East Godavari
-
పాపాలు చేస్తే శాపాలు తప్పవు
● రావణ వృత్తాంతం చెప్పేదిదే.. ● ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ ఆల్కాట్తోట (రాజమహేంద్రవ రం రూరల్): ‘ఇతరులను హేళన చేస్తే పరాభవం తప్పదు. అధర్మవర్తనంతో తపోబలం క్షీణిస్తుంది. పాపాలు చేస్తే శాపాలు తప్పవు’ అని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నా రు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన స్థానిక టి.నగర్లోని హిందూ సమాజంలో ఉత్తరకాండపై మూడో రోజు ప్రవచనాన్ని ఆయన కొనసాగించారు. ‘నీది వానరముఖం అని నందీశ్వరుడిని హేళన చేసిన రావణునికి వానరుల చేతిలో పరాభవం తప్పదన్న శాపం ఎదురైంది. వేదవతిని పరాభవించినప్పుడు ఆమె మరుసటి జన్మలో అయోనిజగా జన్మించి, సపరివారంగా రావణుడు నశించడానికి కారకురాలినవుతానని శపించింది. ఇక్ష్వాకువంశానికి చెందిన రాజు అనరణ్యుడు.. రావణుని చేతిలో పరాజితుడై, మా వంశంలో జన్మించే శ్రీరాముని చేతిలో నీవు మరణిస్తావని శపించాడు. రావణుని చేతిలో బందీలుగా చిక్కిన ఎందరో దేవకాంతలు, ఋషి కన్యలు, మానవకాంతల కన్నీరే రావణుని పాలిట పెనుశాపంగా మారింది’ అని సామ వేదం అన్నారు. ధర్మాచరణతో అల్పాయుష్కుడు కూడా దీర్ఘాయువు పొందగలడని, దీనికి విలోమంగా దీర్ఘాయువు వరంగా గలవాడు కూడా పాపకృత్యాలతో అల్పాయుష్కుడు కాగలడని చెప్పారు. ‘కై లాసగిరిని పెకలించబోయి భంగపాటుకు గురైన రావణుడు పెద్దగా రోదించినప్పుడు, దయాళువు అయిన పరమ శివుడు అతనికి విడుదల ప్రసాదించి, ఇక నుంచి నీవు రావణుడిగా పేరు పొందుతావని అన్నాడు. అప్పటి నుంచీ రావణ శబ్దం వ్యాప్తిలోకి వచ్చింది. రామ అనే శబ్దానికి అందరికీ ఆనందాన్ని కలిగించేదని అర్థమైతే, రావణ శబ్దానికి అందరినీ ఏడిపించడం అనే అర్థం ఉంది’ అని వివరించారు. వేదవతి తామర పూవులో శిశువుగా ఉద్భవించడం, రావణుడు ఆ శిశువును సముద్రంలో పడవేయడం ప్రాచీన రామాయణ ప్రతుల్లో లేదని, ఇది ప్రక్షిప్తమని చెప్పారు. కృతయుగాంతంలో వేదవతిని పరాభవించిన రావణుడు త్రేతాయుగంలో శ్రీరాముని చేతిలో మరణించాడంటే.. ఆయన ఎప్పటివాడో మనం ఊహించుకోవచ్చునని సామవేదం అన్నారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలికారు. ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధి కారి బీవీ గిరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా సుమారు రూ.20 వేల పారితోషికంతో, ప్రారంభంలో 11 నెలలకు, తరువాత పొడిగించే పద్ధతిన పని చేయాలన్నారు. నిర్వహణ సమాచార వ్యవస్థ (ఎంఐఎస్), ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్డబ్ల్యూఎం), ద్రవ వ్యర్థాల నిర్వహణ (ఎల్డబ్ల్యూఎం) కన్సల్టెంట్ పోస్టులు ఒకొక్కటి, అకౌంటెంట్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉన్నాయని వివరించారు. డిగ్రీ చదివి, 2 నుంచి ఐదేళ్ల అనుభవం కలిగిన జిల్లాలోని అభ్యర్థులు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు లాలాచెరువులోని తమ కార్యాలయంలో నేరుగా లేదా 94921 22355 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం
నల్లజర్ల: జిల్లావ్యాప్తంగా వచ్చే ఖరీఫ్లో 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డీపీఎం) తాతారావు వెల్లడించారు. ప్రకృతి సాగుపై నల్లజర్లలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన, రాష్ట్ర రైతు సాధికార సంస్థ ప్రత్యేకాధికారి ముస్తఫా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ, సీజన్కు 45 రోజుల ముందు ఈ 47 వేల ఎకరాల్లో నవధాన్యాల సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మరో 8 వేల ఎకరాల్లో ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా, సహజ పద్ధతుల్లో వరి సాగు చేపట్టనున్నామని చెప్పారు. మూడు నాలుగు సెంట్ల విస్తీర్ణం చొప్పున 20 వేల యూనిట్లలో కిచెన్ గార్డెన్లు వేయిస్తున్నామన్నారు. పంటపై డ్రోన్ల ద్వారా కషాయాలు, జీవామృతం పిచికారీ చేయనున్నామన్నారు. వంద గ్రామాల్లో వెయ్యి మంది రైతులతో దేశవాళీ వరి సాగు చేపట్టనున్నామని తెలిపారు. ప్రస్తుతం కొన్ని గ్రామాలకే పరిమితమైన ప్రకృతి సాగును అన్ని రైతు సేవా కేంద్రాలకూ విస్తరింపజేయాలన్నదే లక్ష్యమని తాతారావు చెప్పారు. సేంద్రియ కర్బనం, సహజమైన సూక్ష్మక్రిములు చనిపోకుండా మొక్కల ఎదుగుదలకు తోడ్పడేందుకు 32 రకాల విత్తనాలు (నవధాన్యాలు) రైతు సేవా కేంద్రాల్లో విక్రయిస్తున్నామని తెలిపారు. వీటిలో ఆకుకూరలు, కూరగాయలు, పశువుల మేత ఉంటాయని, వీటిని తొలకరికి ముందే దమ్ములో కలియదున్నడం వలన భూసారం పెరగడంతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని వివరించారు. భూమిని 365 రోజులూ పచ్చగా ఉంచడం ద్వారా గాలిలోని కార్బన్డయాకై ్సడ్ భూమిలో సేంద్రియ కర్బనంగా స్థిరీకరణ అవుతుందని తాతారావు చెప్పారు. కార్యక్రమంలో అదనపు డీపీఎం మహబూబ్ వలీ, యూనిట్ ఇన్చార్జి కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రేపు స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర రాజమహేంద్రవరం సిటీ: నాలుగో విడత స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం శనివారం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణపై తన క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించి, ఉపయోగంలోనికి తీసుకుని రావడంపై దృష్టి సారించాలని అన్నారు. ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గ్రామ పంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో ఈ అంశంపై గ్రామసభ నిర్వహించాలని సూచించారు. కార్యాలయాలను పూర్తి స్థాయిలో శుభ్రపరచాలన్నారు. కార్యకమ్రంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ కూడా పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): నగరంలోని ఆవ పరిసర ప్రాంతాల్లో ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ భూమిని లీజు పేరుతో కబ్జా చేయడానికి కబ్జాదారులు ప్రయత్నాలు మొదలు పెట్టారని ఆరోపించారు. ‘ఇంటి స్థలం కోసం పేదల గోడు’ పేరిట సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యాన స్థానిక 16వ డివిజన్ ఆవ ప్రాంతం నుంచి సుమారు 4 వేల మందితో ప్రదర్శన గురువారం నిర్వహించారు. ఎస్టీపీ వద్ద మేకల కబేళాను ఆనుకుని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రజలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల ప్రజలకు 2 సెంట్ల చొప్పున స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం 16 ఎకరాల స్థలంలో ఎరజ్రెండా పాతి, కొబ్బరికాయ కొట్టి, దీనిని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇంటి స్థలాల హామీని మంగళగిరి మినహా ఇప్పటి వరకూ ఎక్కడా నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం 8 నెలలుగా ఆందోళనలు చేస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేదల ఇళ్ల స్థలాలుగా పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకూ తమ పోరాటం ఆగదని రామకృష్ణ అన్నారు. ఇళ్ల స్థలాల సమస్యను రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ, ఆవకు ఆనుకుని ఉన్న 16 ఎకరాల భూమిలో పేదలకు ఇళ్లు ఇవ్వాలని, సుదూర ప్రాంతాల్లో స్థలాలు ఇస్తే వారు ఇబ్బందులు పడతారని అన్నారు. ఇళ్ల స్థలాలపై తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రజాప్రతినిధులను డిమాండ్ చేశారు. తాము రాస్తున్న ప్రతి దరఖాస్తుదారుకు ఇక్కడే ఇంటి స్థలం మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేసి త్వరలో ఇక్కడ పాకలు వేస్తామని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ కోనసీమ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల సంఘం అధ్యక్షుడు కుండ్రపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ భూమి కబ్జాలను నిరోధించాలి ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ ఫ నగరంలో భూ పరిరక్షణ పోరాటం -
కుంటుబడ్డ ఇంటి ప్రణాళికలు
ఒక్క ప్లాన్ కూడా అమలు కాలేదు జీవో నంబర్ 20 వచ్చినప్పటి నుంచి అమలాపురం మున్పిపాలిటీలో 300 మీటర్ల లోపు ఇంటి స్థలాల్లో ప్లాన్ అప్రూవల్ అవ్వలేదు. 300 మీటర్లు దాటిన స్థలాల్లో పెద్ద భవనాలు, కమర్షియల్ భవనాలకు అనుమతులు ఇచ్చాం. – రాణి సంయుక్త, టౌన్ ప్లానింగ్ అధికారి, అమలాపురం జీవో నంబర్ 20ని సవరించాలి మా ఎల్టీపీల ఉనికిని ఇబ్బంది పెట్టేలా ఉన్న జీవో నంబర్ 20ని ప్రభుత్వం సవరించాలి. జీవోలో ఆంక్షలు విధిండం మేం వ్యతిరేకిస్తున్నాం. జీవోను సవరించే వరకూ బిల్డింగ్లకు ప్లాన్ అప్రూవల్స్ ఇచ్చేది లేదు. – యేడిద దొరబాబు, అధ్యక్షుడు, ఎల్టీపీల అసోసియేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్పై తాజాగా జారీ చేసిన జీవో నంబర్ 20ని ఆయా పట్టణాల్లోని లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్లు (ఎల్టీపీ) తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ జీవో ద్వారా బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ స్వీయ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్సీఎస్) విధానంతో ఆ బాధ్యతలను ఎల్టీపీలకు అప్పగించింది. అయితే ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ భవన యాజమాని ప్లాన్ అతిక్రమిస్తే ఎల్టీపీలను బాధ్యులను చేసి వారిపై చర్యలు తీసుకోవాలన్న నిబంధనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఎల్టీపీలు జీవో వచ్చిన గత రెండు నెలల నుంచి 300 చదరపు మీటర్ల స్థలంలోపులో ఒక్క ప్లాన్ కూడా ఇవ్వకుండా నిరసన తెలుపుతున్నారు. ఫలితంగా జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో ఏడున్నర సెంట్ల లోపు ముఖ్యంగా రెసిడెన్షియల్ బిల్డింగ్లకు ప్లాన్ల అప్రూవల్లు చేయకపోవడంతో ప్లానులన్నీ నిలిచిపోయాయి. మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్లాన్ ఇచ్చే విధానంలో లోపాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ఆ బాధ్యతను ఎల్టీపీలకు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. ఏదైనా బిల్డింగ్ ప్లాన్కు అనుమతి ఇస్తే 10 శాతం వరకూ అతిక్రమణ (డీవియేషన్)కు మినహాయింపు ఉంటుంది. అంతకుమించి అతిక్రమణ జరిగితే భవన నిర్మాణాన్ని నిలిపివేస్తారు. అయితే ప్లాన్ ఇచ్చిన ఎల్టీపీని బాధ్యుణ్ణి చేయడం, సంబంధిత ఎల్టీపీ లైసెన్స్ను అయిదేళ్ల పాటు రద్దు చేయడమే కాకుండా వారిపై క్రిమినల్ కేసులు కూడా ఉంటాయన్న జీవో నిబంధననే వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మున్సిపాల్టీల ఆదాయాలకు గండి ఎల్టీపీలు బిల్డింగ్ ప్లానులు ఇవ్వకపోవడంతో నిలిచిన భవన నిర్మాణాలతో ఆయా మున్సిపాలిటీలకు ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఉదాహరణకు అమలాపురం మున్సిపాలిటీలో గత ఏడాది 300 చదరపు మీటర్ల లోపు భవనాలకు 170 వరకూ ప్లాన్లు ఇస్తే జీవో వచ్చిన నాటి నుంచి ఒక్క ప్లాన్ కూడా ఇవ్వలేదంటే పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అంచనా వేయవచ్చు, రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీల్లో కూడా ఇదే పరిస్థితి. జిల్లా మొత్తం మీద మూడు మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీలో ఈ జీవో అభ్యంతరాలు లేకపోతే ఈ రెండు నెలల్లో 100కి పైగా ప్లాన్లు మంజూరు చేసే అవకాశం ఉండేది. ప్లాన్లు ఇవ్వకపోవడంతో దాదాపు రూ.1.20 కోట్ల వరకూ ఆదాయానికి గండి పడింది. ప్లాన్లను ఎల్టీపీలు అనుమతించని పరిస్థితుల్లో కొత్తగా 300 చదరపు మీటర్ల లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకునే వారు సైతం ఈ కొత్త జీవో, నిబంధనలపై పెదవి విరిస్తున్నారు. జీవోను వ్యతిరేకిస్తూ ప్లాన్లు ఇవ్వని ఎల్టీపీల నిరసన ఓ పక్క సాగుతుంటే కొందరైతే ప్లాన్ అప్రూవల్ లేకుండానే సొంత ప్లాన్లతో ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపాలిటీ పరంగా ఏదైనా అభ్యంతరం ఎదురైతే అప్పుడే చూద్దామన్న ధోరణిలో ముందుకు సాగుతున్నారు. మాపై చర్యలను మినహాయిస్తే జీవోను స్వాగతిస్తాం భవన యాజమానులు ప్లాన్ను అతిక్రమిస్తే తమను బాధ్యులను చేయని పక్షంలో జీవోను స్వాగతిస్తామని ఎల్టీపీలు అంటున్నారు. లేదా 300 చదరపు మీటర్లు దాటిన స్థలాలకు ప్లాన్ను అనుమతి ఇచ్చే బాధ్యతలు తమకు అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జీవో నంబర్20ని సవరించి ప్లాన్ అతిక్రమణ అయితే తమ లైసెన్ప్ రద్దు చేయడం, క్రిమినల్ కేసు వంటి ఆంక్షలు తొలగించాలని సూచిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల్లో అతిక్రమణ జరిగితే భవన యాజమానిని బాధ్యులను చేయాలే తప్ప తమను బాధ్యులను చేయడమేమిటని ఎల్టీపీలు ప్రశ్నిస్తున్నారు. పట్టణాల్లో పట్టించుకోని ఎల్టీపీలు జీవో నంబర్ 20ని వ్యతిరేకిస్తూ నిరసన ఎల్టీపీలను బాధ్యులను చేస్తున్న ఎస్సీఎస్ విధానం నిలిచిన ప్లాన్ అప్రూవల్స్... తగ్గిన ఆదాయం -
శిశిరంలో వసంతంలా..
● మోడువారిన భారీ వృక్షాలకు పునరుజ్జీవం ● కడియం నర్సరీ రైతుల ఘనత కడియం: శిశిర రుతువులో ఆకులన్నీ రాలిపోయి చెట్లు మోడుల్లా మారుతూంటాయి. అలా మోడువారిన చెట్లన్నీ.. తిరిగి వసంత రుతువు ఆగమనాన్ని సూచిస్తూ లేచివుళ్లు వేసి.. చూస్తూండగానే తిరిగి ఆకుపచ్చని శోభను సంతరించుకుంటాయి. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ, అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణం, ఇతర కారణాలతో నరికివేసే భారీ వృక్షాలు మాత్రం మోడుల్లానే మిగిలిపోతూ.. చివరకు జీవాన్ని కోల్పోతున్నాయి. దీనిపై ఇలా చెట్ల నరికివేతపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటువంటి వృక్షాలకు మళ్లీ జీవం పోస్తూ.. వాటికి వసంత శోభను తీసుకుని వస్తున్నారు కడియం ప్రాంత నర్సరీ రైతులు. వినూత్న రకాల మొక్కలను వేలాదిగా ఇక్కడి నర్సరీల్లో అందుబాటులో ఉంచుతూ, దేశవిదేశాల్లో కడియం ప్రాంతానికి ఎంతో గుర్తింపును తీసుకుని వచ్చిన ఈ ప్రాంత రైతులు.. భారీ వృక్షాలకు పునరుజ్జీవం పోస్తూ, కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మోళ్లుగా మిగిలిన రావి, మర్రి, జమ్మి, జువ్వి, బాదం, ఉసిరి, గానుగ, కదంబం, కొబ్బరి, తాటి వంటి భారీ వృక్షాలను వేర్లతో సహా పెకలించి, ఇక్కడకు తీసుకుని వస్తున్నారు. వాటిని బతికించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. దీనికోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. ఒకవేళ తీసుకువచ్చిన వృక్షం చనిపోతే, ఆ మేరకు నష్టాన్ని కూడా వీరు భరించాల్సి ఉంటుంది. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనుకాడటం లేదు. చెట్టు ఎంత భారీ సైజులో ఉన్నప్పటికీ, నిపుణుల పర్యవేక్షణలో తొలగించి, వేర్లకు ప్రత్యేక పోషణ చేపడుతున్నారు. వేర్లు దెబ్బ తినకుండా తగు జాగ్రత్తలు తీసుకుని, ట్రాలీలపై తీసుకుని వస్తున్నారు. అలా తెచ్చిన చెట్లకు మినరల్స్, సూక్ష్మ పోషకాలు (మైక్రో న్యూట్రియెంట్స్) అందించి, మాను నుంచి చిగుళ్లు వచ్చే వరకూ పోషిస్తారు. చిగుళ్లు వచ్చి, చెట్లు మళ్లీ బతికిందని నిర్ధారించుకున్న తరువాత రవాణాకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియకు ఏడాది నుంచి నాలుగైదేళ్ల వరకూ పడుతుంది. అప్పటి వరకూ దీనిపై పెట్టుబడి పెడుతూనే ఉండాలి. చెట్టు సైజు, వయస్సును బట్టి రూ.లక్ష నుంచి రూ.15 లక్షల వరకూ వీటిని విక్రయిస్తున్నారు.ట్రాలీపై రవాణా చేస్తున్న భారీ వృక్షం -
లారీ డ్రైవర్కు ఆరు నెలల జైలు
సామర్లకోట: ఇద్దరు మహిళల మృతికి కారణమైన లారీ డ్రైవర్కు ఆరు నెలల జైలు, రూ.5,500 జరిమానా విధిస్తూ కాకినాడ ఐదవ కోర్టు మెజిస్ట్రేట్ షేక్ షరీన్ గురువారం తీర్పు ఇచ్చారని సీఐ ఎ.కృష్ణభగవాన్ తెలిపారు. 2022, నవంబర్ 10వ తేదీన పీబీ దేవం రైల్వే గేటు ఎదురుగా ఇద్దరు మహిళలను లారీ ఢీ కొంది. వేట్లపాలెం నుంచి ద్వారపూడి అయ్యప్పస్వామి గుడికి నడిచి వెళుతున్న సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ మహిళలను ఢీ కొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లి జిల్లా గుట్టివాడకు చెందిన అద్దం భాస్కరం లారీని నిర్లక్ష్యంగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని అప్పటి ఎస్సై టి.సునీత కేసు నమోదు చేశారు. ప్యాసిక్యూషన్ తరఫున పీపీ రఘువీర్ వాదించారు. అక్రమంగా తరలిస్తున్న 85 గోవుల పట్టివేత నల్లజర్ల: ఒడిశా రాష్ట్రం నవరంగ్పూర్ నుంచి ప్రత్యేక కంటైనర్లో హనుమాన్ జంక్షన్కు అక్రమంగా తరలిస్తున్న 85 గోవులను నల్లజర్ల శివార్లలో ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ కంటైనర్లో బంధించిన 85 గోవులను నల్లజర్ల పోలీస్ స్టేషన్కు అప్పగించారు. దీనిపై ఎస్సై రమేష్ కేసు నమోదు చేశారు. వీటన్నింటినీ తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని గోశాలకు అప్పగించనున్నట్టు ఎస్సై తెలిపారు. ఈ దాడిలో హిందూ ధర్మరక్షణ ప్రచారక్ ఉప్పలపాటి మాధవరావు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గుంటముక్కల రామకృష్ణ, సవలం రామకృష్ణ, మద్దూరి విష్ణుమూర్తి, తాడేపల్లిగూడెం గో సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు. -
బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు ముఖ్యం
కొవ్వూరు: జిల్లావ్యాప్తంగా ఫైర్ క్రాకర్స్ తయారు చేసే యూనిట్స్ను పరిశీలించి అక్కడ తగిన భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం ఐ.పంగిడి గ్రామ శివారున ఫైర్ క్రాకర్స్ గోడౌన్ దగ్ధమైన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హానీ జరగలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్ల కాల పరిమితి ముగిసిన ఫైర్ క్రాకర్స్ విక్రయ, తయారీదారులను గుర్తించి తక్షణం అనుమతులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాణసంచా భద్రపరుస్తున్న గోదాముల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తున్నారో లేదో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3లక్షల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఐ.పంగిడిలో ఫైర్ క్రాకర్స్కు ఇచ్చిన అనుమతి మార్చి నెలాఖరు నాటికి ముగిసిందన్నారు. ఆర్డీవో రాణి సుస్మిత, తహశిల్ధార్ ఎం.దుర్గాప్రసాద్, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి తుని: అన్నవరం–హంసవరం మధ్యలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం వీరభద్రపేట గ్రామానికి చెందిన నారపురెడ్డి చిన అప్పారావు (55) కటక్ వైపు వెళుతున్న రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిన అప్పారావు ఈ నెల 2న గ్రామస్తులతో కలిసి గుంటూరు జిల్లా కారంపూడికి వ్యవసాయ పనుల కోసం వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తూ హంసవరం సమీపంలో జారిపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ● కలెక్టర్ ప్రశాంతి ● ఐ.పంగిడిలో బాణసంచా గోదాము దగ్ధం ● రూ.3లక్షల మేర ఆస్తి నష్టం -
నాన్ స్టాప్ కీబోర్డు ప్లేయర్గా విద్యశ్రీ గిన్నిస్ రికార్డు
రాయవరం: మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన విద్యశ్రీ కీబోర్డు ప్లే చేయడంలో గిన్నిస్ రికార్డు సాధించింది. ఈ విషయాన్ని విద్యశ్రీ తల్లిదండ్రులు సురేష్, సుధారాణి గురువారం స్థానిక విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం విద్యశ్రీ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. కీబోర్డుపై ఉన్న ఆసక్తితో విజయవాడకు చెందిన హల్లెలూయ మ్యూజిక్ స్కూల్లో ఆన్లైన్ తరగతులకు హాజరై కీబోర్డు ప్లే చేయడంతో పాటు, మెళకువలను నేర్చుకుంది. ఈ నెల 14న హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గిన్సిస్ రికార్డు ప్రతినిధుల చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నట్లు వారు తెలిపారు. గతేడాది డిసెంబరు 1న ఇన్స్ర్ట్రాగామ్ వేదికగా ఆన్లైన్లో గంట పాటు నిర్వహించిన పోటీలో విద్యశ్రీ పాల్గొంది. ఇదే పోటీలో 1,046 మంది ఒకే సమయంలో పాల్గొని గంట పాటు నిర్విరామంగా కీబోర్డు ప్లే చేశారు. గిన్నిస్ రికార్డులో భాగస్వామిగా ఉన్న విద్యశ్రీని గిన్సిస్ రికార్డు ఆఫ్ ఇండియా సంస్థ సర్టిఫికేట్, మెడల్ను ప్రదానం చేసింది. ఇంతకుముందు విద్యశ్రీ కీబోర్డు ప్లేయర్గా ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇన్జనియస్ వరల్డ్ రికార్డును సాధించిందన్నారు. కీబోర్డు ప్లేయర్తో పాటుగా, చిత్రలేఖనంలో విద్యశ్రీ రాణిస్తున్నట్లు తెలిపారు. -
వారం వారం చంద్రబాబు అప్పులు
●● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై చేసిన దుష్ప్రచారానికి సమాధానం చెప్పాలి ● టీటీడీ గోశాలలో గోవుల మృతిపై విజిలెన్స్ విచారణ జరపాలి ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్రాజమహేంద్రవరం సిటీ: సంపద సృష్టించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానన్న సీఎం చంద్రబాబు పది నెలల కాలంలో రూ.90 వేల కోట్లు అప్పులు చేశారని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ విమర్శించారు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోతుందంటూ అనేక రకాలుగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు చేస్తున్న అప్పులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ నగర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టిస్తాం, పథకాలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారం వారం అప్పులు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టినట్లేనంటూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనాడే చెప్పారని, ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అవాస్తవాలు ప్రచారం చేసి, రుజువు చేయలేకపోయారన్నారు. ఇప్పుడు టీటీడీ గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, దీనికి ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. ఇంత ఘోరం జరిగితే సనాతన పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని నిలదీశారు. టీటీడీ ఈఓ గతంలో 170 గోవులు చనిపోయాయంటున్నారని, మూడు నెలల్లో 40 మాత్రమే చనిపోయాయని చెప్పడం దారుణమని అన్నారు. గోవుల మృతిపై విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గోవుల మృతికి టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు, ఈఓ బాధ్యత వహించాలని అన్నారు. కందుకూరికి అగౌరవం గతంలో కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో ఉన్న కందుకూరి వీరేశలింగం విగ్రహం తొలగించి, ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం కందుకూరిని అగౌరవపరచడమేనని అన్నారు. అలాగే, జేఎన్ రోడ్డులో ఏకేసీ కళాశాలకు ఆనుకుని ఉన్న హ్యాపీ స్ట్రీట్లో టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట ఉన్న పార్కులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారని, ఇది దారుణమని అన్నారు. కావాలనుకుంటే కొత్తగా మరో పార్కు నిర్మించి, ఎన్టీఆర్ పేరు పెట్టుకోవాలని హితవు పలికారు. సూపర్ బజార్ ముడుపుల ఆరోపణల నిగ్గు తేల్చాలి గౌతమి సూపర్ బజార్ వ్యవహారంలో తనకు రూ.5 కోట్లు ఇచ్చారంటూ ఈవీఎం ఎమ్మెల్యే ఆరోపించారని, వీటిని నిరూపించాలని సవాల్ చేశారు. ఇప్పుడు అక్కడ భవన నిర్మాణం జరుగుతోందని, పనులు తక్షణం ఆపకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు. లాలాచెరువు వద్ద జాతీయ రహదారి సమీపాన హోండా షో రూం ఎదురుగా ఉన్న 1,300 గజాల భూమి మిగులు అని, పా ర్క్ స్థలమని పేర్కొంటూ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పందిరి మహాదేవుడు సత్రం భూముల మాదిరిగానే లాలాచెరువు భూమిని కూడా కాపాడేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రుల పరిశీలనకు ఒక కమిటీ వేయాలని భరత్రామ్ డిమాండ్ చేశారు. -
పిఠాపురంలో రైతుల వినూత్న నిరసన..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు. కల్లాల్లో ధాన్యం రాశుల వద్ద ధర్నా నిర్వహించారు. రబీ పచ్చి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా అకాల వర్షాలతో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. మిల్లర్లు సిండికేట్గా మారి 76 కేజీల బస్తాను రూ.1200లకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బస్తా మీద రూ.200-300ల వరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది పచ్చి ధాన్యం బస్తా రూ.1,400-1,500ల వరకు అమ్ముకున్నామని అన్నదాతలు గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేత్రస్థాయిలోకి వచ్చి రైతులతో సమీక్ష చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
కూటమిలో ట్విస్ట్.. జనసేన కారణంగా టీడీపీ కీలక నేతల రాజీనామా
సాక్షి, తూర్పు గోదావరి: ఏపీలో కూటమి పార్టీ మధ్య విభేదాలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తాజాగా మంత్రి కందుల దుర్గేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ కీలక నేత కొమ్మిన వెంకటేశ్వర రావు రాజీనామా చేశారు. దీంతో, కూటమి పార్టీ రాజకీయం ఆసక్తికరంగా మారింది.వివరాల ప్రకారం.. నిడదవోలులో ఎన్డీయే కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి కందుల దుర్గేష్ తీరుపై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి కొమ్మిన వెంకటేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు జనసేన విధానాలతో విసుగు చెందినట్టు చెప్పుకొచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ వ్యవహారంపై వేలివెన్నులో కార్యకర్తల సమావేశంలో టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక, నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకోవడంతో అంతర్యుద్ధం మొదలైనట్టు పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.మరోవైపు.. తనకు గుర్తింపు దక్కడం లేదంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమిలో భాగంగా అసలు తమను గుర్తించడం లేదని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడంలో ఎలాంటి సమాచారం తమకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, అన్నా క్యాంటీన్ ప్రారంభానికి కూడా ఆహ్వానం అందలేదని అసహనం ప్రదర్శించారు. అధిష్టానం స్పందించకుంటే మరిన్ని రాజీనామాలు ఉంటాయని శేషారావు హెచ్చరించారు. -
వర్గపోరులో ఢీసీసీబీ
● చైర్మన్ పీఠం కోసం నేనంటే నేను ● బీసీలకే అంటున్న టీడీపీ అధిష్టానం ● రేసులో పిల్లి సత్తిబాబు... ● మెట్ల వర్గంలో ఉలికిపాటు ● చివరి యత్నంగా చినబాబు దగ్గరకు ● జిల్లాలో పదవుల కోసం ఎదురుచూపులు సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు పందేరం పుణ్యమా అని సామాజికవర్గాలు, పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పొడచూపుతోంది. తొలుత ఒక పేరు ప్రచారంలో ఉంచడం, చివరకు మరొకరికి పదవి కేటాయించడం టీడీపీలో కొత్త వ్యూహంగా మారింది. ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్)లకు త్రీమెన్ కమిటీ పదవుల నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ పదవి వరకు ఇదే పంథా అవలంబిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులకు పేర్లను ఖరారు చేసే పనిలో టీడీపీ అధిష్టానం సిద్ధమైంది. దీనిలో డీసీసీబీ చైర్మన్ పదవి కీలకమైంది. తొలి నుంచి ఈ పదవికి అమలాపురానికి చెందిన పార్టీ నాయకుడు మెట్ల రమణబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో డీసీసీబీకి నిర్వహించిన ఎన్నికల్లో రమణబాబు టీడీపీ తరఫున పోటీ చేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దివంగత వరుపుల జోగిరాజు (రాజా)పై పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి రమణబాబు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. 2014–19 మధ్య కాలంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ రమణబాబుకు ఈ పదవి కేటాయించలేదు. కేవలం గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ పదవితో సరిపెట్టారు. ఈసారి తనకు ఈ పదవి వస్తుందని రమణబాబు బలంగా నమ్మకం పెట్టుకున్నారు. పార్టీలో సైతం అతని పేరు ప్రముఖంగా వినిపించింది. కాని వారం రోజులుగా పరిస్థితి తల్లకిందులైంది. డీసీసీబీ చైర్మన్ పదవి బీసీలకు కేటాయించాలని, అందునా శెట్టిబలిజ సామాజికవర్గానికి ఇవ్వాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. దీనిలో భాగంగా కొత్తపేటకు చెందిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం (ఆర్ఎస్) పేరు ప్రముఖంగా వినిపించింది. దీనిపై ఆర్ఎస్ను పార్టీ అధిష్టానం సంప్రదించిన విషయం తెలిసిందే. క్యాబినెట్ ర్యాంకు పదవి చేసిన తాను డీసీసీబీ చైర్మన్ పదవి చేయలేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. తెరపైకి పిల్లి సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవిని ఆర్ఎస్ తిరస్కరించడంతో కాకినాడ రూరల్కు చెందిన పిల్లి సత్తిబాబు పేరు తెరపైకి తీసుకువచ్చారు. సత్తిబాబు సతీమణి పిల్లి అనంతలక్ష్మి ఎమ్మెల్యేగా పనిచేసిన విషయం తెలిసిందే. కూటమి పార్టీల మధ్య కుదిరిన పొత్తులలో భాగంగా కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించగా, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పంతం నానాజీ విజయం సాధించారు. జనసేనకు ఆ సీట్టు ఇవ్వడంతో అవకాశం కోల్పోయిన సత్తిబాబుకు సముచిత స్థానం కల్పిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీనితో సత్తిబాబు ఎమ్మెల్సీ పదవిపై ఆశ పెట్టుకున్నారు. పిఠాపురం నుంచి ఈ పదవి ఆశిస్తున్న ఎస్.వి.ఎస్.ఎన్.వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఎన్నికల పూర్తయిన తరువాత పక్కన బెట్టడం చూసిన సత్తిబాబు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చినా చాలన్నట్టుగా చూస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇందుకు సముఖంగా ఉన్నట్టు తెలిసిందే. రమణబాబు చివరి యత్నాలు డీసీసీబీ చైర్మన్ పదవి చేజారిపోతోందని తెలియడంతో రమణబాబు చివరి యత్నాలు ప్రారంభించారు. పార్టీ అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. దీనిలో భాగంగా ఆయన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలవనున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి తనకు కేటాయించాలని ఆయన పట్టుబట్టనున్నారు. అయితే రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశం టీడీపీ అధిష్టానానికి లేదని పార్టీలో కొంతమంది ప్రముఖులు చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో రమణబాబు పట్టుబట్టడంతోనే అమలాపురం అసెంబ్లీ స్థానం ఆనందరావుకు కేటాయించారు. గతంలో ఒకసారి రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలు కలిశారు. ‘రమణబాబు కోటాలోనే ఆనందరావుకు సీటు ఇచ్చామని, ఇద్దరు కలిసి పనిచేసుకోవాలి’ అని అప్పుడు లోకేష్ అన్న మాటలను పార్టీ క్యాడర్ గుర్తు చేసుకుంటోంది. పదవిపై హామీ ఇవ్వకుండా పరోక్షంగా రమణబాబుకు నామినేటెడ్ పదవి ఇచ్చేది లేదని తేల్చినట్టుగా క్యాడర్ భావిస్తోంది. దీనికితోడు గత ప్రభుత్వంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన సమయంలో అమలాపురం మున్సిపాలిటీ ఓసీ మహిళ రిజర్వ్ అయ్యింది. ఆ సమయంలో రమణబాబు సతీమణిని పోటీలో పెట్టాల్సిందిగా లోకేష్ సూచించారని, ఇందుకు రమణబాబు అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఎన్నికల్లో పట్టణంలో పార్టీ మూడవ స్థానంలో నిలిచింది. దీనిపై లోకేష్ అసంతృప్తితో ఉన్నారని సమాచారం. అయితే తూర్పు డీసీసీబీ చైర్మన్ పదవి తొలి నుంచి కాపు సామాజికవర్గానికి కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సైతం అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు), ఆకుల వీర్రాజుకు ఇచ్చిన విషయాన్ని రమణబాబు వర్గీయులు గుర్తు చేస్తున్నారు. ఈ ఆనవాయితీని కాదని బీసీలకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న వారు.. ఇదే విషయాన్ని లోకేష్ వద్ద తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీసీఎస్ చైర్మన్ పదవుల కోసం తూర్పు డీసీసీబీ పరిధిలో 198 సహకార సంఘాలున్నాయి. వీటికి సంబంధించి త్రీమెన్ కమిటీల నియామకం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన జాబితాను ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి పంపించారు. ఒకటి, రెండు చోట్ల తప్ప పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. గత ఫిబ్రవరిలోనే ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వం నుంచి జీవో విడుదల అవుతుందనుకున్న సమయంలోనే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఏఏసీఎస్ పదవుల పందేరానికి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసినా పదవులకు సంబంధించిన ప్రకటన మాత్రం విడుదల కాకపోవడంతో పదవులు దక్కినవారు ఆశగా ఎదురుతెన్నులు చూస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో దుర్భర పరిస్థితులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, పరిశుభ్రత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. నిత్యం ఎన్నో కేసులు వచ్చే ఈ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. బుధవారం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వార్డుల్లో పరిస్థితులను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇక్కడకు వచ్చిన కేసులలో 60 శాతం విఫలమవుతున్నాయని ఆరోపించారు. ఎవరినైనా ఇక్కడ చేరిస్తే, సీరియస్గా ఉందని, కాకినాడ తరలిస్తున్నారని, అలాంటప్పుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పుతున్న సందర్భాలున్నాయని చెప్పారు. గర్భవతులు చేరితే లేబర్ రూమ్కి కూడా తీసుకెళ్లడం లేదని, ఫలితంగా బెడ్ మీదే ప్రసవాలు అయిపోతున్నాయని, మంగళవారం రాత్రి కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పారు. మార్చురీలో దాతలు ఇచ్చిన వెంటిలేటర్లు, ఐస్ కేసులున్నా వాడడం లేదన్నారు. తాను వస్తున్నానని తెల్సి వార్డుల్లో శుభ్రం చేయడం, కరెంట్ పునరుద్ధరించడం చేశారని చెప్పారు. ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఏమిటి, డాక్టర్లు, సిబ్బంది ఉన్నారా లేదా అనే విషయాలు కూడా రివ్యూ చేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం దారుణమని అన్నారు. ఆసుపత్రిలో ఉన్న ఇబ్బందులపై, సమస్యలపై వీడియోలు చేసేది రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికేనని ఆయన స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నపుడు కరోనా సమయంలో పడిన ఇబ్బందులు గమనించి ఆసుపత్రిలో పరిస్థితులు మెరుగు పరచడం కోసం చర్యల్లో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని భరత్ పేర్కొన్నారు. దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా ? అని ప్రశ్నించారు. వీడియో తీసిన వీరా అనే యువకుడు మాట్లాడుతూ ఒక ముసలాయన రోడ్డుపై పడివుంటే, ఆటోలో తీసుకొచ్చి చేర్చామని, స్ట్రెచర్ మీద పడుకోబెట్టి కుట్లు వేసే రూమ్కి తీసుకెళ్లారని, అయితే అక్కడ కూడా విద్యుత్ లేదని చెప్పాడు. 500 పడకల ఆసుపత్రి అయినందున ఇక్కడ 24గంటలూ కరెంట్ ఉండాలని, కనీసం జనరేటర్ కూడా లేకపోవడం విచారకరమని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేవు, తగిన సిబ్బంది లేరు మాజీ ఎంపీ భరత్రామ్ -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించి, నివారణ దిశగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులు ఎస్పీ డి.నరసింహాకిశోర్ అదేశించారు. సీసీటీఎన్ఎస్ సమాచారం ద్వారా నెలవారీ నేర సమీక్షా సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. గ్రేవ్ ఎక్విటల్ కేసులు, మిస్సింగ్ కేసులు, పొక్సో, ఎస్సీ ఎస్టీ కేసుల పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీట్ హోల్డర్స్పై ప్రత్యేకంగా నిఘా ఉంచి వారి కదలికలు పసిగడుతూ ఉండాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగ్గ కేసులు ఉంటే ఆ దిశగా పనిచేయాలన్నారు. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమీక్షలో అడిషనల్ ఎస్పీలు ఎన్బీఎం మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్కుమార్ రెడ్డి, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. పాలిసెట్కు నేడు తుది గడువు రాయవరం: పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే ‘పాలిసెట్’ దరఖాస్తుకు గురువారం సాయంత్రంతో గడువు ముగియనుంది. ఫిబ్రవరి 27న నోటిఫికేషన్ విడుదలైన విషయం పాఠకులకు విదితమే. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తుకు తుది గడువు గురువారంతో ముగుస్తున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4,236 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. -
మాటతీరు తెలిసిన మర్యాదాపురుషోత్తముడు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘‘ పెద్దలతో ఎలా మాట్లాడాలో మనం రాముని మాటతీరును పట్టి తెలుసుకోవాలి, ఆయన మర్యాదాపురుషోత్తముడు, వినయాది సద్గుణశోభితుడు’’ అని వాగ్దేవీవరపుత్ర సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం టీనగర్లోని హిందు సమాజంలో ఆయన ఉత్తరకాండపై రెండవ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. సీతాసమేతుడయి కొలువుతీరిన రామచంద్రుని దర్శనార్థం మహర్షులు తరలి వచ్చా రు. రాక్షస పీడను తొలగించినందుకు శ్రీరాముని కొనియాడుతూ, వారు ఇంద్రజిత్తు గురించి పదేపదే ప్రస్తావించడంతో రామునిలో కుతూ హలం పెరిగింది. ‘మహాత్ములారా! మీరు ప్రత్యేకించి ఇంద్రజిత్తు గురించి ప్రస్తావించడానికి కారణం తెలుసుకోగోరతాను. అది రహస్యం కాకపోతే, తెలుసుకునే యోగ్యత నాకు ఉన్నదని మీరు భావిస్తే, నాకు తెలియచెప్పమని శ్రీరాముడు అడిగాడు, మునులు ఇంద్రజిత్తు తపస్సు, వాడు పొందిన వరాల గురించి చెబుతూ, వాడిని వధించడం విశేష మన్నారు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ఇంద్రజిత్తును వధించినది లక్ష్మణుడు అయితే, రాముని ప్రశంసించడంలో ఔచిత్యమేమిటని. ‘శ్రీరాముడు సత్యసంధుడు, ధర్మాత్ముడు అయితే, ఈ అస్త్రం ఇంద్రజిత్తుని వధించుగాక’ అని లక్ష్మణుడు స్తోత్రం చేస్తూ ఉయోగించిన అస్త్రమే ఇంద్రజిత్తు ప్రాణాలను తీసిందని మనం విస్మరించరాదని సామవేదం అన్నారు. రామాయణంలో జ్యోతిషశాస్త్ర ప్రాశస్త్యం పలు సన్నివేశాలలో కనపడుతుంది, జ్యోతిషం వేదాంగం, ఒక ప్రామాణికమైన శాస్త్రమని సామవేదం అన్నారు. రావణుడు సీతను విందముహూర్తంలో అపహరించాడని, ఆ ముహూర్తంలో అపహరించినవాడికి ప్రాణాంతకం. అలాగే, రావణుని తల్లి కై కసి విశ్రవసుబ్రహ్మను ‘దారుణ’ముహూర్తంలో సమీపించి సంతానం కోరడం వల్ల ఆమెకు లోకకంటకుడయిన రావణుడు జన్మించాడని, ఆ తరువాత పుట్టిన విభీషణుడు ధర్మాత్ముడవుతాడని ఆయన కై కసిని ఓదార్చాడని సామవేదం అన్నారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయినప్పుడు, ‘మానవులు నాకు తృణప్రాయులు, మానవులను తప్పించి ఇత రుల చేతిలో నాకు మరణం కలగకూడదని రావణుడు కోరుకున్నాడు, ఎట్టి ఆపదలలోను నా బుద్ధి ధర్మతప్పకూడదని విభీషణుడు బ్రహ్మను కోరుకు న్నాడు. బ్రహ్మదేవుడు విభీషణునికి అమరత్వాన్ని ప్రసాదించాడు, రావణుడు అదే అమరత్వాన్ని ముందు కోరితే, ఆయన ఆ వరాన్ని ప్రసాదించలేదని సామవేదం అన్నారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలికారు. వాగ్దేవీ వరపుత్ర సామవేదం షణ్ముఖశర్మ -
వివిధ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం ˘
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పిల్లల రక్షణ విభాగం, ప్రత్యేక దత్తత ఏజెన్సీ, చిల్డ్రన్ హోమ్ 2, వన్ స్టాప్ సెంటర్లలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఈ నెల 19వతేదీ లోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల భర్తీకి ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ ను జారీచే శామన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19వ తేదీలోపు అందజేయాలని పేర్కొన్నారు. అన్నదానం భక్తుల నుంచి అభిప్రాయ సేకరణ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భక్తులకు అందిస్తున్న సేవలపై ఎందుకు భక్తుల్లో అసంతృప్తి నెలకొని ఉందనే దానిపై ఇద్దరు ప్రయివేట్ వ్యక్తులతో కూడిన ఐవీఆర్ఎస్ బృందం రెండో రోజు బుధవారం కూడా అభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రధానంగా అన్నదానం పథకంలో ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని భక్తులను ఆ బృందం ప్రశ్నించింది. బాగున్నాయని చాలామంది భక్తులు చెప్పినట్టు సమాచారం. అయితే ఒకరిద్దరు మంచినీరు ఆలస్యమవుతోందని తెలిపారు. సత్యదేవుని నిత్యాన్నదానం హాలు ఫ్లోరింగ్ శుభ్రతపై ఆ బృందం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఫ్లోరింగ్ శుభ్రత ఇంకా బాగుండాలని, చెప్పినట్టు తెలిసింది. దేవస్థానం టాయిలెట్స్లో పరిశుభ్రత పై కూడా ఆ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసిందని సమాచారం. వక్ఫ్ సవరణలపై నిరసన కాకినాడ సిటీ: ముస్లిం మైనారిటీల హక్కులను హరిస్తున్న వక్ఫ్ సవరణలకు వ్యతిరేకంగా కాకినాడలో బుధవారం ముస్లింలు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ చట్టంను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వక్ఫ్ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు–2025ను వ్యతిరేకిస్తూ ముస్లిం వక్ఫ్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మొయిన్రోడ్డులోని జమియా మసీద్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వక్ఫ్ను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ముస్లిం నాయకులు జవహర్ అలీ, తాజువుద్దీన్, అబ్దుల్ బషీరుద్దీన్, రెహమాన్, రహీం, కుతుబుద్దీన్, జిలాని దురాని, అబ్దుల్ రజాక్ రిజ్వీ, గౌస్ మొహిద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తున్నామన్నారు. వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభిష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం త్యాగం చేసి దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కావన్నారు. -
రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానం
తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన రాపాక సహ దేవుడు, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె రాపాక భావన. నిడదవోలు ప్రభుత్వ మహిళా కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్ పరీక్షలు రాసి, 974 మార్కులతో సీఈసీలో రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచింది. నిరుపేద కుటుంబమైనా.. పిఠాపురానికి చెందిన కాపుగంటి సత్య రాజ్యలక్ష్మి సుధశ్రీ ఓకేషనల్ కోర్సులు సెరికల్చర్ విభాగంలో 977 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రధమస్థానం సాధించింది. తల్లిదండ్రులు సర్వారాయుడు, సునీత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా ఆమె పట్టుదలతో చదవి అత్యుత్తమ ఫలితం సాధించింది. ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత లేని తన లాంటి వారికి గతంలో ఎన్నడు లేని విధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ కళాశాలల రూపు రేఖలు మారి అన్ని వసతులు రావడంతో చదువులో రాణించగలిగాలని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. -
ఏపీఎస్పీలో ఉత్సాహంగా క్రీడలు
● రెండో రోజు హోరాహోరీగా పోటీ ● నేటి సాయంత్రం ముగింపోత్సవం కాకినాడ రూరల్: కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్లో రేంజ్ – 1 పరిధిలోని నాలుగు బెటాలియన్లకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొంటున్నారు. బుధవారం పరుగు పందెం పోటీలు, హై జంప్, కబడ్డీ, క్రికెట్, టగ్ ఆఫ్ వార్, తదితర పోటీలను నిర్వహించారు. మూడు రోజులు పాటు జరగనున్న పోటీలు గురువారం సాయంత్రంతో ముగియనున్నాయి. పోటీలలో ఏపీఎస్పీ కాకినాడ 3వ బెటాలియన్తో పాటు విజయనగరం, విశాఖపట్నం, మంగళగిరి బెటాలియన్ల క్రీడాకారులు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమంలో బెటాలియన్ల ఐజీ రాజకుమారి, డీఐజీ ఫక్కీరప్ప తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. రెండో రోజు విజేతలు వీరే హైజంప్ విభాగంలో 5వ బెటాలియన్కు చెందిన పి.ప్రసాదరావు, 16వ బెటాలియన్కు చెందిన వి.సుధాకర్, వి.శ్రీను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచారు. 1500 మీటర్ల పరుగు పోటీలో తొలి మూడు స్థానాలలో 5వ బెటాలియన్కు చెందిన సురేష్కుమార్, 16వ బెటాలియన్కు చెందిన కె.రాజానాయుడు, 5వ బెటాలియన్కు చెందిన పి.సత్యారావు, చెస్ విభాగంలో 16వ బెటాలియన్కు చెందిన శివకుమార్ విన్నర్గాను, 6వ బెటాలియన్కు చెందిన శ్రీను రన్నర్గా నిలిచారు. కబడ్డీ విభాగంలో 16వ బెటాలియన్ విన్నర్గాను, 5వ బెటాలియన్ రన్నర్గా నిలిచారు. క్రికెట్ విభాగంలో 3వ బెటాలియన్ విన్నర్గాను, 5వ బెటాలియన్ రన్నర్గా నిలిచారు, 200 మీటర్ల విభాగంలో 5వ బెటాలియన్కు చెందిన ఎస్.శివకుమార్, 16వ బెటాలియన్కు చెందిన జి.శ్రీను, జి.మురళీ విజేతలుగా నిలిచారు. 5వేల మీటర్ల పరుగు విభాగంలో 5వ బెటాలియన్కు చెందిన ఎస్.శివకుమార్, వై.సత్యారావు, 16వ బెటాలియన్కు చెందిన రాజినాయుడు విజేతలుగా నిలిచారు. మారథాన్లో 5వ బెటాలియన్కు చెందిన ఎం.లక్ష్మణ్, టి.శ్రీనివాసరావు విజేతలుగా నిలిచారు. -
క్రిస్టియన్ బృంద సంగీతంలో భవాని గిన్నిస్ రికార్డ్
కరప: మండలం వేళంగి గ్రామానికి చెందిన టెక్కలి వీరకన్య భవాని (పల్లవి) క్రిస్టియన్ బృంద సంగీతంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. సంగీతాభ్యాసంలో పాస్టర్ అగస్టిన్ ఇచ్చిన ఉచిత శిక్షణలో అగ్రగామిగా ఉన్న భవాని విజయవాడలోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో గతేడాది డిసెంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. అగస్టిన్ దండంగి వేణుగోపాల్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒక గంట వ్యవధిలో అత్యధికంగా 1046 పియానో వాయిద్య ప్రదర్శన వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం ద్వారా ఆమె ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఈ మేరకు హైదరాబాద్లో ఈనెల 14వ తేదీన నిర్వహించిన కార్యక్రమంలో బ్రదర్ అనిల్కుమార్, అగస్టిన్ వేణుగోపాల్ తనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ పార్టిస్పేషన్ సర్టిఫికెట్ అందజేసినట్టు భవాని బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు ప్రత్తిపాడు రూరల్: మండలంలోని వెంకటనగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటనా స్థలంలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ప్రత్తిపాడు పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు నందవరపు వీరబాబు (20), నందవరపు కృష్ణ బైక్పై కొత్తూరు (యూజే పురం) వెళ్లి వివాహ వేడుకలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో వెంకటనగరం చెరువు సమీపంలోని కోళ్ల ఫారం వద్ద యూజే పురం వైపు వెళ్తున్న బోర్ వెల్ వాహనం భైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నందవరపు వీరబాబు (20) తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కుర్చున్న నందవరపు కృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. కృష్ణను 108 వాహనంలో ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి గురైన అన్నదమ్ములు నందవరపు రాము, బైరాగి కుమారులు. బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలంలో రోడ్డు బైఠాయించి ఆందోళన చేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నందవరపు రాము దంపతుల కుమారుడు వీరబాబు వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో నిత్యం చలాకీగా తిరిగే విరబాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో చింతలూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి, కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. -
వసతులు, సౌకర్యాలతో లక్ష్య సాధన
రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన నక్కా శ్రావణి సత్య హెచ్వో (హోటల్ మేనేజ్మెంట్) గ్రూప్లో 1000/982 మార్కులు సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. కొండగుంటూరు ప్రాంతానికి చెందిన శ్రావణి తండ్రి నక్కా చిన్న అప్పారావు రోజువారీ కూలీ. తల్లి ఆదిలక్ష్మి నర్సరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం ఉన్న శ్రావణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేసిన విద్యా వసతులు, సౌకర్యాలు, స్కాలర్షిప్లతో తన లక్ష్యాన్ని అలవోకగా సాధించింది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
క్షేత్రస్థాయి నివేదిక మేరకు నిర్ణయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూములకు సంబంధించి క్షేత్రస్థాయి నివేదిక ఆధారంగా వచ్చే డేటాతో తదుపరి సమావేశం నిర్వహిస్తామని అమలాపురం ఆర్డీఓ కె.మాధవి అన్నారు. బుధవారం అంతర్వేది ఆలయ ప్రాంగణంలో మండలంలోని వివిధ గ్రామాల్లో స్వామివారి దేవస్థానం భూముల శిస్తుల పెంపుదల నిమిత్తం ఏర్పాటు చేసిన అధికార సమావేశం రైతుల హాజరు శాతం తక్కువగా ఉండడం వల్ల వాయిదా వేశారు. దీంతో గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ, అగ్రికల్చర్, ఫిషరీస్ సిబ్బంది దేవస్థానం భూములపై ఇచ్చే వాస్తవ పరిస్థిల డేటాపై తదుపరి సమావేశం నిర్వహణకు ఆర్డీఓ పై విధంగా తెలిపారు. సదరు సమావేశానికి రైతులు శాతం సంతృప్తికరంగా ఉండాలని కూడా ఆర్డీఓ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా దేవస్థానం కౌలు రైతులు ఒక వినతి పత్రాన్ని ఆర్డీఓకు అందజేశారు. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం కావడం వల్ల, మరో పక్క చెరువుల వల్ల వచ్చే వ్యర్థమైన నీటి వల్ల దేవస్థానం భూముల్లో వ్యవసాయం దెబ్బతిందని, గత 12 సంవత్సరాలుగా కనీసం పంట ఊడ్చలేని పరిస్థితులు ఏర్పడ్డాయని, వ్యవసాయ భూములు తరుచూ ముంపులోనే మునిగి ఉంటున్నాయని ఆ పత్రంలో వారు వివరించారు. గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు అంచనా వేసి, తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ–1 కొల్లాబత్తుల శుభాకర్, ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండా జాన్బాబు, మాలే శ్రీనివాస నగేష్, దేవ రాజేంద్రప్రసాద్, ఉండపల్లి అంజిబాబు, పలువురు వీఆర్వోలు, వివిధ గ్రామాలకు చెందిన కౌలు రైతులు పాల్గొన్నారు. అంబేడ్కర్ను అవమానించిన యువకుడి అరెస్టు శంఖవరం: గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి చెప్పులు దండ వేసిన యువకుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు అందించిన వివరాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన యువకుడు శంఖవరం గ్రామానికి చెందిన పడాల వాసుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 14 అర్ధరాత్రి దాటిన తరువాత వాసు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానం కలిగించినట్లుగా పోలీసులు గుర్తించారు. దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదే రోజున అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించారు. అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, డిఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 40 మంది పోలీసులు ప్రత్యేక బృందాలుగా విచారణ చేపట్టారు. ఈ కేసులో సాంకేతిక, సీసీ ఫుటేజీల ఆధారంగా అనేక మంది అనుమానితులను విచారించి నిందితుడిని గుర్తించారు. నిందితుడు ఆటో డ్రైవర్గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడు దుందుడుకు స్వభావంతో ఈ దారుణానికి ఒడిగటినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితునికి కఠిన శిక్ష పడేందుకు మరిన్ని సాంకేతిక ఆధారాలతో లోతైన దర్యాప్తు చేస్తున్నామన్నారు. అన్నవరం డ్రైవర్పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అన్నవరం: అన్నవరం దేవస్థానం ట్రాన్స్పోర్టు విభాగంలో డ్రైవర్గా పనిచేస్తున్న కొల్లు పైడిబాబు (పెద్ద శ్రీను)ను ‘బ్రీత్ అనలైజర్’ పరీక్షలో మద్యం తాగినట్టు గుర్తించి తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. తదుపరి చర్యల కోసం ఈఓకు నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు. బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు రాయవరం: స్థానికంగా 11 ఏళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన తేతల వెంకట శ్రీనివాస్రెడ్డి అలియాస్ కేబుల్ శ్రీనుపై ఎస్సై డి.సురేష్బాబు కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని రాయవరం మెయిన్రోడ్డులో అరెస్టు చేశామన్నారు. అనంతరం జేఎఫ్సీఎం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు తెలిపారు. -
నేటి ప్రయోజనం!
