breaking news
East Godavari
-
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: శ్రావణ మాసంలోని ఆఖరి శనివారం కావడంతో అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అనేక మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాతల ఆర్థిక సాయంతో 8,500 మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నసమారాధన నిర్వహిస్తున్నామని, ప్రసాదాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. టంగుటూరి పోరాటం అందరికీ ఆదర్శం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్వాతంత్య్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం, ఆయన చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం టంగుటూరి జయంత్యుత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ టంగుటూరి నిజాయితీ, ధైర్యం, ప్రజాసేవ.. నేటి తరానికి మార్గదర్శకమన్నారు. మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ అధికారులను ఎదిరించి, తుపాకీకి గుండెను చూపిన ఆయన సాహసం ఎన్నటికీ మరువలేమన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, జిల్లా సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ, ఏఓ అలీ, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీ యువతకు డ్రైవింగ్ శిక్షణ రాజానగరం: భారీ వాహనాల డ్రైవింగ్పై షెడ్యూల్ కులాల యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ జేఏ ఝాన్సీ అన్నారు. అభ్యర్థులకు 20 ఏళ్లు పైబడి వయసు, లైట్ వెహికల్ లైసెన్స్ ఉండాలన్నారు. జిల్లాలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలను ఎంపిక చేసి, వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. దీని కోసం ఈ నెల 27వ తేదీ లోపు ఎస్సీ కార్పొరేషన్, కాకినాడకు దరఖాస్తులు అందజేయాలన్నారు. ఇతర వివరాలకు 76719 49476 నంబర్ను సంప్రదించాలని కోరారు. జిల్లాలో 2.52 లక్షల మంది నిరక్షరాస్యులు అనపర్తి: జిల్లాలో 2.52 లక్షల మంది నిరక్షరాస్యులను సర్వే ద్వారా గుర్తించినట్లు జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి అనిశెట్టి వెంకట్రావురెడ్డి తెలిపారు. అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి మండ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం వలంటీర్లకు అక్షరాస్యతపై శిక్షణ తరగతులు నిర్వహించా రు. ఈ సందర్భంగా వెంకట్రావురెడ్డి మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉల్లాస్, అక్షరాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో 79,528 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్య లు చేపట్టామన్నారు. ఇందుకోసం 7,950 మంది వలంటీర్లను ఎంపిక చేశామన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8న తరగతులు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. అప్పటి నుంచి 2026 మార్చి వరకు 100 గంటల పాటు నిరక్షరాస్యుల ఖాళీ సమయాన్ని బట్టి తరగతులు నిర్వహిస్తామన్నారు. -
బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించాలి
● కూటమి మోసాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు రాజమహేంద్రవరం రూరల్: అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. ఆయన శనివారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శులకు పలు బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తూ, గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ అబద్దపు హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించినా, పార్టీ సదరు వ్యక్తులతో పాటు ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో కనీసం రైతులకు యూరియా సరఫరా కూడా చేసే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. రీ సర్వే పేరుతో దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తాడాల విష్ణుచక్రవర్తి, దాసి వెంకట్రావు, కందుల శ్రీనాథ్, పటాన్ ఆన్సర్ బాషా, జుట్టా ఏడుకొండలు, కోర్ల ఉదయభాస్కర్ పాల్గొన్నారు. -
నిలకడగా గోదావరి
ధవళేశ్వరం: ఉగ్రరూపం దాల్చి నాలుగు రోజులుగా పరవళ్లు తొక్కిన గోదారమ్మ శాంతించింది. శనివారం తెల్లవారుజామున కాటన్ బ్యారేజీ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అనంతరం మరింత తగ్గుతూ రాత్రి 7 గంటలకు 11.70 అడుగులకు నీటి మట్టం చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. రాత్రి 8 గంటలకు 11.50 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజీ నుంచి 9,83,312 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 13,400 క్యూసెక్కులు వదిలారు. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి మట్టాలు మరింత తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆదివారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉంది. -
ఎవరో అతగాడు!
● కలకలం రేపిన సీఐ వ్యవహారం ● ఎక్కడ చూసినా ఇదే చర్చ ● ఇప్పటికే ఇంటెలిజెన్స్, ఎస్బీ అధికారులు నివేదికలు ● సీఐకి అండగా ఇద్దరు ఉన్నతాధికారులు ● బయటకు వస్తున్న అవినీతి కథలు సాక్షి, టాస్క్పోర్స్: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో పని చేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అక్రమ వ్యవహారం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది. ఆ సీఐ అడ్డగోలు తీరుపై ఇటీవల సాక్షి పత్రికలో శ్రీఆ సర్కిల్ సెపరేటుశ్రీ శీర్షికతో ప్రచురితమైన కథనం సంచలనం రేపింది. పోలీసు శాఖలో ఎవరి నోట విన్నా.. ఎవరా సీఐ ? అంటూ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నా, సదరు వ్యక్తిపై కనీస చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న పోలీసు శాఖలో ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. అతడు పనిచేసిన ప్రతి చోటా అవినీతి పనులు చేస్తూనే ఉంటాడని, అందుకు జిల్లాలో బలమైన ఉన్నతాధికారులకు ముడుపులు చెల్లించి, తను పనులను యథేచ్ఛగా చేసుకుంటాడని చెబుతున్నారు. ఆ సీఐపై వచ్చిన కథనం నిజమని ఇప్పటికే ఇంటిలిజెన్స్, ఎస్బీ అధికారులు నివేదికలు సమర్పించారని చెప్పుకుంటున్నారు. సిబ్బందికి ఇబ్బందులు ఆయన ఇలాకాలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో జరుగుతున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా పోలీస్ స్టేషన్లో ఎవరు ఏ విధులు నిర్వర్తించాలి, ఎవరు రైటర్గా ఉండాలి, ఎక్కడ పనిచేయాలని, ఎవరికి డ్యూటీ వేయాలనేది స్థానిక ఎస్సై చూసుకుంటారు. కానీ దానికి విరుద్ధంగా కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకూ అన్ని డ్యూటీలను ఈ సీఐ వేస్తారు. ఇప్పటికే ఈయన పనితీరు నచ్చక ముగ్గురు ఎస్సైలు స్వచ్ఛందంగా బదిలీపై వెళ్లిపోయారు. అనేక అక్రమాలు సీఐ అవినీతి బాగోతం బయట పడిన తర్వాత అనేక కొత్త అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో ఒక చీటింగ్ కేసులో ముద్దాయిని హైదరాబాద్లో అరెస్టు చేసి, అతడి వద్ద లక్షల్లో సొమ్ములు బలవంతంగా దండుకున్నారని ఆరోపణ వచ్చింది. ఇటీవల ఒక మండలంలో భారీగా బంగారం చోరీ జరిగితే, రికవరీ కేసులో అన్ని తానై నడిపించి, బంగారం సైడ్ చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై బాధితుడు ఒక ప్రజాప్రతినిధితో సీఐకి ఫోన్ చేయించినా పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. రిసార్టుల్లోనే కాకుండా అన్ని మండలాల్లోని లాడ్జిల్లో గదులు వినియోగించుకున్నట్టు చెబుతున్నారు. ఇటువంటి అవినీతి అధికారికి రాజకీయంగా, శాఖాపరంగా అండదండలు ఉన్నాయని గుసగుసలాడుకుంటున్నారు. -
కర్యాట్ టైమ్
మూషికాల బెడదను నివారిస్తాం ఖరీఫ్ సీజన్కు సంబంఽధించి పంట పొలాల్లో ఎలుకల బెడద అధికంగా ఉందని గుర్తించాం. అందులో భాగంగా మూషికాల బెడదను నివారించి రైతులకు స్వాంతన చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలుకల ఉధృతిని నివారించేందుకు బ్రోమోడయోలిన్ మందును రైతులకు సరఫరా చేయబోతున్నాం. అలాగే ఎలుకల నిర్మూలనకు పూర్వ సంప్రదాయ రీతికి అనుగుణంగా ఎలుకల కన్నాల్లో పొగను నింపి నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – సీహెచ్కేవీ చౌదరి, వ్యవసాయ సహాయ సంచాలకుడు, ఆలమూరు ఆలమూరు: ఎలక చిన్నదే.. సాగులో తెచ్చే నష్టం మాత్రం పెద్దది. అసలే ఖరీఫ్ సాగు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులకు ఈ సమస్య ప్రాణసంకటంగా మారింది. ప్రస్తుతం పిలక దశలో ఉన్న వరి పంటపై మూషికాల దాడి అధికమైంది. ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క ప్రతికూల పరిస్థితులు, ఇంకోపక్క ముషికాల బెడద కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రారంభ దశలోనే ఇలా ఉంటే పంట చేతి కొచ్చే సమయానికి మరింత నష్టాన్ని చేకూర్చుతాయని రైతన్నల్లో ఆందోళన నెలకొంది. సమస్య పరిష్కారానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇంకా బ్రోమోడయోలిన్ మందును పంపిణీ చేయకపోవడంతో రైతులను మనోవేదనకు గురిచేస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 1.64 లక్షల ఎకరాల్లో సుమారు 1.40 లక్షల మంది రైతులు ఖరీఫ్ సాగు చేస్తున్నారు. అందులో సుమారు 70 శాతం మేర వెదజల్లు సాగు చేపట్టగా, మిగిలిన పొలాల్లో సాధారణ పద్ధతిలో వరి నాట్లు వేశారు. ఈ సీజన్లో రైతులు అధిక విస్తీర్ణంలో స్వర్ణ (ఎంటీయూ 1318), తక్కువ విస్తీర్ణంలో ఎంటీయూ 7,029, విత్తనాల కోసం బొండాలు (ఎంటీయూ 3,626), పీఆర్ 126, ఎంటీయూ 1121 రకాన్ని సాగు చేస్తున్నారు. ఇంకా స్పందించక.. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎలుకల నివారణకు వ్యవసాయ శాఖ ఏటా బ్రోమోడయోలిన్్ మందును నూకలు, నూనె మిశ్రమంతో కలిపి రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పంట పొలాల్లో మూషికాల బెడద ఎక్కువై పంటను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. పంట పొలాల్లో ఎలుకలు తినేదాని కన్నా దాదాపు పది రెట్లు పంటను పాడుచేసే అవకాశం ఉంది. దీంతో పిలుక దశలోనే ఎలుకలను నిర్మూలిస్తే చిరు పొట్ట దశకు చేరుకునే సరికి వరి పంటకు సంబంధించి నష్ట నివారణకు దోహదపడుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ స్పందించి ఎలుకల నివారణకు బ్రోమోడయోలిన్ మందును త్వరితగతిన పంపిణీ చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇదో అదనపు ఖర్చు పంట పొలాలను నాశనం చేస్తున్న ఎలుకలను సంప్రదాయ పద్ధతిలో పట్టించేందుకు అఽధిక ఖర్చు అవుతుంది. చిలుకలు పండ్లను కొరికి పడేసినట్టు ఎలుకలు వరి దుబ్బులను కొరకడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వరి పంటను పూర్తి స్థాయిలో రక్షించాలనుకునేందుకు ఖర్చుకు వెనకాడని పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బుట్టల సహాయంతో, పొగపెట్టే విధానంతో ఎలుకలను మట్టుబెట్టే చర్యలకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఒక ఎకరం భూమిలో సరాసరి సుమారు 50 ఎలుకలకు పైగా పట్టివేత జరుగుతుండగా, ఒక్కొక్క ఎలుకకు కార్మికులు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు ఎలుకల నివారణకే రూ.మూడు వేల వరకూ ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. ఎలుకల బెడద ఎక్కువగా ఉండడంతో వాటిని పట్టేవారికి అదే స్థాయిలో డిమాండ్ కూడా ఉంది. సామూహిక నివారణ సాధ్యమేనా! వ్యవసాయ శాఖ ఏటా పంపిణీ చేసే బ్రోమోడయోలిన్ మందు సకాలంలో పంపిణీ చేసి రైతులను ఆదుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సామూహిక ఎలుకల నిర్మూలన చేపట్టడం ద్వారా పంట పొలాల్లో అధిక భాగం ఎలుకలను నిర్మూలించేందుకు అవకాశం ఉన్నందున ఆ మేరకు వ్యవసాయ శాఽఖ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. అయితే బ్రోమోడయోలిన్ మందును ఇంకా పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో సామూహిక ఎలుకల నివారణ సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫ పంటలపై ఎలక్కొట్టుడు ఫ పిలక దశలో పంట ధ్వంసం ఫ నివారణకు అధికారుల చర్యలు శూన్యం ఫ ఆందోళనలో అన్నదాతలు -
సమగ్ర మార్పులతో కొత్త బార్ విధానం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకు రావడమే లక్ష్యంగా కొత్త బార్ విధానం తీసుకు వచ్చిందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్శర్మ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో కొత్త బార్ పాలసీ, నవోదయం 2.0 పనితీరుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దేవ్శర్మ మాట్లాడుతూ ఈ పాలసీ బార్ లైసెన్సుల మంజూరులో ఆన్లైన్ విధానం, ఎంపిక ప్రక్రియలో సమానత్వం పాటిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 840 బార్లు ఉండగా, దీనిలో ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గాయని వివరించారు. ఇందులో భాగంగా 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు రూ.55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉంటే రూ.75 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని అన్నారు. ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఫీజులు పెంచుతామన్నారు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని, ఇక ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుందని అన్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 28న కలెక్టర్ లాటరీ తీసి బార్లు కేటాయిస్తారని, సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజా ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా సారా వ్యాపారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మూడు కన్నా ఎక్కువ సారా కేసుల్లో ఉన్నవారిపై పీడీ యాక్ట్ విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎకై ్సజ్ అధికారులు తమ తమ కార్యాలయాల్లో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, సీనియర్ అధికారులతో రాత్రిపూట గస్తీ చేయాలని ఆదేశించారు. సారా వినియోగంతో అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాల్లో విస్తృత దాడులు చేపట్టి సారా రహిత జిల్లాలుగా ప్రకటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళీ, అసిస్టెంట్ కమిషనర్ రేణుక, ఎకై ్సజ్ జిల్లా అధికారులు చింతాడ లావణ్య, ఎస్కేవీడీ ప్రసాద్, ఏఈఎస్లు నాగరాహుల్, రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
అప్పనపల్లికి పోటెత్తిన భక్తులు
మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి వారి పాత గుడితో పాటు కొత్త గుడి వద్ద సందడి నెలకొంది. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీ,భూ సమేత బాలబాలాజీ స్వామిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.1,18,346 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. నిత్య అన్నదానానికి రూ.58,120 విరాళాలు అందించారన్నారు. స్వామివారిని 1,500 మంది భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. వెయ్యి మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. వరద నీటిలో వ్యక్తి మృతదేహం రాజోలు: స్థానిక వశిష్టా నదీ తీరానికి వరద నీటిలో శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం (60) కొట్టుకువచ్చింది. ఇక్కడి కాటన్ పార్కు వద్ద చెట్ల పొదల్లో చిక్కుకుంది. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉరివేసుకుని యువకుడి మృతి పెరవలి: ఉసులుమర్రులో ఓ యువకుడు ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పెరవలి ఎస్ఐ వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. నరసాపురం గ్రామానికి చెందిన బొర్రా తరుణ్ (20) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, అమ్మమ్మ ఊరైన ఉసులమర్రుకు ఈ నెల 21న వచ్చాడు. ఏమైందో ఏమో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరివేసుకున్నాడని, పోస్టుమా ర్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. అతని మేనమామ బొరుసు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. గ్రామీణ క్రీడా పోటీలు కాకినాడ క్రైం: కాకినాడలోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా సంబరం ఆరంభమైంది. ఐడియల్ కళాఽశాల మైదానంలో ఈషా గ్రామోత్సవంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. 120 మందితో కూడిన 20 జట్లు పోటీల్లో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. హోరాహోరీ పోరులో నాలుగు జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. పోటీలు ఆదివారంతో ఫైనల్స్కు చేరుకుంటాయి. ఆదివారం మహిళల త్రోబాల్ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా..
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తర్వాత స్వామివారిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాఢ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గోవిందా.. అంటూ ముందుకు సాగారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించి స్వామివారికి వివిధ సేవలు నిర్వహించారు. వివిధ సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని కన్నుల పండువగా అలంకరించారు. దేవస్థానం నిర్వహించిన అన్నసమారాధనలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ సేవల ద్వారా ఈ ఒక్కరోజు సాయంత్రం 4 గంటల వరకూ దేవస్థానానికి రూ.55,60,552 ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది.ఫ మార్మోగిన వాడపల్లి క్షేత్రం ఫ ఒక్కరోజే రూ.55.60 లక్షల ఆదాయం -
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దుర్మరణం
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు ప్రధాన రహదారిలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామన్నపాలెం పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు కూచిపూడి బుల్లారావు(71) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించుకోవడానికి బైక్పై వెళ్తున్న సర్పంచ్ కూచిపూడి బుల్లారావును ఎదురుగా వస్తున్న క్వారీ టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. బుల్లారావు తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. సర్పంచ్ బుల్లారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వరలక్ష్మీ నమోస్తుతే..
● రత్నగిరిపై ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ● పాల్గొన్న 9,680 మంది మహి ళ లుఅన్నవరం : నిత్యం సత్యదేవుని నామజపంతో మార్మోగే రత్నగిరి శ్రావణమాసం ఐదో శుక్రవారం మాత్రం వేలాదిగా వచ్చిన మహిళల వరలక్ష్మీ నామ జపంతో మార్మోగింది. దేవస్థానంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. నిత్యకల్యాణ మండపంతో బాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలు, వాయవ్య, నైరుతి వ్రత మండపాలలో ఈ వ్రతాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బ్యాచ్లలో 9,680 మంది మహిళలు ఈ వ్రతాలు ఆచరించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రత్నగిరి ఆలయ ప్రాంగణం మహిళలతో కిటకిట లాడింది. ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం పండితులు విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య కల్యాణ మండపం వేదిక మీద ప్రతిష్ఠించిన వరలక్ష్మీ అమ్మవారికి ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం పూజలు చేసి హారతి ఇచ్చారు. కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు మహిళలతో వరలక్ష్మీ వ్రతం చేయించారు. వరలక్ష్మీ వ్రతకథను పాలంకి పట్టాభిరామ్మూర్తి చదివి వినిపించారు. హాజరైన మహిళలకు ఉచితంగా జాకెట్టుముక్క, సత్యదేవుని ప్రసాదం, అమ్మవారి రాగిరూపు, చేతికి కట్టుకునే తోరం అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో వీరికి భోజన సౌకర్యం కలుగజేశారు. మహిళలు గంటల తరబడి క్యూ లో నిలబడాల్సి వచ్చింది. దాంతో ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోగా వారిని వ్రతాల ఆఫీసులోకి తరలించి తోటి మహిళలు సపర్యలు చేశారు. అధికారులు రామాలయం వద్ద గల వార్షిక కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించి ఉంటే గంటల తరబడి మహిళలు వేచియుండే అవసరం ఉండేది.ప్రత్యేక అలంకరణలో వరలక్ష్మీ అమ్మవారు -
మునిసిపాలిటీలలో పనితీరు మెరుగుపరచాలి
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 10 ప్రధాన పనితీరు సూచికల అమలులో స్పష్టమైన ఫలితాలు ప్రతిబింబించాలని పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్కుమార్ ఆదేశించారు. శుక్రవారం రాజమహేంద్రవరం నగర పాలక కార్యాలయంలో కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ పి. ప్రశాంతి సమక్షంలో అధికారులతో కేపీఐ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, పుష్కరాల్లో రద్దీ నియంత్రణ కోసం ప్రతీ ఘాట్ వద్ద ఏఐ టెక్నాలజీతో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఐ సహాయంతో భక్తుల రద్దీని పసిగట్టి ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. కుంభమేళాలో ఈ విధానం విజయవంతమైందని, అందుకే గోదావరి పుష్కరాల్లోనూ అమలు చేసేలా ప్రతిపాదనలు, డీపీఆర్ అందచేయాలన్నారు. నగరంలో ఉన్న 1.12 లక్షల గృహాలకు అసెస్మెంట్ నంబర్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. మెరుగైన విధానంలో నీటి సరఫరా వినియోగం ఉందని, నీటి కనెక్షన్లు 100శాతం ఆన్లైన్లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డోర్ టు డోర్ చెత్త సేకరణ 99.42 శాతం సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్ఈడీ బల్బుల వినియోగం పెంచాలని, టాక్స్ కలెక్షన్, ఆటో మ్యూటేషన్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు, అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ పాల్గొన్నారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ -
ముగిసిన గిరిజన ప్రాచీన విజ్ఞాన సదస్సు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ – భవిషత్ తరాలకు చేర్చడం’ అనే అంశం పై రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు శుక్రవారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. ఇథోఫియా, ఇరాక్ వంటి దేశాల నుంచి వచ్చిన పరిశోధకులతోపాటు వివిధ అంశాలపై 65 మంది పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. వీటి నుంచి ఉత్తమ పరిశోధనలుగా ఎంపిక చేసిన 40 పరిశోధన పత్రాలతో ఒక పుస్తకాన్ని ముద్రించదలచామన్నారు. పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాలదొర, కో కన్వీనర్లు డాక్టర్ ఎం. గోపాలకృష్ణ, డాక్టర్ ఎలీషాబాబు, డాక్టర్ కె.రాజామణి, డాక్టర్ వి.రామకష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, రాజేశ్వరీదేవి, సమన్వయకర్త డాక్టర్ సాంబశిరావు పాల్గొన్నారు. -
ఖర్చును కంట్రోల్ చేద్దాం
● టోల్ గేట్ల ఫీజు బాధ తప్పినట్టే ● అమల్లోకి పాస్ విధానం ● రూ.3 వేలతో పొందే అవకాశం ● ఏడాది లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటు ఐ.పోలవరం: జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో టోల్గేట్లు కనిపిస్తాయి. అక్కడ టోల్ (చార్జీ) చెల్లించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు చక్రాలు, ఆపైన పెద్ద వాహనాలన్నీ ఈ టోల్ కట్టాల్సిందే. మనం వెళ్లే దారిలో ఎన్నిచోట్ల టోల్ గేట్లు ఉంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ట్రిప్పుకు (టోల్గేటు) ఇరువైపులా కలిపి రూ.90 నుంచి 200 వరకు ఖర్చవుతుంది. కానీ ఇక నుంచి ఆ భారం లేకుండా జాతీయ ఉపరితల రవాణా సంస్థ (ఎన్హెచ్) స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏడాది పాస్ విధానం తీసువచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు, లేదా 200 ట్రిప్పులకు అవకాశం ఉంటుంది. ఒక టోల్గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఆ దారిలో నాలుగు గేట్లు దాటి, తిరిగి వెనక్కి వస్తే ఎనిమిది ట్రిప్పులు అయినట్టు లెక్క. దేశవ్యాప్తంగా 1,150 టోల్ గేట్లు గతంలో నగదు రూపంలో టోల్ ఫీజు వసూలు చేయగా, ఆ తరువాత ఫాస్టాగ్ వచ్చింది. దీని వల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ చాలా వరకూ తగ్గిపోయింది. దేశ వ్యాప్తంగా సుమారు 1,150 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం మండలం అయినాపురం వద్ద, 216 ఏ జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద టోల్గేట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఎన్హెచ్ 216పై గొల్లప్రోలు వద్ద, ఎన్హెచ్ 16పై కృష్ణవరం వద్ద ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొవ్వూరు, నల్లజర్ల వద్ద టోల్గేట్లు కనిపిస్తాయి. పాస్ పొందే విధానం ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది. బస్సులు, టాక్సీలు, లారీలు, రవాణా, వాణిజ్య వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్కు వినియోగించే కార్లకు, జీప్లకు, వ్యాన్లకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ ప్రెస్ రహదారులలోని అన్ని టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది. అయితే ఉత్తరాదిన కొన్ని ఎక్స్ప్రెస్ హైవేలపై కూడా ఇది వర్తించదని తాజాగా ఎన్హెచ్ ప్రకటించింది. డిజిటల్ రూపంలోనూ.. ఫాస్టాగ్ ఏడాది పాస్ను డిజిటల్గా తీసుకోవచ్చు. రాజమార్గ్ యాత్ర యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీని కోసం రూ.మూడు వేలు చెల్లించాలి. సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. రూ.3 వేలు చెల్లించిన తర్వాత, ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్కు లింక్ అవుతుంది. ఈ పాస్ ఒక ఏడాది కాలం, లేదా 200 ట్రిప్పులకు మాత్రమే పనిచేస్తుంది. ఈ రెండింటిలో దేని గడువు ముందు అయినా ఇక పనిచేయదు. ఈ పాస్ వల్ల టోల్ చార్జీలు బాగా తగ్గుతాయి.ఉపయోగాలు ఇవే కేంద్ర రవాణా, ఉపరితల మంత్రిత్వ శాఖ ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ను ప్రవేశపెట్టింది. జాతీయ రహదారిపై సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణంలో టోల్ గేట్ భారం బాగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి విజయవాడ, రావులపాలెం మీదుగా సొంత కారులో వెళ్లి వస్తే, ఇప్పుడున్న టోల్ చార్జీలను బట్టి నాలుగు టోల్ గేట్ల వద్ద దాదాపు రూ.565 వరకు చెల్లించాలి. కానీ వార్షిక ఫాస్టాగ్ కొన్నవారికి కేవలం రూ.120 మాత్రమే అవుతుంది. అదే అమలాపురం నుంచి విశాఖపట్నం వరకు కాకినాడ, కత్తిపూడి మీదుగా వెళ్లేవారు రూ.500 వరకూ చార్జి కట్టాలి. ఇక నుంచి అది రూ.120కి తగ్గిపోతుంది. ఏడాది ఫాస్టాగ్ వల్ల సొంత కార్లు, వ్యాన్లు, జీపులు ఉన్న వారికి టోల్ చార్జీల భారం గణనీయంగా తగ్గుతుంది. -
నిరాశతో వెను తిరిగిన భక్తులు
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారరామభీమేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా చివరి శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రద్దు చేసిన విషయం తెలియక ఆలయానికి వచ్చిన అనేకమంది మహిళా భక్తులు వెనుతిరిగి వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మినహా మిగిలిన అన్ని శుక్రవారాలలోను 15 ఏళ్లుగా పంచారామ క్షేత్రంలో సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండు, నాల్గవ శుక్రవారాల్లో మాత్రమే పంచారామ క్షేత్రం సామూహిక వ్రతాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియని అనేకమంది మహిళలు చివరి వారంలోను సామూహిక వ్రతాలు జరుగుతాయని భావించి ఆలయానికి తరలి వచ్చారు. వ్రతాలు నిర్వహించడం లేదని తెలిసి మహిళలు నిరాశతో వెనుతిరిగి వెళ్లి పొయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రైవేటుగా వ్రతాలను నిర్వహించుకున్నారు. -
క్షమాపణ చెప్పలేదని స్నేహితుడి హత్య
● ఐదుగురు యువకుల ఘాతుకం ● వీడిన కేసు మిస్టరీ ● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని కై లాసభూమి సమీపంలో అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ధవళేశ్వరానికి చెందిన సతీష్ కుమార్ది హత్యగా తేలింది. ఈ ఘోరానికి పాల్పడిన అతడి ఐదుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సతీష్ కుమార్ క్షమాపణలు చెప్పలేదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. వేపాడి సతీష్ కుమార్ (22) రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో మూడేళ్లుగా సమోసాలు అమ్ముతు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8వ రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో టీవీ ఎక్కువగా సౌండ్ పెట్టుకుని చూస్తుండగా తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఈ నెల 15న కై లాస భూమి వెనుక శవమై కనిపించాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ శివ గణేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిందిలా.. వేపాడి సతీష్ కుమార్ ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున తోటి స్నేహితులైన ఆల్కాట్ గార్డెన్స్కు చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీ పేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్య తేజతో కలిసి మద్యం తాగడానికి గోదావరి గట్టు దిగువనున్న కై లాస భూమి శ్మశానం లోపలకు వెళ్లాడు. వారిలో భాగ్ రాధాకాంత్ భార్యపై ముందు రోజు రాత్రి వారు కలిసిన సమయంలో సతీష్ కుమార్ చులకనగా మాట్లాడాడు. దీనిపై క్షమాపణ చెప్పాలని సతీష్ కుమార్ను వారందరూ అడిగారు. దానికి అతడు నిరాకరించడంతో పాటు మళ్లీ ఆమైపె అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పటికే పూర్తిగా మద్యం తాగి ఉన్న ఐదుగురూ కోపంతో సతీష్ కుమార్పై దాడి చేశారు. నమ్మి సూర్యతేజ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తలపై కొట్టడంతో సతీష్ కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భాగ్ రాధాకాంత్ ఆ తర్వాత అతడి పీక మీద కాలు వేసి.. మృతి చెందే వరకు గట్టిగా తొక్కాడు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకుని వెళ్లి గోడ అవతల పారవేసి, ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. హత్యకు ఉపయోగించిన కర్ర, మృతుడి టీషర్టును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. -
గణేష్ మండపాలకు అనుమతి తప్పనిసరి
● నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ● ఎస్పీ నరసింహకిశోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న వినాయక చవితి వేడుకలపై పోలీసుశాఖ షరతులతో కూడిన నిబంధనలు జారీ చేసింది. మండపంలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించిన నాటి నుంచి నిమజ్జనం కార్యక్రమాలు పూర్తయ్యే వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విధించిన నిబంధనలు పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహకిశోర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలివీ... ● గణేష్ మండపాలు, పందిర్లు ఏర్పాటు చేసుకోవడానికి ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా అనుమతి పొందాలి. పోలీసు అనుమతి లేకుండా విగ్రహాలు, పందిరి, మండపాలు ఏర్పాట్లు చేయరాదు. ● విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మండపాల వద్ద డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టంలను ఉపయోగించరాదు. ● సాధారణ సౌండ్ బాక్స్లు మాత్రమే అనుమతించబడతాయి. మైక్ పర్మిషన్కు సంబంధిత డీఎస్పీ నుంచి అనుమతి తీసుకోవాలి. విగ్రహాల ఎత్తు 5 అడుగులు మించరాదు. ● ఈనెల 23వ తేదీలోగా మండపాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసువాలి. ● 27వ తేదీలోగా వినాయక నిమజ్జనాలు పూర్తి చేయాలి. 11 రోజుల తరువాత నిమజ్జనాలు అనుమతించరు. ● పబ్లిక్ ప్రదేశాలలో మండపం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రైవేట్ ప్రదేశాలలో గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు స్థలం యజమాని నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి. గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్కి, ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకూడదు. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదు. అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. తొక్కిసలాటలు, అగ్నిప్రమాదాలు ఎలక్ట్రికల్ షాక్ లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి ఈ విధంగా పొందాలి నిర్వాహకులు గణేష్ఉత్సవ్.నెట్ వెబ్సైట్లోకి వెళ్లి న్యూ అప్లికేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. వెరికేషన్ పూర్తయ్యాక దరఖాస్తు ఓపెన్ అవుతుంది. దరఖాస్తుదారుని పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, చిరునామా , కమిటీ పేరు, గణేష్ మండపం స్థలం, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు. ఏ సబ్ డివిజన్, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది, ఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు. గణేష్ నిమజ్జనం తేది, సమయం, వాహన వివరాలు ఎంటర్ చేయాలి. దీని ఆధారంగా పోలీసులు వచ్చి మండపం ప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులు ఇస్తారు. అనుమతి వచ్చిన తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్ను మండపంలో ప్రదర్శించాలి. తనిఖీ అధికారులు వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ను పరిశీలిస్తారు. -
బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల (హెచ్డబ్ల్యూఓ)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ హెచ్డబ్ల్యూవోల పనితీరును మెరుగుపరుచుకునేందుకు నూతన విధానం తీసుకువచ్చిందన్నారు. విధి నిర్వహణలను విభజించి ప్రతి దానికి కొన్ని మార్కులు కేటాయించిందన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని వసతి గృహాల్లో 244 మంది నాలుగో తరగతి సిబ్బందిని నియమిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ సంచా లకులు ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డీసీఎస్ రాజు, అధికారులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్
కాకినాడ సిటీ: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమ పోస్టర్ను శుక్రవారం స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, ఎం.గంగాసూరిబాబు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యావిధానం పేరు చెప్పి విద్యను మొత్తం ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కషాయీకరణ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యారంగంలోని పెండింగ్లో ఉన్న రూ.64 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి, ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు రూ.3 వేలకు పెంచి, హాస్టల్కు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్షుడు ఎ.వాసుదేవ్, జిల్లా కమిటీ సభ్యులు చిన్ని, జైశ్రీరామ్, నగర నాయకులు సత్యం, ఆదర్శ్ కార్త్తిక్, తేజ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ● గుడ్డిగూడెంలో ఘటన గోపాలపురం: ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే. గుడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళలు శుక్రవారం వరినాట్లకు వెళ్లారు. పని ముగించుకుని ట్రాక్టర్పై వస్తుండగా గుడ్డిగూడెం వద్ద గల కొవ్వాడ కాలువలోకి ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో సుగ్గనబోయిన పద్మ (42) అక్కడికక్కడే మృతి చెందగా, సుగ్గనబోయిన తాయారు, కత్తవ నాగలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. స్వల్ప గాయాలైన అడ్డ పోశమ్మ, అడబాల వెంకటలక్ష్మి, సిరిగినీడి రామలక్ష్మి, కత్తవ అచ్చమ్మలకు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందజేశారు. సంఘటనా స్థలాన్ని దేవరపల్లి సీఐ కె.నాగేశ్వర్ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ప్రమాద వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మిథున్ రెడ్డిని కలిసిన పెద్దిరెడ్డి.. బాబు సర్కార్పై సీరియస్
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో వైఎస్సార్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావడం లేదన్నారు.మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని కలిశారు. అనంతరం, పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నాయకుల విషయంలో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో జైలు వద్ద పోలీసుల ఆంక్షలు ఏ విధంగా ఉండేవో.. ఇప్పుడు ఎలా ఉన్నాయో స్పష్టంగా కనపడుతోంది. ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదు. కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇచ్చిన సదుపాయాలు కూడా అమలు కావటం లేదు. చంద్రబాబు సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం ఈ రకంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి మరింత సమర్థవంతంగా రాణిస్తారని భావిస్తున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు. -
గిరిజన విజ్ఞాన పరిరక్షణ అవసరం
● నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ● గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ సదస్సు కార్యక్రమంలో మాట్లాడుతున్న ఆచార్య ప్రసన్నశ్రీ సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న విద్యార్థులు రాజానగరం: భావితరాలకు గిరిజన విజ్ఞానాన్ని పరిరక్షించి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ, భవిషత్ తరాలకు చేర్చడం అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. గతాన్ని కాపాడుకోవడం ద్వారా భవిషత్తును శక్తిమంతంగా మార్చుకోవచ్చన్నారు. సమకాలీన సమాజంలో గిరిజన విజ్ఞాన వ్యవస్థలపై దృష్టి సారించడానికి ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. శతాబ్దాలుగా సంస్కృతి, భాష, జ్ఞానాన్ని కలిగి ఉన్న గోదావరి తీరాన నిర్వహిస్తున్న ఈ సదస్సు గిరిజన నాగరికత గుర్తింపునకు పునాదిగా తోడ్పడుతుందన్నారు. గిరిజన సంస్కృతి, విజ్ఞాన సంపదను డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఈ సందర్భంగా నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ (న్యూఢిల్లీ) ముద్రించిన గిరిజన సమరయోధులు, గిరిజన హక్కుల చిత్రపటాలను ఆంధ్ర వనవాసి కల్యాణాశ్రమ సహకారంతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను వీసీ ప్రారంభించారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా విద్యార్థులు, కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు, కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాలదొర, కో–కన్వీనర్లు డాక్టర్ ఎం.గోపాలకృష్ణ, డాక్టర్ ఎలీషాబాబు, డాక్టర్ కె.రాజామణి, డాక్టర్ వి.రామకృష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, రాజేశ్వరీదేవి, సమన్వయకర్త డాక్టర్ సాంబశిరావు, కేంద్రీయ విద్యాలయం అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు బుధవారం నోోటిఫికేషన్ విడుదల చేసింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆన్లైన్ విధానంలో డిగ్రీ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో ఉన్న కళాశాలల్లో గతేడాది సుమారు 32 వేల సీట్లు భర్తీ అయ్యాయి. కోనసీమ జిల్లా విషయానికొస్తే.. రామచంద్రపురం, మండపేట, రావులపాలెం, ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, ఆలమూరుల్లో డిగ్రీ కళాశాలలున్నాయి. ఇందులో సైన్స్, ఆర్ట్స్, కామర్స్, ఒకేషనల్ కోర్సుల్లో సుమారు 2,800 వరకు సీట్ల భర్తీకి అవకాశముంది. షెడ్యూల్ విద్యార్థులు ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఆన్లైన్లో పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 25 నుంచి 28వ తేదీ వరకు స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్/సీఏసీ/ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టవిటీస్/ఎన్సీసీ/గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వంటి స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్లు ఆయా యూనివర్సిటీల్లో ప్రాంతాల వారీగా నిర్వహిస్తారు. కోర్సులను ఎంపిక చేసుకోవడం కోసం ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. వెబ్ ఆప్షన్ల మార్పునకు ఈ నెల 29న అవకాశం కల్పించారు. ఈ నెల 31న సీట్ల అలాట్మెంట్, వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడే డిగ్రీ కోర్సులు జాతీయ విద్యా విధానం–2020 నిబంధనలను అనుసరించి ఏపీ ఉన్నత విద్యా మండలి 2023 నుంచి నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. సంప్రదాయక మూడేళ్ల డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులు అమలు చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రత్యేక కళాశాలల్లోనే నాలుగేళ్ల డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు. మెజార్టీ కళాశాలల్లో మాత్రం మూడేళ్ల డిగ్రీ కోర్సులున్నాయి. నాలుగేళ్ల కోర్సుల్లో గతంలో మాదిరిగా మూడు మేజర్ సబ్జెక్టులు కాకుండా, ఒక్కటే ఉంటుంది. దీనిని సింగిల్ మేజర్ డిగ్రీ కోర్సులుగా పిలుస్తారు. ఉదాహరణకు గతంలో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా బీఎస్సీ చదువుకునే విద్యార్థి సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంలో బీఎస్సీ బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టును ఎంచుకుని, తనకు నచ్చిన వేరే సబ్జెక్టును మైనర్ సబ్జెక్టుగా ఎంచుకుంటాడు. ఇంటర్లో ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో సంబంధం లేకుండా, ఏ సబ్జెక్టునైనా మైనర్ సబ్జెక్టుగా ఎంచుకోవచ్చు. డిగ్రీ ఫస్టియర్ చదివి మానేసినప్పటికీ సర్టిఫికెట్ కోర్సు అని ధ్రువపత్రం ఇస్తారు. రెండేళ్లయితే డిప్లొమా సర్టిఫికెట్, మూడేళ్లయితే డిగ్రీ సర్టిఫికెట్, నాలుగేళ్లు చదివితే డిగ్రీ ఆనర్ సర్టిఫికెట్ను అందజేస్తారు. డిగ్రీ నాలుగేళ్లలో ఎప్పుడైనా మధ్యలో చదువు మానేసే వెసులుబాటు ఉంది. దానికి అనుగుణంగానే సర్టిఫికెట్లు అందజేస్తారు. ఫస్టియర్ నుంచి నాలుగేళ్ల లోపు ఏ దశలో చదువు మానేసినా, ఏడేళ్ల లోపు తిరిగి ప్రవేశం పొంది, విద్యాభ్యాసం కొనసాగించే అవకాశం ఉంది. డిగ్రీ విద్యా విధానంలో ప్రవేశ పెట్టిన నూతన సింగిల్ మేజర్ ఆనర్స్ డిగ్రీ పద్ధతిపై ఇంటర్మీడియెట్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ విద్యా సంవత్సరం నుంచే నూతన విద్యా విధానం అమలవుతుంది. డిగ్రీ కళాశాలలుజిల్లా ప్రభుత్వ ప్రైవేట్ అటానమస్ కోనసీమ 07 45 01 తూర్పుగోదావరి 06 40 01 కాకినాడ 05 46 03 సీట్ల కేటాయింపు ఇలా.. గతంలో డిగ్రీ అడ్మిషన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వారీగా నిర్వహించే వారు కాదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిగ్రీ కోర్సుల్లో 50 శాతం రిజర్వేషన్లు తప్పనిసరి చేశారు. ఇంటర్మీడియెట్లో కామర్స్ ఓ సబ్జెక్టుగా చదివిన వారికి మొత్తం బీకాం కోర్సులో 60 శాతం సీట్లు కేటాయిస్తారు. అలాగే ఆర్ట్స్, హ్యుమానిటీస్లో ఇంటర్ పూర్తి చేసిన వారికి మొత్తం బీఏ సీట్లలో 50 శాతం, తక్కిన 50 శాతం ఇంటర్లో సైన్స్ గ్రూపు పూర్తి చేసిన వారికి కేటాయిస్తారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ(అక్ను) పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ సాధారణ కోర్సులతో పాటు, కంప్యూటర్, మార్కెట్ ఓరియంటెడ్, స్కిల్ ఓరియంటెడ్, ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. విద్యార్థులు aprche.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయాలి. సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సాధారణ కోర్సులకు రూ.3 వేల వరకు, కంప్యూటర్ కోర్సులకు రూ.8–రూ.10 వేల వరకు ఫీజు ఉంటుంది. సద్వినియోగం చేసుకోవాలి డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తక్కువ ఫీజులతో, అన్ని రకాల సౌకర్యాలతో డిగ్రీ చదువుకునే వెసులుబాటు ఉంది. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది. క్యాంపస్ ప్లేస్మెంట్లలో అత్యధికంగా ఎంపికవుతున్నారు. – డాక్టర్ సీహెచ్ రామకృష్ణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామచంద్రపురం అత్యున్నత ప్రమాణాలతో.. నాడు–నేడు పథకం ద్వారా డిగ్రీ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు సమకూరాయి. అత్యున్నత ప్రమాణాలతో డిగ్రీ కళాశాలల్లో తరగతి విద్యా బోధన జరుగుతుంది. అన్ని కళాశాలల్లో జవహర్ నాలెడ్జ్ సెంటర్, ప్లేస్మెంట్ సెల్స్ ఉన్నాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ కేపీ రాజు, ప్రిన్సిపాల్, వీకేవీ డిగ్రీ కళాశాల, కొత్తపేట, కోనసీమ జిల్లా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వారీగా సీట్ల కేటాయింపు ఆన్లైన్లో అభ్యర్థుల రిజిస్ట్రేషన్కు 26వ తేదీ తుది గడువు వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు ప్రారంభం ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం -
క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించాలి
అమలాపురం టౌన్: క్యాన్సర్ లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధి నిర్థారణ, నివారణ సామర్థ్యాలు బలోపేతమవుతాయని డీఎంహెచ్వో డాక్టర్ ఎం.దుర్గారావు దొర అన్నారు. జిల్లావ్యాప్తంగా క్యాన్సర్ లక్షణాలున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు చేపట్టిన శిక్షణ తరగతుల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రాథమిక, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, సిబ్బందికి గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఎంహెచ్వో మాట్లాడారు. గురువారం నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకూ అసంక్రిత వ్యాధుల (ఎన్సీడీ) గుర్తింపుపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ శిక్షణ తరగతుల నోడల్ ఆఫీసర్ తిరుమలరావు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం. సుమలత, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ కార్తీక్ రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు, డాక్టర్ అనూష శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించారు. కాన్సర్ కారకాలు, ప్రాథమిక దశ లో గుర్తించడం వంటి అంశాలను వివరించారు. -
సత్యదేవుని దర్శించిన మాజీ మంత్రి రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
అన్నవరం: వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కుటుంబ సమేతంగా గురువారం రత్నగిరిలో సత్యదేవుని దర్శనం చేసుకున్నారు. తొలుత రోజా దంపతులు, కల్యాణి దంపతులు సత్యదేవుని వ్రతాలాచరించారు. అనంతరం స్వామివారిని అంతరాలయంలో దర్శించి, పూజలు చేశారు. వారికి వేద పండితులు వేదాశీస్సులు అందజేయగా, సత్యదేవుని ప్రసాదాలను ప్రొటోకాల్ గుమస్తా గణపతి అందజేశారు. వారి వెంట పార్టీ నాయకుడు, అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు వాసిరెడ్డి జగన్నాథం(జమీలు) ఉన్నారు. కాగా, స్వామివారి ఆలయానికి దర్శనం కోసం వచ్చినందున మీడియాతో మాట్లాడేందుకు రోజా, కల్యాణి ఇష్టపడలేదు. -
భారీగా నల్ల బెల్లం స్వాధీనం
● ఇద్దరిపై కేసు నమోదు ● వ్యాన్ డ్రైవర్ను అరెస్టు చేసిన పోలీసులుప్రత్తిపాడు: అక్రమంగా వ్యాన్లో తరలిస్తున్న నాలుగు వేల కిలోల నల్లబెల్లాన్ని జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద గురువారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేయగా, వ్యాన్ డ్రైవర్ను అరెస్టు చేశారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం కృష్ణకుమారి వివరాల మేరకు, ఏలేశ్వరం మండలం యర్రవరం వద్ద జాతీయ రహదారిపై ఎకై ్సజ్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అనకాపల్లి నుంచి నల్లబెల్లం లోడుతో యర్రవరం వస్తున్న వ్యాన్ను తనిఖీ చేశారు. ఎటువంటి రసీదులు లేకుండా నల్లబెల్లం రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ మనం నాగరాజును అరెస్టు చేసి, వ్యాన్తో పాటు, 4 వేల కిలోల నల్లబెల్లాన్ని సీజ్ చేశారు. ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామానికి చెందిన బెల్లం వ్యాపారి శిలపరశెట్టి వెంకటరమణ అలియాస్ వెంకన్నబాబుపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్తు, ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్, ఎకై ్సజ్ ఎస్సై పున్నం వంశీరామ్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
తొట్టెలో కూర్చున్న కూలీ మృతి గోకవరం: తిరుమలాయపాలెం–రంపయర్రంపాలెం గ్రామాల మధ్య విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై పవన్కుమార్ వివరాల మేరకు, తిరుమలాయపాలెంలో ఇటుకల లోడు దింపిన ట్రాక్టర్ ఐదుగురు కూలీలతో రంపయర్రంపాలెం వైపు బయలుదేరింది. డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి, రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్తంభం విరిగి ట్రాక్టర్ తొట్టైపె పడటంతో, తొట్టెలో ఉన్న కూలీ కోరుకొండ మండలం కాపవరానికి చెందిన కొట్టాల శివ(36) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుముప్పు తప్పింది. మిగిలిన నలుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పవన్కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కళాకారుడి మృతి అన్నవరం: జాతీయ రహదారిపై స్థానిక మండపం జంక్షన్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దాపురానికి చెందిన సంగీత కళాకారుడు ఎన్.ఆదినారాయణ(60) మృతి చెందారు. తేటగుంట తిమ్మాపురంలో బంధువుల ఇంటికి వచ్చిన ఆయన తిరుగు ప్రయాణంలో మోటార్ బైక్పై పెద్దాపురం వెళుతున్నారు. మండపం సెంటర్ వద్ద వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై తమకు సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. -
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు కపిలేశ్వరపురం (మండపేట): ఎరువుల కృత్రిమ కొరతను సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు హెచ్చరించారు. మండపేటలో గురువారం ఆలమూరు సహాయ వ్యవసాయ సంచాలకుడు కేవీఎస్ చౌదరి, మండల వ్యవసాయాధికారి కె.ప్రభాకర్తో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. మండపేటలోని లక్ష్మీఅపూర్వ ఏజెన్సీస్ గౌడౌన్లోని నిల్వలు, రికార్డులను తనిఖీ చేసి, సంతృప్తి వ్యక్తం చేశారు. షాపుల ద్వారా ప్రతి బస్తాను ఈ–పాస్ ద్వారా విక్రయించాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన రైతుకు కచ్చితంగా బిల్లు అందజేయాలన్నారు. ఎరువు విక్రయించిన సమయానికి, బిల్లు అందజేసిన సమయానికి పొంతన లేని పక్షంలో చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట మండల విస్తరణాధికారి బాలకృష్ణ, ఇతర సిబ్బంది ఉన్నారు. -
ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు
కోరుకొండ: వినాయక చవితి ఉత్సవాలను నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఏఆర్ అదనపు ఎస్పీ చెంచురెడ్డి అన్నారు. కోరుకొండలోని నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ కార్యాలయంలో గురువారం కోరుకొండ, రాజానగరం సర్కిల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఉత్సవాలు నిర్వహించకూడదన్నారు. వివాదాస్పద ప్రాంతాలు, వివాదాలకు కారకులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉత్సవ కమిటీల్లో డీజేలు నిర్వహించే వారిని బైండోవర్ చేయాలన్నారు. అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేయనున్న కోరుకొండ దేవుని కోనేరు, శ్రీరంగపట్నంలోని చెరువులను పరిశీలించారు. సీఐ సత్య కిశోర్ మాట్లాడుతూ విగ్రహాలకు అనుమతులు తీసుకున్న తర్వాత మండలాల్లోని అన్ని కమిటీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో రాజానగరం సీఐ ప్రసన్న వీరగౌడ, కోరుకొండ ఎస్సై కూన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఒక్క రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కేవలం ఒక్క రూపాయికే సిమ్ కార్డు అందించి, మొదటి నెలలో 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అన్నారు. ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకే ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ సమీపంలో గల నన్నయ సంచార భవనం కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తక్కువ రీచార్జి ప్లాన్లతో మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఏజెన్సీలో కూడా టవర్స్ అదనంగా పెట్టి ఫ్రీక్వెన్సీ పెంచామన్నారు. సమావేశంలో డీజీఎంలు సత్యనారాయణ, శైలజ, ఏజీఎంలు భమిడి శ్రీనివాస్, శారద, జయశ్రీ పాల్గొన్నారు. వరి పొలాల్లో డ్రోన్తో కషాయాల పిచికారీ పెరవలి: ప్రకృతి వ్యవసాయంలో వరి పంటను ఆశించే తెగుళ్లను అరికట్టడానికి డ్రోన్ సాయంతో కషాయాలను పిచికారీ చేయిస్తున్నామని జిల్లా సేంద్రియ వ్యవసాయ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ సాకా రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు గురువారం పెరవలిలో వరిచేలపై డ్రోన్తో కషాయాల పిచికారీని అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 45 వేల ఎకరాల్లో, పెరవలి మండలంలో 800 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకోసం 30 డ్రోన్లను వినియోగిస్తామని, ఒక ఎకరానికి పిచికారీ చేసినందుకు రూ.300, కషాయాలకు రూ.200 చొప్పున రూ.500 తీసుకుంటున్నామన్నారు. దీని వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు ప్రతి వరిదుబ్బుపై మందు పిచికారీ జరుగుతుందన్నారు. వేపగింజల పొడి, ఇంగువ, చేపబెల్లం ద్రావణాన్ని పిచికారీ చేయటం వలన కాండం తొలుచు పురుగు, రసం పీల్చే పురుగులను నివారించవచ్చన్నారు. బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, వావిలాల కషాయాలను జీవామృతంతో కలిపి చల్లడం వల్ల ఎటువంటి తెగుళ్లనైనా అరికట్టే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మోడల్ మేకర్ ఉమా మహేశ్వరరావు, స్వాతిముత్యం, దీప్తి, మనోరంజని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
బాబూయ్ రచ్చ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నమ్మించి దగా చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారు. అది ప్రజలైనా, పార్టీ కోసం పనిచేసే నాయకులైనా, అందరినీ ఒకే గాటన కడతారు. ఎన్నికల్లో సేవలను వినియోగించుకుని గద్దెనెక్కాక కాలదన్నేయడంలో బాబును మించిన నాయకుడు లేడంటారు. అది అక్షరాలా నిజమని కాకినాడ రూరల్ నియోజకవర్గ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) తాజా ఎపిసోడ్తో స్పష్టమైంది. పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్తిబాబు వర్గం కాలా శ్రీనివాస్ను, వైరి వర్గం నుంచి కో కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్(బాబి) వర్గం కాకరపల్లి చలపతిరావును తెరమీదకు తీసుకు రావడంతో బుధవారం పార్టీ పరిశీలకులు నల్లమిల్లి వీర్రెడ్డి, పి.సుధాకర్రెడ్డి సమక్షంలోనే కుమ్ములాడుకున్నాయి. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నిక చివరకు రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. గతంలో ఎప్పుడూ లేనిది పార్టీ మండల కమిటీ అధ్యక్షుడి ఎంపిక కోసం కటకంశెట్టి బాబి వర్గం సీల్డ్ కవర్ రాజకీయాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని సత్తిబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. సీనియర్ అయిన తనను, తన భార్యను ఇంతలా అవమానించడాన్ని తట్టుకోలేక మనస్తాపంతో సత్తిబాబు పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. తమకు, అనుచరులకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక, ఆత్మాభిమానం దెబ్బతిని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా గౌరవం దక్కకపోవడంతో పదవిని విడిచిపెట్టాల్సి వచ్చిందని సత్తిబాబు వెల్లడించారు. సత్తిబాబును బుజ్జగించేందుకు పార్టీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, తోట నవీన్ వంటి నాయకులు ప్రయత్నించారు. కానీ అప్పటికే కోఆర్డినేటర్ పదవికి సత్తిబాబు రాజీనామా చేసేశారు. ఇక చేసేదేమీ లేక వారు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని ముక్తాయించారు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల నుంచి సత్తిబాబు అధిష్టానంపై అసహనంతోనే ఉన్నారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటును పొత్తు ధర్మానికి కట్టుబడి త్యాగం చేసిన పాపానికి సత్తిబాబుకు అతన్నే నమ్ముకుని టీడీపీ వెన్నంటే నిలిచిన అనుచర వర్గానికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. తమకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై గడచిన 14 నెలల కాలంలో అధినేత చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పర్యవేక్షించే నేతల వరకూ అందరి వద్ద నాలుగైదు పర్యాయాలు సాగిలపడినా అవమానాలే తప్ప ఆశాజనకమైన ప్రతి స్పందన కనిపించక పోవడాన్ని సత్తిబాబు వర్గం సీరియస్గా తీసుకుంది. ఉదయం అక్కడ.. సాయంత్రం ఇక్కడ అవమానాలపై సత్తిబాబు వర్గం ఉదయం ఆరోపణలకు దిగితే సాయంత్రానికి వైరి వర్గంగా ఉన్న కటకంశెట్టి బాబి అనుచరులు సత్తిబాబుపై ఎదురుదాడికి దిగడంతో టీడీపీలో కుమ్ములాటలు రచ్చకెక్కాయి. రూరల్ మండల అధ్యక్ష పదవికి బాబి వర్గం ప్రతిపాదించిన కాకరపల్లి చలపతి సహా కముజు నెహ్రూ, గీశాల శ్రీనివాస్, గుడాల లోవరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, తుమ్మల వెంకన్న తదితరులు మీడియా సమావేశంలో సత్తిబాబుపై అనేక ఆరోపణలు సంధించారు. 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదని చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టలేదా అని వారు నిలదీశారు. కార్పొరేషన్ డైరెక్టర్గా పనికి ఆహార పథకంలో బియ్యం స్వాహా చేయడంపై కేసు నమోదు, తరచూ పార్టీపై అలక వహించడం, ఆనక ఇంట్లో కూర్చోవడం సత్తిబాబుకు ఆనవాయితీగా వస్తున్నదేనంటూ వారు తాజా ఎపిసోడ్ను కొట్టిపారేస్తున్నారు. సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడంతో టీడీపీలో ఇరువర్గాల మధ్య రాద్ధాంతం రావణకాష్టాన్ని తలపిస్తోంది.పిల్లి సత్తిబాబు కటకంశెట్టి బాబిఒక్క పదవీ దక్కలేదని..ఎన్నికలై అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా తమ నాయకుడికి ఒక్కటంటే ఒక్క పదవి కూడా దక్కలేదని సత్తిబాబు అనుచరులు బాహాటంగానే ఆక్షేపిస్తున్నారు. పేరుకే కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ అయినా ఆ స్థాయిలో అటు పార్టీలోనూ, ఇటు అధికారిక కార్యక్రమాల్లోనూ ప్రాతినిధ్యం దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పైనుంచి కింది వరకూ పొమ్మనకుండానే పొగబెడుతున్నారని ఆ వర్గంలో బలంగా నాటుకుపోయింది. లేదంటే పార్టీ కోఆర్డినేటర్గా నియోజకవర్గంలో 25 గ్రామాల్లో బూత్ కమిటీలు అన్నింటినీ పూర్తి చేసి రూరల్ మండల అధ్యక్షుడి నియామకానికి అడ్డుతగలడం ఏంటని సత్తిబాబు సహా ఆ వర్గం మండిపడుతోంది. రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కూడా సత్తిబాబు పనిలో పనిగా పలు విమర్శలు సంధించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక కనీసం పనుల్లో కూడా ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని సత్తిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా 50 శాతం పదవులు, పనులు తమ పార్టీ నేతలకు దక్కాల్సిందేనని అన్నారు. ఎన్నికల్లో తమ సేవలను వినియోగించుకుని అవసరం తీరిపోయాక కూరలో కరివేపాకులా తీసిపడేస్తారా అని సత్తిబాబు వర్గం నిలదీస్తోంది. జరుగుతున్న అవమానాలను చంద్రబాబు సహా జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుల వరకూ తీసుకువెళ్లినా బీసీ సామాజిక వర్గానికి చెందడంతో తొక్కేస్తున్నారనే ఆవేదనతో ఆ వర్గం కుతకుతలాడుతోంది. ఫ టీడీపీలో ఆధిపత్య పోరు ఫ రోడ్డెక్కిన నాయకుల కుమ్ములాట ఫ కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ పదవికి సత్తిబాబు రాజీనామా ఫ ఇది మామూలే అంటున్న బాబీ వర్గం -
వర్షాలకు ఆందోళన వద్దు
రాజమహేంద్రవరం రూరల్: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ చల్లా వెంకట నరసింహారావు అన్నారు. ఆయన గురువారం శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో కలిసి తొర్రేడు, వెంకటనగరం, కోలమూరు గ్రామాల్లోని వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ జల్ల కాలువ కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరి ముంపునకు గురైందని, తొందరలోనే అదనపు నీరు బయటకు పోతుందన్నారు. ఈ వర్షాలు పంట ఎదుగుదలకు దోహదం చేయడమే కాక, ఆకుముడత, ఆకునల్లి పురుగులు నీటిలో కొట్టుకుపోతాయన్నారు. ఒకవేళ పంట ముంపునకు గురైతే ఈ క్రింది యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. పల్లపు ప్రాంతాలలో వరి పంట ఊడ్చిన దశ నుంచి పిలకలు దశలో నీట ముంపునకు గురి కావడం జరిగిందన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన ఎంటీయూ 1318, పీఎల్ఏ 1100, ఎంటీయూ 1262, స్వర్ణ, సంపద స్వర్ణ, ఎంటీయూ 1061, ఎంటీయూ 1064 రకాలు ఐదు రోజుల వరకు ముంపును తట్టుకుంటాయన్నారు. ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ల నివారణకు లీటరు నీటికి 1 గ్రాము కార్బెన్డిజిమ్ లేదా 2 గ్రాము కార్బెన్డిజిమ్, మాంకోజెబ్ కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మానుకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ పిలకలు కట్టే దశలో నీట మునిగిన వరి పొలం త్వరగా పుంజుకోవడానికి, వీలైనంత త్వరగా నీటిని తీసివేయాలన్నారు. -
ఉగ్ర గోదావరి
రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిసాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు గోదావరి ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద నీటి ఉధృతి పెరుగుతోంది. గురువారం సాయంత్రం 7 గంటల సమయానికి అక్కడ 52.10 అడుగులకు నీటిమట్టం చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. రాత్రికి మరింత ఎక్కువవుతుందని అధికారులు చెబుతున్నారు. పుష్కర ఘాట్, గౌతమీ ఘాట్ వద్ద వరద నీటి ఉధృతి అధికంగా ఉంది. కాటన్ బ్యారేజీకి వరద ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద వరద క్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న నీటితో గురువారం సాయంత్రానికి బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.90 అడుగులకు చేరింది. 11,51,758 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మరో 9,100 క్యూసెక్కుల నీటిని డెల్టా కాలువలకు విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. వరద ఉధృతి రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అప్రమత్తమైన యంత్రాంగం గోదావరి వరదతో లంక గ్రామాలు నీటిలో చిక్కుకుంటున్నాయి. ఇప్పటికే సీతానగరం, రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్, కడియం ప్రాంతాల్లోని లంక భూములు నీట మునిగాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నేపథ్యంలో గోదావరి వరదల ప్రభావిత కుటుంబాలను, లంకల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నగరంలోని ఆల్కాట్ గార్డెన్ మున్సిపల్ కల్యాణ మంటపంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. కేతావారిలంక నుంచి 68 మందిని, వెదుర్లమ్మ లంక నుంచి 126 మందిని, గోదావరి గట్టు కింద నుంచి ఏడుగురిని, గౌతమీ ఘాట్ నుంచి 45 మందిని, బ్రిడ్జి లంక నుంచి 48 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరద సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ముంపు సమస్య రాజానగరం నియోజకవర్గానికి చెందిన 18 గ్రామాల ప్రజలు కలుషిత నీరు తాగాల్సి వస్తోంది. కోరుకొండ మండలం బుచ్చెంపేట, జగన్నాథపురం, మునగాల, శ్రీరంగపట్నం గ్రామాల నివా స స్థలాలకు ముంపు సమస్య ఎదురైంది. బూరుగుపూడి, కాపవరం, కోటి, మునగాల, శ్రీరంగపట్నం, రాఘవపురం తదితర గ్రామాల్లోని పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. సీతానగరం మండలంలోని గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది. కోరుకొండ మండలంలో బురద కాలువ ఉగ్రరూపం దాల్చుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రాన్ని వరద నీరు ముంచెత్తింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు పోటెత్తిన వరద కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న నీటిమట్టం మొదటి ప్రమాద హెచ్చరిక అమలు రాత్రికి మరింత పెరిగే అవకాశం కంట్రోల్ రూమ్లు -
ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కూటమి
● అన్ని వర్గాల ప్రజలకూ అవస్థలే ● తల్లికి వందనంలో కోత, నాడు–నేడు పనుల నిలిపివేత ● శాసనమండలి విపక్ష నేత బొత్స ధ్వజం సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజల సంక్షేమంపై కూటమి ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని, పరిపాలనను పూర్తిగా విస్మరించిందని శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు.. ఇలా ఏ ఒక్క వర్గమూ సంతృప్తిగా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలేనని, అందులో అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉంటోందన్నారు. తమది మంచి ప్రభుత్వమని అధికార పార్టీ పెద్దలు, నేతలు అనుకోవడం తప్ప, రాష్ట్రంలో సంతృప్తికరమైన పాలన అందడం లేదన్నారు. రైతులను మోసం చేసిన కూటమి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో రైతు భరోసా తీసుకున్న రైతుల సంఖ్యను ఇప్పుడు సుమారు 80 వేల మందికి తగ్గించారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల మందికి ‘అన్నదాత సుఖీభవ’ పథకం అందలేదన్నారు. మరో 8 లక్షల మందికి ‘తల్లికి వందనం’ పథకం నిధులు అరకొరగా అందించారన్నారు. అదేమని ప్రశ్నిస్తే కేంద్రం నుంచి డబ్బులు రావాలని చెబుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.1.50 లక్షల కోట్ల అప్పు నుంచి ఆ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ పథకంలో దేశ, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏడు వారాలవుతున్నా కూలీల వేతనాలు ఇవ్వలేదన్నారు. రైతులకు ఒక యూరియా బస్తా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ తీసుకొచ్చారన్న కారణంగా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాడు–నేడు పనులు, ఇంగ్లిష్ మీడియం చదువును నిలిపివేశారన్నారు. రేషన్ బియ్యంపై చర్యలేవీ? పీడీఎస్ బియ్యం విషయంలో ఎవరి మీదనైనా చర్యలు తీసుకున్నారా అని బొత్స ప్రశ్నించారు. విశాఖపట్నం వెళ్లి గోదాములు సీజ్ చేయాలని మంత్రి ప్రకటిస్తారని, రెండు రోజుల తర్వాత కాదంటారన్నారు. సింగపూర్కు వెళ్లేది పెట్టుబడుల కోసం కాదని, అక్కడున్న కంపెనీలతోనే ఒప్పందం కోసమన్నారు. అమరావతి వర్షాలకు మునిగిపోయిందన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. త్వరలో జరిగే జనసేన మహాసభలో విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయకుండా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అధికార ప్రతినిధి మార్గాని భరత్, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జి.శ్రీనివాసులు నాయుడు, యువజన విభాగం రీజనల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, లీగల్ సెల్ ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జ్ సాదిక్ హుస్సేన్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, రాష్ట్ర మహిళా కార్యదర్శి అంగాడి సత్యప్రియ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కార్యదర్శి ముద్దాల అను, నాయకులు చెల్లుబోయిన నరేన్ పాల్గొన్నారు. -
లంకలను ముంచెత్తిన వరద
● 198 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు ● జలదిగ్బంధంలో కేతావారి లంక, వెదుర్లంక, బ్రిడ్జి లంక ● సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆర్డీఓ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): లంక ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. వర్షాకాలం మూడు నెలలు వీరికి కష్టకాలం అని చెప్పవచ్చు. చేపలు పట్టుకోవడం, లంకల్లో పశువుల పెంపకం వంటి పనులతో వీరంతా జీవనోపాధి పొందుతారు. వర్షాకాలంలో గోదావరికి వరద నీరు చేరడంతో వీరిని పునరావాస కేంద్రాలకు తరలించడం పరిపాటుగా మారింది. ఏటా వర్షాకాలంలో వీరిని రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అక్కడే వీరికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వరద ఉధృతి తగ్గిన తరువాత వారంతా తిరిగి లంకల్లోకి వెళ్లతారు. మగవారు పడవలకి కాపలా... మహిళలు, పిల్లలు, వృద్ధులు పునరావాస కేంద్రాలకు తరలిరాగా మగవారు మాత్రం పడవలకు కాపలాగా లంకల్లోనే ఉంటారు. పడవలు వరద ఉధృతిలో కొట్టుకుపోకుండా వాటిని కాపాడుతారు. కొంతమంది మగవాళ్లు పునరావస కేంద్రానికి వచ్చి భోజనం చేసి తిరిగి లంకల్లోకి చేరుకుంటారు. అప్పుడు మిగిలిన వాళ్లు పునరావాస కేంద్రానికి వచ్చి భోజనాలు చేస్తారు. పునరావాస కేంద్రానికి తరలింపు గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ముందుస్తు చర్యలుగా నదీ పరివాహక ప్రాంతంలోని మూడు లంకల్లో ఉన్న కుటుంబాలకు చెందిన వారిని అధికారులు సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించారు. మంగళవారం మత్స్య, అగ్నిమాపక, రెవెన్యూ, మునిసిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో మూడు లంక గ్రామాల్లోని కుటుంబాలను తరలించారు. మానవ, పశువుల ప్రాణ నష్టం నివారణ చర్యల్లో భాగంగా వారిని సురక్షితంగా పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. ఆల్కట్ గార్డెన్, మునిసిపల్ కల్యాణ మండపంలో వీరికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు. బ్రిడ్జి లంక, ఎదుర్లమ్మలంక, కేతవారిలంక కు చెందిన సుమారు ఇప్పటి వరకు 198 మందికి పునరావాస కేంద్రంలో చేర్చారు. -
సెంట్రల్ జైలులో ఆక్టోపస్ మాక్ డ్రిల్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర కారాగారంలో ఆపరేషన్ మహా సురక్ష పేరుతో ఆక్టోపస్ టీమ్ మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆ వివరాలను జైలు సూపరిడెంట్ ఎస్.రాహుల్ బుధవారం తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రెవెన్యూ, ఫైర్, మెడికల్, ఎలక్ట్రికల్ విభాగాల సిబ్బంది, లోకల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్లు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. జైలులో అత్యవసర పరిస్థితులు ఎదురై, అనుకోని ఘటనలు జరిగినప్పుడు, ఉగ్రవాద చర్యలు, ప్రమాదకర ఘటనలు ఎదురైనప్పుడు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం మాక్ డ్రిల్ ముఖ్యోద్దేశం. రక్షణ వ్యవస్థలను సమర్థంగా వినియోగించి ప్రతిస్పందించడమే ధ్యేయంగా దీన్ని నిర్వహించారు. అత్యవసర పరిస్థితులలో సురక్షిత చర్యలు చేపట్టడానికి అవసరమైన మార్గదర్శకాలను జైలు అధికారులకు, సిబ్బందికి ఆక్టోపస్ బృందం వివరించింది. మాక్ డ్రిల్లో ఆక్టోపస్ అధికారులు, డీఎస్పీలు బి.కృష్ణ, కె.శంకరయ్య, ఇన్స్పెక్టర్ బి.మురళీ, ఆక్టోపస్ సిబ్బంది, జైలర్లు, డిప్యూటీ జైలరు పాల్గొన్నారు. -
దివ్యాంగులను ఏడిపింఛెన్..!
● అనర్హత పేరుతో దివ్యాంగుల పెన్షన్లకు భారీగా కోత ● వైకల్య ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని వెల్లడి ● అందుకు అనుగుణంగా ఏర్పాటు చేయని సదరం క్యాంపులు ● తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 33,688 మందికి పెన్షన్లు ● 19,928 మంది వైకల్య శాతం తిరిగి పరిశీలన ● గగ్గోలు పెడుతున్న దివ్యాంగులు సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజలపైనే కాదు.. దివ్యాంగులపై కూడా కూటమి ప్రభుత్వానికి కనికరం కరువైంది. అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగిస్తోంది. ఉన్న ఆసరాను దూరం చేస్తోంది. కేవలం మంచానికే పరిమితమైనా.. అనర్హత కారణంగా చూపి వారి నోటికాడ కూడును లాగేస్తోంది. సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకొచ్చి పింఛన్లలో కొర్రీలు పెడుతోంది. మీ వైకల్య అర్హతను నిరూపించుకోవాలని మరి కొంతమందికి నోటీసులు అందిస్తోంది. రూ.15 వేలు పొందుతున్న పింఛను రూ.6 వేలకు తగ్గిస్తోంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న వారి పింఛన్లు మార్పుచేస్తూ తీరని వేదన మిగులుస్తోంది. కూటమి ప్రభుత్వ చర్యలతో దివ్యాంగులు గగ్గోలు పెడుతున్నారు. ఉన్న ఆర్థిక ఆసరాను లాగేస్తే తామెలా బతకాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. అయినా ప్రభుత్వం కనికరించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పింఛన్లు భారీగా తగ్గించుకునేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో 3,211 పింఛన్లు తొలగింపు తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా అధికారిక లెక్కల మేరకు 33,688 మంది దివ్యాంగ కేటగిరిలో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. వారిలో 1,321 మంది వివిధ రకాల హెల్త్ పింఛన్లు (రూ.15 వేలు) తీసుకుంటున్నారు. మిగిలిన 32,367 మంది రూ.6 వేల పింఛను పొందుతున్నారు. పింఛన్ల తొలగింపులో భాగంగా 19,928 మందికి సంబంధించిన వైకల్య శాతం తిరిగి పరిశీలించారు. వారిలో 3,211 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు వైలక్య శాతం లేదని నిర్ధారించారు. వీరిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు రద్దు చేసినట్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు అందించారు. పింఛను సొమ్ము తగ్గింపు కూటమి ప్రభుత్వం ఆదాయ ఆర్జనలో భాగంగా పింఛను సొమ్మును సైతం తగ్గిస్తోంది. ఇందులో భాగంగానే రూ.15 వేలు పింఛను పొందుతున్న 398 మందిని వివిధ కారణాలతో దివ్యాంగ పింఛన్ల (రూ.6 వేల)కు మార్చింది. తొమ్మిది మందిని వృద్ధాప్య పింఛన్ల (రూ.4 వేలు)కు కుదించారు. రూ.6 వేలు దివ్యాంగ పింఛన్లు పొందుతున్న కోటాలో 18,609 మందికి రీ వెరిఫికేషన్ చేపట్టారు. 405 మందికి వృద్ధాప్య పింఛన్లుగా మార్చారు. 3,211 మందిని అనర్హులుగా గుర్తించి వారికి పింఛన్లు తీసేశారు. తొలగిస్తున్నారిలా.. దివ్యాంగ పింఛనుకు మీరు అనర్హులంటూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నోటీసులు ఇస్తున్నారు. సదరం సర్టిఫికెట్ల జారీ 2009–2010లో ప్రారంభమైంది. ఆ సమయంలో 100 శాతం వికలత్వం ఉంటే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రీ–వెరిఫికేషన్లో 40 శాతానికి తగ్గిపోతోంది. అదెలా తగ్గుతోందో అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. ఫలితంగా దివ్యాంగులు పింఛను కోల్పోతున్నారు. గతంలో వెరిఫై చేసి వైకల్య ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇచ్చింది వైద్యులే. అప్పుడు 85, 90, 100 శాతం వికలత్వం ఉంటే.. ఇప్పుడు 40 శాతం లోపు ఎలా తగ్గుతోందంటూ బాధితులు వాపోతున్నారు. చాపకింద నీరులా తొలగింపు ప్రక్రియ దివ్యాంగ పింఛన్ల తొలగింపు ప్రక్రియ చాపకింద నీరులా సాగుతోంది. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు నోటీసులు ఇస్తున్నారు. నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ శాతం మందికి పింఛనుకు అనర్హత ఉన్నట్లు తేలుతోంది. తమ పింఛను పోతుందని భావిస్తున్న లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో కలెక్టరేట్, ఎంపీడీఓల వద్దకు పరుగులు తీస్తున్నారు. అనధికార సమాచారం మేరకు జిల్లాలో ఎనిమిది వేలకు పైగా పింఛన్లు తొలగించినట్లు తెలిసింది. ఈ నెల 27వ తేదీ వరకు సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్లు, నోటీసులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. తొలగింపులకు గురైన వారిలో చెవిటి, మూగ, శారీరక వికలాంగులు, అంధులే అధికంగా ఉంటున్నారు. తొలగింపులు కుట్రలో భాగమే..! సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలన్న తలంపుతో చంద్రబాబు సంక్షేమ పథకాలు, పింఛన్లపై అమలుకు సాధ్యంకాని ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చాక కోతలు ప్రారంభించారు. దివ్యాంగులపై కనీస కనికరం లేకుండా పింఛన్ల తొలగింపులకు నాంది పలికారు. ఇదంతా పింఛన్లు తగ్గించుకునేందుకు ఆడుతున్న నాటకంలో భాగమే అన్న ఆరోపణలున్నాయి. సిఫారసులకే అందలందివ్యాంగుల పింఛన్ల తొలగింపులు, సదరం రీ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల జారీలో మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే సిఫారుసులకే పెద్దపీట వేస్తున్నారు. ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్న వారికే ఇస్తున్నారు. వైకల్యం లేకపోయినా.. ఉన్నట్లు ధ్రువీకరిస్తూ పింఛన్లు కొనసాగిస్తున్నారు. సిఫారసు లేనివారికి మాత్రం నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. సిఫారసులు ఉన్న వారికి రూ.15 వేల పింఛన్లు వచ్చే విధంగా 85 నుంచి 100 శాతం వరకు వికలత్వం నమోదు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మిగిలిన వారికి మాత్రం తొలగించేస్తున్నారు. మరి కొంత మంది సదరం క్యాంపులో మామూళ్లు ముట్టజెప్పి వైకల్య శాతం నమోదు చేయించుకుంటున్నారు. పైసలు ఇవ్వలేని వాళ్లు మాత్రం ఏమీ చేయలేక వెనుదిరగాల్సిన పరిస్థితి తలెత్తుతోంది.చిత్రంలో మంచానికే పరిమితమైన వ్యక్తి పేరు పేకేటి సత్యనారాయణ. నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం గ్రామంలో నివాసముంటున్నారు. ఈయన పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నారు. ఏ పనీ చేసుకోలేని పరిస్థితి. కేవలం మంచానికే పరిమితమయ్యారు. భార్య సహాయం చేస్తే తప్ప తనపని తాను చేసుకోలేని దుస్థితి. అలాంటి వ్యక్తిపై సైతం కూటమి ప్రభుత్వం కనికరం చూపడం లేదు. 85 శాతం వైకల్యం ఉండాలని.. రీ వెరిఫికేషన్లో 59 శాతం వైకల్యం మాత్రమే ఉందని నోటీసు ఇచ్చారు. అనర్హత పేరుతో పింఛను పీకేశారు. కళ్లముందు వ్యక్తి మంచంపై ఉంటే.. వైకల్యం లేదనడం ఎంతవరకూ సమంజసం. దీంతో ఆ దివ్యాంగుడు లబోదిబో మంటున్నారు. తాను, భార్య ఉంటున్నామని, తన కుటుంబానికి ఆసరాగా ఉన్న పింఛన్ తొలిగిస్తే కుటుంబ పోషణ ఎలాగంటూ ఆవేదన చెందుతున్నారు. కేవలం ఇతనొక్కరే కాదు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది దివ్యాంగుల పరిస్థితి ఇలాగే ఉంది. -
తాత్కాలిక ధ్రువపత్రం ఉన్నవారి పెన్షన్ల ఆపలేదు
రాజమహేంద్రవరం సిటీ: మానసిక వికలాంగత్వం (ఎమ్.ఆర్), మానసిక అనారోగ్యం (ఎమ్.ఐ) కేటగిరీల కింద తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేసిన వారికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లు నిలుపుదల కావని, ఎలాంటి నోటీసులు కూడా జారీ చేయబోమని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ జిల్లాలో 4,328 మంది ఈ రెండు కేటగిరీల కింద పెన్షన్లు పొందుతున్నారన్నారు. వారిలో 1,402 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 477 మందికి నోటీసులు జారీ చేశారన్నారు. ఎమ్ఆర్ కేటగిరీలో 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన 256 మందికి తాత్కాలిక వైద్య ధ్రువపత్రం జారీ చేశామన్నారు. ఎమ్ఐ కేటగిరీలో 1,157 మందిలో 429 మందికి పరీక్షలు జరగగా, అందులో పెన్షన్ నిలిపివేసిన 206 మందిలో 204 మంది 18 ఏళ్ల లోపు వారే ఉన్నారన్నారు. వారికి తాత్కాలిక ధ్రువపత్రం జారీ చేశామని వివరించారు.ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానంరాజమహేంద్రవరం రూరల్: పదవ తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ ఫెయిలైన అభ్యర్థులకు జిల్లాలో గల ప్రభుత్వ ఐటీఐలలో 2025–26 సంవత్సరానికి మూడవ విడత అడ్మిషన్స్కు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ సీహెచ్ సునీల్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో ఐటిఐ.ఏపీ.జివోవి.ఐన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఐటీఐలో వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్ కాపీలతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు 79813 08986, 78010 95303 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.రేపు సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతంఅన్నవరం: శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన ‘సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం’ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కల్యాణ మండపంతోపాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలలో కూడా ఈ వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూడు మండపాలలో వ్రతాలు నిర్వహించిన తరువాత కూడా మహిళలు ఎక్కువగా ఉంటే ఉదయం పది గంటలకు రెండో బ్యాచ్లో కూడా ఈ వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
ఉగ్ర గోదావరి ఉరకలు
రాజమహేంద్రవరంలో వరద గోదావరి ఉధృతిధవళేశ్వరం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది. ఎగువ నుంచి కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ఉధృతి వేగంగా పెరుగుతుంది. మరోపక్క గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి 10.60 అడుగులకు నీటి మట్టం చేరింది. మొత్తం 175 క్రస్ట్గేట్లను పూర్తిగా పైకిలేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. 8,28,331 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. డెల్టా కాలువలకు సంబంధించి 4,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,000 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1,300 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. నేడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి.. కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ యంత్రాంగం అంచనా వేస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేస్తూ 11.75 అడుగులకు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటిస్తారు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను ,17.75 అడుగులకు నీటి మట్టం చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. ఎగువ ప్రాంతాల్లో ఇలా... ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో 47.40 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలంలో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. కాళేశ్వరంలో 12.83 మీటర్లు, పేరూరులో 17.48మీటర్లు ,దుమ్ముగూడెంలో 13.07మీటర్లు, కూనవరంలో 18.14మీటర్లు, కుంటలో 9.75మీటర్లు, పోలవరంలో 13.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.55 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. నేడు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తం కాటన్ బ్యారేజీ నుంచి 8.28లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల -
వాడపల్లి వెంకన్నకు రూ.1.42 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా రూ. 1,42,16,807 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బుధవారం ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 28 రోజుల అనంతరం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం తెరిచి, ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,19,58,204, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 22,58,603 వచ్చిందని ఈఓ వివరించారు. అలాగే బంగారం 23 గ్రాములు, వెండి 670 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 46 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ అధికారిగా ఏసీ అండ్ జిల్లా దేవదాయశాఖ అధికారి వి.సత్యనారాయణ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ టీవీఎస్ సార్ ప్రసాద్, జిల్లా దేవదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు డి.సతీష్ కుమా ర్, గోపాలపురం గ్రూపు దేవాలయాల ఈవో బి కిరణ్, దేవస్థానం సిబ్బంది అర్చకులు, శ్రీవారి సేవకులు పోలీసులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు వద్ద మహిళల తోపులాట
అనపర్తి : ప్రచార ఆర్భాటంతో అరకొర బస్సులతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన సీ్త్ర శక్తి (సీ్త్రలకు ఉచిత బస్సు) పథకం ప్రారంభించి నాలుగు రోజులు గడవకుండానే మహిళల సహనానికి పరీక్షగా నిలిచింది. మంగళవారం అనపర్తి బస్టాండ్లో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే సాయంత్రం నాలుగు గంటల సమయంలో కళాశాలల నుంచి, వ్యాపార, షాపింగ్ తదితర పనులు ముగించుకుని వారి గమ్యస్థానాలకు బయలుదేరిన మహిళలు పెద్ద ఎత్తున అనపర్తి బస్టాండ్లో వేచి ఉన్నారు. ఇంతలో ఒక బస్సు వచ్చి బస్టాండ్లో నిలిచింది. దీంతో మహిళలంతా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నెట్టుకుంటూ బస్సు ఎక్కడానికి చేసిన ప్రయత్నం రణరంగాన్ని తలపించింది. జనం ఎక్కువగా ఉండడంతో ముందుగా బస్సు ఎక్కాలన్న ఆతృతలో బస్సు ఆగకుండానే ఎక్కడానికి ప్రయత్నించిన ఒక మహిళ జారి పడి బస్సు కిందదికి వెళ్లిపోవడంతో ప్రయాణికులు అప్రమత్తమై పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే సీ్త్ర శక్తి పథకాన్నైతే ఆడంబరంగా ప్రకటించారు కాని అవసరమైనన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ సమయంలో చక్కగా ప్రయాణాలు సాగేవని ఈ పథకం ప్రవేశపెట్టాక సమయానికి బస్సులు రాక, పనులు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనపర్తిలో యుద్ధ వాతావరణాన్ని తలపించిన ఉచిత బస్సు ప్రయాణం -
కక్ష కట్టి.. కడతేర్చి..
నల్లజర్ల: భార్యను కాపురానికి పంపడం లేదని అత్తమామలపై కక్ష కట్టిన అల్లుడు.. చాకుతో వారిద్దరినీ దారుణంగా పొడిచి చంపాడు. మండలంలోని ఘంటావారిగూడెంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా పూళ్ల గ్రామానికి చెందిన ఏకుల బాబూరావు కొన్నేళ్ల కిందట ఘంటావారిగూడేనికి మకాం వచ్చాడు. ఆయనకు భార్య శారద, కుమారుడు అప్పారావు, కుమార్తె నాగేశ్వరి ఉన్నారు. అప్పారావు ఉద్యోగ రీత్యా విశాఖపట్న ంలో ఉంటున్నాడు. దెందులూరు మండలం గంగన్నగూడేనికి చెందిన మరీదు కోటేశ్వరరావుతో నాగేశ్వరికి 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. బాబూరావు, శారద ఘంటావారిగూడెంలో ప్రధాన రహదారి పక్క చిన్న టీ హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. భర్త వేధింపులు భరించలేక ఏడాది క్రితం నాగేశ్వరి తన ఇద్దరు కుమారులు గిరిష్, లోకేష్లతో పుట్టింటికి వచ్చి ఉంటోంది. పిల్లలిద్దరినీ స్థానికంగా ఉన్న పాఠశాలలో చదివించుకుంటోంది. తరచూ గొడవలు కోటేశ్వరరావు తరచూ ఘంటావారిగూడెం వచ్చి భార్యను కాపురానికి పంపాలని అత్తమామలపై ఒత్తిడి చేస్తూ ఉండేవాడు. ఈ గొడవపై రెండు, మూడుసార్లు పెద్దల సమక్షంలో తగవులు జరిగాయి. అయితే మద్యం తాగి వచ్చి విపరీతంగా కొట్టే భర్త దగ్గరకు కాపురానికి వెళ్లడానికి నాగేశ్వరి నిరాకరించింది. నెల రోజుల క్రితం కోటేశ్వరరావు ఘంటావారిగూడెం వచ్చి బాబూరావుతో ఘర్షణ పడ్డాడు. ఆ సమయంలో మామ పీక నులుముతుండగా స్థానికులు వచ్చి విడదీశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ పని ముగించుకొని బాబూరావు, శారద, నాగేశ్వరి ఇంటికి వచ్చారు. అదే సమయంలో కోటేశ్వరరావు బైక్పై వచ్చి ఆ వీధిలో రెండుసార్లు రౌండ్లు కొట్టాడు. అనంతరం ఇంటి వద్ద ఆగి, మొక్కలను శుభ్రం చేస్తున్న అత్త శారద(48)ను చాకుతో పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి బయటకు వస్తున్న మామ బాబూరావు(58)ను హతమార్చాడు. ఇది చూసిన నాగేశ్వరి ఇంట్లోకి వెళ్లి దాక్కుని ప్రాణాలు కాపాడుకుంది. అనంతరం కొటేశ్వరరావు బయటకు వస్తూ.. కొంచెం కదులుతున్న శారదను మరోసారి పొడిచాడు. చాకును సంఘటన స్థలంలోనే పాడేసి, తీరుగ్గా సిగరెట్ కాల్చుకుంటూ తన తల్లికి ఫోన్ చేశాడు. అత్తమామలు ఇద్దరినీ చంపేసాను, జైల్లో ఉంటానని చెప్పాడు. పోలీసులు వచ్చే వరకు అతడు అక్కడే ఉన్నాడు. విషయం తెలుసుకున్న సీఐ బాలశౌరి తమ సిబ్బందితో వచ్చి కోటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అయితే డీఎస్పీ దేవకుమార్ మాత్రం నిందితుడి కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని, కేసు నమోదు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్తమామలను హత్య చేసిన అల్లుడు భార్యను కాపురానికి పంపలేదని ఆగ్రహం ఘంటావారిగూడెంలో కలకలం -
విజ్ఞానపదం
కపిలేశ్వరపురం: సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానాన్ని ఒక తరం నుంచి మరో తరానికి అందించడంలో జానపద కళలు ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. మన పూర్వీకుల ఆచారాలు, పద్ధతులు, ఆనాటి పరిస్థితులకు అద్దం పడతాయి. వీటిలో గీతాలు, నృత్యాలు, నాటకాలు, శిల్పాలు, వాయిద్యాలు.. ఇలా అనేకం ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల సంప్రదాయాలను వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జానపద కళారూపాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (ఆగస్టు 22) అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవం సందర్భంగా వాటిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 55 వేల మంది జానపద కళాకారులు ఉన్నారు. గరగ నృత్యం, డప్పు వాయిద్యం, కోలాటం తదితర ఆధ్యాత్మిక కళాకారులు దాదాపు ప్రతి ప్రాంతంలోనూ కనిపిస్తారు. పెద్దాపురం, కాకినాడలో తప్పెటగుళ్లు కళాకారులు, మాధవపట్నం, కొత్తపేటల్లో తోలుబొమ్మల కళాకారులు, పెద్దాపురం తదితర మెట్ట ప్రాంతాల్లో సాము గారడి, ఏజెన్సీ ప్రాంతాల్లో థింసా నృత్య కళాకారులు ఎంతో ప్రసిద్ధి చెందారు. జిల్లా వ్యాప్తంగా దళిత సామాజిక వర్గీయులు గారడీ నృత్యకళను తమ భుజాలపై వేసుకుని పోషిస్తున్నారు. రామచంద్రపురం ప్రాంతంలో బుర్రకథ, కపిలేశ్వరపురం మండలంలో గంగిరెద్దుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలు, గరగ నృత్యం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పలు ప్రదర్శనలు ● రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ ఆధ్వర్యాన ఈ ఏడాది ఫిబ్రవరి 5, 6 తేదీల్లో ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ఆదివాసీ కళాకారులు నిర్వహించిన జానపద, లంబాడీ, థింసా, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ● ఈ ఏడాది ఏప్రిల్లో రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) ఆధ్వర్యాన మూడు రోజుల పాటు 25వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహించగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా సీఆర్సీ కృషిని సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతం రాజు అభినందించారు. స్వేచ్ఛ, బ్రహ్మ స్వరూపం, జనరల్ బోగీలు అనే నాటకాలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ● రాజమహేంద్రవరం సద్గురు సన్నిధి నిర్వహణలో శ్రీత్యాగరాజ నారాయణదాస సేవా సమితి ప్రాంగణంలో ఆగస్టు 3న జరిగిన అన్నమయ్య కీర్తనలకు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ శిష్యులు నర్తించిన తీరు ఆకట్టుకుంది. ● రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో ఈ ఏడాది జూన్లో నాలుగు రోజుల పాటు నిర్వహించిన 43వ అంతర్జాతీయ సంగీత నృత్య ఫెస్ట్ – 2025 అలరించింది. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యాన నిర్వహించిన ఫెస్ట్లో మలేషియా బృందం, 13 రాష్ట్రాల నుంచి 550 మంది కళాకారులు సంగీతం, నృత్య, జానపద కళారూపాలను ప్రదర్శించారు. ● పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో స్నేహ ఆర్ట్స్ నాటక కళా పరిషత్ ఆధ్వర్యాన ఈ ఏడాది జనవరి 24న నాటక పోటీలు నిర్వహించారు. ● బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన సీనియర్ రంగస్థల దర్శకుడు, నటుడు తాడి సూర్యనారాయణరెడ్డి (78) ఈ ఏడాది జూన్ 25న కన్నుమూయడం కళాకారులకు తీరని లోటు. ఆయన వెంకట రమణ ఆర్ట్స్ సంస్థకు ఆస్థాన దర్శకుడిగా ఉంటూ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి నారాయణరావుతో కలిసి పనిచేశారు. కళాకారులకు పురస్కారాలు ● విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు నాటక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్ 16న కార్యక్రమం నిర్వహించారు. రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన నటి సరోజకు మంత్రి కందుల దుర్గేష్ చేతులు మీదుగా పురస్కారం అందజేశారు. ● సాతులూరులో ఈ ఏడాది మే 28న నిర్వహించిన జాతీయ స్థాయి నాటిక పోటీల వేదికపై ప్రత్తిపాడుకు చెందిన రంగస్థల మేకప్ కళాకారుడు కాతేటి నూకరాజు (థామస్)కు నటరత్న ఎన్టీఆర్ పురస్కారాన్ని అందజేశారు. ● న్యూఢిల్లీలో జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవంలో కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన గరగ నృత్య కళాకారుడు కొరివి కల్యాణ్, కొత్తపేట మండలం పలివెలకు చెందిన కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ తమ కళను ప్రదర్శించారు. మొత్తం గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ స్థాయి డాక్యుమెంటరీగా రూపొందించగా, వీరి కళా ప్రదర్శనకు అందులో స్థానం లభించింది. వీరిలో కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్కు ఈ ఏడాది ఏప్రిల్ 13న విశాఖపట్నం మదర్ థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ కళాజ్యోతి పురస్కారం దక్కింది. ఆయన ఆధ్వర్యంలోని బృందం ఒడిసా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఫోక్ ఫైర్ ఫెస్టివల్లో కళా ప్రదర్శనను ఇచ్చారు. ● కాకినాడలో ఈ ఏడాది జూలైలో జరిగిన అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ రజతోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు నిర్వహించారు. శిక్షణ శిబిరం జానపద కళ పాతకాలం నాటిదే అయినా ఆధునిక కాలానికి అనుగుణంగా కళాకారులు ఎప్పటి కప్పుడు శిక్షణ పొందుతున్నారు. ఈ ఏడాది జూన్ 6న అమలాపురంలో ప్రజానాట్యమండలి కళాకారుడు శామ్యూల్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. పెద్దాపురం కళాకారుడు యాసలపు సూర్యారావు స్మారక భవన్లో ఈ ఏడాది జూన్ 21న కళాకారుల శిక్షణ శిబిరం నిర్వహించారు.జగన్ ప్రభుత్వం చేయూత గత వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజాము ఆరు గంటలకే వలంటీర్లు.. కళాకారులకు ఇంటికెళ్లి పింఛన్ సొమ్ములు అందించేవారు. కరోనా మహమ్మారి సమయంలోనూ కళాకారుల పింఛను చెల్లింపును కొనసాగించారు. రంగస్థల సమాజాలు, పరిషత్లకు రూ.5 లక్షలతో వైఎస్సార్ రంగస్థల పురస్కారాలను ఇచ్చేందుకు కృషి జరిగింది. అప్పటి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్య ప్రకాశరావు అభ్యర్థనపై కందుకూరి వీరేశలింగం జయంతి అయిన ఏప్రిల్ 16ను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక రంగ దినోత్సవంగా ప్రకటించారు. జానపద కళలకు ఎంతో చరిత్ర ఆనాటి సంప్రదాయాలకు ప్రతీక నేటికీ కొనసాగుతున్న వైనం ఉమ్మడి జిల్లాలో అనేక మంది కళాకారులు రేపు అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవంకళాకారుల వినతులు జానపద కళా పోషణ భారాన్ని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించాలని కళాకారులు కోరుతున్నారు. కళనే నమ్ముకున్న తమకు పింఛన్ ఇవ్వాలని, కళా వేదికలను ప్రభుత్వమే అన్వేషించి ప్రదర్శనలను ఏర్పాటు చేయాలన్నారు. తుని మండలం కొత్తూరులో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యాన ఈ నెల 1న నిర్వహించిన డప్పు కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ డప్పు, చర్మకారుల సంక్షేమం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కళా ప్రదర్శనకు మూడు ఎకరాల భూమి, రూ.ఏడు వేల పింఛన్, ఉచితంగా డప్పు, గజ్జెలు, దుస్తులను మాదిగ కార్పొరేషన్ ద్వారా సమకూర్చాలని డిమాండ్ చేశారు. -
సీతారామ సత్రాన్ని కూల్చివేయండి
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని సత్యనారాయణస్వామి దేవస్థానంలో శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని కూల్చివేయాలని జేఎన్టీయూకే ప్రొఫెసర్లు బృందం స్పష్టం చేసింది. ఆ సత్రానికి మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండదని తెలిపింది. ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నంతో కూడిన బృందం ఈ నెల 13వ తేదీన సీతారామ సత్రం లోని గదులు, శ్లాబ్, గోడలను పరిశీలించింది. అనంతరం తమ నివేదికను బుధవారం దేవస్థానానికి అందజేసింది. కాగా.. ఆర్బీఐ అధికారుల నివేదికను అనుసరించి ఈ సత్రాన్ని కూల్చివేయాలని గతంలోనే నిర్ణయించారు. 2024 మేలో దీన్ని కూల్చివేసి, నూతన సత్రం నిర్మించేందుకు రూ.11.40 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలవగా 16 శాతం తక్కువకు ఖరారు చేశారు. అదే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సత్రాన్ని పరిశీలించిన దేవదాయశాఖ సలహాదారు కొండలరావు దీనికి మరమ్మత్తులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేయడంపై గందరగోళం నెలకొంది. దీంతో ఈ సత్రం మరమ్మత్తులు చేయడానికి సుమారు రూ. రెండు కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. దీనిపై జూన్ 26న సాక్షి పత్రికలో ‘సత్యదేవ చూడవయ్యా’ శీర్షికన వార్త ప్రచురితమైంది. ఆ వార్తపై కలెక్టర్ షణ్మోహన్, దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ స్పందించారు. ఈ సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్టీయూ ప్రొఫెసర్లను కోరారు. నివేదిక ఇచ్చిన జేఎన్టీయూకే ప్రొఫెసర్లు ‘సాక్షి’ కథనానికి స్పందన -
బస్సు చక్రాలు ఎక్కడంతో మహిళకు తీవ్ర గాయాలు
జగ్గంపేట: బంధువును బస్సు ఎక్కించడానికి వచ్చిన మహిళ ప్రమాదం బారిన పడింది. బస్సు వెనుక చక్రాలు ఎక్కడంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. జగ్గంపేట ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇవి. గోకవరం గ్రామానికి చెందిన రేవాడి రాజేశ్వరి (29) ఇంటికి ఆమె అక్క కుమార్తె అశ్విని తన చంటి పిల్లతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. తిరిగి తన సొంత ఊరు తుని వెళ్లడానికి బుధవారం సిద్ధమైంది. అయితే అశ్వినిని జగ్గంపేటలో బస్సు ఎక్కించటానికి రాజేశ్వరి కూడా ప్రయాణమైంది. జగ్గంపేట బస్టాండ్లో తుని వెళ్లడానికి రాజమహేంద్రవరం నుంచి వచ్చిన బస్సులో అశ్వినిని ఎక్కించి, లగేజీ సర్దిపెట్టింది. ఆ సమయంలో బస్సు కదలడంతో దిగిపోయే ప్రయత్నంలో బస్సు నుంచి కిందకు పడిపోయింది. దీంతో బస్సు వెనుక చక్రాలు ఎక్కడంతో రాజేశ్వరి కుడి కాలు నుజ్జునుజ్జయ్యింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమెను దగ్గరకు ఎవ్వరూ రాలేదు. స్థానిక శెట్టిబలిజిపేటకు చెందిన శివభక్తుడు పాలిక అప్పారావు ఆమెకు అండగా నిలిచాడు. అలాగే ప్రమాదాన్ని చూసిన అశ్విని వెంటనే బస్సు దిగిపోయింది.ఎంతకీ రాని అంబులెన్స్తీవ్రగాయాలతో రోదిస్తున్న రాజేశ్వరిని చూసి బస్టాండ్లో ప్రయాణికులు 108కు ఫోన్ చేశారు. కానీ ఎంత సేపటికీ అంబులెన్స్ రాలేదు. దీంతో సుమారు 45 నిమిషాల తర్వాత ఆమెను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి స్ట్రెచర్ తీసుకువచ్చి చికిత్స కోసం తీసుకువెళ్లసాగారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అటుగా వచ్చిన ఓ వ్యాన్లో రాజేశ్వరిని ఎక్కించి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం రాజమహేంద్రవరానికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో బాధితురాలి కుటుంబ సభ్యులను ఏలేశ్వరం ఆర్టీసీ డీఎం జీవీ సత్యనారాయణ కలిసి వివరాలు తెలుసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు అందిన తరువాత కేసు నమోదు చేస్తామని జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్తకొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ, పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
విద్యుత్ స్మార్ట్ మీటర్ దగ్ధం
నిడదవోలు: స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న న్యూ మంజునాథ్ బెంగళూరు అయ్యంగార్ బేకరీలోని విద్యుత్ స్మార్ట్ మీటర్ బుధవారం దగ్ధమైంది. బేకరి యజమానికి ఇష్టం లేకపోయినా విద్యుత్ సిబ్బంది వచ్చి రెండు నెలల క్రితం ఈ మీటర్ను బిగించారు. అయితే నాసిరకం మీటర్ ఏర్పాటు చేయడంతో ఈ విధంగా జరిగిందని బాధితుడు చెబుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిట్టీల సొమ్ము రూ.2 కోట్లతో వ్యక్తి పరార్తాళ్లపూడి: చిట్టీల సొమ్ము రూ.2 కోట్లతో ఓ వ్యక్తి ఉడాయించిన సంఘటన తిరుగుడుమెట్టలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టలో కిరాణా వ్యాపారం చేసే బెల్లంకొండ సత్యనారాయణ చిట్టీలు వేస్తుంటాడు. అతడి వద్ద గ్రామస్తులు చాలామంది చిట్టీలు కట్టారు. అయితే భార్యతో కలసి సత్యనారాయణ గ్రామం నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు బుధవారం అతడి ఇంటి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ సత్యనారాయణ కొన్నేళ్లుగా చిట్టీలు కట్టించుకుంటున్నాడని, అతడి వద్ద పెద్ద మొత్తంలో వాటిని వేసినట్టు తెలిపారు. చిట్టీ పాట సొమ్మును కూడా తన వద్దే ఉంచుకుని, వడ్డీ ఇస్తానని నమ్మించేవాడన్నారు. అలాగే చాలామంది అతడికి అప్పులు కూడా ఇచ్చామన్నారు. ఇలా సుమారు రూ. 2 కోట్ల వరకూ వసూలు చేశాడన్నారు. కాగా.. బాకీల వాళ్లు వేధిస్తున్నారని, ఆ భయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నట్టు సత్యనారాయణ ఉత్తరం రాసి ఉంచినట్టు సమాచారం. అతడి ఇద్దరు కుమారుల్లో ఒకరు లండన్, మరొకరు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారని చెబుతున్నారు. -
రిసార్ట్లో రాసలీలలు.. గోదావరి తీరంలో వెలుగులోకి ‘సీఐ’ అకృత్యాలు!
