breaking news
East Godavari
-
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి దర్శనానికి శనివారం వేలాది మంది భక్తులు పోటెత్తారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. శనివారం స్వామి అమ్మవార్లను విశేష అలంకరణ చేయటంతో భక్తులు చూసి పరవశించారు. తెల్లవారుజాము నుంచే వందలాది మంది భక్తులు రావడంతో భక్తులు క్యూలో ఆలయ ప్రాంగణం చుట్టూ నిలబడటంతో దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులందరికీ దాతల ఆర్థిక సాయంతో 7 వేల మందికి ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో ఉచిత అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం సీటీఆర్ఐ: స్థానిక దేవీచౌక్లో బాలాత్రిపుర సుందరీదేవి 92వ శరన్నవరాత్ర మహోత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్రీదేవి మహోత్సవ సమితి అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు. ఉత్సవ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్టు తెలిపారు. శనివారం స్థానిక దేవి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ 21వ తేదీ రాత్రి 9.45 గంటలకు శ్రీదేవి విగ్రహ ప్రతిష్ఠ, 22వ తేదీ ఉదయం 6.18 నిమిషాలకు కలశస్థాపన చేస్తామని తెలిపారు. ప్రతిరోజూ కుంకుమ పూజలు, ఉదయం, సాయంత్రం మంగళవాయిద్యాల నడుమ అఖండ హారతి కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. 28వ తేదీ ఆదివారం 108 దంపతుల పూజ ఉంటుందని, పూజలో పాల్గొన్న వారికి మధ్యాహ్నం భోజన ప్రసాదం అందిస్తామన్నారు. 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ పూజలు ఉంటాయన్నారు. రోజుకో అలంకారంతో అమ్మవారికి పూజలు, రాత్రివేళ నాటకాలు జరుగుతాయన్నారు. 22న స్వర్ణకవచ కనకదుర్గాదేవిగా, 23న గాయత్రీ దేవిగా, 24న అన్నపూర్ణదేవిగా, 25న మహాలక్ష్మిగా, 26న బాలాత్రిపుర సుందరీదేవిగా, 27న శ్యామలాదేవిగా, 28న లలితాత్రిపుర సుందరీ దేవిగా, 29న సరస్వతీదేవిగా, 30న దుర్గాదేవిగా, అక్టోబరు ఒకటిన మహిషాసురమర్ధినిగా, రెండున విజయదశమి నాడు రాజరాజేశ్వరిగా అలంకరించనున్నారు. అలాగే ప్రతిరోజూ వివిధ నాటకాలు ఉంటాయని ఉత్సవ కమిటీ తెలిపింది. 12వ తేదీ ఆదివారం అన్నసమారాధన నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యక్షులు ముత్యాల కుమార రెడ్డి, గంధం భైరవస్వామి, ఆకుల వెంకటేశ్వరరావు, సెక్రటరీ అల్లక సత్యనారాయణ, కోశాధికారి బత్తుల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు మూడో స్థానం కంబాలచెరువు(రాజమహేంద్రవరం): తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని అప్పాలో నిర్వహించిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025లో జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ పోటీలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించింది. ఆ వివరాలను సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ శనివారం తెలిపారు. పురస్కారాన్ని ఆయన హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. జైళ్లలో పరిశుభ్రత, ఆరోగ్యకర వాతావరణం కల్పించడంతో ఈ స్థానం లభించింది. కేంద్ర కారాగారంలో పనిచేసిన సిబ్బంది సమష్టి కృషిని రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారులు అభినందించారని రాహుల్ తెలిపారు. ఈ పురస్కారంతో రాష్ట్ర జైళ్ల శాఖకు గౌరవం చేకూరిందన్నారు. శృంగార వల్లభుని దర్శనానికి పోటెత్తిన భక్తులు పెద్దాపురం: మండలంలోని స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని పూలమాలికలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కలెక్టర్ కీర్తి చేకూరి సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. శనివారం నూతన కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కీర్తి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రానున్న 2027 గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ, ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పరిపాలనలో బాధ్యతాయుత ధోరణి కనబరచాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థల ద్వారా అందిస్తున్న సేవలు ప్రజలకు నిజ సమయంలో చేరేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. పీజీఆర్ఎస్కు సంబంధించి వాస్తవంగా డివిజన్, మండల స్థాయిలో సరైన పరిష్కారం, సరైన అవగాహన లేకే కలెక్టరేట్కి ఎక్కువ మంది వస్తున్నారన్నారు. మనందరం కలసికట్టుగా పనిచేసి జిల్లాను అగ్రగామిగా నిలపడంలో సమన్వయం, పరస్పర సహకారంతో కలసి పనిచేద్దామని కలెక్టర్ కోరారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంలో జిల్లాకు చెందిన ముఖ్యమైన సమస్యలు, రాష్ట్ర, కేంద్ర స్థాయిలో రావలసిన అనుమతులు, నిధుల మంజూరు తదితర అంశాలపై శాఖల వారీగా చర్చించామని, ఈమేరకు సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి కలెక్టరేట్ ఏవో ఆలీ, ఆర్డీఓలు రాణీసుస్మిత, ఆర్.కృష్ణనాయక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు స్వాగతం పలికారు. -
జీవనోపాధి కోల్పోయాం
ఆటో కార్మికుల పరిస్థితి ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి అన్న చందంగా మారింది. సీఎం చంద్రబాబునాయుడు ఏకపక్ష నిర్ణయంతో ఆటో కార్మికుల పొట్టకొట్టారని కార్మికులు ధ్వజమెత్తుతున్నారు. రోజంతా కష్టపడి ఆటోను నడుపుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులు నేడు సీ్త్రశక్తి ఉచిత బస్సు పుణ్యాన అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఒకనాడు దర్జాగా నేను ఆటోవాలాను అని చెప్పుకునే దశ నుంచి నేడు అడుక్కుతినే పరిస్థితి వచ్చిన ఆటో కార్మికులను చూసి ప్రతి ఒక్కరూ జాలిపడుతున్నారు. దీనిపై కథనమిలా.. ఫ రోడ్డున పడిన ఆటోవాలాలు ఫ పడిపోయిన ఆదాయం ఫ రోజుకి రూ.500 కూడా రాని వైనం ఫ జిల్లాలో 21 వేల మందికి పైగా కార్మికులు ఫ ఎన్నికల వాగ్దానం నిలబెట్టుకోని కూటమి ప్రభుత్వం పెరవలి: ఆటో నడిస్తేనే జీవనచక్రం తిరిగే కుటుంబాలు నేడు వీధిన పడ్డాయి. ఫైనాన్స్ బకాయిలు కట్టలేక, కుటుంబాలను పోషించుకోలేక, అప్పులు చేయలేక, కడుపునిండా తిండి తినలేక విలవిల్లాడిపోతున్నారు. ఎంతో సాఫీగా సాగే ఆటోవాలాల జీవనం నేడు తెల్లవారితే చాలు ఎలా బతకాలో తెలియక నానా అగచాట్లు పడుతున్నారు. ఒకప్పుడు ఆడుతూ పాడుతూ సాగిపోయిన కుటుంబాలు కాస్తా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం అష్టకష్టాలు చవిచూపిస్తుంది. కిరాయిలు లేక, ఆటో ఎక్కే వారు లేక ఏమి చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారు. పదులు, వందలు కాదు ఏకంగా జిల్లాలో 21 వేల మంది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చంద్రబాబు సర్కారు నిర్ణయంతో ఆటోడ్రైవర్లు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి ఇప్పుడు కిరాయిలు లేక నెలవారీ ఈఎంఐలు కట్టలేక ఆటో కార్మికులు సతమతమవుతున్నారు. ఆర్టీసీలో సీ్త్రశక్తి పేరుతో ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సుతో తాము ఉపాధి కోల్పోతామని.. తమ బతుకులు వీధిన పడతాయి గత 6 నెలలుగా ఉద్యమాలు చేసి నిరసనలు తెల్పినా ప్రభుత్వానికి కనికరం లేదని ధ్వజమెత్తుతున్నారు. ప్రాంతాన్ని బట్టి రోజుకి 5 నుంచి 10 ట్రిప్పులు వేస్తూ రోజుకి చెల్లించవలసిన అద్దెలు కట్టి ఇంటికి రూ.500 నుంచి రూ.800 వరకు తీసుకెళ్లేవారమని నేడు రోజంతా కష్టపడి ఆటో తిప్పినా కనీసం రూ.500 కూడా రావడం లేదని దీనంగా చెబుతున్నారు. ఇంత దుర్భర పరిస్థితి వస్తుందని తాము ఏనాడు ఊహించలేదని వాపోతున్నారు. ఉచిత బస్సుతో జీవనోపాధి కోల్పోతామని తెలిసినా కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆటో యూనియన్లు తప్పుపడుతున్నాయి. తగిన విద్యార్హత ఉన్నా ప్రభుత్వ, ప్రెవేట్ రంగాల్లో ఉద్యోగాలు లేక విద్యావంతులు కూడా ఫైనాన్స్పై ఆటోలు తీసుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఉచిత బస్సు ప్రవేశపెట్టిన నాటి నుంచి మహిళలు ఆటోలు ఎక్కడం మానేశారని దీంతో ఉపాధి పోయి ఉసూరుమంటూ రోడ్లపై కాలక్షేపం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, రాజానగరం, కడియం, గోకవరం, రంగంపేట, అనపర్తి, తాళ్లపూడి, పెరవలి, ఉండ్రాజవరం, బిక్కవోలు, కోరుకొండ, దేవరపల్లి మండల కేంద్రాల్లో ఆటోలే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ ఉచిత బస్సు మూలంగా ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తరువాత ఆటోయూనియన్లు బగ్గున లేచి ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం కనికరం లేకుండా అణచి వేసిందని అంటున్నారు. గత ప్రభుత్వం ఆదుకున్నట్టుగా ఎన్నికల్లో మాకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకుని ఆర్థిక భరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు వైఎస్సార్ సీపీ పెద్దపీట గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆటో కార్మికులకు వాహనమిత్ర పథకం ప్రవేశపెట్టి వారి ఉపాధికి భరోసాగా నిలిచింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికీ ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేసి ఆదుకుంది. కోవిడ్ లాంటి కష్ట సమయంలోనూ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది. -
16 బార్లకు దరఖాస్తులు నిల్
ఫ దరఖాస్తు చేయకుండా తెరవెనుక కూటమి నేతల కుట్రలు ఫ మొత్తం 25 బార్లకు 9 బార్లకు పూర్తయిన డ్రా ఫ మిగిలిన వాటికి 17 వరకు గడువు పొడిగింపు రాజమహేంద్రవరం రూరల్: బార్ల విషయంలో అధికార కూటమి నేతలు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అధికార పార్టీ వారంతా సమావేశమై దరఖాస్తులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తయినా అన్ని బార్లకు దరఖాస్తులు రాలేదు. జిల్లాలో కల్లుగీత కార్మికుల బార్లతో కలసి 25 బార్లకుగాను 9 బార్లకు మాత్రమే డ్రా తీశారు. ఇంకా మిగిలిన 16 బార్ల విషయంలో ఎకై ్సజ్శాఖ అధికారులపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. దరఖాస్తు గడువు ఈనెల 17వ తేదీ వరకు పొడిగించినా ఒక్క దరఖాస్తు రాలేదు. అడ్డగోలు షరతులు విధించడంతో బార్లు ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. ఒక్క దరఖాస్తూ రాలేదు వాయిదాల మీద వాయిదాలు వేసి నోటిఫికేషన్లు మీద నోటిఫికేషన్లు విడుదల చేసినప్పటికీ జిల్లాలో మొత్తం బార్లకు దరఖాస్తులు రావడం గగనంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ కూటమి ప్రభుత్వం నూతన బార్ల పాలసీని ప్రకటించింది. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 22, రిజర్వ్ కేటగిరిలో 3 బార్లు మొత్తం కలుపుకుని 25 బార్లకు లైసెన్సులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ఒక్కో బార్కు నాలుగేసి దరఖాస్తులు వస్తేనే డ్రా తీయాలని, లేకపోతే రీనోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి దరఖాస్తులు స్వీకరించడం మొదలుపెట్టింది. మొదట ఆగస్టు 26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఆశించిన రీతిలో దరఖాస్తులు రాలేదు. దాంతో మరో రెండు రోజుల పాటు దరఖాస్తులకు గడువు పెంచింది. జిల్లాలో మద్యం దుకాణాలను బినామీల ద్వారా నిర్వహిస్తున్న కూటమి నేతల కుట్రలతోనే దరఖాస్తులు రాలేదని ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో మొత్తం మీద ఓపెన్ కేటగిరీలో 24 దరఖాస్తులు, గీత కార్మికులకు కేటాయించిన బార్ల కు 19 దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 30న ఓపెన్ కేటగిరిలో ఆరు, రిజర్వ్ కేటగిరిలో మూడు బార్లకు డ్రా తీసి లైసెన్సులు మంజూరు చేశారు. మిగిలిన 16 బార్లు మిగిలిపోయాయి. రాజమహేంద్రవరం 13, కడియపులంక ఒకటి, కొవ్వూరు ఒకటి, నిడదవోలు ఒకటి బార్లు ఉన్నాయి. వాటి కోసం రీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయినా ఒక్క దరఖాస్తు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఎకై ్సజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
సర్వం సాంకేతిక మయం
కూటమి పాలనలో తప్పులుకపిలేశ్వరపురం: ఆధునిక కాలమంతా సాంకేతికమయం. ప్రయోగాలు, పరిశోధనలే కాదు సామాన్యుడి రోజువారీ జీవితం సైతం సాంకేతిక అంశాలతో నిండిపోయింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో విస్తారంగా సాంకేతిక విద్య సంస్థలున్నాయి. ఇంజినీర్లను తయారు చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న వాదన ఉంది. సెప్టెంబర్ 15న ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ కథనం.. జిల్లాలో సాంకేతిక విద్యాసంస్థలివే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలల్లో 520, 29 ప్రైవేటు కళాశాలల్లో 16,800 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగంలో కాకినాడ జిల్లాలో 8,666 మంది పరీక్ష రాయగా 6,343 మంది అర్హత పొందారు. కోనసీమలో 3,891 మందికి 2,866 మంది, తూర్పుగోదావరిలో 7,416 మందికి 6,011 మంది మొత్తం 15,220 మంది అర్హత పొందారు. కాకినాడ జిల్లాలో రెండు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 644 సీట్లు, 12 ప్రైవేటు కళాశాలల్లో 1,400 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 ప్రభుత్వ, 44 ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలలున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలతో పాటు మరో ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. రంపచోడవవరం, రాజమహేంద్రవరంలలో ఒక్కొక్కటి చొప్పున ప్రభుత్వ, ఐదు ప్రైవేటు, కాకినాడ జిల్లాలో పిఠాపురంలో ఒకటి, కాకినాడలో రెండు ప్రభుత్వ, 9 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. సాంకేతిక విద్యపై విద్యార్థుల ఆసక్తి జూలై 4న కాకినాడ జేఎన్టీయూకే విశ్వ విద్యాలయ 11వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 35 మందికి బంగారు, 99 మందికి పీహెచ్డీ పట్టాలు, 5 నగదు పతకాలు, అందజేశారు. సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ, సమగ్ర శిక్షా, ముస్కాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఏడాది జూలై 28న పిఠాపురంలోనూ, 29న అమలాపురంలోనూ స్పేస్ ఎడ్యుకేషన్ క్యాంపులను నిర్వహించగా విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్శిటీ క్యాంపస్లో జూలై 14 నుంచి 19 వరకూ క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ– ఏటీఏఎల్ స్పాన్సర్డ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. జాతీయ స్థాయి పరీక్షల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో విద్యలో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ అమలు చేశారు. 3వ తరగతి నుంచే టోఫెల్ క్లాసులు నిర్వహించడంతో పాటు 8వ తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ట్యాబులు అందించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు స్మార్ట్ టీవీలు, ఉన్నత పాఠశాలలకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇచ్చారు. సాంకేతిక విద్యపై కూటమి నిర్లక్ష్యం డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు వేధిస్తున్నాయి. సుమారు రూ.15 వేలు చొప్పున నాలుగు నుంచి ఏడు క్వార్టర్ల వరకూ చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. వాటి భారాన్ని మోయలేక డీమ్డ్ యూనివర్శిటీలుగా మారేందుకు కళాశాలల యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తుండటం వల్ల రానున్న రోజుల్లో ఈఏపీసెట్ ప్రాధాన్యం తగ్గిపోయే ప్రమాదం ఉంది.ఆధునిక సాంకేతికతను సామాన్యుల కోసం వినియోగించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఈ–కేవైసీ పేరుతో రేషన్ కార్డుల్లో కోత పెట్టిందన్న వాదన ఉంది. యాప్ల ద్వారా సర్వే పేరుతో దివ్యాంగులు తదితరుల పింఛన్లలో కోత పెట్టింది. మే 15న ఈసెట్ ఫలితాలు విడుదల చేసినప్పటికీ నెలన్నర తర్వాత జూలైన 4నుంచి కానీ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇవ్వలేకపోయింది. రాష్ట్రంలో డీఎస్సీ ఒకే రోజు ఒకే సమయానికి రెండు పరీక్షలకు హాజరు కావాలంటూ హాల్ టికెట్లు జారీ చేయడంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు. స్మార్ట్ రేషన్ కార్డులు తప్పుల తడకగా మారాయి. సాంకేతికతతో నేరాలను అదుపు చేస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నప్పటికీ అందుకు భిన్నంగా ఏడాది కాలంలో కాకినాడ జిల్లాలో సుమారు వెయ్యికిపైగా ఆన్లైన్ మోసాల కేసులు నమోదయ్యాయి. పెరిగిన ఇంజినీర్ల ఆవశ్యకత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సద్వినియోగం ఇంజినీరింగ్ విద్యనందించడంలో ‘కూటమి’ నిర్లక్ష్యం సంక్షేమాన్ని ఎగ్గొట్టేందుకు సాంకేతికత వాడకం రేపు ఇంజినీర్స్ డే -
ఉమ్మడి జిల్లాలో 42 బెంచ్ల్లో లోక్ అదాలత్
● పరిష్కరించిన కేసులు 4,453 ● బాధితులకు రూ.16.35 కోట్ల నష్టపరిహారంకంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రమాదవశాత్తూ మృతి చెందిన వారి కేసుల్లో రాజీ పడ్డ వారు నష్టపరిహారానికి ఎక్కువ కాలం వేచి ఉండనవసరం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీ లబ్ధిదారుడు తన బ్యాంక్ అకౌంట్ తెలిపితే నెల రోజుల్లోనే లబ్ధిదారుని ఖాతాలోనే జమ చేస్తారని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.మాధురి తెలిపారు. ఉమ్మడి జిల్లాలైన తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏఎస్ఆర్ జిల్లాల్లో శనివారం 42 బెంచ్లలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. దీనిని జిల్లా కోర్టులో ఇన్చార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.మాధురి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో ఇరువర్గాల సమస్య రాజీతో కూడిన పరిష్కారం అవుతుందన్నారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో తూర్పు గోదావరి జిల్లా ముందంజలో ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలో 4453 కేసులను పరిష్కరించారు. బాధితులకు రూ.16.35 కోట్ల నష్టపరిహారాన్ని అందేలా చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్.ఉమా సునంద, ఎల్.వెంకటేశ్వరరావు, ఎస్కే.జానీబాషా, బి.పద్మ, కె.ప్రకాష్బాబు, ఎన్.శ్రీలక్ష్మి, టి.రాఘవేంద్ర, జి.శ్రీనివాస్రెడ్డి, పి.బాబు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి పి.రమేష్ పాల్గొన్నారు. -
అంగన్వాడీల జిల్లా కమిటీ ఎన్నిక
సీటీఆర్ఐ: ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా రెండో మహాసభ స్థానిక విక్రమహాల్లో శనివారం జరిగింది. ఈ మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని తీర్మానాలను ఆమోదించారు. సీహెచ్ మాణిక్యాంబ అధ్యక్షురాలిగా, కె.బేబీరాణి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా బి.రామలక్ష్మి, గౌరవ అధ్యక్షుడిగా ఎస్ఎస్ మూర్తి, జిల్లా ఆఫీస్ బేరర్స్గా సీహెచ్ అన్నపూర్ణ, బి.మార్తమ్మ, 10 మంది జిల్లా కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మహాసభలో అంగన్వాడీ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో, రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న పరిస్థితులను సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షలు టి.అరుణ్ వివరించారు. దేశభవిష్యత్తు అయిన బాలలను, గర్భిణీలు సంక్షేమం చూసే సేవా కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సభలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి తదితరులు పాల్గొన్నారు. -
శానిటరీ ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం
అన్నవరం: ఐదేళ్ల క్రితం ప్రభుత్వ స్థలాన్ని ప్రవేట్ స్థలంగా నమ్మించి తన బంధువులకు విక్రయించి మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలని పోలీసులను, పెద్దలను ఆశ్రయించినా న్యాయం జరగలేదని మనస్థాపానికి గురైన అన్నవరం దేవస్థానం శానిటరీ ఇన్స్పెక్టర్ టి.వేంకటేశ్వరరావు శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే సకాలంలో అతడిని తునిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ చికిత్స పొందుతున్నారు. ఎటువంటి ప్రాణపాయం లేదని వైద్యులు చెప్పినట్టు ఆయన కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. శానిటరీ ఇన్స్పెక్టర్ వేంకటేశ్వరరావు రాసిన లేఖలో వివరాల ప్రకారం.. ఆయన 2021లో మధ్యవర్తిగా ఉండి తన తోడల్లుడు తెడ్లాపు రవికుమార్, మరదలు వేంకట సత్యదీప్తి కోసం బెండపూడి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 114–16ఎ, 114–17ఏ లో రియల్ ఎస్టేట్ వెంచర్లోని 33 నెంబర్ ప్లాట్ను రూ.25 లక్షలకు స్థానిక వ్రతపురోహితుడు నాగాభట్ల సీతారామం వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఐదేళ్ల అనంతరం ఈ ఏడాది ఆగష్టు 14న ఆ స్థలాన్ని ఎల్ఆర్ఎస్ నిమిత్తం కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆఫీసులో సంప్రదించగా అది ప్రభుత్వ భూమి అని తేలిందని తెలిపారు. దాంతో ఆ భూమి విక్రయించిన నాగాభట్ల సీతారామంను డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగ్గా తాను రియల్ ఎస్టేట్ వెంచర్లో దానిని కొన్నానని ఆ వెంచర్ వేసిన వారినే అడగాలని అంటున్నాడని అందులో పేర్కొన్నారు. దీనిపై తొండంగి పోలీసులను ఆశ్రయించినా, పెద్దల వద్ద పంచాయితీ పెట్టినా న్యాయం జరగలేదని పేర్కొన్నారు. దాంతో తనకు గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా, తుని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేంకటేశ్వరరావును దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం పరామర్శించారు. వేంకటేశ్వరరావుకు స్థలం అమ్మిన నాగాభట్ల సీతారామంను ఈ వ్యవహారంపై ప్రశ్నించగా తాను ఇల్లు కట్టుకుందామని ఆ ప్లాట్ కొనుక్కున్నానని కాని తన తండ్రి అనారోగ్యం కారణంగా 2021లో విక్రయించానని తెలిపారు. అది తన పూర్వార్జితం కాదని అది ప్రభుత్వ భూమి అన్న విషయం తనకు తెలియదని తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వారినే అడగాలని ఆయనకు చెప్పానని తెలిపారు. -
బ్యాంకు మేనేజర్ని బురిడీ కొట్టించిన మహిళ
నిడదవోలు: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని ఓ బ్యాంక్ మేనేజర్ను మాయమాటలతో నమ్మించి, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్న మహిళపై నిడదవోలు పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. నిడదవోలు పట్టణ సీఐ తిలక్ తెలిపిన వివరాల ప్రకారం. నిడదవోలు పట్టణంలో గతంలో పనిచేసిన ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ వద్ద నుంచి పట్టణంలోని విద్యానగర్కు చెందిన అంబటి ఉమా (అలియాస్ శ్రావ్యారెడ్డి) దఫదఫాలుగా రూ.1.30 కోట్లు తీసుకుంది. నూజివీడు ఇతర ప్రాంతాల్లో పొలాలు ఉన్నాయని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పి మాయమాటలు చెప్పి బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ను నమ్మించింది. ఈ క్రమంలో లోన్ వంకతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భారీ మొత్తం కావాలంటూ పలుమార్లు బ్యాంకు మేనేజర్ వద్దకు వచ్చేది. ఇలా తరుచుగా వస్తూ పెద్ద మొత్తంలో నగదు తీసుకుంది. బ్యాంకు మేనేజర్ బంధువులు, తెలిసిన వారి వద్ద నుంచి సొమ్ములు తీసుకుని నిందితురాలు అంబటి ఉమకు ఇచ్చారు. ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ బంగారం కూడా కొనుగోలు చేసింది. తీరా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా లేదని మోసపోయినట్లు బ్యాంకు మేనేజర్ గ్రహించారు. తీసుకున్న రూ.1.30 కోట్లు డబ్బులు ఇవ్వాలని ఆమెను బ్యాంక్ మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ తరచూ అడిగేవారు. ఈ క్రమంలో డబ్బుల గురించి అడిగితే అత్యాచారం చేశావని, నన్ను వాడుకొని మోసం చేశావని కేసు పెడతానని నిందితురాలు మేనేజర్ను బెదిరించింది. ఈ మేరకు బ్యాంకు మేనేజర్ చప్పిడి శ్రీనివాసరావు పట్టణ పోలీసులను ఆశ్రయించి ఆమైపె ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా శనివారం విద్యానగర్లో నిందితురాలు అంబటి ఉమను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలి నుంచి రూ.4.93 లక్షల నగదు, 312.020 గ్రాముల బంగారు వస్తువులు, ఆండ్రాయిడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముద్దాయి అంబటి ఉమా వలలో పడి నిడదవోలు చుట్టుపక్కల మరి కొంతమంది కూడా మోసపోయినట్లు తెలిసింది. కేసును ఛేదించిన సీఐ పీవీ తిలక్, ఎస్సై జగన్మోహన్రావులను కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ అభినందించారు. రియల్ ఎస్టేట్ పేరుతో రూ. 1.30 కోట్లు తీసుకున్న మహి ళ సొమ్ము అడిగితే అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులు రూ.4.93 లక్షల నగదు, బంగారం రికవరీ -
నానా ఇబ్బందులు పడుతున్నాం
నేను అన్నవరప్పాడు ఆటో యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. గత పదేళ్లలో ఇంత దుర్భర పరిస్థితి ఏనాడూ ఎదురవలేదు. నేడు ఆటో నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఫైనాన్స్లో అప్పు తీసుకుని ఆటో కొనుగోలు చేసిన వారే నేడు అద్దెలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రోజుకి రూ.1000 నుంచి నేడు రూ.500 కూడా మిగలడం లేదు. – వాసంశెట్టి రాము, ఆటోయూనియన్ ప్రెసిడెంట్, అన్నవరప్పాడు ఎలా పోషించాలో అర్థం కావడం లేదు నిడదవోలు–కానూరు, కానూరు–తణుకు రోజుకి 10 ట్రిప్పులు వేసేవాడిని. నేడు రెండు, మూడు ట్రిప్పులు కూడా వేయలేకపోతున్నాం. రోజుకి ఆదాయం రూ.800 నుంచి రూ.1200 వరకు ఉండేది. నేడు రూ.500 కూడా తోలడం లేదు. మిగులు ఎలా ఉన్నా కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. – పంజా దుర్గారావు, ఆటో డ్రైవర్, కానూరు ఆర్థికంగా నలిగిపోతున్నాం కుటుంబాలను పోషించలేక ఆర్థి కంగా నలిగిపోతున్నాం, రోడ్డెక్కి నా కిరాయిలు ఉండటం లేదు. ఉచిత బస్సు పథకం మా ఉపాధికి గండికొట్టింది. గతంలో ఉద యం 6 గంటలకు ఆటో ఎక్కితే సాయంత్రం 6 గంటలకు డ్యూటీ దిగేవాడిని. కానీ నేడు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు వేచి చూసినా రోజుకి రూ.500 కూడా సంపాదించలేకపోతున్నాం. జీవితం భారంగా మారింది. –ఈతకోట నాగరాజు, ఆటో డ్రైవర్, లంకమాలపల్లి -
కృష్ణమోహన్కు రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): స్థానిక నేషనల్ సీనియర్ బేసిక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వరాహగిరి కృష్ణమోహన్ను ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘం రాష్రస్థాయి బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయుడు 2025గా ఎంపిక ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ వివరాలను శనివారం ఆయన తెలిపారు. తొలిసారిగా ఇస్తున్న బ్రాహ్మణ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రాష్ట్ర స్థాయిలో 248 నామినేషన్లు వచ్చాయన్నారు. వాటిలో 53 మందిని ఎంపిక చేసి గుంటూరు బ్రాడీపేట బ్రాహ్మణ సేవాసమితి ఆఫీసులో ఈ నెల 14న అతిథుల చేతుల మీదుగా అవార్డు అందజేయనున్నారన్నారు. -
సెపక్తక్రా పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక
పి.గన్నవరం: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఈనెల 11న కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి సెపక్తక్రా సెలక్షన్స్లో పీఎంసీ పి.గన్నవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ఎం కోసూరి ఉమాదేవి తెలిపారు. అండర్–17 బాలికల విభాగంలో మట్టపర్తి అవంతి, అండర్–14 బాలికల విభాగంలో కడలి హిరణ్యవల్లి, అండర్–17 బాలుర విభాగంలో గుమ్మళ్ల నితీష్లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆమె వివరించారు. వీరిని పేరెంట్స్ కమిటీ సభ్యులతో పాటు, వ్యాయామోపాధ్యాయులు ఎం.దుర్గాప్రసాద్, కె.భీమేంద్ర తదితరులు అభినందించారు. ఫెన్సింగ్ పోటీలకు విద్యార్థుల ఎంపికఅమలాపురం రూరల్: మలికిపురం మండలం మోరి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ఎస్జీఎఫ్ ఫెన్సింగ్ జిల్లా ఎంపికల్లో అమలాపురం మండలం ఎ.వేమవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 బాలుర విభాగంలో డి.భార్గవ్, అండర్–14 విభాగంలో ఎ.నాగవరుణ్ ప్రతిభ కనబరచి రాష్ట్ర పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయిని కనకదుర్గ తెలిపారు. విద్యార్థులను సర్పంచ్ రావూరి వెంకటలక్ష్మి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ దాసం విజయదుర్గ, వ్యాయామోపాధ్యాయుడు బీవీవీఎస్ఎన్ మూర్తి, ఎంపీటీసీ సభ్యురాలు లింగోలు సత్యవతి, నాయకులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు అభినందించారు.మృతదేహం గుర్తింపుఏలేశ్వరం: పట్టణంలో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం మెట్లపై మృతదేహాన్ని గుర్తించారు. వయస్సు 50 ఉంటుందని భావిస్తున్నారు. శరీరంపై నిక్కరు మినహా ఏమీలేవు. బక్కపలుచగా ఉన్నాడు. మతిస్థిమితం లేనివాడని భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించాలి
తుని: విద్యార్థులు జ్ఞాన సముపార్జనపై దృష్టి సారించాలని భారతీయ వరి పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎం సుందరం సూచించారు. స్థానిక స్పేసెస్ డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించిన యువ ప్రేరణ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్ధుల ఆలోచనల్లో సృజనాత్మకత లేకపోతే యాంత్రికంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జీవిత లక్ష్యాల సాధనకు సమర్థ ప్రణాళికలు రచించాలన్నారు. సవాళ్లను అధిగమించి అవకాశాలను అందిపుచ్చుకునేలా సంసిద్ధులై ఉండాలని చెప్పారు. మరో అతిథి, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వీ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించే మార్కులు వారి మేధస్సుకు కొలమానం కాదన్నారు. లక్ష్యసాధన వైపు అడుగులేయాలంటే కఠోరశ్రమ, పట్టుదల ఎంతో అవసరమన్నారు. శ్రీప్రకాష్ విద్యాసంస్థల అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్ అతిథులను జ్ఞాపికలతో సత్కరించారు. -
కులాల మధ్య చిచ్చు పెడుతున్న కూటమి సర్కార్: వేణు
సాక్షి, తూర్పుగోదావరి: కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ది పొందాలని కుటిల యత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కుటిల యత్నాన్ని ప్రజలు, కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కులధృవీకరణ పత్రాల జారీలో తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ సామాజిక వర్గం ఆందోళన చెందే విధంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు.శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆ తర్వాత బ్రాకెట్లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. పైగా ఈ నిర్ణయం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకున్నదేనన్న మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. గతంలో మెమో జారీ చేసిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం అయితే దాన్ని రద్దు చేస్తూ జీవో నెంబరు 25 విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెమోకు జీవోకు తేడా తెలియకుండా మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..జీవో జారీ చేసిందే చంద్రబాబు ప్రభుత్వంప్రభుత్వం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కుల ధృవీకరణ పత్రం మంజారు చేసే సమయంలో ముందుగా గౌడ అని చూపించి ఆతర్వాత బ్రాకెట్ లో శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత, సిగిడి అని నమోదు చేస్తుంది. దీనిపై శెట్టిబలిజ సామాజికవర్గంలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనిపై కొందరు మంత్రులు మాట్లాడుతూ... ఇది సాంకేతికపరమైన ఇబ్బంది, త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామన్నారు. కొద్ది రోజుల తర్వాత సాంఘిక సంక్షేమశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కొత్తగా.. వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి సంబంధించిన జీవో జారీ చేసింది, దాన్ని ఆధారంగా చేసుకుని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ విధంగా కులధృవీకరణ పత్రాలు జారీ చేసిందని చెబుతున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం.తమకు నష్టం జరుగుతుందని, తమ ఆత్మ గౌరవానికి ఇబ్బంది కలుగుతుందని ఆందోళన చెందుతున్న వారందరికీ... నేను చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదల్చుకున్నాను. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 19-06-1997లో జీవో నెంబరు 16 విడుదల అయింది. వాస్తవానికి 15-05-1995లో సామాజిక స్పృహ కలిగిన నాయకుడు, అందరూ సర్ధార్ అని పిలిచే గౌతు లచ్చన్న గారు ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదన ప్రకారం కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నకులాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆలోచన చేసి ఈ జీవో నెంబరు 16ను ప్రతిపాదించారు.ఆ సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రభాకర్ రావు వంటి పెద్దలు కూడా సమ్మతి తెలిపారు. అనంతరం విడుదలైన జీవో ప్రకారం అంతా గౌడగా ఉండాలన్న ప్రతిపాదన చేశారు. దీనిపై కొంతమంది శెట్టిబలిజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఇది తమ అస్తిత్వానికి భంగం కలిగించేదిగా ఉందని.. ఎప్పటిలానే శెట్టిబలిజలుగానే తమ నామకరణం ఉండాలని ప్రతిపాదించారు. ఇదే విషయంపై కోర్టులకు కూడా వెళ్లారు. దీంతో కులాల ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం కాబట్టి.. ప్రభుత్వాలు దీనిపై పునరాలోచన చేశాయి. ఈ జీవోను జారీ చేసింది చంద్రబాబేఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఈ జీవో అమలు కాలేదు. 2014-19 వరకు మరలా చంద్రబాబు ఉన్నప్పుడూ కూడా ఈ జీవో అమలు కాలేదు. 2019-24 వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది గౌడ సోదరులు గౌతులచ్చన్న గారి ప్రతిపాదనను మరలా తెరపైకి తీసుకొచ్చారు. కేవీ సుబ్బారావు గౌడ్, జోగి రమేష్ తో పాటు కొంతమంది కలిసి 23-02-2023 నాడు చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది.మా హయాంలోనే జీవో నెంబరు 25 జారీ..గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అసమ్మతి వచ్చిందో.... ఈ మెమో జారీ చేసినప్పుడు కూడా అదే విధంగా వ్యతిరేకత వచ్చింది. కృష్ణా జిల్లాలో శెట్టిబలిజ కులస్తులు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటే గౌడ అని వస్తుందని అప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు 10-11-2023 నాడు రాష్ట్ర వ్యాప్తంగా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు కులధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకున్నా వారికి కేవలం శెట్టిబలిజ అని మాత్రమే ఇవ్వాలని జీవో ఎం ఎస్ నెంబరు 25 జారీ చేశాం. అదే సమయంలో రాయలసీమలో ఉన్న శెట్టిబలిజలుది గీత వృత్తి కాకపోవడంతో గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు కూడా వర్తించదని జీవోలో పొందుపరిచాం.మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చిన కూటమి ప్రభుత్వంకానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ కారణమో లేక ఇతర కారణాల వల్ల గతంలో ఎవ్వరూ అమలు చేయని నిర్ణయాన్ని కేవలం ఒక మెమోని మాత్రమే ఆధారంగా చేసుకుని గౌడ అని ముందు చేర్చి తర్వాత శెట్టిబలిజ, ఈడిగ, యాత అని చేర్చడం మొదలుపెట్టారు. ఇది మళ్ళీ శెట్టిబలిజల్లో ఆందోళనకు కారణమైంది. ధృవీకరణ పత్రాలు జారీ చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయకుండా.. తమ తప్పును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నెట్టే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్సార్సీపీ హయాంలో ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించకుండానే.. ప్రజలకేం చెప్పినా నమ్ముతారన్న అతి విశ్వాసంతో ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తున్నారు.మెమోకి, జీవోకి తేడా తెలియకుండా మాట్లాడ్డం హాస్యాస్పదం. ప్రజలు వారి వారి కులాల పేర్ల మీదే కులధృవీకరణ పత్రాలు మంజారు చేయాలని కోరుకుంటున్న నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఆ పని చేయకుండా, జీవో నెంబరు 6 జారీ చేయడం ద్వారా వారి అశాంతికి కారణం అయింది. గౌత లచ్చన్న గారి ఆశయానికి కూడా కూటమి ప్రభుత్వం చరమ గీతం పాడింది. మాస్టర్ కేస్ట్ సర్టిఫికేట్ పేరుతో మా ప్రభుత్వం గౌడ, శెట్టిబలిజ, యాత కులాలను కలిపి ఉంచామని ఒకవైపు చెబుతారు, మరోవైపు వైఎస్ జగన్ వచ్చి అందరికీ విడిగా కార్పొరేషన్లు ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 139 కులాలకు ఆకాంక్షలు, ఆశలు ఉన్నాయి. వారికి ఒక వేదిక ఉండాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 672 మందిని డైరెక్టర్లుగా నియమించాం. ఇవాళ ఏడాదిన్నర కావస్తున్నా కూటమి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లను భర్తీ చేయలేదు.బీసీలకు అండగా నిలిచింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేబీసీలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలుంటే వాటిని ఫీజు రీయింబర్స్ మెంట్ ద్వారా అందేటట్టు చేసిన ఘనత దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్లకే చెందుతుంది. మార్కెటింగ్ కమిటీల్లోనూ, దేవాలయాల్లోనూ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ కాదా?, ఈ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీల, ఎస్టీలు, మైనార్టీల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉన్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. బీసీలకు మేలు చేశామని చెప్పుకునే చంద్రబాబు మాత్రం వారికి ఒక మగ్గమో, మోకూ, చక్రమో ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప వారి దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే పనిచేయలేదు.కేవలం వారిని గౌరవిస్తున్నట్టు నటిస్తూ.. వారి ఆశయాలను నశింపజేసే ప్రక్రియ కూటమి పాలనలో జరుగుతుంది. కులాల మధ్య ఐక్యత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రోజు మా ప్రభుత్వ హయాంలో సమస్య వచ్చినప్పుడు దాన్ని తక్షణమే పరిష్కరించాం. కానీ అవగాహన లేని మంత్రి మాత్రం ఫేక్ జీవో అంటూ మాట్లాడ్డం హాస్యాస్పదం. ఆయన మెమోకి జీవోకి తేడా తెలుసుకోవాలి. కేవలం కులాల నడుమ ఆందోళనలు సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఈ వివాదం. ప్రభుత్వం తక్షణమే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి -
జిల్లా పేరే మార్చేశారు.. స్మార్ట్గా!
అమలాపురం టౌన్: అత్యంత ఆధునిక, సాంకేతిక, పారదర్శకతతో రూపొందించిన స్మార్ట్ రేషన్ కార్డులతో సరుకులను పొందే అవకాశాన్ని కల్పిస్తున్న ప్రభుత్వం వాటి ముద్రణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును విస్మరించింది. జిల్లాలో పంపిణీకి సిద్ధమైన 5,31,926 స్మార్ట్ కార్డుల్లో కొన్నింటిపై జిల్లా పేరు కాకుండా తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించడం విమర్శలకు తావిస్తోంది. ఈ కార్డులపై ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుని మరీ ఈ తప్పిదానికి పాల్పడడం శోచనీయం. జిల్లా 2022 ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ఇప్పటికి మూడేళ్లు దాటినా జిల్లా పేరుకున్న గౌరవాన్ని తగ్గించేలా ఇంకా తూర్పుగోదావరి జిల్లాగా వాటిపై ముద్రించడం శోచనీయం. ఇప్పటికే ఈ కార్డుల పంపిణీ మొదలైంది. వాటిపై జిల్లా పేరు తప్పుగా పడడం వల్ల తమకు రేషన్ ఇస్తారో లేదోనని లబ్ధిదారులు కంగారు పడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని రాయడం ఇష్టం లేక తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారా అని జిల్లాకు చెందిన కొందరు ఎస్సీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తక్షణమే కార్డులపై తమ జిల్లా పేరు ముద్రించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ స్మార్ట్ కార్డు ద్వారా లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకునే సమయంలో ఆధార్ ఆధారంగా ఓటీపీ లేదా బయోమెట్రిక్తో పొందే వీలుంటుదని జిల్లా పౌర సరఫరాల అధికారి ఎ.దయ భాస్కర్ చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన కొన్ని కార్డుల్లో మాత్రమే తూర్పుగోదావరి జిల్లా అని ముద్రించారని, ఈ తప్పిదాలను సరిదిద్దుతామని పేర్కొన్నారు. దీనివల్ల స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పొందేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.రేషన్ కార్డుల్లో పేరు మార్పుపై లబ్ధిదారుల ఆందోళన -
వరిదొడుకులు తప్పేనా?