నాటి ప్రణాళిక.. చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి పాగా ఈ కోటలో.. ఎన్ని కష్టాలు రానీ.. నష్టాలు రానీ నీ మాట దక్కించుకో బాబయా.. అంటూ సాగే ఈ గీతంలోని ప్రతి పదం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నూటికి నూరు పాళ్లు అతికినట్టు సరిపోతుంది. పేదరికం కారణంతో ఏ పిల్లవాడూ చదువుకు దూరం కాకూడదు. కేజీ నుంచి పీజీ వరకు ఏ స్థాయిలోనూ ఏ విధమైన ఆటంకం రాకూడదు. అందుకు చేయాల్సింది ఏదైనా వెనకాడకూడదు. ఈ లక్ష్యంతో నాడు–నేడు పేరున బృహత్తర పథకాన్ని అమలు చేసిన దార్శనికుడు జగన్మోహన్రెడ్డి. ఏటేటా ఫీజు రీయింబర్స్మెంట్. పిల్లలు పాఠశాలకు, కళాశాలకు వస్తున్నారా లేదా అని ఉపాధ్యాయుల ద్వారా పటిష్టమైన నిఘా. పిల్లల ఇళ్లకే వెళ్లి వాళ్ల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాజీ లేని ప్రణాళికా రచన.. మానసిక ఉల్లాసానికి ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడలకు ప్రోత్సాహం. ఇలా ఎన్నో చర్యలు చేపట్టి విద్యార్థుల మనసులో కోట కట్టుకుని సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అందుకోసం ఎన్ని కష్టాలు, నిధుల లేమి ఎదురైనా ఎలాగోలా సమకూర్చి అవసరాలన్నీ తీర్చి నిజంగానే జగన్ మామ అనిపించుకున్నారు. ఆయన నాటిన విత్తనాలు నేడు చక్కని ఫలితాలను ఇస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం: పరీక్షా ఫలితాలు వెలువడ్డాయంటే చాలు 1, 2, 3, 4, 5... అసాధారణ ఫలితాలు అద్భుత విజయాలు మా సొంతం అంటూ ప్రసార మాద్యమాల్లో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రచారంతో ఊదరగొడుతుంటాయి. గత కొన్నేళ్లుగా విద్యా వ్యవస్థలో ఈ పరిస్థితి నాటుకుపోయింది. ర్యాంకు రావాలంటే ప్రైవేటు విద్యా సంస్థలో తప్ప మరెక్కడా రాదని ప్రజల్లో నాటుకు పోయేలా చేశాయి ప్రైయివేటు విద్యా సంస్థలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ప్రవేశ పెట్టి అమలు చేసిన పథకాలు, విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన సంస్కరణలతో ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను మార్చివేయడంతో అలాంటి పరిస్థితిని మార్చి చూపించారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. ప్రభుత్వ కళాశాలల్లో చదివి అత్యుత్తమ ఫలితాలను సొంతం చేసుకుని సత్తా చాటి ప్రైవేటు పాఠశాలలకు సవాల్ విసురుతున్నారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు. ఈ ఏడాది ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు 54 మంది అత్యుత్తమ ఫలితాలు సాధించగా వారిలో 99 శాతం మంది ప్రభుత్వ కళాశాలల విద్యార్థులే కావడం విశేషం. మట్టిలో మాణిక్యాలు అరుదుగా బయటపడుతుంటాయి, అలాంటి మాణిక్యాలకు సాన పెడితే వాటి విలువ ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. సరైన మౌలిక వసతులు, వృత్తికి అనుకూల వాతావరణం కల్పిస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. గడచిన ఐదేళ్లలో నాడు–నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారి పోవడంతో పాటు ఉపాధ్యాయులు తమ శక్తి వంచన లేకుండా తర్ఫీదు ఇస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు విద్యార్థులు. ఒక్క పైసా కూడా ఖర్చు లేదు. మీకు చదవాలనే ఆసక్తి ఉంటే చాలు అన్ని వసతులు కల్పిస్తాం రండి.. చదువుకోండి.. మంచి ఉన్నత స్థానాలకు చేరుకోండి.. అంటు ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుంటే విద్యార్థులు క్యూకడుతున్నారు. రూ.లక్షల ఫీజులు చెల్లించి చదువుకునే ప్రైవేటు కళాశాలలను తలదన్నే విధంగా ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు తమ సత్తా చాటారు. ప్రభుత్వ కళాశాల్లో మెరుగుపడిన సౌకర్యాలతో పైసా ఫీజు లేకుండా చదువుకుని టాపర్లుగా నిలిచి ప్రభుత్వ కళాశాలలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెస్తున్నారు ప్రభుత్వ కళాశాలల విద్యార్థినులు.మనో నేత్రమే ఆమె బలం తుని మండలం టి.వెంకటాపురం గ్రామానికి చెందిన గింజాల హేమజ్యోతి పుట్టుకతో ఒక కన్ను పూర్తిగా కనిపించకపోయినా మసకబారినట్టు కనిపించే రెండో కన్నుతో విద్యను అభ్యసించింది. ఆమె ఇంటర్మీడియట్ ఎంఈసీలో అత్యుత్తమంగా 660 మార్కులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన షైనింగ్ స్టార్స్ జాబితాలో స్థానం దక్కించుకుంది. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నాగ సత్యవతి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత బీఈడీ చదివి ఉపాధ్యాయురాలు కావాలన్నదే తన కుమార్తె ఆశయమని తెలిపారు. మరింత మందికి స్ఫూర్తి బిక్కవోలు మండలంలోని పందలపాకకు చెందిన రుత్తల లీలా శ్రావణి. విజయవాడ చెందిన ఈమె కళాశాల ఫస్ట్ రావడంతో పాటు రాష్ట్రంలో సీఈసీలో 943 మార్కులతో హైస్కూల్ ప్లస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆమె చదువు మరింతమంది మహిళలకు బాట వేసింది. రూపాయి ఖర్చు లేకుండా అన్ని వసతులతో ప్రభుత్వ కళాశాలలను తీర్చి దిద్దడం వల్లే విద్యా ప్రమాణాలు పెరిగి తమలాంటి వాళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నామని ఆమె పేర్కొంది. ఆటో డ్రైవర్ కుమార్తె అయినా.. కాకినాడ పీఆర్ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలకు చెందిన దుంపా సాయిలక్ష్మి ఎలక్ట్రానిక్స్ గ్రూపులో 1000కి 982 మార్కులు సాధించి ప్రధమ స్థానంలో నిలిచింది. పేద కుటుంబానికి చెందిన ఆమె తండ్రి దుంపా ప్రసాద్ ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు. తల్లి శేషారత్నం గృహిణి. డిగ్రీ పూర్తి చేసి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతానని ఆమె తెలిపారు. విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల, ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన విద్యా భోదన వల్ల తాను మంచి మార్కులు సాధించగలిగాలని ఆమె తెలిపారు. ఇవిగో సంస్కరణ ఫలితాలు.. గత వైఎస్సార్ సీపీ సర్కారు చర్యలతో నేటి విద్యార్థుల విజయ సోపానాలు సరికొత్త రికార్డులు సాధిస్తున్న వైనం ఇంటర్మీడియెట్ ఫలితాలే నిదర్శనం -
వనామీ.. ధర పెరగదేమి!
సాక్షి, అమలాపురం: అమెరికా సుంకాల కొరడాను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నా.. నిలిచిపోయిన ఎగుమతులు మొదలైనా.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వనామీ రొయ్యల రైతుల వెతలు వీడలేదు. సుంకాల పేరుతో రాత్రికి రాత్రి ప్రతి కౌంట్కు రూ.40 నుంచి రూ.60 వరకు రొయ్యల ధరలు తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.10 నుంచి రూ.20 వరకు మాత్రమే పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 23 వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని అంచనా. ప్రస్తుతం సుమారు 13 వేల ఎకరాల్లో మే 15 లోపు ఇంచుమించు తొలి పంట దిగుబడి రైతులకు అందుతుంది. అమెరికా సుంకాల సంక్షోభం వీడడంతో పాత ధరలు వస్తాయని వనామీ రైతులు ఆశలు పెట్టుకున్నారు. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు రావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో వనామీకి రికార్డు స్థాయి ధరలు దక్కాయి. 30 కౌంట్ (కేజీకి 30 రొయ్యలు) ధర కేజీ రూ.470 వరకు, 40 కౌంట్ ధర రూ.415కు పెరిగింది. స్థానికంగా రొయ్యల పట్టుబడి మొదలైనప్పటి నుంచి వ్యాపారులు నెమ్మదిగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. అమెరికా సుంకాలు ప్రకటించే సమయానికి 30 కౌంట్ ధర రూ.460 వరకు తగ్గించారు. సుంకాల ప్రకటన తరువాత ఒకేసారి కేజీకి రూ.60 తగ్గించి రూ.400 చేశారు. 40 కౌంట్ ధర రూ.415 నుంచి రూ.390కి తగ్గించగా, సుంకాల ప్రకటన తరువాత రూ.310కి కుదించారు. ఇలా ప్రతి కౌంట్కు ధరను భారీగా తగ్గించేశారు. 50 కౌంట్ ధర రూ.350 నుంచి రూ.320కి, 60 కౌంట్ ధర రూ.320 నుంచి రూ.280కి, 70 కౌంట్ ధర రూ.290 నుంచి రూ.250కి, 80 కౌంట్ ధర రూ.260 నుంచి రూ.230కి, 90 కౌంట్ ధర రూ.240 నుంచి రూ.210కి తగ్గించేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేజీ రూ.250 ఉన్న 100 కౌంట్ సుంకాల విధించిన తరువాత రూ.190కి తగ్గించారు.టారిఫ్ వాయిదా పడినా..అమెరికా సుంకాల విధింపును మూడు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో వనామీ రొయ్యల ఎగుమతులు మొదలయ్యాయి. పరిస్థితులు సానుకూలంగా మారడంతో పాత ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ.. పెంపు మాత్రం స్వల్పంగా ఉంది. 30 కౌంట్కు ఏకంగా రూ.60 వరకు ధర తగ్గించిన ఎగుమతిదారులు.. ఇప్పుడు కేవలం రూ.25 మాత్రమే పెంచారు. 40 కౌంట్కు రూ.60 వరకు తగ్గించి ఇప్పుడు రూ.30 వరకు పెంచారు. 50 కౌంట్కు రూ.50 తగ్గించి ఇప్పుడు కేవలం రూ.20, 60 కౌంట్కు రూ.40 తగ్గించి ఇప్పుడు రూ.20 చొప్పున పెంచి చేతులు దులుపుకున్నారు. -
పోషక విలువల లక్ష్మణ ఫలం
పిఠాపురం: మన పురాణ పురుషులు అయిన రాముడు, సీత, లక్ష్మణుల పేర్లతో సీతాఫలం, రామఫలంతో పాటు ఇప్పుడు లక్ష్మణ ఫలం స్థానికంగా పండుతున్నాయి. పలువురు రైతులు తమ ఇళ్ల వద్ద, పొలాల్లోను వీటిని పండిస్తున్నారు. దీనిని తింటే క్యాన్సర్ తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్న తరుణంలో వీటి పెంపకం చాలాచోట్ల పెరిగింది. దీనిని ఆంగ్లంలో సోర్సో గ్రావియోలా అని పిలుస్తారు. దీనిలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, తయామిన్, రెబోఫ్లోవిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్సు వంటి ఎన్నో పోషక విలువలు ఉంటాయి. దీని జ్యూస్ తాగితే దానిలోని పోషక విలువలు ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. 12 రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేసే సామర్థ్యం ఈ లక్ష్మణ ఫలానికి ఉందని ఆయుర్వేదం చెబుతోంది. అందుకే లక్ష్మణ ఫలాన్ని తింటే మంచినిద్ర పట్టడంతో పాటు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి. రక్తహీనతను తగ్గించే గుణం దీనిలో ఉంది. ఎముకలను ధృడంగా మార్చి కీళ్ల నొప్పులను నివారిస్తుంది. చెడు కొలస్ట్రాల్ కరిగి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. నీరసం, అలసట దూరమై శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లతో బాధ పడే వారికి ఇది ఒక మెడిసిన్లా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలలో ఈ పండ్లు అందుబాటులోకి వస్తాయి. పోర్చుగీసు నుంచి ఈ పండ్లు దిగుమతి అయినట్లు చెబుతుంటారు. వీటిని పండుగా తినడంతో పాటు స్వీట్లు, జ్యూస్లు, ఐస్క్రీంలు, జామ్ల తయారీలో వినియోగిస్తారు. ధర కిలో రూ.1,400 వరకు పలుకుతోందంటే దీని విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. -
అంబేడ్కర్ విగ్రహానికి అవమానం
శంఖవరం: మండల కేంద్రమైన శంఖవరంలో మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంతో దళిత సంఘాలు అగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం దళితవాడలో అంబేడ్కర్ విగ్రహం మెడలో చెప్పుల దండ చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న దళిత సంఘాల నేతలు శంఖవరం చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనతో ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద కత్తిపూడి – శంఖవరం ప్రధాన రహదారిని దిగ్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహానికి అవమానం జరగడం అంటే యావత్తు భారతజాతికి అవమానం జరిగినట్లు అని తెలిపారు. ఈ ఘటనకు కారకులైనవారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలానికి చేరుకుని 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. దళిత సంఘాల నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. ఎస్పీ హామీ మేరకు దళిత సంఘాలు నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నాయి. అడిషినల్ ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని సీఐ చెన్నకేశవరావు ఎస్పీ వెంట ఉన్నారు. దళిత సంఘాల నాయకులు శెట్టిబత్తుల కుమార్రాజా, టి.కిరణ్కుమార్, సోనిహుడ్, వెంకటరత్నం, చరమర్ల మదు, గోళ్ల శేఖర్, పులి సుధాకర్, పి.భరత్ పాల్గొన్నారు. నిందితులను శిక్షించాలి : ముద్రగడ గిరిబాబు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపన కోసం చిరస్మరణీయ కృషిచేసిన అంబేడ్కర్ను అవమానించడం దారుణమన్నారు. చెప్పుల దండ వేసిన దుండగులు ఆగ్రహించిన దళిత సంఘాల నేతలు శంఖవరంలో రహదారి దిగ్బంధం నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ ఎస్పీ హామీతో ఆందోళన విరమణ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఏపీఎస్పీలో క్రీడా సంబరాలు
కాకినాడ రూరల్: విధులతో నిత్యం టెన్షన్గా గడిపే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసులు(ఏపీఎస్పీ) ఉపశమనం పొందేలా, వారిలోని క్రీడాస్ఫూర్తిని తేటతెల్లం చేసేలా స్పోర్ట్స్ మీట్ – 2025 కాకినాడలో ఘనంగా ప్రారంభమైంది. మూడురోజుల పాటు రేంజ్ – 1 పరిధిలో జరగనున్న క్రీడా పోటీలకు 3వ బెటాలియన్ ఆతిథ్యం ఇచ్చింది. రమణయ్యపేటలో ఏపీఎస్పీ 3వ బెటాలియన్ పరేడ్లో క్రీడా పోటీలను కమాండెంట్ ముద్రగడ నాగేంద్రరావు మంగళవారం ఉదయం శాంతి కపోతాలు, బెలూన్లు గాలిలో ఎగురవేసి లాంఛనంగా ప్రారంభించారు. విజయనగరం నుంచి 5వ, విశాఖపట్నం నుంచి 16వ, కాకినాడ నుంచి 3వ, మంగళగిరి నుంచి 6వ బెటాలియన్లకు చెందిన పోలీసు సిబ్బంది క్రీడా సంబరాలకు ఉత్సాహంగా హాజరయ్యారు. తమలోని ప్రతిభను చాటేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీ పడ్డారు. తొలుత క్రీడాకారులు కవాతు, బ్యాండ్తో ఆకట్టుకున్నారు. కవాతు ద్వారా క్రీడాకారుల గౌరవ వందనాన్ని కమాండెంట్ నాగేంద్రరావు స్వీకరించారు. బెటాలియన్ నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎందరో ఎదిగారని, ముఖ్యంగా బాస్కెట్బాల్, వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచారన్నారు. స్టోర్ట్స్ మీట్లో భాగంగా బాస్కెట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్, షాట్ఫుట్, క్రికెట్, హై జంప్ వంటి పోటీలను తొలి రోజు నిర్వహించారు. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్లు చంద్రశేఖర్, మన్మఽథరావు, ఆర్ఐలు అజయ్కుమార్, రవిశంకరరావు, విఠలేశ్వరరావు, ప్రసాద్, బెటాలియన్ ఇంగ్లిషు మీడియం స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రేంజ్ – 1 పరిధిలోని నాలుగు బెటాలియన్ల క్రీడాకారుల హాజరు మూడు రోజుల పాటు సందడి స్పోర్ట్స్మీట్ను లాంఛనంగా ప్రారంభించిన కమాండెంట్ నాగేంద్రరావు -
చిన్నబాబు వచ్చారు.. బహుపరాక్!
అన్నవరం: కలెక్ట్రేట్లో జరిగే అధికారిక సమావేశాల్లో కలెక్టర్తో కలిసి ఆయన పుత్రరత్నం పాల్గొంటే ఎలా ఉంటుంది? ఓ ఎస్పీ కుమారుడు పోలీస్ స్టేషన్లు తనిఖీ చేస్తానంటే..! మరోచోటైతే ఇవి సాధ్యం కాకపోవచ్చునేమో! కానీ అన్నవరం దేవస్థానంలో మాత్రం ఈ తంతు 4 నెలలుగా యథేచ్ఛగా సాగిపోతోంది. సత్యదేవుని సన్నిధిలో ఓ అధికారి పుత్రరత్నం తమపై ఎక్కడా లేని పెత్తనం చేస్తున్నారంటూ సిబ్బంది, ఇతర అధికారులు వాపోతున్నారు. ప్రతి రోజూ ఆ అధికారి విధులకు వచ్చారా అని కాకుండా.. ఆయన గారి కొడుకు.. చినబాబు వచ్చాడా.. వస్తే ఎక్కడున్నాడంటూ సిబ్బంది ఆరా తీస్తున్నారు. తమ సెక్షన్కు వస్తే ఏమంటాడో.. అసలు వచ్చేలా ఉన్నాడా అంటూ ఆ పుత్రరత్నానికి సహాయకుడిగా ఉండే అటెండర్ను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. ఎదురుపడితే ఏమంటాడో అని హడలెత్తుతున్నారు. అధికారిక సమావేశంలో.. దేవస్థానం భద్రతకు ఉపయోగించే డ్రోన్ కెమెరాల కొనుగోలుపై ఆ కంపెనీ ప్రతినిధులతో రత్నగిరిపై ఆ అధికారి కార్యాలయంలో సోమవారం ఒక సమావేశం జరిగింది. ఇందులో ఆ అధికారితో పాటు ఈఈ లు, డీఈలు ఏఈఓలు, సూపరింటెండెంట్లు, సెక్యూరిటీ అధికారితో పాటు ఆ అధికారి పుత్రరత్నం చినబాబు కూడా పాల్గొన్నారు. డ్రోన్ కెమెరాల గురించి ఆ అధికారికి బదులు చినబాబే ప్రశ్నించడం మరో విడ్డూరం. ఇటువంటి సమావేశాల్లో చినబాబు పాల్గొన్నప్పుడు ఎవ్వరినీ ఫొటోలు, వీడియోలు తీయనివ్వరు. ఆ అధికారి సీసీ మాత్రమే ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఫొటోల్లో ఆ చినబాబోరిని కట్ చేసి, మిగిలిన ఫొటోలను దేవస్థానం సెక్షన్ హెడ్స్ గ్రూపులో పెడుతున్నారు. చినబాబుగారి పెత్తనం ఇలా.. ఫ దేవస్థానంలో సీసీ టీవీలు పరిశీలించే అధికారం, సంబంధిత లింక్ దేవస్థానంలో కీలకమైన నలుగురికి మాత్రమే ఉంటుంది. కానీ, ఆ అధికారి పుత్రరత్నానికి కూడా ఆ లింక్ ఇచ్చారు. దీంతో ఆయన వాటిని చూసి, సిబ్బందికి డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం అందరికీ తెలియడంతో ఆ అధికారికి, మరో కీలక వ్యక్తికి తప్ప అందరికీ ఆ లింక్ తొలగించారు. పాస్వర్డ్ కూడా మార్చేశారు. ఫ దేవస్థానానికి వచ్చిన ప్రతిసారీ చినబాబు సీసీ టీవీలుండే కమాండ్ కంట్రోల్ రూముకు వెళ్లి కొంతసేపు ఆ టీవీలు పరిశీలిస్తారు. ఆ సమయంలో ఎవ్వరూ లోపలకు రాకుండా బయట ఒకరు కాపలాగా ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు, సూచనలను అక్కడి సిబ్బంది పాటించాలి. ఫ పీఆర్ఓ కార్యాలయాన్ని చినబాబు సందర్శించినప్పుడు అక్కడ సిబ్బంది ఎవ్వరూ లేకపోవడంతో అవమానంగా భావించారు. దీంతో, ఆయన ఆదేశాల మేరకు ఆ మర్నాడే అక్కడ సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఫ ఒక రోజు స్వామివారి నిత్యకల్యాణం, ఆన్లైన్ వ్రతం జరిగే కార్యాలయాన్ని సందర్శించి, సిబ్బంది పనితీరును పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఫ ఆ అధికారి గత నెలలో రెండు రోజుల సమావేశానికి విజయవాడ వెళ్లినపుడు ఆయన అధికారిక వాహనంలోనే చినబాబు నేరుగా దేవస్థానానికి వచ్చారు. దర్జాగా ఆ అధికారి కూర్చునే ముందు సీటులో కూర్చుని పెత్తనం చేశారు. వాస్తవానికి అధికారి లేనపుడూ ఆ కారును వేరొకరు ఉపయోగించకూడదు. కుటుంబ సభ్యులైనా సరే ఆ అధికారితో పాటు ప్రయాణించినప్పుడే ఆ వాహనం ఎక్కాలి. ఫ దేవస్థానానికి మరో వాహనం కూడా ఉంది. చిన్నబాబు కొన్నిసార్లు ఆ వాహనంలో కొండ పైకి వచ్చి, అనధికారిక పర్యవేక్షణ అనంతరం తిరిగి కొండ దిగువకు అదే వాహనంలో వెళ్తున్నారు. ఫ దేవస్థానానికి వచ్చినపుడు పర్యవేక్షణ అనంతరం ఆ అధికారి కార్యాలయానికి ఎదురుగా ఉన్న వీఐపీ గదిలో చినబాబు సేద తీరుతారు. అప్పుడు ఆ అధికారి మాదిరిగానే ఆ పుత్రరత్నానికి కూడా మర్యాదలు చేయాల్సిందే. ఫ గతంలో ఎంతో మంది అధికారులు వచ్చినా వారి పిల్లలు ఎలా ఉంటారో కూడా సిబ్బందికి తెలియదు. ఎప్పుడూ ఇలాంటి వ్యవహారం చూడలేదని సిబ్బంది చెబుతున్నారు. ఫ ఆ పుత్రరత్నం ఓవర్ యాక్షన్ దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఎందుకనో కానీ మౌనం వహిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, సరైన ఆధారాల కోసం ఎదురు చూస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. దేవస్థానంలో సీసీ టీవీలు పరిశీలిస్తే చినబాబు కదలికలు తెలిసిపోతాయని పలువురు అంటున్నారు. ఉన్నతాధికారులు చినబాబు అజమాయిషీకే కత్తెర వేస్తారో లేక ఆ అధికారికే ఉద్వాసన పలుకుతారో వేచి చూడాల్సిందే. ·˘ A¯]l²Ð]lÆý‡… §ólÐ]lÝ릯]l…ÌZ ఓ అధికారి పుత్రరత్నం నిర్వాకం ·˘ BĶæ$¯]l Úëyø Ķæ*MýSÛ¯ŒS™ø హడలెత్తుతున్న సిబ్బంది ·˘ A°²…sê BĶæ$¯]l ò³™èl¢¯]lÐól$.. -
ఉత్తరకాండ వాల్మీకి రామాయణాంతర్గతమే..
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఉత్తరకాండ నిస్సందేహంగా వాల్మీకి మహర్షి రామాయణాంతర్గతమే. ఈ వివాదం ప్రాచీన కాలంలో లేదు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఋషిపీఠం సత్సంగం ఆధ్వర్యాన ఉత్తరకాండపై నగరంలోని హిందూ సమాజంలో మంగళవారం జరిగిన తొలి రోజు ప్రవచనంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తర కాండపై వివాదం ఇటీవల తలెత్తిందని అన్నారు. ఉత్తర భారతంలో ఈ వివాదం లేదని, రామాయణంపై వెలువడిన అన్ని భాష్యాల్లోనూ ఉత్తరకాండలోని అంశాలను పేర్కొన్నారని చెప్పారు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతీకగా మహర్షి వాల్మీకి 24 వేల శ్లోకాలతో రామాయణం రచించారని, ఉత్తరకాండ లేదనుకుంటే, గాయత్రీ మంత్రంలో మూడక్షరాలు లేవనుకోవాలని అన్నారు. షట్కాండలు రచించిన అనంతరం ఉత్తరకాండ రచించినట్టు బాలకాండలోనే వాల్మీకి మహర్షి పేర్కొన్నారని, అప్పటి వరకూ జరిగిన కథను షట్కాండలలో, జరగబోయే కథను ఉత్తరకాండలో రచించారని వివరించారు. తపో మార్గంలో, యోగదృష్టితో మహర్షి రచించిన రామాయణంలో ఎటువంటి తప్పులూ ఉండవన్నది బ్రహ్మవాక్కు అని చెప్పారు. బాలకాండ 3వ సర్గలో సీతాపరిత్యాగాన్ని ఉత్తరకాండలో రచించినట్టు వాల్మీకి మహర్షి పేర్కొన్నారని తెలిపారు. ‘యుద్ధకాండ వరకూ పారాయణ చేస్తే, సంపూర్ణ రామాయణ ఫలితం లభిస్తుందని అంటే, ఉత్తరకాండ లేదని అర్థం కాదు. సుందరకాండ పారాయణ చేస్తే పూర్తి రామాయణ పారాయణ ఫలితం లభిస్తుందని అంటే మిగతా కాండలు, కథ లేవని అర్థం కాదు’ అని ఆయనన్నారు. ఆద్యంతం ఛలోక్తులతో సామవేదం ప్రవచనం కొనసాగింది. ‘రచన ఎంత అసంప్రదాయమైనది, సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నదీ అయితే అంత గొప్ప పురస్కారం లభించవచ్చు. ఇటువంటి పురస్కారం భగవంతుని తిరస్కారానికి గురి కాక తప్పదు’ అని అన్నారు. ‘నాకు ఇష్టమైనవి, నేను నమ్మినవి ప్రమాణాలు, నేను నమ్మనివి ప్రక్షిప్తాలు అనుకునే మూర్ఖాగ్రేసరులు కొందరున్నారు’ అంటూ ఛలోక్తులు విసిరారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగత వచనాలు పలుకుతూ, పూర్వ రామాయణమైనా, ఉత్తర రామాయణమైనా రాముని చరిత్రేనని అన్నారు. ఈ ప్రవచనాలు వినడం నగరవాసులు చేసుకున్న సుకృతమని అన్నారు. -
నర్సరీని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
కడియం: కడియపులంకలోని శ్రీ శివాంజనేయ నర్సరీని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు మంగళవారం సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు నర్సరీ అధినేత మల్లు పోలరాజు స్వాగతం పలికి, బోన్సాయ్, ఆయుర్వేద తదితర మొక్కల గురించి వివరించారు. కడియం ప్రాంత నర్సరీ రైతులు స్వీయ నైపుణ్యంతో మొక్కలను అభివృద్ధి చేస్తూండటాన్ని జస్టిస్ మల్లికార్జునరావు అభినందించారు. 25న జాబ్ ఫెస్ట్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాలేజియేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సహకారంతో స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 25న జాబ్ ఫెస్ట్–2025 నిర్వహించనున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. డిగ్రీ, పీజీ ఫైనలియర్ చదువుతున్న, పాసైన విద్యార్థులకు 40 కంపెనీలతో ఈ జాబ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జాబ్ ఫెస్ట్ ఏర్పాట్లపై సంబంధిత ప్రిన్సిపాళ్లు, ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్లు, స్కిల్ డెవలప్మెంట్ సిబ్బంది తదితరులతో చర్చించారు. జాబ్ ఫెస్ట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ప్రతి కళాశాల నుంచి విద్యార్థులందరూ హాజరై, జాబ్ ఫెస్ట్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీరామ్మూర్తి, జేకేసీ కో ఆర్డినేటర్ బి.హరినాథ్రెడ్డి, నోడల్ రీసోర్స్ సెంటర్ కో ఆర్డినేటర్ సీహెచ్ సంజీవ్ కుమార్, స్కిల్ డెవలప్మెట్ అధికారి వీడీజీ మురళి, గణిత విభాగాధిపతి జి.చంద్రశేఖర్, ప్లేస్మెంట్ ట్రైనర్ ఎం.కిరణ్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్ కో ఆర్డినేటర్ ప్రియ పాల్గొన్నారు. వర్సిటీ ప్రగతికి ప్రణాళికలు రూపొందించాలి రాజానగరం: యూనివర్సిటీ ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నూతన ఆలోచనలతో అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మంగళవారం నిర్వహించిన ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన డీఆర్డీఓ అడ్వాన్స్డ్ సిస్టమ్ లేబొరేటరీ సైంటిస్టు కె.వీరబ్రహ్మం మాట్లాడుతూ, సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వివిధ సంస్థల నుంచి యూనివర్సిటీకి సీఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి, అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధ్యాపకులకు సూచించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే నెల 10వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ గంధం సునీత సూచించారు. అండర్ ట్రయిల్ రివ్యూ కమిటీ, ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాలను జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జిషీట్ ఫైలింగ్ విషయంలో పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. బెయిలు, జామీనుల విషయంలో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సంబంధిత అధికారులకు తగిన సిఫారసులు చేశారు. ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాచరణ, బాధితుల కేసులపై చర్చించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్కే జానీ బాషా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి, జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, కాకినాడ ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, ప్రభుత్వ న్యాయవాది సీహెచ్వీ ప్రసాద్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.రాధాకృష్ణంరాజు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు, ప్రత్యేక మహిళా జైలు అధికారులు, జిల్లా సబ్ జైలు అధికారి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న తోటలో.. ముసిరిన చీకట్లు
జిల్లాలో మొక్కజొన్న సాగు వివరాలుపెరవలి: మొక్కజొన్న తోటల్లో చీకట్లు ముసురుకుంటున్నాయి. ఓవైపు దండిగా దిగుబడులు వస్తున్నా.. మద్దతు ధర పెంచాల్సిన కూటమి సర్కార్.. దానిని గణనీయంగా తగ్గించేసింది. ఫలితంగా గత ఏడాది కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఆశించిన రైతులు దిగులు చెందుతున్నారు. జిల్లాలో ఏటేటా మొక్కజొన్న సాగు పెరుగుతోంది. ఐదేళ్ల కిందట జిల్లాలో 6 వేల ఎకరాల్లో మాత్రమే.. అది కూడా లంక భూముల్లోనే ఈ పంట సాగు చేసేవారు. అయితే, మంచి లాభాలు వస్తూండటంతో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుపై మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఈ పంట సాగు విస్తీర్ణం 16,713 ఎకరాలకు పెరిగింది. సుమారు 10,400 మంది రైతులు లంక భూములతో పాటు బయటి పొలాల్లో కూడా ఈ పంట సాగు చేస్తున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ మినహా జిల్లాలోని దాదాపు ప్రతి మండలంలోనూ ఈ పంట సాగు జరుగుతోంది. ఒక్క పెరవలి మండలంలోనే సుమారు 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కానూరు, కానూరు అగ్రహారం, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి గ్రామాల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఆశలు ఆవిరి పంటపై తెగుళ్లు పెద్దగా ఆశించకపోవడం, వాతావరణం కూడా అనుకూలించడంతో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడులు దండిగా వస్తున్నాయి. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది. దీంతో, కాస్త లాభాలు కళ్ల చూడవచ్చని రైతులు ఆశించారు. కానీ, వారి ఆశలపై కూటమి ప్రభుత్వం నీళ్లు జల్లింది. గత ఏడాది క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వం రూ.2,600 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఇది ఈ ఏడాది అంతకంటే పెరుగుతుందని రైతులు ఆశ పడ్డారు. కానీ, రకరకాల సాకులతో ప్రభుత్వం ఈ ధరను రూ.2,200కు కుదించేసింది. ఫలితంగా లాభం మాట అలా ఉంచితే గత ఏడాది కంటే రైతులు క్వింటాల్కు రూ.400 మేర నష్టపోతున్న పరిస్థితి ఏర్పడింది. సాగు ఆరంభంలో ధర బాగుందని, ఈ ఏడాది క్వింటాల్ ధర రూ.2,800 వరకూ పలుకుతుందనుకున్నామని, కానీ దీనికి భిన్నంగా ధర పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో, లాభాలు సగానికి సగం తగ్గిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడి ఎక్కువ.. రాబడి తక్కువ ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగుకు రూ.45 వేలు ఖర్చవుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.25 వేలు మాత్రమే మిగులుతోందని, ధర పెంచి ఉంటే మరింతగా లాభాలు వచ్చి ఉండేవని రైతులు అంటున్నారు. పెంచకపోయినా, కనీసం గత ఏడాది ధర చెల్లించినా తాము గట్టెక్కేవారమని చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఓవైపు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తూనే, రైతులకు కనీస మద్దతు ధరలు కూడా పెంచేదని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వకపోగా మద్దతు ధరలో కూడా కోత పెట్టిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దిగుబడి వస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఈపాటికే మార్క్ఫెడ్ ఆధ్వర్యాన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సాగు విస్తీర్ణాన్ని బట్టి వీటిని రెండు మూడు మండలాలకు కలిపి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తారు. కానీ, ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో, గత్యంతరం లేక రైతులు దక్కిన ధరకే పంటను బయటి వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. గతంలో వ్యాపారులు చేల వద్దకే వచ్చి, కొనుగోలు చేసేవారు. ఇప్పుడు దిగుబడి ఎక్కువగా ఉండటంతో వారి వద్దకే తీసుకు వెళ్లాల్సి (చేర) వస్తోందని, దీని వలన అదనంగా ఖర్చవుతోందని రైతులు వాపోతున్నారు. పైగా, సరకు నెమ్ముగా ఉందంటూ ధరలో కోత పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. బర్డ్ఫ్లూ ఎఫెక్ట్ మొక్కజొన్న దిగుబడిలో 80 శాతం మేర కోళ్ల ఫారాలకు మేతగా వినియోగమవుతుంది. ఈ పంట చేతికి రావడానికి రెండు నెలల ముందు బర్డ్ఫ్లూ వ్యాధితో లక్షలాదిగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో కోళ్ల పరిశ్రమ కుదేలై, వేలాదిగా పౌల్ట్రీలు మూత పడ్డాయి. ఫలితంగా మొక్కజొన్నకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. మరోవైపు గత ఏడాది మొక్కజొన్న నిల్వలు కూడా ఇంకా మిగిలిపోయాయని చెబుతున్నారు. ఈ పరిణామాల ప్రభావం మొక్కజొన్న ధరలపై పడిందని చెబుతున్నారు. 2018 నుంచి మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర (క్వింటాల్కు రూ.) ÝëVýS$ ÑïÜ¢Æý‡~…-˘ 16,713 GMýSÆ>Ë$ సాగు చేస్తున్న రైతులు 10,400 ఎకరాకు దిగుబడి 35 – 40 క్వింటాళ్లు గత ఏడాది క్వింటాల్ మద్దతు ధర రూ.2,600 ఈ ఏడాది రూ.2,200కోళ్ల పరిశ్రమ దెబ్బ తినడంతో.. ప్రస్తుతం వస్తున్న దిగుబడి వలన రైతులకు లాభాలు వస్తున్నాయి. కోళ్ల పరిశ్రమ దెబ్బ తినడంతో మొక్కజొన్న గింజల వినియోగం కొంత తగ్గింది. – పి.చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు, కొవ్వూరుదిగుబడి బాగుంది వాతావరణం అనుకూలించడంతో ఈ ఏడాది దిగుబడి బాగుంది. ఎకరానికి 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. అయితే, ధర తగ్గించేయడంతో ఖర్చులు పోను రూ.25 వేలు మాత్రమే మిగులుతోంది. – మిద్దే వీరాంజనేయులు, రైతు, కానూరు అగ్రహారం, పెరవలి మండలం లాభం తగ్గుతోంది పంట బాగానే పండింది. కానీ, గిట్టుబాటు ధర గత ఏడాది కంటే రూ.400 తగ్గింది. అయినప్పటికీ సరకు కొనుగోలు చేయడానికి ఎవ్వరూ రావడం లేదు. చేర ఇస్తున్నాం. దీని వలన అదనపు ఖర్చు అవుతోంది. ఫలితంగా లాభం తగ్గుతోంది. – జన్ని వెంకటేశ్వర్లు రైతు, కానూరుఽసంవత్సరం ధర 2018 1,400 2019 1,500 2020 1,800 2021 1900 ఽసంవత్సరం ధర 2022 2,100 2023 2,400 2024 2,600 2025 2,200 ఫ దిగుబడి ఫుల్.. గిట్టుబాటు నిల్ ఫ మద్దతు ధర తగ్గించిన సర్కారు ఫ క్వింటాల్కు ఏకంగా రూ.400 కోత ఫ రైతన్నల ఆవేదన -
13,549 హెక్టార్లలో వరి కోతలు పూర్తి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లావ్యాప్తంగా 58,586 హెక్టార్లలో రబీ వరి సాగు జరిగిందని, ఇప్పటి వరకూ 13,549 హెక్టార్లలో కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పులతో అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి, భద్రపరచుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సలహాలు, సూచనలు ఇచ్చి, పంటలు దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు ఆయన పలు సూచనలు చేశారు. పంట దెబ్బ తింటే.. ఫ కోతకు 10–15 రోజులున్న దశలో చేను పడిపోయి నీట మునిగితే, బూజు తెగులు వల్ల గింజ రంగు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలు తగ్గిన వెంటనే లీటరు నీటికి ఒక మిల్లీలీటర్ ప్రొపికోనజోన్ (టిల్ట్/బంపర్/ప్రోపిగార్డ్) లేక ఒక గ్రాము కార్బండిజం (బావిస్టన్/ధనుస్టిన్/బెన్ఫిల్/బెన్గార్డ్) లేదా 2 గ్రాముల కార్బండిజం+మాంకోజెట్ (సాఫ్/సిక్సర్/కంపానియన్) చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఫ కోత కోసిన పనలు వర్షానికి తడిసినట్లయితే గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణాన్ని (లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు) పనలపై పడేలా పిచికారీ చేయాలి. వర్షాలు తగ్గి, ఎండ రాగానే పనలను తిరగేసి ఎండబెట్టి నూర్చుకోవాలి. పొలంలో నీరు లేకపోతే మడిలోనే ఉన్న పనలపై ఉప్పు నీరు జల్లుకోవచ్చు. ఒక వేళ పొలంలో నీరు నిలిచిపోతే పనలను గట్ల పైకి తెచ్చుకొని విడగొట్టి ఉప్పు ద్రావణం జల్లుకోవడం ద్వారా గింజ మొలకెత్తకుండా రంగు మారకుండా నివారించవచ్చు. ఫ పనలు కుప్ప వేసే దశలో వర్షాల వల్ల పనలు తడిస్తే కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై జల్లుకుంటూ కుప్ప వేయాలి. ఫ నూర్చిన ధాన్యం రెండు మూడు రోజుల పాటు ఎండబెట్టడానికి వీలు కాకపోతే కుప్పల్లోని గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడువాసన వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి క్వింటాల్ ధాన్యానికి కిలో ఉప్పును 20 కిలోల పొడి ఊక లేక 4 కిలోల వరిగడ్డితో కానీ కలిపి పోగు పెట్టాలి. దీనివల్ల గింజ మొలకెత్తి చెడిపోకుండా నివారించవచ్చు. ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పారబట్టి నిలువ చేసుకోవాలి. ఫ పూర్తిగా తడిసి, రంగు మారిన ధాన్యానికి మార్కెట్ విలువ పూర్తిగా తగ్గిపోతుంది. అటువంటి ధాన్యం పచ్చిబియ్యం కంటే ఉప్పుడు బియ్యంగా అమ్ముకోవడం వల్ల నష్టాన్ని కొంతవరకూ తగ్గించుకోవచ్చు. ఫ అకాల వర్షాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలి ఫ జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు -
ఈదుకుంటూ మృత్యుఒడికి..
