East Godavari
-
మరిడమ్మ జాతరకు పటిష్ట భద్రత
కాకినాడ ఇన్చార్జి డీఎస్పీ శ్రీహరిరాజు కరప: ఈనెల 25వ తేదీ నుంచి 40 రోజుల పాటు జరిగే మరిడమ్మ జాతర మహోత్సవంలో భక్తులకు అసౌక్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ, కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తునకు కరప ఎస్ఐ టి.సునీతతో చర్చించేందుకు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దాపురంలో అమ్మవారి దర్శనానికి ఆది, మంగళ, గురువారాల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో క్యూలైన్లు, వివిధ శాఖల సమన్వయంపై ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తు బాలిక అదృశ్యం కేసుపై ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు, బంధువులు డీఎస్పీని కలసి తమగోడు వినిపించారు. బాలికను కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్న యువకుడి తండ్రిని పిలిపించి మాట్లాడారు. కిడ్నాప్ కేసుతో పాటు, పోక్సో కేసు పెట్టాల్సి ఉంటుందని, ఎక్కడున్నా వెంటనే సమాచారం చెప్పాలని యువకుడి తండ్రికి డీఎస్పీ సూచించారు. ఆర్డీఓ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. బాలిక అదృశ్యానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, బాలిక వివరాల ముఖ్యమైన నగరాల్లోని పోలీసులకు పంపినట్టు ఆయన తెలిపారు. అనంతరం కరపలోని పురాతన శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. అర్చకులు విలపర్తి శ్రీనివాస్, విలపర్తి సత్యకృష్ణ, పెద్దింటి గోపాలకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆశీర్వచనం ఇచ్చారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పైసలిస్తేనే పోస్టింగ్!
రీ వెరిఫికేషన్ పూర్తి కాకినాడ క్రైం: సచివాలయం ఏఎన్ఎంల నుంచి ఎంపీహెచ్ఏఎఫ్లుగా పదోన్నతులు పొందిన అభ్యర్థుల కౌన్సిలింగ్ రీవెరిఫికేషన్ బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన 390 మందికి కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహంనాయక్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. తాజా ప్రక్రియలో ఇద్దరు అనర్హులను, గత ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో బృందాన్ని మోసగించి పదోన్నతులు పొందిన ఇద్దరు సచివాలయ ఏఎన్ఎంలను గుర్తించారు. ఓ ఏఎన్ఎం వివాహితురాలు అయినప్పటికీ అవివాహిత హోదాలో బదిలీ ప్రయోజనం పొందింది. మరో ఏఎన్ఎం ప్రొహిబిషన్ డిక్లేర్ కాకపోయినా బదిలీలకు హాజరై తనకు అనుకూలమైన స్థానాన్ని పొందింది. వీరద్దరిని డీఎంహెచ్ఓ బుధవారం నాటి రీవెరిఫికేషన్లో గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా 388 మందికి నియామక పత్రాలు అందజేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతుల కౌన్సెలింగ్లో అవినీతి జాతర సాగుతోంది. కొందరి అవినీతి పరాకాష్టకు చేరుకుంది. కాసులిస్తేనే పదోన్నతులు, కోరుకున్న కుర్చీలు దక్కుతున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కొక్క రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. పదోన్నతుల బాగోతంలో లక్షలు చేతులు మారాయి. సాధారణంగా పదోన్నతులు వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగులు తలా ఇంత సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇటువంటివన్నీ ఉద్యోగులు సంతృప్తి కోసం సంతోషంగా ఇస్తుంటారు. ఏ శాఖలో అయినా ఇదేమీ కొత్త కూడా కాదు. ఎటొచ్చీ పదోన్నతులకు ఒక రేటు, కోరుకున్న సీటు కోసం మరొక రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడటమే ఈ సారి సంబంఽధిత శాఖలో హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతులు కాకినాడ డీఎంహెచ్ఓ నోడల్ అధికారి వ్యవహరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు ఏఎన్ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్ జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 830 సబ్ సెంటర్లలో సుమారు 400 సబ్ సెంటర్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం గత ఆదివారం ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో భార్య, భర్తలు, వితంతువులు, పెళ్లికాని వారు, అనారోగ్య సమస్యలున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 60 మందికి పోస్టింగులు ఇచ్చారు. 340 సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు సాధారణ కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలు ఏఎన్ఎంలుగా పదోన్నతి కోసం క్యూ కట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జరిపిన కౌన్సెలింగ్కు ముందుగానే ఆ శాఖలోని కొందరు చేతివాటం చూపించారు. ఇందుకోసం ఒక రేటు కూడా నిర్ణయించి వసూళ్ల పర్వానికి తెరతీశారు. పదోన్నతి పొందిన వారికి సీటు కేటాయించే సందర్భంలో సొమ్ములు గుంజారు. రూ.4000 నుంచి రూ.5000 వంతున వసూలు చేశారు. ఇలా రూ.20 లక్షలు వరకు ముడుపులు వసూలుచేశారు. ఇందులో వైద్య ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఒకరికి 50 శాతం, పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టే దిగువ స్థాయి వారు 20 శాతం, క్షేత్ర స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే వారికి 30 శాతం వంతున వాటాలు వేసుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చి కాకినాడలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఎపిడిమిక్ విభాగంలో మరొకరు, ఏఎన్ఎం సంఘంలో ముగ్గురు కలిసి ఈ మొత్తం అవినీతి బాగోతాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టి సొమ్ము చేసుకున్నారు. పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను బ్లాక్లో పెట్టి సొమ్ములు ఇచ్చిన వారికి కోరుకున్న పోస్టింగ్లు కట్టబేట్టేశారు. ఇలా పోస్టింగ్లు అందుకున్న వారి నుంచి రూ.30 వేలు వంతున వసూలు చేసి మూటగట్టేసుకున్నారు. ఇలా మరో తొమ్మిది లక్షలు ముడుపులు మెక్కి పోస్టింగ్లు ఇచ్చేశారనే విమర్శలు వెళ్లువెత్తాయి. ఇలా సొమ్ములు తీసుకున్న వ్యవహారంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యుల వ్యహారాలు పర్యవేక్షించే ఒకరు, పరిపాలనా విభాగంలో మరొకరు సూత్రధారులుగా వ్యవహరించారు. ఈ లంచావతారాలతో విసుగెత్తిపోయిన ఐదుగురు ఏఎన్ఎంలు వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చి కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ రీ కౌన్సెలింగ్ జరపాలని ఆదేశాలు చేశారు. దీంతో బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేలకు వేలు సొమ్ములు ముట్టచెప్పి పోస్టింగులు పొందిన వారి పరిస్థితి రీ కౌన్సెలింగ్తో కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. సొమ్ములు ఇచ్చి కోరుకున్న పోస్టింగులు పొందిన వారి స్థానాలు తాజా కౌన్సెలింగ్లో మారిపోతున్నాయి. దీంతో గత ఆదివారం ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని సదరు సూత్రధారులపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది. సొమ్ములు తిరిగి ఎలా ఇవ్వగలుగుతామని, ఏదో రకంగా సర్దుబాటు చేస్తామని బుజ్జగిస్తున్నారు. రీ కౌన్సెలింగ్ పూర్తయ్యి చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకోనుందో వేచి చూడాల్సిందే. వైద్య, ఆరోగ్య శాఖలో పదోన్నతుల కౌన్సెలింగ్ పోస్టుకో రేటు నిర్ణయం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పలువురు ఏఎన్ఎంలు ఆయన ఆదేశాలతో రీ కౌన్సెలింగ్ సొమ్ము తిరిగి ఇవ్వాలని మెక్కిన వారిపై ఒత్తిడి -
యోగాంధ్రలో ‘నన్నయ’కు రికార్డు
రాజానగరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘మెగా యోగ’ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీ ఉన్న ‘నన్నయ’లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదే స్థాయిలో 16,123 మంది హాజరు కావడంతో, దీనిని ఒక రికార్డుగా గుర్తించిన ఆ సంస్థ నిర్వాహకులు డాక్టర్ సి.కె. రాయుడు, తాతా వెంకట వరప్రసాద్లు అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలు, క్యాంపస్ల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంచనాలకు మించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్ుడ్సలోకి ఎక్కడంతో పాటు యూనివర్సిటీ చరిత్రలో ఒక చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం యోగ సాధన చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు మేథో సంపత్తిని వృద్ధి చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇది ఎంతో అవసరమన్నారు. యోగాసనాలతో అబ్బురపరిచారు యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్పెట్లపై విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వేసిన యోగాసనాలు ఆబ్బురపరిచాయి. కానవరంలోని రాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా ప్రతినిధుల పర్యవేక్షణలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాల నుంచి 16,123 మంది హాజరు -
సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు ఖైదీల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బుధవారం ఇద్దరు ఖైదీలు విడుదలయ్యారు. ఆ వివరాలను సూపరింటెండెంట్ ఎస్.రాహుల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఖైదీలు విడుదల కాగా వారిలో రాజమహేంద్రవరం సెంట్రల్ నుంచి ఇద్దరికి అవకాశం వచ్చింది. వారిలో కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన కోనేటి సత్తిబాబు, గజ్జవరపు మురళీకృష్ణ ఉన్నారు. వీరు హత్య కేసులో జైలుకి వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 17 నాటికి అర్హత కలిగిన జీవిత ఖైదీల విడుదలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఇద్దరు ఖైదీలకు ప్రత్యేక ఉపశమనం ఇచ్చి విడుదల చేశారు. బాధితురాలికి న్యాయం చేస్తాం రాజమహేంద్రవరం రూరల్: పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయిన బాధితురాలికి అన్ని విధాలా న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక మహిళ తన కుమార్తెను పులవర్తి సత్యదేవ్ తన కుమార్తెను ప్రేమించి మోసం చేశాడని ఓ మహిళ కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళాభివృద్ధి, సంక్షేమశాఖ, వన్స్టాప్ సెంటర్ విచారణ జరిపింది. బొమ్మూరు పోలీస్స్టేషన్లో పలుమార్లు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని, తమకు పదిరోజులు గడువు కావాలని కోరగా, బొమ్మూరు ఇన్స్పెక్టర్ వారం రోజులు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. బాధితురాలిని సత్యదేవ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈనెల 13న అతనిపై పోక్సో కేసు నమోదు చేశారని, ప్రస్తుతం అతడు రిమాండ్పై సెంట్రల్ జైల్లో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారన్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉంచారన్నారు. -
వేతనాల ఆలస్యం రివాజే!
అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 18వ తేదీ వచ్చినా ఈ నెల జీతాల బిల్లు సిద్ధం చేసిన దాఖలాలు లేకపోవడంతో దేవస్థానంలోని 349 మంది కార్మికులు మూడో నెలలో కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిల్లు తయారై ఆడిట్కు వెళ్లి పాసై వస్తే అప్పుడు చెక్కుపై ఈఓ సంతకం చేయడం, దానిని ఆన్లైన్లో కాంట్రాక్టర్కు బదలాయించడం, ఆయన సదరు కార్మికుల అకౌంట్లలో జమచేయడం ఈ ప్రక్రియంతా కనీసం వారం రోజుల ప్రహసనం. అంటే 25వ తేదీ దాటితే తప్ప కార్మికులకు మే నెల జీతాలు పడని పరిస్థితి. గత రెండు నెలలూ ఆలస్యమే.. ఆలయంలో కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం రివాజైపోయింది. మార్చి నెల జీతాలు ఏప్రిల్ 30న, ఏప్రిల్ నెల జీతాలు మే 28న చెల్లించారు. ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనానికి, మే 26న ప్రచురితమైన ‘వీరి కష్టం తుడిచేవారేరీ’ కథనాలకు స్పందించి అధికారులు ఆ తేదీలకై నా వారి అకౌంట్లలో జమ చేయగలిగారు. ఇందులో కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.లక్ష కోత పెట్టి రూ.58 లక్షలు విడుదల చేశారు. అయితే మొత్తం నిధులు వస్తేకానీ చెల్లించనని కాంట్రాక్టర్ చెప్పడంతో జూన్ ఒకటో తేదీకి కానీ జమ చేయలేదు. కాంట్రాక్టర్ వల్లే ఆలస్యం దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ సకాలంలో పీఎఫ్ జమ చేయకపోవడం, బిల్లు అందచేయకపోవడం వల్లే జీతాల చెల్లింపు ఆలస్యమవుతోందని అధికారులు పదే పదే చెప్తున్నారు. ఏజెన్సీకి స్థోమత లేకపోయినా.. హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ రెండేళ్లకు పైగా దేవస్థానంలో పారిశుధ్య విధులు నిర్వహించింది. ఆ సంస్థ ప్రతి నెల పదో తేదీనే సిబ్బందికి జీతాలు చెల్లించేది. గత నవంబర్తో ఆ సంస్థ గడువు ముగిసినా టెండర్ ద్వారా కొత్త సంస్థను కాంట్రాక్టుకు ఎంపిక చేసే వరకు విధులు కొనసాగించాలని అధికారులు కోరడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు కాంట్రాక్టు కొనసాగింది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆ కాంట్రాక్టు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి అప్పగించారు. ఆ సంస్ధకు 349 మందికి జీతాలు ఇచ్చే స్థోమత లేకపోయినా అధికారులు నామినేషన్ పద్ధతిపై ఇచ్చినట్టుగా హడావిడిగా విధులు కట్టబెట్టారు. దీంతో ఆ సంస్థపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేని పరిస్థితిని అధికారులే కల్పించుకున్నారు. కానీ సకాలంలో జీతాలు అందక పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రత్నగిరిపై కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల కష్టాలు వరుసగా మూడో నెలా ఆలస్యం సగం నెల దాటినా సిద్ధం కాని బిల్లు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయడ్డారు. వారిని స్థానికులు చికిత్స కోసం స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. తమిళనాడు నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు వెళ్తున్న కారు దుద్దుకూరు వద్ద అదుపుతప్పి డ్రైనేజీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో జావీద్, ఆయాష్ గాయపడగా స్థానికులు హైవే అంబులెన్స్లో వారిని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. -
సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి
కోటికేశవరంలో విషాదం కోరుకొండ: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం, సీతపల్లివాగులో స్నానానికి దిగి కోరుకొండ మండలం కోటికేశవరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఇటీవల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్టు సభ్యులు 15 మంది బుధవారం వాగులోకి స్నానాలకు దిగారు. వారిలో పీతల రాకేష్ (25), గుమ్మడి హర్ష (25) వాగు ప్రవాహ వేగానికి కాలు జారి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో వాగులోని రాళ్లకు వారు బలంగా ఢీకొని మృతి చెందారు. వీరిలో రాకేష్ చిన్న కిళ్లీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన అతడు మైదానంలో కట్ కొడితే ప్రత్యర్థి జట్టు సభ్యులు అడ్డుకోలేరని మంచి పేరుంది. కాగా గుమ్మడి హర్ష తల్లి కవిత సహకారంతో చిరు వ్యాపారం చేస్తున్నాడు. గ్రామ సర్పంచ్ ముడే సింధూ దివ్య, ఆమె భర్త ముడే కామేష్ ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలకు పంచనామా తదితర కార్యకలాపాలు నిర్వహించారు. ఇసుక తవ్వుతున్న ఏడు పడవల సీజ్ తనిఖీల్లో జిల్లా మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి తాళ్లపూడి: స్థానిక డీసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న ఏడు పడవలను అధికారులు బుధవారం సీజ్ చేశారు. జిల్లా మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, టాస్క్ఫోర్స్ ఎస్సై ఆంజనేయులు తదితరులు సాధారణ తనిఖీల్లో భాగంగా బోట్స్మన్ సొసైటీ సభ్యులు గోదావరిలో ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న ఏడు పడవలను సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం ఉందని వారు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేసినట్టు ఆయన తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ పడవలను సీజ్ చేశామని తెలిపారు. కాగా ఇసుక తవ్వకాలు చేపట్టిన పడవలు ఎవరివన్న విషయమై సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు. -
కొవ్వూరు మున్సిపల్ కమిషనర్పై బదిలీ వేటు
కొవ్వూరు: స్థానిక మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న టి నాగేంద్ర కుమార్ను బదిలీ చేస్తూ బుధవారం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఈ బదిలీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ)కు తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. గతంలో కమిషనర్పై ఓ మహిళ విషయంలో పలు ఆరోపణలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కలెక్టర్కు బాధితులు చేసిన ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. స్మార్ట్సిటీకి మేలు చేసే ఒప్పందం బోట్క్లబ్ (కాకినాడ): ఐఐఐటీ హైదరాబాద్, కాకినాడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, స్మార్ట్సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యక్ష పరిశోధన, ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నారు. స్మార్ట్సిటీ వింగ్ ల్యాబ్ చీఫ్ టెక్నాలజీ ఆర్కిటెక్ వి అనురాధ నేతృత్వంలోని ప్రతినిధి బృందం , కై ట్ ప్రొఫెసర్లతో కలిసి వ్యూహాత్మక సహకార ప్రతిపాదనను సమర్పించడానికి బుధవారం కలెక్టర్ షణ్మోహన్ను కలిశారు. నగర అభివృద్ధిలో ఎదురవుతున్న ముఖ్యమైన సవాళ్లను అధిగమించడానికి ఐఐఐటీ అభివృద్ధి చేసిన వివిధ స్మార్ట్ సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు వినియోగించేందుకు ప్రతిపాదించారు. తాగునీటి పంపిణీపై రియల్ టైమ్ మానిటరింగ్, పైపులైన్ లీకేజీల గుర్తింపు, తాగునీటి నాణ్యతపై విశ్లేషణ సాగుతాయి. ఈ భాగస్వామ్యం వల్ల స్మార్ట్ సిటీలో మౌలిక సదుపాయాలను గణనీయంగా ప్రోత్సహించే వీలుంటుంది. కలెక్టర్ను కలిసిన వారిలో కై ట్ కళాశాల అధినేత పోతుల విశ్వం ఉన్నారు. యాంత్రీకరణ దిశగా రైతుల అడుగులు కాకినాడ సిటీ: వ్యవసాయంలో యాంత్రీకరణ దిశగా రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లు, వివిధ యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తుందని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. 688 మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి మంజూరైన రాయితీ రూ.3.83 కోట్ల నమూనా చెక్కును అందజేశారు. అనంతరం రైతులకు వివిధ రకాల విత్తనాలకు సంబంధించిన మినీ కిట్లను, పవర్ స్ప్రేలను పంపిణీ చేశారు. జిల్లాకు 42 డ్రోన్లు లక్ష్యం కాగా ఇప్పటికి 35 మంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయగా, 25 మంది బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ చేశారన్నారు. జిల్లాలో ఇప్పటికే నలుగురికి కిసాన్ డ్రోన్లు అందజేసినట్లు వివరించారు. ఈ నెల చివరి నాటికి మిగిలిన వారందరికీ రాయితీపై డ్రోన్లు అందజేస్తామని వెల్లడించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో యాంత్రీకరణ లేకపోతే వ్యవసాయమే లేదన్నారు. 23న ఒలింపిక్ డే రన్ అమలాపురం టౌన్: జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఉదయం జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఒలింపిక్ డే రన్లు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ రన్ బ్రోచర్లు, సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ రన్లలో వ్యాయామ ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ క్లబ్ల ప్రతినిధులు, ఎంఎస్డీవోలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొంటారని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు తెలిపారు. పట్టణంలోని దుడ్డివారి అగ్రహారంలోని ఆఫీసర్ రిక్రియేషన్ క్లబ్ నుంచి కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ రన్ను ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు శరత్బాబు పర్యవేక్షణలో సంఘం ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్ల సహకారంతో ఈ రన్ సాగనుంది. -
గడువు దాటితే ముప్పు
అంబాజీపేట: గ్యాస్ సిలిండర్తో పంట చేసుకోవడం ఎంత సులభమైన పద్ధతో... సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం కూడా ఉంటుంది. సిలిండర్కు కాల పరిమితి ఉంటుందని, దానిని గమనిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గడవు తేదీ ముగిసిన సిలిండర్ను వినియోగిస్తే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ కంపెనీలు సరఫరా చేసే ప్రతీ సిలిండర్పై గడువు తేదీ, కోడ్ విధానంలో మెటల్ ప్లేటుపై ముద్రిస్తాయి. సిలిండర్ను మార్చుకున్నప్పుడల్లా ఆ గడువు తేదీని చూసుకొని వినియోగించాలి. ఇలా గుర్తించాలి.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఏ–25, బీ–25 అని ఉంటే ఆ సిలిండర్ 2025 మార్చి–జూన్కి గడువు ముగుస్తుందని అర్థం. 25 అంటే 2025 సంవత్సరానికి, ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ‘ఏ’ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు ‘బి’ అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ‘సీ’ అక్షరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ‘డీ’ అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని గుర్తించాల్సి ఉంటుంది. సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేటుపై కోడ్ విధానంలో ఉన్న గడువు తేదీని. గడువు తేదీ నెల వ్యవధిలో ముగుస్తున్నట్లు సిలిండర్పై ఉంటే దానిని తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న కుటుంబాల వారికి నెల రోజులకు పైగా గ్యాస్ వస్తుంది. ఆ సిలిండర్ స్థానంలో వేరే సిలిండర్ను అడిగి తీసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. సిలిండర్కు 10 ఏళ్ల గడువు.. సిలిండర్ తయారైనప్పటి నుంచి 10 ఏళ్ల వరకు గడువు ఉంటుంది. సిలిండర్ను ప్రత్యేకమైన ఉక్కుతో సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తారు. బీఐఎస్ అనుమతులు తీసుకున్న తర్వాతే సిలిండర్ మార్కెట్ల్లోకి వస్తుంది. వినియోగదారుల హక్కులు.. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు హక్కులు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ మార్పు చేసుకోవచ్చు. కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ఽధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ పొందవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకునే సమయంలో తమ వద్దనే స్టౌ కొనుగోలు చేయాలని డీలర్ కోరవచ్చు. అయితే డీలర్ వద్ద కొనుగోలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. వంట గ్యాస్ సిలిండర్కు కాలపరిమితి గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవు
మాజీ హోం మంత్రి తానేటి వనితదేవరపల్లి: కూటమి ప్రభుత్వంలో మహిహిళలకు రక్షణ కరవైందని రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత విమర్శించారు. నల్లజర్లలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కుప్పం సంఘటనలో మహిళపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు అమానుషంగా ప్రవర్తించినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని నారాయణపురంలో ఒక మహిళను నడిరోడ్డుపై ఈడ్చుకుని వెళ్లి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందనే విషయం కుప్పం ఘటన రుజువు చేస్తోందన్నారు. భర్త చేసిన అప్పులకు భార్యను అమానుషంగా హింసించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఏన్డీఏ ప్రభుత్వం చేతకాని తనం కారణంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సాటి మహిళకు జరిగిన అన్యాయంపై హోం మంత్రి అనిత స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, లైంగిక దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారని అన్నారు. కుప్పం ఘటనపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని, మహిళలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో మహిళలకు రక్షణ కరవైందన్నారు. రోజూ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై వెళ్లాలంటే మహిళలు వణికిపోతున్నారని ఆమె అన్నారు. హత్యాచారాలకు, హత్యలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఎక్కడా పరిహారం అందించలేదన్నారు. నల్లజర్ల మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహమణ్యం, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రజా సహకారం అవసరం
రాజానగరం: రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పానికి ప్రజా సహకారం కూడా ఉండాలని రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఈగల్) ఆర్కే రవికృష్ణ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి కళాశాలలోను విద్యార్థులతో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఇందులో సభ్యునిగా ఉంటూ తన దృష్టికి వచ్చిన మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1972 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన కేసుల్లో నేరస్తులుగా ఎవరు పట్టుబడినా వారి భవిషత్తు నాశనం కాక తప్పదన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈగల్ క్లబ్లకు సంబంధించిన పోస్టర్ను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)తో కలిసి విడుదల చేశారు. అడిషనల్ ఎస్పీ ఎన్బీ మురళీకృష్ణ, నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్, సీఐలు వీరయ్యగౌడ్, సూర్యమోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.నాగేంద్ర, జీజీయూ వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీవీఎస్ శర్మ, పాల్గొన్నారు. రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఈగల్) రవికృష్ణ -
‘నన్నయ’ రిజిస్ట్రార్గా సుధాకర్ పదవీ విరమణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్టార్గా ఆచార్య జి.సుధాకర్ పదవీ విరమణ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయనను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. ఆమె మాట్లాడుతూ 2023 ఆగస్టు 23 నుంచి రిజిస్ట్రార్గా సుధాకర్ విశిష్ట సేవలందించారన్నారు. ‘నన్నయ’ యూనివర్సిటీ అభివృద్ధిలో ఒక రిజిస్ట్రార్గా భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందని ఆచార్య సుధాకర్ పేర్కొన్నారు. కాగా.. సుధాకర్ ఇక నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో హ్యుమన్ జెనిటిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించనున్నారు. ఇదిలావుండగా ‘నన్నయ’ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్గా అకడమిక్ డీన్ ఆచార్య కేవీ స్వామిని నియమిస్తూ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ఉత్తర్వులు జారీ చేశారు. దేవదాయశాఖ ఆస్తులను పరిరక్షించాలి బోట్క్లబ్ (కాకినాడ): ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములు, ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురైతే కోర్టులో కేసులు దాఖలు చేయాలని జిల్లా దేవదాయశాఖాధికారి కె.నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ నగరంలోని ఆలయ, సత్రాలకు సంబంధించిన ఈవోలతో మంగళవారం ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేవదాయశాఖకు చెందిన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా ఆలయ ఈఓ, సత్రాల ఈవోలపైనే ఉందన్నారు. నగరం పరిధిలో ఉన్న ఆలయాలు, సత్రాలకు ఉన్న భూములు, ఖాళీ స్థలాలు అన్నీ ఆన్లైన్లో ఆయా సత్రాలు, ఆలయాల పేరున ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. భూములు ఏమైనా ఆక్రమణలో ఉంటే వాటిని ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆ శాఖ కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు
పెరవలి: గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పెరవలిలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకుకు చెందిన పాలుమూరి సాగర్, కానూరు అగ్రహారానికి చెందిన కర్సినపు ప్రవీణ్ కుమార్, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం, కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన తగరపు వెంకట్, వర్దణపు మణి తదితరులు మూడు కిలోల గంజాయిని రవాణా చేయటానికి ప్రణాళిక వేసుకున్నారు. వీరందరూ పెరవలిలోని హిందూ శ్మశానవాటిక సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించారు. అనుమానంతో వారిని పట్టుకుని తనిఖీ చేయగా మూడు కిలోల గంజాయి దొరికింది. దానితో పాటు రెండు మోటారు సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఐదుగురినీ అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తణుకు కోర్టులో మంగళవారం హాజరు పరిచారు. గంజాయి కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు కోరుకొండ: గంజాయి కేసులో ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ను కోరుకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్టు నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. కోరుకొండ పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చింతపల్లి నుంచి తీసుకొచ్చిన రెండు కేజీల గంజాయిని కోరుకొండ మండలం అయ్యన్నగళ్లు వద్ద పంచుకుంటుండగా నిందితులను అరెస్టు చేశామన్నారు. ఆ సమయంలో ఐదుగురు దొరికారని, ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ పరారయ్యాడన్నారు. స్థానిక సాంబశివరావు కాలనీకి చెందిన నరేష్ కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు తెలిపారు. కాగా.. నరేష్ను అరెస్టు చేయడానికి కృషి చేసిన ఎస్సై కూన నాగరాజు, కానిస్టేబుల్ ఉదయ భాస్కర్, ప్రసాద్ అభినందించారు. సమావేశంలో కోరుకొండ సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు పాల్గొన్నారు. -
వేస్ట్ ఆయిల్ ప్యూరిఫై యూనిట్లో తనిఖీలు
కాకినాడ రూరల్: సర్పవరం ఆటోనగర్లో వేస్ట్ ఆయిల్ను ప్యూరిఫై చేసి సెకండ్ గ్రేడ్ ఆయిల్, గ్రేజ్ తయారు చేసే ఎస్ఏఎఫ్ పెట్రోలియం యూనిట్పై విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమహేంద్రవరం విజిలెన్స్ డీఎస్పీ తాతారావు, విజిలెన్స్ సీఐలు, కాకినాడ సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ సప్లయి అధికారి ప్రసన్న లక్ష్మీదేవి, అర్బన్ టీపీ అనిల్ కుమార్ తదితరులు సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చైన్నె నుంచి ట్యాంకర్లో తీసుకువచ్చిన టర్పెన్టైన్ను గుర్తించారు. జీఎస్టీ బిల్లులు ఉన్నప్పటికి టర్పెన్టైన్లో పెట్రోలియం కంటెంట్ ఉండడంతో వాహనంతో సహా 25 వేల లీటర్ల సరుకు ఉన్నట్టు గుర్తించారు. టర్పెన్టైన్ ఉన్న వాహనంతో పాటు మరో ఖాళీ వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాలు, సరకు విలువ సుమారు రూ.75 లక్షలు అధికారులు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
తొమ్మిది మందికి రిమాండ్
ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో జరిగిన పరస్పర దాడులకు సంబంధించి తొమ్మిది మంది నిందితులకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రిమాండు విధించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక యర్ర కాలనీ సమీపంలో ఈ నెల 15వ తేదీ రాత్రి పెనికేరుకు చెందిన కె.రోహిత్, చింతలూరుకు చెందిన పి.తేజ వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ సందర్భంగా ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై 15 మంది నిందితులను గుర్తించి సోమవారం కేసు నమోదు చేశారు. వారిలో ఇప్పటికే అరెస్ట్ చేసిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఐ.ప్రవీణ్ కుమార్ 15 రోజుల రిమాండు విధించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వెళ్లింది 31 మంది... వచ్చింది 50 మంది నర్సింగ్ ఆఫీసర్ల కౌన్సెలింగ్ పూర్తి కాకినాడ క్రైం: సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జీజీహెచ్లోని కమ్యూనిటీ హాల్లో వెబ్ ద్వారా నిర్వహించిన ఈ ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పర్యవేక్షించారు. జీజీహెచ్లో తొలి నుంచి 24 ఖాళీ స్టాఫ్ నర్సుల పోస్టులు ఉండగా, ఉన్న వారి నుంచి 31 మంది బదిలీ అయ్యారు. దీంతో మొత్తం 55 ఖాళీలు ఏర్పడ్డాయి. మంగళవారం నాటి కౌన్సెలింగ్ ప్రక్రియలో వివిధ ప్రాంతాల నుంచి 50 మంది స్టాఫ్ నర్సులు కొత్తగా కాకినాడ జీజీహెచ్కు బదిలీ అయ్యారు. దీంతో సింహభాగం భర్తీ అయి, మరో ఐదు ఖాళీలు మిగిలాయి. అలాగే, జీజీహెచ్లో పనిచేస్తున్న హెడ్ నర్సులు 9 మంది బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఒక్కరు కూడా చేరలేదు. స్టాఫ్ నర్సులకు పదోన్నతులు వచ్చే వరకు ఈ స్థానాలు భర్తీ అయ్యే ప్రసక్తే లేదు. ఈ పరిస్థితి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టేషన్ సీనియారిటీని అనుసరించి బదిలీ అయిన వీరంతా రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లారు. అలాగే నర్సింగ్ ట్యూటర్లలో ఓ పోస్టు రిటెన్షన్ అయి దరఖాస్తుదారు అదే స్థానంలో కొనసాగనున్నారు. మరో పోస్టు ఖాళీగా ఉండగా తాజా బదిలీలో భర్తీ అయ్యింది. -
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చాగల్లు: ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు – పంగిడి రహదారిలోని ఎస్.ముప్పవరం శివారులో ఇసుక ట్రాక్టర్ ఆగి ఉంది. దాన్ని పోలవరం నుంచి నిడదవోలు వెళుతున్న నిడదవోలు డిపోకు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. అలాగే బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆన్ అయ్యి సమీపంలో ఇంటి గేటును ఢీకొని ట్రక్కు బొల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న కొవ్వూరుకు చెందిన జి.వీర వెంకట సత్యనారాయణతో పాటు మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో వారిని మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానాలకు చేరవేశారు. -
చేనుకు చేప మందు
ప్రయోజనాలు ఇవే.. ● ఫిష్ అమినో యాసిడ్లో నత్రజని శాతం ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు తొందరగా పెరుగుతాయి. ● స్వల్ప కాలిక పంటలైన కూరగాయలు, వరి, పప్పు దినుసులకు మొదటి 40 రోజులు చాలా కీలకమైనవి. వాటి పెరుగుదల పైన మాత్రమే దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఐదు రోజులకు ఒకసారి చొప్పున ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే యూరియా, డీఏపీ ఎరువుల కంటే ఎక్కువ బలాన్ని పంటకు ఇస్తుంది. ● 40 రోజుల తర్వాత పది రోజులకు ఒకసారి ఇతర ద్రవాలతో కలిపి దీనిని వాడుకోవచ్చు. దీనిని వాడడం వల్ల మొక్క ఆకులు బాగా పచ్చబడటం, కొమ్మలు బాగా రావటం, కాయ సైజు బాగా పెరగడం జరుగుతుంది. ● నత్రజనితో పాటు ఇతర పోషకాలు ఉండటం వల్ల పూత, పిందె ఎక్కువ మొత్తంలో వస్తుంది. పిఠాపురం: సాధారణంగా ఉబ్బసానికి చేప మందు వేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చేపలతో చేలకు మందు తయారు చేస్తున్నారు. దాన్నే ఫిష్ అమినో యాసిడ్ మీనామృతం అని పిలుస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలోని గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ఏడాది అధిక మొత్తంలో మీనామృతం తయారీ చేపట్టారు. రోజుకు 300 లీటర్ల మీనామృతం తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు ఈ మందును పంపిణీ చేయనున్నారు. మీనామృతం తయారీఽ విధానాన్ని ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకుడు గుండ్ర శివచక్రం వివరించారు. మీనామృతం మీనామృతం తయారీకి చేపలు, బెల్లం, బొగ్గు, దేశీయ ఆవు మూత్రం అవసరమవుతుంది. ముందుగా చేపలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చేప లోపలి భాగాలను కూడా వినియోగించుకోవచ్చు. వాటిని పారవేయాల్సిన అవసరం లేదు. ముందుగా కత్తిరించిన చేపలు ఎన్ని కేజీలున్నాయో తూకం వేసి సిద్ధం చేసుకోవాలి. అంతే మొత్తంలో బెల్లాన్ని దగ్గర పెట్టుకోవాలి. బెల్లాన్ని పొడిగా దంచుకోవాలి. 200 లీటర్ల కెపాసిటీ గల డ్రమ్ములు తీసుకోవాలి. వాటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మీనామృతం కలపడానికి ఒక పెద్ద గిన్నె లేదా టబ్ అవసరం. అది పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తయారీ విధానం పెద్ద గిన్నె లేదా టబ్లో 10 కేజీల చేపలు, 10 కేజీల బెల్లం, 100 గ్రాముల బొగ్గు పొడి, ఒక లీటర్ ఆవు మూత్రం పోసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎన్ని కేజీల చేపలు ఉంటే అన్నిసార్లు కలుపుకొని డ్రమ్ములో వేసుకోవాలి. వీటిని కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పాత్రలు శుభ్రంగా ఉండేలా చూడాలి. తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే చేపలు ఎన్ని ఉన్నాయో అంచనా వేసుకొని అందుకు తగిన విధంగా డ్రమ్ములు సిద్ధం చేసుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరి డ్రమ్ములో కలిపిన చేపలు వేసినప్పుడు 60 శాతం మాత్రమే నింపాలి. లేకపోతే రెండో రోజు పొంగిపోయే అవకాశం ఉంటుంది. డ్రమ్ము 60 శాతం నింపిన తరువాత దానిని కప్పేందుకు సరిపడా ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ సంచితో మూతిని గట్టిగా కట్టాలి. దీన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సవ్య దిశలో ఐదు నిమిషాల పాటు కర్రతో కలుపుతూ ఉండాలి. అనంతరం కర్రను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. లేకపోతే వాటిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి, దానితో ద్రవాన్ని కలిపినప్పుడు పురుగులు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ద్రవాన్ని కలిపిన అనంతరం డ్రమ్ముకు కవర్ కట్టి వేయాలి. ఇలా 20 నుంచి 25 రోజులలో ద్రావణం తయారవుతుంది. సుమారు 20 రోజుల తర్వాత ద్రావణం నుంచి తాటి పండు వాసన వస్తుంది. అలా వాసన వస్తే ద్రావణం ఉపయోగించడానికి వీలుగా తయారైనట్లు గుర్తించాలి. ఉపయోగించే విధానం మొక్కలు నారుదశలో ఉన్నప్పుడు వంద లీటర్ల నీటికి 250 గ్రాముల ద్రావణం సరిపోతుంది. చిన్న మొక్కలైతే 500 గ్రాములు, పెద్దవైతే ఒక కేజీ వరకూ వాడుకోవచ్చు. స్ప్రే చేసినప్పుడు ఫలితం తొందరగా కనిపిస్తుంది. ఎకరానికి ఐదు నుంచి పది కేజీల వరకూ ఉపయోగించుకోవాలి. ఈ ఫిష్ అమినో యాసిడ్ నీటిలో కలిపే ముందు ఒక కేజీ ద్రావణాన్ని ఐదు లీటర్ల నీటిలో బాగా కలుపుకొని, ఫిల్టర్ చేసుకోవాలి. దాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో చేపలతో మీనామృతం తయారీ దుర్గాడలో ఖరీఫ్కు సిద్ధమవుతున్న ద్రావణం -
అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం
అమలాపురం టౌన్: అమలాపురం నుంచి రెండు రోజుల కిందట అదృశ్యమైన తల్లీ పిల్లలను (కుమార్తె, కుమారుడు) విశాఖపట్నం మద్దెలపాలెంలో పోలీసులు మంగళవారం ఉదయం గుర్తించారు. తన భర్త పెట్టే వేధింపులు భరించలేకే కన్నబిడ్డలతో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఈ నెల 15న తల్లీపిల్లల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు తక్షణమే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లో అదృశ్యమైన ఆ కుటుంబాన్ని వెతికి పట్టుకున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ శివారు దూడలవారి వీధికి చెందిన చవ్వాకుల నరేష్ భార్య హారతి (24), కుమార్తె నందన (6), కుమారుడు భార్గవ్ (4) ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. హారతి తన బిడ్డలతో తొలుత మామిడికుదురు మండలం లూటుకుర్రులోని తన పుట్టింటికి స్కూటీపై వెళ్లడం, అక్కడ నుంచి అమలాపురం ఆర్టీసీ బస్స్టేషన్కు వచ్చి సైకిల్ స్టాండ్లో స్కూటీని పెట్టి అదృశ్యమైనట్లు పోలీసులు ఆ రోజు రాత్రే గుర్తించారు. విశాఖపట్నం బస్సు ఎక్కి వెళ్లిన ఆమె తన బిడ్దలతో మద్దెలపాలెంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని ఉన్నట్లు అమలాపురం పోలీసుల విచారణలో తేలింది. వారిని విశాఖ నుంచి అమలాపురం తీసుకుని వచ్చి బంధువులకు అప్పగించారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్సై కేఎం జోషి, కానిస్టేబుల్ రాయు డు శ్రీను, ఐటీ కోర్ విభాగం కానిస్టేబుల్ జాఫర్ సాంకేతికత ఆధారంగా తల్లీపిల్లలను గుర్తించారు. తల్లి వద్దకు క్షేమంగా చేరిన బాలిక కాకినాడ రూరల్: చీడిగ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక చల్లా సత్య పావని అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆ బాలికను మంగళవారం ఇంద్రపాలెం పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న సత్యపావని సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం పోలీసులు రాత్రి అదృశ్యం కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఎస్సై వీరబాబు ప్రత్యేక బృందాలతో బాలిక కోసం గాలించారు. ఆ బాలిక ముందుగా విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి సామర్లకోట వచ్చి, చివరకు రామచంద్రపురంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఇంద్రపాలెం తీసుకువచ్చి విచారించగా తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్టు పావని చెప్పింది. దీంతో బాలిక, ఆమె తల్లికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, అనంతరం అప్పగించారు. కాగా.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తల్లీపిల్లల ఆచూకీ లభ్యం భర్త వేధింపులు భరించలేకే పారిపోయినట్టు వెల్లడి -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: అన్నవరం – రావికంపాడు రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు నుంచి జారిపడి కొడకల వెంకట రమణ (30) అనే వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన కొడకల వెంకటరమణ అనపర్తి మండలం పి.రామచంద్రాపురం కోళ్లఫారంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో సోమ వారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నానికి రైలులో బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు కావడంతో 108లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటరమణకు భార్య, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కోనసీమ కళ .. పూరీలో భళా..
కొత్తపేట: కోనసీమకు చెందిన గరగనాట్యం, వీరనాట్యం కళాబృందాల ప్రదర్శనలకు ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఫోక్ ఫైర్ ఫెస్టివల్ (జానపద జాతర)లో విశేష గుర్తింపు లభించింది. ఆ ఫెస్టివల్లో భాగంగా వెస్ట్ జోన్ కల్చరల్ ఉదయ్పూర్, సౌత్ జోన్ కల్చరల్ తంజావూరు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జానపద జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో గరగ నాట్యం, వీరనాట్యం ప్రదర్శనలకు అవకాశం అభించింది. సోమవారం నిర్వహించిన ఆయా ప్రదర్శనల్లో ప్రసాద్తో పాటు 20 మంది ఆయా కళాబృందాలు తమ ప్రతిభను ప్రదర్శించి, నిర్వహకులను, ప్రముఖులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ కళాకారులను ముఖ్యంగా టీమ్ లీడర్ ఏసు వెంకట ప్రసాద్.. ఒడిశా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖల మంత్రి డాక్టర్ కృష్ణచంద్ర మహాపత్ర, తదితర ప్రముఖుల అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తమ బృందాలను గుర్తించి దేశ, విదేశాల్లో అవకాశాలు కల్పి స్తున్న రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్ సీఈఓ మల్లికార్జునరావుకు కళాబృందాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
రక్త సేకరణలో జేఎన్టీయూకేకు అవార్డు
బాలాజీచెరువు: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రక్త సేకరణలో జేఎన్టీయూకే రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి అవార్డును సాధించింది. గుంటూరులో వైద్యశాఖమంత్రి సత్యకుమార్యాదవ్ ఈ అవార్డును అందజేశారు. మంగళవారం జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తన చాంబర్లో అవార్డు అందుకున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ శ్యామ్కుమార్ను అభినందించారు. 2023–24 ఏడాదికి వర్సిటీ అనుబంధ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించి అధిక యూనిట్లు సేకరించడం సంతోషమని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. శ్యామ్కుమార్ను రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ రవీంద్ర, ప్రిన్సిపాల్ మోహనరావు అభినందించారు. ఐఎఫ్టీ నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐఐఎఫ్టీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసిందని ఎంపీ తంగేళ్ల ఉదయ్శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపల్లి మండలం పొన్నాడ వద్ద 229.81 కోట్ల వ్యయంతో నిర్మించే క్యాంపస్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంజూరు చేశాయి. అయినవిల్లికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకోలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 24 మంది, లక్ష్మీగణపతి హోమంలో 12 జంటలు, స్వామి సన్నిధిలో ఐదుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం, చిన్నారులకు తులాభారం, అన్నప్రాసన నిర్వహించారు. 28 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 1600 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,04,571 వచ్చినట్టు ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. విద్యా పథకాల అమలుపై సమీక్ష అమలాపురం టౌన్: విద్యా పథకాల అమలుపై క్షేత్ర స్థాయిలో జరిగే అధ్యయనాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత క్లస్టర్ రీసోర్స్ మొబైల్ టీచర్స్ (సీఆర్ఎంటీ)పై ఉందని సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ జి.మమ్మీ అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం జిల్లాలోని స్కూల్ కాంప్లెక్స్ సీఆర్ఎంటీలతో సమీక్షించారు. సమగ్ర శిక్షా సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ విద్యా పథకాలపై చర్చించారు. విద్యార్థులకు కిట్ల పంపిణీ, టీచర్ల ట్రైనింగ్ తదితర కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మమ్మీ మాట్లాడుతూ విద్యా పథకాల అమలు కోసం సీఆర్ఎంటీలు క్షేత్ర స్థాయిలో పాఠశాలలను సందర్శించాలన్నారు. సమగ్ర శిక్షా ఏఎంవో పి.రాంబాబు మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 26 వరకూ ప్రధానోపాధ్యాయలకు లీడర్ షిప్ ట్రైనింగ్, ఈ నెల 23 నుంచి 28 వరకూ గతేడాది ఎఫ్ఎల్ఎన్ శిక్షణ పొందిన ఒకటో తరగతి బోధన చేసే ఉపాధ్యాయులకు రెండో దశ శిక్షణ ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్షా ఏఎస్వో కె.నారాయణరావుతో పాటు జిల్లాలోని 22 మండలాల పరిధిలోని స్కూల్ కాంప్లెక్స్ల సీఆర్ఎంటీలు పాల్గొన్నారు. -
నిలకడగా డయేరియా రోగుల ఆరోగ్యం
రౌతులపూడి: డయేరియాతో బాధపడుతూ రౌతులపూడి సీహెచ్సీలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యాధికారిణి మంగళవారం జానకీదేవి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 44 మందికిగాను ఆరోగ్యం మెరుగుపడిన ఏడుగురిని మంగళవారం డిశ్చార్జి చేయగా సత్యవరం గ్రామానికి చెందిన మరో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 40 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వారందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో జిల్లా రాపిడ్ రెస్సాన్స్ బృంద సభ్యులు డాక్టర్ వి.అరవింద్ కుమార్, డాక్టర్ వి.సత్యచంద్రిక, డాక్టర్ ఎస్.రుక్మిణీదేవి మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగులు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన చికిత్స నందించేందుకు అవసరమైన సూచనలను సీహెచ్సీ వైద్యులకు సూచించారు. డయేరియా ప్రబలిన సబ్ప్లాన్ ఏజెన్సీకి చెందిన దబ్బాది, సత్యవరం గ్రామాల్లో తాగునీరు, ఆహార దినుసులు, తదితర శాంపిల్స్ను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. సీహెచ్సీ వైద్యులు డాక్టర్ పావని పాల్గొన్నారు. యోగా ప్రయోజనాలపై అవగాహన సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర సాధనలో ‘వన్ హెల్త్ – వన్ ఎర్త్ ‘ అనే నినాదంతో మానవాళికి ఆరోగ్యవంతమైన మార్గంలో యోగా సాధన వల్ల చేకూరే ప్రయోజనంపై అవగాహన కల్పిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి అన్నారు. రాజమహేంద్రవరంలోని వై.జంక్షన్ వద్ద పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం యోగాంధ్ర సాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో సీతారామమూర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 4,900 పైగా ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రదేశాల్లో 7,50,000 మంది యోగ సాధకులకు నిత్యం శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. డీఆర్ఓ సీతారామమూర్తి -
పొట్టి శ్రీరాములు వర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభించాలి
రాజమహేంద్రవరం సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి వెంటనే వైస్ చాన్సలర్ను, రిజిస్ట్రార్ను నియమించి అడ్మిషన్లు ప్రారంభించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీ.కే.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. జూన్ నెల 15వ తేదీ దాటిందని, హైదరాబాద్ పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయంలో ఉన్న కోర్సులన్నింటిని ఇక్కడ కూడా ప్రవేశపెట్టేందుకు విద్యాశాఖా మంత్రి నారా లోకేష్తో మాట్లాడి అడ్మిషన్లు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ పనిని చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై ఉందన్నారు. పురపాలక శాఖా మంత్రితో మాట్లాడి చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రాన్ని తేవాలని, కడప, కర్నూలు కంటే ఆ ప్రాజెక్టు అవసరం రాజమహేంద్రవరం నగరానికి ఎక్కువగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూరల్లో స్థలం ఇచ్చి వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. హుకుంపేటలో నిర్మాణంలో ఉన్న మురికి నీటి శుద్ధి కర్మాగారం పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్ధుల్లా షరీఫ్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు జేటీ రామారావు తదితరులు పాల్గొన్నారు. -
గట్టు తెగితే గల్లంతే..