పెరవలి: ఖరీఫ్లో ధాన్యాన్ని సేకరించటానికి అధికారులు సిద్ధమవుతుండగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సాగులో అధికారులు వేసిన అంచనాలు తప్పటంతో ధాన్యం కొనుగోలు కూడా ఇలాగే ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత రబీ సీజన్లో పడినపాట్లు మరువక ముందే నేడు ఖరీఫ్ సాగు పంట అందుబాటులోకి రానుండటంతో అధికారులు ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తారా అని చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో ఽవరిసాగు 76,941 హెక్టార్లలో చేపడతారని అంచనాలు వేసినా 55,021 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. ఈ నెల 11న జరిగిన జిల్లా ధాన్యం సేకరణ కమిటీ సమావేశంలో 5,31,616 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అయితే ఎంతమేర కొనుగోలు చేస్తారనేది అధికారులు చెప్పలేదు. దీంతో రైతులు గందరగోళంలో పడ్డారు. గత ఏడాది రబీ సీజన్లో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయటంతో రైతులు నానా పాట్లూ పడ్డారు. సాగు తగ్గడానికి కారణాలు ఖరీఫ్లో వరి సాగు తగ్గింది. జిల్లాలో 21,920 హెక్టార్లలో అసలు నాట్లే పడలేదు. రైతులు వరి సాగు చేపట్టకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో సేకరించక దళారీలకు అమ్ముకోవలసి వస్తోంది. మెట్టలో ముందస్తుగా ఽవరి కోతలు పూర్తి అవుతుండగా డెల్టా ప్రాంతంలో చేలు నవంబర్లో కానీ కోతలకు రావటం లేదు. దీంతో ముందుగా కోతలు కోసిన చేల నుంచి ప్రభుత్వం ధాన్యం కోనుగోలు చేసి టార్గెట్ పూర్తి అయ్యిందని చెప్పటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. గత రబీ సీజన్లో ఇలాగే జరగటంతో రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. అధికారులు, మిల్లర్లు చుట్టూ ప్రదక్షిణలు చేసి ధాన్యం అమ్ముకోలేక ఽఅయిన కాడికి దళారీలకు విక్రయించుకున్నారు. ఈ సార్వా సీజన్లో యూరియా కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. అధికారులు మాత్రం జిల్లాకు సరిపడా యూరియా వచ్చిందని, గతంలో కంటే ఎక్కువ యూరియా సరఫరా చేశామని చెబుతున్నారు. కష్టపడి పండించిన పంట అమ్ముకొనే వీలు లేనప్పుడు అసలు పంటే వేయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నామని, అందుకే సాగు చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. లక్ష్యాన్ని చేరుతుందా.. ఖరీఫ్ సాగులోనైనా రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది. రబీలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఈసారైనా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలి. పంట దిగుబడి అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా కొనుగోలు కూడా చేపడితేనే రైతుల కష్టాలు గట్టెక్కుతాయి. ఇబ్బంది లేకుండా చూడాలి రబీ సీజన్లో ధాన్యం అమ్మిన సొమ్ము ఆలస్యంగా రావడంతో నానా పాట్లూ పడ్డాం. ఈ ఏడాదైనా సక్రమంగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. –చిట్టీడి వెంకట సత్యనారాయణ, రైతు, పెరవలి డెల్టాను దృష్టిలో ఉంచుకోవాలి ఈ ఖరీఫ్లో నాట్లు వేసే దశ నుంచీ ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే రెండు సార్లు వర్షాలకు నారు పోయింది. డెల్టాలో వరి కోతలు నవంబర్ నెలలో ప్రారంభం అవుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అఽధికారులు ధాన్యం కొనుగోలు చేయాలి. – అధికారి పల్లపురాజు, రైతు, కానూరు అగ్రహారం జిల్లాలో ఇలా.. మండలం వరి సాగు (హెక్టార్లలో) రాజమహేంద్రవరం రూరల్ 1,191 కడియం 2,100 రాజానగరం 2,791 అనపర్తి 3,310 బిక్కవోలు 5,265 కోరుకొండ 1,052 గోకవరం 1,114 సీతానగరం 4,632 రంగంౖపేట 1,160 చాగల్లు 3,110 దేవరపల్లి 2,818 గోపాలపురం 1,400 కొవ్వూరు 4,316 నిడదవోలు 6,600 పెరవలి 2,325 తాళ్ళపూడి 2,395 ఉండ్రాజవరం 4,792 నల్లజర్ల 4,650 ఖరీఫ్ ధాన్యం సక్రమంగా కొనుగోలు చేస్తారా? జిల్లాలో 55,021 హెక్టార్లలో సాగు 5,31,616 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి అంచనా రబీలో 5.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా కొనుగోలు 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పుడు అలాగే ఉంటుందా అని రైతులకు అనుమానాలు ఊహించని విధంగా తగ్గిన వరి సాగు విస్తీర్ణం -
బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయండి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం జిల్లా నాయకులు దొమ్మేటి శంకరరావు, సత్యనారాయణ, బిల్డర్ చిన్నల ఆధ్వర్యంలో బీసీల శ్రీఐద్ఙు ప్రధాన డిమాండ్లపై శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి అనంతరం ఆర్డీఓ కృష్ణనాయక్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న బీసీలకు ఎస్సీ, ఎస్టీల మాదిరిగా శ్రీప్రత్యేక రక్షణ చట్టం్ఙ తెస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టసభలలో 33 శాతం, స్థానిక సంస్థల నామినేటెడ్ పదవులు, నామినేషన్ లలో 34 శాతం రిజర్వేషన్లు అమలు జరుపుతామన్న మరో వాగ్దానం ఇప్పటి దాకా అమలు కాలేదన్నారు. స్థానిక ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేయకుండా, బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. ఏప్రిల్ తరువాత ఆరు నెలల లోపు కమిషన్ నిబంధనల మేరకు ఎన్నికలు జరిపే వీలున్నందున, ఈ లోపే రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరిపి, ప్రాదేశిక నియోజక వర్గాల విభజన పూర్తి చేసి, బీసీలకు వారి జనాభా దామాషా మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. కార్యక్రమంలో నరవ గోపాలకృష్ణ మార్గాని సురేష్, బీసీ నాయకులు పాల్గొన్నారు. -
చేనేత.. సమస్యల కలబోత
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేనేత కుటుంబాలు బకాయిల గుదిబండతో చితికిపోతున్నాయి. గడచిన 10 నెలలుగా పైసా కూడా విదల్చక పోవడంతో చేనేత సహకార సంఘాలు మూత వేసుకునే దుస్థితి ఏర్పడింది. సూపర్ సిక్స్–సూపర్ హిట్ అంటూ అన్ని పథకాలు అమలు చేశామంటూ కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటోంది. సూపర్ సిక్స్ అమలుమాట దేవుడెరుగు కనీసం అప్పులు కూడా పుట్టక చేనేత రంగం కుదేలైందని చేనేత కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి. చంద్రబాబు సర్కార్ గద్దె నెక్కి 14 నెలలు దాటిపోయినా బకాయిలు విడుదల చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా చేనేతలు చేతిలో చిల్లిగవ్వ లేక నూటికి రూ.8ల వడ్డీతో అప్పుల కోసం రోడ్డెక్కే దయనీయ పరిస్థితిలో ఉన్నారు. సంప్రదాయంగా చేనేత ఉత్పత్తులనే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న కుటుంబాల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముందుకు వెళదామంటే నుయ్యి, వెనక్కు వద్దామంటే గొయ్యి అన్న సామెత చందంగా నేతన్నల పరిస్థితి తయారైంది. అనేక చేతివృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే చేనేత రంగం కాలానికి ఎదురునిలిచి పోరాడుతోంది. అగ్గిపెట్టెలో ఇమిడిపోయే ఆరు మూరల చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటి చెప్పిన ఈ ప్రాంతంలో చేనేతల జీవితం కష్టాలు, కన్నీళ్లు కలబోతగా మారింది. ఈ దుస్థితికి కూటమి ప్రభుత్వం నిర్వాకం కూడా కారణమని చేనేత సంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ఉచిత విద్యుత్ ఉత్తిమాట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 పైబడే చేనేత సహకార సంఘాలు నడుస్తున్నాయి. ఈ సంఘాల పరిధిలో చేనేత కుటుంబాలు ఉప్పాడ కొత్తపల్లి, గొల్లప్రోలు, ప్రత్తిపాడు, రామచంద్రపురం మండలం ఆదివారపుపేట, అంగర, పులుగుర్త, వడిశలేరు, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, ముమ్మిడివరం, క్రాపచింతలపూడి శివారు కె జగన్నాథపురం, బండార్లంక తదితర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మొత్తం సంఘాల పరిధిలో జరిగే లావాదేవీలపై సుమారు 13వేల చేనేత కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఉమ్మడి తూర్పున పేరుకుపోయిన బకాయిలు విడుదల చేయడం ద్వారా మాత్రమే భవిష్యత్లో సంఘాలు మనుగడ సాగిస్తాయనేది నిర్వివాదాంశంగా పేర్కొటున్నారు. గతంలో మాదిరిగా సంఘాలు ఇక ముందు కూడా సక్రమంగా నడవాలంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కలిసి సంఘాలకు రావాల్సిన రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయాలంటున్నారు. తనతోనే చేనేత రంగం ప్రగతిబాటలో పయనించిందని గొప్పలకు పోతోన్న చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బకాయిలు విడుదల చేసి మాట్లాడాలంటున్నారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు 200 యూనిట్ల వినియోగం వరకు విద్యుత్ ఉచితమని చంద్రబాబు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో చూస్తే ఇందుకు భిన్నంగా 100 యూనిట్లకు పైబడి వినియోగించిన వారికి విద్యుత్ బిల్లులు సెప్టెంబర్ నెలలో చేతిలో పెట్టారని చేనేత కార్మికులు మండిపడుతున్నారు. పెట్టుబడులు పెట్టే స్తోమత లేక.. ఉమ్మడి జిల్లాలో ఒకో సంఘానికి తక్కువలో తక్కువ రూ.ఏడెనిమిది లక్షల నుంచి రూ.90 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కపిలేశ్వరపురం మండలంలోని ఒక్క అంగర చేనేత సహకార సంఘానికే రూ.90 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. జాతీయ స్థాయిలో రెండు పర్యాయాలు అవార్డు దక్కిన అంగర చేనేత సహకార సంఘం దుస్థితి ఇలా ఉంటే మిగిలిన సంఘాల పరిస్థితి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఈ సంఘాలలో సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులకు ఆప్కో నుంచి రూ.7 కోట్ల బకాయిలు విడుదల చేయించాల్సిన బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసి తమ పొట్టకొడుతోందని చేనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేయక, పెట్టుబడులు పెట్టే స్థోమత లేక, బయట మార్కెట్లో రూ.8ల వడ్డీకి అప్పులు తెచ్చే సాహసం చేయలేక చివరకు సొసైటీలను మూసేసే దుస్థితి దాపురించిందని నేతన్నలు అంటున్నారు. ఎన్నికల్లో కూటమి నేతన్నలకు ఇచ్చిన హామీ ఉచిత విద్యుత్. గద్దె నెక్కి 14 నెలలు దాటినా అమలు చేయకుండా సర్కారు దగా చేసింది. సాధారణ మగ్గాలపై ఉచిత విద్యుత్ను మరో 100 యూనిట్లకు పెంచుతున్నామని చెప్పారే తప్ప ఆచరణలో అమలుకునోచుకోలేదు. కానీ గత నెల7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉచిత విద్యుత్ అమలులోకి వచ్చేసినట్టు చంద్రబాబు చెప్పిన మాటలకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. తీరా సెప్టెంబర్ నెలలో 100 యూనిట్లు దాటిన విద్యుత్ బిల్లులు చేతిలో పెట్టి ఉచిత విద్యుత్ అమలుచేయకుండా కూటమి సర్కార్ మోసం చేస్తోందని నేతన్నలు విమర్శిస్తున్నారు. ఈ పథకం అమలుచేయకపోవడంతో ఏడాదిగా సుమారు రూ.4కోట్ల రాయితీ ఎగ్గొట్టేసిందని చేనేత ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. ముడినూలు కొనుగోలు సమయంలో చేనేత కార్మికులు 5శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఈ కారణంగా చీరల ధరలు పెంచడంతో మార్కెట్లో విక్రయాలు మందగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వమే 5శాతం జీఎస్టీ చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయంలో కూడా సర్కార్ నమ్మించి మోసగించిందని, జీఎస్టీ చెల్లించలేదంటున్నారు. ఇందుకు తోడు త్రిఫ్ట్ ఫండ్ మాటే వినిపించడం లేదంటున్నారు. సహకార సంఘాల్లో నేత కార్మికుల ఆదాయంలో 8శాతం మినహాయించి సొసైటీలో జమ చేస్తుంటారు. ఆ మొత్తానికి రెట్టింపు 16శాతం ప్రభుత్వం త్రిఫ్ట్ఫండ్ జతచేసి మూడు నెలలకు ఒకసారి కార్మికుల ఖాతాలకు జమ చేస్తుంటుంది. ఈ త్రిఫ్ట్ ఫండ్ రూ.5 కోట్లు విడుదల చేశామని సంబంధిత మంత్రి సవిత ఆరు నెలల క్రితం ప్రకటించడమే తప్ప ఆ సొమ్ము ఎక్కడా తమ ఖాతాల్లో జమ కాలేదని సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే ఒక విడత నేతన్న నేస్తం రూ.24వేలు జమ అయ్యేదంటున్నారు. చేనేతను ఆదుకోవడం సామాజిక బాధ్యత చేనేత వృత్తి పరిరక్షణ ప్రభుత్వం సామాజిక బాధ్యతగా పరిగణించాలి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్న చరిత్ర అంగర చేనేత సహకార సంఘం సొంతం. అటువంటి సొసైటీకి ఆప్కో నుంచి రూ.కోటి పైగానే బకాయిలు పేరుకుపోయాయి. సొమ్ము విడుదల కాకుంటే సంఘం మూతపడే ప్రమాదం ఉంది. – గుడిమెట్ల శివరామకృష్ణ, మాజీ చైర్మన్, శ్రీ గణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం, అంగర బకాయిలు విడుదల చేయాలి బకాయిలు విడుదల చేయకుంటే సొసైటీ మూతే వేసే పరిస్థితి. సొసైటీలు మనుగడ సాగించేందుకు 11 నెలలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలి. ప్రొక్యూర్మెంట్ కూడా సక్రమంగా జరగడం లేదు. – ఉప్పు అర్థనారీశ్వర బులిరాజు, ఆదివారపుపేట, రామచంద్రపురం మండలం ఎన్నికల హామీలు అమలు చేయాలి ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు జరపాలి. సంఘాలకు ఎన్నికలు జరపాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.7కోట్లు ఆప్కో ద్వారా సహకార సంఘాలకు బకాయిలను చెల్లించింది. – జాన జగదీష్ చంద్ర గణేష్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు, కోనసీమ జిల్లా మూసివేత దిశగా సొసైటీలు ‘బాబు’ బకాయి రూ.7 కోట్లు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఊసే లేదు అమలు కాని ఉచిత విద్యుత్ హామీ -
మీకు నచ్చని వార్తలు వస్తే కేసులు పెడతారా?
పత్రికల్లో మీకు నచ్చని వార్తలు, విమర్శలు వస్తే కేసులు పెడతారా? ఇదేం పద్ధతి? ఇంత దారుణంగా పత్రికా స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ మీద కూటమి ప్రభుత్వం దాడులు చేయడం దుర్మార్గం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో పోలీస్స్టేషన్కు పిలిపించడం సరికాదు. ప్రభుత్వ అసమర్థత, ఇతర వైఫల్యాలను ప్రజల పక్షాన, ప్రజాగొంతుగా వినిపిస్తుంటే తట్టుకోలేక దాడులకు దిగుతున్నట్లుగా స్పష్టమవుతోంది. కూటమి ప్రభుత్వం చర్యలను యావత్ ప్రజానీకం గమనిస్తోంది. – మార్గాని భరత్రామ్, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం ప్రజాస్వామ్యానికి విరుద్ధం ˘ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండే పత్రికల మీద దాడులు చేసి కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది ప్రతికా స్వేచ్ఛను అడ్డుకోవటమే. జర్నలిస్టులు వెతికి తీసిన సమస్యలపై ప్రభుత్వం స్పందించాలే తప్ప వారిపై కేసులు పెట్టడం అమానుషం. ప్రభుత్వం వెంటనే సాక్షి ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. – పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడు -
కట్టు కథతో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు: బైరెడ్డి సిద్దార్థ
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు వైఎస్సార్సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అక్రమ కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే అరెస్టు చేశారని ఆరోపించారు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవు అని చెప్పుకొచ్చారు.రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మూలాఖత్లో వైఎస్సార్సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు మేడపాటి షర్మిల రెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు కలిశారు. అనంతరం, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ..‘కట్టు కథతో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. మిథున్ రెడ్డి అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదు. దేశంలోనే పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి పెద్ద స్థాయిలో ఉంటే భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బంది అని భావించి, అక్రమ కేసులో అరెస్టు చేశారు. కూటమి గాలిలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిపై మిథున్ రెడ్డి విజయం సాధించారు. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే అరెస్టు చేశారు. కస్టడీకి ఎందుకు ఇప్పటి వరకు పిలవలేదు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవు. కథలు చెప్పి వాటిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు ఒక్కరినైనా తిరిగి తీసుకొచ్చారా?. గత ప్రభుత్వంలో కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు అన్నారు.. ఒక్క ఆధారమైన ఉందా?.కల్తీ మద్యంతో ఎంతో మంది ఆసుపత్రి పాలైతే ఒక కేసు అయినా నమోదు చేశారా?. గత ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు ఆధారాలు చెరిపేసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించటం దారుణం. ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు.. టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ అన్నివేళలా మద్దతుగా ఉన్న వ్యక్తులకు మా మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది. అన్నదాత సుఖీభవ గానీ ఇతర ఏ ప్రభుత్వ పథకం గాని ఇప్పటివరకు సక్రమంగా అమలు చేయలేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. మిథున్ రెడ్డి ఎంపీ అయినా కేటాయించాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం లేదు. జైల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు.మేడపాటి షర్మిల రెడ్డి మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. సాక్ష్యాలు లేకుండా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారు. భవిష్యత్తులో వైఎస్సార్సీపీకి మంచి రోజులు వస్తాయి’ అని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లో పోలేకుర్రు పంచాయతీ సుంకటరేవులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగబత్తుల షడ్రక్కు తీవ్ర గాయాలయ్యాయి. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు సుంకరపాలెం పంచాయతీ బాబానగర్ గ్రామానికి చెందిన షడ్రక్ ద్విచక్రవాహనంపై కాకినాడ వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో షడ్రక్ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన 108లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పట్టాలెక్కిన ప్రసాద్ నిర్మాణాలు
అన్నవరం: రత్నగిరిపై ప్రసాద్ పథకం నిధులతో చేపట్టనున్న నిర్మాణాలకు రంగం సిద్ధమైంది. ఈ పథకం కింద కేటాయించిన రూ.25.32 కోట్లలో రూ.18.98 కోట్లతో చేపట్టనున్న పనులకు గత మే నెలలో టెండర్లు ఖరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయా పనులు చేపట్టనున్న స్థలాలను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్ వెంకటరమణ శుక్రవారం పరిశీలించారు. అతి త్వరలో ప్రతిపాదించిన నిర్మాణాలు ప్రారంభిస్తామని, వచ్చే ఆగస్టు నాలుగో తేదీకి వాటిని పూర్తి చేయాల్సి ఉందని పేర్కొన్నారు. లేకుంటే ఆ నిధులు మురిగిపోతాయని వివరించారు. ఆయన వెంట ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, టూరిజం ఈఈ విజయ భాస్కరరెడ్డి, డీఈ సత్యనారాయణ, ఏఈ వెంకటేష్ పాల్గొన్నారు. ప్రసాద్ నిధులతో అన్నదాన భవనం నిర్మించే స్థలాన్ని పరిశీలిస్తున్న టూరిజం సీఈ వెంకట రమణ, ఇతర అధికారులు -
దేవస్థానానికి చెరువుల స్వాధీనం
కాజులూరు: ఆర్యావటంలో అనధికారికంగా కొనుగోలు చేసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానం భూమిని కోర్టు ఉత్వర్వుల మేరకు శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు దేవస్థానం అధికారులకు అప్పగించారు. వివరాల్లోనికి వెళ్లితే ఆర్యావటంలో పురాణ ప్రసిద్ధిగాంచిన సీతారామస్వామి దేవస్థానానికి ధూపదీప నైవేద్యాల నిమిత్తం కేటాయించిన నాలుగు ఎకరాల ఆరు సెంట్లు భూమిని వంశపారంపర్య అర్చకుడు 1999వ సంవత్సరంలో అనధికారికంగా ఆరుగురు వ్యక్తులకు విక్రయించారు. ఆ విక్రయాలు చెల్లవని దేవస్థానం అధికారులు కోర్టుని ఆశ్రయించగా 2006లో జిల్లా కోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించగా వాదోపవాదానల అనంతరం హైకోర్టు గత మార్చి నెలలో సదరు భూమి దేవస్థానానికి చెందుతుందని తీర్పు ఇచ్చింది. దీనిపై కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్, రెవెన్యూ సిబ్బంది చెరువుల వద్దకు వచ్చి నాలుగు ఎకరాల ఆరు సెంట్లు భూమిని దేవస్థానం అధికారులకు అప్పగించారు. -
అనధికార క్వారీల్లో తనిఖీలు
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాల సర్వే నెంబరు 15లో అనధికారికంగా నిర్వహిస్తున్న నల్లరాయి క్వారీలో మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం రాత్రి చేపట్టిన ఈ తనిఖీలో రెండు చోట్ల అనధికార క్వారీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు క్వారీల్లో పనిచేస్తున్న రెండు జేసీబీలు, ఒక లారీని సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనధికారికంగా నల్లరాయి క్వారీలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మైనింగ్ అధికారులు సత్యతేజ, రవీంద్రలు పాల్గొన్నారు. -
బాలల కళా కౌశలం!
● నాటక, దృశ్య కళల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలు ● ఆకట్టుకున్న కళా ఉత్సవ్ 2025 ● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 80 మంది హాజరు ● ఘనంగా ముగిసిన ఉత్సవాలు రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో కళా ఉత్సవ్ 2025 సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఐదు అంశాలలో పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 30 పాఠశాలల నుంచి 80 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటక, దృశ్య కళలు, వ్యక్తిగత మరియు బృంద విభాగాలలో పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. రాజమహేంద్రవరం డీఎంహెచ్ స్కూల్ 9వ తరగతి దివ్యాంగ విద్యార్థి మహబూబ్ కిజర్ మహమ్మద్ మాస్టర్ వేషధారణ అందరినీ ఆకట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో పోటీలలో విజేతలకు డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు చేతుల మీదుగా సర్టిఫికెట్లు, షీల్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో దాగివున్న కళాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకులు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా పీపీఎస్ జోగన్న శాస్త్రి, ఎం.శ్రీనివాస్, పుప్పాల బాపిరాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోప్యాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలు నాటక కళల బృంద విభాగంలో కె.విమల, సీహెచ్ కళ్యాణి, జి.చరణ్ తేజ, జి.అజయ్ కుమార్ (ఎంఎస్ఎన్సీ ఎయిడెడ్ హైస్కూల్, కాకినాడ), దృశ్య కళల (2డి) వ్యక్తిగత విభాగంలో ఏ.ప్రియదర్శిని, (నెహ్రూ నగర్ మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం), శిల్ప కళ (3డి) వ్యక్తిగత విభాగంలో డి.దుర్గా జగదీష్, (జెడ్పీహెచ్ఎస్, రావులపాలెం), దృశ్యకళల బృంద విభాగంలో కేఆర్ఏ కుమారి (పీఎస్సీఎం జడ్పీహెచ్ఎస్, మండపేట). సంప్రదాయ కథా కథనంలో బి.పరిమళ (విజ్ఞాన్ జూనియర్ కళాశాల, రాయవరం) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. -
సర్వేజనా ఆరోగ్యమస్తు..
● జిల్లాలో ఎన్సీడీ 4.0 సర్వేకు చర్యలు ● ఆరోగ్య సమాజమే లక్ష్యంగా ఇంటింటి సర్వే ● ముందస్తు గుర్తింపుతో సరైన వైద్యానికి అవకాశం రాయవరం: క్యాన్సర్.. ప్రజల ప్రాణాలను హరించే మహమ్మారి. చాలా మందికి ఆ వ్యాధి వచ్చిందని తెలుసుకునేలోపే మృత్యువు సింహద్వారం వద్ద నుంచునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్య పరిస్థితిని ముుందుగా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో ఏటా జిల్లా వ్యాప్తంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్(ఎన్సీడీ) ప్రోగ్రామ్ను చేపడుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందని వ్యాధులను నాన్ కమ్యూనికల్ డిసీజెస్గా పిలుస్తారు. బీపీ, షుగర్, క్యాన్సర్, కిడ్నీ, గుండె తదితర జబ్బులను ముందుగానే పసిగట్టడానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఎన్సీడీ 4.0 సర్వేకు ఆ శాఖ చర్యలు ప్రారంభించింది. నాలుగేళ్ల నుంచి.. 2021 అక్టోబరులో తొలిసారిగా ఎన్సీడీ సర్వే చేపట్టింది. రెండో విడత 2022 అక్టోబర్ 2 నుంచి, మూడో విడత 2024 నవంబరులో నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. మూడో విడతలో.. గతేడాది జిల్లాలో 18 ఏళ్లు పైబడిన 14,68,723 మందిలో 11,29,412(77శాతం) మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2,06,666 మందికి బీపీ (18.30 శాతం), చక్కెర వ్యాధిగ్రస్థులు 1,41,508 (12.53 శాతం) మంది ఉన్నట్టు గుర్తించారు. నోటి సంబంధ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు గతంలో 215 మంది ఉండగా ఈ సర్వేలో 4,172 అనుమానిత కేసులు గుర్తించారు. అలాగే గతంలో 466 మంది రొమ్ము క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ సర్వేలో 2,090 మందికి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. కాగా వీరిలో ముగ్గురికి మాత్రమే క్యాన్సర్ నిర్థారణ అయ్యింది. సర్వైకల్ (గర్భాశయ ముఖ ద్వార) క్యాన్సర్కు గురైన వారు గతంలోనే 283 మంది ఉండగా, 1,894 మంది అనుమానిత కేసులు గుర్తించారు. నాలుగో సర్వేకు ఏర్పాట్లు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఎన్సీడీ నాలుగో సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది నిర్వహించే సర్వేలో క్యాన్సర్పై ప్రధానంగా దృష్టిపెడుతున్నారు. నోటి సంబంధిత, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లపై ప్రధానంగా సర్వే ఉంటుంది. సర్వేలో 110 మంది వైద్యులు పాల్గొననున్నారు. ఇప్పటికే వీరికి శిక్షణ పూర్తి చేశారు. అలాగే జిల్లాలో 527 మంది మల్టీపర్పస్ హెల్త్ ప్రొవైడర్, ఏఎన్ఎంలకు శిక్షణ ఇస్తున్నారు. వీరికి ఆగస్టు 25న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 18వ తేదీతో పూర్తికానుంది. పరీక్షలు ఇలా వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి 18 ఏళ్ల నిండిన వారికి పలు రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు, నెలసరి వివరాలు, గర్భాశయ ముఖద్వారం, రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు నమోదు చేయడం ద్వారా క్యాన్సర్ దశను ప్రాథమిక అంచనా వేస్తారు. ఈ పరీక్షలతో పాటు బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ వంటి పరీక్షలు చేస్తారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరం అయితే ఆరోగ్యశ్రీ కింద ఇతర నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. ఇక బీపీ, షుగర్ తదితర వ్యాధులకు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీల ద్వారా చికిత్స అందిస్తున్నారు. వెలుగు చూస్తున్న వ్యాధులు ఈ పరీక్షల్లో వెలుగుచూస్తున్న సమస్యల్లో బీపీ ముందు వరుసలో, తర్వాత స్థానంలో మధుమేహం ఉంటోంది. అనుమానిత జాబితాలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము, నోటి క్యాన్సర్ ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బీపీ, షుగర్ వ్యాధులను నియంత్రణలో ఉంచుకోకుంటే శరీరంలో ప్రధాన భాగాలైన కళ్లు, కిడ్నీ, గుండె, నరాలు తదితర భాగాలు దెబ్బతింటాయి. అలాగే మద్యపానం, పొగతాగడం, గుట్కాలు తదితర వ్యసనాల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ప్రజలు సహకరించాలి నాన్ కమ్యూనికల్ డిసీజెస్ను గుర్తించేందుకు నాలుగో విడత సర్వే ఈ ఏడాది నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. మూడో విడత సర్వే మాదిరిగానే నాల్గవ విడత సర్వేకు ప్రజలు సహకరించాలి. – డాక్టర్ సుమలత, ఎన్సీడీ జిల్లా నోడల్ అధికారి, కోనసీమ జిల్లా ముందుగా గుర్తిస్తే నయం మారిన జీవనశైలి, ధూమ, మద్యపానాలు, పొగాకు సేవనంతో పాటుగా వంశపారంపర్యం వంటి కారణాలతో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ముందుగా గుర్తిస్తే మెరుగైన వైద్యం అందించి నయం చేసే అవకాశం ఉంది. సర్వే చేయడం వల్ల ప్రజలకు ఉపయోగం.– డాక్టర్ దుర్గారావు దొర, డీఎంహెచ్ఓ, కోనసీమ జిల్లా -
కళకాలం నిలిచేలా..
● డైట్లో కళా ఉత్సవ్ పోటీలు ప్రారంభం ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 మంది విద్యార్థుల హాజరు రాజమహేంద్రవరం రూరల్: ఎప్పుడూ పుస్తకాల్లోని పాఠాలు చదువుతూ బిజీగా ఉండే విద్యార్థులు తమలోని ప్రతిభను బయటకు తీశారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో సత్తా చాటి శభాష్ అనిపించుకున్నారు. బొమ్మూరులోని జిల్లా విద్యాశిక్షణసంస్థ (డైట్)లో గురువారం కళా ఉత్సవ్ 2025 పేరిట జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తొలిరోజు నిర్వహించిన పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగాయి. గాత్రం, వాయిద్య సంగీతం, నృత్యం అంశాల్లో సోలో, గ్రూప్ విభాగాలలో పోటీలు జరిగాయి. వీటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని 35 పాఠశాలల నుంచి 130 మంది విద్యార్థులు హాజరయ్యారు. సృజనాత్మకతకు వేదిక ప్రారంభోత్సవంలో డైట్ ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు మాట్లాడుతూ విద్యార్థులలో దాగిన సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందన్నారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచి వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. డైట్ కళాశాల సీనియర్ అధ్యాపకుడు కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల మానసిక పరిపక్వతకు, మనో వికాసానికి ఈ పోటీలు ఉపయోగపడుతాయన్నారు. శుక్రవారం సోలో(2డి), సోలో(3డి), గ్రూపు (2డి/3డి), థియేటర్ ఆర్ట్స్, సంప్రదాయ కథనాలకు సంబంధించి గ్రూపు విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. బహుమతుల ప్రదానం తొలిరోజు జరిగిన పోటీల్లో విజేతలకు ప్రిన్సిపాల్ ఆర్జేడి రాజు చేతులమీదుగా సర్టిఫికెట్లు, షీల్డ్లు అందజేశారు. వీరందరూ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారని తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా కేటీ సుబ్బరాయన్, ఎం.నాగేశ్వరరావు, డి. రవి కిరణ్ వ్యవహరించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ ఎం.రాజేష్, వి.శిరీష ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. ● గాత్రం వ్యక్తిగత విభాగంలో కె.షర్మిల, బృంద విభాగంలో ఎన్.సుమశ్రీ, ఆర్.భారతి, ఈ.నాగజ్యోతి, కె.శిరీష (అంబేడ్కర్ గురుకులం, ఏలేశ్వరం) ● వాయిద్యం వ్యక్తిగత విభాగానికి సంబంధించి స్ట్రింగ్లో టీవీకే దేవీ ప్రియాంక (భాష్యం స్కూల్, కాకినాడ), పెర్కషన్లో కె.కార్తికేయ హిమాన్షు (కలాం జూనియర్ కళాశాల, రాజమహేంద్రవరం). ● నృత్యం వ్యక్తిగత విభాగంలో సీహెచ్ హేమసత్య (చేబ్రోలు జెడ్పీ ఉన్నత పాఠశాల), బృంద విభాగంలో సీహెచ్ త్రిలోచన, పి.జ్యోతి లహరి, జి.చరణ్ సాత్విక్, ఎం.పవన్ కుమార్ (గాంధీపురం మున్సిపల్ హైస్కూల్, రాజమహేంద్రవరం). -
ప్లీనరీ సెషన్లో ‘ఆదిత్య’ సతీష్ రెడ్డి
గండేపల్లి: న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో ఈ నెల 10న జరిగిన అఖిల భారత మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 52వ జాతీయ మేనేజ్మెంట్ కన్వెన్షన్లో నిర్వహించిన ప్లీనరీ సెషన్లో ఆదిత్య యూనివర్సిటీ ప్రో చాన్సలర్ ఎన్.సతీష్రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయాన్ని డిప్యూటీ ప్రో చాన్సలర్ ఎం.శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. పారిశ్రామిక, విద్యారంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, మేనేజ్మెంట్, వ్యాపార రంగాల్లో జరుగుతున్న పరిణామాలపై చర్చించారన్నారు. కార్యక్రమంలో నితిన్ ఆట్రోలే (చీఫ్ స్ట్రాటజీ, కేపీఎంజీ), సంజయ్ కుమార్ సింగ్ (డైరెక్టర్, స్ట్రాటజీ, ఎక్స్టర్నల్ రిలేషన్స్, జిందాల్ స్టీల్ లిమిటెడ్), సంజయ్ నారాయణ్ (చీఫ్ జనరల్ మేనేజర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), తదితర ప్రముఖులు పాల్గొన్నారన్నారు. తిరుమల విద్యాసంస్థల సిబ్బంది రక్తదానం రాజమహేంద్రవరం రూరల్: తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు జన్మదినం సందర్భంగా గురువారం తిరుమల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కాతేరులోని సంస్థ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్టు, డాక్టర్ వైఎస్సార్ అండ్ జక్కంపూడి రామ్మోహనరావు బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాలలో సుమారు 265 మంది తిరుమల సిబ్బంది రక్తదానం చేశారు. వారికి నున్న తిరుమలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రక్తాన్ని డబ్బుతో కొనలేమని, వెల కట్టలేనిదన్నారు. ప్రపంచంలో మనిషి నుంచి మాత్రమే రక్తం లభిస్తుందన్నారు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో తిరుమలరావు సోదరులు నున్న కృష్ణ, నున్న సురేష్, డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు. చికిత్స పొందుతూ బాలిక మృతి అల్లవరం: దేవగుప్తం పంచాయతీ నల్లగుంటకు చెందిన బాలిక ఈ నెల ఒకటో తేదీన పురుగుమందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికి బాలిక పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్కు తీసుకువెళ్లారు. అక్కడ పది రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. -
22 నుంచి పీఠంలో శరన్నవరాత్ర ఉత్సవాలు
శరన్నవరాత్ర ఉత్సవాల ఆహ్వాన పత్రికను విడుదల చేస్తున్న పీఠాధిపతి గాడ్ తదితరులు రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని విజయదుర్గా పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు గురువారం విలేకరులకు తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో శరన్నవరాత్రి ఉత్సవ వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఈ నెల 22న ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు ఉదయం 8.19 గంటలకు గురుహోరలో కలశస్థాపన జరుగుతుందన్నారు. పీఠంలోని కొలువైన విజయదుర్గా అమ్మవారికి ప్రతి రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారన్నారు. అమ్మవారు దర్శనమిస్తారిలా.. ఈ నెల 22న బాలాత్రిపుర సుందరి, 23న గాయత్రీదేవి, 24న అన్నపూర్ణాదేవి, 25న రజిత కవచ అలంకృత విజయదుర్గాదేవి, 26న మహాలక్ష్మీదేవి, 27న లలిత త్రిపుర సుందరీదేవి, 28న విజయదుర్గాదేవి, 29న సరస్వతీదేవి, 30న దుర్గాదేవి, అక్టోబర్ ఒకటిన మహిషాసురమర్దని, 2న రాజరాజేశ్వరి అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ పీఠాధిపతి గాడ్ సమక్షంలో అడ్మినిస్ట్రేటర్ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్య కనకదుర్గ, బుజ్జి, పీఆర్వో బాబి తదితరులు ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. పీఠానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. -
ఉత్కంఠగా చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విక్టరీ అకాడమీలో గురువారం జిల్లా స్థాయిలో చెస్ ర్యాపిడ్, బ్లిట్జ్ పోటీలు ఉత్కంఠగా జరిగింది. ఈ జిల్లా చెస్ చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించి ర్యాపిడ్ విభాగంలో బండారు నానిబాబు ప్రథమ, ద్రాక్షారపు సాత్విక్ ద్వితీయ స్థానాలు, బ్లిట్జ్ విభాగంలో ద్రాక్షారపు సాత్విక్ ప్రథమ, పనిశెట్టి సాయి అవినాష్ ద్వితీయ స్థానాలు సాధించారు. జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ మాట్లాడుతూ విజేతలు ఈ నెల 13 నుంచి నంద్యాలలో జరిగే రాష్ట్ర ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఇద్దరి ఎంపిక రావులపాలెం: రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ అండర్–19 విభాగానికి డాన్ బాస్కో హైస్కూల్కు చెందిన పదో తరగతి విద్యార్థులు ఆర్.పవన్ కుమార్, ఎ.వినయ్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ జె.విద్యాసాగర్ గురువారం తెలిపారు. కర్నూలులో ఈ నెల 22 నుంచి 24 వరకూ జరిగే రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. రాజమహేంద్రవరం ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 10న జరిగిన ఎస్జీఎఫ్ అండర్–19 బాలుర విభాగంలో జిల్లా స్థాయిలో చక్కటి ప్రతిభ చూపారన్నారు. జూదరులకు జరిమానా కిర్లంపూడి: పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నట్టు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. వారిని గురువార ంప్రత్తిపాడు కోర్టుకు హాజరు పర్చామన్నారు. ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 300 చొప్పున జరిమానా విధించారన్నారు. మరోసారి పేకాట ఆడితే కఠన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
తాళ్లరేవు: జాతీయ రహదారిపై మట్లపాలెం వంతెన వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వలిపూడి గోవరాజు (41) మృతి చెందాడు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. పటవల పంచాయతీ కొత్తూరుకు చెందిన గోవరాజు రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా యానాం వైపు నుంచి కాకినాడ వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గోవరాజు తలకు తీవ్ర గాయమైంది. అతడిని స్థానికులు హుటాహుటీన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోవరాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.శతాధిక వృద్ధుడి మృతిఅల్లవరం: కొమరగిరిపట్నం గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గుర్రం గంగాధర్ (బాబ్జి) తండ్రి కొండలరావు (100) గురువారం ఉదయం మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు సందర్శించి, శద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
పనితీరుతో ఉద్యోగులకు గుర్తింపు
● పంచాయతీరాజ్ కమిషనర్ ముత్యాలరాజు ● ఈటీసీలో ఎంపీడీఓల శిక్షణ పరిశీలన సామర్లకోట: ఉద్యోగులు మంచి పనితీరుతో గుర్తింపు పొందవచ్చని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ కమిషనర్ రేవు ముత్యాలరావు అన్నారు. సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రానికి (ఈటీసీ) గురువారం ఆయన విచ్చేశారు. అక్కడ ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జల్లాల్లోని ఎంపీడీఓలకు జరుగుతున్న శిక్షణను పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యాలరాజు మాట్లాడుతూ ప్రాధాన్యతాక్రమంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రతిచోటా ఎదురయ్యే సమస్యలను నైపుణ్యంతో సమర్థంగా అధిగమించాలన్నారు. అంతకు ముందు జరిగిన ఈటీసీ నిర్వహణ కమిటీ సమావేశానికి కమిషనర్ ముత్యాలరాజు అధ్యక్షత వహించారు. ఈటీసీలో జరుగుతున్న శిక్షణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ కావాల్సిన అవసరాలపై ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు. జీఎస్డబ్ల్యూ, వైద్యం, విద్య, ఇంజినీరింగ్ వంటి ఇతర శాఖల శిక్షణలు కూడా ఈటీసీలో జరిగేలా తీర్చిదిద్దాలని ప్రిన్సిపాల్కు సూచించారు. అనంతరం విస్తరణ శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, జేఎన్టీయూకే ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్, డీడీఓలు శ్రీనివాస్, విజయ భాస్కర్, ఫ్యాకల్టీలు పాల్గొన్నారు. -
మూతపడే దుస్థితికి చేనేత సంఘాలు
రామచంద్రపురం రూరల్: చేనేత సహకార సంఘాల నిధులన్నీ ఆప్కో బకాయిల రూపంలో స్తంభించిన కారణంగా సభ్యులకు ఉపాధి కల్పించలేని దుస్థితికి సంఘాలు చేరుకున్నాయని లివరీ ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్య ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు. హసన్బాద చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల లివరీ చేనేత సహకార సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన సత్య ప్రకాశ్ మాట్లాడుతూ గడిచిన 10 నెలలుగా బకాయిలు పేరుకు పోయాయన్నారు. బ్యాంకుల నుంచి మంజూరు కాబడిన నిధులు పూర్తిగా వినియోగించుకోలేక పోవడంతో సంఘాల బ్యాంకు ఖాతాలన్నీ ఎన్పీఏలోకి వెళుతున్నాయన్నారు. కొన్ని సంఘాలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆప్కోకు ఎన్నికలు నిర్వహించి గాడిన పెట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో హసన్బాద, ఆదివారపుపేట, శివల, అద్దంపల్లి, నేలటూరు, ముమ్మిడివరం, తమ్మవరం, మురారి, నల్లూరు తదితర చేనేత సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అయోధ్యకు తరలిన విల్లు, బాణం
కపిలేశ్వరపురం (మండపేట): అయోధ్యలో నిర్మిస్తున్న కల్యాణ రాముని ఆలయానికి సమర్పించేందుకు దాత విల్లు, బాణం తయారీకి మండపేటలో ఆర్డర్ చేశారు. మండపేటలోని రామకృష్ణా బ్రాస్ అండ్ సిల్వర్ వర్క్స్ నిర్వాహకుడు, శిల్ప కళాకారుడు వాసా శ్రీనివాస్ గోల్డ్ కోటింగ్తో వీటిని రూపొందించారు. అయోధ్యకు చెందిన వంశవృక్షం అన్నదాన ట్రస్ట్ నిర్వాహకులు చల్లా శ్రీనివాస్ శాస్త్రి, గాయత్రి దంపతులు రూ.1.80 లక్షలతో తయారు చేయించారు. వాటిని గురువారం చల్లా శ్రీనివాస్ శాస్త్రి అయోధ్య నుంచి మండపేటకు వచ్చి తీసుకెళ్లారు. కళాకారుడు వాసా శ్రీనివాస్ నైపుణ్యాన్ని ఆయన ప్రసంశించారు. -
ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
– పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నేతలు సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో మధ్యంతర బెయిల్పై వెళ్లిన ఎంపీ మిథున్రెడ్డి తిరిగి గురువారం మధ్యాహ్నం 4.35 గంటలకు సెంట్రల్ జైల్లో సూపరింటెండెంట్ ఎదుట హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం వచ్చారు. తొలుత వీఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయాన్ని సందర్శించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం ఆయన వెంట వచ్చారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు పూలు జల్లి, శాలువాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి మంజీర హోటల్కు చేరుకుని అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్, మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావ్, జి.శ్రీనివాసులనాయుడు, సత్తి సూర్యనారాయణరెడ్డి, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరి, జ్యోతుల చంటిబాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, మాజీ ఎంపీ వంగా గీత, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పి.గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిలు జి.శ్రీనివాసరావు తదితరులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఎంపీ మిథున్రెడ్డికి నేతలందరూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
లక్ష్మీనరసింహస్వామికి రూ.35,62 లక్షల ఆదాయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి హుండీల ద్వారా రూ.35,62,444 ఆదాయం సమ కూరింది. ఈ ఏడాది జూన్ 20 నుంచి సెప్టెంబర్ 11 వరకూ 83 రోజులకు గాను ఈ మొత్తం సమకూరింది. దేవదాయశాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ పర్యవేక్షణలో అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం లెక్కింపు చేపట్టారు. మొత్తం ఆదాయంలో మెయిన్ హుండీల ద్వారా రూ.35,07,678, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీ నుంచి రూ.14,679, అన్నదానం హుండీల ద్వారా రూ.40,087 లభించినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ తెలిపారు. అలాగే 4 గ్రాముల బంగారం, 39 గ్రాముల వెండి లభించిందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్ బాబు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. వినాయకునికి వెండి పళ్లెం సమర్పణఅయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామికి విశాఖపట్నం తగరపువలసకు చెందిన కటకం అవినాష్, సాహిత్య శృతి దంపతులు గురువారం వెండి పళ్లెం సమర్పించారు. 1050 గ్రాములు బరువైన ఈ పళ్లెం విలువ రూ.1,35,000 ఉంటుంది. దాతలు దీన్ని ఆలయ అర్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తికి అందజేశారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు, వేద పండితులు సత్కరించి, స్వామివారి శేష వస్త్రాలు, చిత్రపటం, ప్రసాదం అందజేశారు. -
జీపీఎస్ ఉన్న వాహనాలతోనే ధాన్యం తరలింపు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అక్టోబర్ రెండో వారం నుంచి ఖరీఫ్ వరి ధాన్యాన్ని సేకరించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 2025– 26 ఖరీఫ్ వరి ధాన్య సేకరణ సన్నద్ధతపై జిల్లా సేకరణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఆమె మాట్లాడుతూ గ్రేడ్ ఏ రకానికి క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాకు రూ.2,369 కనీస మద్దతు ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. గత సీజన్తో పోలిస్తే కనీస మద్దతు ధర రూ.69 పెరిగిందన్నారు. వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం ఖరీఫ్లో 5,31,616 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి కానుందని చెప్పారు. ధాన్యం సేకరణకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని, అవసరమైతే నియామకం చేపట్టాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా ఈ పంట, ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు. మిల్లులు సిద్ధంగా ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. మిల్లుల టాగింగ్, తనిఖీపై దృష్టి సారించాలన్నారు. ధాన్యం తరలించే వాహనాలన్నిటికీ జీపీఎస్ తప్పనిసరిగా ఉండాలన్నారు. గోతాముల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గత సీజన్లో మిల్లులకు 3,54,903 మెట్రిక్ టన్నుల ధాన్యం చేరగా, 2,28,806 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వారి నుంచి వచ్చిందని, ఇంకా 10,781 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉందని దీనిని త్వరితగతిన రికవరీ చేయాలని ఆదేశించారు. ఆర్డీవోలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్.మాధవరావు, జిల్లా సహకార శాఖ అధికారి ఎం.వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వి. పార్వతి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
భ్రాంతిభద్రతలు భేష్!
సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతలు కట్టుతప్పుతున్నాయా? రౌడీ షీటర్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయా? రోడ్లపైనే మద్యం తాగి దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారా? నడిరోడ్లపై కొట్లాటలు సాగుతున్నాయా? గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోందా? యథేచ్ఛగా పేకాట శిబిరాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అశ్లీల నృత్యాలు, రేవ్ పార్టీలు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు కొందరు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇలాంటి ఘటనలు నిత్యకృత్యం అవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఏడాదిగా జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలే తార్కాణం. వాటి వివరాలు ఇలా.. ● దివాన్చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో లారీ ఆపి డివైడర్పై పడుకొని ఉన్న లారీ డ్రైవర్పై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.20,000 నగదు, సెల్ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. అతనిపై తీవ్రంగా దాడి చేయడంతో అక్కడే కుప్పుకూలిపోయాడు. 112 ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ● ఇటీవల రాజమహేంద్రవరం తూర్పు రైల్వేస్టేషన్ రోడ్డులో క్రైమ్ పోలీసులం అని చెప్పి సీతంపేటకు చెందిన 67 ఏళ్ల వృద్ధుడి వద్ద 9 గ్రాముల బంగారపు ఉంగరాలు లాక్కుని వెళ్లిపోయారు. ● ఇటీవల కొవ్వూరు వెళ్లాలని వేచి చూస్తున్న ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ యువకుడు ఏమార్చాడు. కొవ్వూరు తీసుకెళ్తానని వాహనం ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాక అతని వద్ద ఉన్న డబ్బు లాక్కొని పరాయయ్యాడు. ● నల్లజర్ల మండలంలోని ఘంటావారిగూడెం గ్రామశివారులో గుణ్ణం సురేష్కు సంబంధించిన రిసార్ట్(కొబ్బరితోట)లో అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలకు తెర తీశారు. బర్త్డే పార్టీ సందర్భంగా అసాంఘిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యూ ఆకారంలో టేబుల్స్ పెట్టుకుని మద్యం సేవిస్తూ.. ఉండగా మధ్యలో యువతులు అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. విషయం పోలీసులకు తెలియడంతో రాత్రి 11 గంటల సమయంలో దాడి చేశారు. ఇతర జిల్లాలకు చెందిన నలుగురు డ్యాన్సర్లు, 24 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు మద్యం బాటిళ్లు, రూ.10 వేల నగదు, 6 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే ప్రాంతంలో ఉంగుటూరుకు చెందిన నాయకుడు తన పుట్టినరోజు వేడుకకు ఇదే తరహాలో పార్టీ ఏర్పాటు చేయగా పార్టీ మధ్యలో పోలీసులు దాడి చేశారు. అయినా పరిస్థితి మారలేదంటే పోలీసుల పహరా ఎలా ఉందో అర్థం అవుతోంది. రాజమహేంద్రవరంలో బరి తెగింపు ప్రశాంతంగా ఉండే చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో రౌడీ మూకలు బరి తెగిస్తున్నాయి. బ్లేడ్ బ్యాచ్, మందు బ్యాచ్, గంజాయి బ్యాచ్లుగా ప్రతి రోజూ రాత్రిళ్లు హల్చల్ చేస్తున్నారు. ఆకతాయిల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. రాత్రివేళ్లల్లో నడిరోడ్లపైనే గొడవలకు దిగుతున్నారు. ప్రజలకే కాదు నైట్ బీట్ నిర్వహించే పోలీసులకు కూడా రక్షణ కరవైంది. ఎందుకు గొడవలు చేస్తున్నారని ప్రశ్నించిన పోలీసులు పైనే దాడులకు తెగబడుతున్నారు. బరి తెగిస్తున్న రౌడీషీటర్ల చేష్టలకు పోలీసులు నివ్వెర పోతున్నారు. చివరకు పోలీసులు ఏమీ చేయలేక రౌడీషీటర్ల చేతిలో తన్నులు తింటున్న ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పోలీసులపైనే దాడులు రాజమహేంద్రవరంలో ఇటీవల ఓ రౌడీ బ్యాచ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైనే దాడికి తెగబడింది. రాత్రి గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ నాగబాబు, హోమ్ గార్డ్ కాళీలు.. రోడ్డుపై హల్చల్ చేస్తున్న ముగ్గురు యువకులను ఈ టైం లో తిరగకూడదని చెప్పారు. ఇంటికి వెళ్లండని హెచ్చరించారు. దీంతో.. మద్యం సేవించిన ఆ యువకులు మీరేంటిరా చెప్పేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా.. మాతోనే పెట్టుకుంటారా..? అంటూ పోలీసులపై చేయి చేసుకున్నారు. పోలీసు లాఠీని లాక్కుని, ఎంత వారిస్తున్నా పట్టించుకోకుండా విధుల్లో ఉన్న కానిస్టేబుల్ని చితకబాదారు. ఈ ఘటన సర్వత్రా సంచలనం రేకెత్తించింది. ఈ దాడి ఘటన వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖ ఘటనను సీరియస్గా తీసుకుంది. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో వెంటనే దాడి చేసిన యువకుల కోసం ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు తిరక్కుండానే అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. ఏది ఏమైనా పోలీసులపైనే తిరగబడ్డారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. జిల్లాలో కట్టు తప్పుతున్న శాంతిభద్రతలు పోలీసులపైనే దాడులకు తెగబడుతున్న రౌడీషీటర్లు రాత్రిళ్లు తప్పతాగి గొడవలు, దోపిడీలు శ్రుతిమించుతున్న ఆగడాలు చారిత్రక రాజమహేంద్రిలో అసాంఘిక ఘటనలు అశ్లీల నృత్యాలు, యథేచ్ఛగా మద్యం, పేకాట కఠినంగా వ్యవహరిస్తున్నామంటున్న పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. జిల్లాలో పోలీసులు సమర్థంగా విధులు నిర్వర్తిస్తున్నారు. గంజాయి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా డ్రోన్ ద్వారా నిఘా పెట్టాం. రెండు రోజుల్లో బహిరంగంగా మద్యం తాగే వారిని గుర్తించి 300 కేసులు నమోదు చేశాం. రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేస్తున్నాం. నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు మద్యం షాపులు నడుపుతున్న యజమానులు, రాత్రి సమయాల్లో తాగి రోడ్లపై తిరిగే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి న్యాయం చేస్తున్నాం. అసాంఘిక ఘటనలు చోటు చేసుకోకుండా గణపతి నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాం. – డి.నరసింహ కిషోర్, ఎస్పీ, తూర్పుగోదావరి తెలియకుండా మరికొన్ని... రాజమహేంద్రవరం నగరంలో తెలిసినది ఈ ఘటన అయితే పోలీసుల దృష్టికి రాకుండా మరెన్నో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గంజాయి, మద్యానికి బానిసలైన ఆకతాయి యువకులకు కొందరు రౌడీషీటర్లు ఆశ్రయం ఇస్తున్నారు. వారిని అక్రమ వ్యవహారాలు, వివాదాలు, సెటిల్మెంట్లకు వాడుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కొందరు యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని జంక్షన్లు, నగర శివారు ప్రాంతాలను తమ అడ్డాలుగా చేసుకుని మద్యం బాటిల్స్తో రోడ్లపైనే హల్చల్ చేస్తున్నారు. కొందరైతే దారిన పోయే వారితో గొడవలకు దిగుతున్నారు. వారి నుంచి విలువైన వస్తువులు దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వీరిపై ఫిర్యాదు చేస్తే.. ఎక్కడ తమపై దాడి చేస్తారో అన్న భయంతో అనేకమంది పోలీస్ స్టేషన్ గడప తొక్కడం లేదన్న విమర్శలున్నాయి. కౌన్సెలింగ్ ఏదీ? గతంలో ప్రతి నెలా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చేవారు. పోలీసుల దెబ్బకు అణిగిమణిగి ఉండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌన్సెలింగ్ నిర్వహించిన దాఖలాలు లేవు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో రౌడీ షీటర్లు పేట్రేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పైరవీలకు తలొగ్గి కేసులు కట్టడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం
ప్రజాస్వామ్యంలో ఉన్న పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తోంది. సాక్షిలో నిజాలను నిర్భయంగా రాస్తే కేసులు పెడతారా? ఒక నాయకుడు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్ను పత్రికలో పబ్లిష్ చేస్తే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది. ప్రచురించిన వార్తలో అభ్యంతరాలు ఉంటే ఖండన లేదా వివరణ ఇవ్వాలి కాని ఎడిటర్, ఎడిషన్ ఇన్చార్జిలు, పత్రిక ప్రతినిధులపై కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం హక్కు లేదా?– తానేటి వనిత, రాష్ట్ర మాజీ హోం మంత్రిసాక్షి ఎడిటర్పై కేసు సరి కాదురాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడిన మాటలను ప్రచురించినందుకు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడం సరికాదు. పత్రికలో వచ్చిన వార్తపై అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా ఖండన ఇవ్వొచ్చు. కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, తూర్పుగోదావరి -
నాణ్యమైన సరకులే సరఫరా చేయాలి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నాణ్యమైన బియ్యం, పప్పులు, ఇతర దినుసులను సరఫరా చేయాలని టెండర్ దారులకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ సూచించారు. ఇటీవల దేవస్థానానికి బియ్యం, పప్పులు, ఇతర దినుసులు సరఫరా చేయడానికి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయగా సుమారు పది మంది టెండర్లు దాఖలు చేశారు. ఆ టెండర్లు తెరవడానికి ముందు దేవస్థానంలో ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నందాజీ మాట్లాడుతూ సరఫరాదారులు పంపించిన సరకుల్లో నాణ్యమైనవని తమ పరీక్షల్లో తేలితేనే, వాటిని దేవస్థానంలో ఉపయోగించేందుకు అనుమతిస్తామన్నారు. లేకపోతే వెనక్కి పంపించేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ పి.కేశవ్ దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ట్యాబ్.. స్విచ్చాఫ్
● బోధనకు కూటమి మంగళం ● గత ప్రభుత్వంలో విద్యార్థులకు పంపిణీ ● పట్టించుకోని ప్రస్తుత పాలకులుపునరుద్ధరించాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల అభ్యున్నతికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ట్యాబ్ విద్యాబోధనను కొనసాగించాలి. గతంలో ఇచ్చిన ట్యాబ్లు ప్రస్తుతం అప్డేట్ సమస్యతో పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ఆ ట్యాబ్లను ఇచ్చిందన్న కారణంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. ఈ విధానం సరైంది కాదు. ట్యాబ్ విద్యాబోధనను వెంటనే పునరుద్ధరించాలి. – నేరేడుమిల్లి నరేష్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం కొత్తపేట మండల అధ్యక్షుడు, గంటి నెరవేరని లక్ష్యం గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు ఎంతో ఉపయోగంగా ఉండేవి. దేశంలో మరెక్కడా విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వాటిని సాంకేతికతతో రూపొందించారు. 2023–24లో ట్యాబ్లు పొందిన విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. అయితే వారి వద్ద ఉన్న ట్యాబ్లు పనిచేయక గత ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా పోయింది. – కేపీసీహెచ్ సూర్యారావు, యూటీఎఫ్ కొత్తపేట మండల అధ్యక్షుడు కొత్తపేట: ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. దానిలో భాగంగానే ప్రభుత్వ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. విద్యావ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. ముఖ్యంగా సాంకేతిక విద్యపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా పథకాలు అమలు చేసింది. కోట్ల రూపాయలు వెచ్చించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా అందజేసింది. వాటి ద్వారా విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ట్యాబ్లతో విద్యాబోధనకు మంగళం పాడింది. జగన్ ముద్ర కనిపించకుండా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను గమనిస్తే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి, వాటి ముద్ర కనిపించకుండా చేసే లక్ష్యంతోనే పరిపాలన సాగిస్తున్నట్టు తేటతెల్లమవుతోంది. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రజా ప్రయోజన పథకాలను కొనసాగించి, హుందాగా వ్యవహరించడానికి బదులు రాజకీయాలకు పాల్పడుతోందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కేవలం కక్ష సాధింపు ధోరణితో ముందుకు వెళుతోందన్నారు. పేద విద్యార్థులపై చిన్నచూపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2022–23 సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ ప్రారంభించింది. రెండేళ్ల పాటు అందజేసింది. ఉపాధ్యాయులు ఆ ట్యాబ్ల ద్వారా అత్యాధునిక సాంకేతికతతో పాఠ్యాంశాలు బోధించేవారు. వాటితో విద్యార్థులు చక్కగా చదువుకునేవారు. ట్యాబ్ల వినియోగం కోసం పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కనీస పర్యవేక్షణ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడం, బైజూస్ ఒప్పందం ముగియడం, మళ్లీ రెన్యువల్ చేసుకోకపోవడం ద్వారా ట్యాబ్ విద్యాబోధనను నిర్వీర్యం చేసింది. ఫలితంగా అవి మూలనపడ్డాయి. ఒక్కో ట్యాబ్కు రూ.32 వేల ఖర్చు గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులందరికీ ఉచితంగా ట్యాబ్లు అందజేశారు. వాటిలో బైజూస్ కంటెంట్తో కూడిన వీడియోలు పొందుపరిచారు. ఇవి పదో తరగతి వరకూ ఉపయోగపడేలా రూపొందించారు. దీని కోసం ఒక్కో ట్యాబ్పై సుమారు రూ.32 వేలు ఖర్చు చేశారు. 2023–24లో ట్యాబ్లు తీసుకున్న విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లు సాఫ్ట్వేర్ సమస్యలతో మొరాయిస్తున్నాయని వారు తెలిపారు. ఈ సమస్యను ఉపాధ్యాయులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు.కోనసీమ జిల్లా సమాచారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 1,266 ప్రాథమికోన్నత పాఠశాలలు 45 ఉన్నత పాఠశాలలు 252 మొత్తం పాఠశాలలు 1,563 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు 89,672 రెండేళ్లలో విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు 30,379 ట్యాబ్లకు ఖర్చు చేసిన మొత్తం రూ.97.21 కోట్లు -
మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
రాజమహేంద్రవరం రూరల్: మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ఆధ్వర్యంలో మంగళవారం గామన్ బ్రిడ్జి నుంచి వెంకట నగరం మధ్య గల ఆర్అండ్బీ రోడ్డు డివైడర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, భూమిపై పచ్చదనం పెరగాలంటే మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఆ విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజనీదేవి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం చిన్నప్పటి నుంచే అలవాటుగా ఉండాలనే ఉద్దేశంతో చిన్న పిల్లలతో మొక్కలు నాటించామన్నారు. అనంతరం తిరుమలరావు, సరోజనీదేవి, వారి కుమార్తె రష్మి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ నిర్మూలన ఉద్యమకారిణి, ఆంధ్ర రాష్ట్ర స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీత జి.వనజ, తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
నేడు ఈటీసీ నిర్వహణకమిటీ సమావేశం
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం (ఈటీసీ) నిర్వహణ కమిటీ సమావేశం పంచాయతీరాజ్ కమిషనర్ రేవు ముత్యాలరావు అధ్యక్షతన గురువారం జరుగుతుందని ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సీఈఓలు, శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 కొత్త జిల్లాల్లోని డీపీఓలు, ఎన్ఐఆర్డీ రాష్ట్ర సమన్వయకర్త, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి ఈటీసీ ప్రిన్సిపాల్ కన్వీనర్గా వ్యవహరిస్తారన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రంలో శిక్షణలు, అభివృద్ధి పనులను సమీక్షించడం, వార్షిక శిక్షణ ప్రణాళికను ఆమోదించడం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారన్నారు. 13న కాకినాడ జిల్లా కబడ్డీ జట్ల ఎంపికసామర్లకోట: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే కాకినాడ జిల్లా జట్లను ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ పీఆర్ కళాశాల ఇండోర్ కబడ్డీ కోర్టులో జూనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. దీనికి హాజరయ్యే క్రీడాకారులు 2006 డిసెంబర్ 31 తర్వాత పుట్టిన వారై ఉండి, బాలురు 75 కేజీలు, బాలికలు 65 కేజీల లోపు బరువు ఉండాలన్నారు. జిల్లా నుంచి వచ్చిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై నవారు ఈ నెల 22 నుంచి 25 వరకూ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితాతో రావాలని కోరారు. తాటాకిల్లు దగ్ధంకొత్తపల్లి: ప్రమాదవశాత్తూ గ్యాస్ సిలిండర్ పేలి తాటాకిల్లు దగ్ధమైన సంఘటన కొండెవరంలో జరిగింది. బాధితుడు పెంకే సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తిబాబు కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక ఒక్కసారిగా సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో వారందరూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో తాటాకిల్లు, దానిలోని గృహోపకరణాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పిఠాపురం ఇన్చార్జి అగ్నిమాపక అధికారి పి.హరిప్రసాద్, సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. పేకాట శిబిరంపై దాడిబిక్కవోలు: పేకాట శిబిరంపై దాడి చేసి ఏడుగురు జూదరులను అరెస్ట్ చేశామని అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ తెలిపారు. కొమరిపాలెంలోని ఒక చావిడిలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం రావడంతో బుధవారం తెల్లవారుజామున బిక్కవోలు ఎస్సై రవిచంద్ర, సిబ్బందితో దాడి చేశామన్నారు. అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగురితో పాటు, చావిడి యజమానిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి నాలుగు మోటారు సైకిళ్లు, రూ.34,790 స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. హోటల్లో తనిఖీలుగండేపల్లి: జిల్లా గూడ్స్, సర్వీస్ టాక్స్ జిల్లా ఇంటిలిజెన్స్ విభాగం డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక హోటల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. మల్లేపల్లి శివారు రాయుడు గారి మిలటరీ హోటల్లో (ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్) అధికారులు సుమారు ఉదయం 11.45 నుంచి తనిఖీలు ప్రారంభించారు. తనిఖీలకు వచ్చిన అధికారులే స్వ యంగా వినియోగదారుల నుంచి బిల్లులు తీసుకున్నా రు. తనిఖీ జరుగుతున్నంతసేపు మీడియాను అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాయంత్రం 7 గంటల వరకు తనిఖీ చేసిన అధికారు లు మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అత్యంత గోప్యత ప్రదర్శించి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కాగా వారంతా జీఎస్టీ వివరాలు తని ఖీ చేసేందుకు వచ్చినట్టు స్థానికంగా భావిస్తున్నారు. -
కక్ష సాధింపు చర్యలు దారుణం
‘సాక్షి’ ఎడిటర్పై పోలీసులు కేసు నమోదు చేయడం, ఆ పత్రికా ప్రధాన కార్యాలయానికి వచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణం. పోలీసు అధికారులకు న్యాయబద్ధంగా దక్కాల్సిన పదోన్నతులు కల్పించలేదనే విషయాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో పోలీసులు ఆ కార్యాలయంలో అర్ధరాత్రి హడావుడి చేయడం తగదు. తగిన ఆధారాలు, వాస్తవాలు ఉంటే కేసులు నమోదు చేసుకున్నా పర్వాలేదు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై వరసగా కేసులు నమోదు చేసి వేధించడమంటే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగినట్టే. – ఎమ్మెన్వీ ప్రసాద్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, అమలాపురం ● -
ఏమైందో ఏమో!
● పెద్దేవంలో గేదెల మృత్యువాత ● 15 రోజుల్లో 25 మరణించిన వైనం ● ఆందోళనలో పాడి రైతులుతాళ్లపూడి: పెద్దేవం గ్రామంలో పాడి పశువులు (గేదెలు) వరసగా మృత్యువాత పడుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో సుమారు 25 వరకూ గేదెలు మరణించాయి. ఆకస్మాత్తుగా నీరసపడి, రెండు రోజులకే అవి మేత మేయక చనిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని సాయిబాబా, ఇతర ఆలయాల సమీపంలో సుగంది చెరువు ఉంది. దీని నీటిని పశువులు తాగుతాయి. అయితే చెరువు నీరు కలుషితం కావడం, ఆ నీటిని పశువులు తాగడం వల్లే చనిపోతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో తాగునీటికి ఉపయోగించిన ఈ చెరువు నేడు గుర్రపు డెక్క పేరుకుపోయి అధ్వానంగా మారింది. దానిలో మలమూత్ర విసర్జనలు, మృత కళేబరాలను వేస్తున్నారు. కాగా.. తమ గ్రామంలో పశువులు ఎందుకు చనిపోతున్నాయో తెలియడం లేదని రైతులు జమ్ముల శ్రీను, బెల్లంకొండ సోమన్న, యాండపల్లి లక్ష్మణరావు, నామన సుబ్బారావు తదితరులు ఆందోళన చెందుతున్నారు. నమూనాల సేకరణ పశుసంవర్ధకశాఖ మండల అధికారి బాలాజీ బుధవారం పెద్దేవంలో పర్యటించి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు వచ్చిన రోగ లక్షణాలు కొత్తగా ఉన్నాయని, కిడ్నీ, లివర్ దెబ్బతింటున్నాయన్నారు. తీసుకునే ఆహారం కానీ, తాగే నీరు కానీ కలుషితమై ఉండచ్చన్నారు. గడ్డి, నీరు, రక్త నమూనాలను పరీక్షలకు పంపామని, ఫలితాలు వచ్చాక విషయం తెలుస్తుందన్నారు. -
పనులకు కదలిక
● వీరేశ్వరస్వామి ఆలయం పరిశీలన ● పునర్నిర్మాణానికి సూచనలుఐ.పోలవరం: వర్షం వస్తే నీటి వెతలు.. ఆపై మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి కానరాని చర్యలపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. రూ.నాలుగు కోట్లతో ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసినా పనులు ప్రారంభించకపోవడం, ఆపై వర్షం వస్తే ఆలయంలో ముంపు సమస్యలపై ‘స్వామీ.. నీ చెంత నీరేమీ’ అనే శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. ఇందులో భాగంగా దేవదాయ శాఖ రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్పతో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డిప్యూటీ స్థపతి, అసిస్టెంట్ స్థపతి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణతో కలసి బుధవారం ఆలయాన్ని పరిశీలించారు. గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపం, గాలి గోపురం, చండీశ్వరస్వామి, నవగ్రహ మండపాలను పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణానికి చేసిన ప్లాన్ను వారు పరిశీలించి తగు సూచనలు చేశారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో సిబ్బంది స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
‘నిర్కా’కు సీఎస్ఆర్ ప్రాజెక్టు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని ఐకార్ – నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (నిర్కా)కు న్యూఢిల్లీకి చెందిన ఎం/ఎస్ ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి మొదటి సీఎస్ఆర్ ప్రాజెక్టు లభించింది. ఈ విషయాన్ని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మా గంటి శేషుమాధవ్ బుధవారం ప్రకటనలో తెలి పారు. ఈ ప్రాజెక్టును తాను, క్రాప్ మేనేజ్మెంట్ డివిజన్ హెడ్ డాక్టర్ కొరడ రాజశేఖరరావు, బహుశాఖ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ముందుకు తీసుకువెళతామన్నారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వద్ద ఉన్న ఐకార్–నిర్కా ప్రాంతీయ కేంద్రంలోని పది ఎకరాల పొలంలో సాంకేతిక ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. రెండేళ్ల వ్యవధి కలిగిన ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 500 మంది రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. సెన్సార్లు, డ్రోన్లు రెండు మార్గాల సమాచార వ్యవస్థల ద్వారా పంట, పురుగుల వాతావరణాన్ని పర్యవేక్షించి రైతులకు తక్షణ సలహాలు అందించడం లక్ష్యమన్నారు. దీని ఫలితంగా నీటి వినియోగం 40–50 శాతం తగ్గడం, ఎనర్జీ వ్యయం 30–40 శాతం తగ్గడం, ఎరువుల సామర్థ్యం పెరగడం, ఉత్పాదకత మెరుగుపడడం, డ్రోన్ల వినియోగంపై రైతులకు అవగాహన పెరుగుతుందన్నారు. -
ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి
● జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు ● కాకినాడలో స్థాయీ సంఘ సమావేశాలు బోట్క్లబ్ (కాకినాడసిటీ): క్షేత్రస్థాయిలో ప్రజా అవసరాలపై సభ్యులు లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సారించాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీసంఘ సమావేశాలు చైర్మన్ వేణుగోపాలరావు, ఆయా సంఘాల చైర్మన్ల అధ్యక్షతన జరిగాయి. వీటికి శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, కుడుపూడి సూర్యనారాయణరావు హాజరయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని ఆయా అంశాల స్థాయి సంఘాలు సమీక్షించాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు సూచనలు చేశాయి. తొలుత రామచంద్రపురం మండలం జెడ్పీటీసీ సభ్యులు ఎం.వెంకటేశ్వరరావు ఆగస్టులో మృతి చెందిన నేపథ్యంలో సభలో మౌనం పాటించారు. ● అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, జిల్లా వయోజన విద్యాశాఖ డీడీ పోశయ్యలతో కలిసి గౌరవ సభ్యులందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అక్షరాంధ్ర వయోజన విద్య పుస్తకాలను ఆవిష్కరించారు. ప్రస్తుత ఖరీఫ్, రానున్న రబీ సీజన్లకు కాలువల ద్వారా నీరు సక్రమంగా పంట పొలాలకు అందేలా చూడడంతో పాటు అకాల వర్షాల వల్ల పొలాలు ముంపునకు గురి కాకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని గౌరవ సభ్యులు అధికారులను కోరారు. ● వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించి సీజనల్ వ్యాధుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన వైద్య అధికారులు పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని కోరారు. ● రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు అధికారులకు సూచించారు. మోతాదుకు మించి యూరియా వినియోగించడం వల్ల అనేక రోగాల బారిన ప్రజలు పడుతున్నారని, ఈ అంశంపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ● అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులో ఉండేలా శాసన మండలి సభ్యులు కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. -
మీడియాపై అక్రమ కేసులు సరికాదు
మీడియాపై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే మీడియా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం సరికాదు. ‘సాక్షి’ కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు చేసి ఎడిటర్, రిపోర్టర్లపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాసిన కథనాల్లో పొరపాట్లు ఉంటే వివరణ ఇవ్వాలని న్యాయపరంగా వెళ్లాలి. మీడియా ప్రతినిధులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – మండెల శ్రీరామ్మూర్తి, రాష్ట్ర మాజీ కార్యదర్శి, ఏపీయూడబ్ల్యూజే, తూర్పుగోదావరి ● -
క్రీడలతో ఒత్తిడి నుంచి ఉపశమనం
కాకినాడ లీగల్: న్యాయవాదులు వృత్తిలో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారని, దాని నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయని కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. కోర్టు ఆవరణలో రూ.3 లక్షలతో నిర్మించిన క్రికెట్ ప్రాక్టీస్ నెట్ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. వాటి ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు. క్రికెట్ నెట్ ద్వారా న్యాయవాదులు తమ క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ఆరో అదనపు జిల్లా జడ్జి పి.గోవర్ధన్ బౌలింగ్ చేయగా, జడ్జి ఆనంది బ్యాటింగ్ చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏలూరి సుబ్రహ్మణ్యం, చెక్కపల్లి వీరభద్రరావు, ఉపాధ్యక్షుడు పెన్మెత్స రామచంద్రరాజు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ జోకా విజయ్ కుమార్, తలాటం హరీష్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 10 వేలకు పైగా హెచ్ఐవీ కేసులు
● నియంత్రణ బాధ్యత అందరిదీ ● మారథాన్ 5 కె రెడ్ రన్లో కలెక్టర్ ప్రశాంతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో 10 వేలకు పైగా హెచ్ఐవీ కేసులు ఉన్నాయని, అవి పెరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఎయిడ్స్పై అవగాహనకు డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్ట్రేటజీ ఫర్ హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్ (దిశ) ఆధ్వర్యంలో బుధవారం మారథాన్ 5 కె రెడ్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా హెచ్ఐవీ పరీక్షలకు సంచార సమీకృత సలహా, పరీక్ష కేంద్రాన్ని (మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్) ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అవగాహన, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఎయిడ్స్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. దీనిపై యువతకు అవగాహన కల్పించడానికి, ఎయిడ్స్ బాధితులకు మద్దతుగా నిలవడానికి మారథాన్ 5 కె రన్ నిర్వహిస్తున్నామన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై చిన్న చూపు, వివక్ష తగదన్నారు. జిల్లాలో హెచ్ఐవీ కౌన్సెలింగ్, పరీక్షలకు ఐదు ఎస్ఏ, ఐసీటీసీ కేంద్రాలు, 38 పీహెచ్సీ ఎఫ్ఐ ఐసీటీసీ కేంద్రాలు, 14 యూపీహెచ్సీ కేంద్రాలున్నాయన్నారు. విజేతలకు బహుమతులు జిల్లా ఎయిడ్స్, కుష్ఠు, క్షయ నివారణ అధికారి డాక్టర్ వసుంధర మాట్లాడుతూ హెచ్ఐవీపై పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచిన వారికి రూ.10 వేలు, రూ.7 వేలు చొప్పున అందించినట్టు తెలిపారు. ఈ విజేతలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే రన్లో పాల్గొంటారన్నారు. అక్కడ విజేతలుగా నిలిస్తే జాతీయ స్థాయి రన్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. హెచ్ఐవీ సంబంధిత సమాచారానికి జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1097ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు డాక్టర్ గన్ని మహాలక్ష్మి, ఆర్ట్స్ కళాశాల రెడ్ రిబ్బన్ కో ఆర్డినేటర్ రవితేజ, వీటీ కళాశాల ప్రతినిధి జేజే.విజయ్ ప్రకాష్, దిశ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం, జిల్లా సూపర్ వైజర్ హరినాథ్ కుమార్, నగర ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. డాక్యుమెంట్ల అప్లోడ్ తప్పనిసరి రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సర్కులర్లు, ప్రభుత్వ ఉత్తర్వులు తదితర డాక్యుమెంట్లను తప్పనిసరిగా ఈపీటీఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డాక్యుమెంట్ల అప్లోడ్ విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఈపీటీఎస్ 67,398 డాక్యుమెంట్లు అప్లోడ్ కాగా, గురువారం ఉదయం నాటికి లక్ష రికార్డులు పూర్తి చేయాలన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలలో వివిధ హోదాల్లో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా పడాల వీర రాఘవరెడ్డి (రాజమహేంద్రవరం రూరల్), రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా యాళ్ల బాబూరావు (కొవ్వూరు), రాష్ట్ర వీవర్స్ వింగ్ సెక్రటరీగా దొంతంశెట్టి వీరభద్రయ్య (రాజమహేంద్రవరం రూరల్), స్టేట్ పబ్లిసిటీ వింగ్ జనరల్ సెక్రటరీగా గుడా విజయరాజ్ (కొవ్వూరు), రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా యార్లగడ్డ జోషి బాబు (కొవ్వూరు), రాష్ట్ర ఐటీ వింగ్ సెక్రటరీగా సీహెచ్ సూర్యనారాయణరెడ్డి అలియాస్ సునీల్ రెడ్డి (అనపర్తి), రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ సెక్రటరీగా సుంకర సత్యనారాయణ ( కొవ్వూరు) నియమితులయ్యారు. -
జీవితాలతో ఆటోలాడొద్దు
సాక్షి, అమలాపురం: జీవితాలతో ఆటలాడుతున్నారు.. సాఫీగా సాగిపోతున్న ప్రయాణానికి బ్రేక్లు వేశారు.. ఆటో కార్మికుల జీవితాలను కుదిపేశారు.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా, రోజువారీ ఆదాయానికి గండి పెట్టడాన్ని కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీ్త్ర శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో రోడ్డున పడ్డామని ఆటో కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆదాయం సగానికి పడిపోవడంతో పాటు పెరిగిపోతున్న ఫైనాన్స్ భారాన్ని మోయలేక రోడ్డెక్కారు. దశల వారీగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఆటో కార్మికుల ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రభుత్వం సీ్త్ర శక్తి పథకం తీసుకు వచ్చిన తరువాత కార్మికుల రోజువారీ ఆదాయానికి భారీగా గండి పడింది. గతంలో రోజుకు రూ.వెయ్యి వరకూ ఆదాయం చూసిన కార్మికులకు ఇప్పుడు రూ.300 నుంచి రూ.500 కూడా రావడం లేదు. దీనితో జిల్లాలో సుమారు 25 వేలకు మందికి పైగా ఉన్న కార్మికుల జీవనోపాధికి గండి పడినట్టయ్యింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కొంత వరకూ సర్వీసు ఉంది. ముఖ్యంగా పల్లె వెలుగు బస్సులు వెళ్లని గ్రామాలకు వెళ్లే ఆటో కార్మికులకు వచ్చే ఆదాయం పెద్దగా తగ్గలేదు. ఉదాహరణకు అమలాపురం నుంచి ఉప్పలగుప్తం మీదుగా ఎన్.కొత్తపల్లి, కూనవరం, అమలాపురం మండలం సాకుర్రు, అంబాజీపేట మండలం వాకలగరువు, తొండవరం, ఐ.పోలవరం మండల కేంద్రానికి, మురమళ్ల నుంచి టి.కొత్తపల్లి, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెం, లంకాఫ్ ఠాణేల్లంక, మలికిపురం మండలం అప్పనరామునిలంక, గుడిమెల్లంక వంటి బస్సు సర్వీసులు లేనిచోట ఆటో కార్మికులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఒకటి, రెండు బస్సు సర్వీసులు ఉన్నచోట కొంత వరకూ ఆదాయం తగ్గగా, అధిక సర్వీసులు తిరిగే అమలాపురం నుంచి రావులపాలెం, రావులపాలెం మీదుగా బొబ్బర్లంక, వాడపల్లి, రాజోలు నుంచి అమలాపురం, రాజోలు నుంచి పి.గన్నవరం మీదుగా రావులపాలెం, అమలాపురం నుంచి ముమ్మిడివరం, మురమళ్ల మీదుగా యానాం, అమలాపురం నుంచి ముక్తేశ్వరం, అమలాపురం నుంచి కాట్రేనికోన, అమలాపురం నుంచి అల్లవరం, యానాం నుంచి రామచంద్రపురం, మండపేట మీదుగా రావులపాలెం వంటి బస్సులు అధికంగా తిరిగే రూట్లలో ఆటో కార్మికుల ఉపాధి మూడొంతులు పడిపోయింది. అమలాపురం బస్టాండ్ నుంచి రావులపాలెం బస్టాండ్కు వెళ్లేందుకు ఆటో సర్వీసులు దాదాపు నిలిపివేశామని కార్మికులు చెబుతున్నారు. ఇదే సమయంలో తనిఖీలు, ఫిట్నెస్, పొల్యూషన్ పేరుతో ఎడాపెడా ఫైన్లు రాస్తుండడంతో వారి ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ ప్రైవేట్ కంపెనీలకు అప్పగించారు. దీనిని అమలాపురం మండలం ఎ.వేమవరంలో ఏర్పాటు చేశారు. జిల్లాకు ఇదొక్కటే కావడంతో రామచంద్రపురం, మండపేట, ఆత్రేయపురం, సఖినేటిపల్లి వంటి సుదూర మండలాల నుంచి ఇక్కడకు వచ్చి సర్టిఫికెట్ పొందడం కూడా వారికి భారంగా మారింది. ప్రభుత్వం పట్టించుకోక.. ప్రధాన మార్గాల్లో ఆదాయం కోల్పోవడం ఆటో కార్మికుల రోజువారీ జీవనానికి సైతం కష్టాలు వచ్చాయి. ఇతర మార్గాల్లో ఆటోలు తిప్పుతుంటే ఇతర కార్మికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. నిత్యం సర్వీసులు తిరిగే మార్గాల్లో ఆదాయం లేకుండా పోయింది. అన్ని ఖర్చులూ పోను రోజుకు రూ.వెయ్యి వరకు ఆదాయం వచ్చేచోట ఇప్పుడు రూ.మూడు వందలు కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. దీనితో వారు నిరసన బాట పట్టారు. ఇప్పటికే జిల్లాలో దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టారు. ఆటోలకు నల్ల జెండాలు కట్టి నిరసన తెలుపుతున్నారు. మండలాల వారీగా రాస్తారోకోలు, ధర్నాలు, ఆటోలతో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేనందున ఈ నెల 12, 13వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్ నిర్వహించాలని నిర్ణయించారు. హామీ.. పట్టదేమీ! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో కార్మికులకు ఏడాదికి రూ.10 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేది. దీనివల్ల జిల్లాలో వేలాది మంది కార్మికులు రూ.కోట్ల మేర లబ్ధి పొందారు. ఆటో మరమ్మతులు, రోడ్ ట్యాక్స్, ఇతర అవసరాల కోసం వినియోగించుకునేవారు. తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికునికి ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని టీడీపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఎన్నికల సభలో తాము ఏడాదికి రూ.15 వేలు అందజేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటికీ ఆ ఊసెత్తడం లేదు. ఈ ఏడాదితో కలిపి ఒక్క ఆటో కార్మికునికి రూ.30 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉంది. అదీ ఇవ్వక, వచ్చే ఆదాయ మార్గం లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సీ్త్ర శక్తి పథకంతో రోడ్డున పడిన కార్మికులు నిరసిస్తూ రేపు, ఎల్లుండి ఆటోల బంద్ ఎన్నికల హామీని పట్టించుకోని కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు ఎప్పటికి ఇస్తారో! -
గురువులపై బరువు
● అసెస్మెంట్ బుక్లెట్ల విధానానికి కూటమి శ్రీకారం ● ఉపాధ్యాయులకు పెరిగిన పని ఒత్తిడి ● బోధనకు సమయం లేక అవస్థలు సాక్షి, రాజమహేంద్రవరం: దేశ అభ్యున్నతికి, సమాజ ప్రగతికి విద్య ఎంతో అవసరం. దాన్ని పిల్లలకు అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో పిల్లలకు విద్యాబోధన చేయడానికి వారికి తగినంత సమయం కేటాయించాలి. కానీ కూటమి ప్రభుత్వం గురువులపై బరువు మోపుతోంది. బోధనేతర పనులను అప్పగిస్తూ, పాఠాలు చెప్పడానికి సమయం లేకుండా చేస్తోంది. నూతన సంస్కరణల పేరుతో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షలకు అసెస్మెంట్ బుక్లెట్ విధానం తీసుకువచ్చింది. దానిలో వివరాల నమోదు చాలా ఎక్కువ సమయం పడుతుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులకు భారం మూల్యాంకనంలో తీసుకొచ్చిన అసెస్మెంట్ బుక్లెట్ విధానం ఉపాధ్యాయులకు భారంగా మారుతోంది. బోధనతో పాటు అసెస్మెంట్ చేపట్టాలంటే కష్టసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా ఫార్మెటివ్, సమ్మెటివ్ పరీక్షలు ఏడాది పొడవునా జరుగుతూనే ఉంటాయి. పరీక్షల జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను అసెస్మెంట్ బుక్లెట్లో నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థులు రాసిన పరీక్షలకు సంబంధించిన అన్ని సబ్జెక్టుల మార్కులను దానిలో నింపాలి. ఒక్కో పరీక్షకు సంబంధించి దాదాపు వంద జవాబు పత్రాలను ఉపాధ్యాయులు దిద్దాల్సి ఉంది. అస్తవ్యస్తం సంక్షేమ పథకాల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వం.. పాలనలో తన మార్కును చూపించుకునేందుకు తహతహలాడుతోంది. అందులో భాగంగా సజావుగా నడుస్తున్న వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్తో ఉద్యోగుల్లో ఆందోళన నింపింది. ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చి బకాయిలు చెల్లించకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. తాజాగా విద్యాశాఖపై వికృత బుద్ధి ప్రదర్శిస్తోంది. హేతుబద్ధీకరణ పేరుతో స్కూల్ కాంప్లెక్స్ల స్థానంలో క్లస్టర్ వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు పాఠశాలల విలీన అంశాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అందులో విలీనం చేసే ప్రక్రియకు నాంది పలికింది. తాజాగా అసెస్మెంట్ బుక్లెట్ల విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి గురువులపై బరువు మోపే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. జిల్లాలో 985 పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 985 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రైమరీ 711, అప్పర్ ప్రైమరీ 72, హైస్కూళ్లు 183, హైస్కూల్ ప్లస్ 15 ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు 587, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకటి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 1.76 లక్షలు, ప్రైవేటు పాఠశాలల్లో 1.52 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు ఏడాదిలో నాలుగు ఫార్మెటివ్లు, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహిస్తారు. గతంలో ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ షీట్ను రాష్ట్ర ప్రభుత్వం అందించేది. జవాబు పత్రాలను విద్యార్థులు తీసుకురావాల్సి ఉంది. జవాబు పత్రాలను ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను ఓఎమ్మార్ షీట్లలో నమోదు చేసేవారు. అనంతరం వాటిని జిల్లా అధికారులు స్కాన్ చేసి భద్రపరిచేవారు. మూల్యాంకనం ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి చేసేవారు. తర్వాత పాఠ్యాంశాల బోధనకు ఎక్కువ సమయం ఉండేది. నూతన సంస్కరణలు కూటమి ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పరీక్షల విధానంలో నూతన సంస్కరణలకు నాంది పలికింది. అసెస్మెంట్ బుక్లెట్ను తీసుకురావడంతో పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలు, ఓఎమ్మార్ షీట్లను ఇందులో పొందుపర్చాలి. పరీక్ష సమయంలో విద్యార్థులకు బుక్లెట్ను ఇచ్చి, దానిలో జవాబులు రాయించాలి. ఇందులో వచ్చిన మార్కులను ఓఎమ్మార్ షీట్లో నమోదు చేయాలి. అంతేగాక వాటిని స్కానింగ్ సైతం ఉపాధ్యాయులే చేయించాలి. ఈ బుక్లెట్లో విద్యార్థి ఆధార్, యూడైస్, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్లనూ అయ్యవార్లే నమోదు చేయాలి. ఏడాదిలో సబ్జెక్టుకు 6, 7వ తరగతులకు 36, అలాగే 8, 9, 10 తరగతుల విద్యార్థులకు 42 ఓఎమ్మార్ షీట్లుంటాయి. విద్యా సంవత్సరం ముగిసేంత వరకు జవాబు పత్రాలు, వారికొచ్చిన మార్కులను బుక్లెట్లోనే నమోదు చేయాలి. వీటిని పాఠశాలల్లోనే భద్రపరచాలి. ఇంటికి తీసుకెళ్లకూడదు. దీంతో ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోందని, పాఠ్యాంశాల బోధన ఇబ్బందిగా మారుతోందని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోధనేతర పనులు కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం మోపుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లీప్ యాప్లో ఐఎమ్మెమ్మెస్, స్టూడెంట్స్ కిట్స్, మెగా పేటీఎంలను ఉంచారు. దీంతో పాటు పాఠశాలకు ప్రతి నెలా అందిన బియ్యం బస్తాలపై క్యూర్ కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంది. అందులోని నాణ్యతను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇలా అన్ని పనులూ ఉపాధ్యాయులతోనే చేయిస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. -