ప్రమాదాల వివరాలు.. సంవత్సరం కేసులు మృతులు 2021 54 59 2022 63 67 2023 71 78 2024 78 80 2025 (ఇప్పటి వరకూ) 23 24 291 308 ● ఈ నెలలోనే ఆరు ప్రమాదాలు– తొమ్మిది మంది మృతి ● ఐదేళ్లలో 291 ప్రమాదాలు, 308 మంది మృత్యువాత ● స్వీయరక్షణ, భద్రత చర్యలు తీసుకోవాలంటున్న నిపుణులు ఆలమూరు: వేసవికాలం వచ్చేసింది..విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి.. యువకులు, పర్యాటకులు సముద్ర, నదీ పరివాహక ప్రాంతాల్లోని అనువుగా ఉండే ప్రదేశాల్లో స్నానాలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే గోదావరిలో స్నానం చేసే సమయంలో కాని ఈత కొట్టే సమయంలో కాని ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా మృత్యువాత పడతామని, తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేస్తామని మాత్రం ఊహించడం లేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల వెంబడి గౌతమీ, వశిష్ట, వైనతేయ గోదావరి నదులు 289 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంటాయి. స్థానికులతో పాటు వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులు నదీ తీరానికి వచ్చి ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ఇష్టపడతారు. ఇదే క్రమంలో గోదావరిలోను, పంట కాలువల్లోను స్నానాలు చేస్తూ ఈత సరదాను తీర్చుకునే క్రమంలో అనేకమంది ప్రమాదవశాత్తూ మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో అనేక చోట్ల లోతులు, ఊబిలు ఉన్న సంగతి తెలియని పర్యాటకులు స్నానాలకు దిగి మృత్యువాత పడుతున్నారు. చర్యలు చేపడుతున్నా... ఆలమూరు, ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, కపిలేశ్వరపురం, కె.గంగవరం, అయినవిల్లి, సఖినేటిపల్లి, రాజోలు మండలాల్లోని నివారణకు చర్యలు ● ప్రమాదాల నివారణకు పంచాయతీరాజ్, హెడ్వర్క్స్శాఖ పోలీసుశాఖ ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. ● గోదావరి పరీవాహక ప్రాంతంలో పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి. ● వేసవిలో గోదావరి తీరంలోకి ఇతర ప్రాంతాల వారు వస్తే ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది కౌన్సెలింగ్ను అందించాలి. ● ప్రమాదకరమైన అన్ని రేవుల వద్ద లోతు వివరాలు తెలియజేసే హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి. ● స్నానానికి అనుమతి లేని ప్రదేశాల వివరాలను తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ● స్నానాలు చేసేటప్పుడు, ఈత కొడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ చర్యలు పాటించి సేఫ్టీ డ్రస్ను ధరించాలి. అనుమతి లేని ప్రదేశాల్లో స్నానాలు వద్దు గోదావరి తీరం వెంబడి అనుమతి లేని ప్రదేశాల్లో ఎవరూ స్నానాలకు దిగవద్దు. ఇప్పటికే తీరం వెంబడి గుర్తించిన ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానికుల సహకారంతో ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాం. రద్దీ ప్రదేశాల్లో పోలీసుల గస్తీని ముమ్మరం చేశాం. పర్యాటక ప్రాంతాల్లో నిరంతరం పోలీసులను పహరాగా ఉంచుతున్నాం. –సుంకర మురళీమోహన్, డీఎస్పీ, కొత్తపేట ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం నదీ తీర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాం. ధవళేశ్వరం దిగువ ప్రాంతాల్లో ఊబులు ఎక్కువగా ఉన్నందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి ఆ మేరకు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. ఇటీవల వాడపల్లి తీర్థానికి వెళ్లే భక్తులను గోదావరి మీద నుంచి వెళ్లకుండా పోలీసుల సాయంతో కట్టడి చేసి ప్రమాదాలను ఆపగలిగాం. – ఆర్.విశ్వనాథరాజు, హెడ్వర్క్స్ జేఈ, ధవళేశ్వరం తూర్పుగోదావరిజిల్లా పలు గ్రామాలతో పాటు కొవ్వూరు మండలంలోని మద్దూరులంక. సీతంపేట, విజ్జేశ్వరం లాకుల సమీపంలోని నదీ తీరాలు అత్యంత ప్రమాదకరంగా పేరుగాంచాయి. దీంతో పాటు అంతర్వేది, ఓడలరేవు, కాకినాడ, ఉప్పాడ సముద్ర తీరంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోంది. గోదావరి తీర ప్రాంతాల్లో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నా ప్రయోజనం కన్పించడం లేదు. గత ఐదేళ్లలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం 291 ప్రమాదాలు జరగ్గా 302 మంది మృత్యువాత పడ్డారు. ఈ నెలలోనే ఇప్పటి వరకూ ఆరు ప్రమాదాలు జరగ్గా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. -
రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలి
ఫ వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఫ శేష ప్రశ్నల సమాధానాలకు ఉత్తరకాండ చదవాలి ఫ ‘సాక్షి’తో సామవేదం షణ్ముఖశర్మ ఫ నేటి నుంచి ఉత్తరకాండ ప్రవచన సప్తాహం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆధునిక సమాజంలో.. ప్రాచీన మహర్షుల కోవకు చెందిన ప్రవచనకర్త ఆయన. ఆర్ష సాహిత్య వైభవంపై దేశ విదేశాల్లో ప్రవచనాలు, ఆధ్యాత్మిక గ్రంథ రచనలు, సాధకుల సందేహాలను నిత్యం నివృత్తి చేయడం, రాజమహేంద్రవరం శివారు కొంతమూరు గ్రామంలో శ్రీ వల్లభ గణపతి ఆలయ నిర్వహణ, భారతీయ ఋషిపీఠం ఆధ్యాత్మిక పత్రిక నిర్వహణ ఆయన దైనందిన జీవితంలో భాగం. ఆయనే సమన్వయ సరస్వతి, ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ. 2023 డిసెంబర్ 13 నుంచి 2024 జనవరి 23 వరకూ రాజమహేంద్రవరంలోని హిందూ సమాజంలో వాల్మీకి రామాయణంపై వరుసగా 42 రోజుల పాటు ఆయన ప్రవచనాలు నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా మంగళవారం నుంచి అదే వేదికపై రామాయణం ఉత్తరకాండపై వారం రోజుల పాటు ప్రవచనాలు కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా తనను కలసిన సాక్షితో ఆయన ఉత్తరకాండలోని పలు విశేషాలను వివరించారు. రామతత్త్వాన్ని అందరూ అర్థం చేసుకోవాలని, దీనికి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రామకథ సమగ్ర స్వరూపం కోసం.. ఉత్తరకాండతో కలిపితేనే రామాయణ శ్లోకాలు 24 వేలు అవుతాయి. మొదటి ఆరు కాండలు రచించిన తరువాత కొద్ది విరామం అనంతరం మహర్షి వాల్మీకి ఉత్తరకాండ రచించారు. మహర్షి వాల్మీకి ప్రణీత రామాయణంలో బాలకాండ నుంచి యుద్ధకాండ వరకూ ఉన్న షట్కాండలలో తలెత్తే కొన్ని శేష ప్రశ్నలకు ఉత్తరకాండలో సమాధానాలు లభ్యమవుతాయి. (‘ఉత్తరం’ అనే పదానికి సమాధానం, జవాబు అనే అర్థాలున్నాయి.) ఉదాహరణకు సీతాదేవి జనకుని యజ్ఞంలో నాగలిచాలున జన్మించిందని, ఆమె అయోనిజ అని ఉత్తరకాండ మనకు వివరిస్తుంది. రావణుడు రంభను బలాత్కరించి, నలకూబరుని శాపానికి గురవడం, తనను చూసి పరిహసించిన రావణుడిని నందీశ్వరుడు శపించడం తదితర అంశాలను కూడా మనం ఉత్తరకాండలో చూడవచ్చు. బాలకాండలో రాముని జనన విశేషాలు చెప్పిన మహర్షి ఉత్తరకాండలో ఆయన అవతార పరిసమాప్తిని వివరించారు. బాలకాండ నుంచి యుద్ధకాండ వరకూ మాత్రమే రామాయణ పారాయణలు జరగడం పరిపాటి అయినా, ఉత్తరకాండను ప్రత్యేక గ్రంథంగా పారాయణ చేసే పూర్వ సంప్రదాయం ఉంది. సీతాపరిత్యాగం.. కాలవైపరీత్యం ● సీతాదేవి గురించి జనాపవాదాన్ని శ్రీరామునికి ఆయన గూఢచారి భద్రుడు వివరిస్తాడు. ‘ప్రభూ! సీతాదేవితో సుఖించడానికి రాముని మనస్సు ఎలా అంగీకరిస్తోంది? ఎంతో కాలము పరుల పంచన ఉన్న తన భార్యను శ్రీరాముడు ఎలా చేరదీశాడు? రేపు మనమూ మన భార్యల పట్ల ఇంతటి సహనం చూపాలా? (అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి)’ – ఈ సన్నివేశం అయోధ్య కాండ 43వ సర్గలో కనపడుతుంది. ఒక రజకుని మాటను విని శ్రీరాముడు నిండు గర్భిణిని పరిత్యజించాడని వాల్మీకి మహర్షి చెప్పలేదు. అగ్నిపునీత అయిన ఆ తల్లిని అయోధ్యవాసులు నమ్మలేదా అనే ప్రశ్నకు సమాధానం మనం చెప్పుకోవాలి. శ్రీరాముడు పట్టాభిషిక్తుడయ్యేనాటికి, సీతాపరిత్యాగ సమయానికి చాలా విరామం ఉంది. కొన్ని తరాలు గడిచాయి. నాటి యువతరం నమ్మకపోయి ఉండవచ్చు. కాలం కొన్ని సమయాల్లో వింత పోకడలు పోతుంది. ఇది కాలవైపరీత్యం అని చెప్పుకోవాలి. ఇది అత్యంత బాధాకరం. ● ‘కూడళ్లయందు, అంగళ్లయందు, రాజమార్గములయందు, వనములలో, ఉపవనాల్లో సీతాదేవిని గురించి ప్రజలు ఇలా పెక్కువిధాలుగా, నోటికి వచ్చిన రీతిలో మాట్లాడుకుంటున్నారు’ అని భద్రుడు శ్రీరామునికి నివేదించాడు. రాజు ఆదర్శపాలకుడు కావాలి. రాజు ప్రవర్తన వివాదాలకు అతీతంగా ఉండాలి. లోకాపవాదును దూరం చేయడం కోసం సీతాదేవిని శ్రీరాముడు పరిత్యజించాడు. అందుకే వారి ప్రస్తావన లేదు శ్రీరాముని సోదరుల భార్యల గురించి ఉత్తరకాండలో సైతం ప్రస్తావించలేదు. ప్రధాన కథలో వారి ప్రాధాన్యం లేకపోవడమే దీనికి కారణం. సుమంత్రుడు భవిష్యత్తు ఎలా చెప్పగలిగాడు? ఒక్క సీతాదేవిని మాత్రమే కాదు.. భవిష్యత్తులో శ్రీరాముడు నిన్ను సైతం పరిత్యజిస్తాడని సుమంత్రుడు లక్ష్మణునితో అంటాడు. (ఉత్తరకాండ 50వ సర్గ). నీవు యాగం చేసి, పుత్ర సంతానం పొందుతావని కూడా దశరథునితో సుమంత్రుడు బాలకాండలో చెబుతాడు. భృగు మహర్షి శాపం వలన శ్రీరాముడు భార్యా వినియోగాన్ని అనుభవిస్తున్నాడని కూడా సుమంత్రుడు లక్ష్మణునికి చెబుతాడు. ఒక మహర్షి అనుగ్రహంతో సుమంత్రుడు భవిష్యద్దర్శనం చేయగలిగాడు. -
కాలువల మూసివేత సాధ్యమేనా?
డెల్టా ప్రధాన పంట కాలువలకు డిసెంబరు 7వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు నీటి విడుద ఇలా (టీఎంసీ)లలో...: తూర్పు డెల్టా : 34.293 మధ్య డెల్టా : 20.291 పశ్చిమ డెల్టా : 56.478 మొత్తం : 111.382 ● ఏప్రిల్ 15న మూసివేయడానికి సన్నాహాలు ● ఇప్పటికీ శివారులకు సాగు నీటి అవసరం ● మరో ఐదు రోజులు పెంచాలని కోరుతున్న వ్యవసాయశాఖ ● తాగునీటి ప్రాజెక్టుల కోసం కూడా పెంచాల్సిన గడువు ● రబీలో ఇప్పటి వరకు 111 టీఎంసీల వినియోగం ● అయినా శివారుల్లో కీలక సమయంలో సాగునీటి ఎద్దడి ● నీటి యాజమాన్యంలో అట్టర్ ఫ్లాప్ సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టా పంట కాలువల మూసివేతకు సాగునీటి పారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి మూడు ప్రధాన పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేయాల్సి ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద హెడ్ స్లూయిజ్ గేట్లు మూసివేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. అయితే డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీకి మరో ఐదు రోజులు నీరందించాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతుండడంతో ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. నీటి యాజమాన్యంలో సమన్వయలోపం గోదావరి మూడు డెల్టాల పరిధిలో సుమారు 8.86 లక్షల ఎకరాల్లో వరి, ఇతర వ్యవసాయ పంటలు సాగవుతున్నాయి. ఈ సీజన్లో సాగుకు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కలిపి మొత్తం 90 టీఎంసీలు ఉంటే సరిపోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలో 4.80 లక్షల ఎకరాలలో వరి ఆయకట్టు ఉంది. దీనిలో సుమారు 4.20 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరిగిందని అంచనా. పంట కాలువలు, చానల్స్ అధ్వానంగా ఉన్నాయి. ఈ ఏడాది రబీ సాగు ఆరంభంలో షార్ట్ క్లోజర్ పనులు చేస్తామని చెప్పారు కాని పూడిక తీత, గుర్రపుడెక్క తొలగింపు పనులు చేయలేదు. ఇది సాగునీటి సరఫరాకు ప్రధాన అవరోధంగా మారింది. దీనికితోడు నీటి యాజమాన్య విషయంలో అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డెల్టాకు 111 టీఎంసీలు గోదావరి డెల్టాలో డిసెంబరు 7వ తేదీన మొదలైన రబీ షెడ్యూలులో ఏప్రిల్ 15 వరకు 111.355 టీఎంసీల నీటిని పంట కాలువలకు విడుదల చేశారు. దీనిలో తూర్పు డెల్టాకు 34.293, మధ్యడెల్టాకు 20.291, పశ్చిమ డెల్టాకు 56.478 టీఎంసీల చొప్పున అందించారు. రబీ సాగు, ఇతర అవసరాలకు వాస్తవంగా 90 టీఎంసీల అయితే పంటకు సరిపోతోంది. కాని అంత కన్నా అధికంగా నీరు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. అయినా డెల్టా శివారులు, మెరక ప్రాంతాల్లో ఫిబ్రవరి, మార్చి నెలల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్, మధ్య డెల్టా అనే తేడా లేదు. తూర్పు గోదావరి, కాకినాడ, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలో ఇంచుమించు అన్ని మండలాల్లో ఏదో ఒక సందర్భంలో రైతులు నీరందక ఇబ్బంది పడ్డారు. తూర్పు డెల్టాలో కరప, కాజులూరు, తాళ్లరేవు, కె.గంగవరం, పీబీసీలో కొత్తపల్లి, మధ్య డెల్టా పరిధిలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, మలికిపురం మండలాల్లో చేలు నెరలు తీసిన విషయం తెలిసిందే. వంట కాలువలకు విడుదల చేసిన నీరుతోపాటు డెల్టాలో పలుచోట్ల వ్యవసాయ విద్యుత్ మోటార్లతో చేలకు పెద్ద ఎత్తున నీరందించారు. ఇలా కనీసం ఒకటిన్నర టీఎంసీ, మురుగునీటి కాలువలపై క్రాస్బాండ్లు వేయడం ద్వారా కూడా నీటిని చేలకు మళ్లించడం ద్వారా మరో ఐదు టీఎంసీల వరకు నీటిని చేలకు తరలించామని అధికారులు చెబుతున్నారు. ఇలా చూస్తే మొత్తం 117.50 టీఎంసీల నీటిని రబీ కాలంలో అందించినట్టు. అయినప్పటికీ తూర్పు, మధ్య డెల్టాలోని ఏకంగా పదకొండు శివారు మండలాల్లో నీటి ఎద్దడి ఏర్పడిందంటే అది ముమ్మాటికీ నీటిపారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యమేనని రైతులు చెబుతున్నారు. నీటి ఎద్దడి ప్రభావంతో రైతులు పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు. పంట బోదెలు, చానల్స్ నుంచి, డ్రెయిన్ల నుంచి మోటార్లతో నీరు తోడకం వల్ల ఎకరాకు అదనంగా రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు పెట్టుబడి అయ్యింది. ఎద్దడికి గురైన ప్రాంతంలో దిగుబడి పడిపోవడం కూడా రైతులకు లాభాలు మాట అటుంచి పెట్టుబడులు వస్తే గొప్ప అన్నట్టుగా మారింది. నేడు నిర్ణయం డెల్టాలో రబీ సాగుకు మరో ఐదు రోజుల పాటు గడువు పెంచే అవకాశముంది. దీనిపై మంగళవారం ధవళేశ్వరంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 15వ తేదీ అంటే మంగళవారం అర్ధరాత్రి తరువాత బ్యారేజీ గేట్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కోనసీమ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బోసుబాబు అభ్యర్థించడంతో ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ గోపినాఽథ్, గోదావరి డెల్టా సిస్టమ్ చీఫ్ ఇంజినీరు (సీఈ) దీనిపై మంగళవారం తుది నిర్ణ యం తీసుకోనున్నారు. వ్యవసాయశాఖతోపాటు తాగునీటి చెరువులు పూర్తిస్థాయిలో నింపాల్సి ఉన్నందున ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా గడువు పెంచాల్సిందిగా కోరుతున్నారు. ఈ కారణంగా ఈ నెల 20వ తేదీ వరకు కాలువల మూసివేత గడువు పెంచే అవకాశముందని సమాచారం. -
మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా సత్యనారాయణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా కేవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 1991 బ్యాచ్కు చెందిన ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సీఐగా, కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీగా, రాజమహేంద్రవరం స్పెషల్ బ్రాంచి, ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్, పరవాడ డీఎస్పీగా విధులు నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో పని చేస్తూండగా సాధారణ బదిలీల్లో భాగంగా ఆయనను జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా నియమించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ, శక్తి యాప్ గురించి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కల్పిస్తానని చెప్పారు. మహిళల మొబైల్ ఫోన్లలో ఈ యాప్ ఇన్స్టాల్ చేయించి, తద్వారా మహిళలు, బాలికలపై జరిగే నేరాలను అరికడతామని అన్నారు. మహిళల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబేడ్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం రాజమహేంద్రవరం రూరల్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి బొమ్మూరులోని రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో వేణు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ విశేషంగా కృషి చేశారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఐదేళ్ల పాలనను అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అందించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు (బాబు), మాజీ ఎంపీపీ రేలంగి సత్యనారాయణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు చీకురుమిల్లి చిన్న, మహిళా అధ్యక్షురాలు అంగాడి సత్యప్రియ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్కు ఘన నివాళిసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు ఘనంగా నివాళి అర్పించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ మహనీయుని సేవల ను స్మరించుకున్నారు. వివిధ శాఖలు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదువుతోనే ఉన్నత స్థాయికి.. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థులు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి, ఆదర్శంగా నిలిచారని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సమీపాన సోమవారం నిర్వహించిన వేడుకల్లో.. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినులను అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం–2కు చెందిన గోలి మౌనిక ఫస్టియర్లో 423/500, సెకండియర్లో మద్దల సుశీల 910/1000 చొప్పున అత్యధిక మార్కు లు సాధించారని తెలిపారు. వారిని అభినందించారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేస్తామని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎంఎస్ శోభారాణి అన్నారు. అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్ పాల్గొన్నారు. అనంతరం దాతల సహకారంతో పలువురికి చీరలు పంపిణీ చేశారు. -
వివాహిత అదృశ్యంపై కేసు నమోదు
కొవ్వూరు: కాకినాడ జిల్లా పెద్దాపురంలో శంకరయ్యపేటకి చెందిన వీరవాసరపు ఏసురత్నం అనే వివాహిత 14వ తేదీ తెల్లవారుజాము మూడు గంటల నుంచి కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.విశ్వం తెలిపారు. కొవ్వూరులో ఉంటున్న ఆమె అత్త వారి ఇంటికి వేసవి సెలవుల నిమిత్తం వచ్చినట్లు ఆమె తల్లి ఏలేశ్వరపు దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లి మరలా తిరిగి రాలేదని పేర్కొన్నారు. ఆచూకీ కోసం పలు చోట్ల వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వివరాలు తెలిస్తే 94407 96622 నంబర్కు తెలియజేయాలని ఆయన సూచించారు. కొబ్బరితోటలో పిడుగు పడి మంటలు సఖినేటిపల్లి: మండల పరిధిలోని గొంది గ్రామంలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ శబ్ధంతో పడిన పిడుగుపాటుకు ఒక రైతు కొబ్బరి తోటలో మంటలు ఎగిసి పడ్డాయి. మంటలను స్థానికులు నీళ్లతో ఆర్పివేశారు. పిడుగుపాటుకు చెట్లకు నష్టం వాటిల్లింది. -
ఔషధ గుణం.. ఆరోగ్య ప్రదం
ఆలమూరు: వేసవి తాపాన్ని అధిగమించేందుకు, శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చేందుకు ప్రకృతి ప్రసాదించిన తాటిముంజలు ఐస్ యాపిల్గా విశేష ప్రాచుర్యం పొందాయి. ఈ తాటిముంజల సీజన్ ఇప్పుడే ప్రారంభం కావడంతో, వీటికి విపరీతమైన డిమాండు ఏర్పడింది. తాటికాయలు ముంజల దశలో జెల్లీ మాదిరిగా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. మరో మూడు నెలల్లో తాటిముంజలు తాటిపండ్లుగా మారడంతో పాటు, ఆరోగ్యకరమైన తేగలనూ ఇస్తాయి. ఈ తాటిముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజాల ప్రమాణాలను సమతుల్యం చేసే లక్షణం కలిగి ఉన్నందున వీటికి విపరీతమైన డిమాండు ఉంటుంది. కాలక్రమంలో.. గ్రామీణ ప్రాంతాల్లో తాటి చెట్లు అధికంగా ఉండేవి. తాటిముంజల లభ్యత ఎక్కువగా ఉన్నా.. చెట్లు ఎక్కి ముంజకాయలు దింపే కార్మికుల కొరత ఏర్పడడంతో వీటి లభ్యత నానాటికీ తగ్గిపోతోంది. ఎలుకల బెడద కారణంగా పొలాల్లో, రియల్ ఎస్టేట్ కారణంగా మారుమూల గ్రామాల్లో సైతం తాటిచెట్లను నరికేస్తుండటంతో భవిష్యత్తులో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్న ఆందోళన ఉంది. ఆరోగ్య ప్రదాయినిగా.. ప్రకృతిలో విరివిగా లభ్యమయ్యే ఈ తాటిముంజలు కల్తీ లేని, స్వచ్ఛమైనవి కావడంతో ఆరోగ్య ప్రదాయినిగా భావిస్తుంటారు. జిల్లాలో తాటిముంజలు సేకరించే వారు కరవయ్యారు. దీంతో మైదాన ప్రాంతాల్లో ఉన్న డిమాండును దృష్టిలో ఉంచుకుని కొందరు మెట్ట, చాగల్నాడు ప్రాంతాలకు చెందిన రైతు కూలీలు తాటిముంజలను పట్టణ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తాటిముంజల సీజన్ ప్రారంభమైంది. తాటిముంజుల పరిమాణాన్ని బట్టి డజను రూ.80 నుంచి రూ.120 వరకూ విక్రయిస్తున్నారు. ధర ఎక్కువగా ఉన్నా తాటిముంజల ప్రియులు దీనిని లెక్కచేయడం లేదు. లేలేతగా ఉండే తాటిముంజలు అద్భుత రుచితో నోరూరిస్తున్నాయి. ఆరోగ్య రక్షణకు దోహదం వేసవి నుంచి వర్షాకాలం ప్రారంభం వరకూ లభ్యమయ్యే తాటిముంజలను తినడం వల్ల సంపూర్ణ ఆరోగ్య రక్షణ లభిస్తుంది. పోషకాలు అధికంగా ఉండటంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. సీజన్ సమయంలో ప్రతి ఒక్కరూ భుజించాల్సిన అవసరం ఉంది. – ఏవీవీ రాజా అక్కుల, హెల్త్ ఎడ్యుకేటర్, పెదపళ్ల, ఆలమూరు మండలం చక్కని ఆరోగ్యం లభిస్తుంది తాటిముంజలు తింటే చక్కని ఆరోగ్యం లభిస్తుంది. ఐస్ యాపిల్గా పిలిచే తాటిముంజలను ఏడాదికి ఒకసారైనా తినాలని కోరిక ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అంతంతమాత్రంగానే లభ్యమవుతుండటం వల్ల తాటిముంజలను కొనుగోలు చేయకతప్పడం లేదు, – ఎ.రామసీత, గృహిణి, ఆలమూరు ప్రయోజనాలివే.. ● తాటిముంజల్లో విటమిన్లు, ఫాస్పరస్, థయామిన్, బీ–కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియంతో పాటు, సోలెబుల్ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వేసవితాపం, వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది. వికారం, వాంతులను నివారిస్తుంది. ● తాటిముంజలను తినడం వల్ల శరీరంలో పేరుకున్న హానికర వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంతో పాటు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ● వేసవిలో ఏటా సీజన్లో క్రమం తప్పకుండా తాటిముంజలను తినడం ద్వారా చెడు కొలస్ట్రాల్ను తగ్గించుకుని, మంచి కొలస్ట్రాల్ను వృద్ధి చేసుకోవచ్చు. లివర్ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ● వీటిలో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో పోషకాలుండటం వల్ల అలసట, నిర్జలీకరణం నుంచి ఉపశమనం కలిగించి, శరీర బరువు పెరగకుండా చేస్తుంది. ● వీటిలో ఉండే పోషకాలు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించి, జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తాయి. ● ఆహారం సక్రమంగా జీర్ణమై గ్యాస్, ఎసిడిటీ, ఉదర సంబంధ సమస్యల నివారణకు దోహదపడుతుంది. ● మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే చికెన్ ఫాక్స్ని నివారించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ● తాటిముంజల్ని గుజ్జుగా చేసి ముఖానికి పూతలా వేస్తే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ● చర్మానికి కావాల్సినంత తేమను అందించి చెమటకాయల్ని నివారిస్తుంది. ఎండ వేడిమికి ముఖంపై ఏర్పడే మచ్చలను తగ్గిస్తుంది. తాటిముంజలతో శరీరానికి విటమిన్లు పుష్కలం ప్రస్తుత సీజన్లో విపరీతమైన డిమాండ్ ఐస్ యాపిల్గా ప్రాచుర్యం -
రాష్ట్రానికి 160 అగ్నిమాపక వాహనాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 160 అగ్నిమాపక వాహనాలను మంజూరు చేసిందని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ) మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. రాజమహేంద్రవరం ఇన్నీసుపేటలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను సోమవారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది అగ్నిప్రమాదాల్లో ఇప్పటి వరకూ రూ.9.28 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, రూ.38.28 కోట్ల ఆస్తులను కాపాడామని చెప్పారు. అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్షించామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లిల్లో అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ సంస్మరణార్థం ఏటా ఏప్రిల్ 14 నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. వంటింట్లో గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలని, అగ్ని ప్రమాదాన్ని గమనించిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆయా ప్రదేశాల నుంచి ఆరుబయట సురక్షిత ప్రదేశా లకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. 25 అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఇ.స్వామి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.250 కోట్లు మంజూరు చేసిందని, మొదటి విడతగా రూ.153 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో 25 అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా సరిపడా నీటిని, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్ట్టలేషన్ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గోదాములు, గ్రామీణ ప్రాంతాలు, కర్మాగారాల్లో అగ్నిప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అగ్ని నిరోధక స్వభావం గల వస్తువులతోనే పందిళ్లు నిర్మించుకోవాలన్నారు. జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి ఎం.మార్టిన్ లూథర్ కింగ్, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సరదా తెచ్చిన తంటా
కొవ్వూరు: విజ్జేశ్వరం లాకులకు దిగువన చిగుర్లంక వద్ద సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మరొకరిని స్థానికులు కాపాడారు. సోమవారం సాయంత్రం నిడదవోలు చర్చిపేటకి చెందిన మర్తి ప్రకాష్కుమార్ (15), రాజమహేంద్రవరానికి చెందిన గంధం హర్ష(18), మరో యువకుడు స్నానం చేసేందుకు చిగుర్లంక వద్ద గోదావరి పాయ వద్దకు వచ్చారు. స్నానాలు ఆచరిస్తున్న ప్రదేశంలో లోతు తక్కువగా ఉందని భావించి నదిలోకి దిగారు. వారు దిగిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే లోతు ఎక్కువగా ఉండడంతో నీట మునిగారు. ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అక్కడే సమీపంలో ఉన్న ఆరుగురు యువకులు గుర్తించి కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రకాష్కుమార్, హర్ష నదిలో గల్లంతయ్యారు. మరో యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీవో రాణి సుస్మిత, డీఎస్పీ జి.దేవకుమార్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు, తహసీల్దార్ ఎం.దుర్గాప్రసాద్ జాలర్లు, గజ ఈతగాళ్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఇదే ప్రదేశంలో రెండేళ్ల క్రితం స్నానాలకు దిగి పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు మృత్యువాత పడ్డారు. హర్ష తండ్రి మూడు నెలల క్రితమే మృతి గోదావరిలో గల్లంతైన హర్ష ప్రస్తుతం వైజాగ్లో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. తండ్రి మూడు నెలల క్రితమే మృతి చెందారు. తల్లి ౖశైలజ రాజమహేంద్రవరంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. హర్ష పెద్ద సోదరి అబిల పోలియో వ్యాధి బారిన పడింది. రెండో సోదరి హేనాకి వివాహం చేశారు. అంబేద్కర్ జయంతి, వేసవి సెలవులను పురస్కరించుకుని నిడదవోలులో ఉంటున్న అక్క హేనా ఇంటికి వచ్చారు. గతంలో హర్ష కుటుంబం నిడదవోలులోనే ఉండేవారు. సోమవారం మధ్యాహ్నం వరకు అంబేడ్కర్ జయంతి వేడుకలో పాల్గొని భోజనం చేసి వచ్చాడని హర్ష చిన్నాన్న మల్లవరపు వినోద్ చెబుతున్నారు. హర్ష తండ్రి మృతి చెంది మూడు నెలలు అయ్యింది. ఇంతలోనే సెలవులకని వచ్చి హర్ష గల్లంతు కావడం జీర్ణించుకోలేక పోతున్నామని అన్నారు. బయటికి వెళ్లి గంటలో వచ్చేస్తానని చెప్పాడని, ఇంతలో ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. పదో తరగతి పరీక్ష రాశాడు మృతుడు మర్తి ప్రకాష్కుమార్ పదో తరగతి పూర్తి చేశారు. తండ్రి కిషోర్ ప్రయివేటు అంబులెన్స్ డ్రైవర్గా పని చేస్తున్నారు. తల్లి కువైట్లో ఉంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రకాష్కుమార్కి సోదరుడు ఉన్నారు. ప్రస్తుతం ఇంటర్ మీడియట్ చదువుతున్నారు. కుమారుడు గల్లంతైన విషయం విదేశాల్లో ఉన్న తల్లి తెలుసుకుని తల్లడిల్లిపోతోంది. ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి గోదావరి నదిలో స్నానానికి దిగి యువకులు గల్లంతు కావడం బాధాకరం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గజ ఈతగాళ్లతో పాటు కాకినాడ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని రప్పిస్తున్నామన్నారు. మత్య్సశాఖ, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో నదిలో యువకుల ఆచూకీ కోసం గాలిస్తున్నారని చెప్పారు. ఇటీవల తాడిపూడిలో ఐదుగురు మృతి చెందడం,ఇప్పుడు ఈ ప్రమాదం బాధాకరం అన్నారు. -
ఆమె చదువు మహిళలకు ఆదర్శం
తూర్పు గోదావరి: మండలంలోని పందలపాకకు చెందిన రుత్తల లీలాశ్రావణికి చదువుపై ఉన్న శ్రద్ధ మహిళలకు ఆదర్శంగా నిలిచింది. విజయవాడకు చెందిన ఈమె 2018–19 ఏడాది 9.7తో పదవ తరగతి పూర్తి చేసింది. అయితే ఆరోగ్య సమస్యల వల్ల చదువు మానేసింది. ఆ తర్వాత పందలపాకకు చెందిన యడ్ల మణికంఠతో వివాహం చేశారు. దీంతో ఆమె పందలపాక వచ్చింది. ఆమెకు ఒక పాప పుట్టింది. చదువు మళ్లీ కొనసాగించాలనే లక్ష్యంతో అడుగు ముందుకు వేసింది. అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పందలపాక గ్రామంలో మహిళల కోసం కళాశాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆమె కాలేజీలో చేరి చదువు కొనసాగించింది. దీంతో కాలేజీ చేరిన ఇంటర్ మొదటి సంవత్సరంలో సీఈసీలో 479 మార్కులు సాధించింది. శనివారం వచ్చిన ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాల్లో మొత్తం 943 మార్కులు సాధించింది. హైస్కూల్ ప్లస్ కాలేజీలో రాష్ట్రంలో మొదటి స్థానం రావడంతో చాలా సంతోషంగా ఉందని ఉపాధ్యాయురాలు కావడం తన కొరిక అని తెలిపింది. విద్యాశాఖ మంత్రి ఈ నెల 15వ తేదీన ఆమెను సత్కరించనున్నట్టు మేసేజ్ వచ్చిందని పందలపాక పడాల పెద్దపూల్లారెడ్డి జిల్లా పరిషత్ హెచ్ఎం చిర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
అతడే.. ఆ నలుగురు..
కాకినాడ క్రైం: జీవన గమనంలో మరణం చివరి మజిలీ. తమ వారంటూ లేని జీవితం ఎంత దుర్భరమో.. చరమాంకంలో దిక్కు లేని మరణం పొందడం అంతకు మించిన దయనీయమైనది. తమను పోషిస్తూ, తమ బాగోగులు అడిగే వారంటూ ఎవరూ లేని అనాథలు, ఒంటరివాళ్లమనే వేదనతో బతుకీడ్చి ప్రాణాలొదిలితే.. జీవాన్ని విడిచేసిన దేహాన్ని సొంత కుటుంబీకులే వివిధ కారణాలతో ఆమడ దూరాన వదిలేస్తే.. ఏ బంధమూ లేని ఆ వ్యక్తి మాత్రం తానున్నానంటూ ముందుకొస్తాడు. ఆఖరి మజిలీలో ఆతీ్మయుడిగా, కాటికి చేర్చి కన్నబిడ్డకు మించి బాధ్యతను మోస్తాడు. ఆ దేహాన్ని తుది మజిలీకి సిద్ధం చేస్తాడు. పూడ్చడమైనా.. దహనమైనా తన చేతులతోనే చేస్తాడు. రెక్కాడితేనే కానీ డొక్కాడని ఆర్థిక దుస్థితిలోనూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచే ఆ వ్యక్తి పేరు కూపర్ భాను అంబేద్కర్. ఎవరీ అంబేద్కర్.. కాకినాడ ప్రతాప్ నగర్కు చెందిన 49 ఏళ్ల అంబేద్కర్ నిరుపేద డ్రైవర్. భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు లోకేష్ ఆకాష్ ఉన్నారు. కొన్నేళ్ల క్రితం ఓ రాజకీయ నాయకుడి బంధువు వద్ద కారు డ్రైవర్గా అంబేద్కర్ పని చేశాడు. ఓ రోజు ఇంటి సమీపంలో ఓ బిచ్చగాడు చనిపోతే మున్సిపల్ సిబ్బంది చెత్త ట్రాక్టరులో ఎక్కించడం చూసి అతడి మనసు వికలమైంది. అటువంటి చావు ఎవ్వరికీ రాకూడదలని తల్లడిల్లిపోయాడు. అటువంటి వారి కోసం ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు, ఉద్యోగం మానేసి అనాథ మృతదేహాల తుది మజిలీని తన చేతులతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిపై ఆలోచన సాగిస్తూనే కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తూ బతుకు బండి నడిపేవాడు. కాకినాడలోని ఓ సంస్థలో అనాథ మృతదేహాల తరలింపునకు 2007లో ‘ఆత్మబంధు’ పేరిట ఓ వాహనం సిద్ధమైందని తెలుసుకున్న అంబేద్కర్.. అందులో పని చేస్తానంటూ అక్కడి అధికారులను సంప్రదించాడు. తాము తగిన జీతం ఇవ్వలేమని వారు చెప్పగా.. భార్యాబిడ్డలకు అన్నం పెట్టే అంత మొత్తం చాలని, తనకు సేవాభాగ్యం కలిపంచాలి కోరాడు. అంబేద్కర్ సంకల్పం ముందు తల వంచిన ఆ సంస్థ ప్రతినిధులు అనాథ దేహాల తరలింపు వాహనానికి అంబేద్కర్ను డ్రైవర్గా నియమించారు. ఆ తరువాత 2017లో అతడు కాకినాడకు చెందిన కండిబోయిన ధర్మరాజు నిర్వహిస్తున్న కండిబోయిన వారి శ్రీ స్వచ్ఛంద సేవా సంస్థలో చేరాడు. అక్కడ వాహనం నడపడంతో పాటు పూర్తి స్థాయిలో అనాథ మృతదేహాలను మోసుకెళ్లడం, తరలించడం వంటి పనులు కూడా అతడికి అప్పగించారు. అది మొదలు సంస్థ ఆదర్శాలను మించి సేవా మార్గంలో అంబేద్కర్ పయనించాడు. కుళ్లి, శరీర భాగాలు తెగిపోయిన దేహాల నుంచి, గుర్తు తెలియని మృతదేహాల వరకూ.. అందరూ ఉండి అనాథలుగా మిగిలిన దేహాల నుంచి.. ఎవరూ లేని అనాథల వరకూ స్వయంగా అతడే అంత్యక్రియలు నిర్వహించేవాడు. గతంలో అంబేద్కర్ పని చేసిన సంస్థ అతడు లేక తమ సేవలనే నిలిపివేసిందంటే అతడి నిబద్ధత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 2007 నుంచి ఇప్పటి వరకూ అంబేద్కర్ మొత్తం 1,153 అనాథ మృతదేహాలను కాటికి తరలించాడు. వీరిలో తలకొరివి పెట్టినవీ ఉన్నాయి.కోవిడ్ వేళ అసమాన సేవలు కోవిడ్ వేళ అంబేద్కర్ అసమాన సేవలు అందించాడు. వైరస్ సోకి, మృతి చెందిన వారి దేహాలు తాకడం ప్రాణాంతకమని తెలిసినా స్వయంగా భుజాలపై మోసుకుని వెళ్లి మరీ దహన సంస్కారాలు నిర్వహించాడు. అలాగే కోవిడ్ సోకి, నడిరోడ్డు పైనే చనిపోయిన వృద్ధులు, అనాథలు, బిచ్చగాళ్లకు అంత్యక్రియలు నిర్వహించాడు. పోలీసులకు తోడ్పాటు అనాథ దేహాలు లేదా కుళ్లిన మృతదేహాలు లభ్యమైతే వాటిని పోస్ట్మార్టానికి తరలించేందుకు, అనంతరం శ్మశానానికి తీసుకుని వెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు పోలీసులు అంబేద్కర్ను సంప్రదిస్తారు. పైసా ప్రయోజనం ఆశించకుండా వారికి తోడ్పాటునందిస్తాడు. తన సేవల ద్వారా అంబేద్కర్ గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గోపాలకృష్ణ ద్వివేది, పూర్వపు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరుల మన్ననలు పొందాడు. ఆయా అధికారులు అతడికి మెమెంటోలు ఇచ్చి సత్కరించారు.కళ్లు చెమ్మగిల్లుతాయి అనాథలు చనిపోయిన తీరు చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయి. ఇటువంటి చావు ఎందుకొచ్చిందా అని వేదన పడుతూంటాను. నా చివరి శ్వాస వరకు అనాథ మృతదేహాల సేవలోనే తరిస్తాను. అనాథ దేహం కదా అని అంతిమ సంస్కారాల్లో ఏ మాత్రం వెనకడుగు వేయను. నలుగురి సహకారంతో పూర్తి స్థాయిలో నిర్వహిస్తాను. ఎవరైనా అనాథ మృతదేహాలను గుర్తిస్తే 93478 78713, 84988 74684 నంబర్లకు ఫోన్ చేస్తే దేహాన్ని ఉచితంగా శ్మశానానికి తరలించి, అంతిమ సంస్కారాలు నిర్వహిస్తాను. – కూపర్ భాను అంబేద్కర్, కాకినాడ -
భూసారానికి నవధాన్య సాగు
● పీఎండీఎస్తో వేరు వ్యవస్థకు భద్రత ● ఈ పద్ధతిపై విస్తృతంగా అవగాహన ● సేద్యానికి విత్తన కిట్లు సిద్ధం కొత్తపేట: ప్రధాన పంటకు ముందు ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (రుతుపవనాలకు ముందు వేసే పంట – నవధాన్యాల సాగు) సాగు చేపట్టడం ద్వారా సేంద్రియ కర్బనాన్ని పెంచుతుందని, ఈ సాగు పట్ల రైతులు అవగాహన కలిగి ఉండాలని వ్యవసా యశాఖ అధికారులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రయోగాత్మకంగా నవధాన్యాల రకాల విత్తనాలను కలిపి వెదజల్లే పద్ధతి గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సాగుపై వ్యవసాయ శాఖ కొత్తపేట సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.వెంకట రామారవు సాక్షికి వివరించారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) సాగు అనేది పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందు 20 నుంచి 30 రకాల వివిధ పంట విత్తనాలను కలిపి వెదజల్లి, సాగుభూమిని సజీవ వేరు వ్యవస్థతో ఎల్లప్పుడూ కప్పబడి ఉండే ప్రక్రియ. ఈ ప్రక్రియ 365 రోజులు భూమి పంటలతో కప్పబడి ఉండాలనే వ్యూహంతో ముఖ్య భూమిక పోషిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని నవధాన్యాల సాగు పద్ధతిగా పిలుస్తారు. మామూలు పద్ధతిలో చేసే వ్యవసాయ క్రమంలో దుక్కి దున్ని, ఎరువులు వాడి, పంటల మధ్య బీడు పెట్టే ప్రక్రియలో భూమిలో సేంద్రియ కర్బన శాతం తగ్గుముఖం పడుతుంది. ప్రకృతి వ్యవసాయ పంటల సాగు సేంద్రియ కర్బనాన్ని పెంచుతుంది. పంటలు కిరణ జన్య సంయోగ క్రియ నుంచి ఆహారాన్ని తయారు చేస్తాయి. అలా తయారైన ఆహారంలో 30 శాతం వరకు వేర్ల ద్వారా స్రవించబడి, నేల పైపొరల మీద ఆధార పడ్డ అసంఖ్యాక జీవరాశుల సంఖ్యను పెంపొందిస్తూ మొక్కలు, వాటి పోషకాల సరఫరా చేయడానికి సహాయపడుతుంది. పంట కోసిన అనంతరం తదుపరి పంట విత్తు వరకు నేలలోకి కార్బన్ విడుదల చేయడం ఆగిపోతుంది. కాబట్టి ఏడాది పొడవునా నిరంతరాయంగా పంటలను పండించడం వల్ల సేంద్రియ కర్బన శాతం నేలలోకి చేరుతుంది. ప్రతి సీజన్లో పంటల వైవిధ్యాన్ని మెరుగు పరచడానికి, బీడుగా ఉండే భూములను పంటలతో సాధారణంగా వేసవి నెలలలో పొలాలు బీడుగా ఉంటాయి కాబట్టి పీఎండీఎస్ లోని పలు పంటల ద్వారా ఆదాయం, భూమిలో పోషకాల పెంపుదలతో పాటు పశువులకు నాణ్యమైన పచ్చిమేతగా పొందేందుకు కూడా అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం రబీ అనంతరం ఖరీఫ్కు ముందు అంటే రుతుపవనాలకు ముందు బీడుగా ఉండే నెలలలో పంటలు సాగు చేయడానికి డ్రై సోయింగ్ పద్ధతి అనువైనది. ఈ విధానంలో పంటల విత్తనాలు ● నవధాన్యాల సాగులో 20 నుంచి 30 రకాల పంటలు సాగు చేయవచ్చు. కనీసం 20 రకాలు తీసుకున్నారు. అవి ఇలా.. ● పచ్చిరొట్ట పైర్లు – జనుము, జీలుగ, పిల్లి పెసర ● పప్పు ధాన్యం పైర్లు – మినుము, పెసర, ఉలవ, బొబ్బర్లు ● నూనె గింజల పైర్లు – వేరుశెనగ, నువ్వులు, ఆముదం ● చిరు ధాన్యం పైర్లు – జొన్న, కొర్ర, రాగి, ● ఆకు కూరలు – గోంగూర, పాలకూర, తోటకూర, చుక్కకూర, ● తీగ జాతి పంటలు – బీర, ఆనప, దోస తదితర పంటలు ● ఈ విత్తనాల కిట్లను వ్యవసాయశాఖ ద్వారా రైతులకు అందజేస్తున్నారు. ● సుగంధ ద్రవ్యాలు – ధనియాలు, ఆవాలు, సబ్ డివిజన్ వారీగా అవగాహన జిల్లా వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ సబ్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) ఆధ్వర్యంలో మండలాలు, గ్రామాల వారీగా ఈ నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో అమలు చేస్తున్న ఈ పథకానికి సంబందించి ప్రత్యేకంగా ప్రతి సబ్ డివిజన్కు ఒక మాస్టర్ ట్రైనర్ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేల మంది రైతులు 22 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ విధానం అవలంబిస్తుండగా సుమారు 22 వేలు కిట్లు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం 98 గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించారు. 9,352 కిట్లు పంపిణీ చేస్తున్నారు. దశల వారీగా గ్రామాలను, విస్తీర్ణాన్ని, కిట్ల పంపిణీని విస్తరిస్తారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ఒక ప్రణాళికను రూపొందించారు. ఉదాహరణకు కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లో 2227.97 ఎకరాలు విస్తీర్ణం కాగా 2489 మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం 1,336 కిట్ల పంపిణీ చేపట్టారు. సాగుతో భూసారం వృద్ధి రైతులు నవధాన్యాల సాగు చేపట్టాలి. తద్వారా భూసారాన్ని పెంచుకోవాలి. ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తులను పండించాలి. 20 రకాల విత్తనాల 12 కేజీల కిట్ ఒక ఎకరానికి సరిపోతుంది. ఈ కిట్ ధర రూ 800. రబీ (దాళ్వా) పంట కోతల ముందు చల్లుకోవాలి. బోర్లు సౌకర్యం ఉన్నచోట వేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – ఎం వెంకట రామారావు, ఏడీఏ, కొత్తపేట ఈ సాగు వల్ల కలిగే ప్రయోజనాలు పీఎండీఎస్ పద్ధతిలో 365 రోజులు భూమి కప్పబడి ఉంచే నిరంతర సాగు ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. వివిధ పంటల వేర్లు భూమిలో వైవిధ్య రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పించి పంటలకు ఉపయోగపడే వీటి సంతతిని అభివృద్ధి చేస్తాయి. తద్వారా ప్రధాన పంటకు కావల్సిన స్థూల, సూక్ష్మ పోషకాలను అందుబాటులోకి తీసు కువచ్చి మొక్కల వేరు వ్యవస్థ గ్రహించేటట్టు చేస్తాయి. నవధాన్య పంటలు పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చిమేతగా ఉపయోగపడుతుంది. నేల గుల్లబారి వానపాములు వృద్ధి చెందుతాయి. నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పలు పంటల సాగు వల్ల అదనపు ఆదాయం కలుగుతుంది. నేల కోతకు గురికాదు. జీవ వైవిధ్యం, నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది. ప్రధాన పంటలో రసాయనిక ఎరువులు వినియోగం తగ్గుతుంది. ప్రధాన పంటలో కలుపు తగ్గుతుంది. పంటలో చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రధాన పంట వాతావరణ వైపరీత్యాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. -
రత్నగిరిపై పెళ్లి సందడి
● నవ దంపతులతో ఆలయం కిటకిట ● స్వామివారి దర్శనానికి 40 వేల మంది ● రెండు వేల వ్రతాల నిర్వహణ అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం ఆదివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారు జామున రత్నగిరిపైన, శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో నవ దంపతులు, బంధు మిత్రులతో స్వామివారి దర్శనానికి బారులు తీరారు. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా, రెండు వేల వ్రతాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. ఆదివారం రాత్రి, సోమవారం పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనుండడంతో రామాలయం వద్ద వార్షిక కల్యాణ మండపం ఎదుట ఉన్న విశ్రాంతి మండపంలో మండపాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్షరాయవరం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. ఆరు సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 533 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 270 మంది హాజరయ్యారు. కాకినాడ జిల్లా పరిధిలో తొమ్మిది సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,143 మందికి 786 మంది, తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని ఐదు సెంటర్లలో ప్రవేశ పరీక్ష నిర్వహించగా, 809 మందికి 605 మంది హాజరయ్యారు. జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు కోనసీమ జిల్లాలో ఆరు సెంటర్లలో నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,067 మందికి 733 మంది హాజరు కాగా, కాకినాడ జిల్లాలో 1,667 మందికి 1,179 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1,282 మందికి 954 మంది హాజరైనట్టు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఎస్.శైలజ తెలిపారు. -
వైభవంగా సప్తస్వర అవధాన వైజయంతి
