breaking news
East Godavari
-
ఏపీలో మరో బస్సు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్ బస్సుగా గుర్తించారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో బస్సులో ఉన్న 10 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూటే కారణమని డ్రైవర్ తెలిపాడు. సుమారు అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను వేరే బస్సులో పంపించారు. -
అనపర్తిలో తిరుమల ఎక్స్ప్రెస్ నిలిపివేత
సాక్షి, తూర్పుగోదావరి: అనపర్తి వద్ద తిరుమల ఎక్స్ప్రెస్ నిలిపివేశారు. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్ ప్రెస్ (18521) బోగీ కింద పొగలు రావడంతో ట్రైన్ను అధికారుల నిలివేశారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో పొగలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తాత్కాలికంగా రిపేర్ చేసి ట్రైన్ను రాజమండ్రికి తరలించారు. -
మరో వారం పాటు కోనసీమ బ్లో అవుట్: కలెక్టర్
సాక్షి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా: ఇరుసుమండలో మరో వారం పాటు బ్లో అవుట్ కొనసాగుతోందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి ఆస్తి, ప్రాణం నష్టం జరగలేదన్నారు. ధ్వంసమైన కొబ్బరి చెట్లకు, దెబ్బతిన్న పంటలకు సమీపంలో పంట పొలాలకు పరిహారం చెల్లిస్తామన్నారు. బ్లో అవుట్ ఒకేసారి కాకుండా క్రీమేపి తగ్గించే ప్రయత్నం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.ఐదు వైపులా పైపులతో వాటర్ అంబ్రెల్లా కొనసాగుతుంది. పూర్తిస్థాయిలో బ్లోట్ అదుపులోకి రావడానికి వారం రోజులు పడుతుందన్నారు. టెక్నాలజీ అండ్ ఫీల్డ్ సర్వీసెస్ డైరెక్టర్ విక్రమ్ సక్సేనా మాట్లాడుతూ.. బ్లో అవుట్ సంభవించిన మోరి- 5 వెల్ను డీప్ ఇండస్ట్రీకి 15 ఏళ్లకు లీజుకి ఇచ్చామని తెలిపారు. బ్లో అవుట్ వల్ల ఎటువంటి సమస్య తలెత్తదన్నారు. -
12 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న 1989 బ్యాచ్కు చెందిన 12మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి లభించింది. డి. సమర్పణరావు, డి. పోలరాజు, యూవీవీ సత్యనారాయణ, కేవీవీసత్యనారాయణ, పీవీ సింహాచలం, వై. శ్రీనివాస్, ఏ నాగేశ్వరరావు, వి వి వి సత్యనారాయణ, ఎం వి ఎస్ ఆర్ నాయుడు, ఏంవీ వెంకటేశ్వరరావు, ఎస్ కే ఎఫ్ రెహమాన్, ఎస్ నాగేశ్వరరావు, సబ్ ఇన్సెక్టర్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా సోమవారం వారు జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి రెండవ స్టార్ను అలంకరించి, శుభాకాంక్షలు తెలిపారు. నేడు పొగాకు రైతుల ర్యాలీ సిగరెట్లపై పెంచిన జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ దేవరపల్లి: సిగరెట్లపై జీఎస్టీని 28 నుంచి 40 శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం దేవరపల్లిలో పొగాకు రైతులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో పంట సాగు చేస్తున్న రై తులు ఉదయం 9 గంటలకు దేవరపల్లి వేలం కేంద్రానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక టుబాకో బోర్డు కార్యాలయం నుంచి మూడు రో డ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ ధ ర్నా, మానవహారం నిర్వహించి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు తమ నిరసన తెలియజేయనున్నట్టు ఆయన చెప్పారు. సిగరెట్లపై జీఎస్టీని పెంచడం వల్ల మన పొగాకు ఉత్పత్తిపై ప్రభావం ప డుతుందని ఆయన చెప్పారు. సిగరెట్లపై జీఎస్టీని పెంచ వద్దని గతంలో పొగాకు బోర్డు అధికారు లు, రాజమహేంద్రవరం, ఏలూరు ఎంపీల ద్వా రా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసినట్టు ఆయన చెప్పారు. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు రాజమహేంద్రవరం సిటీ: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రాంతం నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తి సోమవారం ప్రకటించారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం 31 స్పెషల్ బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి 36 షెడ్యూల్ బస్సులతో పాటు 10 స్పెషల్ బస్సులు (రాజమహేంద్రవరం డిపో – 7, కొవ్వూరు డిపో – 2, నిడదవోలు డిపో – 1) అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలతో నడపనున్నట్లు తెలిపారు. విజయవాడ వైపు 17 షెడ్యూల్ బస్సులు, విశాఖపట్నం వైపు 14 షెడ్యూల్ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా మరిన్ని అదనపు బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మూర్తి తెలిపారు. -
● మాయాసీత్రం
● అలా.. హిమదారిలో.. భోగి పండగ అంటే పిల్లలకు సందడే.. ఆ మంటలను చూసి వారికి సంబరమే.. అందుకే చిన్నారులు ఇప్పటి నుంచే భోగి మంటలకు దుంగలను సిద్ధం చేస్తూ, భోగి పిడకలు తయారు చేస్తూ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పల్లెల్లో ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యలే కనిపిస్తున్నారు. పెదపట్నంలంకలో చిన్నారులు ఇలా దుంగలను సేకరిస్తున్నారు. – మామిడికుదురు పోలవరం జిల్లా మన్యం మంచు దుప్పటిలో ఒదిగిపోతోంది.. ఓ వైపు చలి, మరోవైపు ఉదయం 9 గంటల వరకూ దట్టమైన పొగ మంచు కమ్మేస్తోంది. రాజవొమ్మంగిలో ఆది, సోమవారాల్లో 9 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి పూట కూడా ఇలా లైట్లు వేసుకుని వాహనదారులు వెళ్లాల్సి వస్తోంది. – రాజవొమ్మంగి పచ్చని పొలాలు, పచ్చిక బయళ్లను పాల సముద్రం ముంచెత్తిందా అనేట్టు కనిపిస్తున్న ఈ చిత్రం కనువిందు చేస్తోంది. గొల్లపాలెంలో తెల్లవారే సమయంలో మంచు తెరలు ఇలా మాయ చేస్తున్నాయి. ఇళ్లు, పొలాలను సముద్రం ముంచెత్తినట్లు కనిపిస్తున్న ఈ దృశ్యం హిమసోయగమే. – కాజులూరు పెదపట్నంలంకలో భోగి మంటలకు దుంగలను సిద్ధం చేస్తున్న చిన్నారులు -
‘ఉత్తరాయణంలో మరణించిన పాపులకు ఉత్తమ గతులుండవు’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఉత్తరాయనం ప్రశస్తమయిన కాలమే. కానీ, ఉత్తరాయణంలో మరణించిన పాపులకు ఉత్తమ గతులు కలగవు. అలాగే, దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు ఉత్తమ గతులు కలుగుతాయి’ అని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా సోమవారం ఆయన ద్రోణపర్వంలోని యుద్ధ సన్నివేశాలను వివరించారు. ‘జీవన్ముక్తులకు ఏ అయనమూ అవసరం లేదు. వారు బ్రహ్మంతో తాదాత్మ్యం చెంది ఉంటారు. నిష్కామ కర్మానుష్ఠానపరులు, యోగులు, ఉపాసకులు ఏ యానంలో మరణించినా, దేవయాన మార్గంలో సగుణబ్రహ్మ లోకానికి వెళ్తారు. కామ్యకర్మానుష్ఠానపరులు కోరికతో సత్కర్మలు చేస్తే, ఊర్థ్వ లోకాలకు వెళ్లి, పుణ్యబలం క్షీణించాక, తిరిగి జన్మిస్తారు. ఇక లోకంలో ఎక్కువ సంఖ్యలో ఉండే నిషిద్ధ కర్మానుష్ఠానపరులు అధోలోకాలకు వెళ్తారు’ అని వివరించారు. మనం భారత యుద్ధం జరిగిన సమయంలోనే ప్రవచనం చెప్పుకుంటున్నామన్నారు. దక్షిణాయన సమయంలో మరణించిన అనేకమంది వీరులు దేవ, బ్రహ్మ, వరుణ లోకాలకు వెళ్లడాన్ని ఆశ్రమవాస పర్వంలో వ్యాసుడు వివరించాడని చెప్పారు. అయితే, స్వచ్ఛంద మరణం