ విధులు నిర్వర్తించాల్సిందే. వరుసగా దీపావళి వరకూ ఆన్ డ్యూటీలో ఉండాల్సిందే. ఇటీవల రాయవరంలో జరిగిన బాణసంచా పేలుడు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది తప్పనిసరి పరిస్థితుల్లో వరుసగా మూడు రోజులూ విధులు నిర్వర్తిస్తున్నారు. -
చీరమేను... అదిరేను
యానాం: గోదావరి నదీ ముఖ ద్వారాల వద్ద చీరమేను అధికంగా పడుతుండటంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేవు. పులస తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో వచ్చే చీరమేనుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రుచికరంగా ఉండటంతో మాంసాహార ప్రియులు చీరమేను కొనుగోలుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఎక్కువగా పడుతుండటంతో చీరమేనును కూరతో పాటు గారెలను సైతం వేసుకుంటున్నారు. స్థానికంగా ఓ కుటుంబం చీరమేనును గారెలుగా వేసి పలువురికి రుచి చూపించారు. గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు సైతం ప్రదర్శించారు. అమ్మకాల జోరు యానాం మార్కెట్లో చీరమేను అమ్మకాల సందడి నెలకొంది. సేరు, బకెట్, క్యారేజీ కొలతల్లో చీరమేను అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పది సేర్ల బకెట్ రూ.18 వేలకు అమ్ముడుకాగా, అనంతరం చీకటి పడటంతో అదికాస్తా రూ.12 వేలకు దిగింది.యానాం మార్కెట్కు విరివిగా చేపలు -
క్వారీ.. సారీ
ఫ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం ఫ కుదేలైన పరిశ్రమ ఫ గౌరీపట్నం ప్రాంతంలో 60 క్రషర్లు, 40 క్వారీలు ఫ క్రషర్లను స్క్రాప్కు అమ్మేస్తున్న యజమానులు ఫ ఉపాధి లేక వలస పోతున్న కార్మికులు ఫ సంక్షోభంలో క్వారీలు దేవరపల్లి: ఒకప్పుడు యజమానులకు కాసులు కురిపించిన నల్లరాతి క్వారీ పరిశ్రమ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేవరపల్లి మండలం గౌరీపట్నం, కొండగూడెం, దుద్దుకూరు, బందపురం, లక్ష్మీపురంతో పాటు కొవ్వూరు మండలం ఐ.పంగిడి, దేచర్ల ప్రాంతాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా నల్లరాతి క్వారీలు విస్తరించి ఉన్నాయి. వీటికి అనుబంధంగా పలువురు స్టోన్ క్రషర్లను స్థాపించి ఇక్కడి నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు నల్లరాతి మెటల్ను సరఫరా చేస్తున్నారు. క్వారీల్లోని నల్లరాతి ముక్కలను (పాల్స్) లారీల ద్వారా క్రషర్ వద్దకు తరలిస్తారు. అక్కడ వివిధ సైజుల్లో క్రషింగ్ చేసి భవన నిర్మాణాలు, సీసీ, తారు రోడ్లు, జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణానికి సరఫరా చేస్తూంటారు. కరెంట్ బిల్లులు సైతం కట్టలేక.. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇక్కడ క్వారీ త్వకాలు జరుగుతున్నాయి. ఇన్నేళ్లూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన క్వారీ పరిశ్రమ దాదాపు రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి కూటమి సర్కారు అనుసరిస్తున్న వైఖరే కారణంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూటమి సర్కారు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో, కొత్త పనులు చేయడానికి వారు ముందుకు రావడం లేదు. ఫలితంగా ప్రధాన రహదారులు, ప్రభుత్వ కాలనీల నిర్మాణం వంటి పనులు నిలిచిపోయాయి, ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు ప్రభుత్వ వైఖరితో తమ వ్యాపారం కుదేలైందని క్వారీ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం పాత బిల్లులు చెల్లించి, కొత్త పనులు ప్రారంభిస్తేనే మెటల్ వ్యాపారం జరుగుతుందని చెబుతున్నారు. కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితిలో కూరుకుపోయామని ఆవేదన చెందుతున్నారు. ఒక్కో క్రషర్కు సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకూ కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో క్రషర్ తిప్పితే కరెంటు బిల్లుకు కూడా రాబడి ఉండటం లేదని వాపోతున్నారు. జిల్లా, మండల పరిషత్తులు, గ్రామ పంచాయతీలకు ప్రతి ఆరు నెలలకోసారి మైనింగ్ సెస్ జమ చేసేవారు. క్వారీలు సంక్షోభంలో కూరుకుపోవడంతో ఈ రూపేణా స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం తగ్గిందని ప్రజాప్రతినిధులు అంటున్నారు. మూత పడుతున్న క్రషర్లు వ్యాపారాలు లేకపోవడంతో స్టోన్ క్రషర్లు మూత పడుతున్నాయి. కొంత మంది యజమానులు క్రషర్లను తిప్పలేక స్క్రాప్కు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. స్క్రాప్కు అమ్మితే క్రషర్కు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు వస్తోందని, కొత్త క్రషర్ నిర్మించాలంటే సుమారు రూ.3 కోట్లు అవుతుందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడి క్వారీ పరిశ్రమలో సుమారు 30 క్రషర్లు మూత పడి, స్క్రాప్కు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో పదేళ్ల క్రితం సుమారు 150 క్రషర్లు, 120 క్వారీలు ఉండేవి. ప్రస్తుతం 40 క్వారీలు, 60 క్రషర్లు ఉండగా, వీటిల్లో పని చేస్తున్న కార్మికుల సంఖ్య 20 వేల నుంచి 5 వేలకు పడిపోయింది. ఇక్కడ ఉపాధి లేక అనేక మంది కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. అప్పుల్లో కూరుకుపోయారు కూటమి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కొత్త పనులు ప్రారంభంకాలేదు. దీని ప్రభావం పరిశ్రమపై పడి, క్వారీలు, క్రషర్ల యజమానులు అప్పుల్లో కూరుకుపోయారు. మూడు నెలల్లో 20 క్రషర్లు మూతబడ్డాయి. కార్మికులకు జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించలేని పరిస్థితి. యూనిట్ మెటల్ రేటు రూ.1,800 ఉంది. డీజిల్, కరెంట్ చార్జిలు, కార్మికుల వేతనాలు పెరిగాయి. కానీ, మెటల్ ధర పెరగకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. పుష్కరాల పనులపై ఆశలు పెట్టుకున్నాం. – ముదునూరి సూర్యనారారాయణరాజు, ఉపాధ్యక్షుడు, జిల్లా క్వారీ, క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్, గౌరీపట్నం వ్యాపారం పడిపోయింది క్వారీ పరిశ్రమ సంక్షోభంలో ఉంది. మెటల్ వ్యాపారం పడిపోయింది. క్రషర్లు తిప్పడారని యజమానులు భయపడుతున్నారు. ఇప్పటికే చాలా క్రషర్లు మూతబడ్డాయి. ఇటీవల 20 క్రషర్లను స్క్రాప్కు అమ్ముకున్నారు. స్టోన్ క్రషర్లను ఎంఎస్ఎంయూలో చేర్చి రాయితీలివ్వాలి. రహదారుల నిర్మాణం చేపడితే పరిశ్రమ కోలుకుంటుంది. పరిశ్రమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతా. – ఆండ్రు అనిల్, అధ్యక్షుడు, జిల్లా క్వారీ, క్రషర్స్ ఓనర్స్ అసోసియేషన్, గౌరీపట్నం ఉపాధి కోల్పోయిన కార్మికులు మెటల్ ధర పతనం కావడంతో క్వారీలు, క్రషర్లు మూతబడుతున్నాయి. పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో కార్మికులు ఉపాధి కోల్పోయి, ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ప్రభుత్వం ఈ పరిశ్రమను ప్రోత్సహిస్తే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. – షేక్ మస్తాన్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రగతిశీల కార్మిక సమాఖ్య 20 వేల మందికి ఉపాధిఇక్కడ లభించే నల్లరాతి మెటల్ ఎంతో నాణ్యతగా ఉంటుంది. అందుకే దీనిని నల్ల బంగారంగా పిలిచేవారు. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని క్వారీ పారిశ్రామిక వాడగా గుర్తించింది. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, భీమవరం, విజయవాడ ప్రాంతాలకు చెందిన యజమానులు ఈ ప్రాంతంలో క్వారీలు ఏర్పాటు చేసి, స్టోన్ క్రషర్లు స్థాపించి, వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. విశాఖపట్నంతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 20 వేల మంది కార్మికులు ఈ పరిశ్రమలోని వివిధ రంగాల్లో ఉపాధి పొందేవారు. పుష్కరాల పనులపై ఆశలు ప్రస్తుతం క్వారీ, క్రషర్ యజమానులు 2027లో గోదావరి పుష్కరాలపై ఆశలు పెట్టుకున్నారు. ఆ సందర్భంగా కొత్త పనులతో పాటు రోడ్ల అభివృద్ధి, భవన నిర్మాణాల వంటి పనులు ప్రారంభమై, వ్యాపారం పుంజుకుంటుందని భావిస్తున్నారు. పుష్కరాల పనులకు ఈ ప్రాంతంలోని మెటల్ను వినియోగించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి రూ.120 కోట్ల ఆదాయం ఇక్కడి క్వారీల ద్వారా మైనింగ్ సెస్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.120 కోట్ల ఆదాయం వస్తోంది. గతంలో ఏటా రూ.150 కోట్లు వచ్చేది. ఈ మొత్తంతో స్థానిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు, గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించేవారు. -
ప్రజలకు ఎస్పీ దీపావళి శుభాకాంక్షలు
ఎస్పీ నరసింహ కిశోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంధకారంపై వెలుగు విజయం సాధించిన ఈ పండగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో ఐకమత్యం, సంతోషం నిండాలన్నారు. ప్రజలందరూ కాలుష్య రహిత దీపావళిని సురక్షితంగా, ఆనందంగా నిర్వహించుకోవాలని కోరారు. ఉత్సాహంగా ‘చెకుముకి’ పోటీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.భీమయ్య, ఎన్.రవిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వివిధ పాఠశాలల్లో ఈ సంబరాలు నిర్వహించామన్నారు. నాలుగు స్థాయిల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి స్థాయిలో పాఠశాల స్థాయి సంబరాలకు 8, 9, 10 తరగతుల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. నవంబర్ 1న మండల, పట్టణ స్థాయిల్లో చెకుముకి పరీక్ష జరుగుతుందని, పాఠశాల స్థాయి విజేతలు ఈ పోటీల్లో పాల్గొనాలని సూచించారు. -
సర్కారు నిర్వాకం.. అన్నదాతకు అన్యాయం
ోరుకొండ: విత్తు నుంచి పంట దిగుబడుల విక్రయం వరకూ అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులకు విత్తనాలతో పాటు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు సకాలంలో అందించేవారు. వీటిలో సిబ్బందిని నియమించి, సకాలంలో వ్యవసాయ సలహాలు, సూచనలు అందించారు. అలా ఎన్నో విధాలుగా ఈ ఆర్బీకేలు రైతులకు తోడుగా నిలిచేవి. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్బీకేల పేరును రైతు సేవా కేంద్రాలు(ఆర్ఎస్కే)గా మార్చారు. ఆ తరువాత నుంచి వీటిని క్రమంగా నిర్వీర్యం చేస్తూ వచ్చారు. తద్వారా రైతులకు సరైన సేవలు అందని పరిస్థితి ఏర్పడింది. దీనిని అవకాశంగా తీసుకుని, ఆర్ఎస్కే భవనాలను ఇతర అవసరాలకు వినియోగించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదే కోవలో కోరుకొండ–1 ఆర్ఎస్కేలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేశారు. ఇప్పటి వరకూ కోరుకొండ పోలీస్ స్టేషన్ స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉంది. వర్షం కురిస్తే ఆ భవనం కారిపోతోంది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు కొత్త భవనం నిర్మించాల్సింది పోయి, ఏకంగా ఆర్ఎస్కేలోనే మకాం పెట్టేశారు. అయితే, దీనిని రెండు నెలలకు మాత్రమే అడిగినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, ఇక్కడ లాకప్ వంటి శాశ్వత ఏర్పాట్లు చేశారు. రెండు నెలలకే అయితే, పక్కా ఏర్పాట్లు ఎందుకు చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోరుకొండ–1 ఆర్ఎస్కే పరిధిలో సుమారు 600 మంది రైతులు ఉన్నారు. సాగు సూచనల కోసం వస్తున్న రైతులు అక్కడ పోలీస్ స్టేషన్ దర్శనమివ్వడంతో నివ్వెరపోతున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరితే గ్రామంలో కోరుకొండ–2 ఆర్ఎస్కే ఉందని, రైతులు అక్కడకు వెళ్లాలని చెబుతున్నారు. -
కార్తికం.. భక్త్యుత్సవం
అన్నవరం: హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసం బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సామర్లకోటలోని పంచారామ క్షేత్రం శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు హరిహర క్షేత్రంగా భాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కార్తిక మాసోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశ్వయుజ అమావాస్య సోమవారం సాయంత్రం ప్రారంభమై మంగళవారం సాయంత్రానికి ముగుస్తుంది. అయితే, శుద్ధ పాడ్యమి తిథి ఉదయం వేళకు ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి పంచాంగం ప్రకారం బుధవారమే కార్తిక మాసం ఆరంభమవుతుంది. అయితే, కార్తిక శుద్ధ పాడ్యమి తిధి మంగళవారం సాయంత్రమే వస్తున్నందున ఆలయాల్లో మాత్రం ఆ రోజు రాత్రి ఆకాశ దీపం ఏర్పాటుతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభించనున్నారు. అన్నవరం దేవస్థానంలో అర్చకులు మంగళవారం రాత్రి ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం ఏర్పాటు చేయడం ద్వారా కార్తిక మాసోత్సవాలకు శ్రీకారం చుడతారు. కార్తిక అమావాస్య అయిన నవంబర్ 20వ తేదీ వరకూ ప్రతి రోజూ ఆకాశ దీపం ఏర్పాటు చేస్తామని ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇవీ ఏర్పాట్లుకార్తిక మాసంలో సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా భక్తులు తరలి రానున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ శని, ఆది, సోమవారాలతో పాటు, దశమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తిక పౌర్ణమి తదితర 16 పర్వదినాల్లో వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున తెల్లవారుజామున ఒంటి గంట నుంచే సత్యదేవుని వ్రతాలు, 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఫ పౌర్ణమి, ఏకాదశి, పర్వదినాల్లో పశ్చిమ రాజగోపురం వద్ద రోప్ పార్టీ ఏర్పాటు చేసి, అధిక సంఖ్యలో వచ్చే భక్తులను బృందాల వారీగా దర్శనానికి అనుమతిస్తారు. ఫ పర్వదినాల్లో ముందు రోజు రాత్రే వ్రతాల టికెట్లు ఇస్తారు. దీనికి గాను ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. స్వామివారి దర్శనం టికెట్లు, ప్రసాద విక్రయాలకు కూడా అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఫ కార్తిక శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ది ద్వాదశి) సందర్భంగా నవంబర్ రెండో తేదీ రాత్రి 6.30 గంటల నుంచి పంపా సరోవరంలో సత్యదేవుని తెప్పోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. ఫ కార్తిక పౌర్ణమి సందర్భంగా నవంబర్ ఐదో తేదీ ఉదయం సత్యదేవుని గిరి ప్రదక్షిణ పల్లకీ మీద లాంఛనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు సత్యరథంతో గిరి ప్రదక్షిణ ఘనంగా ప్రారంభించి, సాయంత్రం ఆరున్నర గంటలకు ముగిస్తారు. అదే రోజు సాయంత్రం 5.45 గంటలకు పంపా జలాశయం వద్ద పంపా హారతులు, రాత్రి 7 గంటలకు తొలి పావంచా వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. ఫ కార్తికం నెల రోజులూ చిన్న కార్లు, ఆటోలు మినహా మరే ఇతర వాహనాలను కొండ మీదకు అనుమతించరు. పెద్ద వాహనాలను భక్తులు కళాశాల మైదానంలో నిలిపివేసి, దేవస్థానం బస్సులు, ఆటోల ద్వారా కొండ మీదకు చేరుకోవాలి. ఫ కొండ మీదకు వచ్చే చిన్న కార్లను సత్యగిరి రోడ్డు పక్కన, సత్రాల ఆవరణలో నిలుపు చేస్తారు. దీనికోసం పార్కింగ్ స్థలాన్ని ప్రత్యేకంగా విశాలంగా రూపొందిస్తున్నారు. సుమారు 4 వేల కార్ల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువకు వెళ్లే వాహనాలను ఆదిశంకర మార్గ్ ద్వారా పంపిస్తారు. ఫ రత్నగిరిపై 2 వేల మంది సేద తీరేందుకు వీలుగా డార్మెట్రీ, విష్ణు సదన్లో 36 హాళ్లు ఉన్నాయి. సీఆర్ఓ కార్యాలయం వద్ద నిర్మించిన డార్మెట్రీలో లాకర్లతో పాటు అన్ని సదుపాయాలూ కల్పించారు. ఈఓ కార్యాలయం దిగువన ఉన్న మెయిన్ క్యాంటీన్ను కూడా డార్మెట్రీగా మార్చనున్నారు. ఫ విద్యుత్ సరఫరా 24 గంటలూ నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఫ దేవస్థానం, కొండ దిగువన మెయిన్ రోడ్డు, రైల్వే స్టేషన్ రోడ్డులో పారిశుధ్యం మెరుగు పడేలా అదనపు సిబ్బందిని నియమించారు. ఫ భక్తుల కోసం రత్నగిరి పైన, దిగువన 457 టాయిలెట్లు ఉన్నాయి. గిరి ప్రదక్షిణ రోడ్డులో 24 టాయిలెట్లు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ రోడ్డులో ఈసారి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఫ కార్తిక మాసంలో అన్నదానానికి బదులు సర్కులర్ మండపం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తులకు పులిహోర, దద్ధోజనం.. చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తారు. అన్నదాన పథకంలో సెక్యూరిటీ సిబ్బందికి, కళాకారులకు మాత్రమే భోజన సౌకర్యం ఉంటుంది. ఫ పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్ ఫార్మాస్యూటికల్స్ (విశాఖపట్నం) నిర్మించిన విశ్రాంతి షెడ్డులో సుమారు 5 వేల మంది భక్తులు సేద తీరే అవకాశం ఉంది. ఈ షెడ్డులోనే భక్తులకు వ్రతాలు, దర్శనం, ప్రసాదాల టికెట్ల విక్రయాలకు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రూ.3 కోట్లతో ఏర్పాట్లు కార్తిక మాసంలో లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నిర్మాణా లు చేపట్టాం. వివిధ సత్రాలకు రూ.కోటితో మరమ్మతులు చేసి, రంగులు వేయించాం. వ్రతాలాచరించే భక్తుల కోసం కూడా తగిన ఏర్పాట్లు చేశాం. భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వ్రత పురోహితులను ఆదేశించాం. రూ.15 లక్షలతో తెప్పోత్సవ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. గిరి ప్రదక్షిణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. ఇందులో పాల్గొనే భక్తులకు మజ్జిగ, పండ్లు, ఫలహారాలు పంపిణీ చేస్తాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం ఫ రేపు రాత్రి ఆకాశ దీపంతో ఉత్సవాల ప్రారంభం ఫ నవంబరు 2న సత్యదేవుని తెప్పోత్సవం ఫ 5న గిరి ప్రదక్షిణ ఫ రత్నగిరిపై విస్తృతంగా ఏర్పాట్లు -
ఆనంద దీపావళి చేసుకోండి
– జిల్లా కలెక్టర్ కీర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కుటుంబ సమేతంగా జిల్లా ప్రజలు ఆనందంగా, సురక్షితంగా దీపావళి పండగను జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లా ప్రజలకు శనివారం ఓ ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, వెలుగుల పండగ అందరికీ సుఖశాంతులను తీసుకురావాలని ఆకాంక్షించారు. వాతావరణ కాలుష్యం, శబ్ధ కాలుష్యం తక్కువగా ఉండే టపాసులు కాల్చి, నూనె దీపాలు వెలిగించి పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. అగ్నిమాపక శాఖ సూచించిన నిబంధనలను పాటించి, జాగ్రత్తలు తీసుకుంటూ పండగ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పీజీఆర్ఎస్ లేదు దీపావళి పండగ సందర్భంగా సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సెలవు రోజు కావడంతో జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిలో పీజీఆర్ఎస్ను నిర్వహించడం లేదని కలెక్టర్ తెలిపారు. ప్రజలు వారి సమస్యలను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలియజేయవచ్చన్నారు. పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు రాజమహేంద్రవరం సిటీ: ఒకే రోజు పంచారామ పుణ్య క్షేత్రాలను (కార్తిక సోమవారాలు) దర్శించే ప్యాకేజీతో రాజమహేంద్రవరం డిపో నుంచి బస్సులు నడపనున్నట్టు డిపో మేనేజర్ మాధవ్ శనివారం తెలిపారు. కార్తిక మాసం సందర్భంగా ప్రతి ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం డిపో నుంచి ఉదయం ఏడు గంటలకు పంచారామ స్పెషల్ బస్సులు బయలుదేరుతాయన్నారు. సోమవారం అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకుని, అదే రోజు రాత్రి పది గంటలకు డిపోకు చేరుతాయన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో వెళ్లే సూపర్ లగ్జరీ స్పెషల్ బస్సుకు ఆన్లైన్లో టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. బస్సుకు సరిపడా భక్తులు ఉండి, ఏ రోజైనా కోరితే తగిన చార్జీలతో వారి ఊరు నుంచే సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతామని తెలిపారు. వివరాలకు 95023 00189 నంబరును సంప్రదించాలన్నారు. ప్రకృతిని పరిరక్షిద్దాం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం సిటీ: ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనాన్ని పెంచి, పర్యావరణ హిత జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆమెతో పాటు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా శనివారం స్థానిక వీఎల్ పురంలో స్వచ్ఛ ఆంధ్రా– స్వర్ణ ఆంధ్రాలో భాగంగా క్లీన్ ఎయిర్ థీమ్తో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని, భావితరాల భవిష్యత్తు అందరి చేతుల్లో ఉందన్నారు. పర్యావరణ హిత జీవనశైలితో స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర జీవనాన్ని పొందవచ్చన్నారు. హరిత విస్తీర్ణం పెంపుతో పాటు, ప్రజా రవాణా, సౌర విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ, ఇప్పటివరకు నగరంలో 4,780 మొక్కలు నాటినట్టు వివరించారు. దీపావళిలో గ్రీన్ టపాసులు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, ఎస్ఈ (ఇన్చార్జి) రీటా, ఎంహెచ్ఓ వినూత్న, ఈఈ మదర్షా అలీ, ఏడీహెచ్ అనిత, సీఎంఎం రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో భౌతిక, రసాయన జీవ శాస్త్రాల్లో సరిహద్దులు–వ్యవసాయ, ఆహార, సాంకేతికత, ఔషధ ఆవిష్కరణ, పర్యావరణ స్థిరత్వంలో అనువర్తనాలు అనే అంశంపై డిసెంబర్ 5, 6 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు జరుగుతుందని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను శనివారం విడుదల చేశారు. అలియోంకీ పబ్లిష్కో(హైదరాబాద్) సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి చైర్మన్గా ప్రొఫెసర్ చంద్రమౌళి, కన్వీనర్గా డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా డాక్టర్ కె.దీప్తి, పబ్లిష్కో డైరెక్టర్ స్వాతి గోనుగుట్ల వ్యవహరిస్తారన్నారు. సదస్సుకు సంబంధించిన పరిశోధన పత్రాలను నవంబర్ 24లోగా సమర్పించవచ్చన్నారు. -
వైద్య విద్యను దూరం చేసే కుట్ర
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బహుజనులకు వైద్య విద్యను దూరంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని, అందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుందని జై భీమ్ రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై కాకినాడ అంబేడ్కర్ భవన్లో శనివారం మేధోమథన సదస్సు నిర్వహించారు. తొలుత కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కలెక్టరేట్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జై భీమ్రావ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది జగ్గారపు మల్లికార్జున అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా శ్రావణ్కుమార్ హాజరు కాగా, విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రావణ్కుమార్ మాట్లాడుతూ, ఓ హాస్పిటల్ నిర్మించాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు అవసరం అవుతుందన్నారు. కేవలం బినామీలకు దోచిపెట్టడానికే పీపీపీ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ ఆరాటపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం పూర్తిగా లేకుండా పోతుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి రూ.5,600 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తే, మిగిలిన రూ.3 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించలేక ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున బడ్జెట్లో కేటాయిస్తే, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయవచ్చనే అవగాహన లేకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాలన సాగించడం సిగ్గుచేటన్నారు. నిరుపేదల విద్యార్థుల డాక్టర్ అయ్యే కలను కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తుందని మండిపడ్డారు. 33 ఏళ్ల లీజుకు ఇచ్చే పీపీపీ విధానం వల్ల రూ.వేలాది కోట్ల ధనార్జన చేస్తారన్నారు. పీపీపీ విధానంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బినామీలు మాత్రమే ఉన్నారని ఆరోపించారు. పిఠాపురం ప్రజలు బాధపడుతున్నారని, దేశం మొత్తం పిఠాపురం వైపు చూస్తుందన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ఇప్పుడు పిఠాపురం ప్రజల ఆలోచన మరోలా ఉందని ఎద్దేవా చేశారు. రియల్ స్టార్కి, రీల్ స్టార్కి చాలా తేడా ఉందని పవన్ కల్యాణ్ గుర్తించాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు ఉండాలో చెప్పాలని, దీనిపై న్యాయస్థానంలో రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పారు. వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా జై భీమ్ రావ్ భారత పార్టీ నుంచి ఎనిమిది లక్షల సంతకాల సేకరణ చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలపై బాధ్యతా రాహిత్యం కూటమి ప్రభుత్వం ప్రజలపై బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. పేద, మధ్యతరగతి వర్గాలు బాగుండాలని కోరుకునే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.ఎనిమిది వేల కోట్లతో మెడికల్ కాలేజీలు నిర్మించాలని భావిస్తే, వాటిని ప్రైవేటీకరణ చేయాలన్న దురాలోచనలతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఒకరోజు హాస్పిటల్లో ఉండాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నేడు ఉందన్నారు. గత 15 రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తుంటే కనీసం వారిని పిలిచి మాట్లాడలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఆగిపోతున్న గుండెలను తిరిగి కొట్టుకునేలా చేసిన మహానేత దివంగత వైఎస్సార్ సేవలు, గత ప్రభుత్వంలో కరోనా సమయంలో చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 72 రకాల మందులను, 14 రకాల ఉచిత టెస్టులను చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. పార్వతీపురం కేంద్రంలో 230 మంది చిన్నారులు అస్వస్థతకు గురై కామెర్లు వస్తే 120 మంది చిన్నారులను కేజీహెచ్లో చేర్పించే స్థాయికి కూటమి ప్రభుత్వం ఉందన్నారు. తాగునీటిలో మలమూత్రాలు ఉన్నాయని రిపోర్టు వచ్చిందన్న విషయాన్ని ప్రభుత్వం ఇప్పటివరకు బయట పెట్టకపోవడం సిగ్గుచేట్టన్నారు. జై భీమ్ రావ్ భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ కూటమి ప్రభుత్వ పీపీపీ విధానంపై నేతల మండిపాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మేధోమథన సదస్సు ప్రజలు పోరాడాలి మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై రాష్ట్ర ప్రజలందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి విద్య నిజమైన ఆయుధం లాంటిదని, అటువంటి విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే పని కూటమి ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణ, న్యాయవాదులు దాడిశెట్టి వీరబాబు, గుగ్గిలపు హరీష్, వైఎస్సార్ సీపీ నాయకులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, రాగిరెడ్డి బన్నీ, సుంకర విద్యాసాగర్, వర్ధినీడి సుజాత తదితరులు పాల్గొన్నారు. -
స్వల్పంగా పెరిగిన పొగాకు ధర
● కిలో గరిష్టం రూ.430 ● లో గ్రేడ్ రూ.80 దేవరపల్లి: పొగాకు మార్కెట్ ఒడిదొడుకుల్లో కొనసాగుతోంది. మార్కెట్ నిలకడ లేకపోవడంతో ధర ఎగసిపడుతోంది. రెండు వారాల పాటు మార్కెట్లో పొగాకు ధర కిలో రూ.425 కొనసాగింది. రెండు రోజులుగా ఈ ధర పెరుగుతూ వస్తోంది. శనివారం మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.430 పలికింది. 2024–25 పంట కాలంలో పండించిన పొగాకు కొనుగోళ్లను పొగాకు బోర్డు మార్చి 24న ప్రారంభించింది. శనివారం నాటికి 168 రోజులు జరిగిన వేలం ప్రక్రియలో మార్కెట్ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంది. కొనుగోళ్లు ప్రారంభంలో కిలో గరిష్ట ధర రూ.290 పలికింది. ఈ ధర దాదాపు రెండు నెలలు కొనసాగింది. ఆ సమయంలో చాలా మంది చిన్న రైతులు తమ వద్ద ఉన్న పొగాకును అమ్ముకోగా, పెద్ద రైతులు నిల్వ ఉంచారు. అనంతరం మార్కెట్ అంచెలంచెలుగా నిలదొక్కుకుని, రోజురోజుకూ ధర పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం కిలో గరిష్ట ధర రూ.430 పలకడంతో.. ముందుగా అమ్ముకున్న చిన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోళ్లు ప్రారంభంలో ధర కంటే ప్రస్తుత ధర కిలోకు రూ.140 పెరగడంతో ముందుగా అమ్ముకున్న రైతులు డీలా పడ్డారు. ఈ ఏడాది పొగాకు రైతుల పంట పండిందని చెప్పవచ్చు. గతేడాది కంటే కిలోకు రూ.30 గరిష్ట ధర అదనంగా రైతులకు లభించింది. గతేడాది కిలో రూ.410 పలికిన పొగాకు.. ఈ ఏడాది రూ.430 పలుకుతోంది. లో గ్రేడ్ మార్కెట్ ఎగిసిపడుతోంది. మొన్నటి వరకూ కిలో ధర రూ.60 నుంచి రూ.70 పలకగా, ఈ ధర రూ.60 నుంచి రూ.80కి చేరింది. అయినా లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లకు ట్రేడర్లు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో సుమారు 84 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 74.29 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. మరో 10 మిలియన్ల కిలోల పంట కొనుగోలు చేయాల్సి ఉంది. -
బాణసంచి నింపాల్సిందే..!
అందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపేదే దీపావళి పండగ. కష్టసుఖాలతో సాగిపోతున్న జీవితానికి ఈ పర్వదినం భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తోంది. అలసిన బతుకులకు కాస్తంత ఊరటనిస్తోంది. అందరిలాగే పండగలూ, పర్వదినాల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వ్యాపారులూ ఆశిస్తుంటారు. దీపావళికి కొద్ది రోజులు కష్టపడితే నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని భావిస్తారు. అలా అనుకుని బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసిన వ్యాపారులను కొందరు అధికారులు మామూళ్ల పేరుతో ఎడాపెడా దండుకుంటున్నారు. మళ్లీ బాణసంచా గిఫ్ట్లు వేరు. నిలకడ లేని మార్కెట్తో అసలే అంతంతమాత్రంగా సాగుతున్న వ్యాపారాలకు తోడు.. ఈ మామూళ్ల దందా వ్యాపార వర్గాలను నిరాశానిస్పృహలకు గురి చేస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం: దీపావళి పండగ అధికారులకు కాసులు కురిపిస్తోందా..? బాణసంచా తాత్కాలిక షాపుల ఏర్పాటులో దందాకు తెరలేచిందా..? ఒక్కో షాపునకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇదీ సంగతీ దీపావళికి తాత్కాలిక ప్రాతిపదికన బాణసంచా దుకాణాల ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు ఇస్తారు. రెవెన్యూ, అగ్నిమాపక శాఖ, పోలీస్, జీఎస్టీ శాఖలు సమన్వయంతో తాత్కాలిక లైసెన్స్ మంజూరు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు గాను వ్యాపారులు దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవడం, ఆపై అనుమతులు ఇవ్వడం ప్రతి ఏటా జరుగుతోంది. ఇదే అదనుగా భావిస్తున్న అధికారులు అక్రమాలకు తెర తీస్తున్నారు. సందట్లో సడేమియా అన్న చందంగా రూ.లక్షలు దండుకుంటున్నారు. ఒక్కో షాపునకు ఒక్కో ధర నిర్ణయించి మరీ వసూళ్లకు తెగబడుతున్నట్టు తెలిసింది. వసూలు చేయాల్సిందిలా.. బాణసంచా తాత్కాలిక దుకాణం ఏర్పాటు చేసుకోవాలంటే సదరు వ్యాపారి ప్రభుత్వ నిబంధనల మేరకు లైసెన్స్ నిమిత్తం అగ్నిమాపక శాఖకు రూ.500 చలానా, రెవెన్యూ శాఖకు రూ.500 చలానా, జీఎస్టీ శాఖకు రూ.5 వేల అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంది. ఇలా ఓ దుకాణానికి రూ.6 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అంతకు మించి దండుకుంటున్నారు. రూ.40 వేల వరకు వసూలు: బాణసంచా దుకాణాల లైసెన్స్ల మంజూరులో అంతులేని అక్రమాలు జరుగుతున్నాయి. అధికారులు అడ్డగోలు వ్యవహారానికి తెర తీస్తున్నారు. షాపునకు ఓ ధర పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒక్కో దుకాణానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు దండుకుంటున్నట్లు సమాచారం. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు 400 దరఖాస్తులు అందాయి. ఇప్పటికే రాజమండ్రి రెవెన్యూ డివిజన్లో 257 దుకాణాలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చారు. కొవ్వూరు డివిజన్లో సైతం వందకు పైగా దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఒక్కో షాపు నుంచి రూ.30 వేల చొప్పున లెక్కగట్టినా.. రూ.1.10 కోట్లు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కో దుకాణానికి రూ.6 వేల చొప్పున రూ.21 లక్షలు ప్రభుత్వానికి వెళ్లగా.. మిగిలిన సుమారు రూ.90 లక్షలు అధికారుల జేబుల్లోకి చేరినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యవర్తులను అడ్డుపెట్టుకుని లైసెన్స్ జారీ అయినట్టు సమాచారం. కూటమి నేతల సిండికేట్..? మద్యం షాపులే కాదు.. బాణసంచా దుకాణాల్లో సైతం కూటమి నేతలు సిండికేట్గా ఏర్పడినట్టు ఆరోపణలున్నాయి. తమ కనుసన్నల్లోనే లైసెన్స్ల మంజూరు ప్రక్రియ నిర్వహించినట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు కావడంతో అధికారులు సైతం మిన్నకుండిపోయినట్టు తెలిసింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి బాణసంచా విక్రయాల కోసం మున్సిపల్, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్, పోలీస్, జీఎస్టీ శాఖల అధికారులతో కూడిన కమిటీ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఇక్కడే అసలు చేతివాటం మొదలవుతోంది. తాత్కాలిక విక్రయదారులకు డీలర్షిప్ ఉండదు. దీంతో వారికి అడ్వాన్స్డ్ లైసెన్స్లు జారీ చేస్తారు. దీని ప్రకారం తాము విక్రయించబోయే సరకు విలువపై 18 శాతం జీఎస్టీని ముందుగానే చెల్లించాలి. రూ.లక్ష విలువైన సరకు విక్రయిస్తే రూ.18 వేలు పన్నుగా చెల్లించాలి. వ్యాపారం ముగిశాక, అమ్మిన సరకు విలువ అంచనా కన్నా ఎక్కువైతే మిగిలిన పన్ను చెల్లించాలి. తక్కువైతే అదనంగా కట్టిన డబ్బును అధికారులు తిరిగి వెనక్కు ఇవ్వాలి. ఇక్కడ మాత్రం కొందరు వాణిజ్య పన్నుల విభాగం అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. వ్యాపారులతో కుమ్మకై ్క ఎంత సరకై నా అమ్ముకో.. ప్రభుత్వానికి కొద్దిగా పన్ను కట్టి, తమకు కొంత సమర్పిస్తే చాలన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఈ తంతు కొవ్వూరు, రాజమండ్రి డివిజన్ల పరిధిలో ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. సర్కిళ్ల వారీగా వసూళ్లకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు ఆరోపణలున్నాయి. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఉన్నత స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు అధికారులు పంచుకుంటున్నట్టు విమర్శలున్నాయి. అక్రమ తయారీపై చర్యలేవీ..? బాణసంచా తయారీ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కరవైంది. మామూళ్లు దండుకుని కేంద్రాలకు లైసెన్స్లు రెన్యూవల్ లేకపోయినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు ఇటీవల చాగల్లు మండలం చిక్కాలకు వెళ్లే రోడ్డు సమీపంలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. పెద్దఎత్తున తయారీ సామగ్రిని పట్టుకున్నారు. కేవలం ఇక్కడ ఒక్కటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నా.. మిన్నకుండిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రమాదాలు ఏమైనా జరిగితే రెండు రోజుల పాటు హడావుడి చేయడం.. అనంతరం మిన్నకుండిపోవడం పరిపాటిగా మారుతోంది. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలున్నాయి. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు క్యాష్ కొట్టు... లైసెన్స్ పట్టు మామూళ్లు ఇచ్చుకో.. లైసెన్స్ పట్టుకో.. దుకాణాల ఏర్పాటులో లంచావతారాలు ఒక్కో షాపునకు ఒక్కో రేటు నిర్ణయం రూ.30 వేల నుంచి రూ.40 వేల వసూళ్లు అన్ని శాఖల అధికారులకూ వాటాలు! జిల్లావ్యాప్తంగా 400కు పైగా షాపుల ఏర్పాటుకు దరఖాస్తులు -
రత్నగిరి భక్త జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● స్వామివారి ఆదాయం రూ.25 లక్షలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 1,800 స్వామివారి వ్రతాలు జరిగాయి. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణలు చేసి, రావిచెట్టు వద్ద దీపాలు వెలిగించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఇలాఉండగా, ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి అర్చకులు పూజలు చేశారు. వేద పండితుల మంత్రోఛ్చాటన మధ్య మంగళ వాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుపతిలో పోటెత్తిన భక్తులు పెద్దాపురం(సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచి అనేక మంది భక్తులు కాలినడకన చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు పది వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,47,150, అన్నదాన విరాళాలుగా రూ.54,035, కేశ ఖండన ద్వారా రూ.4,240, తులాభారం ద్వారా రూ.50, ప్రసాద విక్రయం ద్వారా రూ.16,845, స్వామివారికి కానుకగా రూ.101తో మొత్తం రూ.2,22,421 ఆదాయం వచ్చిందని చెప్పారు. సుమారు 3,500 మంది భక్తులు మధ్యాహ్నం అన్న ప్రసాదం స్వీకరించారు. -
ఎస్ఈజెడ్ భూములపై కపట ప్రేమ
● 2,800 ఎకరాల భూమిని మాజీ సీఎం జగన్ రైతులకు ఇచ్చారు ● చంద్రబాబు ప్రభుత్వంలో వారిపై అక్రమ కేసులు పెట్టారు ● విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన యేడాదిన్నరకు ఎస్ఈజెడ్ రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తుందని వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తునిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జీఓ కాకుండా ఒక మెమో ఇచ్చి, 2,800 ఎకరాలను డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రబాబు ఫ్రీగా తిరిగి ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్డర్ కాపీ ఇచ్చి ఆ భూములను రైతులకు వెనక్కు ఇచ్చారని గుర్తు చేశారు. గత వారం రోజులుగా ఎల్లో మీడియాలో రూపాయికే ఎకరం భూమి చంద్రబాబు ఇచ్చినట్టు గొప్పగా ప్రచారం చేసుకోవడమే కాకుండా, క్షీరాభిషేకాలు చేయించుకున్నారన్నారు. తన గురించి, తన క్యారెక్టర్ గురించి ఈనాడులో అవాకులు, చవాకులు రాశారన్నారు. చంద్రబాబు ఇటీవల మెమో మాత్రమే ఇచ్చారని, అది జీఓ కాదని, 2024, డిసెంబర్ 5న ఈనాడు పత్రికలో తనను వ్యక్తిత్వ హసనం చేసిన విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మెగాస్టార్నే గుడ్డలిప్పి నిలబెట్టారు ఎల్లో మీడియాలో మెగాస్టార్ చిరంజీవికే దిక్కులేదని, ఆయననే గుడ్డలు విప్పి రోడ్డుపై నిలబెట్టారని, ఇక తామెంతని రాజా ప్రశ్నించారు. డిసెంబర్ 5, 2024లో ఈనాడు మొదటి పేజీలో కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుని రైతులను అన్యాయం చేసి భూములు నొక్కేశారని తనపై అసత్య ప్రచారం చేశారన్నారు. ఈనాడు పేపర్ ఆ రోజు రాసింది తప్పా లేదంటే ఈ రోజు చంద్రబాబు భూములు వెనక్కు ఇచ్చేయడం అసత్యమా అనేది ఈనాడు స్పష్టం చేయాలని రాజా సవాలు విసిరారు. నచ్చిన ధరకు అమ్ముకున్నారు జగన్ ప్రభుత్వం రైతులకు భూములు ఇచ్చిన వారికి నచ్చిన ధరకే అమ్ముకున్నారన్నారు. ఆ ధరకే తాను కొనుగోలు చేశానన్నారు. ఆ భూములను ఈనాడుగానీ మరే కూటమి ప్రభుత్వం వారికిగాని కొనుగోలు చేస్తానంటే తాను తిరిగి అదే ధరకు అమ్మేస్తానన్నారు. కొన్న ధరకంటే రూ.లక్ష, రూ.రెండు లక్షలో అదనంగా వస్తుందని ఆశపడి కొనుగోలు చేశానని చెప్పారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నామనే అక్కసుతో ఈనాడు తనపై అసత్యాలు ప్రచురిస్తోందన్నారు. చంద్రబాబు 1999లోనే రూ.370 కోట్లు ప్రజాధనంతో కాకినాడ పోర్టును మూడు బెర్త్లతో కట్టిన తరువాత పీపీపీ మోడ్లో కేవీ రావు అనే అయన బినామీకి రూ.50 కోట్లకే ధారాదత్తం చేశారని ఆరోపించారు. దీని ద్వారా వచ్చిన ఆదాయం చంద్రబాబుకా ఆయన బినామీకా, లేక ప్రభుత్వానికి వస్తుందో ఈనాడు స్పష్టం చేయాలని రాజా డిమాండ్ చేశారు. ఆ రోజుల్లో రూ.370 కోట్లు అంటే ఈ రోజు ఎన్ని వేల కోట్లో అర్థం చేసుకోవాలన్నారు. ఇటువంటి విషయాలను బయటపెట్టినందుకు తనను, తన వాళ్లను ఖూనీకోర్లు, అవినీతిపరులు అంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాస్తారా? అని రాజా నిలదీశారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు, పత్రాలతో సహా ఎల్లో మీడియాలో ప్రచురించాలని సవాలు విసిరారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వ ఆర్డర్ కాపీ ఇచ్చారు: జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి మంత్రి కన్నబాబు నేతృత్వంలో ఈ విషయమై కొందరు ఐఏఎస్లను ప్రభుత్వం సబ్ కమిటీగా వేసి రైతు సమస్యలు తెలుసుకుని ఆ భూములను వెనక్కి ఇచ్చారని, అందులో 1,400 ఎకరాలు రైతులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఎస్ఈజెడ్ భూములపై రైతులు 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నారన్నారు. వారిపై చంద్రబాబు హయాంలో అట్రాసిటీ కేసులు నమోదు చేయించారన్నారు. రిమాండ్లో ఉన్న రైతులతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్లు శుభ్రం చేయించిందని గుర్తు చేశారు. -
రాములోరి భూములకు మోక్ష ం..