వైఎస్ జగన్తో గూడూరి భేటీ
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ భేటీ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని మాజీ సీఎం క్యాంప్ కార్యాలయంలో జగన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆయన వెంట పార్టీ ప్రచార విభాగం జిల్లా మాజీ అధ్యక్షుడు తోట రామకృష్ణ ఉన్నారు. పూర్తిస్థాయిలో సిబ్బంది లేకుంటే ఒప్పందం రద్దు రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో భద్రతా సిబ్బంది నియామకంపై ఒప్పంద నిబంధనలు పాటించని ఏజెన్సీకి చెల్లింపుల్లో కోత విధించాలని అధికారులకు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఆసుపత్రి భద్రత, పారిశుధ్యం, ఆహారం సరఫరా నిర్వహిస్తున్న సంస్థల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం ఆసుపత్రిలో 67 మంది భద్రతా సిబ్బంది ఉండాలని, ఇప్పుడు కేవలం 55 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. జూన్ నుంచి ఇప్పటి వరకు తక్కువగా ఉన్న సిబ్బంది సంఖ్యకు అనుగుణంగా ఏజెన్సీ చెల్లింపులపై కోత విధించాలని ఆదేశించారు. ఉత్సాహంగా పనిచేసే వారినే నియమించాలని, ప్రతి రోజూ హాజరు పరిశీలన (రోల్ కాల్) తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పూర్తి స్థాయి నియామకాలు చేపట్టకపోతే ప్రస్తుత ఏజెన్సీ ఒప్పందాన్ని రద్దు చేసి వేరే సంస్థకు పనులు అప్పగిస్తామని హెచ్చరించారు. -
క్లోరిన్ గ్యాస్ లీకై పలువురికి అస్వస్థత
యానాం: కనకాలపేట రక్షిత తాగునీటి పథకం ట్రీట్మెంట్ ప్లాంట్లో మంగళవారం సాయంత్రం క్లోరిన్ గ్యాస్ లీక్ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) ఆధ్యర్యంలో కనకాలపేటలోని ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి పలు గ్రామాలకు తాగునీరు అందిస్తుంటారు. ఈ నీటిని శుభ్రపరిచేందుకు సుమారు 900 కేజీల క్లోరిన్ గ్యాస్ సిలిండర్ను ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మార్చాలి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం సిబ్బంది సిలండర్ను మార్చతుండగా ఒక్కసారిగా దానిలోంచి గ్యాస్ లీకై బయటకు వ్యాపించింది. దీంతో అక్కడే ఉన్న సుమారు తొమ్మిది మంది సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కనకాలపేటలోని కోనవారివీధి, పాతబడివీధి, జమ్ముబాడువ తదితర గ్రామాల్లోకి గ్యాస్ వ్యాపించడంతో దాని వాసనకు పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పీడబ్ల్యూడీ ఈఈ నాగరాజు ఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. అనంతరం నాగరాజు, జేఈ పెదపాటి సంతోష్, గ్యాస్ లీకేజీని అరికట్టేందుకు వచ్చిన ఫైర్మన్ కోన కృష్ణారావు (బాబీ) తదితర తొమ్మిది మంది సిబ్బందితో పాటు 18 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే అశోక్, ఆర్ఏవో అంకిత్ కుమార్ పరామర్శించారు. గ్యాస్లీక్ను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్టు
రామచంద్రపురం: కె.గంగవరం మండలం అద్దంపల్లి సమీపంలో ఈనెల 3న దారి దోపీడికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ ఎం.వెంకట నారాయణ వెల్లడించారు. పట్టణంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ద్రాక్షారామకు చెందిన యండమూరి శ్రీనివాస్ ఈ నెల 3న తాను పనిచేస్తున్న నగల దుకాణాన్ని మూసివేసి సుమారు రాత్రి 11 సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. అద్దంపల్లి గ్రామం దేవాంగుల శ్మశాన వాటిక సమీపానికి వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులు ఆటోలో వచ్చి అతడిని ఇనుప పైపుతో కొట్టి కళ్లలో కారం చల్లారు. సుమారుగా 10 గ్రాముల పాతబంగారం, సెల్ఫోన్ రూ.5 వేలు, షాపునకు సంబంధించిన రశీదులు, స్కూటర్తో పాటు సుమారు రూ.78 వేలు విలువైన వస్తువులు దోచుకుపోయారు. దొంగలకు మరో వ్యక్తి సాయం చేశాడు. ఈ మేరకు ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ రఘువీర్ ఆదేశాల మేరకు సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. తాళ్లరేవు మండలం లచ్చిపాలెం ఏరియా బైపాస్ రోడ్డులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిని తాళ్లరేవు మండలం గాడిమెగ గ్రామానికి చెందిన ఓలేటి సత్తిబాబు, సంగాడి రాజు, పత్తిగొంది గ్రామానికి చెందిన కళ్లేపల్లి ప్రసాద్గా గుర్తించారు. -
విద్యుత్ షాక్తో సెంట్రింగ్ కూలీ మృతి
కపిలేశ్వరపురం: మండలంలోని టేకి గ్రామానికి చెందిన సెంట్రింగ్ కూలి వాసంశెట్టి శ్రీనివాస్ (30) పని ప్రదేశంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. శ్రీనివాస్ మరో ఇద్దరు కూలీలతో కలిసి మంగళవారం పడమర ఖండ్రిక గ్రామంలో ఇంటి శ్లాబ్ సెంట్రింగ్ పనికి వెళ్లాడు. శ్రీనివాస్ ఆ భవనం కింది నుంచి ఊసను పైకి లాగుతుండగా 11 కేవీ వైర్లకు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన వి.శ్రీనివాస్, జి.శివకృష్ణలకు స్వల్పగాయాలయ్యాయి. ఇద్దరినీ తొలుత కపిలేశ్వరపురం సీహెచ్సీకి, తర్వాత రాజమహేంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర ఎస్సై జి.హరీష్కుమార్ తెలిపారు. మోటారు సైకిల్ ఢీకొని మహిళ.. పెరవలి: మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతి చెందింది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలెం మండలం రావులపాడు గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకాయమ్మ (68) మంగళవారం ఉదయం రావులపాలెంలో ఆటో ఎక్కి పెరవలి మండలం కడింపాడు సెంటర్లో దిగింది. అక్కడ రోడ్డు దాటుతున్న ఆమెను తణుకు నుంచి రావులపాలెం వైపు వెళుతున్న మోటారు సైకిల్ వేగంగా ఢీకొంది. దీంతో వెంకాయమ్మ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమైంది. ఆమెను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స అందించి, మైరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగా వెంకాయమ్మ మృతి చెందింది. మృతురాలి కుమారుడు కొప్పిశెట్టి వీరభద్రం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వ్యాన్ కింద పడి.. ముమ్మిడివరం: ఠానేల్లంక ప్రధాన రహదారిపై రాజుపాలెం వద్ద మంగళవారం కొబ్బరి డొక్కల లోడుతో వెళుతున్న వ్యాన్ కింద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. కూనాలంకకు చెందిన కొప్పిశెట్టి గంగరాజు (45) మోటారు సైకిల్పై ముమ్మిడివరం వెళుతున్నాడు. రాజుపాలెం వద్ద ముమ్మిడివరం వైపు వెళుతున్న వ్యాన్ను తప్పించబోయి దాని కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గంగరాజుకు భార్య రాజేశ్వరి, ఒక కుమార్తె ఉన్నారు. ఎస్సై డి.జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు బస్సు ఢీకొని.. గండేపల్లి: మల్లేపల్లికి చెందిన మడపాటి సూరిబాబు (34) తాళ్లూరు సమీపంలోని సామిల్లు వద్ద తాపీపనికి వెళ్లాడు. అక్కడ రోడ్డు పక్కన నిలుచున్న అతడిని విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరిబాబు అక్కడిక్కడే మృతి చెందాడు. అతడికి భార్య రామలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గండేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రూ.1.15 లక్షల ఎరువుల సీజ్అంబాజీపేట: నిబంధనలకు వ్యతిరేకంగా నిల్వ ఉంచిన రూ.1.15 లక్షల విలువైన 5.20 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రాజమహేంద్రవరం డీఎస్పీ ఎస్.తాతారావు, మండల వ్యవసాయ అధికారి కె.ధర్మప్రసాద్ తెలిపారు. మాచవరంలోని సుభూషణ్ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని రాజమహేంద్రవరానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ విభాగ అధికారులతో కలిసి మండల వ్యవసాయ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రూ.1,15,370 విలువైన ఎరువులను సీజ్ చేశారు. తనిఖీలో డీసీటీవో ఎ.నవీన్ కుమార్, కానిస్టేబుల్ శివకుమార్, ఏఈఓ జాజెబ్ శాస్త్రి పాల్గొన్నారు. -
పోలీసులపై దాడి చేసిన యువకులకు జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం తాగి పోలీసులపై దాడి చేసిన ముగ్గురు యువకులు జైలు పాలయ్యారు. టూటౌన్ పోలీసుల విధులకు ఆటకం కలిగించడమే కాక, వారిపై చేతివాటం చూపించిన వారిని అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ ముగ్గురు యువకులను జైలుకు పంపారు. ఆ వివరాలను సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిశోర్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈనెల 7వ తేదీ అర్ధరాత్రి రెండో పట్టణ పోలీసులు నాగబాబు, కాళి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్ (రౌడీ షీటర్), రాజమహేంద్రవరం రూరల్ రాజవోలుకు చెందిన కర్రి దుర్గా సూర్య ప్రసన్నకుమార్, ధవళేశ్వరానికి చెందిన ములపర్తి వినోద్కుమార్లు మద్యం తాగి గొడవ పడుతున్నారు. దీన్ని చూసిన నైట్బీట్ పోలీసులు నాగరాజు, కాళి వారి వద్దకు వెళ్లి ఆపతుండగా వారు పోలీసులపై దాడి చేశారు. దీంతో వారిపై టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, పోలీసులు బృందం యువకుల కోసం గాలించారు. ఈస్ట్ రైల్వే స్టేషన్ వద్ద వారు ఉన్నారని సమాచారం తెలిసిన పోలీసులు ఆ ప్రాంతంలో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. -
రాజమహేంద్రవరం – కాకినాడ మధ్య స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు మధ్య ప్రతి రోజు అన్ రిజర్వ్డ్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అఽధికారులు మంగళవారం ప్రకటించారు. కాకినాడ పోర్టు – రాజమహేంద్రవరం (07523) రైలు ఈ నెల 15 నుంచి, రాజమహేంద్రవరం – కాకినాడ పోర్టు (07524) రైలు ఈ నెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయన్నారు. ఇవి రాజమహేంద్రవరం, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, మేడపాడు, సామర్లకోట, కాకినాడ టౌన్, కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో ఆగుతాయని వివరించారు. ఒక రైలు రాజమహేంద్రవరంలో తెల్లవారుజాము మూడు గంటలకు బయలుదేరి 4.40 గంటలకు కాకినాడ పోర్టు చేరుకుంటుందన్నారు. మరో రైలు కాకినాడలో ఉదయం 6.15 గంటలకు బయలుదేరి 8.15 గంటలకు రాజమహేంద్రవరం వస్తుందన్నారు. పింక్ మూన్తో ‘నన్నయ’ ఒప్పందంరాజానగరం: పింక్ మూన్ టెక్నాలజీ సంస్థతో ఆదికవి నన్నయ యూనివర్సిటీకి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. దీనికి సంబంధించిన పత్రాలపై మంగళవారం వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, టెక్నాలజీ సంస్థ సీఈఓ టి.నాగమల్లేశ్వరరావు సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా యూనివర్సిటీలోని అన్ని ఐటీ, సాఫ్ట్వేర్ ప్రక్రియలకు సాంకేతిక మద్దతు, కన్సల్టెన్సీ, పరిష్కారాలు అందిస్తుందన్నారు. వివాహిత అదృశ్యంపెరవలి: ఖండవల్లి గ్రామానికి చెందిన వనచెర్ల రాంబాబు, లక్ష్మి దంపతుల కుమార్తె పెచ్చెట్టి జ్యోత్స్న (19) అదృశ్యమైంది. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోత్స్నకు ఈ ఏడాది ఏప్రిల్ 23న వివాహం జరిగింది. వినాయక చవితి పండగకు పుట్టింటికి వచ్చి, ఇక్కడే ఉంది. ఈ క్రమంలో ఈ నెల 8న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లి, ఉదయం 11 గంటలకు ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఇంట్లో జ్యోత్స్న కనిపించలేదు. బంధువులు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా, ఫలితం లేకపోవడంతో ఆమె తల్లి.. పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఆచూకీ తెలిసే 94407 96642కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
టెన్నికాయిట్ జట్లకు క్రీడాకారుల ఎంపిక
దేవరపల్లి: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టెన్నికాయిట్ సీనియర్ మహిళలు, పురుషుల జట్ల ఎంపిక పోటీలను మంగళవారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో మహిళల జట్టుకు గెడల హేమమాధురి, రాపాక సంస్కృతి, రాపాక సౌరిక, ఎస్కే లతిఫా, మిరియాల ప్రియదర్శిణి ఎంపికై నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు గద్దే చంద్రశేఖర్ తెలిపారు. పురుషుల జట్టుకు బోయిన చంటిబాబు, గంగుల చంద్ర మహేష్, రాపాక నవీన్, మద్దాల అజయ్, గారపాటి బాబీలను ఎంపిక చేశామన్నారు. వీరు మండపేటలో ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న జట్లకు రెండు రోజుల పాటు స్థానిక జెడ్పీ హైస్కూల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. క్రీడాకారులకు టెన్నీకాయిట్ జిల్లా అసోసియేషన్ చైర్మన్ గన్నమని హరికృష్ణ, వైస్ చైర్మన్ ఉప్పులూరి రాంబాబు క్రీడా దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో వాప్ డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్, దాపర్తి వెంకటేశ్వరరావు, 20 మంది పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి బ్రేక్.. స్థానికులకు షాక్..
● రాజోలు దీవిలో వంద ఆయిల్, గ్యాస్ బావులు ● ఉత్పత్తులను తరలిస్తున్న ఆయిల్ కంపెనీలు ● స్థానికులకు ప్రాధాన్యం కరువు ● బయటి వారికే పెద్దపీట ● యువతకు కొరవడిన ఉపాధి మలికిపురం: రాజోలు దీవి నుంచి అపార చమురు, గ్యాస్ నిక్షేపాలను తరలించుకు పోతున్న ఓఎన్జీసీ, గెయిల్ సంస్థలు ఇక్కడ పారిశ్రామిక అభివృద్ధికి ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగం తాండవం చేస్తోందన్నారు. నిక్షేపాలు అధికంగా ఉన్న చోట అభివృద్ధిని సాధించాల్సింది పోయి, యువత ఉపాధి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మలికిపురం, రాజోలు, సఖినేటిపల్లి మండలాల్లోని సుమారు 100 బావుల ద్వారా ప్రతి రోజూ 20 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్, అదే స్థాయిలో చమురు నిక్షేపాలను ఓఎన్జీసీ, గెయిల్ తరలించుకుపోతున్నాయి. కానీ ఈ సంస్థలు ఈ ప్రాంతాల ప్రజలకు ఉపాధి చూపడంపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఈ సంస్థల్లో ఇక్కడి వారికి సరైన ఉద్యోగాలు లేవు. ఆయా సంస్థల కార్యకలాపాల్లో కూడా సరియైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పరిశ్రమలకు దక్కని ప్రాధాన్యం రాజోలు దీవిలో గతంలో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వాటిలో తూర్పుపాలెంలో ఐస్ ఫ్యాక్టరీ, ఐరన్ ఫ్యాక్టరీ, అలాగే తూర్పుపాలెంతో పాటు కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అప్పట్లో వాటికి లోప్రెజర్ గ్యాస్ను తక్కువగా అందించేవారు. భవిష్యత్తులో గ్యాస్ మరింత అందిస్తారని, రాయితీ కూడా వస్తుందని నిర్వాహకులు ఆశించారు. అయితే రానురాను పరిస్థితి దిగజారింది. గ్యాస్ సరఫరాను పెంచలేదు, రాయితీ ఇవ్వలేదు సరికదా, అప్పటి వరకూ సరఫరా చేసిన గ్యాస్ ధరను అమాంతంగా పెంచేశాయి. దీంతో అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న ఆయా పరిశ్రమలను యజమానులు మూసివేశారు. తూర్పుపాలెం ఐస్ ఫ్యాక్టరీతో పాటు, విద్యుత్, స్టీల్ పరిశ్రమలు, కేశవదాసుపాలెంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ మూతబడ్డాయి. దీంతో నిర్వాహకులు రూ.కోట్లు నష్టపోయారు. స్థానిక యువత ఉపాధి లేక సతమతమవుతున్నారు. స్థానిక పరిశ్రమలకు రాయితీలు, గ్యాస్ సరఫరా చేయని ఆయా సంస్థలు.. ఇతర చోట్ల పరిశ్రమలకు ఇవ్వడం దారుణమైన అంశమని స్థానికులు మండిపడుతున్నారు. లోప్రెజర్ గ్యాస్ను తక్కువ ధరకు నియోజకవర్గంలో పరిశ్రమలకు అందించని ఒక సంస్థ.. ఇటీవల రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కంపెనీకి శివకోడులోని ఓ బావిని ధారాదత్తం చేయడం గమనించదగ్గ విషయం. వరస లీకేజీలు రాజోలు దీవిలో వారానికోసారి గ్యాస్, ఆయిల్ బావులు లీకవుతాయి. ప్రజలు బెంబేలెత్తి, తీవ్ర భయాందోళనలు చెందుతారు. కానీ ఆయా సంస్థలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తాయి. శిథిలమైన పైపులైన్లు, బావుల పరికరాలకు మరమ్మ తులు చేయపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కనీసం ఓఎన్జీసీ కార్యకలాపాల పనులు, కాంట్రాక్టులు కూడా ఆయా సంస్థలో పరిచయం, పలుకుబ డి ఉన్న ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల సంస్థలు, వ్యక్తులకే ఇస్తున్నారనే వాదన ఇక్కడ బలంగా ఉంది. అనేక నష్టాలు రాజోలు దీవిలో గ్యాస్, చమురు నిక్షేపాలను తరలించుకుపోవడంతో ఈ ప్రాంతం గుల్లవుతోంది. ఇక్కడి భూసారంతో పాటు పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. అలాగే గ్యాస్ను తరలించే భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. తరచూ పైపులైన్ల లీకేజీలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఆయిల్ కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. -
ఉద్యమంపై ఉక్రోషం!
● రైతులకు అండగా ఆందోళన చేస్తున్న ● వైఎస్సార్ సీపీ శ్రేణులపై పోలీసుల జులుం ● యూరియా, ఎరువుల కొరతపై అధికారులకు విన్నవించేందుకు నేతల సమాయత్తం ● ముందుకు కదలకుండా అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు ● సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లకుండా నిలువరించిన వైనం ● నిరసనగా రోడ్డుపై బైఠాయించి రెండు గంటలు ధర్నాకు దిగిన వైఎస్సార్ సీపీ నేతలు ● కొవ్వూరులో ఆంక్షలను అధిగమించి ఆర్డీఓ ● కార్యాలయానికి చేరుకున్న పార్టీ నేతలు ● డిమాండ్లపై ఆర్డీఓకు వినతి పత్రం సాక్షి, రాజమహేంద్రవరం: అన్నదాతలకు అండగా చేపడుతున్న ఉద్యమంపై కూటమి ప్రభుత్వ నేతృత్వంలోని పోలీసులు ఉక్రోషం ప్రదర్శించారు. కర్షకుడి కష్టాలు కూటమి పాలకులు, అధికారుల కళ్లకు కట్టేందుకు సమాయత్తమవుతున్న ఉద్యమకారుల గొంతు నొక్కారు. యూరియా, ఎరువుల కొరత అరికట్టాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయానికి వెళుతున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, రైతులపై ఆంక్షలు విధించారు. కార్యాలయం వద్దకు వెళ్లేందుకు వీలులేదంటూ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నేతల ఇళ్లవద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి మరీ బయటకు రాకుండా నిలువరించారు. కొందరు పోలీసులైతే అత్యుత్సాహం ప్రదర్శించారు. నిరసన కార్యక్రమానికి వెళ్లవద్దంటూ ముందురోజు నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు ఎవరూ రాకుండా నిలువరించారు. కనీసం వినతి పత్రం ఇచ్చేందుకు సైతం అనుమతించలేదంటే రాష్ట్రంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తోందో అద్దం పడుతోంది. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రజాస్వామ్యం బతికుందా? అన్న అనుమానం కలుగుతోందని ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలో ఉద్రిక్తం యూరియా, ఎరువుల కొరతను తక్షణం నివారించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. యూరియా, ఎరువుల కొరతపై సబ్కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, రైతులు సమాయాత్తమయ్యారు. రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్లోని జక్కంపూడి రాజా గృహం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళుతున్న వైఎస్సార్ సీపీ శ్రేణులను, నాయకులను పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని వారించారు. అక్కడికి వెళ్లనిచ్చేది లేదంటూ పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పోలీసులను మోహరించారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అక్కడి నుంచి కదలకుండా అష్టదిగ్బంధనం చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎంత సర్దిచెప్పినా వినకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా వినకుండా పోలీసులు నేతలు, రైతులను అక్కడే నిలువరించారు. దీంతో ఆగ్రహించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, అనపర్తి ఇన్చార్జి సత్తిసూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) చందన నాగేశ్వర్, గుబ్బల తులసీకుమార్, నక్కా నగేష్, రైతులు అక్కడే బైఠాయించారు. ఎర్రటి ఎండలో సుమారు రెండు గంటల పాటు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కూటమి వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. తక్షణం రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రిష్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవ.విజయసారథి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ పాల్గొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం దిగ్బంధంవైఎస్సార్ సీపీ శ్రేణులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ముందస్తుగా అక్కడికి చేరుకున్నారు. ఎవరూ రాకుండాకార్యాలయం నలువైపులా అష్ట దిగ్బంధం చేశారు. నాలుగు వైపులా రహదారులను బంధించారు. కొవ్వూరులో సక్సెస్కొవ్వూరు డివిజన్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీఅన్నదాత పోరుశ్రీ కార్యక్రమం విజయవంతమైంది. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, తక్కువ మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలిచ్చినా, వాటిని లెక్క చేయకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల పరిధిలోని అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. తొలుత నాయకులు, కార్యకర్తలు కొవ్వూరు మెరకవీధి వాటర్ ట్యాంక్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయా నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాస్ నాయుడుల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ బస్టాండ్ సెంటర్, విజయవిహార్ సెంటర్, ఎల్ఐసీ ఆఫీస్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. అందరికీ అనుమతి లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం 50 మంది ఆర్డీఓ కార్యాలయంలోకి అనుమతిస్తామని పోలీసులు అడ్డుకున్నారు. అందరినీ పంపించాలని ఎంత వాదించినా ససేమిరా అనడంతో వైఎస్సార్ సీపీ నేతలు మిన్నకుండిపోయారు. అనంతరం రైతుల సమ స్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకు సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కంఠమని రమేష్, మాజీ ఏమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, ఎంపీపీ లు, మండలం అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
యువకులను శిక్షించాలి
గోకవరం: బాలికపై అత్యాచారం చేసిన యువకులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ విజృంభణ ఆధ్వర్యంలో మంగళవారం గోకవరంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె.సతీష్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన మాగాపు గాంధీ, టీడీపీ నాయకుడి అన్నయ్య కుమారుడు గునిపే కిరణ్ ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం చేశారన్నారు. అధికారం చేతిలో ఉందనే అహంతో, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో ఈ దుశ్చర్యలకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసి 24 గంటలు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. తక్షణమే పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాలిక, ఆమె తల్లిదండ్రులపై బెదిరింపులకు పాల్పడకుండా రక్షణ కల్పించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో బాలికకు న్యాయం జరగకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. బాలికపై అత్యాచారం చేసిన -
ఆటోవాలాలను రోడ్డుకీడ్చారు..
విశాఖ నుంచి అమరావతికి డ్రైవర్ పాదయాత్ర తొండంగి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఆటోవాలాలను రోడ్డుకీడ్చిందని విశాఖ కంచరపాలేనికి చెందిన ఆటోవాలా చింతకాయల శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలన్న డిమాండ్తో విశాఖపట్నం నుంచి అమరావతికి పాదయాత్ర సాగిస్తున్నాడు. అతని పాదయాత్ర సోమవారం తొండంగి మండలం జాతీయ రహదారి నుంచి సాగింది. ఈ సందర్భంగా అతను ‘సాక్షి’తో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉచిత పథకాలతో పాలనను భ్రష్టు పట్టించిందని ఆరోపించిన కూటమి నేతలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసి ఆటోవాలాల జోవనోపాధిపై దెబ్బకొట్టారన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న యువకులు, మధ్య వయస్కులు ఎందరో ఆటోలు నడుపుతూ జీవనోపాధి పొందుతున్నారన్నారు. ఫైనాన్స్ కంపెనీలపై ఆధారపడి ఆటోలు కొనుగోలు చేసి ప్రతి నెలా ఫైనాన్స్ చెల్లించుకుంటూ ప్రభుత్వానికి ట్యాక్స్లు, బీమా, అప్పుడప్పుడు ఫైన్లు చెల్లిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని అన్నారు. ఉచిత బస్సు పథకంతో ప్రస్తుతం ఆటోవాలాలంతా రోడ్డున పడ్డారన్నారు. ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 2న విశాఖ నుంచి అమరావతికి పాదయాత్ర ప్రారంభించానని, తమ మనోవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకూ పోరాడతానని వివరించారు. -
స్కానింగ్ సెంటర్ సీజ్
కాకినాడ క్రైం: కాకినాడలోని నూకాలమ్మ గుడి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్కానింగ్ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు సోమవారం డీఎంహెచ్వో డాక్టర్ నరసింహ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో స్కానింగ్ సెంటర్లో తనిఖీలు చేసి కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు, ఆర్డీఓ మల్లిబాబు సమక్షంలో సీజ్ చేశామని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారన్న ఓ మహిళ ఫిర్యాదుతో డీఐఓ డాక్టర్ సుబ్బరాజు బృందం తనిఖీలు చేపట్టిందన్నారు. చట్టం ఉల్లంఘించిన నేపథ్యంలో వివరణ కోరగా సమాధానం సంతృప్తికరంగా లేదని వెల్లడించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేశామని డీఎంహెచ్ఓ తెలిపారు. మభ్యపెట్టి.. చోరీ చేసి ఫ ఇద్దరు నిందితుల అరెస్ట్ ఫ రూ.రెండు లక్షలు, బంగారం స్వాధీనం అన్నవరం: కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు, ఆటోలే వారి లక్ష్యం.. అందుకే సాటి ప్రయాణికుల్లా వెళ్తారు.. అందికాడకు దోచుకుంటారు.. ప్రయాణికులను మభ్యపెట్టి వారి బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న ఇద్దరు మహిళలను అన్నవరం పోలీసులు సోమవారం ఆరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. రెండు లక్షలు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను అన్నవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గత నెల 13న కత్తిపూడిలో ఆటోలో వెళ్తున్న ఓ మహిళ దృష్టి మరల్చి ఆమె బ్యాగ్ నుంచి రూ. రెండు లక్షలు అపహరించినట్టు అక్కడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే విధంగా ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో ప్రయాణిస్తున్న మహిళల నుంచి బంగారం దొంగిలించినట్లు ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారం ఉదయం కత్తిపూడి ఫ్లైఓవర్ దిగువన ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా వారు ఆ నేరాలు చేసినట్టు అంగీకరించారని సీఐ తెలిపారు. నిందుతులు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని డ్రైవర్స్ కాలనీ తారకనగరానికి చెందిన తొండ శాంతి, అదే ప్రాంతానికి చెందిన ఆవుల భూలక్ష్మిగా గుర్తించారు. వీరి నుంచి రూ.రెండు లక్షలు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ ప్రత్తిపాడు కోర్టులో హాజరు పర్చనున్నారు. సందట్లో సడేమియా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేపథ్యంలో హడావుడిలో ఉండగా, కొందరు చేతివాటం ప్రదర్శించి ఆభరణాలు, నగదు అపహరించే వీలుందని సీఐ తెలిపారు. అందువల్ల ప్రయాణ సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు, క్రైమ్ సిబ్బంది, కానిస్టేబుళ్లు రమణ, శ్రీనివాస్, హోంగార్డు అన్నపూర్ణలను అభినందించారు. -
కొత్త కోటపాడులో డయేరియా
రంగంపేట: మండలంలోని కొత్త కోటపాడు గ్రామంలో డయేరియా ప్రబలింది. వాంతులు, విరేచనాలతో పలువురు మంచాన పడ్డారు. కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఆ గ్రామంలో నమోదైన డయారియా కేసులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం కొత్త కోటపాడులో ప్రత్యేక వైద్య బృందంతో శిబిరం నిర్వహించి, బాధితులకు చికిత్స అందించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి కేసులపై విచారణ జరిపారు. ప్రభావిత ఇళ్లలో పారిశుధ్య చర్యలు చేపట్టగా, నీటిలో క్లోరినేషన్ పనులు చేయించారు. కొత్త కోటపాడులో 234 ఇళ్లలో 973 జనాభా ఉండగా, నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. పరిస్థితి నియంత్రణలో ఉందని వైద్యాధికారులు తెలిపారు. వినాయక చవితి ప్రసాదం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగి డయేరియా వచ్చి ఉండవచ్చని చెప్పారు. -
వరద ముంచేను
ఫ గోదావరి తగ్గడంతో కోలుకుంటున్న లంకలు ఫ పంటల సంరక్షణకు జాగ్రత్తలు అవసరం ఆలమూరు: వరద వచ్చింది.. నిండా ముంచేసింది.. లంకలను అతలాకుతలం చేసింది.. చివరికి వెనక్కి తగ్గినా బురదే మిగిల్చింది.. ఈ ఏడాది గోదావరికి మూడు సార్లు వరద వచ్చింది.. లంకల్లో వందల ఎకరాల పంటలను నీట నాన్చింది. చాలాచోట్ల పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. మిగిలిన పంటలను రక్షించుకునేందుకు ఉద్యాన రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. గోదారమ్మ శాంతించడంతో ఇప్పుడిప్పుడే లంక భూములు కోలుకుంటున్నాయి. వరద తాకిడికి గురైన ఉద్యాన పంటలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే నష్టం తప్పదు. ఒక్కోసారి వివిధ రకాల తెగుళ్లు సోకి పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నీట మునిగిన పంటను ఏవిధంగా సంరక్షించుకోవాలో వివరిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేట, మండపేట, రాజానగరం, రాజమహేంద్రవరం రూర ల్, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో వందలాది ఎకరాల కూరగాయల పంటలు వరద నీటి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ పంట భూముల్లో వరద నీరు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండడంతో జింక్, పొటాష్, నత్రజని పోషకాలతో పాటు ఇనుము ధాతు లోపం ఏర్పడుతుంది. వాతావరణంలో తేమ అధికంగా ఉండడం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ తెగుళ్ల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఉద్యాన పంటలను కాపాడుకోవచ్చని జిల్లా ఉద్యాన శాఖాధికారి పీవీ రమణ వివరించారు. ● ఆకుముడత: వరదల వల్ల కూరగాయ మొక్కల ఆకులు ముడుచుకుపోతాయి. అలాగే చీడపీడలు ఆశించినప్పుడు కూడా ఈ తెగులు సోకి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ● చీడపీడలు: వరదల వల్ల పొలాల్లో తేమ పెరిగి చీడపీడలు పెరిగి పంటలు నాశనమవుతాయి. ● వేరుకుళ్లు: వరద నీరు రోజుల తరబడి పొలాల్లో ఉంటే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈ శిలీంధ్ర తెగులు వస్తుంది. కరవు సంభవించిన సమయంలో కూడా ఈ తెగులు ప్రభావం ఉంటుంది. ● కాండం కుళ్లు: స్ల్కీ రోషియం ఒరైజా అనే శిలీంధ్రం ద్వారా ఈ తెగులు సోకుతుంది. దీనివల్ల కూరగాయల మొక్క కాండం కుళ్లిపోయి పంట తీవ్రంగా దెబ్బతింటుంది. ● కీటకాల వృద్ధి: వరదలు సంభవించిన తరువాత ఉద్యాన పంటల్లో ఎక్కువగా ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో పాటు అగ్ని చీమలు, దోమలు, బొద్దింకలు వృద్ధి చెందుతున్నాయి. ఈ కీటకాలు మొక్కల ఆకులను తినేసి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. నివారణ చర్యలు ఫ లంక భూమి వాలును అనుసరించి పొలాల్లోంచి వరద నీరు పోయే విధంగా అరడుగు వెడల్పు గల కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. ఫ నీరు ఇంకిపోయిన తరువాత వీలైనంత మేర నేలను ఆరనివ్వాలి. ఫ జింక్ లోప నివారణకు 0.2 శాతం జింక్ సల్ఫేట్ను పిచికారీ చేయాలి. నత్రజని లోప నివారణకు ఒక గ్రాము కార్బన్డైజమ్ లేదా రెండు గ్రాముల కార్బన్డైజమ్తో పాటు మాంకోవెబ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఫ ఇనుము ధాతులోపం నివారణకు 0.2 శాతం పెర్రస్ సల్ఫేట్ను వేయాలి. ఫ పొటాష్, నత్రజని లోపాల నివారణకు పంట దశను అనుసరించి 0.5 శాతం నుంచి 1.0 శాతం పొటాష్ నైట్రేట్ను పిచికారీ చేయవచ్చు. దొండ సాగుపై ప్రత్యేక శ్రద్ధ వరదల సమయంలో దొండ సాగు పట్ల ఉద్యాన రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సాధారణంగా వరద నీరు నిల్వ ఉండటం వల్ల దొండ పాదుల్లో చల్లని వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ముఖ్యంగా బూజు, బూడిద తెగులు ఆశించే ప్రమాదముంది. బూజు తెగులు నివారణకు మాంకోజెల్ లేదా మెటాలాక్సిల్ 2 మిల్లీ లీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. బూడిద తెగులు నివారణకు ట్రైడీమార్ఫ్ లేదా డైనోకాప్ ఒక మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి వేయాలి. సోకే తెగుళ్లువరద నీటిలో చిక్కుకున్న కూరగాయ పంటలకు సాధారణంగా ఆకుముడత, చీడపీడలు, వేరుకుళ్లు, కాండం కుళ్లు తదితర తెగుళ్లు సంభవించే అవకాశం ఉంది. ఉద్యాన పంటలను సస్యరక్షణ చర్యల ద్వారా కాపాడుకోవచ్చు. -
మార్కెట్లోకి హోండా షైన్ 100 డీఎక్స్
కంబాలచెరువు: రాజమహేంద్రవరం మై హోండా షోరూమ్లో హోండా షైన్ 100 డీఎక్స్ కొత్త బైక్ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ వాహనం అందుబాటులోకి వచ్చిందని హోండా కంపెనీ స్టేట్ హెడ్ శరద్ఉండ్రే, ఏరియా సేల్స్ మేనేజర్ రక్షిత్, షోరూమ్ జీఎం ఎం.కోటేశ్వరరావు తెలిపారు. హోండా షైన్ 100 డీఎక్స్ అత్యధిక మైలేజీ ఇచ్చే విధంగా తయారైందన్నారు. దీనితో పాటు వాహనానికి డిజిటల్ మీటర్, ట్యూబ్ లెస్ టైర్, హెన్హేస్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ వంటివి ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్నవారు వచ్చి వాహనం టెస్ట్ డ్రైవ్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. -
వీధి ఆవుకు అత్యవసర శస్త్రచికిత్స
ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్ల తొలగింపు అమలాపురం టౌన్: అమలాపురంలో ఓ వీధి ఆవుకు పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ ఎల్.విజయరెడ్డి సోమవారం అత్యవసర శస్త్రచికిత్స చేసి, ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. స్థానిక ఫైర్స్టేషన్ వద్ద ఓ వీధి ఆవు కదలేని పరిస్థితుల్లో ఉండి నోరు, ముక్కు వెంబడి తిన్న ఆహారం బయటకు వచ్చేస్తుందని గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు డాక్టర్ విజయరెడ్డికి సమాచారం అందించారు. తక్షణమే ఆయన పశువుల అంబులెన్స్–1992 వాహనంలో తన సిబ్బందితో వీధి ఆవు వద్దకు చేరుకున్నారు. ఆవు పొట్ట ఉబ్బి ఇబ్బంది పడుతున్న సమయంలో డాక్టర్ విజయరెడ్డి తక్షణమే ఆవు కడుపు భాగంలో అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి ఐదు కిలోల ప్లాస్టిక్ కవర్లను తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ తెలిపారు. గో ప్రేమికులు స్వామి, పుల్లయ్య, పశు వైద్య సిబ్బంది వెంకటేష్, యశ్వంత్ తదితరులు సహకారం అందించారు. -
జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని ఈఏఆర్ ఎయిడెడ్ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న లక్ష్మీశ్రీ సాయి జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికై ంది. ఏపీ రాష్ట్ర సబ్ జూనియర్ ఫుట్బాల్ జట్టు తరఫున గత నెల 25 నుంచి 30వ తేదీ వరకూ ఛత్తీస్ఘడ్, నారాయణపూర్లో జరిగిన జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరచడంతో ఆమెను ఎంపిక చేశారు. పాఠశాల కరస్పాండెంట్ కె.ప్రభాకరరావు, హెచ్ఎం పి.షాలిని సౌజన్య, ఉపాధ్యాయులు, పీఈటీ సయ్యద్ షఫీ ప్రోత్సాహమే తన విజయానికి కారణమని లక్ష్మీశ్రీసాయి తెలిపింది. సోమవారం పాఠశాల క్రీడా సంఘం నిర్వహించిన సమావేశంలో ఆమెను మెమెంటోతో సత్కరించారు. -
ఎంపీడీఓలు జాబ్చార్ట్పై అవగాహన పెంచుకోవాలి
సామర్లకోట: ఎంపీడీఓలు తమ జాబ్చార్ట్పై అవగాహన పెంచుకోవాలని, ఇదే తరుణంలో గ్రామ పంచాయతీలను సొంత వనరులతో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని విస్తరణ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు ఎంపీడీఓలకు నిర్వహించే శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో పదోన్నతి పొందిన 50 మందికి రెండో బ్యాచ్లో శిక్షణ జరుగుతుందన్నారు. ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలను వైస్ ప్రిన్సిపాల్ పరిచయం చేసుకున్నారు. గ్రామ పంచాయతీలకు సొంత వనరుల సమీకరణ, ఆర్థిక సుస్థిరత ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిధుల రూపంలో అందిస్తున్న ఆర్థిక సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు సరిపోదన్నారు. గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి, సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను చేపట్టాల్సి ఉంటుందని అన్నారు. పనులు నిర్వహించే సమయంలో మండల పరిషత్తు పాలక మండలి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎంపీపీల నిర్ణయాలను పాటించాల్సిన పనిలేదన్నారు. ఎంపీడీఓలు విధుల నిర్వహణలో మండల పరిషత్తుకు, ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తొలిరోజు ఫ్యాకల్టీలు ఎస్ఎస్ శర్మ, డి.శ్రీనివాసరావు, కె.సుశీల శిక్షణ ఇచ్చారు. -
గౌరవ వేతనం ఆపడం సరి కాదు
● ఇమామ్లు, మౌజన్లకు 11 నెలలుగా వేతనాలు లేవు ● జేసీకి వినతి పత్రం అందచేసిన మైనార్టీ నాయకులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఇమామ్లు, మౌజన్లకు గౌర వవేతనం ఆపడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు అన్నారు. సోమవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మైనార్టీ నాయకులతో వేణు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్లో జేసీ మేఘా స్వరూప్కి వినతి పత్రం అందచేశారు. మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా అలీ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం వల్లనే ఇమామ్లు, మౌజన్లు జీవనోపాధి పొందుతూ మసీదుల నిర్వహిస్తున్నారన్నారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో ఒకసారి ఆలోచించాలని ప్రభుత్వానికి విన్నవించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏ నెలా బకాయి లేకుండా గౌరవ వేతనాలు విడుదల చేశారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనాలను పెంచి మసీదులకు అందించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లిం సామాజిక వర్గం అన్ని రంగాలలోనూ వివక్షకు గురై తీవ్ర వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 118 మసీదుల నిర్వహణ ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంపై ఆధారపడి జరుగుతోందన్నారు. జిల్లా వ్యాప్తంగా మసీదులకు బకాయి ఉన్న రూ.1,94,70,000 గౌరవ వేతనాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎటువంటి ఆదాయ మార్గాలు లేని మసీదులకు అంతకు ముందున్న చంద్రబాబు ప్రభుత్వం ఎనిమిది వేలు అందిస్తుంటే గత ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిన మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్రెడ్డి దానిని రెట్టింపు చేసి ప్రతి నెల రూ.15 వేలులు అందజేసేవారన్నారు. అధికారంలోకి వచ్చేందుకు మైనార్టీలకు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా గతం నుంచి అందిస్తున్న సంక్షేమాన్ని సైతం ఇలా వివక్షా పూరితంగా అడ్డుకోవడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. తక్షణమే గౌరవ వేతనాలు విడుదల చేయని పక్షంలో అన్ని మసీదు కమిటీలతో పాటు ముస్లిం సంఘాలను, మానవతావాదులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు ఆరిపుల్ల ఖాన్, జిల్లా మైనార్టీ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి షేక్ ఇబ్రహీం, షేక్ చానా, షేక్ మస్తాన్, మదీనా భాష, ప్రింటు భాయ్, పలు మసీదుల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
బాబూ.. లోడెత్తాల !