వరంగా ఉన్న భీష్ముడు ఉత్తరాయనం ప్రశస్తమయిన కాలం కనుక, ఆ సమయం వచ్చే వరకూ నిరీక్షించసాగాడని తెలిపారు. జ్ఞానం, భక్తి, యోగాలు మూడింటినీ తనలో నింపుకొన్నవాడు భీష్ముడని, తాను చేస్తున్నాననే అహంకారం లేని నిస్సంగుడని, అన్నారు. శాంతి, అనుశాసన పర్వాల్లో భీష్ముడు చెప్పిన నీతులు, ధర్మాలు పురాణ వాఙ్మయంలో మరెక్కడా కనపడవని సామవేదం అన్నారు. ‘‘భీష్ముడు శర తల్పం చేరాక, కర్ణుడు సంగ్రామానికి వచ్చాడు. ద్రోణుడు సర్వసైన్యాధిపతి అయ్యాడు. ధర్మరాజును బంధించి తీసుకు రమ్మని ద్రోణుడిని దుర్యోధనుడు కోరాడు. ధర్మరాజును వధించి తీసుకు రమ్మనకుండా, బంధించి తీసుకు రమ్మనడంలో దుర్యోధనుని అంతరంగంలో మంచి భావాలు కలిగాయని భావించరాదు. పాండవుల్లో ఏ ఒక్కరు మిగిలినా పోరు తప్పదు. వారిలో ఎవరూ మిగలకపోయినా, కౌరవులదరినీ కృష్ణుడు బంధించి రాజ్యాన్ని ద్రౌపదికి ధారాదత్తం చేస్తాడు. ధర్మరాజును బంధించి, తిరిగి ద్యూతానికి ఆహ్వానించి, పాండవులందరినీ వనవాసానికి, అజ్ఞాతవాసానికి పంపాలన్నది దుర్యోధనుడి కుటిల భావం. అర్జునుడు సమీపంలో లేకపోతే, ధర్మరాజును బంధించి తీసుకువస్తానని ద్రోణుడు దుర్యోధనునికి మాట ఇస్తాడని సామవేదం అన్నారు. ద్రోణపర్వంలోని యుద్ధ వ్యూహ ప్రతివ్యూహాలను సామవేదం వివరించారు. -
వక్క సాగు రైతులకు లాభసాటి
కపిలేశ్వరపురం (మండపేట): వక్క సాగు చేయడం ద్వారా రైతులు లాభాలను ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దీనికోసం రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి చిరంజీవ్ చౌదరి అన్నారు. మండపేట మండలం వేములపల్లిలోని భవానీ గార్డెన్స్లో సోమవారం శ్రీప్రకాష్ ఆయుష్ చారిటబుల్ అండ్ రీసెర్చ్ ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వక్క రైతుల సదస్సు నిర్వహించారు. స్థానికంగా వక్క సాగుకు ఉన్న సానుకూల అంశాలను రైతులకు వివరించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది రైతులు హాజరయ్యి తమ అనుభవాలను వెల్లడించారు. స్థానిక పంటలను పరిశీలించారు. సీపీసీఆర్ఐ పూర్వ డైరెక్టర్ డాక్టర్ పి.చౌడప్ప మాట్లాడుతూ వక్క వాడటం ద్వారా క్యాన్సర్ వస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే అన్నారు. ఆదర్శ రైతు చిలుకూరి దొరయ్య చౌదరి సేద్య ప్రస్థానంపై రాసిన సృజనాత్మక రైతు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు. -
అణువణువూ జల్లెడ
కోరింగ అభయారణ్యంలో పక్షుల గణన తాళ్లరేవు: కోరింగ అభయారణ్యంలో పక్షుల లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృంద సభ్యులు శ్రమించారు. ప్రత్యేక కెమెరాలతో అభయారణ్యం, సముద్ర తీర ప్రాంతంలో అణువణువూ జల్లెడ పట్టారు. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్– 2026లో భాగంగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన 12 బృందాల సభ్యులు ఇందులో పాల్గొని పక్షుల సంఖ్యను లెక్కించారు. పర్యావరణంలోని ప్రస్తుత పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షుల సంఖ్యను లెక్కించేందుకు ప్రభుత్వం ఏటా జనవరిలో పక్షుల గణన చేపడుతోంది. దీనికోసం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ నేతృత్వంలో సుమారు 100 మందితో కూడిన బృందానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అటవీ సిబ్బందితో పాటు ఒక వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్, ఒక సైంటిస్ట్, ఒక స్టూడెంట్తో పాటు ఒక వలంటీర్ ఈ లెక్కింపులో పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి ప్రత్యేక కెమెరాలతో కోరింగ మడ అటవీ ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో సంచరించే వివిధ రకాల పక్షులు, దూర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను లెక్కించారు. నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ, సీనియర్ సైంటిస్ట్లు, బీఎన్హెచ్ఎస్ ప్రతినిధుల నేతృత్వంలో ఈ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కోరంగి బయో డైవర్సటీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పక్షి గణనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వరప్రసాద్, సత్య సెల్వం చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అన్నీ పరిశీలించిన తరువాత పక్షుల సంఖ్యను ప్రకటించనున్నట్లు వరప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో అటవీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి యానాం ప్రజా ఉత్సవాలు
● ఫల, పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తి ● అలరించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు యానాంలో విద్యుత్ కాంతులతో సిద్ధమైన ఫల, పుష్ప ప్రదర్శన ముఖద్వారం ప్రజా ఉత్సవాలకు సిద్ధమవుతున్న ప్రధాన వేదిక యానాం: పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 22వ యానాం ప్రజా ఉత్సవాలు మంగళవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్టేడియం వద్ద బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఈ నెల 8 వరకు మూడు రోజుల పాటు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పర్యవేక్షణలో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్అశోక్ అధ్యక్షతన జరగనున్న ప్రజా ఉత్సవాలతో పాటు 9 వరకూ ఫల, పుష్ప ప్రదర్శనను సైతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కె.కై లాషనాథన్ ప్రారంభించనున్నారు. అదేవిధంగా స్పీకర్ సెల్వం, వ్యవసాయ మంత్రి సీడీజే కౌమార్, డిప్యూటీ స్పీకర్ రాజవేలు తదితరులు వస్తుండగా, ముగింపు వేడుకలకు పుదుచ్చేరి సీఎం రంగసామి, పర్యాటక మంత్రి కె.లక్ష్మీనారాయణన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శరత్చౌహాన్, కలెక్టర్ కులోఽథుంగన్, కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ తదితరులు హాజరవుతారు. కార్యక్రమాలు ఇలా.. మంగళవారం జాతీయ సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా ఒడిశా కళాకారులచే ప్రత్యేక ప్రదర్శన, విశాఖ కళాకారులచే ఎల్ఈడీ లేజర్ మేస్ యాక్ట్, బిగ్బాస్ ఫేమ్ రాము రాథోడ్చే జానపద గీతాలు, విశాఖ డీజే టిల్లు టీమ్ కార్యక్రమాలు, మధ్యప్రదేశ్ కళాకారులచే విజయేంద్ర ప్రత్యేక ప్రదర్శన ఉంటాయి. 7న కోల్కతా, పీఆర్ ఈవెంట్స్ ఫ్యాషన్ షో, పాశ్చాత్య నృత్య ప్రదర్శన, రష్యన్ కళాకారుల ప్రదర్శన, కోల్కతా కళాకారులచే గారడీ ప్రదర్శన, యానాం కళాకారుల తెలుగు సంప్రదాయ కళల ప్రదర్శన, 8న శాంతకుమార్ మిమిక్రీ, రింగ్ రిబ్బన్ డ్యాన్స్, సినీ ఆర్కెస్ట్రా, స్కైల్యాంట్రన్ నిర్వహించనున్నారు. ఆర్ఏఓ అంకిత్కుమార్, వ్యవసాయశాఖ డీడీ సీహెచ్ జోగిరాజు వివరాలను వెల్లడించారు. ఉత్సవాలకు ముస్తాబు ప్రజా ఉత్సవాలు, ఫల, పుష్ప ప్రదర్శనకు బాలయోగి మైదానం ముస్తాబయ్యింది. ఇప్పటికే వేదిక, ముఖద్వారాలు సిద్ధమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి పలువురు కళాకారులు చేరుకున్నారు. పోలీసులు సైతం విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మల్లాడి కృష్ణారావు పిలుపునిచ్చారు. -