దేవదాయ శాఖకు 19.92 ఎకరాల అప్పగింత కొత్తపల్లి: ధూప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు పిఠాపురం మహారాజు గోర్స గ్రామంలో ఉన్న పురాతన సీతారామస్వామి ఆలయానికి కొంత భూమిని దానం చేశారు. దానిని పండించుకుంటూ కొందరు రైతులు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. భూమి తమదేనని, పట్టాలున్నాయంటూ దేవునికే శఠగోపం పెట్టేందుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు చేసిన పోరాటం నేటికి ఫలించింది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని పోలీసుల సహకారంతో శనివారం దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. కొమరగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 121, 122లో ఉన్న 19.92 ఎకరాలను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్దార్ చిన్నారావు, పాడా పీడీ చైత్రవర్షిణి సమక్షంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ రమేష్, సహాయ కమిషనర్ నాగేశ్వరరావు సీతారామ ఆలయ ఈవో ధనలక్ష్మికి అప్పగించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. కొత్తపల్లి–గోర్స, పండూరు–గోర్స రోడ్డులో వాహనాలను నిరోధించారు. ఉప కమిషనర్ రమేష్ మాట్లాడుతూ, ఈ భూములను 34 మంది రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారన్నారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, రైతులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. గ్రామస్తుల సహకారంతో దేవదాయ శాఖ కోర్టులో పోరాడడంతో, ఇటీవల అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన ఈ భూమిని ఐదు భాగాలుగా చేసి, త్వరలో కౌలుకు బహిరంగ వేలం నిర్వహిస్తారన్నారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు. పోరాటం ఫలించింది పురాతన సీతారాముల ఆలయానికి చెందిన ఆలయ భూములు అన్యాక్రాంతంపై గ్రామస్తులంతా ఒక్కటై పోరాడారు. కుటుంబ సభ్యులు, మహిళలు సైతం పాల్గొన్నారు. దేవుని ఆలయ భూముల కోసం రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగాం. చివరకు అధికారులు స్పందించడం హర్షణీయం. – రొంగలి వీరబాబు, సర్పంచ్, గోర్స గ్రామస్తుల సహకారంతో.. పురాతన గోర్స సీతారామ ఆలయానికి కోట్ల రూపాయ లు విలువ చేసే భూమలు ఉన్నా అన్యాక్రాంతం కావడంతో ధూప దీప నైవేద్యాలు భారమైంది. కొన్నేళ్లుగా గ్రామస్తుల సహకారంతో స్వామివారి నిత్య కై ంకర్యాలు, ప్రతి సంవత్సరం స్వామి అమ్మవార్ల కల్యాణం జరుగుతుంది. – అనంతాచార్యులు, సీతారామ ఆలయ అర్చకుడు -
పంట మార్పిడితో మేలైన దిగుబడి
● చీడపీడల నుంచి రక్షణ ● భూసారం పెంపు ● ఎరువులు, మందుల ఖర్చు ఆదా ● సమీకృత వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి ● రబీ సీజన్లో సాగుకు సన్నాహాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు భూముల్లో ప్రతి సారి సాగు చేసే పంటలనే మళ్లీ మళ్లీ వేస్తుండడంతో భూమిలో సారం తగ్గిపోయి పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పంటల మార్పిడి చేయడం వల్ల భూమిలో నాణ్యత పెరిగి దిగుబడులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఖర్చులు కూడా తగ్గుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వాణిజ్య పంటలు లాభదాయకంగా ఉన్నందున రైతులు ఒకే పంటను అదే పొలంలో ప్రతి ఏడాది సాగు చేస్తున్నారు. దీని వల్ల భూసారం క్షిణించి, పంటలను చీడపీడలు విజృంభించి దిగుబడులు క్రమేపీ తగ్గుతున్నాయి. రెండు మూడు సంవత్సరాలకో సారైనా పంట మార్పిడి చేస్తేనే చీడపీడలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. పంట మార్పిడిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. పంట మార్పిడితో భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందడంతో పాటు చీడపీడలు దూరమవుతాయి. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు. పంట మార్పిడితో లాభాలు పంట మార్పిడి వల్ల చీడపీడలను అదుపులో ఉంచవచ్చు. ఒక పంటను ఆశించే చీడపీడలు రెండో పంటను ఆశించవు. పంట మార్పిడిలో రెండు మూడు పంటలను పండించడం వల్ల ఏదైనా ఒక పంటకు గిట్టుబాటు ధర రాకున్నా వేరే పంటల వల్ల తగిన లాభం పొందవచ్చు. పంటల మార్పిడితో వివిధ పంటల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవచ్చు. రైతులందరూ ఒకే రకమైన పైరు వేయడం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా ఉండి దిగుబడి తగ్గడమే కాక మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయడం వల్ల సస్యరక్షణ కోసం వాడే పురుగు మందులు ఖర్చు తగ్గించవచ్చు. వేర్లు భూమిలో తక్కువ లోతుకు చొచ్చుకుపోయే పైర్లను, వేర్లు ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయే పైర్లతో పంట మార్పిడి చేయడం వల్ల భూమిలోని వివిధ పొరల్లో ఉన్న తేమ పోషకాలను సమర్థంగా వినియోగించుకుంటాయి. ప్రత్తి వేసిన పొలంలో మిరప పంట సాగు చేస్తే లాభసాటిగా ఉంటుంది. మిరప పంట వేసిన పొలంలో పత్తి సాగు చేస్తే పెట్టుబడులు తగ్గడంతో సాగు దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిరప పంట సాగు చేయడానికి ముందు సదరు భూమిలో జనుము, పిల్లి పెసర వంటి పంటలను సాగు చేసి, దాన్ని ట్రాక్టర్ ద్వారా తొక్కించిన తర్వాత పంటలు సాగు చేస్తే భూసారం పెరిగి చీడపీడలు దరిచేరవు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో టమోట, బెండ, పెసర, మినుము పంటలు వేయకూడదు. వాటిని వేస్తే పురుగులు మరింత అభివృద్ధి చెందుతాయి. పంట మార్పిడిలో భాగంగా నేలంతా పూర్తిగా కప్పే పంటలు ఎంపిక చేసుకోవాలి. వేరుశనగ, బొబ్బర్లు, పెసర, మినుము పంటలను వేయడంతో నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వల్ల కలుపు మొక్కలు అధికంగా రాకుండా నివారించవచ్చు. వరి పంట తర్వాత పప్పుధాన్యాల పంటలను కానీ నూనె గింజల పంటలను కానీ సాగు చేయడం వల్ల వరిని తెగుళ్లు ఆశించకుండా ఉంటాయి. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు ఏడాదిలో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక, నేలల్లో మిశ్రమ పంటలను సాగు చేసుకోవచ్చు. కంది పంటలను సాగు చేయడం వల్ల నేలలో పైరు ఆకుల రాలి కుళ్లిపోవడం వల్ల నేలలో సేంద్రియ పదార్ధం పెరిగి భూ భౌతికస్థితి మెరుగుపడి భూసారం వృద్ధి చెందుతుంది. వేరుశనగ, కంది, పప్పుశనగ మొదలైనవి సాగు చేయడం వల్ల వాటి వేర్ల బుడిపెలోని రైజోబియం బ్యాక్టీరియా గాలిలోని నత్రజని స్థిరీకరించి నేలను సారవంతం చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో సమతుల్యతను పెంచడానికి వీలు కలుగుతుంది. ● శాస్త్రవేత్తలకు అవగాహన రైతులు సమీకృత వ్యవసాయం చేయాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఐదారు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాం. – ఎన్.విజయ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖాధికారి, కాకినాడ సమీకృత వ్యవసాయంపై అవగాహన రైతులు సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించే విధంగా రైతులకు వ్యవసాయశాఖ అధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోను సమీకృత వ్యవసాయంతో కలిగే లాభాలను శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక ఎకరంలో ఫిష్ కల్చర్, వరి, కోళ్లఫారం, కూరగాయాలు పండిచే విధంగా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో బోర్లు అందుబాటులో ఉన్న రైతులు వరికి బదులు రాగులు, కొర్రలు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు సాగు చేసుకోవచ్చు. వరి పంట సుమారు 120 నుంచి 150 రోజులు వస్తుంది. అదే చిరు ధాన్యాలు సాగు చేస్తే 90 రోజుల్లో పంట పూర్తై సంవత్సరానికి మూడు పంటలు వేసుకోవచ్చు. ఇలా ఎకరానికి పెట్టుబడి పోను రూ.50 వేల నుంచి 60 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదే వరి సాగు చేస్తే రెండు సీజన్లోను రూ.25 వేలు మిగులుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ రబీ సీజన్లో జిల్లాలోని అన్ని మండలాల్లో సమీకృత వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్న రైతులను ప్రోత్సహించి వారితో సమీకృత వ్యవసాయం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మండల వ్యవసాయశాఖాధికారులు. -
యువకుడిని కాపాడిన ట్రైనీ ఎస్సై
గోపాలపురం: చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని పోలీసులు కాపాడిన సంఘటన గోపాలపురం మండలం చెరుకుమిల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆ వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన పురిటిగడ్డ భానుప్రకాష్ అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల సెలవుల్లో స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన వాట్సాప్ స్టేటస్లో పోస్టు చేశాడు. అతని స్టేటస్ను చూసిన మిత్రుడు అనంతపురం నుంచి 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ సమాచారం అందుకున్న గోపాలపురం ట్రైనీ ఎస్సై పి.శివగణేష్, తనతో పాటు విజయ్ అనే కానిస్టేబుల్ను తీసుకుని సంఘటనా స్థలానికి మూడు నిమిషాల్లో చేరుకుని, చెరువులో మునిగిపోతున్న భానుప్రకాష్ను కాపాడారు. భానుప్రకాష్ తల్లిదండ్రులు, బంధువులు, అతని స్నేహితులు, గ్రామస్తులు ట్రైనీ ఎస్సైను అభినందించారు. -
బైక్ను ఢీకొన్న ఆటో
ఒకరి మృతి, మరొకరికి గాయాలు నల్లజర్ల: పోతవరం శివారులో శుక్రవారం ఉదయం ఓ బైక్ను ట్రక్కు ఆటో ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై వెళ్తున్న బల్వేంద్రసింగ్ (28) అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన బల్వేంద్రసింగ్ ఆరు నెలల క్రితం కొయ్యలగూడెం మండలం కనకాద్రిగూడెంలో మారుతి కోళ్లఫారంలో పనికి చేరాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శుక్రవారం సెలవు కావడంతో బైక్పై కూరగాయలు తేవడానికి పోతవరం వెళ్తుండగా నల్లజర్ల నుంచి కొయ్యలగూడెం వెళ్తున్న ట్రక్కు ఆటో ఢీకొంది. ఏఎస్ఐ శోభనాద్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతా చూసి.. ఆరా తీసి