సాక్షి, టాస్క్ఫోర్స్: తూర్పు గోదావరి జిల్లాలో సివిల్ పోలీసుల దందాలు పెరిగిపోతున్నాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలో అయితే కొన్ని పోలీస్ స్టేషన్లు పూర్తిగా గతి తప్పాయి. కొందరు పోలీసు అధికారులు బాధితులను పీడించుకుతింటున్నారు. ఒక సీఐ అయితే ఏకంగా కాసులు ఇస్తేనే కేసులు ఉంటాయని బహిరంగంగా చెబుతున్నారు. ఆ సీఐ డబ్బులు తీసుకుని ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారని తెలుస్తోంది.మరో వ్యక్తి ఫిర్యాదు చేస్తే, అవతల వారి నుంచి సొమ్ము తీసుకొని బలవంతంగా సెటిల్ చేశారని సమాచారం. ఆయన వారాంతాల్లో ఒక రిసార్ట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, సర్కిల్ పరిధిలోని ఇసుక మాఫియా, మద్యం షాపుల నుంచి మామూళ్లు మస్తుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తూర్పు గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చివరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఐదు ఇసుక రీచ్ల నుంచి ప్రతి నెలా పోలీస్ స్టేషన్కు రూ.30వేలు చొప్పున సీఐకి మామూళ్లు వెళుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మద్యం షాపుల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున సీఐ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ సీఐ పనితీరు నచ్చని ఇద్దరు ఎస్ఐలు విధుల్లో చేరిన మూడు నెలల్లోనే బదిలీపై వెళ్లారని సమాచారం.సొమ్ము ఇచ్చుకో.. పేకాట ఆడుకో..ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు బహిరంగంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తుండగా, వారి నుంచి సదరు సీఐ మామూళ్లు తీసుకుని కళ్లు మూసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెల్టాలో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే కాపలాగా పోలీసులే వ్యవహరిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ సిబ్బంది పేకాట శిబిరాలపై దాడులకు సిద్ధమైతే, వెంటనే ఆ సమాచారం నిర్వాహకులకు ఇస్తున్నారని, పారిపోయేందుకు సూచనలు కూడా పోలీసులే చెబుతున్నారని తెలుస్తోంది. ఎప్పుడైనా అవసరమైతే అనామకులకు కొంత సొమ్ము ఇచ్చి వారిపై కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం. రోడ్డు ప్రమాదాలు, ఇళ్ల వద్ద గొడవలు వంటివాటిని కూడా సెటిల్మెంట్ పేరుతో ఆ సీఐ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.రిసార్ట్లో రాసలీలలుకేసుల విషయమై వచ్చే కొందరు మహిళలను ఆ సీఐ లొంగదీసుకుని రాసలీలలు సాగిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఒక మహిళా హోంగార్డు సహకారం అందిస్తున్నట్టు సమాచారం. గోదావరి తీరంలో వెలసిన ఒక రిసార్ట్లో లేదా ఆ మహిళా çహోంగార్డు ఇంట్లో ఈ వ్యవహారాలు నిస్సిగ్గుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీఐ దందాలపై ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లినా పట్టించుకోవడం లేదని, ఎక్కడ తాము ఇరుక్కుపోతామోనని సర్కిల్లోని ఎస్ఐలు, సిబ్బంది భయపడుతున్నట్లు సమాచారం. -
సర్కారు ఆదేశాలకు కూటమి నేతల తూట్లు
● అనుమతి లేని చోట ఏకంగా ప్రారంభోత్సవం ● ఎమ్మెల్యే సతీమణి తీరుపై విమర్శలు సాక్షి, టాస్క్ఫోర్స్: ‘ప్రభుత్వ పాఠశాలలో అనధికార వ్యక్తులకు అనుమతి లేదు, విద్యార్థుల తల్లిదండ్రులకు, పాఠశాల నిర్వహణా కమిటీ సభ్యులకు మాత్రమే ప్రవేశం’ అంటూ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు జారీ చేసిన ఆదేశాలకు విలువ లేకుండా పోయింది. జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న సీతానగరం మండలం, మునికూడలిలో ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే సతీమణి ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయవలసిన వారే వాటిని తుంగలోకి తొక్కేసి, అనధికార వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చారంటున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన వివరాలిలావున్నాయి. మునికూడలిలో పాఠశాల భవన ప్రారంభోత్సవం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చేతుల మీదుగా సోమవారం జరుగవలసి ఉంది. కానీ ఆయన భార్య వెంకటలక్ష్మితో ప్రారంభోత్సవం చేయించడంతోపాటు, బడి పిల్లలతో ఆమె పూలు చల్లించుకోవడం విడ్డూరమని స్థానికులు విమర్శిస్తున్నారు. శిలాఫలకంపై ఆమె పేరును కూడా చెక్కడం ఆశ్చర్యకరం. రుడా చైర్మన్ హోదాలో హాజరైన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకటరమణచౌదరిని ఉత్సవ విగ్రహం చేశారు. కూటమి ప్రభుత్వంలో జీవోలకుఎంతటి విలువనిస్తున్నారో ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి నీరుకొండ వీరన్నచౌదరి కూడా అనధికార వ్యక్తిగా పాల్గొన్నారు. -
ఆ సర్కిల్... సెపరేటు
సాక్షి, టాస్క్ఫోర్స్: తూర్పు గోదావరి జిల్లాలో సివిల్ పోలీసుల దందాలు పెరిగిపోతున్నాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలో అయితే కొన్ని పోలీస్ స్టేషన్లు పూర్తిగా గతి తప్పాయి. కొందరు పోలీసు అధికారులు బాధితులను పీడించుకుతింటున్నారు. ఒక సీఐ అయితే ఏకంగా కాసులు ఇస్తేనే కేసులు ఉంటాయని బహిరంగంగా చెబుతున్నారు. ఆ సీఐ డబ్బులు తీసుకుని ఫిర్యాదు చేసిన వ్యక్తిపైనే కేసు నమోదు చేసి కోర్టుకు పంపించారని తెలుస్తోంది. మరో వ్యక్తి ఫిర్యాదు చేస్తే, అవతల వారి నుంచి సొమ్ము తీసుకొని బలవంతంగా సెటిల్ చేశారని సమాచారం. ఆయన వారాంతాల్లో ఒక రిసార్ట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, సర్కిల్ పరిధిలోని ఇసుక మాఫియా, మద్యం షాపుల నుంచి మామూళ్లు మస్తుగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చివరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. నియోజకవర్గంలోని ఐదు ఇసుక రీచ్ల నుంచి ప్రతి నెలా పోలీస్ స్టేషన్కు రూ.30వేలు చొప్పున సీఐకి మామూళ్లు వెళుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మద్యం షాపుల నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున సీఐ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ సీఐ పనితీరు నచ్చని ఇద్దరు ఎస్ఐలు విధుల్లో చేరిన మూడు నెలల్లోనే బదిలీపై వెళ్లారని సమాచారం. సొమ్ము ఇచ్చుకో... పేకాట ఆడుకో... ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు బహిరంగంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తుండగా, వారి నుంచి సదరు సీఐ మామూళ్లు తీసుకుని కళ్లు మూసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డెల్టాలో భారీగా పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటే కాపలాగా పోలీసులే వ్యవహరిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇంటెలిజెన్స్ సిబ్బంది పేకాట శిబిరాలపై దాడులకు సిద్ధమైతే, వెంటనే ఆ సమాచారం నిర్వాహకులకు ఇస్తున్నారని, పారిపోయేందుకు సూచనలు కూడా పోలీసులే చెబుతున్నారని తెలుస్తోంది. ఎప్పుడైనా అవసరమైతే అనామకులకు కొంత సొమ్ము ఇచ్చి వారిపై కేసులు నమోదు చేస్తున్నారని సమాచారం. రోడ్డు ప్రమాదాలు, ఇళ్ల వద్ద గొడవలు వంటివాటిని కూడా సెటిల్మెంట్ పేరుతో ఆ సీఐ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. రిసార్ట్లో రాసలీలలు కేసుల విషయమై వచ్చే కొందరు మహిళలను ఆ సీఐ లొంగదీసుకుని రాసలీలలు సాగిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ఒక మహిళా హోంగార్డు సహకారం అందిస్తున్నట్టు సమాచారం. గోదావరి తీరంలో వెలసిన ఒక రిసార్ట్లో లేదా ఆ మహిళా హోంగార్డు ఇంట్లో ఈ వ్యవహారాలు నిస్సిగ్గుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సీఐ దందాలపై ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లినా పట్టించుకోవడం లేదని, ఎక్కడ తాము ఇరుక్కుపోతామోనని సర్కిల్లోని ఎస్ఐలు, సిబ్బంది భయపడుతున్నట్లు సమాచారం. కొవ్వూరు డివిజన్లోని ఓ సీఐ తీరుపై విమర్శల వెల్లువ లంచాలు తీసుకుని బాధితులపైనే కేసులు కడుతున్న వైనం రిసార్టుకు వస్తే సమస్య పరిష్కారిస్తానంటూ మహిళలకు వేధింపులు గోదావరి తీరంలోని రిసార్ట్లో శృంగార కార్యకలాపాలు ఆయన పరిధిలో పోస్టింగ్ వద్దంటూ ఎస్ఐల గగ్గోలు -
తొలగిస్తేనే రైతులకు మేలు
ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, ఇతర ఉద్యాన ఉత్పత్తులపై జీఎస్టీ మొత్తం ఎత్తి వేయాలి. దీనివల్ల కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పడతాయి. ఇదే జరిగితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశ్రమల లేనిలోటు కొంత వరకూ తీరి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గతంలో ఎండు కొబ్బరికి రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించడం ద్వారా జీఎస్టీని ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. – మత్యాల జమ్మి, నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ సభ్యుడు, అంబాజీపేట -
కన్నబాబు ఇంట విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీలో అందరికీ బాబాయ్గా సుపరిచితులైన మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ(76) మృతి చెందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణను తొలుత కాకినాడ,హైదరాబాద్కు అక్కడి నుంచి తిరిగి కాకినాడలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ట్రస్టు ఆస్పత్రిలో కన్నుమూశారు. భౌతికకాయాన్ని పార్టీ నేతలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం వైద్యనగర్లోని కన్నబాబు ఇంటికి తీసుకువచ్చారు. సత్యనారాయణ భౌతిక కాయాన్ని చూసి కన్నబాబు తల్లి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నిడదవోలు మండలం శెట్టిపేటకు చెందిన సత్యనారాయణ ఏజెన్సీలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు సోదరులు, ఇద్దరు తోబుట్టువులు, భార్య కృష్ణవేణి, కుమారులు కన్నబాబు, సురేష్బాబు, కళ్యాణ్ కృష ఉన్నారు. వీరిలో కన్నబాబు, సురేష్బాబు జర్నలిస్టులు, కళ్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు. ప్రముఖుల నివాళి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు తరలివచ్చి కాకినాడ వైద్యనగర్లోని కన్నబాబు స్వగృహం వద్ద సత్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల విజ్జపు రెడ్డి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా వైద్యనగర్లో నివాసం నుంచి ఊరేగింపుగా అంతిమ యాత్ర నిర్వహించారు. బంధువులు, పార్టీ అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తండ్రి భౌతిక కాయానికి హిందూ సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు కన్నబాబు అంత్యక్రియలు నిర్వహించారు. కన్నబాబుకు పరామర్శ కన్నబాబును జెడ్పీ చైర్పర్సన్లు విపర్తి వేణుగోపాలరావు, చిన్ని శ్రీను, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, అనంతబాబు, పేరాబత్తుల రాజశేఖర్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, వెల్లంపల్లి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, చెల్లుబోయిన వేణు, తోట నరసింహం, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, అన్నంరెడ్డి అనుదీప్, పాముల రాజేశ్వరి, తిప్పల నాగిరెడ్డి, జి.శ్రీనివాస్ నాయుడు, తలారి వెంకట్రావు, పిల్లి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, పిల్లి సూర్య ప్రకాశరావు, గన్నవరపు శ్రీనివాస్, పార్టీ నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, జమ్మలమడక నాగమణి, గుబ్బల తులసీకుమార్, కర్రి పాపారాయుడు, వట్టికూటి రాజశేఖర్, చెల్లుబోయిన శ్రీనివాస్, పిల్లంక శ్రీనివాసరాజు పరామర్శించారు. అంతిమ యాత్రలో పాల్గొన్న కన్నబాబు, చిత్రంలో జక్కంపూడి రాజా తదితరులు కాకినాడ వైద్యనగర్ నివాసంలో తండ్రి భౌతిక కాయం వద్ద కన్నబాబు, కుటుంబ సభ్యులు తండ్రి సత్యనారాయణ కన్నుమూత ప్రముఖుల పరామర్శ అంతిమ యాత్రలో వైఎస్సార్ సీపీ శ్రేణులు -
మేధోమంథన్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థుల్లో దాగిన ప్రతిభ, ఆలోచన, ఆవిష్కరణలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తుంది. దీనిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు, దేశంలోని సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్డీఓ, బార్క్, డీఆర్డీఓ తదితర ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశంతో పాటు ఇంటర్న్షిప్, స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీవీఎం ఈ పరీక్షపై జిల్లాలోని విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో 6వ తరగతి నుంచి 11వ తరగతి (ఇంటర్ ఫ్రథమ సంవత్సరం) వరకూ చదువుతున్న వారందరూ దీనికి అర్హులే. జాతీయ స్థాయిలో.. ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం, విజ్ఞాన భారతి సంయుక్తంగా ఈ విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరిట జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు చదివే వారందరూ దీనికి అర్హులే. దీనిలో ప్రతిభ కనబర్చిన వారికి దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తులు పక్రియ ప్రారంభమైంది. ఆన్లైన్లో అవకాశం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబరు 30 వరకూ గడువు ఉంటుంది. ఆన్లైన్లో పాఠశాల స్థాయిలో పరీక్ష జరుగుతుంది. 6వ తరగతి నుంచి 11 (ఇంటర్ మొదటి సంవత్సరం) తరగతుల వరకూ విద్యార్థులకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిషు తదితర భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు. మాక్ పరీక్షలు ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకూ ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులైన వారికి సెకండ్ లెవెల్ (ద్వితీయ పరీక్ష) పరీక్ష ఆన్లైన్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19వ తేదీన జరుగుతుంది. జాతీయ స్థాయికి ఎంపిక ఇలా.. రాష్ట్ర స్థాయి విజేతల్లో ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల వంతున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు రూ.2 వేల చొప్పున సంవత్సరం పాటు ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీఓ, ఇస్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగ శాలలు, పరిశోధన సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్ షిప్కు అవకాశం కల్పిస్తారు. ప్రతిభ ఉంటే.. భవిత మీదే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం జాతీయ స్థాయిలో నిర్వహణ స్కాలర్షిప్తో పాటు అనేక ప్రయోజనాలు 6వ తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు అర్హులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న వారికి అవకాశం విస్తృతంగా అవగాహన విజ్ఞాన్ మంథన్ పరీక్షల్లో ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఉపకార వేతనంతో పాటు ప్రఖ్యాత పరిశోధనా సంస్థల్లో ఇంటర్న్షిప్కు అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తిని కలిగించి, నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి కలిగినవారు వీవీఎం అధికారిక వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. – పిల్లి రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా -
రాష్ట్రంలో స్తంభించిన పరిపాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, మర్డర్లు, మహిళలపై అఘాయిత్యాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అక్రమ మద్యం కేసులో అరెస్టయి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బొత్స సత్యనారాయణ ముఖ్యనేతలతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకపక్క అధిక వర్షాలు వచ్చి రైతులకు కావాల్సిన ఎరువులను అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి అవగాహన, కార్యాచరణ, ముందుచూపులేకపోవడం వలన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం చంద్రబాబు ఎక్స్పీరియన్స్ అంటూ సొల్లు కబుర్లు చెప్పడమే తప్ప ఆచరణలో లేదని బొత్స విమర్శించారు. కూటమి ప్రభుత్వం మంచిపాలనను ఐదురోజుల నుంచి చూస్తున్నాం వారి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోందన్నారు. శాసనమండలి ప్రతిపక్షనేతగా ఉన్న తాను ప్రెస్తో మాట్లాడుతుండగా డ్రోన్ ఎగురవేయడంపై ఆయన మండిపడ్డారు. ఏమైన అడిగితే లా అండ్ ఆర్డర్ సమస్య అంటారన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, చట్టం తన పనిచేసుకునేలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలన్నారు. అమరావతి ముంపు సమస్యపై విలేకరుల అడిగిన ప్రశ్నకు పదిరోజుల్లో అంతా తెలుస్తుందని బొత్స బదులిచ్చారు. ఫ్రీ బస్సు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో గొప్పగా ఇక్కడ బస్సు ఎక్కితే తిరుపతి వెళ్లవచ్చన్నారు. కానీ మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీమంత్రి తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీలు మార్గాని భరత్రామ్, చింతా అనురాధ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసనాయుడు, తలారి వెంకటరావు, పాముల రాజేశ్వరిదేవి, రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంటు పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు దవులూరి దొరబాబు, పిల్లి సూర్యప్రకాశ్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, చిన్నమిల్లి వెంకట్రాయుడు, గన్నవరపు శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వివిధ నియోజకవర్గాల పార్టీ నేతలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స -
డ్రగ్స్ రహిత రాష్ట్ర సాధనే ఈగల్ లక్ష్యం
రాజానగరం: రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడమే ఈగల్ లక్ష్యమని, దీని కోసం జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని ఐజీ ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ తెలిపారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ కన్వెన్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ వీక్, సైబర్ క్రైమ్ అండ్ డ్రగ్స్ అవేర్సెస్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ ఇప్పటికే సుమారు 40 వేల విద్యాసంస్థలలో ఈగల్ కమిటీలను ఏర్పాటు చేసి, అవగాహన కలిగిస్తున్నామన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండటంతో పాటు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. భయం, దురాశ, వ్యామోహం, అవమానం వంటివి సైబర్ నేరాల పెరుగుదలకు కారణాలన్నారు. సైబర్ నేరాలకు సంబంధించి ఎటువంటి సమాచారం తెలిసినా 1930 టోల్ఫ్రీ నంబరుకు తెలియజేయాలన్నారు. నన్నయ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ‘నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్’ అనే నినాదంతో జీవితంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. డ్రగ్స్కు అలవాటు పడితే జీవితాలే కాదు కుటుంబాలే నష్టపోతాయని, ర్యాగింగ్కు పాల్పడితే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. ఈగల్ ఎస్పీ కె.నగేష్ బాబు మాట్లాడుతూ భయం, అభద్రతా భావాలతో మనుషులు జీవించరాదని, ఆనందమైన జీవనాన్ని గడపాలన్నారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్యశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య కెవిస్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈగల్ చీఫ్ రవికృష్ణ నన్నయ వర్సిటీలో సదస్సు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్తకొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ, పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
గోపవరంలో ‘తారాజువ్వ’ వివాదం
నిడదవోలు రూరల్: ఇంటిలోకి తారాజువ్వ దూసుకురావడంతో ప్రశ్నించిన వ్యక్తిపై యువకులు దాడికి పాల్పడ్డారు. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలా జీ సుందరరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం గోపవరంలో సోమవారం రాత్రి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా కొందరు యువకులు రోడ్డుపై బాణసంచా కాల్చారు. ఆ సమయంలో ఓ తారాజువ్వ లారీ డ్రైవర్ ఖండవల్లి శ్యాంబాబు ఇంటిలోకి దూసుకువెళ్లింది. దీంతో శ్యాంబాబు ఆ యువకులను నిలదీశాడు. ఈ నేపథ్యంలో వేముల నాగేంద్ర, ఆరేపల్లి దిలీప్, వేముల సాయి, ఆరేపల్లి గాంధీతో పాటు మరికొందరు యువకులు.. శ్యాంబాబుపై ఇటుకలతో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి యువకులను అదుపులోకి తీసుకున్నారు. తలకు తీవ్ర గాయాలైన శ్యాంబాబును నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుపై సమిశ్రగూడెం పోలీసులు పలువురి యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ పరిశీలించారు. నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు శ్యాంబాబును కలిసి దాడి ఘటన విషయాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోపవరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకుల దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు నిడదవోలు ఆస్పత్రిలో చికిత్స -
స్కూల్ బస్సుకు త్రుటిలో తప్పిన ప్రమాదం
అమలాపురం టౌన్: పట్టణంలోని ఈదరపల్లి వంతెనపై నుంచి విద్యార్థులతో వస్తున్న నారాయణ విద్యాసంస్థల బస్సుకు మంగళవారం ఉదయం త్రుటిలో ప్రమాదం తప్పింది. అంబాజీపేట వైపు నుంచి విద్యార్థులను ఎక్కించుకుని అమలాపురానికి ఈ బస్సువస్తోంది. ఆ సమయంలో వెనుక చక్రం ఊడిపోవడాన్ని వంతెనపై ఉన్న జట్టు కార్మికులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. చక్రం ఊడి పోవడంతో తక్షణమే బస్సును ఆపి, దానిలోని విద్యార్థులను కిందకు దింపాడు. తిరిగి చక్రాన్ని అమర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల అమలాపురం విద్యానిధి విద్యా సంస్థలకు చెందిన బస్సుకు కూడా త్రుటిలో ప్రమాదం తప్పింది.జాతీయ రిఫరీగా అంజి అమలాపురం టౌన్: హైదరాబాద్లోని ఉర్దూ మాస్కన్ హాల్లో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకూ నాలుగు రోజుల పాటు తెలంగాణ జు–జిట్సు (యుద్ధ కళ) అసోసియేషన్ నిర్వహించిన నేషనల్ రిఫరీ, కోచ్ సెమినార్లో అమలాపురానికి చెందిన పడాల అంజి జాతీయ రిఫరీగా ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు ఆయన అక్టోబర్లో ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి జు–జిట్సు చాంపియన్ షిప్ పోటీలకు ఎంపికయ్యారు. అలాగే జాతీయ రిఫరీగా ఉత్తీర్ణులైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని జు–జిట్సు ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ యాసిన్, ప్రధాన కార్యదిర్శి ఎన్.గురుప్రభాకరరావు చేతుల మీదుగా అందుకున్నారు. -
‘న్యాయ’ పరీక్షలకు సర్వం సిద్ధం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బుధవారం నుంచి న్యాయ విభాగం నియామక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ వివరాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ పరీక్షలకు 25,173 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని అన్ని జ్యుడీషియల్ జిల్లాల్లో స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీయిస్ట్, డ్రైవర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి విభాగంలో ఉదయం 7.30 నుంచి 8.45 మధ్య అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. 9 నుంచి 10.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. రెండో విభాగంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి 12.15 వరకు లోపలికి అనుమతి, 12.30 నుంచి 2 గంటల వరకూ పరీక్ష జరుగుతుంది. మూడో విభాగానికి సంబంధించి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 3.45 వరకు లోపలికి అనుమతి, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలే ఎంపికకు ప్రామాణికం పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే సెంటర్ గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్, చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫొటో ఐడీ వెంట తీసుకురావాలి. హాల్ టిక్కెట్ డౌన్లోడ్ సమస్యలకు హెల్ప్డెస్క్ ఫోన్ నంబర్ 0863 2372752, ఈ–మెయిల్ హెచ్సీ.ఏపీ.ఎట్దరైటాప్ ఏఎల్జే.గవ్.ఇన్ లో సంప్రదించాలి. పరీక్షల ఫలితాలే అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికం. ఎటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించరు. స్టేనోగ్రాఫర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డ్రైవర్ పోస్టులకు విడిగా నైపుణ్య పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రా లకు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. కేంద్రంలో సమస్యలపై సిబ్బందిని అందుబాటులో ఉంచారు. అలాగే 0863 2372752 నంబర్కు ఫోన్ చేయవచ్చు. ● కాకినాడ జిల్లాలోని రాయుడుపాలెం వద్ద సాఫ్ట్ టెక్నాలజీస్ కేంద్రం, అచ్యుతాపురం రైల్వే గేట్ దగ్గర నున్న ఆయాన్ డిజిటల్ జోన్లో ఈ నెల 20, 21, 22, 23 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ● సూరంపాలెం అదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 24న నిర్వహిస్తారు. ● రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 20, 21. 22, 24 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ● అమలాపురం పరిధిలోని అభ్యర్థులకు చెయ్యేరు శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, భట్లపాలెంలోని బీవీసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఈ నెల 22, 23, 24 తేదీల్లో నిర్వహిస్తారు. నేటి నుంచి 24 వరకూ నిర్వహణ ఉమ్మడి జిల్లాలో పూర్తయిన ఏర్పాట్లు -
నకిలీ దస్తావేజులతో స్థలాల రిజిస్ట్రేషన్
రాజమహేంద్రవరం రూరల్: నకిలీ దస్తావేజులు సృష్టించి స్థలాలను విక్రయిస్తున్న ఐదుగురి సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం బొమ్మూరు పోలీస్స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కుప్పనపూడికి చెందిన గొల్లపల్లి కాశీ విశాలాక్షి గతంలో రాజమహేంద్రవరంలో డాక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో 1997లో తన పెద్ద కుమారుడు వినోద్ పేరున కవలగొయ్యిలో 267 చదరపు గజాలు, దివాన్ చెరువులో 267 చదరపు గజాలు, చిన్న కుమారుడు లక్ష్మణ్ పేరున దివాన్ చెరువులో 267 చదరపు గజాల స్థలాలను కొనుగోలు చేశారు. అయితే విశాలక్షి భర్త వెంకటేశ్వరరావు 2012లో చనిపోవడంతో ఆమె తన స్వగ్రామం కుప్పనపూడికి వెళ్లిపోయారు. ఆమె కుమారులు ఉద్యోగాల రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. విశాలాక్షి కూడా అమెరికా నుంచి ఇటీవల తన స్వగ్రామానికి వచ్చారు. తన ఆస్తుల కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పరిశీలించగా, వాటిని వేరొకరు కాజేసినట్టు గుర్తించారు. దీనిపై ఈ ఏడాది జూన్ 14న బొమ్మూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఠాగా ఏర్పడి.. కాకినాడకు చెందిన షేక్ ఫకీర్ మహమ్మద్ ఖాసిం బాషాకు 2013 జనవరిలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా పనిచేసే రాజమహేంద్రవరానికి చెందిన మద్దిరెడ్డి లక్ష్మీనారాయణ, మద్దిరెడ్డి నాగేంద్ర ప్రసాద్ (సిటీ బస్సు ప్రసాద్) పరిచయమయ్యారు. ఎక్కువ కాలం ఖాళీగా ఉండి, ఎవ్వరూ పట్టించుకోకుండా ఉన్న స్థలాల దస్తావేజు జిరాక్సులు తెస్తే, వాటికి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి, అధిక ధరకు విక్రయించుకుందామని చెప్పాడు. దానికి మిగిలిన ఇద్దరూ అంగీకరించారు. ఈ నేపథ్యంలో కాశీ విశాలాక్షి కుమారుల స్థలాలకు నకిలీ దస్తావేజులు తయారు చేసి, రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం బయటకు వారికి విక్రయించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాల ప్రకారం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య ఆధ్వర్యంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సోమవారం మద్దిరెడ్డి నాగేంద్ర ప్రసాద్, సబ్బితి భాస్కరరావును ఆదర్శనగర్లో, షేక్ ఫకీర్ మహమ్మద్ ఖాసిం బాషా, యాదగిరి సురేష్, గాలి రాజేంద్ర ప్రసాద్లను ఈస్ట్ రైల్వే గేటు వద్ద బొమ్మూరు ఇన్స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం అరెస్టుచేశారు. ఐదుగురి సభ్యుల ముఠా అరెస్టు కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీవిద్య -
‘అవాస్తవాలు చెప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’
తూర్పుగోదావరి జిల్లా. మద్యం కేస్ పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ అని, ఇందులో వాస్తవాలు లేవని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా మిధున్ రెడ్డి కుటుంబాన్ని అవమాన పరచాలనే ఉద్దేశంతోనేఈ తతంగమంతా జరిగినట్టు అర్థం అవుతుందన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 19వ తేదీ) రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్రెడ్డిని ములాఖత్లో బొత్స సత్యనారాయణ కలిశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ ప్రభుత్వాలు వ్యవస్థను డైవర్ట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేయటం తగదు. రానున్న రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చివరకు ధర్మం గెలుస్తుందిఈ నెల 25 మా నాయకుడు వస్తున్నారు. ఈ ప్రభుత్వంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా జరుగుతాయని సదుపాయాలు కల్పిస్తారని అంచనా వేయనవసరం లేదు. చట్టాన్ని ఒకసారి చేతిలోకి తీసుకుని వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు. అది వారినే దహించి వేస్తుంది. అవాస్తవాలు చెప్పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న కాలంలో నిజానిజాలు బయటికి వస్తాయి. వ్యక్తులను అవమానపరిచి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని బొత్స ధ్వజమెత్తారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్తకొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ, పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
ఏదోమంత్రం చాలదు
● పల్లెలు, పట్టణాల్లో విపరీతమైన దోమల సమస్య ● నిత్యం రోగాల పాలవుతున్న జనం ● ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వ్యాధిగ్రస్తులు ● నిర్మూలనకు ప్రభుత్వ యంత్రాంగం అరకొర చర్యలు ● పటిష్ట పారిశుధ్య చర్యలతోనే నివారణ సాధ్యం ● రేపు ప్రపంచ దోమల దినోత్సవం ఆలమూరు: దోమ సైజు చిన్నదే కానీ.. కుట్టిందంటే మాత్రం పెద్ద ప్రమాదమే. అసలే వర్షాకాలం.. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో దోమలూ విజృంభిస్తున్నాయి. వీటి ద్వారా కలిగే వ్యాధులకు సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకం కావచ్చు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు.. సరైన పారిశుధ్య చర్యలు చేపట్టకపోవడంతో దోమల వ్యాప్తి సమస్యాత్మకంగా మారింది. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా, చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అంటు వ్యాధులు ప్రబలుతున్నా యి. దోమకాటుతో మలేరియా, డెంగీ, చికున్గున్యా, జికా వైరస్ వంటి వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత సర్ రోనాల్డ్ రాస్ 18 ఏళ్ల పాటు దోమల వల్ల సంక్రమించే వ్యాధులపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. ఆడ అనాఫిలిస్ దోమ కుట్టడం వల్ల మలేరియా సంభవిస్తుందనే విషయాన్ని 1897 ఆగస్టు 20న కనుగొన్నారు. డబ్ల్యూహెచ్ఓ సూచనల మేరకు ఆ రోజును ప్రపంచ దోమల దినోత్సవం (వరల్డ్ మస్కిటో డే) జరుపుతున్నారు. నిర్మూలన చర్యలు తప్పనిసరి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఏడు సామాజిక, రెండు ఏరియా అస్పత్రులున్నాయి. జిల్లాలోని ఆయా పీహెచ్సీల ద్వారా దోమల నిర్మూలనకు వైద్యారోగ్య శాఖ విసృత ప్రచారం నిర్వహిస్తోంది. వర్షాకాలంలో తేమ శాతం అధికంగా ఉన్న ప్రదేశాల్లో దోమల వ్యాప్తి అధికంగా ఉంటోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిత్యం పదుల సంఖ్యలో రోగులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దోమల నివారణకు దోమ తెరలు వాడటం, సంపూర్ణ పారిశుధ్య చర్యలు పాటించాలి. జనావాసాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైనేజీల్లో లార్వాసైడ్ క్రిమి సంహారక మందును పిచికారీ చేయాలి. ఇంటి గోడలపై సింథటిక్ ఫైరిత్రాయిడ్, ఏసీఎం క్రిమి సంహారక మందును చల్లాలి. మలేరియా లక్షణాలు ● అంటువ్యాధి మలేరియాను రక్త పరీక్ష (ఆర్డీ) ద్వారా నిర్థారించవచ్చు. ● ప్లాస్మోడియం జాతికి చెందిన అనాఫిలిస్ దోమ వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ● వ్యాధిగ్రస్తుడు చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడతాడు. ● వ్యాధి నిరోధక శక్తి లేనివారు విపరీతమైన తలనొప్పితో ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదముంది. ● దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ● గిరిజన ప్రాంతాల్లో ఫాల్సిపారం మలేరియా అధికంగా ఉండగా, మైదాన ప్రాంతాల్లో వైవాక్స్ జాతి మలేరియా విస్తృతంగా వ్యాపిస్తుంది. డెంగీ నిర్థారణ–లక్షణాలు ● ఏడిస్ ఈజిప్టి దోమకాటు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ● రక్త ప్రవాహంలో గడ్డ కట్టే రక్త కణాల సంఖ్య భారీగా క్షీణిస్తాయి. ● డెంగీ వ్యాధిని ఏలీసా (ఎన్ఐవీ) పరీక్ష ద్వారా నిర్థారిస్తారు. ● వ్యాధిగ్రస్తుని అవయవాలపై ఏ మేరకు ప్రభావం ఉందో గుర్తించేందుకు పూర్తి రక్త గణన, ఈ ఎకోకార్డియోగ్రఫీ, సెరోలజీ పరీక్ష, యాంటీజెన్ డిటెక్షన్, రేడియాలజీ ఇమేజింగ్, ఫైబ్రిన్ క్షీణత ఉత్పత్తి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ● జ్వరం తరచూ వస్తుంటే వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స పొందాలి. ● డెంగీ జ్వరం సాధారణంగా ఉష్ణ మండల ప్రాంతంలో దోమకాటు వల్ల్ల సోకుతుంది. చికున్గున్యా నివారణ ● ఏడిస్ అల్పోపిక్టస్ జాతి దోమకాటు వల్ల చికున్గున్యా వస్తుంది. ● వ్యాధిగ్రస్తుడిని కుట్టిన దోమ మరొకరిని కుట్టడం ద్వారా వ్యాప్తిస్తుంది. ● వ్యాధి సోకిన వారికి 102 డిగ్రీలు పైబడి జ్వరం వస్తుంది. ● కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ● సాధారణంగా వారం నుంచి 12 రోజుల్లోపు లక్షణాలు కనిపిస్తాయి. ● వ్యాధిగ్రస్తుడు త్వరితంగా అలసట చెందుతారు. ● ఒకొక్కరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ● గర్భిణులు ప్రసవ సమయంలో చికున్గున్యా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ వర్షాకాలం దృష్ట్యా విజృంభిస్తున్న దోమల నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నాం. వైద్యారోగ్య సిబ్బంది ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి, పారిశుధ్య నిర్వహణ, దోమల నియంత్రణను ప్రజలకు వివరిస్తున్నారు. అంటువ్యాధుల నివారణకు క్షేత్ర స్థాయిలో హెల్త్ అసిస్టెంట్లతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. – ఎన్.వెంకటేశ్వరరావు, జిల్లా మలేరియా యూనిట్ అధికారి, అమలాపురం జికా వైరస్ వ్యాప్తి ఏడిస్ ఈజిప్టి దోమకాటు వల్ల జికా వైరస్ మానవుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంపర్కం జరిపిన వారికీ వ్యాప్తిస్తుంది. దేశంలో ఈ వైరస్ ప్రభావం అంతగా లేదు, వైరస్ సోకినా సాధారణ జ్వరం వస్తుంది. చికున్గున్యా, డెంగీ వైరస్ల ద్వారానే జికా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తులకు దృష్టి సమస్యలు రావచ్చు. జ్వరం లక్షణాలుంటే వైద్యుల్ని సంప్రదించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిరోధించవచ్చు. -
బాలుడిపై వీధి కుక్కల దాడి
అనపర్తి: ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చిన ఘటన సోమవారం అనపర్తిలో చోటుచేసుకుంది. అనపర్తి తహసీల్దార్ కార్యాలయం వీధిలో పదేళ్ల బాలుడు సాత్విక్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో వీధిలో ఉన్న కుక్కల గుంపు అతడిపై దాడి చేశాయి. బాలుడు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరమేశారు. బాలుడి చేతికి లోతుగా కుక్కకాటు గాయాలయ్యాయి. బాలుడిని చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినదిన గండంగా మారిన కుక్కల గుంపులను జనావాసాల నుంచి ఊరి బయటకు తరలించకపోతే మరిన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగులపై కూటమి సర్కార్ కక్ష రాయవరం: కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష కట్టిందని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్కుమార్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సోమవారం వెంటూరులో ఓ ప్రకటన విడుదల చేశారు. అనర్హుల ఏరివేత పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దివ్యాంగుల పింఛన్లు తొలగించిందని ఆరోపించారు. దీనిపై చిత్తూరు జిల్లాలో దివ్యాంగులు నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఓవైపు పింఛను సొమ్మును పెంచి, మరోవైపు తొలగించి, వారిని రోడ్డుపాలు చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. 2010లో జారీ చేసిన వైకల్య ధ్రువీకరణ పత్రాల్లో వైకల్య శాతాన్ని తగ్గించడం సమంజసం కాదన్నారు. రాబోయే రోజుల్లో ఉపాధి, సంక్షేమ, ఉద్యోగ అవకాశాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. జ్యూయలరీ షాపు యజమాని పరారీ తుని: మోసపూరిత మాటలతో కస్టమర్లను నమ్మించి.. మోసగించిన ఓ జ్యూయలరీ షాపు యజమాని పరారీలో ఉన్నట్టు పట్టణ సీఐ గీతారామకృష్ణ సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక నక్కినవీధిలో శ్రీశ్రీనివాసా జ్యూయలరీ పేరుతో సత్యవరం గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, అతని కుటుంబ సభ్యులు బంగారం షాపు నిర్వహిస్తున్నారు. తుని, కోటనందూరు తదితర మండలాల్లో తమ కస్టమర్లకు అధిక వడ్డీ ఇస్తానని, తక్కువ ధరకే బంగారం ఇస్తానని చెప్పి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారు. ప్రస్తుతం వెంకటేశ్వరరావు షాపు మూసేసి పరారీలో ఉన్నట్టు తెలిసిందని సీఐ చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. బాధితులు ఇంకా ఉంటే పట్టణ సీఐ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. -
ముగిసిన సౌత్ జోన్ హ్యాండ్ బాల్ పోటీలు
రాజానగరం: విద్యార్థులకు చదువుతో పాటు, క్రీడలూ అవసరమని దివాన్చెరువులోని శ్రీప్రకాష్ విద్యా నికేతన్ కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్ అన్నారు. పాఠశాల మైదానంలో నాలుగు రోజులుగా జరుగుతున్న సీబీఎస్ఈ సౌత్ జోన్–1 హ్యాండ్ బాల్ పోటీలు సోమవారం ముగిశాయి. విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. విజేతలు వీరే.. అండర్–14 విభాగంలో డాల్ఫిన్ ఎలైట్ స్కూల్ (చైన్నె), వెలమలై విద్యాలయం వెస్ట్ (చైన్నె) ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందారు. తృతీయ స్థానంలో శ్రీప్రకాష్ విద్యా నికేతన్ (పాయకరావుపేట), ఆర్జీఎం స్కూలు (నంద్యాల) నిలిచాయి. అండర్–17లో రాజాజీ విద్యాలయం (చైన్నె), కవి భారతి స్కూలు (చైన్నె) తొలి రెండు స్థానాల్లో, శ్రీవిద్యా నికేతన్ (తిరుపతి), భారతీయ విద్యా భవన్ (తాడేపల్లిగూడెం) తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. అండర్–19లో ఎస్వీఆర్ స్కూలు (చైన్నె), కికాని విద్యా మందిర్ (చైన్నె) వరుస స్థానాల్లో, శ్రీప్రకాష్ విద్యానికేతన్, వెల్లమల విద్యాలయం (విరగనూరు–చైన్నె) తృతీయ స్థానంలో నిలిచాయని టెక్నికల్ కమిటీ ఇన్చార్జి డాక్టర్ ఎస్.గోపీకృష్ణ వెల్లడించారు. స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.స్వామి, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, ప్రిన్సిపాల్ విమల, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మస్కట్ నుంచి స్వదేశానికి చేరిక
నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఇరుక్కున్న వైనం అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి మస్కట్ దేశంలో ఇబ్బందులు పడుతున్న మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు స్వదేశానికి రప్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురం పట్టణం వడ్డెగూడేనికి చెందిన బొంతు సుహాసిని(31) ఉపాధి కోసం నకిలీ ఏజెంట్ ద్వారా ఈ ఏడాది మార్చిలో మస్కట్కు వెళ్లింది. అక్కడ పనిలో చేరిన ఆమెను యజమాని శారీరకంగా, మానసికంగా వేధించాడు. దీంతో తనను రక్షించి, స్వదేశానికి తీసుకువెళ్లాలంటూ భర్తను వేడుకుంది. ఆమె భర్త కొండలరావు దీనిపై కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులను ఆశ్రయించారు. వారి విన్నపంపై స్పందించిన కలెక్టర్ మహేష్కుమార్ వెంటనే భారత రాయబార సంస్థ ద్వారా సంప్రదింపులు జరిపారు. బాధితురాలిని స్వదేశానికి తీసుకురావాలని నోడల్ అధికారి కె.మాధవిని ఆదేశించారు. అధికారులు ఆ నకిలీ ఏజెంట్, మస్కట్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఈ ప్రయత్నాలు ఫలించడంతో భారత విదేశీ రాయబార మంత్రిత్వ శాఖ సహకారంతో సుహాసిని స్వదేశానికి సురక్షితంగా చేరింది. బాధితురాలు సుహాసిని తన బంధువులతో సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ మహేష్కుమార్ను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. -
ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం
తండ్రి మందలించాడని ఘాతుకం రాయవరం: సరిగ్గా చదవడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు సోమ వారం కేసు నమోదు చేశారు. రాయవరం మండలం పసలపూడి శివారు సర్వారాయ తోటలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న దంగేటి వెంకటరమణ(19) బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై డి.సురేష్బాబు వివరాల మేరకు, తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన వెంకటరమణ సర్వారాయతోటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ, రామచంద్రపురంలోని వీఎస్ఎం కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తల్లిదండ్రుల వద్దకు పటవల గ్రామానికి వెళ్లాడు. ఆ సమయంలో కుమారుడి చదువు గురించి తండ్రి ఆరా తీసినట్టు తెలిసింది. ఫస్టియర్ సబ్జెక్టులు ఉండిపోయిన విషయాన్ని తెలుసుకుని అతడిని తండ్రి మందలించడంతో.. మనస్తాపానికి గురైన వెంకటరమణ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై సురేష్బాబు తెలిపారు. -
మరో మూడు రోజులు భారీ వర్షాలు
● అధికారులు అప్రమత్తంగా ఉండండి ● కలెక్టర్ ప్రశాంతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రానున్న మూడు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో అధికారులతో ఆమె మాట్లాడారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద నీటి ప్రవాహం పెరుగుతుందని, మంగళవారం నాటికి 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసి, మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బలహీన వంతెనలు, కల్వర్టులపై వాహన రాకపోకలను నిలిపి వేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలను పరిశీలించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడు రోజుల పాటు సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. సమస్యలు పరిష్కరించండి ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో ఉండాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి 108 అర్జీలను స్వీకరించారు. -
‘రిజిస్టర్డ్ టపా’కు టాటా
● వచ్చే నెల ఒకటి నుంచి రద్దు ● స్పీడ్ పోస్ట్లో విలీనం ● ఇక ట్రాకింగ్ సిస్టమ్తో విస్తృత సేవలు అమలాపురం టౌన్: దశాబ్దాలుగా పోస్టల్ శాఖలో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ పోస్టు రద్దవుతోంది. ఈ నెలాఖరుకు రిజిస్టర్డ్ పోస్టు అనేది పోస్టల్ శాఖ నుంచి అంతర్థానం కానుంది. రిజిస్టర్డ్ పోస్టును స్పీడ్ పోస్ట్లో విలీనం చేయడం ద్వారా ఈ విధానం రద్దు కానుంది. కొత్త విధానం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖ అమలులోకి తీసుకురానుంది. ఇక నుంచి స్పీడ్ పోస్ట్లే పార్సిల్ సేవలు అందించనున్నాయి. స్పీడ్ పోస్ట్ అనేది పోస్టల్ శాఖలో కొన్నేళ్ల కిందట నుంచి విస్తృత సేవలు అందిస్తోంది. కొత్తగా స్పీడ్ పోస్ట్లో ట్రాక్ సిస్టమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. పార్శిల్ బుక్ చేసిన వ్యక్తికే కాకుండా, దానిని అందుకోనున్న వ్యక్తి మొబైల్ ఫోన్కు పూర్తి సమాచారంతో కూడిన మెసేజ్ వస్తుంది. బుక్ చేసిన పార్శిల్ ఎక్కడుంది, ఎప్పటికి అందుతుంది వంటి వివరాలు మొబైల్ ఫోన్లలో చూసుకునే వెసులుబాటు కల్పించింది. సరికొత్త టెక్నాలజీ దిశగా.. పోస్టల్ శాఖ ఇప్పటివరకు అమలవుతున్న టెక్నాలజీ విధానాలకు స్వస్తి పలికి, సరికొత్త సాంకేతిక, ఆధునీకతతో కూడిన ఏపీటీ 2.0 ద్వారా సేవలు అందిస్తోంది. జూలై నెలకు ముందు పోస్టల్ శాఖ మొత్తం సేవలు కోర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా అందేవి. వీటి స్థానే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ఏపీటీ 2.0 అమలులోకి తెచ్చింది. అమలాపురం పోస్టల్ డివిజన్ సూపరింటెండెంట్ ఆర్.నవీన్కుమార్ డివిజన్లో పోస్టల్ సేవలను ఏపీటీ 2.0 ద్వారా సేవలు అందించడమే కాదు.. వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విలీనమైన స్పీడ్ పోస్ట్ ద్వారా సాంకేతిక సౌకర్యాలతో సేవలందించేందుకు డివిజన్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అమలాపురం పోస్టల్ డివిజన్ పరిధిలో రెండు ప్రధాన పోస్టల్ కార్యాలయాలు, 39 సబ్ పోస్టాఫీసులు, 196 బ్రాంచి పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో స్పీడ్ పోస్ట్ ఆధునిక సాంకేతిక సేవలు అందబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఆయా పోస్టల్ కార్యాలయాల ద్వారా గత జూలై నుంచి ఏపీటీ 2.0 ద్వారా మొత్తం పోస్టల్ సేవలను అందుతున్నాయి. -
పెరిగిన గోదావరి ఉధృతి
ధవళేశ్వరం: స్థానిక కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి పెరిగింది. దీంతో మిగులు జలాలను సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నీటి ఉధృతి పెరిగినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. మరోపక్క గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెంలలో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో రెండు రోజుల్లో కాటన్ బ్యారేజీ వద్ద వరద తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 6,07,682 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అలాగే రాత్రి 9.10 అడుగులకు నీటి మట్టం చేరింది. డెల్టా కాలువలకు సంబంధించి 2,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 1,500, మధ్య డెల్టాకు 100, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. రేవు వద్ద వాహనాల రద్దీ సఖినేటిపల్లి: చించినాడ వంతెన మరమ్మతుల కారణంగా సఖినేటిపల్లి రేవు వద్ద సోమవారం వాహనాల రద్దీ ఏర్పడింది. రాజోలు నియోజకవర్గ ప్రజలకు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు, ఇతర జిల్లాలకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న ప్రధానమైన చించినాడ వంతెనను ఒక రోజు మూసివేశారు. దీంతో సఖినేటిపల్లి వద్ద వశిష్ట రేవులో పంట్లపై దాటేందుకు వాహనాల్లో తరలివచ్చారు. -
ఉండవల్లిని కలసిన వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యేలు
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ను ఆయన నివాసంలో వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తదితరులు సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నగరానికి వచ్చిన వారు దానవాయిపేటలోని మాజీ ఎంపీ ఉండవల్లి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. వారి వెంట మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఉన్నారు. పోలీస్ గ్రీవెన్స్కు 25 ఫిర్యాదులుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం (పీజీఆర్ఎస్)కు 25 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఎస్పీ డి.నరసింహకిశోర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫోన్ చేసి సమస్యలకు సంబంధించి వివరాలు అడిగారు. ఫిర్యా దుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశాలిచ్చా రు. నిర్దేశించిన సమయంలో అర్జీల పరిష్కారా నికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సివిల్ కేసు లు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట, దొంగతనం కేసులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. భక్తులతో రత్నగిరి కిటకిట అన్నవరం: సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలి వచ్చిన నవ దంపతులు, భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత మండపాలు నిండిపోయాయి. ఆదివారం రాత్రి, సోమవారం తెల్లవారుజామున ముహూర్తాలలో రత్నగిరిపై సుమారు 50 వివాహాలు జరిగాయి. ఇతర ప్రాంతాలలో కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో వారంతా తమ బంధువులతో కలిసి సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారని, 2,200 వ్రతాలు జరిగాయని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సెప్టెంబర్ నెలాఖరు నాటికి తూర్పుగోదావరి జిల్లాను సారా రహితంగా తీర్చిదిద్దాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్యమురళి అధికారులను ఆదేశించారు. సోమవా రం ఆయన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి కార్యాలయాన్ని సందర్శించి నవదో యం 2.0పై అధికారులకు పలు సూచనలు చేశా రు. రాజమహేంద్రవరం సౌత్, నార్త్, కోరుకొండ స్టేషన్ల పరిధిలో సారాను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది సిబ్బందిని స్పెషల్ టీమ్గా తీసుకు వచ్చామన్నారు. వీరు బృందాలుగా ఏర్పడి సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తిస్థాయిలో సారా తయారీ, అమ్మకాలపై దాడులు నిర్వహిస్తారన్నారు. బార్ పాలసీ విధానంలో ఎక్కువ మంది పాల్గొనేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య, ఏఈఎస్ పి.నాగరాహుల్, టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పులి హనుశ్రీ, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ క్రాంతికిరణ్, సౌత్ ఇన్స్పెక్టర్ ఐడీ నాగేశ్వరరావు, కోరుకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస బాలాజీ పాల్గొన్నారు. -
మందూ వెనకా చూడకుండా..