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 2026
పచ్చని కోనసీమ మరోసారి అంటుకుంది. చమురు సంస్థలు పెడుతున్న చిచ్చు రాజుకుంటూనే ఉంది. ఓఎన్జీసీ డ్రిల్లింగ్లు, చమురు, సహజవాయువుల వెలికితీత, గ్యాస్ పైప్ లైన్లు, ఇతర చమురు సంస్థల కార్యకలాపాలతో గడచిన మూడు దశాబ్దాలుగా కోనసీమ మందుపాతరగా మారిపోయింది. ఎప్పుడు ఏ క్షణాన, ఏ మూలన గ్యాస్ లీకేజీలు.. బ్లో అవుట్లు చోటు చేసుకుంటాయో తెలియక ఈ ప్రాంతవాసులు మందుపాతరల మీద జీవిస్తూ నిత్యం భయం భయంగా బతుకుతున్నారు. సాక్షి, అమలాపురం/ మలికిపురం/ అమలాపురం టౌన్/ అంబాజీపేట: కోనసీమ పచ్చదనంపై వరుస బ్లో అవుట్లు పగబట్టాయి. కోనసీమ గుండెలపై బ్లో అవుట్లు కుంపట్లు అవుతున్నాయి. చమురు సంస్థలకు చెందిన రిగ్ల లోంచి అప్పుడప్పుడూ బ్లో అవుట్లు అనివార్యమై మంటలు, సెగలు, పొగలు కక్కుతున్నాయి. భరించలేని శబ్దాలతో కోనసీమ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బ్లో అవుట్లతో భద్రత లేని కారణాలపై చమురు సంస్థల మీద ముఖ్యంగా ఓఎన్జీసీపై ఈ ప్రాంత ప్రజలు, ప్రజా ప్రతినిధులు తర చూ ఉద్యమాలు, పోరాటాలు చేస్తున్నా ఆ సంస్థలకు కనువిప్పు కావడం లేదు. స్పందన మచ్చుకై నా కనిపించడం లేదు. తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం సంభవించిన బ్లో అవుట్ నుంచి గతంలోకి ఓసారి తొంగి చూస్తే అనేక చేదు అనుభవాలు, చేదు జ్ఞాపకాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఒక్కొక్క బ్లో అవుట్ కథను వింటే నాడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు గుర్తుకు వస్తాయి. ● 1995 జనవరి 8న అల్లవరం మండలం దేవరలంక (పాశర్లపూడి) గ్రామంలో సంభవించిన బ్లోఅవుట్ అతి పెద్దది. మార్చి 15వ తేదీ వరకు ఇది కొనసాగింది. ప్రాణనష్టం లేకపోయినప్పటికీ ఆస్తి నష్టం ఎక్కువే. ఈ బ్లో అవుట్తో 65 రోజులపాటు సుమారు 30 నుంచి 60 అడుగుల ఎత్తులో మంటలు నిరంతరాయంగా మండాయి. దాదాపు పది కిలోమీటర్ల మేర ఆ పెనుమంటల వెలుగు విరజిమ్మింది. సుమారు 15 కిలోమీటర్ల మేర పెను శబ్దం ప్రజల చెవులను గింగిర్లు ఎత్తించాయి. విపరీత శబ్దానికి, పేలుడు ధాటికి దేవరలంక, గోపాయలంక తదితర గ్రామాల్లో పలు ఇళ్ల గోడలు బీటలు వారాయి. ఇదీ విస్ఫోటాల చరిత్ర ● 1997 ఫిబ్రవరి 19న రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో బ్లో అవుట్ జరిగింది. ● 2006 సెప్టెంబర్ 19న అమలాపురం రూరల్ మండ లం తాండపల్లిలో మరో బ్లో అవుట్ సంభవించింది. ● 2014 జూన్ 27న మామిడికుదురు మండలం నగరంలో గెయిల్కు చెందిన గ్యాస్ పైపులైన్ల బ్లాస్ట్ ( విస్ఫోటం) అయ్యాయి. ఆ రోజు తెలతెలవారుతుండగా అనేక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువాత పడ్డారు. కోనసీమ చరిత్రలో చమురు సంస్థల ప్రమాదాలలో ఇది అత్యంత విషాదకరమైనది. తీవ్రమైనది. ● 1992లో మామిడికుదురు మండలం కొమరాడలో బ్లో అవుట్ సంభవించింది. ● 2020 ఫిబ్రవరి 2న కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో బ్లో అవుట్ జరిగింది. ప్రాణాలు అరచేత పట్టుకొని పొరుగు ఊళ్లకు.. బ్లో అవుట్ జరిగిన ప్రతిసారీ ఆ పరిసర గ్రామాల ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీయడం, తమ ఇళ్లకు తాళాలు వేసి పొరుగు ఊళ్లు వెళ్లిపోవడం సాధారణమైపోయింది. పొరుగు ఊళ్లు వెళ్లి తలదాచుకుంటున్నారు. బ్లో అవుట్లు జరిగిన గ్రామాల్లో ప్రజలు తమ ఇంట్లో పొయ్యిలు వెలిగించకుండా పస్తులు ఉండటం సాధారణమైపోయింది. ఎందుకంటే అప్పటికే బ్లో అవుట్ వల్ల గ్రామం అంతటా గ్యాస్ గాలిలో కలిసిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఏ చిన్న నిప్పు ముట్టించినా ఘోర ప్రమాదం జరుగుతుంది. అందుకే అగ్గిపుల్ల వెలిగించేందుకు కూడా భయపడిపోతారు. చేష్టలుడిగి చూస్తున్న చమురు సంస్థలు ప్రమాదం జరిగిన వెంటనే తేరుకుని నివారణా చర్యలు చేపట్టడంలో ఓఎన్జీసీ, గెయిల్, ఇతర ప్రైవేట్ సంస్థలు అనుసరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. వెంటనే స్పందించడంలో ఆ సంస్థ సంక్షోభ నివారణ జట్టు వచ్చే వరకు స్థానిక సిబ్బంది కళ్లప్పగించి చూడాల్సి వస్తోంది. ప్రమాదాలు ఎదుర్కొనే సామగ్రి, ఇతర వస్తువులు వారికి అందుబాటులో ఉండడం లేదు. కోనసీమ నుంచి కోట్లాది రూపాయలు తరలించుకుపోతున్న చమురు సంస్థలు అంతర్జాతీయంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా అందిపుచ్చుకోవడం లేదు. కనీసం ప్రమాదాల నుంచి అనుభవాలు కూడా నేర్చుకోకపోవడంపై ఈ ప్రాంత వాసుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్లో అవుట్ అదుపునకు విదేశీ, స్వదేశీ నిపుణులు బ్లో అవుట్ను అదుపు చేసేందుకు విదేశీ, స్వదేశీ నిపుణులు రావలసి ఉందని అధికారులు అంటున్నారు. ఇతర దేశాలతో పాటు ముంబయి, గుజరాత్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించేందుకు ఓన్ఎన్జీసీ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. యంత్రాలు, రసాయనాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు కూడా విదేశాల నుంచి రావలసి ఉంది. రాజమహేంద్రవరం. తూర్పుపాలెంకు చెందిన క్రైసిస్ మేనేజ్మెంట్ బృందాలు ప్రమాద స్థలానికి మంగళవారం చేరుకుంటాయని ఓన్ఎన్జీసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే మంటలు ఆర్పే కొన్ని యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. ఇరుసుమండ గ్రామంలోని కొంతమంది రాత్రి సమయంలో ఇళ్లకు చేరుకున్నారు. గ్యాస్ మండిపోవడంతో పెద్దగా ప్రమాదం ఉండదని భావించి గ్రామస్తులను పోలీసులు, అధికారులు, ఇళ్లలోకి అనుమతిస్తున్నారు. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీ రిగ్ వద్ద ఎగసి పడుతున్న మంటలు సీమ గుండెల్లో చిచ్చుసాక్షి, అమలాపురం/ మలికిపురం/ అంబాజీపేట: మొన్న దేవరపల్లి... నిన్న నగరం.. నేడు ఇరుసుమండ. కోనసీమలో ప్రాంతాలు మారుతున్నాయి కాని.. చమురు సంస్థలు చేస్తున్న విధ్వంసం మారడం లేదు. ఈ ప్రాంతం నుంచి కోట్ల రూపాయల చమురు, సహజ వాయువు కొల్లగొట్టుకుపోతున్నా స్థానిక అభివృద్ధి.. ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల జరుగుతున్న బ్లో అవుట్లు.. గ్యాస్ లీకేజుల వల్ల ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో తెలియని దుర్భర పరిస్థితులలో కోనసీమ జిల్లా ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. ముఖ్యంగా రాజోలు, పి.