ఫ రాయవరంలో బాణసంచా పేలుడిపై పరిశీలన ఫ ఘటనా స్థలాన్ని సందర్శించిన ద్విసభ్య కమిటీ ఫ బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ త్రిమూర్తులు డిమాండ్ రాయవరం: కోనసీమ జిల్లాను కుదిపేసిన రాయవరం బాణసంచా పేలుడి ఘటనపై ద్విసభ్య కమిటీ సభ్యులు ఆరా తీశారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి నిబంధనల అమలును పరిశీలించారు.. ఈ నెల 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో బాణసంచా ప్రమాదం జరగ్గా, ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఇందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్కుమార్, ఈగల్ ఐజీ పీడీ రామకృష్ణలు ఉన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ అఖిల, డీఎస్పీ బి.రఘువీర్లు ద్విసభ్య కమిటీకి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. అక్కడ పరిశీలించిన సభ్యులు బాణసంచా యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) చిన్న కుమారుడు చిట్టిబాబును కూడా విచారణ చేశారు. ప్రమాదం జరిగిన గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ సమీపంలోని భవానీ గ్రాండ్ ఫైర్ వర్క్స్ను చూసిన ద్విసభ్య కమిటీ అక్కడ తీసుకున్న భద్రతా చర్యలను పరిశీలించింది. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని, ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో సమీక్షించింది. ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ద్విసభ్య కమిటీని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిశారు. ప్రమాదంలో మృతి చెందిన యజమానిని మినహాయిస్తే, చనిపోయిన తొమ్మిది మంది కూలీలు నిరు పేదలేనని కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. వారివి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలని, ఘటన జరిగి పది రోజులవుతున్నా నేటికీ ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందలేదన్నారు. పేద కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాష్ట్ర మంత్రులు సందర్శించినా, నేటికీ సాయం అందలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన కూలీలకు కనీస న్యాయం చేయని ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిన తీరును ఎమ్మెల్సీ ఉదాహరించారు. ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటలు తిరక్కుండానే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ వెంట సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకటరమణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాసరావు, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు ఆరిఫ్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెలగల సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వానికి నివేదిస్తాం.. ప్రమాదం ఏ విధంగా జరిగిందీ.. బాధిత కుటుంబాల పరిస్థితి.. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ద్విసభ్య కమిటీ సభ్యుడు ఎస్.సురేష్కుమార్ తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ బాణసంచా తయారీ కేంద్రానికి అన్ని అనుమతులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్, కార్మిక తదితర సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడామన్నారు. ప్రమాదంలో పది మంది చనిపోగా, ముగ్గురు బయట పడినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు. అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. న్యాయం చేయాలంటూ.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్దకు మృతుల కుటుంబాలకు చెందిన బంధువులు, ప్రజా సంఘాలు వచ్చి ఆందోళన చేశారు. కమిషనర్ బయటకు రావాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రాయవరం సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత ధూళి జయరాజు, రైతు కూలీ సంఘ నేత వెంటపల్లి భీమశంకరం, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు కోన లాజర్ తదితరులు బాధిత కుటుంబాల తరఫున ద్విసభ్య కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు కమిటీ సభ్యులకు వినతిపత్రం అందించారు. -
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
రాజానగరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి పాలచర్ల శివారులో టిప్పర్ చోరీ చేసిన అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఆ వివరాలను శుక్రవారం స్థానిక మీడియాకు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ నడుపుతున్న మన్యం గణేశ్వర్రావు గత నెల 24న వ్యక్తిగత పనిపై హైదరాబాద్కు వెళ్తూ తనకున్న నాలుగు టిప్పర్లను తన స్నేహితుడైన అబ్బిరెడ్డి నాగేశ్వర్రావుకు చెప్పి అతని ఏఎన్ఆర్ లారీ కాటాకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేశాడు. గత నెల 25న రాత్రి వాటిలో సుమారు రూ. 42 లక్షల ఖరీదైన ఒక టిప్పర్ చోరీకి గురైంది. దీంతో అబ్బిరెడ్డి నాగేశ్వర్రావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తును సీసీ కెమేరాల సాయంతో విస్తృతం చేసిన పోలీసులకు నిందితులు కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో టిప్పర్తో సహా దొరికిపోయారు. ఇందులో రాజస్థాన్ రాష్ట్రంలోని ధహోటగావ్కు చెందిన షౌకత్ ఖాన్ (38), శేర్పూర్గావ్కు చెందిన జామాల్ఖాన్ (35), సోహిల్ (19)లతోపాటు హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఫసీఉద్దీన్ఖాన్ (41) ఉన్నారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, ఏస్సైలు ప్రియకుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వశాంతిని కాంక్షిస్తూ శాంతి కల్యాణం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి సన్నిధిలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో సంపూర్ణమయ్యాయి. మూడో రోజు స్వామివారికి, ఉభయ దేవేరులకు అలంకరించిన పవిత్రాలను తీసుకు వచ్చి చక్ర పెరుమాళ్లుకు సమర్పించారు. చతుస్థానార్చనలతో ఉత్సవాలను ప్రారంభించి శ్రీపుష్పయాగంతో ముగించారు. 108 కలశాలతో స్వామి, అమ్మవార్లకు శత కలశ స్నపన తిరు మంజన సేవ ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజాదికాల్లో పాల్గొన్నారు. అనంతరం లోక కల్యాణం కోరుతూ శ్రీవారి శాంతి కల్యాణం కనుల పండువగా జరిపించారు. శ్రీపుష్ప యాగం, మహాదాశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్ఠి, బుత్విక్ సన్మానంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో గుడివాడకు చెందిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. -
అక్రమ బాణసంచా తయారీ నిందితుల అరెస్ట్
చాగల్లు: అనుమతులు లేకుండా అక్రమంగా బాణసంచాను తయారు చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు రాజమహేంద్రవరం నార్త్ జోన్ ఏసీపీ, కొవ్వూరు ఇన్చార్జి డీఎస్పీ వై.శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చాగల్లు శివారులోని మట్టా శివనారాయణ జీడిమామిడి తోటలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్న ఊనగట్లకు చెందిన ఆత్కూరి గోపాలకృష్ణ, మట్టా శివనారాయణ, దొనక మురళి, పల్లెల రవికుమార్, కోకనాటి సూరిబాబులను అరెస్ట్ చేశామన్నారు. బాణసంచా తయారీ సామగ్రితోపాటు పాటు రెండు వ్యాన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. ఈ దాడుల్లో కొవ్వూరు రూరల్ సీఐ విజయ్బాబు, చాగల్లు ఎస్సై కె.నరేంద్ర, తహసీల్దార్ ఎం.మెరికమ్మ తదితరులు పాల్గొన్నారు. -
4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
నిడదవోలు రూరల్: జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం సేకరణకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు మండలం డి.ముప్పవరం పీఏసీఎస్ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధాన్యానికి మద్దతు ధర రూ.69 అధికంగా ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఈ ఏడాది ప్రత్యేకంగా యూనిక్ నంబర్తో కార్డులు అందిస్తామన్నారు. అనంతరం ధాన్యం జల్లెడ, ధాన్యం నాణ్యత, గోనె సంచులు, తేమ శాతం కొలిచే యంత్రాన్ని, డిజిటల్ తూనిక యంత్రాలను మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జెడ్పీటీసీ సభ్యుడు కొయ్యే సూరిబాబు, తహసీల్దార్ బి.నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆ వాయిస్ ఫేక్ టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మద్యం వ్యాపారులతో మాట్లాడినట్లుగా వైరల్ అవుతున్న వాయిస్ తనది కాదని, అది ఫేక్ అని నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు స్పష్టం చేశారు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో నకిలీ వీడియోలు, వాయిస్లు సృష్టిస్తున్నట్లు చూస్తున్నామని, ఇది కూడా అలాంటిదేనని అన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. స్థానిక పాత సోమాలమ్మ పుంత రోడ్డులోని శ్రీకన్య ఇన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. మద్యం వ్యాపారులతో తాను మీటింగ్ పెట్టినట్లు నిరూపించాలని సవాల్ చేశారు. తనకు లిక్కర్ షాపులు లేవని, మద్యం వ్యాపారులతో మాట్లాడాల్సిన అవసరం లేదని రాంబాబు తెలిపారు. -
టీడీపీ నేతలపై చట్టపరమైన చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అక్రమ లిక్కర్ వ్యాపారానికి తెర తీసిన రాజమహేంద్రవరం నగర టీడీపీ నేతలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతో కలసి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద శుక్రవారం ఆయన ఆందోళన నిర్వహించారు. అనంతరం అదనపు ఎస్పీ ఎంబీఎన్ మురళీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా భరత్రామ్ మాట్లాడుతూ, నగరంలో టీడీపీ నేతల ఆధ్వర్యాన అక్రమ మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలన్నారు. మద్యం వ్యాపారులతో ఫోనులో మాట్లాడిన నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబుపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏయే బ్రాండ్లకు ఎంతెంత వసూలు చేయాలో నిర్ణయించుకుంటున్నారని, ఆ బ్రాండ్లు ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ మద్యం వ్యాపారాన్ని లిమిటెడ్ కంపెనీగా మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. అక్రమాలకు బైలా రాసుకోవాలని అనుకోవడం దారుణమన్నారు. నకిలీ మద్యం తాగి జీఎస్ఎల్ ఆసుపత్రిలో ముగ్గురు యువకులు మృతి చెందారని, అందుకే నగరంలో నకిలీ మద్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఎకై ్సజ్ అధికారులకు ఎన్ని కేసులు ఇవ్వాలో కూడా టీడీపీ నేతల ఆధ్వర్యంలోని సిండికేట్ నిర్ణయించడం చూస్తూంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఇట్టే తేటతెల్లమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఎకై ్సజ్ అధికారుల ప్రమేయంపై కూడా విచారణ చేయాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. అక్రమ లిక్కర్ వ్యవహారంలో ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి నగర టీడీపీ అధ్యక్షుడు మజ్జి రాంబాబుపై చర్యలు తీసుకోవాలి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన -
సాంబార్లో పడిన వ్యక్తి మృతి
కాకినాడ క్రైం: ఓ వివాహ వేడుకకు వెళ్లి ప్రమాదవశాత్తూ సాంబార్లో పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ వివరాల్లోకి వెళితే.. భీమవరం గునిపూడి ప్రాంతం అంబేడ్కర్ కాలనీకి చెందిన కటికల సునీల్కుమార్ (27) ఈ నెల 12న అదే ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ భోజనాలకు సిద్ధం చేసిన భారీ సాంబార్ బాణీలో పడిపోయాడు. అప్పుడే వండిన సాంబార్ వేడిగా ఉండడంతో దేహం కాలిపోయి తీవ్రగాయాల పాలయ్యాడు. సునీల్కుమార్ను అక్కడి వారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. నాలుగు రోజులుగా బర్న్స్ వార్డులో చికిత్స కొనసాగుతుండగా అతను శుక్రవారం మధ్యాహ్నం ప్రాణాలు కోల్పోయాడు. సునీల్కుమార్ నాలుగేళ్ల క్రితం తాను నివసిస్తున్న ప్రాంతానికే చెందిన నీలమను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు షాలేం రాజు ఉన్నాడు. కూలి పనులు చేసుకుంటూ భార్య, కుమారుడిని పోషించుకుంటున్న సునీల్ కుమార్ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. వ్యక్తి దుర్మరణం శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. సీతంపేట గ్రామానికి చెందిన బోడ రాంబాబు (65) కత్తిపూడిలో ఆసుపత్రికి వచ్చాడు. అక్కడ పెట్రోల్ బంక్ వద్ద హైవే దాటుతుండగా, తుని నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమాదు చేసినట్లు ఎస్సై జి.హరిబాబు తెలిపారు. -
కలంపై కక్షా?