సాక్షి, రాజమహేంద్రవరం: ముందూ వెనకా చూడడం లేదు.. జనారోగ్యం పట్టించుకోవడం లేదు.. మద్యంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నా పట్టించుకోవడం లేదు.. ప్రజలతో తప్ప తాగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది.. మందుబాబులం.. మేం మందుబాబులం.. అంటూ అర్ధరాత్రయినా రోడ్డుపై పడేలా కిక్కు ఇస్తోంది.. సంపద సృష్టే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోంది.. మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటోంది.. ఈ క్రమంలో ఇప్పటికే మద్యం పాలసీలో సమూల మార్పులు తీసుకు వచ్చింది. ప్రభుత్వ మద్యం విధానాన్ని పక్కనబెట్టి, ప్రైవేట్కు కట్టబెట్టి రూ.కోట్లు గడించింది. మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూమ్లు పెట్టుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా మరింత ఆదాయం పెంచుకుంది. తాగాగా మరో విధానానికి శ్రీకారం చుట్టింది. నూతన బార్ పాలసీని తీసుకు వస్తోంది. అనుకున్నదే తడువుగా రంగంలోకి దిగింది. ఇందుకు గాను ఇటీవల ఎకై ్సజ్ ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిర్వహించింది. నూతన పాలసీ, ప్రజలకు మద్యం ఇంకా సంపూర్ణంగా అందుబాటులోకి ఎలా తీసుకురావాలి? ఎక్కడ బార్లు ప్రారంభిస్తే ఎక్కువగా తాగుతారు..? అనే విషయాలపై సమగ్రంగా చర్చించింది. రాష్ట్ర వైన్ డీలర్ల సంఘం, స్టార్ హోటల్స్ అసోసియేషన్, ఏపీ హోటల్స్ అసోసియేషన్లు కొత్త పాలసీపై వెల్లడించిన అభిప్రాయాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో బార్లలో విక్రయాలు ఎలా ఉండాలన్న విషయాలపై చర్చించారు. కొత్త విధానం ద్వారా ఆదాయం పెంపొందించడమే లక్ష్యంగా ముందు కెళ్లాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు పాత బార్ల పాలసీ ముగియనుండగా.. వచ్చే నెల 1వ తేదీ నుంచి నూతన పాలసీ అమల్లోకి రానుంది. ఇందుకు ఎకై ్సజ్ అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ‘తూర్పు’లో 25 బార్లు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 25 బార్లు ఉన్నాయి. ఇందులో 3 బార్లు కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేయగా, మిగిలినవి ఓపెన్ క్యాటగిరీలో కేటాయిస్తారు. ఇందులో రాజమహేంద్రవరంలో 19, కొవ్వూరులో 2, నిడదవోలులో 3 బార్లు ఉండగా.. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం టూరిజం ప్రదేశాల్లో బార్లకు అనుమతులు రానున్నాయి. కడియపులంకలో ఒక బార్కు అనుమతి ఇవ్వనున్నారు. ఫీజు వసూళ్లు ఇలా.. మున్సిపల్ కార్పొరేషన్కు 10 కిలోమీటర్ల లోపు బార్ ఏర్పాటు చేసుకునే వారికి ఒక్కో బార్కు ఏడాదికి రూ.70 లక్షల ఫీజుగా నిర్ధారించారు. నిడదవోలులో రూ. 37.50 లక్షలుగా నిర్ణయించారు. కల్లుగీత కార్మికులకు కేటాయించే షాపులకు ఫీజులో 80 శాతం రాయితీ కల్పిస్తారు. బార్లకు దరఖాస్తు ఫీజును సైతం పెట్టారు. అప్లికేషన్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ నెల 26 వరకూ ఓపెన్ కేటగిరీ బార్లకు దరఖాస్తులకు సమయం ఇచ్చారు. కల్లుగీత కార్మికులు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. మరింత కిక్కో కిక్కు..! ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయం పొందేందుకు ప్రజలకు మద్యం కిక్కు ఎక్కిస్తోంది. ఇప్పటికే మందుబాబులు తప్పతాగి రహదారులపై తూలుతున్నారు. అది చాలదన్నట్లు మరింత కిక్కు ఎక్కించేందుకు బార్లు తెరిచి ఉంచే సమయాన్ని సైతం ప్రభుత్వం పెంచింది. గతంలో బార్ రాత్రి 11 గంటల వరకు నడుపుకొనేందుకు అనుమతి ఉండేది. అయినా రాత్రి 12 వరకూ అలాగే నడిపేవారు. ఆ సమయాన్ని కాస్త, అధికారికంగా రాత్రి 12 గంటలకు పెంచింది. ఇదే అదునుగా భావించే బార్ల యజమానులు తెల్లవారు జామున 3 గంటల వరకూ నడిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే జరిగితే రాత్రంతా తాగడం.. రహదారులపై రచ్చ చేయడం జరుగుతుందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే తాగి గొడవలకు దిగుతున్నారని, మహిళలపై అసభ్యంగా ప్రవరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రాత్రంతా కూర్చోబెట్టి తాగిస్తే శాంతిభద్రతలు అదుపుతప్పే పరిస్థితి లేకపోలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. పర్మిట్ రూమ్లకు గ్రీన్ సిగ్నల్ మద్యం ద్వారా ప్రస్తుత ఆదాయం చాలదన్నట్లు భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఆదాయం మరింత పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. మద్యం విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పర్మిట్ రూమ్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులు ఉండగా.. అందుకు అనుగుణంగా 125 పర్మిట్ రూమ్లు వెలుస్తున్నాయి. అక్కడే మద్యం తాగేందుకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నారు. ఇలా జనం ఊగి తూగేలా చేస్తోంది. సంపద సృష్టే లక్ష్యంగా ‘కూటమి’ అడుగులు ఇప్పటికే మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములు తాజాగా నూతన బార్ల విధానం రూపకల్పన తప్ప తాగేందుకు మరో గంట పొడిగింపు -
ఆ చేతులకు.. మనసుంది
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆ చేతులకు మనసుంది.. అభాగ్యులకు ఆపన్నహస్తం అందిస్తోంది. ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే నానుడిని నిజం చేస్తూ సాటివారి సేవలో తపిస్తోంది. తాము పడిన కష్టం మరొకరికి రాకూడదనే ఉద్దేశంతో ముందుకు సాగుతోంది. ఇలా సేవ చేసే ప్రతి హృదయం మానవత్వం చాటుతోంది. మంగళవారం ప్రపంచ మానవత్వ దినోత్సవం సందర్భంగా సాయం చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల గురించి ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. సేవ చేయాలనే తపనతో జిల్లాలో సుమారు 50 వరకూ స్వచ్ఛంద సంస్థలు ఏర్పడ్డాయి. వీటికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అలాగే మరో 150 వరకూ సంస్థలతో పాటు వ్యక్తులూ అభాగ్యుల సేవల్లో తరిస్తున్నారు. తమకున్న దాంట్లోనే సేవ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సమాజంలో అభాగ్యులు, అనాథలు, నిరాశ్రయులకు సాయం అందించి సహృదయాన్ని చాటుతున్నారు. సమాజ శ్రేయస్సుకు పాటుపడుతూ మా చేతులకూ మనసుందని నిరూపిస్తున్నారు. అందులో కొన్ని తెలుసుకుందాం రండి.. తపనతో చదువుకుని.. పామర్తి గోపాలరావు మాస్టారుది కృష్ణా జిల్లా గుడివాడ మండలం జమీగొల్లేపల్లి. తండ్రి గీత కార్మికుడు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగోక పోవడంతో పదో తరగతి వరకే చదువుకున్నారు. కానీ బాగా చదువుకోవాలనే తపన ఆయనకు ఉండేది. ఈ నేపథ్యంలో తమ బాల్య మిత్రుడు పొట్లూరి రామబ్రహ్మం అందించిన సాయంతో ఆయన పీజీ వరకూ పూర్తి చేశారు. తరువాత రాజమహేంద్రవంలోని వీరేశలింగం పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా చేరి, తదనంతరం కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసి 2010లో ఉద్యోగ విరమణ పొందారు. అయితే తనలా చదువుకోవాలనే తపన ఉన్న పేద విద్యార్థులకు ఫీజులు కట్టేందుకు ముందుకు ఉండేవారు. తరువాత వాకర్స్ యోగా, లాఫింగ్ క్లబ్ను మిత్రులతో స్థాపించారు. అప్పటి నుంచి నిరంతరంగా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, ప్రభుత్వ పింఛన్ అందని పేదలకు ప్రతి నెలా 5న రూ.500 చొప్పున అందిస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది నేను సహాయం చేసిన కొంత మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి స్థానం పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఏ విధంగా ఈ స్థితికి వచ్చానో గుర్తు పెట్టుకున్నాను. అందుకే ప్రతి నెలా నేను, నా మిత్రు లంతా కలసి పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, వృద్ధులకు పింఛన్ల రూపంలో రూ.50 వేలకు పైగా సహాయం అందిస్తున్నాం. నగరంలో ఎస్కేవీటీ కళాశాలలో ప్రతి నెలా 5న ఈ సాయం చేస్తున్నాం. – పామర్తి గోపాలరావు, విశ్రాంత ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం ఆఖరి మజిలీ కోసం జంగారెడ్డిగూడేనికి చెందిన ఎస్.రామచంద్రారెడ్డి మి త్రుడి తల్లి చనిపోయినప్పుడు దూరం నుంచి బంధువులు రావడానికి సమయం పట్టింది. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని భద్రపరచడానికి ఇబ్బంది ఎదురైంది. దీనిని చూసి రామచంద్రారెడ్డి చలించిపోయాయి. ఇ లాంటి ఘటనల సమయంలో బాధలో ఉన్నవారికి ఏదై నా చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. 2004లో జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుడిగా ఆయన పనిచేస్తున్న సమయంలో మానవత స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం రోడ్డులో అనేక ప్ర మాదాలు జరిగినప్పుడు సాయం కోసం ఎదురుచూసే క్షతగాత్రులను ఆదుకోవాలనే లక్ష్యంతో అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఈ సంస్థ జంగారెడ్డిగూడెం కేంద్రంగా ఏర్పడి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 65 శాంతి రథాలు, 20 అంబులెన్స్లు, 375 ప్రీజర్ బాక్సులు, 20 అంబులెన్స్లు, 15 వాటర్ ట్యాంక్లు ఏర్పాటు చేసింది. ఆదుకోవాలనే తలంపుతో... చనిపోయిన వారిని భద్రపరచడానికి మానవత స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రీజర్లు, వారిని అంత్యక్రియలకు తీసుకు వెళ్లడానికి శాంతి రథాలను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. బాధలో ఉన్నవారికి సాయం చేయాలనే తలంపుతో వీటిని అందుబాటులోకి తెచ్చాం. ఇవే కాకుండా వికలాంగులకు ట్రై సైకిళ్లు అందించాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 15 శాంతి రథాలు, ప్రీజర్లను ఉంచాం. – కండెపు వెంకట సూర్యనారాయణ, మానవత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, ఉమ్మడి గోదావరి జిల్లా సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్న సంస్థలు అభాగ్యుల కష్టాలు దూరం చేసేందుకు ప్రయత్నం నేడు ప్రపంచ మానవతా దినోత్సవం -
అమ్మ చెప్పిందని..
అమ్మా నాకు జాబ్ వస్తే నీకు ఏం కావాలో చెప్పు అని కొడుకు తల్లిని అడిగాడు. అప్పుడు ఆ తల్లి నాకేం వద్దు, నీ జీతంలో కొంత భాగాన్ని అభాగ్యులు, అనాథల కోసం, వారి వైద్యానికి ఖర్చు చేయమని చెప్పడంతో ఆ మాట నుంచే సాయం పుట్టుకొచ్చింది. తన తల్లికిచ్చిన మాట కోసం కేశవభట్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా అనేక వేల మంది నిరాశ్రయులకు కేశవభట్ల శ్రీనివాసరావు సేవలందిస్తున్నారు. వివిధ రూపాల్లో పేదలను ఆదుకుంటున్నారు. సాయం చేస్తున్నాం ఇప్పటికి వరకూ పేదవర్గాల ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 5 లక్షల మందికి పైగా కంటి వైద్య పరీక్షలు చేయించాం. 76 వేల మందికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశాం. వెయ్యి మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించాం. అంతే కాకుండా రైల్వే కార్మికులకు ఉచితంగా బి య్యం ఇచ్చాం. దివ్యాంగులకు 820 ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు అందించాం. ఆ తల్లి మాట కోసం సాయం చేస్తూనే ఉన్నా. – కేశవభట్ల శ్రీనివాసరావు, విశ్రాంత రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ -
దూసుకొచ్చిన మృత్యువు
● కోరంగిలో ఇద్దరిని బలిగొన్న అతివేగం ● పాదచారి, ఆటోను ఢీకొన్న కారు ● మరో మహిళకు గాయాలు తాళ్లరేవు: మృత్యు రూపంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఇద్దరి ప్రాణాలను బలిగొంది. ఆదివారం కోరంగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీ పనికి వెళ్లి, ఇంటికి తిరిగి వెళుతున్న పాదచారితో పాటు, చర్చిలో ప్రార్థనలను ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన మహిళ దుర్మరణం పాలయ్యారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ రహదారి 216లోని కోరంగి పెంతెకోస్తు చర్చి వద్ద ఆగి ఉన్న ఆటోను యానాం నుంచి కాకినాడకు వెళుతున్న కారు వేగంగా వచ్చి.. తొలుత పాదచారిని, తర్వాత ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో కొత్త కోరంగి గ్రామానికి చెందిన నిమ్మితి ఏసు(50) అక్కడికక్కడే మృతి చెందగా, ఆగి ఉన్న ఆటోలో కూర్చున్న పాత కోరంగి గ్రామానికి చెందిన అరుబరుగుల లక్ష్మి(58) కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ఉన్న మరో మహిళ దడాల ధనలక్ష్మికి గాయాలు కాగా, స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిన్నారులు సురక్షితం : ఇలాఉండగా ఆటోలో ఉన్న మరో నలుగురు చిన్నారులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మృతుడు ఏసు భార్య హైదరాబాద్లో ఉండగా, వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలాగే పాత కోరంగి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన హెల్పర్గా పని చేస్తున్న లక్ష్మి భర్త పదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆమె తన ఇద్దరు కుమారుల వద్ద ఉంటోంది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వివరాలు సేకరించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కాగా సంఘటన సమయంలో ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్నట్టు స్థానికులు అంటున్నారు. కారులో కొన్ని మద్యం బాటిళ్లు కూడా ఉన్నాయంటున్నారు. దీంతో వారు మద్యం సేవించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో ఉన్నవారిలో ఇద్దరు పరారు కాగా, ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. -
కన్ను మూస్తే.. సజీవ చిత్రం
● చరిత్రకు సాక్ష్యం చెప్పే ఛాయాచిత్రం ● మానవ జీవితానికి విడదీయని బంధం ● సాంకేతిక పరిజ్ఞానంతో విప్లవాత్మక మార్పులు ● రేపు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రాయవరం: కన్ను తెరిస్తే జననం.. కన్నుమూస్తే మరణం అన్నాడో మహానుభావుడు. కానీ.. ఈ పరికరం శ్రీకన్నుశ్రీమూస్తే మాత్రం ఆ దృశ్యం కలకాలం సజీవంగా ఉండిపోతుంది. అదే ఫొటోగ్రఫీ. పరిమితులు లేకుండా ప్రపంచంలోని ఏ ప్రాంతం వారికై నా అర్ధమయ్యేది.. పండితుల నుంచి పామరుల వరకు భాషకందని భావాన్ని సులువుగా అర్ధం చేసుకోగలిగే ఏకై క మాధ్యమం ఫొటోగ్రఫీ. అందుకే ఫొటోలు భాషలేని.. భావ దృశ్య కావ్యాలని అంటుంటారు. క్షణకాలంలో కరిగిపోయే జ్ఞాపకాల దొంతరలను కెమెరా కన్నుతో క్లిక్ మనిపించి.. కళ్లముందు సాక్షాత్కరింపజేసేవే ఛాయాచిత్రాలు. బాల్యం.. యవ్వనం.. వృద్ధాప్యం ఇలా గడిచిపోయిన మానవ జీవనయానాన్ని కనులారా వీక్షించే అపురూప అవకాశం కల్పిస్తాయి. ఓ ఛాయా చిత్రం కోటి భావాల్ని పలుకుతుంది. చరిత్రను, సంస్కృతిని చాటిచెబుతాయి. ఫొటోగ్రఫీ అనేది అద్భుత కళ. ఇందులో నేడు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకటిన్నర శతాబ్దాలకు పైగా ఫొటోగ్రఫీ ప్రక్రియ ఉన్నా, రెండు దశాబ్దాలుగా విప్లవాత్మక పరిణామాలు సంతరించుకున్నాయి. కెమెరా పితామహుడు డాగురేకు పేటెంట్ లభించిన రోజును ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహిస్తున్నారు. పలురకాల మోడళ్లు ఫొటోగ్రఫీ ఉద్భవించి సుమారు 199 ఏళ్లవుతుంది. ఇటీవల ఫొటోగ్రపీలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆధునిక, సాంకేతిక విప్లవం ఫొటోగ్రఫీ దశ, దిశను మార్చేసింది. గతంలో ఫొటో తీసుకోవడమంటే గొప్ప అనుభూతి, సుదీర్ఘప్రక్రియ. ఇప్పుడు ప్రతి మనిషి వద్ద ఆండ్రాయిడ్ ఫోన్ రూపంలో కెమెరా ఉంది. ఫొటో తీసుకోవడం ఇప్పుడు సులువుగా మారింది. కెమెరాల్లోనూ రకరకాల ఫీచర్లతో రోజుకో మోడల్ వస్తుంది. అంతరిక్షం.. వైద్య రంగం.. ఇలా ఫొటోగ్రపీ ప్రక్రియ లేనిదే ఏ పనీ జరగని పరిస్థితి నెలకొంది. రోలికార్డ్, రైస్ ల్యాండర్, రోలీ ఫ్లెక్స్, నికాన్, కేనన్ వంటి ఎన్నో కంపెనీల కెమెరాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. రూ.వేల నుంచి రూ.లక్షల విలువైన కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ప్రజా సమస్యలకు అద్దం పడుతూ.. ఇలాఉండగా ప్రజల సమస్యలను పత్రికల ద్వారా అధికారులు, పాలకుల దృష్టికి తేవడంలో ఫొటోలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో ఫొటోల ఆవశ్యకత ఎనలేనిది. ఇటీవల కాలంలో సెల్ఫోన్ల రాకతో కెమెరాల ప్రాభవం కాస్త తగ్గినా, విలక్షణ ఫొటోలకు మాత్రం స్టూడియోలు, కెమెరాలను ఆశ్రయించక తప్పదు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా.. ఫొటోగ్రఫీ పదం గ్రాఫోన్ నుంచి పుట్టింది. గ్రాఫోన్ అంటే రాయడం, చిత్రించడం అని అర్ధం. తొలిసారి 1826లో ఫ్రెంచ్ శాస్త్రవేత్త జోసఫ్ నైసిఫర్ నిస్సీ కనిపెట్టిన తొలి కెమెరా పరికరంతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా రీల్ నుంచి డిజిటల్ పరిజ్ఞానానికి మారింది. ఫొటోగ్రఫీలో లెన్సుల ప్రవేశం తర్వాత సుదూర దృశ్యాలనూ నాణ్యత తగ్గకుండా ఫొటో తీసే విధానం అందుబాటులోకి వచ్చింది. సెల్ఫోన్లో బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక ఫొటోగ్రఫీ ఎక్కడికో వెళ్లిపోయింది. సామాజిక మాథ్యమాల్లో ఫొటోల పాత్ర కీలకంగా మారింది. ఇటీవల నాలుగు వైపులా రెక్కలతో ఆకాశంలో ఎగిరి.. చిత్రాలు, వీడియోలు తీసే డ్రోన్ కెమెరాల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఫొటోగ్రఫీలో డిజిటల్ యుగం నడుస్తోంది. డిజిటల్ యుగంలో డ్రోన్ కెమెరాలు కూడా వాడకం బాగా పెరిగింది. జిల్లాలో 140 సంవత్సరాల చరిత్ర ఫొటోగ్రఫీలో జిల్లాకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాకినాడలో చెక్కా బసవరాజు అండ్ సన్స్ 1885లో హాబీగా ఫొటోగ్రఫీని చెక్కా బసవరాజు ప్రారంభించారు. ప్రస్తుతం నాలుగు తరాలుగా ఫొటోగ్రఫీలో వారి కుటుంబం రాణిస్తోంది. కోనసీమ జిల్లాలో 19 ఫొటోగ్రాఫర్ల సంఘాలుండగా.. 1,400 మంది ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 4 వేలకు పైగా ఫొటో స్టూడియోలు ఉండగా, భారీ స్థాయిలో కెమెరా, ఫొటో ల్యాబ్స్ 20కి పైగా ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఆరు వేల మందికి పైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వ సహకారం అవసరం ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వ సహకారం అవసరం. టెక్నాలజీ అభివృద్ధి చెందడం మంచిదే కానీ, ఫొటోగ్రాఫర్ల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ల ప్రభావం మా వృత్తిపై తీవ్రంగా ఉంది. ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. – గెడ్డం సురేష్కుమార్, జిల్లా అధ్యక్షుడు, ఫొటో గ్రాఫర్ల సంఘం, కొత్తపేట, కోనసీమ జిల్లా అప్డేట్ అవ్వాల్సిందే.. ఫొటోగ్రఫీలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అలా కానివారు వృత్తిలో వెనుకబడుతున్నారు. – సంగుల దొరబాబు, ప్రధాన కార్యదర్శి, ఫొటోగ్రాఫర్ల సంఘం, మండపేట, కోనసీమ జిల్లా పసితనంలోకి జారేలా.. ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడానికి అక్షరాలు సరిపోవు. వేయి పదాలతో చెప్పలేని భావాన్ని ఒక్క కెమెరా క్లిక్తో చెప్పవచ్చు. అందరికీ అర్ధమయ్యే భాష.. మధురమైన జ్ఞాపకం ఫొటో. తీరిక వేళల్లో ప్రశాంత సమయంలో చిన్ననాటి ఫొటో ఆల్బమ్ చూసుకుంటూ.. నాటి జ్ఞాపకాల పేజీలను తిరగేస్తుంటే మెల్లగా పసితనంలోకి జారిపోతాం. పొడవాటి చొక్కాలు.. లూజు నిక్కర్లు.. బుట్టబొమ్మల్లాంటి గౌన్లు.. పొడవాటి పావడాలు.. పిలక జడలు.. ఇలా చూసుకుంటూ.. మురిసిపోతుంటే అదో అందమైన అనుభూతి కలుగుతుంది. సర్వసాధారణంగా మారి.. గతంలో కెమెరాలు ప్రత్యేకంగా తీసుకుని వెళ్లాల్సి వచ్చేంది. ఇప్పుడు ప్రతి సెల్ఫోన్లో కెమెరా సర్వసాధారణ అంశంగా మారింది. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. సెల్ఫోన్లలో కెమెరాల సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా సెల్ఫోన్ సంస్థలు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అవి మల్టీపర్పస్గా ఉపయోగపడుతుండడంతో ప్రతి ఒక్కరికీ ఫొటోలు తీయడం అలవాటుగా మారింది. అందులో సెల్ఫీలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. -
కౌలుకునేదెలా..?
సాక్షి, రాజమహేంద్రవరం: కౌలు రైతులపై కూటమి ప్రభుత్వ కనికరం కరవైంది. సీసీఆర్సీ కార్డుల జారీ నుంచి, పంట రుణాలు అందించడంలో తీరని అన్యాయం జరుగుతోంది. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం, ఆపై కూటమి సర్కారు పట్టించుకోకపోవడంతో పంట సాగుకు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన అన్నదాత సుఖీభవ సాయం కూడా సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారు. వెరసి పంట సాగుకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితి ఎదురైందని ఆవేదన చెందుతున్నారు. ఇంత చేసినా చివరకు పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసి దిగుబడులు తగ్గడం, మద్దతు ధర దక్కకపోవడంతో ఆశించిన మేర రాబడీ అందడం లేదు. వెరసి కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణాలపై బ్యాంకర్ల విముఖత కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు విముఖత చూపుతున్నారు. కొన్ని బ్యాంకులైతే తాము ఇవ్వలేమంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇందుకు పలు కారణాలను స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కౌలుదారు సాగు చేస్తున్న భూములపై అసలైన యజమానులు రుణాలు తీసుకోవడంతో, ఒకే భూమిపై యజమానికి, అటు కౌలు రైతుకు రుణాలివ్వడం అసాధ్యమన్న వాదన బ్యాంకర్ల నుంచి వినిపిస్తోంది. భూ యజమానులు రుణాలు తిరిగి చెల్లిస్తే.. వాటి స్థానంలో కౌలు రైతులకు మంజూరు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని అంటున్నారు. వెరసి జిల్లాలో కౌలు రైతుల రుణాల లక్ష్యం ముందుకు కదలడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్ సాగు ప్రారంభమైంది. నాట్ల ప్రక్రియ సింహభాగం పూర్తయింది. పంట సాగుకు పెట్టుబడుల ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి కీలక సమయంలో ఆర్థిక ఆసరా అవసరం. రుణాలు మంజూరు చేస్తే పంట సాగుకు భరోసా ఉంటుంది. క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కానరావడం లేదు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో తీవ్ర వైఫల్యం చెందిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్యం రూ.307 కోట్లు జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 1,11,000 కౌలు రైతులకు కార్డులు అందజేసి, రూ.307 కోట్ల పంట రుణాలు లక్ష్యంగా నిర్దేశించారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం గడప దాటడం లేదు. ఇప్పటి వరకు కేవలం రూ.13 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. పెండింగ్లో ఉన్న లక్ష్యం కోసం కుస్తీ పడుతున్నారు. ఒక్క పెరవలి మండలం మినహా, మిగిలిన మండలాల్లో రూ.కోటి రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవంటే పరిస్థితి ఏమిటో అవగతమవుతోంది. ఇలాగైతే తాము సాగు ఎలా చేయాలన్న ప్రశ్న రైతుల నుంచి ఉత్పన్నమవుతోంది. సగం కార్డులే జారీ..! కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల జారీలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లావ్యాప్తంగా 1.50 లక్షల మంది కౌలు రైతులున్నట్టు సమాచారం. ఏటా వీరు భూములు కౌలుకు తీసుకుని పంట సాగు చేస్తున్నారు. భూమి యజమాని సమ్మతితోనే సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తారు. 2025–26లో జిల్లావ్యాప్తంగా 1,11,000 మంది కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయాలని వ్యవసాయ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం 57,328 మందికి మాత్రమే కార్డులు జారీ చేయగలిగారు. 52.12 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. మిగిలిన లక్ష్యాన్ని అధిగమించాల్సి ఉంది. నల్లజర్ల, రంగంపేట, రాజానగరం మండలాల్లో లక్ష్యం 30 శాతానికి మించలేదు. సీసీఆర్సీ కార్డు జారీ కావాలంటే రూ.10 స్టాంపుపై రాసుకున్న అగ్రిమెంట్పై భూ యజమాని, కౌలుదారు ఇద్దరూ సంతకాలు చేయాలి. వీఆర్ఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి దీనికి గ్రీన్సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఈ ప్రక్రియలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. వీఆర్వోలు నాన్చివేత ధోరణి అవలంబిస్తుండటంతో రైతులకు సకాలంలో రుణాలందడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా భావించిన కొందర వీఆర్వోలు రూ.వెయ్యి వరకు దండుకుంటున్నట్టు తెలిసింది. అందని ‘అన్నదాత సుఖీభవ’ కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘అన్నదాత సుఖీభవ’ నిధులు కౌలు రైతులకు అందిన దాఖలాలు లేవు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా 57,328 మందికి సీసీఆర్సీ కార్డులు మంజూరయ్యాయి. ఇందులో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.7 వేల సుఖీభవ నిధులు సగం మందికి పైగా జమ అయిన దాఖలాలు లేవన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తడిసిమోపెడవుతున్న కౌలు కౌలు రైతులకు కౌలు సొమ్ము తడిసిమోపెడవుతోంది. యజమానులు ప్రతి ఏటా కౌలు పెంచుకుంటూ పోతున్నారు. ఎకరానికి 45 బస్తాల ధాన్యం పండితే.. అందులో భూ యజమానికి 30 బస్తాల ధాన్యం ఇవ్వాల్సి ఉంటోంది. మిగిలింది కౌలు రైతులకు వెళుతోంది. వాటిలోనే సాగు ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ పరిణామం ఇబ్బందికరంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో.. కాగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు రూ.12,500 అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 అందజేశారు. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకూ అందించింది. దీర్ఘకాలంగా దేవస్థానం భూములు కౌలుకు తీసుకున్న రైతులకూ లబ్ధి చేకూరింది. జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు. కౌలు రైతుపై కూటమి సర్కార్ దా’రుణం’ పూర్తి స్థాయిలో అందని పంట రుణాలు జిల్లావ్యాప్తంగా రూ.307 కోట్ల లక్ష్యం ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.13 కోట్లే.. రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని బ్యాంకర్లు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు సైతం అందని వైనం సీసీఆర్సీ కార్డుల జారీలోనూ నిర్లక్ష్యం జిల్లాలో పంట రుణాలిలా.. మండలం రుణ లక్ష్యం మంజూరు (రూ.కోట్లలో) (రూ.కోట్లలో) రాజమండ్రి 4.75 0.70 రాజానగరం 27.50 0.64 కడియం 11.90 0.25 కోరుకొండ 27.90 0.57 సీతానగరం 16.75 0.71 గోకవరం 16.90 0.62 అనపర్తి 17.10 0.81 బిక్కవోలు 18.50 0.80 రంగంపేట 16.90 0.69 కొవ్వూరు 16.75 0.67 చాగల్లు 16.40 0.88 దేవరపల్లి 17.60 0.87 గోపాలపురం 15.10 0.96 తాళ్లపూడి 12.45 0.97 నిడదవోలు 18.70 0.74 ఉండ్రాజవరం 16.40 0.87 పెరవలి 17.10 1.03 నల్లజర్ల 18.80 0.74 కౌలు రైతుల గుర్తింపులో విఫలం కౌలు రైతుల గుర్తింపు, కార్డుల జారీ, రుణాల మంజూరులో కూటమి ప్రభుత్వం విఫలమైంది. కౌలు రైతులను గుర్తించడంపై దృష్టి పెట్టడం లేదు. ఇందుకు గ్రామసభల ఏర్పాటు కలగానే మారింది. కౌలు రైతులకు రుణాలు ఇప్పించడం లేదు. భూమి లేకుండా, కౌలుకు భూమి తీసుకుని సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకూ కౌలు కార్డులో పాటు, అన్నదాత సుఖీభవ, పంట రుణాలు మంజూరు చేయాలి. – కె.శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏపీ రైతు సంఘం రుణాల ముంజూరుకు కృషి కౌలు రైతులకు పంట రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ప్రతి వారం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి, రుణాల మంజూరుపై నెలకొన్న ఇబ్బందులపై చర్చిస్తున్నాం. అర్హులైన ప్రతి కౌలు రైతుకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరుతున్నాం. సీసీఆర్సీ కార్డులు సైతం అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటాం. – ఎస్.మాధవరావ్, జిల్లా వ్యవసాయ అధికారి -
పులసా.. గోదారంటే అలుసా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘గోదాట్లో నీరు ఎరుపెక్కిందంటే నా సామిరంగా.. సముద్రం నుంచి పులస లగెత్తుకు రావాల్సిందే. వెంటనే పుస్తెలు అమ్మయినా పులస పులుసు తినాల్సిందే’ అంటుంటారు గోదావరి జిల్లాల వాసులు. ఏడాదికి ఒకసారి మాత్రమే అదికూడా గోదావరికి వరద నీరు వచ్చినప్పుడు మాత్రమే కనిపించే పులసలు ఈసారి మొహం చాటేస్తున్నాయి. గోదావరికి వరదలు వచ్చి ఎర్రనీరు పోటెత్తుతున్నా పులస జాడ లేదు. గత సీజన్లతో పోలిస్తే పులసలు ఎప్పుడూ ఈ స్థాయిలో తగ్గిపోలేదని ఇక్కడ మత్స్యకారులు మదనపడుతున్నారు. వాస్తవానికి జూలై మొదటి వారం నుంచే పులసలు గోదావరిలో సందడి చేస్తాయి. ఆగస్టు మూడోవారం వచ్చేసినా వాటి జాడ ఎక్కడా కనిపించడం లేదు. ఈ నెలాఖరుకై నా రాకుండా పోతాయా అని గోదావరి జిల్లాల జనం ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడు ఈ సీజన్లో ఇప్పటివరకూ ముచ్చటగా మూడంటే మూడు పులసలు మాత్రమే మత్స్యకారులకు దొరికాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం పరిసర ప్రాంతాల్లో 20 రోజుల వ్యవధిలో మత్స్యకారుల వలలకు చిక్కాయి. కిలో పులస రూ.20 వేల నుంచి రూ.26 వేల వరకూ.. అది కూడా వేలంలో సొంతం చేసుకుంటున్నారు. కొందరైతే మత్స్యకారులకు రూ.5 వేలు, రూ.10 వేల చొప్పున చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు. ఒకప్పుడు కేజీ నుంచి మూడున్నర కేజీలు, కొన్ని 4, 5 కేజీలున్న పులసలు కూడా మత్స్యకారుల వలకు చిక్కేవి. నాలుగైదు కేజీలున్న పులసలు ఐదారు వలలో పడ్డాయంటే వారి పంట పండినట్టే. నాలుగైదు కేజీల పులస రూ.10 వేల నుంచి రూ.15 వేలు పలికేది. గోదావరి తీరంలో ఒకప్పుడు యానాం, భైరవపాలెం, కోటిపల్లి, ఎదుర్లంక, రావులపాలెం, సిద్ధాంతం తదితర ప్రాంతాల్లో పులసలు విరివిగా లభించేవి. మత్స్యకారులు అర్ధరాత్రి నుంచి తెల్లారే వరకూ ఈ ప్రాంతాల్లోనే వేటాడేవారు. అటువంటిది ఇక్కడ కూడా పులసలు దొరక్క వారు నిరాశతో ఇళ్లకు తిరిగొచ్చేస్తున్నారు. గతంలో వరదల సీజన్ మొదలయ్యాక ప్రతి నెలా 40 టన్నులకు తక్కువ కాకుండా పులసలు పడేవన్నది మత్స్య శాఖ అంచనా. ప్రస్తుతం ఇందులో 10 శాతం కూడా ఈసారి కనిపించడం లేదని అంటున్నారు. చమురు సంస్థల కార్యకలాపాలతో.. పులసలు పునరుత్పత్తి కోసం బంగాళాఖాతంలో 11 వేల నాటికల్ మైళ్లు ప్రయాణిస్తాయి. సాగర సంగమం వద్ద ఉండే మొగల నుంచి గోదావరి నదిలోకి ఇవి ప్రవేశిస్తాయి. సంతానోత్పత్తి కోసం సముద్రం నుంచి వచ్చే ఇలస (హిల్స–విలస) చేప ఏటికి ఎదురీదుతూ గోదావరిలోకి వచ్చేసరికి పులసగా రూపాంతరం చెందుతుంది. అయితే.. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్లోని ఆఫ్షోర్లో జరుగుతున్న డ్రెడ్జింగ్తో ధ్వని కాలుష్యం పెరిగిపోయింది. గోదావరి నదీ ముఖద్వారం (సీ మౌత్) వద్ద రిలయన్స్, ఓఎన్జీసీ తదితర చమురు సంస్థలు నిర్వహిస్తున్న డ్రెడ్జింగ్ పనులు పులసల రాకకు ప్రతిబంధకంగా మారాయి. డ్రెడ్జింగ్ వల్ల నీటిలో సంభవించే కంపనాలు, శబ్దాల వల్ల పులసలు గోదావరి నదిలోకి రావడం లేదు. ఏపీ తీరం వైపు రావాల్సిన పులసలు ఒడిశా, బెంగాల్ వైపు వెళ్లిపోతున్నాయి. యానాం సమీపాన గాడిమొగ, భైరవపాలెంతో పాటు అంతర్వేది, కరవాక సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక, ఆక్వా వ్యర్థాలు గోదావరి నదిలో కలుస్తున్నాయి. ప్రధానంగా సల్ఫర్, అమ్మోనియా, లెడ్, పాదరసం ఇతర కర్బనాలు నదిలో కలుస్తున్నాయి. ఆక్వా సాగులో వినియోగించే యాంటీబయోటిక్స్, పటిక (ఆలం) వంటివి కలుస్తూండటంతో పులస గోదావరి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ వైపు కన్నెత్తి చూడని జలపుష్పం ఒడిశా, బెంగాల్ వైపు పయనం జిహ్వ జివ్వున లాగేస్తున్నా కానరాని ఆచూకీ మూసుకుపోయిన సముద్ర మొగలు కేజీ బేసిన్లో చమురు కార్యకలాపాలు.. ప్రాణభయమూ మరో కారణం ఒకప్పుడు నాలుగున్నర కేజీలుండే పులస ఇప్పుడు కిలో దొరకడమే గగనం -
ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్
మూడు కిలోల గంజాయి స్వాధీనం రాజోలు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చినట్టు సీఐ నరేష్కుమార్ ఆదివారం తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామానికి చెందిన చవ్వాకుల నితీష్ అలియాస్ బంటి ఇంట్లో మూడు కిలోల గంజాయిని మలికిపురం ఎస్సై పీవీవీ సురేష్ గుర్తించారు. రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నితీష్తో పాటు, రాజమహేంద్రవరం గాజుల వీధికి చెందిన అమిటి ప్రశాంత్కుమార్, తాడి హరీష్బాబు(పడమటిపాలెం), కోరుకొండ మనోజ్(బట్టేలంక), భూపతి దిషోన్కుమార్(చింతలమోరి), గాడా శ్యాంసన్(కేశనపల్లి)ని అరెస్ట్ చేశారు. వీరిలో చవ్వాకుల నితీష్, అవిటి ప్రశాంత్కుమార్, తాడి హరీష్బాబుపై గతంలో మారేడుమిల్లి పోలీస్స్టేషన్లో గంజాయి కేసు నమోదైంది. కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆదేశాల మేరకు రీ–విజిట్ కార్యక్రమంలో భాగంగా గంజాయి కేసుల్లో పాత నిందితులను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఎస్సై సురేష్కు వచ్చిన సమాచారంతో, గంజాయి విక్రయిస్తున్న నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో.. చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. శ్రీఆపరేషన్ సేవ్ క్యాంపస్శ్రీ పేరుతో విద్యాసంస్థల్లో ఈగిల్ క్లబ్బులు ఏర్పాటు చేసి, శ్రీడ్రగ్స్ వద్దు బ్రోశ్రీ నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సీఐ నరేష్కుమార్ తెలిపారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
● రూ.9.80 లక్షల విలువైన సొత్తు స్వాధీనం ● పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు అన్నవరం: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కాకినాడ జిల్లా అన్నవరం పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆదివారం రాత్రి విలేకరులకు వివరాలు తెలిపారు. అన్నవరం, తుని పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల పలు దొంగతనాలు జరగడంతో, ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు పర్యవేక్షణలో అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన అడపా జోగాఅమర్ గంగాధర్, అల్లూరి జిల్లా రంపచోడవరానికి చెందిన అడపా సూర్యచంద్రపై అనుమానంతో పోలీసులు నిఘా ఉంచారు. ఆదివారం ఉదయం వారిద్దరూ మండపాం సెంటర్లో అనుమానాస్పదంగా తచ్చాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన నేరాలను వారు అంగీకరించారు. వారిని అరెస్ట్ చేసి, వారిచ్చిన సమాచారంతో రూ.9.80 లక్షల విలువైన 500 గ్రాముల వెండి వస్తువులు, అమ్మవారి గుడిలో అపహరించిన రోల్డ్గోల్డ్ హారం, మూడు బుల్లెట్లు, ఆరు మోటార్ బైకులు, నాలుగు స్కూటీలు, ఎల్ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై హైదరాబాద్ పోలీస్స్టేషన్లో రెండు, విశాఖపట్నం జిల్లా అరిలోవ పోలీస్స్టేషన్లో ఒకటి, అన్నవరం పోలీస్స్టేషన్లో ఎనిమిది, తుని రూరల్ పోలీస్స్టేషన్లో మూడు, ప్రత్తిపాడు, తుని టౌన్ పోలీస్స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైనట్టు డీఎస్పీ వివరించారు. వీరిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు చెప్పారు. సమావేశంలో ప్రత్తిపాడు సీఐ సూరిఅప్పారావు, ఎస్సై శ్రీహరిబాబు, అడిషనల్ ఎస్సై ప్రసాద్ పాల్గొన్నారు. -
కూలీలపై అడవి పంది దాడి
నలుగురికి గాయాలు ఐ.పోలవరం: గ్రామ పరిధిలో వరి పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న నలుగురు కూలీలపై అడవి పంది దాడి చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గాయపడిన నలుగురినీ టి.కొత్తపల్లి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు వారి బంధువులు తెలిపారు. గాయపడిన వారిని దంగుడుబియ్యం రాజారావు, గుత్తుల త్రివేణి పద్మావతి, బొలిశెట్టి రాంబాబు, దంగేటి వెంకటరెడ్డిగా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన అధికారులు.. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఇలాఉండగా పలువురు గ్రామస్తులు శ్రమించి అడవి పందిని బంధించారు. సాధారణంగా ఈ ప్రాంతంలో అడవి పందుల సంచారం చాలా తక్కువ. సమీపంలో ఉన్న మడ అడవుల నుంచి అడవి పంది ఇక్కడకు చేరుకున్నట్టు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో తీర ప్రాంతంలోని సరుగుడు తోటల్లో వీటి ఉనికిని గుర్తించినట్టు స్థానికులు చెబుతున్నారు. ముగిసిన సీబీఎస్ఈ యోగా పోటీలు బాలాజీచెరువు (కాకినాడ): సౌత్ జోన్ సీబీఎస్ఈ యోగా పోటీలు స్థానిక లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం ముగిశాయి. ఏపీ, తెలంగాణతో పాటు, తమిళనాడు, పాండిచ్చేరికి చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సంప్రదాయ యోగా, ఆర్టిస్టిక్, రిథమిక్ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు స్కూల్ డైరెక్టర్ సుగుణారెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వందనబొహ్రా, యోగా ట్రైనర్ సీహెచ్ సుధ పాల్గొన్నారు. -
విలసలే లేవు.. ఇక పులసలెక్కడివి?