గన్నవరం కొత్తపేట, అమలాపురం నియోజకవర్గాల ప్రజలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. గతం నుంచీ ఇలా లీకేజీలు, బ్లో అవుట్ల ఘటనలు జరగడం వల్ల వీటితో సహజ జీవనం తప్పదని వారు మానసికంగా సిద్ధపడిపోయారు. అలా భయపడినట్లే తాజాగా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో సోమవారం సంభవించిన భారీ బ్లో అవుట్తో ఈ ప్రాంతాల ప్రజలు భీతావహులయ్యారు. ఉదయం 11 గంటలకు ఇంటి పెద్దలు ఎవరి పనులకు వారు వెళ్లిపోయిన తరువాత సంభవించిన ఘటనతో ప్రజలు షాక్ తిన్నారు. భారీ శబ్దాలు, విస్తరించిన తెల్లని పొగ ఉదయం పదకొండు గంటల సమయంలో సిబ్బంది డ్రిల్లింగ్ చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ ఎగదన్నుకు వచ్చింది. సిబ్బంది దీనిని అదుపు చేసేందుకు చేసిన యత్నాలు విఫలం కావడం, రానురానూ గ్యాస్ తీవ్ర పీడనంతో బయటకు ఎగదన్నడంతో వారు రిగ్ను వదిలి కేకలు వేసుకుంటూ ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో రిగ్ వద్ద పదిమంది వరకు సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్యాస్ ఎగదన్నుకు వస్తూనే ఉంది. ఈ సమయంలో భారీ శబ్దాలు రావడం, గ్యాస్ తెల్లని పొగలా చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం చూసి సమీప గ్రామాల వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. వృద్ధులు, చిన్న పిల్లలను చంకన వేసుకుని తల్లిదండ్రులు పరుగులు పెట్టారు. డ్రిల్ సైటుకు సమీపంలో నాట్లు వేస్తున్న కూలీలు పేలుడు ధాటికి పొలాల్లో పడిపోయారు. స్థానిక రైతులు తమ పాడి పశువులను దూర ప్రాంతాలకు తరలించారు. వెంటనే లేని అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. రెండు గంటల పాటు గ్యాస్ ఎగజిమ్ముతున్న సమయంలో రెవెన్యూ, పంచాయతీ, పోలీసులు చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. ఇరుసుమండతోపాటు లక్కవరం గ్రామస్తులను ఖాళీ చేయించారు. స్థానికులను విద్యుత్ వినియోగించవద్దని, నిప్పు రాజేయవద్దని మైకులతో ప్రచారం చేశారు. రెండు గంటల తరువాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా మంటలు రాజుకుని భారీ పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో వీరిని కట్టడి చేయడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. అర్ధరాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. రాత్రి ఆరు గంటల సమయంలో రాజమహేంద్రవరం నుంచి వచ్చిన సిబ్బంది ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే మంటలను ఎప్పుడు అదుపులోకి తీసుకువస్తారనే దానిపై ఓఎన్జీసీ వర్గాలు, డ్రిల్లింగ్ చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తేల్చిచెప్పలేకపోతున్నారు. అయితే పగటిపూట ప్రమాదం జరగడం వల్ల ప్రాణనష్టం లేదని స్థానికులు కొంత వరకు ఊరట చెందుతున్నారు. ఇళ్లు వదిలి రోడ్డుపైకి వచ్చిన లక్కవరం గ్రామస్తులు8 కోనసీమలో నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు తరచు బ్లో అవుట్లు.. గ్యాస్ లీకేజ్లు మందుపాతరల మీద జన జీవనం ప్రమాదం జరిగితే చేష్టలుడిగి చూస్తున్న చమురు సంస్థలు -
మరో చౌకబారు నిర్ణయం!
● చౌక ధరల దుకాణాల ద్వారా కొందరికే చెక్కి గోధుమపిండి ● జిల్లాలో రాజమహేంద్రవరం నగరానికే పరిమితం ● 83,482 కార్డు దారులకు మాత్రమే పంపిణీ ● జిల్లాలో రైస్ కార్డుదారులు 6,55,444 మంది ● చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక నిలిచిన కందిపప్పు పంపిణీ ● ఆగిపోయిన ఇంటింటికీ రేషన్ సరకుల సరఫరా ● సర్కారు తీరుపై జనం ఆగ్రహం రాజమేహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో పావలా పనికి..రూపాయి ప్రచారం అనే నానుడికి ఇదొక నిదర్శనం. సంక్రాంతి పండగ సమయంలో చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేందుకు చెక్కి గోధుమపిండి పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని చంద్రబాబు వంత మీడియా, సామాజిక మాధ్యమాలు ఊదరగొట్టాయి. తీరా చేసి కేవలం జిల్లా ప్రధాన కేంద్రం ఉన్న నగరాలకు, పట్టణాలకు మాత్రమే గోధుమపిండి పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతోంది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్కార్డుపై కేజీ చొప్పున గోధుమపిండి ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. బహిరంగ మార్కెట్లో కేజీ క్వాలిటీ గోధుమ పిండి రూ.60 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. సంక్రాంతి నాడు పేదలకు మేలు చేసేందుకు ఇలా పంపిణీ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. దీనిపై విస్తృతంగా ప్రచారం హోరెత్తించింది. తీరా అమలు చేయాల్సిన సమయానికి వచ్చే సరికి జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోనే ఇస్తామంటోంది. నగరపాలకసంస్థ పరిధిలో కేవలం 83,482 రైస్ కార్డుదారులకు మాత్రమే పంపిణీ పరిమితం చేశారు. ఈ నెల రెండవ తేదీన జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్ చేతులమీదుగా గోధుమపిండి పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మండిపడుతున్న వినియోగదారులు చెక్కి గోధుమ పిండి కేవలం రాజమహేంద్రవరం నగరం వాసులకు మాత్రమే పరిమితం అని తెలిసి జిల్లాలోని రైస్కార్డుదారులు కంగుతిన్నారు. జిల్లాలో 6,55,444 రైస్కార్డుదారులు ఉన్నారు. అంటే మొత్తం లబ్ధిదారుల్లో కేవలం 14శాతం మందికి మాత్రమే గోధుమపిండి అందుతుందని అంచనా. జిల్లాలో కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీలతో పాటు, 21 మండలాల్లో ఈ గోధుమపిండి పంపిణీ లేదు. దీనిపై వినియోగదారులు మండిపడుతున్నారు. పండగ రాజమహేంద్రవరం నగరవాసులకేనా అని ప్రశ్నిస్తున్నారు. బాబు ప్రభుత్వంలో రేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాపంపిణీ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్) అందించేవారు. అరకేజీ పంచదార, కేజీ చొప్పున కందిపప్పు, గోధుమపిండిని వినియోగదారులకు అందజేసేవారు. రేషన్ సరకులను మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ)ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ వ్యవస్థను తొలగించింది. ఇప్పుడు వృద్ధులు, వితంతవులు కూడా రేషన్దుకాణాల వద్ద పడిగాపులు పడుతున్నారు. ఎండీయూలను తొలగించడంతో సుమారు 400 మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. వీరు రోడ్డెక్కి ఆందోళన చేసినా చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపలేదు. పలు సందర్భాలలో రేషన్ ద్వారా ముతక బియ్యం ఇస్తుండడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది జనవరిలో కిలో రూ.67 చొప్పున అందించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కందిపప్పును పంపిణీ చేయలేదు బహిరంగ మార్కెట్లో కేజీ కందిపప్పును రూ.120 నుంచి రూ.135 చేసి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో గోధుమపిండి ప్రతి లబ్ధిదారునికి అందించగా, బాబు ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా దీనిని రాజమహేంద్రవరం నగర పరిధిలో కేజీ రూ.20 చొప్పున అందించాలని నిర్ణయించారు. కాగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కిలో గోధుమపిండి రూ.18 చొప్పున ప్రతి నెలా అందరికీ అందించేవారు. ప్రతి ఒక్కరికీ గోధుమపిండి అందించాలి పేద, మధ్య తరగతికి మేలు చేసే ప్రతి నిత్యావసర వస్తువును ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందరికీ అందించాలి. గోధుమపిండి ప్రతి లబ్ధిదారునికి అందించాలి. నాణ్యమైన బియ్యంతో పాటు కందిపప్పు ఇతర వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. – పడాల రామకృష్ణ, సీపీఎం గ్రామ కార్యదర్శి, ధవళేశ్వరం -
చుట్టుముట్టి.. చేతులతో మెడను బిగించి..