● జిల్లావ్యాప్తంగా జర్నలిస్టుల నిరసనలు ● సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ ● పత్రికా స్వేచ్ఛను కాపాడాలని నినాదాలు ● అధికారులకు వినతులు ● ఏపీయూడబ్ల్యూజే, ప్రజా సంఘాలు, ప్రెస్ క్లబ్ మద్దతు సాక్షి, రాజమహేంద్రవరం: కలంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు గళమెత్తాయి. సర్కారు మీడియా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిరసనకు దిగాయి. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించిన ‘సాక్షి’ మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా జర్నలిస్టు, ప్రజా సంఘాల నేతలు, ప్రతినిధులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ప్రజల స్వరాన్ని వినిపిస్తున్న పాత్రికేయ కలంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై గళమెత్తారు. ప్లకార్డులు చేబూని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇలాంటి దారుణమైన సంస్కృతికి వెంటనే స్వస్తి చెప్పాలని హితవు పలికారు. భావ ప్రకటన స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితో పాటు, పాత్రికేయులపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. వార్తలు రాస్తే కేసులు పెట్టడం దారుణమని, ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వార్తా సంస్థలనూ ఒకేలా చూడాలని హితవు పలికారు. ‘‘నకిలీ మద్యం తాగితే మనుషులు చనిపోరా.. దీనిపై వార్తలు రాస్తే రిపోర్టర్లు, ఎడిటర్లను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చారని రాయడం తప్పా? నకిలీ మద్యం తప్పని రాయడం కూడా మీకు తప్పేనా? నకిలీ మద్యం మంచిదేనని ప్రభుత్వం చెబుతోందా? ఇప్పటికై నా ప్రభుత్వం ‘సాక్షి’పై కక్ష సాధింపు మానుకోవాలి. తప్పుడు కేసులు ఎత్తివేయాలి. జర్నలిస్టులు, మీడియా సంస్థలను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం మానుకోవాలి. లేని పక్షంలో జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై పోరాడతాయి’’ అని హెచ్చరించారు. ● ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు రిపోర్టర్లపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధించడాన్ని మండల కేంద్రమైన పెదపూడిలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ తహసీల్దార్ పీవీ సీతాపతిరావుకు వినతిపత్రం సమర్పించారు. ● జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యాన నిడదవోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ నాగరాజు నాయక్కు వినతిపత్రం అందజేశారు. ● గోపాలపురంలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ● నియోజకవర్గ కేంద్రమైన కొవ్వూరులో జర్నలిస్టులు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ రాణి సుస్మితకు వినతిపత్రం అందజేశారు. ‘సాక్షి’పై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు జర్నలిస్టులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో... ఏపీయూడబ్ల్యూజే, రాజమండ్రి ప్రెస్క్లబ్, ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టులు రాజమహేంద్రవరంలో ఆందోళన చేపట్టారు. ఎస్పీ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. నిజాలు నిర్భయంగా రాస్తున్న ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం, పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మూడు రోజులుగా సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేస్తూ, పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. అడిషనల్ ఎస్పీ ఎంబీఎన్ ముళీకృష్ణకు వినతి పత్రం సమర్పించారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి మండెల శ్రీరామ్మూర్తి, ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కుడుపూడి పార్థసారథి మాట్లాడుతూ, ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలకు సంబంధించి ఎడిటర్ ధనంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జిలకు పోలీసులు నోటీసులు జారీ చేయడం, పత్రికా కార్యాలయంలో హడావుడి చేయడం, ఒక వార్త రాసినందుకు విచారణ పేరుతో 170 ప్రశ్నలు సంధించడం ప్రత్యక్ష వేధింపుల కిందకే వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసినంత మాత్రాన ఎడిటర్, సంబంధిత ఉద్యోగులపై కక్షపూరిత చర్యలు తీసుకోరాదంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా, వాటిని తుంగలో తొక్కుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎన్టీవీ స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్, సాక్షి టీవీ స్టాఫ్ రిపోర్టర్ హరీష్, సాక్షి పత్రిక స్టాఫ్ రిపోర్టర్ ఫయాజ్ బాషా, జర్నలిస్టులు విశ్వనాథ్, సత్యంబాబు, పీఎస్ గంగాధర్, సత్యనారాయణ, దానవాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసులు భావ్యం కాదు వార్తలు రాసే మీడియా సంస్థలపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న కారణంతో ‘సాక్షి’ ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు బనాయించి వేధించడం తగదు. వార్తల్లో తప్పు ఉంటే రిజాయిండర్ ఇవ్వాలే తప్ప ఇలాంటి చర్యలు తగవు. ప్రభుత్వం పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – మండెల శ్రీరామ్మూర్తి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ కార్యదర్శి పత్రికా స్వేచ్ఛను హరించడమే పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రభుత్వానికి తగదు. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా పత్రికలను నియంత్రించడం మంచి పరిణామం కాదు. వార్తలు రాసే విషయంలో పత్రికలకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం తగదు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. – కుడుపూడి పార్థసారథి, రాజమండ్రి ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే.. ‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. సమస్యలపై ప్రజలను చైతన్యపరుస్తున్న మీడియాపై ప్రభుత్వాలు కక్ష కట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. సాక్షి పత్రిక, ఎడిటర్, రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. కేసులు ఉపసంహరించుకునేంత వరకూ ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. – గెడ్డం రవీంద్రబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, కుల నిర్మూలన పోరాట సమితి, సమిశ్రగూడెం, నిడదవోలు మండలం ‘సాక్షి’పై దాడులు ఆపాలి ‘సాక్షి’ మీడియాపై పోలీసు దాడులను తక్షణం ఆపాలి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియాకు సంకెళ్లు వేయడం మంచిది కాదు. ‘సాక్షి’ కార్యాలయాల్లో సోదాలు చేయడం, ఎడిటర్, బ్యూరో ఇన్చార్జిలకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం రాజ్యాగం విరుద్ధం. – షేక్ మస్తాన్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు -
ఎక్సైజ్ సీఐలను కూర్చోబెడదాం.. కమీషన్ మాట్లాడదాం.. టీడీపీ నేత ఆడియో లీక్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ(TDP) నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చింది. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్(Liquor Belt Shop) షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది. ఏపీలో కూటమి పాలనలో మరోసారి మద్యం అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం.. రాజమండ్రి అర్బన్, రూరల్లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్చార్జ్ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఈ సందర్బంగా.. రాజమండ్రిలో ఎక్కడెక్కడ బెల్టు షాపులు పెట్టాలి. ఎక్కువ ధరకు అమ్మినా ఎక్సైజ్ అధికారులు అడ్డు చెప్పకుండా ఉండేందుకు వారికి ఎంత ఇవ్వాలో నిర్ణయిద్దాం. ఇప్పటికే ఎక్సైజ్ నార్త్, సౌత్ సీఐలను కూర్చోబెట్టి మాట్లాడాను. వాళ్లు ఎంత ఇవ్వాలో ప్రతిపాదించారు. దానికి అనుగుణంగా రూ.2 లక్షల వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత? రూ.2 లక్షలకు పైగా వ్యాపారం జరిగే షాపుల నుంచి ఎంత మామూళ్లు ఎక్సైజ్ అధికారులకు ఇప్పించాలో నిర్ణయిస్తామన్నారు. ఒక ఏరియాలో ఉన్న మద్యం దుకాణం పరిధిలో ఉన్న బెల్టు షాపుల విషయంలో మరొకరు జోక్యం చేసుకోకుండా పకడ్బందీగా రూల్స్ పెట్టుకుందాం. మద్యం అక్రమ వ్యాపారానికి బైలాస్ కూడా రూపొందించుకుందాం. 39 షాపుల నిర్వాహకులను బాండ్లపై సంతకాలు పెట్టించాలి.ఇక, ఎమ్మార్పీకంటే ఎక్కువ రేట్లకు అమ్మాలి. ఏ బ్రాండ్పై ఎంత పెంచాలో చర్చించి నిర్ణయం తీసుకుందాం. 39 షాపుల్లో ఎవరిపై కేసు నమోదు చేసిన అందరూ భరించాలి. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా చర్చిద్దాం. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇప్పించాలి. రెండోసారి షాపుమీద కేసు పెడితే షాపు క్యాన్సిల్ చేస్తారు కనుక కేసు పడకుండా వాళ్లే చూసుకుంటారు అని మాట్లాడుకున్నారు. అయితే, ఈ సమావేశం వెనుక ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే కూటమి నేతలు మద్యం సిండికేట్ ద్వారా ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో మద్యం అక్రమ వ్యాపారాన్ని లీగలైజ్ చేసే విధంగా టీడీపీ నేత మధ్య రాంబాబు మాట్లాడిన ఆడియోపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.ఇది కూడా చదవండి: నకిలీ మద్యం దోపిడీకి క్యూఆర్ కోడ్ అడ్డమే కాదు.. -
కోటసత్తెమ్మ వారికి రూ.36.11 లక్షల ఆదాయం
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ఆలయ హుండీలో రూ.34,61,125, అన్నదాన ట్రస్ట్ హుండీలో రూ.1,50,761 కలిపి మొత్తం రూ.36,11,886 నగదు, 16 గ్రాముల బంగారం, 245 గ్రాముల వెండి, 5 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని దేవదాయ శాఖఅసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. వంద రోజులకు గాను ఈ లెక్కింపు జరిగింది. దేవదాయ శాఖ జిల్లా అధికారి ఈవీ సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది హుండీల నగదును లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధానార్చకుడు అప్పారావుశర్మ తదితరులు పాల్గొన్నారు. అన్నవరప్పాడు వెంకన్నకు రూ.4.18 లక్షల రాబడి పెరవలి: మండలంలోని అన్నవరప్పాడులో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల్లోని హుండీల ద్వారా రూ.4,09,326, అన్నదాన హుండీ ద్వారా రూ.8,831, కలిపి మొత్తం రూ.4,18,157 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. మొత్తం 50 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందన్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ తనిఖీదారు జి.సత్యవర ప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. -
ఘాట్ల అభివృద్ధికి ప్రతిపాదనలు
● అధికారులకు కలెక్టర్ ఆదేశం ● గోదావరిలో బోటుపై ప్రయాణించి పరిశీలించిన కీర్తి తాళ్లపూడి (కొవ్వూరు): గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధి, సౌకర్యాలు, భక్తులకు సురక్షిత ఏర్పాట్లపై హేతుబద్ధమైన విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం, కృష్ణచైతన్య, భక్తాంజనేయ, శివాలయం, పిండ ప్రదానం, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, హేవలాక్ బ్రిడ్జి, శ్రీనివాస, ఎరినమ్మ తదితర ఘాట్లను ఆమె గురువారం పడవ ద్వారా పరిశీలించారు. కుమారదేవం వద్ద సినిమా చెట్టును ఘాట్ను కూడా పరిశీలించారు. ఎరినమ్మ ఘాట్ నుంచి గోష్పాద ఘాట్ వరకూ పడవలో తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం గోదావరి నీరాజనం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, కొవ్వూరు డివిజన్లో పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రత తదితర అంశాలపై అన్ని శాఖలూ సమన్వయంతో పని చేయాలని అన్నారు. పుష్కరాల ప్రారంభానికి ముందే ఆయా శాఖలు ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమీక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో, జిల్లా స్థాయిలో అన్ని విభాగాలూ సమన్వయంతో ముందస్తు సన్నాహాలు వేగవంతం చేసేలా క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్నామని చెప్పారు. వివిధ అంశాలపై విభాగాల వారీగా సమీక్షించి, తక్షణమే లోపాలను సరిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొవ్వూరు వద్ద గోదావరి తీరంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు నిర్మాణంలో ఉన్న పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టు పురోగతిని అధికారులు కలెక్టర్కు వివరించారు. 26 కాటేజీలు, బార్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ హాలు వంటి సౌకర్యాలతో కూడిన ఈ ప్రాజెక్టులో 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు 2027 పుష్కరాల ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా పర్యాటకాధికారి పి.వెంకటాచలం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పట్టాలు ఇచ్చారు..
భూమి చూపలేదు బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి ఏళ్లు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ఇచ్చిన పట్టాలకు నేటికీ భూమిని చూపించలేదు. అక్టోబర్ పదో తేదీ 2014లో వాకతిప్పలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 18 మంది అక్కడకక్కడే మృతి చెందారు. వారిలో నా భార్య మసకపల్లి పుష్పావతి, మరదలు మసకపల్లి కుమారి ఉన్నారు. అప్పట్లో బాధిత కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 సెంట్లు భూమి ఇస్తానని బి పట్టాలు ఇచ్చింది. ఆ భూమి చూపించాలని తహసీల్దార్ కార్యాలయం, స్పందనకు కాళ్లు అరిగేలా తిరుగుతూ వచ్చాం. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఈ పట్టాలకు సంబంధించిన భూమిని గతంలో వేరే వారికి ఇచ్చారు. వారి దగ్గర పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. మమ్మల్ని అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఇస్తానన్న 50 సెంట్ల భూమిని ఇవ్వాలి. – మసకపల్లి నాగేశ్వరరావు, వాగతిప్ప ప్రభుత్వం ఆదుకోవాలి నా తల్లి విజయలక్ష్మిని కోల్పోయాను. ఇంతకాలం మా కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చింది. ఈ ప్రమాదంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాం. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకుంటుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. – దుర్గాదేవి, సోమేశ్వరం, రాయవరం -
సాయం చేసే చేతులేవీ..?