సముద్రంలో విలసలు గోదావరికి వస్తేనే కదా పులసలుగా మారేది. ఇప్పుడు సముద్రం నుంచి గోదావరి వైపు అసలు విలసలే రావడం లేదు. ఒకప్పుడు జూలై వచ్చిందంటే అర్ధరాత్రి వేటకు వెళ్తే తెల్లారేసరికి 10, 15 పులసలతో తిరిగొచ్చే వాళ్లం. ఇప్పుడు ఒకట్రెండు కూడా దొరకడమే గగనమైపోతోంది. గోదావరిలో లభించే పులసల కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. ఇప్పుడు పులసల కోసం జనం వస్తున్నా నిరాశతో వెనుదిరిగిపోతున్నారు. గోదావరి, సముద్రం కలిసే నదీ ముఖద్వారం వద్ద యానాం సమీపాన భైరవపాలెం వద్ద చమురు కంపెనీలు గ్యాస్ పైప్లైన్ వేసే సమయంలో తవ్వకాల వల్ల ఇసుక మేటలు వేశాయి. ఈ మేటలు తొలగించడంతో పాటు కేజీ బేసిన్లో డ్రెడ్జింగ్పై నియంత్రణ ఉండాలి. – పాలేపు పోసియ్య, మత్స్యకారుడు, యానాం -
వేదవిహిత జీవనమే గుళ్లపల్లి గమ్యం
● సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ ● సీతారామచంద్ర ఘనపాఠికి రాజా–లక్ష్మి ఫౌండేషన్ అవార్డు రాజమహేంద్రవరం రూరల్: వేద పండితులు ఎందరో ఉన్నారు, కానీ వేదవిహిత జీవనమే జీవనయానంగా చేసుకున్న వారిలో గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి ప్రముఖులు అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరులో ఉన్న దత్తాత్రేయ వేద విద్యాలయం గురుకులం ప్రాంగణంలో గురుకులం గౌరవాధ్యక్షుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠికి రాజా–లక్ష్మి ఫౌండేషన్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ, తాను వేద ధర్మాలను ఆచరిస్తూ, ఎందరో వేద పండితులను గురుకులం ద్వారా తయారు చేస్తున్న గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠికి ఈ అవార్డు రావడం ముదావహమన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, సంప్రదాయంలో పెద్దలను బ్రహ్మశ్రీ, వేదమూర్తులు అని సంబోధించడం పరిపాటి అని, మూర్తీభవించిన వేదమూర్తులు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి అని కొనియాడారు. అత్యంత సంప్రదాయబద్ధంగా గురుకులాన్ని నిర్వహిస్తూ, వేదమాతకు ఎనలేని సేవలను అందిస్తున్నారని అభినందించారు. ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకట్రావు మాట్లాడుతూ, ఇప్పటి వరకు పురస్కారాలను చెన్నయ్లోనే అందజేశామని, గుళ్లపల్లి అనుష్ఠాన విధులకు భంగం కలగరాదనే ఉద్దేశంతో ఈ ఏడాది రాజమహేంద్రవరంలో అవార్డు ప్రదానం చేస్తున్నామన్నారు. మహాపోధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ, సామవేదం షణ్ముఖశర్మ తదితర ప్రముఖుల చేతులమీదుగా రూ.లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో గుళ్లపల్లికి అవార్డును అందజేశారు. -
ఉత్సాహంగా ఉమ్మడి జిల్లా ఆర్చరీ పోటీలు
పిఠాపురం: జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఇండియన్ రౌండ్ ఆర్చరీ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రాజోలు, కాకినాడ, తుని, పిఠాపురం నుంచి సుమారు 60 మంది ఇండియన్ రౌండ్ ఆర్చర్లు వివిధ విభాగాల్లో పాల్గొన్నారు. పిఠాపురం క్రీడాకారులు ఓవరాల్ తొలి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో కాకినాడ, మూడో స్థానంలో అమలాపురం ఆర్చర్లు గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పోటీలు ప్రారంభించి, క్రీడాకారులకు పతకాలు అందజేశారు. అనంతరం కాకినాడ జిల్లా బాక్సింగ్ సంఘ అధ్యక్షుడు ఇమిడిశెట్టి నాగేంద్రకుమార్, పలువురు నాయకులు బహుమతీ ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలుగా పి.కృష్ణ, కె.చిన్నబ్బాయి, ఎం.గణేష్, జె.ప్రసాదరావు వ్యవహరించారు. డీఎస్డీవో బి.శ్రీనివాస్ కుమార్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణ, పి.లక్ష్మణరావు, ఏపీ ఒలింపిక్ సంఘ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం, జిల్లా ఆర్య వైశ్య సంఘ కన్వీనర్ బోడ సతీష్ పాల్గొన్నారు. -
ఫొటో జర్నలిస్టులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు సీనియర్ ఫొటో జర్నలిస్టులకు పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ గోదావరి బెస్ట్ ఫొటో జర్నలిస్ట్ అవార్డు–2025లను మంగళవారం అందించనుంది. ఈ మేరకు సీనియర్ ఫొటో జర్నలిస్టులు జీవీవీ ప్రసాద్ (సాక్షి), ఎస్బీ రాజేశ్వరరావు (ఆంధ్రజ్యోతి)ను ఎంపిక చేసినట్టు సంస్థ అధ్యక్షుడు అద్దంకి రాజా యోనా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖుల చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందించనున్నామన్నారు. క్లిష్టమైన సామాజిక, పర్యావరణ, సాంస్కృతిక పరిస్థితులు, ప్రజా సమస్యలను ఎత్తిచూపడం ద్వారా సమాజంలో మార్పు తేవడానికి కృషి చేస్తున్నందుకు ఈ పురస్కారాలను అందిస్తున్నామని రాజా యోనా తెలిపారు.ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా సత్యనారాయణరెడ్డిరాజమహేంద్రవరం రూరల్: జిల్లాకు చెందిన ఎండీ సత్యనారాయణ రెడ్డి ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్ను వెంకటరావు (పార్వతీపురం మన్యం జిల్లా)ను ఎన్నుకున్నట్టు సత్యనారాయణరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రభుత్వం పీఆర్సీ, డీఏ బకాయిలు ఇవ్వాలని, ఉపాధ్యాయులపై పని ఒత్తిడి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగేలా అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తప్పక ఉండాలని, టెన్త్ విద్యా బోధనకూ తెలుగు మీడియం ఉండాలన్నారు. పరీక్షలకు బుక్లెట్ విధానం విపరీతమైన పనిభారం పెంచినట్టు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారన్నారు. త్వరలో వీటన్నింటిపై సమగ్ర నివేదికతో విద్యా శాఖ మంత్రిని కలుస్తామని తెలిపారు.తులాభారానికి త్రాసు సమర్పణఅయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయానికి తోటపేటకు సత్తి సుబ్బారెడ్డి, సీతారత్నం దంపతులు ఆదివారం తులాభారం నిమిత్తం ఇత్తడి త్రాసును సమర్పించారు. ఈ తక్కెడను ఆలయ అర్చకుడు సత్తిబాబుకు అందజేశారు. దీని విలువ రూ.1.50 లక్షలు కాగా, దాతను అర్చకులు సత్కరించి, స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.లోవకు భక్తుల తాకిడి– రూ.4.33 లక్షల ఆదాయంతుని రూరల్: జోరువానలోను తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 13 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో వంటలు, భోజనాలు చేసేందుకు భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. టార్పాలిన్ను కట్టుకుని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,43,280, పూజా టికెట్లకు రూ.1,27,400, కేశఖండనశాలకు రూ.12,800, వాహన పూజలకు రూ.4,350, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.96,216, విరాళాలు రూ.49,117 వెరసి మొత్తం రూ.4,33,163 ఆదాయం సమకూరినట్టు ఈఓ తెలిపారు. -
కలిసొచ్చిన ముహూర్తం
● కడియపులంక పువ్వుల మార్కెట్కు కళ ● ఆకాశాన్నంటిన ధరలు ● బంతి కిలో రూ.150 కడియం: కడియపులంకలోని అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్కు ముహూర్తం కలిసొచ్చింది. శుభకార్యాలకు ఈ నెలలో ఆదివారంతో ముహూర్తాలు అయిపోవడంతో.. నాలుగు రోజులుగా మార్కెట్లో పువ్వుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా బంతి పువ్వుల ధర కిలో రూ.150 వరకు పలకడంతో విస్తుపోతున్నారు. శుభకార్యాల సందర్భంగా అలంకరణలకు ఇతర ప్రత్యేక రకాల పువ్వులు లేకపోవడంతో బంతి పువ్వులనే ప్రధానంగా వినియోగిస్తున్నారు. దీంతో వీటి ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు స్థానికంగా పువ్వుల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్థానికంగా పువ్వుల దిగుబడి అంతగా ఉండదని నర్సరీ రైతులు చెబుతున్నారు. జాజులు, లిల్లీలు, మల్లెలు, కనకాంబరం వంటి రకాలు మాత్రమే ఇక్కడ ప్రస్తుతం ఉత్పత్తి అవుతాయని, బంతి, చామంతి వంటి ముఖ్యమైన పువ్వులను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. గతంలో తగిన ధరల్లేక కాలువల్లో పారబోసిన బంతి పువ్వులకు ఇప్పుడు డిమాండ్ భారీగా పెరగడం సాగులో అనిశ్చితికి నిదర్శనమంటున్నారు. నాలుగు రోజులుగా.. ఒకవైపు శ్రావణ మాసం, మరోవైపు ముహూర్తాల నేపథ్యంలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కడియపులంక పువ్వుల మార్కెట్లో ధరలు భారీగా పెరిగాయి. మార్కెట్కు పువ్వులు వచ్చిన వెంటనే అయిపోయాయి. ఆదివారం మధ్యాహ్నం సమయానికే పువ్వులు లేకపోవడంతో మార్కెట్ నిర్మానుష్యంగా మారిపోయింది. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దాదాపు పది టన్నులకు పైగా బంతి, చామంతి పువ్వులు ఇక్కడకు వస్తే, గంటల వ్యవధిలోనే అవన్నీ అమ్ముడయ్యాయని వ్యాపారులు తెలిపారు. ఆదివారంతో వివాహాలు, గృహ ప్రవేశాలకు ముహూర్తాలు అయిపోయాయని, తిరిగి సెప్టెంబర్ 23 తర్వాతే ముహూర్తాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. చివరి ముహూర్తాలు కావడంతో పువ్వులకు భారీగా డిమాండ్ ఏర్పడిందంటున్నారు. ధరలు ఇలా.. కాగా కడియపులంక పువ్వుల మార్కెట్లో ఆదివారం స్థానికంగా లభించే లిల్లీ పువ్వులు కిలో రూ.500, మల్లెలు రూ.1300–రూ.1500, జాజులు రూ.700–రూ.900 పలికాయి. అలాగే కర్ణాటక నుంచి వచ్చిన బంతి పువ్వులు రూ.120–రూ.150 వరకు విక్రయించారు. తమిళనాడు చామంతులు (తడి పువ్వులు) కిలో రూ.250–రూ.300, పొడి పువ్వులు రూ.350, వైట్ చామంతి రూ.250, నీలం చామంతి రూ.270, స్టార్ గులాబీలు కిలో రూ.240, కనకాంబరం బారు రూ.220 పలికాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్తకొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ, పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
ఉచిత బస్సు పేరుతో మోసం
చాగల్లు: ఉచిత బస్సు ప్రయాణం పేరుతో రాష్ట్రంలో మహిళలను సీఎం చంద్రబాబు మరోసారి మోసం చేశారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ సూపర్ సిక్స్లో భాగంగా సీ్త్ర శక్తి పథకాన్ని ఎన్నో ఆంక్షలతో అమలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత అమలు చేస్తున్న ఈ పథకానికి ఎన్నో మెలికలు పెట్టారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ ప్రకారం అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, కానీ ఇప్పుడు కొన్ని బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారన్నారు. ఆర్టీసీలో 16 రకాల బస్సులు ఉంటే కేవలం ఐదు రకాల బస్సుల్లో, అది కూడా షరతులతో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చారన్నారు. దీని వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఏమాత్రం ఉపయోగం ఉండదన్నారు. కూటమి ప్రభుత్వం అంటే కోతల ప్రభుత్వంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ నాలుగేళ్లలో కేవలం మహిళలకు సుమారు రూ.8 వేలు కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయిస్తుండగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మహిళలకు వివిధ పథకాల ద్వారా సుమారు రూ.1.26 లక్షల కోట్లు అందించిందన్నారు. రాష్ట్రంలో వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసిందని, ఆరోగ్యశ్రీని అటకెక్కించిందని, రైతన్నలకు పెట్టుబడి సాయం అందించకుండా అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడంతో 9,280 మంది ఆపరేటర్లు వీధుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉత్సాహంగాహ్యాండ్ బాల్ పోటీలు
రాజానగరం: దివాన్ చెరువులోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్లో రెండు రోజులుగా జరుగుతున్న సీబీఎస్ఈ సౌత్ జోన్ –1 హ్యాండ్ బాల్ పోటీలలో క్రీడాకారులు హోరాహోరిగా తలపడుతున్నారు. దీనిలో భాగంగా శనివారం జరిగిన పోటీలలో అండర్ – 14 విభాగంలో చేరక్ ఇంటర్నేషనల్ (హైదరాబాద్), ఆర్జీఎం ఇంటర్నేషనల్ స్కూల్ (నంద్యాల), హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హైదరాబాద్), ఏకశిల హైస్కూల్, అలాగే అండర్ – 17 విభాగంలో రైల్వే హయ్యర్ సెకండరీ స్కూల్ (మధురై), వెలమలై విద్యాలయం (చైన్నె), అండర్– 19 విభాగంలో వెలమలై విద్యాలయం (చైన్నె) విద్యార్థులు విజయం సాధించారు. పోటీలకు డాక్టర్ ఎస్.గోపికృష్ణ రిఫరీగా వ్యవహరించారు. సోమవారం వరకు జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ నుంచి 1200 మంది క్రీడాకారులు, 120 మంది కోచ్లు, మేనేజర్లు హాజరయ్యారని స్పోర్ట్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.స్వామి తెలిపారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ విజయ ప్రకాష్, ప్రిన్సిపాల్ విమల, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కూలీలపై అడవి పంది దాడి ఐ.పోలవరం: గ్రామ పరిధిలోని పొలాల్లో పనిచేస్తున్న కూలీలపై శనివారం అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో దంగుడుబియ్యం రాజారావు, గుత్తుల త్రివేణి పద్మావతి, బొలిశెట్టి రాంబాబు, దంగేటి వెంకట్రావుకు గాయాలయ్యాయి. వారిని టి.కొత్తపల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వీరిలో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. చెరువులో పడి వ్యక్తి మృతి గోపాలపురం: ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై పి.మనోహర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గంగోలు పంచాయతీ పరిఽఽధిలోని రాంపాలెంకి చెందిన ఏసులంక బుల్లి వెంకన్న (39) తన పొలానికి వెళ్లే క్రమంలో బాలింక చెరు వు దాటుతూ ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో చెరువు లో మునిగి చనిపోయా డు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విక్రమార్కులు
● డీఎస్సీలో అభ్యర్థుల ప్రతిభ ● ఉత్తమ ఫలితాల సాధన ● మెరిట్ లిస్ట్ కోసం ఎదురు చూపులు ● ఉపాధ్యాయ కొలువుపై ఆశలు ● ఉమ్మడి జిల్లాలో 1,241 పోస్టులు రాయవరం: ఇటీవల జరిగిన డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) 2025 పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో చాలా మంది మంచి మార్కులు సాధించారు. తమకు తప్పకుండా ఉపాధ్యాయ కొలువు లభిస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలో మిగిలిన వారికి ఎన్ని మార్కులు వచ్చాయన్న అంశంపై ఆరా తీస్తున్నారు. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన స్కోర్ కార్డులను ఎస్సీఈఆర్టీ విడుదల చేసిన నేపథ్యంలో టీచర్ కొలువు దక్కడంలో ఎవరికెంత అవకాశం ఉందన్న అంశంపై నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు అంచనాలు వేసుకుంటున్నారు. తాము పొందిన మార్కులకు ఉద్యోగం వస్తుందా అనే ఆలోచనలో ఉన్నారు. ఇంకా మెరిట్ లిస్ట్ రానందున తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి మార్కులపై ఆరా తీస్తున్నారు. ఇదీ పరిస్థితి పూర్వపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ తదితర యాజమాన్యాలకు సంబంధించి 1,241 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 63,004 దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 38,617 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీటిలో ఎస్జీటీ పోస్టులు 423, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 818 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో అధికంగా ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత సోషల్, బయాలజీ ఖాళీలు ఉన్నాయి. మిగిలిన సబ్జెక్టులు కేవలం రెండంకెల్లో ఖాళీలున్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ విభాగంలో ఎస్ఏ (పీఎస్) 03, ఎస్ఏ (బీఎస్) 04, ఎస్ఏ (పీఈ) 01, ఎస్జీటీ పోస్టులు 104 ఖాళీలున్నాయి. ఇవి కాకుండా జోన్–2 పరిధిలో ఏపీ రెసిడెన్షియల్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ / ట్రైబల్ (గురుకులం) యాజమాన్య పాఠశాలల్లో 348 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 03, పీఈటీ 24 పోస్టులు భర్తీ చేయనున్నారు. మెరిట్ లిస్ట్ కోసం.. నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మెరిట్ జాబితా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 1,241 ఖాళీలకు డీఎస్సీని ఈ ఏడాది ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు 10 నెలల అనంతరం ఈ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పరీక్షలు రాసి స్కోర్ కార్డులు పొందిన వారు మెరిట్ లిస్ట్ ప్రకటనకు వేచి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ పూర్వపు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి రావాల్సి ఉంది. ఆ జాబితా వచ్చిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. అయితే సాంకేతిక కారణాలతో మెరిట్ లిస్ట్ విడుదలలో జాప్యం చోటుచేసుకుంటున్నట్లు సమాచారం. ఆ జాబితా వచ్చిన తర్వాతే ఉద్యోగం వచ్చే విషయంపై అభ్యర్థులకు స్పష్టత వస్తుంది.ఖాళీల వివరాలు కేటగిరి ప్రభుత్వ/జెడ్పీ/మున్సిపల్ మేనేజ్మెంట్లు ఎస్జీటీ 423 ఎస్ఏ తెలుగు 65 ఎస్ఏ హిందీ 78 ఎస్ఏ ఇంగ్లీష్ 95 ఎస్ఏ గణితం 64 ఎస్ఏ పీఎస్ 71 ఎస్ఏ బయాలజీ 103 ఎస్ఏ సోషల్ 132 ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 210 మొత్తం 1,241 -
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శనివారం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్న రాముడు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ 1909 ఆగస్టు 16న శ్రీకాకుళం జిల్లా బారువ గ్రామంలో జన్మించిన గౌతు లచ్చన్న.. చిన్న వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రవేశించారన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిలో చురుకుగా పాల్గొని, బెర్హంపూర్, రాజమండ్రి జైళ్లలో కఠినమైన శిక్షలను అనుభవించారన్నారు. ఆయన జీవితాంతం వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రైతుల సంక్షేమం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశారన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి, గాంధేయవాదిగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి.శశాంక, డీఆర్ఓ సీతారామమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
భక్తవత్సలా గోవిందా
● వాడపల్లికి పోటెత్తిన భక్తులు ● ఒక్కరోజే రూ.60 లక్షల ఆదాయం కొత్తపేట: భక్తవత్సలా గోవిందా.. భాగవతాప్రియ గోవిందా అంటూ ఆ శ్రీనివాసుడిని స్మరిస్తూ భక్తజనం మురిసింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, భారీ క్యూ లైన్లలో బారులు తీరారు. అనేక మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నసమారాధన జరిపారు. భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం ద్వారా దేవస్థానానికి ఒక్కరోజే రూ.60,17,243 వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రించి, ఆలయ ఆవరణలో శాంతిభద్రతలను పర్యవేక్షించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది. కాగా.. ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి నిర్వహించిన బాలికల శాసీ్త్రయ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. న్యూఢిల్లీ ఫౌండేషన్ ఫోర్ డెవలప్ ఇండియా కళాశాలకు చెందిన కళాకారులు కూచిపూడి నృత్యం చేశారు. -
వైఎస్సార్ సీపీలో ముగ్గురికి పదవులు
రాజమహేంద్రవరం రూరల్/దేవరపల్లి: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ముగ్గురికి పార్టీలోని వివిధ విభాగాల్లో పదవులు దక్కాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని పిడింగొయ్యి గ్రామానికి చెందిన రూరల్ మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణను పార్టీ రాష్ట్ర బీసీ విభాగ కార్యదర్శిగా నియమించారు. అలాగే కడియపులంక గ్రామానికి చెందిన మాజీ సొసైటీ అధ్యక్షుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావును పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగంకార్యదర్శిగా నియమించారు. గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం మండలం సంజీవపురానికి చెందిన ఇళ్ల భాస్కరరావు రాష్ట్ర అతిరాస విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. -
ఎమ్మెల్యే సార్ కోప్పడుతున్నారు
● ప్రారంభోత్సవాలకు డ్వాక్రా మహిళలను తీసుకురండి ● యానిమేటర్లపై ఒత్తిడి ● గోరంట్ల ‘ప్రత్యేక’ అనుచరురాలి దందా సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అరకొర హామీల అమలతో ప్రజలు సంతోషంగా ఉన్నారంటూ కలరింగిస్తోంది. ఒక పక్క సీఎం చంద్రబాబు అన్ని హామీలు అమలు చేసేశాం.. అమలు కాలేదన్న వారి నాలుక మందమంటూ మీడియా సాక్షిగా హుంకరింపులకు దిగుతున్నారు. ఈ తతంగానికి తెర వెనుక మరో కోణం ఉంది. సంక్షేమ పథకాల అమలుతో ప్రజలంతా సంతోషించేస్తున్నారంటూ సొంత మీడియాలో డబ్బా కొట్టుకునేందుకు డ్వాక్రా మహిళలను పావుగా వాడుతున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో యానియేటర్లపై తీవ్ర ఒత్తిడి తెచ్చి డ్వాక్రా మహిళలను ప్రభుత్వ, పార్టీ సంబంధ కార్యక్రమాలకు తరలించాలని టార్గెట్లు పెడుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక అనుచరురాలి దందాయే ఇందుకు నిదర్శనం. ‘ సార్ కోప్పడుతున్నారు.. మీరంతా మీ పరిధిలో డ్వాక్రా మహిళలను సీ్త్రశక్తి పథకం ఉచిత బస్సు ప్రారంభోత్సవం, సీఎం, డిప్యూటీ సీఎం క్షీరాభిషేకానికి తీసుకురాకపోతే తరువాత మీ ఇష్టం అంటూ బెదిరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, పార్టీ సంబంధ కార్యక్రమాల పేరిట నెలకు 10, 15 రోజులు ఇలా తిప్పడంపై డ్వాక్రా మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాగా.. సీ్త్రశక్తి పథకం ఉచిత బస్సు ప్రారంభోత్సవం ప్రభుత్వ అధికార కార్యక్రమం అయినప్పటికీ ఆర్టీసీ బస్సులపై ముఖ్య అనుచరురాలి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. -
ట్రిప్స్కు తృతీయ బహుమతి
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు తృతీయ బహుమతి లభించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన శ్రీమిలే సూర్ సాంగ్ ప్రేక్షకులను అలరించింది. ఈ నృత్యానికి తృతీయ బహుమతి లభించగా, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ చేతుల మీదుగా విద్యార్థులు బహుమతి అందుకున్నారు. ఆ విద్యార్థులను శనివారం ట్రిప్స్ చైర్మన్ బాలా త్రిపుర సుందరి, డైరెక్టర్లు వంశీకృష్ణ, రూపాదేవి అభినందించారు. -
పోలవరం సమస్యలపై చిత్తశుద్ధి లేదు
కోరుకొండ: పోలవరం ప్రాజెక్టుకు భూములు, ఆస్తులు ఇచ్చి, నిర్వాసితులైన వారి సమస్యల పరిష్కారం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబి అన్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీల పరిశీలన కోసం తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పర్యటన నిమిత్తం ఇండిగో విమాన సర్వీసులో శనివారం ఉదయం ఆయన రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వచ్చారు. ఆయనతో పాటు రాజ్యసభ సబ్యుడు, సీపీఎం ఫ్లోర్ లీడర్ జాన్ బ్రిట్టాస్ కూడా ఉన్నారు. వీరికి ఆ పార్టీ నాయకత్వం, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడం శోఛనీయమన్నారు. ఆదివాసీ రైతులు, నిర్వాసితుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చామన్నారు. ప్రాజెక్టు కారణంగా 1.06 లక్షల కుటుంబాలు నిర్వాసితులయ్యాయని, వీరిలో 80 శాతం ఆదివాసీయులే ఉన్నారన్నారు. వీరికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం రూ.33 వేల కోట్లు రావాల్సి ఉండగా, ఆ మేరకు నిధులు విడుదల చేయలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై పార్లమెంటులో చర్చను లేవనెత్తుతున్నానన్నారు. కార్యక్రమంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి. అరుణ్, అల్లూరి సీతారామరాజు జిల్లాకార్యదర్శి బి. కిరణ్, కార్యదర్శివర్గసభ్యులు తులసి, పవన్, రాంబాబు, నాయకులు ఎస్ఎన్ మూర్తి, సుందరబాబు తదితరులు పాల్గొన్నా రు. -
నేడు గుళ్లపల్లి ఘనపాఠికి రాజాలక్ష్మి అవార్డు ప్రదానం
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం శివారు కొంతమూరులోని దత్తాత్రేయ వేదవిద్య గురుకులం గౌరవాధ్యక్షుడు, ప్రధాన ఆచార్యుడు గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్నారు. చైన్నెకి చెందిన రమణయ్యరాజా 1979 నుంచి వివిధ రంగాల్లో నిష్ణాతులకు రాజాలక్ష్మి అవార్డులను అందజేస్తున్నారు. ఈ మేరకు వేదవిద్య ప్రచారానికి గుళ్లపల్లి ఘనపాఠి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆదివారం ఉదయం 11.30 గంటలకు వేదవిద్య గురుకులం ప్రాంగణంలో ఈ అవార్డును అందజేయనున్నారు. సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు. సంస్థ రజతోత్సవ సందర్భంలో ఈ అవార్డును అందుకోవడం దత్తాత్రేయుని ఆశీస్సులుగా భావిస్తున్నానని సీతారామచంద్ర ఘనపాఠి తెలిపారు. గురుకులం కార్యవర్గం తరఫున భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు ఈ వివరాలు తెలిపారు. శ్రీఖండ్ కై లాష్ మహాదేవ్ యాత్ర బిక్కవోలు: మండలంలోని కొంకుదురు చెందిన నలుగురు యువకులు శ్రీఖండ్ కైలాష్ మహాదేవ్ యాత్ర పూర్తి చేసుకుని స్వగ్రామానికి వచ్చారు. పంచ కై లాసాలలో ఒకటిగా భావించే ఈ ప్రదేశం హిమాచల్ ప్రదేశ్లో సముద్ర మట్టానికి 18,570 అడుగుల ఎత్తులో ఉంది. పోతంశెట్టి మదన్రెడ్డి ఆధ్వర్యంలో చిన్నం వెంకటరెడ్డి, మల్లిడి సురేంద్రరెడ్డి, కర్రి ఉమామహేశ్వరరెడ్డి, పడాల వెంకటరెడ్డి ఈ యాత్రను చేసి 72 అడుగుల పర్వత లింగాన్ని దర్శించుకున్నారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: శ్రావణ మాసంలోని మూడో శనివారం సందర్భంగా అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామునుంచే ఆలయ ప్రాంగణం చుట్టూ క్యూలో నిలబడ్డారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధి కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. దాతల ఆర్థిక సాయంతో 9,500 మందికి అన్నసమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి శనివారం భక్తులకు అన్నసమారాధనతో పాటు ప్రసాదాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన స్వామి వారికి పూలంకరణ, భక్తులకు ప్రసాదం, నిత్యగోత్రార్చన, అన్నదానం వంటి కార్యక్రమాలకు భక్తుల నుంచి విరాళాలు స్వీకరిస్తున్నామని తెలిపారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
పెదపూడి: క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జి.మామిడాడకు చెందిన వ్యాపారవేత్త మల్లిడి శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జి.మామిడాడ లలిత నగర్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వ్యాపారవేత్తలు మల్లిడి శ్రీనివాసరెడ్డి, సబ్బెళ్ల రామచంద్రారెడ్డి, సబ్బెళ్ల లక్ష్మణరెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా నుంచి 120 మంది బాలురు, బాలికలు హాజరయ్యారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికై న వారు సెప్టెంబర్లో అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎంపికలకు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీడీ నల్లమిల్లి అప్పారెడ్డి, పీఈటీ జె.మోహన్ వ్యవరించారు. కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ముప్పన వీర్రాజు, అధ్యక్షుడు ముప్పన వీరభద్రస్వామి, కార్యదర్శి సీతాపతిరావు, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సూరిబాబు పాల్గొన్నారు. -
ప్రాణప్రదాతలూ స్పందించండి..