కపిలేశ్వరపురం (మండపేట): మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పట్ల పోలీసుల దురుసుగా ప్రవర్తించారు. ప్రజా సమస్యలపై ధర్నా చేసేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారు. తెల్లవారు జామునే పెద్ద ఎత్తున పోలీసులు మండపేట పట్టణంలో మోహరించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద, బస్టాండ్లోని రిక్షా స్టాండ్ వద్ద, ప్రధాన కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. సామాన్య ప్రజల సమస్యల పట్ల అధికార పార్టీ నేతలు, వారికి వత్తాసు పలుకుతున్న మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు స్పందిస్తున్న తీరును ప్రశ్నించేందుకు బయలుదేరిన ఎమ్మెల్సీ తోటను పోలీసులు నిర్బంధించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పార్టీ కార్యాలయం వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. మండపేట మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీ నేతలా వ్యవహరిస్తూ సామాన్యుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ పట్టణ ప్రజలు ఎమ్మెల్సీ తోటకు విన్నవించుకున్నారు. అతి సులువుగా పరిష్కారమయ్యే సమస్యలకు సైతం రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని, విపక్షానికి చెందిన వారిని వేధిస్తున్నారంటూ తమ గోడును ఎమ్మెల్సీ తోటకు తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనేక సార్లు మున్సిపల్ కమిషనర్కు తన తీరును మార్చుకోవాలని సూచించారు. పరిపాలనా పరమైన నియమ నిబంధనల మేరకే నడుచుకోవాలని చెప్పి చూశారు. అయితే కమిషనర్ తన వైఖరిని మార్చుకోకుండా మరింత పేట్రేగిపోతున్నారంటూ పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ సాధారణ నిధులు రూ.10 లక్షలతో బస్టాండ్ వద్ద రిక్షా కార్మికుల నీడ కోసం రేకుల షెడ్డు నిర్మించారు. ఆ అభిమానంతో కార్మికులు అప్పట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోలతో కూడిన రిక్షాస్టాండ్ బోర్డును ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల మున్సిపల్ కమినషర్ రంగారావు తన సిబ్బందితో ఆ బోర్డును తొలగించారు. ఆ స్థానంలో పసుపు పచ్చ రంగుతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఫొటోలతో ఉన్న బోర్డు ఏర్పాటు చేశారు. ఇలా చేయడం కమిషనర్ నియంతృత్వానికి పరాకాష్ట అంటూ సోమవారం ధర్నాకు ఎమ్మెల్సీ తోట పిలుపునిచ్చారు. సంఘీభావంగా నియోజకవర్గంలోని ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రణరంగంగా మార్చిన పోలీసులు ధర్నాలో పాల్గొనేందుకు ఉదయమే ఎమ్మెల్సీ తోట, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్నబాబు, సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాజుబాబు, కొవ్వూరి త్రినాథరెడ్డి తదితరులు కార్యాలయానికి వచ్చారు. మండపేట పట్టణ, రూరల్ సీఐలు ఐ.సురేష్, పి.దొరరాజు ఆధ్వర్యంలోని పోలీసులు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఎమ్మెల్సీ త్రిమూర్తులు బయటకు వస్తుండగా గుమ్మం వద్దనే నిలువరించారు. తాను ప్రజాస్వామ్యయుతంగానే ఆందోళన చేస్తున్నానని, సామాన్య ప్రజలు కోసమే వెళ్తున్నానని, రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవని పోలీసులకు ఎమ్మెల్సీ స్పష్టత ఇచ్చారు. అనుమతి లేదన్న కారణంతో పోలీసులు బలగంతో దౌర్జన్యంగా అడ్డుకున్నారు. ప్రజా క్షేత్రానికి వెళ్లడం తన హక్కు, బాధ్యత అంటూ ఎమ్మెల్సీ తోట ముందుకు సాగగా ఆయన్ను చుట్టుముట్టి, చేతులతో మెడను బిగించి బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులు ముఖ్యంగా మహిళా నాయకులు పోలీసుల చర్యను చైతన్యంతో అడ్డుకున్నారు. డీఎస్పీ రఘువీర్ వచ్చి ఎమ్మెల్సీ తోటతో చర్చలు జరిపారు. సమస్యలు చెప్పేందుకు పరిమిత సంఖ్యలో వస్తానంటే కమిషనర్ వద్దకు తీసుకెళ్తానన్నారు. కమిషనర్ దౌర్జన్యాలకు బలైపోతున్నది నలుగురు కాదని, వేలాది మంది ఉన్నారని, అందరూ మున్సిపల్ కార్యాలయానికి వస్తామని ఎమ్మెల్సీ తోట అన్నారు. పోలీసులుగా ప్రజల తరఫున నిలబడదలచుకుంటే కమిషనర్నే ప్రజలు వద్దకు వచ్చి సమాధానం చెప్పేలా చూడాలని కోరారు. మున్సిపాలిటీకి చెందిన రూ.నాలుగు కోట్ల విలువైన స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో తాను కాపాడి తిరిగి మున్సిపాలిటీకి అప్పగించానన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే గతంలో ఆక్రమించిన వ్యక్తే మరోసారి కబ్జాచేసి గోడ నిర్మించడం వెనుక కమిషనర్ హస్తం ఉందన్నారు. పట్టణంలో కొంతమందిని లక్ష్యంగా పెట్టుకుని వారి భవనాలను కూల్చేయిస్తున్నారంటూ కమిషనర్ తీరును పోలీసులకు వివరించారు. అలాంటి కమిషనర్కి వ్యతిరేకంగా ప్రజలు ప్రశ్నిస్తామని వెళ్తుండగా ఆపుతామనడం ధర్మం కాదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫొటో ఉన్న రిక్షాస్టాండ్ బోర్డును అదే స్థలంలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తర్జనభర్జనల అనంతరం 20 రోజుల్లో బోర్డును పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. నిర్దేశించిన సమయంలోపు బోర్డు పునరుద్ధరించకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రజలు కమిషనర్కు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ తోట హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ పట్టణ, మండలాల అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, అడబాల బాబ్జి, గూటం సత్యనారాయణ, వెలగల సత్యనారాయణరెడ్డి, ఎంపీపీలు జుత్తుక వెంకటలక్ష్మి, నౌడు వెంకటరమణ, నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తోటను నిలువరిస్తున్న పోలీసులు మండపేటలో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఎమ్మెల్సీ తోట పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన ధర్నాకు వెళ్తామన్నందుకు దౌర్జన్యం రాజకీయ నేతను తలపిస్తున్న మున్సిపల్ కమిషనర్ మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ ఉన్న బోర్డు తొలగింపు పునరుద్ధరించాలంటూ వైఎస్సార్ సీపీ ఆందోళన -
పర్యావరణ అంచనాకు పక్షుల గణన
తాళ్లరేవు: పర్యావరణంలో నెలకొన్న పరిస్థితులను అంచనా వేసేందుకు పక్షుల గణన దోహదపడుతుందని, అందువల్లే ఏటా ఈ కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా అటవీశాఖ అధికారి ఎన్.రామచంద్రరావు తెలిపారు. ఆదివారం కోరంగి బయోడైవర్సటీ సెంటర్లో ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ – 2026 వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. మడ అటవీ ప్రాంతంలో సంచరించే వివిధ రకాల పక్షులు, దూర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను లెక్కించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సంబంధించి తమ సిబ్బందితో పాటు ఒక వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్, ఒక సైంటిస్ట్, ఒక స్టూడెంట్తో కలిపి నలుగురు సభ్యులతో కూడిన 12 బృందాలను సిద్ధం చేశామన్నారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ప్రత్యేక కెమెరాలతో అభయారణ్యంలో గుర్తించిన 12 ప్రాంతాల్లో పక్షుల గణన చేపట్టనున్నట్లు తెలిపారు. బీఎన్హెచ్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ పి.సత్య శెల్వం తదితరులు పక్షులను ఎలా గుర్తించాలి, గణన ఎలా చేపట్టాలన్న అంశాలను వివరించారు. పక్షుల గణన ప్రాముఖ్యతను ఐబీసీఎన్ స్టేట్ కోఆర్డినేటర్ మృత్యుంజయరావు తెలిపారు. ఈ అభయారణ్యంలో 11 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అమలాపురం ఫారెస్ట్ రేంజర్ జి.ఈశ్వరరావు, ఎఫ్ఎస్ఓలు, అటవీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
ఒకరి పరిస్థితి విషమం యానాం: యానాం– ఎదుర్లంక బాలయోగి వారధిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు అయ్యాయి. రెండు బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ బైక్పై అమలాపురం వైపు వెళుతున్న ప్రత్తిపాడు చెందిన ఇద్దరు వ్యక్తులు, అదేవిధంగా యానాం వైపు వెళుతున్న తాళ్లరేవు చెందిన ఇద్దరు మరో బైక్పై వచ్చి పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురికీ గాయాలు కాగా, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం నేపథ్యంలో వంతెనపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలి ఐ.పోలవరం స్టేషన్ పరిధికి వస్తుందని వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. -
జంట ఆత్మహత్యాయత్నం
యానాం/ తాళ్లరేవు: యానాం బైపాస్ రహదారి సమీపంలోని సుంకరపాలెంలో ఓ లాడ్జిలో ఓ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. పాలకొల్లు పట్టణానికి చెందిన కావూరి రమేష్, బొక్కా భాగ్యశ్రీ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారు ఇంటి నుంచి పారిపోయి ఈ నెల 1న యానాం సమీపంలో సుంకరపాలెంలోని ఓ లాడ్జిలో దిగారు. ఆ ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్నవారిని చూసిన లాడ్జి యాజమాన్యం స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ జంటకు ఇది వరకే వివాహాలు అయినట్లు బంధువులు చెబుతు న్నారు. 28 ఏళ్ల రమేష్కు ఒక అమ్మాయి ఉండగా, భాగ్యశ్రీకి ఇద్దరు పిల్లలు ఉన్నారని అంటున్నారు. ఆ మెకు వివాహమై 12 ఏళ్లు అయ్యిందని, భర్త దుబాయ్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఇరువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నట్లు తాళ్లరేవు ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. -
మురిసేలా.. మైమరపించేలా..