ఐ.పోలవరం: ఒకవైపు గౌతమి గోదావరి పాయ... మరోవైపు వృద్ధ గౌతమి నదీ పాయ...ఈ రెండింటి మధ్య ఉండే దీవి ఐ.పోలవరం (ఐలాండ్). సుమారు 16 గ్రామాలతో ఉండే ఐలాండ్లో దాదాపు లక్ష మంది వరకూ ప్రజలు జీవిస్తున్నారు. గోదావరి మధ్యన ఉండే ఈ దీవికి వరద సమయంలో చుట్టూ ఉన్న ఏటిగట్లే శ్రీరామరక్ష. 2006, 2022లో గోదావరికి వచ్చిన అతి పెద్ద వరదల నుంచి ఇవే ఐలాండ్ను రక్షించాయి. అటువంటి ఏటిగట్లకు గత కొన్నేళ్లుగా కనీస మరమ్మతులు చేపట్టలేదు. దీంతో అవి కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. వరద పోటు గోదావరికి వరద పోటు తాకగానే ఏటిగట్లను ఆనుకుని ఉండే నది లంక గర్భాలు నీట మునుగుతుంటాయి. ఏటిగట్టు పట్టున ఉండే పంట పొలాలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరడం ఇక్కడ సర్వసాధారణం. అయితే ఏటిగట్ల వల్ల వరద నీరు గ్రామాల్లోకి రాకుండా ఉంటుంది. ఐలాండ్ చూట్టూ 36 కిలోమీటర్ల మేర ఏటిగట్లు విస్తరించి ఉన్నాయి. వీటిని 2000లో ఎత్తు చేసి పటిష్ట పరిచారు. నాటి నుంచి నేటి వరకు కనీస మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడవి బలహీనపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంగిపోయి.. ఐ.పోలవరం మండలంలోని పలు గ్రామాలలో ఏటిగట్లు కుంగి స్థానికులను భయపెడుతున్నాయి. గట్లకు రక్షణగా ఉన్న మట్టి అండలుగా జారిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో కోతలకు గురై ప్రమాదకరంగా మారాయి. గట్ల మీద వేసిన గ్రావెల్, బీటీ రోడ్లు అధ్వానంగా తయారై, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మండలంలోని కేశనకుర్రు, కేశనకుర్రుపాలెం, తిల్లకుప్ప, దుప్పిలంక, జి.మూలపాలెం, జి.వేమవరంలో ఐలాండ్ ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. ఇటువంటిచోట మరమ్మతులు చేపట్టి, గట్లకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. కొంపముంచుతున్న ఆక్వా సాగు ఏటిగట్లను ఆనుకుని నదీ గర్భంలో ఆక్వా సాగు చేపట్టారు. దీని కోసం ఏటిగట్టు వెంబడి ఇస్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నదీ గర్భంలోనే ఆక్వా చెరువులు ఉన్నాయి. గట్లకు ఆనుకుని నదిలో ఉండే పెద్ద పెద్ద మట్టి దిబ్బలను తొలగించడం వల్ల వరద నీటి ప్రవాహం నేరుగా గట్టుకు తగులుతోంది. దీని వల్ల గండ్లు పడే ప్రమాదం మరింత పెరుగుతోంది. ఆక్వా చెరువుల తవ్వకాలు 1856 మద్రాస్ కన్జర్వెన్సీ యాక్టుకు పూర్తి విరుద్ధం. నది వైపునే కాకుండా నదికి ఇవతలి వైపు ఐలాండ్లో సాగు చేసే ఆక్వా చెరువుల కోసం గట్లను ధ్వంసం చేసి, మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల వీటి వల్ల కూడా గట్లు బలహీనపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కొమరగిరి, పాత ఇంజరం, ఎదుర్లంక, జి.వేమవరం, మురమళ్ల, పశువుల్లంక, కేశనకుర్రు. జి.మూలపొలంలో ఆక్వా సాగు పెద్ద ఎత్తున సాగుతోంది. ఇంత జరుగుతున్నా హెడ్ వర్ుక్స అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దెబ్బతిన్న ఐలాండ్ రోడ్లు గతంలో ఐలాండ్ చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టారు. పలుచోట్ల బీటీ రోడ్లు వేశారు. మొత్తం బీటీ రోడ్డు వేసి ఉంటే వాహనాల రాకపోకలు పెరిగి గట్లు బలపడడంతో పాటు స్థానికులకు రవాణా సౌకర్యం కూడా ఏర్పడుతుందని భావించారు. దీనితో పాటు నదిని ఆనుకుని రిసార్టుల నిర్మాణాలు జరిగితే పర్యాటకాభివృద్ధి జరుగుతుందని ప్రణాళికలు రచించారు. ఆ తర్వాత వాటి సంగతి వదిలేశారు. ప్రస్తుతం ఏటిగట్ల మీద రహదారులు దెబ్బతినడంతో రైతులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. గోదావరికి వరదలు సమీపిస్తున్న తరుణంలో గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు గట్లను పటిష్టం చేసే పనులు చేపట్టాలని ఐలాండ్ వాసులు కోరుతున్నారు. బలహీనంగా ఏటిగట్లు వరదలు వచ్చే సమయం స్థానికుల ఆందోళన రక్షణ చర్యలు చేపట్టాలి IÌê…yŠæ HsìæVýSrϯ]l$ 2000ÌZ ç³sìæçÙt ç³Ç^éÆý‡$. B 糯]l$Ë$ fÇW Cç³µ-sìæMìS §é§éç³# 24 Hâ¶æ$Ï AÐ]l#-™ø…-¨. M>ºsìæt Hsìæ-VýS-rϯ]l$ çÜÐ]l${VýS…V> ç³Ç-Ö-Í…-_, MýS$…W¯]l {´ë…™é-ÌS¯]l$ VýS$Ç¢…_ Ððl…r¯ól ç³sìæçÙt 糯]l$Ë$ ^ólç³-sêtÍ. Ð]l$Æø ¯ðlÌS ÆøkÌZÏ Vø§éÐ]lÇ Ð]lÆý‡-§ýlÌSMýS$ Ð]l^óla AÐ]lM>Ôèæ… E¯]l²…§ýl$¯]l Ððl…r¯ól 糯]l$Ë$ {´ëÆý‡…-À…-^é-Í. ˘ – ఎన్.రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ, టి.కొత్తపల్లి, ఐ.పోలవరం మండలం -
గర్భస్థ శిశువు నిర్ధారణపై సమగ్ర విచారణ
అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచనలుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గర్భస్థ శిశువు నిర్ధారణ చేయడం, లింగ ఎంపిక నిషేధం వంటి ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ప్రశాంతి అధికారుకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బహుళ సభ్యుల సాధికార కమిటీ, జిల్లా సలహా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గర్భస్త శిశువు నిర్ధారణ పరీక్షలు చేయడం, అబార్షన్, పోస్ట్ అబార్షన్ కోసం వాడే మందుల వినియోగంపై ప్రతి నెలా డ్రగ్స్ కంట్రోలర్ ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో ఒక ఆడపిల్ల, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వారిలో ఎంతమందికి అబార్షన్ చేశారు అనే వివరాలు తెలుసుకోవాలన్నారు. డెకాయిట్ ఆపరేషన్ కోసం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్కానింగ్ సెంటర్స్ విషయంలో కొత్తగా అనుమతులు, ప్రస్తుతం కొనసాగుతున్న వాటికి రెన్యువల్, సవరణల విషయంలో నియమ నిబంధనలు, అర్హతలపై దృష్టి సారించాలన్నారు. ఏదైనా స్కానింగ్ సెంటర్కి అనుమతులు ఇచ్చే క్రమంలో నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు లోబడే ఉత్తర్వులు జారీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘తల్లికి వందనం’కు షాక్!
సామర్లకోట: తల్లికి వందనం పథకానికి విద్యుత్తు బిల్లుల నిబంధనల సెగ తగిలింది. గడచిన ఆరు నెలలుగా 300 యూనిట్ల వాడకం లేనప్పటికీ తమకు తల్లికి వందనం పథకం నిలిపివేశారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు సోమవారం స్థానిక పిఠాపురం రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్కు తరలివచ్చారు. వేసవి కాలంలో ఎండలు మండిపోవడం, అదే సమయంలో శుభకార్యాలు జరగడంతో ఒక్క మే నెలలో మాత్రమే 300 యూనిట్ల బిల్లు వచ్చిందని, దానిని సాకుగా తీసుకోవడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. ఆరు నెలల సరాసరి తీసుకొని 300 యూనిట్లు దాటితే తల్లికి వందనం నిలిపివేసినా అభ్యంతరం లేదని అన్నారు.అనేక మందికి 4 నుంచి 14 వరకూ మీటర్లు ఉన్నట్లు స్టేట్మెంట్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో వాడుకుంటున్న విద్యుత్ మీటర్లు తమ పేరిట ఉండటమేమిటని ప్రశ్నించారు. ఇలా ఉన్న మీటర్లను గుర్తించి, బాధితుల పేర్లు తొలగిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ ఏఈ రమేష్ కుమార్ చెప్పారు. ఆధార్ కార్డుల ప్రాతిపదికన విద్యుత్తు బిల్లులకు సంబంధించి అదనపు మీటర్లు ఉన్నట్లు గుర్తిస్తే రూ.30 చెల్లించి స్టేట్మెంట్ తీసుకోవడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి తొలగిస్తామని తెలిపారు. దీంతో, ఈ స్టేట్మెంట్ల కోసం విద్యుత్ వినియోగదారులు ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద బారులు తీరారు. విద్యుత్తు వాడుతున్న వారు వారి ఆధార్ కార్డులతో మీటరుకు లింక్ చేయించుకోవాలని ఏఈ సూచించారు. ఈ మేరకు విద్యుత్తు మీటర్లకు ఆధార్ లింక్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. విద్యుత్తు వాడకం 300 లోపు యూనిట్లు ఉన్నవారికి స్టేట్మెంట్లు అందజేస్తామని చెప్పారు. అయితే, తల్లికి వందనం అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఆలోగా విద్యుత్ వాడకానికి సంబంధించిన స్టేట్మెంట్లు రాకపోతే తమకు అన్యాయం జరుగుతుందని తల్లులు ఆవేదన చెందుతున్నారు. -
మార్కెట్లోకి సుజుకి కొత్త స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని కంటిపూడి సుజుకి షోరూంలో సోమవారం కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు సుజుకి న్యూ యాక్సెస్ 125 సీసీటీఎఫ్టీ ఎడిషన్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూ వీలర్ విక్రయ రంగంలో సుజుకి ఆక్సిస్ నెంబర్ వన్ స్థానంలో ఉందని. కొత్తగా లాంచ్ చేసిన టీఎఫ్టీ వాహనానికి సరికొత్త హంగులు, అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేశారన్నారు. కలర్ డిజిటల్ మీటర్, వెదర్ అలర్ట్, నావిగేషన్, మెసేజ్ అలర్ట్, వాట్సాప్ కాల్, మైలేజ్ రేంజ్, డెమో నైట్ మోడ్ లాస్ట్ పార్కింగ్ అలర్ట్, స్పీడ్ ఎక్సీడింగ్ అలెర్ట్ వంటి సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ స్కూటీ అన్ని వర్గాలతో పాటు యువతకు ఆకర్షణీయంగా ఉంటుందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైందని, డ్రైవింగ్కు సులువైందని నాణ్యతలో సాటిలేని స్కూటర్ అని అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ కె.వినయ్బాబు, ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్రామ్, జి.ఎం రాజారావు, కస్టమర్లు, నగర ప్రముఖులు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
బ్రాందీషాపు ఏర్పాటును నిరసిస్తూ ధర్నా
మామిడికుదురు: పెదపట్నం గ్రామంలోని ఏటిగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఎదురుగా బ్రాందీ షాపు ఏర్పాటుకు నిరసనగా సోమవారం స్థానికులు ధర్నా చేశారు. బ్రాందీ షాపు ఎదురుగా నిల్చుని నిరసన తెలిపారు. ఆలయం సమీపంలో నివాస గృహాల వద్ద బ్రాందీషాపు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా నిరసించారు. గతంలో ఇదే విధంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నామన్నారు. అప్పట్లో ఈ షాపును వేరే చోట ఏర్పాటు చేశారని చెప్పారు. మళ్లీ ఇక్కడ బ్రాందీ షాపు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దీని వల్ల తాము నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. బ్రాందీ షాపు ఏర్పాటు నిర్ణయాన్ని తక్షణం ఉప సంహరించుకోవాలని నినాదాలు చేశారు. నిరసనలో గెద్దాడ సందీప్, కుక్కల వేణు, గెద్దాడ సావిత్రి, చెల్లింగి సత్యనారాయణ, కుక్కల సక్కుబాయి, ముత్యాల సుబ్రహ్మణ్యం, కుక్కల నాగలక్ష్మి, అరిగెల కృష్ణవేణి, చెల్లింగి వరలక్ష్మి పాల్గొన్నారు. -
పెద్దాపురంలో వ్యక్తి దారుణ హత్య
పెద్దాపురం: పట్టణ శివారు కట్టమూరు పుంత ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన జానకి సత్య శ్రీనివాస్ (వెంకన్నబాబు) (32)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... మృతుడు ఓ రైస్మిల్లులో పని చేస్తున్నాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. పదునైన ఆయుధంతో మెడపై బలంగా కొట్టి చంపినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద పగిలిన బీర్ బాటిళ్లు ఉండడంతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమా.? మద్యం మత్తులో ఎవరైనా హత్య చేశారా? మరే ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు శ్రీనివాస్పై గతంలో హత్య, హత్యాయత్నంతో సహా పలు కేసులు ఉన్నట్లు సమాచాఉరం. పెద్దాపురం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ మౌనిక తెలిపారు. -
‘సార్... ఇలా చేశారు’
నర్సింగ్ బదిలీలలో మాయాజాలంపై ఆర్డీ కలెక్టర్కు వివరణ కాకినాడ క్రైం: నర్సింగ్ బదిలీలలో నర్సింగ్ అసోసియేషన్ అగ్రనాయకత్వ మాయాజాలంపై కలెక్టర్ షణ్మోహన్ సీరియస్ అయ్యారు. బదిలీల ప్రయోజనాలను పొందేందుకు అసోసియేషన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న వారి పేర్లకి బదులు ఇతరులవి చేర్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్డీ డాక్టర్ పద్మశశిధర్ని ఆరా తీశారు. ఈ ఉదంతంపై పూర్తి వివరాలివ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వివాదానికి సంబంధించి ఆది నుంచీ చోటు చేసుకున్న ప్రతి అంశాన్ని ఆర్డీ వివరణాత్మకంగా కలెక్టర్కు అందించారు. ఉన్నతాధికారులనే బురిడీ కొట్టించిన ఈ వ్యవహారంపై కలెక్టర్ అప్రమత్తమయ్యారు. తమకందుతున్న వివిధ యూనియన్ల లెటర్లలోని ఆఫీస్ బేరర్ల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ధారించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కాగా కలెక్టర్ సూచనల మేరకు బాధ్యులపై చర్యలు చేపడతామని డాక్టర్ పద్మశశిధర్ అన్నారు. పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల ఘర్షణ ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో ఇరు వర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ కథనం ప్రకారం స్థానిక పెద్ద కాలువ రోడ్డులోని ఎర్రకాలనీ వద్ద పలివెల తేజ, కొమ్ము రోహిత్ వర్గాల మధ్య ఆదివారం రాత్రి పరస్పర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హత్యా ప్రయత్నం జరిగిందంటూ ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 14 మందిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య బిక్కవోలు: మండలంలోని పందలపాక గ్రామంలోని రేకుల షెడ్డులో మేడిశెట్టి వెంకటరమణ (44) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎస్ఐ వాసంశెట్టి రవిచంద్ర కుమార్ సోమవారం తెలిపారు. ఊలపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకటరమణ పందలపాక కోదండ రామ రైస్మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగడానికి ఇంట్లో రూ.100 అడిగాడు. ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తాను పనిచేసే రైస్మిల్లు ఎదురుగా ఉన్న షెడ్డులోకి వెళ్లి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రుమాలుతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఆయన కుమారుడు అజిత్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించి, పంచానామా అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
తాళ్లరేవు సీహెచ్సీసూపరింటెండెంట్ స్నేహలత సస్పెన్షన్
తాళ్లరేవు: స్థానిక సీహెచ్సీ సూపరింటెండెంట్ ఆర్.స్నేహలతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు తాడేపల్లి విజిలెన్స్ విభాగం డీఎస్హెచ్ నుంచి ఉత్తర్వులు ఆస్పత్రికి అందాయి. ఈ నెల 14వ తేదీన ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి రెండో కాన్పుగా జన్మించిన పసికందు మృతి చెందింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి చెందిన బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. సూపరింటెండెంట్ స్నేహలత, స్టాఫ్ నర్సుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని, వారిని విధుల నుంచి తొలగించాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆందోళనకారులతో మాట్లాడి, విచారణ నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా అదేరోజు బాధ్యులైన నర్సులను సస్పెండ్ చేయగా, సూపరింటెండెంట్ స్నేహలతను సోమవారం సస్పెండ్ చేశారు. ప్రసవానికి ముందు కేసును సరిగ్గా అనుసరించకపోవడం, రోగికి జ్వరం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, అటెండర్ల కాల్కు వెంటనే స్పందించకపోవడం, కేసు షీట్ను ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేయడం, విధుల్లో నిర్లక్ష్యం తదితర కారణాలతో సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
గోదావరిలో స్నానానికి దిగిన యువకుడి మృతి
● రెండో రోజు ఒడ్డున మృతదేహం లభ్యం ● కలసి వెళ్లిన మిగిలిన ఆరుగురు మిత్రులు సురక్షితం కరప/ఐ పోలవరం: ఆదివారం సరదాగా గడపడానికి వెళ్లిన ఏడుగురు స్నేహితులు గోదావరిలోకి స్నానానికి దిగగా, ఒక యువకుడు గల్లంతు అయ్యాడు. మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. రెండో రోజు సోమవారం గోదావరి ఒడ్డున మృతదేహం లభ్యమైంది. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... కరప గ్రామానికి చెందిన నరాల సాయికృష్ణ(19) మరో ఆరుగురు స్నేహితులతో కల్సి ఆదివారం సరదాగా గడపడానికి మోటార్ సైకిళ్లపై యానాం వెళ్లి, అక్కడి నుంచి ఎదుర్లంక వంతెన దాటివెళ్లి గోదావరిలోకి స్నానానికి దిగారు. ఒకరికొకరు సాయపడి ఒడ్డుకు చేరడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వీరిలో సాయికృష్ణ గల్లంతయ్యాడు. మిగిలిన ఆరుగురు ప్రాణాలతో బయటపడి, ఒడ్డుకు చేరుకున్నారు. ఆరుగురిని ఐ.పోలవరం పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతున్నారు. గల్లంతైన సాయికృష్ణ మృతదేహం రెండో రోజు సోమవారం ముమ్మిడివరం సమీపంలో గోదావరిలో మునిగిపోయిన ప్రాంతంలోనే పైకి తేలింది. రెండురోజులుగా తాత నరాల కృష్ణ(వెంటూరు కృష్ణ), తండ్రి నరాల బుజ్జి, బంధువులతో కల్సి కన్నీరు,మున్నీరుగా విలపిస్తూ గోదావరి ఒడ్డునే ఉండిపోయారు. ఎలాగైనా బతికిబయట పడతాడని ఎదురుచూశారు. తీరా శవమై తేలడంతో తాత, తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటికి వెళ్లి తన కూతురికి ఎలా చెప్పాలంటూ తాత కృష్ణ, తండ్రి బుజ్జి గుండెలు అవిసేలా విలపిస్తూ, కూలబడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కరప మండల యూత్ అధ్యక్షుడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పెంకే సత్తిబాబు, మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు ఘటనా స్థలానికెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించి, బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పారు. గోదావరిలో గల్లంతైన సాయికృష్ణ స్వగ్రామం కరప గోదావరిలో గల్లంతైన యువకుడు నరాల సాయికృష్ణ స్వగ్రామం కరప. అతని తండ్రి బుజ్జి చిన్న హోటల్ నిర్వహిస్తాడు. తాత నరాల కృష్ణ భార్య కరప హైస్కూలులో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తుంటారు. తల్లి గృహిణి. వీరికి ఒక కుమారుడు సాయికృష్ణ ఇంటర్మీడియెట్ చదివాడు. కుమార్తె కరప హైస్కూలులో చదువుతోంది. కరప, శివారు రామకంచిరాజునగర్ కాలనీకి చెందిన ఆరుగురు స్నేహితులతో కల్సి యానాం మీదుగా వంతెన దాటి వెళ్లి గోదావరిలోకి స్నానానికి దిగారు. ఐ.పోలవరం ఎస్ఐ రవీంద్రబాబు పర్యవేక్షణలో ఎస్డీఆర్ఎఫ్ బృందాల గాలింపులో సోమవారం సాయంత్రం సాయికృష్ణ మృతదేహం లభ్యమైంది. కరపలో విషాద ఛాయలు సాయికృష్ణ మృతితో కరపలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరినీ నవ్విస్తూ, కలుపుగోలుతనంగా ఉండే సాయికృష్ణ లేడని తెలుసుకున్న స్నేహితులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. తల్లికి మరణవార్త తెలియనివ్వలేదు. -
కన్నుల పండువగా సాహితి అరంగేట్రం
గన్ఫౌండ్రీ: ప్రముఖ నాట్య శిక్షణాలయం జ్యోతి కళాక్షేత్రం స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నృత్య గురువు జ్యోతిరెడ్డి శిష్యురాలు సాహితీ పద్మప్రియ కూచిపూడి నాట్య రంగ ప్రవేశం సోమవారం రవీంద్ర భారతిలో కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా పు ష్పాంజలి, జతిస్వరం, అలరింపు, వర్ణం, థిల్లాన వంటి అంశాలపై చక్కటి హావాభావాలతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ట్యాక్స్ ఆనంద్ రాజేశ్వర్ బైవార్ మాట్లాడుతూ.. నేటి తరానికి శాసీ్త్ర య సంగీత కళలపై మక్కువ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తూ శాసీ్త్రయ కళలపై మక్కువ పెంచుకున్న సాహితి రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్వీ రెడ్డి, ఇన్కమ్ట్యాక్స్ (ఇన్వెస్టిగేషన్) ప్రైమరీ డైరెక్టర్ రాజ్గోపాల్ శర్మ తల్లిదండ్రులు మానస, ఐఆర్ఎస్ ఏపీ బాబు పాల్గొన్నారు. కొట్లాటకు నిలయాలుగా బ్రాందీషాపులు కోరుకొండ: మండలంలోని బ్రాందీషాపులు కొట్లాటలు, ఘర్షణలకు నిలయాలుగా తయారయ్యాయి. తాజాగా ఆదివారం రాత్రి జరిగిన కొట్లాటలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. కోరుకొండ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జంభూపట్నం బ్రాందీషాపు వద్ద ఇద్దరు యువకులు గాయపడ్డారు. పశ్చిమగానుగూడెం గ్రామానికి చెందిన కాటుమళ్ల రాజశేఖర్ను గుర్తుతెలియని వ్యక్తులు తలపై బీరు సీసాలతో కొట్టారు. గాధరాడకు చెందిన చంద్రమళ్ల మహేష్ తలపై గుర్తుతెలియని వ్యక్తులు బీరుసీసాలతో మోదారు. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సైనాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 0000648886-000001-Casual Advertis 10.00x8.00 Casual Advertisers -
ఇంటర్ తరువాత కోర్సుల ఎంపికే కీలకం
● మూడు, నాలుగేళ్లు కష్టపడితే ఆనందమయ జీవితం ● సంప్రదాయ డిగ్రీ కోర్సులతోనూ ఉపాధి రాయవరం: ఇంటర్ తర్వాత ఏ కోర్సు చదవాలి! ఏ రంగంలో స్థిరపడాలనే సందేహాలు విద్యార్థుల మెదళ్లను తొలిచేస్తుంటాయి. తల్లిదండ్రులు, స్నేహితుల ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకోకుండా విద్యార్థులు ఇష్టమైన కోర్సును ఎంపిక చేసుకుంటే భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. ఈ ఏడాది జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో 9,246 మంది ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ పరీక్షల్లో 1,576 మంది ఉత్తీర్ణత సాధించారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో మన జిల్లాకు చెందిన మరో ఆరు వేల మంది విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్తీర్ణత పొందారు. వీరిలో 70 శాతం మేరకు ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేందుకు సిద్ధమవుతున్నట్టు అంచనా. ఇంటర్ తరువాత అందుబాటులో ఉన్న కోర్సులు ఇవీ.. వైద్య విద్య ఇంటర్లో బైపీసీ చదివేవారు వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశముంది. నీట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్ సీటు లభిస్తుంది. వైద్య విద్య పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగం పొందే అవకాశాలు అధికంగా ఉంటాయి. బీడీఎస్ పూర్తి చేసి దంత వైద్యులుగా స్థిరపడవచ్చు. సీఏతో సీఏ (చార్టర్ అకౌంటింగ్) మంచి ఉపాధినిచ్చే కోర్సు. ఇంటర్ తరువాత సీపీటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. దీనిలో అర్హత సాధించి, ఐపీసీఏలో చేరవచ్చు. ఇది నాలుగున్నర సంవత్సరాల కోర్సు. కామర్స్ కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ను బీకామ్ ఆనర్స్ అని కూడా పిలుస్తారు. ఇంంటర్లో కామర్స్ చదివిన విద్యార్థులకు ప్రాధాన్యమిస్తారు. కేంద్ర, రాష్ట్ర విశ్వ విద్యాలయాల్లో బీకామ్ ప్రవేశానికి సీయుఈటీ పరీక్షను రాయాల్సి ఉంటుంది. బ్యాంకింగ్, బీమా రంగాల్లో కెరీర్ను ఎంచుకోవాలనుకునే విద్యార్థులు బీకామ్ అకౌంటింగ్, టాక్సేషన్ తీసుకోవాలి. బీకామ్ కోర్సు పాఠ్యాంశాల్లో ఇండియన్ టాక్స్ సిస్టమ్, ఫైనాన్సియల్ అకౌంటింగ్, వాల్యూయాడెడ్ టాక్స్, సెంట్రల్ టాక్స్ ప్రొసీజర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ కమ్యూనికేషన్ ఉంటాయి. బీబీఏ, బీసీఏ, సీఏ, సీఎస్ తదితర వృత్తిపరమైన కోర్సులను చదవడానికి వీలుంది. డిగ్రీతో బోలెడు అవకాశాలు సీయూ సెట్ రాసి జాతీయ స్థాయిలో ప్రాధాన్యం గల విశ్వవిద్యాలయాల్లో హ్యూమన్ సైన్సు కోర్సులు చదవచ్చు. మన రాష్ట్రంలో బీఏతో పాటు బీకాం జనరల్, కంప్యూటర్ కోర్సులకు డిమాండ్ ఉంది. బీఎస్సీ కంప్యూటర్ కోర్సుకు కూడా డిమాండ్ ఉంది. డిగ్రీ చదివే విద్యార్థులకు నైపుణ్యాల పెంపుపై వివిధ యూనివర్శిటీలు దృష్టి సారించాయి. ఇప్పుడిప్పుడే క్యాంపస్ ఇంటర్వ్యూలలో డిగ్రీ చదివే విద్యార్థులు కూడా అవకాశాలు పొందుతున్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్లాలనుకునేవారు డీఈడీ పూర్తి చేసి అవకాశాలు పొందవచ్చు. న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే విద్యార్థులు ఐదేళ్ల కోర్సులకు చెందిన ప్రవేశ పరీక్షలు రాసి ఇంటర్ తరువాత న్యాయ విద్యను అభ్యసించవచ్చు. ఫార్మసీకి ప్రాధాన్యముంది ఔషధ రంగ పరిశోధన, అభివృద్ధి రంగాల్లో ఫార్మసీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. ఏపీ ఈఏపీసెట్తో బి–ఫార్మసీ ప్రవేశాలు జరుగుతాయి. ఇది పూర్తి చేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ ఆఫీసర్, హాస్సిటల్ ఫార్మాసిస్టులుగా ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవసాయం, ఉద్యానం ఏపీ ఈఏపీసెట్తోనే బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ చదివే అవకాశం ఉంది. నాలుగు సంవత్సరాల ఈ కోర్సులు పూర్తి చేస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. నర్సింగ్తో స్వయం ఉపాధి ఇంటర్ బైపీసీ విద్యార్థులకు నర్సింగ్ చక్కని అవకాశం. ఈ కోర్సుతో స్వయం ఉపాధి పొందడమే కాకుండా రోగులకు సేవ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్ తరువాత నాలుగేళ్ల కోర్సును ఎంపిక చేసుకుంటే మహిళలకు మంచి అవకాశాలు ఉంటాయి. రెండేళ్ల ఫిజియోథెరపీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫైన్ ఆర్ట్స్తో ఉజ్వల భవిత పెయింటింగ్, శిల్పకళ, ప్రింట్ మేకింగ్, విజువల్ కమ్యూనికేషన్, ఫొటోగ్రఫీ, గ్రాఫిక్ డిజైన్, ఆర్ట్ హిస్టరీ వంటి విభాగాల్లో శిక్షణ పొందడానికి ఫైన్ ఆర్ట్స్ కోర్సులు ఉపకరిస్తాయి. ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ లేదా డిప్లమా పూర్తి చేసిన అనంతరం విద్యార్థులు గ్యాలరీలు, మ్యూజియం, మీడియా సంస్థలు, విద్యారంగం తదితర రంగాల్లో ఉద్యోగాలు పొందడానికి వీలుంటుంది. డిగ్రీ కోర్సులతో ఉపాధి ఇంటర్ తర్వాత డిగ్రీ కోర్సులతో ఉపాధి పొందడానికి వీలుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎంప్లాయిబిలిటీ కోర్సులు ప్రవేశ పెట్టారు. వీటికి డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులతో పాటుగా, ఆక్వా కల్చర్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులను కలిపి డిగ్రీ చేసుకునే వెసులుబాటు ఉంది. – డాక్టర్ సీహెచ్ రామకృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం ఇంజినీరింగ్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్, ఏపీ ఈఏపీసెట్లో ఇంజినీరింగ్ కోర్సులకు ప్రాధాన్యం అధికం. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఏఐ, ఐటీ తదితర కోర్సులు ఉన్నాయి. ఐఐటీ, ఎన్ఐటీలో చేరి ఇంజినీరింగ్ చేస్తే డిగ్రీ పూర్తయ్యేలోగా వివిధ కంపెనీల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి క్యాంపస్ ఇంటర్వూల్లో ఆఫర్లు వస్తున్నాయి. -
అదీ ‘మ్యా(మీ)టర్’
● 300 యూనిట్ల పేరుతో ‘తల్లికి వందనం’ నిలిపివేత ● ఉన్న మీటరు ఒకటి ● 4 నుంచి 14 వరకూ ఉన్నట్లు స్టేట్మెంట్లు ● సామర్లకోటలో నిలదీసిన మహిళలు సామర్లకోట: తల్లికి వందనం పథకానికి విద్యుత్తు బిల్లుల నిబంధనల సెగ తగిలింది. గడచిన ఆరు నెలలుగా 300 యూనిట్ల వాడకం లేనప్పటికీ తమకు తల్లికి వందనం పథకం నిలిపివేశారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు సోమవారం స్థానిక పిఠాపురం రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్కు తరలివచ్చారు. వేసవి కాలంలో ఎండలు మండిపోవడం, అదే సమయంలో శుభకార్యాలు జరగడంతో ఒక్క మే నెలలో మాత్రమే 300 యూనిట్ల బిల్లు వచ్చిందని, దానిని సాకుగా తీసుకోవడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. ఆరు నెలల సరాసరి తీసుకొని 300 యూనిట్లు దాటితే తల్లికి వందనం నిలిపివేసినా అభ్యంతరం లేదని అన్నారు. అనేక మందికి 4 నుంచి 14 వరకూ మీటర్లు ఉన్నట్లు స్టేట్మెంట్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో వాడుకుంటున్న విద్యుత్ మీటర్లు తమ పేరిట ఉండటమేమిటని ప్రశ్నించారు. ఇలా ఉన్న మీటర్లను గుర్తించి, బాధితుల పేర్లు తొలగిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ ఏఈ రమేష్ కుమార్ చెప్పారు. ఆధార్ కార్డుల ప్రాతిపదికన విద్యుత్తు బిల్లులకు సంబంధించి అదనపు మీటర్లు ఉన్నట్లు గుర్తిస్తే రూ.30 చెల్లించి స్టేట్మెంట్ తీసుకోవడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి తొలగిస్తామని తెలిపారు. దీంతో, ఈ స్టేట్మెంట్ల కోసం విద్యుత్ వినియోగదారులు ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద బారులు తీరారు. విద్యుత్తు వాడుతున్న వారు వారి ఆధార్ కార్డులతో మీటరుకు లింక్ చేయించుకోవాలని ఏఈ సూచించారు. ఈ మేరకు విద్యుత్తు మీటర్లకు ఆధార్ లింక్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. విద్యుత్తు వాడకం 300 లోపు యూనిట్లు ఉన్నవారికి స్టేట్మెంట్లు అందజేస్తామని చెప్పారు. అయితే, తల్లికి వందనం అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఆలోగా విద్యుత్ వాడకానికి సంబంధించిన స్టేట్మెంట్లు రాకపోతే తమకు అన్యాయం జరుగుతుందని తల్లులు ఆవేదన చెందుతున్నారు. అమలాపురంలో విపత్తుల స్పందన దళం స్థావరం అమలాపురం టౌన్: జిల్లాలో తరచుగా సంభవించే తుపాన్లు, గోదావరి వరదలు, చమురు సంస్థల గ్యాస్ లీకేజీ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే ఆదుకుని ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విపత్తుల స్పందన దళం స్థావరాన్ని అమలాపురంలో నెలకొల్పుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వెనుక గల పాత సబ్ జైలు భవనంలో ఈ స్థావరం నెలకొల్పాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ జైలు భవనాన్ని కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ స్థావరంలో దళం నివాసం ఉండి రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సంసిద్ధమై ఉంటుందన్నారు. తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్తోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
డబ్బులెప్పుడిస్తావ్ బాబూ!
● రెండు నెలలుగా ధాన్యం సొమ్ము ఇవ్వని సర్కారు ● ప్రారంభమైన ఖరీఫ్ ● పెట్టుబడి కోసం రైతుల ఇక్కట్లు ● బకాయిలపై నోరు మెదపని ప్రభుత్వం సాక్షి, రాజమహేంద్రవరం: రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసి చాలా రోజులే అయ్యింది. ధాన్యం సేకరణ ఆపేసి, కొనుగోలు కేంద్రాలను సర్కారు మూసేసింది కూడా. రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మి దాదాపు రెండు నెలలు కావస్తోంది. కానీ, ఇప్పటికీ వారికి ప్రభుత్వం ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని కూటమి పెద్దలు గొప్పగా చెప్పారు. ఆ మాటలు నమ్మితే చివరకు తమను నిలువునా ముంచారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రబీ ధాన్యం డబ్బులు రాక.. అన్నదాతా సుఖీభవ సాయం ఇవ్వకపోవడంతో.. సార్వా సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 428 హెక్టార్లలో నారుమళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో ధాన్యం అమ్మిన డబ్బులు ఎప్పుడిచ్చేదీ ప్రభుత్వం చెప్పకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. సాగు పెట్టుబడులకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నెలకొన్న పరిస్థితులే పునరావృతమవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. చేసేది లేక ప్రైవేటు వ్యక్తుల వద్దకు పరుగులు తీస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. రూ.129 కోట్లు పెండింగ్ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తామని కూటమి నేతలు ఊరూవాడా డప్పేసి గొప్పలు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 58,586 హెక్టార్లలో రబీ వరి సాగు జరిగింది. 5.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 60 వేల మెట్రిక్ టన్నులు ఫైన్ వైరెటీ. మిగిలిన 4.51 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, 2.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా నిర్దేశించింది. ఆ మేరకు 216 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ప్రారంభించారు. 2,63,076 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన అనంతరం లక్ష్యం అధిగమించామని చెప్పి, అధికారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనిపై ఆగ్రహించిన రైతులు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళన బాట పట్టారు. రహదారులపై బైఠాయించారు. వారి ఆగ్రహాన్ని చల్లార్చే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం మరో లక్ష టన్నుల ధాన్యం సేకరణకు అనుమతిచ్చింది. ఆ మేరకు 30,448 మంది రైతుల నుంచి రూ.812.4 కోట్ల విలువైన 3,53,199.280 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, కొనుగోలు కేంద్రాలను మూసేసింది. ఇక సేకరించబోమని చెప్పేసింది. ధాన్యం కొనుగోళ్లలో తొలి లక్ష్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణను అధికారులు ఏప్రిల్ 22వ తేదీ నాటికి పూర్తి చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.682.49 కోట్లు మంజూరు చేసింది. అదనంగా కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన సొమ్మును ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించడం లేదు. మొత్తం రూ.129.91 కోట్లు విడుదల చేయకుండా రైతులను నానా తిప్పలూ పెడుతోంది. ధాన్యం డబ్బులు ఎప్పుడొస్తాయని అధికారులను ప్రశ్నిస్తే.. వచ్చే వారం అంటూ తప్పించుకుంటున్నారే తప్ప.. స్పష్టత ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో పలువురు రైతుల వద్ద లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం మిగిలిపోయింది. దీనిని విక్రయించుకునేందుకు వారు అనేక పాట్లు పడుతున్నారు. ఇదే అదనుగా దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కొన్న ధాన్యం 3,53,199 మెట్రిక్ టన్నులు విక్రయించిన రైతులు 30,448 అందించాల్సిన సొమ్ము రూ.812.4 కోట్లు మంజూరు చేసినది రూ.682.91 కోట్లు బకాయి రూ.129.91 కోట్లు అప్పు చేసి నారుమడి వేశాం నేను 3.50 ఎకరాలు కౌలు చేస్తున్నాను. మే నెల మొదటి వారంలో ధాన్యాన్ని రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) ద్వారా మిల్లుకు తోలాను. ఇప్పటి వరకూ నా ఖాతాలో డబ్బులు పడలేదు. దీంతో అప్పు చేసి ఖరీఫ్ సాగుకు నారుమడి వేశాను. ట్రాక్టర్తో పాటు ఎరువులు, పురుగు మందులు అరువు తెచ్చి, పెట్టుబడి పెట్టాను. కౌలు చెల్లించాలని పొలం యజమానులు కూడా అడుగుతున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. రైతులకు వెంటనే ధాన్యం డబ్బులు ఇవ్వాలి. – కామన కొండబాబు, రైతు, కోరుపల్లి, నిడదవోలు మండలం ప్రభుత్వం విఫలం ధాన్యం సేకరణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఆది నుంచీ రైతులపై వివక్ష చూపుతూనే ఉంది. కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచీ ఇబ్బందులకు గురి చేస్తోంది. కొన్న ధాన్యానికి సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్న తరుణంలో అటు రైతుభరోసా అందక, ఇటు ధాన్యం డబ్బులు రాక అల్లాడిపోతున్నారు. ఒక్క కొవ్వూరు నియోజకవర్గంలోనే సుమారు రూ.10 కోట్లకు పైగా బకాయిలున్నట్లు తెలిసింది. వెంటనే ధాన్యం డబ్బులు చెల్లించి, రైతులను ఆదుకోవాలి. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి -
గుట్టక్కున మింగేసి..