● సికిల్ సెల్ వ్యాధితో బాలిక అవస్థలు ● వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ● సాయం కోరుతున్న తల్లిదండ్రులు కపిలేశ్వరపురం (మండపేట): ఆడుతూ పాడుతూ తిరగాల్సిన సమయంలో ఆ పాప మంచాన పడింది. తోటి స్నేహితులతో ఆనందంగా గడపాల్సిన సమయంలో జ్వరం, నీరసం, ఒళ్లనొప్పులతో బాధపడుతోంది. ఆ బాలిక వైద్య చికిత్సకు సాయం చేయాలని దాతలను తల్లిదండ్రులు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మండపేట పట్టణంలోని 26వ వార్డు గాంధీ నగర్ కోలావారి తోట ప్రాంతానికి చెందిన నీలాపు అమృత వర్షిణి సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతోంది. ఆమె తండ్రి ఈశ్వరరావు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికుడు. తల్లి అనూరాధ గృహణి. అమృత వర్షిణి నాలుగో తరగతి, కుమారుడు రామ్తేజ్ దామోదర కుమార్ ఏడో తరగతి చదువుతున్నారు. 2016 సెప్టెంబర్లో పుట్టిన కుమార్తె అమృత వర్షిణి సుమారు నాలుగేళ్లుగా ఆ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ఆరో సంవత్సరం ప్రారంభంలో ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఈ సమస్య ప్రారంభమైంది. మొదట్లో మండపేట, రాజమహేంద్రవరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించారు. అనంతరం వైజాగ్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా సికిల్ సెల్ ఎనీమియాగా నిర్ధారించారు. దీంతో 2022లో తమిళనాడు వెల్లూరులోని సీఎంసీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు వెళుతున్నారు. వెళ్లిన ప్రతిసారీ వైద్యానికి సుమారు రూ.20 వేలు ఖర్చవుతోంది. ఆరు నెలలకు ఒక్క సారి రక్తం ఎక్కించాల్సి వస్తోంది. దాతలు సమకూరనప్పుడు తండ్రి ఈశ్వరరావు తన రక్తాన్ని దానం చేసి ప్రత్యామ్నాయంగా పాప గ్రూపునకు చెందిన రక్తాన్ని సమకూర్చుకుంటున్నారు. ఈశ్వరరావు మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్గా నమోదు కావడంతో కుటుంబానికి ప్రభుత్వ సాయం అందడం లేదు. దీంతో బాలిక చికిత్సకు దాతలు సహకారం అందించాలని కోరుతున్నారు. వివరాలకు 80087 88195 నంబర్ను సంప్రదించవచ్చు. -
ప్రారంభించినారు
దేవరపల్లి: మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు 2025–26 పంట కాలానికి గాను అక్టోబర్ నుంచి పొగాకు నాట్లు ప్రారంభం కానున్నాయి. ఒకవైపు 2024–25 పంట కాలానికి సంబంధించిన పొగాకు అమ్మకాలు ఇంకా జరుగుతున్నాయి. ఇదే తరుణంలో పొగాకు బోర్డు 2025–26 పంట కాలానికి ఉత్పత్తి కోటాను ఖరారు చేయడం.. మరోవైపు వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులు దుక్కులు చేసి, పొగాకు సాగుకు అవసరమైన నారుమడులు కట్టి విత్తనాలు వేయడంలో బిజీగా ఉన్నారు. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా ఐటీసీ సరఫరా చేస్తున్న ఎల్వీ–7, 1353 వంగడాలతో నారుమడులు వేస్తున్నారు. ఇవి ఎకరాకు సగటున 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి ఇస్తున్నాయి. దీంతో పాటు పొగాకు బోర్డు, సీటీఆర్ఐ కూడా రైతులకు వంగడాలను సరఫరా చేస్తున్నాయి. పంట నియంత్రణ చర్యలు రాజమహేంద్రవరం రీజియన్లో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడేల్లోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 2024–25 పంట కాలంలో 58 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి టుబాకో బోర్డు అనుమతించింది. అయితే, గత ఏడాది లెక్కకు మిక్కిలిగా లాభాలు రావడంతో రైతులు సుమారు 80 మిలియన్ కిలోల వరకూ ఉత్పత్తి చేశారన్నది అధికారుల అంచనా. మార్కెట్ పరిస్థితులు మారడంతో గత సంవత్సరం మాదిరిగా ఈసారి ధర దక్కక నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట నియంత్రణ చర్యలకు బోర్డు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2025–26 పంటకాలంలో పొగాకు ఉత్పత్తిని 48 మిలియన్ కిలోలకు పరిమితం చేసింది. గత ఏడాది బ్యారన్కు 45 క్వింటాళ్ల ఉత్పత్తికి అనుమతించగా.. ప్రస్తుతం దానిని 36 క్వింటాళ్లకు కుదించింది. విస్తీర్ణం పెరిగే చాన్స్ ఎకరం విస్తీర్ణంలో వేసిన నర్సరీలోని నారు దాదాపు 900 ఎకరాలకు సరిపోతుంది. ఈ ఏడాది పొగాకు ధరలు క్వింటాల్కు గరిష్టంగా రూ.350 నుంచి రూ.392 వరకూ పలికింది. ఈ నేపథ్యంలో 2025–26 పంట కాలంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున నారుమడుల విస్తీర్ణం కూడా పెరుగుతుందని రైతు సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. నారుమడులకు ఎకరం భూమి కౌలు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకూ పలుకుతోంది. నారుమడుల కోసం ఆగస్టు నుంచి డిసెంబర్ వరకూ రైతులు తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. డిసెంబర్ 16 తర్వాత నారుమడులను ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కౌలుదారులు భూములను ధైర్యంగా కౌలుకు తీసుకుంటున్నారు. దేవరపల్లి మండలం పల్లంట్ల, బందపురం, లక్ష్మీపురం, యర్నగూడెం, సంగాయగూడెం, చిన్నాయగూడెం, గోపాలపురం మండలం గోపాలపురం, చిట్యాల, వేళ్లచింతలగూడెం, చిట్యాల గ్రామాల్లో పొగాకు నారుమడులు ముమ్మరంగా వేస్తున్నారు. ట్రే నర్సరీలు పలు గ్రామాల్లో రైతులు షేడ్ నెట్ పందిళ్లు వేసి, ట్రేలు ఏర్పాటు చేసి ఎక్కువగా నారు పెంచుతున్నారు. ఈవిధంగా పెంచిన నారు నాణ్యతగా ఉండి, చీడపీడలను తట్టుకుంటుందని చెబుతున్నారు. నారు రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది దీనివైపే మొగ్గు చూపుతున్నారు. పెద్ద రైతులైతే సొంతంగానే ట్రే నారు పెంచి తోటలు వేస్తున్నారు. నర్సరీలకు అవసరమైన ట్రేలను బోర్డు ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, ఒంగోలు, కనిగిరి ప్రాంతాల నుంచి రైతులు వచ్చి ఇక్కడి నారు కొనుగోలు చేసి తీసుకు వెళ్తూంటారు.ఫ పొగాకు నారుమడులకు శ్రీకారం ఫ అధిక దిగుబడులిచ్చే వంగడాల వైపు రైతుల చూపు ఫ నిబంధనలు పాటించాలంటున్న అధికారులు రిజిస్ట్రేషన్ తప్పనిసరి వచ్చే ఏడాదికి నర్సరీ దశ నుంచే బోర్డు నిబంధనలను కఠినతరం చేసింది. నారుమడి కట్టే ప్రతి రైతూ భూమిని బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని రసీదు తీసుకోవాలి. అలా రసీదు ఉన్న వారి వద్ద మాత్రమే రైతులు నారు కొనుగోలు చేయాలి. వారు కూడా రసీదు పొందాలి. నాట్లు వేసే సమయంలో ఆ రసీదును మొక్క ఫారంతో కలిపి బోర్డులో అందజేస్తేనే పొగాకు బ్యారన్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. – జీఎల్కే ప్రసాద్, రీజినల్ మేనేజర్, పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం కాసుల పంట పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో సుమారు 25 వేల హెక్టార్లలో పొగాకు సాగు జరుగుతోంది. మూడేళ్లుగా ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. నారుమడులు కడుతున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలుదారులే ఉన్నారు. ఐదు వేలం కేంద్రాల పరిధిలో దాదాపు 400 కౌలు రైతులు నారుమడులు కట్టి వ్యాపారం చేస్తున్నారు. ఒక్కో రైతు ఎకరం నుంచి ఐదెకరాల వరకూ నారుమడులు వేస్తున్నారు. 2021–22లో ఎకరం నారు (6 వేల మొక్కలు) రూ.5 వేలు పలకగా, 2022 సీజన్లో అది ఏకంగా రూ.18 వేలకు పెరిగింది. 2023–24లో కూడా రూ.16 వేలు పలకడంతో రైతులకు కాసుల పంట పండింది. అయితే, ఈ రెండు సీజన్ల ఎకరం విస్తీర్ణంలో నారుమడులు కట్టిన రైతులు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ కూడా ఆదాయం పొందారు. 2024 సీజన్లో మాత్రం నారు ధర పడిపోవడంతో చాలా మంది రైతులు నష్టాలు చవిచూశారు. కొంత మందికి పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి ఎదురైంది. -
మెరిట్ లిస్ట్ కోసం చూస్తున్నా
ముమ్మిడివరం మండలం మల్లయ్యపాలెం ఎంపీపీ స్కూల్లో ఎస్జీటీ పనిచేస్తూ డీఎస్సీ 2025 పరీక్షలో ఫిజికల్ సైన్స్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 82 మార్కులు సాధించాను. ఆన్లైన్లో స్కోర్ కార్డు పొందాను. మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. – బి.శివ గణేష్, ఎస్జీటీ, ద్రాక్షారామం, రామచంద్రపురం మండలం మంచి ర్యాంకు సాధించాను తెలంగాణ డీఎస్సీ 2024లో పరీక్ష రాసి మిర్యాలగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. డీఎస్సీ 2025 పరీక్షల్లో ఎస్జీటీ విభాగంలో 87.7 మార్కులు సాధించాను. మెరిట్ జాబితా కోసం ఎదురు చూస్తున్నాను. మా నాన్న మట్టపర్తి వెంకట రాంబాబు కొత్తలంక మోడల్ ప్రైమరీలో పీఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్నారు. నాన్న స్ఫూర్తితో ఉద్యోగం సాధించాను. – మట్టపర్తి సౌమ్య, ముమ్మిడివరం త్వరగా ప్రకటించాలి డీఎస్సీ 2025 పరీక్షలో ఎస్జీటీ విభాగంలో 87.2 మార్కులు సాధించాను. రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను టీచర్ కొలువు సాధించాలనే పట్టుదలతో చదివాను. మెరిట్ జాబితా కోసం వేచి చూస్తున్నాను. అధికారులు మెరిట్ జాబితాను ప్రకటించాలి. – బద్రి అంజలి దేవిక, అండ్రంగి, కాజులూరు మండలం -
ఉప ఎన్నికలతో ప్రజాస్వామ్యానికి అప్రతిష్ట
● రిగ్గింగ్ డేగా ఆగస్టు 12 ● కూటమి ప్రభుత్వ తీరు దారుణం ● అక్రమ కేసులకు భయపడేది లేదు ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రాజమహేంద్రవరం సిటీ: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యానికి అప్రతిష్టగా మారాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆయన శనివారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఉప ఎన్నికలు జరిగిన ఆగస్టు 12వ తేదీకి ప్రజాస్వామ్యంలో రిగ్గింగ్ డేగా గుర్తింపు వచ్చిందన్నారు. ప్రతిపక్షాలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు లేకుండా, పోటీ చేసిన అభ్యర్థులు ఓటు వేయకుండా చేసి.. గొప్పగా ఎన్నికలు నిర్వహించామని చెప్పుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ధ్వజమెత్తారు. పులివెందులలో గెలుపు కోసం జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి దొంగ ఓటర్లను దిగుమతి చేసి, పోలీసుల సాయంతో రిగ్గింగ్ చేయించారన్నారు. తెలుగుదేశం పార్టీ మూకలు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని అన్ని పోలింగ్ బూతుల్లో వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాష్టీకానికి తెగబడ్డాయన్నారు. పక్క జిల్లాకు చెందిన మంత్రి పోలింగ్ బూతుల్లోకి జొరబడి వై్ఎస్సార్ సీపీ ఏజెంట్లకు బయటకు గెంటివేయించారన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, సాను భూతి పరులను మాత్రం బెదిరించారన్నారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరిపోయే ప్రసక్తే లేదన్నారు. కేవలం రెండు రోజులు కురిసిన వర్షానికి ముంపు బారిన పడిన రాజధాని ప్రాంతంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. మంత్రి నారాయణ అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్నారని, ఆ దిశగా అక్కడ పనులు జరగడం లేదన్నారు. నాలుగు ఐకానిక్ టవర్లు నిర్మించినంత మాత్రాన రాజధాని నిర్మాణం పూర్తయినట్టు కాదన్నారు. 138 ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చిన స్థలాల్లో ఏ మేరకు నిర్మాణాలు జరుగుతున్నాయో తెలియడం లేదన్నారు. -
స్వదేశానికి దుబాయ్ బాధితుడు
● ఏజెంట్ మోసంతో అంబాజీపేట వాసి అవస్థలు ● ఇండియాకు తీసుకువచ్చిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు అమలాపురం రూరల్: నకిలీ ఏజెంట్ మోసంతో దుబాయ్లో ఇబ్బందులు పడుతున్న అంబాజీపేట చెందిన ఒక యువకుడిని భారత విదేశీయ రాయబార మంత్రిత్వ శాఖ సహకారంతో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అఽధికారులు ఇండియాకు తీసుకునివచ్చారు. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట చెందిన పొన్నాడ మంగ కుమారుడు కనకరాజును ఒక ఏజెంట్ ఇటీవల దుబాయ్కు పంపించాడు. అక్కడ నెలకు రూ.50 వేలకు పైగా జీతం వస్తుందని, రోజుకు 8 గంటలు పని ఉంటుందని చెప్పాడు. కానీ అక్కడ కనకరాజుకు భిన్నమైన పరిస్థితులు ఎదుర య్యాయి. అధిక పని గంటలు, తీవ్రమైన ఒత్తిడితో పాటు జీతం తక్కువగా ఇవ్వడంతో ఇబ్బంది పడ్డాడు. ఈ విషయాన్ని తన తల్లి మంగకు ఫోన్లో తెలియజేశా డు. దీంతో ఆమె కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను ఆశ్రయించింది. తన కుమారుడిని దుబాయ్ నుంచి ఇండియాకు రప్పించాలని కోరింది. అలాగే కలెక్టర్ మహేష్ కుమార్కు కూడా ఫిర్యాదు చేయడంతో ఆయన డీఆర్ఓ కేంద్రం నోడల్ అధికారి మాధవికి ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు బాధితుడిని సంప్రదించి, అక్కడి సమస్యను తెలుసుకున్నారు. కనకరాజు ఇబ్బందులు పడుతున్నాడని తెలియడంతో ఇండియాకు తీసుకువచ్చారు. -
హైవేపై ఆయిల్ మాఫియా
● లారీ డ్రైవర్ల నుంచి అక్రమంగా డీజిల్ కొనుగోలు ● లాభం వేసుకుని ఇతర లారీలకు విక్రయం ● అక్రమార్కుల ధనార్జన గండేపల్లి: స్థానిక 16వ నంబర్ జాతీయ రహదారిపై ఆయిల్ మాఫియాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆయిల్ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. పలు జిల్లాలు, రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ఈ జాతీయ రహదారిపై పలు శాఖల చెందిన అధికారులు ప్రయాణిస్తుంటారు. అయినప్పటికీ అక్రమార్కులు యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చైన్నె, విజయవాడ, కోల్కతా, విశాఖపట్నం తదితర నగరాలకు ఎగుమతులు, దిగుమతుల కోసం నిత్యం వందల లారీలు హైవేపై ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో లారీ యజమానులు లారీలకు ఆయిల్ను ఫుల్ ట్యాంక్ చేయించి సరకు ఎగుమతులు, దిగుమతుల కోసం గమ్యస్థానాలకు పంపుతారు. ఒక్కొక్కసారి డ్రైవర్లే ఆయిల్ను ఫుల్ ట్యాంక్ చేయించుకుంటారు. అయితే గమ్యస్థానాలకు వెళుతుండగా మధ్యలో లారీ డ్రైవర్, క్లీనర్ ఒక్కటై.. ట్యాంక్లో డీజిల్ను అక్రమంగా తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. యథేచ్ఛగా వ్యాపారం మల్లేపల్లిలో ఈ డీజిల్ అక్రమ వ్యాపారం కొంత కాలంగా పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తోంది. లారీ డ్రైవర్, క్లీనర్ల నుంచి డీజిల్ను కొందరు వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద ఒక లీటర్ డీజిల్ను రూ.96.74కి విక్రయిస్తుండగా, ఆయిల్ మాఫియా నిర్వాహకులు.. లారీల వద్ద రూ.75కు కొనుగోలు చేస్తున్నారు. ఆ డీజిల్ను ఇతర లారీలకు రూ.85కి విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. దాబా, టీ షాపుల వద్ద డ్రైవర్లు టీ తాగేందుకు, టిఫిన్, భోజనం నిమిత్తం ఆగుతుండటంతో ఆ ప్రాంతంలోనే ఈ వ్యాపారం కొనసాగుతోంది. కొన్నిసార్లు రహదారిపైనే వాహనాలను నిలిపి ఆయిల్ను బయటకు తీసే సమయంలో ట్రాఫిక్కు ఇబ్బందులు ఏర్పడిన ఘటనలు కూడా ఉన్నాయి. అక్రమంగా డీజిల్ విక్రయించిన లారీ డ్రైవర్లకు కొందరు వ్యాపారులు డబ్బులకు బదులు మద్యం సీసాలను ఇస్తున్నట్టు సమాచారం. -
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన గౌరవ వందనం సమర్పిస్తున్న దళం దేశభక్తి భావాన్ని చాటిన విద్యార్థుల ప్రదర్శనప్రగతి పథంలో తూర్పుసాక్షి, రాజమహేంద్రవరం: ‘ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సమష్టి కృషితో తూర్పుగోదావరి జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిద్దాం. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదాం. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా ముందడుగు వేద్దాం’ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దళాల కవాతు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోలీసు వాహనంపై మంత్రి, కలెక్టర్, ఎస్పీ కవాతు చేపట్టారు. అంతకు ముందు మంత్రి దుర్గేష్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఆర్ట్స్ కళాశాలలో ప్రత్యక్షంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి ప్రసంగించారు. ఎందరో నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, అమరవీరుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. ఆ మహనీయుల త్యాగాలను స్మరిస్తూ.. ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. బ్రిటిష్ పాలనలో దేశం ఆర్థిక దోపిడీకి గురైందన్నారు. ఆ పరిస్థితి నుంచి ప్రస్తుతం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ దిశగా, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంతో ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా అడుగులేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగుతున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మార్గదర్శులతో బంగారు కుటుంబాలను అనుసంధానిస్తూ పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. శ్రీసూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నాం. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రూ.15 వేల ఆర్థిక తోడ్పాటు, ప్రతి ఏటా రైతుకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.20 వేల పెట్టుబడి సాయం, అర్హులైన మహిళలందరికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు వంటి వాటిని అమలు చేశాం. మహిళలకు సీ్త్ర శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తున్నాం’ అని వివరించారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలివీ.. ● రాబోయే కాలంలో యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, ఉద్యోగం లేని నిరుద్యోగులకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి, మహాశక్తి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం వంటి వాటిని రానున్న రోజుల్లో అమలు చేస్తాం. ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద 17 కేటగిరీల లబ్ధిదారులకు ఇంటివద్దనే పింఛన్లు అందిస్తున్నాం. ● పేదల ఆకలి తీర్చే ఐదు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చాం. త్వరలో మరిన్ని ప్రారంభించనున్నాం. ● ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ కోసం ద్వారా ప్రజాసమస్యలకు జవాబుదారీతనంతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందిస్తున్నాం. ● ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాం. ● హర్ ఘర్ తిరంగా వంటి వినూత్న కార్యక్రమాలతో జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా వాడవాడలా పలు కార్యక్రమాలు చేపట్టి, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించాం. ● చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన జిల్లా ప్రధాన కేంద్రం రాజమహేంద్రవరాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ● అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో తొలి విడతలో 1.14 లక్షల రైతులకు రూ.57.50 కోట్లు, పీఎం కిసాన్ పథకం కింద 20వ విడతలో 1.03 లక్షల మందికి రూ.20.76 కోట్ల సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశాం. ● జిల్లాలో 40,261 మంది రైతులు 16,406 హెక్టార్లలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2025 ఖరీఫ్ సీజన్లో రూ.307 కోట్ల పంట ఋణాలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 3,193 మంది రైతులకు రూ.13 కోట్ల ఋణాలు అందించాం. ● పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు ప్రతి మంగళ, బుధవారాల్లో రోజుకు రెండు గ్రామాల్లోని రైతులతో సమావేశమై, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ● జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 3.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. జిల్లాలో వివిధ ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.12.41 కోట్ల పనులు చేపట్టనున్నాం. ● ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద 17 కేటగిరీల్లో 2,,36,331 మందికి రూ.103.26 కోట్లు ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నాం. ● జిల్లాలో ఇప్పటివరకు 36.24 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు ఉచితంగా సరఫరా చేసి, రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. వర్షాకాలంలో ఇసుక కొరత అధిగమించేందుకు జిల్లాలో 29 స్టాక్ పాయింట్ల ద్వారా సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేశాం. ● మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేసి, నిఘా వ్యవస్థను మరింత పెంచాం. న్యాయ వ్యవస్థ ద్వారా జిల్లాలో సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి, పేదరిక నిర్మూలనకు సహకరిస్తున్న బ్యాంకు అధికారులకు అభినందనలు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహకిషోర్, జేసీ చినరాముడు, ఆర్డీఓ కృష్ణనాయక్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు భారత స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. మంత్రి దుర్గేష్, కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని రేకెత్తించాయి. చిన్నారుల నుంచి ఉన్నత పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దేశభక్తి, ఐక్యత, త్యాగం, సాంస్కృతిక సంపదల విలువలను ప్రతిబింబించే ప్రదర్శనలు చేశారు. అంగన్వాడీ పిల్లల ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. విజేతలు వీరే.. శ్రీగౌతమి ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రథమ, ఆనందనగర్ మున్సిపల్ స్కూల్ ద్వితీయ, ట్రిప్స్ స్కూల్ తృతీయ స్థానాలు పొందాయి. ప్రత్యేక కన్సొలేషన్ బహుమతులు సాంఘిక సంక్షేమ పాఠశాల, అంగన్వాడీ బాలలకు, యోగా సాధన చేసిన కార్తీక్రెడ్డికి అందించారు. వివిధ దళాల కవాతు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కవాతుకు పరేడ్ కమాండర్గా డీఎస్పీ టీవీఆర్కే కుమార్ నాయకత్వం వహించారు. 1996లో రిజర్వ్ ఎస్సైగా చేరి, 2010లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా, 2024లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. గతంలో గ్రేహౌండ్స్లో పనిచేసిన ఈయన 46 సేవా గుర్తింపులు, 17 నగదు బహుమతులు, 2 ప్రతిభా పత్రాలు, 21 ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ కవాతులో సన్మాన్ గార్డ్, సివిల్ పురుషులు, ట్రాఫిక్, సివిల్ మహిళలు, హోం గార్డులు, ఎన్సీసీ బాలికలు, యువ రెడ్క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ బాలుర దళాలు పాల్గొన్నాయి. స్వాతంత్య్ర సమరయోధుల బంధువును సత్కరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి కృషితో జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం మహనీయుల త్యాగాలు మరువలేనివి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘనంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలు స్వాతంత్య్ర యోధుల కుటుంబాలకు సన్మానం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి దుర్గేష్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను ఆర్ట్స్ కళాశాలలో కలుసుకుని, శుభాకాంక్షలు తెలిపారు. స్వాత్రంత్య్ర యోధుల వారసులను గౌరవించడం అందరి కర్తవ్యమన్నారు. ప్రభుత్వ, సమాజ పరంగా వీరికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. శ్రీరంగపట్నానికి చెందిన ఆకెట్ల గంగరాముడు కుమార్తె చావలి రామలక్ష్మి, దోసకాయలపల్లికి చెందిన నెక్కంటి చంద్రవతి కుటుంబ సభ్యులు నెక్కంటి ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, బలరాం, రాజమహేంద్రవరానికి చెందిన క్రొవ్విడి లింగరాజు మనవడు భాస్కరరావు, కారుమూరి మార్కండేయులు కుమారుడు నాగవిశ్వనాథం ఉన్నారు. వీరందరినీ మంత్రి సన్మానించారు. -
రత్నగిరి.. భక్తజన ఝరి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది భక్తులు ● స్వామివారి వ్రతాలు మూడు వేలు ● ఆదాయం రూ.40 లక్షలు ● మంచినీరు లేక క్యూలో అల్లాడిన భక్తులు అన్నవరం: శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా రత్నగిరి సత్యదేవుని ఆలయం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసింది. సత్యదేవుని దర్శించేందుకు భక్తులు స్వామివారి ఆలయానికి భారీగా తరలివచ్చారు. దీనికితోడు రత్నగిరిపై, పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు కూడా జరుగుతుండడంతో.. పెళ్లి బృందాలు, నవ దంపతులు కూడా పెద్ద సంఖ్యలో విచ్చేశారు. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులతో పాటు, హాజరైన పెళ్లి బృందాలు, ఇతర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న నవ దంపతులు భారీగా రత్నగిరికి తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయం, వ్రత మంటపాలు, క్యూ లైన్లు, విశ్రాంతి మంటపాలన్నీ నవ దంపతులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల రద్దీ కారణంగా ఉదయం 12 గంటల వరకు అంతరాలయ దర్శనం నిలిపివేశారు. వ్రతాల నిర్వహణ కోసం కూడా భక్తులు వ్రత మంటపాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించినట్టు దేవస్థాన వర్గాలు తెలిపాయి. స్వామివారి వ్రతాలు మూడు వేలు జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. భక్తులకు అందని మంచినీరు కాగా, శుక్రవారం రత్నగిరికి విచ్చేసిన భక్తులు క్యూ లైన్లలో మంచినీరు అందక అల్లాడిపోయారు. ఆలయం దిగువన క్యూలైన్లు ప్రారంభమయ్యే లిఫ్ట్ వద్ద, ఆలయం వద్ద ఉన్న క్యూ లైన్లలో సేవ చేయడానికి వచ్చిన వలంటీర్లు భక్తులకు మంచినీరు అందించేవారు. కానీ శుక్రవారం వారెవరూ కనిపించలేదు. ఆలయం వద్ద క్యూలైన్లలో ఖాళీ మంచినీటి పాత్రలు దర్శనమిచ్చాయి. -
వేలివెన్ను శశిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
ఉండ్రాజవరం(నిడదవోలు రూరల్): ఎందరో మహనీయుల పోరాటం, త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని శశి విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ అన్నారు. వేలివెన్ను శశి విద్యాసంస్థల ప్రాంగణంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పోటీ పరీక్షల్లో జాతీయ, రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో విద్యాసంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ, డైరెక్టర్ శశి ప్రియ, మన్నెం వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ షేక్ షానూర్ తదితరులు పాల్గొన్నారు. -
డీసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో శుక్రవారం డీసెట్–2025 రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన జరిగిందని ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు తెలిపారు. 20 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు పరిశీలించిన అనంతరం ఫైనల్ అడ్మిషన్ లెటర్లు అందజేశామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన శని, ఆదివారాలు కూడా కొనసాగుతాయని చెప్పారు. ‘ఉచిత బస్సు’ ప్రారంభం నిడదవోలు/రాజమహేంద్రవరం సిటీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీ్త్ర శక్తి పథకం అమల్లో భాగంగా నిడదవోలు డిపో, రాజమహేంద్రవరం కాంప్లెక్స్లో శుక్రవారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ప్రారంభించారు. తొలి జీరో ఫేర్ టికెట్ను మంత్రి మహిళలకు అందించారు. ఉచిత బస్సు ప్రయాణం చేసే బాలికలు, మహిళలు, యువతులు, ట్రాన్స్ జెండర్లు ఆధార్, ఓటర్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 186 ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. సూపర్ లగ్జరీ, నాన్ స్టాప్ బస్సులు మినహా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఏపీ ఎన్క్లేవ్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ పి.ప్రశాంతి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల చైర్మన్లు పాల్గొన్నారు. రత్నగిరికి బస్సు సమర్పణ అన్నవరం దేవస్థానానికి బస్సు బహూకరించిన అరబిందో ఫార్మా అన్నవరం: రత్నగిరి శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి అరబిందో ఫార్మాస్యూటికల్స్ రూ.32 లక్షలు విలువ చేసే బస్సును శుక్రవారం అందచేసింది. డీజిల్తో నడిచే ఈ బస్సులో 44 మంది భక్తులు ప్రయాణించవచ్చునని అధికారులు తెలిపారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఈ బస్సుకు లాంఛనంగా పూజలు చేసి ప్రారంభించారు. వన దుర్గమ్మకు చండీహోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మకు శుక్రవారం చండీ హోమం ఘనంగా ఘనంగా నిర్వహించారు. అలాగే ప్రధానాలయంలోని సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండదిగువన తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చండీహోమం ప్రారంభించారు. అనంతరం 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. అమ్మవారికి నిర్వహించిన హోమంలో 42 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధాన ఆలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో, కనకదుర్గ అమ్మవారికి పరిచారకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించి నీరాజనమంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. -
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొనగా, విద్యుత్ సంస్థ శకటం ప్రథమ స్థానం సాధించగా, వ్యవసాయం–హార్టికల్చర్ ద్వితీయ, సాంఘిక సంక్షేమ శాఖ తృతీయ, పశు సంవర్థక శాఖ నాలుగు, పర్యాటక శాఖ శకటం ఐదో స్థానం సాధించాయి. విద్యా శాఖ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ, ప్రణాళిక పీ–4 శకటాలు, వైద్యారోగ్య శాఖ, అగ్నిమాపక సంస్థ శకటాలు వినూత్న అలంకరణతో ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో నిర్వహించిన ప్రదర్శనలో బహుమతులు పొందిన విద్యుత్ సంస్థ, వ్యవసాయ–ఉద్యాన శాఖ, సాంఘిక సంక్షేమ శాఖల శకటాలు -
హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
రాజానగరం: దివాన్చెరువులోని శ్రీప్రకాష్ విద్యా నికేతన్లో సీబీఎస్ఈ సౌత్ జోన్–1 హ్యాండ్ బాల్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ తదితర ప్రాంతాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు, 120 మంది కోచ్లు, మేనేజర్లు హాజరవుతున్నట్టు కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. తొలి రోజు పోటీల్లో శ్రీకృష్ణ ఇంటర్నేషనల్ స్కూల్ (చైన్నె), ది నంద్యాల పబ్లిక్ స్కూల్ (నంద్యాల), శ్రీప్రకాష్ విద్యా నికేతన్ (దివాన్చెరువు), కవి భారతి విద్యాలయం (చైన్నె) విజయం సాధించాయని స్పోర్ట్స్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.స్వామి తెలిపారు. కార్యక్రమంలో రివర్బే మూర్తి, టెక్నికల్ ఇన్చార్జి ఎస్.గోపీకృష్ణ, ప్రిన్సిపాల్ విమల, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
దేవదాయ శాఖ ఆధీనంలోకి వారాహి అమ్మవారు
సింగిల్ ట్రస్టీగా శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఈఓ సౌజన్య కాకినాడ రూరల్: మండలంలోని కొవ్వూరు గ్రామం వారాహి అమ్మవారు దేవదాయ శాఖ ఆధీనంలోకి వెళ్లారు. ఈ మేరకు దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రమేష్బాబు ఆదేశాల మేరకు శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకుని, పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ఈఓ ఎస్.సౌజన్యకు సింగిల్ ట్రస్టీగా బాధ్యతలు అప్పగించారు. వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించారు. కొవ్వూరులో వారాహి అమ్మవారిని అన్నాచెల్లెళ్లు కాళ్ల ప్రసన్నరాణి, పద్మలక్ష్మి, సత్యనారాయణ ఏడాది క్రితం స్థాపించారు, దర్శనం, పూజల కోసం భక్తులు విపరీతంగా పెరిగిపోయారు. సౌకర్యాలు లేక భక్తులు, గ్రామంలో ట్రాఫిక్ పెరిగిపోయి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయల విరాళం వస్తున్నాయని, అవి దుర్వినియోగం అవుతున్నట్టు జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు అందడంతో, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖను కలెక్టరు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్ తనిఖీదారు విచారణ చేసి, నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై వారి నుంచి సమాధానం రాకపోవడంతో సింగిల్ ట్రస్టీగా ఈఓ సౌజన్యకు బాధ్యతను అప్పగించినట్టు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి.ఫణీంద్రకుమార్ తెలిపారు. -
డేంజరింగ్
● పోలీస్ డీపీలతో ఫోన్కాల్ చేసి బెదిరింపులు ● రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు ● భయభ్రాంతులకు గురవుతున్న అమాయక ప్రజలు ● అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు రాయవరం: హలో.. నేను సీబీఐ ఆఫీసర్ని. మీ అబ్బాయి హరీష్ కదూ. మీ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కదా. ఏ కంపెనీలో పని చేస్తున్నాడు? అంటూ ఓ ఫోన్కాల్. ఇటువైపు వ్యక్తి సమాధానాలు చెప్పగానే.. మీ అబ్బాయి డ్రగ్స్ విక్రయిస్తూ మాకు పట్టుబడ్డాడు. పది నిమిషాల్లో మా దగ్గరికి వస్తే వదిలేస్తా.. లేదంటేశ్రీ అంటూ హిందీలో బెదిరింపు ధోరణి ఆ వ్యక్తి సంభాషణ. ఇటీవల రాయవరం గ్రామానికి చెందిన తండ్రి సత్తిబాబు(మార్చిన పేరు)కు వచ్చిన ఫేక్ ఫోన్కాల్ అది. ఆందోళన చెందిన సత్తిబాబు ఫోన్ కట్ చేయగా, మళ్లీ అవతలి వ్యక్తి ఫోన్ చేసి.. ఎందుకు కాల్ కట్ చేశావంటూ గట్టిగా బెదిరించాడు. దీంతో బిత్తరపోయిన సత్తిబాబు వెంటనే వాళ్ల అబ్బాయికి ఫోన్ చేయగా, తాను కంపెనీలో బీజీగా ఉన్నానని చెప్పగానే ఆయన తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇలా ఒక్క సత్తిబాబుకే కాదు. గ్రామంలో మరికొందరికి ఇటువంటి ఫేక్ ఫోన్కాల్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే అమలాపురం పట్టణానికి చెందిన ఓ వ్యక్తికీ ఇలాగే పోలీస్ డీపీతో ఉన్న ఫోన్ నంబర్ నుంచి సీబీఐ డీఎస్పీని మాట్లాడుతున్నానంటూ డబ్బు డిమాండ్ చేశారు. మరో వ్యక్తికీ ఇలాంటి ఫేక్ పోలీస్ డీపీతో ఫోన్కాల్ వచ్చినట్టు సమాచారం. పోలీసు డీపీలతోనే.. లాటరీలో రూ.లక్షలు తగిలాయని, అకౌంట్లో జమ చేయాలంటే బక్స్ రూపంలో కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుందంటూ.. గతంలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడిన సంఘటనలున్నాయి. అలాగే న్యూడ్ కాల్స్ చేసి సొమ్ము వసూలు చేసిన సంఘటనలూ అనేకం ఉన్నాయి. ఇలా సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు కొత్తదారులను మారుస్తూనే ఉన్నారు. తాజాగా పోలీసు ఫొటోలను డీపీగా పెట్టుకుని మోసాలకు తెరదీశారు. పోలీసులమని నమ్మించేందుకు వాట్సాప్ డీపీల్లో పోలీసు ఫొటోలను పెట్టి ఫోన్కాల్స్ చేస్తున్నారు. ఇదంతా నిజమేననుకుని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఫేక్ కాల్ అని కట్ చేసినా.. మళ్లీ మళ్లీ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కూతురు, కొడుకు, భర్త అంటూ పేర్లతో సహా వివరాలు చెబుతుండడంతో బాధితులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనంతరం కొందరు తేరుకుని తమ వారికి ఫోన్ చేసి, వాస్తవాన్ని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎక్కువగా అమాయకులే బాధితులుగా మారుతున్నారు. అపరిచిత కాల్స్ వస్తే ఇలా చేయాలి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వాట్సాప్ లేదా సాధారణ ఫోన్కాల్ చేసి.. పోలీసులమని చెప్పి బెదిరింపులకు పాల్పడినా, డబ్బు డిమాండ్ చేసినా.. మూడు పనులు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి కూతురు/కొడుకు లేదా ఇతర వ్యక్తి డ్రగ్స్ లేదా ఇతర కేసుల్లో పట్టుబడ్డాడని చెబితే.. ముందుగా తమ వారికి ఫోన్ చేసి నిర్ధారణ చేసుకోవాలంటున్నారు. అలాగే అపరిచిత ఫోన్ నంబర్ను బ్లాక్ చేయాలి. చివరిగా టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో సెల్ఫోన్లకు వచ్చే అపరిచిత కాల్స్, మెసేజ్లు, లింక్లకు స్పందించవద్దని సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి సైబర్ నేరగాళ్లు పోలీస్ డీపీలతో ఫోన్ చేసి మోసాలు, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని బెదిరిస్తే ఆందోళన చెందకుండా, ముందుగా మీ సంబంధీకులకు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలి. అపరిచిత ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి, 1930 నంబర్కు రిపోర్ట్ చేయాలి. సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలి. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలే లక్ష్యంగా మోసాలకు పాల్పడేందుకు సైబర్ నేరగాళ్లు కొత్తదారులు ఎంచుకుంటున్నారు. ఏకంగా పోలీస్ డీపీలు వాడుకుని, వాట్సాప్, నార్మల్ కాల్స్ చేస్తూ, అమాయక ప్రజలను బెదిరిస్తూ, ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఉపాధి, ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి కుటుంబాలే లక్ష్యంగా మోసాలకు యత్నిస్తున్నారు. ఇటీవల అనపర్తి మండలానికి చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు పోలీసులమంటూ ఫోన్ చేసి, మీ కొడుకు డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డాడు అని బెదిరింపులకు పాల్పడ్డారు. విడిచి పెట్టాలంటే డబ్బు పంపాలని చెప్పడంతో.. రూ.50 వేలు యూపీఐ ద్వారా పంపి మోసపోయారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం వెలుగు చూస్తున్నాయి. సైబర్ నేరగాళ్ల బారిన పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుంటే, మరికొందరు మిన్నుకుండిపోతున్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
చాగల్లు: కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి వ్యవస్థలను పతనం చేసి పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానా లను గెలుపొందిందని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ధ్వజమెత్తారు. గు రువారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేసిందని, ఏజెంట్ల కు, ఓటర్లకు స్వేచ్ఛలేని పోలింగ్ జరిగిందని, ఉప ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్, పోలీస్ వ్యవస్థ కళ్లుండీ చూడలేని దుస్థితిలో ఉన్నాయని అన్నారు. పోలింగ్కు ముందు కేంద్రాలను మార్చి ఓటర్లలో గందరగోళం సృష్టించారని అన్నారు. ప్రజలను, మా పార్టీ వారిని బయటకు రానీయకుండా అడ్డుకున్నారు. ఇలాంటి గెలుపు కూడా గెలుపేనా? వైఎస్సార్ సీపీకి 683 ఓట్లు వచ్చాయంటే జనం నమ్ముతారా? పోలీసులను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్ల వేయించుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోలేదు? హైకోర్టు కూడా ఓటర్లకు స్వేచ్చ, ఏజెంట్లకు రక్షణ కల్పించమని చెప్పింది. అయినా సరే ఎన్నికల కమిషన్లో మార్పు లేదని అన్నారు. కనీసం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కూడా ఓటు వేయలేకపోయారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజీని బయట పెట్టాలి పోలింగ్లో జరిగిన అక్రమాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదన్నారు. జమ్మలమడుగు, కమలాపురం నుంచి వచ్చిన దొంగ ఓటర్ల గురించి జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు. ఎన్నికల కమిషన్ ప్రజల ముందు దోషిగా నిలబడిందని అన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలోని వెబ్ కాస్టింగ్, సీసీ పుటేజీని బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కార్ ప్లాన్ ప్రకారమే జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టిందని అన్నారు. కలెక్టర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారని వెంకట్రావు విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలకు రిగ్గింగ్ చేయాలని కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారని ఆరోపించారు. పోలింగ్ బూత్ల వద్ద కనీసం ఎక్కడా క్యూలైన్లలో మహిళలు కనిపించలేదని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికతో చంద్రబాబు ఏం సాధించారని అన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారు’ అన్నారు. యూనిఫామ్ వేసుకున్న పోలీసులు ఉన్నది ప్రజలను రక్షించడానికి కాదని పాలకులు చెప్పింది చేయడం, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం, ప్రతిపక్షాన్ని కట్టడి చేయడం.. తమకు ఆయుధం ఇచ్చింది, ప్రజల రక్షణ కోసం కాకుండా, విపక్ష కార్యకర్తలను కాల్చడానికి అన్నట్లుగా ఎన్నికల్లో ఒక డీఎస్పీ అత్యంత అహంకార పూరితంగా పార్టీ కార్యకర్తలను బెదిరించడం సిగ్గు చేటని ఆయన విమర్శించారు. ఎన్ని అరాచకాలు, అక్రమాలు చేసినా మేము ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం కళ్లుండీ చూడలేని ఎన్నికల కమిషన్, పోలీసులు వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజీని బయట పెట్టాలి వైఎస్సార్ సీపీ కొవ్వూరు ఇన్చార్జి తలారి వెంకట్రావు -
అధికారులూ.. అప్రమత్తం
● కార్యాలయాల్లో అందుబాటులో ఉండండి ● కలెక్టర్ ప్రశాంతి ఆదేశం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అధిక వర్షాల నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జేసీ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ సీతారామమూర్తితో కలిసి జిల్లా, క్షేత్రస్థాయి అధికారులకు ఆమె దిశానిర్దేశం చేశారు. రానున్న నాలుగైదు రోజులు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ఎటువంటి సెలవులు పెట్టకుండా తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, రోడ్లు–భవనాలు, పంచాయతీ రాజ్, మున్సిపల్, విద్యుత్, పౌర సరఫరాల శాఖలు తమ పరిధిలో నష్టపోయిన వనరులను సమీక్షించి, కచ్చితమైన గణాంకాలతో 24 గంటల్లో కలెక్టర్ కార్యాలయానికి నివేదించాలని సూచించారు. ఈ నివేదికల ఆధారంగా తక్షణ సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఆరోగ్య, పారిశుధ్య చర్యలు ఆరోగ్య శాఖ అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అన్ని కేంద్రాల్లో సిద్ధంగా ఉంచి, తగిన వైద్య సిబ్బంది విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే జిల్లా, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో 24 గంటల కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితులు, ప్రమాద సూచనలు గమనించిన వెంటనే సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లకు సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. జిల్లాలో వర్షపాతం 957.8 మిల్లీ మీటర్లు దేవరపల్లి: జిల్లాలోని 18 మండలాల్లో గురువారం ఉదయం 8.30 గంటల వరకు 957.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 50.4 మిల్లీ మీటర్లు కాగా, ఉండ్రాజవరం మండలంలో అత్యధికంగా 180 మిల్లీ మీటర్లు, పెరవలి మండలంలో 170.6 మిల్లీ మీటర్లు, నల్లజర్ల మండలంలో 120 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన మండలాలను పరిశీలిస్తే అనపర్తిలో 55.2, రాజమహేంద్రవరం రూరల్లో 52.8, రాజమహేంద్రవరం అర్బన్లో 45.6, బిక్కవోలులో 45.4, కోరుకొండలో 43.4, కడియంలో 37.4, గోకవరంలో 33.6, చాగల్లులో 28, దేవరపల్లిలో 25.4, రంగంపేటలో 24.6, తాళ్లపూడిలో 15, సీతానగరంలో 14.6, కొవ్వూరులో 13.8, రాజానగరం 10.2, గోపాలపురం మండలంలో 8.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
పంద్రాగస్టు పరేడ్ రిహార్సల్స్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ను ఎస్పీ డి.నరసింహాకిశోర్ గురువారం పరిశీలించారు. దీనిలో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించి సాయుధ పోలీస్ బలగాల పరేడ్ను తిలకించారు. పరేడ్ బాగుందని, ఇదే స్ఫూర్తితో శుక్రవారం జరిగే వేడుకలను విజయవంతం చేయాలన్నారు. జెండా వందనానికి వచ్చే ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, ప్రజలకు సరైన సదుపాయాలు, బందోబస్తు, భద్రతపై పలు సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్కరినీ డీఎంఎండీ ద్వారా తనిఖీ చేసి పంపాలని, వాహనాల పార్కింగ్ నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎం మురళీకృష్ణ, ఎల్.చెంచిరెడ్డి, ఏఆర్ డీఎస్పీ రవికుమార్, ఆర్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పూర్తయినట్టు జేసీ ఎస్.చిన్నరాముడు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో వేడుకల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. వర్షం ఇబ్బంది పెడితే సుబ్రహ్మణ్యం మైదానం వద్ద వేడుకలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆర్ఎంసీ అధికారులు, రెవెన్యూ, పోలీసు, సాంస్కృతిక సమన్వయ శాఖల అధికారులతో తగిన చర్యలు తీసుకున్నట్టు ఆయన తెలిపారు. 14 శాఖల శకటాలు, స్టాల్స్ ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఈ క్రమంలో ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, ఆర్ఎంసీ ఏడీసీ పీవీ రామలింగేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ ఎన్వీవీఎస్ మూర్తి, జిల్లా పశు సంవర్ధక అధికారి శ్రీనివాసరావు, తదితర అధికారులు పాల్గొన్నారు. రత్నగిరి కిటకిట ● స్వామివారిని దర్శించిన 40 వేల మంది భక్తులు ● 2,500 వ్రతాల నిర్వహణ అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం గురువారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలు చేసుకున్న నవ దంపతులు వారి బంధువులు సత్యదేవుని వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించారు. పెళ్లిబృందాలు తమ వాహనాలను ఘాట్రోడ్డుకు ఇరువైపులా నిలిపివేయడంతో ఉదయం పది గంటల వరకు ఘాట్రోడ్లలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు శ్రీగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించారు. తరువాత రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. కాగా, గురువారం స్వామివారి వ్రతాలు 2,500 నిర్వహించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారు. నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు కాగా, గురువారం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల నిజరూప దర్శనంతో భక్తులు పులకించారు. ప్రతి సోమవారం ముత్యాల కవచాలతో, గురువారం ఏ విధమైన అలంకరణ లేకుండా నిజరూప దర్శనంతో అలంకరిస్తున్న విషయం తెలిసిందే. -
ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిసే ర్యాగింగ్
రాజానగరం: విద్యార్థి దశలో జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఆనందమని సీనియర్లు భావిస్తారని.. కానీ అది ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తన జీవితంలో కూడా ర్యాగింగ్కు భయపడిన సంఘటనలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నారు. ఎవరూ ర్యాగింగ్కు పాల్పడవద్దని, పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను ర్యాగింగ్కు దూరంగా ఉంచాలని చూస్తారని, అందుకోసమే ర్యాగింగ్ ఛాయలు లేని కళాశాలలు, యూనివర్సిటీలను ఎంపిక చేసుకుంటున్నారన్నారు. ర్యాగింగ్ వలన జీవితాలు నాశనం అవడమే కాకుండా కన్నవారికి, చదువుకునే సంస్థలకు కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు. వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ‘నన్నయ’ వర్సిటీ అంటేనే సత్ప్రవర్తనకు కేరాఫ్ అనే ఖ్యాతిని పొందేలా మీ నడవడిక ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నం నిడదవోలు రూరల్: మండలంలోని తాడిమళ్ల ప్రధాన సెంటర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ పక్కన ఉన్న ఈ ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ మేరకు గురువారం బ్యాంకు మేనేజర్ రవి అందించిన సమాచారంతో సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏటీఎంలోకి ప్రవేశించిన దొంగలు ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. డబ్బులను చోరీ చేసేందుకు ఏటీఎం ముందు భాగాన్ని పగులగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో రూ.1.53 కోట్లకు టోకరా రాజమహేంద్రవరం రూరల్: గుర్తుతెలియని వ్యక్తి సెల్ఫోన్కు మేసేజ్ పంపి, క్యాపిటల్ సర్వీసెస్ గ్రూప్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని నమ్మించి ఖాతా తెరిపించి రూ.1.53 కోట్లకు టోకరా వేసిన ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరం వీఎల్పురం సత్యనారాయణపురం వీధికి చెందిన విశ్రాంత హార్లిక్స్ ఫ్యాక్టరీ మెడికల్ ఆఫీసర్ ఏలూరిపాటి శ్రీరామసూర్యప్రసాద్కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి వాట్సాప్ మేసేజ్ వచ్చింది. ఏఏ413 ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ నుంచి ప్రాతినిధ్యం వహించినట్లు నమ్మించాడు. సదరు గుర్తుతెలియని వ్యక్తి శ్రీరామసూర్యప్రసాద్ను ఖాతా తెరవమని బలవంతం చేసి, ఖాతా తెరిపించి ఆయనకు రూ.5,000 పంపాడు. ఆ వ్యక్తి తప్పుడు యాప్ను ఉపయోగించి ‘కష్టపడండి ఫలితం పొందండి ’ అంటూ ప్రత్యక్షంగా పెట్టుబడులు పెడితే మంచిలాభాలు ఉంటాయని నమ్మించడంతో శ్రీరామసూర్యప్రసాద్ ఈ నెల 5వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు దఫదఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1,53,48,000 పొగొట్టుకున్నారు. అవతలి వ్యక్తుల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో శ్రీరామసూర్యప్రసాద్ సైబర్క్రైమ్లో రిఫరన్స్ నంబర్ ద్వారా గురువారం సాయంత్రం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ పి.కాశివిశ్వనాథం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొబ్బరి చెక్క.. సిరులు పక్కా
● రత్నగిరిపై వేలం పాట ● నెలకు రూ.19.05 లక్షలకు ఖరారు ● సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానంలో కొబ్బరి ముక్కల వేలం రికార్డు ధరకు ఖరారైంది. గతంలో నెలకు రూ.7.26 లక్షలు ఉన్న వేలం ఈ సారి రూ.19.05 లక్షలు వెళ్లింది. అంటే దాదాపు మూడురెట్లు పెరిగి సత్యదేవునికి సిరులు కురిపించింది. అన్నవరం దేవస్థానం చరిత్రలో ఒక వేలం ఇంత ఎక్కువ మొత్తానికి వెళ్లడం ఇదే ప్రథమం. రెండేళ్ల కాలపరిమితికి గాను గురువారం ఈ వేలం జరిగింది. దేవస్థానంలో వ్రతాలాచరించే భక్తుల నుంచి సేకరించే కొబ్బరి చెక్కలతో పాటు రావిచెట్టు వద్ద, వివిధ ఆలయాల్లో భక్తులు కొట్టే కొబ్బరి చెక్కలను పోగుచేసుకునేందుకు గతంలో విడివిడిగా వేలం నిర్వహించేవారు. అయితే దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆ రెండింటికీ కలిపి గురువారం ఒకే వేలం జరిపారు. ఈ కార్యక్రమంలో నలుగురు పాటదారులు పాల్గొన్నారు. గతంలో రెండు వేలం పాటల్లో నెలకు రూ.7.26 లక్షలు ఆదాయం వచ్చింది. గురువారం జరిగిన వేలంపాటలో రికార్డు స్థాయిలో రూ.19.05 లక్షలకు వెళ్లింది. దీంతో దేవస్థానానికి తొలి ఏడాది రూ.2.28 కోట్లు, రెండో ఏడాది పది శాతం పెరుగుదలతో సుమారు రూ. 2.51 కోట్లు ఆదాయం రానుంది. అంటే రెండేళ్లకు రూ.4.80 కోట్లు ఆదాయం సమకూరనుంది. అలాగే బుకింగ్ ఆఫీసు ఎదురుగా గల షాపింగ్ కాంప్లెక్స్లోని మూడో నంబర్ షాపులో కొబ్బరి కాయలు, అరటిపండ్లు విక్రయించేందుకు గాను గతంలో నెలకు రూ.2.33 లక్షలు ఉండగా ఇప్పుడు ఆ వేలం పాట నెలకు రూ.3.78 లక్షలకు వెళ్లింది. ప్రకాష్ సదన్ సత్రం వెనుక మినీ క్యాంటీన్ వేలం నెలకు రూ.2.82 లక్షలకు వేలం ఖరారైంది. దేవస్థానం ఈఈ నూకరత్నం, ఏఈఓ ఎల్ శ్రీనివాస్, సీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకట రమణ తదితరులు వేలం నిర్వహించారు. -
ప్రాణం తీసిన చెట్టు
● ఉద్యోగానికి వెళుతుండగా కూలిన వృక్షం ● దుళ్ల యువకుడి మృతి కడియం: చెట్టు కూలి మీద పడడంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి వెళుతున్న యువకుడు మృతి చెందాడు. పాయకరావుపేట మండలం రాంభద్రపురం – శ్రీరాంపురం మధ్య ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన తొట్టా శ్రీనివాస్ (31) అనకాపల్లి జిల్లా కేశవరం డెక్కన్ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం తన క్వార్టర్స్ నుంచి స్నేహితుడితో కలిసి ఫ్యాక్టరీకి వెళుతున్నాడు. రాంభద్రపురం–శ్రీరాంపురం మధ్యకు వచ్చేసరికి ఓ భారీ వృక్షం కూలి వీరు వెళుతున్న మోటారు సైకిల్పై పడింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చెట్టు కింద ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం శ్రీనివాస్కు రెండేళ్ల క్రితమే వివాహమైంది. పెళ్లయిన తర్వాత ఆరు నెలలకు అనకాపల్లి జిల్లా కేశవరంలోని డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగం వచ్చింది. దీంతో తునిలోని బ్యాంక్ కాలనీలో భార్యతో సహా నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. అతడి హఠాన్మరణంతో వారంతా తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. కాగా.. దుళ్లలో మృతుడి కుటుంబాన్ని పలువురు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా హరికృష్ణ అన్నవరం: స్థానిక దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా డాక్టర్ అల్లు హరికృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పటి వరకు తుని అర్బన్ పీహెచ్సీలో పనిచేశారు. అక్కడ రాజీనామా చేసి అన్నవరంలో చేరారు. డాక్టర్ హరికృష్ణ అనస్థీషియాలో ఎండీ కూడా చేశారు. గతంలో దేవస్థానం ఆస్పత్రి వైద్యాధికారిగా పనిచేసిన శ్రీకాంత్ గత నెల 12న రౌతులపూడి ఆస్పత్రి డాక్టర్గా నియమితులవ్వడంతో ఈ పోస్టు అప్పటి నుంచి ఖాళీగా ఉంది. గత నెల 31న స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో దేవస్థానం ఆస్పత్రిలో వైద్యాధికారి లేక సకాలంలో వైద్యం లభించలేదు. వారి పరిస్థితి విషమించడంతో తుని ప్రభుత్వాస్పత్రికి పంపాల్సి వచ్చింది. ‘సాక్షి’ చొరవతో.. ఈ సమస్యపై ఆగస్టు ఏడున సాక్షి దినపత్రికలో ‘వైద్యం... పూజ్యం ’ శీర్షికన వార్త ప్రచురితమైంది. దానిపై స్పందించిన కమిషనర్ రామచంద్ర మోహన్ వెంటనే వైద్యుడిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. దీంతో డాక్టర్ హరికృష్ణను నియమించారు. ఆయన గురువారం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిశారు. -
అధిక భారం
విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను రాసేందుకు అసెస్మెంట్ బుక్లెట్లను వినియోగిస్తున్నారు. ఇది ఉపాధ్యాయులకు భారంగా ఉంది. బోధనకు కూడా సమయం సరిపోవడం లేదు. పూర్వపు పద్ధతిలోనే పేపరుపై జవాబులు రాసే విధానాన్ని అమలు చేయాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యతిరేకిస్తున్నాం ఉపాధ్యాయులకు పనిభారం పెంచేందుకే అన్నట్లుగా అసెస్మెంట్ బుక్లెట్లు ఉన్నాయి. పరీక్షా పత్రాలు కూడా విద్యార్థుల స్థాయికి మించి ఉన్నాయి. ఏ మాత్రం ఆమోదయోగ్యం కాని అసెస్మెంట్ బుక్లెట్ల విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తాం. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉపాధ్యాయులకే పరీక్ష పరీక్షల విధానంలో కొత్తగా తీసుకుని వచ్చిన మూల్యాంకన విధానం ఉపాధ్యాయులకే పరీక్షలా ఉంది. ఉపాధ్యాయులపై తీవ్రమైన పనిభారం పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలే మేలు అన్నట్లుగా ఉంది. దీన్ని మా సంఘం తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. – పి.నరేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆపస్ ఉపాధ్యాయ సంఘం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
ఎరువు.. ధరవు!