చితికిపోయినా..సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వానికి మానవత్వం బొత్తిగా లేకుండా పోతోంది. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవలసిన బాధ్యతను విస్మరిస్తోంది. తాజాగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో సంభవించిన బాణసంచా విస్ఫోటంలో ప్రాణాలు కోల్పోయిన పది మందిలో బాణసంచా తయారీ దుకాణం యజమాని తప్ప మిగిలిన వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని వారే. ఈ పెను విషాదం జరిగి వారం రోజులు గడిచినా మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి నాలుగు మాటలు చెప్పి వెళ్లడమే తప్ప తక్షణ సాయం అందించే దిశగా ఎటువంటి చర్యలు లేవు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఎప్పుడో ఓ టీడీపీ కార్యకర్త హత్యకు గురైతే ఆ కుటుంబంలో ఒకరికి ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. అదే ఉదారత రాయవరం ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిపై లేకపోవడం ఏంటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని బుధవారం రాయవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాలు ధర్నాకు దిగి అధికారులను నిలదీశాయి ఈ దుర్ఘటనలో బిక్కవోలు మండలం కొమరిపాలేనికి చెందిన బాణసంచా యూనిట్ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మినహాయిస్తే మిగిలిన వారంతా పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి వచ్చిన వారే. కొమరిపాలేనికి చెందిన పొట్నూరి వెంకటరమణ, రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన పాకా అరుణ, వాసంశెట్టి విజయలక్ష్మి, అనపర్తికి చెందిన చిట్టూరి శ్యామల, చిట్టూరి యామిని, అనపర్తి సావరానికి చెందిన కుడుపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, కొమరిపాలెం, పెదపూడి మండలం వేండ్రకు చెందిన లింగం వెంకటకృష్ణ, ఒడిశాకు చెందిన కె. సదానందం మృతులు. యజమాని మినహా మిగిలిన వారంతా ఎస్సీ, బీసీ సామాజికవర్గాల వారే. తమ ప్రభుత్వం ఎస్సీ, బీసీలకు అగ్రాసనం వేస్తుందని గొప్పగా చెప్పుకొనే సర్కార్ కనీసం వారిని ఆదుకోవాలని ఆలోచించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఘటన జరిగిన రోజు రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి వెళ్తున్నారు తప్ప ఎటువంటి సాయం ప్రకటించకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశా రు. అలా కాదని సాయం కోసం ప్రశ్నిస్తే ఇచ్చే సాయం ఇవ్వరేమోననే భయం వారిని మాట్లాడనీయలేదు. వా రిని పక్కనబెడితే కూటమి నేతలైన మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాధిత కుటుంబాలను పలకరించి ప్రభుత్వ పరంగా న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారే తప్ప ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం విస్మయానికి గురిచేసింది. అసలు సంఘటన జరిగిన రోజు వచ్చిన సందర్భంలోనే మంత్రులు ప్రభుత్వ సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. అలా కాకుండా ఈ ఘటనపై సమీక్షించిన తరువాత అయినా ఆర్థిక సాయాన్ని ప్రకటించాల్సి ఉంది. కాగా బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం జ్యుడీషియల్, ప్రభుత్వం వైపు నుంచి విచారణ జరుగుతోంది, పరిహారం ఎలా ఇవ్వాలనేది ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కాలయాపనపై ప్రజా సంఘాలు కార్మిక న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి. కాగా, ఈ దుర్ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తనంతట తానుగా మంగళవారం కేసు నమోదుచేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు కారణాలను ఎన్హెచ్ఆర్సీ ప్రశ్నించింది. మీడియా కథనాల ఆధారంగా కేసు నమోదుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. బాఽధితుల సమీప బంధువులకు పరిహారం అందించారా అనే విషయాన్ని కూడా రెండు వారాల్లో అందించే నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత విషాదకర ఘటనగా నిలిచిపోయిన వాకతిప్ప బాణసంచా పేలుడు 2014 అక్టోబర్ 10వ తేదీన జరిగింది. ఆ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ ఒకో కుటుంబానికి రూ.50 వేలు సొంత నిధులు అందించి ఆదుకున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ తొలుత లక్షన్నర పరిహారం ప్రకటించింది. జగన్ వచ్చి వెళ్లాక ఆర్థిక సాయాన్ని రూ.3 లక్షలు చేసింది. జగన్మోహన్రెడ్డి హయాంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ప్రభుత్వం మానవత్వంతో ఆదుకున్న ఉదంతాలు కోకొల్లలు. సామర్లకోట మండలం జి. మేడపాడులో 2019 అక్టోబర్లో బాణసంచా తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో మృతుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం సుమారు రూ.15 లక్షలు సాయం అందించింది. రంపచోడవరం మన్యం ప్రాంతంలో కచ్చులూరు వద్ద 2019లో పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు బోల్తా పడిన సంఘటనలో 48 మంది మృత్యు వాతపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించింది. అలాగే తాళ్లరేవు మండలం జి.వేమవరంలో బాణసంచా పేలుడు ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. వెంటనే కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారాన్ని, క్షతగాత్రులకు రూ.3 లక్షలు అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విస్మయం పది మంది ప్రాణాలు పోయినా పరిహారానికి మీనమేషాలు ఎదురుతెన్నులు చూస్తున్న బాధిత కుటుంబాలు సర్కార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జగన్ హయాంలో 24 గంటల్లోనే సాయం నేడు ఉన్నత స్థాయి కమిటీ రాక రాయవరం: బాణసంచా ప్రమాద ఘటనపై విచారణ నిమిత్తం ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం రాయవరం రానుంది. ఈ విషయాన్ని తహసీల్దార్ బీవీ భాస్కర్ తెలిపారు. ఉన్నత స్థాయి కమిటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు శాఖ నుంచి ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) రానున్నట్లు తెలిసింది. వీరి వెంట జిల్లా అధికారులు ఉంటారు. ప్రమాద ఘటన తీరుతెన్నులను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించే అవకాశముంది. అలాగే బాధిత కుటుంబాలతో మాట్లాడవచ్చు. పరిశీలన అనంతరం ఉన్నత స్థాయి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. -
రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు
రాజమహేంద్రవరం రూరల్: ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేట్తో అధికార పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలోని 39 మద్యం షాపుల సిండికేట్కు సంబంధించిన ఆడియో సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలను భరత్ బయటపెట్టారు.రేట్ల పెంపు, బెల్టు షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూళ్ల గురించి నిస్సిగ్గుగా చర్చిస్తున్న టీడీపీ రాజమహేంద్రవరం నగర పట్టణ అధ్యక్షుడు మజ్జి రాంబాబుతో పాటు ఆయన వెనకున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అక్రమాలకు వేదికగా రాజమహేంద్రవరం టీడీపీ ప్రభుత్వంలో రాజమహేంద్రవరం అక్రమాలకు వేదికగా మారింది. రాజమండ్రి సిటీ ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరం నగరం, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గం రాజమండ్రి రూరల్లోని 39 మద్యం దుకాణాల సిండికేట్ మీటింగ్ పెట్టారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడైన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఫోన్ సంభాషణ ద్వారా అధికార పార్టీ నేతల సిగ్గులేని తనం బయటపడింది.రూ.100 బాండ్ పేపరు మీద సంతకాలు చేద్దామంటూ నిస్సిగ్గుగా ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 37ఏ, 39/1, 2 సెక్షన్ల ప్రకారం వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. మజ్జి రాంబాబు వెనుక ఉన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేయాలి. ఆయన్ని చంద్రబాబు బర్తరఫ్ చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ అధికారులకు లంచాలిద్దామంటూ నేరుగా చెబుతున్నారు. దీనిపై బీఎన్ఎస్ 274, 276 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే అండతోనే సిండికేట్ మంతనాలు ఎక్సైజ్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టాలో కూడా డ్రా తీసి వీళ్లే నిర్ణయిస్తామని చెబుతున్నారు. కేసు పెట్టిన షాపు కట్టాల్సిన ఫైన్ సిండికేట్ మొత్తం భరించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రెండుసార్లు కేసులు వస్తే.. ఆ షాపు క్లోజ్ అవుతుంది కాబట్టి వంతుల వారీగా ఏ షాపు మీద కేసు పెట్టాలో కూడా సిండికేటే నిర్ణయిస్తుంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండ లేకుండా ఇలా అధికారులను సైతం ప్రభావితం చేయడం సాధ్యమా? లేని లిక్కర్ కేసులో మా పార్టీ ఎంపీ మిథున్రెడ్డిని, ఇతర నేతలను అరెస్టు చేశారు. ఇవాళ మీ పార్టీ నేతలు బహిరంగంగా దొరికిపోయారు.రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీలో చంద్రబాబుకు సైతం భాగస్వామ్యం ఉంది. కూటమి నేతలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున స్కామ్కు పాల్పడుతున్న వీళ్లందరినీ అండమాన్ లేదా తీహార్ జైలుకు పంపించాలి. కూటమి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఆ బురదను ప్రతిపక్షంపై చల్లుతున్నారు. మద్యం షాపుల్లో అమ్మే మందు అసలా, నకిలీయా తేల్చాల్సింది ప్రభుత్వం. ఒకవైపు నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ.. కొనే ముందు ఫోనులో స్కాన్ చేసి అది అసలా.. నకిలీయా టెస్ట్ చేయమంటున్నారు. రూ.100కు చీప్ లిక్కర్ కొనే వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా?వైఎస్ జగన్ హయాంలోనే డేటా సెంటర్విశాఖలో ఏర్పాటు చేస్తున్నది గూగుల్ అదానీ ఎయిర్ టెల్ డేటా సెంటర్. దీనితో పాటు ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని వైఎస్ జగన్ విశాఖలో 130 ఎకరాల స్థలం ఇచ్చి ఎంఓయూ చేసుకున్నారు. 2021లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులతో 25 వేల ఉద్యోగాలతో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్స్పోలో అదానీ డేటా సెంటర్తో ఎంఓయూ చేసుకుని, 2023 మే నెలలో శంకుస్థాపన కూడా చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధినే చంద్రబాబు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. -
మంత్రి నారాయణ వ్యాఖ్యలపై స్పందించిన వర్మ
సాక్షి, కాకినాడ: మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. టీడీపీకి నేనెప్పుడూ ఫైర్ బ్రాండేనన్న వర్మ.. మంత్రి నారాయణ వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదన్నారు. ఎవడో కర్మ, గడ్డి పరక అంటే నాకేంటి? అంటూ వ్యాఖ్యానించారు. తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసునన్నారు.కాగా, టెలి కాన్ఫరెన్స్లో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడిన ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్చార్జ్ మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన, టీడీపీ మధ్య విభేదాలున్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనను నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్లమని, ఇష్టం లేకపోతే వెళ్లకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేదిలేదన్నారు.నీ నియోజకవర్గంలో పార్టీ నేతలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నావని, పార్టీ కేంద్ర కార్యాలయం తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి పది, ఇరవై రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్కళ్యాణ్, నాదెండ్ల మనోహర్తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నాయని, వీటిపై చర్చించి సరిచేసుకుంటున్నామని పేర్కొన్నారు.మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీఏలో ఉన్నామా, లేమా.. అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ను డీగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడటంపై అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారా? అంటూ తనను అడిగారన్నారు. ఇప్పటి వరకు నుడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరూ ఉండరన్నారు. తనకూ తిట్టడం వచ్చు.. కేకలేయడం వచ్చని, ఇక నుంచి పార్టీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. టెలి కాన్ఫరెన్స్లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
రాష్ట్రంలో నాలుగు స్పోర్ట్స్ అకాడమీలు
దేవరపల్లి: రాష్ట్రంలో నాలుగు స్పోట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖలలో అకాడమీల ఏర్పాటుకు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించినట్టు ఆయన చెప్పారు. ఒక్కొక్క అకాడమీలో 14 నుంచి 16 గేమ్స్ ఉంటాయని, ఆరు టీమ్ గేమ్స్ కాగా, మిగిలినవి వ్యక్తిగత క్రీడలని ఆయన తెలిపారు. విజయనగరంలో సుమారు 60 ఎకరాల్లో క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో 100 ఎకరాల్లో క్రీడా పాఠశాల ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో దేవరపల్లి, కొండిపి, కుప్పం, పాయకరావుపేటలో క్రీడా వికాస కేంద్రాలు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. కొవ్వూరులో రాష్ట్రస్థాయి అండర్–17 వాలీబాల్ పోటీలు, దేవరపల్లిలో అండర్–17 సెపక్తక్రా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. 2025 డీఎస్సీ ద్వారా 450 మంది విద్యార్థులకు పైబడి ఉన్న పాఠశాలకు ముగ్గురు పీడీలు ఉన్నారని, మిగిలిన పాఠశాలకు ఇద్దరు పీఈటీలు ఉన్నట్టు ఆయన తెలిపారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, దుద్దుకూరు, యర్నగూడెం, చిన్నాయగూడెం, యాదవోలు గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల్లో మైదానాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పనులుసాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక క్వారీ ఏరియాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనా రూ.16,100 కోట్లు ఉండేదని, ప్రస్తుతం చాలా పెరిగిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని, 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందన్నారు. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని గుర్తుచేశారు. కృష్ణా జలాలపై 1976లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకునే అవకాశం ఉందని, ప్రతి నీటి బొట్టును మనం వాడుకోవాలని అభిప్రాయపడ్డారు. మన ప్రాంతంలో రొయ్యలు, చేపలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని, దీని వల్ల రూ.11 వేల కోట్ల ఆదాయం వచ్చేదని, అమెరికాలో తీసుకున్న పన్నుల విధానం వల్ల ఏర్పడిన ఇబ్బందిని అధిగమించే చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వారు నివాళులర్పించారు. ఐఫోన్ కొనుగోలులో రూ.1.04 లక్షల మోసం రాజమహేంద్రవరం రూరల్: ఓఎల్ఎక్స్లో పెట్టిన ఐఫోన్ను కొనుగోలు చేద్దామనుకుంటే గుర్తు తెలియని వ్యక్తి తనను సంప్రదించి నగదు వేస్తే ఐఫోన్ అందజేస్తానని చెబితే అతని బ్యాంకు ఖాతాకు రూ.1.04 లక్షలు వేస్తే తనను మోసం చేసాడని మోరంపూడి సాయినగర్కు చెందిన పసగడుగుల రాజా శ్రీవెంకటసాయి బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం మోరంపూడి సాయినగర్కు చెందిన సాయి ఓఎల్ఎక్స్లో ఐఫోన్ ఎం ప్రో మోడల్ను కొనుగోలు చేయడానికి గుర్తు తెలియని వ్యక్తికి గత నెల 26వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు రూ.1.04 లక్షలు పంపాడు. కానీ సదరు వ్యక్తి ఐఫోన్ను అందించకుండా సాయి ఫోన్నెంబర్ను బ్లాక్ చేశాడు. సదరు వ్యక్తిపై వెంటనే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయడంతో ఆ మొత్తంలో రూ.1,03,970ను హోల్డ్లో పెట్టినట్టు సాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● విజయనగరంలో 60 ఎకరాల్లో క్రీడా పాఠశాల ● శాప్ డైరెక్టర్ రవీంధ్రనాథ్ -
ఆహా ఏమి రుచి.. అతిథులు మైమరచి..
● నన్నయలో ఆహార మహోత్సవ్ ప్రారంభం ● తొలిరోజు ఆకట్టుకున్న ‘తూర్పు’ రుచులు ● పోటాపోటీగా వంటకాల తయారీ రాజానగరం: పిజ్జాలు, బర్గర్లు అంటూ రెడీమేడ్ ఫుడ్కు అలవాటు పడిన నేటి కాలంలో అసలైన సంప్రదాయ ఆహార పదార్థాల రుచులను గోదావరి వాసులు తమ వంటల ద్వారా నిరూపిస్తున్నారని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్సిటీలో డిపార్టుమెంట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఆహార మహోత్సవ్ 2025 బుధవారం ప్రారంభమైంది. గోదావరి జిల్లాల్లోని ఆహారపు అలవాట్లు, వంటకాల గురించి తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. స్టాళ్ల ఏర్పాటు మొదటి రోజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాల విద్యార్థులు, సిబ్బంది, తమ సన్నిహితులతో కలిసి సంప్రదాయ, ఆరోగ్యకర ఆహార పదార్థాలను తయారు చేయడంలో పోటీ పడ్డారు. తాము తయారు చేసిన పదార్థాలతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, పలువురు అతిథులు, యూనివర్సిటీ, కళాశాలల ఉద్యోగులు, విద్యార్థులు సందర్శించి రుచులను ఆస్వాదించారు. గురువారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల విద్యార్థులు, సిబ్బంది తమ వంటలతో పోటీపడనున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు, పోటీల్లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేస్తారు. తొలిరోజు విజేతలు ● శాకాహారం విభాగంలో బి.ప్రశాంతిశ్రీ, పి.హేమ ప్రియాంక ప్రథమ, డాక్టర్ పి.శిరీష బృందం ద్వితీయ, కె.మమత తృతీయ స్థానాల్లో నిలిచారు. ● మాంసాహార వంటలకు సంబంధించి యూనివర్సిటీలోని బాయ్స్ హాస్టల్ విద్యార్థులు ప్రథమ, బి.లక్ష్మి ద్వితీయ, వై.బాబీ తృతీయ స్థానాలు పొందారు. ● న్యాయ నిర్ణేతలుగా జిల్లా రోగనిరోధక అధికారి డాక్టర్ కోమలి, కెమిస్ట్రీ అధ్యాపకురాలు బీబీ నళిని, గైనకాలజిస్టు డాక్టర్ చందన పర్వత వర్ధిని, శ్రీలక్ష్మి, ఎస్.పుష్పలత వ్యవహరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.విజయ నిర్మల, హెచ్ఓడీ ఆచార్య డి.కల్యాణి, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర, అడ్వకేట్ ఎ.రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
మస్కట్ నుంచి సురక్షితంగా స్వదేశానికి..
అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ కారణంగా మస్కట్లో చిక్కుకుపోయిన ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన పిప్పర శ్రీలతను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చారు. శ్రీలత గత జూన్లో మస్కట్ వెళ్లింది. అక్కడ సరైన పని దొరక్కపోవడం, యజమాని వేధింపులు, మూడు ఇళ్లలో పనికి చేరినా లాభం లేక తీవ్ర ఇబ్బందులు పడింది. వీటికి తోడు అనారోగ్య సమస్యలతో భారత రాయబార కార్యాలయానికి వచ్చేసింది. ఆమె సమాచారం మేరకు తండ్రి మల్లవరపు వెంకటేశ్వర్లు.. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించారు. తన కుమార్తెను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావాలని కలెక్టర్కు అర్జీ అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ బృందం అక్కడి భారత రాయబారి ఇంటి రాజ్యలక్ష్మితో సంప్రదింపులు జరిపి, భారత విదేశీ రాయభార మంత్రిత్వ శాఖ సహకారంతో స్వదేశానికి సురక్షితంగా చేర్చినట్టు నోడల్ అధికారి, డీఆర్ఓ కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్ బుధవారం తెలిపారు. -
దేదీప్యం.. బ్రహ్మోత్సవం
● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై స్వామివారి విహారం ● దర్శనానికి పోటెత్తిన భక్తులు కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలోని శ్రీ భూసమేత వేంకటేశ్వరస్వామి వారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు బుధవారం స్వామివారు శ్రీకృష్ణుని అలంకరణలో సూర్యప్రభ, మోహినీ అలంకరణలో చంద్రప్రభ వాహనాలపై విహరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు వాహన సేవలను వీక్షించారు. దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, పర్యవేక్షణలో ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధా న అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేదపండితులు పూజలు నిర్వ హించారు. డీసీ అండ్ ఈఓ చక్రధరరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పాల్గొన్నారు. రెండు వాహనాలపై ఊరేగింపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రెండు వాహనాలపై స్వామివారు ఊరేగారు. ఉదయం శ్రీకృష్ణుని అవతారంలో సూర్యప్రభ వాహంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని దర్శించుకున్న భక్తులకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తాయని పండితులు తెలిపారు. అనంతరం రాత్రి శ్రీవారు మోహినీ అలంకారంతో చంద్రప్రభ వాహనంపై విహరించారు. దీని వల్ల భక్తులకు శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని నమ్మకం. ఈ సందర్భంగా నిర్వహించిన మేళతాళాలు, కేరళ వాయిద్యాలు, కోలాటం, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. నేటి కార్యక్రమాలు స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు గురువారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలు జరుగుతాయి. స్వామివారికి రాజాధిరాజ అలంకరణలో గజ వాహన సేవ నిర్వహిస్తారు. -
రూ.72.23 లక్షలకు కొబ్బరి చెక్కల వేలం
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామివారి ఆలయంలో భక్తుల కొట్టిన కొబ్బరి చెక్కలను పోగుచేసుకునే వేలం రూ.72,23,499కు ఖరారైంది. ఈ ఏడాది నవంబర్ 16 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 15 వరకూ ఏడాది పాటు కొబ్బరి చెక్కలు తీసుకునేందుకు బుధవారం అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో వేలం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ – టెండర్, సీల్డ్ టెండర్, బహిరంగ వేలం ద్వారా పాట జరిగింది. తొండంగి మండలం సీతారామపురానికి చెందిన గింజాల నాగ వెంకట సత్తిబాబు రూ.72,23,499కు పాట దక్కించుకున్నాడు. గతేడాది రూ.45 లక్షలకు వెళ్లి వేలం ఈ సారి మరింత పెరిగిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. -
ధాన్యపు సిరులొలికేనా!
ప్రజా సమస్యలు గాలికి..సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ వరి కోతలు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే 500 హెక్టార్లకు పైగా కోతలు పూర్తయ్యాయి. వారం, పది రోజుల వ్యవధిలో మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది. ధాన్యం కొనుగోళ్లు ప్రాంభించాల్సి ఉన్నా ప్రభుత్వం నేటికీ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా దళారులు, ప్రైవేటు వ్యాపారులు కోతలు పూర్తయిన వెంటనే తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తక్కువ ధర అని తెలిసినా రైతులు వాళ్లకే విక్రయిస్తున్నారు. ‘తూర్పు’లో ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 1.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. వరి కోతలు విస్తృతంగా సాగుతున్నాయి. జేసీ మేఘ స్వరూప్ శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 221 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించాచారు. ఈ–పంటలో నమోదు చేసుకున్న రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్దేశించినట్లు పేర్కొన్నారు. గ్రేడ్–ఏ రకం ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 నిర్ణయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ సారైనా సమయానికి ధాన్యం నగదు అందిస్తారా? 48 గంటల్లో డబ్బులు జమ చేస్తారా? లేదా గత రబీ సీజన్లో ఎదురైన అనుభవాలే మిగులుస్తారా? అన్న సందిగ్ధం వ్యక్తమవుతోంది. రబీలో రైతులకు అన్యాయం జిల్లాలో 2024–25 రబీలో వరి సాధారణ విస్తీర్ణం 60,042 హెక్టార్లు కాగా ఈ ఏడాది 58,586 హెక్టార్లలో సాగైంది. 5.11 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. అందులో 60 వేల మెట్రిక్ టన్నులు ఫైన్ వైరెటీ ధాన్యం. మిగిలిన 4.51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. 216 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రక్రియ ప్రారంభించారు. తొలుత 2,63,076 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి చేసి, లక్ష్యాలను అధిగమించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలు ముగియడంతో ధాన్యం కొనుగోళ్లు ఆపేశారు. దీంతో చేసేది లేక రైతులు ఆందోళన బాట పట్టారు. వారి నిరసనలకు దిగివచ్చిన ప్రభుత్వం 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు ఇచ్చింది. 3.53 లక్షలు సేకరించి అనంతరం కొనుగోలు కేంద్రాలు మూసేసింది. ఇక సేకరించేది లేదంటూ చేతులెత్తేసింది. 30,448 మంది రైతుల నుంచి 3,53,199.280 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. మిగిలిన ధాన్యం వదిలేయడంతో వాటికి విక్రయించేందుకు రైతులు పడిన పాట్లు వర్ణనాతీతమైంది. సుమారు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించకుండా చేతులెత్తేసింది. ధాన్యం డబ్బుల కోసం తిప్పలు ప్రభుత్వానికి విక్రయించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇవ్వలేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామని గొప్పలు చెప్పిన పాలకులు నెలలు గడిచినా ఇవ్వలేదు. గత రబీలో రూ.812.4 కోట్లు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం రూ.682.49 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన రూ.129.91 కోట్లు విడుదల చేయకుండా నానా తిప్పలు పెట్టింది. ఎప్పుడు విడుదలవుతుందని రైతులు ప్రశ్నిస్తే అధికారులు దిక్కులు చూశారు. ప్రస్తుతం అదే పరిస్థితి ఎదురవుతుందా..? డబ్బులు సకాలంలో ఇస్తారా..? అన్న ప్రశ్న రైతుల్లో ఉంది. గతంలో కోతల వెంటే కొనుగోళ్లు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కోతలు ప్రారంభమయ్యే నాటికి రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్రాలు ప్రారంభించిన వెంటనే కోనుగోళ్లకు నాంది పలికారు. కొనుగోళ్లకు ముందుగానే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్కు రూ.143 పెంచింది. కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేసింది. విస్తృతంగా కోతలు జిల్లా వ్యాప్తంగా చాగల్లు, దేవరపల్లి, గోపాలపురం, కొవ్వూరు, నల్లజెర్ల, నిడదవోలు, రాజమండ్రి రూరల్ మండలాల్లో వరి కోతలు విస్తృతంగా జరుగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో సైతం ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కూలీల రేట్లు అధికంగా ఉండటంతో కోతలకు రైతులు యంత్రాలపైనే ఆధారపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 75 నుంచి 80 శాతం రైతులు యంత్రాల ద్వారానే కోతలు చేపడుతున్నారు. జిల్లాలో వరి సాగు ఇలా.. మండలం కోతల విస్తీర్ణం (ఎకరాల్లో)అనపర్తి 8744.13 బిక్కవోలు 14502.28 చాగల్లు 7901.23 దేవరపల్లి 8580.89 గోకవరం 13993.3 గోపాలపురం 10858.59 కడియం 4870.01 కోరుకొండ 13732.16 కొవ్వూరు 11039.89 నల్లజెర్ల 9065.62 నిడదవోలు 17194.81 పెరవలి 8139.98 రాజమండ్రి రూరల్ 3490.41 రాజానగరం 10530.21 సీతానగరం 13523.45 తాళ్లపూడి 9584.36 ఉండ్రాజవరం 11480.74 రేపటి నుంచి కొనుగోళ్లు జిల్లా వ్యాప్తంగా 221 కేంద్రాల ఏర్పాటు ఊపందుకున్న వరి కోతలు ఆలస్యంగా ధాన్యం సేకరణ గత సీజన్లో చేతులెత్తేసిన ప్రభుత్వం ఈసారైనా కనికరిస్తారా అని అన్నదాత ఎదురుచూపు ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన ధ్వజం కడియంలో రచ్చబండి, కోటి సంతకాల సేకరణ -
రా‘బంధువుల’ మధ్య జీవించలేనంటూ..
ఆలమూరు: బంధువులే రాబంధువులు అయ్యారు. అయిన వాళ్లే గద్దల్లా అనునిత్యం పొడుచుకుతిన్నారు. కేసులు పెట్టి హింసించి జైలుకు పంపించారు. సూటిపోటి మాటలతో వ్యక్తిత్వాన్ని కించపరచేవారు. దీంతో సమాజంలో తాను బతకలేనని అతడు భావించాడు. తాను చనిపోతే బిడ్డలు అనాథలైపోతారని భావించి, ముక్కుపచ్చలారని వారికి పురుగు మందు పట్టించి హత్య చేశాడు. తాను కూడా ఇంట్లో సీలింగ్ ప్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విచార సంఘటన ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు ఇవీ.. స్థానిక శ్రీషిర్డీసాయి ఆలయం సమీపంలో నివసిస్తున్న పావులూరి కామరాజు అలియాస్ చంటి (36) గతంలో గ్రామ వలంటీర్గా పనిచేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామ వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడంతో, తన కులవృత్తి అయిన సెలూన్ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే ఐదేళ్ల క్రితం చంటి భార్య నాగదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి చంటే కారణమంటూ అత్తింటి వైపు బంధువులు ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో ఆలమూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయడంతో చంటి జైలు శిక్షకు గురయ్యాడు. ఇటీవల భార్య నాగదేవి ఆత్మహత్య కేసుపై రాజీ కుదరడంతో బయటపడ్డాడు. కానీ బిడ్డలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. క్లూస్ టీం రాక బిడ్డలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టేందుకు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై జి.నరేష్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కాకినాడ నుంచి క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. మృతుడు చంటి సెల్ఫీ వీడియోలోని ఆరోపించిన విధంగా ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీటి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల రోదన గ్రామస్తులకు చేదోడు వాదోడుగా ఉంటూ అందరిని అప్యాయంగా పలుకరించే తన కుమారుడు చంటి, బుడిబుడి అడుగులతో అల్లరితో సందడి చేసే ఇద్దరు మనవలు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. లోకం పోకడ తెలియని ఆ చిన్నారులను చంపి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డావంటూ వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ముక్కుపచ్చలారని ఆ పసి బాలురు మృతదేహాలను చూసిన స్థానికులు చలించిపోయారు. ఇద్దరు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య ముగ్గురి వేధింపులే కారణమని సెల్ఫీ ఆలమూరు మండలం మడికిలో విషాదం కారణం ఆ ముగ్గురే.. తన సమీప బంధువులైన పావులూరి దుర్గారావు, కొరుప్రొలు తలుపులు, కొరుప్రొలు శ్రీనివాసరావు వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చంటి ఆరోపించాడు. చనిపోయే ముందు ఒక సెల్ఫీ వీడియోను రూపొందించి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. ఇటీవల ఆ ముగ్గురూ తనను చంపేందుకు పలు రకాలుగా ప్రయత్నించారన్నారు. తాను చనిపోతే తన కుమారులు అనాథలై పోతారని ఆందోళన చెందాడు. తన మాదిరిగా బిడ్డల ఆలన పాలన ఎవ్వరూ పట్టించుకోరని ఆవేదన చెందాడు. ఆ ఉద్దేశంతోనే పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు, ఆ ముగ్గురినీ కఠినంగా శిక్షించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.