● ఓపెన్ రీచ్లలో ఈ నెల 1 నుంచి ఇసుక తవ్వకాల నిలుపుదల ● వర్షాకాలం కోసం జిల్లాలో అధికారికంగా 29 స్టాక్ పాయింట్లు ● ఆ ముసుగులో కూటమి నేతల బరితెగింపు ● విచ్చలవిడిగా తవ్వకాలు ● అనధికారికంగా 50 వేల క్యూబిక్ మీటర్ల మేర నిల్వలు ● కన్నెత్తి చూడని అధికారులుపెరవలి: వర్షాకాలం ప్రారంభమవుతూండటంతో పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం అధికారులు జిల్లాలోని 22 ఓపెన్ రీచ్లలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇసుక తవ్వకాలు నిలిపివేశారు. వర్షాకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని 18 బోట్స్మెన్ సొసైటీ (డీసిల్టేషన్) రీచ్ల ద్వారా ఇసుక తవ్వి, జిల్లాలోని 29 స్టాక్ పాయింట్లలో నిల్వ చేస్తున్నారు. ఇదే అదనుగా జిల్లాలోని ఇసుక మాఫియా ముసుగులో కూటమి నేతలు గోదావరిని గుల్ల చేసి పారేస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వేసి అనేక ప్రాంతాల్లో అక్రమంగా గుట్టలు గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. వర్షాకాలం, గోదావరి వరదల సమయంలో ఇసుక లభ్యత తగ్గితే అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఈ అక్రమ గుట్టలు సిద్ధం చేస్తున్నారు. ఇవీ అధికారిక స్టాక్ పాయింట్లు కొవ్వూరు మండలం కొవ్వూరు, ఆరికరేవుల–1, 2, చిడిపి–1, 2, కుమారదేవం–1, 2; తాళ్లపూడి మండలం ప్రక్కిలంక–1, 2, 3, వేగేశ్వరపురం, తాడిపూడి–1, 2, 3; నిడదవోలు మండలం పురుషోత్తపల్లి, జీడిగుంట, మునిపల్లి; పెరవలి మండలం కాకరపర్రు, తీపర్రు; సీతానగరం మండలం ములకల్లంక, మునికూడలి–1, 2, కాటవరం, వంగలపూడి–1, 2; రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం, కాతేరు; రాజమహేంద్రవరం అర్బన్ మండలం కోటిలింగాల–2; రంగంపేట మండలం వడిశలేరు ప్రాంతాల్లో అధికారికంగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వర్షాకాల అవసరాల కోసం ఓపెన్ రీచ్ల నుంచి తవ్వి, ఈ ప్రాంతాల్లో సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక నిల్వ చేశారు. దీని కోసం ఏప్రిల్ నెలలోనే ఆదేశాలు ఇచ్చారు. అక్రమార్కుల రంగప్రవేశం ఇదే అదనుగా రంగప్రవేశం చేసిన కూటమి నేతలు పగలు అధికారిక స్టాక్ పాయింట్లకు ఇసుక తోలారు. రాత్రి వేళల్లో యంత్రాలతో యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలించేశారు. దీనిని ముందుగా సిద్ధం చేసుకున్న ప్రాంతాల్లో గుట్టలుగుట్టలుగా భారీ ఎత్తున అక్రమంగా నిల్వ చేశారు. ఒక్కడ కొవ్వూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ర్యాంపులున్న ప్రతిచోటా అధికారిక గుట్టలతో పాటు అనధికారికంగా సుమారు 50 వేల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక నిల్వ చేశారు. ఈ విషయాన్ని కూటమి నాయకులే బహిరంగంగా చెప్పుకొంటున్నారు. దాదాపు ప్రతి అధికారిక స్టాక్ పాయింట్ పరిధిలో అనధికారిక గుట్టలు జిల్లాలో అనేకం ఏర్పాటు చేశారు. పుంతగట్లు, ఆర్అండ్బీ రోడ్ల పక్కన, లే అవుట్లు, గృహ నిర్మాణాలు జరిగే ప్రాంతాలకు కొద్ది దూరంలోను, చేలలో మకాంల వద్ద, ఇళ్ల వద్ద సైతం ఈవిధంగా నిల్వ చేశారు. పెరవలి మండలం కానూరు, నడుపల్లి, నడుపల్లి కోట, తీపర్రు తదితర గ్రామాల్లో పెద్దపెద్ద ఇసుక గుట్టలు దర్శనమిస్తున్నాయి. ఈ వ్యవహారం తెలిసినప్పటికీ అక్రమార్కులు అధికార కూటమి నేతలే కావడంతో రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. దీని వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని, అందువల్లనే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. -
కేతన్ గార్గ్ బదిలీ
రాజమహేంద్రవరం సిటీ: నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేతన్ గార్గ్ దాదాపు ఏడాది కాలం నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేస్తున్నారు. ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఇంకా ఎవ్వరినీ నియమించలేదు. కొత్త కమిషనర్ వచ్చేంత వరకూ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి కమిషనర్గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. పీజీఆర్ఎస్కు 177 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 177 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, రీ ఓపెన్ అవ్వకుండా పరిష్కరించాలని అన్నారు. ప్రజలు తమ సమస్యలపై 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని, దీనిపై ప్రచారం చేయాలని సూచించారు. అందరికీ మెరుగైన ఆరోగ్యమే లక్ష్యం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అందరికీ మెరుగైన ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. సికిల్సెల్ ఎనీమియాపై సోమవారం తన చాంబర్లో ఆమె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సికిల్సెల్ ఎనీమియా గతంలో మన్యం ప్రాంతంలో ఉండేదని, ప్రభుత్వం అక్కడే వైద్య సేవలు అందించేదని చెప్పారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జిల్లాలో 14,312 మంది గిరిజనులుండగా 7,574 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ పి.కోమల తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రభుత్వం తక్షణం సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.బేబీరాణి అన్నారు. కలెక్టరేట్ వద్ద సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కార్యకర్తలను సాధికార సర్వేల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొనడంతో వారికి సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు న్యాయం చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు గాలికి వదిలేయడం సరికాదని అన్నారు. అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఇస్తున్నామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకూ ఇవ్వలేదని చెప్పారు. అనంతరం కలెక్టర్ పి.ప్రశాంతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.పవన్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు సీహెచ్ మాణిక్యాంబ, ఉపాధ్యక్షులు సీహెచ్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బదిలీలు పూర్తి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలు, ఎస్జీటీలకు సంబంధించి 6,572 మంది బదిలీ అయ్యారన్నారు. జెడ్పీ పరిధిలో స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా 96 మంది, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 10 మంది పదోన్నతి పొందారని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలో సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 204 మందికి పదోన్నతి కల్పించామని రమేష్ తెలిపారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
● రత్నగిరిపై సత్రాలకు ఎట్టకేలకు మరమ్మతులు ● రూ.1.20 కోట్లతో పనులు ● రెండు నెలల్లో పూర్తి అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ సత్రాల మరమ్మతులు ఎట్టకేలకు సోమవారం ప్రారంభమయ్యాయి. రూ.1.20 కోట్లతో న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాల్లో ఈ పనులు ప్రారంభించారు. ఈ పనులను ఈఓ వీర్ల సుబ్బారావు పరిశీలించారు. ఆయా సత్రాల్లో చేపడుతున్న పనుల గురించి ఆయనకు ఈఈ వి.రామకృష్ణ వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, టెండర్ షరతుల ప్రకారం ఈ మూడు సత్రాల్లో మరమ్మతులు పూర్తి చేయడానికి మూడు నెలల గడువుందని చెప్పారు. అయితే రెండు నెలల్లోనే పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తేవాల్సిందిగా ఈఓ ఆదేశించారన్నారు. ఆ మేరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మూఢమి, దానికి తోడు ఈ నెల 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో వివాహాది శుభ కార్యక్రమాలు జరగవు. అందువలన ఈ సమయంలో భక్తులు పెద్దగా రారు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆలోగా సత్రాల మరమ్మతులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సగం గదుల్లో సమస్యలు దేవస్థానంలో హరిహర సదన్, శివసదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ, ప్రకాష్ సదన్, శ్రీ సీతారామ సత్రం, కొండ దిగువన సత్య నికేతన్ సత్రాలున్నాయి. వీటిల్లో ఏసీ, నాన్ ఏసీ గదులు 620 ఉన్నాయి. వీటిలో సుమారు 120 గదులు పాడై, అద్దెకిచ్చేందుకు ఏమాత్రం వీలుగా లేవు. మరో 150 గదుల్లో ఫర్నిచర్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సరిగా లేవు. ప్రకాష్ సదన్ వంటి సత్రాల్లో బస చేసిన భక్తులు ఆ గదుల్లో ఉండలేక రాత్రికి రాత్రే ఖాళీ చేసిన సందర్భాలు కోకొల్లలు. వీటికి మరమ్మత్తులు చేయించాలని చాలా కాలం నుంచి భక్తులు కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదు. గత ఏడాది అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్రాల గదులకు మరమ్మత్తులు చేయించాలని నిర్ణయించి, అంచనాలు రూపొందించారు. తొలుత రూ.40 లక్షలతో హరిహర సదన్ సత్రంలో గదులకు మరమ్మత్తులు పూర్తి చేసి, రంగులు వేయించారు. తరువాత న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాలకు మరమ్మత్తులు చేయించేయించాలని నిర్ణయించి, రూ.40 లక్షల చొప్పున అంచనాలు రూపొందించి, టెండర్లు ఖరారు చేశారు. ● ఓల్డ్ సెంటినరీ సత్రం: దీనిని నిర్మించి సుమారు 30 సంవత్సరాలైంది. ఇందులో 48 గదులున్నాయి. పెళ్లి బృందాల వారు ఇక్కడ గదులు రిజర్వ్ చేసుకుని, సత్రం ఆవరణలో వివాహాలు చేసుకుంటారు. ఈ సత్రం గదులకు పెయింట్లు వేసి చాలా కాలమైంది. డోర్లు, కిటికీలు, వాటర్ పైప్లైన్లు, బాత్రూముల్లో ఫిట్టింగ్స్ పగిలిపోయాయి. నీరు లీకవుతూండటంతో డ్రైనేజీ పైప్లైన్లకు నాచు పట్టింది. కొన్నిచోట్ల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ● న్యూ సెంటినరీ సత్రం: సుమారు 28 ఏళ్ల కిందట నిర్మించిన ఈ సత్రంలో కూడా 48 గదులున్నాయి. వివాహాది శుభకార్యాలకు భక్తులు గదులు రిజర్వ్ చేసుకుంటారు. ఇందులో కూడా ఓల్డ్ సెంటినరీ సత్రం మాదిరిగానే సమస్యలున్నాయి. ● ప్రకాష్ సదన్ సత్రం: వీఐపీ సత్రంగా పేరొందిన ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. 86 గదులున్నాయి. గదికి రూ.వెయ్యి చొప్పున రోజుకు రూ.86 వేల మేర అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. స్వామివారి ఆలయానికి దగ్గరగా ఉండటం, దగ్గర్లోనే క్యాంటీన్, పార్కింగ్ సదుపాయాలుండటంతో ఈ సత్రంలో బస చేయడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులోని పలు గదుల్లో కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. -
అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా తెలుగమ్మాయి
అమలాపురం టౌన్: అమెరికా దేశం వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం అమ్మాయి చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్గా నిలిచింది. ఆమె కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ మనమరాలు. అమెరికాలోని ఆ స్కూల్లో శనివారం జరిగిన కాన్వగేషన్లో శ్రీకావ్యకు ఎమ్మెస్ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రదానం చేశారు. శ్రీకావ్య ఇప్పటికే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసింది.హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంటెక్, స్వీడన్ బ్లెకింజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి టెలీ కమ్యూనికేషన్స్ సిస్టమ్లో ఎమ్మెస్ డిగ్రీ చేసింది. కోచ్ కోడ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ చేసింది. ఈ ఇనిస్టిట్యూట్లో శ్రీకావ్య ఆటోమేషన్ ఆఫ్ క్లౌడ్ హాస్టెడ్ అప్లికేషన్స్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. ఈమె స్పోర్ట్స్లో కూడా విజేతే. జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్గా, తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత పది మీటర్ల మహిళా షూటింగ్ చాంపియన్ షిప్ గెలుచుకుంది. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి -
సంప్రదాయానికి పెద్ద పీట.. కొబ్బరికాయలకు పసిడి వన్నెలద్దీ..!
సాక్షి, అమలాపురం: ‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’ అన్నట్టు కొబ్బరాకు.. కొబ్బరి కాయలు.. ధాన్యం కుచ్చులు.. చెరకు గెడలు.. అరటి చెట్లు.. అరటి ఆకులు.. పోక చెట్లు... ఆర్కిడ్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే పెళ్లి మండపం... పెళ్లి స్వాగత ద్వారం ముస్తాబు చేయడానికి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తి అయినా కాదేదీ అనర్హం అంటున్నారు మండపాల తయారీదారులు. కొబ్బరాకులతో పెళ్లి మండపాల ముస్తాబు గోదావరి జిల్లాల్లో పెద్ద విషయం కాదు. అదిప్పుడు గోదావరి జిల్లాలు దాటుతోంది. ఇప్పుడు కొబ్బరాకుల ముస్తాబు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక హంగులు అద్దుకుంటోంది. పెళ్లిళ్ల డెకరేషన్లో పెరుగుతున్న హంగూ ఆర్భాటాల్లో సంప్రదాయానికి సైతం పెద్దపీట వేస్తున్నారు.కొబ్బరాకులతో పెళ్లి పందిళ్లు వేయడం.. పందిళ్లకు వేసే రాటలను కొబ్బరాకులతో ముస్తాబు చేయడం గతం నుంచీ ఉన్నదే. పెళ్లిళ్లే కాదు.. గ్రామాల్లో జరిగే ఇతర శుభ కార్యక్రమాల్లోను, ఆలయాల వద్ద జరిగే కల్యాణాలు, యాగాలు వంటి వాటిల్లోను కొబ్బరాకు ముస్తాబు సర్వసాధారణమైంది. ఇప్పుడు అదే కొబ్బరాకుతో కొత్త కొత్త కళాకృతులు తయారు చేయడం ట్రెండ్గా మారింది. పెద్ద పెద్ద పెళ్లి మండపాల్లో కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లి మండపాలు ఒక్కటే కాకుండా పెళ్లింటి వద్ద, కల్యాణ మండపాల వద్ద ఏర్పాటు చేసే స్వాగత ద్వారాలను సైతం ఈ ఆకులతో అందంగా తయారు చేస్తున్నారు. అంబాజీపేట పెద్ద వీధిలో కొబ్బరి ఆకులతో తయారు చేసిన కళాకృతులు, కొబ్బరి కాయలు, చెరకు గెడలు, ధాన్యం కుచ్చులతో ముస్తాబు చేసిన పెళ్లి ఇంటి వద్ద స్వాగత ద్వారం ఇప్పుడు వీటికి అదనంగా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను జోడిస్తున్నారు. కొబ్బరి ఆకుల స్వాగత స్తంభాలను నెలకొల్పడంతో పాటు వాటికి చిన్న అరటి చెట్లను తగిలిస్తున్నారు. వీటికి అదనంగా కొబ్బరి కాయలు వేలాడదీస్తున్నారు. అక్కడకక్కడ ధాన్యం కుచ్చులూ ఏర్పాటు చేస్తున్నారు. చెరకు గెడలతో ముస్తాబు చేయడమూ పెరిగింది. ఆర్కిడ్లు, చిలుక పువ్వులతో కొత్త అందాలు తీసుకువస్తున్నారు. కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేటలో ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో కొబ్బరి కాయలకు అందమైన రంగులద్ది స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇటువంటి డెకరేషన్లు పెళ్లికి కొత్త జోష్ తీసుకు వస్తున్నాయి. చివరకు వధూవరులను అలంకరించే చోట కూడా వీటితోనే చిన్న చిన్న వేదికలు తయారు చేస్తూండటం విశేషం. కొబ్బరితో పాటు అరటి ఆకులతో సైతం వీటిని ముస్తాబు చేస్తున్నారు.ఇతర ప్రాంతాలకు సైతం..కొబ్బరి అధికంగా సాగయ్యే గోదావరి జిల్లాల్లోనే కాదు.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సైతం పెళ్లిళ్లకు కొబ్బరాకు స్వాగత ద్వారాలకు, పెళ్లి మండపాల ఆర్డర్లు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, ఆత్రేయపురం, అంబాజీపేట, రావులపాలెం, రాజమహేంద్రవరం, కడియం, కడియపులంక, పెరవలి, కాకరపర్రు వంటి ప్రాంతాల్లో కొబ్బరి ఆకులతో ప్రత్యేక ఆకృతులు తయారు చేసేవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. ఇక్కడ వీటిని తయారు చేయించి నగరాలలో జరిగే పెళ్లిళ్లకు తీసుకు వెళుతున్నారు. వీటితో పాటు పెళ్లిళ్ల డెకరేషన్లో వినియోగించే ఆర్కిడ్లు, చిలకపువ్వు, డయనల్ గ్రాస్, చిన్నచిన్న అరటి మొక్కలను రైతులు స్థానికంగానే పండిస్తున్నారు. కోనసీమ జిల్లాలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, చాగల్లు, కడియం వంటి ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. పెళ్లిళ్లలో వస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఇటు రైతులకు.. అటు డెకరేషన్ చేసేవారికి ఆదాయ వనరుగా మారుతోంది.అరటి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును చేసే వేదికలు అభిరుచి మారుతోందిపెళ్లిళ్లు చేసేవారి అభిరుచి మారుతోంది. బాహుబలి వంటి సెట్టింగ్లే కాదు.. ఒకప్పటి సంప్రదాయాన్ని తలపించేలా కొబ్బరి, అరటి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో సెట్టింగ్లు కావాలంటున్నారు. పెళ్లిళ్లలో అచ్చమైన పల్లె వాతావరణం కనిపించాలని కోరుకుంటున్నారు. వారి కోరికలకు అనువుగా కొబ్బరి, అరటి వంటి ఆకులతో సైతం కొత్తకొత్త మోడల్స్లో డెకరేషన్లు చేస్తున్నాం.– బృందావనం నూకరాజు, ర్యాలి, ఆత్రేయపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేకంగా డెకరేషన్ కొబ్బరాకులతో తయారు చేసే కల్యాణ వేదికలు, స్వాగత ద్వారాలు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి కూడా కావాలని కోరుతున్నారు. షాపింగ్ మాల్స్ వంటి ప్రారం¿ోత్సవాల్లో వీటితో ప్రత్యేకంగా డెకరేషన్ చేయించుకుంటున్నారు. చివరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తయారు చేసే చిన్న వేదికల వద్ద కూడా వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. – మన్నెం సత్యనారాయణ, కాకరపర్రు, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లాకొబ్బరి కాయలకు పసిడి వన్నెలద్ది, కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి వేదిక -
దాతలు సహకరించాలి
నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి దాతలు సహకరించాలి. ఇప్పటికే అనేక మంది దాతలు, భక్తులు విరాళాలు అందజేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి పుణ్యక్షేత్రానికి రోజూ వేలాది మంది వస్తున్నారు. వారికి ఇబ్బంది రాకుండా నిత్యాన్నదానం చేస్తున్నాం. అంతేకాకుండా పేదలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మానవ సేవే.. మాధవ సేవగా భావించి ముందుకు వెళ్తున్నాం. –మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, పీఠాధిపతులు, ఏలూరు భవిష్యత్తులో మరింత విస్తరిస్తాం.. దాతలు, పీఠాధిపతులు జయరావు పొలిమెర సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రోజూ 3 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నాం. అన్ని మతాలకు చెందిన భక్తులు అన్నదానం కార్యక్రమానికి సహకరిస్తున్నారు. కార్తిక మాసంలో అయ్యప్ప, భవానీ భక్తులు కూడా ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. భవిష్యత్తులో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం. –రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్, డైరెక్టర్, నిర్మలగిరి పుణ్యక్షేత్రం, గౌరీపట్నం -
అన్నంత సేవ
ఫ రోజూ మూడు వేల మందికి అన్నదానం ఫ దాతల సహకారంతో నిర్మలగిరిలో సేవ ఫ 24 ఏళ్లుగా కొనసాగుతున్న కార్యక్రమం దేవరపల్లి: మది నిండా భక్తితో.. ఎక్కడెక్కడి నుంచో.. ఆ నిర్మలగిరికి వస్తున్న భక్తుల ఆకలి తీర్చే నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది.. భక్తులు, దాతల విరాళాలతో నిత్యం ఈ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతోంది. ఈ సేవ 24 ఏళ్లుగా సాగుతుండడం ప్రాముఖ్యతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం వద్ద ప్రత్యేకత ఇది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ పుణ్యక్షేత్రానికి దూర ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. వారి ఆకలి తీర్చడానికి ఏలూరు మేత్రాసనం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ పర్యవేక్షణలో నిత్యాన్నదానం విజయవంతంగా జరుగుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ.. నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో 2020–21లో అప్పటి డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఆరోన్ దిరిసిన ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కొండపైన ఉన్న క్రీస్తు ఆలయం సమీపంలో అన్ని వసతులతో కూడిన సువిశాల భోజనశాల నిర్మించారు. భోజన శాలను అప్పటి ఏలూరు పీఠాధిపతులు రెవరెండ్ జాన్ములగాడ ప్రారంభించారు. తొలుత 200 మందితో ప్రారంభించి... నేడు వేలాది మంది భక్తుల ఆకలి తీర్చుతున్నారు. రోజూ మూడు వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తుండగా, ఆదివారం సుమారు పది వేల మందికి జరుగుతోంది. సుమారు 24 ఏళ్లుగా నిత్యాన్నదానం నిర్విరామంగా కొనసాగుతుంది. డైరెక్టర్ ఫాదర్ జాన్పీటర్ పర్యవేక్షణలో కళ్లే నాగేశ్వరరావు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోషకాహారం.. రుచికరం పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారం భక్తులకు అందిస్తున్నారు. నగదుతో పాటు కూరగాయలు, నిత్యావసర సరకులు, బియ్యం వంటివి దాతలు నిత్యాన్నదానానికి అందిస్తూ తమ వంతు సహకరిస్తున్నారు. అన్నదానానికి రూ.వెయ్యి కంటే పైబడి విరాళం అందించిన దాతల పేరున ఏటా ఒకరోజు భక్తులకు అన్నదానం చేసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయ్యప్ప మాలధారులకూ.. క్రైస్తవ పుణ్యక్షేత్రం అయినప్పటికీ ఇక్కడ అన్నిమతాల భక్తులకు అన్నదానం చేస్తున్నారు. ప్రతి ఏటా కార్తిక మాసంలో అయ్యప్పమాల, భవానీ మాలలు ధరించిన భక్తులు పుణ్యక్షేత్రానికి చేరుకుని అన్నప్రసాదం స్వీకరించడం ఇక్కడ విశేషం. అక్టోబర్ నుంచి జనవరి వరకూ ఎక్కువ మంది అయ్యప్ప మాలధారణ, భవానీ దీక్ష భక్తులు అన్నప్రసాదం స్వీకరించి పుణ్యక్షేత్రంలో విశ్రాంతి తీసుకుని వారి ప్రయాణం కొనసాగిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. రోజూ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3.30 గంటల వరకు అన్నదానం జరుగుతుంది. ఎంత మంది భక్తులు వచ్చినా లేదనకుండా భోజనం పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. నిర్మలగిరి సాంబారుకు మంచి గుర్తింపు ఉంది. ఈ సాంబారు రుచి అమోఘమని భక్తులు అంటుంటారు. మినరల్ వాటర్తో వంటకాలు తయారు చేసి నాణ్యమైన భోజనం భక్తులకు అందిస్తున్నారు. ఒక రౌండుకు సుమారు 750 మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. వేసవిలో చల్లచల్లగా.. భక్తులకు వేసవిలో చల్లని నీటిని సరఫరా చేస్తున్నారు. పుణ్యక్షేత్రంలో తలనీలాల కాంట్రాక్టర్, అన్నదాన కార్యక్రమం నిర్వాహకుడు కళ్లే నాగేశ్వరరావు తన భార్య లలిత జ్ఞాపకార్థం నిత్యాన్నదాన భోజన శాల వద్ద కూలింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. వేసవిలో భక్తులకు ఇక్కడ చల్లని నీటిని అందజేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
చేపలొచ్చాయోచ్..
ఫ వేటకు వెళ్లిన తొలిరోజు బోణీ అదుర్స్ ఫ మత్స్యకారుల వలలకు భారీ చేపలు కాకినాడ రూరల్: సముద్రంలో వేట నిషేధం ముగిసింది. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచి మత్స్యకారులు బోట్లతో వేటకు వెళ్లారు. కొందరు మత్స్యకారులు ఆదివారం ఉదయమే వేట ముగించుకుని రాగా, వారి వలలకు భారీ సైజు చేపలు చిక్కాయి. కాకినాడ కుంభాభిషేకం రేవు వద్దకు భారీ కొమ్ము కోనం చేపను బోట్ నుంచి క్రేన్ సహాయంతో అమ్మకానికి తీసుకువచ్చారు. దీని బరువు సుమారు 350 కిలోలు ఉంటుందని అంచనా. దీని ధర రూ.37 వేలు పలికింది. కొందరు మత్స్యకారులకు పెద్ద సైజు గుమ్మడి పార చేపలు చిక్కాయి. సుమారు 25 కిలో బరువున్న చేపను మత్స్యకారులు తీసుకురావడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. కోనసీమ జిల్లాకు చెందిన వ్యాపారి కిలో సుమారు రూ.250 పైబడి ధరతో దీనికి కొనుగోలు చేశారు. వాతావరణం బాగోక చేపలు పడడం లేదని, అన్ని బోట్లు వేటకు వెళ్లలేదని మత్స్యకారులు చెబుతున్నారు. మరోవైపు కాకినాడ జగన్నాథపురం ఏటమొగ వద్ద మోటరైజ్డ్ బోట్లు (సోనా) ఆదివారం గంగమ్మ తల్లికి పూజల అనంతరం రాత్రికి వేటకు పయనమయ్యాయి. -
దేవఆదాయ భూములు
పలివెల దేవస్థానం భూమిలో మట్టి అక్రమ తవ్వకాలు ఫ యథేచ్ఛగా మట్టి దోపిడీ ఫ పలివెల భూముల్లో అక్రమ తవ్వకాలు కొత్తపేట: దేవదాయ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొత్తపేట మండలం పలివెల పంచాయతీ పరిధిలో దేవదాయ– ధర్మదాయ శాఖ ధర్మసత్రం, ఉమా కొప్పేశ్వరస్వామివారి దేవస్థానం భూముల్లో మట్టిని అనుమతులు లేకుండా తవ్వి, తరలిస్తున్నారు. పలివెల ధర్మ సత్రానికి ఆ గ్రామ శివారు నక్కల కాలువకు ఆనుకుని 5.38 ఎకరాల వరి (పల్లం) భూమి ఉంది. దానిని గత వేలం పాటల్లో అదే గ్రామ శివారు పూజారిపాలెం గ్రామానికి చెందిన ఒక రైతు కౌలుకు పాడుకున్నారు. ఆ భూమిలో ఆ రైతు మూడు రోజులుగా జేసీబీతో మట్టిని తవ్వి, ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. ట్రాక్టర్ల లెక్కన మట్టిని పెద్ద మొత్తానికి విక్రయించినట్టు సమాచారం. ఈ మట్టి అక్రమ తవ్వకాలు, తరలింపుపై స్థానికులు సంబంధిత శాఖ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, పైగా అది తమ భూమి కాదు.. ప్రైవేట్ భూమి అని చెప్పి మొఖం చాటేశారని ఫిర్యాదుదారులు అంటున్నారు. దీంతో ఆ శాఖ ఆర్జేసీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో ఆ అధికారి ఆదేశాల మేరకు స్థానిక అధికారి, సిబ్బంది శనివారం మధ్యాహ్నం సంబంధిత భూమి వద్దకు వెళ్లి తవ్వకాలు నిలిపివేయించారు. వారు వెళ్లిన తరువాత మళ్లీ తవ్వకాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. అలాగే పలివెల – పల్లిపాలెం రోడ్డు నుంచి మట్లదొడ్డి వెళ్లే రోడ్డులో ఉమా కొప్పేశ్వరస్వామివారి దేవస్థానానికి చెందిన భూమిలో ఐదు రోజుల క్రితం మట్టి అక్రమ తవ్వకాలు చేపట్టగా స్థానికుల ఫిర్యాదు మేరకు దేవస్థానం సిబ్బంది వెళ్లి నిలిపివేయించారు. తిరిగి శుక్రవారం తవ్వకాలు చేపట్టారు. దానిపై ఫిర్యాదు చేయగా, అది దేవస్థానం భూమి కాదని, ఫలానా రైతుకు చెందిన ప్రైవేట్ భూమిలో మెరకలు తీస్తున్నారని సంబంధిత దేవస్థానం, రెవెన్యూ సిబ్బంది చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో సంబంధిత రైతుకు స్థానికులు ఫోన్ చేసి ఆరా తీయగా తమ భూమి ఇప్పటికే పల్లమని, మట్టి తీయాల్సిన పనిలేదని చెప్పారు. దేవదాయ శాఖ భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలపై సంబంధిత ఈఓ ఎస్.శివను శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా ధర్మసత్రం భూమిని పూజారిపాలేనికి చెందిన పల్లికొండ అర్జునరావు కౌలుకు పాడుకున్నారని తెలిపారు. మట్టి తవ్వకాలపై తమకు సమాచారం అందిన వెంటనే వెళ్లి నిలదీయగా మెరక పల్లాలు సరిచేసుకునేందుకు తవ్వుతున్నట్టు తెలిపారని, అనుమతులు లేకుండా తవ్వడం తగదని చెప్పి నిలిపివేయించామన్నారు. -
కామేశ మహర్షి కారణజన్ములు
సంస్మరణ సభలో భక్తులు పీఠాధిపతి కామేశ మహర్షి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పీఠం ప్రేమ మందిరం అమ్మ వాణి అమలాపురం టౌన్: స్థానిక శ్రీకామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి కారణజన్ములని, వందలాది మంది అనాథ బాల బాలికలకు ఆశ్రయం కల్పించిన మానవతావాదని భక్తులు ముక్త కంఠంతో అన్నారు. శ్రీకామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పీఠంలో ఆదివారం జరిగిన కామేశ మహర్షి సంస్మరణ సభలో అనేక మంది భక్తులు పీఠాధిపతి సేవలను స్మరించారు. ట్రస్ట్ సభ్యుడు, న్యాయ సలహాదారు వీరా నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభకు సాహితీవేత్త డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి అతిథిగా పాల్గొని మాట్లాడుతూ పీఠాధిపతి కామేశ మహర్షి దాదాపు 40 ఏళ్లకు పైగా పీఠం ద్వారా ఆధ్యాత్మిక, సామాజిక సేవలు అందించారన్నారు. చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, పీఠంలో అనాథ పిల్లలు పెరిగే ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి మాట్లాడుతూ కామేశ మహర్షి సేవలను స్మరిస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. కామేశ మహర్షి సమాజ హితాన్ని కాంక్షించే వారని పీఠం ఉత్తరాధికారి విఘనస రాఖీ ప్రేమ్ అన్నారు. పీఠం బ్రహ్మ గోవిందవర్జుల నాగబాబు మాట్లాడుతూ భౌతికంగా పీఠాధిపతి మనకు దూరమైనా ఆయన ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం నిరంతరం పాటుపడాలన్నారు. పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు, ఎస్కేబీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ నూకల శ్రీనివాస్, కోనసీమ చిత్రకళా పరిషత్ అధ్యక్షుడు కొరసాల సీతారామస్వామి, విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏబీ నాయుడు, ట్రస్ట్ సభ్యుడు మట్టపర్తి సత్యనారాయణ, జ్యోతిష పండితుడు కర్రా వీరభద్రం, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు యర్రమిల్లి పాండురంగారావు తదితరులు ప్రసగించి కామేశ మహర్షి సేవా ప్రస్థానాన్ని వివరించారు. తొలుత కామేశ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు భమిడిపాటి కృష్ణమూర్తి, వెంకటరెడ్డి, సతీష్, కూచిమంచి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా అమలాపురం మహిళ
అమలాపురం టౌన్: అమెరికా దేశం వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం మహిళ చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్గా నిలిచింది. ఆమె కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ మనమరాలు. అమెరికాలోని ఆ స్కూల్లో శనివారం జరిగిన కాన్వగేషన్లో శ్రీకావ్యకు ఎమ్మెస్ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రదానం చేశారు. శ్రీకావ్య ఇప్పటికే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసింది. హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంటెక్, స్వీడన్ బ్లెకింజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి టెలీ కమ్యూనికేషన్స్ సిస్టమ్లో ఎమ్మెస్ డిగ్రీ చేసింది. కోచ్ కోడ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ చేసింది. ఈ ఇనిస్టిట్యూట్లో శ్రీకావ్య ఆటోమేషన్ ఆఫ్ క్లౌడ్ హాస్టెడ్ అప్లికేషన్స్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. ఈమె స్పోర్ట్స్లో కూడా విజేతే. జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్గా, తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత పది మీటర్ల మహిళా షూటింగ్ చాంపియన్ షిప్ గెలుచుకుంది. అదృశ్యమైన వ్యక్తి 18 రోజులకు ప్రత్యక్షం పిఠాపురం: అప్పుల బాధ భరించలేక ఇల్లు వదిలి వెళ్లిపోయిన వ్యక్తి 18 రోజుల అనంతరం క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. తమను వదిలి వెళ్లిపోయిన తండ్రి ఫాదర్స్ డే నాడు తిరిగి రావడంతో పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పిఠాపురం ఏడు కాలువల ప్రాంతానికి చెందిన గీసాల శ్రీనివాస్ గత నెల 29న ధవళేశ్వరంలో ఎవరో డబ్బులు ఇవ్వాలని చెప్పి తన స్నేహితుడైన కాకి రమణ బైక్ తీసుకు వెళ్లాడు. తర్వాత రోజు సాయంత్రం 4 గంటల వరకు తన భార్యతో ఫోన్లో మాట్లాడాడు. అనంతరం తన సెల్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చి బంధువుల సహాయంతో వెతకగా ధవళేశ్వరం బ్యారేజీపై తాను తీసుకెళ్లిన బైక్, దుస్తుల బ్యాగు, చెప్పులు కనిపించాయి. దీంతో ఆయన భార్య గీసాల లక్ష్మి పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో విచారణ చేయగా శ్రీనివాస్ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద తన వస్తువులను వదిలి రైల్వే స్టేషన్ వరకూ వెళ్లినట్లు సీసీ పుటేజీ ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీనివాస్ పిఠాపురంలో తన ఇంటికి చేరుకున్నాడు. 18 రోజుల తరువాత అదీ ఫాదర్స్డే నాడు ఇంటికి చేరుకోవడంతో అతని పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లినట్లు శ్రీనివాస్ తెలిపాడు. -
జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
పిఠాపురం: జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు పిఠాపురం క్రీడాకారిణి ఎంపికై నట్లు కోచ్ పి.లక్ష్మణరావు ఆదివారం తెలిపారు. స్థానికంగా ఆయన మాట్లాడుతూ మే నెల 30, 31వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో 80+ కిలోల విభాగంలో పిఠాపురానికి చెందిన జె.ఐశ్వర్య సూర్యదీపిక రజిత పతకం సాధించిందన్నారు. అదే పోటీల్లో విజయనగరానికి చెందిన బాక్సర్ స్వర్ణ పతకం సాధించింది. ఆమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. అనివార్య కారణాలతో విజయనగరం బాక్సర్ పోటీల నుంచి తప్పుకుంది. దీంతో తరువాత స్థానంలో ఉన్న పిఠాపురం బాక్సర్ ఐశ్వర్య సూర్యదీపికకు ఈ అవకాశం దక్కిందన్నారు. ఈ నెల 19 నుంచి 26 తేదీ వరకు హర్యానా రాష్ట్రం రోతక్లో జరగనున్న జాతీయ స్థాయి 6వ జూనియర్ బాలికల బాక్సింగ్ పోటీలకు పిఠాపురం నుంచి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున సూర్యదీపిక పాల్గొంటుందని కోచ్ వివరించారు. ఈ సందర్భంగా ఆమెను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.శ్రీనివాస్కుమార్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటేశ్వరరావు, కె.పద్మనాభం అభినందించారు. -
తల్లి, కుమార్తె, కుమారుడి అదృశ్యం
అమలాపురం టౌన్: మండలంలోని పేరూరు గ్రామ శివారు దూడలవారి వీధికి చెందిన చవ్వాకుల హారతి (24), ఆమె కుమార్తె నందన (6), కుమారుడు భార్గవ్ (4) అదృశ్యమయ్యారు. వీరు శనివారం సాయంత్రం 3.30 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. హారతి భర్త నగేష్ తన భార్య, పిల్లల ఆచూకీ కోసం ఆమె పుట్టింటి వారిని, స్నేహితులు, బంధువులను వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో శనివారం రాత్రి అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. భర్త నరేష్ కొబ్బరి ఒలుపు కార్మికుడిగా పని చేస్తున్నాడని, భార్యభర్తల మధ్య గొడవలు ఉన్నాయని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. సీఐ కథనం ప్రకారం... హారతి ఇంటి నుంచి తన ఎలక్ట్రికల్ స్కూటీపై పిల్లలను ఎక్కించుకుని తన పుట్టినిల్లు మామిడికుదురు మండలం లూటుకుర్రు వెళ్లింది. హారతి కొద్ది సేపటికే తన పిల్లలతో తిరిగి అమలాపురం బయలుదేరింది. అమలాపురం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి అక్కడి సైకిల్ స్టాండ్లో తన స్కూటీని పెట్టి పిల్లలతో సహా వెళ్లిపోయింది. పట్టణ పోలీసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో హారతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సైకిల్ స్టాండ్లో తన స్కూటీని పెట్టినట్లు గుర్తించారు. తర్వాత ఆమె తన పిల్లలతో బస్సు ఎక్కి ఏదో ఊరు వెళ్లినట్లు గమనించారు. భర్త నరేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఆమెతోపాటు పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టనట్లు సీఐ వీరబాబు తెలిపారు. ఆ తల్లీ బిడ్డల ఆచూకీ తెలిసిన వారు పట్టణ సీఐ 94407 96561, ఎస్సై 79811 66996 ఫోన్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
వేలివెన్ను శశి ర్యాంకర్లకు సత్కారం
విజేతలకు అభినందన సభలో మాట్లాడుతున్న శశి విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్ ఉండ్రాజవరం: నీట్–2025 ఫలితాల్లో జాతీయస్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించిన శశి వేలివెన్ను విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వేలివెన్ను క్యాంపస్లో సత్కరించారు. ఈ క్యాంపస్కు చెందిన కె.భాను ప్రకాష్ జాతీయస్థాయి 25వ ర్యాంకు, కె.మోహిత్ శ్రీరామ్ 42, ఎస్.గోవర్ధన్ 50, వై.చరణ్ 60, డి.రత్నకుమార్ 111, టి.శ్రీరామ్ 204, ఎం.ఆస్మిత 231, జి.ఆకాష్ వీరా 239, డి.శ్యామ్ కృష్ణారెడ్డి 278, జి.కార్తికేయ 331, ఎ.సత్య 472 ర్యాంకు సాధించగా వారిని సత్కరించి అభినందించారు. రవికుమార్ మాట్లాడుతూ ఆలిండియా ర్యాంకులు 100 లోపు నలుగురు, 500 లోపు 11 మంది, వెయ్యి లోపు 16, ఐదు వేల లోపు 41 మంది, పది వేల లోపు 84 మంది సాధించారన్నారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సత్యదేవుని ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత, విశ్రాంతి మండపాలు నవ దంపతులు, వారి బంధుమిత్రులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి, పూజలు చేశారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2,100 జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచీ వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పశ్చిమ రాజగోపురం వద్ద చలువ పందిళ్ల నుంచి, ఆలయ ప్రాకారం చుట్టూ ఉన్న గ్రీన్ షేడ్ నుంచి వాన నీరు ధారగా కారడంతో భక్తులు పూర్తిగా తడిసిపోయారు. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గింది. వర్షం కారణంగా సత్యదేవుడు, అమ్మవారి పల్లకీ సేవ ఆలయం లోపలి ప్రాకారంలో నిర్వహించారు. లోవలో భక్తుల రద్దీ తుని: లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 30 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,460, పూజా టికెట్లకు రూ.2,15,550, కేశఖండన టికెట్లకు రూ.27,600, వాహన పూజ టికెట్లకు రూ.6,170, కాటేజీలకు రూ.92,792, డొనేషన్లుగా రూ.1,27,118 కలిపి రూ.7,17,690 ఆదాయం సమకూరిందని వివరించారు. ముగిసిన ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. గత నెల 21న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల వెబ్ ఆప్షన్లతో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, భాషా పండితులు, ఫిజికల్ డైరెక్టర్లు, స్కూల్ అసిస్టెంట్ తదితర పలు క్యాడర్లకు సంబంధించి 5,010 మంది, సెకండరీ గ్రేడ్ క్యాడర్కు సంబంధించి 3,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ క్యాడర్ల బదిలీ ప్రక్రియ వెబ్ ఆప్షన్ల ద్వారా చేపట్టగా, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీ విషయంలో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం తిరిగి వెబ్ ఆప్షన్ల ద్వారానే చేస్తామని చెప్పడంతో ఉపాధ్యాయులు ధర్నాలు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ చేపట్టింది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రితో ఈ ప్రక్రియ ముగిసింది. రెగ్యులర్ ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్, ఒకేషనల్ విభాగాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఆదివారం నిర్వహించారు. దీంతో మొత్తం ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ముగిసినట్లయింది. బదిలీ పొందిన గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు ఇప్పటికే ఆయా స్థానాల్లో చేరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బదిలీ అయిన ఎస్జీటీలు ప్రస్తుతం పని చేస్తున్న స్థానాల్లో ఆదివారం రిలీవ్ అయి, సోమవారం ఆయా పాఠశాలల్లో చేరాలి. అన్ని యాజమాన్యాల్లోని ఎస్ఏ లాంగ్వేజెస్, ఎస్ఏ–పీఈ, ఎల్పీలు, పీఈటీలు బదిలీ అయిన స్థానాల్లో సోమవారం చేరాలి. ఎంపీపీ/జెడ్పీ యాజమాన్యాల పరిధిలోని ఎస్జీటీలు సోమవారం రిలీవ్ అయి, వారు బదిలీ పొందిన స్థానాల్లో చేరాలి. రిలీవ్ అయిన పాఠశాలలో సగం కంటే తక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే జీవోఎంఎస్ నంబర్–22 ప్రకారం జూనియర్ తిరిగి వెనక్కు వచ్చి పూర్వపు పాఠశాలలో పని చేయాల్సి ఉంటుంది. -
రూ.495 కోట్ల పొగాకు విక్రయాలు
దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు ఒడుదొడుకుల్లోనే సాగుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభించి 82 రోజులు కాగా, ఇప్పటి వరకూ 65 రోజుల పాటు వేలం జరిగింది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.495.38 కోట్ల విలువైన 18.07 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయని రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ తెలిపారు. ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) పండిన పొగాకు 17.26 మిలియన్ల కిలోలు, తొర్రేడు ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో (బ్లాక్ సాయిల్ – బీఎస్) పండిన పొగాకు 8.06 లక్షల కిలోలు కొనుగోలు చేశారు. ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ 1,39,994 బేళ్లకు వేలం నిర్వహించారు. వీటిలో 1,34,085 బేళ్లు ఎన్ఎల్ఎస్, 5,909 బేళ్లు బీఎస్ బేళ్లు ఉన్నాయి. రైతులు శనివారం ఐదు వేలం కేంద్రాలకు 5,286 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా, 3,671 బేళ్లు అమ్ముడయ్యాయి. 1,615 బేళ్లు అమ్ముడు పోలేదు. వారం రోజులుగా వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని రైతులు వాపోతున్నారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 2.93 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 4.35, జంగారెడ్డిగూడెం–2లో 3.82, కొయ్యలగూడెంలో 3.29, గోపాలపురం వేలం కేంద్రంలో 3.66 మిలియన్ల కిలోల చొప్పున పొగాకు విక్రయాలు జరిగాయని రీజినల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. -
భళీ.. నృత్యకేళి
అలరించిన నృత్య రూపకం● ముగిసిన అంతర్జాతీయ కళా సమ్మేళన్–2025 ● ప్రతిభ చూపిన 13 బృందాలుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): తెలుగు సంస్కృతీ వైభవానికి కేంద్రమైన రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన కళాభిమానులు నాలుగు రోజుల పాటు సంగీత, నృత్యానందఝరుల్లో ఓలలాడారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గురువారం ప్రారంభమైన కళా సమ్మేళన్–2025 అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. దేశంలోని 13 రాష్ట్రాలతో పాటు మలేషియా నుంచి వచ్చిన 750 మంది కళాకారులు 13 బృందాలుగా ఈ సంగీత, నృత్య పోటీల్లో పాల్గొని, కళాభిమానులకు నేత్రానందాన్ని కలిగించారు. తొలి రోజు వంద మంది నృత్యకారిణులు పురివిప్పిన మయూరాల్లా నర్తించి, వీక్షకులను అలరించారు. రెండో రోజున శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకెన్లకు గురువాష్టకం, మీనాక్షీ పంచరత్న స్తోత్రాలకు ఏకధాటిగా సాయంత్రం 6 గంటల వరకూ నర్తించారు. దీనికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ పినాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వరించాయి. మూడో రోజైన శనివారం ప్రదర్శించిన డ్యాన్స్ బాలేకి ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి వినోద్ త్యాగి, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గోపాల్ అగర్వాల్ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. చివరి రోజైన ఆదివారం జూనియర్, సబ్ జూనియర్ కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాజమహేంద్రవరం శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నృత్యకారులు ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణానికి ఈ పోటీల్లో ప్రథమ బహుమతి లభించింది. హైదరాబాద్ కళాకారులు ప్రదర్శించిన గోదా కళ్యాణానికి ద్వితీయ, గుడివాడ బృందం ప్రదర్శించిన నవదుర్గలకు తృతీయ బహుమతులు లభించాయి. వీటితో పాటు అయ్యప్ప మహాత్మ్యం, పార్వతీ కల్యాణం, మోహినీ భస్మాసుర, కృష్ణలీలలు, శ్రీనివాస కల్యాణం, సనాతన శక్తి వైభవం, నమో వెంకటేశాయ, గోదా కల్యాణం తదితర ప్రదర్శనలకు సర్టిఫికెట్లు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. నాట్యానికి మంచి రోజులొస్తున్నాయి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరం గౌరవిస్తోంది. భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ తీసుకోవడానికి చిన్నారులు సైతం ముందుకు రావడమే దీనికి నిదర్శనం. భారతీయ నృత్య రీతుల పట్ల నేటి తల్లిదండ్రులకు మంచి అభిప్రాయం ఉంది. ఇది శుభపరిణామం. కూచిపూడి నృత్యాన్ని నేటి తరం తెలుసుకోవాలనే సంకల్పంతో 63 రోజుల పాటు 22 రాష్ట్రాల్లో 17 వేల కిలోమీటర్లు ప్రయాణించాను. దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి, ఈ అపూర్వ కళకు పూర్వ వైభవం తీసుకురావడానికి 2003లో భగీరథ ప్రయత్నం తలపెట్టాం. ఇప్పుడు కళాసమ్మే ళన్–2025 ద్వారా వందల మంది శాసీ్త్రయ నృత్యాలు ప్రదర్శించారు. వీటిని తిలకించి మరికొంత మంది నృత్యం నేర్చుకుంటే నా జన్మ ధన్యమైనట్లే. – డాక్టర్ జి.బదరీ నారాయణ, నిర్వాహకుడు, శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం -
నయానానందం
ఫ కొబ్బరాకుతో సెట్టింగ్లు ఫ పెళ్లి మండపాల డెకరేషన్లో ప్రాధాన్యం ఫ విభిన్న ఆకృతులతో ఆకట్టుకుంటున్న వైనం ఫ వాటితో పాటు పలు వ్యవసాయ ఉత్పత్తులకూ స్థానం సాక్షి, అమలాపురం: ‘‘కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం’’ అన్నట్టు కొబ్బరాకు.. కొబ్బరి కాయలు.. ధాన్యం కుచ్చులు.. చెరకు గెడలు.. అరటి చెట్లు.. అరటి ఆకులు.. పోక చెట్లు... ఆర్కిడ్లు.. ఇలా చెప్పుకొంటూ పోతే పెళ్లి మండపం... పెళ్లి స్వాగత ద్వారం ముస్తాబు చేయడానికి ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తి అయినా కాదేదీ అనర్హం అంటున్నారు మండపాల తయారీదారులు. కొబ్బరాకులతో పెళ్లి మండపాల ముస్తాబు గోదావరి జిల్లాల్లో పెద్ద విషయం కాదు. అదిప్పుడు గోదావరి జిల్లాలు దాటుతోంది. ఇప్పుడు కొబ్బరాకుల ముస్తాబు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక హంగులు అద్దుకుంటోంది. పెళ్లిళ్ల డెకరేషన్లో పెరుగుతున్న హంగూ ఆర్భాటాల్లో సంప్రదాయానికి సైతం పెద్దపీట వేస్తున్నారు. కొబ్బరాకులతో పెళ్లి పందిళ్లు వేయడం.. పందిళ్లకు వేసే రాటలను కొబ్బరాకులతో ముస్తాబు చేయడం గతం నుంచీ ఉన్నదే. పెళ్లిళ్లే కాదు.. గ్రామాల్లో జరిగే ఇతర శుభ కార్యక్రమాల్లోను, ఆలయాల వద్ద జరిగే కల్యాణాలు, యాగాలు వంటి వాటిల్లోను కొబ్బరాకు ముస్తాబు సర్వసాధారణమైంది. ఇప్పుడు అదే కొబ్బరాకుతో కొత్త కొత్త కళాకృతులు తయారు చేయడం ట్రెండ్గా మారింది. పెద్ద పెద్ద పెళ్లి మండపాల్లో కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసేవారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లి మండపాలు ఒక్కటే కాకుండా పెళ్లింటి వద్ద, కల్యాణ మండపాల వద్ద ఏర్పాటు చేసే స్వాగత ద్వారాలను సైతం ఈ ఆకులతో అందంగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు వీటికి అదనంగా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను జోడిస్తున్నారు. కొబ్బరి ఆకుల స్వాగత స్తంభాలను నెలకొల్పడంతో పాటు వాటికి చిన్న అరటి చెట్లను తగిలిస్తున్నారు. వీటికి అదనంగా కొబ్బరి కాయలు వేలాడదీస్తున్నారు. అక్కడకక్కడ ధాన్యం కుచ్చులూ ఏర్పాటు చేస్తున్నారు. చెరకు గెడలతో ముస్తాబు చేయడమూ పెరిగింది. ఆర్కిడ్లు, చిలుక పువ్వులతో కొత్త అందాలు తీసుకువస్తున్నారు. కొబ్బరి వ్యాపార కేంద్రమైన అంబాజీపేటలో ఇటీవల జరిగిన ఒక పెళ్లిలో కొబ్బరి కాయలకు అందమైన రంగులద్ది స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఇటువంటి డెకరేషన్లు పెళ్లికి కొత్త జోష్ తీసుకు వస్తున్నాయి. చివరకు వధూవరులను అలంకరించే చోట కూడా వీటితోనే చిన్న చిన్న వేదికలు తయారు చేస్తూండటం విశేషం. కొబ్బరితో పాటు అరటి ఆకులతో సైతం వీటిని ముస్తాబు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు సైతం.. కొబ్బరి అధికంగా సాగయ్యే గోదావరి జిల్లాల్లోనే కాదు.. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో సైతం పెళ్లిళ్లకు కొబ్బరాకు స్వాగత ద్వారాలకు, పెళ్లి మండపాల ఆర్డర్లు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కోనసీమ జిల్లాలో అమలాపురం, కొత్తపేట, ఆత్రేయపురం, అంబాజీపేట, రావులపాలెం, రాజమహేంద్రవరం, కడియం, కడియపులంక, పెరవలి, కాకరపర్రు వంటి ప్రాంతాల్లో కొబ్బరి ఆకులతో ప్రత్యేక ఆకృతులు తయారు చేసేవారి సంఖ్య రానురానూ పెరుగుతోంది. ఇక్కడ వీటిని తయారు చేయించి నగరాలలో జరిగే పెళ్లిళ్లకు తీసుకు వెళుతున్నారు. వీటితో పాటు పెళ్లిళ్ల డెకరేషన్లో వినియోగించే ఆర్కిడ్లు, చిలకపువ్వు, డయనల్ గ్రాస్, చిన్నచిన్న అరటి మొక్కలను రైతులు స్థానికంగానే పండిస్తున్నారు. కోనసీమ జిల్లాలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, తూర్పు గోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, చాగల్లు, కడియం వంటి ప్రాంతాల్లో కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. పెళ్లిళ్లలో వస్తున్న ఈ కొత్త ట్రెండ్ ఇటు రైతులకు.. అటు డెకరేషన్ చేసేవారికి ఆదాయ వనరుగా మారుతోంది.కొబ్బరి కాయలకు పసిడి వన్నెలద్ది, కొబ్బరి ఆకులతో ముస్తాబు చేసిన పెళ్లి వేదికఅభిరుచి మారుతోంది పెళ్లిళ్లు చేసేవారి అభిరుచి మారుతోంది. బాహుబలి వంటి సెట్టింగ్లే కాదు.. ఒకప్పటి సంప్రదాయాన్ని తలపించేలా కొబ్బరి, అరటి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో సెట్టింగ్లు కావాలంటున్నారు. పెళ్లిళ్లలో అచ్చమైన పల్లె వాతావరణం కనిపించాలని కోరుకుంటున్నారు. వారి కోరికలకు అనువుగా కొబ్బరి, అరటి వంటి ఆకులతో సైతం కొత్తకొత్త మోడల్స్లో డెకరేషన్లు చేస్తున్నాం. – బృందావనం నూకరాజు, ర్యాలి, ఆత్రేయపురం మండలం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రత్యేకంగా డెకరేషన్ కొబ్బరాకులతో తయారు చేసే కల్యాణ వేదికలు, స్వాగత ద్వారాలు హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల నుంచి కూడా కావాలని కోరుతున్నారు. షాపింగ్ మాల్స్ వంటి ప్రారంభోత్సవాల్లో వీటితో ప్రత్యేకంగా డెకరేషన్ చేయించుకుంటున్నారు. చివరకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తయారు చేసే చిన్న వేదికల వద్ద కూడా వీటిని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. – మన్నెం సత్యనారాయణ, కాకరపర్రు, పెరవలి మండలం, తూర్పు గోదావరి జిల్లా -
నల్లమిల్లికి టీడీపీపై మమకారం తగ్గలేదు
● అన్నింటిలోనూ ఆ పార్టీ వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు ● పర్సంటేజీల్లో తేడా వస్తుందనే ఇలా చేశారా? ● అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై బీజేపీ సీనియర్ నేత విమర్శ అనపర్తి: తమ పార్టీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా ఎన్నికై న నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీపై ఇంకా మమకారం తగ్గలేదని బీజేపీ సీనియర్ నాయకుడు తేతలి సత్యనారాయణరెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. బీజేపీని రామకృష్ణారెడ్డి తిరోగమనంలోకి తీసుకు వెళుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నలభయ్యేళ్లుగా ఎంతో మంది నాయకులు పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడి అభివృద్ధి చేశారన్నారు. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో అనపర్తిని బీజేపీకి కేటాయించడంతో పార్టీ విధేయులుగా తామంతా సంతోషించామన్నారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రామకృష్ణారెడ్డి బీజేపీని ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని విమర్శించారు. ప్రతి విషయంలోనూ టీడీపీ శ్రేణులకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీపై ఇంకా మమకారం తగ్గనందువల్లనే దాదాపు అన్నిచోట్లా టీడీపీ వారినే నియమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తరఫున విజయం సాధించిన ఆయన పార్టీపట్ల కనీస విశ్వాసం కూడా లేకుండా టీడీపీ వారినే నియమించుకుంటున్నారని, అనపర్తి మండలంలో ఒక్క బీజేపీ కార్యకర్తను కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తున్న అనపర్తి పంచాయతీతో పాటు రెవెన్యూ, ప్రభుత్వ ఆసుపత్రి తదితర అన్ని వ్యవస్థల్లోనూ టీడీపీ కార్యకర్తలనే నియమించడంలో ఆంతర్యమేమిటని సత్యనారాయణరెడ్డి ప్రశ్నించారు. పర్సంటేజీల్లో తేడా వస్తుందనే వారిని నియమించుకున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల పొత్తు సందర్భంగా టీడీపీ గెలిచిన చోట 50 శాతం పదవులు ఆ పార్టీ వారికి 30 శాతం బీజేపీకి, 20 శాతం జనసేనకు కేటాయిస్తామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఆ మాట ప్రకారం అనపర్తి నియోజకవర్గంలో ఎంతమందికి పదవులు కేటాయించారో చెప్పాలని నిలదీశారు. వైఎస్సార్ సీపీ నుంచి వచ్చిన వ్యక్తిని పార్టీ మండల అధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి నియమించారని, తాను పార్టీలోకి రాక ముందు నుంచి ఉన్న వారిని పక్కన పెట్టారని చెప్పారు. అలాగే ఉపాధి హామీ కూలీలను క్రియాశీలక సభ్యులుగా చూపిస్తూ పార్టీని మభ్యపెడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి విఫలమయ్యారని, సంక్షేమ పథకాలు, అభివృద్ధిని గాలికి వదిలేసి, కేవలం ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. దాని పర్యవసానంగానే వెన్నుపోటు దినం విజయవంతమైందని, బిక్కవోలులో తాను తలపెట్టిన కార్యక్రమం విఫలమైందని సత్యనారాయణరెడ్డి చెప్పారు. ఇకనైనా ఎమ్మెల్యే పద్ధతి మార్చుకుని బీజేపీకి విధేయుడిగా పని చేయాలని సూచించారు. -
చిన్నారికి ఎంత కష్టం.. వైద్యానికి రూ. 16 కోట్లు అవసరం!