బాబూ.. లోడెత్తాల !● యూరియా కోసం రైతుల అగచాట్లు ● లోడు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ● అవసరమైన మేరకు అందుబాటులో ఉంచడంలో కూటమి ప్రభుత్వం విఫలం ● వచ్చిన యూరియాను తన్నుకుపోతున్న కూటమి నేతలు ● తమ అనుయాయులకు అందజేస్తున్న వైనం ● పీఏసీఎస్ల వద్ద అన్నదాతల పడిగాపులు ● వచ్చినా.. బస్తా యూరియాకు తప్పని కుస్తీ సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం కర్షకులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. పంటల సాగుకు కీలకమైన దశలో యూరియా, ఎరువులు అందించడంతో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. సకాలంలో ఎరువులు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అరకొరగా అందుబాటులో ఉంచుతూ ఆందోళనకు గురి చేస్తోంది. వెరసి రైతు సేవా కేంద్రాలు, సొసైటీ కార్యాలయాల్లో ఎరువుల నిల్వలు నిండుకున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అల్లాడుతున్నారు. అమావాస్యకో.. పున్నానికో వస్తున్న వాటిని సైతం కూటమి నేతలు తన్నుకుపోతున్నారు. ముందుగానే పసిగట్టి గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇవేమీ తెలియని రైతులకు మాత్రం సొసైటీ కార్యాలయాల వద్ద నిరీక్షణ తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి తలెత్తిందని రైతులు వాపోతున్నారు. పీఏసీఎస్ కార్యాలయాల వద్ద పెద్ద క్యూలు దర్శనమిస్తున్నాయి. రైతులు అంత ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం తనకు పట్టదన్నట్లు వ్యవహరిస్తోంది. అవసరం కొండంత.. రైతులకు అవసరమైన మేరకు ఎరువులు, యూరియా సరఫరా కావడం లేదు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో అత్యధికంగా వరి 76,941 హెక్టార్లలో సాగు చేశారు. 70 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు వేశారు. ప్రస్తుతం పంటలు కీలక దశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల వ్యవధిలో ఎరువులు, యూరియా అవసరం ఉంది. కానీ డిమాండ్ తగ్గట్టు అందుబాటులో లేకపోవడంతో రైతుల్లో కలవరం నెలకొంది. ఈ ప్రభావం పంటల దిగుబడిపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్లో 61,692 మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ నేటికి 16,659 మెట్రిక్ టన్నులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎరువుల కొరత ఎలా ఉందో అర్థం అవుతోంది. డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ ఫాస్పేట్ వంటి ఎరువుల వినియోగం పెరిగిపోయింది. సకాలంలో ఎరువులు లేకపోతే పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యూరియాకు అత్యధిక డిమాండ్ ప్రస్తుతం వివిధ పంటల దశలను బట్టి చూస్తే యూరియా అవసరం అధికంగా ఉంది. అందుకు అనుగుణంగా యూరియా అందుబాటులో లేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే యూరియా కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్లు, ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో బస్తా యూరియా కూడా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్కు 26,465 మెట్రిక్ టన్నుల యూరియా ఆవస్యకత ఉంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 13,195 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర ఎరువుల అవసరం ఉంటే.. కేవలం 1,456 మెట్రిక్ టన్నులు మాత్రమే కూటమి ప్రభుత్వం అందించింది. అందులో యూరియాను పరిగణలోకి తీసుకుంటే సెప్టెంబర్ మాసానికి మాత్రం 5,890 మెట్రిక్ టన్నులు సరఫరా కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 950 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన స్టాక్ ఎప్పుడొస్తుందన్న మీమాంస నెలకొంది. బ్లాక్ మార్కెట్కు తరలింపు జిల్లాకు వారంలో ఒకటి, రెండుసార్లు యూరియా సరఫరా అవుతోంది. యూరియా వస్తుందన్న సమాచారం ముందస్తుగా ఆయా పీఏసీఎస్ల పరిధిలోని కొందరు అధికారులు కూటమి నేతలకు సమాచారం అందిస్తున్నారు. ఇదే అదనుగా రంగంలోకి దిగుతున్న కూటమి నేతలు యూరియాను తన్నుకుపోతున్నారు. తమ అనుయాయులకు కట్టబెడుతున్నారు. కొందరు అవసరం కంటే ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంటే.. మరి కొందరేమో బ్లాక్ మార్కెట్లో అత్యధిక ధరకు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. వెరసి రైతులకు మద్దతు ధరతో యూరియా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. పీఏసీఎస్ల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చుని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంటోంది. టీడీపీ మద్దతు దారులు దర్జాగా ఎరువులు పక్కదారి పట్టిస్తున్నారు. అధిక ధరలకు విక్రయం యూరియా కొరతను సాకుగా తీసుకుంటున్న ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సగటున ఒక్కో మండలంలో ఏడాదిలో 4,500 టన్నుల నుంచి 15 వేల టన్నుల వరకు ఎరువులు వినియోగిస్తున్నారు. టన్నుపై రూ.4 వేల వరకు ఎరువుల భారం రైతులపై పడుతోంది. ఈ ప్రభావం చిన్న, సన్నకారు రైతులపై పడుతోంది. యూరియా 45 కేజీల బస్తా ప్రభుత్వ నిర్ణయించిన ధర ప్రకారం రూ.266.70 చేసి విక్రయించాల్సి ఉంది. కానీ ప్రైవేట్ దుకాణాల దారులు డీలర్లు బస్తాను రూ.330 నుంచి రూ.390 చేసి విక్రయిస్తున్నారు. ఆర్ఎస్కే, పీఏసీఎస్ల వద్ద యూరియా అమ్మకాలకు ఆధార్ లింక్ చేయడం, ఎకరాకు అరబస్తా మాత్రమే ఇస్తామనే నిబంధనలతో రైతులకు పూర్తి స్థాయిలో యూరియాను అందుబాటులో ఉంచడం లేదు. ఇలా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా కోసం యుద్ధం ● యూరియా కోసం రైతులు యుద్ధం చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో అధికారులు ప్రకటిస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. ● కొవ్వూరు నియోజకవర్గం గజ్జరం, అన్నదేవరపేట, మలకపల్లి, రాగోలపల్లి సొసైటీల వద్ద యూరియా కోసం రైతులు తరచూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. ఎంత యూరియా వచ్చింది, ఎంతమంది రైతులకు సరఫరా చేస్తున్నారన్న వివరాలు తెలియడం లేదు. రైతుకు 10 ఎకరాలు లేదా ఎన్ని ఎకరాలు ఉన్నా రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, ఇలా అయితే ఎలా సరిపోతుందని అంటున్నారు. ఆధార్ కార్డుపై యురియా సరఫరా చేయడం సరైన విధానం కాదని, కౌలు కార్డులు, పాస్బుక్ల అధారంగా యూరియా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ● సీతానగరం మండలంలో నిత్యం యూరియా కోసం యుద్ధాలు తప్పడం లేదు. వస్తున్న సరకు ఏ మవుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. లారీ యూరియా వస్తే.. నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోతోంది. రైతులు మాత్రం క్యూలో అలా నిల్చోవాల్సిన పరిస్థితి దర్శనమిస్తోంది. ● కోరుకొండలో ఇటీవల యూరియా పంపిణీలో వివాదం చోటు చేసుకుంది. లారీ యూరియా వచ్చినా.. అక్కడున్న రైతులకు మాత్రం అందలేదు. వచ్చిన సరకంతా ఏమైందంటూ రైతులు అధికారులను ప్రశ్నించడం, అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడం, రైతులు ఒక్కసారిగా పీఏసీఎస్ కార్యాలయం వైపు దూసుకెళ్లడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ● గాదరాడ వద్ద అధికారులు తమకు కావాల్సిన ఒక్కో రైతుకు 5 నుంచి 10 బస్తాల యూరియా ఇచ్చేస్తున్నారు. ఆకస్మిక పర్యటనకు వెళ్లిన కలెక్టర్ పి.ప్రశాంతి దృష్టికి సమస్య రావడంతో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇవ్వాల్సి ఉండగా.. ఎక్కువగా ఎందుకిచ్చారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ఎక్కువగా ఇచ్చిన బస్తాలను రికవరీ చేయా లంటూ తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ● రంగంపేట మండలం వడిశలేరు సొసైటీ వద్ద ఇటీవల ఎరువుల కోసం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తెల్లవారుజామున నుంచే రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. కేవలం ఈ గ్రామాల్లోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలే దర్శనమిస్తున్నాయి.జిల్లాలో ఎరువుల వివరాలు ఇలా (మెట్రిక్ టన్నుల్లో)... ఎరువులు ఖరీఫ్లో సెప్టెంబర్ ఇప్పటి వరకు ఆవశ్యకత నెల అవసరం సరఫరా యూరియా 26,465 5,890 950 డీఏపీ 6,420 736 0 ఎంఓపీ 4,806 1,795 267 ఎన్పీకేఎస్ 18,607 3,564 203 ఎస్ఎస్పీ 5,394 1,210 36‘అన్నదాత పోరు’ను జయప్రదం చేయండి యూరియా, ఎరువుల కొరత నివారించాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ రైతులకు బాసటగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ పేరుతో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కొవ్వూరు, రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయాల వద్ద అన్ని నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్లు, పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై గళమెత్తుతాం. రాజమహేంద్రవరం రూరల్, సిటీ, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల శ్రేణులు రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయం వద్ద, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల శ్రేణులు కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతాం. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలి. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
ఆటిజం.. అవగాహనతో దూరం
● బాల్యంలో వేధిస్తున్న మందబుద్ధి సమస్య ● ప్రతి వంద మందిలో ఇద్దరికి వచ్చే అవకాశం ● జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు రాయవరం: పేరు పెట్టి పిలిచినా పలకక పోవడం, ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, వారి వైపు చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, మిగిలిన చిన్నారులతో కలవక పోవడం వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న చిన్నారుల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాలతో మన దేశంలో ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరు ఇటువంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనల్లో వెల్లడైంది. కోవిడ్ తర్వాత ఆటిజం లక్షణాలు ఉన్న చిన్నారులు అధికమయ్యారని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం భవిత కేంద్రాల ఆధ్వర్యంలో ఆటిజం కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించింది. ఇందులో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరు చేశారు. జిల్లాలో 22 మండలాల్లో ఇప్పటికే 22 భవిత కేంద్రాలు ఉన్నాయి. వారిలోనూ నైపుణ్యాలు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. వారిలా ఉండమని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఆటిజం సమస్యలు తగ్గుతాయని భావిస్తుంటారు. ఈ పద్ధతి ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. అలాగే ఆటిజం ఉన్నవారిలో కూడా ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. ఇలా ఆటిజం ఉన్నప్పటికీ అద్భుతమైన విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. అందుకే ఈ చిన్నారుల్లో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉంది. భవిత కేంద్రాల తరహాలో.. జిల్లా పరిధిలోని అమలాపురం, మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీలో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు సమగ్ర శిక్షా అధికారులు చర్యలు చేపట్టారు. ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు భవిత కేంద్రాల్లో తరహాలోనే ఈ కేంద్రాల్లో ఆటిజం బాధితులకు సేవలు అందిస్తారు. బాధిత చిన్నారులను పూర్వపు స్థితికి తీసుకువచ్చి అందరిలో కలిసేలా చేసేందుకు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే వీటికి ప్రత్యేక భవనాలు నిర్మించడంతో పాటు సిబ్బందిని నియమించే అవకాశముంది. ఒక్కో భవనానికి రూ.27.75 లక్షల చొప్పున అందజేయనున్నారు. ఈ నిధులతో రెండు గదులు నిర్మిస్తారు. ఫిజియోథెరపీ, ఆటపాటలతో కూడిన బోధన అందించనున్నారు. ఆటిజంతో బాధపడే చిన్నారులను తీసుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం(బస్టాండ్) ఉన్న ప్రదేశాలకు దగ్గరలోనే కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మానసిక పరిస్థితి మెరుగు ప్రస్తుతం భవిత కేంద్రాల్లో ఆటిజంతో బాధపడే చిన్నారులకు కూడా సేవలందిస్తున్నారు. ప్రత్యేక అవసరాలు, ఆటిజం బాధితులకు ఒకేచోట సేవలు అందించడం ఇబ్బందిగా మారడంతో ఆటిజంకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. స్పీచ్ లాంగ్వేజ్, వ్యక్తిగత ప్రవర్తన, ఆక్యుపేషనల్, మ్యూజిక్ థెరపీ శాసీ్త్రయంగా సాధన చేయించనున్నారు. ప్రాథమిక దశలోనే లక్షణాలు గుర్తించి చికిత్స చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. త్వరలో ఏర్పాటు చేస్తాం.. జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. ఈ కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై పరిశీలన చేస్తున్నాం. వచ్చే చిన్నారులకు అనువుగా సెంటర్లను ఎంపిక చేయనున్నాం. రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. – జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టర్, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, జిల్లా సమగ్ర శిక్షాభియాన్ -
సిబ్బందితో గొడవలొద్దని ఈఓకు ఆదేశాలు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సిబ్బందితో సమన్వయం చేసుకుని పాలన సాగించాలని, చిన్న చిన్న కారణాలతో సిబ్బందితో ఘర్షణ పడవద్దని ఈఓ వీర్ల సుబ్బారావును దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ సోమవారం ఆదేశించారు. దేవస్థానంలో ఈఓ కుటుంబ సభ్యుల జోక్యం, సిబ్బందిని అవమానించేలా ఈఓ మాట్లాడడం వంటి వాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో కొందరు సిబ్బంది సెలవుకు దరఖాస్తు చేయడం, కొంతమంది వీఆర్ఎస్ తీసుకునేందుకు నిర్ణయించడం వంటివి జరిగాయి. ఆ సందర్భంగా గత ఏప్రిల్ 16వ తేదీన సాక్షి దినపత్రికలో ‘చినబాబొచ్చారు బహుపరాక్’ శీర్షికన, అదే నెల 18వ తేదీన ‘నీ కొలువుకు సెలవు స్వామీ’ శీర్షికన వార్తలు ప్రచురితమయ్యాయి. ఆ వార్తలకు స్పందించిన దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఈఓ వ్యవహారశైలిపై వచ్చిన ఆరోపణలపై, సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలపై విచారణ చేయాలని అడిషనల్ కమిషనర్ ఎస్.చంద్రకుమార్ను ఆదేశించారు. ఆయన ఏప్రిల్ 27న విచారణ జరిపి తన నివేదికను కమిషనర్కు సమర్పించారు. విచారణలో ఈఓ వ్యవహార శైలిపై సిబ్బందిలో తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం వాస్తవమేనని తేలిందని కమిషనర్ తన ఆదేశాలలో పేర్కొన్నారు. దేవస్థానంలో సిబ్బంది తో సమన్వయం చేసుకుని భక్తులకు ఇబ్బంది కలుగకుండా సేవలందించడం ఈఓ ప్రథమ కర్తవ్యమని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. సిబ్బందితో వివాదాలు లేకుండా పరిపాలన సాగించాలని ఈఓను ఆదేశించారు. -
కదలిన ఉద్యాన అధికారులు
పెరవలి: జిల్లాలో కంద రైతులు పడుతున్న పాట్ల గురించి ‘చేతికందని కష్టం’ శీర్షికన సాక్షి దినపత్రిలో ఈ నెల 7వ తేదీన కథనం వెలువడటంతో జిల్లా ఉద్యానవన ఽఅధికారులు స్పందించి పొలం బాట పట్టారు. మార్కెట్లో కంద పంటకు గిట్టుబాటు ధర లభించకపోవటం వలన ఎకరానికి రూ.2.25 లక్షలు నష్టపోవటంతో కంద రైతులు కంటిమీద కునుకులేకుండా ఉంటున్నారు. జిల్లా ఉద్యానవన పీడీ ఏ దుర్గేష్ పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామం వచ్చి కంద రైతు బొలిశెట్టి వెంకటేశ్వరరావుని కలసి కంద చేనుకు పెట్టుబడి, దిగుబడి, మార్కెట్టులో లభిస్తున్న ధరల గురించి ఆరా తీశారు. రైతుల సమస్యలు మార్కెటింగ్ శాఖకు వివరిస్తామని, కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామని అధికారులు చెప్పారు. కందరైతులు ఇప్పటికే చాలా నష్టపోయామని అఽధికారులు పట్టించుకోకపోతే తీవ్ర నష్టాలు పాలవుతామని చెప్పారు. ఉద్యానవన అధికారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్ను ముట్టడించిన ఆందోళనకారులు అనపర్తి : మహిళలపై దాడి చేసి గాయపరిచిన నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించకుండా అదుపులోకి తీసుకుని స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపిస్తూ ఊలపల్లి గ్రామానికి చెందిన బాధిత వర్గానికి చెందిన వారు సోమవారం సాయంత్రం భారీగా తరలివచ్చి బిక్కవోలు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ నెల 6న వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో మరో వర్గానికి చెందిన వారిపై అందిన ఫిర్యాదు మేరకు బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా నిందితులపై చర్య లు తీసుకోకపోవడంతో పాటు వారిని స్వేచ్ఛగా వదిలేశారని ఆరోపిస్తూ బాధిత వర్గం వారు స్టేష న్ వద్దకు భారీగా చేరుకుని న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక పోలీసులతో ఆందోళనకారుల ను కట్టడి చేశారు. అనపర్తి సీఐ సుమంత్ ఆందోళ నకారులతో చర్చలు జరిపి నిందితులను అదుపులోకి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. రుడా వైస్ చైర్మన్గా జేసీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు. -
మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యం మత్తులో ఒక రౌడీషీటర్, మరో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. రాజమహేంద్రవరంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళి ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా కోటిపల్లి బస్టాండ్ వద్దకు వెళ్లారు. అక్కడ ఓ జ్యూస్ షాప్ వద్ద రాజమహేంద్రవరం రూరల్ మండలం రాజవోలు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ కర్రి దుర్గా సూర్యప్రసన్నకుమార్, రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్, ధవళేశ్వరానికి చెందిన వినోద్కుమార్ మద్యం మత్తులో వేరే వ్యక్తులతో గొడవపడుతున్నారు. వారిని నాగబాబు, కాళి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన సూర్యప్రసన్నకుమార్, హరీష్, వినోద్కుమార్ కలిసి కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళిపై దాడి చేశారు. దుర్భాషలాడుతూ అర్ధగంటకు పైగా కదలనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం కానిస్టేబుల్, హోంగార్డు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల దాతృత్వం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ బ్రాంచ్ విద్యార్థుల కోసం రూ.2.5 లక్షల విలువైన హైడ్రాలిక్ ల్యాబ్కు సంబంధించిన 5 మెషీన్లను పూర్వ విద్యార్థులు బహూకరించారు. ఆదివారం హైడ్రాలిక్ ల్యాబ్ను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.మురళి ప్రారంభించగా ఆయనకు మెషీన్లు అందజేశారు. ముందుగా పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్తో పాటు కంప్యూటర్, మెకానికల్, ఎలక్ట్రానిక్ బ్రాంచ్ హెడ్లను కలసి కళాశాల అభివృద్ధిపై చర్చించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బోరుగడ్డ జోసఫ్, కోశాధికారి కొంబత్తుల శ్రీనివాస్, సెక్రటరీ మేరుగ రత్నకిశోర్ మాట్లాడుతూ 2015లో రూ.2 లక్షలతో ఆర్వో ప్లాంట్, 2022లో ఎలక్ట్రానిక్స్ లాబ్స్కు వాటర్ లీకేజీ రాకుండా రూ. 3 లక్షలతో రూఫ్ టాపింగ్ చేశామని, నాలుగు నెలల క్రితం హాస్టల్ విద్యార్థుల కోసం చపాతీ/పూరీ మేకర్ ఇచ్చామన్నారు. పూర్వ విద్యార్థులు రాజకుమార్, కృపారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు ముంధరకొచ్చి..
● పొగాకు పంటకు మంచి రోజులు ● రైతుల మోములో ఆనందం ● కిలో గరిష్ఠ ధర రూ. 376 దేవరపల్లి: పొగాకు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.. నాలుగు రోజుల నుంచి ‘ధర’హాసం వచ్చింది.. మార్కెట్లో ధర పెరుగుతుండడంతో పొగాకు పంట పండింది.. రెండేళ్లుగా ఈ సాగు లాభసాటిగా ఉండడంతో అధిక శాతం రైతులు పంట వేశారు. మొన్నటి వరకూ కిలో గరిష్ఠ ధర రూ. 350 పలకగా, నాలుగు రోజుల నుంచి అంచెలంచెలుగా పెరుగుతోంది. శనివారం మార్కెట్లో కిలో రూ. 376 పలికింది. ఈ నెల 2న కిలో గరిష్ఠ ధర రూ. 350 ఉండగా, 3న రూ.362, 4వ తేదీన రూ. 375, 6వ తేదీన రూ.376 పలికింది. గరిష్ఠ ధరతో పాటు కిలో సగటు ధర కూడా పెరిగింది. సగటు ధర రూ. 299 పలికింది. దేవరపల్లి వేలం కేంద్రంలో గరిష్ఠంగా రూ.310 ధర పలికింది. గరిష్ఠ ధర రూ. 400 దాటుతుందని రైతులు ఆశిస్తున్నారు. ఒక దశలో కిలో గరిష్ఠ ధర రూ. 392 పలికిన పొగాకు కొద్ది రోజుల్లోనే పతనమై రూ. 350కు చేరింది. ఈ ధర దాదాపు 20 రోజులు నిలకడగా ఉంది. ఇంకా తగ్గుతుందని భయపడిన చిన్న రైతులు తమ వద్ద ఉన్న పొగాకును తక్కువ ధరకు అమ్ముకుని కొంత వరకూ నష్టపోయారు. గత ఏడాది కిలో గరిష్ఠ ధర రూ. 410, సగటు ధర రూ. 328 లభించింది. గత ఏడాది పొగాకు రైతుల ఇంట లాభాల పంట పండింది. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి కొనసాగుతుంది. రూ.1,683 కోట్ల పొగాకు విక్రయం పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి సుమారు రూ.1,683 కోట్ల విలువైన 56.29 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. 58 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో దాదాపు 80 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగినట్టు అధికారుల అంచనా. ఇప్పటి వరకూ 56.29 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా అధికారుల లెక్కల ప్రకారం మరో 32 మిలియన్ల కిలోల పొగాకు అమ్మకాలు జరగాల్సి ఉంది. బోర్డు అనుమతించిన మేరకు కోటా మరో రెండు, మూడు రోజుల్లో పూర్తి కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆశాజనకంగా దిగుబడులు ఈ ఏడాది పొగాకు నాణ్యతతో పాటు దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు అవసరమైన నాణ్యత గల పొగాకును ఇక్కడి రైతులు పండించారు. ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. దీంతో మార్కెట్లో ఎన్ఎల్ఎస్ పొగాకుకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఎగుమతి ఆర్డర్లు ఆలస్యంగాా రావడంతో కొంతకాలం మార్కెట్ ఒడిదొడుకుల్లో కొనసాగినప్పటికీ ప్రస్తుతం కోలుకుని రైతులకు అనుకూలమైన మార్కెట్ నడుస్తుంది. 4.42 లక్షల బేళ్ల కొనుగోలు ఎన్ఎల్ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో మార్చి 24న ప్రారంభమై శనివారానికి 133 రోజులు కొనుగోళ్లు జరిగాయి. 4,42,476 పొగాకు బేళ్లు కొనుగోలు చేశారు. 13 కంపెనీలు వేలంలో పాల్గొంటున్నాయి. రోజుకు సుమారు 2.60 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరుగుతున్నాయి.అనుమతి మేరకే పండించాలి పొగాకు బోర్డు అనుమతి మేరకు పంట పండించాలి. 2025–26 పంట కాలానికి బోర్డు నిబంధనలను కఠినతరం చేసింది. బ్యారన్కు 35 క్వింటాళ్ల పంట ఉత్పత్తికి అనుమతి ఉంది. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 49 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి బోర్డు నిర్ణయించింది. వచ్చే పంట కాలంలో రైతులు విధిగా పంట నియంత్రణ పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టాలి. పరిమితికి లోబడే పొగాకు సాగు చేయాలి. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం వేలం కేంద్రాల వారీగా పొగాకు కొనుగోళ్లు, గరిష్ఠ , సగటు ధరలు ఇలా.. వేలం కేంద్రం కొనుగోలు గరిష్ఠ ధర సగటు ధర (కిలోలు) (రూ.లలో) (రూ.లలో) దేవరపల్లి 97,96,452 375.00 310.73 జంగారెడ్డిగూడెం–1 1,20,41,603 376.00 298.07 జంగారెడ్డిగూడెం–2 1,19,41,952 375.00 295.73 కొయ్యలగూడెం 1,18,98,189 375.00 296.64 గోపాలపురం 1,06,20,567 375.00 300.05 -
టేకు రథంపై సత్యదేవుని ఊరేగింపు
అన్నవరం: రత్నగిరి వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి అర్చకుడు దత్తాత్రేయశర్మ తదితరులు పూజలు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను ఊరేగించి తిరిగి ఆలయానికి చేర్చారు.నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళంఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమానికి రాజమహేంద్రవరానికి చెందిన భక్తులు ఆదివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. రాజమహేంద్రవరం సత్యనారాయణపురానికి చెందిన కె.సతీష్కుమార్ ఆలయ అధికారులను కలసి ఈ విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.ఉత్సాహంగా అథ్లెటిక్స్క్రీడాకారుల ఎంపికనాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ డీఎస్ఏలో జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. దీనిని జిల్లా అథ్లెటిక్స్ సంఘ సభ్యుడు సాయి, రిటైర్డ్ కోచ్ కొండలరావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. అండర్–14, 18 బాలుర, బాలికల విభాగ ఎంపికలకు 250 మంది హాజరయ్యారు. వీరికి రన్స్, జంప్స్, త్రోస్లో ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ప్రతిభ చాటిన 35 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వీరు ఈ నెల 25 నుంచి 27 వరకూ ఏలూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలిపారు. పీడీలు బంగార్రాజు, నూకరాజు, త్రిపుల, హరిబాబు, వీరబాబు, డీఎస్ఏ కోచ్లు ప్రవీణ్, ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కారు ఢీకొని ఎనిమిది గొర్రెల మృతిపెద్దాపురం: అతి వేగంగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనలో గొర్రెల మంద మృతి చెందిన సంఘటన ఆదివారం పెద్దాపురం ఏడీబీ రోడ్డులో చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్తున్న కారు వేగంగా వస్తూ స్థానిక వెంకటేశ్వర పౌల్ట్రీ సమీపంలోని రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందను ఢీకొంది. ఈ ప్రమాదంలో గండేపల్లి మండలం సూరంపాలెం వాసి కొరికట్ల సుబ్బారావుకు చెందిన ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. కారు డ్రైవర్ను పెద్దాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
అద్దేపల్లి సాహిత్యం అందరికీ ఆదర్శం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అద్దేపల్లి రామ్మోహనరావు సాహిత్యం అందరికీ ఆదర్శనీయమని పలువురు వక్తలు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్లో ఆదివారం రాత్రి ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహనరావు సాహిత్య పురస్కారం 2025ను రాజమహేంద్రవరానికి చెందిన రెంటాల శ్రీవెంకటేశ్వరరావుకు ప్రదానం చేశారు. వయో భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ సాహిత్యంలో ప్రోత్సహించిన గొప్ప సాహితీవేత్త అద్దేపల్లి అని రాజమహేంద్రవరానికి చెందిన ఎస్ఆర్ పృథ్వీ అన్నారు. మధునాపంతుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణను వ్యతిరేకిస్తూ తన సాహిత్యంలో ప్రతిధ్వనింపజేశారన్నారు. పురస్కార గ్రహీత రెంటాల శ్రీవెంకటేశ్వరరావు మాట్లాడుతూ గజల్స్ను అర్థవంతంగా పాడి కొత్త ఒరవడికి అద్దేపల్లి శ్రీకారం చుట్టారన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా శ్రీవెంకటేశ్వరరావు దంపతులకు పురస్కారం అందించారు. ఈ సందర్భంగా వచన కవిత పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అద్దేపల్లి ప్రభు, అద్దేపల్లి రాధాకృష్ణ, వాడ్రేపు వీరలక్ష్మి, గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
భార్య కాపురానికి రాలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
బిక్కవోలు: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన వ్యక్తి కాలువలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం బిక్కవవోలులో జరిగింది. ఎస్సై వి.రవిచంద్ర కథనం ప్రకారం.. బిక్కవోలుకు చెందిన కుందేటి రవికుమార్కు సోనితో వివాహం జరిగింది. భర్తపై కోపంతో తన అమ్మ ఇళ్లయిన మండపేటకు సుమారు 3 నెలల క్రితం వెళ్లిపోయింది. ఆమె కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో రవికుమార్ స్థానిక బ్రిడ్జి పైనుంచి అందరూ చూస్తుండగా సామర్లకోట కాలువలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అదే మార్గంలో వెళ్తున్న ఎస్సై రవిచంద్ర కుమార్, ఆయన ప్రైవేట్ డ్రైవర్ గణేష్ కలసి వెంటనే కాలువ వద్దకు వెళ్లి చెట్టుకు వేలాడుతున్న అతనిని నీటిలో పడకుండా కాపాడారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్సై వివరించారు. -
స్వామీ.. నీ చెంత నీరేమీ!