72 మేళకర్త రాగాలపై అవగాహన సదస్సు పి.గన్నవరం: ముంగండ గ్రామంలోని శ్రీత్యాగరాజ ఆరాధన సమితి, ఉభయ తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ప్రముఖ సినీ సంగీత దర్శకుడు స్వర వీణా పాణిచే సప్తస్వర అవధాన వైజయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీణాపాణిచే 72 మేళకర్త రాగాలపై అవగాహన సదస్సు జరిగింది. వీణాపాణి సప్తస్వర అవధానం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. సభికులు అడిగిన రాగాలలో.. వీణాపాణి చేసిన సంగీత అవధానం ఉర్రూతలూగించింది. విశేష అతిథిగా హైదరాబాద్కు చెందిన ఆధ్యాత్మిక పాటల ప్రముఖ రచయిత, సాహితీవేత్త పరిమి కేదార్నాథ్ పాల్గొని మాట్లాడారు. అద్భుతమైన సాహిత్యంతో ఆయన సభికులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా స్వర వీణాపాణి, కేదార్నాథ్ తదితరులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. తొలుత ఎల్.గన్నవరంలోని అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వారి నివాసాన్ని వారు సందర్శించారు. సీతమ్మ వారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. గ్రామంలోని మూడు దేవాలయాలను సందర్శించి పూజలు చేశారు. ఎల్.గన్నవరంలో మిర్తిపాటి నారాయణ, సూర్యకుమారి దంపతుల చిత్ర పటాలకు, ముంగండలో నడిమింటి నాగరాజారావు చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముంగండలో హైదరాబాద్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యుడు మిర్తిపాటి రామం నేతృత్వంలో జరిగిన అవధాన కార్యక్రమానికి తెన్నేటి లక్ష్మి నర్శింహమూర్తి సంధాన కర్తగా వ్యవహరించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక (హైదరాబాద్) వ్యవస్థాపకుడు బాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వేముల కిషన్రావు, బ్రాహ్మణ వేదిక నాయకులు గొల్లపల్లి ఫణీంద్ర, ప్రముఖ చిత్ర కళాకారుడు రవి పరస, తబలా వాద్యకారుడు టి.మోహన్ తదితరులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో సంగీత, సాహిత్య అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కుక్కల దాడిలో నెమలికి గాయాలు
● రక్షించిన హెడ్కానిస్టేబుల్ ● అటవీ అధికారులకు అప్పగింత రాజమహేంద్రవరం రూరల్: జాతీయపక్షి నెమలిని కుక్కల బారినుంచి రక్షి క్షించిన సంఘటన ఆదివారం ఉదయం కొంతమూరు గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమూరు పప్పులమిల్లు ప్రాంతంలో 14 ఎకరాల లే అవుట్లో వై.రామవరం హెడ్ కానిస్టేబుల్ కేవీ మాధవ్ నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం సమయంలో ఎటునుంచో వచ్చిన నెమలిని కుక్కలు తరుముతున్నాయి. ఈ లోగా కేవీ మాధవ్ కుమారుడు చూసి కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న మోటర్సైకిలిస్ట్ కుక్కలను తరమడం జరిగింది. దీంతో గాయపడిన నెమలిని హెడ్కానిస్టేబుల్ మాధవ్ ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేసి, వెంటనే ఫారెస్టు ఆఫీసర్కు ఫోన్ చేశారు. అధికారులు నెమలిని తమ కార్యాలయానికి తీసుకువచ్చి అప్పగించాలని కోరారు. దీంతో కేవీ మాధవ్ లాలాచెరువు పుష్కరవనం దగ్గర ఉన్న ఫారెస్టు రేంజ్ ఆఫీసుకు తీసుకువెళ్లి ఫారెస్టు రేంజ్ అధికారి దావీదురాజుకు అప్పగించారు. జాతీయ పక్షి నెమలికి ఆరోగ్య పరీక్షలు చేసి వైద్య సేవలు అందించి అనంతరం అడవిలో వదిలేస్తామని దావీదు రాజు వెల్లడించినట్టు హెడ్కానిస్టేబుల్ కేవీ మాధవ్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వైభవంగా తలుపులమ్మతల్లి జాతరోత్సవాలు
● ఘనంగా ప్రారంభం ● 26న జాగరణ, 27న ఊరేగింపు, తీర్థం తుని రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. లోవకొత్తూరు రామాలయంలో గతేడాది భద్రపర్చిన గరగలను ఆదివారం నృత్య కళాకారులు తీసి దేవస్థానానికి తీసుకువెళ్లారు. పుట్టధార పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి నూతన వస్త్రాలు, పూలతో అలంకరించారు. గరగలను ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు, మాజీ చైర్మన్ దూలం మాణిక్యం, ఇసరపు గాంధీ శిరస్సుపై ధరించి గరగ నృత్యాలతో అమ్మవారి గంధ అమావాస్య సంబరాలను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. అనంతరం డప్పు కళాకారుల వాయిద్యాల నడుమ లోవకొత్తూరు గ్రామంలో అమ్మవారి ఉపాలయానికి చేరుకున్నారు. ఈఓ మాట్లాడుతూ 14 రోజులు వివిధ గ్రామాల్లో గరగల నృత్యాలు చేస్తూ కళాకారులు అమ్మవారికి విస్తృత ప్రచారం కల్పిస్తారన్నారు. ఈ నెల 26న లోవ కొత్తూరులో ఉపాలయం ప్రాంగణంలో జాగరణోత్సవాలు, వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, విద్యుత్ దీపాలంకరణలు ఏర్పాటు చేశామన్నారు. 27న ఊరేగింపు నిర్వహించి, తీర్థం, అమ్మవారి దర్శనాలు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. మాజీ సర్పంచ్ పలివెల శ్రీనుబాబు, వేదపండితులు, ప్రధాన అర్చకులు, పలువురు భక్తులు పాల్గొన్నారు. అగ్నిప్రమాదంలో గూడపర్తి వాసి మృతి ● అనకాపల్లి బాణసంచా తయారీ కేంద్రంలో ఘటన ● సామర్లకోటకు చెందిన నలుగురికి గాయాలు ● వేట్లపాలెంలో విషాదం సామర్లకోట: అనకాపల్లి జిల్లా కోటవురట్లలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మండల పరిధిలోని వేట్లపాలెం శివారు గూడపర్తికి చెందిన దేవర నిర్మల (38) మృతి చెందింది. నిర్మలతో పాటు ఆమె భర్త గొడత వీరవెంకటసత్యనారాయణ, సామర్లకోట పెన్షన్లైన్కు చెందిన యాలంగి రాజు, యాలంగి సంతోషిణి, యాలంగి సారోన్ కూలి పనికి వెళ్లి బాణసంచా తయారీ కేంద్రంలో చేరారు. ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిర్మల మృతి చెందగా మిగిలిన వారు స్వల్వ గాయాలలో బయట పడిన్నట్లు వారి బంధువులు తెలిపారు. నిర్మలతో సహజీవనం చేస్తున్న గూడపర్తికి చెందిన గొడత వీరవెంకటసత్యనారాయణకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న నిర్మల కుటుంబ సభ్యులు హుటాహుటిన అనకాపల్లి వెళ్లారు. ఈ ఘటనతో గూడపర్తిలో విషాద ఛాయలు అలముకున్నాయి. సీఐ ఎ.కృష్ణభగవాన్ గూడపర్తి చేరుకుని సమాచారం సేకరించారు. అక్కడి ప్రమాద వార్త తెలిసిన వెంటనే వేట్లపాలెంలో బాణా సంచాతయారీదారులు తమ దుకాణాలను మూసి వేశారు. ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు గూడపర్తి చేరుకుని సమాచారం సేకరించారు. కాగా సుమారు ఆరేళ్ల క్రితం పెన్షన్లైన్కు చెందిన డొకుబుర్ర రాజు, శేషారావులు పెదపూడిలో బాణా సంచాతయారీకి వెళ్లి మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఉత్సాహంగా ఎడ్లబళ్ల పోటీలు
రాజానగరం: వ్యవసాయ ఆధారితంగా ప్రాంతాలలో సంప్రదాయంగా వస్తున్న ఎడ్ల బండ్ల పోటీలను ఏటా ప్రభుత్వం తరఫున నిర్వహించేలా ప్రతిపాదన చేయనున్నట్టు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. మండలంలోని వెలుగుబంద సమీపంలో వృత్తాకారంలో ఆదివారం నిర్వహించిన ఎండ్ల బళ్ల రాష్ట్ర స్థాయి పోటీలకు అపూర్వ స్పందన లభించింది. జీఎస్ఎల్ వైద్య కళాశాల ఎండీ డాక్టర్ గన్ని సందీప్ పోటీలను ప్రారంభించగా, విజేతలకు ఎమ్మెల్యే బత్తుల బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలలో వ్యవసాయ ఆధారిత రైతు కుటుంబాలకు ఇదొక పండుగలాంటిదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటువంటి పోటీలు లేకపోతే పశుసంపద అనేది కనుమరుగై పోయేదన్నారు. గ్రామ దేవత సత్తెమ్మ తల్లి తీర్థమహోత్సవాలను పురస్కరించుకుని వెలుగుబందకు చెందిన కూటి కోటేశ్వర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో వివిధ ప్రాంతాల నుంచి 23 ఎడ్ల జతలు పోటీపడగా, నిర్ణీత వ్యవధిలో గమ్యాన్ని చేరుకున్న ఎనిమిది జతల ఎడ్లను విజేతలుగా ప్రకటించి, బహుమతులు అందజేశారు. మొదటి బహుమతిగా రూ. 20 వేలను పెద పైడితల్లమ్మ (లెక్కల వానిపాలెం), రెండో బహుమతిగా రూ. 16 వేలను వేగుల్ల తేజాచౌదరి (మండపేట), మూడో బహుమతిగా రూ. 14 వేలను పోలుపర్తి రామునాయుడు అందుకోగా, మరో ఐదు జతలను కూడా తదుపరి స్థానాలలో విజేతలుగా ప్రకటించి నగదు బహుమతులను అందజేశారు. -
బాకీ అడిగాడని కడతేర్చారు
● దొమ్మేరు హత్య కేసులో వీడిన మిస్టరీ ● ముగ్గురు నిందితుల అరెస్ట్ ● రెండు మోటారు సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్ల స్వాధీనం ● 36.7 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ ● నిందితుడు పెద్దేవం సచివాలయంలో సర్వేయర్ కొవ్వూరు: గత నెల 26వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. నందమూరు – దొమ్మేరు పుంతరోడ్డులోని పోలంలో పెండ్యాల ప్రభాకరరావు (46) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఆదివారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ జి.దేవకుమార్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. పోలవరం మండలం పాత పట్టిసీమకి చెందిన చుక్కా రామ శ్రీనివాస్ ఈ హత్య చేసినట్లు ధ్రువీకరించారు. ప్రధాన నిందితుడు తాళ్లపూ డి మండలం పెద్దేవం సచివాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్నారు. గోపాలపురం మండలం దొండపూడికి చెందిన అంకోలు జగదీష్ దుర్గాప్రసాద్, పోలవరానికి చెందిన నోముల ప్రవీణ్ కుమార్ నిందితుడికి సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు ముగ్గురిని 12వ తేదీ మధ్యాహ్నం ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ఇంటి వద్ద పట్టణ సీఐ పి.విశ్వం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళితే మృతుడు ప్రభాకరావు వింటేజ్ కంపెనీ ఉత్పత్తుల వ్యాపారం చేస్తూ ఏజెంట్ల ద్వారా విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే చుక్కా రామ శ్రీనివాస్తో పరిచయం ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్లో ప్రభాకరావు వద్ద శ్రీనివాస్ రూ.2.4 లక్షలు అప్పు తీసుకున్నారు. బాకీ తీర్చమని ప్రభాకరరావు ఒత్తిడి తేవడమే కాకుండా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు. విలాసాలు, క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి నిందుతుడు చాలా అప్పులు చేశాడు. ప్రభాకరరావును చంపేస్తే తన బాకీ తీర్చనవసరం లేదని భావించి స్నేహితులైన జగదీష్, ప్రవీణ్కుమార్లకు తెలిపాడు. మార్చి 26వ తేదీ రాత్రి జగదీష్ దుర్గాప్రసాద్ను వెంటబెట్టుకుని కొవ్వూరు పట్టణ శివారున హైవేలో అండర్ పాసేజ్ వద్దకి చేరుకున్నారు. ప్రభాకరరావుకు శ్రీనివాస్ ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. ఆర్థిక లావాదేవీలు ఉండడం, వ్యాపార సంబంధాలు ఉండడంతో ప్రభాకరరావు ఇంటి నుంచి మోటారు సైకిల్ వేసుకుని నందమూరు–దొమ్మేరు అండర్ పాసేజ్ వద్దకు చేరుకున్నారు. శ్రీనివాస్ అండర్ పాసేజ్ నుంచి కొద్ది దూరం వచ్చి ప్రభాకరరావు మోటారు సైకిల్ ఎక్కారు. తాను ఫోన్ చేసిన తర్వత రావాలని జగదీష్ దుర్గాప్రసాద్కు సూచించాడు. ఇద్దరు కలిసి నందమూరు–దొమ్మేరు పుంత రోడ్డు మార్గంలో వెళుతూ నీరుకొండ శేషగిరిరావుకు చెందిన డ్రాగన్ ఫ్రూట్తోట వద్ద మూత్ర విసర్జనకు ఆపమని అడిగాడు. అదే సమయంలో శ్రీనివాస్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రభాకరరావుపై విచక్షణారహితంగా పలుమార్లు నరికాడు. అనంతరం ప్రభాకరరావు కంఠం నరికి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఆ సమయంలో మృతుడి కుడి చేతికి ఉన్న బంగారు కడియం, నాలుగు బంగారపు ఉంగరాలు తీయడానికి ప్రయత్నించి రాకపోవడంతో చేతిని నరికి పేపర్ చుట్టి బ్యాగ్లో పెట్టుకున్నారు. మృతుడి వద్ద ఉన్న ఫోన్, మెడలో ఉన్న బంగారు గొలుసు, ఉంగరం బ్యాగ్లో పెట్టుకున్నాడు. అనంతరం జగదీష్ దుర్గా ప్రసాద్కు ఫోన్ చేసి రమ్మని పిలిచి ఇద్దరు కలిసి మోటారుసైకిల్పై దొమ్మేరు, కాపవరం మీదుగా పోలవరం వెళ్లి పోయారు. ఈ విషయాన్ని మూడో నిందితుడు ప్రవీణ్కుమార్కు చెప్పాడు. అనంతరం వారు తెచ్చిన ప్రభాకరరావు చేతికి ఉన్న ఉంగరాలు తీసుకున్నారు. తరువాత చేతిని, హత్యకు వినియోగించిన కత్తిని, ప్రభాకరరావు సెల్ఫోన్ను, నేరం చేసిన సమయంలో వారు ధరించిన దుస్తులను బ్యాగ్లో పెట్టి గుటాల వద్ద గోదావరి నదిలో వదిలేశారు. ఈ కేసులో 31.8 గ్రాముల ఒక బంగారపు గొలుసు, 4.9 గ్రాముల బంగారపు ఉంగరం ప్రధాన నిందుతుడి నుంచి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నేరం చేసిన సమయంలో వినియోగించిన మోటారుసైకిల్ను, రెండు సెల్ఫోన్లను, జగదీష్ దుర్గా ప్రసాద్ వద్ద నేరానికి వినియోగించిన అతని మోటారు సైకిల్ను, ఒక సెల్ఫోన్ను, ప్రవీణ్కుమార్ వద్ద సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే గుటాల సమీపంలో నిందితులు గోదావరి నదిలో పడేసిన వస్తువులను, మృతుడి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో దోచుకున్న బంగారంలో జగదీష్ దుర్గాప్రసాద్ కొయ్యలగూడెంలోని ముత్తూట్ ఫైనాన్స్లో కడియం తాకట్టు పెట్టి రూ.1.26 లక్షలు, తాళ్లపూడిలో కిస్ట్రియన్ సిరియన్ బ్యాంక్ (సీఎస్బీ)లో మూడు ఉంగరాల తాకట్టు పెట్టి రూ.43,600 తీసుకున్నారు. ఈ బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందన్నారు. పట్టణ సీఐ పి.విశ్వం, రూరల్ సీఐ కె.విజయ్బాబు, ఎస్సై పి.రవీంద్ర, నిడదవోలు ఎస్సై కె.జగన్మోహనరావు, కొవ్వూరు రూరల్ ఎస్సై కె.శ్రీహరి రావు, ఇతర సిబ్బంది ఈ కేసు చేధించడంలో సహకరించారన్నారు. వీరిని జిల్లా ఎస్పీ నరసింహా కిశోర్ అభినందించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. -
కూటమి వల.. గంగపుత్రులు విలవిల
● అప్పుడు..ఇప్పుడు అదే మోసం ● 24 గంటల్లో వేట నిషేధం ● అటకెక్కిన మత్స్యకార భరోసా ● రూ.20 వేలు ఇస్తామని బాబుదగా సాక్షి ప్రతినిధి, కాకినాడ: నడిసంద్రమే జీవనాధారంగా బతుకు నావను నెట్టుకొస్తున్న గంగపుత్రులకు పెద్ద కష్టం వచ్చి పడింది. సముద్రంలో మత్స్య ఉత్పత్తుల పరిరక్షణ కోసం ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు విధించే వేట నిషేధం ఆ కుటుంబాలకు సంకటంగా మారింది. మత్స్యకార కుటుంబాలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టినట్టు కనిపిస్తోంది. సముద్రంపై వేట విరామం అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వేలాది మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లేనట్టే. నిషేధ సమయం 60 రోజులు ప్రత్యామ్నాయ ఉపాధి గగనమైపోతుంది. ఎందుకంటే వీరంతా తరతరాలుగా సముద్రంపై వేట తప్ప మరో పని చేయలేరు. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు విరామ సమయంలో ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్రెడ్డి క్రమం తప్పకుండా మత్స్యకార భరోసా అందించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.4 వేలు ఉన్న వేట నిషేధ భృతిని 2019లో సీఎంగా జగన్మోహన్రెడ్డి మత్స్యకార భరోసా కింద రూ.10 వేలకు పెంచారు. వేట నిషేధం అమలులో ఉన్న సమయంలోనే ఏటా ఠంచన్గా భరోసా సొమ్ము జమ చేస్తూ వచ్చారు. ఇలా నిషేధ సమయంలోనే జగన్ భరోసా సొమ్ము అందివ్వడంతో సముద్ర వేటపై ఆధారపడ్డ మత్స్యకార కుటుంబాలు సంతోషంగా ఉండేవి. వేట విరామ సమయం రెండు నెలలకు కుటుంబాలు నెట్టుకురావడానికి లోటు లేకుండా గడచిపోయేది. ఏటా మాదిరిగానే 2023–24 మత్స్యకార భరోసా కూడా ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. ఇందుకు కార్యాచరణ కూడా పూర్తయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పంపిణీ ప్రక్రియకు బ్రేక్ పడింది. తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడచినా.. అప్పుడే రెండోసారి వేట నిషేధ సమయం వచ్చేసింది. ఈ విరామ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే రూ.10 వేల పరిహారాన్ని రెట్టింపు చేసి రూ.20 వేలు ఇస్తామని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నమ్మించారు. ఎన్నికలు ముగిసి కూటమి సర్కార్ గద్దెనెక్కి 10 నెలలు గడచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి కూడా వేట విరామం అమలులో ఉంది. బాబు, పవన్ ఎన్నికల్లో ప్రకటించినట్లుగా తమకు రూ.20 వేల పరిహారం ఇస్తారని వేలాది మత్స్యకార కుటుంబాలు గంపెడాశలు పెట్టుకున్నాయి. వేట నిషేధ సమయంలో పస్తులతో కుటుంబాలను నెట్టుకొచ్చినా కూటమి ప్రభుత్వం కనీసం మానవత్వం చూపించలేదు. సూపర్ సిక్స్ హామీల మాదిరిగానే మత్స్యకారులకు ఇచ్చిన మాటను కూడా నడిసంద్రంలో విడిచి పెట్టేసింది. ఫలితంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సముద్ర వేటపై ఆధారపడ్డ వేలాది మత్స్యకార కుటుంబాలు చుక్కాని లేని నావ మాదిరిగా తయారయ్యాయి. ఇచ్చిన హామీ అమలు చేయకుండా గాలికొదిలేయడంతో ప్రత్యామ్నాయ ఉపాధి లేక రోడ్డున పడ్డాయి. చంద్రబాబు అండ్ కో మాటల గారడీతో నిలువునా ముంచేశారని మత్స్యకార కుటుంబాలు ఘొల్లుమంటున్నాయి. ఈసారీ కడుపు మాడ్చుకోవాల్సిందేనా? గత ఏడాది వేట విరామ సమయంలో పరిహారం రేపు ఇస్తాం, మాపు ఇస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఎగనామం పెట్టింది. అసలు గత విరామ సమయంలో పరిహారం అందుకోకుండానే రెండోసారి వేట నిషేధ సమయం మరో 24 గంటల్లో అమలులోకి వచ్చేస్తోంది. పెండింగ్ పరిహారం ఊసే లేదు అని మత్స్యకారులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్వాకంతో మరోసారి కడుపు మాడ్చుకోవాల్సిందేనని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నిషేధ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం ఏడాది కావస్తున్నా అందించలేదు. కూటమి ప్రభుత్వంలో రెండోసారి కూడా అందుతుందనే నమ్మకం కలగడం లేదంటున్నారు. ఇలా నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబుకు మించిన నాయకుడు లేడనే విషయం మరోసారి రుజువైందని మత్స్యకారులు ఆక్షేపిస్తున్నారు. బాబూ.. మాట నిలబెట్టుకో.. మత్స్యకార భరోసా ఏడాదికి రూ.20,000 ఇస్తామని చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి. గత ఏడాది మత్స్యకార భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు మరోసారి వేట నిషేధ సమయం వచ్చేసింది. అయినప్పటికీ గత ఏడాది ఇవ్వాల్సిన భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిషేధ సమయం ముగియకుండానే ఏటా మత్స్యకార భరోసా అందజేసేవారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలకు కలిపి మత్స్యకార భరోసా నిధులు విడుదల చేయాలి. – చింతా నాగ మునీంద్రరావు, మత్స్యకార నాయకుడు, చింతావానిరేవు, ముమ్మిడివరం మండలం నిషేధ సమయంలో పస్తులుండాల్సి వస్తోంది వేట నిషేధ సమయం రెండు నెలలూ ప్రత్యామ్నాయ జీవనోపాధి లేక సముద్రంపై వేటాడే కుటుంబాల వారు పస్తులుండాల్సి వస్తోంది. నిషేధ సమయంలో ఇవ్వాల్సిన పరిహారం సకాలంలో విడుదల చేయకపోవడంతో నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రూ.10వేలు పరిహారం కాస్తా రూ.20వేలు చేస్తామంటే ఎంతో నమ్మకంగా ఉన్నారు. తీరా రెండోసారి నిషేధ సమయం వచ్చేసినా చిల్లి గవ్వ కూడా విడుదల చేయలేదు. – మేరుగు ఎల్లాజీ, ఎంపీటీసీ సభ్యుడు, ఉప్పాడ ప్రతి కుటుంబానికి రూ.40వేలు ఇవ్వాలిచంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మోసం చేయడం తగదు. గత ఏడాది ఇవ్వాల్సిన పరిహారం, ఈ నెలలో నిషేధ సమయంలో ఇవ్వాల్సిన సొమ్ము కలిపి ప్రతి కుటుంబానికి రూ.40 వేలు మత్స్యకారుల ఖాతాలకు జమ చేయాలి. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా కాలక్షేపం చేస్తోన్న కూటమి ప్రభుత్వం కనీసం మత్స్యకారుల విషయంలో అయినా మాట నిలబెట్టుకోవాలి. – గుబ్బల తులసీకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు, ఉప్పాడ కొత్తపల్లి మండలం 13కేకేడీ 09ఉమ్మడి తూర్పున.. లబ్థిదారులు: 33,704 మంది ఇవ్వాల్సిన మొత్తం: రూ.67.407 కోట్లు జగన్ హయాంలో... మత్స్యకార భరోసా వేటకు వెళ్లే ప్రతి కుటుంబానికి రూ.10వేల చొప్పున 2019–20లో–23,190 మందికి రూ.23,19 కోట్లు 2020–21లో–24,587 మందికి రూ.24,587 కోట్లు 2021–22లో–30,213 మందికి రూ.30,213 కోట్లు 2022–23లో–21,394 మందికి రూ.21,394 కోట్లు 2023–24లో–24,147 మందికి రూ.24,147 కోట్లు 2019–20 నుంచి వేట నిషేధంతో ప్రభావితమైన బోటు యజమానులు, కళాసీలు 1,23,531 మందికి రూ.123.531 కోట్లు జమ చేశారు. కోనసీమ జిల్లాలో.. మండలాలు: ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, మామిడికుదురు, ఉప్పలగుప్తం, సఖినేటిపల్లి, రామచంద్రాపురం, కె గంగవరం, అల్లవరం, సఖినేటిపల్లి తీరప్రాంత గ్రామాలు: 45 మొత్తం బోట్లు: 1,700 అర్హులైన మత్స్యకారులు : 9,575 మంది కాకినాడ జిల్లాలో ... మండలాలు: తుని, తొండంగి, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, తాళ్లరేవు మత్స్యకార తీర గ్రామాలు: 36 మెకనైజ్డ్ బోట్లు: 467, మోటారు బోట్లు: 3,779, సంప్రదాయ బోట్లు 399 వేట నిషేధ లబ్ధిదారులు: 24,147 మంది -
ఉపాధ్యాయులు సమాచారం ధ్రువీకరించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ అసిస్టెంట్స్ సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించామని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు ఆదివారం తెలిపారు. ఆ జాబితాలు ఆర్డీ కాకినాడ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జేడీఎస్ఈకేకేడీ.ఆర్గ్, సంబంధిత ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి కృష్ణా జిల్లా విద్యాశాఖల వెబ్సైట్లు, నోటీసు బోర్డులలో అందుబాటులో ఉంచామన్నారు. అయితే సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16వ తేదీలోగా సంబంధిత ఉమ్మడి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించి, సరి చేయించుకోవాలన్నారు. అభ్యంతరం చేసే ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలతో సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఆధారాలు, సంబంధిత సాక్ష్యాలు ఉంటే వాటిని జత చేయాలన్నారు. టీఐఎస్లో సమాచారం అంతా సరిగానే ఉన్న ఉపాధ్యాయులు అందరూ తమ మొబైల్లోనే వన్ టైమ్ పాస్ వర్డ్ తో తమ డేటాను కన్ఫర్మ్ చేయాలన్నారు. సీతారాములకు ఘనంగా శ్రీపుష్పయాగం రత్నగిరిపై ముగిసిన శ్రీరామనవమి వేడుకలు అన్నవరం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో చివరగా తొమ్మిదో రోజు ఆదివారం రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీసీతారాములకు శ్రీపుష్పయాగం కార్యక్రమం నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో రాత్రి ఎనిమిది గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనంపై , పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రత్యేక సింహాసనంపై ప్రతిష్టించి పండితులు పూజలు చేశారు. అనంతరం సీతారాములను సుగంధ భరిత పుష్పాలతో పూజించారు. సీతారాములకు వివిధ రకా ల పిండివంటలు నివేదించారు. అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. రామాలయంలో పూలమాలలతో అలంకరించిన ఊయల మీద సీతారాములను పవళింపు చేసి మంత్రాలు చదువుతూ మూడుసార్లు ఊపారు. అనంతరం ఆ ఊయలకు అమర్చిన అద్దంలో సీతారాములను పండితులు దర్శించారు. అనంతరం పండితులకు దంపత తాంబూలాలు బహూకరించారు. భక్తులకు ప్రసాదాలను, ముత్తయిదువులకు జాకెట్టు ముక్కలను పంపిణీ చేశారు. భక్తు లు సీతారాములను అద్దంలో తిలకించి పులకించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో రత్నగిరి పై శ్రీరామ నవమి మహోత్సవాలు ముగిసాయి. వైభవంగా వెంకన్న శ్రీపుష్పోత్సవం వాడపల్లిలో ముగిసిన కల్యాణోత్సవాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరుని శ్రీపుష్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన కల్యాణమహోత్సవాలు ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీపుష్పోత్సవంతో ఘనంగా ముగిసాయి. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వైఖానస పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించి రాత్రి శ్రీపుష్పోత్సవం నిర్వహించారు. వివిధ రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అద్దాల మండపంలో వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి వారిని జోల పాటలతో పవళింపజేశారు. పలువురికి దంపతి తాంబులాలు అందచేశారు. కాగా అందరి సహకారంతో స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించినట్టు డీసీ చక్రధరరావు తెలిపారు. -
పోలీసుల దర్యాప్తు నమ్మశక్యంగా లేదు
పాస్టర్ ప్రవీణ్ మృతిపై మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిలో పోలీసుల దర్యాప్తు నమ్మశక్యంగా లేదని ఇప్పటికీ ప్రవీణ్ మృతి ఆక్సిడెంట్ వల్ల జరగలేదని నమ్ముతున్నానని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులు మొదటి నుంచి యాక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారన్నారు. ప్రవీణ్ మరణం యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేశారో, ల్యాప్టాప్లు, ఐపాడ్లు పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారో అర్థం కావడం లేదన్నారు. ప్రవీణ్ షెడ్యూల్ ప్రకారం ప్రమాదం జరిగిన రోజు మహారాష్ట్రలో ఉండాలని అన్నారు. విజయవాడ, కొవ్వూరులో సమావేశాలకు ప్రవీణ్ను పిలిచింది ఎవరు అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు. పోలీసులు ఇటువంటి నాన్సెన్స్ ఇన్వెస్టిగేషన్లు చేసి ప్రవీణ్ మద్యం సేవించి మృతి చెందాడనే విషయం చెప్పడం మానుకోవాలన్నారు. ప్రవీణ్ మృతిపై అనుమానం ఉన్న వారంతా నోరు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మృతిపై దర్యాప్తునకు మరింత ముందుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. పోలీసులకు సహకరించాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలు వేడుకలను నిర్వహించుకోవాలని ఎస్పీ డి.నరసింహకిశోర్ సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈ వేడుకలలో భాగంగా, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో టీడీపీ కుట్ర బట్టబయలైంది. విశాఖ ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై హత్యాయత్నం చేసిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. 2018లో వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబీ వెంకటేశ్వరరావు ఉన్నారు.అయితే, ప్రసుత్తం ఆయన కూటమి ప్రభుత్వంలో కూడా నామినేటెడ్ పోస్ట్లో కొనసాగుతున్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఏబీ మంతనాలు జరిపారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసు కీలక దశలో ఉండగా.. నిందితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులతో ఏబీ వెంకటేశ్వరరావు రహస్యంగా చర్చలు జరపడం చర్చాంశనీయంగా మారింది. శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.టీడీపీనే హత్యాయత్నం చేయించిందని ముందు నుంచే అనుమానాలు ఉన్నాయి. జనుపల్లి శ్రీనివాస్ ఇంటికి ఏబీ వెంకటేశ్వరరావు వెళ్లడంతో టీడీపీతో నిందితుడు శ్రీనివాస్కు ఉన్న సంబంధాలు బట్టబయలైంది. కొద్దిరోజుల నుంచి జగన్పై విషం కక్కుతూ ఏబీవీ ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎక్స్లో జగన్పై ఏబీవీ తన అక్కసును వెళ్లగక్కారు. -
వెరైటీ వెడ్డింగ్ కార్డు.. బీజేపీ నేత సరికొత్త ఆలోచన
సాక్షి, కొవ్వూరు: ఇటీవలి కాలంలో పెళ్లి వేడుక అంటే.. ఏదో కొత్తగా ఉండాలని చాలా మంది భావిస్తున్నారు. పెళ్లి కుదిరింది మొదలు.. తాళికట్టే వరకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఫొటో షూట్, ఆహ్వాన పత్రికలు, పెళ్లిలో ఆహార మెను విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీకి చెందిన బీజేపీ నాయకుడు ఒకరు.. విందు విషయంలో సరికొత్తగా ఆలోచించారు. ఆహారం వృథా చేయవద్దని అందులో చెప్పుకొచ్చారు.వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోడూరి లక్ష్మీనారాయణ తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించారు. పెళ్లి విందులో వడ్డించే వంటకాల జాబితాను అందులో ప్రచురించారు. విందు సమయంలో ఆహార పదార్థాల వృథాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ ప్రచురించారు. ‘దయచేసి ఎవరూ అన్యథా భావించవద్దు అని వినయపూర్వక ప్రార్థన’ అంటూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. -
‘నన్నయ’ వీసీకి రత్నసింహ్జీ మహిదా అవార్డు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ‘రత్నసింహ్జీ మహిదా మెమోరియల్ అవార్డు అందుకున్నారు. ఆమెకు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ శనివారం ఈ అవార్డు అందజేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని రాజ్పిప్లాలో సామాజిక సంస్కర్త, విద్యావేత్త, గిరిజనుల సంక్షేమానికి అంకితమైన దివంగత రత్నసింహ్జీ మహిదా జ్ఞాపకార్థం సంఘ సేవ చేసిన ప్రముఖులకు ఈ సంవత్సరం నుంచి అందజేస్తున్నారు. బిర్సాముండా గిరిజన యూనివర్సిటీ వీసీ మధుకర్బాయ్ ఎస్తో పాటు 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించి, భారత రాష్ట్రపతి నుంచి ‘నారీరత్న’ పురస్కారాన్ని అందుకున్న ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీకి ఈ అవార్డును తొలిసారిగా ప్రదానం చేశారు. కారు బోల్తా.. 10 మందికి గాయాలు దేవరపల్లి: అతి వేగంగా వెళుతున్న కారు 16వ నంబర్ జాతీయ రహదారిపై అదుపు తప్పి, పంట పొలాల్లో బోల్తా పడి, ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బందార్లపల్లికి చెందిన 10 మంది కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం మధ్యాహ్నం 2.40 గంటల సమయానికి దేవరపల్లి మండలం యర్నగూడెం వద్దకు చేరుకున్నారు. అక్కడ కారు ఒక్కసారిగా అదుపుతప్పి హైవే పైనుంచి పల్టీలు కొడుతూ పంట పొలాల్లో పడింది. ఈ ప్రమాదంలో కారులోని 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని స్థానికులు బయ టకు తీసి, హైవే అంబులెన్స్లో గోపాలపు రం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. గాయపడిన వారిలో గౌరక్క (కోతుల లత), గౌరక్కగారి చిన్నమ్మాయి, కోతుల సోమశేఖర్, కోతుల యశ్వంత్, కోతుల చందన, భార్గవి, పభ్రేష్, లలిక, శిరీష, కారు డ్రైవర్ గౌరక్కగారి శ్రీకాంత్ ఉన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఇ.సుబ్రహ్మణ్యం తెలిపారు. -
వైఎస్సార్ సీపీలో ‘తూర్పు’నకు అగ్రాసనం
● పీఏసీలో కీలక ప్రాతినిధ్యం ● నియామకాల్లో సామాజిక సమతూకం ● బోస్, తోట, విశ్వరూప్, ముద్రగడకు చోటు సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్టానం పలు కీలక నియామకాలు చేపట్టింది. మండల, గ్రామ స్థాయిలో నూతన కమిటీల నియామకాల్లో పాత, కొత్త నేతల కలయికతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీలో అత్యున్నతమైన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ)లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అధిష్టానం అగ్రాసనం వేసింది. పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కన్వీనర్గా వ్యవహరించే ఈ కమిటీలో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు ప్రముఖులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ శనివారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలు చేపట్టారు. పీఏసీ సభ్యులుగా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ, మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట త్రిమూర్తులు, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని నియమించారు. శృంగార వల్లభుని సన్నిధిలో రద్దీ పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం శనివారం రద్దీగా మారింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,80,809 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. మూడు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామని చెప్పారు. -
అక్క బంగారం కాజేసి కటకటాలకు
● సొంత చెల్లి పెద్దమ్మ కూతురితో కలసి చోరీ ● కట్టర్ సాయంతో తాళాలు తొలగించిన వైనం ● 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు, ఇంటి డాక్యుమెంట్ల స్వాధీనం నిడదవోలు : సొంత అక్క బంగారంపైనే చెల్లెలు కన్నేసింది. అదును చూసి ఇద్దరి సాయంతో వాటిని అపహరించి చివరకు కటకటాల పాలైంది. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ శనివారం స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఎంవీ నగర్లో బలిజ సత్యనారాయణ, శశి లలితాదేవి దంపతులు నివసిస్తున్నారు. లలితాదేవి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఆమె సొంత చెల్లెలు పడాల లక్ష్మీశైలజ తాడేపల్లిగూడెంలో ఉంటోంది. శైలజ ఆర్థిక పరిస్థితుల వల్ల తన అక్క బంగారం దొంగిలించి తన ఆర్థిక అవసరాలను తీర్చుకోవాలని పథకం వేసింది. ఈ మేరకు ఉండ్రాజవరం గ్రామానికి చెందిన తన పెద్దమ్మ కుమార్తె బండి సత్యవేణి సహాయం తీసుకుంది. ఆమెకు ఈ పథకం గురించి చెప్పింది. బీరువా తాళాలు బద్దలు కొట్టడానికి ఓ వ్యక్తిని పురమయించాలని చెప్పింది. ఆమె ఉండ్రాజవరం గ్రామానికి చెందిన కప్పకాయల సురేంద్రను తీసుకుని ఆటోలో ఈ నెల పదో తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు లలితాదేవి ఇంటికి చేరుకున్నారు. వారు ముగ్గురు ఇంటి చుట్టుపక్కల రెక్కీ నిర్వహించి, ఎవరైనా వస్తే చెప్పాలని సత్యవేణిని ఆటో వద్ద కాపలా ఉంచారు. తర్వాత నిందితులు శైలజ, సురేంద్ర కలిసి ఇంటికి వేసిన తాళాన్ని ఐరన్ కట్టర్తో కట్ చేసి లోపలికి ప్రవేశించారు. గదిలో ఉన్న బీరువా లాకర్ను కూడా కట్టర్ సహాయంతో కట్ చేసి బీరువాలోని 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు, ఇంటి, ఖాళీ స్థలం డాక్యుమెంట్లు అపహరించుకుపోయారు. దీననిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పట్టణంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా శైలజ, సత్యవేణి, సురేంద్రల నేరం చేసినట్టు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తిలక్ పేర్కొన్నారు. వీరి నుంచి 198 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్ల విలువ రూ.12.55 లక్షలు ఉంటుందన్నారు. అతి తక్కువ సమయంలో ముద్దాయిలను గుర్తించి కేసులు ఛేదించిన ఎస్సై కె.జగన్మోహన్రావు, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అభినందించి వారికి రివార్డులు ప్రకటించారు. -
ఇంటర్ ఫలితాలలో శశి సత్తా
ఉండ్రాజవరం: ఇంటర్ 2025 ఫలితాలలో వేలివెన్ను శశి క్యాంపస్ విద్యార్థులు మరోసారి అత్యుత్తమ ఫలితాలతో సత్తా చాటారని ఆ విద్యాసంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శనివారం తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు కె.సాత్విక్ వర్మ, బి.షన్మిత, డీపీబీ బంగారం 990, ఎస్జేఎం దీపిక, బి.స్నేహ, జిఎస్.వైష్ణవి, కె.నంద కార్తిక్ 989 మార్కులు, ఏజేఎస్ రమాదేవి, ఎస్.హేమలత, పీఎల్ ప్రసన్న, సీహెచ్.పవన్కుమార్, ఎస్.రేఖ 988 మార్కులు సాధించారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు కె.లీలా వినోదిని 990, జి.చెరిష్ సాయి, పి.ధరణి 989, టి.కీర్తి 988 మార్కులు సాధించారు. వీరితో పాటు 990 మార్కుల పైన నలుగురు, 980 మార్కులపైన 179 మంది, 950 మార్కులపైన 811 మంది, 900 మార్కులపైన 1402 మంది సాధించారని ఆయన తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు ఎస్.నాగపూజిత్, వై.రాహుల్, టి.నారాయణ మూర్తి, ఎం.శైలజ, పి.సాయి చరణ్, సీహెచ్.వినీల, కె.కాళీశ్వర, టి.మణికంఠ, ఎం.సాయిలక్ష్మి, బి.సాత్విక్, ఎస్వి.తేజశ్విని, సయ్యద్ అనస్, ఎన్.చాతుర్ వర్మ, యు.ధీరజ్ కుమార్, ఎండి.తహ్లీల్ సామా 466 మార్కులు, బైపీసీలో 440 మార్కులకు ఎల్.దినేష్, జి.భవ్య, ఎస్.స్వర్ణాంజలి, పి.సుష్మ 435 మార్కులతో పాటు 465 మార్కులు పైన 50 మంది, 460 మార్కుల పైన 264 మంది, 430 మార్కులు పైన 1070 మంది, 400 మార్కుల పైన 1567 మంది సాధించారని ఆయన తెలిపారు. ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని విద్యాసంస్థల వైస్ చైర్మన్ బూరుగుపల్లి లక్ష్మి సుప్రియ అభినందించారు. -
నేటి నుంచి తలుపులమ్మ తల్లి పుట్టింటి సంబరాలు
● లోవ గ్రామంలో 26న జాగరణ ● 27న తీర్థం, ఊరేగింపు ● పలు గ్రామాల్లో జాతరలకు భారీ ఏర్పాట్లు తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు ఆదివారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకూ జరగనున్నాయి. ప్రతి సంవత్సరం గంధామావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని లోవ కొత్తూరు గ్రామంలో తలుపులమ్మ తల్లికి పుట్టింటి సంబరాలు, ఆషాఢ మాసంలో లోవ దేవస్థానం ఆవరణలో నెల రోజులు ఆషాఢ మాసోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పుట్టింటి సంబరాల సందర్భంగా 14 రోజుల ఉత్సవాల అనంతరం అమ్మవారి ఊరేగింపు, దర్శనాలు, తీర్థం నిర్వహిస్తారు. గ్రామస్తుల అభీష్టం మేరకు లోవ దేవస్థానం అధికారుల పర్యవేక్షణలో లోవ గ్రామంలో ఉపాలయం వద్ద నాలుగెకరాల విస్తీర్ణంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ సాంస్కృతిక, జానపద, సాంఘిక ప్రదర్శనలు, కోలాటాలు, భజనలు, కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, బాణసంచా పేలుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న స్థానికులు, వారి ఆడపడుచులు, అల్లుళ్లు, బంధుమిత్రులు లోవ కొత్తూరు వచ్చి గంధామావాస్య ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాలకు అవసరమైన ఖర్చును లోవ దేవస్థానం నుంచి భరిస్తామని ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. సంబరాలు జరుగుతాయిలా.. మొదటి రోజయిన ఆదివారం గరగల సంబరాలతో అమ్మవారి పుట్టింటి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. వివిధ గ్రామాల్లో గరగలను ప్రదర్శిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. 26వ తేదీ రాత్రి జాగరణ, 27న అమ్మవారి ఊరేగింపు, దర్శనాలు, తీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 26న 50 మంది నాట్య కళాకారులచే సాంస్కృతిక ప్రదర్శనలు, కేరళ లేడీ డ్రమ్స్ టీమ్, కాంతార లైటింగ్ డ్యాన్స్ టీమ్, గోపాల గోపాల ప్రోగ్రాం, పెద్ద ఆంజనేయ బృందాలతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 27న వివిధ వాహనాలపై బళ్ల వేషాలు, నక్కపల్లి వారి మ్యూజికల్ బ్యాండ్, 60 మంది నాట్య కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లో.. లోవ దేవస్థానం పరిసర ప్రాంతవాసులకు తలుపులమ్మ తల్లి ఇలవేల్పు కావడంతో గంధామావాస్య రోజున వివిధ గ్రామాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. వి.కొత్తూరు, కొత్త వెలంపేట, సీతయ్యపేట, మర్లపాడు, రాజుపేట, జగన్నాథగిరి, గెడ్లబీడు, వెలంపేట కాలనీ, తాళ్లూరు, కుమ్మరిలోవ తదితర గ్రామాల్లో వేర్వేరుగా తలుపులమ్మ తల్లి జాతర భారీగా నిర్వహిస్తారు. దీని కోసం ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యాన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ ప్రదర్శనల్లో వెండి తెర, బుల్లి తెర నటీనటులు పాల్గొని ఆయా గ్రామస్తులను అలరించనున్నారు. -
ఇంటర్ ఫలితాలలో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రధమ, ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470కి 467 మార్కులను యు.విరోనిక, ఎం.హర్షిత, ఎస్.తేజ, జి.రాజనీవన్తేజ, ఎ.వీరవెంకట సాయిలిఖి సాధించారని, 466 పైన 31మంది, 464పైన 369 మంది, 460పైన 1086 మంది, 450 పైన ప్రతి ఇద్దరిలో ఒకరికి అనగా 2133 మంది సాధించారని, అలాగే 99.20 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ విభాగంలో 440కి 436 మార్కులను 11 మంది విద్యార్థులు కె.సుప్రియ, ఎ.శ్రీరామ తేజశ్విని, సీహెచ్ నేహా గ్రేస్, జి.మోహనరూప, జె.భవిత, కె.గాయత్రి, టి.సరయు, బి.యశస్విని, షేక్ షమీన, ఆర్.వీరగంగ నాగేంద్ర, పి.ప్రణవ్ సాయిగణేష్ సాధించారని, 435పైన 32 మంది, 433 పైన 91మంది, 430 పైన 167 మంది, 400 పైగా మార్కులు 463 మంది సాధించారని, అలాగే 99.47 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఏడుగురు విద్యార్థులు ఎం.ప్రియహాసిని, సీహెచ్ హరిసూర్య, పి.పవిత్ర, కె.మానస, ఎం.లేఖన, ఎస్.సాయిలిఖిత, పి.ధాత్రికావ్యశ్రీ సాధించారని, 23 మంది విద్యార్థులకు 990 మార్కులు, 331 మంది విద్యార్థులకు 985 మార్కుల పైన, 791 మంది విద్యార్థులకు 980 మార్కుల పైన, 2151 మంది విద్యార్థులకు 950 మార్కులపైన సాధించారని, 99.98 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు షేక్ ఫాతిమున్నీసా బేగం 991 మార్కులు, పి.నాగవైష్ణవి, సీహెచ్వీడీ రేణుక, ఎన్.వైష్ణవి, బి.హర్షిత, ఎన్.మణి, జి.రితిక 990 మార్కులు సాధించారని, 108 మంది విద్యార్థులు 980 పైన, 204 మంది విద్యార్థులు 970 పైన, 297 మంది విద్యార్థులు 950 మార్కులపైన సాధించారని, అలాగే 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధికమార్కులు వచ్చిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, విద్యాసంస్థల టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. -
చివరి మజిలీ సౌకర్యంగా..
● కొత్తపేటలో కై లాసభూమి కార్యరూపం ● రూ.3 కోట్లతో ఎట్టకేలకు పూర్తి ● నెరవేరిన నంబూరి రెడ్డియ్య కల ● ఘనంగా ప్రారంభం కొత్తపేట: అంతిమ సంస్కారాలకు అధునాతన సౌకర్యాలతో కై లాస భూమి కొత్తపేట పరిసర గ్రామల ప్రజలకు సమకూరింది. స్థానిక బోడిపాలెం వంతెన సమీపంలోని సూర్యగుండాల రేవు ప్రాంతంలో లయన్స్ క్లబ్ కై లాసభూమి ఎట్టకేలకు నిర్మితమైంది. ప్రముఖ వ్యాపారవేత్త, కేబుల్ నెట్వర్క్ అధినేత, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నంభూరి వీరవెంకట సత్య సూర్య రెడ్డియ్య 20 ఏళ్లనాటి ఆలోచనకు 13 ఏళ్లనాడు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో కార్యరూపం దాల్చి ఎట్టకేలకు రూ.3 కోట్ల వ్యయంతో ఎట్టకేలకు నిర్మితమై శనివారం ప్రారంభమైంది. ఘనంగా ప్రారంభోత్సవం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నంభూరి రెడ్డియ్య ఆధ్వర్యంలో ఎంపీ గంటి హరీష్మాధుర్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ కై లాసభూమిని ప్రారంభించారు. వివిధ విభాగాలను లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవీవీ ఈశ్వరకుమార్, మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ, కై లాసభూమి నిర్మాణ పర్యవేక్షకుడు కంఠంశెట్టి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర టీడీపీ నాయకుడు ఆకుల రామకృష్ణ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం తదితరులు ప్రారంభించారు. నాడు కల నేటికి సాకారం 2012వ సంవత్సరంలో స్థానిక లయన్స్ క్లబ్ ఏర్పాటుకు జరిగిన సమావేశంలో నంబూరి రెడ్డియ్య ఈ కై లాసభూమి ఆవశ్యకతను ప్రస్థావించారు. ఆయన ప్రెసిడెంట్గా క్లబ్ ఏర్పాటు కాగా కాలక్రమంలో కై లాసభూమి నిర్మాణంపై దృష్టిపెట్టారు. పవిత్ర సూర్యగుండాలపాయకు చేర్చి రూ.12 లక్షలతో 1.50 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. రెడ్డియ్య వ్యక్తిగతంగా రూ.1.80 కోట్లు వెచ్చించారు. మిగిలిన మొత్తాన్ని దాతల నుంచి సేకరించారు. ఉపాధి నిధులు రూ.40 లక్షలతో కై లాసభూమి వరకు సీసీ రోడ్డు, మిగిలిన పనులకు పలు చోట్ల నిధులు సేకరించారు. ఈ నిధులతో ఒక అంతస్తుతో కూడిన భవనం (మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ విభాగం, అస్తికల లాకర్ల విభాగం, కార్యాలయం, సంతాప సభ కోసం హాలు సముదాయం), నాలుగు బెర్తులతో శవ దహనవాటిక, మృతదేహంతో ప్రదక్షిణ చేసే ఓం నమఃశివాలయ షెడ్డు, మృతుని బంధువుల వెయిటింగ్ భవనం, శివుని విగ్రహం, 24 ట్యాప్లతో జల్లు స్నానం పైపులైన్, పార్కు నిర్మాణం పూర్తిచేశారు. ఇంకా కలప షెడ్డు నిర్మాణం పూర్తికావాల్సివుంది. నాడు పెద్దల అంత్యక్రియల్లో పుట్టిన ఆలోచన 2004 అక్టోబర్ 18న నా తండ్రి నంబూరి వీర్రాజు (సిద్ధాంతి) చనిపోయినప్పుడు ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించాం. అప్పుడే ఈ శ్మశానానికి వచ్చాను. ఏ సౌకర్యాలు లేక చాలా దుర్భరంగా ఉంది. 2005 జూన్లో రాజమహేంద్రవరంలో మా మావయ్య వాకచర్ల బంగారయ్య మృతి చెందగా అక్కడ రోటరీ కై లాసభూమిలో అన్ని సౌకర్యాల నడుమ అంత్యక్రియలు నిర్వహించాం. అటువంటి కై లాసభూమిని కొత్తపేటలో నిర్మించాలని సంకల్పించి ఎట్టకేలకు పూర్తిచేసి ప్రారంభించాం. చాలా సంతప్తిగా, ఆనందంగా ఉంది. – నంభూరి వీవీఎస్ఎస్ రెడ్డియ్య, కై లాసభూమి నిర్మాత, కొత్తపేట -
రాష్ట్రస్థాయి హాకీ విజేత కాకినాడ
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈనెల 6 నుంచి 9 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల జూనియర్స్ హాకీ పోటీలలో కాకినాడ జిల్లా బాలుర జట్టు విజేతగా నిలిచిందని జిల్లా హాకీ సంఘ కార్యదర్శి నంబు శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. జిల్లాల విభజన తరువాత సాధించిన ఈ విజయం జిల్లాకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం కాకినాడ డీఎస్ఏలో జరిగిన కార్యక్రమంలో డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, పీడీలు రవిరాజు, నూకరాజు, సూరిబాబు, సునీల్, పరశురాం, డిఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్రలు విజేతలను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు. -
గుర్రాల జోరు.. కుర్రకారు హుషారు!