కడియం(తూర్పుగోదావరి జిల్లా): మొదటి కాన్పులో అమ్మాయి పుట్టిందని ఎంతో సంతోషించిందా కుటుంబం. ఎంత ముద్దుగా సాకాలనే ప్రణాళికలు వేసుకున్నారు. ఆమె బోస్ నవ్వులకు మురిసిపోయి మోహన అనే పేరు పెట్టుకున్నారు. విధి వెక్కిరించి రెండు నెలలకే ఆమెలోని అనారోగ్యాన్ని బయటపెట్టింది. మండ లంలోని మాధవరాయుడుపాలెం పంచాయతీ చైతన్యనగర్ కు చెందిన డాక్కా ఈశ్వర్, శ్రావణి గారాలపట్టి మోహనకు తట్టుకోలేని కష్టం వచ్చింది.స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (ఎస్యంఏ) టైప్ 1 సమస్య వచ్చిందని వైద్యులు తేల్చి ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉం దని పేర్కొన్నారు. ఆమెను రక్షించాలంటే రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ను రెండేళ్ల వయసు లోపే ఇవ్వాలని చెప్పారు. ఆ ఇంజెక్షన్ అందే వరకు రూ.ఆరు లక్షల విలువైన సిరప్ను పాపకు అందించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.పేప రు మిల్లు ఉద్యోగిగా, వచ్చేదానితో కుటుంబంతో ఆనందంగా ఉందామనకున్న వారి ఆశలకు చిన్నారి మోహన అనారోగ్యం గండి కొట్టింది. పాపకుపాపతో తల్లిదండ్రులు ఈశ్వర్, శ్రావణిఎప్పుడెలా ఉంటుందో అర్థంకాని రీతిలో అప స్మారక స్థితికి వెళ్లిపోతోంది. ప్రభుత్వం, దాతలు స్పందించి పాప వైద్యానికి సాయం చేయాలని ఈశ్వర్, శ్రావణి దంపతులు కోరుతున్నారు. కన్పించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సహాయం చేయదలచిన వారు 94411 01670కు ఫోన్ చేయాలని తండ్రి ఈశ్వర్ తెలిపాడు. -
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే..
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓ కార్యకర్తపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చెరువుల తవ్వకం విషయమై తన వద్దకు వచ్చిన ఒక కార్యకర్తపై ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో దుర్భాలాడారు.ఈ ఘటనను అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త తన సెల్ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ‘జన సైనికుడిపై జనసేన ఎమ్మెల్యే బూతు పురాణం’ పేరిట ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నువ్వెంత పోటుగాడివిరా.. ఎక్కువ మాట్లాడకు.. నువ్వెందుకు దెం.. దెం.. యి,’ వంటి బూతులతో పాటు ఇంకా ఘాటైన పదాలతో దూషించినట్లు ఆడియో ఉంది.నీతి, న్యాయం, ధర్మం గురించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తెగనీతులు చెబుతుంటారని.. ఇప్పుడు బూతులతో రెచ్చిపోయిన తన పార్టీ ఎమ్మెల్యేపై ఆయన ఇప్పుడేమంటారని పలువురు ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు. -
మాకు మంచి స్నేహితుడు
నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా, మా తమ్మడు శ్రీను అన్నా నాన్నకు ఎంతో ఇష్టం. నాకు ఏమి కావాలన్నా నాన్న కొనిస్తారు. మా నాన్నా సప్పా సత్యనారాయణ మాకు మంచి స్నేహితుడు. మేము ఎప్పుడూ సరదాగా స్నేహితుడిలా ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం. స్నేహితుడిలా ఉంటూ మా భవిష్యత్ సలహాలు అందించారు. –తండ్రి సత్యనారాయణతో సప్పా నాగేశ్వరరావు, కొంకుదురు ఎంతో ప్రేమగా చూస్తారు.. సాధారణంగా తల్లి దగ్గరకన్నా ఆడపిల్లలకు తండ్రి దగ్గరే చనువెక్కువగా ఉంటుందంటారు. నా విషయంలోనూ అది పూర్తిగా నిజమైంది. మా నాన్న గొలుగూరి నాగిరెడ్డి చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పెళ్లయి కూతురు ఉన్నప్పటికీ ఏ విషయమైనా మా నాన్నతోనే పంచుకుంటాను. –తండ్రి గొలుగూరి నాగిరెడ్డితో పడాల దేవి, పొలమూరు -
నీట్గా మెరిశారు
రాజమహేంద్రవరం రూరల్: వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష నీట్లో జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎంబీబీఎస్ చదివి అనంతరం న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, స్కల్ సర్జన్ తదితర స్పెషలైజేషన్ అంశాల్లో పీజీ చేసి, వైద్యసేవలందిస్తామని ఈ సందర్భంగా పలువురు విజేతలు చెప్పారు. పేరు: డి.కార్తీక్రామ్ కిరీటి, రాజమహేంద్రవరం ర్యాంకు: 19 (ఓపెన్ కేటగిరీ), 18 (ఈడబ్ల్యూఎస్) తండ్రి: డాక్టర్ డీఎస్ అరుణ్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్ తల్లి: లత, గృహిణి లక్ష్యం: కార్డియాలజిస్ట్, స్కల్ సర్జన్ ............................................................... పేరు: కె.ఈప్సిత్ కశ్యప్, రాజమహేంద్రవరం ర్యాంకు: 198 (ఓపెన్ కేటగిరీ),12 (ఈడబ్ల్యూఎస్) తండ్రి: సారథి కశ్యప్ (లేటు) తల్లి: గాయత్రి, టీచర్ లక్ష్యం: ఆర్థోపెడీషియన్, న్యూరోసర్జన్ పేరు: కేవీవీ నాగసాయి పవన్, రాజమహేంద్రవరం ర్యాంకు: 587 (ఓపెన్ కేటగిరీ), 154 (ఓబీసీ) తండ్రి: రామకృష్ణ, బిల్డర్ తల్లి: లక్ష్మీరూప, గృహిణి లక్ష్యం: జనరల్ సర్జన్, రేడియాలజిస్ట్ ............................................................... పేరు: టి.సాహితి, రాజమహేంద్రవరం ర్యాంకు: 1209 (ఓపెన్ కేటగిరీ), 32 (ఎస్సీ) తండ్రి: టీవీఆర్ రాజు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ తల్లి: నాగమణి, స్కూల్ అసిస్టెంట్ లక్ష్యం: కార్డియాలజిస్ట్ ............................................................... పేరు: ఎం.సూర్య సంతోష్రెడ్డి, పందలపాక ర్యాంకు: 1518 (ఓపెన్ కేటగిరీ), 880 (ఈడబ్ల్యూఎస్) తండ్రి: డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి, వైద్యుడు తల్లి: సంధ్యాదేవి, కెమిస్ట్ లక్ష్యం: జనరల్ సర్జన్, గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు -
ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం
కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఎస్బీఐ చీఫ్ అసోసియేట్ యానాల సాయికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అచ్చియ్యమ్మల ఏకై క కుమార్తె యానాల శుభశ్రీవల్లి ఆత్రేయి. చిరునవ్వుల ఈ చిన్నారికి చదువంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించిన నాన్న తగిన విధంగా ప్రోత్సహించారు. ఆత్రేయికి చిన్నతనంలో ఆశించిన మార్కులు వచ్చేవి కాదు. దీంతో నిరుత్సాహపడేది. తక్కువ మార్కులు వచ్చాయన్న విషయాన్ని నాన్న సాయికృష్ణ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చదువును ప్రేమించే మనస్తత్వం తన చిన్నారికి ఉందా లేదా అన్నదే గమనించేవారు. నిరుత్సాహంతో ఉన్న ఆమెకు జీవితంలో ఒడిదొడుకులు ఎలా వస్తాయో, ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పేవారు. మార్కుల ఆధారంగా జీవితాన్ని తూకం వేసుకోవద్దని అనేవారు. లక్ష్యం కోసం చేసే ప్రయత్నం స్థాయిని మరింత పెంచుకోమని ప్రోత్సహించేవారు. మూడేళ్ల ఆయన మాటలు ఫలితంగా ప్రేరణ పొందిన ఆత్రేయి ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ముందుకు దూసుకుపోయింది. రోజూ చదువుకునే క్రమంలో శారీరక, మానసిక సమస్యలను అమ్మ అచ్చియ్యమ్మ తీర్చి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు తోడ్పాటునిచ్చారు. ఇటీవల విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఆత్రేయి 296వ ర్యాంక్ను సాధించింది. ఫిబ్రవరిలో విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.98 స్కోర్తో ప్రతిభ కనబర్చింది. ఏపీఈపీసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్లో 91వ ర్యాంక్ సాధించింది. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు దక్కింది. అనంతరం సివిల్స్లో ఐఏఎస్ చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆత్రేయి తెలిపింది. -
నాన్నా... నీ మనసే వెన్న
ఫాదర్స్ డే రోజునే ఉద్యోగంలోకి.. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాలచర్ల అమ్మిరాజు స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో చిరుద్యోగి. తన భార్య సునీతతో కలసి తన ఇద్దరు పిల్లలను ప్రణాళికాబద్ధంగా చదివించారు. రోజూ న్యూస్ పేపర్లో ప్రచురితమైన విజయం సాధించిన వారి కథనాలను పిల్లలతో చదివించేవారు. అంచెలంచెలుగా పిల్లలు ఎదుగుతూ పెద్ద ప్యాకేజీలతో గూగుల్లో ఉద్యోగులయ్యారు. పెద్ద కుమారుడు శ్రీవినోద్ ఎంసెట్లో 289వ ర్యాంకు, గేట్లో 240వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఐఐటీ చైన్నెలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్లో సామ్సంగ్ రీసెర్చ్ బెంగళూరుకు ఎంపికై రెండేళ్లపాటు రూ.22 లక్షల ఏడాది ప్యాకేజీలో ఉద్యోగం చేశాడు. 2023 సెప్టెంబర్లో గూగుల్ సంస్థలో రూ.50 లక్షల ప్యాకేజీకి ఎంపికై ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీసత్యనవీన్ జేఈ మెయిన్స్లో 1924వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. మ్యాథ్స్, ఫిజిక్స్లలో 100కి 100 మార్కులు రావడం అతని ప్రత్యేకత. మెయిన్స్ ఆధారంగా ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అక్కడే క్యాంపస్ ప్లేసమెంట్లో గూగుల్కి ఎంపికై రూ. 44 లక్షల ఏడాది ప్యాకేజీకి ఎంపికయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత స్థితికి చేరుకున్న శ్రీసత్యనవీన్ ఫాదర్స్ డే రోజునే గూగుల్లో ఉద్యోగంలో చేరుతుండటం విశేషం. తాము ఇలా స్థిరపడడానికి తన తండ్రి బాటలు వేశారని ఆ కుమారులు అంటున్నారు. ఫ నడిపించే దైవం ఆయనే ఫ కుటుంబానికి వెలుగునిచ్చే సారథి ఫ నేడు ఫాదర్స్ డే కపిలేశ్వరపురం/ బిక్కవోలు: వారధి లేకుండా నదిని దాటలేం... సారథి లేకుండా రథం నడపలేం.. ప్రతి కుటుంబానికి ఆ వారధి, సారథి నాన్నే. పిల్లలు తప్పటడుగులు వేసే వయసు నుంచి వారి వేలు పట్టుకుని నడక నేర్పి లోకాన్ని చూపే ప్రతి అడుగులోనూ నీడలా ఉండే దైవం నాన్న. అలాంటి నాన్న కన్నీటి కష్టాన్ని కనురెప్పల మాటున దాచుకుంటాడు. తాను చిరిగిన చొక్కా అయినా వేసుకోవడానికి ఇష్టం పడతాడు కానీ తన పిల్లలకు మంచి దుస్తులు కొని ఇవ్వాలని ఆరాటపడుతుంటాడు. గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసి తన పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చే త్యాగశీలుడు. మాట కాస్తా కటువుగా ఉన్నా మనసు వెన్నే.. శనివారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా, చిన్నారులు, నేటి యువతకు తమ తండ్రి పట్ల ఉండే అనుబంధం గురించి సాక్షి ప్రత్యేక కథనం ఇది. -
నీట్లో ఆదిత్య పభంజనం
బాలాజీచెరువు (కాకినాడ): నీట్–2025 ఫలితాల్లో 625/720 మార్కులతో వి.సాయి భవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకును సాధించారని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ ఏకేన దీపక్రెడ్డి తెలిపారు. ఎన్టీఏ ప్రకటించిన నీట్ ఫలితాల్లో దగ్గుమాటి శ్రవణ్ కార్తికేయ ఆలిండియా 109వ ర్యాంకు, వీరంరెడ్డి సాయిభవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకు, దంగేటి శ్రీనివాస రిషిత్ ఆలిండియా 890వ ర్యాంకులను సాధించారని అన్నారు. ఆలిండియా నీట్ ఫలితాల్లో 550 మార్కులు పైన 12 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో శ్రీఆదిత్యశ్రీను అగ్రగామిగా నిలిచిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ దీపక్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నీట్ లాంగ్టర్మ్ కోచింగ్కు అడ్మిషన్లు విశాఖపట్నం ఆదిత్య గంగరాజునగర్, మారికవలసలో ప్రారంభించారని తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల హాస్టల్ డైరెక్టర్ ఎ.లక్ష్మీరాజ్యం, డైరెక్టర్ శృతి, డైరెక్టర్ సుగుణ, ప్రిన్సిపాల్స్ జె.మొయిన, పి.సత్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్ కె.లక్ష్మీకుమార్, అకడమిక్ డైరెక్టర్ ఎస్వీ రాఘవరెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ఐఐటీ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఫణీంద్ర, ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణ అందించిన అధ్యాపకవర్గాన్ని అభినందించారు. -
యోగాకు 7.66 లక్షల మంది నమోదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా 4,889 ప్రాంతాల్లో యోగా సాధనకు 7.66 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా శనివారం యోగా ట్రయల్ రన్ నిర్వహించారు. నగరంలో 45 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు తెలిపారు. రాజమహేంద్రవం ఆర్ట్స్ కళాశాల వద్ద పర్యాటక, సాంస్కృతిక శాఖ, సరస్వతీ ఘాట్ వద్ద ఉద్యానవన శాఖ, పుష్కర ఘాట్ వద్ద మత్స్య శాఖ, సుబ్రహ్మణ్య మైదానంలో పోలీస్, సైనిక్ సంక్షేమ శాఖ, ఏకేసీ కాలేజీ రోడ్డులో వైద్య, ఆరోగ్య శాఖ, లాలాచెరువు బీటీ రోడ్డు సమీపాన సూర్య నమస్కారాల విగ్రహాల వద్ద, క్వారీ మార్కెట్, శివాలయం ఎదురుగా జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన యోగా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాసా... శ్రీపురుషోత్తమా... ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తజన సంద్రం ఫ ఒక్కరోజే రూ.60.16 లక్షల ఆదాయం కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీపురుషోత్తమా.. శ్రీవేంకటేశా.. గోవిందా అంటూ వాడపల్లి క్షేత్రంలో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారిని చూసిన భక్తజనం ఆనందంతో ఉప్పొంగింది.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి బాట పట్టారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోర్కెలు తీరిన అనేకమంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసిన అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. మాఢ వీధులు, ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు. వేలాది గా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి రూ.60.16 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
నీట్ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో డి.కార్తీక్ రామ్కిరీటికి ఏపీ ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆలిండియా 19వ ర్యాంకు సాధించాడన్నారు. వివిధ కేటగిరీల్లో కె.ఈప్సిత్ కశ్యప్ 12వ ర్యాంకు, డి.కార్తీక్రామ్ కిరిటీ 18వ ర్యాంకు, టి.సాహితి 32వ ర్యాంకు, కేవీవీ నాగసాయిపవన్ 154వ ర్యాంకు, ఎం.సూర్యసంతోష్రెడ్డి 880వ ర్యాంకు, ఎల్.అభిషేక్ 888 ర్యాంకు, టి.రామచంద్రన్ 1,145వ ర్యాంకు, ఎల్.వర్షిత్ 1,237వ ర్యాంకు, పి.ప్రశంస 1,851వ ర్యాంకు, కె.విన్షిత 1,909వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. వెయ్యిలోపు ఆరుగురు, ఐదు వేల లోపు 35 మంది, 10 వేల లోపు 71 మంది, 20 వేల లోపు 138 మంది, 30 వేల లోపు 189 మంది ర్యాంకులు సాధించారని, 250 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరిలు అభినందించారు. -
శ్రీషిర్డీసాయి విజయకేతనం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): నీట్ ఫలితాల్లో శ్రీషిర్డీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య తెలిపారు. తమ దీకా్ష్య్ మెడికల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బి.సంజన ఆల్ ఇండియా 227వ ర్యాంకు, కె.పావన్ తనయ్ 308వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. 2 వేల లోపు ర్యాంకులు ఐదుగురు, ఐదు వేల లోపు 8 మంది, పది వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. విద్యా సంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ హాజరైన మొత్తం విద్యార్థుల్లో 20 శాతం మంది ఎమ్బీబీఎస్ సీట్లు సాధించగలరన్నారు. ఏటా తమ విద్యార్థులు నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, దీక్ష్యా అకాడమీ డీన్ పి.నరసింహారావు అభినందించారు. -
తల్లికి వంచన
సాక్షి, రాజమహేంద్రవరం: తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న అనేక కుటుంబాలకు ద్రోహం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికీ ఎటువంటి నిబంధనలూ లేకుండా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు. ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు’ అంటూ గొప్పగా ప్రచారం చేశారు. తీరా అమలు చేయాల్సి వచ్చేసరికి కూటమి సర్కారు అనేక నిబంధనలతో ఆంక్షలు పెట్టింది. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,88,226 మంది విద్యార్థులున్నారు. వీరిలో 1,23,779 మందిని అర్హులుగా గుర్తించి వారి తల్లుల ఖాతాల్లో రూ.240 కోట్లు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారమే 64,447 మందికి మొండిచేయి చూపారు. ఇదిలా ఉండగా జిల్లాలో సుమారు 2.80 లక్షల మంది విద్యార్థులున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే ఎంత మంది విద్యార్థులు ఈ పథకానికి దూరమయ్యారో అర్థం చేసుకోవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 1.62 లక్షల మంది విద్యార్థులకు ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారానే రూ.243 కోట్లు జమ చేసేవారు. ఇలా నాలుగేళ్ల పాటు నిరంతరాయంగా అందించారు. ఇది కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా, వసతి దీవెనల పేరుతో ఫీజు రీయింబర్స్మెంట్ అందజేశారు. ఇవీ నిబంధనలు ● ఒకే ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందితే ఆ ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వరు. ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందే వారికి ఈ పథకం వర్తించదు. ● బియ్యం కార్డు లేకపోతే పథకం రాదు. ● కుటుంబం నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం వర్తించదు. ● మాగాణి మూడెకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలు మించకూడదు. ● పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ● ప్రతి కుటుంబానికీ ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం వర్తింపజేయరు. ● ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారికి పథకం వర్తించదు. ఈ ఆంక్షలతో జిల్లాలో వేలాది మంది తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. వీరు కూడా దూరం సీబీఎస్ఈతో పాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తల్లికి వందనం జాబితాలో కనుమరుగయ్యాయి. గత విద్యా సంవత్సరంలో టెన్త్, సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ డబ్బులు ఇవ్వలేదు. టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరితేనే వారికి లబ్ధి కలుగుతుంది. సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను అనర్హుల్ని చేశారు. నాడు తప్పు.. నేడు ఒప్పా? ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.2 వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మినహాయించినట్లు తెలిపింది. ఈ నిధులు జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంచే విధంగా జీఓలో పేర్కొంది. ఇదే పని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తే నాడు కూటమి నేతలు బురద జల్లారు. ఇలా చేయడం నాడు తప్పని చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా ఒప్పవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.తల్లికి వందనం డబ్బులు రాని అంబేద్కర్ కుటుంబ సభ్యులు తల్లికి వందనం పథకానికి ని‘బంధనాలు’ ఆదాయం, విద్యుత్ వినియోగం పేరిట అనర్హత వేటు జిల్లాలో 64,447 వేల మంది పరిస్థితి అగమ్యగోచరం అర్హత ఉన్నా వేటు నిడదవోలు మండలానికి చెందిన వడల రత్నకుమారి, అంబేద్కర్ దంపతుల పిల్లలు రిషిత (8వ తరగతి), వెంకట్ రిషి (6వ తరగతి) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ కుటుంబం ఎస్సీ కేటగిరీ కింద విద్యుత్ వినియోగిస్తోంది. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీలకు ఉచిత విద్యు త్ నాలుగేళ్లుగా అమలవుతోంది. దీంతో, వీరు 300 యూనిట్ల విద్యుత్ బిల్లు వినియో గం ఆంక్షల పరిధిలోకి రారు. అయినప్పటికీ ఈ కుటుంబం 300 యూనిట్ల విద్యుత్ వాడినట్లు చూపించి, తల్లికి వందనం పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో ఇద్దరు పిల్లలకూ నయాపైసా కూడా జమ కాలేదు. దీని పై ఆ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ కుటుంబమే కాదు.. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. -
22న ద్విశత కవి సమ్మేళనం
సఖినేటిపల్లి: కాకినాడలో ఈ నెల 22న శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో గోదావరి కవితా పండగ కాన్సెఫ్ట్లో జాతీయ స్థాయి ద్విశత కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. శనివారం సఖినేటిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పీఆర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న పై ద్విశత కవి సమ్మేళనంలో ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల మందికి పైగా కవులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల పర్యావరణంపై ప్లాస్టిక్ భూతం అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు బహుమతులు గోదావరి కవితా పండుగలో అందజేస్తామని కూడా ఆయన తెలిపారు. చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి మామిడికుదురు: నగరం గ్రామంలోని తాడివారిమెరకకు చెందిన తాడి అశోక్కుమార్ (35) శుక్రవారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేశామని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ శనివారం తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పెయింటర్గా పని చేసే అశోక్కుమార్ పిల్లలకు అనారోగ్యంగా ఉండడంతో బొండం కోసం చెట్టెక్కి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడన్నారు. అశోక్కుమార్ మృతితో అతని భార్య నాగమణి, 15 ఏళ్ల కుమార్తె స్వప్న, 13 ఏళ్ల కుమారుడు సంతోష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కళ్లు తెరవకుండానే.. కన్నుమూసిన పసికందు
ఫ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన ఫ ఇద్దరు నర్సుల సస్పెన్షన్ తాళ్లరేవు: కళ్లు కూడా తెరవకుండానే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి.. గర్భిణిని వైద్యులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోక పోవడంతో బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి పురిటి నొప్పులు రావడంతో భర్త రాము తాళ్లరేవు సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బిడ్డ మృతి చెందాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు మాధురికి పురిటి నొప్పులు వచ్చినప్పటికీ డ్యూటీలో ఉన్న వైద్యురాలు డి.స్నేహలత గాని, నర్సులు ఇందిర, శైలజ గాని పట్టించుకోకపోవడంతో స్వీపర్ అనంత డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే బిడ్డ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని, వైద్యురాలు స్నేహలత నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మద్దతు పలికారు. ఆరు గంటలపాటు ఆందోళన కాకినాడ – యానం రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, నైట్ డ్యూటీ డాక్టర్ స్నేహలతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ రహదారిలో సుమారు 6 గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జనం అధిక సంఖ్యలో రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్నేహలతను సస్పెన్షన్ చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని చెప్పడంతో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణకు సమాచారం ఇచ్చారు. పెదపూడి ఎస్సై తులసీరామ్, ఇంద్రపాలెం ఎస్సై వీరబాబుతోపాటు, ఏపీఎస్పీ బలగాలను రప్పించారు. ఇలాఉండగా అధికార పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, వాడ్రేవు వీరబాబు, ధూళిపూడి బాబి, జక్కల ప్రసాద్ తదితరులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించి కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ముగ్గురు వైద్యులు వినోద్కుమార్, సుజాత, సతీష్లతోకూడిన బృందంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి డ్యూటీలో ఉన్న నర్సులు ఇందిర, శైలజలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆర్డీఓ మల్లిబాబు ప్రకటించారు. అయితే వైద్యురాలు స్నేహలతపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమైపె చర్యలు తీసుకోవడం తమ పరిధిలో లేదని, జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేసినట్లు తెలిపారు. -
మొదటి గురువులా..
ప్రతి ఒక్కరూ మంచి విలువలతో జీవించాలి. అలాంటి విలువలను మొదటి గురువులా చెప్పేది, నేర్పిందేది నాన్న మాత్రమే. మా నాన్న గొర్రిపోటి సత్యనారాయణ కష్టం గురించి తెలియకుండా పెంచారు. నేను నాన్న అయిన తరువాత మా నాన్న కష్టం నాకు తెలిసింది. మా అబ్బాయికి కూడా అదే విలువలు నేర్పిస్తున్నాను. తండ్రి ఒక్క రోజు ఉంటే సరిపోదు. ప్రతి రోజూ పిల్లల వెంట ఉండి సన్మార్గంలో నడిపించాలి. –తండ్రి సత్యనారాయణతో గొర్రిపోటి నాగేశ్వరరావు, పందలపాక ఆయనే కొండంత ధైర్యం ఏ సమస్య, కష్టం వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నేను, మా తమ్ముడు మణికంఠ కమల్ ఉన్నత స్థాయి చేరుకోవాలని మా నాన్న బండారు రాము కలలుకంటున్నారు. మాకు కొద్దిగా నలతగా ఉంటే తట్టుకోలేరు. ఆరోగ్యం బాగయ్యే వరకూ ఎంతో తపిస్తారు. తప్పకుండా నాన్న కోరిక నెరవేర్చేందుకు నా వంతు శ్రమిస్తా. ఆయనే మాకు ఆదర్శం. –తండ్రి బండారు రాముతో సంధ్య అఖిలదేవి, మణికంఠ కమల్, కొప్పవరం -
తోలు తీస్తామన్న లీడర్లు ఎక్కడ?.. బాధితురాలికి సత్యదేవ్తో వివాహం జరిపించాల్సిందే: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించని స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘దళిత బాలికకు ఎంత అన్యాయం జరిగితే మహిళ కమిషన్ ఎందుకు స్పందించలేదు. ఈ వ్యవహారంపై చంద్రబాబు లోకేష్, పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న ఆ నాయకులు ఎక్కడికి వెళ్లిపోయారు?. ఏపీలో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో?.. 40 రోజులుగా బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎందుకు కేసు కట్టలేదు. కలెక్టర్ ఆదేశించే వరకు డీఎస్పీ కూడా ఇన్వాల్వ్ కాకపోవటం దారుణం. ఎవరి రాజకీయ ఒత్తిడితో పట్టించుకోలేదా?. ఈవీఎం ఎమ్మెల్యే ఒత్తిడి చేశారా?. ఈ వ్యవహారం రాష్ట్ర డీజీపీని కలుస్తాం. ఈ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని బాధితులానికి న్యాయం చేయాలి. బాధితురాలికి సత్యదేవ్తో వివాహం జరిపించాలి’’ అని మార్గాని భరత్ డిమాండ్ చేశారు. తల్లికి వందనం మోసంపై..మరోవైపు.. తల్లికి వందనం పథకం పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపైనా ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కోసం రూ.13,000 కోట్లు ఖర్చు అవుతుంది. బీపీఎల్లో ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించాలి. అలాంటప్పుడు ఎంతమందికి తల్లికి వందనం లేకుండా చేస్తున్నారు?. వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఆ జబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం గతేడాది నిధులు విద్యార్థులకు బకాయి ఉన్నారు. ఎంతమంది విద్యార్థులున్నారో అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలి. లేదంటే వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’’ అని భరత్ హెచ్చరించారు.కేసు ఏంటంటే..బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మోరంపూడికి చెందిన పులవర్తి సత్యదేవ్ ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి దళిత బాలికను మోసం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని చెప్పాడు. ఆపై ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ 17న అబార్షన్ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్ నిరాకరిస్తూ వస్తున్నాడు. గట్టిగా నిలదీస్తే.. కులం తక్కువ దానివంటూ దూషించాడు. ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. వివాహం చేసుకోమని అడిగితే.. పెద్ద సమక్షంలో సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడని మండిపడుతోంది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. -
పోతవరంలో నేడు గంగానమ్మ జాతర
దేవరపల్లి: నల్లజర్ల మండలం పోతవరం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి జాతర శనివారం నిర్వహిస్తున్నారు. గత నెల 29న ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారం నైవేద్యాలతో ముగుస్తాయి. సుమారు 39 ఏళ్ల తర్వాత జరుగుతున్న అమ్మవారి జాతరకు గ్రామస్తులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బంధువులు, ఆడపడుచులతో గ్రామం సందడిగా మారింది. విద్యుద్దీప కాంతులతో గ్రామం కొత్త కాంతులు అద్దుకుంది. గ్రామ ప్రధాన రహదారి, కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారి కలశాలతో గ్రామోత్సవం నిర్వహించి, గంగానమ్మ తల్లికి మంగళ స్నానం చేయించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి బలిచేట కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయంకంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి శుక్రవారం మహిళా జైలును సందర్శించారు. ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. మహిళా ఖైదీలతో మాట్లాడారు. వారి తరఫున ఉచితంగా వాదించేందుకు, బెయిల్ పిటిషన్లపై కోర్టులో అప్పీలు వేయాలన్నా, న్యాయవాదులు కావాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా డీఎల్ఎస్ఏ సహకరిస్తుందని తెలిపారు. న్యాయ సహాయం అవసరమైన వారు సంస్థ నియమించిన పారా లీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు అందించాలని సూచించారు. యోగాంధ్ర మాక్ డ్రిల్ విజయవంతం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన స్థానిక ఏకేసీ కాలేజీ వద్ద హ్యాపీ స్ట్రీట్లో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జేసీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లు సుమారు 1,500 మంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా చిన్నరాముడు మాట్లాడుతూ, ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో మరింత మంది పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 20న హుండీల లెక్కింపు సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన హుండీల ఆదాయం లెక్కించనున్నారు. దీనికి ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యంకేటీఎన్వీ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎండోమెంట్స్ అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన హుండీలతో పాటు, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీని ఆ రోజు తెరిచి, ఆదాయం లెక్కింపు చేపడతామన్నారు. 22న శాంతి కల్యాణం జ్యేష్ఠ బహుళ ద్వాదశి సందర్భంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వారి శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో పాల్గొనదలచిన భక్తులు దేవస్థానం వెబ్సైట్ ద్వారాను, ఆలయం వద్ద గల కౌంటర్లో ముందస్తుగా కల్యాణం టికెట్లు తీసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. -
కోనసీమలో పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ నెలకొల్పాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు డిమాండ్ అమలాపురం టౌన్: చమురు, సహజ వాయు వనరులు అధికంగా ఉన్న కోనసీమలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కిందట పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ కోసం అనకాపల్లి జిల్లాలో 200 ఎకరాల స్థల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రూ.వెయ్యి కోట్లతో నెలకొల్పనున్న ఈ యూనివర్సిటీని రాష్ట్రంలో స్థాపించేందుకు సన్నాహాలు జరుగుతుండగా అది ఉత్తరప్రదేశ్కు తరలిపోయిందని తెలిపారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో ఈ యూనివర్సిటీ రాష్ట్రానికి రాకుండా పోయిందని, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కోనసీమలో స్థాపించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ పరిధిలో పలు చమురు సంస్థలు 49 ఏళ్లుగా రూ.వేల కోట్ల విలువైన సంపదను, ఆదాయాన్ని దోచుకుపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రజలకు న్యాయబద్ధమైన రాయల్టీ ఇవ్వకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పేరుతో అరకొర నిధులు ఇస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల కాలంలో గౌరవ ఉన్నత న్యాయస్థానాలు కూడా కేజీ బేసిన్కు తగిన రాయల్టీ ఇవ్వాలని ఆదేశించిన విషయాన్ని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. చైన్నెలో ఉన్న చమురు, సహజ వాయువుల రీజినల్ ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని కోనసీమ జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని స్థాపించాలని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ పాల్గొన్నారు. -
ఏదీ.. అనుగృహం!
● కూటమి ఏడాది పాలనలో ముందుకు కదలని గృహ నిర్మాణం ● పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని ఎన్నికల్లో హామీలు ● ఏడాదైనా నెరవేరని వాగ్దానం ● జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు (ఫైల్) సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. గృహ నిర్మాణానికి లక్ష్యాలు నిర్దేశించిన ప్రభుత్వం.. వాటి సాధన దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. ‘మన ఇల్లు.. మన గౌరవం’ పేరుతో అవగాహన సదస్సులు పెడుతూ కొద్ది రోజులు హంగామా చేసిన ప్రభుత్వం ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గృహ నిర్మాణాలపై అంతులేని నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా.. 6,087 ఇళ్లు మాత్రమే నిర్మించారు. అది కూడా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనవే ఎక్కువ శాతం కావడం గమనార్హం. రాజానగరంలో 183, రాజమహేంద్రవరం అర్బన్లో 2,382, కొవ్వూరు అర్బన్లో 214 ఇళ్లు పూర్తయినట్లు సమాచారం. మిగిలిన మండలాల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఏడాది 10,749 గృహాలు లక్ష్యం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇళ్ల నిర్మాణాలపై గతంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అధికార యంత్రాంగం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించింది. ఈ మేరకు హౌసింగ్, ప్రత్యేక అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలి. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా గత ఏడాది డిసెంబర్ నెలాఖరుకు 4,875 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా 331 మాత్రమే పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 10,749 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 6,087 మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అడ్రస్ లేని 2.0 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2.0 అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వాటి కంటే ఎక్కువగా లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గృహ నిర్మాణానికి నిధులు సైతం పెంచుతామన్నారు. కానీ, ఇప్పటి వరకూ ఈ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. దీనిపై కూటమి నేతలు నోరు మెదపడం లేదు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలంటే ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పాత్ర కీలకం. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం వారికి అత్యంత ప్రాధాన్యం కల్పించింది. లే అవుట్లలో పర్యటించడం, లబ్ధిదారులతో పనుల పర్యవేక్షణ, బిల్లుల చెల్లింపునకు వెబ్సైట్లో గృహాల పురోగతి నమోదు చేయడం వంటి పనులు వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో కృషి చేస్తేనే కానీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాకారం కావు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం మొక్కుబడి సమావేశాలకు మాత్రమే పరిమితం చేస్తూండటంపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పీఎంఏవైపై గందరగోళం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద పేదలు నిర్మించుకుంటున్న ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు వచ్చే ఏడాది మార్చి తర్వాత కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వదు. జిల్లా అధికార యంత్రాంగానికి పంపిన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకునేలా హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మండలాల వారీగా గృహ నిర్మాణాల లక్ష్యం, సాధించిన వివరాలు మండలం గృహ సాధించింది నిర్మాణ లక్ష్యం అనపర్తి 1,210 161 బిక్కవోలు 999 202 గోకవరం 178 133 కడియం 262 109 కోరుకొండ 239 168 రాజమహేంద్రవరం రూరల్ 251 108 రాజానగరం 214 183 రంగంపేట 158 128 సీతానగరం 145 89 చాగల్లు 203 135 దేవరపల్లి 742 483 గోపాలపురం 587 347 నల్లజర్ల 511 407 నిడదవోలు 305 218 తాళ్లపూడి 343 151 ఉండ్రాజవరం 187 125 నిడదవోలు అర్బన్ 285 214 వైఎస్సార్ సీపీ పాలనలో... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 431 లే అవుట్లలో 65,075 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో 47,053 ఇళ్లు, ప్రైవేటు స్థలాల్లో 18,022 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికారు. ఇళ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. నిరంతరాయంగా సాగింది. సకాలంలో బిల్లులు రావడంతో లబ్ధిదారులు త్వరితగతిన పనులు చేపట్టారు. ఇప్పటి వరకూ 25,316 ఇళ్లు అన్ని హంగులతో పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలు సైతం జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. -
నేత్రపర్వం.. నృత్యాభినయం
● 9 గంటల పాటు పోటీ పడిన కళాకారులు ● కొనసాగుతున్న అంతర్జాతీయ సంగీత ఫెస్ట్ ● గోదారి తీరాన రికార్డుల జడి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వంద మయూరాలు పురి విప్పి ఒక్కచోట చేరి నర్తించినట్టు.. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం సంగీత నృత్యానంద లహరిలో ఓలలాడింది. సప్త స్వరాల సమ్మేళనంతో వీనుల విందైన గళ మాధుర్యం.. అద్భుత ఆహార్యంతో చూపులు తిప్పుకోలేనంత నేత్రపర్వంగా సాగిన కళాకారుల లాస్య విన్యాసం.. ప్రేక్షకులను, కళాభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. అంతర్జాతీయ సంగీత ఫెస్ట్–2025లో భాగంగా శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన రెండో రోజు కళాసమ్మేళన్ వైభవంగా కొనసాగింది. నెమలిక నేర్పిన నడకలివీ అన్నట్టుగా.. నృత్య కళాకారులు.. సుస్వర గాత్రంతో గాయకులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఈ సంగీత, నృత్య సంగ్రామంలో ఇరువురూ సమ ఉజ్జీలుగా నిలిచి ప్రేక్షకుల మనసుల్ని దోచారు. 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లు గురువాష్టకంతో పాటు మీనాక్షీ పంచరత్నంలోని శ్లోకాలకు తొమ్మిది మంది గాత్రదానం చేశారు. వారి స్వరాలాపనకు అనుగుణంగా 125 మంది నృత్యకారిణులు పదజతులు కలిపారు. మొత్తం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకన్ల పాటు నిర్విరామంగా సాగిన ఈ అపూర్వ సంగీత, నృత్య సమ్మేళనం అనేక ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ పినాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దక్కించుకుంది. మరికొన్ని రికార్డులు కూడా పరిశీలనలో ఉన్నాయి. రెండో రోజు కళా సమ్మేళన్ను విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉదయం ప్రారంభించారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల ఆత్మశాంతికి కళాకారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సాయంత్రం రుక్మిణీ కల్యాణం నృత్య రూపకం అనంతరం కేరళ సంప్రదాయ నృత్యం మోహినీ అట్టంను చిన్నారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు గుంటూరు తాళ్లపాలెంలోని శ్రీ శివక్షేత్రం పీఠాధిపతులు శివస్వామీజీ సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వనాథ్, రోషన్ గుప్తా, చందన్ చౌబే, కుషాల్ భట్టాచార్య (కోల్కతా), కృష్ణభగవాన్, పోతిన శ్రీనివాస్ తదితరులను సత్కరించారు. -
పారిశుధ్య నిర్వహణకు రీ టెండర్లు
● దేవదాయ శాఖ నోటిఫికేషన్ ● దాఖలుకు 26 వరకూ గడువు ● వచ్చే నెల మొదటి వారంలో ఖరారయ్యే చాన్స్ అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణకు దేవదాయ శాఖ సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. శానిటరీ మెటీరియల్ సహా పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రోడ్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనుల నిర్వహణకు ఈ టెండర్ పిలిచారు. గత ఏప్రిల్లో పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో తాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కొటేషన్ల దాఖలుకు జూన్ 26 చివరి తేదీగా నిర్ణయించారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు ఖరారు చేస్తారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో రెండేళ్ల కాలపరిమితితో ఆగస్టు 1 నుంచి పారిశుధ్య పనులు ప్రారంభిస్తుంది. నెలల తరబడి జాప్యం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏ దేవస్థానానికి ఆ దేవస్థానంలో శానిటేషన్ టెండర్లు పిలిచి ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే టెండర్ పిలవాలని గత ఏడాది ఆగస్టు 27న నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, దీని అమలులో దాదాపు పది నెలలు ఆలస్యం చేశారు. గత ఏడాది నవంబర్ వరకూ అన్నవరం దేవస్థానంలో హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్ధ శానిటేషన్ విధులు నిర్వహించేది. ఆ సంస్థ కాంట్రాక్ట్ గత నవంబరుతో ముగిసింది. ఆ గడువుకు నెల రోజులు ముందే గత అక్టోబర్లో టెండర్ ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే, టెండర్లు పిలవడం ఆలస్యమవడంతో దేవస్థానం కోరిక మేరకు గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఆ సంస్ధ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి 1 నుంచి ఎటువంటి టెండరూ పిలవకుండా గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్కు తాత్కాలికంగా అప్పగించారు. శానిటరీ మెటీరియల్ మాత్రం దేవస్థానమే అందిస్తోంది. రూ.80 లక్షలకు పెరిగే అవకాశం దేవస్థానంలో గతంలో పారిశుధ్య పనులు నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్ధకు నెలకు రూ.49 లక్షలకు టెండర్ ఖరారైంది. అనంతరం తాత్కాలిక వచ్చిన కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలు, మరో రూ.12 లక్షలు మెటీరియల్కు కలిపి మొత్తం రూ.71 లక్షలు చెల్లిస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి పిలిచిన సెంట్రలైజ్డ్ టెండర్లో పారిశుధ్య పనుల్లో అత్యాధునిక యంత్రాలు ఉపయోగించాలనే షరతు విధించారు. అలాగే, శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు చెల్లించాలని, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్లుగా మరి కొంత మందిని నియమించాలని షరతు పెట్టారు. అలాగే, ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఇవన్నీ కలిపితే అన్నవరం దేవస్థానంలో నెలకు రూ.80 లక్షల వరకూ ఆయా సంస్ధలు కోట్ చేసే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. -
ఘనంగా చండీ హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీ హోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. తరువాత వాటిని భక్తులకు పంపిణీ చేశారు. చండీహోమంలో 30 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. వేద పండితులు వేదుల సూర్యనారాయణ, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ప్రధానాలయంలో సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యాన, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. వాడపల్లి వెంకన్న అన్నదాన భవనానికి విరాళాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో వకుళమాత అన్నప్రసాద భవనం నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా అమలాపురానికి చెందిన వరదా శశికుమార్, సూర్య నాగ వెంకట అమృత దంపతులు రూ.1,01,116, విజయవాడకు చెందిన పచ్చిపులుసు రామకృష్ణ, లీలా శ్రీనిర్మలాకుమారి దంపతులు రూ.51,116, కాకినాడ రూరల్ కరప గ్రామానికి చెందిన గొర్రెల సాయి వెంకట వంశీ, వారి కుటుంబ సభ్యులు రూ 50,116 చొప్పున విరాళాలుగా సమర్పించారు. వారికి స్వామివారి చిత్రపటాన్ని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది అందజేశారు. -
ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న బీఎస్ఎఫ్ ఆర్ఎస్సైకి సన్మానం
కాకినాడ రూరల్: ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న బీఎస్ఎఫ్ ఆర్ఎస్సై ఆర్.దేవానందంను కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు, సిబ్బందితో కలిసి సన్మానించారు. ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న దేవానందం అల్లుడి ఇంటికి రావడంతో విషయం తెలుసుకున్న కమాండెంట్ నాగేంద్రరావు పిలిపించి సన్మించారు. దేశానికి సేవ చసిన మహనీయుడిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీఎస్ఎఫ్ ఆర్ఎస్సై దేవానందం మాట్లాడుతూ బీఎస్ఎఫ్లో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, ఆపరేషన్ సిందూర్లో తన వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ మోహన్రావు, చంద్రశేఖరరావు, రాము పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న లారీ
● 11 మందికి తీవ్ర గాయాలు ● రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు దేవరపల్లి: జాతీయ రహదారిపై గుండుగొలను–కొవ్వూరు మధ్య శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరంలోని సీతంపేటకు చెందిన 11 మంది ఆటోలో శుక్రవారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని 11 మంది తీవ్రంగా గాయపడగా, హైవే అంబులెన్స్లో గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియవలసి ఉంది. గాయపడిన వారిలో పలువురు మహిళలు ఉన్నారు. -
రక్తం పంచి..ఆయువు పెంచి..