యానాం: ప్రకృతి ప్రేమికుల మది మురిసేలా.. అందరినీ మైమరపించేలా యానాం ప్రజా ప్రజా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 24వ ఫల, పుష్ప ప్రదర్శన ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. యానాం డాక్టర్ వైఎస్సార్ ఇండోర్ స్టేడియం పక్కనే బాలయోగి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసే ఫల, పుష్ప ప్రదర్శన కోసం ప్రభుత్వం రూ.53.60 లక్షలు ఖర్చు చేయనుంది. కడియం, పూణె తదితర ప్రాంతాల నుంచి తెచ్చే వందలాది పుష్పజాతి మొక్కలు, రైతులు పండించిన వివిధ రకాల కూరగాయలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. అదేవిధంగా ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూలతో తయారు చేసిన వివిధ ఆకృతులను విద్యుత్ కాంతుల మధ్య ఉంచనున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఔత్సాహికులకు వివిధ పోటీలను నిర్వహిస్తున్నారు. ఇళ్లు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పెంచే పూల మొక్కలను న్యాయనిర్ణేతలు పరిశీలించి వారికి బహుమతులు ఇవ్వనున్నారు. అదేవిధంగా మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి పుదుచ్చేరి సీఎం రంగసామిని, ఎల్జీ కె కై లాషనాథన్ను, మంత్రులను ఆహ్వానించనున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఒకవైపు ప్రజా ఉత్సవాల సాంస్కృతిక ప్రదర్శనలు, మరోవైపు ఫల, పుష్ప ప్రదర్శనతో యానాం పట్టణంలో నాలుగు రోజుల పాటు సందడి నెలకొననుంది. ఫ యానాంలో ఫల, పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు ఫ రేపటి నుంచి నాలుగు రోజుల పాటు కనువిందు -
పంట కాలువలో పడి వృద్ధుడి మృతి
పి.గన్నవరం: ప్రధాన పంట కాలువలో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటూ ప్రమాదవశాత్తూ నీట మునిగి ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన జి.పెదపూడిలో జరిగింది. ఎస్సై బి.శివకృష్ణ కథనం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన కాండ్రేగుల రామకృష్ణ (61) ఇంటింటికీ తిరిగి పాత ఇనుము కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం జి.పెదపూడి వంతెన వద్ద అడ్డుపడిన ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కాలు జారి పంట కాలువలో మునిగిపోయాడు. సాయంత్రానికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, పంట కాలువ వద్ద అతడి సైకిల్ కనిపించింది. దీంతో కాలువలో పడిపోయినట్టు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆధ్వర్యంలో కాలువలో గాలించగా ఆదివారం రామకృష్ణ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
మహిళ గొంతు కోసి..
ఆపై హత్యకు యత్నించిన నిందితుడుకాకినాడ క్రైం: కాకినాడలో ఓ మహిళపై హత్యాయత్నం జరిగింది.. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక సూర్యనారాయణపురం పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్లో నివాసం ఉంటున్న ఆకుల అన్నపూర్ణ (32) ఇంట్లోనే బ్యూటీపార్లర్ నడుపుతూ జీవనం కొనసాగిస్తుంది. తన భర్త సతీష్తో నాలుగేళ్ల కిందట విడిపోయి ఎనిమిదేళ్ల కుమారుడు లోకేష్తో కలసి ఉంటుంది. కొన్నాళ్ల క్రితం ఆమె సోదరుడు వీరసాయి స్నేహితుడు అయిన ముచ్చినపల్లి మణికంఠతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం నేపథ్యంలో అన్నపూర్ణకు పలు పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. వారిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కొనసాగి, అన్నపూర్ణ మణికంఠకు డబ్బులు ఇచ్చింది. హోటల్లో పనిచేస్తూ సంపాదన అంతంత మాత్రంగా ఉన్న మణికంఠ ఆమెకు సకాలంలో డబ్బులు ఇవ్వలేకపోయాడు. దీంతో తరచూ వీరివురి మధ్య గొడవలు జరుగుతుండేవి. శనివారం సాయంత్రం మణికంఠ ఎప్పటిలాగే అన్నపూర్ణ ఇంటికి వెళ్లాడు. అన్నపూర్ణ తాను ఈఎంఐలు కట్టాల్సి ఉందని, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే తనకు చావే శరణ్యమని అంది. దీంతో కోపోద్రిక్తుడైన మణికంఠ నువ్వు చావడం ఎందుకు, నేనే చంపుతానంటూ ఇంట్లో ఉన్న చాకు తీసుకొని అన్నపూర్ణ పీకకోశాడు. తప్పించుకునేందుకు యత్నించిన ఆమె చేయి, పొట్టపై తీవ్రంగా పొడిచాడు. ఇంట్లో నుంచి అతికష్టం మీద బయటకు వచ్చి రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రురాలు ఆరుబయట కూర్చొని తనను రక్షించాలంటూ దారిన పోయే వారిని అర్థించింది. స్థానికులు గమనించి ఇంటి తలుపులు తెరిచి చూడగా ఇంట్లో మణికంఠ తన మెడ కోసుకొని ఆత్మహత్యకు యత్నించడాన్ని గమనించారు. వీరిద్దరినీ స్థానికులు కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మణికంఠకు స్వల్ప గాయాలవ్వగా ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. అన్నపూర్ణ పరిస్థితి విషమంగా ఉందని ఆమె మెడను బలంగా కోయడం వల్ల అన్నవాహిక పూర్తిగా తెగిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆదివారం రాత్రి హైదరాబాద్కు తరలించారు. కాకినాడ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఘటనా స్థలాన్ని సీఐ సత్యనారాయణ పరిశీలించారు. -
కాలువలోకి దూసుకెళ్లిన వ్యాన్
అంబాజీపేట: కె.పెదపూడి మలుపు వద్ద ఆదివారం తెల్లవారు జామున ఓ వ్యాన్ పంట కాలువలోకి దూసుకెళ్లింది. రాజమహేంద్రవరం నుంచి అమలాపురం వెళుతున్న ఈ వ్యాన్ అదుపుతప్పి నేరుగా పంట కాలువలోకి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ వ్యాన్లో డ్రైవర్ తప్ప ఎవరూ లేకపోవడం, అతను కూడా స్వల్ప గాయాలతో బయట పడడంతో పెను ప్రమాదం తప్పింది. వ్యాన్ను క్రేన్ సాయంతో బయటకు తీశారు. దీనిపై పోలీసులు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. నేటి నుంచి జాతీయ స్థాయి ప్రో–కార్ట్ రేసింగ్ గండేపల్లి: సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో సోమవారం నుంచి జాతీయ స్థాయి ప్రో–కార్ట్ రేసింగ్ సీజన్–6 (ఎండ్యూరెన్స్ చాంపియన్ షిప్–2026) పోటీలు నిర్వహించనున్నట్టు ప్రో చాన్సిలర్ ఎన్.సతీష్రెడ్డి తెలిపారు. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేశామన్నారు. వెహికల్ డిజైన్, పిక్–అప్, బ్రేక్, లోడ్, స్పీడ్ తదితర విభాగాలు పరీక్షించి విజేతలను పాయింట్ల ప్రకారం ఎంపిక చేస్తామని అన్నారు. విజేతలను జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు పురస్కారాలతో సత్కరిస్తామన్నారు. అమలాపురంలో జ్యూస్ షాపు దగ్ధం అమలాపురం టౌన్: స్థానిక హైస్కూల్ సెంటర్లోని శ్రీనివాస లస్సీ అండ్ ఫ్రూట్స్, జ్యూస్ షాపు శనివారం అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. అమలాపురం అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే షాపులోని ఫ్రిజ్లు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. మట్టపర్తి శ్రీనివాస్కి చెందిన ఈ షాపు ప్రమాదంలో కాలిపోయింది. ప్రమాదంలో రూ.2.50 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక దళాధికారి ఎం.రాజా తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
సెల్ఫ్ అసెస్మెంట్కు వేళాయె..