● ముంపు నీట మురమళ్ల వీరేశ్వరుని ఆలయం ● ముందుకు కదలని ఆలయ పునర్నిర్మాణ పనులు ● రూ.4.50 కోట్లు మంజూరైనా మొదలు కాని వైనం ఐ.పోలవరం: ప్రసిద్ధి చెందిన మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వర్షం వస్తే ముంపునీటి వెతలు ఎదుర్కొంటుంది.. శతాబ్దాల కిందట నిర్మించిన ఈ ఆలయం కొద్దిపాటి వర్షానికే నీట మునుగుతుంది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరైనా గ్రహణం వీడడం లేదు. ఈ పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని భక్తులు ఎదురు చూస్తున్నారు. నిత్యం వందలాది మంది భక్తులు కల్యాణాలకు, దర్శనాలకు వచ్చే వస్తుంటారు. మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఇక భక్తజన కోలాహలమే. ఇక్కడి సమస్యలపై పాలకులు, అధికారులు స్పందిస్తున్న తీరును వారు తప్పుపడుతున్నారు. వృద్ధ గౌతమీ గోదావరి నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయం ప్రముఖ శైవ క్షేత్రంగా పేరొందింది. పెళ్లికాని వారు ఇక్కడ కల్యాణం చేయించుకుంటే వివాహం జరుగుతోందని నమ్మకం. దీంతో ప్రతి రోజూ ఇక్కడ 116 కల్యాణాల వరకూ జరుగుతున్నాయి. ఇది కాకుండా మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, లక్ష రుద్రాక్ష పూజలకు 20 వేల మంది నుంచి 30 వేల మంది వరకూ భక్తులు వస్తుంటారు. ఇక పుష్కరాల సమయంలో భక్తుల తాకిడి అధికం. సమీపంలోని వృద్ధ గౌతమీ నదీపాయలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. పనులు ఎప్పుడో..! ఇంతటి ప్రాముఖ్యం ఉన్న స్వామి ఆలయ పునర్నిర్మాణం ఎప్పుడో అర్థం కావడం లేదు. కొద్దిపాటి వర్షానికి ఇప్పుడున్న ఆలయం జలాశయాన్ని తలపిస్తోంది. ఆలయం చుట్టూ మోకాలు లోతు నీరు రావడంతో పాటు గర్భ గుడిలోకి సైతం నీరు చేరుతోంది. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి సైతం వర్షాలకు మునుగుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ నైరుతి సీజన్లో చెప్పుకొనే స్థాయిలో వర్షాలు లేవు. అడపాదడపా మాత్రమే ఒక మోస్తరు నుంచి భారీ కురుస్తోంది. ఈ వర్షానికి రోడ్డు నీట మునిగి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల దర్శనానికి వీలుగా ద్వారాలు వెడల్పు చేయాల్సి ఉంది. ఆలయ పునర్నిర్మాణ పనులకు రూ.4.50 కోట్లు మంజూరైన విషయం తెలిసిందే. ఈ నిధులతో ఇప్పుడున్న ఆలయాన్ని తొలగించి కొత్త ఆలయాన్ని నిర్మించాల్సి ఉంది. ఇటీవల ఈ పనులు మొదలు పెడతామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా పనులు మొదలు కాలేదు. ఇప్పుడే పనులు మొదలు పెట్టకుంటే పుష్కర సమయానికి పూర్తమవుతోందనే నమ్మకం లేదు. వెంటనే పనులు ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. -
షోడశ సంస్కారాలతో మానవ జన్మ పరిపూర్ణం
అమలాపురం టౌన్: సనాతన భారతీయ విధానంలో షోడశ సంస్కారాలు మానవ జీవనంలో ప్రధానంగా నిలిచాయని విజయనగరం శ్రీవిద్యా పీఠం అధ్యక్షుడు యనమండ్ర సుబ్రహ్మణ్యశర్మ అన్నారు. ఆదివారం అమలాపురం ఆపస్తంబ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో స్మార్తాపర విద్వత్సభ స్థానిక సత్యసాయి కల్యాణ మండపంలో జరిగింది. పరిషత్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విద్వత్సభ రజతోత్సవ సభ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా మావుళ్లమ్మ దేవస్థానం ఆస్థాన వేద పండితుడు యీవని రామచంద్ర సోమయాజి ఘనపాఠి అధ్యక్షతన జరిగిన ఆపస్తంబ పురోహిత సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 150 మందికి పైగా పురోహితులు హాజరయ్యారు. 16 విధాలైన షోడశ సంస్కారాల ద్వారా మానవ జన్మ పరిపూర్ణం అవుతుందని సుబ్రహ్మణ్యశర్మ స్పష్టం చేశారు. అలాంటి ప్రధాన సంస్కారాలను నిర్వహిస్తూ సమాజాన్ని సన్మార్గంలో నడిపించే వారే పురోహితులన్నారు. పురోహిత్యం అనేది నిబద్ధత, త్రికరణశుద్ధితో నిర్వహించాల్సిన వృత్తి అని పేర్కొన్నారు. సంస్కారాలు చేయించుకునే యజమాని క్షేమం కోరుతూ కర్మలు చేయాలని పురోహితులకు వేద ఘనపాఠీలు సూచించారు. పురోహితులు సమాజంలో మనుషులకు నిర్వహించే సంస్కారాలు, కర్మ కాండల సమయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను వివరించారు. జ్యోతిష పండితుడు చింతామణి సిద్ధాంతి మాట్లాడుతూ జ్యోతిషపరమైన విశేష అంశాలను వివరించి ముహూర్తం విలువ, విశిష్టతను తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 14 మంది విద్యార్థులకు స్మార్త పరీక్షలను ప్రథమ, ద్వితీయ కక్ష్యలతో నిర్వహించారు. పరీక్షాధికారులుగా స్మార్త పండితులు రాళ్లపల్లి సూర్య సుబ్రహ్మణ్యశర్మ, మంగిపూడి చైతన్యశర్మ వ్యవహరించారు. సభకు హాజరైన ప్రతి పురోహితునికి 10 గ్రాముల వెండి ప్రతిమను అందించారు. ఆపస్తంబ పురోహిత పరిషత్ వ్యవస్థాపకులు తోపెల్ల రామం, శ్రీపాద కరుణేందు మౌళి చిత్రపటాలకు, ఆపస్తంబ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు. పరిషత్ కార్యదర్శి ఆకొండి పవన్కుమార్, కోశాధికారి ఆకెళ్ల రాజబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పరిషత్ సభ్యులు మరువాడ వెంకన్న, తోపెల్ల చంటి, కర్రా శివయ్య, మూల పళ్లయ్య, పెద్దింటి కృష్ణ, కప్పగంతులు రాము, అనుపిండి మూర్తి, తోపెల్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. చివరిగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన పురోహితులను ఘనంగా సత్కరించారు. -
కొత్త కార్యవర్గం ఎన్నిక
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ఎన్జీఓ హోమ్లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఎన్నిక ఆదివారం ఏకగ్రీవంగా జరిగింది. మూడేళ్ల కాల పరిమితికి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కేజీకే మూర్తి, జనరల్ సెక్రటరీగా కర్రి లక్ష్మీనరసింహరెడ్డి (కేఎల్ఎన్ రెడ్డి), కోశాధికారిగా పామర్తి గోపాలరావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎండీ అక్బర్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీహెచ్ జార్జిలతో కూడిన కార్యవర్గం ఎన్నికై ంది. వీరితో పాటు జిల్లాలోని వివిధ యూనిట్ల నుంచి ఎన్నికై న ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. -
గడ్డి మందు తాగి ఆత్మహత్య
అంబాజీపేట: గడ్డి మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి సోదరుడు వెంకటేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కె.పెదపూడికి చెందిన దంగేటి సోమేశ్వరరావు అనే సోమేష్ (44) పాత్రికేయుడిగా ఉన్నారు. అతను స్థానికంగా ఉన్న కొబ్బరి తోటలో గడ్డి మందు తాగి ఉండటాన్ని స్థానికులు, బంధువులు గుర్తించారు. వెంటనే సోమేష్ను అతని కుటుంబ సభ్యులు అంబాజీపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అమలాపురం కిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై కె.చిరంజీవి వివరించారు. చెరువులో పడి వ్యక్తి మృతిపిఠాపురం: చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు గొల్లప్రోలు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. దుర్గాడకు చెందిన బొమ్మిడి వెంకటేష్ (25)కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. అతను వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 6న మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం దుర్గాడ కొత్త చెరువులో వెంకటేష్ మృతదేహం కనిపించింది. బహిర్భూమికి వెళ్లినప్పుడు కాలుజారి చెరువులో పడి మృతి చెందినట్లు భావిస్తున్నారు. దీనిపై గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికి అడ్హక్ కమిటీ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) ఆధ్వర్యంలో అడ్హక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్గా వరసల రాందాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజమహేంద్రవరంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఆదివారం జిల్లా సచివాలయ ఉద్యోగుల విస్తృత సమావేశం జరిగింది. ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు పి.గిరిప్రసాద్వర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమకు సెలవులు లభించడం లేదని, పని ఒత్తిడి విపరీతంగా పెరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేయాల్సి వస్తుందని అన్నారు. వలంటీర్ విధులను బలవంతంగా తమపై రుద్దడం, ఇంటింటా సర్వేల పేరుతో పని ఒత్తిడి పెంచడం సరికాదన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయిలో ఏపీజీఈఏ అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ పోరాడుతున్నారన్నారు. జిల్లా అధ్యక్షుడు గిరిప్రసాద్వర్మ మాట్లాడుతూ ఉద్యోగులకు అండగా నిలవడానికి ఒక చైతన్యవంతమైన సంఘం అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ముందుకు వచ్చిన సచివాలయ ఉద్యోగులను అభినందించారు. సమావేశంలో సంఘ కన్వీనర్ కోనాల శుభాకర్, కో చైర్మన్ షేక్ గౌసియా బేగం, కోకన్వీనర్ బాల రజని పాల్గొన్నారు. -
సర్వేత్రా వ్యతిరేకత
ఫ సచివాలయ వ్యవస్థపై ‘కూటమి’ కుట్ర ఫ ఉద్యోగులకు సర్వేల పేరుతో వేధింపులు ఫ అసలు విధులు పక్కనబెట్టి పనులు ఫ కొత్తగా మరికొన్ని సర్వేలకు నిర్ణయం ఫ ప్రభుత్వ తీరుపై నిరసన గళం సాక్షి, రాజమహేంద్రవరం: సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది.. ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వ్యవస్థను నీరుగార్చుతుంది.. రోజుకో నిర్ణయం తీసుకుంటూ పనిభారం పెంచుతుంది. ఇప్పటికే వలంటీర్లను సాగనంపిన సర్కారు తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై వేధింపులకు దిగుతుంది. నిర్దేశించిన విధులు కాకుండా అన్ని పనులు సచివాలయ ఉద్యోగులతో చేయిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తోంది. జాబ్ చార్ట్లో లేని పనులూ చేయిస్తోంది. వివిధ రకాల సర్వేల పేరుతో తిప్పుతుంది. సెలవు రోజుల్లో సైతం తిప్పలు పెడుతోంది. జిల్లా వ్యాప్తంగా 512 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఇందులో 119 వార్డు, 393 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 5,513 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, 4,323 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను కేవలం సర్వేలకు వినియోగిస్తుండటంతో పౌర సేవలు సక్రమంగా అందడం లేదు. చివరకు మహిళా పోలీసులను సైతం సర్వేలకు తిప్పుతుండటంతో పల్లెల్లో శాంతిభద్రతలు, నాటు సారా తయారీ, విక్రయాలు పెట్రేగిపోయాయి. సచివాలయంలో కీలక పనిచేయాల్సిన డిజిటల్ అసిస్టెంట్లు సైతం సర్వేల్లో భాగస్వామ్యం అవుతుండటంతో ప్రజా సేవలకు ఆటంకం కలుగుతుంది. ప్రజలు కార్యాలయాలకు రావడం.. తిరిగి వెళ్లడం పరిపాటిగా మారుతుంది. అగ్రికల్చర్ అసిస్టెంట్లు పొలంబడి వదిలేసి గ్రామాల బాట పడుతున్నారు. నిత్యం.. సర్వేలతో సతమతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై వేధింపుల పర్వం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వలంటీర్లు చేపట్టిన పనులన్నీ ఉద్యోగులతో చేయిస్తుంది. ప్రతి నెలా ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నామని గొప్పలు చెప్పుకొనేందుకు, వీటిని సచివాలయ ఉద్యోగుల ద్వారా అందిస్తుంది. జాబ్చార్ట్కు విరుద్ధంగా పనులు అప్పగిస్తుంది. 36 రకాలకు పైగా సర్వేలకు ఉద్యోగులను వినియోగిస్తుందంటే ఏ స్థాయిలో వేధిస్తుందో ఇట్టే అర్థం అవుతోంది. ప్రతి నెలా మొదటి తారీఖున ఉదయం 4 గంటల నుంచి ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టాల్సి వస్తోంది. ఇది మంచిదే అయినా మిగిలిన వాటిపైనా ఉద్యోగులను ఇబ్బందులు పెడుతోంది. ఓడీఎఫ్ సర్వేలో భాగంగా మురుగుదొడ్ల ఫొటోలు తీసే బాధ్యతలు సైతం సచివాలయ ఉద్యోగులకే అప్పగించింది. ఆర్డబ్ల్యూఎస్ పల్స్ సర్వేలో కుళాయిలు ఫొటోలు సైతం తీయిస్తుంది. ఉదయం 6 గంటలకు పారిశుధ్య తీరును పరిశీలించాల్సి ఉంది. 100 రోజుల హౌస్ హోల్డ్ సర్వే, ఇంటింటికీ స్టిక్కర్లు అతికించి కరపత్రాలు పంపిణీ చేసే విధులు, విజన్ 2047 పేరుతో సర్వే చేయిస్తుంది. హౌస్ టు హౌస్ జియో ట్యాగింగ్, ఎంఎస్ఎంఈ సర్వే, ప్రజా ఫిర్యాదులపై వెరిఫికేషన్ (పీఆర్ఎస్) సర్వే, ఎన్పీసీఐ లింక్ (బ్యాంక్ లింక్) వంటి కార్యక్రమాలన్నీ సచివాలయ ఉద్యోగులే చేపడుతున్నారు. వార్డు పరిపాలన కార్యదర్శులకు ఒకవైపు హౌస్ జియో ట్యాగింగ్, మరోవైపు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్ల చేయాలని లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఈ–వసూళ్లను పెంచాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. వెల్ఫేర్ సెక్రటరీలకు ఎన్పీసీఐ (బ్యాంక్ అకౌంట్కు ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ) విధులు కేటాయిస్తున్నారు. అనుకున్న సమయంలో పూర్తికాకపోతే మెమోలు జారీ చేస్తున్నారు. విగిసిపోయి విధుల బహిష్కరణ సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో నిరసన బాట పట్టారు. గతంలో వలంటీర్లు ఒక క్లస్టర్కు పరిమితమై విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం అలా కాకుండా సచివాలయ ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ క్లస్టర్లకు మ్యాపింగ్ చేశారు. బలవంతంగా ఇంటింటికీ తిరిగే విధులు అప్పగిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం నుంచి ప్రభుత్వం ఆర్భాటంగా చెబుతున్న వాట్సాప్ గవర్నెన్స్కు సంబంధించి ప్రతి ఇంటికీ వెళ్లి అవగాహన కల్పించి.. దగ్గరుండి వాట్సాప్ సర్వీసులు పొందేలా ప్రజలపై బలవంతం చేయాలన్న ఆదేశాలు వచ్చాయి. ఈ విషయమై సచివాలయ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక పిలుపు మేరకు నిరసనకు దిగారు. మనమిత్ర డోర్ టు డోర్ సర్వే, క్లస్టర్ మ్యాపింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. శనివారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తాజాగా మరికొన్ని.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్వేలు చాలదన్నట్లు కొత్త సర్వేలు తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీ–4 సర్వే చేపడుతున్నారు. కొత్తగా మిస్సింగ్ సిటిజన్స్ సర్వే, మిస్సింగ్ ఎంప్లాయీస్ సర్వే, వర్క్ ఫ్రమ్ హోం, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్, డెత్ రీ వెరిఫికేషన్ సర్వే, 0–6 ఏళ్ల పిల్లల ఆధార్ మిస్సింగ్ సర్వే, నాన రెసిడెన్స్ సర్వే, ఇంటి, కుళాయి పన్నుల వసూళ్లు, సామిత్వ, మనమిత్ర సర్వే, కౌసల్య, అన్నదాత సుఖీభవ సర్వే, ఈ–పంట నమోదు చేయిస్తుంది. గతమెంతో ఘనం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు అన్ని రకాల సేవలు అందేవి. 35 శాఖలకు సంబంధించిన 500 రకాల సేవలు ప్రజలకు చేరువయ్యాయి. ప్రధానంగా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాలు, సివిల్ పనులు, వైద్యం, ఆరోగ్యం, రెవెన్యూ సమస్యలు, భూముల సర్వే, శిశు సంక్షేమం, డెయిరీ, ఫౌల్ట్రీ లాంటి సేవలు సచివాలయం నుంచే అందించేవారు. ప్రస్తుతం ఆయా శాఖల కార్యాలయాల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. అప్పట్లో అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే సమస్య పరిష్కారం అయ్యేది. ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్కు వెళ్లాల్సి వస్తోంది. -
అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ
ఫ 9న ‘అన్నదాత పోరు’ కార్యక్రమం ఫ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9న రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయాల వద్ద శ్రీఅన్నదాత పోరుశ్రీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ శ్రేణులతో కలసి శ్రీఅన్నదాత పోరుశ్రీ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని అన్నారు. దీనిపై మాట్లాడితే కేసులు బనాయిస్తామని చంద్రబాబు వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులపై కక్ష సాధిస్తుందని వేణు మండిపడ్డారు. గతంలో చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నాడని, విద్యుత్ ఉద్యమంలో రైతులను కాల్చి చంపించాడని, 2014–19 పాలనలో రుణమాఫీ పేరుతో రైతులను దగా చేశాడన్నారు. ఈ మధ్యకాలంలో ధాన్యం పండించవద్దని, వరి వేయవద్దని ప్రకటనలు చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏనాడూ రైతులకు ఎరువుల కొరత లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఎరువుల కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం, మిర్చి, పొగాకు, మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడ్డారన్నారు. మిర్చి, పొగాకు రైతుల వద్దకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శకు వెళ్లిన తర్వాతే కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఇప్పుడు ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. పండించిన పంటకు సరైన సమయంలో యూరియా అందకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుపోటు పొడిచి యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తుందన్నారు. రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 9న రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయం వద్దకు రాజమహేంద్రవరం రూరల్, సిటీ, అనపర్తి, రాజానగరం రైతులు, పార్టీ శ్రేణులు, కొవ్వూరు డివిజనల్ కార్యాలయం వద్ద కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల రైతులు, పార్టీ శ్రేణులు తరలి రావాలన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరిజాల వీర్రాజు(బాబు), నక్కా శ్రీనగేష్, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్రస్టాలిన్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధికారి ప్రతినిధి ఎంఎం ఆలీ, రాష్ట్ర మహిళా కార్యదర్శి అంగాడి సత్యప్రియ, జిల్లా మహిళా విభాగ అధ్యక్షరాలు మార్తి లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శివకుమార్, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్, జిల్లా కార్యదర్శులు యెనుముల త్యాగరాజు, ముద్దాల అను, వివిధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు చీకురుమిల్లి చిన్న, చెరుకూరి సత్యనారాయణ, పెనుమాక సునీల్, చింతపర్తి రాంబాబు, హితకారిణి సమాజం మాజీ డైరెక్టర్ దేవులపల్లి సరితారాణి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా సుబ్బారావు
నిడదవోలు (ఉండ్రాజవరం): వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభా గం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన బూరుగుపల్లి సుబ్బారావు ఎంపికయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురిని నియమిస్తూ వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఆది వారం ఉత్తర్వులు ఇచ్చింది. బూరుగుపల్లి సుబ్బారావు గతంలో పశ్చిమ, తూర్పు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ సలహా మండలి చైర్మన్గా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకూ ఎంపీటీసీ సభ్యుల ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాలకు రైతు విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రైతుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తానన్నారు. తనకు బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. -
సాయమందజేసీ
అమలాపురం రూరల్: ఉద్యోగం పేరుతో మోసానికి గురై, చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్లో చిక్కుకున్న దివ్యాంగుడు, అతడి కుటుంబ సభ్యులను జాయింట్ కలెక్టర్ నిషాంతి రక్షించారు. వివరాల్లోకి వెళితే.. అమలాపురానికి చెందిన నాగేశ్వరరావు అనే దివ్యాంగుడికి ఉద్యోగం ఇప్పిస్తానని శంకర్రావు అనే వ్యక్తి నమ్మించాడు. చైన్నెలో ఉద్యోగం ఉందంటూ చెప్పి నాగేశ్వరరావు, అతడి భార్య, పిల్లలను తీసుకువెళ్లాడు. చైన్నెలో ని సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత, వారి దగ్గర ఉన్న డబ్బులను తీసుకుని పరారయ్యాడు. వెంటనే నాగేశ్వరరావు.. జేసీ నిషాంతికి ఫోన్ చేసి, తన పరిస్థితిని వివరించాడు. భార్యాపిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. స్పందించిన జేసీ.. వెంటనే చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ సిబ్బందితో మాట్లాడి, నాగేశ్వరరావు కుటుంబానికి రైలు టిక్కెట్లు, ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేయించారు. ఖర్చు కోసం తన సొంత డబ్బును పంపించి ఆ కుటుంబాన్ని రక్షించారు. -
మహీంద్ర ఎలక్ట్రిక్ కార్ల విడుదల
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని ఎంఅండ్ఎన్ మోటార్స్ షోరూంలో శనివారం మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాలైన ఎక్స్యూవీ 9ఈ, బీఈ6ల నుంచి ప్యాక్–2 వెర్షన్లను ఆ సంస్థ ప్రతినిధులు మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇతి తక్కువ వ్యవధిలోనే (5 నెలల్లో 20 వేల మంది వినియోగదారులు) అత్యున్నత ఆదరణను పొందిన ఈ కార్లను మరింతగా వినియోగదారులకు చేరువ చేసేందుకు కొత్త వెర్షన్లు ఆవిష్కరించినట్టు తెలిపారు. ఎక్స్యూవీ 9ఈ ప్యాక్–2 ధర రూ.24,90,000, బీఈ6 ప్యాక్ ధర రూ.21,90,000 (ఎక్స్షోరూమ్)గా నిర్ణయించారు. ఇవి 59, 79 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్లతో పాటు 7, 11 కేవీ చార్జర్లలో లభిస్తున్నాయన్నారు. అడాస్ లెవెల్–2++, 1 విజన్ కెమెరా, 1 రాడార్ సిస్టమ్తో ఎంఈ4యు యాప్తో కనెక్ట్ చేసుకుంటే వాహన స్థితిగతులను వినియోగదారుడు తన మొబైల్ నుంచే గమనించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎండీ రాధాకృష్ణ, డైరెక్టర్ శ్రీరాం, జీఎం రాజ తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నీ బాధితుడికి రూ.1.61 లక్షల ఆర్థిక సాయం
పెదపూడి: కిడ్నీ బాధితుడికి వైద్య ఖర్చుల కోసం సంపర ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు రూ.1,61,162 ఆర్థిక సాయం అందజేశారు. ఆ అసోసియేషన్ ఫౌండర్ కం చైర్మన్ వడ్డి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. సంపర గ్రామానికి చెందిన చల్లపల్లి నాగేశ్వరరావు బతుకుతెరువు కోసం హైదరాబాద్కు వలస వెళ్లి, అక్కడ ఓ అపార్టుమెంట్లో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు చల్లపల్లి సతీష్కు కేవలం 20 ఏళ్ల వయసులోనే రెండు కిడ్నీలు పాడై, వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు ఆర్థిక సాయం కోసం తమ సొంత ఊరు సంపరలోని ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులను ఆశ్రయించాడు. స్పందించిన సభ్యులు రూ.1,61,162 సేకరించి కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోషన్ చేతుల మీదుగా శనివారం మధ్యాహ్నం నాగేశ్వరరావుకు అందజేశారు. అలాగే కలెక్టర్ షణ్మోషన్.. సంపర అసోసియేషన్ కార్యక్రమాలను పరిశీలించి, అభినందించి బాధితుడి తండ్రికి మరో రూ.10 వేలు తన సొంత సొమ్ములు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు కుందూరి వెంకట సుబ్బారావు కొమ్మన శ్రీనివాసరావు, యానాల మౌళి తదితరులు పాల్గొన్నారు. -
కొబ్బరి చెట్టుపై నుంచి పడి వార్డు మెంబర్ మృతి
ముమ్మిడివరం: మండలంలోని చినకొత్తలంక పంచాయతీ రెండో వార్డు మెంబర్ కముజు వీర వెంకట సత్యనారాయణ (48) శనివారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. ఉదయం కొబ్బరి బొండాం కోసం చెట్టు ఎక్కి, కాలు జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ముమ్మిడివరం ఆసుపత్రికి తరలించగా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య శ్రీలక్ష్మి, ఒక కుమార్తె, వృద్ధ తల్లిదండ్రులు సత్యనారాయణ, సత్యవతి ఉన్నారు. భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై జ్వాలా సాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆహారం.. ఆరోగ్యం
● పోషకాహారంతో ఎన్నో ప్రయోజనాలు ● ఈ నెల 12 నుంచి రాష్ట్రీయ పోషణ్ మాహ్ ● అక్టోబర్ 11 వరకూ కార్యక్రమాలు ● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహన సమావేశాలు రాయవరం: ఆరోగ్యకర జీవనంలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానిలో ఎలాంటి లోపాలున్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చిన్నారుల్లో పోషకాహార లోపాలు వారి భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారతాయి. పోషకాహార లోపాల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి సీ్త్ర, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి అక్టోబర్ 11 వరకూ 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2025 నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,546 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పోషణ్ అభియాన్–మిషన్ పోషణ్ 2.0 పేరుతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఊబకాయం, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఏక్ పేడ్ మాకే నామ్, ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్, మెన్ స్ట్రీమింగ్ – ఇన్వాల్వింగ్ మెన్ ఇన్ న్యూట్రిషన్ అండ్ కేర్ గివింగ్ తదితర అంశాలను వివరిస్తారు. కోనసీమ జిల్లా పరిధిలో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 1,726 అంగన్వాడీ కేంద్రాల్లో 7,725 మంది గర్భిణులు, 5,848 మంది బాలింతలు, 901 మంది ఆరు నెలల లోపు చిన్నారులు, 7,017 మంది ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు, 8,041 మంది 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఉన్నారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు కోనసీమ జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా 1,81,759 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 70,254 మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించగా, 16,680 మంది ఎనిమిక్గా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కంటి వైద్య పరీక్షల అనంతరం 3,300 మంది విద్యార్థులకు కళ్లద్దాలు అందజేశారు. 1,204 మంది చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించగా, 100 మందికి హియరింగ్ ఎయిడ్స్ అందజేశారు. 10 మందికి గ్రహణం మొర్రి ఉన్నట్లుగా గుర్తించగా, వీరిలో 9 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో జూలైకు సంబంధించి 7,303 మంది గర్భిణులు ఉండగా, వారిలో 542 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మొత్తం గర్భిణుల్లో 7.42 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వారికి టీహెచ్ఆర్ పంపిణీ చేస్తున్నారు. పోషకాహారంపై అవగాహన అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచాలని ప్రతి ఏటా సెప్టెంబర్లో జాతీయ పోషకాహార వారోత్సవాలను అమలు చేస్తున్నారు. గతంలో వారం రోజుల పాటు నిర్వహించగా, వీటిని ఇప్పుడు నెల రోజులకు పొడిగించారు. కోవిడ్ 19 తదనంతర పరిస్థితుల్లో పోషకాహారం మరింతగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ పోషకాహార వినియోగంపై సూచనలు అందిస్తోంది. విటమిన్ ఏ లేకపోవడం వల్ల మన దేశంలో ఏటా 30 వేల మంది కంటి చూపును కోల్పోతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఊబకాయం వల్ల టైప్ – 2 డయాబెటీస్, ఫ్యాటీ లివర్ వ్యాధి, పిత్తాశయంలో రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్త పోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. వీటి నివారణకు సరైన పోషకాహార వినియోగంపై అధికారులు అవగాహన కల్పించనున్నారు. ప్రణాళికాబద్ధంగా నిర్వహణ చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాల నివారణకు పోషణ మాసోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తాం. ముఖ్యంగా ఐదు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో లయన్ డిపార్ట్మెంట్లతో కలిసి కార్యక్రమాలు చేపడతాం. ముందుగా అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళతాం. – వై.విజయశ్రీ, ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంట్) పలువురు నాయకులను నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వివిధ అసెంబ్లీ నియోజకర్గాల్లో సమన్వయం చేసుకుంటూ రీజినల్ కో ఆర్డినేటర్లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయంగా వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నియోజక వర్గాల కేటాయింపుగిరజాల వీర్రాజు (బాబు)కు నిడదవోలు, కొవ్వూరు, చందన నాగేశ్వర్కు రాజానగరం, అద్దంకి ముక్తేశ్వరరావుకు రాజమహేంద్రవరం సిటీ, గోపాలపురం, నక్కా శ్రీనగేష్కు రాజమహేంద్రవరం రూరల్), కాకినాడ జిల్లాకు చెందిన గుబ్బల తులసీకుమార్కు అనపర్తి నియోజవర్గాన్ని కేటాయించారు. -
చేతికందని కష్టం
● కంద రైతుకు కన్నీళ్లు ● ధర పతనంతో కుదేలైన వైనం ● గత ఏడాది పుట్టు ధర రూ.11 వేలు ● నేడు రూ.6 వేలకు పడిపోవడంతో ఆవేదన ● ఎకరానికి సుమారు రూ.2.25 లక్షల నష్టం పెరవలి: జిల్లాలో కంద సాగు చేస్తున్న రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. గత కొన్నేళ్లుగా లాభాల బాట పట్టిన రైతులు.. నేడు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. దిగుబడి బాగున్నా మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టాలు తప్పడం లేదు. వెరసి.. రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్టులో పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.6 వేలు మాత్రమే ఉండడంతో దిగుబడి (ఊరిక) బట్టి ఎకరానికి రూ.1.05 లక్షల నుంచి రూ.2.25 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో.. గత వైఎస్సార్ ప్రభుత్వంలో కంద రైతులు స్వర్ణయుగాన్ని సరి చూశారు. ఆనాడు గిట్టుబాటు ధర చరిత్ర సృష్టించింది. పుట్టు కంద రూ.11 వరకూ పలికింది. దీంతో రైతుల ఆదాయం బాగుండేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కంద ధర పతనం కావడంతో రైతులు కుదేలవుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది దిగుబడులు పెరిగినా, ధరలు లేకపోవడంతో పెట్టుబడి కూడా రావడం లేదు. జిల్లాలోని 1,450 హెక్టార్లలో సుమారు ఆరు వేల మంది రైతులు కంద పంటను సాగు చేస్తుండగా, దానిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మంది ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 పుట్టుల దిగుబడి వస్తోంది. ధర లేకపోవడంతో ఎకరానికి సుమారు రూ.2.25 లక్షల వరకు నష్టం రావటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగు విస్తీర్ణం జిల్లాలో కంద పంట విస్తీర్ణం గత ఏడాది కంటే ఈసారి ఎక్కువైంది. గత ఏడాది ఎవరూ ఊహించని విధంగా పుట్టు కంద ధర రూ.11 వేలు పలకడం దీనికి కారణం. పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, పోలవరం, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, బిక్కవోలు మండలాల్లో గత ఏడాది 1,050 హెక్టార్లలో సాగు చేస్తే, ఈ ఏడాది 1,450 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఈ పంట లాభాలు తీసుకురావటంతో ఈ ఏడాది రైతులు పంట విస్తీర్ణం పెంచారు. దీంతో దిగుబడి పెరిగి, నష్టాల బాట పట్టారు. ధర పతనం రైతులు ఊహించని విధంగా కంద ధర ఈ ఏడాది రూ.7 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.6 వేలకు దిగిపోయింది. గతేడాది ఇదే సమయంలో పుట్టు ధర రూ.11 వేలు ఉండగా, నేడు రూ.6 వేలకు పడిపోయింది. కంద పంట వేసినప్పుడు పుట్టు విత్తనాన్ని రూ.11 వేలకు కొనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.6 వేలు ఉండడంతో దిగుబడి పెరిగినా రైతులకు తీవ్ర నష్టాలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 50 పుట్టులకు రూ.3 లక్షలు, 60 పుట్టులకు రూ.3.60 లక్షలు, 70 పుట్టులు ఊరిక ఉంటే రూ.4.20 లక్షలు వస్తోంది దిగుబడి పెరిగినా.. గత ఏడాది ఎకరానికి 50 నుంచి 60 పుట్టుల దిగుబడి వస్తే ఈ ఏడాది అది 60 నుంచి 70 పుట్టులకు పెరిగింది. కానీ ధరలు సగానికి సగం తగ్గిపోవడంతో నష్టాలు వచ్చాయి. అంతే కాకుండా గత ఏడాది లాగే ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తుందనే రైతులు ఆలోచించారు. దీంతో సాగు విస్తీర్ణం జిల్లాలో మరో 500 హెక్టార్లు పెరిగింది. కానీ ధర పతనం కావడంతో కంద రైతులు కుదేలయ్యారు. నష్టాల పాలవుతున్నాం ఆరుగాలం శ్రమించి పండించిన కంద పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నష్టాలపాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.ఒక లక్షపైనే మిగులుతుందనుకుంటే.. నేడు ఒక ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టం వచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పుట్టు ధర రూ.11 వేలు పలికితే నేడు రూ.6 వేలు మాత్రమే ఉంది. – దిడ్ల సంపతిరావు, రైతు, ఖండవల్లి పెట్టుబడి కూడా రాదు గత ఐదేళ్లూ లాభాలను చూసిన మేము.. ఇప్పుడు పెట్టుబడి కూడా రాని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. గతంలో చాలా ఆశాజనకంగా పంట ఉండేది. పుట్టు ధర పతకం కావడంతో నేడు ఆ పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలియడం లేదు. – బొలిశెట్టి వెంకటేశ్వరరావు, కంద రైతు, అన్నవరప్పాడు పెరిగిన సాగు విస్తీర్ణం ఉభయ గోదావరి జిలాల్లో పండించిన కందకు చైన్నె, ముంబై మార్కెట్లలో మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది కంద సాగు విస్తారంగా పెరగటం, మార్కెట్లో వినియోగం తగ్గడంతో ధరలు దిగిపోయాయి. అన్ని జిల్లాల్లో కంద దిగుబడులు బాగుండటం కూడా మరో కారణం. – గడుగొయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి రూ.లక్షల్లో పెట్టుబడి కంద సాగుకు కోసం రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఒక ఎకరంలో ఈ పంటను సాగు చేయాలంటే 30 పుట్టుల విత్తనం వేయాలి. గత ఏడాది విత్తనం పుట్టును రూ.11 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.3.30 లక్షలు, చేను దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి, చచ్చు ఎక్కవేయటానికి కూలీలకు రూ.ఒక లక్ష, పెంట వేయటానికి రూ.30 వేలు, ఎరువులు, పురుగు మందులకు రూ.40 వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.25 వేలు.. కలిసి దాదాపు రూ.5.25 లక్షల పెట్టుబడి అవుతోంది. ఇక దిగుబడి ఎకరానికి 50 పుట్టులు ఉంటే ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం ప్రకారం పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.6 వేల చొప్పున 50 పుట్టులకు రూ.3 లక్షలు మాత్రమే వస్తోంది. 60 పుట్టులు ఉంటే రూ. 3.60 లక్షలు, 70 పుట్టులు దిగుబడులు ఉంటే రూ.4.25 లక్షలు మాత్రమే వస్తోంది. అంటే పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో పెరిగిన సాగు గతంలో ఇతర రాష్ట్రాల్లో కంద సాగు చేసినా ఆంధ్రా కందకు మంచి డిమాండ్ ఉండేది. కానీ బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కంద సాగు విస్తీర్ణం పెరగటం, మన కంటే అక్కడ తక్కువ ధరకు అక్కడ లభించడంతో ఎగుమతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో ధరలు కూడా పతనమయ్యాయి. -
● గణనాయకా.. వీడ్కోలిక..
సీటీఆర్ఐ: వినాయక చవితి మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజు రాజమహేంద్రవరంలోని హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలోని ఇసుక ర్యాంపు వద్దకు నిమజ్జనం కోసం సుమారు 4 వేల విగ్రహాలు తరలివచ్చాయి. నగరంలో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవ కమిటీలు ఊరేగింపుగా వీటికి తీసుకువచ్చాయి. గణనాథునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, నదిలో నిమజ్జనం చేశాయి. ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు, వీక్షించడానికి తరలివచ్చిన భక్తులతో గోదావరి తీరం కిటకిటలాడింది. – సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)పంటుపైకి ఎక్కించిన గణపతి విగ్రహాలు -
పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. దీంతో తెల్లవారుజామునుంచే క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కళగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చర్యలు తీసుకున్నారు. దాతల ఆర్థిక సాయంతో 6,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహిస్తున్నామని, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పౌల్ట్రీ రైతులు జాగ్రత్తలు పాటించాలి ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఇటీవల వివిధ కారణాలతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, ఈ నేపథ్యంలో జిల్లాలోని రైతులు, పెరటి కోళ్ల పెంపకందారులు, మార్కెట్లోని వ్యాపారస్తులు జాగ్రత్తలు పాటించాలని జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డాక్టర్ టి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. పౌల్ట్రీల యజమానులు తమ కోళ్ల ఫారాల్లో బయో సెక్యూరిటీ ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. పశుసంవర్ధక శాఖ జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా పెద్ద సంఖ్యలో కోళ్లు మృతి చెందితే, సమీపంలోని పశుసంవర్ధక శాఖ సిబ్బందికి తెలియజేయాలన్నారు. అలాగే జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయ కాల్ సెంటర్ 88340 58087ను సమాచారం ఇవ్వాలన్నారు. కాటన్ బ్యారేజీకి తగ్గిన నీటి ఉధృతిధవళేశ్వరం: కాటన్ బ్యారేజీకి నీటి ఉధృతి తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గడంతో శనివారం రాత్రి బ్యారేజీ వద్ద పది అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.42 మీటర్లు, పేరూరులో 13.87 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.31 మీటర్లు, భద్రాచలంలో 36.80 అడుగులు, కూనవరంలో 16.48 మీటర్లు, కుంటలో 7.84 మీటర్లు, పోలవరంలో 11.33 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.47 మీటర్ల నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. 160 ఎంవీవీ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభం రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ఏపీ ట్రాన్స్కో ఓ–ఎమ్ సర్కిల్ సబ్ స్టేషన్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. గత 50 ఏళ్లుగా సేవలందించిన 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో ఆధునిక 160 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. దానికి శనివారం జోనల్ చీఫ్ ఇంజినీర్ బి.శ్యాం ప్రసాద్ చార్జింగ్ చేసి, సేవలను ప్రారంభించారు. కాగా.. పాత ట్రాన్స్ఫార్మర్ను 1976 అక్టోబర్ 18న ప్రారంభించారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా పనిచేసిన దానికి గౌరవంగా వీడ్కోలు పలికారు. చివరిసారిగా 2015 మార్చి 21న ఓవర్ ఆయిలింగ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.శ్రీనివాస్ ప్రభు, డివిజనల్ ఇంజినీర్ కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ పాత ట్రాన్స్ఫార్మర్ అందించిన సేవలు అద్భుతమైనవని కొనియాడారు. కేవలం 40 రోజుల్లోనే కొత్త 160 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం ఘనతగా పేర్కొన్నారు. తిరుచ్చి వాహనంపై సత్యదేవుని సేవఅన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో శనివారం ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవ మూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి అర్చకులు సుధీర్ తదితరులు పూజలు చేసి ఊరేగింపు ప్రారంభించారు. -
ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
● తరలివచ్చిన పార్టీ శ్రేణులు ● జక్కంపూడి స్వగృహంలో సర్వమత ప్రార్థనలు సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం అక్రమ కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన ఎంపీ మిథున్రెడ్డికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక సెంట్రల్ జైల్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఏసీబీ కోర్టు వెలువరించిన బెయిల్ ఉత్తర్వులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా జైల్ వద్దకు తీసుకొచ్చారు. అప్పటికే ఎంపీ మిథున్రెడ్డిని చూసేందుకు భారీగా పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఇంటి వద్దకు భారీ కాన్వాయ్లో వెళ్లారు. అక్కడే కాసేపు పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన అనంతరం మధురపూడి ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన, తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్ పయనమయ్యారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, మాజీ ఎంపీ ఎంపీ చింతా అనురాధ, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మేడపాటి షర్మిలారెడ్డి, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావ్, సత్తిసూర్యనారాయణ రెడ్డిలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం కన్వీనర్ జక్కంపూడి గణేష్ ఉన్నారు. సర్వమత ప్రార్థనలు రాజమహేంద్రవరం సిటీ: సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి శనివారం ప్రకాశం నగర్లోని జక్కంపూడి స్వగృహంలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గ్గిరెడ్డి, మాజీ ఎంపీ చింతా అనురాధ, డాక్టర్ జక్కంపూడి సుకీర్తి, డాక్టర్ జక్కంపూడి రాజశ్రీ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
యూటీఎఫ్ రణభేరి పోస్టర్ ఆవిష్కరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ విద్యారంగంతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుంచి 19 వరకు యూటీఎఫ్ రణభేరి జాతా చేపట్టనుంది. ఈ కార్యక్రమ పోస్టర్ను శనివారం యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆవిష్కరించింది. రాజమహేంద్రవరంలోని యూటీఎఫ్ హోంలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయకర్, ఎ.షరీఫ్, రాష్ట్ర కార్యదర్శి ఎన్.అరుణ కుమారి నేతృత్వంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు ప్రాంతాల నుంచి రణభేరి జాతాలు మొదలవుతాయని, ఐదు రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో ఇవి పర్యటిస్తాయన్నారు. ప్రభుత్వ విధానాలు విద్యా వ్యవస్థను అధోగతి పాలు చేస్తున్నాయన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు చెల్లిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. 15 నెలలు కావస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 5న విజయవాడలో భారీ రణభేరి సదస్సు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షురాలు ఎం.విజయ గౌరీ, జిల్లా కార్యదర్శులు రవిబాబు, దయానిధి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపస్రావు, జిల్లా కార్యవర్గం శ్రీనుబాబు, శ్రీనివాసరావు, విజయ్ బాబు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
జేసీగా చిన్నరాముడు సేవలు అభినందనీయం
● కొనియాడిన కలెక్టర్ ప్రశాంతి ● కలెక్టరేట్లో సత్కారం రాజమహేంద్రవరం సిటీ: జాయింట్ కలెక్టర్గా చిన్నరాముడు జిల్లాకు అందించిన సేవలు అభినందనీయమని కలెక్టర్ పి.ప్రశాంతి కొనియాడారు. బదిలీపై వెళుతున్న ఆయనను శనివారం కలెక్టరేట్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికార హోదాలో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా మానవత్వం విషయంలో మృధు స్వభావం కలిగి ఉండడం చిన్న రాముడి ప్రత్యేకత అన్నారు. కొత్త విషయాలు నేర్చుకోవడం ఆయనకు పనిపై ఉన్న మక్కువకు నిదర్శనమన్నారు. జిల్లాలో పనిచేసిన ఏడాది కాలంలో యోగాంధ్ర, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారన్నారు. విధి నిర్వహణలో ఎల్లప్పుడూ సానుకూల ధృక్పథంతో వ్యవహరించారని, కొన్నిసార్లు వేచి చూసే ధోరణి వల్ల మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. నూతన జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ మాట్లాడుతూ చిన్న రాముడు మంచి మనసున్న వ్యక్తిగా అందరిలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారన్నారు. చిన్న రాముడు మాట్లాడుతూ ఈ ఏడాది కాలం తనకు గుర్తుండిపోయే తీపి జ్ఞాపకం అన్నారు. రెవెన్యూ అనుబంధ, ఇతర ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడటానికి తన వంతు కృషి చేశానన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, ఆర్డీవోలు ఆర్.కృష్ణ నాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, కేఆర్సీసీ ఎస్డీసీ కె.భాస్కర్ రెడ్డి, డీఎస్వో వి.పార్వతి పాల్గొన్నారు. -
రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్రెడ్డి విడుదల
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి జైలు నుంచి ఎంపీ మిథున్రెడ్డి విడుదలయ్యారు. మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయనకు అనుమతి ఇచ్చిన కోర్టు.. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది.అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్రెడ్డి పేరును ఏ4గా చేర్చింది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురికాగా.. కోర్టు ఆదేశాల మేరకు జూలై 19వ తేదీన సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే సుదీర్ఘంగా ఆయన్ని విచారించిన అనంతరం అదే రోజు రాత్రి సిట్ అరెస్ట్ చేసింది.ఈ క్రమంలో.. కోర్టుల్లో ఉపశమనం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎంపీ పీవీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. తాను ఓటేయాల్సిన అవసరం ఉందని అందులో పేరొన్నారాయన. అయితే.. మిథున్రెడ్డి పిటిషన్కు అర్హత లేదని సిట్ వాదించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపుతూ బెయిల్ కోరడం సహేతుకం కాదు అని అభిప్రాయపడింది. చివరకు కోర్టు మిథున్రెడ్డి తరఫు లాయర్ల వాదనకే మొగ్గు చూపిస్తూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సెప్టెంబర్ 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
ఈ వయసులో నీకిది అవసరమా..!
అమలాపురం రూరల్: భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో అతని భార్య ఇనుపరాడ్డుతో అతడి తలపై దాడిచేసి హతమార్చిన ఘటన మండలం నడిపూడిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నడిపూడి గ్రామ పరిధి మెట్ల రాంజీ కాలనీకి చెందిన దొమ్మేటి రాంబాబు (61) కాకినాడ ఆర్టీసీ చెకింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్నాడు. అతని భార్య వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తెకు ఒఆసై వివాహం చేశారు. కాగా రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై తరచూ ఆ భార్యాభర్తలు ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో ఒక ఇంట్లోనే వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాంబాఋతో అతని భార్య ఘర్షణపడింది. అనంతరం అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్త రాంబాబు తలపై ఇనుప రాడ్డుతో భార్య వెంకటరమణ దాడి చేసింది. దీంతో అతను ప్రాణాలు విడిచాడు. ఈ విషయం శుక్రవారం సాయత్రం బయటికి రావడంతో సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్సై శేఖర్ బాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించి వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. కాగా రాంబాబు ఉద్యోగ విరమణ దగ్గర పడడంతో అతడికి వచ్చే ప్రోత్సాహకాలు తనకు దక్కవనే అనుమానంతో ఈ హత్యకు పాల్పడినట్లు పొలీసు లు భావిస్తున్నారు. రాంబాబు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ బాబు తెలిపారు. -
భావోద్వేగాల బంధానికి బైబై!