● ఆపదలో ఆదుకుంటున్న పలువురు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రాయవరం: రక్తదానం మహోన్నతం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ప్రాణ బంధువులే. ఏ బంధం లేకున్నా మానవీయ కోణంలో స్పందించే తీరు ఐక్యతను చాటుతుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి, శస్త్ర చికిత్స అవసరమైన వారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ఆప్తులకు మించిన వారుగా చెప్పవచ్చు. రక్తం అవసరం ఉందనే విషయం వాట్సాప్, వివిధ రకాల సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. అన్ని దానాల్లోకెల్లా మిన్న అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అంటారు. కాని నేడు అదే మాటను అన్ని దానాల్లోకల్లా రక్తదానం మిన్న అని చెప్పుకోవాల్సి వస్తుంది. అన్నదానం చేస్తే ఒక్క పూట కడుపు నిండుతుంది. కాని రక్తదానం చేస్తే..ఒక ప్రాణం నిలబడుతుంది. ఒకప్పుడు రక్తదానం చేస్తే నీరసించి పోతారని, పాడైపోతారనే అపోహలు ప్రజల్లో ఉండేవి. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేక పోయారు. రక్తాన్ని కేవలం దానం చేయడం ద్వారా మాత్రమే సేకరించగలుగుతున్నారు. రక్తం అందుబాటులో లేక పలువురు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. రక్తం లభ్యమైన సందర్భాల్లో కొందరు ప్రాణాపాయం నుంచి బయట పడిన సందర్భాలు ఉన్నాయి. రక్తదాతలలకు అవగాహన మరింత కల్పించాల్సిన అవసరం ఉంది. రక్తదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోరాదు. మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదాన సమయంలో కేవలం 350మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. అందువల్ల ఎటువంటి హాని కలగదు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమే. రక్తదానానికి ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. రక్తదానం చేస్తే హిమోగ్లోబిన్ శాతం పడిపోతుందనేది కూడా అపోహే అంటున్నారు వైద్యులు. రక్తదానానికి అర్హతలు ● 18 నుంచి 60 ఏళ్ల లోపు సీ్త్ర, పురుషులు ఎవరైనా రక్తాన్ని దానం చేయవచ్చు. ● మూడు నెలల వ్యవధితో రక్తదానం చేయవచ్చు. ● రక్తదానం చేయడానికి 12గంటల ముందు తర్వాత ఆల్కహాల్ తీసుకోరాదు. ● రక్తదానం చేసే వారు 45 కేజీల పైబడి బరువును కలిగి ఉండాలి. ● సీ్త్రలు రుతుక్రమం సమయంలో, గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు పాలివ్వడం ఆపేంత వరకు రక్తదానం చేయరాదు. ● రక్తంలో హిమోగ్లోబిన్ కనీసం 12.5 గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలి. రక్తంలో ఏం ఉంటాయి? రక్తంలో 55శాతం ప్లాస్మా, 45శాతం సెల్స్ ఉంటాయి. ప్లాస్మాలో 91శాతం నీరు, 8శాతం ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఒక శాతం ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. సెల్స్లో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఒక మైక్రో లీటరు రక్తంలో 5.6 మిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఒక మైక్రో లీటరు రక్తంలో 11వేల వరకు తెల్ల రక్తకణాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్ సరఫరాకు తోడ్పడతాయి. తెల్ల రక్తకణాలు శరీరంలో ఉండి రోగకారక క్రిములపై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి. 1.5 నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ కణాలు రక్తం గడ్డకట్టడానికి సహకరిస్తాయి. జిల్లాలో పరిస్థితి ఇదీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రాజోలులో బ్లడ్ బ్యాంకులున్నాయి. కొత్తపేట, పి.గన్నవరం, మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం, ముమ్మిడివరం, అల్లవరం, టి.కొత్తపల్లి పీహెచ్సీల్లో బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి. ఏడాదికి వలంటీర్ బ్లడ్ డోనర్స్ నుంచి 18వేల యూనిట్ల రక్తాన్ని జిల్లావ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 31 వరకు 1,093 ప్రసవాలు జరగ్గా 706 సిజేరియన్స్ నిర్వహించారు. వందల సఖ్యంలో మేజర్, మైనర్ శస్త్ర చికిత్సలు చేశారు. ప్రసవాలు, ప్రమాదాలు, అత్యవసర శస్త్ర చికిత్సలు సమయంలో రక్తాన్ని వినియోగిస్తున్నారు. అరుదైన బ్లడ్ గ్రూప్ల డోనర్స్ వివరాలను జిల్లా రక్తనిధి కేంద్రం సిబ్బంది సేకరించి, ఆ వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వీరి ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో రక్త కొరత లేదని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ కె.కార్తీక్ తెలిపారు. కళాశాలల్లో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, రాజకీయ సంస్థలకు చెందినవారికి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నారు. 23 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నా.. 2002 నుంచి రక్తదానం చేస్తూ ఇతరులను ప్రోత్సహిస్తున్నాను. ప్రస్తుతం తూర్పుగోదావరి వలంటరీ బ్లడ్ అండ్ ఐ డోనర్స్ క్లబ్ పేరుతో రక్తదానం చేస్తున్నాం. ఈ క్లబ్లో రోజువారీ కూలీలతో పాటు ఆటోడ్రైవర్లు, పలు వృత్తుల్లో కొనసాగుతున్న 1,500 మంది సభ్యులుగా ఉన్నారు. మా సంస్థ ద్వారా ఇప్పటి వరకు 38 బ్లడ్ క్యాంపుల ద్వారా రక్తాన్ని సేకరించి, రోటరీ, రెడ్క్రాస్ వంటి సంస్థలకు అందజేశాం. – వెలగల ఫణికష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వలంటరీ బ్లడ్అండ్ఐ బ్యాంక్ చైర్మన్, రాయవరం ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ప్రోత్సహించడం వలన ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడినవారవుతారు. ప్రతి నెలా స్వచ్ఛంధ సంస్థల నుంచి, దాతల నుంచి రక్తాన్ని సేకరించి భద్రపరుస్తాం. అత్యవసర సమయాల్లో అవసరమైన వారికి అందిస్తున్నాం. – డాక్టర్ పి.అన్నపూర్ణ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పెథాలజీ), ఏరియా ఆస్పత్రి, అమలాపురం అరుదైన బ్లడ్ గ్రూపులు కొందరు అరుదైన బ్లడ్ గ్రూపులు కలిగి ఉంటారు. అటువంటి వారికి రక్తం అవసరమైన సందర్భంలో అదే గ్రూపు రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ, ఏబీ, బీ, ఓ నెగిటివ్ గ్రూపులు అరుదైన గ్రూపులు. ఇటువంటి గ్రూపులకు చెందిన వ్యక్తులు ప్రమాదాలకు గురైనప్పుడు అరుదైన బ్లడ్ గ్రూపుల వారి నుంచి సేకరించిన రక్తాన్నే అందజేయాల్సి ఉంటుంది. అనర్హులు ఎవరంటే... సాధారణంగా రక్తదానం శ్వాసకోశ వ్యాధులున్న వారు, క్యాన్సర్, గుండెజబ్బులు, బరువు తగ్గడం, డయాబెటిక్, హెపటైటిస్, ఆస్తమా, ఎపిలెప్సీ, కాలేయ వ్యాధులు, ఎండోక్రైన్ సమస్యలు, ఎయిడ్స్ లక్షణాలు కలిగిన వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయరాదు. మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులకు చికిత్స పొందిన వారు శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు, రక్తదానం పొందినవారు కనీసం ఏడాది వరకు రక్తదానం చేయడానికి వీలులేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి అస్వస్థత కలిగిన వారు, ఏదైనా చికిత్సలో భాగంగా మందులు వాడుతున్న వారు ఆ విషయాల్ని వైద్యులకు చెబితే వారు ఎప్పటి వరకు రక్తదానం చేయరాదన్న విషయాన్ని చెబుతారు. రోగుల సేవలో తరిస్తూ.. కొత్తపేట: అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ 15 ఏళ్ల ప్రాయం నుంచీ సైకిల్పై మొక్కలు వ్యాపారం చేసేవాడు. ఒకసారి కడియపులంక నుంచి మొక్కలు తెచ్చుకుంటుండగా రావులపాలెం వద్ద లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావమై ఇబ్బంది పడ్డాడు. కొంత కాలానికి కోలుకుని బతికి బయటపడ్డాడు. తరువాత నుంచి కొత్తపేటలో స్వామి వివేకానంద యోగాశ్రమం, హనుమాన్ వ్యాయామ కళాశాల నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచీ తాను స్వయంగా 24 సార్లు రక్తదానం చేయగా, తన సంస్థల స్టూడెంట్స్, దాతల సహకారంతో రక్తదానం చేయిస్తున్నారు. రక్తం అవసరమైన రోగుల బంధువులు రక్తం కోసం సంప్రదించినప్పుడు సాధ్యం కాదు అనే మాట రాకుండా రక్తం ఇప్పిస్తున్నారు. ఇతర జిల్లాలకు సైతం తీసుకువెళ్లి... స్థానికులకే కాక స్థానికేతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు సైతం రక్తదాతలను తీసుకువెళ్లి రక్తదానం చేయిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం బ్లడ్ బ్యాంకుల ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లి రక్తదానం చేయించి సేవా సంస్థలు, ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. -
తండ్రి మందలించాడని ఆత్మహత్య
కొత్తపేట: తండ్రి మందలించాడని మనస్తాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై జీ సురేంద్ర శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని పలివెలశేరేపాలెం గ్రామానికి చెందిన తులా రాంబాబు కుమారుడైన సతీష్ (31) గురువారం పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తున్న సమయంలో పనికి వెళ్లగా వచ్చిన డబ్బు ఇంట్లో ఇవ్వకుండా రోజూ మద్యం తాగుతున్నావని తండ్రి రాంబాబు మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన సతీష్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొంతసేపటి తరువాత గదిలోంచి శబ్దం రావడంతో తండ్రి రాంబాబు కిటికీలోంచి చూడగా మంచంపైన ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని వేళ్లాడుతున్నాడు. స్థానికుల సాయంతో తలుపుతీసి సతీష్ను కిందికి దించి చూడగా స్పృహలో లేకపోవడంతో వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వై ద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. కాగా సతీష్కు వివాహం కాలేదు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. -
సముద్రంలో గల్లంతైన బాలుడి మృతి
కాకినాడ రూరల్: కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డులో రూరల్ మండల పరిధిలో నేమాం రాళ్ల బీచ్ వద్ద గురువారం సాయంత్రం స్థానం కోసం దిగి గల్లంతైన జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బాలుడు సముద్రాల పార్దు(17) మృతి చెందాడు. తిమ్మాపురం పోలీసుల వివరాలు ప్రకారం పార్ధు, అతని స్నేహితులు నిడదవోలుకు చెందిన నారపురెడ్డి దుర్గాప్రసాద్, జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం మండలానికి చెందిన కేతామోహన్ కలిసి బైక్పై గురువారం సాయంత్రం కాకినాడ బీచ్కు వచ్చారు. స్టోన్ బీచ్ వద్ద సాయంత్రం 4.30గంటల సమయంలో పార్ధు, దుర్గా ప్రసాద్ స్నానం చేస్తుండగా మోహన్ ఫొటోలు తీశాడు. ఆ సమయంలో పార్థు బలమైన అలలకు కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం 11గంటలకు ఘటన స్థలం సమీపంలోనే బాలుడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గణేష్కుమార్ తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై పోక్సో కేసు
● బాలికను మోసగించి ముఖం చాటేసిన వైనం ● అబార్షన్ చేయించిన నిందితుడు ● కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై పోక్సో కేసు నమోదు అయింది. అతను బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఏడు నెలల గర్భవతిగా ఉన్న ఆమెకు అబార్షన్ చేయించిన అతనిపై బాధితురాలు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలతో కలిసి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ దానివంటూ దూషిస్తున్నాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేశారని బాధితురాలు ఆరోపించారు. రాజమహేంద్రవరం మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ 2022 నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసగించాడు. 2024 నవంబర్ నెలలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ బాలిక 6వ నెల గర్భవతి అని నిర్ధారించారు. ఈ మేరకు పులపర్తి సత్యదేవ్ వద్దకు వెళ్లి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు అడిగారు. అయితే నేను ఇప్పుడు అయ్యప్పస్వామి మాలలో ఉన్నాను. మాల తీసే లోపు మీ అమ్మాయికి అబార్షన్ చేయించమని కోరాడు. దీంతో 2024 డిసెంబర్ 17న బాలికకు ధవళేశ్వరంలోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు. అనంతరం పెళ్లి చేసుకోమని అడుగగా అప్పటి నుంచి సత్యదేవ్ ఆచూకీ తెలియలేదని, ఈ మేరకు న్యాయం చేయాలని బొమ్మూరు పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయండి గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన నిందితుడు పులవర్తి సత్యదేవ్పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి తదితరులు తూర్పుజోన్ డీఎస్పీ విద్య, బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ను కోరారు. బాధితురాలితో కలిసి పోలీసు అధికారులను కలిసి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర తెలికులగాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిన భవానిప్రియ, మహిళా నేతలు పాల్గొన్నారు. మానవతా దృక్పథంతోనే కేసు నమోదు ఆలస్యం : డీఎస్పీ విద్య మానవతా దృక్పథంతోనే బాధితురాలు కోరిక మేరకు కేసు నమోదు ఆలస్యమైందని తూర్పుజోన్ డీఎస్పీ బి.విద్య అన్నారు. శుక్రవారం బొమ్మూరు పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 4వ తేదీన బాధితురాలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిందన్నారు. జిల్లా వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య బాధితురాలిని బొమ్మూరు పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారన్నారు. ఆ సమయంలో ఆమెకు తాను, సౌజన్య కౌన్సెలింగ్ ఇచ్చామని, సత్యదేవ్తో తనకు వివాహం జరిపించాలని కోరిందన్నారు. దీంతో సత్యదేవ్ను, అతని బాబాయిని పిలిచి మాట్లాడామన్నారు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని, పదిరోజులు సమయం కావాలని కోరారన్నారు. పదిరోజులు కుదరదు ఏడురోజులలో విషయం తెలపాలని ఇద్దరికీ చెప్పామన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవ్పై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. అబార్షన్ చేసిన ఆసుపత్రిపై చర్యలు ఉంటాయన్నారు. సత్యదేవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. బొమ్మూరు పీఎస్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథం, వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య పాల్గొన్నారు. -
విద్యార్థులకు కిట్కట
● ప్రచారార్భాటానబడిసాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలకుల మాటలు కోటలు దాటేస్తున్నాయి. పనులు మాత్రం గుమ్మం కూడా దాటడం లేదు. అధికారం కోసం ఎన్నికల్లో ఎడాపెడా ఇచ్చిన హామీల అమలు మొదలుకుని అన్నింటా పాలనలో తిరోగమనమే కనిపిస్తోంది. చివరకు గత జగన్ పాలనలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విద్యపై కూడా ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. వేసవి సెలవుల తరువాత ప్రభుత్వ పాఠశాలలు గురువారం తెరచుకున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు.. ఇలా అన్నీ కలిపిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (ఎస్ఆర్కేవీఎం) కిట్లు అందజేసినట్టు విద్యా శాఖా మంత్రి లోకేష్ను సామాజిక మాధ్యమాల్లో ఆహా ఓహో అంటూ భజన బృందం పొగడ్తలతో ముంచెత్తుతోంది. అయితే, వందిమాగధుల ప్రచారంలో వాస్తవం లేదని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కిట్ల పంపిణీని పరిశీలిస్తే అర్థమవుతోంది. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ప్రచారం చేయడంలో దిట్ట అయిన చినబాబు అనుచరగణం విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు పంపిణీ చేయకుండానే చేసినట్టు ప్రచారార్భాటం చేస్తోంది. ప్రభుత్వం విఫలం సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్లు, స్కూల్ బ్యాగ్, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు కలిపి ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువైన విద్యార్థి మిత్ర కిట్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విద్యార్థిని కదిపినా బూట్లు రాలేదని, బ్యాగ్లు, యూనిఫాం ఇవ్వలేదనే చెబుతున్నారు. పుస్తకాలు మినహా కిట్లో మిగిలిన ఏ ఒక్కటీ విద్యార్థులకు చేరలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు అందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. బాబు పాలనలో ఎప్పుడూ ఇంతే.. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఇలానే జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. ఆ సమయానికి విద్యార్థులకు పుస్తకాలతో పాటు బూట్లు, యూనిఫాం అందజేసేందుకు ముందస్తు ప్రణాళిక ఉండదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో సగం విద్యా సంవత్సరం ముగిసినా ప్రభుత్వ బడులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అప్పట్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు మాత్రమే ఇచ్చేవారు.తూర్పుగోదావరి జిల్లాలో.. ● జిల్లాలోని 19 మండలాల్లో అన్ని రకాల పాఠశాలలూ కలిపి 984 ఉన్నాయి. వీటిల్లో 44,771 మంది బాలు రు, 49,583 మంది బాలికలు చదువుతున్నారు. ● జిల్లాకు పాఠ్య పుస్తకాలు 4,14,529, వర్క్ బుక్స్ 76,662, నోట్ బుక్స్ 6,62,952, డిక్షనరీలు 14,947, బెల్టులు 61,548 వచ్చాయి. ● మొత్తం విద్యార్థులకు 94,354 బ్యాగ్లు రావాల్సి ఉండగా 67,158 మాత్రమే వచ్చాయి. ● 94,548 బూట్లు రావాల్సి ఉండగా 84,726 మాత్రమే వచ్చాయి. ● 94,354 యూనిఫాంలు రావాల్సి ఉండగా 50,549 మాత్రమే వచ్చాయి. రాజమహేంద్రవరంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులుజగన్ హయాంలో.. చంద్రబాబు పాలనకు భిన్నంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లల విద్యకు పెద్దపీట వేశారు. బడి వైపు వారిని మరింతగా ప్రోత్సహించేలా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. గతంలో మాదిరిగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లతో పాటు అదనంగా విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, బెల్టు, బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు జత చేసి ఇచ్చారు. పాఠశాలలు తెరచిన రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రమం తప్పకుండా అందజేసేవారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పాఠశాలలు తెరచిన రోజున విద్యా కానుక అందజేశారు. ఈసారి అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలనలో కిట్ల పంపిణీ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో వచ్చిన కిట్లను కూడా విద్యార్థులకు అందజేయకుండా ఆపేశారు. దీనిపై అడిగితే మెగా పేరెంట్స్ మీట్లు పెట్టి అందజేస్తామంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ కిట్ల పంపిణీని ప్రచారార్భాటానికి వాడుకోవాలనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారంభమైన పాఠశాలలు పుస్తకాలకే ‘విద్యార్థి మిత్ర’ కిట్ పరిమితం బూట్లు, బ్యాగులు, యూనిఫాం లేవు ఇతర వస్తువుల ఊసే లేదు కూటమి సర్కారు వైఫల్యం -
పుష్కర్ఘాట్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక పుష్కర్ఘాట్ వద్దనున్న గోదావరి నదిలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు వయసుగల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. 5.5 అడుగుల ఎత్తు ఉండగా మృతదేహంపై నీలం రంగు షర్ట్ ఉంది. ఎడమపాదానికి నలుపురంగు కాశీతాడు ఉంది. కుడిచేయి మణికట్టుకు నలుపురంగు పూసలతాడు, కుడిచేయి మణికట్టు వద్ద కాషాయ రంగు తాడు కట్టి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ 9989786529, 9440796532 నంబర్లలో తెలపాలన్నారు.గుర్తు తెలియని మృతదేహం స్వాధీనంతాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ విశ్వం తెలిపిన వివరాల ప్రకారం కొవ్వూరు లాంచీల రేవు వద్ద గోదావరిలో 40 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఆర్డీని కలిసిన ఏపీ ఎన్జీవో నేతలుఆఫీస్ బేరర్ అయినప్పటి నుంచే లెక్కించాలని వినతికాకినాడ క్రైం: ఆఫీస్ బేరర్లకు ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిదేళ్ల మినహాయింపును ఆఫీస్ బేరర్గా చేరినప్పటి నుంచి మాత్రమే లెక్కించాలని కోరుతూ జోన్–2 ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు గురువారం సాయంత్రం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పద్మాశశిధర్ను రాజమహేంద్రవరంలోని ఆర్డీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. స్టేషన్ సీనియారిటీ పరిగణించరనే విషయాన్ని ప్రభుత్వం జీఏడీ సర్కులర్ ద్వారా తెలియజేసిందని పేర్కొన్నారు. సదరు పత్రాలను ఆర్డీకి అందజేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టడంతో పాటు మినహాయింపులను పరిగణించాలని కోరారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహన్ అధ్యక్షతన రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్, చోడిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, కృష్ణాజిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి నేరుసు రామారావు, ఉమ్మడి తూర్పుగోదావరి సహ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మినీస్టిరియల్ సంఘ అధ్యక్షుడు వీరాజీ, రాజమహేంద్రవరం యూనిట్ సహ అధ్యక్షుడు అనిల్తో పాటు వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
భక్తుల అసంతృప్తికి బాధ్యులెవరు?
గత ప్రభుత్వంలో ఇలా.. గతం లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేవస్థానంలో సుమారు రూ.30 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. 50 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వారికి 30 నుంచి 40 శాతం పారితోషికం పెంచారు. భక్తుల సదుపాయాలకు పెద్ద పీట వేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించి భక్తుల అసంతృప్తిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అన్నవరం: సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన భక్తులను అన్ని విభాగాల్లోనూ అసంతృప్తి వెంటాడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం చేసిన సర్వేలలో వెల్లడవుతున్న నిజం. రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నుంచి వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలలో భక్తుల అభిప్రాయాలను సేకరిస్తుండగా ఏ నెలలో కూడా అన్నవరం దేవస్థానం టాప్ వన్ స్థానంలో లేకపోవడం విశేషం. తాజాగా ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 25 వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన భక్తుల్లో 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. ఒకప్పుడు ఎంతో గొప్ప అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయమంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఉత్తరాన పంపా నది, పచ్చని రత్నగిరి, సత్యగిరి కొండలపై వెలసిన అనంతలక్ష్మీ సత్యవతీ సమేత సత్యదేవుడు, నిత్యకల్యాణం పచ్చతోరణంలా విలసిల్లే ఆలయం, కమ్మని సత్యదేవుని ప్రసాదం, ఎక్కడ చూసినా అద్దంలా దర్శనమిచ్చే ఆలయ ప్రాంగణం, భక్తులకు గౌరవ మర్యాదలతో సిబ్బంది సేవలు ఇలా ఉండేది. నేడు సిబ్బందికి, ఈఓకు మధ్య కుదరని సమన్వయం, క్షేత్రస్థాయిలో పర్యటించని ఈఓ, ఆయన వ్యవహారశైలిపై అధికారుల అసంతృప్తి, వీటిపై మీడియాలో వచ్చిన కథనాలపై అడిషనల్ కమిషనర్ నివేదిక సమర్పించినా దానిపై ఏ విధమైన స్పందన లేని వైనం ఇలా అంతా అందరిదీ తలో దారి అన్నట్టు తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మే లో పెరిగిన భక్తుల అసంతృప్తి రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో జనవరిలో సేకరించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం ఏడో ర్యాంకులో నిలిచింది. ఫిబ్రవరిలో సేకరించిన అభిప్రాయ సేకరణలో రెండో ర్యాంకు వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలో సర్వేలలో భక్తుల అసంతృప్తి 30, 31శాతంగా నమోదైంది. మే నెలలో ఇది 35 శాతానికి చేరింది. ఏప్రిల్ 30– మే 25 మధ్య అభిప్రాయాల సేకరణ దేవస్థానాలు భక్తులకు అందిస్తున్న సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నావళి ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం , తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కనకదుర్గ గుడి, విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ నృశింహస్వామి దేవస్థానం, నంద్యాలలోని శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానం, అన్నవరంలోని సత్యనారాయణ స్వామివారి దేవస్థానాల్లో భక్తుల అభిప్రాయాలు సేకరించింది. దర్శనంపై 32 శాతం అసంతృప్తి సత్యదేవుని దర్శనం సకాలంలో జరిగిందా అనే దానికి 68 శాతం మంది భక్తులు అవునని సమాధానం చెప్పగా 32 శాతం మంది కాలేదని చెప్పారు. దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూమ్స్, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు, తదితర విషయాలపై 61 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యత విషయాలలో 78 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యంపై 64 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యత ప్రభుత్వానిదా.. అధికారులదా? అన్నవరంలో పరిస్థితి దిగజారడానికి బాధ్యత ఎవరిది అనే చర్చ నడుస్తోంది. ఒక నెలలో అసంతృప్తి ఉంటే తరువాత నెల మార్పు వచ్చేలా చేయాలి. కాని అదే అసంతృప్తి కొనసాగుతుంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అనే అభిప్రాయం వినిపిస్తోంది. పరిస్థితి చక్కదిద్దాలని కలెక్టర్ ప్రయత్నించినా.... జనవరిలో ఏడో ర్యాంకు రావడంతో కలెక్టర్ షణ్మోహన్ ఫిబ్రవరిలో దేవస్థానానికి వచ్చి అన్ని విభాగాల పర్యవేక్షించి పలు చర్యలు తీసుకున్నారు. అన్నదానంలో సిట్టింగ్తో బాటు బఫే పద్ధతిలో కూడా భోజనాలు పెట్టేలా చర్యలు తీసుకున్నారు. సత్రాలలో గదులు భక్తులకు అద్దెకివ్వాలని, బ్లాక్ చేసి దళారీల ద్వారా అమ్ముకోవద్దని హెచ్చరించారు. ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ కోసం వైఫై ఏర్పాటు చేసి దర్శనం, సేవా టిక్కెట్ల కొనుగోలు, సత్రాలలో గదులు అద్దెకిచ్చేలా ఏర్పాటు చేశారు. పారిశుధ్యం మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆ నెలకే అదంతా అమలైంది. భక్తుల అసంతృప్తికి కారణాలివీ... పనితీరు మార్చుకోని అధికారులా? విమర్శలొచ్చినా పట్టించుకోని ప్రభుత్వమా? మెరుగుపడని అన్నవరం దేవస్థానంలో పరిస్థితులు వైఫే పనిచేయక భక్తులు డిజిటల్ పేమెంట్స్ కోసం ప్రయాస పడాల్సి వస్తోంది. పశ్చిమ రాజగోపురం వద్ద గైడ్లు మళ్లీ చెలరేగి పోతున్నారు. వీరు భక్తులను రూ.వేయి ఇవ్వండి సులభంగా దర్శనం చేయిస్తాం అని చెప్పి దేవస్థానం ఉద్యోగులు, సెక్యూరిటీ వారికి ఆ భక్తులను అప్పగిస్తారు. వారు నేరుగా దేవాలయానికి తీసుకువెళ్లి దర్శనం చేయిస్తారు. గైడ్లు వసూలు చేసిన సొమ్ము సమానంగా పంచుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవస్థానం ఈఓ ఎప్పుడూ ఆలయంలో గంట సేపు ఉన్న దాఖలా లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు నెలలుగా దేవస్థానంలో వివాదాలు లేని నెల లేదంటే ఆశ్చర్యం. ఫిబ్రవరిలో ఉచిత కల్యాణ మండపంలో ఒక సంస్ధ కార్యవర్గం ప్రమాణ స్వీకారం వివాదంగా మారింది. మార్చి నెలలో దేవస్థానంలో చినబాబు హల్చెల్ చేయడం, అదే నెలలో ఏసీ గదులు అద్దెకివ్వడం లేదని ఈఓ చేసిన ప్రకటన వివాదాస్పదం అవడం, ఈఓపై దిగువ స్థాయి అధికారుల అసంతృప్తి, ఈఓపై వచ్చిన విమర్శలపై ఏడీసీ విచారణ, ఏప్రిల్, మే నెలలో శానిటేషన్ సిబ్బంది జీతాల ఆలస్యం, చెత్త ట్రాక్టర్ టెండర్ వివాదం, మేలో కల్యాణోత్సవాలలో వనదుర్గ అమ్మవారికి హోమాలు నిలిపివేయడం, శ్రీపుష్పయాగం రోజు స్వామి, అమ్మవారి అలంకరణ ఆకట్టుకోకోపోవడం ఇలా ఎన్నో వివాదాలు దేవస్థానం ప్రతిష్ఠను పలుచన చేశాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 24,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
విద్యుదాఘాతానికి కార్మికుడి మృతి
దేవరపల్లి: నల్లజర్ల మండలం పోతవరంలో విద్యుదాఘాతానికి గురై ఆయిల్ పామ్ గెలలను చెట్టు నుంచి దించుతున్న కార్మికుడు తిప్పనబోయిన శ్రీనివాసరావు(35) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం నల్లజర్ల మండలంలోని సుభద్రపాలెంకు చెందిన శ్రీనివాసరావు గురువారం ఉదయం పోతవరం శివారులోని ఒక రైతులకు చెందిన పామ్ ఆయిల్ తోటలో గెలలు కోస్తుండగా అతని చేతిలో ఉన్న ఇనుప ఊస ప్రమాదవశాత్తూ పక్కన గల విద్యుత్ తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుధారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
ప్రకృతికి ప్రణామం
● సేంద్రియ సాగుపై రైతు మొగ్గు ● జిల్లాలో లక్ష్యం 47 వేల ఎకరాలు ● 35 వేల ఎకరాల్లో వరి ● 12 వేల ఎకరాల్లో ఇతర పంటలు ● 43 వేల మంది రైతుల ఎంపిక దేవరపల్లి: జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు పలువురు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన పంట దిగుబడులు అందిస్తున్నారు. దిగుబడులు కూడా ఆశాజనకంగా వస్తూండటంతో సేంద్రియ వ్యవసాయం గిట్టుబాటు అవుతోందని చెబుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తూండటంతో జిల్లాలో ప్రకృతి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే సాగు చేస్తున్న వారితో పాటు ఏటా కొత్త రైతులను ప్రకృతి సాగు వైపు అధికారులు, సిబ్బంది మళ్లిస్తున్నారు. ఇదీ ప్రకృతి సాగు లక్ష్యం ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 35 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఉద్యాన, 2 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. దీని కోసం 43 వేల మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కో రైతు అరెకరం నుంచి ఎకరం వరకూ ప్రకృతి సాగు చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నెల 15 నుంచి 30వ తేదీ మధ్య ప్రకృతి సాగు ప్రణాళికకు తుది రూపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 2022–23 ఖరీఫ్లో 19,500 మంది రైతులు 17 వేల ఎకరాల్లో సేంద్రియ వరి సాగు చేశారు. 2023–24 ఖరీఫ్లో 32 వేల మంది 28 వేల ఎకరాల్లోను, గత ఏడాది ఖరీఫ్లో 36 వేల మంది 40 వేల ఎకరాల్లోను ప్రకృతి సాగు చేపట్టారు. నవధాన్యాల విత్తనాలు సరఫరా ప్రకృతి సాగు విధానంలో ఖరీఫ్ ప్రారంభానికి రెండు నెలల ముందు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకుంటే భూసారం పెరిగి ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గుతుంది. దీనికి అవసరమైన నవధాన్యాల విత్తనాలను రైతులకు అధికారులు సరఫరా చేస్తున్నారు. ఐదు జాతుల పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, సుగంధద్రవ్యాలు, 15 నుంచి 20 రకాల నూనె జాతులను అందిస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనం వేసుకోవాలి. విత్తనం వేసిన రెండు నెలల్లో వచ్చిన పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని పంటలు వేసుకోవాలి. దీనివలన ఎకరాకు 10 నుంచి 12 టన్నుల సేంద్రియ ఎరువు తయారవుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకం 40 నుంచి 50 శాతం తగ్గుతుంది. ప్రస్తుత ఖరీఫ్లో పచ్చిరొట్ట పంటల సాగుకు ఎకరాకు 12 కిలోల చొప్పున సుమారు 564 క్వింటాళ్ల నవధాన్యాల విత్తనాలను రైతులకు సరఫరా చేశారు. సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏటా కొత్త రైతులను ఎంపిక చేసి, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచుతున్నాం. – బొర్రా తాతారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, రాజమహేంద్రవరం -
సాంకేతికత సమర్థతే భవిష్యత్ వైద్య రంగం
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య విద్యార్థులు నిర్వహిస్తున్న ఎరెవ్నా 4.0 వైద్య విజ్ఞాన సదస్సు గురువారం జీజీహెచ్ ఎదురుగా ఉన్న ఫార్మకాలజీ లెక్చర్ గ్యాలరీలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.విష్ణువర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ పి.చంద్రశేఖర్ హాజరై, సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ వైద్య రంగం సాంకేతికత, సమర్థతల సమాహారం అని అన్నారు. ఈ రెండూ లేని వారు వైద్యరంగంలో తమ మనుగడను కొనసాగించలేరని తేల్చి చెప్పారు. వైద్య విద్యా అభ్యాస నైపుణ్యాలకు సాంకేతికతను జోడించాలని సూచించారు. లోతైన విశ్లేషణలపై మొగ్గు చూపాలన్నారు. ఓ అనారోగ్యాన్ని సామాన్యుడి దృక్కోణంలోనే మనమూ చూస్తే అభ్యాసనకు అర్థం లేదన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ను వీసీ అభినందించారు. ఈ సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన డీఎంఈ అకడమిక్స్ డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ, నేర్చుకోవడమే వైద్యుడి తపన కావాలని అన్నారు. అటువంటి వారు వైద్య రంగాన్ని శాసిస్తారని చెప్పారు. ప్రయోగాత్మక విద్యాభ్యాసం విషయ అవగహనకు దోహదపడుతుందని, ఎరెవ్నా సదస్సు ఆ దిశగా తోడ్పాటునిస్తుందని అన్నారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ మాట్లాడుతూ తమ భవిత కోసం విద్యార్థులే నిర్వహిస్తున్న ఓ అరుదైన సదస్సు ఇదని వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి మరో విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సీపీఆర్ మేన్ ఆఫ్ ఇండియా, ఐఎస్ఏ రిసక్స్యుయేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సి చక్రరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎంపీఆర్.విఠల్, డాక్టర్ శ్రీనివాసన్, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశితో పాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు. తొలి రోజు 14 వర్క్ షాప్లు నిర్వహించినట్లు కోర్ కమిటీ పేర్కొంది. సదస్సు అనంతరం వీసీ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రఘునందన్, డాక్టర్ విష్ణువర్దన్ సత్కారాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటి వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ఎరెవ్నా వైద్య విజ్ఞాన సదస్సు ప్రారంభం -
హామీల అమలు లేకుండా సంబరాలా?
● ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు? ● కలగానే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ● వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి నేతలు సాక్షి, రాజమహేంద్రవరం: ఏడాదయినా ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల నేతలు విమర్శించారు. తాడితోటలోని సంహిత కన్వెన్షన్ హాలులో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముచ్చకర్ల రవి, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు నల్లమిల్లి విజయారెడ్డి గురువారం ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. యువగళం పాదయాత్ర సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. రెండు లక్షల మంది వలంటీర్లను, బేవరేజెస్ ఉద్యోగులను, ఎండీయూ ఆపరేటర్లను తొలగించి, వారి జీవితాలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడంతో ఏడాదిలో ఒక్కొక్కరు రూ.36 వేల మేర నష్టపోయారన్నారు. ఫీజు రీ యింబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, పరీక్షలకు హాజరు కాలేని దుస్థితి నెలకొందన్నారు. మెగా డీఎస్సీలో 30 వేల పోస్టులని చెప్పి, 16 వేల పోస్టులకు మెగా డీఎస్సీ అని పేరు పెట్టి మోసం చేయడం దారుణమని మండిపడ్డారు. అందరూ చదువుకుని ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో 2004లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీ యింబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఇంటికొక ఇంజినీర్ను తయారు చేశారని, ఈ పథకానికి 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడించిందని అన్నారు. వైఎస్ జగన్ 2019లో సీఎం అయ్యాక ఈ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు చదువులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టి ఏటా రూ.15 వేల చొప్పున అందించారని గుర్తు చేశారు. కూటమి నేతల మోసపూరిత హామీలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే, అరెస్టు చేస్తున్నారని వాపోయారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చేకూరి వీఎస్ రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ అధ్యక్షుడు కొండమీది శ్రీను, గోపాలపురం అధ్యక్షుడు నక్కా నాగ సత్యనారాయణ, అనపర్తి అధ్యక్షుడు పడాల దుర్గారెడ్డి, రాజానగరం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రగడ కల్యాణ్ పాల్గొన్నారు. -
1,268 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: తణుకు నుంచి జగ్గంపేటకు అక్రమంగా రవాణా చేస్తున్న 1,268 కిలోల రేషన్ బియ్యం రాజానగరంలో గురువారం పట్టుబడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వాహనంలో 32 ప్లాస్టిక్ సంచుల్లో మూటలుగా కట్టి రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, స్వాధీన పర్చుకున్నారు. బియ్యం విలువ రూ.58,328 కాగా, వాహనం విలువ రూ.1.50 లక్షలుగా అంచనా వేశామని స్థానిక ఎంఎస్ఓ బాపిరాజు తెలిపారు. వాహన యజమాని అయిన జగ్గంపేటకు చెందిన మారిశెట్టి గణేష్.. డ్రైవర్ జి.సత్తిబాబు సాయంతో ఈ బియ్యాన్ని తరలిస్తున్నాడన్నారు. నిందితులను పోలీసులకు అప్పగించి, 6ఏ కేసు నమోదు చేశామన్నారు. -
తల్లికి వంచనే
తాళ్లపూడి (కొవ్వూరు): ఎటువంటి నిబంధనలూ లేకుండా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఆ మాట తప్పి, తల్లులను మోసం చేశారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు విమర్శించారు. కొవ్వూరులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు అంటేనే మోసానికి, వెన్నుపోటుకు చిరునామా అని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకానికి ‘300 యూనిట్లకు మించి కరెంటు వాడకం’ నిబంధన లేకుండా చేస్తానని ఎన్నికల్లో పదేపదే మాయ మాటలు చెప్పారని, నేడు అదే నిబంధన పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఒక ఇంట్లో ఇద్దరి పేరిట కరెంట్ మీటర్ ఉంటే వేర్వేరుగా లెక్క కట్టాలని, అలా కాకుండా రెండు మీటర్ల నుంచి వాడిన కరెంటు యూనిట్లు లెక్క కడుతున్నారని చెప్పారు. అలాగైతే, ఇళ్లు అద్దెకిచ్చిన వారి పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఎటువంటి నిబంధనలూ విధించబోమన్న మాట తప్పి, తల్లికి వందనం పథకానికి అనేక మందిని దూరం చేసి, డబ్బులు మిగుల్చుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘నీకు రూ.15 వేలు, నీకు 15 వేలు’ అని ఎన్నికల్లో చెప్పి.. ఇప్పుడు రూ.13 వేలు వేస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. ఒక ఇంట్లో ఉన్న ఆధార్ కార్డులన్నింటినీ కలిపి లింక్ పెట్టడం సరికాదన్నారు. తల్లి ఆధార్ కార్డులో ఉన్న వివరాలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా అనర్హులని అంటున్నారని, నిబంధనలు సడలించాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. టెన్త్ సప్లిమెంటరీలో 82.99 శాతం ఉత్తీర్ణత కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో జిల్లా 82.99 శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 3,057 మంది హాజరు కాగా 2,537 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. మార్కుల జాబితాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్.బీఎస్ఈ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫలితాల్లో ఏమైనా అనుమానాలుంటే ఈ నెల 19వ తేదీ రాత్రి 11 గంటల్లోగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి. ఓపెన్ టెన్త్, ఇంటర్లో.. ఓపెన్ స్కూలు టెన్త్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఓపెన్ స్కూలు ఇంటర్ పరీక్షలు 730 మంది రాయగా 371 మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతిలో 460 మంది పరీక్షలు రాయగా 246 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ ఫీజు రూ.200, రీ వెరిఫికేషన్ ఫీజు రూ.1,000 చొప్పున చెల్లించాలి. యోగాంధ్రపై పోటీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమంపై వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్, ఈ కార్యక్రమం జిల్లా నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాటలు, కవితలు, డాక్యుమెంటేషన్పై ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పాటల విభాగంలో విజేతకు రూ.లక్ష, కవితలు, డాక్యుమెంటేషన్ పోటీల విజేతలకు రూ.50 వేల చొప్పున నగదు పురస్కారాలు అందజేస్తామని వి వరించారు. ఈ పోటీల దరఖాస్తులకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ అవకాశం ఉందన్నారు. వచ్చిన దరఖాస్తులను శనివారం ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఎంవీ సుబ్రహ్మణ్యం, హెడ్మాస్టర్, ఎస్కేవీటీ ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం చిరునామాలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వర్షాల హెచ్చరికలతో ఈపీడీసీఎల్ అప్రమత్తం విశాఖ సిటీ: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వినియోగదారులకు 24/7 సేవలందించేందుకు కార్పొరేట్ కార్యాలయంతో పాటు సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎస్ఈలు, ఈఈలను సీఎండీ ఆదేశించారు. అధికారులందరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిబ్బందికి ఎటువంటి సెలవులూ మంజూరు చేయవద్దని సూచించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేసి, సత్వర పరిష్కారం పొందవచ్చని సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కంట్రోల్ రూము నంబర్లు రాజమహేంద్రవరం: 73822 99960 కాకినాడ: 94931 78718 కోనసీమ: 94409 04477 కార్పొరేట్ ఆఫీస్: 1912 -
గోదారి.. కళాఝరి
● ప్రారంభమైన అంతర్జాతీయ కళా సమ్మేళనం ● అలరించిన కళాకారుల నృత్య ప్రదర్శనలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కళలకు కాణాచి అయిన ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన కళాఝరి రసరమ్యంగా ప్రవహించింది. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన స్థానిక ఆనం కళా కేంద్రంలో 43వ కళా సమ్మేళనం–2025 గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతీయ కళా వైభవాన్ని చాటేలా పలువురు చిన్నారులు తొలి రోజు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాల్లో భాగంగా తొమ్మిది మంది సంగీత కళాకారులు వీణానాదంతో అన్నమయ్య కీర్తనలను వీనుల విందుగా వినిపించారు. అలాగే, తమిళనాడుకు చెందిన జానపద కొమ్మి నృత్యాలు, దుర్గ సూక్తం భరతనాట్యం అందరినీ ఆనంద గోదారిలో ఓలలాడించాయి. కళా సమ్మేళనంలో పాల్గొన్న కళాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలి ఈ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపకుడు జీబీ నారాయణ ఇటీవలి కుంభమేళాలో సైతం తన ప్రదర్శనలతో పలువురి మన్ననలు పొందారని గుర్తు చేశారు. నారాయణ కుమార్తె లక్ష్మీ గీతిక చిన్న వయస్సులోనే కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహిని అట్టం వంటి నృత్యాల్లో ప్రతిభ చూపి ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారని, ఆమె మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రాష్ట్రపతి అవార్డు సైతం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రదర్శనలకు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి శనివారం హాజరు కానున్నారని తెలిపారు. నృత్యాలతో అలరించిన చిన్నారులను మంత్రి అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు తీగల రాజా తదితరులు పాల్గొన్నారు. -
బాలికపై అఘాయిత్యం
రాజమహేంద్రవరం సిటీ: ప్రేమ పేరుతో వంచించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బాలికను గర్భిణిని చేసిన యువకుడు చివరకు మోసం చేసిన ఘటన రాజమహేంద్రవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికతో కలసి రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి గురువారం మీడియాతో మాట్లాడారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామానికి చెందిన బాలికను మోరంపూడి ప్రాంతానికి చెందిన యువకుడు పులపర్తి సత్యదేవ్ ప్రేమించానంటూ రెండేళ్లుగా వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ బాలికను లోబరచుకున్నాడు. గత ఏడాది నవంబర్లో వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆ బాలిక 6వ నెల గర్భిణిగా నిర్ధారణ అయ్యింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని, మాల తీసేలోగా బాలికకు అబార్షన్ చేయించాలని చెప్పాడు. ఈ నేపథ్యంలో ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్ 17న ఆ బాలికకు అబార్షన్ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్ నిరాకరిస్తున్నాడు. కులం తక్కువ దానివంటూ దూషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికను పెళ్లి చేసుకోమంటే పెద్దల సమక్షంలో సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధితురాలికి చట్ట ప్రకారం న్యాయం జరగాలని కోరారు. బాలికకు అబార్షన్ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ గాండ్ల, తెలుకుల సంఘం అధ్యక్షురాలు సంకిస భవానీప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి పాల్గొన్నారు.బాలికపై లైంగిక దాడిగర్భం దాల్చడంతో తల్లి ఫిర్యాదునాగలాపురం: తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో 15 ఏళ్ల బాలికపై రెండునెలల క్రితం లైంగిక దాడికి పాల్పడ్డ ఓ వ్యక్తిపై గురువారం పోక్సో కేసు నమోదు చేసినట్లు నిండ్ర సీఐ రవీంద్ర తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం.. పిచ్చాటూరు మండలం, కారూరు దళితవాడకు చెందిన శేఖర్ (55) అనే వ్యక్తి రెండు నెలల క్రితం 15 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అనంతరం.. బాలిక గర్భం దాల్చడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిచ్చాటూరు పోలీసులు బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి రిమాండుకు తరలించినట్లు పిచ్చాటూరు ఎస్ఐ వెంకటేశ్వర్ తెలిపారు. -
పీతల సరఫరాలో ఘరానా మోసం
కాట్రేనికోన: పచ్చ పీత పిల్లలకు సొమ్ము చెల్లిస్తే మండ పీత పిల్లలను అంటగట్టి రైతులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన పల్లం గ్రామంలో చోటు చేసుకుంది. మండలం పల్లం గ్రామానికి చెందిన 26 మంది రైతులు 50 ఎకరాలు పీతల చెరువులు లీజుకు చేస్తున్నారు. పచ్చ పీత పిల్లల కోసం స్థానికం హేచరీ అందుబాటులో లేక పోవడంతో మద్రాసుకు చెందిన హేచరీ నుంచి పీత పిల్లలను పల్లం గ్రామానికి చెందిన పాలెపు శ్రీను, సంగాని సత్యంకు సొమ్ము చెల్లించారు. 26 మంది రైతులు ఒక పీత పిల్లకు రూ.23 చొప్పున 60 వేల పిల్లలకు రూ.14 లక్షలను దళారులు పాలెపు శ్రీను, సంగాని సత్యంలకు చెల్లించారు. అయితే పచ్చ పీత పిల్లలకు బదులు నకిలీ పీతలను (మండ పీతల) సరఫరా చేయడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళ చెరువులో పీత పిల్లలను వదలడం, సీడ్ దశలో ఉండడం వల్ల అసలో నకిలీయో తెలియదని వారు పేర్కొన్నారు. చెరువులో పీతలు వేసి 20 రోజులు పైబడిందని, పచ్చ పీతలకు బదులు మండ పీతలని తేలడంతో మోసపోయినట్టు గుర్తించామని, మండ పీత పిల్లలను సరఫరా చేసిన హేచరీ యాజమాన్యం పైన, దళారులపై కేసు నమోదు చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు పచ్చ పీతలకు బదులు మండ పీతలు పంపిన హేచరీ యాజమాన్యం రూ.14 లక్షలు నష్టపోయిన రైతులు -
గల్లంతైన మృతదేహం లభ్యం
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం బీచ్కు స్నానాలకు వెళ్లి సముద్రంలో మంగళవారం గల్లంతైన ఇద్దరిలో రెండో యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన యాళ్ల హరికిశోర్ మృత దేహం మంగళవారమే లభ్యమైనప్పటికీ మరో యువకుడు ఇసుకపట్ల జస్వంత్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం వాపాలతిప్ప సమద్రతీర ప్రాంతంలో లభ్యమైనట్టు ఎస్సై సీహెచ్ రాజేష్ తెలిపారు. ఆ మృత దేహాన్ని తహసీల్దార్ వీఎస్ దివాకర్, ఎస్ఐ రాజేష్ పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించి కుటుంబ సభ్యులకు అందించారు.యువకుడి ఆత్మహత్యయానాం: పిన్ని ఇంటికి వచ్చి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం యానాం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం, జయంతి కాలనీకి చెందిన గండ్రాపు వెంకటకృష్ణచైతన్య (24) యానాంలో వికాస్కాలనీలో నివాసం ఉంటున్న తన పిన్ని ఇంటికి ఇటీవల వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతున్న కృష్ణచైతన్యను చూసిన బంధువులు హుటాహుటిన కిందకు దింపి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కృష్ణచైతన్య బీటెక్ చదువుకున్నాడని ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పెంకే గణేష్ తెలిపారు. -
సత్యదేవుని సన్నిధికి సులువుగా!