ఫ నేటి నుంచి ఎస్ఏ–3 పరీక్షలు ఫ హాజరుకానున్న 1.07 లక్షల మంది విద్యార్థులు రాయవరం: విద్యార్థి అభ్యసన సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు విద్యాశాఖ పలు పరీక్షలు నిర్వహిస్తోంది. ఏటా నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు జరుపుతోంది. ఇందులో భాగంగా స్వీయ అంచనా–3 పరీక్షలను ఈ నెల 5వ తేదీ సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చేపట్టనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు 2022 నవంబర్ నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలను ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ విధానంలో ప్రారంభించారు. గతంలో సీబీటీ పరీక్షలను రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్కు అమలు చేయగా, ఇప్పుడు పూర్తిగా నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను సీబీటీ విధానంలోనే నిర్వహిస్తున్నారు. గతంలో 1–8 తరగతులకు మాత్రమే సీబీటీ విధానం అమలు చేయగా, ఇప్పుడు 9వ తరగతి వరకూ అమలు చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు మాత్రం గతంలో మాదిరిగానే డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇందుకు సంబంధించి డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమైంది. సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ప్రశ్నలు ఎంయూఏ విధానంలో ఇస్తారు. ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైపులో ఇస్తారు. 15 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానం, ఐదు మార్కులకు రాత పూర్వక జవాబు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలన్నీ కూడా విద్యార్థి సమగ్రంగా అంచనా వేసే విధంగా ఉంటాయి. మెకానికల్.. అండర్ స్టాండింగ్.. అప్లికేషన్ (ఎంయూఏ) విధానంలో ఉంటాయి. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాలి. నేటి నుంచి 8వ తేదీ వరకు.. సీబీఏ విధానంలో నిర్వహించే పరీక్షలు సోమవారం నుంచి 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 2,02,532 మంది విద్యార్థులు విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ యాజమాన్యాల పరిధిలో 1,08,733 మంది, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 93,799 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండ గా, వీరంతా సెల్ఫ్ అసెస్మెంట్–3 పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన వి ద్యార్థులు సాధారణ విధానంలోనే పరీక్షలు రాస్తారు. వీరికి సీబీఏ విధానంలో పరీక్షలు నిర్వహించరు. మండల కేంద్రాలకు పంపిణీ పూర్తి పరీక్ష పత్రాలు, ఓఎంఆర్ షీట్లను జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పంపిణీ చేశాం. పరీక్ష పేపర్లకు ఎంఈఓలు కస్టోడియన్లుగా వ్యవహరిస్తారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. –బి.హనుమంతురావు, ప్రధాన కార్యదర్శి, డీసీఈబీ, అమలాపురం పకడ్బందీగా నిర్వహించాలి పరీక్షలను ప్రధానోపాధ్యాయులు పకడ్బందీగా నిర్వహించాలి. క్లాస్ రూమ్ బేస్ట్ అసెస్మెంట్ విధానంపై ఉపాధ్యాయులకు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవగాహన ఉంది. గతంలో నిర్వహించిన సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షల మాదిరిగానే సీబీఏ పరీక్షలను కూడా నిర్వహిస్తాం. అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. –పి.నాగేశ్వరరావు, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
సఖినేటిపల్లి లాకుల వద్ద...
సఖినేటిపల్లి: పి.గన్నవరం ప్రధాన పంట కాలువలో పడి గొందికి చెందిన కొల్లాబత్తుల కుటుంబరావు (65) మృతి చెందాడు. శుక్రవారం ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి ఇంటికి చేరుకోలేదు. కుటుంబ సభ్యులు అంతా గాలించినా ఆచూకీ లభించలేదు. సఖినేటిపల్లి గ్రామీణ బ్యాంకు వద్ద అతడి సైకిల్ ఉండడంతో పొరపాటున పంట కాలువ వైపునకు వెళ్లి కాలువలోకి జారి పడిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానించారు. ఈ మేరకు పి.గన్నవరం ప్రధాన పంట కాలువ పొడవునా వెతకగా ఆదివారం సఖినేటిపల్లి లాకుల వద్ద అతని మృతదేహం గుర్తించారు. ఈ మేరకు సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు -
భీమేశ్వరాలయంలో మరో అపచారం
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో పురాతన కపాలేశ్వరస్వామి శివలింగాన్ని ముక్కోటి ఏకాదశి నాడు ధ్వంసం చేస్తే.. అధికారులు, స్థానిక నాయకులు తొందరపాటులో మరో ఘోర అపచారానికి పాల్పడ్డారని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గత డిసెంబర్ 30వ తేదీ రాత్రి ఓ దుండగుడు కపాలేశ్వరస్వామి శివలింగాన్ని సుత్తితో ధ్వంసం చేశాడని పోలీసులు చెప్పారన్నారు. ఉదయం 6.30 గంటలకు స్థానిక అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురాగా.. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం.. కూటమి నాయకులతో కలసి మధ్యాహ్నం వరకూ ఆలయం వద్దనే ఉండి.. ప్రభుత్వానికి, తమకు చెడ్డపేరు రాకూడదనే తొందరపాటులో శూన్య మాసం, మూఢమని చూడకుండా, పండితులతో చర్చించకుండా శివలింగాన్ని కంగారుగా ప్రతిష్ఠించారన్నారు. ఇది ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగిందనేది విస్తృతంగా ప్రచారమవుతోందన్నారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో ఈ మొత్తం సంఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని విష్ణు డిమాండ్ చేశారు. -
సమస్యలు పరిష్కరించకుంటే 19 నుంచి సహాయ నిరాకరణ
● ఏపీ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు ● కాకినాడలో రాష్ట్ర కౌన్సిల్ మహాసభ కాకినాడ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రీ సర్వే ప్రాజెక్ట్లో పని చేస్తున్న తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 19 నుంచి సహాయ నిరాకరణ చేస్తామని ఏపీ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు బూరాడ హెచ్చరించారు. కాకినాడ కేఎంసీ ఫంక్షన్ హాలులో సంఘం 5వ రాష్ట్ర కౌన్సిల్ మహాసభ ఆదివారం జరిగింది. దీనికి అన్ని జిల్లాల నుంచి సంఘ ప్రతినిధులు, గ్రామ సర్వేయర్లు సుమారు 150 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ, ఇతర సచివాలయ ఉద్యోగుల మాదిరిగానే ప్రమోషన్ చానల్లో బేసిక్ పే రూ.30 వేల పైచిలుకు ఉండాలని, నోషనల్ ఇంక్రిమెంట్, టీఏ, డీఏ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, రీ సర్వేలో ఉన్న సర్వేయర్లకు సచివాలయ పరిధిలోని ఇతర సర్వేల నుంచి మినహాయింపు ఇవ్వాలని, రీ సర్వేలో ఆఫ్లైన్, ఆన్లైన్ సబ్ డివిజన్ తదితర పనుల ఒత్తిడి ఉన్నందుకు చాలినంత సమయం ఇవ్వాలని, వీఆర్వోలు, డీటీలు కూడా రీ సర్వేలో పని చేసేలా చర్యలు తీసుకోవాలని, సర్వే, భూమి రికార్డుల శాఖలో కనీస అర్హతను ఐటీఐ నుంచి డిప్లొమాగా మార్చాలని, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సహాయ నిరాకరణలో భాగంగా కార్యాలయ పని వేళల్లో మాత్రమే విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. అధిక వేళల్లో విధులు నిర్వహించడమనేది వ్యక్తిగత హక్కులను కాలరాయడమేనని అన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోజ్కుమార్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నాట్లు.. పాట్లు..