15 పైసల పోస్టు కార్డు.. ఇన్లాండ్ కవర్.. కవరింగ్ లెటర్.. రిజిస్టర్డ్ పోస్టు.. టెలిగ్రాం.. ఇలా ఎన్నో సేవలు సుదీర్ఘ కాలం అందించిన తపాలా శాఖ కొన్ని బంధాలను వదిలించుకుంటోంది. కారణం.. కాలంతో పరుగులు తీయాలనుకోవడమే. సాంకేతికత రాకెట్ వేగంతో సాగుతుంటే కనీసం బుల్లెట్ ట్రైన్లా అయినా ముందుకు సాగకపోతే తన ఉనికికే ప్రమాదమని గ్రహించింది ఆ శాఖ. ఎస్సెమ్మెస్ మొదలైన దగ్గర నుంచి ఊపందుకున్న సాంకేతికత నేడు చాలా వేగంగా విస్తరించి అతి తక్కువ వ్యవధిలో పెద్ద పెద్ద ఫైళ్లను సైతం ఈ మెయిల్ రూపంలో చేరవేస్తోంది. ఇవన్నీ చూస్తున్న నాటి తరం కొంత నిట్టూర్పు విడుస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షణ అనంతరం తాము అందుకున్న ఉత్తరాలు, రిజిస్టర్డ్ పోస్టులను గుర్తు చేసుకుని ఇక ఆ సేవలు కనుమరుగు కానున్నాయని తెలియడంతో కాస్త మనస్తాపానికి గురవుతున్నారు. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థను అందిపుచ్చుకుంటూ ఈ సేవల విస్తరణ కోసం సరి కొత్త ప్రయోగాలు చేస్తున్న పోస్టల్శాఖ పాత సేవలను మాత్రం ఒక్కొక్కటిగా రద్దుచేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు సేవలు రద్దు కాగా, సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్ పోస్టుసేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. మరో వైపు లెటర్ రెడ్ (పోస్టల్) బాక్స్ను కూడా ఎత్తివేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రధానంగా పోస్టల్ శాఖ నూతన ఒరవడితో ఈ–సేవల విస్తరణపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు లేని రోజుల్లో సమాచార వ్యవస్థకు ఉన్న ఏకై క దిక్కు తపాలానే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలకు మరింత సులువైన సేవలందించేందుకు సాంకేతికతకు పోస్టల్ డిపార్టుమెంట్ అప్గ్రేడ్ అవుతోంది. రిజిస్టర్డ్ పోస్టుకు మంగళం పోస్టల్శాఖ రిజిస్టర్ పోస్టు సేవలకు మంగళం పాడింది. తాజాగా బ్రిటీషు కాలం నుంచి వస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పోస్టు మాస్టర్లకు ఇప్పటికే శాఖాపరమైన నోటీసులు జారీచేసింది. ఒకప్పుడు బంధుమిత్రులకు కబురు పంపాలన్నా ముఖ్యమైన పత్రాలు చేరవేయలన్నా పోస్టుకార్డు లేదా రిజిస్టర్డ్ పోస్టు మాత్రమే అందుబాటులో ఉండేది. సుమారు 171 ఏళ్లుగా.. పోస్టల్ వ్యవస్థ ప్రజల జీవితంలో విడదీయరాని భాగమైంది. కాలంతో పాటు మారిన పోస్టల్ శాఖ ఇప్పుడు మరింత ఆధునిక సేవలతో మందుకు వస్తోంది. 1854లో అప్పటి బ్రిటిష్ అధికారి లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టంతో సేవలు ప్రారంభమయ్యాయి. అంతకు ముందుగా 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్ మొదలైంది. దాదాపు 171 ఏళ్లుగా ముఖ్యమైన పత్రాలను, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి రిజిస్టర్డ్ పోస్ట్ ప్రధాన మార్గంగా నిలిచింది. లీగల్ నోటీసులు, అపాయింట్మెంట్ లెటర్లు, బ్యాంకింగ్ సంబంధిత పత్రాలు వంటి వాటిని పంపడానికి ఎంతగానో ఉపయోగపడింది. పంపిన వస్తువు అవతలి వారికి చేరినట్లు రసీదు (డెలివరీ ప్రూఫ్) పొందడం ఒక ప్రత్యేకత, చట్ట పరంగా సైతం ఎంతో విలువైనది. స్పీడ్ పోస్టులో విలీనం రిజిస్టర్డ్ పోస్టు సేవను పూర్తిగా స్పీడ్ పోస్టు సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. ఆ శాఖ తమ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా దేశీయ పోస్టల్ సేవల క్రమబద్దీకరణ, పనితీరు మెరుగుపరచడం, ట్రాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం తదితర ప్రక్రియలో భాగంగానే స్పీడ్పోస్టులో రిజిస్టర్డ్ పోస్టు విలీనం చేస్తున్నట్లు వెల్లడించింది. స్పీడ్ పోస్టు అంటే వేగవంతమైన డెలివరీ. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్టు సేవలు స్పీడ్పోస్టులో కలపడంతో డెలివరీలు మరింత వేగవంతంగా గమ్యాన్ని చేరనున్నాయి. స్పీడ్ పోస్టు ద్వారా పార్శిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్లైన్లో చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకే సేవ ఉండటం వల్ల పోస్టల్ శాఖ పని మరింత సులభమవుతుందని అధికారులు చెప్తున్నారు. తగ్గిన ఆదరణ.. పెరిగిన సాంకేతికత.. వాస్తవంగా రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం గణనీయంగా తగ్గింది. వాట్సాప్, జీ మెయిల్ వంటి డిజిటల్ మాధ్యమాల రాకతో సమాచార మార్పిడి చాలా వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్ మార్గంలోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తున్నాయి. ఐదేళ్ల క్రితం సాగిన రిజిస్టర్డ్ పోస్ట్ బుకింగ్లను పరిశీలిస్తే 25 శాతం పడిపోయాయి. స్పీడ్ పోస్టు, ఇతర కొరియర్ల సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ పోస్టు డిమాండ్ అంతకంతకూ తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా స్పీడ్ పోస్టుతో చార్జీల మోత తప్పని పరిస్థితి కనిపిస్తోంది. రిజిస్టర్డ్ పోస్ట్ కనీస చార్జి రూ.26 నుంచి రూ.30 వరకు ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కనీస చార్జి రూ.41 ఇది రిజిస్టర్డ్ పోస్ట్తో పోలిస్తే 20 నుంచి 25 శాతం ఎక్కువ. ఇక చార్జీల భారం మొయకతప్పదు. రెడ్ పోస్టు బాక్స్ ఎత్తివేత ఊహగానమే.. రిజిస్టర్డ్ పోస్ట్ సేవల రద్దు నేపథ్యంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన రెడ్పోస్టు ఎత్తివేత ప్రచారం జోరుగా సాగుతోంది. సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీంతో పోస్టల్ శాఖ అభిమానులు ఒకింత కలవరానికి గురవుతున్నారు. దశాబ్దాలుగా నిస్వార్థంగా.. నిశ్శబ్దంగా.. నిశ్చలంగా.. విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించిందన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, అది ఒక ఊహాగానమేనని పోస్టల్ వర్గాలు అంటున్నాయి. పోస్టల్ శాఖ ద్వారా ఎరుపు పోస్ట్బాక్సును ఎత్తివేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఏదీ లేదని స్పష్టం చేస్తున్నారు. ఉహాగానమే.. పోస్టుబాక్స్లు ఉండవని సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారం కేవలం ఊహాగానమే. ఇప్పటి వరకు పోస్టుబాక్స్లు తొలగింపునకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు రాలేదు. కేవలం రిజిస్టర్ పోస్టు మాత్రమే నిలిపివేశారు. – దాసరి నాగేశ్వరరెడ్డి, పోస్టల్ సూపరిండెంట్, కాకినాడ తపాలా సేవలపై అయోమయం ఇప్పటికే రిజిస్టర్డ్ పోస్ట్ సేవల నిలిపివేత తాజాగా లెటర్ రెడ్ బాక్స్ ఎత్తివేత ప్రచారం అదేమీ లేదంటున్న ఆ శాఖ అధికారులు ఈ–సేవ విస్తరణలో పోస్టల్ శాఖ నిమగ్నం -
రత్నగిరిపై భూగర్భ విద్యుత్ లైన్లు
● రూ.28 లక్షల వ్యయంతో ఏర్పాటు ● పాలకవర్గ సమావేశంలో నిర్ణయం ● కార్తికమాసం ఏర్పాట్లపై చర్చ అన్నవరం: రత్నగిరిపై స్వామివారి నిత్య కల్యాణ మండపం, వ్రత మండపాలకు స్వామి వారి ఆలయానికి రత్నగిరి పవర్హౌస్ నుంచి అండర్ గ్రౌండ్ కేబుళ్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.28 లక్షలతో రూపొందించిన అంచనాలకు దేవస్థానం పాలకవర్గం ఆమోదం తెలిపింది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపి తీర్మానాలు చేశారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తీర్మానాలివీ.. ● సుమారు రూ.40 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూపొందించిన అంచనాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ● గత నెలలో నిర్వహించిన కొబ్బరి ముక్కలు, బుకింగ్ కౌంటర్ వద్ద మూడో నెంబర్ షాపు, ఇతర షాపుల వేలంపాటలలో హెచ్చు మొత్తం వేలం పాటలకు ఆమోదం తెలిపారు. ● సత్యగిరిపై రహదారుల నిర్మాణానికి పిలిచిన రూ.32 లక్షలు టెండర్కు ఆమోదం. కార్తికమాసం ఏర్పాట్లపై చర్చ అక్టోబర్ 22వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో వచ్చే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు చర్చించి పలు నిర్ణయాలు తీస్కున్నారు. ప్రధానంగా రూ.7.70 లక్షల వ్యయంతో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, రూ.ఐదు లక్షల వ్యయంతో షామియానాలు, రూ.పది లక్షలతో తాత్కాలిక క్యూ లైన్లు నిర్మాణం, రూ.ఐదు లక్షలతో తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. -
ఏపీని మెడికల్ మాఫియా చేయాలని చూస్తున్న చంద్రబాబు
● జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీల్లో 10 అమ్మేయడం ఏమిటి? ● ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ భరత్రామ్ మండిపాటు రాజమహేంద్రవరం సిటీ: అపారమైన అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు 15 ఏళ్ల పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురాకుండా జగనన్న తీసుకువచ్చిన 10 మెడికల్ కాలేజీలు అమ్మేయాలని చూడటం దారుణమని మాజీ ఎంపీ, వైఎస్సార్ ిసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఏపీని మెడికల్ మాఫియా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి, ఏ ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని మినహాయించి, లేని ప్రాంతాల్లో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చి, నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. వాటిలో రాజమహేంద్రవరం వంటి ఐదు ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం కూడా క్లాసులు ప్రారంభమయ్యాయన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ఎదురుగా 35 ఎకరాల్లో మెడికల్ కాలేజీ భవన నిర్మాణం ప్రారంభిస్తే, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిన్నర కాలంలో పనులు నత్తనడకన నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. మొదటి బ్యాచ్ పూర్తయి డాక్టర్లు బయటకు వచ్చే సమయానికి కూడా భవన నిర్మాణాలు పూర్తవుతాయన్న నమ్మకం లేకుండా పోయిందన్నారు. అంతేకాకుండా జగనన్న తెచ్చిన మెడికల్ కాలేజీల్లో పది మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం 99 ఏళ్లకు అమ్మేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుని కాలరాయడానికి చంద్రబాబుకి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. ఎవరైనా మెడికల్ కాలేజీలు పెడతామన్నా, సీట్లు పెంచుతామన్నా ఆనందంగా ముందుకు వస్తారని, అయితే చంద్రబాబు అందుకు విరుద్ధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచొద్దని లేఖ రాయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. బినామీ ప్రయివేట్ మెడికల్ కాలేజీలకు మంచి చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేయడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా నిర్వీర్యం చేసి, పేదలకు వైద్యం అందకూడదన్నది చంద్రబాబు ఉద్దేశంగా ఉందని భరత్రామ్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ ప్రయివేటు ఆసుపత్రుల్లో అమలు కాకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. -
ప్రతిభకు ప్రోత్సాహం
● ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం ● 9 నుంచి ఇంటర్ వరకు ఏటా రూ.12వేల స్కాలర్షిప్ ● ఎంపికై న వారికి నాలుగేళ్ల పాటు స్కాలర్షిప్ ● ఈ నెల 30 దరఖాస్తుకు తుది గడువు ● డిసెంబరు 7 ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్ష రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ సర్టిఫికేట్ (ఎన్ఎంఎంఎస్) పథకాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్షలో ఎంపికై న వారికి 9వ తరగతి నుంచి ఇంటర్ పూర్తయ్యే వరకు ఏటా రూ.12 వేలు వంతున నాలుగేళ్లకు మొత్తం రూ.48 వేలు అందజేస్తారు. అయితే ఇంటర్ విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే చదవాల్సి ఉంటుంది. వసతిగృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వరు. డే స్కాలర్గా ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అందజేస్తారు. పేద విద్యార్థులకు భరోసా.. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏటా పేద విద్యార్థుల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని 2008–09లో ప్రవేశపెట్టారు. ఇది పేద విద్యార్థుల విద్యకు భరోసా కల్పిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 వేల వంతున నాలుగేళ్ల పాటు విద్యార్థికి స్కాలర్షిప్ నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వారికి మాత్రమే స్కాలర్షిప్ కొనసాగిస్తారు. ట్రిపుల్ ఐటీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదివిన వారికి కూడా స్కాలర్షిప్ కొనసాగింపు ఉండదు. ఏటా జిల్లా నుంచి సుమారు వందలాది మంది ఎంపికవుతున్నారు. డిసెంబరు 7న అర్హత పరీక్ష పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు 7న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాత పరీక్ష ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో 180 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. 90 మార్కులకు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ ఉండగా, మరో 90 మార్కులకు 7, 8 తరగతులకు చెందిన గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలపై ప్రశ్నలుంటాయి. పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం కేటాయిస్తారు. జిల్లా ప్రాతిపదికగా స్కాలర్షిప్కు విద్యార్థులను ఎంపిక చేస్తారు. అర్హతలివీ ప్రస్తుతం ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తులకు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు ఈ నెల 30 చివరి తేదీ కాగా, పరీక్ష రుసుం చెల్లించేందుకు అక్టోబరు ఒకటో తేదీ తుది గడువు. ప్రధానోపాధ్యాయులు ప్రింటెడ్ నామినల్ రోల్స్, ధ్రువపత్రాలను సంబంధిత జిల్లా విద్యాశాకాధికారి కార్యాలయంలో సమర్పించడానికి ఈ నెల 30 చివరి తేదీ. అధిక సంఖ్యలో దరఖాస్తు చేయించాలి ప్రతి పాఠశాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు చూడాలి. విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగేందుకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేద విద్యార్థులకు వరం నిరుపేద విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ ఒక వరం. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్షను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఎన్ఎంఎంస్కు అధిక సంఖ్యలో విద్యార్థులు అర్హత సాధించేలా సంబంధిత పాఠశాల విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ జిల్లాలో పరిస్థితి ఇదీ గత విద్యా సంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గత విద్యా సంవత్సరంలో 2,815 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి గతేడాది డిసెంబరు ఎనిమిదో తేదీన 13 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ అర్హత పరీక్షకు 2,688 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 142 మంది ఎన్ఎంఎంఎస్కు అర్హత సాధించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 12,131 మంది 8వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభించారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో పాఠశాల డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవ్వాలి. దరఖాస్తులో విద్యార్థి పూర్తి వివరాలను ఉపాధ్యాయుడి సమక్షంలో పొందుపరచాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 పరీక్ష ఫీజు చెల్లించాలి. -
87 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
గురుపూజోత్సవంలో సాంస్కృతిక ప్రదర్శనలిస్తున్న విద్యార్థులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. మొత్తం 87 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్స్, ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ సమాజం ఉన్నతంగా ఎదిగేలా ఉపాధ్యాయులు తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ మన జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఉపాధ్యాయుడేనన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారన్నారు. సభకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, ఆర్టీవో ఆర్.కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, అడిషినల్ ఎస్పీ సుబ్బరాజు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సుభాషిణి, జిల్లా విద్యా శాఖాధికారి కంది వాసుదేవరావు, శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్, అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్ కుమార్, రూరల్ ఎంఈవో తులసిదాస్ పాల్గొన్నారు. -
గురువుకు విగ్రహం!
రాజోలు: తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దైవాలు అనే మాటలను నిజం చేసి తమకు పాఠాలు బోధించిన గురువు విగ్రహాన్ని శిష్యులు గురువు ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. శుక్రవారం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని మాజీ డిప్యూటీ స్పీకర్ ఏవీ సూర్యనారాయణరాజు చింతలపల్లి గ్రామంలో స్వర్గీయ ఉపాధ్యాయుడు గుబ్బల గంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన బోధించిన పాఠాలు, వ్యక్తిత్వ వికాసాలు, జీవిత మార్గదర్శకాలను ఆదర్శంగా తీసుకున్న పూర్వ విద్యార్థులు ఆయన ఇంటి ఆవరణలో గంగారావు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గురుభక్తిని చాటారు. ఈ సందర్భంగా సత్యనారాయణ రాజు మాట్లాడుతూ గంగారావు గణిత బోధనలో గొప్పవారిగా నిలిచారన్నారు. ఆయన జ్ఞాపకార్థం శిష్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. సర్పంచ్ మట్టా ప్రసన్నకుమారి, నాయకులు దంతులూరి చంటిబాబు, పెదబాబు, పి.గన్నవరం వైస్ ఎంపీపీ చెల్లుబోయిన గంగాదేవి, మాజీ సర్పంచ్ గెడ్డం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విలసాలాలకు అలవాటు పడి మోటారు సైకిళ్ల చోరీ
కోరుకొండ: మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులను 11 మోటారు సైకిళ్లతో కోరుకొండ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. విలాసాలకు అలవాటు పడి రాజమహేంద్రవరం, కోరుకొండ, రాజానగరం, సీతానగరం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆ వాహనాలను వారు చోటీ చేసిన ట్లు నార్త్జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. స్కూటీలను చోరీ చేయడం వీరు లక్ష్యంగా తీసుకుని తొమ్మి దింటిని చోరీ చేసినట్లు తెలిపారు. చోరీ చేసిన వాహనాలను గాదరాడలో అల్లాడి విజయ్ కుమార్ ఆద్వర్యంలో దాచేవారు. విజయ్కుమార్ అదే గ్రామానికి చెంది న వనుం సురేష్, వనుం లోవరాజులతో కలిసి ఈ వాహనాల చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల కోరుకొండలో ని స్ప్లెండర్ ఫ్లస్ వాహనాన్ని చోరీపై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సోదాలు నిర్వహించగా 11 మోటార్లు సైకిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇంటి ముందు నిలిపిని మోటారు సైకిళ్లను చోరీ చేయడంలో వారు నిష్ణాతులని, నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు అధికారిగా ఎస్సై కేవీ నాగార్జున ఉన్నారు. విలేకరుల సమావేశంలో కోరుకొండ సీఐ సత్య కిశోర్ పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన వివాహేతర బంధం
● పదవీ విరమణ ప్రోత్సాహకాలు ● రావన్న అనుమానంతో భర్తపై దాడి ● తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి అమలాపురం రూరల్: భర్త వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో అతని భార్య ఇనుపరాడ్డుతో అతడి తలపై దాడిచేసి హతమార్చిన ఘటన మండలం నడిపూడిలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నడిపూడి గ్రామ పరిధి మెట్ల రాంజీ కాలనీకి చెందిన దొమ్మేటి రాంబాబు (61) కాకినాడ ఆర్టీసీ చెకింగ్ స్క్వాడ్లో పనిచేస్తున్నాడు. అతని భార్య వెంకటరమణతో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమార్తెకు ఒఆసై వివాహం చేశారు. కాగా రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై తరచూ ఆ భార్యాభర్తలు ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో ఒక ఇంట్లోనే వారు వేరువేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన రాంబాఋతో అతని భార్య ఘర్షణపడింది. అనంతరం అర్ధరాత్రి నిద్రలో ఉన్న భర్త రాంబాబు తలపై ఇనుప రాడ్డుతో భార్య వెంకటరమణ దాడి చేసింది. దీంతో అతను ప్రాణాలు విడిచాడు. ఈ విషయం శుక్రవారం సాయత్రం బయటికి రావడంతో సీఐ ప్రశాంత్ కుమార్, ఎస్సై శేఖర్ బాబు ఘటన స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించి వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. కాగా రాంబాబు ఉద్యోగ విరమణ దగ్గర పడడంతో అతడికి వచ్చే ప్రోత్సాహకాలు తనకు దక్క వనే అనుమానంతో ఈ హత్యకు పాల్పడినట్లు పొలీసు లు భావిస్తున్నారు. రాంబాబు మృతదేహాన్ని పోస్ట్మా ర్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శేఖర్ బాబు తెలిపారు. -
అధ్యాపకుల సేవలు కనపడలేదా
● జేఎన్టీయూకేకు దక్కని ఉత్తమ పురస్కారం ● వర్సిటీ చరిత్రలో మచ్చగా మిగలనున్న వైనం ● రాయలసీమ వర్సిటీల నుంచి ముగ్గురికి అవకాశం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో సాంకేతిక వర్సిటీలలో కీలకంగా ఉన్న జేఎన్టీయూ కాకినాడ నుంచి ఈ ఏడాది రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుల పురస్కారానికి అర్హత గలవారు ఒక్కరూ లేరన్నట్టు కనిపిస్తుంది. ప్రొఫెసర్ల హోదా కలిగి అధ్యాపక వృత్తిలో 20 నుంచి 30 ఏళ్ల సర్వీస్ ఉన్న వారిలో ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఏటా కనీసం ఇద్దరు ప్రొఫెసర్లకు అవకాశం దక్కేది. కానీ ఈ ఏడాది నలుగురు పేర్లు ప్రతిపాదించినా కనీసం వారిలో ఒక్కరి పేరు కూడా రాకపోవడం వర్సిటీ ప్రతిష్టకు మచ్చగా మిగిలిపోతుంది. వర్సిటీకు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరు, మరో సీనియర్ ప్రొఫెసర్తో పాటు, డైరెక్టర్గా పనిచేసిన ఒక ప్రొఫెసర్ పేరు ప్రతిపాదించగా వీరిలో కనీసం ఒక్క పేరునూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఏపీ ఎంసెట్, ప్రభుత్వ ఉద్యోగాల వంటి కీలక పరీక్షల నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వం ఈ వర్సిటీకే అప్పగిస్తున్న తరుణంలో ఏ ఒక్క ప్రొఫెసర్ ఉత్తమ అధ్యాపకుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించలేదా అన్న సందేహం వర్సిటీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వర్సిటీలను బలోపేతం చేస్తామంటూ జాతీయ విద్యాసంస్థల్లో పనిచేసే వారికి, ఉపకులపతులుగా నియమించిన ప్రభుత్వానికి ఇంత మంది సీనియర్ ప్రొఫెసర్లలో ఒక్కరూ కనిపించకపోవడం విస్మయానికి గురిచేసింది. రాయలసీమ ప్రాంతంలో ఉన్న అనంతపురం వర్సిటీ నుంచి ముగ్గురు ప్రొఫెసర్లకు, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుంచి ముగ్గురిని ఎంపిక చేశారు. దీన్ని బట్టి జేఎన్టీయూకేను ప్రభుత్వం అవార్డుల ఎంపికలో అసలు ప్యానల్ లిస్టులోకి తీసుకోలేదా అన్న సందేహం వర్సిటీ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది. -
ముమ్మరంగా పొగాకు నారుమడులు
● 65 హెక్టార్లలో నర్సరీలు ● దసరా నుంచి నాట్లకు సన్నాహాలు ● ట్రే నర్సరీలపై రైతుల ఆసక్తి ● 70 వేల ఎకరాల్లో పంట సాగు దేవరపల్లి: పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 2025–26 పంట కాలానికి పొగాకు సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సాగుకు అవసరమైన నారును నర్సరీల్లో విత్తనం వేసి పెంచుతున్నారు. బోర్డు నిబంధనల మేరకు రైతులు, వ్యాపారులు నారుమడులు కట్టి పెంచుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నారుమడి దశ నుంచి బోర్డు నిబంధనలను కఠినతరం చేసింది. నారుమడి కట్టే రైతులు తప్పనిసరిగా బోర్డులో నర్సరీని రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంది. పొగాకు పంట సాగు చేసే రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యాపారులు, రైతుల నుంచి నారు కొనుగోలు చేయవలసి ఉంది. నారు అమ్మిన రైతు నుంచి నారు కొనుగోలు సమయంలో రశీదు తీసుకుని బోర్డు కార్యాలయంలో మొక్క ఫారంతో పాటు అధికారులకు అందజేయవలసి ఉంది. ప్రస్తుతం పొగాకు నారుమడులు ముమ్మరంగా కడుతున్నారు. నర్సరీల విస్తీర్ణం పెరిగే అవకాశం దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటి వరకు 65 హెక్టార్లలో పొగాకు నర్సరీలు వేసినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీనిలో సుమారు 34 హెక్టార్లు కమర్షియల్, 21 హెక్టార్లు డొమెస్టిక్ నర్సరీలు ఉన్నాయి. ఈ నెలాఖరుకు నర్సరీల విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దేవరపల్లి మండలం పల్లంట్ల, దేవరపల్లి, బందపురం, యర్నగూడెం, సంగాయగూడెం, చిన్నాయగూడెం గ్రామాల్లో ఎక్కువగా పొగాకు నారుమడులు కడుతున్నారు. పల్లంట్ల, దేవరపల్లి, లక్ష్మీపురం, బందపురం గ్రామాల్లో కమర్షియల్ నర్సరీలు కడుతున్నారు. కమర్షియల్ నర్సరీలు కట్టేవారిలో 90 శాతం కౌలుదారులు ఉన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు, కాపవరం, ధర్మవరం, తాళ్లపూడి మండలం మలకపల్లి, ప్రాంతాల్లో కమర్షియల్ నారుమడులు కడుతున్నారు. ఇక్కడ వేసిన నారుకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు ప్రాంతాలతో పాటు తెలంగాణలోని అశ్వారావుపేట, ఖమ్మం ప్రాంతాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేసి తీసుకువెళతారు. ఎకరం విస్తీర్ణంలో పెంచిన నారు సుమారు 1,200 ఎకరాల్లో సాగుకు సరిపోతుందని రైతులు తెలిపారు. ట్రే నారుపై రైతుల ఆసక్తి ట్రేలలో పెంచిన నారుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ట్రే నారు ఆరోగ్యకరంగాను, ధృడంగా ఉండి నాటిన అనంతరం చీడపీడలను తట్టుకుంటుందని రైతులు తెలిపారు. పొగాకు సాగు చేసే రైతులంతా ట్రే నారుపై మొగ్గు చూపుతున్నారు. ట్రే నారు ధర ఎక్కువగా ఉన్నప్పటికి రైతులంతా దీనినే కొనుగోలు చేస్తారు. ఏటా దాదాపు 70 వేల ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. అధిక దిగుబడుల వంగడాలు సాగు అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. సాగుకు అవసరమైన విత్తనాలను సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థలు రైతులకు సరఫరా చేస్తున్నాయి. కిలో విత్తనాలకు వంగడాన్ని బట్టి రూ.15 వేలు ధర ఉంది. ఎల్వీ–7, 1353 వంగడాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు సుమారు 10 నుంచి 13 క్వింటాళ్లు పొగాకు దిగుబడి వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు బోర్డు నిబంధనలు ఉల్లంఘించి పొగాకు నర్సరీలు వేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. పంట నియంత్రణలో భాగంగా ఈ ఏడాది నర్సరీ దశ నుంచి నిబంధనలు కఠినతరం చేశాం. నర్సరీ వేసే ప్రతి రైతు బోర్డు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. నర్సరీల తనిఖీకి బోర్డు బిజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ ఉన్న నర్సరీల నుంచి రైతులు నారు కొనుగోలు చేయాలి. నారు అమ్మిన వ్యాపారి నుంచి తప్పనిసరిగా రశీదు పొందాలి. రశీదు పుస్తకాలను బోర్డు ద్వారా నర్సరీ యజమానులకు అందజేస్తున్నాం. అక్టోబర్ నుంచి పొగాకు నాట్లు ప్రారంభం కానున్నాయి. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం -
చెడు వ్యసనాలకు లోనై చోరీలు
● పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర ముఠా ● 64 గ్రాముల బంగారం.. ● 2.88 కేజీల వెండి వస్తువుల స్వాధీనం రాజోలు: చెడు వ్యసనాలకు లోనై చోరీల బాట పట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా రాజోలు పోలీసులకు చిక్కారు. శుక్రవారం రాజోలు సర్కిల్ కార్యాలయంలో సీఐ టీవీ నరేష్కుమార్, క్రైమ్ సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న రాజోలు మండలం బి.సావరం గ్రామానికి చెందిన కట్టా అర్జున్, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన సోదెం మంగప్రసాద్, రాజమహేంద్రవరానికి చెందిన షేక్ బాషి అలియాస్ బాషా, కాకినాడకు చెందిన షేక్ అజీజ్లను అరెస్ట్ చేసి రాజోలు కోర్టులో హాజరు పర్చారు. వీరిపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు పోలీస్స్టేషన్లో మూడు, ఆత్రేయపురం పోలీస్స్టేషన్లో ఒకటి, తూర్పుగోదావరి జిల్లా ఇరగవరం పోలీస్స్టేషన్లో ఒకటి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో రెండు, కొయ్యలగూడెం పోలీస్స్టేషన్లో ఒకటి, పెదవేగి పోలీస్స్టేషన్లో ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వీఎం బంజారా పోలీస్స్టేషన్లో ఒకటి మొత్తం 10 కేసులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో ఈ ముఠా చోరీ చేసి 64.106 గ్రాముల బంగారం, 2.859 కేజీల వెండి వస్తువులు, రూ. 2.80 లక్షలు నగదును పోలీసులు రికవరీ చేశారు. షేక్ అజీజ్ కాకినాడలోని ఒక నర్సింగ్ హోంలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తూ విలాసాలకు అలవాటు పడి చోరీలకు అలవాటు పడ్డాడు. అజీజ్కు కట్టా అర్జున్, సోదెం మంగప్రసాద్లు రాజమండ్రి సెంట్రల్ జైలులో పరిచయమ్యారు. వీరిద్దరితో అజీజ్ దొంగతనాలు చేయిస్తూ, తను కూడా దొంగతనాలు చేసేవాడు. వీరు దొంగిలించిన చోరీ సొత్తును షేక్బాజీ విక్రయించేవాడు. అజీజ్పై ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 75కు పైగా దొంగతనం కేసులు, కట్టా అర్జున్పై 10కి పైగా దొంగతనాలు కేసులు, షేక్ బాషిపై మారేడుమిల్లి పోలీస్స్టేషన్లో అక్రమ గంజాయి రవాణా కేసు నమోదు చేశారు. చోరీ కేసు చేధించిన రాజోలు సీఐ టీవీ నరేష్కుమార్, అమలాపురం సీసీఎస్ క్రైమ్ సీఐ ఎం. గజేంద్రకుమార్, ఎస్సైలు పరదేశి, ఎస్.రాజేష్కుమార్, ఏఎస్ఐ బాలకృష్ణ, క్రైమ్ హెచ్సీలు కె.రమణ, ఎం.రమేష్, పి.కిషోర్, ఎం.శేఖర్రాజు, కేవీ రమణ, కానిస్టేబుళ్లు బీఎన్వీఎస్ఎస్ రెడ్డి, ఆర్.శ్రీను, డి.అర్జున్, ఎం.హరిబాబు, జి.సాయి, బి.ప్రసాద్, ఎ.సుభాకర్, ఐ.శ్రీను, ఆర్.ప్రసాద్లను ఎస్పీ బీవీ కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీమోహన్ అభినందించారు. -
నలుగురు భార్యలు, ఆరుగురు సంతానం.. ఐదో పెళ్లికి రెడీ!
తూర్పు గోదావరి జిల్లా: అతనికి నలుగురు భార్యలు, ఆరుగురు పిల్లలు. ప్రస్తుతం ఒక భార్య 9 నెలల గర్భిణి. అయినా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు ఓ నిత్య పెళ్లికొడుకు. అతనిపై యానాం లోని గిరియాంపేటకు చెందిన రెండో భార్య శీలం సాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం గురువారం అతని మోసాల గురించి మీడియాకు వివరించింది. ‘యానాంలోని సావిత్రినగర్కు చెందిన ఎస్.రమేష్ నేను ప్రేమించుకున్నాం. మా ప్రేమ గురించి 2016లో యానాం పోలీస్స్టేషన్కు వెళ్లి చెప్పాం. పెద్దల సమక్షంలో యానాం వెంకన్న ఆలయంలో పెళ్లి చేసుకున్నాం. మాకు ఇద్దరు సంతానం కలిగారు. కానీ, అప్పటికే రమేష్కు భైరవపాలేనికి చెందిన కామేశ్వరితో మొదటి వివాహమైందని, ఆమెతో విభేదాలు రావడంతో వదిలేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో నాతో కాపురం చేస్తూనే చొల్లంగిపేటకు చెందిన సత్యవేణిని మూడో వివాహం చేసుకున్నాడు. వీరవేణి అనే మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నాడు. నన్ను, నా పిల్లలను రోడ్డుపాలు చేశాడు. మూడో వివాహం చేసుకున్న మహిళను హైదరాబాదులో, నాలుగో పెళ్లి చేసుకున్న మహిళను కాకినాడలో పెట్టాడు. మొదటి వివాహం చేసుకున్న ఆమెకు ఒక పాప. రెండో వివాహం చేసుకున్న నాకు ఇద్దరు పిల్లలు. మూడో వివాహం చేసుకున్న ఆమెకు ముగ్గురు సంతానం. నాలుగో భార్య ప్రస్తుతం 9 నెలల గర్భిణి. అయినా రమేష్ మళ్లీ ఐదో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. న్యాయం కోసం నేను పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని శీలం సాయి తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ అడగగా.. ఇద్దరిని కలపడానికి ప్రయతి్నంచామని, ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని చెప్పారు. -
లక్ష్మీలావణ్యను అభినందించిన కలెక్టర్
తాళ్లపూడి: అన్నదేవర పేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఆకుల లక్ష్మీలావణ్య ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షల్లో 500 మార్కులకు గాను 345 మార్కులు (69%) సాధించి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి ఆమె ఇంటికి స్వయంగా వెళ్లి అభినందించారు. గత నెల ఆగస్టు 11న బొమ్మూరు కలెక్టరేట్లో లావణ్య కలెక్టర్ ప్రశాంతిని కలిసినప్పుడు తానే స్వయంగా ‘‘మీ ఇంటికి వస్తా’’ అని చెప్పిన మాట ప్రకారం మండల పర్యటనలో భాగంగా లావణ్య ఇదే గ్రామంలో ఉండడంతో ఆమె ఇంటికి వెళ్లి లావణ్య లక్ష్మిని, ఆమె కుటుంబ సభ్యులను కలిసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని, అందుకు దివ్యాంగురాలు లావణ్య నిదర్శనమన్నారు. మళ్లీ పెరుగుతున్న నీటి ఉధృతి ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి మళ్లీ పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 10.50 అడుగులు ఉన్న నీటిమట్టం క్రమేపీ పెరుగుతూ రాత్రి 7గంటలకు 11.30 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 9,11,254 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మరోపక్క ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. శుక్రవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి స్వల్పంగా తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. డెల్టా కాలువలకు సంబంధించి 12,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.49 మీటర్లు, పేరూరులో 15.36 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.76 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 9.78 మీటర్లు, కుంటలో 18.36 మీటర్లు, పోలవరంలో 11.80 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.85 మీటర్లు వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. నేడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఆనం కళాకేంద్రంలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పంపిణీ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు తెలిపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి అవార్డులను అందజేయనున్నారు. ఆంధ్రనగర్లోని పవర్స్ ఎయిడెడ్ యూపీ స్కూల్ ఉపాధ్యాయుడు జీవీఎస్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, గాంధీపురం 2 సుంకర భాస్కరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.సన్యాసిరావు, ఎస్కేవీటీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్వీఎం సుబ్రమణ్యం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 9న జోన్ 2 స్టాఫ్నర్స్ పోస్టులకు కౌన్సెలింగ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జోన్ 2 పరిధిలోని స్టాఫ్ నర్స్ పోస్టుల కాంట్రాక్టు పద్ధతిలో భర్తీలో భాగంగా ఈ నెల 9న రాజమహేంద్రవరంలోని కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేసేందుకు జనవరి 2 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరించారు. వీటిని పరిశీలించి జులై 17న మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మెరిట్ లిస్టులో ఎంపికై న వారి ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలన అనంతరం అదేరోజు కౌన్సెలింగ్ నిర్వహించి ఉద్యోగ నియామక పత్రం అందించనున్నారు. -
సనాతనానికి మూల స్తంభాలు వేదాలు
● ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు ఘనపాఠి ● వేద స్వస్తితో పులకించిన అమలాపురం ● ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది వేద పండితుల రాక అమలాపురం టౌన్: సనాతన సంస్కృతికి మూల స్తంభాలు వేదాలేనని తిరుపతికి చెందిన వేద పండితుడు దూవ్వూరి ఫణి యజ్ఞేశ్వర సోమయాజులు ఘనపాఠి అన్నారు. శ్రీ కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సత్య సాయి కల్యాణ మండపంలో గురువారం జరిగిన 63వ వార్షికోత్సవ వేద సభలో ఆయన ఉపన్యసించారు. ఈ సభకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 250 మంది వేద పండితులు వచ్చి వేదాలను ఘోషించారు. వంక రామకృష్ణ విద్యాశంకర్ అధ్యక్షతన వేదసభ సాగింది. వేద పండితులు కడియాల వేంకట సత్య సీతారామ ఘనపాఠి, శృంగేరి అస్థాన విద్వాంసులు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, విష్ణుభట్ల సుబ్రహ్మణ్యేశ్వర ఘనపాఠి, గుళ్లపల్లి విశ్వనాథ ఘనపాఠి, విష్ణుభట్ల శ్రీకృష్ణ ఘనపాఠి, హైదరాబాద్కు చెందిన హరి సీతారామమూర్తి సలక్షణ ఘనపాఠి, వడ్లమాని సుబ్రహ్మణ్య ఘనపాఠి వేదికపై ఆశీనులై వేదాల విశిష్టతను వివరించారు. వేద ధ్వనితో సమాజ వికాసమే కాకుండా వాతావరణం కూడా పవిత్రం అవుతుందని పేర్కొన్నారు. ప్రపంచానికి రక్ష ధర్మమే, ఆ ధర్మానికి మూలం వేదమేనన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో నిత్యం పారే గోదావరి పాయలు వేదల్లా ఘోషిస్తున్నాయంటే అది ఆ వేదాల్లోని శక్తి వల్లేనని పేర్కొన్నారు. అనంతరం వందలాది మంది వేద పండితులు ఒకేసారి పలికిన వేద స్వస్తితో అమలాపురం పట్టణం పునీతమైంది. కోనసీమ భాష వేద ఘోష అన్నట్లుగా స్వస్తి సాగింది. అనంతరం వేద పండితులను వేద శాస్త్ర సన్మాన సభ కార్యదర్శి గుళ్లపల్లి వెంకట్రామ్, సభ సభ్యులు శిష్టా భాస్కర్, కుమారశాస్త్రి, యేడిది సుబ్రహ్మణ్యం తదితరులు ఘనంగా సత్కరించారు. వేదాభిమానులు మండలీక ఆదినారాయణ, పుత్సా కృష్ణ కామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వేదాలను పోషించడం అభినందనీయం ఏడాదికోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వేద పండితులను ఆహ్వానించి సత్కరించడం అంటే సాక్షాత్తు వేదాలను గౌరవించడమే. కోనసీమ వేద శాస్త్ర సభ వేదాలను పోషిండచం అభినందనీయం. ధర్మాన్ని మనం ఆచరిస్తే వేదాలు మన ధర్మాన్ని కాపాడుతాయి. వేదాలు ఎక్కడ పోషిస్తే అక్కడ వేదాలు శోభిల్లుతాయి. వేద భూమి కోనసీమ. ఈ సీమలో ప్రవహించే నదీ పాయలు కూడా వేదాలు ఘోషిస్తాయి. – హరి సీతారామమూర్తి, సలక్షణ ఘనపాఠి, వేద పండితుడు, హైదరాబాద్ మానవ మనుగడను నిర్దేశించేవి వేదాలే మానవ మనుగడను నిర్దేశించేవి వేదాలే. నాలుగు వేదాలతోనే ప్రపంచం నడుస్తోంది. వేదాధ్యయనం, వేదన పఠనం చేసిన పండితులు లోక కల్యాణంలో భాగస్వాములే అవుతారు. కోనసీమ వేద శాస్త్ర సన్మాన సభ వేద పండితులను వామన జయంతి నాడు సత్కరించడం, వేద స్వస్తి చెప్పించం లోక కల్యాణం కోసమే. ఈ సంస్థ వేదాలను పోషిండచం మాలాంటి వేద పండితులకు ఎంతో ఆనందం. – ఉపాధ్యాయుల కాశీ విశ్వ సోమయాజులు, టీటీడీ తెలంగాణ రాష్ట్ర సూపర్వైజర్ -
ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి జానీ పాషా అన్నారు. గురువారం రాజమహేంద్రవరంలోని ఏపీఎన్జీజీఓల అసోసియేషన్ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫెడరేషన్ కో ఆర్డినేటర్ దడాల జగ్గారావు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జానీ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమ్మరావు పాల్గొన్నారు. జానీ పాషా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్ మార్పు చేసి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సాధించడం కోసం నోషనల్ ఇంక్రిమెంట్లు సాధించడం కోసం కృషి చేస్తున్నామన్నారు. సచివాలయ ఉద్యోగులు అంటే కట్టు బానిసలుగా భావిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఉద్యోగులు ఎట్టి పరిస్థితిలో బానిసలు కాదన్నారు. సచివాలయాల శాఖ సర్వేల శాఖగా మారిపోయిందన్నారు. సమావేశానికి హాజరైన వివిధ విభాగాల సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర నాయకత్వం దృష్టికి అనేక సమస్యలను తీసుకొచ్చారు. రాజమహేంద్రవరం ఏపీఎన్జీజీఓ అసోసియేషన్ నగర అధ్యక్షుడు పి.అనిల్కుమార్, నగర కార్యదర్శి సేవా ప్రవీణ్, కొల్లిరాజేష్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
గురువుల మార్గదర్శకత్వంతోనే ఈ స్థాయికి
నా తొలి గురువులు తల్లిదండ్రులు షేక్ మీరాబి, కరీమ్. చిన్నతనం నుంచి క్రమశిక్షణ అలవరచి చదువులో బాగా ప్రోత్సహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం గార్లమడుగు ఎస్ఎంఎన్బీ మెమోరియల్ ఓరియంటల్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు హెచ్ఎం కె.నాగేశ్వరరావు నాపై చెరగని ముద్ర వేశారు. గురువుల దయతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. టీచర్ ప్రవర్తన విద్యార్థుల జీవితాలకు స్ఫూర్తిదాయకం కావాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిత్యం మననం చేసుకుంటాను ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క చదువుకు మాత్రమే ఉంది. అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానమార్గంలో నడిపించడం గురువుకే సాధ్యం. గురువు స్ఫూర్తిదాయకంగా ఉంటారు. కాకినాడ ఐడియల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో డాక్టర్ చిరంజీవినీకుమారి చదువుతో పాటు జీవిత పాఠాలు నేర్పారు. సమాజానికి ఉపయోగపడేలా చదువుకోవాలని చెప్పిన మాటలు నేటికీ మననం చేసుకుంటాను. – దేవిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా రవాణా అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వారి ప్రభావం ఎంతో ఉంది నా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లో సాగింది. ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ పద్మజ, ప్రిన్సిపాల్ శశి ప్రభావం నాపై ఎక్కువుగా ఉంది. వారు నేర్పిన క్రమశిక్షణ, నైతిక విలువలు లక్ష్యాన్ని నిర్దేశించాయి. వారిచ్చిన స్ఫూర్తితోనే పోలీస్ అవ్వాలనే కోరిక బలంగా నాటుకుంది. సాంకేతికంగగా ఎంత ఎదిగినా ఉపాధ్యాయుల పాత్ర ఎప్పటికీ నిలిచే ఉంటుంది. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం -
7న వాడపల్లి ఆలయం మూసివేత
కొత్తపేట: చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం నుంచి ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్టు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 7వ తేదీ ఆదివారం రాత్రి 9.55 గంటల నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు చంద్రగ్రహణం సంభవిస్తుందని పేర్కొన్నారు. గ్రహణ సమయానికి ముందుగానే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయాన్ని మూసివేయనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం 7.01 గంటలకు ఆలయాన్ని తెరిచి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారని తెలిపారు. -
అశ్లీల నృత్యాలపై కేసు : ఐదుగురు నిర్వాహకుల అరెస్టు
నల్లజర్ల: వినాయక నిమజ్జన ఊరేగింపులో భాగంగా అశ్లీల నృత్యాలు చేయించిన నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. తెలికిచెర్లలో వినాయక నిమజ్జనం, ఊరేగింపులో గత నెల 31వ తేదీన హిజ్రాలతో ట్రాక్టర్పై అశ్లీల నృత్యాలు చేయించి ప్రజలకు ఇబ్బంది కల్గించిన కమిటీ సభ్యులు రుద్రా శ్రీనివాస్, పాలూరి సుబ్బారావు, కోట వెంకట శ్రీనివాస్, చౌటుపల్లి చిన్ననరసయ్య, అడ్డాల సత్తిపండుపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ విలేకరులకు తెలిపారు. వీఆర్వో డి.శ్రీనివాస్ గురువారం ఇచ్చిన ఫిర్యాదుపై సెక్షన్ 292, 296, 50గా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా సీఐ బాలశౌరి మాట్లాడుతూ ఊరేగింపులకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఊరేగింపులలో ఎటువంటి అశ్లీల నృత్యాలు నిర్వహించరాదని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా సౌండ్ సిస్టమ్లు పెట్టకూడదని, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. -
గురువు.. తిమిరంలో తేజోమూర్తి
● బాలలను బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దే నేర్పరి ● రేపు ఉపాధ్యాయ దినోత్సవం రాయవరం: ‘గురవంటే రెండు బెత్తం దెబ్బలు.. నాలుగు గుంజీలు తీయించడం కాదు.. కొండంత చీకటిలో తేజోమయంగా వెలిగే దీపం. గురవంటే పసిపిల్ల పెదాలపై విరిసిన నవ్వురేఖ..’ ఈ మాటలన్నది ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అజ్ఞానపు తిమిరాన్ని పారదోలి విజ్ఞాన కాంతులు ప్రసరింపజేసే మార్గదర్శకులు గురువులు. విద్యార్థిని సానబట్టి వజ్రంలా తయారు చేసే అక్షర శిల్పులు. అందుకే ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కొఠారి దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందన్నారు. ఎంతటి శాస్త్రవేత్త అయినా, దేశానికి ప్రధాని అయినా ఒక ఉపాధ్యాయుడి వద్ద ఓనమాలు నేర్చుకున్న వారే. గురువుల స్ఫూర్తితో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న వేళ గురువులపై పలువురి అభిప్రాయాలతో కథనం.. గురువు పాత్ర ఎనలేనది సమాజంలో గురువు పాత్ర ఎనలేనిది. నిరంతర విద్యార్థిగా ఉంటూ తన శిష్యులను ఉన్నత స్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తుంటారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివే సమయంలో వయోల మేడమ్ సైన్స్, ఇంగ్లిష్ బోధించేవారు. ఆమె బోధనా విధానం నన్ను ప్రభావితం చేసింది. ఉపాధ్యాయులు నేర్పిన విద్యతోనే ఈ రోజు జిల్లా అధికారిగా రాణించగలుగుతున్నాను. – జి.మమ్మీ, డిప్యూటీ కలెక్టర్, ఏపీసీ, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
బీసీ సంక్షేమ సంఘ పటిష్టతకు చర్యలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లా, నియోజకవర్గ కమిటీలతోపాటు గ్రామ గ్రామాన రాష్ట్ర స్థాయిలో బీసీ సంక్షేమ సంఘాన్ని పటిష్ట పరచడానికి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పిలుపునిచ్చారు. స్థానిక రోటరీ క్లబ్ భవనంలో గురువారం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా శాఖ బీసీ సంఘ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ విద్యార్థుల వసతి గృహ సమస్యల పరిష్కారంతో సహా జాతీయ స్థాయిలో జన గణనతో పాటే కులగణన కూడా నిర్వహించాలన్నారు. కేంద్ర స్థాయిలో చట్టసభలలో బీసీ రిజర్వేషన్ ఓబీసీ సబ్ ప్లాన్లో ప్రత్యేక బడ్జెట్ కోసం జాతీయస్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలు సాగిస్తున్నామన్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం, చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థలలో 34 రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమిద్దామని అన్నారు. ఈ సమావేశంలో ముచ్చకర్ల సత్యనారాయణ, బిల్డర్ చిన్న, నరవ గోపాలకృష్ణ, దొమ్మేటి సోమశంకర్, మజ్జి అప్పారావు, ఎం.సురేష్, వాసంశెట్టి గంగాధర్, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఏదీ ఉపాధి హామీ?