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సత్యదేవుని దర్శనానికి మరో మార్గానికి పనులు చురుగ్గా సాగుతున్నా యి. మొదటి ఘాట్రోడ్డు వద్ద గల టోల్గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.90 లక్షల వ్యయంతో సుమారు 450 మెట్లతో ఆకర్షణీయంగా ఈ మార్గం రూపుదిద్దుకుంటోంది. రాజస్థాన్ కార్మికుల మెళకువలతో రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన మెషీన్తో అందమైన పరిమాణాల్లో కట్ చేసిన రాళ్లను మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. తొలిపావంచా నుంచి స్వామివారి ఆలయానికి ఉన్న ప్రస్తుతం మెట్లను సుమారు 50 ఏళ్ల క్రితం రాతితో నిర్మించారు. కాగా ప్రస్తుతం నిర్మిస్త్న్ను రెండో మెట్లమార్గానికి గ్రానైట్, మార్బుల్ రాళ్లను యంత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. 2010లోనే ప్రతిపాదన 2010 సంవత్సరంలో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో సందర్శకుల బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడి నుంచి తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి మెట్లపై స్వామివారి దర్శనానికి వెళ్లాల్సివచ్చేది. ఇది దూరాభారం కావడంతో కళాశాల మైదానానికి దగ్గరలో మరో మెట్లదారి నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఇంతలో ఆయన 2012లో బదిలీకావడంతో ఆ ప్రతిపాదన మూలపడింది. మళ్లీ 2023లో ఆయన ఈఓగా రావడంతో ఈ మెట్ల మార్గం పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు. మూడు మలుపులు, 450 మెట్లు ఈ మార్గాన్ని 450 మెట్లతో మూడు మలుపులతో నిర్మిస్తున్నారు. మొదటి ఘాట్రోడ్ టోల్గేట్ నుంచి మెట్లు ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల రోడ్డు వద్ద ముగియనున్నాయి. అక్కడ నుంచి 200 మీటర్ల దూరంలోనే స్వామివారి ఆలయం ఉంటుంది. గత ఏప్రిల్లో ప్రారంభించిన పనుల్లో భాగంగా వంద మెట్లు పూర్తి చేశారు. ఇంకా 350 మెట్లు నిర్మించాల్సి ఉంది. ఈ మెట్లకు అవసరమైన రాయిని ప్రత్తిపాడులోని క్వారీ నుంచి తీసుకువచ్చి మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. భక్తుల విశ్రాంతికి ఏర్పాట్లు మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు అలసట చెందితే విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా షెడ్లు, తాగునీటి సదుపాయానికి పక్కనే కొంత స్థలాన్ని చదును చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మూడు నెలల్లో పూర్తి ఈ మెట్ల నిర్మాణాన్ని ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేయనున్నట్టు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, డీఈ ఉదయ్కుమార్ తెలిపారు. పనుల పరిశీలన దేవదాయశాఖ చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్ ఈ మెట్ల మార్గం పనులను ఇటీవల పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. చురుగ్గా రెండో మెట్లదారి నిర్మాణం రూ.90 లక్షలతో 450 మెట్లు ఏర్పాటు ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి -
వ్యక్తి అనుమానాస్పద మృతి
తుని: స్థానిక జాతీయ రహదారి కొండవారిపేట ప్రాంతంలో ఉన్న చర్చి ఎదురుగా ఉన్న పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన తెలిపిన వివరాల మేరకు పిఠాపురం రూరల్ మండలం కోలంక గ్రామానికి చెందిన నంద్యాల వీరభద్రరావు (40)గా మృతుడిని గుర్తించారు. ప్రస్తుతం వీరభద్రరావు కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు. ప్రమాదమా, లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. ఏడీబీ రోడ్డుపై లారీ దగ్ధం రంగంపేట: స్థానిక శివారు ఏడీబీ రోడ్డుపై బుధవారం కాంక్రీట్ మిల్లర్ లారీ దగ్ధమైంది. ఏడీబీ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా కాంక్రీట్ తీసుకువచ్చిన లారీ అన్లోడింగ్ అనంతరం డ్రైవర్ లారీని రోడ్డుపై పార్కు చేసి పక్కకు వెళ్లారు. అనంతరం లారీపై ఉన్న విద్యుత్తు తీగలు గాలికి కదిలి తాకడంతో ఒక్కసారిగా లారీ టైర్ల నుంచి మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో లారీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 15,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జాతీయ ఎస్టీ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జాతీయ ఎస్టీ కమిషన్ 2018లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించిందని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారు అయినాపురపు సూర్య నారాయణ విమర్శించారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో 53శాతం మంది గిరిజనులున్నారని, వీరి విషయంలో ప్రభుత్వం, అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.11.80 లక్షల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. కొత్త భూసేకరణ చట్టం రూల్ 24 ప్రకారం భూమిలేని ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఎకరం భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు సరైన న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో నెసిక లక్ష్మణరావు, బూరమ్మ, వీరమ్మ, రాజమణి పాల్గొన్నారు. -
మిథ్యారంభం కరిష్యామి!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన తయారైంది నేటి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరవకుండానే, వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు అందాల్సిన టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు, షూస్, యూనిఫాంలు వచ్చేసి స్టాక్ పాయింట్లలో ఉండేవి. జిల్లాలోని 19 మండలాల్లో 984 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో బాలురు 44,771 మంది, బాలికలు 49,583 మంది ఉన్నారు. టెక్స్స్టబుక్స్, నోట్బుక్స్ వంటివి జిల్లాకు చేరినా అవి ఇంకా మండలాల నుంచి స్కూల్స్కు చేరలేదు. బ్యాగులు 94,354 రావాల్సివుండగా 67, 158 మాత్రమే 13 మండలాలకు చేరాయి. 94,354 షూస్ రావాల్సి వుండగా 64,726 మంది విద్యార్థులకే వచ్చాయి. యూనిఫాం అయితే కనీసం 10 మండలాలకు కూడా ఇంకా రాలేదు. 94,354 యూనిఫాంలకు 50,549 మాత్రమే వచ్చాయి. ఇంకా 40,805 యూనిఫాంలు రావాల్సి వుంది. అంసంపూర్తిగా తరగతి గదులు, టాయిలెట్స్ నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉత్సాహంతో స్కూల్స్కు వెళ్లే విద్యార్థులకు రంగులు వెలసిపోయిన విద్యాలయాలే కనిపించనున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి నాడు – నేడు పనులు పూర్తి చేసి విద్యాలయాలను సిద్ధం చేయాల్సి వుండగా నిర్లక్ష్యంగా సగం పనులతో వాటిని అలాగే వదిలేశారు. దీంతో పాఠశాలల్లో టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. స్కూల్స్కు రంగులు వేయలేదు. కొన్ని స్కూల్స్లో అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభించారు. అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కొన్ని పాఠశాలలకు అయితే కిటీకీలు, తలుపులు ఇంకా బిగించలేదు. పూర్తికాని ఉపాధ్యాయ బదిలీలు జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలు పూర్తికాలేదు. స్కూల్కు వెళ్లి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులకు వారి బదిలీలు ఇంకా అగమ్యగోచరంగా ఉండడంతో ఏం చేయాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో బోధించే ఎస్జీటీల కౌన్సెలింగ్ పూర్తికాలేదు. దీంతో పాత పాఠశాలల్లోనే ఎస్జీటీలు ఉండిపోయారు. అయితే ప్రధానోపాధ్యాయులు మాత్రం నూతనంగా వచ్చారు. వేసవి కాలం సెలవుల్లో పూర్తి చేయాల్సిన బదిలీలు పూర్తి నిర్లక్ష్యంతో పాఠశాలలు తెరిచే వరకూ కూడా పూర్తి చేయలేదు. హామీ ఇచ్చిన ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేయకుండా ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడంతో వారు ఆందోళన చేశారు. తప్పు తెలుసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు మాన్యువల్ బదిలీలకు ఒప్పుకుంది. అయితే ఇప్పటకే ఆలస్యం కావడంతో దీనివల్ల గురువారం కూడా బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. నేడు పాఠశాలల పునఃప్రారంభం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 94,354 మంది పూర్తిగారాని విద్యార్థుల స్కూల్ కిట్లు పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు -
దివ్యాంగుల పింఛన్లలో కోత తగదు
కాకినాడ సిటీ: దివ్యాంగుల పింఛన్లలో భారీ కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఖండించారు. కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పింఛన్ల తనిఖీ పేరుతో రాష్ట్రంలో దివ్యాంగులను ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపించారు. పింఛన్ల తనిఖీకి హాజరయ్యే క్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆసుపత్రి పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరప, ముమ్మిడివరం మండలాల్లో మానసిక మహిళ దివ్యాంగులపై అత్యాచార ఘటన జరపడం దురదృష్టకరమన్నారు. జరిగిన సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, 35 కేజీల బియ్యం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సంఘ జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు పాల్గొన్నారు. -
రైతులు నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం
రాజమహేంద్రవరం రూరల్: ధాన్యం కొనుగోలు చేయకుండా, ఇన్సూరెన్స్ చెల్లించకుండా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుంటే, మరోవైపు కేంద్రం కేవలం మూడు శాతం మాత్రమే వరిపై మద్దతు ధర పెంచడం దారుణమని మాజీ మంత్రి ,వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పక్కనే ఉన్న ఒడిశా ప్రభుత్వం వరిపై కనీస మద్దతు ధరకు 800 రూపాయలు బోనస్ చెల్లించి క్వింటాల్ వరిని కొనుగోలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రూ.500 అదనంగా చెల్లిస్తుండగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు పెట్టుబడి సహాయం ఏడాదికాలంగా అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఓవైపు పెట్టుబడులు పెరిగిపోతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాలు బంజరు భూములను కూడా వరి భూములుగా మారుస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం మూడు పంటలు పండే భూములను రాజధాని పేరిట లాక్కుంటున్నారని వేణు ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు కూటమి ప్రభుత్వ పాలనలో దారుణంగా క్షీణించాయని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. డిబేట్లో మాట్లాడిన అంశాన్ని ఆధారంగా చేసుకుని సీనియర్ జర్నలిస్టు కేఎస్ఆర్ను అరెస్టు చేయడం, సాక్షి కార్యాలయాలపై దాడులు నిర్వహించటం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టం చేస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకు నాలుగురెట్లు ఇస్తానని చెప్పిన సంవత్సరకాలంలో చేయకుండా చంద్రబాబు మహిళలను, రైతులను, అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ఇప్పుడు సాక్షి డిబేట్లో ఒక ఎనలిస్ట్ అన్నమాటలకు చంద్రబాబు మహిళలను అడ్డుపెట్టుకుని డైవర్షన్ పాలిటెక్స్ చేస్తున్నారన్నారు. గతంలో తన సతీమణిపై వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఎంతో మనోవేదన చెందారన్నారు. ఇప్పుడు ఏబీఎన్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పై వ్యక్తిత్వ హననం చేస్తూ, ఆయన సతీమణి భారతమ్మపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని సభ్యసమాజం తలదించుకుంటోందన్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని కచ్చితంగా కూటమి పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ -
పంచ భూతాలను కాపాడుకోవాలి
పిఠాపురం: ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచ భూతాలను కాపాడుకోవచ్చునని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఏరువాక పౌర్ణమిను పురస్కరించుకుని పిఠాపురం, ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం సస్యవృద్ధి బీజారోపణోత్సవం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా తమ ఆశ్రమం వద్ద ఏరువాక పౌర్ణమి నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సాధించడమే ఆధ్యాత్మిక వ్యవసాయమని అన్నారు. దానికి ప్రేరణ కలిగించే కార్యక్రమమే సస్యవృద్ధి బీజారోపణోత్సవం అని తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దారపురెడ్డి వెంకన్న, దార్లంక సూరిబాబు, యాండ్ర చంద్రావతి, దాసరి పెద్దనాగేశ్వరరావు, గుళ్ళపల్లి వీరభద్రరావును సత్కరించారు. పరబ్రహ్మ మొహియద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం 2025 పురస్కారాన్ని పశ్చిమగోదావరి జిల్లా చీమలవారిగూడెంకు చెందిన చీమల వెంకటేష్కు అందజేసి రూ.10వేల నగదు పురస్కారాన్ని, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త నడింపల్లి రామగోపాలవర్మ డ్రోన్లతో వ్యవసాయం గురించి రైతులకు వివరించారు. అంబాజీపేట హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.బి.వి చలపతి వివిధ పంటలలో జీవ నియంత్రణ పద్ధతులను తెలిపారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి సత్య నారాయణమూర్తి, గోలి సుభాష్, పృథ్వీరాజ్ కఠారి, పొట్రు శశికాంత్ సమీకృత ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడారు. కెప్టెన్ అజ్జరపు మల్లికార్జునరావు, ఎస్సార్ కార్పొరేషన్ మాజీ సీఈవో జి.వి.కృష్ణంరాజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి తెలిపారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పాల్గొన్నారు. ఏరువాక సాగిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా -
వనదుర్గమ్మకు ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి దుర్గామాతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి జ్యేష్ట పౌర్ణిమ సందర్భంగా బుధవారం ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమగుండంలో హోమద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రత్యంగిర హోమం, పూజ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. 40 మంది భక్తులు రూ.750 చొప్పున టికెట్లు కొనుగోలు చేసి హోమంలో పాల్గొన్నారు. దీంతో భక్తులకు హోమ మంటపం సరిపోక ఇబ్బంది పడ్డారు.మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించిన రోజు నుంచే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి సన్న బియ్యాన్ని వినియోగిస్తామని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అన్ని అర్హత కలిగిన పాఠశాలలకు మధ్యాహ్న భోజనం తయారీకి ఫైన్రైస్ను అందించామన్నారు.నేడు కనకదుర్గ అమ్మవారికి చండీ హోమంకొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం సందర్బంగా గురువారం చండీహోమం నిర్వహిస్తారు. శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ హోమాలలో రూ.750 టిక్కెట్తో భక్తులు పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.సత్యదేవుని దర్శించిన 40 వేల మందిఅన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం బుధవారం భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులతో పోటెత్తింది. సుమారు 40 వేలమంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు రెండువేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదానపధకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగ చేశారు.జర్నలిస్ట్లపై అక్రమ కేసులు దారుణంఅమలాపురం టౌన్: రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్లు, వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం దారుణమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మెల్సీ ఖండించారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు బుధవారం సాయంత్రం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ కేసులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కక్ష సాధింపు చర్యల్లో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట ధర్నాలు, కేసులు అనే కొత్త నాటకానికి తెర తీసిందని చెప్పారు. భారత రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజాన్ని నేటి కూటమి ప్రభుత్వం ఖతం చేసే ప్రయత్నంలో ఉందని అన్నారు. ప్రభుత్వం కూటమి పార్టీల నేతలకే రక్షణగా నిలుస్తోందని విమర్శించారు. తుపాకీ గొట్టంతో రాజ్య హింస ద్వారా నియంత పాలన రుచి చూపిస్తోందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఆరోపించారు. -
విశ్వాసం నిలబెట్టుకోలేకపోయారు
దేవరపల్లి: రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. నల్లజర్లలో పార్టీ మండల కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చట్టాలను అమలు చేయవలసిన వ్యవస్థలను ప్రభుత్వ పెద్దలు తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. చట్టాల్ని ఉల్లంఘించడానికే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు మీడియాపై, మరోవైపు ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని, అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. రైతులను ప్రభుత్వం నిలువునా ముంచిందని విమర్శించారు. పెట్టుబడి సాయం లేదని, పంటల బీమా సౌకర్యం లేక, గిట్టుబాటు ధరలు రాక రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని అన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో వ్యవసాయం భారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం, కోకో, ఆయిల్పామ్, పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా ఉండి, సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని చెప్పారు. రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్గా మారడంతో ముక్కుపచ్చలారని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా జరుగున్నాయని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలపై 185 అత్యాచారాలు జరగగా, వీటిలో 27 హత్యలు జరిగాయని తెలిపారు. తల్లికి వందనం సాయం అందించకుండా పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. విద్యారంగాన్ని విధ్వంసం చేశారన్నారు. ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలకులందరూ బంజరు భూములను సాగులోకి తెచ్చి పంట భూములుగా మార్చ గా, సీఎం చంద్రబాబు పట్టుదలకు పోయి మూడు పంటలు పండే భూముల్లో అమరావతి నిర్మాణం చేపట్టారని విమర్శించారు. అమరావతి భూములను వ్యాపార భూములుగా మార్చారని అన్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పని తీరుపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వేణు అన్నారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బంకా అప్పారావు పాల్గొన్నారు.ఫ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ఫ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షసాధింపు చర్యలు ఫ కూటమి ప్రభుత్వ పనితీరుపై విస్తృత చర్చ జరగాలి ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు -
జీజీయూలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు
రాజానగరం: ఆస్ట్రేలియాలోని మెక్వెరీ యూనివర్సిటీ, ప్రముఖ సంస్థ కేపీఎంజీ ఇండియాలతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీనికి సంబంధించిన పత్రాలను యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రొ.ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జీజీయూ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో బోధన అందించేందుకు జీజీయూ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రొ.ఛాన్సలర్ శశికిరణ్వర్మ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా బీటెక్లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ చేసేందుకు అవకాశాలుంటాయన్నారు. కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి మాట్లాడుతూ, జీజీయూతో కలిసి పని చేయడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవితను అందించే అవకాశం లభించిందన్నారు. మెక్వెరీ యూనివర్సిటీ సైబర్ స్కిల్ అకాడమీ సీఈఓ మాట్ బుష్బై ఆన్లైన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేపీఎంజీ ఇండియా ప్రతినిధులు మహావీర్, రాఘవన్ ఎస్., జీజీయూ సాంకేతిక సలహాదారు సుమంత్, వీసీ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డీఐపీఆర్ఓగా లక్ష్మీనారాయణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సమాచార, పౌర సంబంధాల అధికారి(డీఐపీఆర్ఓ)గా కె.లక్ష్మీనారాయణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతిని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన లక్ష్మీనారాయణ 2020 జనవరిలో ఏపీపీఎస్సీ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉప సమాచార ఈఈగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. జిల్లాల పునర్విభజన అనంతరం బదిలీపై అమలాపురంలో డీఐపీఆర్ఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం భాగంగా రాజమహేంద్రవరానికి బదిలీ అయ్యారు. లక్ష్మీనారాయణకు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, బదిలీపై వెళ్తున్న డీఐపీఆర్ఓ సీహెచ్ శ్రీనివాస్, తదితరులు అభినందనలు తెలిపారు. -
సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడి మృతి
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఉన్న బీచ్లో స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతుకాగా అందులో ఒకరు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన యాళ్ళ హరికిషోర్(19), అయినవిల్లి మండలం నేదునూరుకి చెందిన ఇసుకపట్ల జస్వంత్(19), మరో ముగ్గురు నేదునూరుకు చెందిన యువకులు ఎస్.యానం బీచ్కు వచ్చి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. వీరు ఐదుగురు స్నేహితులు. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల్లో హరి కిషోర్, జస్వంత్ సముద్రంలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా హరికిషోర్ మృతదేహం లభ్యమయిందని, జస్వంత్ కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ సీహెచ్.రాజేష్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాం... అంబాజీపేట: మృతిచెందిన యాళ్ల హరికిషోర్ ఓ ప్రైవేటు కంపెనీలో రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మృతితో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న నేపథ్యంలో ఇప్పుడు దిక్కెవరని బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. వీరి స్వగ్రామం పి.గన్నవరం కాగా మృతుడి తండ్రి కుమార్ ఎస్.యానం ఓఎన్జీసీలో పనిచేస్తున్నారు. తల్లి నాగమణి, అతని సోదరి మాచవరం కుసుమవారిపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అందరితో సరదగా ఉండే హరికిషోర్ ఇక లేడని తెలియడంతో కుసుమవారిపేటలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. హరికిషోర్ అందరితో కలిసి ఉండేవాడని అతని మరణం జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. గల్లంతైన మరొకరి కోసం గాలింపు -
అఘాయిత్యాలపై స్పందించరేం..?
దేవరపల్లి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ హోం మంత్రి వంగలపూడి అనిత కనీసం స్పందించిన దాఖలాల్లేవని రాష్ట్ర మాజీ హో మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత విమర్శించారు. నల్లజర్లలో పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. వారం రోజులు గడిచినా పోలీసులు స్పందించలేదన్నారు. నాడు అదృశ్యమైన తన్మయి ఆదివారం శవమై కనిపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆమె గురించి హోం మంత్రి అనిత ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని విమర్శించారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో బాలికపై టీడీపీ కార్యకర్త అత్యాచార యత్నానికి ఒడిగట్టాడని, బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఇంతవరకూ సాయం అందించలేదని వనిత ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఒక యువతిని ఆరు నెలలుగా ఏడుగురు యువకులు ఇంట్లో బంధించి లైంగిక దాడికి పాల్పడినా, విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినా కేసు నమోదు చేయని విషయం అనితకు కనిపించడం లేదని మండిపడ్డారు. ఎంతసేపూ వైఎస్ జగన్ను, భారతిని తిట్టడం తప్ప వేరే పని లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అనిత పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. వీటిపై ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించి, జైల్లో పెడుతున్నారన్నారు. జర్నలిస్టు కృష్ణంరాజు మహిళలపై చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ, మహిళల తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ వాటిని తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, భారతికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి గురించి వంగలపూడి అనిత ఎన్నో అన్నారని, అలా మాట్లా డాలని చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్ చెప్పా రా అని వనిత ప్రశ్నించారు. కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్య ల గురించి వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని అనిత అంటున్నారని, విజయమ్మ, భారతి గురించి మాట్లాడిన మాటలపై ముందు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, యువతులు, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసి, బాధితులకు అండగా నిలబడాలని సూచించారు. బాధితులను పరామర్శించడం లేదని, ప్రభుత్వం నుంచి కనీస సాయం అందించడం లేదని, డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపుతూ వైఎస్ జగన్, సాక్షి చానల్, చానల్ అధినేత భారతి గురించి తప్పుడుగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. జగన్ గురించి అనితకు ఏం తెలుసని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో మహిళలకు జగన్ ఇచ్చినంత గౌరవం ఏ సీఎం ఇవ్వలేదన్నారు. మహిళలంతా మహరాణులుగా ఉండాలని అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఇళ్ల స్థలాలు, ఇళ్లు వంటి 11 పథకాలను మహిళల పేరిట అందించారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చారని వనిత చెప్పారు. జగన్ గురించి మాట్లాడే అర్హత మంత్రి అనితకు లేదని అన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు యజ్జవరపు లక్ష్మి, నియోజకవర్గ కార్మిక విభాగం అధ్యక్షుడు మద్దూరి నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బంకా అప్పారావు, మేన్నీ కృష్ణ చౌదరి పాల్గొన్నారు.ఫ డైవర్షన్ రాజకీయాలకు తెర లేపుతారా? ఫ హోం మంత్రి అనితపై మాజీ హోం మంత్రి వనిత విమర్శ -
కూటమి పాలనలో అతివలకు రక్షణ కరవు
రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో సీ్త్రలకు, బాలికలకు రక్షణ కరువైందని పలువురు మహిళలు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో మహిళలు రాజమహేంద్రవరంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. మహిళలపై దాడులు అరికట్టాలని, వైఎస్ భారతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద నిరసన తెలిపి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ, మహిళలకు రక్షణ అని సీఎం చంద్రబాబు చెప్పడమే తప్ప వారికి రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతూంటే సాటి మహిళ అయిన హోం మంత్రి కనీసంగా కూడా స్పందించకపోవడం దారుణమని అన్నారు. అత్యాచారాలకు గురైన మహిళల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. మహిళలకు న్యాయం చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వారి రక్షణ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నవారిని అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సాక్షి చానల్లో జరిగిన డిబేట్లో ఒక తప్పు మాట దొర్లిందని ఆ పత్రిక కార్యాలయాల వద్ద ఆందోళన చేయడం, భారతిని, జగన్రె నిందించడం సరైన విధానం కాదని అన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా హామీలు అమలు చేయకపోవడంతో వెన్నుపోటు దినం పేరిట వైఎస్సార్ సీపీ ఆందోళన చేయడాన్ని జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారని ధ్వజమెత్తారు. సాక్షి చానల్లో జరిగిన డిబేట్లో దొర్లిన తప్పునకు సంబంధిత వ్యక్తులు క్షమాపణ చెప్పినప్పటికీ, సంబంధం లేని భారతిని దూషిస్తూ రాద్ధాంతం చేయడంలో ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మహిళా అధ్యక్షులు పోలు విజయలక్ష్మ, ఇమంది విజయకుమారి, దాకారపు బంగారమ్మ, ముప్పిడి దమయంతి, అంగాడ సత్యప్రియ, చీరాల ఉమాదేవి, గాండ్ల, తెలుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంకిస భవానీప్రియ తదితరులు పాల్గొన్నారు. ఫ అత్యాచార ఘటనల్లో తక్షణ చర్యల్లేవు ఫ మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించాలి ఫ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన నిరసన -
వడగాడ్పులు.. గుడ్లు తేలేస్తున్న కోళ్లు
కొద్ది రోజులుగా మండుతున్న ఎండలు పౌల్ట్రీకి గుబులు పుట్టిస్తున్నాయి. వేడిగాలులకు తాళలేక ఫారాల వద్ద వందల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. 3 నెలల క్రితం బర్డ్ ఫ్లూ దెబ్బతో కుదేలైన కోళ్ల పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం అందించలేదు. మరోపక్క మండుతున్న ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తుండటం కోళ్ల రైతులను కలవరపరుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లోని 200 పౌల్ట్రీల్లో 1.3 కోట్ల వరకు లేయర్ కోళ్లు ఉన్నాయి. లక్ష కోళ్లు ఉన్న పౌల్ట్రీ ఫారంలో సాధారణంగా రోజుకు 50–60 కోళ్లు వరకు చనిపోతుంటాయి. ప్రస్తుతం ఈ మరణాల సంఖ్య భారీగా ఉంటోంది. వారం రోజులుగా ఎండలు ఎక్కువై, వడగాడ్పుల తీవ్రతతో కోళ్ల మరణాలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. ఈ విధంగా రోజుకు 39,000 కోళ్లు మృత్యువాత పడుతున్నట్లు అంచనా. ఒక కోడి చనిపోతే రూ.250 వరకు నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రూ.97.50 లక్షల నష్టం వాటిల్లుతోంది. గత వారం రోజుల్లో జిల్లాలోని పౌల్ట్రీకి రూ.6.83 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా. – సాక్షి, భీమవరంతగ్గిపోయిన గుడ్ల ఉత్పత్తి...ఎండల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో జిల్లాలో రోజుకు 1.05 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా వడగాడ్పుల తీవ్రతకు అది 94.50 లక్షలకు తగ్గిపోయింది. డ్రాపింగ్ వల్ల రోజుకు 10.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఫాంగేట్ వద్ద గుడ్డు రైతు ధర రూ.5.35 ఉండగా రోజుకు రూ.56.17 లక్షలు చొప్పున వారం రోజుల్లో రూ.3.93 కోట్లు నష్టపోయినట్టు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పెరిగిన నిర్వహణ భారంఅధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులు చెబుతున్నారు. వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా ఫారాల్లో వాతావరణాన్ని చల్లబర్చేందుకు షెడ్ల చుట్టూ గోనె సంచులు కట్టి నీటితో తడపడం, స్ప్రింక్లర్ల ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లతో నిర్వహణ భారం పెరిగిపోతోందని తెలిపారు.ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభంలో వెలుగుచూసిన బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్ల రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. వైరస్ను గుర్తించక ముందు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15 లక్షల వరకు లేయర్ కోళ్లు మృతి చెందినట్లు అంచనా. వైరస్ గుర్తించాక వేల్పూరు ఇన్ఫెక్షన్ జోన్లోని 55 వేలు, బాదంపూడి ఇన్ఫెక్షన్ జోన్లోని 1.34 లక్షల లేయర్ కోళ్లను కల్లింగ్ చేశారు. గుడ్లు, మేతను పూడ్చిపెట్టారు. వైరస్ కట్టడిలో భాగంగా ఆంక్షలు అమలు చేయడంతో వినియోగం తగ్గి ఫాంగేట్ వద్ద గుడ్డు ధర రూ.4.10కు పడిపోయింది. ఒక్కో కోడికి రూ.140 నష్టపోయినట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కగట్టారు. ఈ మేరకు పూడ్చిపెట్టిన కోళ్లకు గాను రూ.2.65 కోట్లు, గుడ్లు, మేత రూపంలో మరింత మొత్తం బాధిత రైతులకు అందించాల్సి ఉంది. 3 నెలలైనా ప్రభుత్వం ఇప్పటివరకు వారికి పరిహారం అందించలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన ఇప్పుడు ఎండలు పౌల్ట్రీకి నష్టం కలిగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి బర్డ్ ఫ్లూ పరిహారం రావాల్సి ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు.ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే తాము మరింతగా నష్టాల్లో కూరుకుపోతామని రైతులు, పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు పరిశీలించి ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
పచ్చని జీవితాల్లో మద్యం చిచ్చు
కోరుకొండ: తాగిన మత్తులో కొంతమంది వ్యక్తులు స్నేహితుడినే అంతమొందించారు. ఈనెల 4న జరిగిన ఈ హత్య కేసు మిస్టరీని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు ఛేదించారు. రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ కథనం మేరకు... కోరుకొండ మండలం గాడాల–నిడిగట్ల రోడ్డులోని ఓ వెంచర్ డ్రైనేజీలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. హతుడిని రాజమహేంద్రవరం రూరల్ వెంకట నగరం గ్రామానికి చెందిన కొవ్వాడ చిన్నబ్బులు (31)గా పోలీసులు గుర్తించారు. చిన్నబ్బులుకు రాజమహేంద్రవరానికి చెందిన డీజే సాయి, శెట్టి వీరబాబు, కర్రి శ్రీనివాసరెడ్డి, రేలంగి తరుణ్సాయి, ఆకుల గణేశ్ స్నేహితులు. తరచుగా కలుసుకుని మద్యం తాగుతుంటారు. ఈనెల 4న ఉదయం మద్యం తాగుతున్న సమయంలో వీరబాబు సెల్ఫోన్ చిన్నబ్బులు తీసుకోగా, కింద పడి పగిలిపోయింది. దీంతో స్నేహితుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు బెదిరించుకున్నారు. సమస్య పరిష్కరించుకుందామని అదే రోజు రాత్రి చిన్నబ్బులును పిలిచారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఐదుగురూ చిన్నబ్బులు గొంతును పదునైన బ్లేడ్తో కోసి, బండరాయితో మోది హత్య చేశారు. నిందితులను పోలీసులు రాజమహేంద్రవరం సీతంపేటలోని ఓ ఇంట్లో అరెస్టు చేశారు. వారికి ఆశ్రయమిచి్చన గండిమేను సుదర్శన్, నిఖితలను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రెండు మోటార్ సైకిళ్లు, సెల్ఫోన్, రక్తపు మరకలున్న దుస్తులు, ఆయుధాలను స్వా«దీనం చేసుకున్నారు.తండ్రి హతం మద్యం తాగి ఇంట్లో గొడవ.. కొడుకులపై దాడిఎదురు దాడి చేసిన పెద్ద కుమారుడు తోట్లవల్లూరు: కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో కొడుకు చేతిలో తండ్రి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని చాగంటిపాడు గ్రామానికి చెందిన నిమ్మకూరి ఆనంద్ (43) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అతనికి భార్య సుపధ, కుమారులు వాసు, భార్గవ్ ఉన్నారు. వాసు కార్ల షోరూమ్లో పనిచేస్తున్నాడు. భార్గవ్ డిగ్రీ చదువుకుంటూ విజయవాడలో ఉంటున్నాడు. తనకు తెలియకుండా భార్య ఇంటిపై రూ.5లక్షలు అప్పు తెచ్చినట్టు ఆనంద్కు తెలిసింది. ఈక్రమంలో సోమవారం మద్యం తాగి భార్యతో గొడవపడ్డాడు. విషయం తెలుసుకున్న ఆనంద్ తల్లి వెంకటేశ్వరమ్మ ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. తండ్రి మద్యం తాగి వచ్చి గొడవచేస్తున్న విషయాన్ని సుపధ కొడుకులు చెప్పింది. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న కొడుకులతో కూడా ఆనంద్ గొడవకు దిగాడు. రాడ్తో పెద్ద కొడుకు వాసుపై దాడి చేయటంతో కింద పడిపోయాడు. వెంటనే వాసు చేతికి దొరికిన చెక్కతో దాడి చేశాడు.కోపంలో రాడ్తో కూడా కొట్టడంతో తలకు బలమైన గాయాలై ఆనంద్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, తోట్లవల్లూరు ఎస్ఐ అవినాశ్ మంగళవారం వివరాలను సేకరించారు. మృతుని తల్లి వెంకటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారకుడైన వాసుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.యువకుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): మద్యానికి బానిస కావడంతో, భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని జాకీర్హుస్సేన్ నగర్లో మంగళవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. రబ్బాని (30), మముల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రబ్బాని తన ఇంటి పక్క వీధిలో టిఫిన్ అంగడి పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన రబ్బాని భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో దంపతుల నడుమ విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 8న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో భర్తపై అలిగి మముల తన ఇద్దరు పిల్లలను తీనుకుని శ్రీనివాసగనర్లోని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రబ్బాని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితుడు అక్బర్ అలియాస్ ఇక్బాల్ ఫోన్ చేసి మములాకు తెలిపారు. దీంతో ఆమె తన బంధువులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరైంది. బాధితురాలు నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
ఏలూరు: సాక్షి ఆఫీస్కు నిప్పంటించి.. టీడీపీ నేతల పైశాచికం
సాక్షి,ఏలూరు: తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈరోజు(మంగళవారం, జూన్ 10) సైతం ‘సాక్షి’పై కుట్రపూరిత దాడులు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలో టీడీపీ నేతల గూండాగిరి కొనసాగుతుంది. సాక్షి కార్యాలయంపై దెందులూరు నియోజకవర్గ టీడీపీ నేతలు దాడి చేశారు. పెట్రోల్ బాటిళ్ళు ,రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయంలో ఉన్న సోఫా సెట్లు, ఫర్నిచర్ ఆగ్నికి ఆహుతయ్యాయి. ఆఫీసు ఉద్యోగి కారు పాక్షికంగా ధ్వంసమైంది. గత, మూడు రోజులుగా సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భయానక వాతావరణం సృష్టించారు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి కార్యాలయంపై మంగళవారం కూటమి మూకలు దాడులకు తెగబడ్డాయి. బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు. రామకృష్ణారెడ్డి, బలరామకృష్ణ ఆధ్వర్యంలో సాక్షి కార్యాలయంపై దాడులక తెగబడ్డారు. సాక్షి కార్యాలయం బోర్డులో ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు కూటమి నేతలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది.తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈ దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. -
దేవదాయశాఖ రాజమహేంద్రవరం ఆర్జేసీగా త్రినాథరావు
అన్నవరం: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావును దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ (రాజమహేంద్రవరం)గా బదిలీ చేస్తూ ఆ శాఖ కార్యదర్శి వి.వినయ్చంద్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సింహాచలం దేవస్థానానికి ఈఓని నియమించేవరకు ఆ దేవస్థానానికి ఇన్చార్జి ఈఓగా కూడా కొనసాగాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్జేసీగా పనిచేస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓ వి. సత్యనారాయణమూర్తికి ఇన్చార్జి బాధ్యతలు తొలగించారు. త్రినాథరావు గతంలో రాజమహేంద్రవరం ఆర్జేసీగా, రెండుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా, 2020–22 మధ్య రెగ్యులర్ ఈఓగా పనిచేశారు. ఆ తరువాత ద్వారకాతిరుమల దేవస్థానానికి బదిలీ అయ్యారు. సింహాచలం దేవస్థానం ఈఓగా 2024లో బదిలీ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన సెలవు పై విదేశాలకు వెళ్లగా ఆయన స్థానంలో రాజమహేంద్రవరం ఆర్జేసీ సుబ్బారావును సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమించారు. ఏప్రిల్ 30న సింహాచలం అప్పన్న చందనోత్సవం రోజున గోడ కూలి ఆరుగుగు భక్తులు మృతి చెందిన ఘటనలో ఇన్చార్జి ఈఓ సుబ్బారావుతో సహా ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. త్రినాథరావు సెలవు అనంతరం మే 26న సింహాచలం దేవస్థానం ఈఓగా జాయిన్ అయ్యారు. -
యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి
● నారుమడుల సంరక్షణతో నాణ్యమైన దిగుబడులు ● రైతులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ● వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే మేలు ఆలమూరు: ఖరీఫ్ పంటకు సంబంధించి నారుమళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఖరీఫ్లో అధిక శాతం వెదజల్లు సాగు చేపడుతుండగా మిగతా భూమిలో నారుమళ్ల ద్వారా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1.63 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంకా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఖరీఫ్ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులను సాధించడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే వరి వంగడాలకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ ఈ ఖరీఫ్లో స్వర్ణ (7029), ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని సూచనలిస్తోంది. అయితే రైతుల మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధ్యాన్యం ఇస్తున్నారు. నారుమళ్ల దశలో సరియైన యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా చీడపీడలను నివారించడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చునని వ్యవసాయశాఖ చెబుతోంది. సస్యరక్షణ చర్యలు నారుమడుల తయారీలో కనీస యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను పాటిస్తే పెట్టుబడి ఆదా అవడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చునని ఆలమూరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కె.నాగేశ్వరరావు చెబుతున్నారు. ● తొలుత 80 శాతం మొలక కలిగిన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేయాలి. నారుమడులను ఏర్పాటు చేసుకునేందుకు 10–12 రోజుల మధ్య దమ్ము చేసి నేలను చదును చేసుకోవాలి. ● పొలాల్లో నీరు పారేందుకు చిన్న చిన్న కాలువలను ఏర్పాటు చేసుకుని ప్రతి మొక్కకు నీరు అందేలా చూడాలి. ● ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, ఒక కిలో పోటాష్నిచ్చే ఎరువులను మిశ్రమం చేసి దుక్కులో వేయాలి. ● చలి తీవ్రత ఎక్కువగ ఉండే ప్రదేశంలో భాస్వరాన్ని రెట్టింపు చేయాలి. ● వరి నారు ఆకుగా విచ్చుకునే వరకూ ఆరుతడులుగా నీటిని అందించాలి. ఆకు కొద్దిగా ఎదిగి ఒక దశకు వచ్చిన తరువాత నీటిని నిల్వకట్టాలి. ● జింక్లోపం గమనిస్తే లీటరు నీటిలో రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను పిచికారీ చేయాలి. ● చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాళ్వా వరి సాగుకు కనిపించే జింక్ లోప లక్షణాలను గుర్తిస్తే సత్వరమే వ్యవసాయశాఖ సూచనలు తీసుకోవాలి. ● నారు తీయడానికి వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే ఐదు సెంట్లలో వేసిన నారుమడికి ఒక కేజీ కిర్టోప్యూరాన్ గుళికలను తక్కువ నీటిలో సమానంగా చల్లాలి. నాట్లు వేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ● వరి నారుమడి వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ● నారు వేయడానికి పక్షం రోజుల ముందు పొలాన్ని మురుగు దమ్ము చేయాలి. ● 15 సెంటీమీటర్లకు మించి లోతుగా దమ్ము చేయరాదు. ● పొలాన్ని దమ్ము చెక్కతో కాని యంత్ర పరికరంతో గాని చదును చేయాలి. ● నారుమడి లేత ఆకు రంగులో ఉన్నప్పుడే నాటడం ద్వారా త్వరగా మూన కడుతుంది. ● నాలుగు నుంచి ఆరు ఆకులు ఉన్న నారును ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. ● నారు ౖపైపెన ఉండే విధంగా నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది. ● నారు వేసేటపుడు భూసారాన్ని బట్టి చదరపు మీటరుకు 33 మూనలు ఉండేటా నాటాలి. ● వరి నాట్లు నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటిమీటర్ల చొప్పున బాటలు వేయాలి. ● దీనివల్ల పైరుకు వెలుతురు తగిలి చీడపీడలు నివారణకు దోహదపడుతుంది. ● నారుమడి మునిగితే తీసుకోవలసిన జాగ్రత్తలు ● నారుమడిలో బాటలు వేసి నీటిని తొలగించాలి. ఠిమొక్కలు కోలుకోవడానికి ఎకరా నారుమడికి యూరియా, పొటాష్ ఎరువులను 10 కేజీల చొప్పున అందించాలి. ● నారుమడికి తెగుళ్లు సోకకుండా లీటరు నీటిలో రెండు గ్రాముల కార్బన్డిజమ్, 2.5 మి.గ్రా క్లోరోపైరీపాస్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ● నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్న రైతులు ప్రత్యామ్నాయంగా వెదజల్లు విధానాన్ని అవలంబించి సమయం, పెట్టుబడిని ఆదా చేసుకోవాలి. వ్యవసాయశాఖ సూచనలు, సలహాలను తీసుకుంటే నారుమడి దెబ్బతిన్న రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్ ద్వితీయార్థంలో నారుమళ్లు చేపట్టాలి 2025 ఖరీఫ్ సీజన్కు సంబంధించి జూన్ ద్వితీయార్థంలో నారుమళ్ల ప్రక్రియను చేపట్టి జూలై 15 నాటికి వరినాట్లు పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ చెబుతోంది. దీనివల్ల అక్టోబర్ నెలాఖరు నాటికి వరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని భావిస్తుంది. దీనివల్ల ఏటా నవంబర్ నెలలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను నుంచి తప్పించుకోవచ్చునని, మళ్లీ డిసెంబర్ చివరి నాటికి రబీ సాగుకు సంబంధించి వరినాట్లు పూర్తి చేస్తే వచ్చే ఏడాది మార్చి నాటికి రబీ పంట చేతికొస్తుందని, దీనివల్ల మూడవ పంటగా అపరాల సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ సూచనలు కచ్చితంగా పాటిస్తూ భూసారం పెరిగి ప్రతి ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఎండ వేడికి పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్
నిడదవోలు : పట్టణంలోని బసివిరెడ్డిపేట విద్యుత్ సబ్ స్టేషన్లో ఎండ వేడికి సోమవారం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రానన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ బయటకు రావడంతో అంటుకొని మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న గడ్డి మొక్కలు మంటలకు కాలిపోయాయి. పురుషోత్తపల్లి విద్యుత్ ఏఈ బి.రమేష్బాబు ఘటనా స్థలానికి చేరుకొని తన సిబ్బందితో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ తీసివేసి ప్రత్యామ్నాయంగా మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ఓ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30,000 ఆస్తి నష్టం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో నిడదవోల పట్టణంలోని బసివిరెడ్డిపేట, నిడదవోలు మండలంలోని సమిస్రగూడెం, అట్లపాడు, తాళ్లపాలెం, శెట్టి పేట గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
ఏపీఈఏపీ –25 ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏపీసెట్–2024 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఈ మేరకు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో పి.ఆదిత్య అభిషేక్ 13వ ర్యాంక్, జి.లోషిణి 72, .శుభశ్రీవల్లిఅత్రేయ 91, జి.శ్రీరామశశాంక్ 95, వై.వేదిక 96 ర్యాంక్ సాధించారన్నారు. వీటితో పాటు 121, 136, 156, 169, 170, 172, 177, 198 ర్యాంకులు సాధించారన్నారు. అగ్రికల్చరల్ ఫార్మశీ విభాగంలో సాయిభవ్యహర్షిణి 31వర్యాంక్, దేవి సౌమ్య శ్రీ 112, పి.శ్రీధర్ 119, సి.వెంకట శివసాయి అచ్యుత 152 ర్యాంకు కై వసం చేసుకున్నారన్నారు. వీటితో పాటు 500లోపు 38, వెయ్యిలోపు 62మంది ర్యాంకులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్య దర్శి కృష్ణదీపక్రెడ్డి, హాస్టల్ డైరెక్టర్ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు శృతి, సుగుణ, ఐఐటీ ప్రిన్సిపాల్ మొయి నా, కో–ఆర్డినేటర్ లక్ష్మీకుమార్, రాఘవరెడ్డి, గంగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. -
కన్నుల పండువలా శ్రీపుష్పయాగం
దివ్యాంగ హక్కుల వేదిక సమావేశం రేపు 09ఆర్జడ్ఎల్82 స్వామి వారి శ్రీపుష్పయాగంలో పాల్గొన్న భక్తులు ● వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు ● బాల బాలాజీ స్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం మామిడికుదురు: శ్రీనివాసా గోవిందా, శ్రీవేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ అయిదు రోజుల పర్యంతం కనుల పండుగలా సాగిన అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు సోమవారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్పాల సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా శ్రీబాల బాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉఽభయ దేవేరులతో కొలువు తీరిన శ్రీబాల బాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. పసుపు, కుంకుమ, రవికల గుడ్డ అందజేశారు. ముందుగా సుప్రభాత సేవతో అయిదవ రోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. స్వామి వారి సన్నిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చోర సంవాదం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దేవస్ధానం ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్యులు చలమచర్ల వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. బాల భోగం, నివేదన, వేదపారాయణ హృద్యంగా సాగాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ నిత్యహోమం, నిత్యారాధన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్ఠి, తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్ధానం ఽకార్య నిర్వహణాధికారిణి ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కనుల పండువలా జరిగాయి. రామచంద్రపురం రూరల్: అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ సమావేశానికి వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు పాల్గొననున్నారని తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే విధంగా జిల్లా, మండల స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
స్వామి పుష్కరిణిలో డేవిల్ ఫిష్!