పిఠాపురం: రేసు గుర్రాల గిట్టల హోరుతో గొల్లప్రోలు మండలం చేబ్రోలు మారుమోగింది. ఉత్కంఠ మధ్య రెప్ప పాటులో గమ్యాన్ని చేరుకోడానికి గుర్రాలు దౌడు తీస్తుంటే రేగిన దుమ్ములో జనం కేరింతలు కొట్టారు. ఎప్పుడో పదేళ్ల క్రితం జిల్లాలో సామర్లకోటలో జరిగిన గుర్రప్పందేలు తరువాత మళ్లీ ఇప్పుడే జరగడంతో వాటిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. చేబ్రోలులో శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర స్థాయి గుర్రాల పరుగు పోటీ నిర్వహించారు. ఏటా ఈ పందేలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది కొత్తగా గుర్రప్పందేలు నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచి సుమారు 35 గుర్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఈ పందాల్లో చేనుల అగ్రహారం మణికి చెందిన జెస్సీ గుర్రం ప్రధమ స్థానాన్ని కై వసం చేసుకుంది. రామన్నపాలేనికి చెందిన చోడమాంబిక గుర్రం విక్రమ్ రెండోస్థానాన్ని, అంకుపాలేనికి చెందిన మోదమాంబకు చెందిన గుర్రం మురుగన్ మూడోస్థానాన్ని కై వసం చేసుకుంది. ఆర్ఆర్ పేటకు చెందిన దాడి రాముడు గుర్రం భగి, సింగపూర్ సత్యనారాయణకు చెందిన గుర్రం దేవర, కోటనందూరుకు చెందిన శివరాజ్ బ్రదర్స్ గుర్రం రాఖీ, సామర్లకోటకు చెందిన జగదీష్ రాజా గుర్రం, శివరాజ్ బ్రదర్స్ గుర్రం చిన్ని, ఆర్ఆర్పేటకు చెందిన దాడి నూక హనుమంత్ గుర్రం కాళీ, చోడమాంబిక గుర్రం రాకెట్ వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలకు ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు బహుమతులు అందజేశారు. చేబ్రోలులో ఉత్సాహంగా గుర్రప్పందేలు విజేతలకు బహుమతులు అందజేత -
సాక్షిపై అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి
ఫ కక్షసాధింపు బాధాకరం ఫ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి ఫ జర్నలిస్టుల డిమాండ్ ఫ ఏఎస్పీకి వినతి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో అరాచకాలను ప్రశ్నిస్తూ వార్తలు రాసిన సాక్షి పత్రికపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం బాధాకరమని జర్నలిస్టు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు పాత్రికేయ సిబ్బందిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే), మీడియా మిత్రుల ఆధ్వర్యాన జిల్లా ఏఎస్పీ సుబ్బరాజుకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తను హత్య చేసిన టీడీపీ గుండాల అరాచకాన్ని శ్రీసాక్షిశ్రీ పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ హత్య కేసును పక్కదారి పట్టిస్తూ, మీడియాను భయభ్రాంతులకు గురి చేసేలా సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు పల్నాడుకు చెందిన సాక్షి జర్నలిస్టులపై పోలీసులు కేసులు బనాయించారు. దీనిని జర్నలిస్టు నాయకులు తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పింఛనుకు వచ్చిన వ్యక్తిని కొందరు వ్యక్తులు హతమార్చారని, దీనిపై సాక్షి కథనం ప్రచురిస్తే దానిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం బాధాకరమని అన్నారు. హత్య వెనుక కుట్ర కోణంపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులకు కఠిన శిక్ష వేయాలన్నారు. అంతే తప్ప, అక్రమ కేసులు బనాయిస్తూ పత్రికా స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను కాలరాయడం తగదని అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని ఏఎస్పీ సుబ్బరాజు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు మండెల శ్రీరామమూర్తి, ఎన్టీవీ శ్రీనివాస్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ షేక్ ఫయాజ్ బాషా, సాక్షి టీవీ విలేకరి హరీష్, ఆంధ్రప్రభ గోపి, శేఖర్రెడ్డి, విశ్వనాథం, సత్యంబాబు, దానవాయిబాబు. గంగాధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పసుపు ఎగుమతులతో రూ.1,876 కోట్ల ఆదాయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): దేశంలో ఉత్పత్తి అయ్యే పసుపునకు అంతర్జాతీయ విపణిలో భారీ డిమాండ్ ఉందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి తెలిపారు. పసుపు ఎగుమతుల ద్వారా మన దేశానికి ప్రస్తుతం రూ.1,876 కోట్ల ఆదాయం వస్తోందని, వచ్చే ఐదేళ్లలో దీనిని రూ.6 వేల కోట్లకు పైగా పెంచేందుకు బోర్డు కృషి చేస్తోందని చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి – జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్–నిర్కా) శుక్రవారం ఇక్కడ నిర్వహించిన పసుపు పంట భాగస్వాముల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధిక కురుకుమిన్ శాతం కలిగిన పసుపు రకాలను సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. మన దేశంలో గోవా మినహా 27 రాష్ట్రాల్లోనూ రైతులు పసుపు సాగు చేస్తున్నారన్నారు. మేఘాలయలో సాగు చేసే లకడాంగ్ అనే పసుపు రకంలో కురుకుమిన్ 9 నుంచి 9.5 శాతం ఉంటుందని, కొంకణ్ ప్రాంతంలో సాగు చేసే రాజాపురి రకంలో 5 నుంచి 6 శాతం ఉంటుందని వివరించారు. మన రాష్ట్రంలోని పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పసుపు సాగుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు. సేంద్రీయ సాగుపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఐసీఏఆర్–నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సాగు చేసే పసుపు రకాలకు భౌగోళిక గుర్తింపు తీసుకు రావడానికి కృషి చేస్తామని చెప్పారు. మన దేశం నుంచి ప్రస్తుతం 1.6 లక్షల టన్నుల పసుపు ఎగుమతి అవుతోందని, ఇది వచ్చే ఐదేళ్లలో 2.7 లక్షల టన్నులకు చేరేలా నిర్కా కృషి చేస్తుందని అన్నారు. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్, వైస్ చాన్సలర్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన దేశంలోని నేలల్లో కర్బన్ శాతం గణనీయంగా తగ్గుతోందని, సేంద్రియ కర్బన్ శాతాన్ని పెంచడానికి మిశ్రమ పంటల సాగు చేపట్టాలని సూచించారు. రైతులకు జాతీయ పసుపు బోర్డు తగు ప్రణాళికలు అందించాలని కోరారు. జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడు కె.సాయిరెడ్డి మాట్లాడుతూ, సాగు ఖర్చుల ఆధారంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు నిర్ణయిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వెంకటేశ్వరరావు, విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ టి.రమేష్బాబు, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ రాధికారాణి, ఐటీసీ శాస్త్రవేత్త బీఆర్ రెడ్డి కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా పసుపు పంట విశ్వవిపణిలో భారతదేశ ఆధిపత్యానికి సంబంధించిన వ్యూహాత్మక పత్రాన్ని విడుదల చేశారు. నిర్కా ఏర్పాటు చేసిన స్టాల్లో పసుపు ఉత్పత్తులు, విలువ ఆధారిత పదార్థాల గురించి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుమన్ కల్యాణి సందర్శకులకు వివరించారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఉన్నం సింహాద్రి, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఐదేళ్లలో రూ.6 వేల కోట్లకు పెంచేందుకు కృషి ఫ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి -
స్తంభాన్ని ఢీకొట్టిన కారు
మామిడికుదురు: మొగలికుదురు గ్రామ పంచాయతీ సమీపంలోని కడలి రోడ్డులో శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ నుంచి వెళ్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న పంట కాలువ పావంచాను ఢీ కొట్టి దాని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దానికి ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ దూరంగా పడింది. ఈ సమయంలో సమీపంలో ఎవరూ లేక పోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
లారీ ఢీకొని వృద్ధుడి మృతి
మామిడికుదురు: నగరం గ్రామంలో ఓఎన్జీసీ రిఫైనరీ గేటు ఎదురుగా 216వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ సైకిల్ను ఢీకొట్టిన ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన కోన వెంట్రావు (70) రిఫైనరీ గేటు ఎదురుగా ఉన్న హోటల్లో టిఫిన్కి వెళ్లాడు. అక్కడ టిఫిన్ లేక పోవడంతో పక్కనే ఉన్న మరో హోటల్కి వెళ్లి సైకిల్ నడిపించుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అప్పటికే కదలిన ఓఎన్జీసీ మెయింటెనెన్స్కు సంబంధించిన లారీ ప్రమాదవశాత్తూ వృద్ధుడిపై నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో లారీ వెనుక చక్రం వృద్ధుడి పొట్ట కింది భాగం నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న 108 వాహనం వచ్చి అందులోని సిబ్బంది సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మోటారు సైకిల్ ఢీకొని..ముమ్మిడివరం: నడిచి వెళుతున్న వ్యక్తి మోటారు సైకిలిస్టు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొమానపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తకాలువకు చెందిన శీలం నాగేశ్వరరావు (54) గురువారం సాయంత్రం కూలిపనికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా యానాం నుంచి వస్తున్న మోటారు సైకిలిస్టు అతనిని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్య సేవలు అందించిన తరువాత ఇంటికి తీసుకు వచ్చి శుక్రవారం ముమ్మిడివరం ప్రవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నాగేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని.. తుని: అన్నవరం–రావికంపాడు మధ్యలో రైలు ఢీకొని (45) ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్టు తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. మృతుడు నలుపు, తెలుపు, ఆరెంజ్ రంగు అడ్డచారల టీషర్ట్, సిమెంట్ రంగు ఫ్యాంట్ ధరించాడని, కుడిచేయి దండపై పెద్దసైజు టాటూ ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. అప్పుల బాధతో వివాహిత ఆత్మహత్య అల్లవరం: మండలం తాడికోన గ్రామానికి చెందిన గెడ్డం నాగమణి పురుగుమందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు ఎస్సై తిరుమలరావు తెలిపారు. అంగన్వాడీ టీచర్ అయిన ఆమె ఇటీవల ఇల్లు నిర్మించి అప్పుల పాలై గత నెల 23న హార్పిక్లో గడ్డిమందు కలిపి తాగింది. సుమారు 20 రోజుల పాటు అమలాపురంలోకి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో నిందితుడికి యావజ్జీవం చాగల్లు: మండలంలోని ఊనగట్ల గ్రామంలో మతి స్థిమితం లేని 16 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారం చేసిన ఘటనలో రాజమహేంద్రవరం నామవరానికి చెందిన నందా శ్రీను అనే వ్యక్తికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమా సునంద తీర్పు ఇచ్చినట్టు ఎస్సై కె.నరేంద్ర శుక్రవారం తెలిపారు. 2017 జూలై 19న బాలికపై అత్యాచారం చేయడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో నందా శ్రీనుపై అప్పటి ఎస్సై జయబాబు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి యావజ్జీవ కారాగారశిక్ష విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
భద్రతా లక్ష్యాల సాధనలో..
యుద్ధ నౌకపై హెలికాప్టర్ విన్యాసాలునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): భారత్, అమెరికా దేశాలు సంయుక్తంగా కాకినాడ బీచ్లో నిర్వహిస్తున్న ఎక్సర్సైజ్ టైగర్ ట్రయంఫ్ శుక్రవారం ఘనంగా ముగిసింది. హెదరాబాద్ యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ మానవత సహాయ, విపత్తు ప్రతిస్పందన, కాల్పనిక ప్రకృతి వైపరీత్యం తరువాత ఫీల్డ్ ఆసుపత్రి ఏర్పాటు, సరఫరా, పంపిణీ ప్రదేశాలను ఏర్పాటు చేయడం వంటి బాధ్యతలను సంయుక్త బలగాలు చేపట్టాయని తైలిపారు. భారత్తో కలిసి రెండో సారి ఈ విన్యాసాలు చేయడం గర్వంగా ఉందన్నారు. టైగర్ ట్రయంఫ్ వంటి వ్యాయామాల ద్వారా యూఎస్, భారత్ పరస్పర భద్రతా లక్ష్యాలు సాధించడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వారం రోజుల పాటు జరిగిన వ్యాయామం, ఉభయచర ల్యాండింగ్ తదితర అంశాలు ముగిసాయని తెలిపారు. విశాఖలో వారంరోజుల పాటు ఆపరేషన్ ప్రణాళిక, యూనిట్–స్థాయి శిక్షణ, సబ్జెక్ట్ నిపుణుల మార్పిడి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నారు. యూఎస్ నేవీకి సంబంధించిన విడ్బే ఐలాండ్, క్లాస్ డాక్ ల్యాండింగ్ అధికారికంగా జరగాల్సిందన్నారు. ఏప్రియల్ 1న జలాశ్వలో ప్రారంభమైన ఈ వేడుకలో 3 వేల మంది సిబ్బంది, నాలుగు నౌకలు, ఏడు విమానాలు పాల్గొన్నాయని తెలిపారు. ముగిసిన టైగర్ ట్రయంఫ్–2025 విన్యాసాలు చేయడం గర్వంగా ఉందన్న యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ -
నేడు ఇంటర్ ఫలితాలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. గత నెల 1 నుంచి 19వ తేదీ వరకూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 127 జూనియర్ కళాశాలలుండగా 51 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల స్పాట్ వేల్యుయేషన్ గత నెల 17 నుంచి ఈ నెల 4వ తేదీ వరకూ నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను మన మిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009కు హాయ్ అని మెసెజ్ పంపడం ద్వారా చూసుకోవచ్చు. అలాగే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం 22,817 మంది, రెండో సంవత్సరం 20,937 మంది కలిపి మొత్తం 43,754 మంది వి ద్యార్థులు పరీక్షలు రాశారు. నూరు శాతం ఫలి తాలు లక్ష్యంగా ఇంటర్ బోర్డు అధికారులు కార్యాచరణ రూపొందించి, అమలు చేశారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పరీక్షల్లో ఉత్తీర్ణత, మంచి మార్కు లు ఎలా సాధించాలనే దానిపై అవగాహన కల్పించారు. నమూనా పరీక్షలు నిర్వహించారు. బీఈడీ రికార్డుల మూల్యాంకనం పరిశీలన రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్లోని కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో జరుగుతున్న బీఈడీ రికార్డుల మూల్యాంకనాన్ని ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ శుక్రవారం పరిశీలించి, సిబ్బందికి సూచనలిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల విద్యార్థులకు చెందిన 2,500 రికార్డుల మూల్యాంకన ప్రక్రియను ఇక్కడి సెమినార్ హాలులో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ప్రిన్సిపాల్ కె.సుబ్బారావు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
స్ఫూర్తిప్రదాత ఫూలే
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సమాజంలో చైతన్యం తీసుకుని రావడం ద్వారా మహాత్మా జ్యోతిరావు ఫూలే స్ఫూర్తిప్రదాతగా నిలిచారని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, దేశంలో మహాత్మా అని గాంధీజీని, ఫూలేను మాత్రమే పిలుచుకుంటామని అన్నారు. వారికి సమాజం ఇచ్చిన గౌరవానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందని అణగారిన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు ఫూలే అని అన్నారు. వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందడానికి చదువు ఎంతో అవసరమని చాటిచెప్పారన్నారు. సీ్త్ర విద్యను ప్రోత్సహిస్తే కుటుంబం, తద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని నమ్మి ఆచరణలో చూపించిన వ్యక్తి జ్యోతిరావ్ ఫూలే అని కలెక్టర్ ప్రశాంతి చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు. ఫూలే జయంతి సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిమ ప్రతిభ చూపిన 110 మంది విద్యార్థినీ విద్యార్థులకు ఫూలే సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యాన రూ.1.10 లక్షలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 144 మంది బీసీ, కాపు, ఈబీసీ వర్గాల లబ్ధిదారులకు రూ.352 లక్షల చొప్పున స్వయం ఉపాధి పథకాల అమలుకు ఆర్థిక సహాయం అందించామని కలెక్టర్ తెలిపారు. చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్ రాజమహేంద్రవరం రూరల్: ఐ–టీడీపీతో ముఖ్యమంత్రి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మీడియా ముందు చేబ్రోలు కిరణ్తో మాట్లాడించడం, తప్పు అని చెప్పడం, క్షమాపణ కోరడం, అరెస్టు చేయడం అన్నీ చంద్రబాబు, ఐ–టీడీపీ స్క్రిప్ట్లో భాగమేనని పేర్కొన్నారు. టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్లు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని అన్నారు. మహాశక్తి లాంటి వైఎస్ జగన్ను అడ్డుకునేందుకు అబద్ధాలు ప్రచారం చేయడంతో పాటు, ఆయన కుటుంబంపై దారుణ వ్యాఖ్యలు చేయడం ద్వారా వారిని మనోవేదనకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడులో వైఎస్ జగన్కు సరైన భద్రత కల్పించలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రజలు అన్ని విషయాలూ గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. ఇప్పటికై నా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మాని, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని వేణు హితవు పలికారు. షార్ట్టర్మ్ ఇంటర్న్షిప్నకు దరఖాస్తుల ఆహ్వానం రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన సమ్మర్ ఆన్లైన్ షార్ట్టర్మ్ ఇంటర్న్షిప్ కార్యక్రమం–2025 ప్రారంభిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వీజీడీ మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు, నాలుగో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామన్నారు. సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, సివిల్ శాఖల విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెండు నెలల పాటు కొనసాగే ఈ ఇంటర్న్షిప్లో 80 గంటల థియరీ, 40 గంటల ప్రాక్టికల్ తరగతులు నిర్వహిస్తారని వివరించారు. ప్రధాన కోర్సుల్లో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్ పైథాన్, డిజంగో వెబ్ డెవలప్మెంట్, ఎంబెడెడ్ సిస్టమ్స్, యూనిటీ 3డీ గేమింగ్ డిజైన్, కాటియా ఎక్స్పర్ట్ డిజైన్ రెవిట్ ఆర్కిటెక్చర్ మోడలింగ్ తదితర కోర్సులలో నైపుణ్యం పెంచేందుకు ఆన్లైన్లో ఈ శిక్షణ ఇస్తారని మురళి తెలిపారు. రోజువారీ క్విజ్లు, వారానికోసారి అసెస్మెంట్లు, ప్రాజెక్ట్ సమీక్ష కూడా ఉంటాయని పేర్కొన్నారు. శిక్షన విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీఎస్ఎస్డీసీ నుంచి సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.1,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని తెలిపారు. తొలి విడత ఇంటర్న్షిప్ ఈ నెల 28న, రెండో విడత మే 12న ప్రారంభిస్తారని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు https://naipunyam.ap.gov.in/user®istration?page=online&short&term& internship వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 99888 53335, 87126 55686, 87901 18349, 87901 17279 మొబైల్ నంబర్లలో ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకూ సంప్రదించవచ్చని మురళి తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 19,000 గటగట (వెయ్యి) 17,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,000 గటగట (వెయ్యి) 16,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
సీతానగరం: మండలంలోని వంగలపూడిలో ఉపాధి కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. వంగలపూడిలో కాలువ పూడిక తీతకు శుక్రవారం 130 మంది కూలీలు వెళ్లారు. వారిలో ఐదుగురు కూలీలు కాలువపై ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఇంతలో తేనె తుట్టైపె ఉన్న ఈగలు ఒక్కసారిగా వచ్చి వారిలో ముగ్గురిపై దాడి చేశాయి. సమాచారం అందుకున్న ఏపీఓ బీవి సత్యవతి సంఘటన స్థలానికి వెళ్లి తేనెటీగల దాడికి గురైన కోడెల్లి గంగరాజు, ఆరుగుల వెంకటేశ్వర్లు, ఓరిగంటి పాపలను సీతానగరం పీహెచ్సీకి తరలించి వైద్యసేవలు అందించారు. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. -
అనధికార లే అవుట్లపై చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: అనధికార లే అవుట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) వైస్ చైర్మన్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. అనధికార లే అవుట్లపై తీసుకుంటున్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలపై రుడా పరిధిలోని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో శుక్రవారం ఆయన తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనధికార లే అవుట్ల వలన ప్రజలకు, డెవలప్మెంట్ చార్జీల రూపంలో పంచాయతీలు కోల్పోతున్న ఆదాయం, తద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కలిగే అడ్డంకులు వంటి వాటిపై అవగాహన కల్పించారు. ప్రతి పంచాయతీ పరిధిలో వారం రో జుల్లోగా ప్రతి అనధికార లే అ వుట్ను గుర్తించాలని ఆదేశించా రు. ఆ వివరాలను పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డు, ముఖ్య ప్రదేశాల్లో ప్రదర్శించాల ని సూచించారు. ఈ కార్యక్రమం అమలుపై ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తామని, నిర్లక్ష్యం వహించే పంచాయతీ కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని కేతన్ గార్గ్ హెచ్చరించారు. -
స్వామీ.. భద్రతేదీ..!
ఫ అన్నవరం దేవస్థానంలో భద్రతకు ఏటా రూ.4.50 కోట్లు ఫ కానరాని లగేజీ స్కానర్లు, మెటల్, హ్యాండ్ డిటెక్టర్లు ఫ 2020లోనే ఇంటెలిజెన్స్ నివేదిక ఫ నాలుగేళ్లయినా అమలుకు నోచుకోని వైనం అన్నవరం: కొద్ది రోజుల కిందట ఓ సత్రంలో మద్యం సీసాల కలకలం.. తాజాగా మద్యం తాగి ఆలయానికి వెళ్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులు.. కారులో మద్యం సీసాలు.. ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు అన్నవరం దేవస్థానంలో భద్రతా ఏర్పాట్లను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇటీవల తనిఖీలు పెరిగినా అవి మద్యం తాగిన వారిని పట్టుకోవడానికి, మద్యం సీసాలతో రత్నగిరికి వెళ్తున్న వారిని నిరోధించడానికి మాత్రమే పరిమితమవుతున్నాయి. భక్తుల లగేజీని స్కానర్లతోను, భక్తులను మెటల్ డిటెక్టర్లతోను తనిఖీ చేయడం వంటివి దేవస్థానంలో జరగడం లేదు. దేవస్థానంలో భద్రతా చర్యలకు ఏటా రూ. 4.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని 14 మంది స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) సిబ్బందికి జీతాలు, సుమారు 40 మంది హోం గార్డులు, 60 మంది సెక్యూరిటీ గార్డులకు జీతాల రూపంలో ఖర్చు చేస్తున్నారు. వీరిలో ఆయుధాలు కలిగి ఉండే ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయం చుట్టూ మాత్రమే ఉంటారు. వారు 24 గంటలూ అక్కడే ఉంటారు. మిగిలిన భద్రతా విషయాలు వారి పరిధిలో లేవు. ట్రాఫిక్ క్లియర్ చేయడం, స్వామివారి ఆలయం దిగువన క్యూ లైన్ల వద్ద, రోడ్డు జంక్షన్లు, ఉత్సవాల సమయంలో భద్రతా విధుల్లో హోం గార్డులు పాల్గొంటున్నారు. సెక్యూరిటీ గార్డులు కూడా దాదాపు ఇవే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక్క అంచె తనిఖీ కూడా లేదు తిరుమల – తిరుపతి దేవస్థానంలో మూడంచెల్లో తనిఖీలు చేస్తూంటారు. కొండ దిగువన అలిపిరి వద్ద భక్తుల లగేజీని యంత్రాలతో స్కాన్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఆ తరువాత స్వామివారి దర్శనానికి కంపార్ట్మెంట్ లోపలకు వెళ్లే ముందు మరోసారి తనిఖీ చేస్తారు. అనంతరం ఆలయానికి సమీపానికి చేరుకున్నాక క్యూ లైన్లో మరోసారి తనిఖీ జరుగుతుంది. కానీ, అన్నవరం దేవస్థానంలో పకడ్బందీగా ఒక్క అంచెలో కూడా తనిఖీ జరగడం లేదు. లగేజీ తనిఖీ నామమాత్రమే సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తుల లగేజీని టోల్గేట్ వద్ద సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంగా మద్యం సీసాలు, మాంసాహారం, లేదా మద్యం తాగి పట్టుబడితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ తనిఖీలు కూడా సాధారణ రోజుల్లోనే జరుగుతున్నాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో వాహనాల తనిఖీ సాధ్యమే కావడం లేదు. ఒక వాహనం తనిఖీ చేయడానికి 10 నిమిషాలు పడితే, ఆ సమయంలో వెనుక చాలా వాహనాలు నిలిచిపోతాయి. దీంతో తూతూమంత్రంగా తనిఖీలు చేసి పంపించేస్తున్నారు. కార్తికం, వైశాఖం, శ్రావణ మాసాలతో పాటు వివాహాల సీజన్, ఉత్సవాల సమయంలో భక్తులు వేలాది కార్లలో రత్నగిరికి తరలి వస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యంత్రాల సాయం లేకుండా ఆ కార్లను తనిఖీ చేయడం సాధ్యం కాని పని. ఇంటిలిజెన్స్ అధికారుల సూచనలివీ.. భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు 202లో అన్నవరం దేవస్థానంలో పర్యటించారు. ఆ సందర్భంగా పలు సూచనలతో నివేదిక అందజేశారు. వారి సూచనలివీ.. ఫ రత్నగిరి టోల్గేట్ వద్ద కచ్చితంగా రెండు లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాలి. భక్తుల లగేజీ స్కాన్ చేశాక మాత్రమే ఆ వాహనాలను అనుమతించాలి. ఫ దేవస్థానం బస్సులలో వచ్చే వారి లగేజీ కూడా తనిఖీ చేయాలి. ఫ రత్నగిరి మెట్ల దారి వద్ద కూడా లగేజీ స్కానర్ ఏర్పాటు చేసి, ఆ ప్రక్రియ పూర్తి చేశాక మాత్రమే భక్తులను కొండ పైకి అనుమతించాలి. ఫ స్వామివారి ఆలయ ప్రాంగణం లోపలకు వెళ్లేచోట, ఆలయం వద్ద, వెలుపలకు వచ్చేచోట మెటల్ డిటెక్టర్ డోర్లు ఏర్పాటు చేయాలి. ఫ ప్రతి భక్తుడిని హ్యాండ్ డిటెక్టర్లతో తనిఖీ చేశాకే లోపలకు అనుమతించాలి. ఫ స్వామివారి ఆలయానికి రాకపోకలు సాగించేందుకు ఎంట్రన్స్, ఎగ్జిట్ రెండు దారులు మాత్రమే ఉండాలి. ఎక్కువ ఉండకూడదు. ఫ దేవస్థానంలో అన్ని ప్రాంతాలూ కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సీసీ టీవీ ఫుటేజ్లు పరిశీలించడానికి సిబ్బందిని 24 గంటలూ అందుబాటులో ఉంచాలి. సీసీ టీవీ ఫుటేజ్లను స్థానిక పోలీసులు కూడా పరిశీలించాలి. అరకొరగానే సూచనల అమలు ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల్లో 10 శాతం కూడా దేవస్థానంలో ప్రస్తుతం అమలవడం లేదు. ఎక్కడా లగేజీ స్కానర్లు లేవు. మెటల్ డిటెక్టర్ డోర్లు లేవు. ఒకటి రెండుచోట్ల ఉన్నా పని చేయడం లేదు. భక్తులను తనిఖీ చేసేందుకు హ్యాండ్ డిటెక్టర్లు కూడా లేవు. స్వామివారి ఆలయానికి రెండుకన్నా ఎక్కువ మార్గాలే ఉన్నాయి. చాలాచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కానీ, సత్యగిరిపై మాత్రం ఇంకా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతమంది టోల్గేట్ వద్ద సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి మద్యం సీసాలు తెచ్చుకుని అక్కడ తాగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీసీ ఫుటేజ్ను భద్రతా సిబ్బంది కాకాకుండా సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగులే పరిశీలిస్తున్నారు. అటకెక్కిన లగేజీ స్కానర్ల ప్రతిపాదనటోల్గేట్ వద్ద లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాలని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు అలిపిరి వెళ్లి, అక్కడ ఏవిధంగా తనిఖీ చేస్తున్నారో పరిశీలించి, నివేదిక ఇవ్వాలని దేవస్థానం ఈఈని ఆదేశించారు. ఆ నివేదిక వచ్చాక టోల్గేట్ వద్ద పెద్ద షెడ్డు నిర్మించి, భక్తుల లగేజీ స్కాన్ చేయడానికి రెండు స్కానర్లు కొనుగోలు చేయాలని ఆయన నిర్ణయించారు. లగేజీ స్కాన్ చేసేటప్పుడు వాహనాలు నిలిచిపోతే ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతుందని భావించి, కళాశాల మైదానంలో నుంచి ఘాట్ రోడ్డు వరకూ మరో రోడ్డు నిర్మించారు. భక్తుల వాహనాలు కళాశాల మైదానంలోకి చేరుకుని, అక్కడి నుంచి స్కానింగ్ అయ్యాక ఘాట్ రోడ్డులోకి ప్రవేశించి రత్నగిరికి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే, ఆటోలు, బైక్ల మీద వెళ్లేవారిని కూడా టోల్గేట్ వద్ద తనిఖీ చేయాలని నిర్ణయించారు. ఆయన బదిలీ అనంతరం టోల్గేట్ వద్ద షెడ్డు నిర్మించారు తప్ప లగేజీ స్కానర్లు, ఇతర చర్యలు తీసుకోలేదు. దీంతో, రద్దీ సమయంలో తనిఖీలు తూతూమంత్రంగానే జరుగుతున్నాయి. గతంలో ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా దేవస్థానంలో ఇప్పటికై నా అధికారులు, పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది. -
క్షేత్రం నుంచి క్షాత్రానికి!
పిఠాపురం: వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించే ఎడ్లు నేడు పరుగు పందేలలో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పూర్వం నుంచి ఎడ్ల పందాలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాలకు పండుగలకు మాత్రమే పోటీలు పరిమితమయ్యేవి. ఆ సరదా పోటీలు నేడు మామూలు సందర్భాలలోనూ కొనసాగుతున్నాయి. గెలుపే లక్ష్యంగా రూ.లక్షలు వెచ్చించి మరీ పోటీలకు ఎడ్లను పెంచడంలో పలువురు రైతుల ఆసక్తి చూపుతున్నారు. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినా దాని ద్వారా వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదని వారంటున్నారు. వ్యవసాయ రంగంలో యంత్ర విప్లవం రావడంతో ఎడ్ల పాత్ర గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వాటిని మరో విధంగా వినియోగిస్తున్నప్పటికీ కొందరు రైతులు ఎడ్ల బండ్ల పోటీల కోసం ప్రత్యేకంగా పెంచుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒక చోట ఎడ్ల పరుగు పందాలు జరుగుతుండగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పందేల కోసం రైతులు తమ ఎడ్లను తీసుకుస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు నిర్వహించనున్నారు. జిల్లాలో లైను పందాలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందాలు ఆడుతుంటారు. వీటికి సెపరేటు పరుగు పందాలలో పాల్గొనే ఎడ్లకు గిత్తల ప్రాయం నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. కేవలం ఒక సంవత్సరం వయసు నుంచే చిన్న సైజు బండ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. సాధారణ ఎడ్లలా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తు సమయానుకూలంగా దూరాలను లక్ష్యంగా పెట్టి పరుగు పెట్టిస్తుంటారు. సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందేలకు వినియోగిస్తారు. పరుగు పందేలలో పాల్గొనే ఎడ్ల ఖరీదు రూ.లక్షలు పలుకుతోంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతుంది. ఒక రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చై నా రైతులు వెనుకాడడం లేదు. ఇతర జిల్లాలకు వెళ్లి మరీ రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మేతలోనే సత్తా పందాలలో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేకమైన మేతతో మేపుతుంటారు. కేవలం ప్రత్యేకమైన దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు, నిత్యం ఉడకబెట్టి నానబెట్టిన ఎండుగడ్డి ముక్కలలో వేసి దాణాగా మేపుతారు. వీటి మేతకు సంవత్సరానికి సుమారు రూ.3 లక్షల వరకు వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందేలు ఉన్నా లేకపోయినా వీటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పదని, మేతలో ఎప్పుడు మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉందంటున్నారు. బండి సదుపాయాలు ప్రత్యేకమైనవి సాధారణంగా బరువులు లాగే ఎడ్ల బళ్లు చాలా బరువుగా పటిష్టంగా పెద్దపెద్ద చక్రాలతో ఉంటాయి. ప్రస్తుతం ఆ చెక్క చక్రాల స్థానంలో టైర్లు వచ్చాయి. గతంలో కేవలం ప్రత్యేకమైన చెక్కతో చేసిన చక్రాలు గల బళ్లు ఉండేవి. కాని పరుగు పందాలలో ఉపయోగించే బళ్లు మాత్రం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. బరువు తక్కుగా ఉండేలా పటిష్టంగా చిన్న సైజులో అందంగా తయారు చేయిస్తారు. వాటికి వివిధ రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రూటు మార్చిన బసవడు ఏటా పెరుగుతున్న ఎడ్ల పందాలు రూ.లక్షలు పలుకుతున్న పందెపుటెడ్లు ప్రత్యేక పోషణ, సాధన, రక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్న రైతులు గెలుపు కిక్కే వేరంటున్న యజమానులు నేడు చేబ్రోలులో పోటీలకు సమాయత్తం ఎడ్లకు ఎయిర్ కూలర్లు కంటిలో లోపం రాకుండా దుమ్ము ధూళి పడినా కంటి చూపు దెబ్బతినకుండా లక్ష్యం వైపు దూసుకుపోయే విధంగా పందెం ఎడ్ల కళ్లకు కాటుక పెడుతుంటారు. పరిగెట్టి అలిసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్ వంటి మందులతో మసాజ్ చేస్తుంటారు. రాత్రి సమయాల్లో ఈగలు, దోమలు కుట్టకుండా దోమ తెరలతో పాటు ప్రత్యేకంగా ఎయిర్ కూలర్లు వాడుతున్నారు. పది నిమిషాల పరుగుకు పది నెలల సాధన పందెంలో ఎడ్లు పది నిముషాలు పరుగు పెట్టాలంటే పది నెలల ముందు నుంచి ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక సంరక్షణ ఉంటుంది. ఎంతో శ్రమకోర్చి వాటిని పెంచి పోషిస్తుంటాం. ఎడ్ల పందేలు మన సంప్రదాయం. ఎన్నో ఏళ్లుగా మా తాతల నాటి నుంచి కొనసాగిస్తున్నాం. పందేల్లో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి రోజు పరుగులో శిక్షణ ఇస్తుంటాం. మేతకు ఎక్కువ ప్రాధాన్యనిస్తాం. బలవర్ధకమైన ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. – రవీంద్రనాథ్ చౌదరి, రైతు, మండపేట ఆనందం కోసమే అంత కష్టం మా కుటుంబంలో పూర్వం నుంచి ఎడ్లను పోషిస్తున్నాం. ముఖ్యంగా పరుగు పందేలంటే మాకు చాలా ఇష్టం. ఏటా వీటి పోషణకు రూ.లక్షలు ఖర్చు అవుతున్నా పోటీలలో గెలుపు సాధించినప్పుడు వచ్చే ఆనందం వెల కట్టలేనిది. అందుకే ఎంత ఖర్చయినా లెక్క చేయం. వీటిని కంటికి రెప్పలా చూసుకుంటాం. వాటికి అనేక సౌకర్యాలు కల్పించి కాపాడుకుంటాం. – కుర్రా పురుషోత్తం, రైతు, బాపట్ల -
చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే
రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భాలు చంద్రబాబు చరిత్రలో ఏనాడూ లేవని విమర్శించారు. మహిళలకు ఉచిత సిలిండర్లు ఇవ్వక ముందే గ్యాస్ ధరలు పెంచేశారన్నారు. పెరిగిన గ్యాస్ ధరను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను చంద్రబాబు గాలికి వదిలేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐ–టీడీఈపీ నాయకులు అనైతిక వ్యాఖ్యలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. గతంలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు చంద్రబాబు ఏడ్చారని.. ఇప్పుడేం మాట్లాడతారో చెప్పాలని వేణు డిమాండ్ చేశారు. -
13న గురుకుల ప్రవేశ పరీక్ష
రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరగోరే విద్యార్థులకు ఈ నెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రిన్సిపాల్ ఎ.వాణీకుమారి గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఆ రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఐదో తరగతికి, మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకూ ఇంటర్ ఫస్టియర్కు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. విద్యార్థులు ఒక గంట ముందు హాజరు కావాలని సూచించారు. పన్ను వసూలులో రాష్ట్రంలో రెండో స్థానం రాజమహేంద్రవరం సిటీ: పన్నుల వసూలులో నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కమిషనర్ కేతన్ గార్గ్ నగదు బహుమతితో పాటు షీల్డ్ అందుకున్నారు. విజయవాడలో గురువారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్కు రాష్ట్ర మున్సిల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బహుమతి ప్రదానం చేశారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా లక్ష్మిసాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మార్తి లక్ష్మి నియమితులయ్యారు. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. తనపై నమ్మకం ఉంచి జిల్లా మహిళా అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్కు, సహకరించిన మాజీ ఎంపీ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్కు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. వాడపల్లి క్షేత్రంలో ఘనంగా సదస్యం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్, వేద పండితులు ఖండవల్లి రాజేశ్వరవరప్రసాద్ ఆచార్యులు ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి చతుర్వేద పండితులతో ద్రవిడ వేద పారాయణం(మహాదాశీర్వచనం) అందజేశారు. స్వామివారికి డీసీ, ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఆభరణాలతో అలంకరించి, గ్రామోత్సవం నిర్వహించారు. శుక్రవారం గౌతమి గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీసీ, ఈఓ చక్రధరరావు తెలిపారు. శత్రువుకు దడ పుట్టేలా.. కాకినాడ రూరల్: శత్రువుకు దడ పుట్టేలా ఇండో – అమెరికన్ టైగర్ ట్రయంఫ్–25 విన్యాసాలు కాకినాడ తీరంలో జరుగుతున్నాయి. ఇరు దేశాలకు చెందిన వైమానిక దళాలు గురువారం సంయుక్త విన్యాసాలతో అదరగొట్టాయి. సాధారణ ప్రజలకు అనుమతి లేనప్పటికీ ఈ విన్యాసాలు చూసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. గురువారం ఉదయం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు కాకినాడ తీర ప్రాంతంతో పాటు సూర్యారావుపేట, వలసపాకల, వాకలపూడి గ్రామాల్లో చక్కర్లు కొట్టాయి. ఆకాశం నుంచి పెద్ద శబ్దం రావడంతో ఇళ్లలోని వారు బయటకు వచ్చి, వాటిని ఆసక్తిగా తిలకించారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 157హెచ్యూకు చెందిన ఎంఐ–17వీ5 ద్వారా 16 మంది యూఎస్ స్పెషల్ ఫోర్సెస్, గరుడ, పారా కమాండోలను యాంఫిబియస్ విన్యాసాలు జరిగే కాకినాడ బీచ్లోని నావెల్ ఎన్క్లేవ్ వద్ద బీచ్ ల్యాండింగ్ జోన్(ఎల్జెడ్)కు చేర్చారు. బీచ్లోకి సందర్శకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. -
చెంతనే గోదారి.. చేలు తడారి..
● నాట్ల దశ నుంచీ రైతుకు ఇక్కట్లే.. ● కోతకు వచ్చినా కష్టాలే.. ● సాగుకు మురుగు నీరే దిక్కు ● బోర్ల ద్వారా అందిస్తున్న అన్నదాతలుపెరవలి: చెంతనే జీవనది గోదావరి ఉన్నా పైరుకు నీటి తడి అందక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. రబీ వరి సాగు చివరి దశకు వచ్చింది. పాలు పోసుకున్న గింజలు తగినంత నీటి తడి అందితేనే గట్టిపడతాయి. లేదంటే తాలుతప్పలుగా మిగిలిపోతాయి. మరోవైపు పంట ఎండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఫలితంగా రైతులు ఇన్ని నెలలుగా పడిన కష్టం, పెట్టిన పెట్టుబడి అక్కరకు రాకుండా పోతాయి. గోదావరి డెల్టా ముఖద్వారమైన పెరవలితో పాటు ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లో కాలువల ద్వారా తగినంతగా నీరు అందకపోవడంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరి నాట్ల దశలో ప్రారంభమైన నీటి కష్టాలు కోత దశకు వచ్చినా తీరడం లేదు. కాలువలకు నీరు అంతంత మాత్రంగానే రావడంతో.. అవి చేలకు ఎక్కక రైతులు దిగాలుగా చూస్తున్నారు. పెట్టుబడి పెట్టి, ఇంత కాలం సాగు చేసిన పంట కళ్లెదుటే పాడైపోతూంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చాలీచాలని నీరు మెట్ట ప్రాంతం అధికంగా ఉన్న మన జిల్లాలో వరిసాగు ఎక్కువగా బోర్ల పైనే జరుగుతోంది. కాలువల ద్వారా సాగు విస్తీర్ణం తక్కువే. అయినప్పటికీ ఆ ప్రాంతానికి కూడా సాగునీరు సక్రమంగా అందడం లేదు. పెరవలి మండలంలో చిన్న, పెద్ద కాలువలు 69 ఉండగా.. వీటిలో పూర్తి స్థాయిలో నీరు ప్రవహించక శివారు భూములకు నీరు అందడం లేదు. ఈ కాలువలపై 6 వేల ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా ఇందులో సగానికి పైగా భూములకు బోర్ల ద్వారానే నీరందిస్తున్న దుస్థితి ఏర్పడింది. పెరవలి మండలం గరప కాలువ, పెండ్యాల పంపింగ్ స్కీమ్, పేకేరు కాలువ, శక్తమ్మతల్లి కాలువ, ఆచంట కాలువ, కాపవరం కాలువ వంటి వాటితో పాటు డైరెక్టు పైపుల (డీసీ) పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ప్రధాన కాలువలో నీరు గట్టును తాకుతూ ప్రవహిస్తే డీసీల ద్వారా నీరు సక్రమంగా పారుతుంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకపోవడంతో చేను తడవటం లేదని రైతులు వాపోతున్నారు. పెరవలి మండలం ఉసులుమర్రు, కాపవరం, ముక్కామల, ఖండవల్లి, నల్లాకులవారిపాలెం, కానూరు, కాకరపర్రు గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది. ఈ గ్రామాలు కాటన్ బ్యారేజీకి పెద్ద దూరం కూడా కాదు. అయినప్పటికీ తగినంతగా సాగు నీరు అందక ఈ ప్రాంతాల్లోని చేలు నెర్రెలు తీశాయి. అన్నదాతకు అగచాట్లు సాగు చివరి దశకు చేరిన తరుణంలో పైరు ఎండటానికి సిద్ధంగా ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీంతో, బోర్లు, మురుగు కాలువల నుంచి నీటిని తోడుకుంటూ పంటలను రక్షించుకునేందుకు రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. కాలువల్లోకి వస్తున్న కొద్దిపాటి నీటిని పంట చేలకు ఇంజిన్లతో అందిస్తున్నారు. దీనికోసం వారికి అదనంగా చేతి చమురు వదిలిపోతోంది. ఏటా రబీ సాగులో ఇదే దుస్థితిని ఈ ప్రాంతాల రైతులు ఎదుర్కొంటున్నారు. కొవ్వూరు డివిజన్లో 34 వేల ఎకరాల్లో వరిసాగు జరుగుతోంది. ప్రస్తుతం కోతలకు సిద్ధమవుతున్న చేలు 30 శాతం ఉండగా మిగిలినవి ఈ నెలాఖరుకు కోతకు వస్తాయి. దీనివలన మరికొన్ని రోజుల పాటు సాగు నీరు అందించాల్సి ఉంది. చేలు ఇంకా ఆకుపచ్చగానే ఉండటంతో ఈ నెలాఖరుకు కోతకు వస్తాయని, అప్పటి వరకూ నీటి తడి అందించడం తప్పనిసరి అని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరి పైరుకు అవసరమైన స్థాయిలో నీరందించాలని అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
మహిళపై టీడీపీ మాజీ కౌన్సిలర్ దాడి
అమలాపురం టౌన్: తమ ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తిపై గొడవకు వచ్చిన అమలాపురానికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, అతని అనుచరులు తనపై ఇనుప రాడ్లతో దాడి చేసి, గాయపరిచారని స్థానిక నల్లవంతెన రజకపేటకు చెందిన టేకి వెంకటలక్ష్మి డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం దీనిపై ఆమె ఫిర్యాదు చేయడమే కాకుండా, తనకు దున్నాల దుర్గ నుంచి రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరారు. ఈ నెల 3న రాత్రి పది గంటల ప్రాంతంలో తన ఇంట్లో అద్దెకుంటున్న తోలేటి ఓంప్రకాష్ ఎక్కడ అంటూ తనపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయ పలుకుబడితో మాజీ కౌన్సిలర్ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. తనపై దాడి చేసిన దున్నాల దుర్గతో పాటు, దున్నాల దిలీప్, కంచిపల్లి శ్రీను, జక్కపు ప్రసాద్, ఏలూరి అయ్యప్పపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఆమెకు సంఘీభావాన్ని తెలిపిన వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణతో కలిసి బాధితురాలు డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించాలని డీఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
సీతానగరం: ఇటుక బట్టీలో మట్టిని తొక్కుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మండలంలోని రఘుదేవపురానికి చెందిన సిద్ద వెంకటేశ్వరరావు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు, ఎప్పటిలాగే గురువారం ఉదయం వెంకటేశ్వరరావు స్థానిక రవీంద్ర కాలనీలోని తన ఇటుక బట్టీ వద్దకు వెళ్లాడు. ఇటుకల తయారీ కోసం మట్టిని ట్రాక్టర్తో తొక్కుతుండగా, అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ క్రమంలో వెంకటేశ్వరరావు అదే మట్టిలో కూరుకుపోయాడు. బట్టీ వద్ద ఉన్నవారు పొక్లెయిన్ సాయంతో ట్రాక్టర్ను తొలగించి, వెంకటేశ్వరరావును బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్థానిక బస్టాండ్ సెంటర్ వద్దనున్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతితో భార్య దుర్గాభవాని, తల్లి సత్యవతి, వివాహాలైన కుమార్తెలు కోటేశ్వరి, సంధ్యారాణి భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ శ్రీను తెలిపారు. -
జీడి పప్పు పరిశ్రమలకు హై ఓల్టేజీ
మలికిపురం/సఖినేటిపల్లి: హైఓల్టేజీ కారణంగా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో బుధవారం రాత్రి పలు జీడిపప్పు పరిశ్రమలకు నష్టం వాటిల్లింది. దీని ప్రభావంతో విలువైన జీడిపప్పు మాడిపోయింది. అలాగే విలువైన విద్యుత్ పరికరాలు, జీడిపప్పు డ్రయ్యర్ మెషీన్లు దెబ్బతిన్నాయి. గ్రామంలోని ముప్పర్తి సుబ్బారావు పరిశ్రమతో పాటు, మరికొన్ని పరిశ్రమల్లో భారీ నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. జీడి పప్పు ప్రాసెసింగ్ కోసం డ్రయ్యర్ మెషీన్లలో ఉంచగా, తెల్లవారుజామున అటుగా జీడి పప్పు డ్రమ్ముల వద్దకు వెళ్లిన కార్మికులు హైఓల్టేజీని గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే కార్మికులు మెయిన్ స్విచాఫ్ చేసి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. లేకపోతే మరింత నష్టం వాటిల్లేదని సుబ్బారావు తెలిపారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని వ్యాపార వర్గాలు తెలిపాయి. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం దెబ్బతిన్న పరిశ్రమలను పరిశీలించారు. హైఓల్టేజీకి కారణాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. మాడిపోయిన సరకు కాలిపోయిన పరికరాలు -
108 అంబులెన్స్కు సుస్తీ..