పెరవలిలో ఆకుమడికి ఎరువులు వేస్తున్న రైతు● అన్నదాతపై తప్పని ధరల భారం ● 50 కిలోల బస్తాపై రూ.320 వరకు పెంపు ● కూటమి పాలనలో రెండు సార్లు పెంచిన వైనం ● ఐదేళ్ల జగనన్న పాలనలో అన్నింటా అండగా నిలచిన ప్రభుత్వం పెరవలి: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వం ఆ బాధ్యత నెరవేర్చకపోగా అదనపు భారాలు మోపుతోంది. ప్రకృతికి ఎదురీది వ్యవసాయం చేస్తున్న రైతులను సంక్షోభంలోకి నెడుతోంన్నది. ఇప్పటికే సాగు ఖర్చులు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్న రైతులపై ఎరువుల రూపంలోనూ అధిక భారాన్ని మోపుతోంది. కూటమి పాలన ఏడాది కాలంలోనే రెండు సార్లు ఎరువుల ధరలు పెంచటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎరువుల ధరల పెరగటంతో రైతులు వ్యవసాయం చేయాలా లేదా వదలేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే వ్యవసాయంలో కూలీల దగ్గర నుంచి, అన్ని ఖర్చులు పెరిగిపోవటం, పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవటంతో రైతులు విలవిలలాడుతున్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులకు మిగులు లేక, ఒకొక్క సారి పెట్టుబడి సైతం కోల్పోతున్న రైతులకు అండగా నిలబడవలసిన పాలకులు ఏమీ పట్టనట్లు వ్యవహరించటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సాగు ఇలా జిల్లాలో 76,941 హెక్టార్లలో ఖరీఫ్ కాలంలో వరి సాగు చేస్తుండగా, 70 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటిలో కొబ్బరి 8,050 హెక్టార్లు, కోకో 5517 హెక్టార్లు, పామాయిల్ 20,219 హెక్టార్లు, అరటి 7,500 హెక్టార్లు, మామిడి 5,500 హెక్టార్లు, మొక్కజొన్న 1,500 హెక్టార్లు, కూరగాయ పంటలు 4,125 హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. ఇవి కాకుండా పొగాకు, బొప్పాయి, జామ, బత్తాయి, జీడిమామిడి వంటి పంటలు సాగు చేస్తున్నారు. పెరుగుతున్న ఎరువుల వినియోగం ఏటా ఖరీప్తో పాటు రబీలోను పంటల సాగుకు డీఏపీ, కాంప్లెక్స్, సూపర్ ఫాస్పేట్ వంటి ఎరువుల వినియోగం పెరిగిపోయింది. మోతాదుకు మించి రసాయనిక ఎరువుల వినియోగం పెరగడంతో పెట్టుబడి కూడ పెరిగింది. దీని ఫలితంగా దిగుబడి ఎంత వచ్చినా రైతులకు పెద్దగా ప్రయోజనం కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం 50 కిలోల ఎరువుల బస్తాపై రూ.50 నుంచి రూ.320 వరకు పెంచింది. జిల్లాలో ప్రతి మండలంలో సరాసరిన ఏడాదిలో సుమారు 4,500 టన్నుల నుంచి 15 వేల టన్నుల వరకు ఎరువులను వినియోగిస్తారని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. టన్నుపై కనిష్టంగా రూ.వెయ్యి నుంచి గరిష్టంగా రూ.4 వేల వరకు ఎరువుల ధరలు పెరగటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో చాలా మంది సన్న, చిన్నకారు రైతులు ఎరువుల దుకాణాల వద్ద అప్పు పెడుతున్నారు. దీనితో పంటలు వచ్చిన తరువాత అసలు, వడ్డీతో కలిపి అప్పు తీర్చాల్సిరావడంతో వచ్చిన ఆదాయం ఎరువుల దుకాణాల్లో బాకీలు తీర్చడానికే సరిపోతోందని రైతులు వాపోతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో అన్నీ అందుబాటులో.. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా ఎరువుల ధరలు పెంచలేదు సరికదా రైతులకు అన్నీ అందుబాటులో ఉంచారు. పెట్టుబడి సాయం కూడ పంట వేసే ముందే అన్నదాతకు అందించి వారిని అన్ని విధాలా ఆదుకున్నారు. అంతే కాకుండా ప్రకృతి వల్ల పంటలు దెబ్బతింటే రైతులకు పంట కాలంలోనే నష్ట పరిహారం అందించేవారు. ఇవే కాకుండా ఎరువులు, విత్తనాలు అన్ని ఆర్బీకేలో అందుబాటులో ఉంచేవారు. పొంతన లేని నేతల మాటలు జిల్లాలో యూరియా, డీఏపీ ఎరువులు అవసరానికి సరిపడా లభించటం లేదు. ఒకవేళ ఎక్కడైనా దొరికినా అధిక ధరలకు విక్రయించడంతో రైతులు దిక్కులేక అధిక ధరలకు కొనుగోలు చేసుకుంటున్నారు. ఎరువులు అందుబాటులో ఉన్నాయని ఒకసారి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువుల కోటాను సకాలంలో పంపించటం లేదని మరోసారి ప్రకటనలు గుప్పించటం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన ఎరువుల కోటాను రప్పించుకోవటంలో కూటమి సర్కారు విఫలమైందని చెప్పవచ్చు. ఎరువుల ధరలను ఆయా సంస్థలు ఇష్టానుసారం పెంచుకుంటూ పోతున్నా కూటమి సర్కార్ కనీస చర్యలు తీసుకోవటం లేదు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కనీసం సమావేశాలు ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. ఎరువుల కంపెనీలపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవటం వల్లే ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఎరువులు రూపాయలలో.. 50కిలోల పాత ధర కొత్త ధర పెరిగినది పొటాష్ 1,535 1800 265 10–26–26 1,470 1800 330 12–32–169 1,470 1720 250 16–16–16 1,450 1600 150 24–24–0 1,700 1800 100 20–20–13 1,300 1400 100 14–35–14 1,700 1800 100 15–15–15 1,450 1600 150 సూపర్ ఫాస్పేట్ 570 650 80బాబు పాలనలో ఎన్నో పాట్లు.. 2014–19లో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ఎరువుల ధరలు పెంచితే, ఈ ఏడాది పాలనలోనే రెండు సార్లు పెంచారు. ఈయన పాలనలో రైతులు పడేపాట్లు వర్ణనాతీతం. ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా రైతులు ఆందోళన చేస్తే గుర్రాలతో తొక్కించటమే కాకుండా ఐదుగురు ప్రాణాలు బలిగొన్నారు. అంతే కాకుండా వ్యవసాయం దండగ అంటూ నీతి వాక్యాలు వల్లించారు. ఇప్పుడు కూడా రైతులపై సవతి తల్లి ప్రేమ కురిపించమే కానీ నిజంగా రైతులను ఆదుకునే పనులు చేయటం లేదని రైతులు విమర్శిస్తున్నారు. రైతుకు అదనపు భారం కూటమి ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎరువుల ధర లు పెంచితే మేము వ్యవసా యం ఎలా చేయాలి? ఇప్పటికే వ్యవసాయంలో పెట్టుబడి ఎక్కువై గిట్టుబాటు లభించటం లేదు. ఈ పెంచిన ఎరువుల ధరల వల్ల ప్రతి రైతుకు ఒక ఎకరానికి రూ.3 వేల నుండి రూ.5 వేల అదనపు భారం పడుతోంది. – పిల్లా శ్రీనివాస్, రైతు, కొత్తపల్లి అగ్రహారం నడ్డివిరుస్తున్న ‘కూటమి’ కూటమి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదు. ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి రైతు నడ్డివిరుస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. రైతులను ఆదుకోలేకపోయినా కనీసం పంటలకు గిట్టుబాటు ధర ఇస్తూ, ఎరువుల ధరలు పెంచకుండా చూస్తే సరిపోతుంది. – వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు అన్నదాతతో ఆడుకోవద్దు పంటకు పెట్టుబడి ఎక్కువై మిగులు కనిపించటం లేదు. పెట్టుబడి వ్యయం అంతకంతకూ పెరిగిపోతోంది. దానికి తోడు ఎరువులు ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచి రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి కానీ ఆడుకోకూడదు. – లొల్ల నాగేశ్వరరావు, రైతు, పెరవలి -
18 నుంచి జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఈ నెల 18 నుంచి మండల పరిషత్తు, జిల్లా పరిషత్తులలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ఆ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపా రు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చే శారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతిపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని 240 మందికి బ్యాచ్ల వారీగా శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి ప్రారంభమయ్యే బ్యాచ్కు 60 మంది హాజరవుతారని, ఆయా కార్యాలయాల్లో కొత్తగా నియమితులైన వారికి ఈ శిక్షణ ఉంటుందన్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వారి విధులు, బాధ్యతలు, ఫైళ్ల నిర్వహణ, ప్రభుత్వ పథకాలు వంటి అంశాలను నిపుణులు వివరిస్తారన్నారు. జాతీయ హాకీ పోటీలకు ఉప్పాడ క్రీడాకారులు కొత్తపల్లి: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో జరిగే 15వ హాకీ ఇండియా జూనియర్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే మన రాష్ట్ర జట్టుకు ఉప్పాడకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు, హాకీ కోచ్ రవిరాజ్ గురువారం తెలిపారు. ధర్మవరంలో ఏప్రిల్లో జరిగిన రాష్ట్ర జూనియర్ హాకీ చాంపియన్ షిప్ పోటీల్లో ఉప్పాడకు చెందిన చొక్కా డేవిడ్, మేరుగు హెబెల్ ప్రతిభ కనబరిచి, చాంపియన్ షిప్కు సాధించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఈ క్రీడాకారులు స్కూల్ గేమ్ అండర్– 19 జాతీయ పోటీల్లో కూడా పాల్గొన్నారన్నారు. కాగా.. జాతీయ జూనియర్ హాకీ పోటీలు శుక్రవారం నుంచి జలంధర్లో ప్రారంభమవుతాయని, శనివారం జరిగే పోటీల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. -
విద్యుత్శాఖ సన్నద్ధం
కంట్రోల్రూమ్ ఏర్పాటు ఎస్ఈ తిలక్ కుమార్ రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలో కురుస్తున్న వర్షాలు, రాబోయే మూడు రోజుల్లో భారీ వర్ష సూచన నేపథ్యంలో, జిల్లా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పర్యవేక్షక ఇంజినీర్ కె.తిలక్ కుమార్ గురువారం ఆదేశాలిచ్చారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈపీ డీసీఎల్ చైర్మన్, కలెక్టర్ ఆదేశాల మేరకు, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు విద్యుత్ భవన్తో పాటు అన్ని డివిజన్ స్థాయిల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్లు సెంట్రలైజ్డ్ టోల్ ఫ్రీ నెంబర్ : 1912 జిల్లా స్థాయి (రాజమహేంద్రవరం): 0883–2463354, 73822 99960 డివిజన్ స్థాయి : 94906 10093, 94391 78874, 8332 973595 ఈ కంట్రోల్ రూమ్లు 24 గంటల విధానంలో పని చేయనున్నాయి. -
మది నిండా మువ్వన్నెల జెండా!
కంబాలచెరువు: స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాలలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశం కోసం పోరాడేలా మన ఆలోచన ఉండాలన్నారు. దేశభక్తి అభ్యున్నతికి, ప్రగతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుంచి నందం గనిరాజు సెంటర్, కంబాలచెరువు మీదుగా వెళ్లి తిరిగి కళాశాలకు చేరింది. ర్యాలీలో 57 మీటర్ల పొడవైన జాతీయ పతాకంతో విద్యార్థులు దేశభక్తితో కూడిన నినాదాలు చేశారు. ర్యాలీలో 4,500 మంది విద్యార్థులు, 200 మంది ఉపాధ్యాయులు, 50 మంది అధ్యాపకేతర సిబ్బంది, యూత్ రెడ్ క్రాస్ కో ఆర్డినేటర్ జి.రవితేజ, కో ఆర్డినేటర్ సుభాషిణీదేవి, మురళీకృష్ణ, ఎన్సీసీ కో ఆర్డినేటర్ అనూష పాల్గొన్నారు. -
వనామీపై సునామీ
ధరపై తీవ్ర ప్రభావం రొయ్యల లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వాటి కౌంట్లకు మంచి ధర రావడం సాధారణం. ఈసారి కూడా మంచి ధర వచ్చింది. పది రోజుల క్రితం రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. వంద కౌంట్ (కిలోకు వంద రొయ్యలు) ధర రూ.265 వరకు ఉండగా, 90 కౌంట్ రూ.275గా, 80 కౌంట్ రూ.295గా, 70 కౌంట్ రూ.325గా, 60 కౌంట్ రూ.345గా, 50 కౌంట్ రూ.375గా, 40 కౌంట్ రూ.395గా, 40 కౌంట్ రూ.440 వరకూ ఉండేది. ఈ సమయంలో ట్రంప్ రెండోసారి భారతీయ దిగుమతులపై 25 సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనిని తర్వాత 50 శాతానికి పెంచారు. ప్రస్తుతం 25 శాతం సుంకాలు అమలులో ఉన్నాయి. సుంకాల ప్రకటన తర్వాత వనామి రొయ్యల ధరలను కొనుగోలుదారులు మరోసారి తగ్గించేశారు. కౌంట్కు వచ్చి రూ.30 నుంచి రూ.50 వరకూ కోత పెట్టడం గమనార్హం. వంద కౌంట్ ధర రూ.235 వరకు తగ్గగా, 90 కౌంట్ రూ.245, 80 కౌంట్ రూ.265, 70 కౌంట్ రూ.285, 60 కౌంట్ రూ.305, 50 కౌంట్ రూ.325, 40 కౌంట్ రూ.345, 30 కౌంట్ రూ.390కి పడిపోయాయి. సాక్షి, అమలాపురం: ఓవైపు కొలుగోలుదారులు సిండికేటుగా మారి ధర పెరిగినప్పుడల్లా ఏదో కారణంతో తగ్గించేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దాడితో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. ఏడాది కాలంగా వనామీ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగిన ప్రతిసారీ ఏదోక ఉపద్రవం రావడం.. ధర పతనం కావడం పరిపాటిగా మారింది. ఎటువంటి ఇబ్బందులు లేకున్నా.. స్థానిక కొనుగోలుదారులు ధర తగ్గించి ఆక్వా రైతుల నడ్డివిరుస్తున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్ ప్రకటనతో మరోసారి వనామీ ధరలు తగ్గడం రైతుల్లో కొత్త ఆందోళనకు తెర తీసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తీర ప్రాంత మండలాల్లో వనామీ రొయ్యల సాగు అధికంగా సాగుతోంది. కాకినాడ జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో ఈసాగు ఉండగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో జరుగుతున్నట్టు అంచనా. ఆయా జిల్లాల్లో మొత్తం 23 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. మొదటి పంట పూర్తయి, రెండో పంటకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం కోనసీమ జిల్లావ్యాప్తంగా 20 శాతం మాత్రమే చెరువుల్లో వనామీ రొయ్యలున్నాయి. సందు దొరికితే.. అంతర్జాతీయంగా ఏ చిన్న సంఘటన జరిగినా దానిని బూచిగా చూపించి రొయ్యల ధరలు తగ్గించడం కొనుగోలుదారులకు పరిపాటిగా మారింది. వీరంతా సిండికేట్గా ఉండడంతో ఒకే మాటపై ధరలు తగ్గించేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో వనామీ రొయ్యలకు మంచి ధర పలికింది. మార్కెట్కు రొయ్యలు పెద్ద సంఖ్యలో వస్తూండడంతో కౌంట్కు రూ.20 చొప్పున ధర తగ్గించారు. ● ఏప్రిల్ తొలి వారంలో ట్రంప్ టారిఫ్ ప్రకటించగానే, దానిని అడ్డుపెట్టుకుని ధరలు భారీగా తగ్గించారు. కౌంట్కు రూ.60 వరకు ధర క్షీణించింది. తర్వాత సుంకాల విధింపు మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కానీ కౌంట్కు రూ.15 మాత్రమే ధర పెంచడం గమనార్హం. ● గత నెల నుంచి చెరువులు ఖాళీ అయి మార్కెట్కు రొయ్యల రాక తగ్గింది. దీంతో ధరలు మరోసారి పెరిగాయి. ఇదే సమయంలో ట్రంప్ సుంకాల ప్రకటన రైతులను కుదేలు చేసింది. వనామి ధరలు మరోసారి పతనమయ్యాయి. ● జిల్లా నుంచి ఎగుమతి అయ్యే వనామీ, సముద్రంలో దొరికే టైగర్, ఇతర రొయ్యలు 70 శాతానికి పైగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. గతంలో యన్టీ డంపింగ్ టాక్స్ 4.5 శాతం, డీవీడీ ట్యాక్స్ 5 శాతం చొప్పున మొత్తం 9.5 శాతం మాత్రమే టాక్స్ ఉండేది. దీనిపై అదనంగా 25 శాతం టాక్స్ను ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అంటే మొత్తం 34.9 శాతం టాక్స్ భారం పడుతోంది. ● వాస్తవంగా ట్రంప్ టారిఫ్ ప్రభావం మొదట పడేది అమెరికాలోని వినియోగదారులపైనే. ఇదే వంకతో కొనుగోలుదారులు ఇక్కడ రొయ్యల కొనుగోలు నిలిపివేశారు. ఇప్పుడు కేవలం 25 శాతం సుంకం ఉండగా, ఈ నెల 25వ తేదీ నుంచి 50 శాతం వసూలు చేయనున్నారు. దీంతో వనామీ ధరలు మరింత పతనం కానున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ● ఆగస్టు నెలాఖరు నుంచి రెండో పంటకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో వారిపై సుంకాల పిడుగు పడింది. దీంతో రైతులు సాగు విషయంలో పునరాలోచనలో పడ్డారు. 50 శాతం టారీఫ్ వల్ల ధరలు మరింత తగ్గితే.. సాగుకు తాత్కాలిక విరామం ఇచ్చేందుకూ వెనుకాడేది లేదంటున్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్ ధరలు ఇలా..కౌంట్ ఫిబ్రవరి మార్చి తొలిసారి సుంకాలు పది రోజుల రెండోసారి సుంకాలు రకం తొలి వారంలో తొలి వారంలో ప్రకటించాక... క్రితం మార్కెట్ ప్రకటించాక 30 470 465 425 440 390 40 415 390 340 400 345 50 375 365 320 375 325 60 345 335 300 345 305 70 320 300 295 325 325 80 285 270 255 295 265 90 265 250 235 275 245 100 255 240 225 265 235 సిండి‘కాటు’ నుంచి సుంకాల ‘వేటు’ వరకు మరోసారి రొయ్యకు కష్టకాలం ఏడాది కాలంగా ఒడిదొడుకులు రికార్డు స్థాయిలో ధర ఉన్నప్పుడు సిండికేట్ దెబ్బ రెండుసార్లు అమెరికా సుంకాల దాడి విదేశాలకు వెళ్లేది 50 కౌంట్ లోపు మాత్రమే.. టారిఫ్ పేరిట మొత్తం కౌంట్ల ధర కుదింపు ప్రస్తుతం సాగు 20 శాతమే.. ఉమ్మడి తూర్పున 23 వేల ఎకరాల్లో ఆక్వా సాగు -
భూ హక్కుల పరిరక్షణకే ‘రీ–సర్వే’
రాజానగరం: భూ హక్కుల పరిరక్షణ కోసమే ప్రభుత్వం ‘రీ–సర్వే’ నిర్వహిస్తోందని కలెక్టరు పి.ప్రశాంతి తెలిపారు. మండలంలోని తోకాడలో బుధవారం నిర్వహించిన ఆర్ఓఆర్ గ్రామసభలో రీ–సర్వే విధానం, ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కలిగించారు. దీనివల్ల అపరిష్కృతంగా ఉన్న భూ వివాదాలు తగ్గుతాయని, రికార్డుల కచ్చితత్వానికి తోడ్పడుతుందన్నారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్ మాట్లాడుతూ గ్రామ విస్తీర్ణం 4674.19 ఎకరాలు ఉండగా, రీ–సర్వే అనంతరం 4654.969 ఎకరాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. ప్రభుత్వ భూమి 341.65 ఎకరాలకు 341.052 ఎకరాలు, ప్రైవేట్ భూమి 4332.54 ఎకరాలకు 4313.91 ఎకరాలుగాను ఖరారైందని వివరించారు. కార్యక్రమంలో సర్వే అధికారి మోహనరావు, తహసీల్దారు జీఏఎల్ఎస్ దేవి, సిబ్బంది పాల్గొన్నారు. 15 నుంచి హ్యాండ్ బాల్ పోటీలు రాజానగరం: దివాన్చెరువులోని శ్రీప్రకాష్ విద్యానికేతన్లో శుక్రవారం నుంచి 18 వరకు సీబీఎస్ఈ సౌత్ జోన్ – 1 హ్యాండ్ బాల్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ల నుంచి 1200 మంది క్రీడాకారులు, 120 మంది కోచ్లు, మేనేజర్లు హాజరవుతారని శ్రీప్రకాష్ కరస్పాండెంట్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉచిత ప్రవేశాలకు మరో అవకాశం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు మరోసారి అవకాశం వచ్చింది. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు దదరఖాస్తులకు కల్పించినట్లు ఎస్ఎస్ఏ జిల్లా ఏపీసీ ఎస్.సుభాషిణి బుధవారం ఆ వివరాలను తెలిపారు. నివాసం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో ఈ ప్రవేశాలు ఉంటాయన్నారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్కు ఇది కొనసాగింపని పేర్కొన్నారు. ధరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 31న సీట్లు కేటాయిస్తారని, మరింత సమాచారానికి సీఎస్ఈ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో చూడవచ్చునని సుభాషిణి తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల విద్యాశాఖ జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనపరచిన పాఠశాలల నుంచి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ బుధవారం తెలిపారు. కాకినాడ జిల్లా నుంచి 5 పాఠశాలలకు ఈ అవార్డులు అందిస్తామన్నారు. 2025 సంవత్సరంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై పాఠశాల హెచ్ఎం, పీడీ సంతంకం చేసి ఈ నెల 18వ తేదీ లోపు కాకినాడలోని ఎస్జీఎఫ్ఐ కార్యాలయంలో కార్యదర్శి ఎల్.జార్జికి అందజేయాలని కోరారు. -
వర్జీనియా మరింత కుంగి!
గోపాలపురం: అంతర్జాతీయంగా వర్జీనియా పొగా కు ధరలు రోజు రోజుకూ దిగిపోతుండటం, నాలుగు రోజుల్లో కిలోకు రూ.20 పడిపోవడంతో రైతులు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. బుధవారం స్థానిక పొగాకు వేలం కేంద్రానికి వచ్చిన 1376 బేళ్లకు 1207 బేళ్లు కొనుగోలు చేయడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కిలోకు రూ.351 పలికిన పొగాకు బధవారం రూ.331కు పడిపోవడం, మేలు రకం పొగాకు మాత్రమే కంపెనీలు కొనుగోలు చేస్తూ మిగిలిన గ్రేడ్ను పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాదాలకుంట, వెదుళ్లకుంట గ్రామాల పొగాకు మేలు రకంగా భావిస్తుంటారు. దానికి కూడా సరైన ధర రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గరిష్ట ధర రూ.350, కనిష్ట ధర రూ.200, సరాసరి ధర రూ.331.26 పైసలు పలికింది. బుధవారం సరాసరి ధర రూ.299.83 పైసలు 14 పొగాకు కంపెనీలు వేలంలో పాల్గొన్నట్లు వేలం నిర్వాహణాధికారి కేవల్ రామ్ మీనా తెలిపారు. 116 రోజుల పొగాకు కొనుగోళ్లలో 92.70 మిలియన్ పొగాకు కొనుగోళ్లు జరిగాయన్నారు. ధర పడిపోయి రైతు కుదేలు -
ఏకధాటిగా.. కుండపోత!
పెరవలి: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. మూడు గంటల పాటు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు కురిసిన ఈ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం కాగా, పలు కాలనీలు నీటమునిగాయి. జిల్లాలో అత్యధికంగా బిక్కవోలు మండలంలో 22.8 మిల్లీ మీటర్లు కురవగా, పెరవలి, రంగంపేట మండలాల్లో 4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో మొత్తంగా 44.8 మిల్లీ మీటర్ల వర్షం కురవగా సగటున 2.4 మిల్లీ మీటర్ల వర్షం పండింది. పాఠశాలల నుండి వచ్చే విద్యార్థులు వర్షం ధాటికి పాఠశాలల్లోనే ఉండి రాత్రి 8 గంటల తరువాత ఇళ్లకు చేరుకున్నారు. పొలం పనులు చేసే కూలీలు, రైతులు వర్షం తగ్గిన తరువాతే ఇళ్లకు చేరుకున్నారు. ఇక చాగల్లు, నల్లజర్ల, నిడదవోలు, సీతానగరం, తాళ్లపూడి మండలాల్లో వర్షం కురవలేదు. గాలి లేకపోవటం వల్ల ఎక్కడ ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనల మేరకు బుధవారం నుంచి 18వ తేదీ వరకు వర్షాలు, గాలులు వంటి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో, అలాగే 10 మండలాలలో తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.కృష్ణ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. ఈ కంట్రోల్ రూములు 24 గంటల విధానంలో పని చేస్తూ, ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సాయం అందించేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు. ప్రజలు సంబంధిత కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించవచ్చు. జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ : 8977935611 సబ్ కలెక్టర్ కార్యాలయం : 0883–2442344 అనపర్తి : 9441386920 బిక్కవోలు : 9849903913 గోకవరం : 9491380560 కడియం : 9490884561 కొవ్వూరు : 9866778416 రాజమహేంద్రవరం రూరల్ : 0883–2416005 రాజమహేంద్రవరం అర్బన్ : 0883–2940695 రాజానగరం : 9494546001 రంగంపేట : 9177824924 సీతానగరం : 9177096888మండలాల వారీగా వర్షపాతం..మండలం మిల్లీ మీటర్లు బిక్కవోలు 22.8 రంగంపేట 4.0 పెరవలి 3.8 రాజానగరం 2.4 ఉండ్రాజవరం 2.2 గోకవరం 2.0 రాజమండ్రి రూరల్ 1.4 కొవ్వూరు 1.2 రాజమండ్రి అర్బన్ 1.2 అనపర్తి 1.0 కోరుకొండ 1.0 గోపాలపురం 0.8 కడియం 0.8 దేవరపల్లి 0.2 3 గంటల పాటు కురిసిన వర్షం పల్లపు ప్రాంతాలు జలమయం -
పీఎంవీబీఆర్వైతో ఉద్యోగి, యజమానులకూ ప్రయోజనాలు
రాజమహేంద్రవరం రూరల్: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎంవీబీఆర్వై) కింద నమోదు చేసుకుంటే ఉద్యోగికి అదనపు వేతనం, యజమానికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుందని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రాంతీయ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం రాజమహేంద్రవరంలోని పీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో ఈ పథకం అమలుపై క్రెడాయ్, ఇతర సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఈ పథకం ఆగస్టు ఒకటి నుంచి అమలులోకి వచ్చిందని చెప్పారు. తొలిసారి ఉద్యోగం పొందిన వ్యక్తి ఖాతాలో ఒక నెల ఈపీఎఫ్ వేతనాన్ని (బేసిక్+డీఏ) ప్రభుత్వం రెండు విడతల్లో జమ చేస్తుందన్నారు. గరిష్టంగా రూ.15 వేల వరకు పొందవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 1.92 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. యజమానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. కనీసం ఆరు నెలల నిరంతర ఉపాధి ప్రాతిపదికన నియమించుకున్న ప్రతి అదనపు ఉద్యోగికి యాజమాన్యాలకు నెలకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకం అందిస్తుందన్నారు. ఉద్యోగులకు ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా, యాజమాన్యాలకు వారి పాన్ అనుసంధానిత ఖాతాల ద్వారా చెల్లింపులు జరుగుతాయన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి 2027 జూలై 31 మధ్యన కల్పించిన ఉద్యోగాలకే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని వివరించారు. 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇందుకు రూ.99,446 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. 12 వేల కంపెనీలు రాజమండ్రి ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయ పరిధిలోని ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 12 వేల కంపెనీలు నమోదై ఉన్నాయని, తప్పనిసరిగా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రాంతీయ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల పీఎఫ్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని, జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు. నిర్మాణ రంగంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారని, వారంతా పథక పరిధిలో వచ్చేలా క్రెడాయ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్య నిధి సంస్థలో సభ్యత్వం తీసుకుని, కనీసం ఏడాది సర్వీస్ కలిగిన వారికి ప్రమాద బీమా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు లభిస్తుందని చెప్పారు. సహాయ పీఎఫ్ కమిషనర్లు యు.శ్రీనివాసరావు, రాధానాథ్ పట్నాయక్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కృష్ణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు వి.శేఖర్, షేక్ జబీనా, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, క్రెడాయ్ ప్రతినిధులు మురళి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కమిషనర్ వెంకటేశ్వర్లు -
29న ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఈ నెల 29న అమలాపురంలోని ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో నాలుగో యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు తెలిపారు. పోటీల పోస్టర్లను స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్లో సంఘ, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ల ప్రతినిధులు బుధవారం ఆవిష్కరించారు. ఉభయ గోదావరి జిల్లాల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు దాదాపు 200 మంది పవర్ లిఫ్టర్లు హాజరవుతారని శరత్బాబు తెలిపారు. సబ్ జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) విభాగాల్లో మొత్తం 30 కేటగిరీల్లో పోటీలు నిర్వహించనున్నట్టు సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి వివరించారు. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, ఒలింపిక్ పతకాలను అందజేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా కార్యదర్శి ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ కార్యదర్శి తిక్కిరెడ్డి శ్రీనివాసరావు, బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, పవర్ లిఫ్టింగ్ పోటీల ఆర్గనైజర్, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, సంఘ ప్రతినిధులు కల్వకొలను బాబు, తిక్కిరెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నారాయణ కళాశాలలో అగ్ని ప్రమాదం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం మోరంపూడి సమీపంలోని సాయినగర్లో ఉన్న నారాయణ కళాశాలలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం 8.30 సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, రాజమహేంద్రవరం అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణ కళాశాల నిర్వహిస్తున్న భవనంలో హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన సామగ్రిని సెల్లార్కు తరలించారు. బుధవారం ఉదయం సెల్లార్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అప్పటికే కళాశాలలో ఉన్న కొందరు విద్యార్థులను సిబ్బంది అప్రమత్తమై బయటకు పంపిచేశారు. అలాగే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించారు. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట, ఆర్యాపురం ఫైర్ స్టేషన్లతో పాటు, కొవ్వూరు అగ్నిమాపక శకటాలు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. సెల్లార్ అంతా మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో పరుపులు, ఫర్నిచర్, విద్యుత్ పరికరాలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.8 లక్షల నష్టం వాటిల్లింది. షార్ట్సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ఇలాఉండగా విద్యార్థులు కళాశాలకు వచ్చే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను వెనక్కు పంపేసినట్టు చెబుతున్నారు.షార్ట్సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అనుమానం -
మోటార్ సైకిళ్ల దొంగ అరెస్టు
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): వరుస మోటార్ సైకిళ్ల చోరీ కేసుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశ్నగర్ పోలీస్ స్టేషన్లో బుధవారం సెంట్రల్ జోన్ డీఎస్పీ కె.రమేష్బాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో ఎక్కువైన మోటార్ సైకిళ్ల చోరీలపై పోలీసులు దృష్టి సారించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ పోలీసు అధికారులకు నిర్దేశించారు. ప్రకాశ్నగర్ సీఐ బాజీలాల్ ఆధ్వర్యంలో బృందం నిఘా పెట్టింది. ఆర్టీవో కార్యాలయం సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా, కాకినాడ గాంధీనగర్కు చెందిన ఇంటి సురేంద్ర అనుమానాస్పదంగా పట్టుబడ్డాడు. అతడిని విచారణ చేయగా, జిల్లావ్యాప్తంగా బైక్ చోరీలు చేస్తూ, మరో వ్యక్తికి ఇస్తున్నట్టు చెప్పాడు. అతడిచ్చిన సమాచారంతో పిఠాపురానికి చెందిన కామిరెడ్డి ఏసుబాబును పోలీసులు అరెస్టు చేశారు. 2003 నుంచి సురేంద్ర బైక్ చోరీలు చేస్తున్నాడు. అతడిపై అనకాపల్లి, రామచంద్రపురం, కాకినాడ, పామర్రు పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయి. అతను బైక్ చోరీ చేస్తూ చివరిసారిగా గతేడాది రామచంద్రపురం పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చి తిరిగి దొంగతనాలు ప్రారంభించాడు. అతడికి స్టిక్కరింగ్ పని చేసే ఏసుబాబు పరిచయమయ్యాడు. ఖరీదైన బుల్లెట్లు, స్పోర్ట్ బైక్లు, స్కూటర్లను చోరీ చేసి, ఏసుబాబు ద్వారా సురేంద్ర అమ్మించేవాడు. రాజమండ్రి ప్రకాష్నగర్, త్రీటౌన్, బొమ్మూరు, కడియం, గోకవరం, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం పోలీస్స్టేషన్ల పరిధిలో దొంగిలించిన మొత్తం రూ.19 లక్షల విలువైన 18 వాహనాలను పోలీసులు రివకరీ చేశారు. నిందితులను పట్టుకున్న సీఐ బాజీలాల్, ఎస్సై జి.సతీష్, హెచ్సీ వి.నాగరాజు, సీహెచ్ శ్రీనివాసరావు, క్రైమ్ పోలీసులు కె.ప్రదీప్కుమార్, వీరబాబు, దుర్గప్రసాద్, శివప్రసాద్ను ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు రద్దు చేయాలిరాజానగరం: అధికార బలంతో ఏకపక్షంగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు రద్దు చేసి, కేంద్ర బలగాల రక్షణలో ప్రజాస్వామ్య బద్ధంగా తిరిగి నిర్వహించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అడబాల చినబాబు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, పోలీ సు బలగాలను దుర్వినియోగపర్చి, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి నిర్వహించిన ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా నిలుస్తాయన్నారు. ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్నా కనికరించకపోవడం ఇందుకు ఉదాహరణగా వ్యాఖ్యానించారు.● విక్రయించిన నిందితుడు కూడా.. ● 18 వాహనాలు స్వాధీనం -
దర్శనమంటూ శఠగోపం
జగ్గంపేట: తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇప్పిస్తానని నమ్మించి, మోసం చేసేందుకు యత్నించిన మోసగాడిని జగ్గంపేట పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను సీఐ వైఆర్కే శ్రీనివాస్ బుధవారం తన కార్యాలయంలో వెల్లడించారు. కోనసీమ జిల్లా గుడిమెల్లంక గ్రామానికి చెందిన జి.రాజ్కుమార్ అలియాస్ విజయ్కుమార్ అలియాస్ వంశీపై పలు చీటింగ్ కేసులున్నాయి. 2020–24 వరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అనేక చోట్ల పలు కేసులు నమోదయ్యాయి. ఇతడిపై సూర్యాపేట, తణుకు, కృష్ణలంక, పాలకొల్లు, నర్సాపురం, ఎల్బీ నగర్ (హైదరాబాద్) పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు ఉన్నాయి. గతంలో పాలకొల్లు, తణుకుల్లో నమోదైన కేసుల్లో ఇతడు అరెస్ట్ అయ్యాడు. సోషల్ మీడియా ద్వారా వ్యాపారాలు చేసే వారిని, ధనవంతులను లక్ష్యంగా చేసుకుని, వారికి తాను ప్రముఖ ప్రజాప్రతినిధుల పీఏగా పరిచయం చేసుకుంటూ సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతడు గోవా నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇదే క్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ పీఏగా గోకవరం మండలంలోని గోల్డ్ షాపు యజమాని పట్నాల నాగేంద్రకు ఫోన్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు ఇప్పిస్తానని చెప్పి, రూ.50 వేలు ఖర్చవుతాయన్నాడు. అనుమానం వచ్చిన నాగేంద్ర అప్రమత్తం కావడంతో.. రాజ్కుమార్ మోసం బయటపడింది. దీనిపై టీటీడీ మెంబర్ జ్యోతుల నెహ్రూ పీఏ ప్రసాద్ జగ్గంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు బుధవారం జగ్గంపేట వచ్చిన సందర్భంలో అరెస్టు చేశారు. ఇతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. అంతర్రాష్ట మోసగాడి అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు -
హెచ్ఐవీ పరీక్షల శాతాన్ని పెంచాలి
అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ భరతలక్ష్మి అమలాపురం టౌన్: ఏఆర్టీ కౌన్సిలర్లు హెచ్ఐవీ పరీక్షల శాతాన్ని పెంచాలని అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ సీహెచ్ భరతలక్ష్మి అన్నారు. జిల్లాలో హెచ్ఐవీ వ్యాప్తి చెందకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఏఆర్టీ కౌన్సిలర్లకు రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుని నుంచి నలుగురు భాగస్వాములను గుర్తించి, వారికి పరీక్షలు చేయాలని, వేరొకరికి వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ ఐ.ప్రభాకరావు, క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ గంటల ఆదిలింగం తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర పుటల్లో రక్తాక్షరాలు
ఆలయం వద్ద స్మారక స్థూపంకొత్తపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం విశిష్టత అమోఘమైంది. అశేష భక్తజన సంద్రంతో కోనసీమ తిరుమలగా వెలుగొందుతున్న ఈ క్షేత్రానికి సంబంధించి ఈ తరానికి తెలియని మరో ముఖ్య చరిత్ర కూడా ఉంది. ఇదే ఈ గడ్డపై దైవ భక్తులతో పాటు దేశభక్తుల ఉనికిని చాటుతోంది. వాడపల్లి గ్రామం చిన్నదైనా.. ఇక్కడి నేల పొరల్లో దశాబ్దాల క్రితం త్యాగాలను నాటి.. రక్తాన్ని ధారపోశారు. ఇవన్నీ భారతావని కోసం.. జాతి విముక్తి కోసం. అప్పట్లో దేశంలో ఎన్నో త్యాగాలు చేసిన అనేక పల్లెలుంటే.. అందులో వాడపల్లి ప్రత్యేకతను సంతరించుకుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. చరిత్ర పుటల్లో వాడపల్లిలో దేశభక్తులపై బ్రిటిష్ వారి దాష్టీకం, ఆంగ్లేయులకు ఎదురెళ్లి రక్తం చిందించిన త్యాగధనులను స్మరించుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులపై ఉంది. రథంపై జాతీయ జెండా ఎగరేసినందుకు.. 1931 మార్చి 30 చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినం. వాడపల్లిలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం సందర్భంగా రథోత్సవం జరగనుంది. ఆరోజు మాతృదాస్య శృంఖలాల విమోచనోద్యమ రథసారథి బాపూజీ శంఖారావానికి ప్రతిస్పందించిన స్వాతంత్య్ర సమరయోధులు.. బ్రిటిష్ పాలకుల నిరంకుశ పాలనను సంఘటితంగా ప్రతిఘటించిన పవిత్ర దినం. రథోత్సవ వేడుకల్లో భక్తితో పాటు, దేశభక్తినీ చాటేందుకు రథంపై బాపూజీ చిత్రపటాన్ని ఉంచి, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. శత్రు స్థావరంపైకి దండెత్తుతున్న సైనికుల్లా పల్లె ప్రజలు పెద్ద ఎత్తున కదలివచ్చారు. అసువులు బాసిన సమరయోధులు అప్పటి రాజమండ్రి డీఎస్పీ ముస్తఫా ఆలీఖాన్ కరుడుగట్టిన బ్రిటిష్వాది. అతను అప్పటికే సీతానగరంలోని గాంధీ ఆశ్రమాన్ని చిన్నాభిన్నం చేసి, అక్కడి వారిని రక్తమోడేలా కొట్టడంతో బ్రిటిష్ అధికారుల మన్ననలు పొందాడు. ఇక్కడ అతడే రంగంలోకి దిగాడు. రథంపై జెండాను తీసేయాలని, గాంధీ చిత్రాన్ని తొలగించాలని దేశభక్తులను హెచ్చరించాడు. అతడి హెచ్చరికలకు వారెవ్వరూ వెనక్కి తగ్గకుండా, రథాన్ని ముందుకు నడిపించారు. ఈ తరుణంలో గాల్లో కాల్పులు జరిపినా.. ఎవరూ బెదరలేదు. పరిస్థితి చేజారుతుందని గ్రహించిన ఆలీఖాన్.. దేశభక్తులపై తన బలగాలతో తూటాల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ఎందరో అమరులయ్యారు. మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. అయినా దేశభక్తులు ప్రాణభయంతో పారిపోలేదు. బ్రిటిష్ సైనికులపై తిరగబడ్డారు. దీంతో ఆలీఖాన్ అక్కడి నుండి తప్పించుకున్నాడు. కొత్తపేట తాలూకాకు చెందిన కరటూరి సత్యనారాయణ, పాతపాటి వెంకటరాజు, వాడపల్లి గంగాచలం అమరులయ్యారు. అలాగే బండారు నారాయణస్వామికి బుల్లెట్ గాయాల కారణంగా రెండు కాళ్లు తొలగించినా ప్రాణం దక్కలేదు. సమరయోధులపై కేసులు ఆ స్వాతంత్య్ర ప్రతిఘటనను కుట్రగా పేర్కొని, ఆనాటి సమరయోధులైన నంబూరి జగ్గరాజు, నామన బాపన్న, పెన్మెత్స సత్యనారాయణ రాజు, దాట్ల సత్యనారాయణ రాజు, పెన్మెత్స వెంకట నరసింహరాజు, చేకూరి సూర్యనారాయణ రాజు, చేకూరి రామరాజు, ముదునూరి గనిరాజు, మెర్ల శాస్త్రులు, సాగిరాజు వెంకట సుబ్బరాజు, సాగిరాజు వెంకటరాజు, తూము వెంకన్న, ముదునూరి నారాయణరాజు, ఇందుకూరి సూర్యనారాయణ రాజు, సఖినేటి సుబ్బరాజు, నంబూరి తాతరాజు, దంతులూరి లక్ష్మీపతి రాజు, పడాల సుబ్బారెడ్డి, దండు జగ్గరాజు, ముదునూరి సుబ్బరాజు, మైపాల రామన్న, ఇందుకూరి రామరాజు, ముదునూరి సూర్యనారాయణ రాజు, మద్దిపాటి సత్యనారాయణను బ్రిటిష్ పోలీసులు దోషులుగా చిత్రించారు. అయితే పోలీసుల అభియోగం దారుణమని, దోషులుగా పేర్కొన్న వారంతా నిర్దోషులని 1931 నవంబర్ 23న జిల్లా న్యాయాధిపతులు జస్టిస్ కేపీ లక్ష్మణరావు, జస్టిస్ ఎంఆర్ శంకరయ్య తీర్పు చెప్పారు. నిందితులకు అండగా ఈ కేసు సాక్షులను కళా వెంకట్రావు సేకరించారు. వాడపల్లి క్షేత్రంలో స్వాతంత్య్ర పోరాటం వెంకన్న కల్యాణోత్సవ రథంపై జెండా ఎగురవేశారని దేశభక్తులపై బ్రిటిష్ వారి కాల్పులు అమరులైన అనేక మంది.. మరెందరో క్షతగాత్రులు ఆనాటి సంఘటనకు సాక్షిగా ఆలయం వద్ద స్మారక స్థూపం భక్తులు తిలకించేలా వెలుగులోకి తెచ్చే ప్రణాళిక వాడపల్లిలో జరిగిన ఆ వీరోచిత సంఘటన బ్రిటిష్ వారినే ఆశ్చర్యపరచింది. ఆ ఘటనలో అసువులు బాసిన అమర వీరులు, క్షతగాత్రులు రక్తం చిందించిన ఆ పవిత్ర ప్రదేశంలో నిర్మించిన స్మారక చిహ్నమే ఈ స్థూపం. వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం ముందు స్వాతంత్య్ర సమరయోధుల శిలాఫలకాన్ని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే మంతెన వెంకటసూర్య సుబ్బరాజు (ఎంవీఎస్ సుబ్బరాజు) నెలకొల్పారు. దానిని 1987 అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. సుందరమైన పార్కు ఆలయానికి ఎదురుగా ఏడు వారాలు–ఏడు ప్రదర్శనలు చేసే మార్గంలో ఉన్న ఈ స్థూపాన్ని మార్చడానికి దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రదేశం నుంచి స్మారక స్థూపాన్ని కొత్తగా నిర్మిస్తున్న కోనేరు వద్ద ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్కుమార్, ప్రజాప్రతినిధుల దృష్టిలో పెట్టారు. వారు సానుకూలంగా స్పందించి, అనుమతులు ఇచ్చారు. భక్తులకు ఈ క్షేత్రంలో దేశభక్తుల విశిష్టతను తెలియజేసేలా సుందరమైన పార్కును నిర్మించి, మధ్యలో స్మారక స్థూపానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించేలా ప్రణాళిక రూపొందించనున్నారు. ఇన్నాళ్లూ ఓ పక్కన ఉన్న స్మారక స్థూపాన్ని వెలుగులోకి తెచ్చే ప్రక్రియకు ఈ నెల 15 తర్వాత శ్రీకారం చుట్టనున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ, పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
మస్కట్ నుంచి ఇండియా చేరిన బాధితురాలు
అమలాపురం రూరల్: మస్కట్ దేశంలో చిత్రహింసలు పడుతున్న మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు క్షేమంగా ఇండియాకు రప్పించారు. తన భార్యను రప్పించాలని కొత్తపేటకు చెందిన సాక చంటి కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్లో ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాలతో మరియమ్మను ఇండియాకు రప్పించినట్టు డీఆర్ఓ, కేంద్ర నోడల్ అధికారి కొత్త మాధవి తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భర్త, ఇద్దరు బిడ్డలను విడిచి మరియమ్మ విదేశాలకు వెళ్లింది. కోటిపల్లికి చెందిన వ్యక్తి కొంత సొమ్ము తీసుకుని ఈ ఏడాది జూన్ మూడున ఆమెను హైదరాబాద్ నుంచి మస్కట్ దేశానికి విమానం ఎక్కించాడు. అక్కడ పనిచేసే ఇంట్లో ఆమెకు సరైన భోజనం, వసతి కల్పించక, శారీరకంగా, మానసికంగా వేధించారు. దీనిపై ఆమె ఓ వీడియో విడుదల చేసింది. తన ఆరోగ్యం క్షీణిస్తుందని, అక్కడ ఉంటే చనిపోయే అవకాశం ఉందని సారాంశం. వెంటనే ఆమె భర్త చంటి కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. కేసీఎం సిబ్బంది ఆ ఏజెంట్ను పిలిపించి, ఇరుపక్షాలను కూర్చోబెట్టి, మరియమ్మ ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేశారు. -
కార్డియాక్ అరెస్ట్ కేసుల నేపథ్యంలో సీపీఆర్ శిక్షణ అవసరం
రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచ వ్యాప్తంగా, భారతదేశంలో కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతున్నందున సీపీఆర్ శిక్షణ చాలా అవసరమని, ఎలాంటి సమయంలోనైనా తక్షణమే ప్రతిస్పందించగలిగే ఈ సీపీఆర్ నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. మంగళవారం కాతేరులోని తిరుమల విద్యాసంస్థల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు సీపీఆర్పై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ సీపీఆర్ అనేది గుండెపోటు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయిన వ్యక్తికి సహాయం చేసే ప్రక్రియ అన్నారు. రోటరీ క్లబ్ రివర్ సిటీ ప్రెసిడెంట్ ఎల్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి, ఒత్తిడి స్థాయిలు పెరగడంతో యువకుల్లో సైతం కార్డియాక్ అరెస్ట్ ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. గుండె ఆగిన మనిషిని దగ్గరలో గల హాస్పిటల్కు తీసుకుని వెళ్లేలోగా అతనికి సీపీఆర్ చేస్తే తిరిగి గుండెను పనిచేయవచ్చునని తెలిపారు. సీపీఆర్ ఎలా చేయాలో డాక్టర్ వేణుగోపాల్నోరి, డాక్టర్ ప్రియాంక తెలిపారు. రోటరీ క్లబ్ రివర్ సిటీ సెక్రటరీ ఎ.దీపిక, పీడీపీ భాస్కరరామ్, ఏజీవీవీఎస్ కృష్ణారావు, జోనల్ కమ్యూనిటీ చైర్పర్సన్ ఎస్.నాగేంద్రకిషోర్, తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి సంసిద్ధత
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ పశ్చిమ రాజగోపురం ముందు భారీ విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీవీ రవికుమార్ దేవస్థానానికి మంగళవారం లేఖ పంపించారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో 125 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పున 12,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో టెన్సిల్ షెడ్డు నిర్మించేందుకు ఆ సంస్ధ ముందుకొచ్చింది. సుమారు 3 వేల మంది భక్తులు ఈ షెడ్డులో సేద తీరే అవకాశం ఉంది. రాత్రి వేళ కూడా విశ్రాంతి తీసుకునే వీలుంటుంది. వసతి గదుల కోసం భక్తుల నుంచి ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ షెడ్డులో భక్తుల కోసం వ్రతాలు, దర్శనం, ప్రసాదం కౌంటర్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. పెద్దపెద్ద హెలికాప్టర్ ఫ్యాన్లు కూడా అమర్చనున్నారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దృష్టికి తీసుకువెళ్లి, షెడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నవరం దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ పశ్చిమ రాజగోపురం ఎదురుగా నిలువ నీడ లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలంలో అక్కడి చెట్ల కిందనే తలదాచుకోవల్సిన దుస్థితి. అదే వర్షాకాలమైతే తడిసి ముద్దవుతున్నారు. షెడ్డు నిర్మాణం జరిగితే భక్తులకు ఈ బాధలు తప్పుతాయి. 22న ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు శ్రావణ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సత్యదేవుని సన్నిధిలో సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. -
రాష్ట్రంలో వైద్యుల కొరత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లోని సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో 59 శాతం ఖాళీలు ఉన్నాయని, ఆయా విభాగాల్లో డాక్టర్ల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్లో చిన్న పిల్లల ఐసీయూలతో నిర్మించిన రెండంతస్తులను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కింద కేంద్రం అందించే రూ.11 కోట్లతో వీటిని నిర్మించామన్నారు. రెండో అంతస్తులో పీడియాట్రిక్ ఐసీయూ, ఎన్ఐసీయూ, స్టెప్ డౌన్ హెచ్డీయూ విభాగాలు, 25 పడకలతో రెండు వార్డులు, మూడో అంతస్తులో నవజాత శిశువుల సంరక్షణకు ఉద్దేశించిన ఎస్ఎన్సీ–1, ఎస్ఎన్సీ–2 తల్లుల వార్డు, ఈఎన్టీ, చర్మవ్యాధుల కేంద్రం ఉన్నాయని వివరించారు. పిల్లల వార్డులో 75, తల్లుల వార్డులో 25 చొప్పున పడకలు ఏర్పాటు చేశామన్నారు. రాజమహేంద్రవరం ఆసుపత్రిలో ఓపీ కౌంటర్లను 4 నుంచి 22కు పెంచామన్నారు. వీల్ చైర్లు ఏర్పాటు చేశామని, మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపరిచామని చెప్పారు. వచ్చే నెల నుంచి రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ వంటి వాటిని గుర్తించేందుకు ఎన్సీడీ–3 సర్వే ప్రారంభిస్తున్నామని చెప్పారు. క్యాన్సర్ల నివారణకు ప్రముఖ ఆంకాలజిస్ట్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలు అందిస్తున్నారన్నారు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు రూ.352 కోట్లు విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ వెంకటేష్, సూపరింటెండెంట్ డాక్టర్ జి.రాజశేఖర్ కెనడీ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కొన ఊపిరికి కొత్త ఊపిరి
వైద్య విద్యార్థుల పరిశోధన లక్ష్యంగా.. కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, ఆలయ శిల్పి పెద్దింశెట్టి సూర్యనారాయణమూర్తి (91) 2021 డిసెంబర్ 8న వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆయన జీవించి ఉండగానే 2009 నవంబర్ 22న కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు దేహదాన ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆ మేరకు సూర్య నారాయణమూర్తి దేహాన్ని కళాశాలకు అప్పగించారు. పిఠాపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, వజ్రాయుధం పుస్తక రచయిత ఆవంత్స సోమసుందర్ 2016 ఆగస్టు 12న వృద్ధాప్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు దేహాన్ని అప్పగించారు. పిఠాపురం పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) తానూ, తన భార్య అనూరాధ ఇద్దరూ తమ దేహాలను వైద్య కళాశాలకు రాసి ఇచ్చారు. కాగా 2022 ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే రోజున సత్యనారాయణశాస్త్రి గుండెపోటుతో మరణించగా కుటుంబ సభ్యులు రాజానగరం జీఎస్ఎల్ కళాశాలకు దేహాన్ని అప్పగించారు. ఆ స్ఫూర్తితో అదేరోజు సత్యనారాయణ శాస్త్రి కుమారుడు గౌరవ్, కోడలు కల్యాణిలు తమ దేహాలను దానం చేసేందుకు ఒప్పంద పత్రాలను రాసి ఇచ్చారు. ● ధన్య చరితులు.. పుణ్యమూర్తులు ● వారి త్యాగం చైతన్యానికి ప్రతీక ● కన్ను మూస్తూ.. మరొకరికి జన్మనిస్తున్న దాతలు ● నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం కపిలేశ్వరపురం: ఆలోచన అయినా ఆచరణ అయినా బొందిలో ప్రాణం ఉన్నంత వరకే. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకొన్న సామాజిక అవగాహనతో కూడిన నిర్ణయాలు మరణించిన వ్యక్తిని మరెన్నో తరాలు జీవించేలా చేస్తాయి. అలాంటి కోవలోకి వచ్చే అవయవదానం సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎంతోమంది తమ అవయవాలను దానం చేసి ఎంతోమందికి ప్రాణం పోశారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ కథనం... పెరిగిన అవసరం భారతదేశంలో అవయవాలు సకాలంలో అందుబాటులో లేక రోజుకు 20 మంది చొప్పున చనిపోతున్నారని అంచనా ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒకరు అవయవ మార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉంది. అవయవాలు అవసరమైన వారిలో పది శాతం మందికి కూడా అవి లభ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవయవదానం ప్రాధాన్యం పెరిగింది. సాహితీవేత్తలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరణానంతరం తమ దేహాలను దానం చేస్తూ అంగీకార పత్రాలను రాసిన చరిత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి ఉంది. చేయడం ఇలా.. దాతలు జీవిస్తూనే వారి అవయవాలలో కొంత భాగాన్ని దానం చేస్తూ ఇతరులకు ఊపిరి పోస్తున్నారు. రక్తాన్ని, 50 శాతం కాలేయాన్ని, రెండింటిలో ఒక కిడ్నీని ఇతరులకు దానం చేయడం ఈ కోవలోనివే. మరొక పద్ధతిలో వారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల నిర్ణయంతో అవయవాలు దానం చేస్తున్నారు. బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల్లో మొత్తం రెండు కిడ్నీలను, గుండెను, కాలేయాన్ని, ఊపిరితిత్తులను, ప్యాంక్రియాసిస్ గ్రంధిని వాటి పనితీరు సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు దానం చేస్తున్నారు. తన దేహాన్ని మరణానంతరం వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధన కోసం కళాశాలకు అప్పగించాలంటూ కొందరు ముందస్తు ఒప్పంద పత్రాన్ని రాస్తున్నారు. సహజ మరణం పొందిన వారి నుంచి కార్నియా, చర్మం, ఎముక, గుండె కవాటాలు, రక్తనాళాలు దానం చేసే వీలు ఉంది. చిరంజీవులయ్యారు మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కాకర శ్రీనివాసరావు ఈ ఏడాది జూలై 12న గుండెపోటుతో మృతిచెందగా ఆయన నేత్రాలను అనపర్తి రాధాకృష్ణ ఐ బ్యాంక్కు దానం చేశారు. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన ధూలిపూడి సీతారాం అనే మహిళ ఈ ఏడాది జులై 1న గుండె పోటుతో మరణించగా నేత్రదానం చేశారు. తాళ్లరేవు మండలం వూడా హిమావతి ఈ ఏడాది జనవరి 26న గుండెపోటుతో మరణించడంతో రెండు నేత్రాలను కాకినాడ బాదం ఐ బ్యాంక్కు దానం చేశారు. ద్రాక్షారామ పద్మ స్టూడియో అధినేత కె.వీర్రాజు ఈ ఏడాది మే 28న మృతి చెందగా కాకినాడ రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు రెండు కార్నియాలను దానం చేశారు. కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పలపకూర వెంకట్రావు ఏడాది ఏప్రిల్ 26న గుండెపోటుతో మరణించగా కాకినాడ రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు రెండు కార్నియాలను దానం చేశారు. కె.గంగవరం గ్రామానికి చెందిన చింత చిన్నారి ఈ ఏడాది ఫిబ్రవరి 27న మృతి చెందగా రెండు నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానం చేశారు. నాన్న స్ఫూర్తితో దేహదానం చేశాం నాన్న మానవ సమాజం పట్ల అవగాహనతో జీవించారు. నా చిన్ననాటి నుంచీ అనేక విషయాలు బోధించారు. ఆయనతో పాటు అమ్మకు అవగాహన కల్పించి ఆమె దేహాన్ని కూడా దానం చేసేందుకు చైతన్య పర్చారు. ఆ స్ఫూర్తితో నేను, నా జీవిత భాగస్వామి కల్యాణి కూడా దేహదానం చేసేందుకు పత్రం రాశాం. – మేకా గౌరవ్, పిఠాపురం, కాకినాడ జిల్లాబ్రెయిన్ డెత్ కావడంతో... మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన యువకుడు నున్న శివన్నారాయణ (శివ) ఈ ఏడాది మే 25న రాజమహేంద్రవరం – ద్వారపూడి రహదారిలో ప్రమాదానికి గురికావడంతో బ్రెయిన్ డెత్ అయ్యింది. కుటుంబ సభ్యుల నిర్ణయంతో కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో అతని అవయవాలను దానం చేయడం ద్వారా ముగ్గురికి జీవితాన్ని ప్రసాదించాడు. లివరు, ఒక కిడ్నీని ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి, మరో కిడ్నీని విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చారు. రెండు నేత్రాలలోని కార్నియాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కు దానం చేశారు. -
ఆ 25 గ్రామాల పరిస్థితేమిటి?