గండేపల్లి: తాళ్లూరు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి గజేంద్ర మోక్ష పుష్కరిణిలో కొందరు ఆకతాయిలు సోమవారం చేపలను వల సహాయంతో పట్టుకుని తీసుకుపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పుష్కరిణిలో పెరిగిన చేపలను పట్టుకోవడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆలయాలలో ఉండే కోనేరులలో పెరిగిన చేపలను విష్టుమూర్తి మత్స్యావతారంగా భక్తులు భావిస్తారు. అంతటి పవిత్రమైన పుష్కరిణిలో చేపలను పట్టుకోవడం ఏమిటని భక్తులు మండిపడుతున్నారు.అసలు పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి?గజేంద్ర మోక్ష పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి? ప్రకృతి సహజసిద్ధమా! ఎవరైనా చేప పిల్లలను కోనేరులో వేశారా అన్నది భక్తులను వేధిస్తున్న ప్రశ్న. గతంలో కొందరు కోనేరులో చేప పిల్లలను పెంపకానికి వేయడంతో అడ్డుకున్నామని అర్చకులు చెబుతున్నారు. అప్పట్లో వేసిన చేపల పెట్టిన గుడ్లే ప్రస్తుతం కోనేరులో చేపలు పెరగడానికి కారణం కావచ్చు అంటున్నారు.ఘోరం జరిగే వరకూ మనసు కరగదాఘోరాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పోయే వరకూ స్పందించారా? అని ప్రశ్నిస్తున్నారు. పుష్కరిణికి మెట్ల మార్గం నాచుకట్టి కనీసం భద్రత లేకపోవడంతో ఇటీవల బొర్రంపాలెంకు చెందిన తండ్రీ కొడుకు స్నానాకికి దిగి మృతిచెందారు. దీంతో రెవెన్యూ, దేవదాయశాఖ, అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టేందుకు తగు సూచనలతో ప్రణాళికను సిద్ధం చేశారు.పుష్కరిణిలో నీటికి మోక్షంఎట్టకేలకు పుష్కరిణిలో నీటికి మోక్షం కలిగింది. ఇటీవల జరిగిన ప్రమాదంతో ఇది సాధ్యమైంది. కొన్ని సంవత్సరాలుగా పుష్కరిణిలో నీరు నిల్వ ఉండి నాచుకట్టి తట్టు తేలి పుష్కరిణి (కోనేరు) ప్రమాదకరంగా మారింది. పదవులు లేకపోయినా కొందరు పెత్తనం చెలాయించడం వల్ల ఆలయ అభివృద్ధికి ఆటకం కలుగుతోందని గ్రామస్తులు, భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నారు.పుష్కరిణిలో డేవిల్ ఫిష్పుష్కరిణిలో సాధారణ చేపలతో పాటు డేవిల్ ఫిష్లు పెరిగాయి. పుష్కరిణిలో నీరు తగ్గుముఖం పట్టడంతో చేపల వేటకు దిగిన వారి వలకు ఈ డేవిల్ ఫిష్లు చిక్కాయి. అటుగా వెళ్లే వారందూ వాటిని చూసేందుకు ఎగబడి ఫొటోలు తీసుకున్నారు. ఈ డేవిల్ ఫిష్, ఇతర జాతులకు చెందిన చేపలు పుష్కరిణి అడుగుబాగం బురదలో తేలియాడుతున్నాయి. -
మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుతూ టీచర్ల నిరశన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) టీచర్లకు మాన్యవల్ విధానంలో కౌన్సెలింగ్పై స్పష్టత లేకపోవడంతో సోమవారం జిల్లా విద్యాశాఖకార్యాలయం వద్ద ఽనిరాహార దీక్ష చేపట్టారు. ఆన్లైన్ విధానంలో వెబ్ కౌన్సెలింగ్కు ఉపాధ్యాయ ఐక్యసంఘాలు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. మాన్యువల్ కౌన్సెలింగ్కే కట్టుబడి ఉండటంతో వెబ్ ఆప్షన్లకు లింక్ విడుదల చేసినప్పటికీ ఆప్షన్లు ఇవ్వడం లేదు. దశలవారీ పోరాటంలో భాగంగా ఐక్యవేదిక పిలుపు మేరకు నిరహార దీక్ష చేపట్టారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడించాలని ఐక్యవేదిక నిర్ణయించింది. పీడీఎఫ్ ఎంఎల్సీ బొర్రా గోపిమూర్తి హాజరై సంఘీభావం తెలిపి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం తగదన్నారు. జీవో నంబర్ 22లో అనేక లోపాలున్నాయని, దాన్ని మార్పు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పలు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కరవాక తీరానికి వింత జీవులు
మలికిపురం: మండలంలోని గొల్లపాలెం, కరవాక సముద్ర తీరానికి వింత జీవులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జనసంచారం లేని సమయంలో, రాత్రివేళల్లో సముద్రం నుంచి భారీ జంతువులు తీరానికి వచ్చి సేద తీరి వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఆ జీవులు ఏంటనేది తెలియడం లేదు. అయితే జంతువుల అడుగులు ఇక్కడ స్పష్టంగా కనిపించడం గమనార్హం. సుమా రు రెండు నుంచి నాలుగు పెద్ద సముద్ర జంతువులు ఇలా తీరానికి వస్తున్నట్లు ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఇక్కడ సముద్రం లోతు అధికంగా ఉండడం వల్ల భారీ సముద్ర జీవులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 169 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. స్థానిక త్యాగరాజ నారాయణ సేవా దాస సమితి హాలులో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నామని చెప్పారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలుస్తారని అన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థీ ఈ విజయపరంపరను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఉన్నత స్థానాలకు చేరుకున్న తరువాత పుట్టిన ఊరిని, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలని, వారి అభ్యున్నతికి పాటు పడాలని కోరారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓలు ఆర్.కృష్ణానాయక్, ఆర్.సుస్మిత, పాఠశాల విద్య ఆర్జేడీ జి.నాగమణి, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. నెలాఖరుకు పోలవరం ఎడమ కాలువ పనులు ధవళేశ్వరం: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై ధవళేశ్వరం కాటన్ గెస్ట్ హౌస్లో ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాల సాధనలో వెనుకబడిన ఇంజినీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కార్యాలయంలో వచ్చే వారంలో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 24 అర్జీలుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 24 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిషోర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఉచిత సీటు నిరాకరించే పాఠశాలలపై చర్యలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లు నిరాకరించే పాఠశాలలపై చర్యలు తప్పవని జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు హెచ్చరించారు. ఎంఈఓలతో సోమవారం నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత అడ్మిషన్ల ప్రక్రియను మంగళవారం సాయంత్రం లోగా పూర్తి చేయాలన్నారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను గత నెల 29న ప్రకటించినప్పటికీ ఇంకా కొన్నిచోట్ల ప్రవేశాలు పూర్తి కాలేదన్నారు. అడ్మిషన్లు నిరాకరించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలను తగు ధ్రువీకరణతో తమ కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు నిరాసక్తత చూపితే వారి నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలని సూచించారు. -
ఇసుకాసురులు
● ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్ర సంగమ ప్రాంతం వరకూ.. ● చెలరేగిపోతున్న అక్రమార్కులు ● ఏడాదిలో రూ.100 కోట్లకు పైగా ఇసుక దందా ● గోదావరి ఇసుక, తువ్వ, సముద్ర తీరంలో బొండు ఇసుక, చేలల్లో మట్టి తవ్వకాలు ● దేనినీ వదలని కూటమి నాయకులు ● జిల్లాలో 20 అధికార ర్యాంపుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చీకటి పడితే చెలరేగిపోవడమే.. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో చీకటి పడితే చాలు. తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఐ.పోలవరం మండలంలో మరీ బరితెగించారు. ఎదుర్లంక పాత రేవులో ఇసుక తవ్వకాలు జోరుగా సాగాయి. ఇదే మండలం గుత్తెనదీవి, ముమ్మిడివరం మండలం గేదెల్లంక, కాట్రేనికోన మండలం నడవపల్లి సమీపంలోని పత్తిగొంది వద్ద వృద్ధ గౌతమీ పాయలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వేశారు. సొంతంగా డ్రెడ్జింగ్ గోదావరి నదీపాయల్లో పడవల మీద డ్రెడ్జర్లు ఏర్పాటు చేసి మరీ ఇసుక తోడేశారు. పి.గన్నవరం మండలం ఊ డిమూడిలంకలో అనధికార ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి ఇసుకతో పాటు మట్టి తవ్వకాల కోసం ఏకంగా డ్రెడ్జింగ్ చేశారు. ఇది లంక గ్రామాలకు పెనుముప్పు. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిలిపివేశారు. సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో గత ఏడాది ప్రభుత్వం మారినప్పటి నుంచి నేటి వరకూ ఇసుకాసురులు చెలరేగిపోతూనే ఉన్నారు. ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక అంటున్నా అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. ఇక అనధికార ర్యాంపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘నదీపాయల్లో బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనను టీడీపీ, జనసేన నేతలు వరంగా మార్చుకున్నారు. బాబు చెప్పిన దాని ప్రకారం జిల్లా ఇసుక కమిటీ ఎంపిక చేసిన ర్యాంపుల నుంచి మాత్రమే ఇసుక తవ్వాల్సి ఉంది. కానీ, ఇదే అదనుగా కూటమి పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్ర సంగమ ప్రాంతం వరకు గోదావరి నదీపాయలను దొలిచేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గత ఏడాది జూన్ 4న వెలువడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది. ఆ రోజు సాయంత్రం నుంచే ఇసుక అక్రమార్కులు దందాకు తెర తీశారు. అంతకు ముందు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరదలు, భారీ వర్షాల సమయంలో ఇసుకకు కొరత రాకుండా ఆరు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి భారీగా ఇసుక నిల్వ ఉంచింది. మొత్తం 2,44,131 మెట్రిక్ టన్నుల ఇసుకను ఆగస్టు మొదటి వారానికల్లా ఇసుకాసురులు ఊడ్చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఇసుక లేకుండా చేశారు. ప్రభుత్వం ఉచితం పేరుతో టన్నుకు రూ.265 చొప్పున వసూలు చేసిన విషయం తెలిసిందే. స్టాక్ పాయింట్ల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా లారీకి అదనంగా రూ.5 వేల చొప్పున వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గ కీలక నేతలు బి–ట్యాక్స్, వి–ట్యాక్స్ పేరుతో కోట్లు కొల్లగొట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఆర్జెడ్ పరిధిలో.. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) పరిధిలో సైతం అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. రావులపాలెం మండలం గోపాలపురం సీఆర్జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ ఇసుక తవ్వేశారు. అది కూడా గోపాలపురం – సిద్ధాంతం మధ్య ఉన్న రెండు వంతెనలకు 300 మీటర్ల సమీపంలోనే ఇసుక తవ్వేయడం గమనార్హం. పి.గన్నవరంలో సైతం సీఆర్జెడ్ నిబంధనలను తోసిరాజని తవ్వేశారు. అయినవిల్లి మండలం కొండుకుదురు పరిసర ప్రాంతాలు, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, కొమరగిరి, పాత ఇంజరం, గుత్తెనదీవి, జి.వేమవరం, ముమ్మిడివరం మండలం గేదెల్లంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక, గోవలంకలలోను సీఆర్జెడ్ పరిధిలో ఇసుక తవ్వేశారు. పి.గన్నవరంలో ‘జట్టు కట్టారు’ పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో కూటమి నేతలు ఎన్నికల్లోనే కాకుండా ఇసుక అక్రమ తవ్వకాల్లో సైతం జట్టు కట్టారు. మామిడికుదురు మండలం బి.దొడ్డవరం, ఆదుర్రులో ఇసుక తవ్వకాలు సాగించారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంకలో రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెంలో తువ్వ ఇసుక అనుమతులు తెచ్చుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అనుమతులివ్వగా దీనిని అడ్డం పెట్టుకుని అక్రమ తవ్వకాలు జోరుగా చేస్తున్నారు. పెదకందాలపాలెం, ఊడిమూడి, మానేపల్లిలో సైతం ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేత కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది. -
యోగాపై అవగాహన ర్యాలీ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాజమహేంద్రవరం వై జంక్షన్ నుంచి దేవీచౌక్ వరకూ, తిరిగి వై జంక్షన్ వరకూ సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు మాట్లాడుతూ, సుమారు 2,100 మందితో ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు రేపు బస్ పాస్లు రాజమహేంద్రవరం సిటీ: ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు ఆర్టీసీ డిపోల్లో బుధవారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ విద్యార్థులకు బస్ పాస్లు ఇవ్వనున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి వై.సత్యనారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. పీజీఆర్ఎస్కు 159 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించి జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 159 అర్జీలు సమర్పించారు. వారి నుంచి డీఆర్ఓ సీతారామమూర్తి, డీఎల్డీఓలు పి.వీణాదేవి తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్ఓ ఈ సందర్భంగా చెప్పారు. -
‘సాక్షి’పై దాడులు ఆపాలి
మంగళవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2025‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు తగవు : స్వాతి ప్రసాద్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యుడు కె.స్వాతిప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి బోర్డులపై సాక్షి అక్షరాలను తొలగించడం, పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలకు పాల్పడటం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. ఈ నెల 6న ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన లైవ్ షోలో అమరావతి మహిళలను కించపరుస్తూ ఒక పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యలు దారుణమని, దీనిపై పలుచోట్ల పౌరులు ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయని, వాటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం గర్హనీయమన్నారు. పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ నేతలు వెంటనే తమ కార్యకర్తలను అదుపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లైవ్ షో నిర్వాహకుడు, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు తన షోలో జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పినందున, ఆయన సీనియార్టీ, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనపై తదుపరి చర్యలు నిలిపివేయాలని స్వాతిప్రసాద్ కోరారు. ‘సాక్షి’పై దాడులను నిరసిస్తూ రాజానగరంలోని పత్రిక యూనిట్ కార్యాలయం వద్ద సిబ్బంది సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, పత్రికా కార్యాలయాలపై దాడులు వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బ్రాంచి మేనేజర్, రీజినల్ మేనేజర్ రమేష్రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కాగా, సాక్షిపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో పాత్రికేయులు పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. – రాజానగరం -
ఏదీ.. వ్యవసాయం!
నాడు రైతులకు పెద్ద పీట ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. మిచాంగ్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన కర్షకుల కన్నీళ్లు తుడిచింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటల లెక్క వేగంగా తేల్చింది. నెలల వ్యవధిలోనే పంటలకు పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 15,615 మంది రైతులకు సంబంధించి 10,487.02 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నట్లు నాడు వ్యవసాయ అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ప్రభుత్వం ఇంకో ఆలోచన చేయకుండా రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన రైతులకు రూ.14.80 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది. ● వైఎస్సార్ యంత్ర సేవ పథకం కింద గత ప్రభుత్వం రైతులకు అత్యాధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 367 ఆర్బీకేలు ఉండగా.. తొలి దశలో ప్రతి మండలంలో మూడు చొప్పున ఆర్బీకేలకు డ్రోన్లు మంజూరు చేసింది. జిల్లాకు మొత్తం 91 డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయ పనులకు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంది. ● ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించింది. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాలు, తూనికలు – కొలతలు, ఇతర శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేపట్టింది. రవాణా చార్జీల చెల్లింపులో జాగ్రత్తలు తీసుకున్నారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశారు. ● కూటమి పాలనలో వ్యవసాయ రంగం తిరోగమనం ● రబీ ధాన్యం సొమ్ము చెల్లింపులో నిర్లక్ష్యం ● అందని ‘అన్నదాత సుఖీభవ’ ● గత ప్రభుత్వంలో సాగుకు భరోసా ● అడగడుగునా రైతుకు తోడ్పాటు ● క్రమం తప్పకుండా రైతు భరోసా ● పంట నష్టపోయిన మూడు నెలల్లో పరిహారం సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తోంది. సాగుకు సిద్ధమైన సమయంలో పెట్టుబడులకు ‘అన్నదాత సుఖీభవ’ ఆర్థిక సాయం అందడం లేదు. పంట నష్టపోతే పరిహారం సైతం అందే పరిస్థితి లేదు. బీమా ప్రీమియం చెల్లింపునకు మంగళం పాడారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు పంట విక్రయాల వరకూ రైతులకు అడుగడుగునా అండగా నిలిచిన రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకే) నిర్వీర్యం చేశారు. ఆరుగాలం స్వేదం చిందించి, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తే.. సకాలంలో సొమ్ము ఇవ్వకుండా రైతులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. పొగాకుకు మద్దతు ధర లేదు. ఉద్యాన, ఆక్వా పంటలకు సైతం ప్రోత్సాహం కరువైంది. వెరసి అన్నదాతకు ఆర్తనాదాలు తప్పడం లేదు. గతమెంతో ఘనం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతులను ఆదుకునేందుకు, పెట్టుబడులకు అప్పులు చేయకుండా ఉండేందుకు ‘రైతు భరోసా’ పేరిట ఏటా రూ.13,500 ఆర్థిక సాయం అందించారు. ఈవిధంగా నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో అండగా నిలిచారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులోకి తెచ్చారు. ఆక్వా రైతులకు విద్యుత్లో రాయితీ సైతం అమలు చేశారు. వెరసి వ్యవసాయ రంగం సస్యశ్యామలంగా విరాజిల్లింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20,000 అందిస్తామని గొప్పగా ప్రకటించి, తొలి ఏడాది ఎగ్గొట్టారు. దీనిని ఈ ఏడాదైనా అమలు చేస్తారా అనే మీమాంస నెలకొంది. ఈ పథకం కోసం 1.35 లక్షల మంది రైతులు నిరీక్షిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్కు కోతలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు నాంది పడింది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా ఇస్తున్నామని ప్రకటనలు గుప్పించిన సర్కారు.. కొన్ని రోజులకే దీనిని 8 గంటలకు తగ్గించింది. తరువాత మరో గంట కుదించింది. విద్యుత్ అధికారుల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా.. ఎలాంటి ప్రకటనా చేయకుండా అనధికారిక కోతలు అమలు చేస్తోంది. తద్వారా వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తామన్న సంకేతాన్ని రైతులకు ఇస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్ట ప్రాంతాలైన దేవరపల్లి, గోపాలపురం, చాగల్లు, నల్లజర్లలో కొంత భాగం, నిడదవోలు రూరల్, పెరవలి మండలంలో కొన్ని గ్రామాలు, గోకవరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఎక్కువ శాతం రైతులు ఉద్యాన పంటలకు బోర్లపై ఆధారపడుతారు. వీరందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం.. దయనీయం.. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం నెల రోజులు గడుస్తున్నా ఆ డబ్బులు ఇవ్వడం లేదు. గత నెల 24వ తేదీ నాటికి 3.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి గాను రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.632.6 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత పంటల బీమా హుళక్కి ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బ తిన్న రైతులకు ఎటువంటి నష్టమూ వాటిల్లకుండా పరిహారం అందించడంలో ఉచిత పంటల బీమా కీలక భూమిక పోషించేది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలని నిబంధన పెట్టింది. 2024–25 రబీ సీజన్లో ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువరించింది. వరికి హెక్టారుకు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు వాటాను సైతం ప్రభుత్వమే భరించేది. పంటల వారీగా హెక్టారుకు మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీ పంట ఇన్పుట్ సబ్సిడీ వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000 మొక్కజొన్న రూ.12,500 మినుములు, పెసలు, శనగలు, రూ.10,000 పొద్దుతిరుగుడు, పొగాకు జొన్న 8,500 జిల్లాలో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు ఇలా.. నియోజకవర్గం రైతులు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ (హెక్టార్లలో) (రూ.లక్షల్లో) అనపర్తి 682 344.28 52.43235 రాజమండ్రి రూరల్ 214 112.55 18.8077 రాజానగరం 8,554 6032.16 838.6905 జగ్గంపేట (గోకవరం) 1,484 832.05 141.4485 గోపాలపురం 2,970 2195.81 279.91535 కొవ్వూరు 819 534.9 77.28165 నిడదవోలు 892 435.27 71.9426 -
కంప్యూటర్ ఇంజినీరింగ్పై గురి
● ఏపీ ఈఏపీ సెట్ టాపర్ల మనోగతం ● పలువురికి ఉత్తమ ర్యాంకులు రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షల ఫలితాలను సెట్ చైర్మన్, జేఎన్టీయూ–కాకినాడ వైస్ చాన్స్లర్ సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ ఈఏపీ సెట్కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగంలో 7,641 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 2,580 మంది, రెండు విభాగాల్లో ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల మనోగతమిదీ.. పేరు: ఆదిమూలం శ్రీహర్ష, అరవపాలెం, కడలి, రాజోలు ర్యాంకు: 20 తండ్రి: ఆదిమూలం వీర రాఘవులు, టీచర్ తల్లి: ఆదిమూలం పద్మావతి, టీచర్ లక్ష్యం: ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్. పేరు: చింతా సాయి కేశవరామ్, బొమ్మూరు ర్యాంకు: 27 తండ్రి: చింతా శ్రీనివాస్, ప్రైవేటు ఉద్యోగి తల్లి: చింతా శ్రీదేవి, గృహిణి లక్ష్యం: ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. పేరు: వనపర్తి తేజశ్రీ, రాజమహేంద్రవరం ర్యాంకు: 31 తండ్రి: వనపర్తి మల్లేశ్వరరావు, ఫైనాన్షియల్ అడ్వైజర్ తల్లి: లక్ష్మి, గృహిణి లక్ష్యం: ఐఐటీ చదివి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడం. పేరు: కంచుమర్తి ప్రణీత్, రాజమహేంద్రవరం ర్యాంకు: 36 తండ్రి: ప్రతాప్ జీవన్, ఏడీ, అగ్రికల్చర్ తల్లి: కంచుమర్తి మీనా, ఏఓ, అగ్రికల్చర్ లక్ష్యం: ముంబై ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్. పేరు: దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్ ర్యాంకు: 66 తండ్రి: దువ్వి శ్యామ్ కిరణ్, వైద్యులు తల్లి: నీలపాల పద్మజ, వైద్యులు లక్ష్యం: ఐఐటిలో కంప్యూటర్ ఇంజినీరింగ్. పేరు: కె.యశ్వంత్రాజా, మానేపల్లి, రాజోలు ర్యాంకు: 26 తండ్రి: నాగ వెంకటరత్నం నాయుడు, టీచర్ తల్లి: సత్యవేణి, గృహిణి లక్ష్యం: ఐఐటీ, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పేరు: డి.కిరీటి, రాజమహేంద్రవరం ర్యాంకు: 8 తండ్రి: డాక్టర్ డీఎస్ అరుణ్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్ తల్లి: లత, గృహిణి లక్ష్యం: కార్డియాలజీ, స్కల్బేస్ స్పెషలైజేషన్ పేరు: ఎం.సూర్య సంతోష్రెడ్డి, పందలపాక, బిక్కవోలు మండలం ర్యాంకు: 12 తండ్రి: డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి, వైద్యుడు తల్లి: సంధ్యాదేవి, కెమిస్ట్ లక్ష్యం: జనరల్ సర్జన్, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించడం. పేరు: ఎల్.అభిషేక్, ఎన్.కొత్తపల్లి, ఉప్పలగుప్తం ర్యాంకు: 39 తండ్రి: గణపతి, ఆక్వా కల్చర్ తల్లి: లక్ష్మి, గృహిణి లక్ష్యం: న్యూరోసర్జన్ -
లేబర్ కోడ్స్ రద్దుకు వచ్చే నెల 9న సమ్మె
రాజమహేంద్రవరం సిటీ: కార్మిక హక్కులు హరించేలా రూపొందించిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండుతో దేశవ్యాప్తంగా వచ్చే నెల 9న నిర్వహించనున్న కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.పవన్ పిలుపునిచ్చారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో సమ్మె వాల్పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన సార్వత్రిక సమ్మె జరుగుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా, ఇప్పుడున్న హక్కులు కూడా లేకుండా కార్మికులను పూర్తిగా అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పైకి మాత్రం చట్టాలను ఆధునీకరిస్తున్నామని చెబుతున్నా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ పేరుతో రద్దు చేసే కుట్ర చేస్తోందని. దీనిని కార్మిక వర్గం తిప్పికొట్టాలని అన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కేఎస్వీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీహెచ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీహెచ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా లేదా ప్రత్యక్షంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు తెలిపారు. ఆర్టీహెచ్ కేంద్రాన్ని సమన్వయ శాఖల అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, అక్కడి నుంచి వర్చువల్గా ధవళేశ్వరంలోని ఆర్టీహెచ్ను ప్రారంభిస్తారని చెప్పారు. ఒకవేళ నేరుగా హాజరైనా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆర్టీహెచ్ను ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ, విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలతో సీఎం సంభాషించి, వారి ఆలోచనలను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్, నగర పాలక సంస్థ ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్, సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, ఇన్చార్జి తహసీల్దార్ బి.శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు. నేడు పీజీఆర్ఎస్ రాజమహేంద్రవరం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవా రం కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల స్థాయిల్లో జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009 నంబర్ ద్వారా, 1100 నంబర్తో ‘మీకోసం కాల్ సెంటర్’కు కూడా నేరుగా అర్జీ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యాన అర్జీలు స్వీకరిస్తారన్నారు.యోగాపై నేడు ర్యాలీ రాజమహేంద్రవరం రూరల్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా సాధకులతో సోమవారం జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ర్యాలీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాసారు. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా యంత్రాంగం, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, ఆయుష్, వైద్య, ఆరోగ్య, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులతో కలిసి ఉదయం 7 గంటలకు స్థానిక వై జంక్షన్ నుంచి దేవీచౌక్ వరకూ, తిరిగి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. 172 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పరిధిలో 48 మంది ఇంటర్, 124 మంది పదో తరగతి విద్యార్థులకు సోమవారం షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులు అందజేస్తున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన ఈ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుతో పాటు రూ.20 వేల నగదు పురస్కారం, ధ్రువపత్రం అందజేస్తామన్నారు. -
రత్నగిరిపై మరో అపచారం!
● సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం ముందు భారీ వివాహ సెట్టింగ్ ● షెడ్డు సగం ఆక్రమించి అట్టహాసంగా వివాహం ● భక్తులకు ఇబ్బందులుఅన్నవరం: సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం ముందు సాధారణంగా దేవస్థానం వైదిక కార్యక్రమాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలూ నిర్వహించరు. అది కూడా వార్షిక కల్యాణ మండపాన్ని మూసివేసేలా ఎటువంటి సెట్టింగులనూ అనుమతించరు. వివాహ ముహూర్తాల సమయంలో ఆ కల్యాణ మండపం ముందున్న విశ్రాంతి మండపంలో పేద, మధ్యతరగతి వారు చిన్నచిన్న మండపాలు వేసుకుని వివాహాలు చేసుకుంటారు. ఆ షెడ్డు నిర్మించక ముందు నుంచే అక్కడ అలా వివాహాలు చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడూ పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి వివాహాలకు అనుమతి లేదు. కానీ, ఆదివారం ఉదయం మాత్రం యలమంచిలికి చెందిన వారు స్వామివా రి వార్షిక కల్యాణ వేదిక ముందు చాలా పెద్ద సెట్టింగ్ వేసి అట్టహాసంగా వివాహం చేశారు. వార్షిక కల్యాణ వేదిక ముందు దాతల సహకారంతో నిర్మించిన విశ్రాంతి షెడ్డును కుర్చీలు వేసి, సగం వరకూ ఆక్రమించేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అక్కడకు రాకుండా బారికేడ్లు కూడా కట్టేశారు. ఉదయం 6 నుంచి 11.30 గంటల వరకూ ఈ వివాహ వేడుకలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకూ ఆ సెట్టింగ్ అలాగే ఉంది. దీంతో మిగిలిన సగం షెడ్డులోనే సేద తీరుతూ భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పక్కనే ఉన్న రామాలయంలో దర్శనానికి వచ్చిన వారు కూడా అవస్థలు పడ్డారు. ఈ వివాహ సెట్టింగ్ వలన పండితులు నిర్వహించిన సూర్య నమస్కారాలు కూడా భక్తులకు కనిపించలేదు. పండితులు ఆ సెట్టింగ్ వెనుకనే ఉండి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విశ్రాంతి షెడ్డును ఇప్పటి వరకూ ఈవిధంగా ఆక్రమించి, వివాహం జరిపిన సందర్భం లేదు. ఈవిధంగా చేయడానికి గతంలో ఎప్పుడూ ఎవ్వరూ అనుమతి కూడా ఇవ్వలేదు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో వివాహం చేసుకోవడానికి నిర్వాహకులు దేవస్థానానికి రూ.10 వేలు చెల్లించారని అధికారులు చెప్పారు. వార్షిక కల్యాణ మండపం ముందు భాగాన్ని ఈ విధంగా ఆక్రమించి, వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం అపచారమేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్చ్.. నిరాశే..
రైతులను ఆదుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014లో ప్రతిపక్ష నేతగా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. గిట్టుబాటు ధర ఇవ్వకపోతే గుంటూరు బోర్డు కార్యాలయం వద్ద రైతులకు అండగా ధర్నా చేస్తానని ప్రకటించారు, అనంతరం కిలోకు రూ.10 నుంచి రూ.17 వరకూ ధర పెరిగి, రైతులకు మేలు జరిగింది. ● 2020 పంట కాలంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో పడి, రైతుల వద్ద లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించారు. మార్క్ఫెడ్కు రూ.200 కోట్లు మంజూరు చేసి, సుమారు 16 మిలియన్ల కిలోల పొగాకును కొనుగోలు చేయించారు. ● 2004లో పాదయాత్ర చేపట్టిన అప్పటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2005–06 పంట కాలంలో పండించిన పొగాకును కేంద్ర ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించారు. ● పుంజుకోని పొగాకు మార్కెట్ ● లో గ్రేడ్కు ట్రేడర్లు నో ● నాణ్యతకే ప్రాధాన్యం ● గిట్టుబాటు ధర దక్కక రైతుల గిలగిల దేవరపల్లి: రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు రెండు నెలలు దాటింది. ఇప్పటికీ మార్కెట్ పుంజుకోవడం లేదు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) పండే పొగాకు కొనుగోళ్లను ఈ ఏడాది మార్చి 24న ప్రారంభించారు. ఇప్పటి వరకూ 59 రోజులు వేలం నిర్వహించినా ధరలో పెరుగుదల లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో, వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్లు తక్కువగా ఉంటున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం నాటికి సుమారు 50 నుంచి 55 శాతం పొగాకు విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం అది 25 శాతానికే పరిమితమైంది. రైతు.. కుదేలు గత ఏడాది పొగాకుకు ఊహించని ధర పలికి, మంచి లాభాలు రావడంతో రైతులు కుబేరులయ్యారు. కిలోకు రూ.410 ధర లభించడంతో ఎకరాకు దాదాపు రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో, అధిక శాతం రైతులు పొగాకు సాగుపై మొగ్గు చూపారు. కనీసం ఎకరం పొలం లేని రైతులు 5 నుంచి 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేశారు. అధిక పెట్టుబడులు పెట్టి పంట పండించారు. తీరా పండించిన పొగాకును వేలం కేంద్రాలకు తీసుకు వెళ్లిన రైతులకు ఎదురు దెబ్బ తగిలింది. ఏటా అత్యధికంగా పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు కూడా ఈసారి అంతంత మాత్రంగానే కొంటున్నాయి. దీంతో, రైతులు సాగుకు తెచ్చిన అప్పులు గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో పొగాకు సాగుకు రూ.3 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఎకరం కౌలు రూ.70 వేలు, బ్యారన్ అద్దె రూ.50 వేలు, పెట్టుబడి దాదాపు రూ.1.50 లక్షలు అవుతోంది. చాలా మంది బ్యారన్కు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టి పంట పండించారు. తీరా చూస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇదే ధర కొనసాగితే ఎకరాకు రూ.లక్ష నష్టం వస్తుందని రైతులు దిగులు చెందుతున్నారు. గత అప్పులకు కొత్త అప్పులు తోడవడంతో రుణభారం పెరిగిందని కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు మందగించడంతో రైతుల వద్ద పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. వేలానికి వస్తున్న బేళ్లే తక్కువగా ఉండగా.. వాటిని కూడా ట్రేడర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. పరిమితికి మించి.. పండించి.. రైతులు 2024–25 పంట కాలంలో పరిమితికి మించి పొగాకు పండించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 59 మిలియన్ల పంటకు పొగాకు బోర్డు అనుమతి ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసింది. గత ఏడాది వచ్చిన ధర చూసి, ఆశపడి, అధిక విస్తీర్ణంలో సాగు చేయవద్దని అధికారులు, ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులు చెబుతూనే ఉన్నారు. ఈ ఏడాది జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పంట వేయాలని సూచించారు. కానీ, ఈ ఏడాది కూడా మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో నిషేధిత భూముల్లో కూడా రైతులు అనుమతి లేకుండా పంట సాగు చేశారు. దీంతో ఉత్పత్తి 80 మిలియన్ల కిలోలకు చేరింది. 24,450 హెక్టార్లలో పొగాకు సాగు చేసినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ, దాదాపు 40 వేల హెక్టార్లలో పంట వేసినట్టు సమాచారం. ఈవిధంగా కొనుగోలు సంస్థల అవసరానికి మించి పంట ఉత్పత్తి కావడంతో మార్కెట్ సంక్షోభంలో పడినట్టు అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకు బ్లాక్ సాయిల్ పొగాకు దక్షిణాదిన నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకు తక్కువ ధరకు లభించడంతో కొనుగోలు సంస్థలు అక్కడే ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు. బ్లాక్ సాయిల్ పొగాకు కిలో రూ.180కి లభిస్తూండగా, ఎన్ఎల్ఎస్ పొగాకు రూ.290 నుంచి రూ.220 వరకూ పలుకుతోంది. బ్లాక్ సాయిల్, ఎన్ఎల్ఎస్ పొగాకులో నికోటిన్ శాతం సమానంగా ఉండడంతో కొనుగోలుదారులు అక్కడి పొగాకు కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఎన్ఎల్ఎస్ పొగాకు కంటే బ్లాక్ సాయిల్ పొగాకు కిలో రూ.50 నుంచి రూ.80 తక్కువకు వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, పంట ఎక్కువగా పండినందున కొనుగోలు సంస్థలు సిండికేట్గా మారి ఇబ్బంది పెడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఖరారు కాని ఎగుమతి ఆర్డర్లు గుంటూరు ప్రధాన కేంద్రంగా ఉన్న పొగాకు బోర్డు తన పరిధిలో వేలం కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు, ట్రేడర్కు మధ్యవర్తిగా పని చేస్తుంది. దీనికి గాను రైతు, ట్రేడర్ నుంచి కిలోకు చెరొక రూపాయి చొప్పున కమీషన్ తీసుకుంటుంది. పంట ధరను బోర్డు నిర్ణయించదు. మార్కెట్లో డిమాండ్, సరఫరాను బట్టి ధర వస్తుంది. పొగాకు ఎగుమతి ఆర్డర్లు ఇంత వరకూ ఖరారు కాలేదు. ప్రధాన ఎగుమతి సంస్థలు పొగాకు శాంపిల్స్ను వివిధ దేశాల్లోని సిగరెట్ తయారీ సంస్థలకు పంపించాయి. మొదట పంపిన శాంపిల్స్ వారికి నచ్చకపోవడంతో రెండోసారి మళ్లీ పంపించారు. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీల ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించి పొగాకును పరిశీలించి వెళ్లారు. త్వరలో ఆర్డర్లు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. రూ.425.62 కోట్ల పొగాకు విక్రయాలు ఎన్ఎల్ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.425.62 కోట్ల విలువైన పొగాకు విక్రయాలు జరిగాయి. కిలోకు గరిష్టంగా రూ.290, కనిష్టంగా రూ.200, సగటున రూ.274.95 చొప్పున ధర పలికింది. ట్రేడర్లు 1,19,775 బేళ్లు కొనుగోలు చేశారు. పొగాకును నాలుగు గ్రేడులుగా విభజించి రైతులు బేళ్లు తయారు చేస్తారు. మొదటి గ్రేడు పొగాకు కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు మిగిలిన గ్రేడ్ల పొగాకు కొనడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. త్వరగా అమ్ముకోవాలి వేలానికి బేళ్లు తక్కువగా వస్తున్నాయి. కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. చాలా మంది రైతులు ఇప్పటి వరకూ కిలో పొగాకు కూడా అమ్మలేదు. వారికి నోటీసులిచ్చాం. వర్షాలు పడితే పొగాకు నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం మీడియం, బ్రైట్ గ్రేడ్ పొగాకు కొనుగోలు చేస్తున్నారు. ఇంతవరకూ 15.48 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. అమ్ముడుపోతున్న గ్రేడ్ పొగాకును వేలానికి తీసుకురావాలి. రైతులు తమ వద్ద మున్న పొగాకును త్వరితగతిన అమ్ముకోవాలి. – జీఎల్కే ప్రసాద్, రీజినల్ మేనేజర్, పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం జాగ్రత్తగా అమ్ముకోవడం మంచిది రాష్ట్రంలో 167 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా 240 మిలియన్ల కిలోలు పండింది. బర్లీ పొగాకు అధికంగా పండింది. అంతర్జాతీయంగా ప్రతి దేశంలోనూ పంట ఉత్పత్తి పెరిగింది. ఈ పరిస్థితిని అధికారులు, కంపెనీలు ముందు నుంచీ చెప్పినా ఒక్క రైతూ వినలేదు. బ్యారన్కు (4 ఎకరాల్లో) 41.25 క్వింటాళ్లు పండించాల్సి ఉండగా, 100 క్వింటాళ్లు పండించిన రైతులున్నారు. ఈ ఏడాది దెబ్బ తిన్న రైతులు ఎక్కువగానే ఉన్నారు. – గద్దే శేషగిరారావు, మాజీ వైస్ చైర్మన్, పొగాకు బోర్డు -
మట్టి మాయం
ఏలేశ్వరం: దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి తయారైంది. రైతులకు మేలు చేస్తున్న చెరువును సైతం వదలడం లేదు. వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న చెరువులో మట్టిపై కన్నుపడింది. ఏలేశ్వరం శివారులో సుమారు 1,800 విస్తీర్ణంలో ఉన్న తిమ్మరాజు చెరువు ద్వారా సుమారు ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో మట్టిని నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో అనుచరులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడైన ప్రత్తిపాడుకు చెందిన వ్యక్తి మట్టి తవ్వకాల ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. రెండు జేసీబీలతో వందలాది లారీలతో చెరువు గర్భంలోని మట్టిని తరలించేస్తున్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సైతం తమ స్థాయికి మించిన మామూళ్లు అందుతుండడంతో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫ తెలుగు తమ్ముళ్ల అక్రమ దందా ఫ సాగునీటి చెరువులో తవ్వకాలు ఫ చోద్యం చూస్తున్న అధికారులు -
భారం చెత్తగించండి..