విడుదలయ్యే అవకాశం ఉపాధి హామీ బిల్లులు జూన్ మాసం నుంచి పెండింగ్లో ఉన్నాయి. కూలీలు పనులు చేసిన వెంటనే ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నాం. త్వరలోనే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే వారి ఖాతాలకు జమ చేస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికీ పనులు చూపుతున్నాం. పనులు జరిగే ప్రదేశంలో కూలీలకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. – నాగమహేశ్వరరావు, డ్వామా పీడీ సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు పస్తులు తప్పడం లేదు. రోజంతా స్వేదం చిందించినా గొంతులోకి ముద్ద దిగడం లేదు. ఉపాధి హామీ కూలీలకు జూన్ నెల 25వ తేదీ నుంచి వేతనాలు స్తంభించడంతో లబోదిబోమంటున్నారు. వెరసి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కూలి డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారా..? అని నిరీక్షిస్తున్నారు. మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు సైతం విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రూ.34 కోట్ల బకాయిలు వలసలు నియంత్రించి ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యసాధనకు దూరంగా ఉంటోంది. సకాలంలో వేతనాలు మంజూరు చేయకపోవడంతో కూలీలు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం వ్యవసాయ పనులు కాస్త నెమ్మదించాయి. ఫలితంగా కూలీలు ఉపాధి పనుల వైపు ఆసక్తి చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రతి రోజూ 20 నుంచి 30 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ వేతనాల కింద రూ.34 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కూలీకి సగటున రూ.15వేల నుంచి రూ.20 వేల వేతనం అందాల్సి ఉంది. ఉపాధి కూలీ డబ్బులు వస్తాయని భావించి కిరాణా దుకాణాల్లో అప్పులు చేశారు. వాటిని తీర్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే విడుదలవుతాయని చెబుతున్నారే తప్ప.. ఎప్పుడన్నది కచ్చితంగా చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోజుకు సగటున రూ.276 కూలి ఉపాధి పథకంలో వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేస్తే సగటున రోజుకు రూ.276 నుంచి రూ.343 వరకు కూలీ గిట్టుబాటు అవుతుంది. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోంది. సాధారణంగా ఉపాధి పథకంలో ప్రతి వారం కూలీ డబ్బులు చెల్లించడం ఆనవాయితీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలి చెల్లింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రతి వారం కూలి డబ్బులు చెల్లిస్తే ఇంట్లో అవసరాలు, నిత్యావసరాలు కొనుగోలు చేసుకుంటారు. జూన్ మాసం నుంచి ఉపాధి వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పనులకు వెళుతున్నా.. డబ్బు తమ ఖాతాల్లో జమకావడం లేదని కూలీలు వాపోతున్నారు. వెరసి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. నెలల తరబడి డబ్బు ఇవ్వకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. రూ.10.99 కోట్ల మెటీరియల్ కాంపొనెంట్ ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు పనులు హడావుడిగా చేపట్టారు. మినీ గోకులం, మొక్కల పెంపకం తదితర పనులు చేపట్టారు. ఇందుకు ఇప్పటి వరకు రూ.10.99 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అప్పులు చేసి మరీ పనులు చేపడితే, సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీ చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకురావడం లేదు. ప్రధానంగా రహదారుల పనుల్లో ఎక్కువ శాతం బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వేసేశారు. ప్రస్తుతం బిల్లులు అందక ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇలా... తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 1.70 లక్షల జాబ్కార్డులు మంజూరు చేశారు. అందులో 2.63 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. 1.26 లక్షల జాబ్కార్డులకు సంబంధించి 1.82 లక్షల మంది పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 459 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. మహిళలకు 56.08 శాతం, ఎస్టీలకు 2.01 శాతం, ఎస్సీలకు 37.05 శాతం పనులు చూపారు. ఇప్పటి వరకు 5,271 పనులు పూర్తి చేశారు. అందులో 43.44 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం కల్పించారు. 30 లక్షల పనిదినాల లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల పనిదినాలు కల్పించాలని డ్వామా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటి వరకు 29 లక్షల పనిదినాలు కల్పించారు. మిగిలినవి సైతం త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో... గత ప్రభుత్వ హయాంలో 2024 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులు, బిల్లుల చెల్లింపులు వేగంగా జరిగాయి. కూలీలతో చేపట్టే పనులు కాకుండా.. మెటీరియల్ కాంపొనెంట్ ద్వారా పనులు నిర్వహించారు. రూ.152.13 కోట్లు వెచ్చించారు. వేతన ఖర్చుగా కూలీలకు రూ.94.49 కోట్లు, మెటీరియల్ కాంపొనెంట్లో భాగంగా రూ.50.50 కోట్లు ఖర్చు చేశారు. రూ.7.14 కోట్లు పరిపాలన ఖర్చుకు వెచ్చించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు అందని వేతనాలు జూన్ 25వ తేదీ నుంచి తప్పని పస్తులు జిల్లావ్యాప్తంగా రూ.34 కోట్ల బకాయిలు స్వేదం చిందిస్తున్నా కడుపు నిండని దుస్థితి ఎప్పుడు అందుతాయో తెలియక ఆందోళన నేడు.. రేపంటూ అధికారుల కాలయాపన జిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు 18 పంచాయతీలు : 300 మంజూరైన జాబ్కార్డులు : 1.70 లక్షలు కూలీలు : 2.63 లక్షలు యాక్టివ్ జాబ్కార్డులు: 1.26 లక్షలు పనులు వినియోగించుకుంటున్న కూలీలు: 1.82 లక్షలు -
రెవెన్యూ రికార్డుల తారుమారుపై నిరసన
గోపాలపురం: కరిచెర్లగూడెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 150లో 137 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడంపై సొంత భూ యజమానులు గురువారం తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వారికి జరిగిన అన్యాయంపై ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కరరెడ్డిని విచారణ అధికారిగా నియమించారు. తహసీల్దారు కార్యాలయంలో 150 సర్వే నంబరుకు సంబంధించిన రికార్డును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూ రీ సర్వే సమయంలో రెవెన్యూ అధికారులు కొంతమంది టీడీపీ నాయకులు, ప్రైవేటు వ్యక్తులు కలసి రికార్డులు తారుమారు చేసినట్టు రుజువైందన్నారు. బాధితుల నుంచి తీసుకున్న వాంగ్మూలాలను రెండు రోజుల్లో కలెక్టరుకు నివేదిస్తామన్నారు. బాధిత రైతులు విలేకరులతో మాట్లాడుతూ గోపాలపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, అప్పటి తహసీల్దారు రవీంద్రనాథ్, డిప్యూటీ తహసీల్దారు ఎస్.కృష్ణ, రెవెన్యూ సిబ్బంది కలసి మా భూములను వేరే వ్యక్తులకు ఆన్లైన్ చేసి నకిలీ పట్టాదార్ పాస్పుస్తకాలు సృష్టించి వేరే వ్యక్తులకు అమ్మకాలు సాగించారని ఆరోపించారు. -
అధరకొడుతున్న కొబ్బరి
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరి ధరలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. గత ఆరు నెలలుగా రైతుల అంచనాలకు మించి ధరలు నమోదవుతున్నాయి. కురిడీ కొబ్బరి కొత్త రికార్డులు నమోదు చేస్తుండగా.. పచ్చి కాయలు సైతం ఆల్టైమ్ హైకి చేరాయి. తొలుత పచ్చి కొబ్బరికాయ ధర రూ.15 ఉండగా.. ఆ తర్వాత అది రూ.17కు చేరడంతో రైతులు సంబరపడ్డారు. అది కాస్తా రూ.19కి.. ఆపై రూ.20కి, రూ.22కి.. ఇప్పుడు ఏకంగా రూ.24కు చేరింది. ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కొబ్బరికాయల ధర రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకు పలుకుతోంది. ఈ స్థాయిలో ధర రావడం ఇదే తొలిసారి. దీంతో అంబాజీపేట మార్కెట్లో జోష్ నెలకొంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 130 లారీల కొబ్బరికాయలు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. కురిడీకి భలే డిమాండ్.. కురిడీ కొబ్బరి ధరలు కూడా భారీగా పెరిగాయి. పాతకాయలలో గండేరా రకానికి(పెద్ద కాయ) చెందిన వెయ్యి కాయల ధర రూ.31,500 ఉంది. అదే గటగటా రకం(చిన్నకాయ) రూ.30 వేలు పలుకుతోంది. ఇక కొత్తకాయలో గండేరా రకం రూ.30 వేలు.. గటగటా రకం రూ.28,500 వరకు ధర ఉంది. కోనసీమ జిల్లా నుంచి రోజుకు 40 లారీల కురిడీ కొబ్బరి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో తగ్గిన దిగుబడులు దక్షిణాదిలో ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు తగ్గాయి. కేరళలో 40 శాతం, తమిళనాడు, కర్ణాటకలో 30 శాతానికి పైగా దిగుబడి తగ్గింది. దీంతో గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్ తదితర రాష్ట్రాలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి కాయలను ఎగుమతి చేస్తున్నారు. అలాగే వరుస పండగలు కూడా ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే వినాయకచవితి వేడుకలు జరుగుతుండగా.. నెలాఖరు నాటికి దసరా, ఆ తర్వాత దీపావళి, ఆ వెంటనే కార్తీక మాసం మొదలుకానుంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొబ్బరికి ఎక్కువగా ఆర్డర్లు వస్తుండడం కూడా ధరల పెరుగుదలకు కారణమని వెల్లడించారు. అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కాయల ధర రూ.23 వేల నుంచి రూ.24 వేలు కురిడీ కొబ్బరి రూ.31,500కు చేరిక ఆరు నెలలుగా రికార్డు స్థాయిలో ధరలు వరుస పండగల ప్రభావం -
ఊరేగింపులో ముగ్గురిపై కత్తిపోట్లు
వినాయక నిమజ్జనం సందర్భంగా ఘటన అల్లవరం: గణేష్ ఉరేగింపులో జరిగిన ఘర్షణలో ముగ్గురు కత్తిపోట్లకు గురైన ఘటన మండలం కొమరగిరిపట్నంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, వివరాలు ప్రకారం వినాయకచవితి సందర్భంగా గుర్రం వారి వీధిలో వినాయక విగ్రహాన్ని గురువారం ఊరేగించారు. విగ్రహం శివాలయం వద్దకు వచ్చే సరికి వారిలో వారికి ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో తిక్కిరెడ్డి మోహిత్ మణికంఠ చెడీ తాళింఖానా చేసే కత్తితో సుంకర సురేష్, కొమ్మూరి శంకర్లను వెనుక నుంచి పొడిచాడు. మణికంఠ ఇద్దరిపై కత్తితో దాడి చేసిన విషయాన్ని గమనించిన తెలగరెడ్డి హరీష్ అడ్డుపడ్డాడు. దీంతో హరీష్పై మణికంఠ దాడి చేసి కత్తితో పోడిచాడు. దీంతో స్థానికులు అప్రమత్తమై రక్తపు మడుగులో ఉన్న ముగ్గురినీ స్థానిక సీహెచ్సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అమలాపురంలోని కిమ్స్కు తరలించారు. ఈ వివాదంలో స్వల్పగాయాల పాలైన మణికంఠను కిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్సై సంపత్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కిమ్స్ ఆస్పత్రిలో బాధితుల నుంచి పోలీసులు సమాచారం సేకరించి విచారణ చేస్తున్నారు. -
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
తొండంగి: మండలంలోని ఒంటిమామిడి గ్రామంలో ఓ ఇంట్లో చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్టు ఎస్సై జగన్మోహనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఒంటిమామిడిలో ఆగస్టు 11న బొమ్మదేవ్ సారధి ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటనలో దుండుగులు బంగారు, వెండి నగలు, కొంత నగదు చోరీ చేశారు. దీనిపై విచారణ చేపట్టి బుధవారం నిందితులను అనకాపల్లి జిల్లా రేవుపోలవరానికి చెందిన చేపల నాని అలియాస్ స్టైలిష్ నాని, యు.కొత్తపల్లికి చెందిన బొండు శివలను అరెస్టు చేశామన్నారు. వారి నుంచి చోరీ చేసిన నగలు తాకట్టు పెట్టి స్కూటీ కొనుగోలు చేయగా ఆ వాహనంతో పాటు కొంత నగదును రికవరీ చేశామన్నారు. రికవరీ సొత్తు విలువ రూ.2.4 లక్షలు ఉంటుందన్నారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పీసీలు సీహెచ్ మణి వీరకంఠ, సీహెచ్ దొర, పి.శివ, కేఆర్వీ సత్యనారాయణ, టి.శ్రీనివాస్, ఆర్.కిశోర్లను ఎస్పీ బిందుమాధవ్, డీఎస్పీ శ్రీహరిరాజు అభినందించారని తెలిపారు. -
600 కిలోల గంజాయి స్వాధీనం
మలకపల్లి వద్ద కారులో పట్టివేత తాళ్లపూడి: మండలంలోని మలకపల్లి వద్ద భారీగా గంజాయి పట్టు బడింది. వైజాగ్ జోనల్ యూనిట్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు తమిళనాడు రిజిస్ట్రేషన్కు చెందిన ఇన్నోవా కారులో సుమారు 600 కేజీల గంజాయి వస్తున్నట్టు అందిన సమాచారం మేరకు వైజాగ్ నుంచి వెంబడిస్తూ మలకపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు పరారు కాగా, పట్టుబడ్డ మహారాజన్ రాజా అనే వ్యక్తిని తాళ్లపూడి స్టేషన్కు తరలించారు. సరకును, వాహనాన్ని, నిందితుడిని రాజమహేంద్రవరం తరలిస్తామని అక్కడి అధికారులు పూర్తి సమాచారం ఇస్తారని తెలిపారు. ఐరెన్ ట్రాక్టర్ బోల్తా: వ్యక్తి మృతి ముమ్మిడివరం: ఇనుప ఊసలతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రక్కు అదుపు తప్పి బొల్తా పడడంతో వాహనంపై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం అయినాపురం అవుట్ ఫాల్ స్లూయిస్ ఏటుగట్టుపై గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. అయినాపురం ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఐరన్ను ట్రాక్టర్పై మురమళ్ల తరలిస్తుండగా ఏటిగట్టుపై ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్పై ఉన్న యానాం శివారు కురసాం పేటకు చెందిన కూలీ మేడిశెట్టి గోవిందు (48) ఊసలు మధ్య ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ముమ్మిడివరం ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
4 వేల కిలోల నల్ల బెల్లం స్వాధీనం
ఇద్దరి అరెస్టు ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న నాలుగు వేల కిలోల నల్ల బెల్లాన్ని గురువారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని అంబాగుబా గ్రామం నుంచి కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి మినీ గూడ్స్ వేన్లో నల్లబెల్లం రవాణా జరుగుతోంది. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళికి అందిన సమాచారం మేరకు ఎకై ్సజ్ ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్తు, ప్రత్తిపాడు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ తమ సిబ్బందితో వెళ్లి ధర్మవరం సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. గూడ్స్ వేన్తో పాటు, 4 వేల కిలోల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. వేన్ డ్రైవర్లు సామర్లకోటకు చెందిన తుమ్మల వీర వెంకట సూర్యతేజ, పెద్దాపురం మండలం మర్లావ గ్రామానికి చెందిన నక్కా చినవీర్రాజులను అరెస్టు చేశారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి దాడి లోవరాజుపై కేసు నమోదు చేసినట్టు ప్రత్తిపాడు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ తెలిపారు. ఈదాడిలో ప్రత్తిపాడు ఎకై ్సజ్ ఎస్సై పున్నం వంశీరామ్ తదతర సిబ్బంది పాల్గొన్నారు. -
స్ప్రేయర్ మొరాయిస్తే.. ఫియరే..!
రాయవరం: పంటలకు ఆశించిన చీడపీడల నివారణకు మందులు పిచికారీ చేయడానికి రైతులు రకరకాల స్ప్రేయర్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటలకు ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు పురుగు మందులను పిచికారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పంట కాలంలో వాటితో పని ముగియగానే అలాగే వదిలేస్తారు. తర్వాత పంట కాలంలో అవసరం రాగానే స్ప్రేయర్లను మళ్లీ వినియోగించేందుకు యత్నిస్తే.. చాలావరకు మొరాయిస్తుంటాయి. అప్పుడు స్ప్రేయర్లను తీసుకుని మెకానిక్ షెడ్లకు పరుగులు పెట్టడం సర్వసాధారణం. డబ్బు వెచ్చించి రిపేరు చేయించడం కన్నా, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వృథా ఖర్చులు తగ్గడంతో పాటు, స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగు ఆశించడంతో రైతులంతా పురుగు మందుల పిచికారీలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో స్ప్రేయర్లను భద్రపర్చే విధానాన్ని మండల వ్యవసాయాధికారి కేవీఎన్ రమేష్కుమార్ వివరించారు. పవర్ స్ప్రేయర్ మందుల పిచికారీ సమయం ముగియగానే మంచి నీటితో శుభ్రం చేయాలి. ట్యాంకులో పెట్రోలు లేకుండా చూసుకోవాలి. టర్బోరేటర్ గిన్నెలోనూ పెట్రోలు లేకుండా చూడాలి. ప్లగ్ తీసి శుభ్రంగా పెట్రోల్తో కడగాలి. పిస్టన్పై 5–6 చుక్కల ఇంజినాయిల్ వేసి ప్లగ్ను బిగించాలి. ఇలా చేస్తే పిస్టన్ పాడైపోకుండా ఉంటుంది. మళ్లీ అవసరం వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ అవుతుంది. తైవాన్ ట్యాంకులో ఐదు లీటర్ల మంచినీరు పోయాలి. ఇంజిన్ స్టార్ట్ చేసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. ఇలా చేయడం వల్ల పైపుతో పాటు, నాజిల్లో మలినాలు లేకుండా శుభ్రమవుతుంది. ట్యాంకులో పెట్రోలు లేకుండా తీయాలి. ప్లగ్ను తీసి పిస్టన్పై ఐదారు చుక్కల ఇంజినాయిల్ వేసి ప్లగ్ బిగించాలి. పంపు భాగాలన్నింటినీ శుభ్రంగా తుడిచి భద్రపర్చుకోవాలి. రీచార్జబుల్.. పనులు పూర్తయిన వెంటనే మూడు లీటర్ల నీటిని ట్యాంకులో పోసి బయటకు పంపాలి. ప్రతి 15 రోజులకు ఓసారి గంట పాటు చార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ డ్రెయిన్ కాకుండా ఉంటుంది. అన్నదాతలు ఆయా విషయాలు పాటించి తమ పంపు స్ప్రేయర్లను భద్రపర్చుకోవచ్చు. ఏడాది తర్వాత తీసినా.. మందుల పిచికారీ పూర్తి కాగానే శుభ్రమైన నాలుగు లీటర్ల మంచినీటిని ట్యాంకులో పోసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తద్వారా స్ప్రేయర్ గొట్టం(ఇత్తడి) తీసి, దానికి ఇంజినాయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్లు, రాడ్ల వద్ద ఇంజినాయిల్ పూయడం వల్ల తుప్పు రాకుండా ఉంటుంది. ఏడాది తర్వాత తీసి వాడినా బాగా పనిచేస్తుంది. హైటెక్.. ట్యాంకులో మూడు లీటర్ల నీటిని పోసి శుభ్రంగా నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తర్వాత స్ప్రేయర్ గొట్టం తీసి దానికి ఇంజినాయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్లు, రాడ్ల వద్ద ఇంజినాయిల్ పూయడం వల్ల తుప్పు పట్టదు. పరికరాలను భద్రపర్చాలంటున్న వ్యవసాయ నిపుణులు నెలల తరబడి వదిలేస్తే.. మొండికేసే అవకాశం డబ్బు, సమయం వృథా చిన్న జాగ్రత్తలతో రైతులకు మేలు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
దేవరపల్లి: వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మండలంలోని కృష్ణంపాలెం వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా మేజిక్ డ్రైవర్ నాని(28) మృతి చెందగా, వాహనంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం గోపాలపురం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. కృష్ణంపాలెం వద్ద ముందు వెళుతున్న లారీని కంటైనర్ ఢీకొంది. అదే సమయంలో డ్యాన్సర్లతో వస్తున్న టాటా మేజిక్ వెనుక నుంచి కంటైనర్ను ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జరానికి చెందిన డైవర్ నాని(28) మృతి చెందగా, డ్యాన్సర్లు చరణ్ ఢిల్లీరావు, హరిసంతోష్, కరిష్మా తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి నెల్లూరుకు ప్రోగ్రాం కోసం 8 మంది వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు నాని కూడా డ్యాన్సరేనని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడికి ఇటీవల నిశ్చితార్థమైంది. రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గోపాలపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. కుమార్తెను చూసేందుకు వెళ్తూ.. అయినవిల్లి: సడన్ బ్రేక్ వేయడంతో ఆటో తిరగబడిన ప్రమాదంలో ప్రయాణికుడు మృతి చెందాడు. ఎస్సై హరికోటిశాస్త్రి వివరాల ప్రకారం, బుధవారం చింతనలంక చిన రామాలయం వీధికి చెందిన గోసంగి తనుకులు(75) ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని తన కుమార్తెను చూసేందుకు బయలుదేరాడు. ముక్తేశ్వరంలో ఆటో ఎక్కి అమలాపురం వెళ్తుండగా, రావిగుంట చెరువు వద్ద ఆటోడ్రైవర్ అతివేగంగా వెళ్తూ సడన్ బ్రేక్ వేశాడు. ఆటో బోల్తా పడడంతో తనుకులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అతడి కుమారుడు అంజికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. వర్షంలో ప్రయాణిస్తూ.. అమలాపురం టౌన్: కిమ్స్ ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్రంగి మేసీ్త్ర మరణించాడు. పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు వివరాల మేరకు, అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామానికి చెందిన వడ్రంగి మేసీ్త్ర గోడ ఫణికుమార్(32) వర్షం కురుస్తున్న సమయంలో స్కూటీపై వెళుతున్నాడు. అమలాపురం వైపు వస్తున్న ట్రాక్టర్ అతడిని వెనుక నుంచి ఢీకొంది. మరో బైకిస్ట్ను కూడా ట్రాక్టర్ ఢీకొట్టడంతో అతనూ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఫణికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిషోర్బాబు తెలిపారు. -
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
శంఖవరం: చదువుపై దృష్టి సారించడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కృష్ణాలయం వీధిలో కనిగిరి వర లక్ష్మీ అపర్ణ(16) మంగళవారం రాత్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అన్నవరం అడిషనల్ ఎస్సై ఎల్ ప్రసాద్ వివరాల మేరకు, స్థానిక ఆదర్శ పాఠశాలలో అపర్ణ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం కళాశాలకు వెళ్లొచ్చిన ఆమె ఇంటి వద్ద చదువుపై దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అపర్ణ తన తల్లిదండ్రులు పడుకున్నాక, ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిర్జీవంగా ఉన్న కు మార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అపర్ణ మృతికి పాఠ శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పోలీసులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
వివాదాస్పద ఫ్లెక్సీలపై చర్యలకు డిమాండ్
పోలీస్ స్టేషన్ వద్ద దళితుల ఆందోళన మామిడికుదురు: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పనపల్లిలో వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు నేపథ్యంలో బుధవారం నగరం పోలీస్ స్టేషన్ వద్ద వారు ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, సినీ నటుల అభిమాన సంఘాలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో నాయకులు, హీరోల పేర్లలో బాబు సీమ, కల్యాణ్ సీమ అని అన్వయించుకోవడం వివాదాలకు కారణమవుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు కొన్ని కులాలను కించపర్చేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సై ఎ.చైతన్యకుమార్, తహసీల్దార్ పి.సునీల్కుమార్కు వినతిపత్రాలు ఇచ్చారు. అంబేడ్కర్ యువజన సంక్షేమ సంఘం, ఎమార్పీఎస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కుల విద్వేషాలను రెచ్చగొట్టొద్దు: సీపీఎం అమలాపురం టౌన్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో కులవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా సీపీఎం కార్యాలయంలో పార్టీ నాయకులు బుధవారం సమావేశమై దీనిపై చర్చించారు. ఈ ఫ్లెక్సీ వేయించిన వారిపై, ముద్రించిన షాపుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. పార్టీ నాయకులు జి.దుర్గాప్రసాద్, పీతల రామచంద్రరావు, జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 3.30 లక్షల ఇళ్లకు కుళాయిలు
● ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ప్రశాంతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జల్ జీవన్ మిషన్ కింద ఇప్పటి వరకూ జిల్లాలో 3,56,543 ఇళ్లకు గాను 3,30,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు కలెక్టర్ ప్రశాంతి అన్నారు. జల్ జీవన్ మిషన్ అదనపు జాయింట్ సెక్రటరీ సి.కమల్ కిశోర్ బుధవారం న్యూఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 92 శాతం గృహల వివరాలను ఐఎంఐఎస్ వెబ్సైట్లో అప్లోడ్ చేశామన్నారు. జిల్లాలోని 865 పాఠశాలలు, 868 అంగన్వాడీ కేంద్రాలకు సురక్షిత తాగునీటి కోసం కుళాయిలు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.144.38 కోట్లతో 491 పనులు పూర్తి చేసి గ్రామ పంచాయతీలకు అప్పగించామని, మరో రూ.24.75 కోట్లతో చేపట్టిన 48 పనులు పూర్తి కావడంతో త్వరలో వాటిని కూడా పంచాయతీలకు అప్పగిస్తామన్నారు. బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ తప్పనిసరి బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మనం అక్షరాస్యత గురించి మాట్లాడే వారమని, కానీ నేడు ఆర్థిక అక్షరాస్యత, భౌతిక అక్షరాస్యత గురించి కూడా చర్చించాలన్నారు. బ్యాంకు ఖాతాను తెరవడం, దానిని కాలానుగుణంగా అప్డేట్ చేయడం, సురక్షితంగా ఖాతాను నిర్వహించడం.. ఇవన్నీ ఆర్థిక అక్షరాస్యతలో భాగమని తెలిపారు. 2014లో జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్ ఖాతాలను చాలామంది తెరిచారని, అలాంటి వారంతా ఇప్పుడు తమ ఖాతాలకు ఈ–కేవైసీ తప్పక చేయించాలని సూచించారు. సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లలిత్ త్యాగి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆర్థిక సేవలు అందేలా చూసి, ఆర్థిక సమ్మిళితకై సంతృప్తి స్థాయిలో ప్రచారం చేపట్టాలన్నారు. భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ స్వయం సహాయక బృందాలకు రూ.20 లక్షల చొప్పున నమూనా చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కాటన్ బ్యారేజీకి తగ్గిన వరద ఉధృతి
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీకి వరద ఉధృతి బుధవారం మరింత తగ్గింది. ఉదయం నుంచి క్రమేపి తగ్గుతూ వచ్చి.. రాత్రి 8 గంటలకు 10.70 అడుగులకు చేరింది. అయితే ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరుగుతుండటంతో మరో రెండు రోజుల పాటు కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరంలో 11.20 మీటర్లు, పేరూరులో 15.85 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.57 మీటర్లు, భద్రాచలంలో 41.80 అడుగులు, కూనవరంలో 17.48 మీటర్లు, కుంటలో 9.40 మీటర్లు, పోలవరంలో 11.65 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.70 మీటర్ల నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
కేసులు పెడితే దోషులవుతారా?
● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ● ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్ సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని దోషిగా ప్రచారం చేస్తోందని, ప్రభుత్వం కేసులు పెట్టినంత మాత్రాన దోషి ఎలా అవుతారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో మాజీ మంత్రి ధర్మాన, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట ధర్మాన మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ మిథున్రెడ్డిపై కేవలం కొన్ని ఆరోపణలు మాత్రమే వచ్చాయన్నారు. న్యాయవ్యవస్థ దోషి అని నిర్ధారించలేదన్నారు. ప్రభుత్వం కేసులు పెట్టిన వారంతా దోషులు కారని స్పష్టం చేశారు. మిథున్రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో ప్రతి కుటుంబంతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇంతవరకు తుది చార్జిషీట్ వేయలేదన్నారు. చార్జీషీటు వేస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయంతో మిథున్రెడ్డి ఉన్నారన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ.. మిథున్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే కుట్రతో అక్రమ కేసు పెట్టారన్నారు. జైల్లో మిథున్రెడ్డి ధైర్యంగా ఉన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలను జైలుకు పంపడంపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు. -
‘ఎంఏ పొలిటికల్ సైన్స్’కు లైన్ క్లియర్
● విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన ‘నన్నయ’ అధికారులు ● ఆ గ్రూపును కొనసాగిస్తామని ప్రకటన రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూప్ను యథాతథంగా కొనసాగించాలంటూ విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనలకు యూనివర్సిటీ అధికారులు దిగివచ్చారు. విద్యార్థుల కోరిక మేరకు ఆ గ్రూప్ను కొనసాగిస్తామని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నన్నయ వర్సిటీని ప్రారంభం నుంచీ ఫాకల్టీ సమస్య వేధిస్తోంది. అరకొరగా ఉన్న ఫ్యాకల్టీలో 80 శాతం మంది అడ్హాక్ అధ్యాపకులే. వీరు కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేకపోవడంతోనే వివిధ సమస్యలకు కారణమవుతోంది. ఈ క్రమంలో పొలిటికల్ సైన్స్ బోధించే ఇద్దరు అధ్యాపకులకు ఏర్పడిన వివాదం విద్యార్థుల భవితకు శాపంగా మారింది. పొలిటికల్ సైన్స్ బోధించే అధ్యాపకులు లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న 22 మంది విద్యార్థులకు తరగతులు బోధించడం కష్టతరంగా మారింది. దీంతో వారిని యూనివర్సిటీ పరిధిలోని కాకినాడ క్యాంపస్కు పంపించాలని యూనివర్సిటీ అధికారులు భావించారు. కానీ దానికి విద్యార్థులు సమ్మతించలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా అడ్మిషన్లు తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చిన యూనివర్సిటీ అధికారులు ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనిని విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో పాటు దళిత, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అధికారుల ఆదేశాల ప్రతుల దగ్ధం ఎంఏలో పొలిటికల్ సైన్స్ గ్రూపులో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేయవద్దంటూ యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై విద్యార్థులు మండిపడ్డారు. యూనివర్సిటీలో ఏర్పడిన అధ్యాపకుల సమస్యకు పరిష్కారం ఏమిటనే విషయాన్ని ఆలోచించడంతో పాటు పొలిటికల్ సైన్స్ గ్రూపును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఎంఏ పొలిటికల్ సైన్స్లో నూతన ప్రవేశాలు తీసుకోవద్దంటూ యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రతులను కాల్చి, బూడిద చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్కు వినతిపత్రం అందజేశారు. ఆ ప్రచారంలో నిజం లేదు యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూపును తొలగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ఈ గ్రూపు ఎప్పటిలాగే కొనసాగుతుందని ఆచార్య కేవీ స్వామి బుధవారం సాయంత్రం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పొలిటికల్ సైన్స్ విభాగంలో ఏర్పడిన కొన్ని అంతర్గత సమస్యల కారణంగా 2025–26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకోకుండా తాత్కాలికంగా నిలిపివేయాలని భావించామన్నారు. అయితే విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్తో ఎప్పటిలాగే కొనసాగించాలనే నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. -
గణపతి నిమజ్జనాలకు పటిష్ట చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వినాయక విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్టు ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లాలోని పోలీస్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు మార్గాలను గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ వినాయక ఉత్సవాల్లో ఆఖరి ఘట్టమైన నిమజ్జనాలు సజావుగా సాగేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పోలీసులు నిర్దేశించిన నిమజ్జన రూట్లోనే ఊరేగింపు వాహనాలు వెళ్లాలన్నారు. -
శాంతించిన వరద గోదావరి
● ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ● 9.44 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద వరద గోదావరి శాంతించింది. ఉదయం 6గంటలకు 12.70 అడుగులు ఉన్న నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ మధ్యాహ్నం 3.47గంటలకు 11.70అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం మరింత తగ్గుతూ రాత్రి 7గంటలకు 11.50 అడుగులకు చేరింది. కాటన్ బ్యారేజీ నుంచి 9,44,409 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుండగా మిగిలిన ప్రాంతాలలో స్వల్పంగా తగ్గుతున్నాయి. బుధవారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. డెల్టా కాలువలకు సంబంధించి 12,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 5,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 10.22 మీటర్లు, పేరూరులో 14.82 మీటర్లు, దుమ్ముగూడెంలో 15.15 మీటర్లు, భద్రాచలంలో 41.20 అడుగులు, కూనవరంలో 18.08 మీటర్లు, కుంటలో 10.45 మీటర్లు, పోలవరంలో 11.89 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.85 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
సంక్షేమ సంతకం వైఎస్సార్
● జిల్లావ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి ● సేవా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, అభిమానులు సాక్షి, రాజమహేంద్రవరం: సంక్షేమ సంతకం చేసి.. దార్శనికుడిగా పేరుగాంచి.. ఆరోగ్య ప్రదాతగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ మహనీయుడు చేసిన సేవలు, సంక్షేమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు కొనియాడారు. మహానేత వర్ధంతి సందర్భంగా మంగళవారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్కు ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్ర పటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలురువు నేతలు మాట్లాడుతూ పేదల అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా నిరంతరం పనిచేసిన మహానేత వైఎస్సార్ అని కొనిడాయారు. ఎన్నో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారన్నారు. అందుకే ఆయన ఎప్పటికీ ప్రజల హృదయాల్లో సజీవంగా ఉంటారని అన్నారు. ఆ లోటు తీరనిది రాజమండ్రి రూరల్: రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియం మండలం వేమగిరి జంక్షన్, కొంతమూరు గ్రామాల్లో దివంగత నేత రాజశేఖరరెడ్డి వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు వైఎస్కు ఘన నివాళులు అర్పించారు. అంకితభావంతో రాజకీయాల్లో కొనసాగిన మహనీయుడు వైఎస్ అన్నారు. ఆయన లేని లోటు ఎప్పటికి తీరనిదని, నేటికీ అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. కోటగుమ్మం జంక్షన్లో.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి కోటగుమ్మం సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. కొవ్వూరులో అన్నదానం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్రెడ్డి వర్థంతిని కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూరులో మెయిన్రోడ్డు, వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం సుమారు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సేవలను, ఆయన చేపట్టిన సంక్షేమాన్ని స్మరించుకున్నారు. అనపర్తిలో.. నియోజకవర్గ కేంద్రమైన అనపర్తి కెనాల్ రోడ్డులో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సంక్షేమ పథకాల ప్రదాత వైఎస్సార్ అని కొనియాడారు. జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సత్తి రాంబాబు పాల్గొన్నారు. నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతిని మంగళవారం నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్నాయుడు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. గోపాలపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించారు. గోపాలపురంలో మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహానేత వైఎస్ఆర్ రాజానగరం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్థంతి సందర్భంగా రాజానగరం వైఎస్సార్ సర్కిల్లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, శ్రీనివాస్ నాయుడు, తలారి వెంకట్రావు, యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర రాజమండ్రి సిటీ: రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో స్థానిక వీఎల్పురం మార్గాని ఎస్టేట్స్లోని పార్టీ సిటీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి నిర్వహించారు. వైఎస్ చిత్రపటానికి రామచంద్రారెడ్డి, భరత్, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ భరత్ క్వారీ సెంటర్లో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకట్రావు, ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కేంద్ర కారాగారాన్ని సందర్శించిన డీఎల్ఎస్ఏ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదరి ఎన్.శ్రీలక్ష్మి మంగళవారం సందర్శించారు. కేంద్ర కారాగారం, మహిళా జైలులో ఖైదీలకు అందిస్తున్న ఆహార ప్రమాణాలు, సదుపాయాలు పరిశీలించారు. ఖైదీలతో పాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖైదీల తరఫున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, బెయిల్ పిటిషన్లు వేయాలన్నా, పైకోర్టుల్లో అప్పీలు చేయాలన్నా, ఎటువంటి న్యాయ సహాయం అవసరమైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. దీనికి పారా లీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు సమర్పించాలన్నారు. ముద్దాయిలు, ఖైదీలకు అందుబాటులో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలన్నారు. పాటకు ప్రాణం పోసిన ఎస్పీ బాలు ధవళేశ్వరం: సంప్రదాయ సంగీతంలో ప్రవేశం లేకపోయినా అత్యంత ప్రతిభతో పాటకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కొనియాడారు. రాకా సాంస్కృతిక సంస్థ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ ధవళేశ్వరం సంయుక్త ఆధ్వర్యంలో ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులో పద్మశ్రీ ఘంటసాల విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి మంగళవారం ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కష్టతరమైన పాటలు కూడా ఎస్పీ బాలు అవలీలగా పాడారని, ఆయనను ఎవరూ అనుకరించలేరన్నారు. ఎంపీని సినీనటులు శుభలేఖ సుధాకర్, రాకా సాంస్కృతిక సంస్థ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి, జివి రమణ సత్కరించారు. ఐసీటీసీలో సేవలు మెరుగుపర్చాలి – కేంద్ర బృందం తనిఖీ పెద్దాపురం: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఐసీటీసీ విభాగంలో మంగళవారం కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డీడీ యూబీ దాస్, నాకో కన్సల్టెంట్లు రాహుల్ ఆహూజా, డాక్టర్ జస్వందర్ సింగ్, ఏపీ స్టేట్ సొసైటీ డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. తనిఖీ అనంతరం ఐసీటీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఐసీటీసీలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఐసీటీసీ భాగస్వామి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీటీసీ, సంపూర్ణ సురక్ష కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సోచ్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఐసీటీసీలోని రికార్డులను పరిశీలించి, ఇక్కడి సేవలపై కౌన్సెలర్ బి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. బృందం వెంట అదనపు పీడీ డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ ఉమామహేశ్వరి ఉన్నారు. ఉచిత బస్సుతో ఆటోడ్రైవర్ల ఉపాధికి గండిఅమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి, ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టిందని ఆంధ్ర ఆటోవాలా జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి ఆటో డ్రైవర్లు నల్ల బ్యాఢ్జీలు ధరించి, ఆటోలకు నల్ల జెండాలు తగిలించి నిరనస తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో మంగళవారం డివిజన్ ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. దీనిపై సమావేశం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. త్వరలోనే 48 గంటల పాటు ఆటోలు నిలిపివేసి నిరాహార దీక్షలు చేపడతామని ఆయన వెల్లడించారు. రామచంద్రపురం డివిజన్ ఆటో డ్రైవర్లతో బుధవారం నిర్వహించే సమావేశంలో ఆ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో 25 శాతం ఆటోలు విద్యాసంస్థలకు విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో ఆ ఆటోల డ్రైవర్లు 48 గంటల నిరాహార దీక్షకు రెండు రోజుల ముందు ఆయా విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని సమావేశం సూచించింది. తక్షణమే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆటోవాలా జిల్లా శాఖ కార్యదర్శి ఊటాల వెంకటేష్ నిరసన తీర్మానాలు సమావేశంలో ప్రవేశపెట్టారు. ఆటో యూనియన్ల ప్రతినిధులు మోకా శ్రీను, వాసంశెట్టి శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శంకర్, ప్రధాన కార్యదర్శి బొక్కా నాని, కోశాధికారి బొమ్మి ఫణి, రాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై తీరనున్న భక్తుల కష్టాలు
● పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి నేడు శ్రీకారం ● రూ.2.5 కోట్లతో నిర్మించనున్న ఫార్మా సంస్థ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలోని పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి మూడేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఈ మార్గంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి బుధవారం ఉదయం శ్రీకారం చుట్టనుంది. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు లేకపోవడంతో భక్తుల ఇబ్బందులను గమనించిన అప్పటి ఈఓ చంద్రశేఖర అజాద్ 2023లో ఈ ప్రణాళిక రూపొందించారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్యదేవ అతిథిగృహాన్ని కూల్చి, దాని స్థానంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు లారెస్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో 2023 అక్టోబర్లో ఇక్కడ సత్రాన్ని కూల్చేశారు. అదే ఏడాది విజయదశమి నాడు భూమిపూజ జరిగింది. తర్వాత ఈఓ చంద్రశేఖర అజాద్ ఇక్కడి నుంచి బదిలీ కావడంతో ఈ ప్రతిపాదన మూలనపడింది. ఇక్కడ విశ్రాంతి షెడ్డు లేకపోవడం వల్ల భక్తులు పడుతున్న ఇబ్బందులపై సాక్షిలో పలు కథనాలు వెలువడ్డాయి. స్పందించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు లారెస్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పశ్చిమ రాజగోపురం ముందు ఖాళీ ప్రదేశంలో 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పున విశ్రాంతి షెడ్డు నిర్మించేందుకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేసినట్టు దేవస్థానం ఈఈ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ విశ్రాంతి షెడ్డులో 12 కౌంటర్లు, స్టెయిన్లెస్ స్టీల్ లైన్లు, మూడు హెలికాప్టర్ ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్ల స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేయనున్నారు. ఈ ఖర్చంతా లారెస్ సంస్థ భరించనుందని ఈఈ తెలిపారు. రెండు నెలల్లో పూర్తి ● విశ్రాంతి షెడ్డు నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని లారెస్ సంస్థను కోరినట్టు ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. ● అక్టోబర్ 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతున్నందున అప్పటికి అందుబాటులో ఉండేలా చూడాలని కోరామన్నారు. ఇది పూర్తయితే పశ్చిమ రాజగోపురం వైపు వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం రెండో రోజు పవిత్రోత్సవాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సారథ్యంలో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ పర్యవేక్షణలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయంలోని పురాతన కల్యాణ మండపంలో ఉన్న ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి, విశేష అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
పాడైన పంటల పరిశీలన
పెరవలి: గోదావరి వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి చనిపోయిన విషయమై సాక్షిలో జల దిగ్బంధం శీర్షికన సోమవారం వెలువడిన కథనానికి ఉద్యానవన అధికారులు స్పందించారు. వివిధ ప్రాంతాల్లో పాడైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యానవన అధికారి సుధీర్కుమార్ మాట్లాడుతూ, దిగువ లంకల్లో పంటలు పూర్తి పాడైపోయాయని, నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో తెలియాలంటే వరద పూర్తిగా తగ్గాలన్నారు. ఆ తర్వాత పంటలు పరిశీలించి అంచనాలు రూపొందిస్తామన్నారు. ఇందుకు మరో వారం ఆగాల్సి ఉంటుందన్నారు. సోమవారం కానూరు నుంచి కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం వరకు పంటలను పరిశీలించామన్నారు. వరద తగ్గాక అంచనాలు తయారు చేయాలని వీఆర్వోలు, ఉద్యానవన అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల రైతులతోనూ మాట్లాడినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి కొయ్యలగూడెం: అదుపు తప్పిన ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని కన్నాపురం గ్రామ శివారున సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామానికి చెందిన అయినపుడి సత్యనారాయణ (60) ద్విచక్ర వాహనంపై బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం గ్రామంలో బంధువు రెడ్డి వెంకట్రావు ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కన్నాపురం శివారున వాహనంతో చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని ఏఆర్టీ/ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఎటువంటి చికిత్సా కేంద్రాలు నడపరాదన్నారు. నియామావళి ప్రకారమే సేవలు అందించాలన్నారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చడంలో ఏఆర్టీ, ఐవీఎఫ్, సరోగసీ ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన, రిజిస్ట్రేషన్ కలిగిన ఆస్పత్రులు/కేంద్రాల్లోనే చికిత్స పొందాలన్నారు. అనుమతి లేని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవడం వల్ల ప్రమాదాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రజలు ఆయా విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనధికార/నమోదు కాని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవద్దని సూచించారు. ఏఆర్టీ లేదా సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలు దంపతుల చట్టబద్ధ సంతానం అవుతారని స్పష్టం చేశారు. వాణిజ్య సరోగసీ (డబ్బు కోసం) పూర్తిగా నిషేధించబడిందన్నారు. లింగ నిర్ధారణ, గర్భకణాల అమ్మకాలు కఠినంగా నిషేధించబడ్డాయని తెలిపారు. చట్ట ఉల్లంఘన చేసిన వారికి జైలుశిక్ష, భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాల అమలుతో పారదర్శకత, న్యాయం, రక్షణ అన్నీ సాధ్యమవుతాయన్నారు. ప్రజలంతా అవగాహనతో ఉండి, నిబంధనలు పాటించే కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలిస్తే వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఇతర వివరాలకు 81255 67830 నంబరులో సంప్రదించాలన్నారు.