ఆదాయం రావడం లేదనే కారణంతో జిల్లావ్యాప్తంగా 25 గ్రామాలకు కనీసం పల్లెవెలుగు బస్సులను కూడా ఆర్టీసీ నడవడం లేదు. రాజమహేంద్రవరం డిపో పరిధిలో 12, గోకవరం పరిధిలో 4, కొవ్వూరు 8, నిడదవోలు డిపో పరిధిలో 5 గ్రామాలకు ఆర్టీసీ బస్సు వెళ్లడం లేదు. ఆయా గ్రామాల ప్రజల తమ ప్రయాణాలకు ఆటోలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆయా గ్రామాల ప్రజల పరిస్థితేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఉన్న పల్లె వెలుగు సర్వీసులను ఉచిత స్కీమ్కు వినియోగిస్తే జిల్లాలోని ఏ గ్రామీణ ప్రాంతానికీ బస్సులు నడిచే పరిస్థితులుండవని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఆలోచనలకు పదును పెడితే నూతన ఉత్పత్తులు
రాజానగరం: ఆలోచనలకు పదును పెడితే నూతన ఉత్పత్తుల తయారీకి అవకాశం ఉంటుందని, తద్వా రా దేశాభివృద్ధి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్లోని మేడివాలీ ఇంక్యుబేషన్ కౌన్సిల్ శాస్త్రవేత్త డాక్టర్ కుష్వంత్ కుమార్ శీరంరెడ్డి అన్నారు. స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) లో మంగళవారం నిర్వహించిన ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ డే ప్రోగ్రామ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినూత్న ఆలోచనలను ఉత్పత్తులుగా మార్చడంలో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అంకుర పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతులు సమకూర్చడమే తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో రెండు వేల వరకూ అంకుర పరిశ్రమలు ఉన్నాయని, ముఖ్యంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన స్టార్టప్స్కు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అనకాపల్లి రూరల్ ఇన్క్యూబేషన్ సెంటర్ సీఈఓ శ్రీరామ్ భగవతుల మాట్లాడుతూ జిల్లాలోని పారిశ్రామిక అవకాశాల గురించి ప్రస్తావిస్తూ, స్థానిక యువత పరిసరాలలోని సమస్యలను సాంకేతిక సాయంతో పరిష్కరించే దిశగా ఆలోచించాలని సూచించారు.కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జీజీయూ చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ కొత్త ఆలోచనలతో ఉత్పత్తులను తీసుకురావడం, వాటికి మార్కెట్ చేయడం ద్వారా భవితకు బంగారు బాట వేసుకునే ప్రయత్నం చేయాలన్నారు. ప్రొ.చాన్సలర్ కె.శశికిరణ్వర్మ యూనివర్సిటీ ప్రాంగణంలో 25 వరకు అంకుర పరిశ్రమల ఏర్పాటుకు రిజిస్టర్ అయ్యాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఎస్ఆర్డబ్ల్యూ వాణిధర్, జీజీయూ వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ఇన్నోవేషన్ డైరెక్టర్ డాక్టర్ వై.మురళీధరరెడ్డి, వాద్వానీ ఫౌండేషన్ డైరెక్టర్ దయాకర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
157 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 157 అర్జీలను స్వీకరించారు. ఆనంతరం ఏపీ అమరావతి ఓపెన్ స్కూల్ (సార్వత్రిక పీఠం) ద్వారా జారీ చేసిన ఉత్తీర్ణత ధ్రువపత్రాన్ని కలెక్టర్ పి.ప్రశాంతి, తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామానికి చెందిన దివ్యాంగురాలు లావణ్య లక్ష్మికి అందజేశారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ఇటీవల జరిగిన 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 500 మార్కులకు 345 మార్కులు 69 శాతంతో సాధించి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన లావణ్య లక్ష్మీని అభినందించారు. ఆమె చదువును కొనసాగించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఆమెకు ప్రభుత్వం ద్వారా ప్రతినెలా రూ.15,000 పెన్షన్ అందిస్తున్నట్లు వివరించారు. పోలీసు పీజీఆర్ఎస్కు 31 అర్జీలు రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్, కొట్లాట, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ డి.నరసింహకిషోర్ తెలిపారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్.బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఎల్.అర్జున్తో కలసి ఆయన పీజీఆర్ఎస్ నిర్వహించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి కష్టాలను, బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. టీసీఐఎల్తో నన్నయకు ఒప్పందం రాజానగరం: న్యూఢిల్లీలోని టీసీఐఎల్ కంపెనీతో ఆదికవి నన్నయ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జరిగిన సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, టీసీఐఎల్ ప్రతినిధి ఆదిత్య సంతకాలు చేసి, వాటిని పరస్పరం మార్చుకున్నారు. వీసీ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ (పీఎం ఉష) పథకంలో భాగంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసే ల్యాబ్స్, టెక్నాలజీ సపోర్టు కోసం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. కార్యక్రమంలో పీఎం ఉషా కోఆర్డినేటర్ డాక్టర్ కె.రమణేశ్వరి, ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ మెంబర్స్ ఆచార్య కేఎస్ రమేష్, ఆచార్య డి.జ్యోతిర్మయి, డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ పి. విజయనిర్మల పాల్గొన్నారు. జీజీహెచ్లో మత కార్యకలాపాలపై నిషేధం అధికారులు, సిబ్బందికి సర్క్యులర్ జారీ కాకినాడ క్రైం: జీజీహెచ్లో ఎప్పటికప్పుడు తీవ్ర వివాదాలకు కారణమవుతున్న మత కార్యకలాపాలపై నిషేధాన్ని విధిస్తూ కలెక్టర్ షణ్మోహన్ సూచనలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్సీ.నం.18/ఏవో/2025తో సర్క్యులర్ జారీ చేశారు. అంతకుముందు హెడ్ నర్సులు, ఆసుపత్రి అధికారులతో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ సూత్రాలకు లోబడి లౌకికవాదం అనుసరించాల్సిన ఆసుపత్రి, ఆవరణలో, తటస్థత, సమగ్రత తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్డులు, కార్యాలయాలతో పాటు ఆసుపత్రి సంబంధిత ఇతర ప్రాంతాలలో మతపరమైన కార్యకలాపాలు అంటే పూజలు, ప్రార్థనలు, ఉత్సవాలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రచారాలు, బోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం, వాటిలో పాల్గొనడం పూర్తిగా నిషేధం. మత సంబంధిత పుస్తకాలు, కరపత్రాలు, బ్యానర్లు, చిత్రాలు, వాల్ పోస్టర్లు చూపడం, పంచడం చేయకూడదు. -
లెఫ్ట్ అయినా రైటే..
● ఎడమ చేతి వాటం జాబితాలో ఎందరో ప్రముఖులు ● కళా, క్రీడా, సంగీత, రాజకీయ రంగాల్లో అద్భుత రాణింపు ● రేపు లెఫ్ట్ హ్యాండర్స్ డే రాయవరం/బిక్కవోలు: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అన్నాడో సినీ కవి. కుడి ఎడమైతే గ్రహపాటు కాదోయ్ అంటున్నారు లెఫ్ట్ హ్యాండర్స్. మానవ శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుంది. ఎడమ చేతితో రాసేవారు తమ హదయ స్పందనను కచ్చితంగా అక్షర బద్ధం చేయగలరని ప్రముఖ విద్యా, మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ప్రపంచంలో ఉన్నత పదవులు అలంకరించిన వారిలో సగానికి పైగా ఎడమ చేతి వాటం వారే. బుధవారం ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. భిన్నమైన శైలి సాధారణంగా ఏ పనైనా కుడి చేత్తో చేయడం అలవాటు. ప్రపంచంలో 87 శాతం మంది కుడి చేత్తో పనులు చేస్తుంటే, 12 శాతం మంది ఎడమ చేత్తో చేస్తారని సర్వేల్లో వెల్లడైంది. మిగిలిన ఒక శాతం మంది రెండు చేతులను వినియోగించడంలో సామర్థ్యాన్ని కనబరుస్తారు. దేశంలో 5.20 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారు. కుడిచేతి వాటం వారి కన్నా, ఎడమ చేతి వాటం వారు ప్రత్యేక స్థానాల్లో ఉంటారని, వారి మేధోశక్తి, ఆలోచనలు, తెలివితేటలు భిన్నంగా ఉంటాయని నిపుణుల అంచనా. ప్రస్తుతం ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో చాలా మంది ఎడమ చేతి వాటం వారు కావడం విశేషం. ప్రతిభ, సృజనాత్మకత, ఏ రంగంలోనైనా రాణించే శక్తి సామర్థ్యాలు ఎడమ చేతి వాటం వారిలోనే ఎక్కువని నాడీ శాస్త్రం కూడా చెబుతుందంటారు. జిల్లా జనాభాలో సుమారు 3.01 లక్షల మంది ఎడమ చేతి వాటం వారున్నట్టు ఓ అంచనా. ప్రముఖుల్లో కొందరు ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్, చంద్రుడిపై మొట్టమొదట కాలుమోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మోనాలిసా సృష్టికర్త లియోనార్డో డావెన్సీ, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్క్లింటన్, ప్రధాని నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త రతన్టాటా, మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, యువరాజ్సింగ్, సినీ నటుల్లో అమితాబ్ బచ్చన్, సావిత్రి ఇలా ఎడమచేతి వాటమున్న ప్రముఖులే. అలాగే పలువురు కళా, క్రీడా, సంగీత రంగాల్లో రాణిస్తూ లెఫ్ట్.. బట్ వియ్ ఆల్వేస్ రైట్ అనిపించుకుంటున్నారు. ఇబ్బందులూ తప్పవు! ఎడమ చేతి వాడకంపై లాభనష్టాలు, ఇబ్బందులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమచేతి వాటం ఉన్న వారెంతో అదృష్టవంతులని కొందరంటుంటారు. అటువంటి వారు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదిగారని చెబుతారు. శుభకార్యాల్లో ఎడమ చేతి వినియోగాన్ని మన సంప్రదాయాలు అంగీకరించవు. ఇటువంటి సందర్భాల్లో ఆ అలవాటు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూజలు, శుభకార్యాలు, డబ్బు చేతులు మారేటప్పుడు కుడి చేతినే ఉపయోగిస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల కుర్చీలకు కుడిచేతివైపు రాయడానికి వీలుగా అట్టలు అమరుస్తారు. డ్రైవర్లకు కుడిచేతి వాటానికి అనుకూలంగా హారన్ వంటివి ఉంటాయి. జన్యు ప్రభావం కూడా.. పుట్టినప్పటి నుంచే కుడి, ఎడమ చేతి వాటాలను సహజసిద్ధంగా కలిగి ఉంటారని సైన్స్ చెబుతోంది. మనిషికి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధ భాగాలుగా ఉంటుంది. కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమ వైపు భాగం నియంత్రిస్తుందని, మెదడు కుడి అర్ధ భాగం బలంగా ఉన్న వారిలో ఎడమ చేతి వాటం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎడమ చేతి వాటం గమనిస్తే.. దానిని మాన్పించేందుకు యత్నిస్తుంటారు. జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు అలా మాన్పించడం సాధ్యం కాదంటున్నారు. -
వద్దన్నా..స్మార్ట్ దెబ్బ!
ప్రజాసంఘాల ఆందోళన బాట స్మార్ట్ మీటర్ల బిగింపుపై ప్రజా సంఘాలు, సీపీఐ తదితర పార్టీలు ఆందోళన బాట పడుతున్నాయి. రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నాయి. స్మార్ట్ మీటర్లు వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని సంతకాల సేకరణ కార్యక్రమం సైతం నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా.. కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. సాక్షి, రాజమహేంద్రవరం: విద్యుత్ వినియోగదారులకు ‘స్మార్ట్ మీటర్ల’ పీడ విరగడవడం లేదు. వినియోగదారులు వద్దని తిరస్కరిస్తున్నా.. రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు, అపార్ట్మెంట్లకు బిగింపు ప్రక్రియ చేపడుతోంది. త్వరలోనే గృహ వినియోగదారులకు, వ్యవసాయ కనెక్షన్లకు సైతం అమర్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రీపెయిడ్ ఆప్షన్తో వీటిని రూపొందించారు. సెల్ఫోన్ తరహాలో ముందుగానే రీచార్జ్ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా ఉంటుంది. లేదంటే ఆటోమెటిక్గా సరఫరా ఆగిపోతుంది. చిన్నపాటి మొబైల్ చార్జర్ అయినా.. విద్యుత్ వినియోగిస్తున్నట్లు బిల్లు వచ్చేస్తుంది. ప్రజలు తమ కష్టార్జితం మొత్తం విద్యుత్ బిల్లులకు కట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అన్ని వర్గాలూ వ్యతిరేకిస్తున్నా.. కూటమి ప్రభుత్వం మాత్రం ఆదాయం సృష్టించే క్రమంలో ముందుకు సాగుతోంది. రంగం సిద్ధం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 7,82,170 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ సంస్థలవి 10,607, ప్రైవేటు కనెక్షన్లు 7,71,563 ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 108.85 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా రూ.74.41 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి, విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నారు. తొలుత 33 కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడర్లు, నాన్ అగ్రికల్చర్, ప్రభుత్వ సర్వీసులు, ఇండస్ట్రియల్, కమర్షియల్ కనెక్షన్లకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగించాలని భావించి అమలు చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 45,000కు పైగా స్మార్ట్ మీటర్లు బిగించినట్లు విద్యుత్ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అనంతరం గృహాలకు బిగించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. 500 యూనిట్ల పైబడి విద్యుత్ వినియోగిస్తున్న గృహాలకు బిగించేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సింహభాగం వినియోగదారులు వ్యతిరేకిస్తున్నారు. తాము స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకమని చెబుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదు. పైగా స్మార్ట్ మీటర్ బిగించుకోకపోతే.. ప్రస్తుతం ఉన్న మీటర్కు కమర్షియల్ బిల్ బనాయిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఏది ఏమైనా స్మార్ట్ మీటర్లు బిగించుకోవాల్సిందేనంటూ తెగేసి చెబుతున్నారు. అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించే అధికారం విద్యుత్ శాఖకు లేదని న్యాయ నిపుణులు వెల్లడిస్తున్నా.. ఆ శాఖ అధికారులు మాత్రం ఏదోలా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ చార్జీల మోత ప్రస్తుతమున్న మీటర్ స్థానంలో స్మార్ట్ మీటర్ అమరుస్తున్నారు. నార్మల్ మీటర్ ఉన్న సమయంలో కమర్షియల్ విద్యుత్ వినియోగానికి రూ.3 వేలు బిల్లు వస్తే.. స్మార్ట్ మీటర్ అమర్చిన అనంతరం రూ.6 నుంచి రూ.10 వేల వరకూ వస్తోంది. ఇదేమని విద్యుత్ అధికారుల వద్దకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు. తమకేమీ తెలియదని వారు సమాధానం ఇస్తున్నారు. స్మార్ట్ మీటర్ బిగించిన అనంతరం విద్యుత్ లోడ్ను బట్టి గంట, గంటకూ బిల్లు రేట్లు మారుతాయి. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే సమయంలో వాడితే చార్జీల మోత తప్పదు. ఉదయం ఒక ధర, మధ్యాహ్నం ఒక ధర, రాత్రి ఇంకో ధర ఉంటుంది. స్మార్ట్ మీటర్తో ప్రతి నెలా సాధారణ వినియోగదారుడిపై రూ.500 నుంచి రూ.800 వరకు అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం నెలంతా విద్యుత్ వినియోగించుకుని బిల్లు వచ్చిన అనంతరం చెల్లిస్తున్నాం. అలాంటి ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. సెల్ఫోన్, డిష్టీవీ తరహా ముందస్తుగా స్మార్ట్ మీటర్కు రీచార్జ్ చేసుకోవాలి. రీచార్జ్ అమౌంట్ పూర్తవగానే విద్యుత్ సరఫరా దానంతట అదే ఆగిపోతుంది. భారం వినియోగదారుడికే.. స్మార్ట్ మీటరు ఖరీదును వినియోగదారుడే భరించాలి. సింగిల్ ఫేజ్ మీటరు ఖరీదు రూ.8,927. త్రీ ఫేజ్ మీటరు రూ.17,286. ఈ మొత్తాన్ని 93 నెలల పాటు ఇన్స్టాల్ మెంట్లుగా బిల్లుతో పాటు వసూలు చేస్తారు. స్మార్ట్ మీటర్ మామూలు విద్యుత్ మీటర్ మాదిరిగా విద్యుత్ వాడకాన్ని రికార్డు చేసేందుకు మాత్రమే ఉపయోగించే పరికరం కాదు. మీటరును రిమోట్ నుంచి ఆపరేట్ చేయవచ్చు. పీక్ సమయం పేరుతో అధిక చార్జీలు వసూలు చేసేందుకు ఇది ఎంతగానో ఉపయుక్తం కానుంది. ఉదాహరణకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు పీక్ సమయంగా నిర్ణయించారు. ఈ సమయంలో ఎక్కువ విద్యుత్ చార్జీ వసూలు చేస్తారు. వేసవి కాలంలో ఎక్కువ రేట్లు వసూలు చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ ఏర్పాటు చేశారు. ఇది ప్రజలకు భారం అవుతుంది. చంద్రబాబు, లోకేష్ ఏమయ్యారు..? ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ ప్రస్తుతం ప్రోత్సహించడంపై వినియోగదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బోరుబావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగలకొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విమర్శించిన వారు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం మంచి ప్రక్రియ అని చెప్పడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసే కుట్ర విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చింది. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టిన షాపులకు వస్తున్న బిల్లులు చూసి చిరు వ్యాపారులు గుండెలు బాదుకుంటున్నారు. స్మార్ట్ మీటర్లు బిగించాలంటే మన అనుమతి కావాలి. ఒక మీటరు బిగిస్తే అనుమతించినట్టే. క్రమేణా మన కరెంటు కనెక్షన్ అదానీ చేతిలోకి పోతుంది. రాజమహేంద్రవరంలో ఇప్పటికే వందలాది మీటర్లు ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రక్రియ కొనసాగితేనేగాని ప్రభుత్వంలో మార్పు రాదు. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం ముందుకే.. జిలా ్లవ్యాప్తంగా 45,000కు పైగా మీటర్ల బిగింపు మీటర్ వద్దంటే కమర్షియల్ చార్జీలు మోపుతామని బెదిరింపులు పీక్ అవర్స్లో అధిక బిల్లులు మోపి దోచుకునేందుకు కుట్ర గతంలో రూ.2 వేలు వచ్చే బిల్లు.. ప్రస్తుతం రూ.10 వేలకు చేరుతున్న వైనం ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన చంద్రబాబు, లోకేష్ జిల్లాలో విద్యుత్ కనెక్షన్లు డివిజన్ క్యాటగిరి–1 క్యాటగిరి–2 క్యాటగిరి–3 క్యాటగిరి–4 క్యాటగిరి–5 నిడదవోలు 2,26,895 24,220 1,257 5,610 30,064రాజమహేంద్రవరం రూరల్ 1,99,806 20,930 778 4,621 15,768రాజమహేంద్రవరం అర్బన్ 2,14,334 33,285 824 2,874 904 -
స్వామీ...నీ దయ రాదా!
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పారిశుధ్య కార్మికులకు జీతాల చెల్లింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. జూన్, జూలై నెలల జీతాలు ఇంకా అందకపోవడంతో 350 మంది ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఎక్కువ మొత్తాలలో జీతాలు తీసుకునే వేతన జీవులకే ఒక నెల జీతం ఆలస్యం అయితే ఇబ్బంది పడతారు. ఈ ఎంఐలు, అద్దెలు, వివిధ చెల్లింపులు ఆలస్యం అవుతాయి. అటువంటిది చిన్నపాటి జీతం రెండు నెలలు నుంచి రాకపోతే వారి పరిస్థితి ఏమిటో ఊహించొచ్చు.ఐదు నెలలుగా ఇదే తంతుఐదు నెలలుగా జీతాలు ఆలస్యం అవుతున్నాయి. పాత కాంట్రాక్ట్ సంస్థ కేఎల్టీఎస్ కాలపరిమితి ముగిసిన తరువాత మార్చి నెల నుంచి శానిటరీ కాంట్రాక్ట్ విజయవాడకు చెందిన కనకదుర్గా మేన్పవర్ సంస్థకు అప్పగించారు. మార్చి జీతాలు ఆలస్యమవడంతో అప్పట్లో సాక్షి దినపత్రికలో ఏప్రిల్ 25వ తేదీన ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ వార్త ప్రచురితమవడంతో ఏప్రిల్ 30న అకౌంట్లో జీతాలు వేశారు. ఏప్రిల్ జీతాలు కూడా పడకపోవడంతో సాక్షి దినపత్రికలో మే నెల 26న ‘వీరి కష్టం తుడిచే వారేరీ!’ శీర్షికన కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి జీతాలు చెల్లించారు. మే నెల జీతాలు కూడా జూన్ రెండో వారంలో చెల్లించారు. జూలై నెలలో ఫేక్ పీఎఫ్ చలానాలు ఇచ్చారంటూ వివాదం రావడంతో ఆ చలానాలు వెరిఫై చేయడం, పీఎఫ్ కార్యాలయ సిబ్బంది తనిఖీలు, కాంట్రాక్టర్పై కేసులు, ఇద్దరి ఉద్యోగుల సస్పెన్షన్ వంటి పరిణామాలతో జూన్, జూలై జీతాలు ఇంకా చెల్లించలేదు.సెక్యూరిటీ కాంట్రాక్టర్తో జీతాలిప్పించే ప్రయత్నం విఫలంఫేక్ పీఎఫ్ చలానాల ఆరోపణలతో కనకదుర్గ సంస్థను పక్కన పెట్టి సెక్యూరిటీ కాంట్రాక్ట్ సంస్థ ‘మాక్స్’ ద్వారా శానిటరీ సిబ్బందికి జీతాలిప్పించేందుకు కమిషనర్ కార్యాలయానికి ఫైలు పంపారు. దీనిపై కమిషనర్ అభ్యంతరం తెలిపారు. దీంతో మళ్లీ కనకదుర్గా సంస్థ ద్వారా జూన్, జూలై నెలలకు జీతాలిచ్చేందుకు వీలుగా ఆ సంస్థతో రెండు నెలల పీఎఫ్ కట్టించారు. రూ.30 లక్షల పీఎఫ్ సొమ్ము చెల్లించి ఆ రశీదులు దేవస్థానానికి ఆ సంస్థ ప్రతినిధులు జమ చేశారు. ఇది జరిగి వారం అయినా ఇంకా శానిటరీ సిబ్బంది అకౌంట్లలో జీతాలు పడలేదు.నెరవేరని కమిషనర్ హామీఈ నెల ఒకటో తేదీన అన్నవరం దేవస్థానానికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ను శానిటరీ సిబ్బంది కలసి తమ జీతాలు చెల్లింపుపై వినతిపత్రం సమర్పించారు. రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే ఏర్పాటు చేయిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. నెలకు రూ.59 లక్షల చొప్పున 350 మంది సిబ్బందికి రెండు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. అయినా 11వ తేదీ వచ్చినా జీతాలు చేతికి అందడం కాదు కదా ఇంకా జీతాల బిల్లు సిద్ధం కాలేదని తెలిసింది.మరో వారం పడుతుందా?జీతాలు బిల్లు తయారైతే అది ఆడిట్కు వెళ్లి అక్కడ ఏ కొర్రీలు పడకుండా మళ్లీ దేవస్థానానికి వచ్చి ఆ తరువాత బిల్లు పాస్ అవ్వాలి. ఆ బిల్లుపై చెక్కు తయారు చేస్తే దానిపై ఈఓ సంతకం చేసి సంబంధిత మొత్తాన్ని ఆన్లైన్లో కాంట్రాక్టర్కు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కాంట్రాక్టర్ 350 మంది సిబ్బంది అకౌంట్లలో జమ చేయాలి. ఇదంతా జరగడానికి కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. అంటే ఆగస్టు 20 తేదీ తరువాతనే పారిశుధ్య కార్మికులకు జీతాలు అందే అవకాశం ఉందని అర్థమవుతోంది. -
మాజీ మంత్రి వనితపై అనుచిత వ్యాఖ్యలు తగవు
● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేణు ● చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ హోం మంత్రి తానేటి వనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు డిమాండ్ చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఈ ఘటనపై వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ హోం శాఖా మంత్రి డాక్టర్ వనితపై నల్లజర్లకు చెందిన సవలం రామకృష్ణ, మద్దిపాటి మహేష్, దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నగ్గిన నాగేంద్ర ఫేస్ బుక్లో అనుచిత పోస్టులు పెడుతున్నారన్నారు. ఏకవచనంతో సంబోధిస్తూ, వ్యంగ్యంగా కించపరుస్తున్నారన్నారు. ఈ నెల 7వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ ఆ పోస్టుని షేర్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అక్రమాల తొలి అడుగు వేసింది నల్లజర్లకు చెందిన ముప్పిడి పెద్దిరాజు 20 సంవత్సరాలుగా రోడ్డు పక్కన షాపు ఏర్పాటు చేసుకొని కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకుని తన కుటుంబంతో జీవిస్తున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ షాపు ఖాళీ చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులు పెద్దిరాజును బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం మద్యం మాఫియా, ఇసుక మాఫియా, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాల్లో తొలి అడుగులు వేస్తోందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముద్దాయి అని ఖైదీ అని విమర్శిస్తుంటారని ఆయన ఆ రెండింటికి తేడా తెలియదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారని ఆయనను ముద్దాయి అనాలా ఖైదీ అనాలా అని ప్రశ్నించారు. ప్రతాప్ నేని వాసు, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వాసంశెట్టి పరమేశ్వరరావు, అప్పారావు, మళ్లీ పూడి సలీం పాల్గొన్నారు -
అలవాటుగా మారింది
చిన్నప్పటి నుంచి ఎడమ చేతితో రాయడం అలవాటైంది. ఏ పని చేయాలన్నా ఎడమ చేతితో చేయడం ఈజీగా అనిపిస్తోంది. బలమైన పనులన్నింటికీ ఎడమ చేతినే ఉపయోగిస్తాను. ఓ పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు ఎడమ చేతితోనే చేస్తాను. – చింతలపూడి మంగాదేవి, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్, జీహెచ్ఎస్, అనాతవరం చిన్నప్పటి నుంచి అలవాటు ఎడమ చేతితో రాయడం, పనులు చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంట్లో పనులన్నీ ఎక్కువగా ఎడమ చేతితో చేయడం జరుగుతుంది. నాకు ఇద్దరు అబ్బాయిలు. వారికి ఈ అలవాటు రాలేదు. – సప్పా శాంతి, గృహిణి, కొంకుదురు మా అమ్మ నుంచి వచ్చింది ఎడమ చేతిరాత మా అమ్మకి ఉంది. మా అమ్మ నుంచి నాకు, అలాగే నా కూతురికి ఎడమ చేతి అలావాటు వచ్చింది. సూల్క్లో నేను డ్రాయింగ్ వేసేవాడిని. బహుమతులూ వచ్చాయి. ఇప్పడు పెయింట్ వేయడానికి ఉపయోగపడుతోంది. – కుక్కుల శివకృష్ణ, పెయింటర్, పందలపాక -
వేర్వేరు ఘటనల్లో ముగ్గురి మృతి
రాజానగరం: వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. జాతీయ రహదారిపై దివాన్చెరువు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గండేపల్లి మండలం కె.గోపాలపురానికి చెందిన జనపరెడ్డి రాఘవ(55) భర్త సత్యనారాయణతో కలిసి మోపెడ్పై రాజమహేంద్రవరం వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి అతివేగంతో వచ్చిన హైపవర్ బైక్ వారి మోపెడ్ను ఢీకొంది. ఈ ఘటనలో మోపెడ్ వెనుక కూర్చున్న రాఘవ రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆమెను 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే చనిపోయింది. కాగా సత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కడియం: మండల కేంద్రమైన కడియం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తుంగపాడు గ్రామానికి చెందిన చిక్కిరెడ్డి సరోజిని(–––) మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు, సోమవారం ఉదయం కడియం దేవీసెంటర్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న సరోజినిని టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను కడియం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా సరోజిని తన చెల్లెలు సత్యతో కలిసి బ్యాంకులో ఆధార్ అప్డేట్ చేయించుకుని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదానికి గురైంది. కడియం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైలు నుంచి జారిపడి.. తుని రూరల్: తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి ౖ(45) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు వివరాల మేరకు, సోమవారం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రైలు నుంచి యలమంచిలి రైల్వే యార్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తి జారి పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 అంబులెన్స్లో అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలం, నలుపు గడుల ఫుల్హ్యాండ్ షర్టు, సిమెంట్ రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. కుడివైపు ఛాతిపై ఐ లవ్ మార్కులో రోహన్ అని పచ్చబొట్టు ఉంది. మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో భద్రపర్చారు. మృతుడిని గుర్తిస్తే 94906 19020 నంబరుకు వివరాలు తెలియజేయాలని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాపురం చేస్తూనే.. రెండో పెళ్లికి సిద్ధం
● వివాహ సమయానికి అదృశ్యం ● పోలీసులకు వధువు బంధువుల ఫిర్యాదు దేవరపల్లి: ఓ మహిళతో కాపురం చేస్తూనే.. పెళ్లి పేరుతో మరో యువతిని మోసం చేసేందుకు యత్నించి, తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిపై స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. సీఐ బీఎన్ పట్నాయక్ వివరాల మేరకు, గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతికి, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి వీరవెంకట సత్యనారాయణతో ఇటీవల వివాహం కుదిరింది. సోమవారం తెల్లవారుజామున స్థానిక ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం వధువు ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు చేశారు. మరో గంటలో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు కనిపించడంలేదంటూ వధువు బంధువులకు రాత్రి ఏడు గంటల సమయంలో సమాచారం వచ్చింది. దీంతో కంగారు పడిన ఆమె బంధువులు అసలు వివరాలు సేకరించారు. అంతకు ముందే సత్యనారాయణకు పెళ్లయి, కాపురం చేస్తున్నాడని, అందుకే పెళ్లికి రాకుండా అదృశ్యమైనట్టు సమా చారం అందింది. దీంతో వధువు కుటుంబానికి న్యా యం చేయాలంటూ ఆమె బంధువులు ఆందోళన చేశా రు. సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఐ పట్నాయక్ తెలిపారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు
ముగిసిన అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు తుని రూరల్: ప్రతిభ చూపే క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ అన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో మూడు రోజుల పాటు జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్–7 అంతర్రాష్ట్ర అండర్–14, 17, 19 బాలబాలికల ఖోఖో పోటీలు సోమవారం ముగిశాయి. విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 180కి పైగా జట్లకు చెందిన రెండు వేల మంది పోటీల్లో పాల్గొన్నారు. మూడు విభాగాల్లో 12 జట్లు విజేతలుగా నిలిచాయి. విజేత జట్లకు మెడల్స్, జ్ఞాపికలు అందించారు. సీబీఎస్ఈ పరిశీలకుడు సీహెచ్ఎల్ఎం శ్రీనివాసు, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, వివిధ ప్రాంతాలకు చెందిన కోచ్లు, మేనేజర్లు పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో విజేతలు అండర్–19 బాలికల విభాగంలో సిస్టర్స్ నివేదిత స్కూల్(హైదరాబాద్), వెరిటాస్ సైనిక్ స్కూల్ (తిరుపతి) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. అలాగే బాలురు విభాగంలో వెరిటాస్ సైనిక్ స్కూల్, ఫార్ూచ్యన్ బటర్ఫ్లై(మహబూబ్నగర్), అండర్–17 బాలికల విభాగంలో శ్రీప్రకాష్ విద్యానికేతన్ (పాయకరావుపేట), మాంటిస్సోరి ఎలైట్ (అనంతపురం), బాలురు విభాగంలో శ్రీప్రకాష్, ఎకార్డ్ స్కూల్(తిరుపతి), అండర్–14 బాలికల విభాగంలో హీల్ స్కూల్ (నరిసింగపాలెం), సూర్య అకాడమీ(హైదరాబాద్), బాలుర విభాగంలో శ్రీప్రకాష్, ఏకశిల ఇంటర్నేషన్(మహబూబ్నగర్) విజేతలుగా నిలిచారు. -
వెయిట్ లిఫ్టింగ్ కోనసీమ జట్టు ఎంపిక
అమలాపురం టౌన్: డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో స్థానిక హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్లో సోమవారం 11 మంది వెయిట్ లిఫ్టర్లు కోనసీమ జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. పురుషుల విభాగంలో ఎనిమిది మంది, మహిళా విభాగంలో ముగ్గురిని ఎంపిక చేశారు. వీరు ఈ నెల 14న కాకినాడలో జరిగే జోనల్ స్థాయి, 18న విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. పురుషుల విభాగంలో ఇళ్ల మల్లికసాయి, జల్లి జితేంద్ర దొర, కొండేటి వేణుమానస్, బుసకాల యశ్వంత్కుమార్, కొల్లి వరుణ్, దాసరి వేదేష్, దొమ్మేటి వేణుసాగర్, వసభక్తుల మణికంఠ, మహిళా విభాగంలో కొండేటి మేఘన, ఉందుర్తి శశికళ, యనమదల ఇందిర ఎంపికయ్యారు. వీరు జిల్లా తరఫున జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. వీరు విజేతలుగా నిలిచి జిల్లాకు మంచి గుర్తింపు తేవాలని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి పీఎస్ సురేష్కుమార్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పప్పుల శ్రీరామచంద్రమూర్తి, నేషనల్ వెయిట్ లిఫ్టర్ మారే వీరేంద్ర, జిమ్ కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, కోచ్లు ఆర్కే నాగేశ్వరరావు, వి.నరేష్, జి.గణేష్బాబు, యనమదల పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): కాకినాడ సురేష్ నగర్లోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో జరుగుతున్న ఏపీ, తెలంగాణ సీబీఎస్సీ క్లస్టర్ బ్యాడ్మింటన్ పోటీలు సోమవారం ముగిశాయి. అండర్–14, 17, 19 బాలుర విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, బ్యాడ్మింటన్ సంఘ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం విజేతలకు బహుమతులు అందజేశారు. డైరెక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతూ, క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందన్నారు. పోటీల పరిశీలకులు గణేష్, రిఫరీలు పి.శ్రీనివాస్, భద్రం, ప్రిన్సిపాల్ శ్రీదేవి, మేనేజర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అండర్–14 విభాగంలో మౌంట్లిటిరా స్కూల్ బంగారు, ఇండస్ యూనివర్శల్ రజత, సిల్వర్ హోక్స్ కాంస్య పతకాలు సాధించాయి. అండర్–17లో గాడియమ్ స్కూల్ బంగారు, డీపీఎస్ ఆనందపురం రజత, పల్లవి మోడల్ కాంస్య పతకాలు అందుకున్నాయి. అండర్–19లో సిల్వర్ హోక్స్ బంగారు, వికాస్ కాన్సెప్ట్ రతజ, నీలకంఠ విద్యాపీఠం కాంస్య పతకాలు కై వసం చేసుకున్నాయి.