ఫ రత్నగిరిపై పారిశుధ్యానికి పెరిగిన ఖర్చులు ఫ కొత్త టెండర్ అంచనాల ప్రకారం నెలకు రూ.80 లక్షలు అన్నవరం: సత్యదేవునికి వచ్చే ఆదాయం కన్నా అయ్యే ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది. ఏ నిర్మాణాలూ చేపట్టకుండా, సీజీఎఫ్, ఆడిట్ ఫీజు, అర్చక వెల్ఫేర్ ట్రస్ట్లకు చెల్లింపులు చేయకుండా అలా నెట్టుకుంటూ వెళ్తే సరి.. లేకపోతే బండి ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దేవస్థానానికి మరింత ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ మరింత భారం కానుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంతో సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో శానిటరీ మెటీరియల్తో సహ క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు గత ఏప్రిల్లో పిలిచిన సెంట్రలైజ్డ్ టెండర్ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరికొన్ని అంశాలను కలిపి త్వరలో రీటెండర్ పిలవనుంది. కొలిక్కి రాని టెండర్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని దాదాపు ఆరు నెలలు ఆలస్యం చేశారు. అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రహదారులు, టాయిలెట్ల క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ తదితర పనులు నిర్వహించడానికి రెండేళ్ల కాల పరిమితికి గత ఏప్రిల్లో పిలిచిన టెండర్ను రద్దు చేశారు. సత్రాల్లో ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణతో పాటు సిబ్బందికి వారాంతపు సెలవులు, మహిళా సిబ్బందికి నెల నెలా వచ్చే శారీకర మార్పులప్పుడు ఇవ్వాల్సిన సెలవులకు గాను అదనపు సిబ్బందిని కూడా కలుపుతూ కొత్తగా టెండర్ పిలవనున్నారు. పెరగనున్న సిబ్బంది, ఖర్చులు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లో విస్తీర్ణంలో శ్రీశైలం దేవస్థానం తరువాత అన్నవరం విస్తీర్ణం పెద్దది. అందుకే అన్నవరం దేవస్థానంలో ప్రస్తుతం 349 మంది మాత్రమే పని చేస్తుండగా, 375 మంది సిబ్బంది అవసరమని లెక్కేశారు. కొత్త టెండర్లో సిబ్బంది పెరిగితే శానిటరీ కాంట్రాక్ట్ వ్యయం కూడా పెరగనుందని అంచనా వేస్తున్నారు. కాగా, రెండేళ్లు శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్థ నెలకు రూ.49 లక్షలకు పారిశుధ్య పనులు నిర్వహించింది. నవంబర్తో ఆ సంస్థ టెండర్ ముగిసినా ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగించింది. ఆ సంస్థ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగాక దేవస్థానం తాత్కాలికంగా రెండు నెలల నుంచి గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీస్కు నెలకు రూ.59 లక్షలు చెల్లిస్తున్నారు. మరో రూ.12 లక్షలు శానిటరీ మెటీరియల్కు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం మీద రూ.71 లక్షల ఖర్చు అవుతోంది. పారిశుధ్య పనుల్లో అత్యాధునిక మిషనరీలు ఉపయోగించాలనే షరతుతో పాటు, శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం కచ్చితంగా జీతాలు చెల్లించాలనే షరతుతో ఈ సారి రూ. 80 లక్షలకు పైగా టెండర్ కోట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ. పది కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ సవరించాలి అన్నవరం దేవస్థానానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ.171.33 కోట్లు కాగా, అందులో పారిశుధ్య నిర్వహణకు రూ.7.5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు పారిశుధ్య నిర్వహణ వ్యయం రూ.పది కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉన్నందున ఆ మేరకు కేటాయింపులు సవరించాల్సి ఉంది. అభ్యంతరాల నేపథ్యంలో.. గత ఏప్రిల్లో పిలిచిన శానిటేషన్ టెండర్లలోని ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్న పలు సంస్థల ప్రతినిధులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలంటూ నిబంధన చేర్చారని, అటువంటప్పుడు సిబ్బందిని పెంచకుండా వీక్లీ ఆఫ్ ఎలా ఇవ్వాలంటూ వారి నుంచి ప్రశ్న వచ్చింది. దీంతో ఆ టెండర్ను రద్దు చేసి కొత్త నిబంధనలు, సిబ్బంది పెంపుదలతో కొత్త టెండర్ పిలవడానికి ప్రభుత్వం దేవదాయశాఖకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే రీ టెండర్ పిలవనున్నారు. -
అంతకందకూ తెగుళ్లు
ఫ వాతావరణ మార్పులతో ఇబ్బంది ఫ దెబ్బతింటున్న తోటలు ఫ సస్యరక్షణ అవసరమంటున్న అధికారులు పెరవలి: అంతకందకూ తెగుళ్లు వ్యాపిస్తున్నాయి.. ముప్పేట దాడి చేస్తున్నాయి.. రైతులను గుక్కతిప్పుకోకుండా మార్చుతున్నాయి.. తూర్పుగోదావరి జిల్లాలో 400 హెక్టార్లలో కంద సాగు జరుగుతోంది. ఇందులో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తాళ్లపూడి, కొవ్వూరు, నల్లజర్ల, చాగల్లు, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో ఎక్కువగా సాగవుతోంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ఒకపక్క వర్షాలు, మరోపక్క ఎండల కారణంగా తోటలపై తెగుళ్లు ఆశిస్తున్నాయని, తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇనుప ధాతులోపం, జింక్ ధాతులోపం, ఆకుమచ్చ తెగులు, కాండం లేక మొదలు కుళ్లు తెగులు, మొజాయిక్ తెగులు ఆశించాయని, దీని నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన తెలిపారు. అవి ఇలా.. ఇనుపధాతు లోపం: నీటి తడులు సక్రమంగా లేనప్పుడు ఇనుప ధాతులోపం సహజంగా కనిపిస్తుంది. ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా మారతాయి. ఈ ధాతు లోపాన్ని నివారించడానికి లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది, ఒక గ్రాము నిమ్మ ఉప్పు తగిన మోతాదులో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు పెడుతూ నీటి ఎద్దడి లేకుండా చూడాలి. జింకుధాతు లోపం: ఆకుల ఈనెలు మధ్య పసుపు వర్ణంగా మారి, క్రమేపి ఆకు మొత్తం పండి, ఎండిపోతాయి. ఈ లోపాన్ని నివారించడానికి లీటరు నీటికి మూడు గ్రాముల జింక్ సల్ఫేట్ మోతాదులో కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు: వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులపై చిన్న మచ్చలుగా ప్రారంభమై త్వరగా ఎదిగి, ఆకులు పండి, ఎండిపోయి దిగుబడులు బాగా తగ్గిపోతాయి. దీని నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. తెగులు ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ ఎమ్.జెడ్ మందును ఒకసారి మాత్రమే ఆకులు అన్ని పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. దుంపలు తవ్వకానికి కనీసం రెండు నెలల ముందు నుంచి మందును వాడరాదు. కాండం లేక మొదలు కుళ్లు ఈ తెగులు కాండం మొదలు వద్ద ఆశించి కాండం పూర్తిగా కుళ్లి చనిపోతుంది. దీని నివారణకు మురుగు, వర్షపు నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇదే చేలో తిరిగి ఈ పంట వేయరాదు. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. తెగులు ఆశించిన చెట్టు చుట్టూ మట్టిని గట్టుగా చేసి, తడి పెట్టినప్పుడు, నీటి ద్వారా ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టాలి. తెగులు ఆశించిన చెట్టు మొదలు చుట్టూ ఉన్న మట్టిని లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేక 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపిన ద్రావణంలో బాగా తడిపి తెగులును అరికట్టవచ్చు. 05ఎన్డీడీ48: ఎల్లో మొజాయిక్ తెగులు సోకి గిడసబారి ఇలా.. మొజాయిక్ తెగులుతెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్ర హరితాన్ని కోల్పోయి, తెలుపు, పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగా, ముడుచుకుపోయినట్టు ఉంటాయి. ఈ వైరస్ విత్తనపు దుంపలు, పేను బంక పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు విత్తన దుంపలను తెగులు సోకిన తోటల నుంచి సేకరించాలి. పేను బంక నివారణకు డైమిధోయేట్ లేదా మిథైల్ డెమెటాన్లను 2 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. -
లోక కల్యాణార్థం వేద సదస్యం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం ఆలయం సందడిగా మారింది. దేవస్థానం ముఖ్య అర్చకుడు గొడవర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శ్రీవారికి సహస్ర నామార్చన, బాలభోగ నివేదన, చతుస్థానార్చనలు, వేద పారాయణ, హోమాలు, బలిహరణ, మంగళశాసనాలు, తీర్థ ప్రసాద గోష్టి, సదస్యం (పండిత సన్మానం), వేద పారాయణ, నిత్య హోమం, బలిహరణ, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది వేద పండితుల ఆధ్వర్యంలో చతుర్వేద మహదాశీర్వచనంలో భాగంగా లోక కల్యాణార్థం వేద సదస్యం నిర్వహించారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పనపల్లికి చెందిన శ్రీశేష శారద భక్త బృందం ఆలపించిన పురంధర దాసు కీర్తనలు అబ్బురపర్చాయి. మానేపల్లికి చెందిన అరుణకుమారి, జీవీ రమణ బృందం ఆధ్యాత్మిక గీతాలు ఆలపించింది. అప్పనపల్లికి చెందిన కాజులూరి మహేంద్రకుమార్ బృందం ఆధ్యర్యంలో శ్రీసీతారామ బాలభక్త బృందం కళాకారులు తమదైన శైలిలో ఆధ్యాత్మిక గీతాలను పాడారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఎంపీసీలో 470కి 467 మార్కులను సీహెచ్ సందీప్, బత్తుల తన్మయిరిత్విక, ముత్యాల హర్షిత, సింగులూరి తేజ, మువెనున్నీషా ఖాన్, పర్చూరి పునీ త వెంకటసాయి, కిల్లంపల్లి రేవతిదేవి, జె.గోపికధమని, వడ్డి జ్వలితసాయిశివవాణి, మద్దు సూర్యదేవ్, కె. సత్యప్రియ, గెడ్డం రాజనవీన్తేజ, దాడి దినేశ్వర్, ఎ. వీరవెంకట సాయిలిఖిత, కేశన తపస్వి, డి.దీపిక, కొ వ్వూరి హాసిని, దీప్తిమహంతి సాత్విక్ సాధించారన్నా రు. 466 మార్కుల పైన 155 మంది, 465 మార్కుల పైన 506 మంది, 463 మార్కులపైన 1,224 మంది , 460 పైన 177 మంది, 450 పైన 204 మంది పొందారన్నారు. బైపీసీలో 440కి 437 మార్కులను మహమ్మ ద్ మనీష, గంగేయుల కృష్ణచందన, కాగ గాయత్రి, గంపల వీరవెంకట లక్ష్మణ్ సాధించారన్నారు. 435 పైన 90 మంది, 430 పైన 292 మంది, 400 పైగా మార్కులు 501 మంది సాధించారని నున్న తిరులమరావు వివరించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరిలు అభినందించారు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. -
పెళ్లింట వినోదం.. అంతలోనే విషాదం
గండేపల్లి: ఆ పెళ్లింట ఆనందంగా గడుపుతున్న వేళ అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, బంధువులతో కళకళలాడుతున్న చోట అంతులేని దుఃఖం మిగిలింది. అందరితో సరదాగా గడిపిన వ్యక్తి మృత్యుఒడికి చేరుకున్న సంఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు ములంపాక సురేష్ సోదరుడు కృష్ణ (48) హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాతకు గురయ్యాడు. గురువారం రాత్రి సమీప బంధువు వివాహ వేడుకలో కృష్ణ ఎంతో సరదాగా గడిపి, శుక్రవారం రాత్రి బంధువులు, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య దేవి, కొడుకు కార్తీక్, కూతురు హాసిని ఉన్నారు. మారేడుమిల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా కృష్ణ పని చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండే అతను మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నామని స్నేహితులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అతని కొడుకు 9వ తరగతి పూర్తి చేయగా, కుమార్తె ఇంటర్ ఫలితాల్లో 987 మార్కులు సాధించారు. ఈ ఆనందాన్ని పంచుకునేలోపే దూరమైపోయావా అంటూ కుటుంబ సభ్యుల రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పాముకాటుకు ఉపాధి కూలీ మృతి కాజులూరు: పెదలంకలో పాముకాటుకు ఉపాధి కూలీ పాలిక నాగేశ్వరరావు (62) మృతి చెందాడు. స్థానికులు, ఉపాధి ఏపీఓ వెంకటలక్ష్మి కథనం ప్రకారం.. శనివారం స్థానికంగా ఉండే పంట కాలువ వద్ద ఉపాధి పనులు చేస్తుండగా పాలిక నాగేశ్వరరావును తాచుపాము కరవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికులు సమీపంలోని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఏపీఓ వెంకటలకి్ష్మ్, సర్పంచ్ చెరువూరి వెంకట సత్యనారాయణ రాజు పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 07జెపిటి122: పెళ్లికి ముందు కల్యాణ వేదిక వద్ద భార్యతో కలసి డ్యాన్స్ చేస్తున్న కృష్ణ -
రత్నగిరిలో భక్తజన సంద్రం
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● 2,300 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. రద్దీ అధికంగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని కొంతసేపు నిలిపివేశారు. సుమారు 50 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,300 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. -
వాడపల్లి స్వామికి లక్ష్మీ కటాక్షం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తోంది. దేవస్థానం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఈ వివరాలు తెలిపారు. హుండీలు, టికెట్లు, లడ్డూ ప్రసాదం ద్వారా దేవస్థానానికి గత ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకూ రూ.17,73,72,207 ఆదాయం వచ్చిందన్నారు. నెలకు సగటున రూ.2,21,71,525 సమకూరిందన్నారు. శనివారాల్లో రూ.38,78,288 ఆదాయం లభించిందన్నారు. అలాగే, గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకూ రూ.26,11,62,698 రాబడి వచ్చిందన్నారు. అంతకు ముందు కాలంతో పోలిస్తే ఆదాయం రూ.8,37,90,491 పెరిగిందన్నారు. ఈ కాలంలో నెలకు సగటున రూ.3,26,45,337 వచ్చిందన్నారు. శనివారాల్లో రూ.55,86,962 మేర ఆదాయం రాగా అంతకు ముందుతో పోలిస్తే రూ.17,08,764 పెరుగుదల నమోదైందని తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రూ.1.14 కోట్లతో వివిధ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆలయ నిధులు రూ.11.17 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రూ.19.30 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు. కల్యాణోత్సవాలకు గత ఏడాది రూ.89,67,000, ఈ ఏడాది రూ.71,14,806 మేర ఖర్చయిందని చెప్పారు. మొత్తం మీద ఖర్చు రూ.18,52,194 తగ్గిందన్నారు. గోదాదేవి కల్యాణోత్సవాలకు గత ఏడాది రూ.99,14,800, ఈ ఏడాది రూ.54,07,220 చొప్పున ఖర్చయ్యాయని, ఈ వ్యయం రూ.45,07,580 తగ్గిందని చక్రధరరావు వివరించారు.ఫ గణనీయంగా పెరిగిన ఆదాయం ఫ రూ.1.14 కోట్లతో సౌకర్యాల కల్పన ఫ ఈఓ చక్రధరరావు -
త్యాగానికి ప్రతీక
ఈ నెలలోనే హజ్ యాత్ర అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ను బలివ్వడానికి తీసుకెళ్లే సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండగ జరుపుకొంటారు. దీనికి ప్రామాణికం ఖురాన్. ఈదుల్ ఫిత్ర్(రంజాన్)లో మాదిరిగా బక్రీదు పండగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా(ధార్మిక ప్రసంగం)తో ప్రారంభమవుతాయి. ఈ నెలలోనే హజ్ యాత్ర చేస్తారు. ఈ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్లి మస్జిద్–అల్–హరామ్లోని కాబా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 20 లక్షల మంది ముస్లింలు ఒకేసారి హజ్ ద్వారా ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. – సయ్యద్ నిజాముద్దీన్, ఇమామ్, మదీనా మసీద్, రాజమహేంద్రవరం ● జిల్లాలో ఘనంగా బక్రీద్ ● ముస్లింల ప్రత్యేక ప్రార్థనలుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పండగ ఈద్ ఉల్ అద్హాను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే శుద్ధి స్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి, ఈద్ నమాజ్ చదివేందుకు ఈద్గాలు, మసీదులకు వెళ్లారు. ఇబ్రహీమ్ ఖలీలుల్లా, ఇస్మాయిల్ జబీవుల్లా ప్రవక్తల త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండగ నిర్వహిస్తారు. ఇదే రోజు పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో హజ్ జరుగుతుంది. మక్కాలోని కాబా సమీపంలో ఉన్న అర్భత్ మైదానంలోని పెద్ద మసీదుల్లో బక్రీద్ నమాజ్తో పాటు పలు నియమ నిబంధనలతో ప్రార్థనలు చేస్తే హజ్ పూర్తవుతుంది. అల్లాహ్ సూచించిన ఇస్లాం ధర్మ సూత్రాల్లో ఇది ఒకటి. ప్రతి ముస్లిం తన జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను పవిత్ర గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సూచించారు. అవే ఈమాన్, రోజుకు ఐదు పూటలా నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర. ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒకసారైనా హజ్ చేయాలని ప్రస్తావించారు. ఇది 40 రోజుల యాత్ర. బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం రాయల్ మాస్క్, జామా మసీదు, అబూబకర్ షా మసీద్, బిలాల్ మసీద్, జాంపేట మసీదు, దానవాయిపేట మసీదుతో పాటు పలు ఈద్గాలలో ఈద్ నమాజ్ నిర్వహించారు.దైవం పట్ల విధేయత.. ఖుర్బానీ తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దానిని సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్కు ఖుర్బానీ ఇవ్వడం.. దైవం పట్ల దాసుడు విధేయత ను చాటుకునే ఒక అత్యున్నత సందర్భం. ధార్మికంగానే కాకుండా ప్రాపంచికంగా కూడా బక్రీద్ పండగ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. – ఎం.ఆరిఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ -
మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
రాజానగరం: మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘించి, వాణిజ్య పరమైన లాభాల కోసం చెరువులను తవ్వి, మట్టి తరలిస్తున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. మండలంలోని తూర్పు గానుగూడెం ఊర చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై శనివారం జిల్లా కలెక్టర్కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ప్రజల ప్రయోజనార్థం చెరువులో మట్టిని తవ్వాల్సి వస్తే జల వనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణలో జరగాలన్నారు. కానీ, ఆ విధానం లేకుండా, నిబంధనలు పాటించకుండా అధికార పార్టీ అండదండలతో జలవనరులు, మైనింగ్ శాఖల నిబంధనలను అతిక్రమించి ఈ తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ పెద్దల సహకారంతో నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ మాఫియా ఇప్పటికే రెచ్చిపోతోందని, చెరువుల పూడికల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి, మట్టి మాఫియా ఆగడాలకు బ్రేకులు వేయాలని, ఇప్పటి వరకూ అనధికారికంగా జరిగిన తవ్వకాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లా విద్యార్థులు ఫస్టియర్లో 42 శాతం, సెకండియర్లో 55 శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి (ఆర్ఐఓ) ఎన్ఎస్వీఎల్.నరసింహం తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 3,891 మందికి గాను 1,636 మంది, ద్వితీయ సంవత్సరం 2,624 మందికి గాను 1,437 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 819 మందికి 394 మంది, సెకండియర్లో 542 మందికి 316 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ఫలితాలపై అనుమానం ఉంటే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని నరసింహం సూచించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కడియం: యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన కడియపులంకలోని శ్రీ సత్యదేవ నర్సరీలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర–2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తదితరులతో కలసి సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేశారు. డ్రగ్స్ నివారణ, సహాయం కోసం ఏర్పాటు చేసిన ఈగల్ ప్రత్యేక వ్యవస్థ పోస్టర్ను ఆవిష్కరించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొత్త మామిడి మొక్కలను ఆవిష్కరించి, యోగాంధ్ర–11గా ఒక మొక్కకు, పీఎస్ఎన్–5గా మరో మొక్కకు పేరు పెట్టారు. జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేరావు రచించిన వృక్ష విలాపం గేయం ఆకట్టుకుంది. కార్యక్రమంలో యోగాంధ్ర నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, నర్సరీ రైతులు పుల్లా పెద సత్యనారాయణ, కుప్పాల దుర్గారావు, మెర్ల కృష్ణ, పుల్లా వీర వెంకట్రావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, అధికారులు పాల్గొన్నారు. 10న వర్చువల్గా ఆర్టీహెచ్ ప్రారంభం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీహెచ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఈ విషయం తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారులు కాటమనేని భాస్కర్, పీఎస్ ప్రద్యుమ్నలు శనివారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో తన క్యాంపు కార్యాలయం నుంచి ఆమె పాల్గొన్నారు. ఆర్టీహెచ్ ఏర్పాటుకు రాజమహేంద్రవరం రూరల్లో భవనం, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ధర ఫుల్.. సరకు నిల్
ఫ అమాంతం పెరిగిన రూప్చంద్ ధర ఫ కేజీ రూ.113 మలికిపురం: రూప్చంద్ చేపల ధరలు భారీగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం కేజీ రూ.30కి పడిపోయిన కేజీ రూప్చంద్ చేపలను ఎగుమతిదారులు ప్రస్తుతం రూ.114కు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో కాస్త పెరుగుదల ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారని ఎగుమతిదారులు అంటున్నారు. 2020లో అత్యధికంగా కిలో రూ.70 పలికిన ఈ చేప ధర అనంతరం రూ.30 కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ధర అయితే పెరిగిందిగానీ, రైతుల వద్ద సరకు లేదు. చెరువుల్లో కిలో రూప్చంద్ పెంపకానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.80 వరకూ అవుతోంది. నాలుగేళ్లుగా ధర లేక నష్టాల బారిన పడిన రైతులు రూప్చంద్ పెంపకం జోలికే వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధర పెరిగినా రైతుల వద్ద సరకు లేదు. ఈ చేపలకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బాగా డిమాండ్ ఉంది. గతంలో భారీగా ఎగుమతులు కోస్తా జిల్లాల్లో పదేళ్లుగా ఆక్వా రంగం కుదేలవుతున్న తరుణంలో రైతులు ఐదేళ్ల క్రితం ముమ్మరంగా రూప్చంద్ చేపల సాగు చేశారు. కోస్తా జిల్లాల నుంచి ఏటా 25 వేల టన్నుల రూప్చంద్ చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవని అంచనా. అయితే, ధర పతనమైన తరువాత రైతులు దాని జోలికి వెళ్లలేదు. వేరే అవకాశం లేని ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాలో ఈ చేపల సాగు నిలిపి వేశారు. అయినప్పటికీ ప్రస్తుతం ఏటా 5 వేల టన్నులకు పైగా ఈ చేపల ఎగుమతులు జరుగుతున్నట్లు అంచనా. ధర బాగున్న సమయంలో ఇక్కడి రైతులు సాగు చేశారు. ఎకరం చెరువులో సుమారు 4 వేల నుంచి 5 వేల వరకూ రూప్చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి నాలుగు టన్నుల పైనే దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని ఈ చేప పెరుగుతుంది. ఇవీ ప్రత్యేకతలు కొన్ని దేశాల్లో పిరాపింగా లేదా రెడ్–బెల్లీడ్ పాకు అని కూడా ఈ చేపను పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా మూలానికి చెందిన మంచినీటి చేప. రెడ్–బెల్లీడ్ పాకును అసోంలో సాధారణంగా శ్రీరుప్చంద్ఙ అని పిలుస్తారు. పాకు అనేది అనేక దక్షిణ అమెరికా చేప జాతులను సూచించడానికి ఉపయోగించే సాధారణ పేరు. ప్రత్యేకమైన రుచి కలిగిన చేపల్లో రూప్చంద్ ఒకటి. చెరువుల్లో పెంచుతారు కాబట్టి దీనిని కోస్తాలో చెరువు చందువా అని పిలుస్తారు. సముద్ర చందువా చేపలకు పోటీగా దీనిని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రవేశపెట్టారు. కోల్కతా నుంచి సీడ్ వస్తుంది. సముద్ర చందువా చేపలు ఒక సీజన్లో మాత్రమే లభిస్తాయి. రూప్చంద్ చేప మన దేశంతో పాటు బంగ్లాదేశ్, చైనాల్లో కూడా పెరుగుతుంది. అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. ఇది భిన్నమైన నిర్మాణ శైలి కలిగి ఉన్న చేప. సముద్ర చందువాతో పాటే, చెరువు చందువా చేపను చైనీస్లో ఫ్రాంఫెట్ అని పిలుస్తారు. తెలుగులో దీనిని చందువా లేదా సందువా అని అంటారు. ఈ జాతి చేపలు కొన్ని ఎరుపు, తెలుపు, నలుపు, సిల్వర్ రంగుల్లో ఉంటాయి. చెరువుల్లోనూ, నదుల్లోనూ పెరుగుతాయి. సిల్వర్ రంగు చేపలు ఉప్పునీటిలో సైతం పెరుగుతాయి. ఎముకను కలిగి ఉండటం ఈ చేప ప్రత్యేకత. అయితే ముళ్లు గుచ్చుకుంటాయనే భయం లేకుండా ఈ చేపలను ఎక్కువగా ఇష్టంగా తింటారు. రూప్చంద్ మాంసంలో ఎక్కువగా ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. పోషక విలువలు అధికంగా ఉండే ఈ చేపలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యకరం. దీనిలో ప్రత్యేకంగా అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రూప్చంద్ చేపలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్–సి, విటమిన్–ఇ, శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే మెదడు బాగా పని చేస్తుంది. గుండె జబ్బులకు గురి కాకుండా ఉంటారు. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం మానవ శరీరంలోని ఎంజైముల పని తీరును మెరుగుపరుస్తాయి. పెరిగిన ధరలు ప్రస్తుతం రూప్చంద్ ధరల పెరుగుదలకు పలు కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా ఈ చేపల సాగు మన దేశంలోని ఆంధ్రప్రదేశ్తో పాటు బంగ్లాదేశ్, చైనాల్లో ఎక్కువగా ఉంది. చైనా, బంగ్లాదేశ్ల నుంచి దొడ్డి దారిన రూప్చంద్ చేపలను ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్కు తక్కువ ధరలకే తరలించేవారు. ఇటీవల బంగ్లాదేశ్ సరిహద్దులో వాణిజ్యం నిలిచిపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం అటు నుంచి రూప్చంద్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో, ఆంధ్రాలో ఈ చేపలకు గిరాకీ పెరిగిందని భావిస్తున్నారు. -
సీలేరులో యువకుడి గల్లంతు
● నలుగురిని రక్షించిన పోలీసులు ● బాధితులు దేవరపల్లి వాసులు ● నదిలో స్నానాలు చేస్తూండగా ప్రమాదం దేవరపల్లి/మోతుగూడెం: స్నేహితులతో విహార యాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు సీలేరు నదిలో స్నానాలు చేస్తూండగా గల్లంతయ్యాడు. నలుగురు యువకులను పోలీసులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుమారు 30 మంది యువకులు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం సమీపంలోని పొల్లూరు ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. ఉదయం 9 గంటలకు ఇక్కడకు చేరుకున్న వారు సీలేరు నది ఒడ్డున వంటలు చేస్తూ స్నానాలు చేశారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత మళ్లీ సీలేరు నది మధ్యలోకి పి.సుధీర్, ఎ.నాగేంద్ర, రామకృష్ణ, ప్రభు, అభిలాష్ వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తూండగా అకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి పెరగడంతో వారు నదిలో చిక్కుకుపోయారు. వీరిలో అభిలాష్ (18) కొట్టుకుపోయాడు. మిగిలిన నలుగురూ నది మధ్యలో బండరాయిని పట్టుకుని ఉండిపోయారు. వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో ఎస్సై సాధిక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏపీ జెన్కో అధికారులకు సమాచారం అందించడంతో నదిలోకి నీటి విడుదలను తగ్గించారు. వెంటనే ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది తాళ్ల సాయంతో నలుగురు యువకులనూ ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోయిన అభిలాష్ ఆచూకీ శనివారం సాయంత్రం వరకూ లభ్యం కాలేదు. దీంతో అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విహార యాత్రకు వచ్చిన యువకులంతా తాపీమేస్త్రులుగా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా సీలేరు నదిలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరుగురు యువకులను ఎస్సై సాధిక్ ఆధ్వర్యంలో సిబ్బంది రక్షించారు. విహార యాత్రకు వచ్చిన వారు సీలేరు నదిలో దిగి ప్రమాదానికి గురవడం బాధాకరంగా ఉందని ఆయనన్నారు. విహార యాత్రకు వచ్చిన వారు ఒడ్డున స్నానాలు చేయకుండా నది మధ్యలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. త్వరలోనే సీలేరు నది ఒడ్డున ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
పదవుల కోసం తండ్రిపై ఆరోపణలు సరికాదు
● బార్లపూడి క్రాంతిపై మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఫైర్ ● పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఇంత దిగజారి పోవాలా? సాక్షి ప్రతినిధి, కాకినాడ: పదవుల కోసం నీ తండ్రి మీద, నీ తమ్ముడుపై ఆరోపణలు చేయడం సరికాదని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతికి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి సూచించారు. బార్లపూడి క్రాంతి ఇటీవల తండ్రి ముద్రగడపై, సోదరుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుపై చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీ శివకుమారి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం నీవు దిగజారి పోవాలా? అని ప్రశ్నించారు. నీ ఆడపడుచు ఆస్తికోసం మీ నాన్న వాచ్మన్ ఉద్యోగం చేయాలా? అన్నారు. నీ రాజకీయం కోసం మా నాయకుడు గిరిబాబుపై నిందలు వేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కోసం కొడుకు గిరిబాబు పడుతున్న కష్టాలు రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. ఎన్నికలప్పుడు నీ తండ్రి మీద ఆరోపణలు చేసి పరువు తీసినప్పుడు ఈ ప్రేమ ఏమైందన్నారు. మా నాయకుడు ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉంది. నీ తండ్రి ముద్రగడ పద్మనాభం ‘నా కూతురితో ఇంక సంబంధాలు లేవు, నాకు ఏమి జరిగినా చూడటానికి కూడా రావద్ద’ని ఎన్నికల సమయంలో మీడియా ముఖంగా చెప్పింది నీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. మా నాయకుడు గిరిబాబుపై ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తే త్వరలోనే మరిన్ని ఆధారాలతో నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మా నాయకుడు ముద్రగడ పద్మనాభం పై ఉన్న కక్షతోనే పవన్ కల్యాణ్ జనసేన నాయకురాలు క్రాంతితో వ్యాఖ్యలు చేయిస్తున్నారా? అనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న క్రాంతిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు ముద్రగడ ఆరోగ్యంపై నీ సలహాలు మాకు అవసరం లేదు ముందు మీ మామయ్య ఆరోగ్యం, నీ భర్త ఆరోగ్యం కోసం ట్రీట్ మెంట్ చేయించుకో అని ఆమెకు సూచించారు. -
ముందస్తు సాగుకు శ్రీకారం
దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో వేస్తున్న సార్వా వరినాట్లుమడి నుంచి ఆకు తీస్తున్న కూలీలు● మెట్ట ప్రాంతంలో నాట్లు ప్రారంభం ● బోర్ల కింద ముమ్మరంగా ఆకుమడులు ● అందుబాటులో 4,550 క్వింటాళ్ల విత్తనాలు ● 154 హెక్టార్లలో నారుమడులు ● 77,820 హెక్టార్లలో సార్వా వరి సాగు దేవరపల్లి: దాళ్వాలో పండించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకుండానే ముందస్తు సార్వా సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. బోర్ల కింద ముమ్మరంగా వరి ఆకుమడులు వేస్తున్నారు. అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల నారుమడులు వేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన ధవళేశ్వరం ఆనకట్ట నుంచి కాలువలకు నీరు విడుదల చేయడంతో డెల్టాలో రైతులు వరి నారుమడులు వేస్తుండగా, మెట్ట ప్రాంతంలోని రైతులు బోర్లు కింద ఆకుమడులు వేస్తున్నారు. చెరువులు, తాడిపూడి కాలువ కింద సాగుకు అవసరమైన నారును బోర్ల కింద ఆకుమడులు వేసి పెంచుతున్నారు. మే నెల రెండవ వారంలో వేసిన నారు నాటడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ మంది రైతులు వారం రోజుల నుంచి నారుమడులు వేస్తున్నారు. అధిక దిగుబడి వచ్చే వంగడాల సాగు ఖరీఫ్లో అధిక దిగుబడులు వచ్చే వంగడాలను రైతులు ఎంపిక చేసుకుని నారుమడులు వేస్తున్నారు. సన్న రకాలైన ఎంటీయూ–1224, బీపీటీ–2841, బీపీటీ–2270, బీపీటీ–2846, ఎల్ఎల్ఆర్–3238 రకాలతో పాటు ఎంటీయూ 1318 వంటి నూతన రకాల వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ వంగడాలతో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తున్నట్టు రైతులు తెలిపారు. రైతులకు అందుబాటులో విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవసరమైన వరి విత్తనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. ఖరీఫ్లో జిల్లాలో 77,820 హెక్టార్లలో రైతులు వరి పంట వేస్తున్నారు. దీనికి 38,910 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి. దీనిలో 400 క్వింటాళ్ల వరకు రాయితీపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ పంట కాలానికి దాదాపు 3,845 హెక్టార్లలో వరి నారుమడి వేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 154 హెక్టార్లలో నారుమడి వేశారు. 80 నుంచి 90 శాతం వరకు వరి రైతులు సొంత విత్తనం లేదా ఇతర రైతుల నుంచి తీసుకుని వినియోగిస్తున్నారు. 10 నుంచి 20 శాతం విత్తనాలు వివిధ మండలాల్లో లైసెన్సు కలిగిన విత్తన అమ్మకందారులు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 4,550 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మెట్ట ప్రాంతంలో ప్రారంభమైన వరినాట్లు కొవ్వూరు డివిజన్ పరిధిలోని దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో వరినాట్లు ప్రారంభించారు. దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో రైతు ధుమంతరావు వెంకటసుబ్బారావు తన ఏడు ఎకరాల పొలంలో రెండు రోజుల నుంచి వరినాట్లు వేశారు. నల్లజర్ల మండలం పోతవరంలో వరినాట్లు ప్రారంభించారు. ముందస్తుగా రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ఒకపక్క దాళ్వా పంట కొనుగోళ్లు పూర్తికాలేదు, మరొక పక్క ముమ్మరంగా ఆకుమడులు వేస్తుండగా, పై రెండు మండలాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. నూతన వంగడం ఎంటీయూ–1318 రైతులు సాగు చేస్తున్నారు.నూతన వంగడం సాగు ఖరీఫ్లో చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే నూతన వంగడం ఎంటీయూ–1318 నారుమడి మే నెల 19న బోరు కింద వేశాను. 18 రోజుల్లో ఆకు సిద్ధం కావడంతో రెండు రోజుల నుంచి ఏడు ఎకరాల్లో నాట్లు వేశాను. 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వస్తుంది. ముందస్తు సాగు చేయాలనే ఉద్దేశంతో ముందుగా నాట్లు వేశాను. మృగశిర కార్తెలో నాట్లు వేయడం ఆనవాయితీ. ఈ కార్తెలో వరినాట్లు వేస్తే దిగుబడులు ఆశాజనకం ఉంటాయని నమ్మకం. – ధుమంతరావు వెంకటసుబ్బారావు(బుజ్జి), రైతు, ధుమంతునిగూడెం, దేవరపల్లి మండలం 80,918 హెక్టార్లలో ఖరీఫ్ పంటలు జిల్లాలో 2025–25 పంట కాలానికి 80,918 హెక్టార్లలో వివిధ రకాల వ్యవసాయ పంటలు వేసే అవకాశం ఉంది. దీనిలో 77,820 హెక్టార్లు వరి, 2,595 హెక్టార్లు మినుము, 181 హెక్టార్లు మొక్కజొన్న, ఇతర పంటలైన పత్తి, వేరుశనగ పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంది. వరి సాగుకు అవసరమైన విత్తనాలు జిల్లాలోని 19 మండలాల్లో 4,5550 క్వింటాళ్లు అందుబాటులో ఉంచాం. 3,845 హెక్లార్లలో వరి నారుమడులు వేయవలసి ఉంది. ఇప్పటి వరకు 154 హెక్టార్లలో నారు మడులు వేశారు. ఎక్కువగా రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలను సాగు చేస్తున్నారు. వాతావరణ శాఖ ప్రస్తుత నివేదికల ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల సకాలంలో వర్షాలు పడతాయి. అక్కడక్కడా బోర్ల కింద నాట్లు వేస్తున్నారు. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం -
గోగులమ్మకు వెండి కిరీటం సమర్పణ
రాజానగరం: స్థానిక రావుల చెరువు గట్టున కొలువైవున్న గోగులమ్మకు వెండి కిరీటాన్ని భక్తులు శుక్రవారం సమర్పించారు. రాజానగరంతోపాటు పలుప్రాంతాలకు చెందిన భక్తులంతా కలసి సుమారు రూ.4 లక్షలు విలువ చేసే 4 కిలోల బరువు ఉన్న ఈ కిరీటాన్ని శనివారం జరిగే తిరునాళ్లను పురస్కరించుకుని అమ్మవారికి కానుకగా సమర్పించారు. శని, ఆదివారాలలో ఇక్కడ గోగులమ్మ వారి జాతర, తిరునాళ్లు, వీరభద్ర స్వామి సంబరాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగా డీఎస్సీ ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మెగా డీఎస్సీ పరీక్ష జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం లూధర్గిరిలోని రాజీవ్గాంధీ కళాశాల ఐయాన్ డిజిటల్ జోన్లో ఈ పరీక్షలు జరిగాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన మొదటి సెషన్కు 600 మంది అభ్యర్థులు హాజరుకావాల్సివుంది. అయితే 532 మంది పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగి సెషన్కు 600 మంది హాజరుకావాల్సివుండగా 527 మంది పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పి.ప్రశాంతి పరిశీలించారు. ఏర్పాట్లపై జిల్లా విద్యాశాఖాదికారి కె.వాసుదేవరావును అడిగి తెలుసుకున్నారు. 12 వరకు వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు కృషి ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వికసిత్ కృషి కార్యక్రమంలో భాగంగా ప్రీ ఖరీఫ్ ప్రచారాన్ని గత నెల 29 నుంచి ఈనెల 12వతేదీ వరకు చేపడుతున్నామని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా) డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ అన్నారు. శుక్రవారం ఐకార్–నిర్కా( సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తలు 2,000కు పైగా జట్లుగా ఏర్పడి ప్రతీరోజు గ్రామాలను సందర్శిస్తూ, కార్యక్రమం ఖరీఫ్ సీజన్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి, స్థిరమైన వ్యవసాయం చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయన్నారు. వికసిత్ కృషి ప్రోగ్రామ్ నోడల్ సైంటిస్ట్ డా.వై.సుబ్బయ్య పాల్గొన్నారు. వనదుర్గమ్మకు ఘనంగా చండీహోమంఅన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఘనంగా చండీ హోమం నిర్వహించారు. సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చండీ హోమం ప్రారంభించారు. హోమం అనంతరం 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు, నైవేద్యం సమర్పించారు. వనదుర్గ అమ్మవారికి నిర్వహించిన హోమంలో 40 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి ఆధ్వర్యంలో, కనకదుర్గకు అర్చకుడు హరగోపాల్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. -
ముందస్తుకు నీళ్లొదిలారు!
క్లోజర్ పనులు ఇప్పుడు మొదలు పెట్టారు డెల్టా పంట కాలువలకు ఏప్రిల్ 27వ తేదీ నుంచి నీళ్లు బంద్ చేశారు. అయితే చాలాచోట్ల మే 20 తరువాత క్లోజర్ పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెట్టడం గమనార్హం. ఆత్రేయపురం మండలం లొల్ల లాకు దిగువన మూడు కాలువల మీద మొదలు పెట్టిన సైఫన్ నిర్మాణాల పనులు నత్తను తలపిస్తున్నాయి. అమలాపురంలో బెండా కెనాల్ మీద ఈదరపల్లి, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణాలు సైతం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇవి కాకుండా పి.గన్నవరం, ముక్తేశ్వరం, అమలాపురం, మండపేట, కాకినాడ కాలువల మీద ఇప్పుడిప్పుడే పూడిక తీత పనులు చేపట్టడం గమనార్హం. ఈ పనులు ఈ నెల పదవ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కోనసీమ జిల్లా సమావేశంలో కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సైతం ఈ నెల పదవ తేదీకి పనులు పూర్తి చేయాలని కోరారు. అంటే ఈ నెల పది వరకు కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం లేదని తేలిపోయింది. అటువంటప్పుడు జూన్1వ తేదీన సాగు నీరు విడుదల చేయడం ఎందుకని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జూన్ పదో తేదీన నీరు విడుదల చేసినా పంట కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడం వల్ల ఈ నెల 20వ తేదీ వరకు ఆయకట్టుకు చేరే పరిస్థితి లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ● ఉమ్మడి జిల్లాలో ముందస్తు ఖరీఫ్ సాగు లేనట్టే ● ఒకటో తేదీన మొక్కుబడిగా నీటి విడుదల ● తూర్పు, మధ్య డెల్టాకు కలిపి 300 క్యూసెక్కులు మాత్రమే ● పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు ● పలుచోట్ల కాలువలపై పనులు ● మధ్య డెల్టాకు లొల్ల లాకుల వద్దనే నిలిపివేసిన అధికారులు ● ఈ మాత్రం దానికి ఎందుకు వదిలినట్టు అని రైతుల మండిపాటు సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్కు ప్రధాన అవరోధం ‘ముంపు’. సాగు ఆలస్యం అయి భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో ఖరీఫ్ దిగుబడికి సిద్ధంగా కావడం వల్ల చేలు ముంపుబారిన పడి రైతులు కోట్ల రూపాయలు నష్టపోవడం పరిపాటిగా మారింది. దీనిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డెల్టాలో ముందస్తు సాగును ప్రోత్సహించింది. దీనిలో భాగంగా జూన్ ఒకటి, రెండు తేదీలలో నీరు విడుదల చేయడం మొదలు పెట్టింది. ఈసారి కూటమి ప్రభుత్వం కూడా ముందస్తు సాగుకు నీరు విడుదల చేస్తామని చెప్పి కొంత మొత్తంలో నీరు విడుదల చేసింది. దానికి కూడా పలుచోట్ల హెడ్ స్లూయిజ్ల సమీపంలోనే నిలిపివేయడం గమనార్హం. కోటి ఆశల ఖరీఫ్కు ఆదిలోనే అవరోధం ఏర్పడింది. ముందస్తు సాగుకు వీలుగా జూన్ ఒకటి, రెండు తేదీల్లో పశ్చిమ, తూర్పు, మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలకు నీరు విడుదల చేశారు. కాని ఈ మూడు డెల్టాలకు కలిపి కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే నీరు వదులుతున్నారు. దీంతో పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కులు. మధ్య డెల్టాకు 100 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. దీనిలో మధ్య డెల్టాకు వదులుతున్న నీరు సమీపంలోని లొల్ల లాకుల వద్దనే నిలిపివేశారు. ఇక్కడ నిలిపివేయడం ద్వారా పి.గన్నవరం, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్, అమలాపురం కాలువలకు నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇక తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కుల వదలడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. దీని మీద కాకినాడ, మండపేట, కోరంగి, కోటిపల్లి, సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరందాల్సి ఉంది. అలాగే పశ్చిమ డెల్టాలో ఏలూరు, నర్సాపురం బ్యాంకు కెనాల్ ద్వారా సాగునీరందాల్సి ఉంది. ముందస్తుతో పలు విధాలుగా మేలు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్ పంటను గట్టెక్కించడం, రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం, మూడవ పంటగా అపరాలు సాగు చేయించడం ద్వా రా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేయడం వంటి ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంటోంది. పంట కాలువలపై మొదలు పెట్టిన పనులు ఇంకా ప్రాథమిక దశలో ఉండడంతో నీటి విడుదల ఆలస్యమై ఆ ప్రభావం ఖరీఫ్ సాగుపై పడనుంది. కాకినాడ జిల్లా పరిధిలో తూర్పు డెల్టాకు వచ్చి మొత్తం 3,40,548.78 ఎకరాల నికర ఆయకట్టు ఉండగా, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలు కలిపి 2,46,155.26 ఎకరాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పు, పశ్చిమ డెల్టాలు కలిపి మొత్తం 66,692.47 ఎకరాలు ఉంది. ఇక్కడ సాగు ఆలస్యమైతే వరి దిగుబడి వచ్చే సమయానికి వర్షాలు, తుపాన్ల బారిన పడే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ఆయకట్టు ఇలా (ఎకరాల్లో) జిల్లా రిజిస్టర్ ఆయకట్టు నికర ఆయకట్టు తూర్పు గోదావరి 77,464.14 66,692.47 -
బక్రీద్ పండగకు సర్వం సిద్ధం
● జిల్లాలో ఘనంగా ఈద్ ఉల్ అద్హా నిర్వహణకు ఏర్పాట్లు ● సర్వమానవాళి కోసం దువా చేయనున్న మత పెద్దలు సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): బక్రీద్ పండుగ ఈదుల్ అద్హాను శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఈద్గాలతో పాటు మసీదుల్లోనూ నమాజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే శుద్ధి స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకుని ఈద్ నమాజ్ చదివేందుకు ఈద్గాలకు బయలుదేరతారు. ‘అల్లాహు అక్బర్.... అంటూ తక్బీర్ చదువుకుంటూ తద్గాలకు చేరుకుంటారు.ఈద్గాలకు వెళ్లలేని వారు సమీపంలోని మసీదులకు వెళ్లి ఈద్ నమాజు చేస్తారు. ఈద్గా, మసీదుల్లో నమాజు చేయించే ఖాజీలు, మౌల్వీలు తమ ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం దువా చేస్తారు. సర్వమానవాళి శాంతి కోసం, జీవితంలో చేసిన పాపాల విముక్తి కోసం అల్లాహ్ను వేడుకుంటారు. నమాజు, దువా అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ కరచాలనం, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొందరు బక్రీద్ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. మరి కొందరు ఈద్కు ఒక రోజు ముందు రోజూ ఉపవాసం పాటిస్తారు. ఇంకొందరు పండగ రోజు ఈద్ నమాజు పూర్తయ్యే వరుకు ఏమీ తినకుండా వెళ్లి ప్రార్థనలు చేస్తారు. శుభాలు జరగాలని కోరుకుంటారు. త్యాగాలకు ప్రతీక.... ఇబ్రహీమ్ ఖలీలుల్లా, ఇస్మాయిల్ జబీవుల్లా ప్రవక్తల త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండగ చేసుకుంటారు. ఇదే రోజు పవిత్రమైన పుణ్యక్షేత్రం మక్కా ప్రాంతంలో హజ్ జరుగుతుంది. మక్కాలోని కాబా సమీపంలో ఉన్న అర్భత్ మైదానంలో ఉన్న పెద్ద మసీదులలో బక్రీద్ నమాజ్ చేయడంతో పాటు పలు నియమ నిబంధనలతో ప్రార్థనలు చేస్తే హజ్ పూర్తవుతుంది. అల్లాహ్ సూచించిన ఇస్లాం ధర్మ సూత్రాల్లో ఇది ఒకటి. తమ జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను పవిత్ర గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సూచించారు. అవే ఈమాన్, రోజుకు ఐదు పూటల నమాజ్, రోజా, జకాత్, హజ్యాత్ర, ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒకసారైనా హజ్ చేయాలని ప్రస్తావించారు. ఇది 40 రోజుల యాత్ర. ఈద్గాలతో పాటు మసీదుల్లో ఏర్పాట్లు రాజమహేంద్రవరంలో రాయల్ మాస్క్, జామా మసీదు, అబుబకర్ షామసీద్, బిలాల్ మసీద్, జాంపేట మసీదు, దానవాయిపేట మసీదు, పలు ఈద్గాలలో ఈద్ నమాజ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.