ప్రత్తిపాడు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రికగా పేరొందిన 108కి సుస్తీ చేసింది. ఫోన్ చేయగానే కుయ్.. కుయ్ మంటూ వచ్చే 108 వాహనానికి అవస్థలు వచ్చిపడ్డాయి. ప్రత్తిపాడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని 108 వాహనం సాంకేతిక లోపంతో తరచూ స్టార్ట్ కానంటూ మొండికేస్తోంది. గతేడాది నవంబర్ నుంచి మరమ్మతుల కోసం ఎదురుచూస్తూనే ఉంది. సిబ్బంది చిన్న మరమ్మతులు చేయడం, బండి బయలుదేరడం అన్నట్టు సాగిపోతోంది. 108కు ఎవరైనా కాల్ చేస్తే.. ఆగమేఘాలపై వెళ్లాల్సిన అపర సంజీవనికి ‘స్టారింగ్’ కష్టాలు లొచ్చాయి. ఎవరైనా బండిని నెట్టుతారా అంటూ ఎదురుచూడడం నిత్యకృత్యమైంది. ఎప్పటిలాగే గురువారం బండి స్టార్ట్ కాకపోవడంతో ఇలా.. తలో చేయి వేస్తున్నారు. -
దివాన్చెరువులో చైన్ స్నాచింగ్
రాజానగరం: ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసును అపహరించిన సంఘటన పట్టపగలే దివాన్చెరువులో చోటుచేసుకుంది. గురువారం ఉదయం 9 గంటల సమయంలో రైస్ మిల్లు వీధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నీలంతోటకు చెందిన ఇద్దరు మహిళలు రైసు మిల్లు వీధిలో బంధువుల ఇంటికి కాలినడక బయలుదేరారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చి యూ టర్న్ తీసుకుని ఓ మహిళ మెడలో ఉన్న ఒకటిన్నర కాసుల బంగారు గొలుసును లాక్కుపోయారు. ఈ ఘటనలో ఆమె మెడకు తీవ్ర గాయమైంది. బైకు నడిపిన వ్యక్తి 40 ఏళ్లలోపు, వెనుక కూర్చున వ్యక్తికి 50 ఏళ్లు పైబడి వయస్సు ఉంటుందని బాధితురాలు తెలిపారు. గొలుసు లాక్కున్న వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న బొమ్మూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వివరాల కోసం సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గత రాత్రి ఓ బైకు అపహరణకు గురైంది. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: అదుపుతప్పి రైలు నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందినట్టు రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్సై మావుళ్లు గురువారం తెలిపారు. ద్వారపూడి–కడియం రైల్వేస్టేషన్ల మధ్య సుమారు 45 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు చెప్పారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపర్చినట్టు తెలిపారు. మృతుడు నీలం రంగు ప్యాంటు, పసుపు రంగు టీ షర్ట్ ధరించి ఉన్నాడని చెప్పారు. టాటానగర్ నుంచి పాలక్కడ్కు జనరల్ టికెట్ ఉందన్నారు.తోట నరికివేతపై కేసుగోపాలపురం: మండలంలోని భీమోలు గ్రామంలో ఈ నెల 3న కొందరు యువకులు జామాయిల్ తోటలోకి అక్రమంగా చొరబడి, కర్రలను నరికి విక్రయించడంపై కేసు నమోదు చేశామని ఎస్సై కర్రి సతీష్కుమార్ గురువారం తెలిపారు. భీమోలు గ్రామానికి చెందిన పేద రైతు షేక్ యాకుబ్ తన ఐదు ఎకరాల జామాయిల్ తోటలోకి అదే గ్రామానికి చెందిన 13 మంది ముఠాగా ఏర్పడి జామాయిల్ తోటలోకి ప్రవేశించారు. తోటలోని కర్రలను నరికి, విక్రయించినట్టు యాకుబ్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను బెజవాడ రవీంద్ర, పెనుమాక మోషే, హేమంత్, ఖండెల్లి దాసు, ముప్పిడి రామకృష్ణ, రాజేష్, అర్జంగి రాంబాబు, నేకూరి బాలకృష్ణ, బెజవాడ మోహన్రావు, ఖండెల్లి వెంకట్రావు, పత్తిపాటి చందు, వేములూరి రాంబాబు, ఈతకోట పెంటయ్యగా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.పోక్సో కేసులో వ్యక్తి అరెస్టుప్రత్తిపాడు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని వంచించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు గురువారం అరెస్టు చేశారు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామానికి చెందిన వి.గన్నిబాబు అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువతిని ప్రేమించానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడంతో ఆమె ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.16లోగా అభ్యంతరాలు,గ్రీవెన్స్ సమర్పించాలిఅమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, పూర్వ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు గత నెలలో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి ఎం.పద్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు దరఖాస్తుల పరిశీలన అనంతరం htpp://artgo davari.nic.in వెబ్సైట్లో ప్రొవిజనల్ లిస్ట్ పొందుపర్చినట్టు చెప్పారు. ఈ జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11 నుంచి 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా కొవ్వూరు ఆస్పత్రి ఆవరణలోని జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి కార్యాలయంలో తగిన ఆధారాలతో సమర్పించాలని కోరారు. అభ్యంతరాలు, గ్రీవెన్స్ పరిశీలన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. -
గంటలో బాలిక ఆచూకీ లభ్యం
పెదపూడి: అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో నాలుగో తరగతి విద్యార్థిని అదృశ్యం సంఘటన కలకలం రేపగా, గంట వ్యవధిలో పోలీసులు ఆ బాలికను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. అనపర్తి ఎస్సై శ్రీనునాయక్ తెలిపిన వివరాల మేరకు, కుతుకులూరు గ్రామంలో లంక సత్యనారాయణ కుమార్తె షర్మిల రామవరం ఎంపీపీ స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం టిఫిన్ తెచ్చుకోడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చట్టుపక్కల వెతికినా బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుమంత్ సూచనలతో రంగంలోకి దిగిన అనపర్తి ఎస్సై శ్రీను నాయక్, అదనపు ఎస్సై దుర్గాప్రసాద్ తమ సిబ్బంది బాలిక కోసం గాలింపు చేపట్టారు. గంట వ్యవధిలోనే కుతుకులూరు గ్రామంలో ఓ చోట బాలికను పోలీసులు కనుగొన్నారు. ఈ సంఘటనపై బాలికను పోలీసులు వివరాలు అడగ్గా, బాగా చదవడం లేదని తల్లిదండ్రులు మందలించినందుకు వెళ్లిపోయినట్టు చెప్పిందని ఎస్సై తెలిపారు. వెంటనే స్పందించి, బాలిక ఆచూకీని కనుగొన్న పోలీసులను తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
తాళం పగులగొట్టి ఇంట్లో చోరీ
నిడదవోలు: తాళం పగులగొట్టి పట్టపగలే ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన సంఘటన పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, స్థానిక దానమ్మగుడి వెనుక వీధిలోని రెండంతస్తుల భవనం కింది పోర్షన్లో పెట్రోల్ బంక్ ఉద్యోగి బలిజ సత్యనారాయణ నివసిస్తున్నారు. ఈయన కుమార్తె ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. ఉదయం పిల్లలతో సహా అందరూ వెళ్లిపోయారు. ఇంటికి తాళం వేసి సత్యనారాయణ కూడా బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 2.30 సమయంలో ఆయన ఇంటికి తిరిగొచ్చారు. దొంగలు ఇంటికి వేసిన తాళాన్ని కట్టర్తో కట్ చేసి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువా లాకర్ను కూడా కట్ చేసి, 35 కాసుల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదు, కొంత వెండిని అపహరించారు. సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 25 కాసుల బంగారం, నగదు అపహరణ -
ముగిసిన పది మూల్యాంకనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో వారం రోజులుగా జరుగుతున్న పదవ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రశాంతంగా ముగిసిందని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు తెలిపారు. మూల్యాంకనం నిమిత్తం 101 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 630 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 200 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ ఎస్పీ నరసింహకిషోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ డీ నరిసింహ కిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఏస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని, అది వచ్చిన తర్వాతే పీఎం రిపోర్టు వస్తుందన్నారు. విచారణలో భాగంగా సేకరించిన వీడియో ఫుటేజ్ నిశిత విశ్లేషణ జరుగుతోందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వారి కుటుంబ సభ్యులకు ఎవరికీ ఇవ్వలేదని, అలాంటి ప్రచారాలను నమ్మవద్దన్నారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్లు పోలీస్ శాఖ రిలీజ్ చేయలేదన్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసు వ్యవస్థ సమర్థంగా, సమగ్రంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు చేస్తుందన్నారు. సత్యదేవునికి ఘనంగా జన్మ నక్షత్ర పూజలు అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ దేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరిచి స్వామి, అమ్మవార్లకు అర్చక స్వాములు సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ల రసాలు పంచామృతాలతో మహాన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం సుగంధ భరిత పుష్పాలతో, స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అర్చకులు దత్తాత్రేయ శర్మ, సుధీర్, పవన్ ఈ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి యాగశాల లో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్య హోమం, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. బుధవారం సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. నేడు నిజరూప దర్శనం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారు, శంకరులు గురువారం ఏ విధమైన ఆభరణాలు ధరించకుండా (మూల విరాట్లుగా) నిజరూపులో భక్తులకు దర్శనమివ్వనున్నారు. డీఎస్సీ ఉచిత కోచింగ్కు దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ సిటీ: కాకినాడ జిల్లాలో అర్హతగల బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు మెగా డీఎస్సీ పరీక్షకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారిణి ఎం లల్లీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సొంత జిల్లాల్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. కులధ్రువీకరణ పత్రం, టెట్ పరీక్షలో అర్హత సాధించి రుజువు వంటివి జతపరచాలన్నారు. దరఖాస్తును సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత అధికారి కార్యాలయం, 2వ అంతస్తు, ప్రగతి భవన్, డీఆర్డీఏ కాంప్లెక్స్, జీజీహెచ్ ఎదుట, కాకినాడ చిరునామాలో సమర్పించాలన్నారు. -
జగన్కు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలం
రాజమహేంద్రవరం రూరల్: అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భద్రత కల్పించడంలో పోలీసుశాఖ పూర్తి వైఫల్యం కనపడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. రాప్తాడులో వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చిన జనాన్ని నియంత్రించడానికే పోలీసులు ఎక్కువగా ప్రయత్నించారన్నారు. ఆయన హెలికాప్టర్ దిగే సమయానికి అక్కడ ఇవ్వాల్సిన భద్రతాలోపం వల్లే ప్రజలు గుమిగూడారన్నారు. అధికారం అనేది ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలకు చట్టాలపై గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలన్నారు. అధికారం మాకు అహంకారం అన్నేటట్టుగా ఈనాడు పత్రికల్లో మంత్రులు ప్రకటనలు చేస్తున్నారన్నారు. జడ్ ప్లస్ కేటగిరి నాయకుడికి మీరు ఇచ్చే భద్రత ఇదేనా అన్ని వేణు ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రజాదరణ గల నాయకుడిగా వైఎస్ జగన్ వస్తుంటే ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారన్నారు. ప్రభుత్వానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పోలీసుశాఖ సరైన భద్రత కల్పించకపోవడం వల్లనే రోడ్డు మార్గాన వైఎస్ జగన్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. జగన్కు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం దారుణం కూటమి ప్రభుత్వంలో పేదలకు అందించే ఆరోగ్యశ్రీసేవలు నిలిచిపోవడం దారుణమని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించిందని, ఆరోగ్యశ్రీ తో పాటు ఆరోగ్య ఆసరా, విలేజ్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, నెట్వర్క్ హాస్పిటల్స్ ద్వారా వైద్యం వంటి ఎన్నో సేవలను అందించిందన్నారు. గత ప్రభుత్వం వైద్యంపై శ్రద్ధ తీసుకుని అనేక సౌకర్యాలు కల్పించిందన్నారు. కరోనా సమయంలో సైతం మెరుగైన వైద్య సదుపాయాలను ప్రజలకు అందించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో రూ.3,500 కోట్ల బకాయిలను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించి ఆరోగ్యశ్రీని కొనసాగించాలని వేణు డిమాండ్ చేశారు.వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ -
ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతకంబాలచెరువు (రాజమహేంద్రవరం): అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో బాధ్యతల్ని నిర్వహించాలని, ఆయా వర్గాల వారికి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు, అణగారిన, వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం చట్టపరమైన, సామాజిక సాధికారత పథకాలపై సమన్వయ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా అమలు చేయవలసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందే విధంగా వారిని చైతన్యవంతం చేయాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందికి వర్క్ షాప్ నిర్వహించి వారికి పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఎ.గాయత్రి దేవి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, లీగల్ ఎయిడ్ డిప్యూటీ చీఫ్ పీఎంఆర్ ప్రేమ్కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె.విజయకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కేఎన్ జ్యోతి, ఇతర శాఖల అధికారులు ఎం.సుబ్బారావు, పీవీడీ ప్రసాద్, యు.రాజు, జాబిన, ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
270 కేజీల గంజాయి స్వాధీనం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జాతీయ రహదారిపై దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద కంటైనర్లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్ట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఈ దాడి చేశారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన సందీప్శర్మ, అదే రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ మోనుసైని ఏజెన్సీ ప్రాంతం నుంచి 270 కేజీల గంజాయిని కంటైనర్లో లోడ్ చేసుకుని బయలుదేరారు. దీనిపై ముందస్తు సమాచారం అందుకున్న బొమ్మూరు పోలీసులు, ఈగల్ టీం సభ్యులు ఆ లారీ వచ్చే ప్రాంతంలో కాపు కాశారు. ఎన్ఎల్ 01 ఏజే 6162 కంటైనెర్ను ఆపి తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. దీంతో లారీ డ్రైవర్ మోనుసైని పోలీసులకు చిక్కగా, మరో నిందితుడు సందీప్ శర్మ పారిపోయాడు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.13.50 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. లారీడ్రైవర్ను పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, అతడిపై తదుపరి చర్యల కోసం సెంట్రల్ జైలుకు రిమాండ్కు పంపారు. గంజాయిని తరలిస్తున్న రూ.30 లక్షల విలువైన కంటైనర్ను సీజ్ చేశారు. కాగా.. గంజాయిని పట్టుకున్న బొమ్మూరు సీఐ పి.కాశీ విశ్వనాథంతో పాటుఈగల్ టీం, పోలీసు సిబ్బందిని ఎస్పీ నరసింహ కిశోర్, ఈస్ట్జోన్ డీఎస్పీ బి.విద్య అభినందించారు. కంటైనర్లో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు గంజాయి విలువ రూ.13.50 లక్షలు -
చిన్నతనం నుంచే చోరీల బాట
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): చిన్నతనం నుంచే చోరీల బాట పట్టిన దొంగను నిడదవోలు పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి రూ.50 లక్షల విలువైన 630 గ్రాముల బంగారం, రూ.3.60 లక్షల విలువైన 4 కేజీల వెండి, లక్ష రూపాయల నగదు, టీవీ, మోటారుసైకిల్, ఐరన్ రాడ్డు, స్కూడ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం సమీపంలోని గునుపూడి బ్రాహ్మణవీధిలో నివాసముండే పందిరి వెంకట నారాయణ ఆలియాస్ నారిగాడు చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. 2008లో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలో సైకిళ్లు, ఇనుపముక్కలు దొంగతనం చేసేవాడు. దీంతో పోలీసులు వెంకట నారాయణను పట్టుకుని జువైనల్ హోమ్కు తరలించారు. ఆ తర్వాత పలు చోరీలకు పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేయడం, బయటకు రావడం, మళ్లీ దొంగతనం చేయడం, తిరిగి జువైనల్ హోమ్కు వెళ్లడం పరిపాటిగా మారింది. అలా అమలాపురం, పి.గన్నవరం, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, పెనుగొండ, పెనుమంట్ర ప్రాంతాల్లో చోరీలు చేశాడు. చివరిసారిగా గత ఏడాది అక్టోబర్ 22న ఆలమూరు పోలీసులు అరెస్టు చేసి తిరిగి జైలుకు పంపారు. నెల తర్వాత బెయిల్పై విడుదలైన వెంకట నారాయణ సమిశ్రగూడెం, ఉండ్రాజవరం, పెనుమంట్ర, ఐనవల్లి, పెరవలి, రావులపాలెం, భీమడోలు పోలీస్ స్టేషన్ పరిధిల్లో మరో నేరస్తుడు శివసుబ్రహ్మణ్యంతో కలిసి నేరాలు చేశాడు. ఇదిలా ఉండగా.. వెంకట నారాయణ ఉండ్రాజవరంలోని సీపాని విజయలక్ష్మి ఇంటి తాళాలు పగులకొట్టి విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కదలికలపై కన్నువేసి చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడిపై గతంలో 57 కేసులున్నట్టు గుర్తించారు. కేసును చేధించిన నిడదవోలు సీఐ స్వరూప్, ఉండ్రాజవరం ఎస్సై జి.శ్రీనివాసరావు, సమిశ్రగూడెం ఎస్సై కె.వీరబాబు, సీసీఎస్ ఎస్సై రవీంద్ర, ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.నరసింహ కిశోర్, క్రైం అడిషనల్ ఎస్పీ ఎల్.అర్జున్ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్ జిల్లా దొంగ అరెస్టు రూ.50 లక్షల విలువైన బంగారం స్వాధీనం -
కాకినాడ తీరం.. కదన రంగం
● ఉత్సాహంగా టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు ● పాల్గొన్న భారత్, అమెరికా సైనికులు కాకినాడ రూరల్: కాకినాడ తీరం కదన రంగాన్ని తలపిస్తోంది. శత్రు దేశాలకు వణుకు పుట్టేలా భారత, అమెరికా దేశాల సైన్యాలు తమ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. క్లిష్ట సవాళ్లను ఎదుర్కొనేలా.. అంకిత భావంతో ఇరు దేశాల సైన్యం ఐక్యతను ప్రదర్శిస్తూ పరస్పర సహకారం, రక్షణ సామర్థ్యం పెంపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. భారత్, అమెరికా దేశాల సైన్యం చేపడుతున్న టైగర్ ట్రయంఫ్ – 25 సంయుక్త విన్యాసాలు ఈ నెల ఒకటిన విశాఖలో ప్రారంభమవ్వగా కాకినాడలో 12న ముగియనున్నాయి. కాకినాడ తీరంలోని నావల్ ఎన్క్లేవ్ ప్రాంతంలోనూ, సాగర తీరంలోనూ నాలుగు రోజుల పాటు విన్యాసాలు చేపడుతున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్), ఇండియన్ నేవీ, యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ (యూఎస్ఏఎఫ్) బుధవారం ప్లయింగ్ మిషన్ను నిర్వహించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి – 130 హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్, భారత నావికాదళానికి చెందిన హాక్స్, యూఎస్ఏఎఫ్కి చెందిన సి – 130 సంయుక్త విన్యాసాలలో పాల్గొన్నాయి. అలాగే ఐఎన్ఎస్ జలాశ్వ, యుఎస్ఎస్ కామ్స్టాక్ యుద్ధ నౌకలతో తీరంలో విన్యాసాలు ప్రదర్శించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఏమీ బాగోలేదు స్వామీ..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం.. భక్తులకు అందిస్తున్న సేవలకు సంబంధించి మూడో నెల అభిప్రాయ సేకరణలో కూడా మెరుగుదల కనిపించలేదు. గత ఫిబ్రవరిలో చిట్టచివరి ఏడో ర్యాంకు, మార్చిలో రెండో ర్యాంకు సాధించినా అసంతృప్తి అలాగే ఉంది. తాజాగా ఏప్రిల్ నాలుగో తేదీన విడుదల చేసిన గణాంకాల ప్రకారం భక్తుల అసంతృప్తి ఇంకా పెరిగినట్టు తెలుస్తోంది. అభిప్రాయాల సేకరణ దేవస్థానాల్లో అందే సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ యాప్, ఐవీఆర్ఎస్ ద్వారా భక్తుల అభిప్రాయాలు తెలుసుకుంది. వాటిని ప్రామాణికంగా తీసుకుని తాజా ర్యాంకులు ప్రకటించింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరస్వామి, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల, విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి, సింహాచలం వరాహ నృశింహస్వామి, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జునస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానాలకు సంబంధించి మార్చి 20 – ఏప్రిల్ నాలుగో తేదీల మధ్య సేకరించిన అభిప్రాయాల ప్రకారం మంగళవారం ర్యాంకులు విడుదల చేసింది. దర్శనంలో రెండు సత్యదేవుని దర్శనం మీరు అనుకున్న సమయంలో జరిగిందా అనే ప్రశ్నకు 69 శాతం మంది భక్తులు అవునని సమాధానం చెప్పగా, 31 శాతం మంది కాలేదన్నారు. సింహాచలం, శ్రీకాళహస్తి దేవస్థానాలకు కూడా ఇదే విధంగా రెండో ర్యాంకు వచ్చింది. మౌలిక వసతుల్లో ఆరు దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూమ్స్, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు, తదితర విషయాలపై 60 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. 40 శాతం మందికి మాత్రం నచ్చలేదు. ఈ విభాగంలో అన్నవరానికి ఆరో ర్యాంకు వచ్చింది. ప్రసాదానికి రెండు సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యత విషయాలలో 80 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా 20 మంది అసంతృప్తి చెందారు. దీనిలో రెండో ర్యాంకు వచ్చింది. పెరిగిన అసంతృప్తి గతంలో జరిగిన అభిప్రాయ సేకరణలో స్వామివారి దర్శనంపై 70 శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, ఈసారి అది 69 శాతానికి పడిపోయింది. మౌలిక వసతుల విషయంలో గతంలో 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, ఈసారి 60 శాతం మంది మాత్ర మే బాగున్నాయన్నారు. ప్రసాదం రుచి, నాణ్యతపై గతంలో 82.4 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి 80 శాతానికి పరిమితమైంది. అన్నవరంలోని సత్యనారాయణస్వామి దేవస్థానం రత్నగిరి సేవలపై భక్తుల అసంతృప్తి అభిప్రాయ సేకరణలో వెల్లడి వరుసగా మూడో నెలా అదే ఫలితం కనిపించని మెరుగుదల -
ఎన్.సూరవరం కార్యదర్శి సస్పెన్షన్
తుని రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, వసూలు చేసిన ఆస్తి పన్నులను సబ్ ట్రెజరీలో జమ చేయకపోవడంపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తుని మండలం ఎన్.సూరవరం పంచాయతీ గ్రేడ్–3 కార్యదర్శి కె.వెంకటలక్ష్మి సస్పెండ్ అయ్యారు. దీనిపై ఈ నెల ఏడో తేదీన కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు బుధవారం ఈఓపీఆర్డీ జి.మరిడియ్య తెలిపారు. టి.తిమ్మాపురం, తేటగుంట గ్రామాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ, ఇటీవల ఎన్.సూరవరానికి వెంకటలక్ష్మి బదిలీపై వచ్చారు. ఆ రెండు గ్రామాల్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో పన్నులు వసూలు చేసేందుకు డిమాండ్ నోటీసులు ఇవ్వకపోవడం, వసూలు చేసిన మొత్తంలో కొంత సొమ్ము సబ్ ట్రెజరీకి జమ చేయలేనట్టు ఆమైపె ఉన్నత అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో తుని ఎంపీడీఓ, పెద్దాపురం డీఎల్పీఓలు వేర్వేరుగా విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. దాన్ని సమగ్రంగా పరిశీలించిన ఉన్నత అధికారులు కార్యదర్శి వెంకటలక్ష్మిని సస్పెండ్ చేశారు. హాకీ టోర్నీ విజేత ‘కాకినాడ’ ధర్మవరం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదికగా హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ హాకీ టోర్నీ విజేతగా కాకినాడ జిల్లా జట్టు నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో వైఎస్సార్ జట్టుపై 2–0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సత్యకుమార్.. విజేత జట్టును అభినందిస్తూ ట్రోఫీని అందజేశారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి ధవళేశ్వరం: వెనుక నుంచి లారీ ఢీకొన్న ఘటనలో మోటారు సైక్లిస్టు మృతి చెందాడు. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజానగరం మండలం యర్రంపాలేనికి చెందిన నేటి శ్రీను (50) ఈ నెల 4వ తేదీన తణుకు మండలం వేల్పూరులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి బుధవారం స్వగ్రామానికి మోటారు సైకిల్పై ప్రయాణమయ్యాడు. ఉదయం 10 గంటల సమయంలో ధవళేశ్వరం హార్లిక్స్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. తీవ్రగాయాలైన శ్రీనును రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు సీఐ టి.గణేష్ ఆధ్వర్యంలో ఎస్సై హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాక్సింగ్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
పిఠాపురం: స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ కాలేజీ మైదానంలో బుధవారం నిర్వహించిన బాక్సింగ్ పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.కృపారావు కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. వీటికి జిల్లా నలుమూలల నుంచి 25 మంది హాజరుకాగా, 8 మంది మహిళలు, ఇద్దరు పురుషులను ఎంపిక చేశామన్నారు. వీరందరూ ఈ నెల 12, 13వ తేదీలలో విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి బాక్సింగ్ యూత్ మెన్ అండ్ వుమెన్ పోటీల్లో పాల్గొంటారన్నారు. రైళ్లలో చోరీలు చేస్తున్న యువకుడి అరెస్టు నిడదవోలు: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన ఉలవలపూడి దుర్గారావును బుధవారం రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. భీమవరం రైల్వే సీఐ ఎస్.సోమరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఉలవలపూడి దుర్గారావు కొంత కాలంగా రైళ్లలో ప్రయాణికుల బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్నాడు. అలాగే రైలు ఫుట్బోర్డుల దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న ప్రయాణికులను కర్రతో కొట్టి, ఆ ఫోన్లు కిందపడగానే వాటిని తీసుకుని ఉడాయిస్తాడు. ఇలా అతడు దోచుకున్న 18 సెల్ఫోన్లు, 30 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. వాటి విలువ సుమారు రూ. 3.70 లక్షలు ఉంటుందని రైల్వే సీఐ తెలిపారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు. వృద్ధుడిపై పోక్సో కేసు నల్లజర్ల: మండలంలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులను లైంగికంగా వేధించిన ఓ వృద్ధుడి (హెచ్ఐవీ రోగి)పై పోలీసులు పోక్సో కేసు కట్టారు. పిల్లల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
వైభవంగా పొన్నవాహన మహోత్సవం
కొత్తపేట: వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం పొన్న వాహన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఈ కార్యక్రమం జరిపారు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున స్వామి వారి మేలుకొలుపు, గౌతమి నది నుంచి తీర్థపు బిందెను తీసుకువచ్చి విశేషార్చన, నిత్య హోమాలు నిర్వహించారు. రాత్రి ఉభయ దేవేరులతో స్వామివారు పొన్నవాహనంపై గ్రామంలో విహరించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం సజ్జాపురానికి చెందిన నందగోపాల మహిళల కోలాట భజన మండలి కోలాటం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. -
పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు: ఎస్పీ
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ కొనసాగుతుందని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇంకా రాలేదని.. అది వచ్చిన తర్వాతే పీఎం రిపోర్టు వస్తుందని ఆయన తెలిపారు. విచారణలో భాగంగా సేకరించిన వీడియో ఫుటేజ్ విశ్లేషణ జరుగుతుందన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వారి కుటుంబ సభ్యులకి ఎవరికీ ఇవ్వలేదని.. అలాంటి ప్రచారాలను నమ్మొద్దన్నారు.పాస్టర్ ప్రవీణ్ మృతి దర్యాప్తుపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇప్పటికీ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు.పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా సమగ్రంగా పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు నిర్వహిస్తోందన్నారు. క్రికెట్ బెట్టింగ్పై రాజమండ్రిలో ఒక కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశామని.. విచారణ కొనసాగుతోందన్నారు. క్రికెట్ బెట్టింగ్లో ఎవరు కూడా ఇరుక్కోవద్దని ఎస్పీ నర్సింహ కిషోర్ అన్నారు. -
నాలుగు రోజుల్లో నిశ్చితార్థం.. కార్యదర్శి అనుమానాస్పద మృతి
సాక్షి, నిడదవోలు: నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నెల్లి కరుణ (25) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో నాలుగైదు రోజుల్లో నిశ్చితార్థం.. వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా ఆమె ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ ఘటనపై నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకైక కుమార్తె కరుణ. ఆమె వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని చెప్పడంతో వెంటనే కారులో నిడదవోలులో ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి సూర్యకుమారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.అప్పటి వరకు సరదాగా ఉండి.. కరుణ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మృతిచెందారన్న నిజాన్ని తోటి ఉద్యోగులు నమ్మలేక సామాజిక ఆసుపత్రి వద్ద కన్నీరు పెట్టుకున్నారు. ఆమె స్వగ్రామం కోరుమామిడిలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. విధి నిర్వహణలో ఎంతో చురుగ్గా ఉండేదని అధికారులు అంటున్నారు. ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమెకు సమీప బంధువుతో వివాహం నిశ్చయమైంది. మరో నలుగైదు రోజుల్లో నిశ్చితార్థం, మే నెలలో వివాహం జరగాల్సి ఉంది. అటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఉద్యోగిని మృతి
నిడదవోలు: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నెల్లి కరుణ (28) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నిడదవోలు రూరల్ ఎస్సై కె.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కోరుమామిడి గ్రామానికి చెందిన నెల్లి వెంకట రమణ, సూర్యకుమారి దంపతులకు ఏకై క కుమార్తె కరుణ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వార్డు సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం సాధించింది. సోమవారం సాయంత్రం విధులను ముగించుకుని కోరుమామిడి గ్రామంలోని ఇంటికి వెళ్లింది. అనంతరం బంధువులతో కలిసి చర్చిలో ప్రార్థన చేసింది. చర్చి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కడుపునొప్పి, కళ్లు తిరగడం, కాళ్లూ చేతులు వంకర్లు తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్న కరుణను బంధువులు పద్మ, సుబ్బు కలిసి కారులో నిడదవోలు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న కరుణను రాత్రి 9 గంటల సమయంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు కరుణను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గదిలో ఉంచారు. బంధువులు, తల్లిదండ్రులు మాత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరుణకు పెళ్లి చేసేందుకు సంబంధాలు కూడా చూశారు. అయితే వివాహం విషయంలో కుటుంబంలో కలహాలు జరుగుతున్నట్లు తోటి ఉద్యోగులు చెబుతున్నారు. కరుణ మరణ సమాచారం తెలుసుకున్న పట్టణంలోని వివిధ వార్డు సచివాలయ ఉద్యోగులు ఆసుపత్రికి తరలివచ్చారు. మృతురాలి కరుణ తల్లి సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కె.వీరబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని కరుణ మృతదేహన్ని పరిశీలించి సంతాపం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు, జనసేన పట్టణ అధ్యక్షుడు రంగా రమేష్ సంతాపం తెలిపారు. రేషన్ బియ్యం స్వాధీనం రాజానగరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జాతీయ రహదారిపై జీఎస్ఎస్ వైద్య కళాశాల సమీపంలో సోమవారం రూ.10 లక్షల విలువైన బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇదే విధంగా మంగళవారం కూడా పైప్రాంతానికి కొద్దిదూరంలో పిరమిడ్ను చేర్చి ఉన్న పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారిపై రూ.ఒక లక్ష విలువ చేసే రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. బియ్యంతో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ తహసీల్దార్ (పౌరసరఫరాలు) గొలుగూరి బాపిరాజు తెలిపారు. చక్రద్వారబంధానికి చెందిన మాడబోయిన గోపి నుంచి వడిశలేరుకు చెందిన వట్టికూటి మణికంఠ మినీ వ్యాన్ను అద్దెకు తీసుకుని, అనపర్తి నుంచి గండేపల్లికి ఈ బియ్యాన్ని రవాణా చేస్తున్నాడన్నారు. నిందితుడిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రోగి మృతితో కుటుంబ సభ్యుల ఆందోళన
● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ ● ఆస్పత్రి వద్ద బైఠాయించి నిరసన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగి మృతి చెందాడంటూ దానవాయిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద మంగళవారం మృతుడి బంధువులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరుకు చెందిన జి.సత్యనారాయణ (55) కూలి పనిచేస్తుంటాడు. అతడు ఆదివారం పనికి వెళ్లి ట్రాక్టర్ పైనుంచి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి రెండు కాళ్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ పరీక్షించిన వైద్యుడు..ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో సత్యనారాయణను దానవాయిపేటలోని ఆ వైద్యుడు తెలిపిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడి కాళ్లకు ఆపరేషన్ చేసి ఐసీయూలో ఉంచారు. ఆపరేషన్ చేసిన రోజు, మర్నాడు సోమవారం బాగానే ఉన్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులు ఐసీయూలోకి వెళ్లి చూసేసరికి సత్యనారాయణ అచేతనంగా పడిఉన్నాడు. అతడి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో వెంటనే బయటకు పరుగెత్తుకు వచ్చి విషయాన్ని అక్కడ సిబ్బందికి తెలిపారు. వారు వచ్చి సత్యనారాయణకు వైద్య చికిత్సలు ప్రారంభించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. దీనిపై మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. తాము చెప్పే వరకు పేషెంట్ను పట్టించుకోలేదని, తాము చెబితేనే చనిపోయినట్లు వారికి అర్థమైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబీకులు ఆందోళన చేస్తున్నారని ఆ ఆసుపత్రి నిర్వాహకులు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
పంజాబ్లో వాడపల్లి యువకుడి మృతి
● మృతుడు వైఎస్సార్ సీపీ నేత సముద్రం కుమారుడు ● స్వగ్రామంలో అంత్యక్రియలు కొవ్వూరు: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో గల లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న వాడపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఉప సర్పంచ్ లంకదాసు సముద్రం పెద్ద కుమారుడు నాగ వెంకట యశ్వంత్ (23) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అమృత్సర్లో ఓ పరీక్ష రాసేందుకు ఈ నెల 6వ తేదీన తన స్నేహితుడి కలిసి మోటారుసైకిల్పై వెళ్లి తిరిగి వస్తుండగా కుపర్తల సమీపంలో హైవేపై డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో యశ్వంత్తో పాటు అతడి స్నేహితుడు, విజయనగరానికి చెందిన గానా సిద్విక్ వర్మ (23) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను అమృత్సర్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్లో మంగళవారం మధ్యాహ్నం యశ్వంత్ స్వగ్రామమైన వాడపల్లి తీసుకొచ్చారు. వాడపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న యశ్వంత్ ఇటీవల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికయ్యారు. మద్రాసులో ఉద్యోగం కుడా వచ్చింది. ఈ వారంలోనే ఉద్యోగంలో చేరనున్న సమయంలో మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోతున్నారు. ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ (నారాయుడు), మాజీ ఏఎంసీ చైర్మన్ బూరుగుపల్లి వీర్రాఘవులు తదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. -
పిడుగు పడి రైతు మృతి
నల్లజర్ల: పిడుగు పడి రైతు మృతి చెందిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. అనంతపల్లి శివారు కృష్ణమ్మగూడెంలో వెలగాని సత్యనారాయణ (47) తన ఇంటి సమీపంలోని మామిడి చెట్టు వద్ద ఉన్న సిమెంట్ బెంచీపై కూర్చున్నాడు. ఈదురుగాలులతో వర్షం పడుతున్న ఆ సమయంలో పిడుగు పడడంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు నబీపేట నుంచి వచ్చి ఇక్కడి ఎంపీపీ స్కూలు వద్ద ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాడు. వివాహిత మౌన దీక్ష కిర్లంపూడి: తన కుమారుడికి రావాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రాజుపాలెంలోని తన అత్తారింటి వద్ద నాగ వెంకటలక్ష్మి అనే వివాహిత తన కుమారుడు, కుటుంబ సభ్యులతో మంగళవారం మౌన దీక్షకు దిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాజులూరు మండలం పెనుమళ్ల గ్రామానికి చెందిన నాగ వెంకటలక్ష్మికి కొత్తపల్లి మండలం గోర్సకు చెందిన వీరబాబుతో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్నేళ్ల తరువాత రాజుపాలెంలో వారు స్థిరపడ్డారు. అయితే వీరబాబు మానసిక స్థితి సరిగ్గా ఉండదు. కానీ ఈ విషయం చెప్పకుండానే వివాహం చేశారు. వారికి మగబిడ్డ పుట్టిన తర్వాత ఆమెను అత్తింటివారు దూరం పెట్టారు. కుమారుడికి రావాల్సిన ఆస్తిని వేరే వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు ఇదేంటి అని అడిగితే ఇంట్లోకి కూడా రానివ్వకుండా బయటకు వెళ్లగొడుతున్నారు. దీంతో నాగ వెంకటలక్ష్మి తన కుమారుడితో కలిసి దీక్ష చేపట్టింది. -
అట్టనాణేలతో లెక్కల పాఠాలు
అమలాపురం టౌన్: బ్రిటీషు కాలంలో దాదాపు 110 ఏళ్లనాటి ఎనిమిది రకాల అట్ట నాణేలను అమ లాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. కాలగర్భంలో కలిసి మరుగున పడిపోయిన ఈ నాణేలు అప్పట్లో అర్ధ రూపాయి, పావలా, బేడా (రెండు అణాలు), అణా, అర్ధణా, కాణి, దమ్మిడి అనే ఎనిమిది రకలుగా చెలామణిలో ఉండేవి. అప్పట్లో ఈ నాణేలను పిల్లలకు లెక్కలు నేర్పడానికి ఉపయోగించేవారని సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. అసలైన నాణేలు పిల్లలకు ఇస్తే అవిపోతే అనివార్యమయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టకుని వీటిని అట్టతో త యారు చేయించారు. వెండి రంగు, రాగి రంగుతో ఉండే ఈ అట్టనాణేలకు, అసలైన నాణేలకు వ్యత్యాసాన్ని ఎంతో పరీక్షించి చూస్తే తప్ప తెలియదు. ఈ నాణేలను బ్రిటీషు వారు జర్మనీ దేశానికి చెందిన లాంగ్ మన్స్ అనే కంపెనీ ద్వారా తయారు చేయించి మన దేశానికి రప్పించి ఇక్కడ విద్యార్థులకు లెక్కలు నేర్పేవారు. అయితే ఈ పద్ధతి ఎక్కువ కాలం నడవకపోవడంతో ఈ అట్టనాణేలు క్రమేణా అదృశ్యమయ్యాయి. అల్లవరం మండలం కోడూరుపాడు గ్రామానికి చెందిన నడింపల్లి రామరాజు 50 ఏళ్ల కిందట అనేక పాఠశాలలను సందర్శించి తిరిగి అట్టనాణేలను సేకరించారు. ఆయన నుంచి తాను సేకరించినట్లు కృష్ణ కామేశ్వర్ తెలిపారు. 110 ఏళ్ల క్రితం చలామణి సేకరించిన కృష్ణ కామేశ్వర్ -
ప్రతి రైతు పారిశ్రామికవేత్తగా ఎదగాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రతి రైతూ పారిశ్రామికవేత్తగా ఎదగాలని, వ్యవసాయాన్ని పరిశ్రమగా చేపట్టాలని జాతీయ వాణిజ్య పరిశోధన, వ్యవసాయ పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. రాజమహేంద్రవరం ఐసీఏఆర్ – నిర్కా (సీటీఆర్ఐ)లో మంగళవారం వ్యవసాయంలో ఆవిష్కరణలు – వ్యవసాయం పారిశ్రామికరణ దిశగా ఆవిష్కర్తల కలయిక కార్యక్రమం జరిగింది. అధ్యక్షత వహించిన శేషుమాధవ్ మాట్లాడుతూ వ్యవసాయంలో వాణిజ్యపరమైన వినూత్న ఆవిష్కరణలు, అవకాశాలతో పాటు వాణిజ్య పంటల ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే దిశగా రైతులు, ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు కృషి చేయాలన్నారు. న్యూఢిల్లీ ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ (ఐపీటీఎం) డాక్టర్ నీరు భూషణ్ ముఖ్యఅతిథిగా ఆన్లైన్లో హాజరు కాగా, వారి తరఫున న్యూఢిల్లీ ఐసీఏఆర్ – ఐటీఎంయూ డాక్టర్ వి.విక్రమ్సింగ్ ఆన్లైన్లో సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఐటీఎంయూ నోడల్ ఆఫీసర్, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హెచ్.రవిశంకర్ మాట్లాడుతూ ఆవిష్కర్తల కలయిక ఆవశ్యకతలను వివరించారు. వాణజ్య వ్యవసాయంపై ఆవిష్కరణలు, విలువ ఆధారిత పదార్థాల తయారీపై రైతుల విజయగాథలు, కోత అనంతరం వాణిజ్య పంటలలో వివిధ ఉత్పత్తులలో సంకలనం చేయబడిన సావనీర్ను అతిథులు ఆవిష్కరించారు. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, హైదరాబాద్ ఐసీఏఆర్–నారమ్ మేనేజ్మెంట్ డివిజన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ హెడ్ ఎస్.సెంథిల్ వినాయగం, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నటరాజ్, నాబార్డు ఏజీఎం సోము నాయుడు, ఎపెడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్పీ నాయుడు మాట్లాడారు. అనంతరం 11 మంది ఔత్సాహిక యువత తమ అనుభవాలను వివరించారు. 11 ఎగ్జిబిషన్ స్టాళ్లలో పసుపు, అశ్వగంధం, ఆముదం, మిరప ఉత్పత్తులతో పాటు ఎన్జీవో, ఎఫ్పీవోలు, ఏపీసీఎన్ఎఫ్ (ప్రకృతి వ్యవసాయం) వారి వివిధ ఉత్పత్తులు, రోబోటిక్స్, డ్రోన్స్, జ్యూట్బ్యాగులను ప్రదర్శించారు. అనంతరం 17 మంది ఔత్సాహిక ఆవిష్కర్తలను సత్కరించారు. నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ ఉత్సాహంగా ‘ఆవిష్కర్తల కలయిక’ -
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఇలా..
గ్యాస్ధర పెంపు దారుణం గ్యాస్ సిలిండర్పై ఒకేసారి రూ.50 ధర పెంచడం దారుణం. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఇది ఇబ్బందికర పరిస్థితి. సామాన్య కుటుంబాలు ఏడాదికి రూ.300 వరకు అదనంగా గ్యాస్కు చెల్లించాలంటే కష్టం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పెంచిన ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. – బొంతా మణి, గృహిణి రాజమహేంద్రవరంసాక్షి, రాజమహేంద్రవరం: నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల పెంపుతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై ప్రభుత్వం వంట గ్యాస్ బండ భారం మోపింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర మంగళవారం నుంచి అమల్లోకి తీసుకురావాలని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్పురి స్పష్టం చేశారు. ధరల పెంపుతో ప్రస్తుతం జిల్లాలో రూ.832 ఉన్న గ్యాస్ సిలిండర్ రూ.50 పెరిగి.. రూ.882కు చేరింది. ఇది కేవలం సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింప చేశారు. ఈ పరిణామం సాధారణ, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళన నింపుతోంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగాయి. విద్యుత్ చార్జీల బాదుడు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో గ్యాస్ ధర పెరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రోజుకు రూ.6 లక్షల భారం తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 43 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. మొత్తం 6,68,641 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజూ 13 వేల వరకు వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్టు సమాచారం. సిలిండర్పై రూ.50 పెంపుతో రోజుకు రూ.6.50 లక్షల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నెలకు రూ.1.95 కోట్లు వరకు భారం పడుతుంది. ఉజ్వలకూ వర్తింపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్, స్టవ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాలో 41,055 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుత పెంపును వారికి సైతం వర్తింప చేశారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు మంజూరు చేసిన పథకాన్ని సైతం పెంపులో భాగస్వామ్యం చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. నిత్యావసరాలతో ఇబ్బందులు ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కందిపప్పు, మినపప్పు, వంట నూనె తదితర ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి తరుణంలో గ్యాస్ రూ.50 పెరగడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వెల్లడవుతోంది. నలుగురున్న ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక సిలిండర్ రెండు నెలల వరకు వినియోగించుకోవచ్చు. అంటే ఏడాదికి 6 సిలిండర్లు అవసరం అవుతాయి. ఏడాదికి అదనంగా రూ.300 చెల్లించాల్సి వస్తోంది. పట్టించుకోని కూటమి ప్రభుత్వం కేంద్రం గ్యాస్ ధర ఏకంగా రూ.50 పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. రాష్ట్ర పరిధిలో నియంత్రించేందుకు ముందుకురాకపోవడంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే పెంచుతూ పోతే తాము వంట ఎలా వండుకోవాలని ప్రశ్నిస్తున్నారు. పెట్రోల్పై రూ.2 పెంపు గ్యాస్ ధరతో పాటు పెట్రోల్, డీజిల్ లీటర్పై ఎక్సైజ్ సుంకం రూ.2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ భారం వాహనదారులపై పడదని, ఇంధనాల రిటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నా.. భవిష్యత్తులో ప్రజలపై భారం తప్పదన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలపై వంటగ్యాస్ ధరల వడ్డన సిలిండర్పై రూ.50 పెంచుతూ నిర్ణయం ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతం తాగాజా గ్యాస్ ధర పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో అసహనం జిల్లావ్యాప్తంగా 6 లక్షల గ్యాస్ కనెక్షన్లు రూ.50 పెంచడంతో ప్రతి నెలా ప్రజలపై రూ.1.95 కోట్ల భారం పెట్రోల్ ధర రూ.2 పెంపు వాహనాలు ఎలా నడపాలంటున్న వాహనదారులు కంపెనీ ఏజెన్సీలు జనరల్ దీపం ఉజ్వల 5 కిలోల సిలిండరు్ల హెచ్పీసీఎల్ 28 3,35,472 1,19,701 24,644 2,513 ఐవోసీఎల్ 12 64,191 53,245 16,252 14 బీపీసీఎల్ 3 27,456 13,262 159 28 -
16 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: వేసవికాలం ప్రయాణికుల రద్దీని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా మీదుగా 16 వీక్లీ సమ్మర్ స్పెషల్ రైళ్లు ఏర్పాటు చేస్తూ రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. 07325 హుబ్లీ– కటీయార్ ప్రతి బుధవారం నడిచే ఈ రైలు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 07326 కటియార్–హుబ్లీ ప్రతి శనివారం నడిచే ఈ రైలు 12వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 06559 ఎస్ఎంవీటీ బెంగళూరు– నారంగి ప్రతీ మంగళవారం నడిచే ఈ రైలు ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. 06560 నారంగి– ఎస్ఎంవీటీ బెంగళూరు ప్రతీ శనివారం నడిచే రైలు ఈ నెల 12వ తేదీ నుంచి మే 3వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆగనున్నాయని ప్రయాణికులు సద్వినియోగం వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా అర్జీల పరిష్కారం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రెవెన్యూ పరంగా పీజీఆర్ఎస్లో 6,765 అర్జీలు పరిష్కారం కోసం రాగా 6,226 పరిష్కరించామని కలెక్టర్ పి. ప్రశాంతి తెలియజేశారు. మంగళవారం అమరావతి నుంచి సీసీఎల్ఏ కమిషనర్ జి.జయలక్ష్మి కలెక్టర్లతో పీజీఆర్ఎస్, వాటర్ ట్యాక్స్, భూముల క్రమబద్ధీకరణ అంశాలపై వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరాలు తెలియజేస్తూ భూముల క్రమబద్ధీకరణ కోసం ఇప్పటి వరకు 278 దరఖాస్తులు రాగా పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, జిల్లా ల్యాండ్ సర్వే అధికారి బి.లక్ష్మీనారాయణ, డిప్యూటీ తహసిల్దార్ శ్రీనివాస్, పాల్గొన్నారు -
యాప్సోపాలు!
● పనిచేయని కొత్త యాప్తో ఇసుక కష్టాలు ● ఎగుమతులు జరగక నిలిచిన వాహనాలు ● కొత్త డ్యూటీలు మాకొద్దు అంటున్న ఉద్యోగులు పెరవలి: ఇసుకాసురులకు ఇచ్చిన అవకాశాలు ఇచ్చినంత సేపు ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేయటంతో ఇసుక ఎగుమతులు అంతంతమాత్రంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరుకు మైనింగ్ అధికారులు ఇసుక కోసం వచ్చే వాహనాలను ముందుగా ఫొటో తీసి, దాని ప్రకారం ఇసుక బుక్ చేసుకున్న రశీదును ముందుగా వీఆర్ఓ లాగిన్లోకి వెళ్లి... వచ్చిన సమయం నోట్ చేసిన తరువాత కాంట్రాక్టర్ లాగిన్కు వస్తోంది. ఆ తరువాత కాంట్రాక్టర్ ఇసుక లోడ్కి అనుమతి ఇచ్చి, లోడ్ అయిన తరువాత మళ్లీ దానిని ఫొటో తీసి పంపిన తరువాత ఉన్నతాధికారులు ఓకే చేశాక, రశీదు రాసి వాహనదారుడుకి ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా పొరపాటున తప్పుగా నమోదు చేస్తే సైట్ మొత్తం ఆగిపోతుంది. మళ్లీ సైట్ ఓపెన్ అవ్వాలంటే మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చి, అక్కడ నుంచి జిల్లా అధికారులకు, అక్కడ నుంచి అమరావతికి పంపించి జరిగిన తప్పు ఇది అని వీరందరికి చెప్పిన తరువాత దానిని సరిచేస్తే మళ్లీ సైట్ ఓపెన్ అవుతోంది. ఇదే క్రమంలో నిన్న ఆదివారం కాకరపర్రు ఇసుక ర్యాంప్, నేడు సోమవారం తీపర్రు ర్యాంప్లో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. కొత్త యాప్తో చాలా ఇబ్బందులు పడవలసి వస్తున్నదని దీనివలన ఎగుమతులు జరగక నానా పాట్లు పడుతున్నామని నిర్వాహకుల చెబుతుండగా, వాహనదారులు మాకు అసలు ట్రిప్లు పడటం లేదని, అన్ని సక్రమంగా ఉంటే యాప్ పనిచేయదని, యాప్ పనిచేస్తే ఇసుక ఉండటం లేదని అంటున్నారు. గతంలో రోజుకి మూడు ట్రిప్లు వేస్తే నాలుగు రోజులుగా కేవలం రెండు ట్రిప్లు మాత్రమే వేశామని చెప్పారు. దీంతో కిస్తీలు కట్టలేక, నానా ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. ప్రభుత్వం అంతా అయిపోయిన తరువాత ఈ విధమైన నిర్ణయాలు చేయటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీఆర్ఓలు మాత్రం మాకు ఈ డ్యూటీలు వద్దని కోరుతున్నారు. ఒక వీఆర్ఓ నేరుగా కలెక్టర్కు నాకు ఇంగ్లిషు రాదు, నేను యాప్లో నమోదు చేయలేకపోతున్నానని తెలియజేయగా.. జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందిని కొత్తగా నియమించటంతో వారు గగ్గోలు పెడుతున్నారు. ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఉంది కానీ ఈ యాప్లు వలన ఎటువంటి ప్రయోజనం లేదని, దోచుకోవలసింది అంతా దోచేశారని ఇప్పుడు కొత్తగా నిబంధనలు తెచ్చి ఏమిటి ప్రయోజనం అని పలువురు అంటున్నారు. ఈ కొత్త యాప్ వలన ఎగుమతులు సక్రమంగా జరగక వాహనదారులు, ఇసుక వెళ్లక కాంట్రాక్టర్లు, కొత్త యాప్తో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. -
అక్రమ ర్యాంప్.. జోరుగా తరలింపు
పెరవలి: అధికారి కూటమి నేతలు బరి తెగించి అక్రమ ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేయటమే కాకుండా యథేచ్ఛగా రాత్రి పగలు ఇసుక తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పెరవలి మండలం ఖండవల్లి పరిధిలోని లంకమాలపల్లికి ఆనుకుని ఉండే ఎర్రవంతెన వద్ద నుంచి నిత్యం యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా రెవెన్యూ, పోలీస్ డిపార్టుమెంట్లు పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఒకవైపు, మామూళ్లూ ఇంకొక వైపు అఽందటంతో అధికారులు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని అంటున్నారు. ఇసుక తరలిస్తున్నప్పుడు అధికారులకు ఎవరైనా చెప్పుచుంటే దళారీలను పట్టుకోవటం మాని అధికారులే నేరుగా దళారీలకు ఫోన్ చేసి చెప్పటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఈ ఫిర్యాదు చేసిన వారు సామాన్యులైతే ఫర్వాలేదు కానీ ప్రతిపక్ష పార్టీ వారయితే వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే అధికార ర్యాంప్ల్లో అధికారుల సాక్షిగా ఇసుక దోపిడీ జరుగుతున్నా చర్యలు లేకపోవడంతో అధికారపార్టీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి ర్యాంపునే ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణాను జోరుగా చేస్తున్నారు. పెరవలి మండలంలో తీపర్రు, కానూరు–పెండ్యాల, కాకరపర్రు ఇసుక ర్యాంపులు ఉన్నా నేడు ఖండవల్లిలో ఏర్పాటైన అనధికార ఇసుక ర్యాంపు నుంచి నిత్యం రాత్రి సమయాల్లో 20 నుండి 40 ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నారు. మంగళవారం జిల్లాలో ఇసుక టెండర్లు వేసే పనిలో కాంట్రాక్టర్లు ఉండగా ఇదే అదనుగా పట్టపగలే ఇసుకను ట్రాక్టర్లతో తరలించారు. తీర ప్రాంతంలోని ప్రతీ గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పగలు పంచాయతీ కార్యదర్శులు, రాత్రులు రెవెన్యూ సిబ్బంది పహరా కాస్తున్నా ఇసుక తరలివెళ్లిపోతున్నదంటే ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలో సాక్షి ఈ విషయాన్ని బయట పెడితే కొద్దిరోజులు ఇసుక రవాణా నిలిచిపోయింది కానీ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. అధికారులు కాసులకు కక్కుర్తి పడటం వలన ఇసుక అక్రమ రవాణా 3 ట్రాక్టర్లు 6 లారీలుగా కొనసాగుతోంది. ఈ ర్యాంప్ నుంచి ఇసుకను రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జాము 4 గంటల వరకు తరలిస్తున్నారు. అధికార నేతలే ర్యాంప్ ఏర్పాటు ఖండవల్లిలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధే ఈ ర్యాంప్ ఏర్పాటు చేశారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై పెరవలి తహసీల్దార్ను వివరణ కోరగా గతంలో ర్యాంప్ ఏర్పాటు చేయటం నిజమేనని, దీనిని ధ్వంసం చేసామని, ఇప్పడు మళ్లీ తోలుతున్నారా అయితే వీఆర్ఓను పంపించి విషయం తెలుసుకుంటానని తెలిపారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావును వివరణ కోరితే ఇసుక తరలిస్తున్నారని తెలిసిన వెంటనే సిబ్బందిని పంపించామని ఎవరూ దొరకలేదని చెప్పారు. యథేచ్ఛగా రాత్రి పగలు ఇసుక రవాణా -
15న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐలో పాసైన అభ్యర్థులకు జిల్లాలో గల ప్రముఖ పరిశ్రమలలోను, బ్లూస్టార్, శ్రీసిటీలో అప్రెంటిస్ షిప్ కోసం ఈ నెల 15వ తేదీన ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ ఎల్ఆర్ఆర్ కృష్ణన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ప్రముఖ సంస్థలు ‘ఆంధ్రపేపర్ లిమిటెడ్‘ రాజమహేంద్రవరం, కడియం యూనిట్లలోను, ధవళేశ్వరంలోని ‘హిందూస్తాన్ యూనిలివర్‘ సంస్థలో ఐటీఐ ఫిట్టర్ పాస్ అయిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహణ ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల నకలు, ప్రొఫైల్ రిజిస్టర్ కాపీలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 13 లోపుగా అందజేయాలని ప్రిన్సిపాల్ తెలిపారు. సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలు అన్నవరం: సత్యదేవునికి చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా అర్చకులు మంగళవారం స్వామి, అమ్మవార్లకు ఘనంగా పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం తొమిది గంటల నుంచి 11 గంటల వరకు తులసి దళార్చన నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 20 లక్షల ఆదాయం సమకూరింది. ఘనంగా సీతారాముల వేద సదస్యం కాగా, రత్నగిరి రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సీతారాముల వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు నవదంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవారిని మరో ఆసనంపై ఉంచి పూజలు చేశారు. సీతారాములకు నూతన పట్టు వస్త్రాలను ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు అందజేశారు. వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠీ, చిట్టి శివ, గంగబాబు, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి కార్యక్రమం నిర్వహించారు. నేడు రాష్ట్ర స్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ కాకినాడ రూరల్: తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద నన్నయ్య ఎంఎస్ఎన్ పీజీ సెంటరులో కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో తలాష్ – 2కె 25 పేరిట రాష్ట్రస్థాయి మేనేజ్మెంట్ ఫెస్ట్ను బుధవారం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రశాంతి శ్రీ తెలియజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నన్నయ్య యూనివర్శిటీ వీసీ ప్రసన్న శ్రీ,, ఓఎన్జీసీ ఈడీ రత్నేష్కుమార్ హాజరవుతారన్నారు. సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై దాడులు కాకినాడ క్రైం: కాకినాడలో కూటమి నేతల అండదండలతో విచ్చలవిడిగా లక్షల్లో జరుగుతున్న నంబర్గేమ్పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బెంగళూరు కేంద్రంగా చేసుకుని దినసరి కూలీలు, నిరుపేదల జీవితాలతో చెలగాటమాటమాడుతున్న సింగిల్ నంబర్ లాటరీల భాగోతాన్ని గత నెల 20న ‘కూటమి వారి లాటరీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. దీనిపై జిల్లా ఎస్పీ బిందుమాధవరావు తీవ్రంగా స్పందించి ఆకస్మికంగా దాడులు చేయించారు. కాకినాడ సాంబమూర్తినగర్ ఫ్లై ఓవర్, సంజయ్నగర్ లారీ ఆఫీసు, ఎమ్ఎస్ఎన్ చారిటీస్ నూకాలమ్మ గుడి వద్ద పార్కు తదితర ప్రాంతాల్లో నిత్యం సింగిల్ నంబర్ లాటరీతో పేదల పొట్టగొడుతున్నారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న జిల్లా ఎస్పీ సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలపై ప్రత్యేక పోలీసు బృందాలతో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కాకినాడ టూటౌన్, త్రీటౌన్ పరిధిలో పలు సింగిల్ నంబర్ లాటరీ స్థావరాలను పోలీసులు గుర్తించారు. నంబర్ గేమ్ ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదును, మొబైల్ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. నంబర్ గేమ్కు మూలాలు, పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో ఉన్నాయని తెలియడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లీ, తండ్రి టార్చర్.. తనయుడు బలవన్మరణం
కాకినాడ రూరల్: నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను.. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.. నావల్ల ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. పెళ్లిచేసి టార్చర్ పెట్టారు. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడది, వంద జన్మలెత్తినా అలాంటి దానికి పుట్టకూడదని కోరుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయికి అన్యాయం చేశాను. నన్ను, నా భార్యను మానసికంగా వేధించారు. నిజంగా నేను వారికి పుట్టానో లేదో తెలీదు. ఇవీ.. కాకినాడ శశికాంత్నగర్లో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దాకారపు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్ (39) సెల్ఫీ వీడియోలోని మాటలు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య పాప, పోలీసుల వివరాల ప్రకారం.. వాటా లేదంటూ ఇంట్లోంచి పొమ్మన్నారు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్కు తామరాడకు చెందిన యువతి పాపతో 2021 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. పాప టీసీఎస్కు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో ఉద్యోగం చేస్తూ కాకినాడలో తన తండ్రి ఇంట్లో ఉంటున్నారు. ప్రసాద్కు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో భార్య సంపాదనతో ఇద్దరు అక్కడే ఉంటున్నారు. ఇంట్లో వాటాలేదని, జగ్గంపేట మండలం మల్లిసాలలో ఉన్న స్కూల్లోనూ వాటాలేదని చెప్పడమే కాక తన ఇంట్లో ఉండవద్దని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీరామమూర్తి చెప్పడంతో పాటు ప్రసాద్, పాపలను ఇంటి నుంచి పొమ్మన్నారు. దీంతో పాప తండ్రి ఇంట్లో అద్దె చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. ఈనెల 3న చనిపోతానని పాపతో పాటు ఆమె అన్నయ్యకు ప్రసాద్ వీడియో పెట్టడంతో వారు కంగారుపడి అదేరోజు తామరాడ తీసుకొచ్చారు. మరుసటి రోజు బయటకెళ్లి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడంలేదని భార్యకు ఫోన్లో చెప్పి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
క్రికెట్ బెట్టింగ్.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
కాకినాడ: క్రికెట్ బెట్టింగ్లో సొమ్ము కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కోలనాటి రమణబాబు (33) ఆత్మహత్య చేసుకున్నాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. సోమవా రం అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం నక్కపల్లి గ్రామానికి రమణబాబు వర్క్ ఫ్రం హోంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలవారీ వస్తున్న జీతం ఇంటికి ఇవ్వకుండా బెట్టింగ్కి అలవాటు పడి సొమ్ము పోగొట్టుకున్నాడు. అప్పుల బాధతో నర్సీపట్నం– రేగు పాలెం మధ్యలో రైలు పట్టాల పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వద్ద లభించిన సెల్ఫోన్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
వర్షాకాలానికి 18 లక్షల టన్నుల ఇసుక సిద్ధం చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని 18 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను స్టాక్ యార్డ్లలో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇసుక రీచ్లు నిర్వహిస్తున్న గ్రామాల పరిధిలో మౌలిక సదుపాయాలు, రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇసుక స్టాక్ యార్డులకు ఆయా నియోజకవర్గాల్లో అనువైన ప్రదేశాలపై ప్రతిపాదన అందజేయాలని ఆర్డీఓలకు సూచించారు. స్టాక్ పాయింట్ల వద్ద తగిన నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సెమీ మెకనైజ్డ్ కింద పర్యావరణ అనుమతులు పొందిన 10 రీచ్ల ద్వారా 57,82,950 మెట్రిక్ టన్నుల ఇసుక త్వరలో అందుబాటులోకి రానున్నదని కలెక్టర్ తెలిపారు. కాటవరం, సింగవరం, కుమారదేవం, తాడిపూడి, పెండ్యాల ఇసుక ర్యాంపుల నిర్వహణ, పర్యవేక్షణ పశ్చిమ గోదావరి, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు జిల్లాల డీఎల్ఎస్సీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని వివరించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.390 కోట్ల మేర ఖనిజ ఆదాయం సాధించామని జిల్లా మైన్స్ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు, అదనపు ఎస్పీ మురళీకృష్ణ, ఆర్డీఓలు కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఆర్డబ్ల్యూఎస్ఎస్ బీవీ గిరి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి వై.శ్రీనివాస్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, ఇరిగేషన్ డీఈ ఆనంద్బాబు తదితరులు పాల్గొన్నారు. డెలివరీ బాయ్స్ ఈ–శ్రమ్లో నమోదు చేసుకోవాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్, బ్లింకిట్, జొమాటో, స్విగ్గీ, ఊబర్, ర్యాపిడో, ఓలా వంటి సంస్థల్లో పని చేస్తున్న డెలివరీ రంగ ఉద్యోగులు ఈ–శ్రమ్ పోర్టల్లో తమ పేర్లు ఉచితంగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసే గుర్తింపు కార్డు పొంది, సంక్షేమ పథకాలు అందుకోవచ్చని వివరించారు. కేంద్ర బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు ప్రకటించిన సంక్షేమ ప్రయోజనాలు అందుకునేందుకు ఆయా ప్లాట్ఫామ్ కార్మికులు తమ పేర్లను ఈ–శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని సహాయ కార్మిక కమిషనర్ బీఎస్ఎం వలి కోరారు. పీజీఆర్ఎస్కు 193 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ప్రజలు 193 అర్జీలు సమర్పించారు. వారి నుంచి అధికారులతో కలసి జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక, మండల స్థాయి అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలో 946 అర్జీలు రీ ఓపెన్ అయ్యాయని, వాటిలో ఇంకా 69 పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రీ ఓపెన్ అయిన ప్రతి అర్జీదారును వ్యక్తిగతంగా కలిసి, పరిష్కారం వివరాలు తెలియజేయాలని సూచించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రం ఆధ్వర్యాన ఆరుగురు దివ్యాంగులకు వివిధ ఉపకరణాలను జేసీ అందజేశారు. డీసీహెచ్ఎస్గా పద్మకొవ్వూరు: జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్)గా ఎం. పద్మ నియమితులయ్యా రు. ఇప్పటి వరకూ తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పని చేస్తున్న ఆమె పదోన్నతిపై ఇక్కడకు వచ్చి, సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమెను కార్యాలయ సిబ్బంది, కొవ్వూరు ఆసుపత్రి సూపరిండెంటెండ్ కె.సాయికిరణ్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీసీహెచ్ఎస్గా పని చేసిన ఎం.పద్మజారాణి విజయనగరం డీసీహెచ్ఎస్గా బదిలీ అయ్యారు. -
పేదల ఆరోగ్యంపై.. నిర్లక్ష్యపు పడగ
సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం, శస్త్రచికిత్సలను ఉచితంగా అందించే ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) ఆగింది. రెండు దశాబ్దాలుగా ఎంతో మంది పేదల ప్రాణాలు నిలిపిన ఈ పథకం.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నిలిచిపోయింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని, తమకు వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే వైద్య సేవలు నిలిపివేస్తామని కొన్ని రోజుల ముందే నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు నోటీసులు ఇచ్చాయి. బకాయిల అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించలేదు. ఈ నేపథ్యంలో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సోమవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స కోసం వివిధ ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లిన రోగులు, వారి బంధువులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. డబ్బులు చెల్లిస్తేనే వైద్యం చేస్తామని ఆయా ఆస్పత్రుల సిబ్బంది చెప్పడంతో కంగు తిన్న పేదలు ఏం చేయాలో తెలియని ఆవేదనతో వెనుతిరిగారు. పేదల ప్రాణదాయినిగా ఉన్న ఈ పథకం నిలిచిపోవడానికి కారణమైన కూటమి ప్రభుత్వానికి వారు శాపనార్థాలు పెట్టారు. రూ.150 కోట్లకు పైగా బకాయిలు ఎన్టీఆర్ వైద్యసేవ కింద తెల్ల రేషన్కార్డు దారులకు కార్పొరేట్ స్థాయిలో వివిధ చికిత్సలు, ప్రొసీజర్లను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనికి అయిన ఖర్చును ప్రభుత్వమే ఆయా ఆస్పత్రులకు చెల్లిస్తూంటుంది. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే.. గడచిన పది నెలలుగా నయాపైసా కూడా చెల్లించలేదు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద గుండె, ఈఎన్టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, ఆర్థో తదితర శస్త్రచికిత్సలు చేసిన నెట్వర్క్ ఆస్పత్రులకు జిల్లా వ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీని కోసం పదేపదే విజ్ఞప్తులు చేసినా, ఉన్నతాధికారులతో చర్చలు జరిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ ఉచిత వైద్య సేవలను ఆయా ఆస్పత్రులు నిలిపివేశాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోయాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ వైద్య సేవలు సైతం ఆగిపోతే తమ పరిస్థితేమిటనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. సేవలు నిలిపివేసినట్లు ఆయా ఆస్పత్రుల సిబ్బంది చెబుతూండటంతో శస్త్రచికిత్సలకు వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు. అయితే, జిల్లా వ్యాప్తంగా 35 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ ఉచిత సేవలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నిర్వీర్యం చేసేందుకు కుట్ర గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు ఎన్టీఆర్ వైద్య సేవ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన వెంటనే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. భవిష్యత్తులో ఈ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసి బీమా పథకం అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ పథకం బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. ఏ మేరకు లబ్ధి చేకూరుతుందనే ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. రూ.508.49 కోట్లు వెచ్చింపు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకం అమలుకు భారీగా ఖర్చు చేసింది. జిల్లా వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజల వైద్యం, శస్త్రచికిత్సలకు రూ.508,49,95,571 కోట్లు వెచ్చించింది. 2,48,805 మందికి వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసింది. ఏటా రూ.50 కోట్లకు పైనే నిధులు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేసింది. ప్రతి కుటుంబానికీ రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని వర్తింపజేసి, దీనిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచింది. గుండె, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, క్యాన్సర్ వంటి ఖరీదైన శస్త్రచికిత్సలకు సైతం ఆరోగ్యశ్రీలో చోటు కల్పించింది. గత సీఎం వైఎస్ జగన్ చేపట్టిన సంస్కరణలతో ఖరీదైన వ్యాధులకు సైతం ఉచితంగా చికిత్స చేయించుకునే వెసులుబాటు పేదలకు కలిగింది. బైలాటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్కు రూ.11.97 లక్షలు, ఆల్లోజెనిక్ బోన్మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ (14 ఏళ్లు పైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షలు వెచ్చించేలా ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యానికి ఇబ్బంది లేదు జిల్లాలో 29 ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులు ఈ పథకాన్ని ఆపేశాయి. మిగిలిన ఆస్పత్రుల్లో యథావిధిగా నడుస్తోంది. సేవలు నిలిపివేసినా అత్యవస వైద్యానికి వచ్చే రోగులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. సేవలు ఆపేసిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందుతున్నాయి. – డాక్టర్ ప్రియాంక, జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊపిరి పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వినూత్న రీతిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. ఆయన తనయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకంలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులు, ప్రొసీజర్లతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్థానం 3,275 వ్యాధులు, ప్రొసీజర్లు విస్తరించారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలు, డ్యూటీ డాక్టర్, స్పెషలిస్టు వైద్యులతో పాటు నర్సు, పారామెడికల్ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. రోగులకు నాణ్యమైన మందులు, పౌష్టికాహారం అందజేసేలా చూశారు. ఆరోగ్య మిత్రతో కూడిన హెల్ప్డెస్క్ పక్కాగా ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని వ్యాధులకు చికిత్సను నిరాకరిస్తే ఆయా నెట్వర్క్ ఆస్పత్రులపై చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందించారు. ఆగిన ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.150 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాలంటూ యాజమాన్యాల విన్నపాలు స్పందించని సర్కారు.. నిలిచిన వైద్య సేవలు చికిత్సకు వచ్చి నిరాశతో వెనుదిరిగిన రోగులు ఇప్పటికే ఈహెచ్ఎస్ సేవల నిలిపివేత అధికారుల లెక్కలివీ.. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ అందిస్తున్న ఆస్పత్రులు 81 వీటిలో ప్రభుత్వ ఆస్పత్రులు 35 ప్రైవేటువి 46 వీటిలో సేవలు పూర్తిగా నిలిచినవి 29 అడపాదడపా సేవలు అందిస్తున్నవి 17 జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ లబ్ధి వివరాలు సంవత్సరం వైద్యం వెచ్చించిన చేయించుకున్న మొత్తం వారు (రూ.కోట్లు) 2019–20 25,750 62.71 2020–21 29,602 62.15 2021–22 47,039 89.48 2022–23 1,46,414 294.15 -
వెంకన్న పెళ్లికొడుకాయనె
ఘనంగా ప్రారంభమైన కోనేటి రాయుడి కల్యాణోత్సవాలు కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిచెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాలు సోమవారం కన్నుల పండువగా ప్రారంభమయ్యా యి. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో కల్యాణ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు, భక్తుల కు సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా సుందరంగా అలంకరించారు. బొబ్బర్లంక – రావులపాలెం ప్రధాన రహదారి నుంచి వాడపల్లికి వెళ్లే రహదారుల ముఖద్వారాల్లో కల్యాణోత్సవ స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు, ఆలయ అర్చకులు స్వామివారిని వేకువ జామున పెండ్లి కుమారునిగా అలంకరించారు. వేద పండితుల మంత్రాలు, మేళతాళాల నడుమ ఈ వేడుక నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వారి గోత్ర నామాలతో పెండ్లి కుమార్తెలుగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6–15 గంటలకు స్వామివారి ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్డీఓ పీ శ్రీకర్, సీఐ సీహెచ్ విద్యాసాగర్ కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. నేడు స్వామివారి కల్యాణోత్సవం వాడపల్లి క్షేత్ర ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాన్ని మంగళవారం రాత్రి వైభవంగా నిర్వహించనున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధ్యాహ్నం 3గంటలకు స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నామన్నారు. ప్రజాప్రతినిదులు, నాయకులు, ఽఅధికారులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. రథోత్సవం, కల్యాణ వేడుకల్లో భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. -
గల్లంతైన యువకుడి మృతదేహం గుర్తింపు
రావులపాలెం: స్నేహితుల తో సరదాగా గోపాలపురం కాలువ వద్ద స్థానానికి వెళ్లి గల్లంతయిన యువకుడు షేక్ ఖాదర్ (21) మృత దేహం సోమవారం సంఘటన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో కాలువలో గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం గోపాలపురం ఆరుమామిళ్ల గట్టు రేవు వద్ద స్నానానికి దిగిన ఖాదర్ గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం రేవుకు 100 మీటర్ల దూరంలో మృతదేహం తేలడంతో ఖాదర్ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని కొత్తపేట ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు టౌన్ సీఐ శేఖర్బాబు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించగా స్థానిక నెక్కంటి కాలనీలో ఉన్న బరియల్ గ్రౌండ్లో ఖననం చేసినట్టు బంధువులు తెలిపారు. బాయిలర్ డ్రైన్లో పడి వ్యక్తి మృతి పెద్దాపురం: బాయిలర్ డ్రైన్లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానిక వాలు తిమ్మాపురం రహదారిలో ఉన్న పట్టాభి ఆగ్రో ఫుడ్స్ రైస్ మిల్లులో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నగరానికి చెందిన వేముల శివ (29) ఫ్యాక్టరీకి పనిమీద వచ్చి, ప్రమాదవశాత్తూ కాలుజారి కాలువలో పడిపోయాడు. ఇంతలో బాయిలర్ నుంచి విడుదలైన వేడినీటి కారణంగా అతడు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ మౌనిక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వినియోగదారుల హక్కుల రక్షణకు ఆసరా
● తూర్పు గోదావరి, కోనసీమ ఇన్చార్జిగా శ్రీహరి ప్రసాద్ ● ఫౌండర్ హబీబ్ సుల్తాన్ అలీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వినియోగదారుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం ఆసరా పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ చెప్పారు. భారతదేశం అంతటా 10కి పైగా రాష్ట్రాలలో ఒకే లక్ష్యంతో అంకితభావంతో ఆసరా పనిచేస్తోందన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం తమ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. 2016లో ప్రారంభమైన తమ సంస్థ 2,500 అవగాహన సదస్సులు నిర్వహించిందని చెప్పారు. వినియోగదారుల తరఫున కోర్టుల్లో కేసులు దాఖలు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నామన్నారు. అయితే ఈ మధ్య స్టేషనరీ వంటి ఖర్చుల కోసం అతి తక్కువ ఫీజు తీసుకుని కేసులు దాఖలు చేస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల ఆసరా ఇన్చార్జిగా శ్రీహరి రాజూను నియమించినట్లు సుల్తానా అలీ తెలియజేస్తూ, ఆయనకు నియామక పత్రం అందించి, ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీహరి రాజు మాట్లాడుతూ వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించి, వారు మోసపోకుండా చూస్తామని చెప్పారు. అడ్వకేట్స్ కానివాళ్లను కూడా ఇందులో సభ్యులుగా వేసుకుని, కేసులు దాఖలు చేయిస్తున్నామని అలీ చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసు, ఈశ్వరాచారి, రామలింగారెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 19,500 గటగట (వెయ్యి) 17,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 18,500 గటగట (వెయ్యి) 16,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పట్టా పండగకు సన్నాహాలు
● జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ ● ఏప్రిల్ 15వ తేదీ దరఖాస్తులకు తుది గడువు ● గవర్నర్కు ఆహ్వానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులు ఒరిజనల్ డిగ్రీ కోసం ఏప్రిల్ 15 తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ వెబ్సైట్లో సూచించారు. గత మార్చి 1వ తేదీన నోటిఫికేషన్ జారీచేయగా తుది గడువు మార్చి 30వ తేదీతో ముగియగా అభ్యర్థులు తక్కువగా దరఖాస్తు చేసుకోవడంతో మరో 15రోజులపాటు ఏప్రిల్ 15వ తేదీ వరకూ గడువు పెంచారు. దీంతో ప్రముఖుల చేతుల మీదుగా సంప్రదాయ వస్త్రధారణలో పట్టా(ఒరిజనల్ డిగ్రీ) అందుకోవాలని కలలు కంటున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి కలిపి స్నాతకోత్సవం నిర్వహిస్తుండేవారు. ఈ విధానానికి స్వస్తిపలికి ప్రతి ఏడాది వేడుకలు నిర్వహించాలనే ఉద్దేశంతో అప్పటి వీసీ ప్రసాదరాజు 2022లో 8వ కాన్వోకేషన్, 23లో 9, గత ఏడాది జనవరి 31వ తేదిన 10వ కాన్వోకేషన్ నిర్వహించారు. అప్పటి వరకూ పెండింగ్లో ఉన్న పట్టాలనీ ఈ కాన్వోకేషన్లో జారీ చేశారు. ఇప్పుడు నిర్వహించే వేడుకలకు సంబంధించి 2023–24 లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే వీరికి కులపతి హోదాల గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై విద్యార్థులకు అందజేస్తారు. వేడుకల నిర్వహణ తేదీ, అనుమతికి ఇప్పటికే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ గవర్నర్ను గత నెల 17వ తేదీన కలిసి విన్నవించారు. దరఖాస్తు చేసుకోవాలి జేఎన్టీయూకే అనుబంధ కళాశాలలలో ఇంజినీరింగ్ లేదా ఫార్మా, మేనేజ్మెంట్ విద్యను పూర్తిచేసిన అభ్యుర్థులు ఒరిజనల్ డిగ్రీ (పట్టా) కోసం బీటెక్, ఎంటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు గడవు ఏప్రిల్ 15వ తేది వరకూ పెంచాం. గవర్నర్ అనుమతి వచ్చిన వెంటనే తేదీ ప్రకటిస్తాం. – ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్, జేఎన్టీయూకే -
రూ.10 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్ఎల్ వైద్య కళాశాల సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షలు విలువ చేసే రేషన్ బియ్యాన్ని సోమవా రం పట్టుకున్నామని స్థానిక డిప్యూటీ తహసీల్దారు (పౌరసరఫరా లు) గొలుగూరి బాపి రాజు తెలిపారు. మూడు వాహనాలలో తరలిస్తున్న ఈ బియ్యాన్ని వాహనాలతో సహా స్వాధీన పర్చుకుని, కేసులు నమోదు చేసేందుకు రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గొల్లప్రోలుకు చెందిన ఆకుల స్వామి, పె ద్దాపురం మండలం గోరంట్లకు చెందిన కోన బాలరాజు, కోరుకొండ అచ్చిరాజు తమ వాహనాలలో ఈ బియ్యాన్ని తరలిస్తూ పట్టుబడ్డారు. వారిపై కూడా కేసు లు నమోదు చేయడంతోపాటు ఈ అక్రమ దందాకు ప్రధాన కారకులు ఎవరనే విషయమై ఆరా తీస్తున్నామని చెప్పారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.10 లక్షలు కాగా, వాహనాల విలువ రూ.20 లక్షలు పైబడి ఉంటుందన్నారు. -
వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే..
● ముస్లింల అస్తిత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ● జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దేశంలోని సుమారు 22 కోట్ల మంది ముస్లింల అస్తిత్వాన్ని అస్థిరపరిచేలా వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదింపజేసుకుందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు. జాంపేటలోని తన కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు పలకడం ద్వారా దేశంలోని ముస్లింల మేలును కాంక్షించబోమనే విషయాన్ని రుజువు చేశాయని విమర్శించారు. ముస్లింల ఆస్తులను కాజేసే కుట్రలో భాగంగానే ఈ చట్టం తెచ్చారని, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ప్రధాన అజెండా అని ధ్వజమెత్తారు. ఈ చట్టం ముస్లింల షరియత్కు పూర్తి విరుద్ధమన్నారు. ముస్లింల అభివృద్ధికి దానం చేసిన స్థిర, చర ఆస్తులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉంచుకోవాలని, తద్వారా వారిని అణచివేసే లక్ష్యంతోనే ఇలాంటి నల్ల చట్టం తీసుకువచ్చారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26లను అపహాస్యం చేస్తూ ముస్లింలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారన్నా రు. అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకునేలా చట్టంలో ఎలాంటి మార్పూ చేయలేదని, ఇది కేవలం బడాబాబులకు దోచిపెట్టడమేనని ఆరిఫ్ విమర్శించారు. ముస్లింల సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు హాని తలపెట్టే ఎటువంటి చర్యలనూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ఏనాడూ చేపట్టలేదని చెప్పారు. ఎన్ఆర్సీ బిల్లును సైతం రాష్ట్రంలో అమలు చేసేది లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా దేశవ్యాప్తంగా మతసామరస్యాన్ని కాంక్షించే మేధావులు, లౌకికవాదులు ఆయనను ప్రశంసిస్తున్నారని చెప్పారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ క్రాస్ ఓటింగ్ చేసిందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని దేశవ్యాప్తంగా పలువురు ఖండిస్తున్నారని, ఇది టీడీపీ నీచమైన కుట్రగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ముస్లింలకు ఎటువంటి నష్టం జరగనివ్వనని ఇఫ్తార్ విందులో హామీ ఇచ్చి, రెండు రోజులు తిరగక ముందే వక్ఫ్ సవరణ చట్టానికి చంద్రబాబు మద్దతు పలికారని, చెప్పిన మాటపై ఎప్పుడూ నిలబడరనే విషయాన్ని మరోసారి రుజువు చేశారని దుయ్యబట్టారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. టీడీపీలోని ముస్లిం నాయకులు ఇప్పటికై నా ఆత్మపరిశీలన చేసుకుని, వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, దీనికోసం పార్టీలకతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉండాలని ఆరిఫ్ పిలుపునిచ్చారు. -
ఆత్మహత్య కాదు హత్యే అంటూ నిరసన
పోలీసుల అదుపులో 17 మంది సీతానగరం: మండలంలోని రాపాక పంచాయతీ పరిధిలోగల శ్రీరామనగరంలోగల రాజుగారి కల్యాణ మండపంలో ఆదివారం రామచంద్రపురానికి చెందిన వేమగిరి సునీల్ (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోలేదని, అది హత్యేనంటూ బంధువులు, స్నేహితులు రాజుగారి గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద నిరసన చేపట్టారు. సోమవారం రాజమహేద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సునీల్ మృతదేహం అంబులెన్స్లో తీసుకువచ్చి ఫంక్షన్ హాల్ వద్ద నిరసన తెలిపారు. మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి కిందకు దించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఫంక్షన్ హాల్ యజమాని రాజు, హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళ సునీల్ను హత్య చేశారని, వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. కోరుకొండ ఇన్చార్జి సీఐ, రాజమహేంద్రవరం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ బాలసౌరి అక్కడికి వచ్చారు. సీతానగరం – రాజమహేంద్రవరం రోడ్డుపై ధర్నాకు ప్రయత్నించగా ఎస్సై డి.రామ్కుమార్ తన సిబ్బందితో అడ్డుకుని 17 మందిని అదుపులోకి తీసుకుని కోరుకొండ తరలించారు. ఇన్వెష్టిగేషన్ ఆఫీసర్ బాలసౌరి విలేకరులతో మాట్లాడుతూ మృతుడు సునీల్కు వరుసకు మరదలైన మహిళ హైదరాబాద్ నుంచి ఆదివారం ఉదయం ప్రయివేట్ బస్లో సీతానగరం చేరుకుందని, రాజు గారి గార్డెన్ ఫంక్షన్ హాల్లో గది తీసుకున్నారన్నారు. సాయంత్రం 4 గంటలకు మహిళ బాత్రూమ్కు వెళ్లి తిరిగి వచ్చే సరికి సునీల్ ఉరివేసుకుని ఉన్నాడని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు వ్యాన్
పిఠాపురం: పాఠశాలకు విద్యార్థులను తీసుకెళుతున్న స్కూలు వ్యాన్ ప్రమాదానికి గురై పంట కాలువలోకి దూసుకెళ్లడంతో ఏడుగురు విద్యార్థులు, డ్రైవరుకు గాయాలయిన ఘటన గొల్లప్రోలు మండలం చెందుర్తిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గొల్లప్రోలుకు చెందిన ఒక ప్రైయివేటు స్కూలు వ్యాన్ సోమవారం ఉదయం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో విద్యార్థులను ఎక్కించుకుని గొల్లప్రోలు బయలుదేరింది. గ్రామ శివారుకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోవడంతో స్కూలు వ్యాన్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో వ్యాన్ పంట కాలువలో తిరగబడడంతో వ్యాన్లో ఉన్న జి.హర్షిత, జి.అపర్ణ, జి.సిద్ధు, జి.ధరణి, కె.భార్గవ్, కె.హాసిని, నిహారిక, వ్యాన్ డ్రైవరు వెంకటేష్కు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని చూసిన పక్కనే పంట పొలాల్లో పనులు చేసుకుంటున్న రైతులు వ్యాన్లో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీశారు. వారిని పిఠాపురంలో ఒక ప్రైయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. వ్యాన్ డ్రైవరుకు కాలు విరగగా మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై ఎన్.రామకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణంగా చెబుతున్న లారీ ఆపకుండా వెళ్లి పోయినట్లు చెబుతున్నారు. గొల్లప్రోలు పోలీసులు కేసు విచారణ చేపట్టారు. ప్రమాదం జరిగే సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి వేగంగా కాలువలోకి దూసుకెళ్లకుండా డ్రైవరు జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు విద్యార్థులు చెబుతున్నారు. కాలువలో నీరు సైతం తక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు ప్రాణాలతో బయటపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారు. ఢీకొట్టి వెళ్లిపోయిన లారీ ఏడుగురు విద్యార్థులు, డ్రైవరుకు గాయాలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం -
పూర్వ విద్యార్థుల భూరి విరాళం
హెచ్ఎంకు రూ.6లక్షల చెక్కు అందజేత రాయవరం: సుమారు నాలుగున్నర దశాబ్దాల క్రితం చదువుకుని వివిధ రంగాల్లో స్థిరపడిన స్నేహితులంతా తిరిగి అదే చదువులమ్మ చెట్టు నీడకు మరోసారి చేరుకున్నారు. ఇంత స్థాయికి చేరుకోవడానికి కారణమైన పాఠశాల అభివృద్ధికి మిత్రులంతా కలిసి భారీ విరాళాన్ని అందజేశారు. రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 1975–80 బ్యాచ్కు చెందిన విద్యార్థులు సోమవారం పాఠశాల హెచ్ఎం వీఎస్ సునీతకు రూ.6లక్షల చెక్కును అందజేశారు. పూర్వ విద్యార్థులు ఆర్వీవీ సత్యనారాయణచౌదరి, తాడి వెంకటరెడ్డి, కె.సత్యనారాయణరెడ్డి, కె.వెంకటరెడ్డి, ఎం.సూరారెడ్డి తదితరులు పాఠశాల హెచ్ఎంకు చెక్కును అందజేశారు. పూర్వ విద్యార్థి ఆర్వీవీ సత్యనారాయణచౌదరి మాట్లాడుతూ పాఠశాల భవనంలోని ఒక తరగతి గదికి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ సొమ్మును వినియోగించాలని హెచ్ఎం సునీతకు సూచించామన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ వుండవిల్లి రాంబాబు, ఎస్ఎంసీ చైర్మన్ దేవిశెట్టి చిన్ని, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
వేమగిరిలో తిరుమల క్యాంపస్కు భూమి పూజ
కడియం: వేమగిరి జాతీయ రహదారి పక్కనే తిరుమల విద్యాసంస్థల కొత్త ప్రాంగణానికి సోమవారం భూమి పూజ చేసినట్టు సంస్థ చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వేమగిరి చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ డే స్కాలర్ క్యాంపస్ను ప్రారంభిస్తున్నామన్నారు. ఇక్కడ ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు క్లాస్లు నిర్వహిస్తామని, 2026–27 నుంచి అడ్మిషన్లు జరుగుతాయన్నారు. ముందుగా తిరుమలరావు, సరోజినీదేవి దంపతులు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో సంస్థ అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రి..
● వైభవంగా రత్నగిరి రాములోరి కల్యాణం ● పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సత్యదేవుడు, అమ్మవారు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యకల్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదివారం వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు తిలకిస్తుండగా.. రత్నగిరిపై రామాలయం పక్కన వార్షిక కల్యాణ వేదిక మీద.. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకూ ఈ క్రతువును కన్నుల పండువగా దేవస్థానం అర్చకులు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో కల్యాణోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు పండితులు సీతారాములకు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. వధూవరులైన సీతారాములను ఉదయం 7 గంటలకు వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకీపై గ్రామంలో ఘనంగా ఊరేగించారు. అనంతరం సీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదిక మీద ప్రత్యేక సింహాసనంపై సీతారాములను వేద మంత్రోచ్చారణల నడుమ పండితులు వేంచేయించారు. పక్కనే మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను వేంచేయించారు. ఉదయం 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో సీతారాముల కల్యాణోత్సవానికి శ్రీకారం చుట్టారు. సీతారాములకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు పట్టువస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల వంశీకుల విశేషాలతో కూడిన ప్రవరను కల్యాణబ్రహ్మ చామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) వివరించారు. అనంతరం పుణ్యాహవాచనం, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం, యుగఛిత్రాభిషేకం తదితర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. ఉదయం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై అర్చక స్వాములు జీలకర్ర – బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం మాంగల్యసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్టులకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులైన సీతారాములకు పండితులు వేదాశీస్సులు అందజేశారు. సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. నవ వధూవరులు సీతారాములకు పండితులు రాత్రి అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించారు. కల్యాణోత్సవాన్ని దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యశర్మ, రామాలయం అర్చకులు దేవులపల్లి ప్రసాద్, చిట్టిం వాసు, అర్చకులు దత్తు శర్మ, సుధీర్, పవన్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ కొండలరావు పర్యవేక్షించారు. సీతారాముల కల్యాణానంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల నిత్య కల్యాణాన్ని అదే వేదికపై మధ్యాహ్నం 12 గంటల నుంచి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు స్వామివారి నిత్యకల్యాణ మండపంలో నిర్వహిస్తారు. దీనికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అయితే శ్రీరామనవమి నాడు మాత్రం తొలుత సీతారాముల కల్యాణం జరుగుతుంది. -
ముగిసిన రెజ్లింగ్ పోటీలు
రాజానగరం: దివాన్ చెరువులోని ఎస్వీపీవీ కన్వెన్షన్ హాలులో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు ఆదివారం ముగిశాయి. అండర్–15 విభాగంలో విజయవాడ, అండర్–20 విభాగంలో కాకినాడ ఓవరాల్ చాంపియన్షిప్ గెలుచుకున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ రన్నర్స్గా కాకినాడ, విశాఖపట్నం నిలిచాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా నిర్వహించిన ఈ పోటీలకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి 400 మంది వరకూ రెజ్లర్లు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు. విజేతలు ఈ నెల 23న రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐకాన్ చార్టర్ అధ్యక్షుడు టి.రాజా, రాజమహేంద్రవరం అధ్యక్షుడు ఇమ్మని వెంకట్, కార్యదర్శి సురేష్ ఉదయ్గిరి, ప్రోగ్రాం చైర్మన్ కామేశ్వరీదేవి, స్పోర్ట్స్ చైర్మన్ మద్దూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల 7 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాల నిర్వహణ దిశగా అన్నవరం దేవస్థానం అడుగులు వేస్తోంది. శ్రీరామ నవమి పర్వదినమైన ఆదివారం సత్యదేవుని కల్యాణోత్సవాల వాల్ పోస్టర్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఆవిష్కరించారు. మే 7వ తేదీ (వైశాఖ శుద్ధ దశమి) నుంచి మే 13వ తేదీ (వైశాఖ బహుళ పాడ్యమి) వరకూ వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మే 8వ తేదీ (వైశాఖ శుద్ధ ఏకాదశి) రాత్రి 9 గంటల నుంచి సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి దివ్య కల్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. వాల్ పోస్టర్ ఆవిష్కరణలో వేద పండితుడు గొల్లపల్లి ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈలు రామకృష్ణ, నూకరత్నం, ఏఈఓలు కొండలరావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవంలో వినియోగించేందుకు గాను విశాఖ జిల్లా గాజువాకకు చెందిన గుంటపల్లి ప్రసాద్ అరకిలో ముత్యాలను ఈఓ సుబ్బారావుకు అందజేశారు. -
రామాలయానికి వెండి కిరీటాలు
మండపేట: పట్టణంలోని 14వ వార్డు శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైన రామాలయానికి మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ దుర్గారాణి వెండి కిరీటాలు సమర్పించారు. ఆలయంలో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలకు సుమారు రూ.లక్ష విలువైన వెండి కిరీటాలు సమర్పించారు. శ్రీరామ నవమి నాడు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమె దేవతామూర్తులకు కిరీటాలను అలంకరించారు. అనంతరం రాముల వారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. సీతారాముల అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధరం, నాయకులు తాడి రామారావు, శెట్టి నాగేశ్వరరావు, సూరంపూడి సత్యప్రసాద్, పిఠాపురం సత్యనారాయణ, శెట్టిబలిజ సంఘం నాయకులు, మహిళలు, కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. -
రామనామమే రక్షణ కవచం
● శ్రీరాముడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి ● బ్రహ్మంగారి మఠాధిపతి విరజానంద ● వైభవంగా శ్రీరామనవమి శోభయాత్ర ● సుమారు 5 వేల బైక్లతో ర్యాలీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యావత్ మానవాళికీ శ్రీరామ నామం అద్భుతమైన రక్షణ కవచం వంటిదని, ఆ నామం ఉచ్చరిస్తేనే పాపాలు తొలగిపోతాయని వైఎస్సార్ కడప బ్రహ్మం గారి మఠాధిపతి విరజానంద స్వామి అన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం సుమారు 5 వేల బైక్లతో నిర్వహించిన శ్రీరామ శోభాయాత్రను ఆయన పుష్కర ఘాట్ వద్ద ప్రారంభించారు. ఈ యాత్ర త్రీటౌన్ పోలీస్ స్టేషన్, ఆర్యాపురం, పేపర్ మిల్లు, శ్రీరామ నగర్, కోరుకొండ రోడ్డు, కంబాల చెరువు, నందం గనిరాజు జంక్షన్, దానవాయిపేట, ఏవీ అప్పారావు రోడ్డు రామాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, షెల్టాన్ హోటల్, ఆవ వాంబే గృహాలు, తాడితోట, స్టేడియం రోడ్డు, శ్యామలా సెంటర్ మీదుగా తిరిగి పుష్కర్ ఘాట్ వరకూ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ, అందరిలోనూ సోదర భావం వెల్లివిరియాలని, భారతీయ సంప్రదాయాలు, కట్టుబాట్లు అందరికీ తెలిసేలా హిందూ ధర్మం పరిఢవిల్లేలా ఈ శోభాయత్ర శోభాయామానంగా జరిగిందని అన్నారు. ప్రతి పురుషుడూ శ్రీరామచంద్ర ప్రభువుకున్న సుగుణాలను అలవర్చుకోవాలని, అప్పుడే సంపూర్ణ మానవుడు అవుతాడని అన్నారు. దుష్ట శిక్షణార్థం విష్ణుమూర్తే త్రేతాయుగంలో రామునిగా అవతరించి, తన చర్యల ద్వారా మనిషి ఎలా బతకాలో లోకానికి ఆచరించి చూపించాడని అన్నారు. పితృవాక్య పరిపాలకునిగా, ఆదర్శవంతునిగా కీర్తి గడించాడన్నారు. పట్టాభిషేకానికి కొన్ని గంటల ముందు తండ్రి ఆదేశం మేరకు 14 సంవత్సరాల వనవాసం గడపాలని చెబితే.. తండ్రి మాటే వేదవాక్కుగా ఎంతో ఆనందంగా కట్టుబట్టలతో అరణ్యానికి వెళ్లిన త్యాగమూర్తి, సాహసవంతుడు శ్రీరాముడని అన్నారు. అటువంటి త్యాగ గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని కాపాడటం ఉత్తమ పురుషుల లక్షణమని చెప్పారు. అంతకు ముందు రథంపై ఉన్న శ్రీసీతారాముల మూర్తులను ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. రామ నామ జయ మంత్రాన్ని అశేష రామ భక్తులతో పలికించారు. కార్యక్రమంలో శ్రీరామ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది పతివాడ రామరాజు, కార్యదర్శి యడ్లపల్లి, అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ ఆలే శ్యామ్కుమార్, ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తదితరులు పాల్గొన్నారు. -
హెపటైటిస్ హడల్..!
వారం రోజుల్లో పరీక్షలు పూర్తి గ్రామంలో హైపటైటిస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీనిపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నాం. అన్ని రకాల వైద్య సేవలూ అందిస్తున్నాం. వారం రోజుల్లో పరీక్షలు పూర్తి చేస్తాం. – దుర్గారావుదొర, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వైద్యులకు పూర్తి సహకారం కామెర్ల సంబంధిత వ్యాధులు ప్రబలుతూండటంతో గ్రామంలో పారిశుధ్య చర్యలు చేపట్టాం. తాగునీటి నాణ్యతపై మరింతగా దృష్టి సారించాం. వైద్య పరీక్షలకు సహకరించాల్సిందిగా గ్రామస్తులకు అవగాహన కల్పించడంతోపాటు వైద్యులకు అన్ని రకాలుగా సహకరిస్తున్నాం. – మల్లిడి వీరబాబ్జీ, సర్పంచ్, పల్లం, కాట్రేనికోన మండలం ● తల్లడిల్లుతున్న పల్లం గ్రామం ● చురుకుగా వైద్య పరీక్షలు ● అంతకంతకూ పెరుగుతున్న కేసులు ● ఆందోళనలో మత్స్యకారులు సాక్షి, అమలాపురం/కాట్రేనికోన: రోజుల తరబడి సాగుతున్న రక్త పరీక్షలు.. పరీక్షలు జరుగుతున్న కొద్దీ బయటపడుతున్న కామెర్ల సంబంధిత వ్యాధులతో మత్స్యకార గ్రామం పల్లం తల్లడిల్లుతోంది. కాట్రేనికోన మండలం శివారు గోదావరి నదీపాయల మధ్య ఉండే ఈ గ్రామంలో హెపటైటిస్ వ్యాధి ప్రబలడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కామెర్ల సంబంధిత వ్యాధులు గ్రామంలో పెద్ద ఎత్తున వెలుగుచూస్తున్నాయి. గ్రామంలో తొలుత నలుగురు గర్భిణుల్లో కాలేయానికి సంబంధించి వాపు లక్షణాలను గుర్తించారు. వీరు కాకినాడలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలకు వెళ్లిన సమయంలో ఇది బయట పడింది. అక్కడి నుంచి వచ్చిన సమాచారంతో ఇక్కడ కొంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా మరిన్ని కేసులు వెలుగు చూశాయి. దీంతో గ్రామంలో ఉన్న అందరికీ వైద్య పరీక్షలు చేస్తున్నారు. గ్రామంలో మొత్తం 12 వేల వరకు జనాభా ఉండగా, వీరిలో 7,800 మంది వరకూ నివసిస్తున్నారు. మిగిలిన వారు ఇతర ప్రాంతాల్లో వేటకు, ఉద్యోగ, ఉపాధికి వెళ్లారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్ల వయస్సు దాటిన వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకార ఇప్పటి వరకూ 2,281 మందికి పరీక్షలు నిర్వహించగా, వీరిలో హెపటైటిస్–బి సర్ఫేస్ యాంటిజెన్ (హెచ్బీఎస్ఏజీ) 12 మందికి నిర్ధారణ అయ్యింది. హెపటైటిస్–సి వైరస్ (హెచ్సీవీ) తొమ్మిది మందికి పాజిటివ్గా నిర్ధారించారు. గ్రామంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో హైపటైటిస్– ఎ, బి, సి కేసులు వెలుగు చూస్తున్నాయి. శనివారం ఒక్క రోజే 118 మందికి పరీక్షలు నిర్వహించారు. అయితే గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తొలి దశలో చేపట్టిన ర్యాపిడ్ టెస్టులో ఇంతకు రెండు మూడు రెట్లు పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో స్థానికుల్లో ఆందోళన పెరుగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖతో సంబంధం లేకుండా స్థానికంగా వైద్య పరీక్షలు, ఇంజెక్షన్లు చేసేవారు ఒకే సిరంజిని ఎక్కువ మందికి వినియోగించడం, గ్రామంలో మత్స్యకారుల సామూహిక జీవన విధానం వల్ల ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా సంక్రమిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు అప్రమత్తమైనప్పటికీ పెద్ద సంఖ్యలో ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సంక్రమిస్తోంది భావిస్తున్నారు. మరిన్ని పరీక్షలు జరిగితే మరికొంత మందిలో ఈ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశముందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఇక్కడ ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తోంది. అలాగే, వ్యాధి లక్షణాలున్న వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తున్నారు. వారం పది రోజులుగా ఇక్కడ కామెర్లు ప్రబలుతూండగా జిల్లా యంత్రాంగం కేవలం పరీక్షలతో సరిపెడుతోందని, వ్యాధికి సంబంధించిన మందులు వ్యాధిగ్రస్తులకు ఇంకా అందలేదని స్థానికులు చెబుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో పరీక్షలు ముమ్మరం నెలవారీ వైద్య పరీక్షల్లో భాగంగా పల్లం గ్రామంలో కొంత మందికి కాలేయ సంబంధ వ్యాధులైన హెపటైటిస్ బి, సి పాజిటివ్ కేసులు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గత నెల 20న ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ మేరకు కలెక్టరు ఇంటింటా రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ కిట్లతో కాలేయ పరీక్షలు చేయాలని ఆదేశించారు. గత నెల 24న రక్త నమూనాలు సేకరించి, పరీక్షలు చేసేందుకు అవసరమైన ర్యాపిడ్ కిట్లను పల్లం హెల్త్ సెంటర్కు పంపించారు. గత నెల 25 నుంచి వైద్యాధికారుల పర్యవేక్షణలో ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఆరు బృందాలుగా ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించి, ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీ వరకు రక్త నమూనాలు సేకరిస్తామని వైద్యాధికారులు చెబుతున్నారు. గ్రామంలో 18 ఏళ్లు పైబడిన మొత్తం 5,436 మందికి రక్త నమూనాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు 2,318 మంది రక్త నమూనాలు సేకరించి ర్యాపిడ్ టెస్ట్లు చేయగా హెపటైటిస్–బి 223, హెపటైటిస్–సి 80 చొప్పున కేసులు నమోదయ్యాయి. కాట్రేనికోన వైద్యాధికారి లిఖిత మాట్లాడుతూ, పాజిటివ్ వచ్చిన వారి రక్త నమూనాలను అదనపు పరీక్షల కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి పంపిస్తామని చెప్పారు. మరిన్ని పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ కేసులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న యాంటీ వైరల్ మాత్రలు అందచేస్తామన్నారు. -
జగ్జీవన్రామ్కు ఘన నివాళి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా పలువురు ఘనంగా నివాళి అర్పించారు. స్థానిక జాంపేట చర్చి సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే వ్యక్తిగా జగ్జీవన్రామ్ చేసిన కృషిని కొనసాగిస్తూ, మరికొందరికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎంఎస్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. గామన్ బ్రిడ్జిపై నేటి నుంచి వన్ వే కొవ్వూరు: అఖండ గోదావరి నదిపై రాజమహేంద్రవరం రూరల్ కాతేరు – కొవ్వూరు మధ్య ఉన్న రెండు వరుసల గామన్ ఇండియా బ్రిడ్జిపై ఆదివారం నుంచి వన్వే అమలు చేస్తున్నారు. వార్షిక మరమ్మతుల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ వరకూ ఒకవైపు ఉన్న బ్రిడ్జి పైనుంచే రెండువైపుల వాహనాలనూ అనుమతిస్తామని టోల్ప్లాజా మేనేజర్ రాజీవ్సింగ్ శనివారం తెలిపారు. కొవ్వూరు నుంచి కాతేరు వైపు వెళ్లే వాహనాలను రెండో లైన్ మీదుగా అనుమతిస్తామన్నారు. ఇప్పటి వరకూ విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న వాహనాలు ఒక బ్రిడ్జిపై, కొవ్వూరు వైపు నుంచి వెళ్లే వాహనాలు మరో వంతెనపై ప్రయాణిస్తున్నాయి. తాజా వన్వే అమలు నేపథ్యంలో ఒక్క వంతెన పైనే రెండువైపుల వాహనాలనూ అనుమతిస్తారు. రెండో వంతెనకు మరమ్మతులు నిర్వహిస్తారు. వన్వేకు వాహనదారులు సహకరించాలని రాజీవ్సింగ్ కోరారు. 8 నుంచి ఇండో – అమెరికా సైనిక విన్యాసాలు కాకినాడ రూరల్: భారత్ – అమెరికా దేశాల సైనిక దళాల సంయుక్త విన్యాసాలకు కాకినాడ సాగర తీరం మరోసారి వేదిక కానున్నది. ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, పరసర్ప నైపుణ్యం పెంపొందించుకునే లక్ష్యంతో టైగర్ ట్రయాంఫ్–2025 పేరిట 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరగనున్నాయి. ఈ నెల 1న విశాఖ సాగర తీరంలో ఈ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఈ నెల 8 నుంచి కాకినాడ తీరంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. విన్యాసాలు ఈ నెల 13న కాకినాడలో ముగియనున్నాయి. తూర్పు నౌకాదళంతో పాటు ఆర్మీ, ఎయిర్ఫోర్స్ బలగాలు, అమెరికా సైనిక దళాలు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. కాకినాడ సూర్యారావుపేటలోని నేవల్ ఎన్క్లేవ్ వద్ద ఇరు దేశాల ఉమ్మడి విన్యాసాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖ నుంచి వచ్చిన నావికా దళాలు గుడారాలు ఏర్పాటు చేసుకుని తమ పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం తూర్పు నౌకాదళ పరిధిలోని విశాఖ, కాకినాడ తీర ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఐఎన్ఎస్ జలాశ్వ, యూఎస్ఎస్ కామ్స్టాక్ ద్వారా ఇండో, అమెరికా నావికా దళాలు విన్యాసాలు కొనసాగిస్తున్నాయి. కిటకిటలాడిన శృంగార వల్లభుని ఆలయం పెద్దాపురం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయ శనివారం కిటకిటలాడింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా ఆలయానికి రూ.3,25,934 ఆదాయం సమకూరిందని ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. -
పాస్టర్ ప్రవీణ్ది హత్యేనన్నది నా నమ్మకం
● అనుమానం వ్యక్తం చేస్తే కేసు పెట్టారు ● మాజీ ఎంపీ హర్షకుమార్రాజమహేంద్రవరం సిటీ: పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యేనన్నది తన నమ్మకమని, అలా కాదని నమ్మకం కలిగించాల్సింది పోలీసులేనని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ కేసులో అయినా మూడో రోజు పోస్టుమార్టం నివేదిక ఇవ్వాల్సి ఉందని, అటువంటిది పాస్టర్ ప్రవీణ్ మృతి చెంది 14 రోజులయినా ఇప్పటి వరకూ పోస్ట్మార్టం నివేదిక బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దీనికి సీఎం చంద్రబాబు, పోలీసులు బాధ్యత వహించాలన్నారు. ఇదంతా చూస్తూంటే హత్యను ప్రమాదంగా చూపాలనే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. పోస్టుమార్టం నివేదిక ఎందుకు రావడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రవీణ్ మృతదేహానికి రీ పోస్ట్మార్టం చేయించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశానని, ఈ నేపథ్యంలోనే పోస్ట్మార్టం నివేదిక బయట పెట్టకుండా వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. ప్రవీణ్ మృతిపై వ్యక్తమవుతున్న అనుమానాలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. పోలీసులు ఎంత త్వరగా ప్రెస్మీట్ పెడితే అంత మంచిదని హితవు పలికారు. ప్రవీణ్ మద్యం కొనుగోలు చేసినవి వీడియోలు ఫేక్ అని ఐజీ స్వయంగా చెప్పారని, వాటిని ఎవరు తయారు చేసి, విడుదల చేశారో ఎందుకు కనిపెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రవీణ్ మృతిని తొలి నుంచీ యాక్సిడెంట్గానే రుజువు చేయాలని చూస్తున్నారన్నారు. అనుమానం వ్యక్తం చేస్తే తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. ప్రవీణ్ మరణం విషయంలో నిజం బయటకు రావాలన్నానే తప్ప తాను ఏ మతం పైనా నిందలు వేయలేదని అన్నారు. అన్ని మతాలనూ ఆచరించే సెక్యులర్ భావాలుఉన్న కుటుంబం తమదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న దర్యాప్తుపై ప్రవీణ్ భార్య జెస్సికా నమ్మకం ఆమె ఇష్టమని, హత్య చేశారన్నదే తన నమ్మకమని హర్షకుమార్ పునరుద్ఘాటించారు. హర్షకుమార్పై కేసు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మాజీ ఎంపీ హర్షకుమార్పై కేసు నమోదు చేసినట్లు రాజానగరం పోలీసులు శనివారం వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 196, 197 కింద కేసు నమోదు చేశారు. ప్రవీణ్ పగడాలను హత్య చేసి పడేశారని, కేసును పోలీసులు పక్కదోవ పట్టిస్తున్నారని హర్షకుమార్ ఇటీవల ఆరోపించారన్నారు. దీనిపై విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలని ఆయనకు నోటీసులు ఇచ్చామన్నారు. విచారణకు హాజరు కాకపోగా తిరిగి అవే ఆరోపణలు చేయడంతో తాజాగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
నచ్చిన చోట ధాన్యం అమ్ముకోవచ్చు
ఉండ్రాజవరం: ధాన్యానికి కనీస మద్దతు ధర కంటే అధికంగా లభిస్తే, రైతులు తమకు నచ్చిన చోట అమ్ముకోవచ్చని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడుతో కలసి మోర్త గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. తొలుత రైతు సేవా కేంద్రం వద్ద మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, రబీ ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచామన్నారు. ధాన్యం తేమ శాతం విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, ఎలా ఉన్నా సేకరించాలని అధికారులకు సూచించారు. నాణ్యత లేని సంచులు ఇవ్వరాదన్నారు. ఆన్లైన్లో ధాన్యం కొనుగోలుకు స్లాట్ బుకింగ్ విధానం ప్రవేశపెట్టారన్నారు. ఇందులో భాగంగా రైతులు ఇంట్లోనే కూర్చుని తమ వాట్సాప్ నుంచి 73373 59375 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే కావాల్సిన సమాచారం, సమస్యకు పరిష్కరం లభిస్తాయని మంత్రి చెప్పారు. జేసీ చిన్నరాముడు మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు మిల్లర్లు సరఫరా చేసే గోనె సంచులు నాణ్యతగా ఉండాలనే ఉద్దేశంతో వాటిపై ఆయా మిల్లర్ల క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రాణి సుస్మిత, జిల్లా ఇన్చార్జి పౌర సరఫరాల అధికారి ఎస్.భాస్కరరెడ్డి, తహసీల్దార్ పీఎన్డీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో ఒత్తిడికి కళ్లెం
రాజానగరం: క్రీడల ద్వారా మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు శరీరదారుఢ్యాన్ని పొందవచ్చని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలను దివాన్ చెరువులోని ఎస్వీపీవీ కన్వెన్షన్ హాలులో శనివారం ఆయన ప్రారంభించారు. అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎలీషారావు మాట్లాడుతూ, ఒకప్పుడు రాజమహేంద్రవరానికి చెందిన మాదిరెడ్డి చెన్నకేశవరావు కుస్తీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ చాంపియన్ అయ్యారని గుర్తు చేశారు. తాలింఖానాలు ఉండటంతో ఆ రోజుల్లో చాలామంది కుస్తీ క్రీడాకారులుండేవారన్నారు. తిరిగి అటువంటి వాతావరణం తీసుకువచ్చే విధంగా పాఠశాలల్లో తాలింఖానాలు ఏర్పాటు చేసి, ఆసక్తి ఉన్న విద్యార్థులను మంచి రెజ్లర్లుగా తీర్చిదిద్దుదామని అన్నారు. అండర్–15, అండర్–20 బాలుర, బాలికల విభాగాల్లో జరుగుతున్న ఈ కుస్తీ పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 350 మంది రెజ్లర్లు హాజరయ్యారు. ఐకాన్ చార్టర్ అధ్యక్షుడు టి.రాజా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ఏపీ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు, కార్యదర్శి వెంకట రమణ, ఐకా న్స్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు ఇమ్మని వెంకట్, కార్యదర్శి సురేష్ ఉదయగిరి పాల్గొన్నారు. -
ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా విజయ రెడ్డి
అమలాపురం రూరల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అమలాపురం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 4వ తేదీన కాకినాడ వీపీసీ మీటింగ్ హాల్లో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ ఆఫీసర్స్ సర్వీస్ అసోసియేషన్ ఎన్నికలు డాక్టర్ కీర్తి రామకృష్ణ అధ్యక్షతన జరిగాయి. అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్ బాలచంద్ర యోగేశ్వర్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ ఎల్.విజయ రెడ్డి ఎన్నికయ్యారు. విజయ రెడ్డిని జిల్లా పశువైద్య అధికారి కె.వెంకట్రావు, ఉప సంచాలకులు కర్నీడీ మూర్తి, వైద్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. పేపరుమిల్లు ఉద్యోగి అదృశ్యం రాజమహేంద్రవరం రూరల్: స్థానిక హుకుంపేటలోని అత్తారింటి నుంచి తన సొంతిల్లు ఉన్న కాతేరులోని కంఠమణివారి వీధికి వెళ్లిన పెనుమాక సునీల్కుమార్ కనిపించడం లేదని అతని భార్య పెనుమాక మాణిక్యం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం స్థానిక పేపర్ మిల్లులో ఉద్యోగం చేస్తున్న పెనుమాక సునీల్కుమార్ ఈ నెల 3వ తేదీ సాయంత్రం 5.30 గంటల సమయంలో హుకుంపేటలోని జనచైతన్య లే అవుట్లోని అత్తగారింటి నుంచి ఏపీ 39 ఎంపీ 3018 నెంబరు రాయల్ ఎన్ఫీల్డ్పై బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదని బొమ్మూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాణిక్యం పేర్కొంది. ఈ మేరకు బొమ్మూరు ఎస్సై సీహెచ్వీ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్కుమార్ ఆచూకీ తెలిసినా, మోటారు బైక్ ఆచూ కీ తెలిసినా బొమ్మూరు ఇన్స్పెక్టర్ 94407 96533, 94911 22811 ఫోన్ నెంబరులో తనకు తెలియజేయాలని ఎస్సై రమేష్ కోరారు. 05 ఎఎంపీ 252: డాక్టర్ విజయ రెడ్డిని అభినందిస్తున్న వైద్యులు ఉద్యోగులు -
తవ్వినదే మృత్యు కుహరమైంది
కపిలేశ్వరపురం: కూటమి నేతల ఇసుక దాహానికి నిండు ప్రాణం బలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక ర్యాంపు వద్ద గోదావరి నదిలోకి స్నానానికి దిగిన యువకుడు, కొత్తపేట మార్కెట్ వీధికి చెందిన మాంసం విక్రయ వ్యాపారి రొట్టా దుర్గాప్రసాద్ (21) మృతి చెందాడు. దుర్గాప్రసాద్, మరో నలుగురు యువకులు శనివారం గోదావరి నదిలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో ఇసుక తవ్విన లోతైన గుంతలో దుర్గాప్రసాద్ గల్లంతయ్యాడు. సమాచారం అందుకొన్న రెవెన్యూ అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. వీఆర్ఓ వెంకటేశ్వరరావు, ఎస్సై డి.రవికుమార్ ఘటనా స్థలంలో శవపంచనామా ప్రక్రియ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతదేహాన్ని తరలించడానికి వీలులేదంటూ మృతుని బంధువులు, కొత్తపేట మార్కెట్ వీధికి చెందిన వారు నిరసన తెలిపారు. ఇసుక ర్యాంపు వద్ద లోతైన గుంతలే దుర్గాప్రసాద్ మృతికి కారణమని, ప్రభుత్వం బాధ్యత తీసుకొని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకూ మృతదేహాన్ని తరలించనివ్వబోమంటూ రాత్రి కూడా నిరసన కొనసాగించారు.కూటమి నేతల ఇసుక దాహం ప్రమాదభరితంప్రభుత్వ ఇసుక విధానం గ్రామానికి చెందిన కూటమి నేతలకు కాసులు కురిపించేదిగా ఉంది. దాంతో నిబంధనలను తుంగలోకి తొక్కుతూ విచ్చలవిడిగా గ్రామానికి చెందిన కూటమి నేతల ప్రోద్బలంతో అక్రమంగా ఇసుక తవ్వి సొమ్ము చేసుకున్నారు. ఈ తవ్వకాలతో ర్యాంపు వద్ద లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఇది తెలియని వారు స్నానాలకు దిగుతూండగా స్థానికులు చూసినప్పుడు దిగవద్దంటూ ఇసుక గుంతల ప్రమాదంపై హెచ్చరిస్తున్నారు. అలా సాధ్యం కాని పరిస్థితిలోనే దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తూ నదిలో గల్లంతై మృత్యువాత పడ్డాడు. ర్యాంపులో అక్రమంగా రాత్రింబవళ్లు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారంటూ స్థానిక ప్రజాప్రతినిధులు గతంలో జిల్లా కలెక్టర్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలపై కొద్ది రోజులు ఇసుక తవ్వకాలను నిలిపివేశారు. తర్వాత తిరిగి కొనసాగించారు. -
క్రీడాకారులను తయారుచేద్దామా?
● కోచ్ కావాలనుకునేవారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్న క్రీడాప్రాధికార సంస్ధ ● ఈ నెల 14 తుది గడువు నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటి): క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించడమే కాదు.. ఆయా స్థాయిల్లో క్రీడాకారులను తయారు చేసేందుకు, వారికి తర్ఫీదు ఇచ్చేందుకు భారత క్రీడాప్రాధికార సంస్థ అవకాశం కల్పిస్తోంది. క్రీడా శిక్షకుడిగా ఎదగాలని, పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని భావిస్తున్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ ఓ వేదికను ఏర్పాటు చేసింది. ఇది వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి చాలా మంది శిక్షణను పూర్తి చేసుకుని ధ్రువపత్రాలు సాధించారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో 23 క్రీడాంశాల్లో ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇంటర్మీడియెట్, ఆపై.. ఇంటర్మీడియెట్, ఆపై ఉత్తీర్ణత సాధించి 20 నుంచి 42 ఏళ్లలోపు అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. జిల్లాస్థాయి చాంపియన్ షిప్ పోటీల్లో తొలి మూడు స్థానాలు, రాష్ట్ర స్థాయి ఆలిండియా, వర్సిటీ చాంపియన్ షిప్, జోనల్ ఇంటర్ యూనివర్శిటీ స్థాయి పోటీలలో ప్రాతినిధ్యం, ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలలో జూనియర్, సీనియర్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. ఏయే అంశాల్లో .... సైక్లింగ్, క్రికెట్, ఫెన్సింగ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్బాల్, హాకీ, జుడో, కబడ్డీ, ఖోఖో, రోయింగ్, సాఫ్ట్బాల్, షూటింగ్, స్విమ్మింగ్, తైక్వాండో, టేబుల్టెన్నిస్, లాన్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషూ, యోఆ, త్రోబాల్ తదితర క్రీడాంశాలుంటాయి. శిక్షణ కేంద్రాలు క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడ ఆధారంగా శిక్షణ కేంద్రాన్ని కేటాయిస్తారు. వారు యూనిఫాంతో పాటు సాధారణ దుస్తులు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలా, కర్ణాటక రాజధాని బెంగళూరు, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలలో ఎన్ఎస్ఎన్ఐఎస్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. మే 6 నుంచి జూలై 2 వరకు శిక్షణ... ఆరు వారాల సర్టిఫికెట్ కోర్సులో 30 రోజులు థియరీ, 14 రోజులు ప్రాక్టికల్స్ ఉంటాయి. మే 6 నుంచి జూలై 2 వరకు ఎంపికై న అభ్యర్థులకు శిక్షణ ఉంటుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఈనెల 14. మంచి అవకాశం క్రీడారంగంపై ఆసక్తి ఉన్న వారి కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ మంచి అవకాశం కల్పిస్తోంది. ఆరు వారాల పాటు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చి వారికి శిక్షకులుగా గుర్తింపు ఇవ్వనుంది. వివరాలకు 89196 42248 నెంబురులో సంప్రదించండి. – శ్రీనివాస్ కుమార్, డీఎస్డీఓ -
రారండోయ్ రాములోరి కల్యాణానికి..
● సత్యదేవుడు అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా ● వధూవరులైన సీతారాములు ● పసుపు దంచిన ముత్తైదువలు ● రత్నగిరి క్షేత్ర పాలకుడు సీతారాముని కల్యాణం నేడు అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడైన శ్రీరాముని ఆలయంలో నవమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. చైత్ర శుద్ధ అష్టమి శనివారం సత్యదేవుడు, అనంతలక్ష్మి, సత్యవతీదేవి అమ్మవార్లు పెళ్లిపెద్దలుగా రాగా సాయంత్రం నాలుగు గంటలకు వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వధూవరులుగా తీర్చిదిద్దారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు నూతన పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ముత్తైదువులతో పాటు ఈఓ సుబ్బారావు కొంతసేపు పసుపు దంచారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వేదపండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, రామాలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. నేడు సీతారాముల కల్యాణం సీతారాముల కల్యాణాన్ని ఆదివారం ఉదయం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఏడు గంటలకు సీతారాములను వెండి హనుమద్వాహనంపై, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని పల్లకీ మీద గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం రత్నగిరి రామాలయం వద్ద వార్షిక కల్యాణవేదికపై ఉదయం పది నుంచి ఒంటి గంట వరకూ సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో మాంగల్యధారణ జరుగుతుంది. అనంతరం భక్తులకు ప్రసాదం, వడపప్పు పానకం పంపిణీ చేస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు రోజుకొక వేడుకతో శ్రీరామ నవమిని తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి ఏడు గంటలకు రామాలయంలో జరిగే శ్రీసీతారాముల శ్రీపుష్పయోతోత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
జగన్మోహనం.. శివకేశవ క్షేత్రం
● భక్తులను ఆకట్టుకునే ద్విముఖ రూపాలు ● కోరిన కోర్కెలు నెరవేర్చే దివ్య స్వరూపం ● ప్రపంచ ప్రసిద్ధి చెందిన ర్యాలి క్షేత్రం ● నేటి నుంచి కళ్యాణమహోత్సవాలు కొత్తపేట: ముందు పురుషరూపం, వెనక సీ్త్ర రూపంతో ఏకశిలలో జగన్మోహినీ, విష్ణువు సాక్షాత్కరించే అద్భుత క్షేత్రం ఆత్రేయపురం మండలం ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం. అణువణువునా ఆధ్యాత్మికత ఉట్టిపడే క్షేత్రం ర్యాలి. ఈ క్షేత్రంలో ఈ నెల 6 నుంచి 13 వరకూ స్వామివారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం ఆరో స్థానాన్ని దక్కించుకని ఖ్యాతికెక్కింది. ఈ క్షేత్రంలో ముందు భాగం కేశవుని రూపం, వెనుక జగన్మోహినీగ స్వయంభూగా అవతరించారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వపాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం. ఏకశిలా విగ్రహం ఉన్న ఈ ఆలయంలో అణువణువునా ఉన్న అద్భుతాలు భక్తి భావాలను పెంపొందిస్తాయి. ఈ ఆలయంలో భక్తులందకీ గర్భాలయ ప్రవేశం ఉండటం విశేషం. అంతే కాక ఈ ఆలయానికి ఎదురుగానే పడమర వైపు ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం ఉండటం ఒక విశేషం. కాగా శివాలయంలో నీరు ఇంకి పోవడం, శ్రీజగన్మోహునుడి ఆలయంలో స్వామి వారి పాదముల నుంచి నిరంతరం నీరు (గంగ) ఉద్భవించడం సృష్టి రహస్యాలుగా చరిత్ర చెప్తోంది. ఆలయ విశిష్ట చరిత్ర ఈ ఆలయ ప్రత్యేకతలకు తగినట్లే ఆ దైవం వెలిసిన విధానం కూడ ఒక చరిత్ర సంతరించుకుంది. ఈ ఆలయంలో దైవం, రాక్షస సంహారంలో భాగంగా ఏర్పడిన ఒక అవతారమని చారిత్రక కథనం. ఇటు గౌతమి అటు వశిష్ట నదీ పాయల మధ్య ఆవిర్భవించిన ఈ ఆలయ స్థాపనకు, ఈ గ్రామానికి ర్యాలి అన్న పేరు రావడానికి కూడా ఒక కథ ఉన్నట్టు పండితులు వెల్లడిస్తున్నారు. విక్రమదేవుడు అనే భక్తుడు ఒకప్పుడు అడవిలా ఉన్న ప్రాంతంలో వేట సాగిస్తూ ఒక చెట్టు వద్ద నిద్రించాడు. అతనికి కలలో కనబడిన మహావిష్ణువు స్వయంభూ శిల రూపంలో నేను ఈప్రాంతంలో ఉన్నానని నీవు కర్రతో రథం చేయించి లాగుకొని వెళ్ళితే ఆ రథం శీల రాలి పోతుందని అక్కడ తవ్వితే విగ్రహం బయట పడుతుందిని చెప్పి అదృశ్యమయ్యాడని ఒక కథ ప్రచారంలో వుంది. ఆ ప్రకారం విక్రమ దేవుడి ద్వారా ఈ విగ్రహం బయటపడిందని చరిత్ర చెబుతోంది. రథం శీల రాలడం వలన ఈ దైవం వెలసిన ప్రాంతానికి శ్రీర్యాలిశ్రీ అని పేరు వచ్చిందని నానుడి. పాప సంహారం కోసం వెలసిన దైవం అమృతం కోసం తగవులాడుకుంటున్న దేవదానవులను శాంతిపజేసి దానవులకు అమృతం అందకుండా చేసేందుకు మహా విష్ణువు జగన్మోహినీగా ఈ లోకంలో అవతరించిన విషయం తెలిసిందే. ఆ ఘట్టం ముగిసిన తరువాత అత్యంత సుందరంగా ఉన్న జగన్మోహినిని మోహించిన శంకరుడు ఆమెను వెంటాడటంతో సీ్త్ర రూపంలో ఉన్న విష్ణుమూర్తి ర్యాలి గ్రామం వరకూ వచ్చి ఇక్కడ అంతర్థానమైనట్టు ఆలయ చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. ఆ సమయంలో వీరిద్దరూ మోహించుకోవడాన్ని సర్వజనానికి తెలిసేటట్టు చేయడం కోసం సీ్త్ర పురుష రూపాల్లో ఏక శిలలో లోకనాఽథులు ఇద్దరూ ఇక్కడ స్వయంభూలుగా వెలిశారని భక్తులు విశ్వాసం అడుగడుగునా అద్భుతాలే లోకనాథులు వెలసిన ఈ గ్రామంలో జగన్మోహిహినీ కేశవస్వామి ఆలయంలో అణువణువునా అద్భుతాలే కనిపిస్తాయి. అత్యంత ఎత్తయినా పురాతన నిలువు గోపురం అందరినీ ఆకర్షించే గర్భగుడితో పాటు శ్రీదేవి, భూదేవి విగ్రాహాలు సైతం ఎంతగానో అకర్షిస్తాయి. ఇవి అన్ని ఒక ఎత్తయితే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన వింత. ఈ ఆలయ ప్రధాన విగ్రహమే ఐదు అడుగుల ఎత్తున ఉన్న సాలగ్రామ ఏక శిలలో సీ్త్ర పురుష రూపాల్లో శివ కేశవులు సాక్షాత్కరించడం భక్తి పారవశ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ ఒక్క శిలలోనే రెండు విధాలైన ఆలయాలు, పొన్న చెట్టు, దక్షిణ భాగంలో గోవర్ధన పర్వతం, మకర తోరణం స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సాలగ్రామ ఏక శిలా విగ్రహంలోనే దశావతారాలు కన్పించడం మరో అద్భుత విశేషం. కంఠంలోని హారాలు, కర కంకణాలు, శంకు చక్రాలు జీవం ఉట్టి పడేలా ఆ శివకేశవులే మన ముందు ప్రత్యక్ష మయ్యినట్టుగా చూసేవారికి అనుభూతి కలుగుతుంది. సాలాగ్రామ విగ్రహం పాదాల వద్ద గంగా జలం నిత్యం ఉబుకుతూనే ఉండడం ఇక్కడ మరో విశిష్టత. పాదాల వద్ద వున్న గంగాదేవి విగ్రహం నుంచి ఈ జలం ప్రవహిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతుందని భక్తుల విశ్వాసం. విగ్రహం వెనుక వైపు వున్న జగన్మోహినీ రూపం మరింత సమ్మోహనం. సీ్త్ర రూపంలో వున్న మహాశిష్ణువు అత్యంత సౌందర్యంగా కనిపిస్తారు. శిరమున సిగచుట్టూ అప్పుడే సంపెంగ నూనె రాసుకొన్నట్లున్న శిరోజాలు సహజమైన చీర కట్టు, తలలో ముచ్చటగొలిపే చామంతి పువ్వు విశేషంగా కనిపిస్తాయి. అంతేకాక పద్మినీ జాతి సీ్త్రలకు శుభసూచకంగా ఉండేలా పుట్టుమచ్చలు సైతం ఈ విగ్రహంలో సాక్షాత్కరించడం భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే రాజమహేంద్రవరం నుంచి ర్యాలి చేరుకునేందుకు గంట సమయం పడుతుంది. రావులపాలెం చేరుకున్న భక్తులు అక్కడ నుంచి ఊబలంక మీదుగా ర్యాలి చేరుకునేందుకు ఆరు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వుంటుంది. రావులపాలెం బస్ కాంప్లెక్సు నుంచి రెండు గంటలకు ఒకసారి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉండడంతో పాటు ప్రైవేటు వాహనాల ద్వారా ర్యాలి దివ్య క్షేత్రానికి చేరుకోవచ్చు. కల్యాణ మహోత్సవాలు ఇలా.. ఆదివారం గరుడ వాహన సేవ, గ్రామోత్సవం, రాత్రి 8–45 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం, 7, 8, 9 తేదీల్లో స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, పదో తేదీన సదస్యం, 12న చక్రస్నానం, 13న శ్రీపుష్పోత్పవంతో కల్యాణ మహోత్సవాలు ముగుస్తాయని దేవస్థానం ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి తెలిపారు. -
‘ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం’
తూర్పుగోదావరి జిల్లా: కూటమి ప్రభుత్వంలోని నేతలు ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో కూటమి నేతల ఇసుక దందాపై తోట త్రిమూర్తులు ధ్వజమెత్తారు.అడ్డగోలుగా బాటలు వేసుకుని ఉచిత ఇసుక పేరుతో కూటమి నేతలు దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక కోసం తీసిన గోతుల్లో పడి ఒక అమాఇయకుడు మృతి చెందడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన త్రిమూర్తులు.. ఇసుక పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమన్నారు.స్నానానికి దిగి యువకుడు గల్లంతుడాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం కేదార లంక గ్రామంలో స్నానానికి దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఉచిత ఇసుక పేరిట గోదావరిలో భారీ గోతులు తీయడంతో యువకుడు గల్లంతయ్యాడు. ఐదుగురు స్నానానికి దిగగా, నీటిలో ఉన్న గోతులు పసిగట్ట లేక రొట్టె దుర్గాప్రసాద్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని వెలికి తీసి కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రాజమండ్రి నాగాంజలి కేసు.. ఎన్నో అనుమానాలు?
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి బొల్లినేని కిమ్స్లో మృతి చెందిన ఫార్మసిస్ట్ నాగాంజలి కేసులో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న సమయంలో సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ఏం జరిగిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ సమయంలో నాగాంజలికి ఏం జరిగిందో వాస్తవాలు వెల్లడికాలేదు. సాయంత్రం 6:30 నుండి 8:30 మధ్యలో నాగాంజలికి ఎలాంటి చికిత్స జరిగింది?. ట్రీట్మెంట్ ఎవరిచ్చారు?. వార్డు నెంబర్ 802లో నాగాంజలికి అనస్థీషియా ఇంజెక్షన్ ఎవరు చేశారో? ఇప్పటివరకు స్పష్టం కాలేదు.బాధితురాలు తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. ఆ రూమ్లో సీసీ ఫుటేజ్ ఏమైనట్టు?. సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే దీపక్తో పాటు ఎవరెవరు ఈ దారుణానికి సహకరించారో బయటపడే అవకాశం ఉంది. సంఘటన జరిగిన రోజు సాయంత్రం 6:30కు అంజలి ఫోన్తో దీపక్ క్యాజువాలిటీకి ఎందుకు వచ్చాడు?. ఆసుపత్రి యాజమాన్యం సకాలంలో ట్రీట్మెంట్ చేస్తే అంజలి బతికేదా?. నాగాంజలిది ఆత్మహత్యా? లేక హత్యా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.కాగా, మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి నిన్న(శుక్రవారం) ఉదయం తుది శ్వాస విడిచింది. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. -
గొడ్రాలు అనే మాట పడలేకే ఈ నాటకం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో కలకలం సృష్టించిన గర్భిణి కొప్పిశెట్టి సంధ్యారాణి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. దేవీపట్నం మండలం ఇందుకూరిపేటకు చెందిన కొప్పిశెట్టి సంధ్యారాణి 9 నెలల గర్భిణి కావడంతో ఆమె భర్త రాజమహేంద్రవరంలోని జయ కిడ్నీకేర్ ఆసుపత్రికి గురువారం పురిటికి తీసుకువచ్చాడు. ఆసుపత్రిలో ఆమెకు ఓపీ చీటీ రాశారు. డాక్టర్ చూసేలోగా ఆమె రెండుసార్లు బయటకు వచ్చింది. అలా మూడోసారి బయటకు వచ్చి కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిన సంధ్యారాణి భర్త విషయాన్ని త్రీటౌన్ పోలీసులకు తెలిపాడు. త్రీటౌన్ సీఐ వి.అప్పారావు పర్యవేక్షణలో ఎస్సై షేక్సుభాణీ, మరికొంత మంది పోలీసులు రెండు టీములుగా విడిపోయి ఆచూకీ కోసం గాలించారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. సంధ్యారాణి ఫోన్ ఆధారంగా కాకినాడలో ఆమె ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడ బస్టాండ్లో ఆమెను పట్టుకున్నారు. పోలీసులు ఆమెను ప్రశ్నించగా...తనను ఎవరో కిడ్నాప్ చేశారని, తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారని, ప్రసవం అయిన వెంటనే పిల్లను ఎవరో ఎత్తుకెళ్లిపోయారని, పలు రకాలుగా పోలీసులకు తెలిపింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. 9 నెలలు గుడ్డలు పెట్టుకుని గర్భిణిగా.. కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో దుర్గను పరిశీలించిన వైద్యులు ఆమె గర్భిణి కాదని తేల్చి చెప్పారు. దీంతో హాతాశులయిన పోలీసులు తేరుకుని ఆమె ఈ నాటకం ఆడడానికి గల కారణాలను తెలుసుకున్నారు. దుర్గకు పెళ్లి అయి తొమ్మిది సంవత్సరా లు అయ్యింది. ఆమెకు పిల్లలు లేరు. దీంతో ఆమె బయటి వారు, ఇంటిలో కుటుంబ సభ్యులు ఆమెను గొడ్రాలుగా చూస్తున్నారు అనే భావనంతో తనకు కడుపు వచ్చినట్లు నాటకమాడింది. ఈ తొమ్మిది నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలని, భార్యాభర్తలు చాలా దూరంగా ఉండాలని తెలిపింది. సంధ్యారాణి డాక్టర్ దగ్గరకు వచ్చి లోపలికి వెళ్లినప్పుడు తనకు గర్భం ఎందుకు రావడంలేదని మాత్రమే అడిగి బయటకు వచ్చేసేది. బయట భర్తను కూర్చోపెట్టి ఆ సమయంలో ఆమె ఒక్కతే డాక్టర్ వద్దకు వెళ్లేది. డాక్టర్ అంతా బావుందని, పురుడు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారని తెలిపేది. దీంతో దుర్గ భర్త నిజమని నమ్మి ఆమెను కంటికి రెప్పలా చూసుకోసాగాడు. ఆమె కడుపు రోజురోజుకీ పెరుగుతున్నట్లు గుడ్డలు పెట్టుకుని కాలం వెళ్లదీసింది. చివరికి ఆ తంతు బయటపడడంతో ఆమె పరిస్ధితిపై జాలిపడడం పోలీసులవంతైంది. పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసును వేగంగా ఛేదించిన త్రీటౌన్ సీఐ వర్రే అప్పారావు, ఎస్సై షేక్సుభానీ, పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.నరసింహాకిశోర్ అభినందించారు. కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చి మాయం.. ఆపై బస్టాండ్లో ప్రత్యక్షం -
చంద్రబాబు తీరు రాష్ట్రప్రయోజనాలకే ప్రమాదకరం: చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం, సాక్షి: రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ను బ్యారేజీగా మార్చే కుట్రకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(Chelluboyina Venugopala Krishna) మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం వద్ద చంద్రబాబు రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా కేంద్రం ముందు తాకట్టు పెడుతున్న చంద్రబాబు చరిత్రలో ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని అన్నారు. ‘‘రాష్ట్ర విభజన సమయంలో పోలవరం(Polavaram)ను జాతీయ ప్రాజెక్ట్గా కేంద్రమే నిర్మించి ఇస్తుందని, ఏపీకి ప్రత్యేకహోదాను ఇచ్చి ఆదుకుంటుందని కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. విభజన తరువాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశాడు. తన కమీషన్ల కోసం రాష్ట్రమే పోలవరం ప్రాజెక్ట్ను నిర్మిస్తుందని కేంద్రాన్ని ఒప్పింది, అందుకు బదులుగా ప్రత్యేకహోదా హామీని వదులుకున్నారు. పోలవరంను అయినా నిర్మించారా అని చూస్తే ఆయన పాలనలో ఒక ప్రణాళిక లేకుండా, అస్తవ్యస్త విధానాలతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సర్వనాశనం చేశారు. .. పోలవరం కంటే ముందుగా స్పిల్వేను నిర్మించాల్సి ఉంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt) ఎటువంటి చొరవ తీసుకోలేదు. కేవలం తనకు కలిసి వస్తుందనే ఆలోచనతో అప్పర్, లోయర్ కాఫర్ డ్యాంలను చేపట్టాలని ప్రయత్నించారు. వాటిని పూర్తి చేయకుండా గ్యాప్లను ఉంచి, డయాఫ్రంవాల్ ను నిర్మించారు. అప్పర్ కాఫర్ డ్యాంలో స్పిల్ వే లేకపోవడం వల్ల కాఫర్ డ్యాంపై ఒత్తిడి పెరిగి వరదతో అవి దెబ్బతిన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు తన నిర్వాకాన్ని కప్పిపుచ్చుకుంటూ అధికారంలో ఉన్న వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపైనే నిందలు మోపేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కేంద్రంలోని పోలవరం అథారిటీ దెబ్బతిన్న డయాఫ్రంవాల్ను పరిశీలించి నివేదిక అందించడంలో జాప్యం జరిగింది. అప్పటి వరకు పోలవరం పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎం కాగానే పోలవరంపై కొత్త అబద్దాలను తెర మీదికి తీసుకువచ్చారు. వైయస్ జగన్ కారణంగానే పోలవరం ఆలస్యమైందంటూ పచ్చి అబద్దాలను చెబుతున్నారు. పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయ్యిందని ఒకవైపు చంద్రబాబు ఊదరగొడుతుంటే, కాదు కేవలం 53 శాతం మాత్రమే పూర్తయ్యిందని కేంద్రం స్పష్టం చేసింది.కేంద్రంపై ఒత్తిడి తేవడంతో నిర్లక్ష్యంతాజాగా పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ, దానికి గానూ రూ.12,157.53 కోట్లు మాత్రమే కేంద్రప్రభుత్వం నుంచి చెల్లించడం జరుగుతుందని కేంద్ర జలశక్తి సంఘం వార్షిక నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. అంటే ముందు నుంచి భావిస్తున్న 45.72 మీటర్ల మేర పోలవరం నిర్మాణం ఉండదూ అనేది స్పష్టమవుతోంది. ఎత్తు తగ్గించడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన రూ.25వేల కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇందుకు గానూ పోలవరంను ఒక బ్యారేజీ స్థాయికి కుదించివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల 164 టీఎంసీలకు బదులుగా కేవలం 115 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరిజిల్లాల ఆయకట్టు స్థిరీకరణకు కూడా నీటిని ఇవ్వలేని దారుణమైన పరిస్థితులు ఏర్పడతాయి. వీటిపైన చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోకుండా ఎత్తు తగ్గింపుపైన కేంద్రంతో రాజీ పడ్డారు. టీడీపీ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. కీలకమైన పోలవరంపై చంద్రబాబు చిత్తశుద్దితో నిలబడితే కేంద్రం ఖచ్చితంగా దిగివచ్చి పోలవరంకు అవసరమైన నిధులు అందిస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పనిచేయడం లేదు. పోలవరంకు పట్టిన గ్రహణంలా చంద్రబాబు మారారు. గతంలో కూడా పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని సాక్షాత్తు ప్రధాని చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారో తెలియదు.చంద్రబాబు.. అబద్దాలపైన అబద్దాలుఎన్నికలకు ముందు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసింది, ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తోందని ఇదే చంద్రబాబు ఆరోపించారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అప్పులు ఒక సారి 12.5 లక్షల కోట్లు అని, మరోసారి రూ.10 లక్షల కోట్లు అని, ఆ తరువాత రూ.9 లక్షల కోట్లు అని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక్కోసారి మీ అబద్దం ఒక్కో అంకెను చెబుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తం అప్పులు చూస్తే రూ.5.62 కోట్లు అని కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తం మీద మీరు ఎన్నికలకు ముందు చెప్పిన రూ.14 లక్షల కోట్ల అప్పులు లేవని మీరే అంగీకరించారు. ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయాలంటే భయమేస్తోంది, రాష్ట్ర అప్పులు చూస్తే ఎలా ఈ పథకాలు ఇవ్వాలో అర్థం కావడం లేదు అంటూ చంద్రబాబు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. రాష్ట్ర అప్పులు ఎన్ని ఉన్నాయో చాలా స్పష్టంగా తెలిసే కదా మీరు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారు. అంతకన్న తక్కువ అప్పులే ఉన్నప్పుడు చాలా సులభంగానే సూపర్ సిక్స్ను అమలు చేయవచ్చు కదా? అంటే పేదలకు మేలు చేయాలనే మంచి ఆలోచనకు చంద్రబాబు ఎప్పుడూ వ్యతిరేకమే. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుక్కుంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. పీ4 ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తానంటూ కొత్త డ్రామాలు చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలోని ఎనబైశాతం పేదలను ఇరవై శాతం ధనవంతులు దత్తత తీసుకుని, వారిని పేదరికం నుంచి విముక్తి చేస్తారంటూ రంగుల కలలను చూపిస్తున్నారు. అలాగే వక్ఫ్ సవరణ బిల్లుపైన కూడా వైయస్ఆర్సీపీపై తన సోషల్ మీడియా మూకను ప్రయోగించి తప్పుడ ప్రచారంకు తెగబడ్డారు. బిల్లుకు వైయస్ఆర్సీపీ రాజ్యసభలో వ్యతిరేకంగా ఓటు వేయడానికి విప్ జారీ చేయలేదంటూ అబద్దాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే దిగజారుడు రాజకీయం చేస్తున్నారు అని వేణుగోపాలకృష్ణ అన్నారు. -
బలైపోయిన అంజలి
సాక్షి, రాజమహేంద్రవరం / కంబాలచెరువు /బుట్టాయగూడెం : ఆత్మహత్యా యత్నం చేసి.. మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగాంజలి (22) తుది శ్వాస విడిచింది. రాజమహేంద్రవరంలోని కిమ్స్ (బొల్లినేని) ఆస్పత్రి ఏజీఎం దువ్వాడ మాధవరావు దీపక్ వేధింపులు తట్టుకోలేక 12 రోజుల క్రితం ఆమె హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితికి చేరిన ఆమె అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతోంది. ఆమెకు అదే కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రోజురోజుకూ ఆమె మెదడు పనితీరు క్షీణిస్తూ.. ఇతర అవయవాల పనితీరు సన్నగిల్లుతూ వచ్చింది. గురువారం రాత్రి పూర్తి విషమంగా మారడంతో ప్రభుత్వాస్పత్రి వైద్య బృందం కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించింది. అదే సమయంలో ఆమెకు గుండె సమస్య అధికమైంది. దీంతో శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి, గుండె ఆగిపోవడంతో నాగాంజలి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని స్వగ్రామమైన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడేనికి తీసుకెళ్లారు. దీపక్ వేధింపుల వల్లే దారుణం ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో అప్రంటీస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రి ఏజీఎం దీపక్ ఆమెను వేధింపులకు గురిచేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన నాగాంజలి గత నెల 23న అదే ఆస్పత్రిలోనే వెక్రోనియం బ్రోమైడ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుంది. దాని ప్రభావంతో అక్కడే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. ఆ ఇంజక్షన్ చాలా హానికరమైనది కావడంతో కొద్ది నిమిషాలకే కోమాలోకి వెళ్లిపోయింది. అయితే, ఈ విషయాన్ని బహిర్గతం చేయని ఆస్పత్రి యాజమాన్యం అక్కడే చికిత్స అందించింది. ఈ క్రమంలో అంజలి రాసిన సూసైడ్ నోట్ ఆ మరుసటి రోజు అంటే.. గత నెల 24న బయటకు వచ్చిoది. దీంతో ఆమె తీసుకున్న ఇంజక్షన్ ఏమిటనే విషయం బహిర్గతమైంది. తన ఆత్మహత్యాయత్నానికి కారణం ఎవరన్నది ఆ లేఖలో ఆమె స్పష్టంగా రాయడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు దీపక్ను అరెస్టు చేశారు. బాధితురాలికి అండగా నిలిచిన వైఎస్సార్సీపీ నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినప్పటి నుంచి ఆమెకు, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. ఆది నుంచీ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. నాగాంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. పూర్తి న్యాయ సహాయం అందిస్తామని కూడా చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆస్పత్రికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు సైతం రోడ్డెక్కారు. ఆందోళనకు తలొగ్గిన ప్రభుత్వం.. నాగాంజలి ఆరోగ్య పరిస్థితిపై 28న ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో ప్రత్యేక కమిటీ వేసింది. వారు ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఘటన జరిగిన తర్వాత నాగాంజలి కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ అధికార ప్రతినిధి శ్యామల పరామర్శించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. నాగాంజలిని దారుణంగా హింసించి, ఆత్మహత్యకు పురిగొలిపేలా చేసిన దీపక్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రౌతుగూడెంలో ప్రజల ఆందోళన నాగాంజలి మృతితో ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం రౌతుగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబులెన్స్లో ఆమె మృతదేహం గ్రామానికి చేరుకునే సమయానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అంజలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘వి వాంట్ జస్టిస్’ అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగాంజలి మృతి పట్ల వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంతాపం తెలిపారు. దోషిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నాగాంజలిని పొట్టన పెట్టుకుందిఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపాటు నిందితుడు దీపక్ టీడీపీ కార్యకర్త కావడం వల్లే ప్రభుత్వ నిర్లక్ష్యం సాక్షి, అమరావతి: రాజమహేంద్రవరంలో ఆత్మహత్యాయత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతికి కూటమి ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అ«ధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన దీపక్ ఏజీఎంగా ఉన్న ఆస్పత్రిలోనే బాధితురాలికి చికిత్స చేయొద్దని, వేరే ఆస్పత్రికి తరలించాలని వైఎస్సార్సీపీ కోరినా, ఆమె తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పినా, ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలో శుక్రవారం కళ్యాణి మీడియాతో మాట్లాడారు. తన ఆత్మహత్యకు కిమ్స్ ఏజీఎం దీపక్ కారణమని సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్యాయత్నం చేసినా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించక పోవడం దారుణం అని అన్నారు. నిందితుడు దీపక్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినందునే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ‘గత నెల 23న నాగాంజలి ఆత్మహత్యాయత్నం చేస్తే.. ఈ 12 రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల్లో ఏ ఒక్కరూ ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె కుటుంబాన్ని కూడా పరామర్శించలేదు’ అని వరుదు కళ్యాణి విమర్శించారు. వీళ్ల వాగ్దానాలన్నీ మాటలకే పరిమితమని, చేతల్లో చేసేదేం ఉండదని అర్థం అవుతోందన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 15,500 గటగట (వెయ్యి) 14,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 14,500 గటగట (వెయ్యి) 13,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260