జిల్లాలో మండలాలవారీగా వరి నాట్ల విస్తీర్ణం (హెక్టార్లలో..) మండలం మొత్తం సాగు వేసిన విస్తీర్ణం నాట్లు రాజమహేంద్రవరం రూరల్ 1,265 886 కడియం 2,217 49 రాజానగరం 3,648 664 అనపర్తి 3,766 1,360 బిక్కవోలు 5,988 224 కోరుకొండ 2,341 302 గోకవరం 1,977 85 సీతానగరం 3,440 110 రంగంపేట 1,000 84 చాగల్లు 3,496 251 దేవరపల్లి 3,130 0 గోపాలపురం 2,211 137 కొవ్వూరు 4,709 565 నిడదవోలు 7,276 1,600 పెరవలి 3,464 2 తాళ్ళపూడి 3,605 173 ఉండ్రాజవరం 4,931 24 నల్లజర్ల 2,862 250 ● నత్తనడకన రబీ ● వరి సాగు లక్ష్యం 61,326 హెక్టార్లు ● ఇప్పటి వరకూ 15 వేల హెకార్లలోనే నాట్లు పెరవలి: రబీ వరి సాగు పనులు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 61,326 హెక్టార్లలో రబీ వరి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ, వివిధ కారణాలతో గత నెల 27వ తేదీ నాటికి 6,766 హెక్టార్లలో మాత్రమే వరి నాట్లు పూర్తయ్యాయి. గడచిన ఎనిమిది రోజుల్లో మరో 8 వేల హెక్టార్ల నాట్లు పడి ఉండవచ్చని అంచనా వేసినా.. మొత్తం సుమారు 15 వేల హెక్టార్లు మాత్రమే అవుతుంది. కొన్ని మండలాల్లో కనీసం 10 శాతం నాట్లు కూడా వేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రబీ పనులు ఈవిధంగా సాగితే ఈ నెలాఖరుకై నా నాట్లు పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి. అదే కనుక జరిగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా 3 వేల హెక్టార్లలో వరి ఆకుమడులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత నెలలో సైతం ఖరీఫ్ మాసూళ్లు జరగడంతో చాలాచోట్ల రైతులు సకాలంలో ఆకుమడులు వేయలేకపోయారు. ఇప్పుడు ఆకుమడులు వేసి పది పదిహేను రోజులే అవడంతో నాట్లు మరింత జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా నవంబర్ నెలాఖరులో చేలను దుక్కులు దున్ని డిసెంబర్లో దమ్ములు చేసి డిసెంబర్ నెలాఖరుకు రబీ వరి నాట్లు పూర్తి చేయడం రైతులకు ఆనవాయితీ, అందుకు విరుద్ధంగా ఈసారి చాలాచోట్ల జనవరిలో సైతం దుక్కులు దున్ని, నాట్లు వేయడానికి పొలాలను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. జాప్యానికి కారణాలివీ.. రబీ సాగు జాప్యానికి రైతులు అనేక కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులను సమకూర్చామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అవి లభ్యం కావడం లేదని చాలామంది ఆరోపిస్తున్నారు. దీంతో, వీటిని అధిక ధరలకు ప్రైవేటు సంస్థల వద్ద కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా గత ఖరీఫ్లో పంట దెబ్బ తినడం, ధాన్యం దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీనికితోడు ఖరీఫ్లో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో రబీ పెట్టుబడికి సొమ్ము లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కాలువలకు సమయానికి నీరు విడుదల చేస్తే చాలని ప్రభుత్వం అనుకుంటోందని, కానీ, పెట్టుబడి లేకుండా సాగు పనులు ఎలా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఉసులుమర్రులో నాట్లకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతు మల్లేశ్వరంలో వారం రోజల ఆకుమడి భయం వేస్తోంది వరి సాగు చేయాలంటే భయం వేస్తోంది. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. తుపాను సమయంలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయలేదు. నానా ఇబ్బందులూ పడ్డాం. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. – చిట్టీడి వీర వెంకట సత్యనారాయణ, పెరవలి ఆందోళనతోనే సాగు ఖరీఫ్ పంట ఆలస్యంతో రబీ సాగులో మరింత జాప్యం జరుగుతోంది. డిసెంబర్ నెలలో ధాన్యం అమ్మకాలు చేశాం. డిసెంబర్ చివరిలో ఆకుమడులు వేశాం. పంట ఎలా ఉంటుందోననే ఆందోళనతోనే రబీ సాగు చేస్తున్నాం. – లొల్ల నాగేశ్వరరావు, వరి రైతు, కొత్తపల్లి అగ్రహారం పెట్టుబడి లేక.. నవంబర్ నెలాఖరులో రబీ ఆకుమడులు వేసేవాళ్లం. ఈ ఏడాది పెట్టుబడికి సొమ్ము లేక అప్పులు చేసి ఆలస్యంగా వేస్తున్నాం. పంట సాగుకు పెట్టుబడి ఎలా తేవాలో తెలియడం లేదు. – వలవల బాలాజీ, వరి రైతు, ముక్కామల -
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
● స్నోయగంఅవనీతలమంతా హిమాలయమే అయ్యిందా అన్నట్లుగా.. ఉషోదయాన కమ్ముకున్న మంచుతెరలు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేశాయి. కంటి ముందున్న దృశ్యం కానరానంతగా అలముకున్న మంచును.. తన కిరణ కరవాలాలతో ఛేదించలేక భానుడు అవస్థలు పడ్డాడు. వర్షంలా కురుస్తున్న హిమపాతంలో దైవ సన్నిధానాలు.. పచ్చని పొలాలు సరికొత్త అందాలను అద్దుకున్నాయి. ఒంటిని కోసేస్తున్నట్టుగా ఉన్న ఆ చలిలోనే కష్టజీవులు బతుకు పోరాటం సాగించారు. వ్యవసాయదారులు, కూలీలు దట్టమైన మంచులోనే రాకపోకలు సాగించారు. విద్యార్థులు హిమ మహిమను ఆస్వాదిస్తూనే పాఠశాలలకు బయలుదేరారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో ఈ అందాల ‘స్నో’యగాలు ఆదివారం ఆవిష్కృతమయ్యాయి. – పెరవలి -
‘తాతను ఎలా వధించాలో ఆయన్నే అడుగుదాం’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘గ్రీష్మకాలపు మధ్యందిన మార్తాండునిలా చెలరేగిపోతున్న భీష్మ పితామహుడిని ఎలా నిరోధించాలో తెలియని పాండవులు.. కృష్ణుడితో సమావేశమయ్యారు. తాతను ఎలా వధించాలో ఆయననే అడుగుదామన్న ధర్మరాజు సూచనను కృష్ణుడు ఆమోదించాడు’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచన పరంపరలో భాగంగా.. అంపశయ్యను చేరిన భీష్ముని ఇతివృత్తాన్ని ఆదివారం ఆయన వివరించారు. ‘‘ఆయుధాలు, కవచాలు వదిలి, కృష్ణుడితో కలసి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన తొమ్మిదో రోజు రాత్రి భీష్ముడిని పాండవులు కలిశారు. ‘తాతా! మాకు ఎలా జయం కలుగుతుంది? నిన్ను ఎలా వధించగలం?’ అని ధర్మరాజు అడిగాడు. ముందు సీ్త్రగా జన్మించి, పురుషుడిగా మారిన శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చేయాలని భీష్ముడు చెబుతాడు. ధర్మరాజు ఇలా అడగటం, భీష్ముడు తన మరణానికి మార్గం చెప్పడం తప్పు కాదా అనే సందేహం కలగవచ్చు. శిఖండితో భీష్ముడు యుద్ధం చేయడన్నది రహస్యం కాదు. భీష్ముని వధ కోసమే శిఖండి జన్మించాడని.. ద్రోణుడిని వధించడానికే తాను జన్మించానని వనపర్వంలో ధర్మరాజుతో దృష్టద్యుమ్నుడు చెబుతాడు. దుర్యోధనుడితో యుద్ధం ప్రారంభానికి ముందే తాను శిఖండితో పోరాడనని భీష్ముడు బహిరంగంగానే చెబుతాడు. అన్నీ తెలిసి కూడా ధర్మరాజు.. భీష్ముడిని వధోపాయం ఎందుకు అడిగాడనే సందేహం రావచ్చు. నిజానికి శిఖండిని ఎదుట నిలుపుకొని భీష్ముడిని వధించడానికి ఆయన అనుమతిని ధర్మరాజు కోరినట్లు మనం భావించాలి. తీవ్రంగా చెలరేగిపోతున్న భీష్మునిలో పదో రోజు పోరులో ఒక రకమైన వైరాగ్యం ఉదయించింది. తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం వరం స్ఫురణకు వచ్చింది. అర్జునుడు ప్రయోగించిన బాణాలు అతడిని తీవ్రంగా నొప్పించాయి. భీష్ముడి శరీరంలో బాణాలు లేని చోటు రెండంగుళాలు కూడా లేదు. అక్కడ ఎవ్వరూ అంపశయ్య ఏర్పాటు చేయలేదు. బాణాల వలన భీష్ముడు నేల మీద వాలలేదు. బాణాలతో ఏర్పడిన శయ్యపై వాలాడు. ఆయన తల నిరాధారంగా వాలుతూంటే, అర్జునుడు అస్త్రాలతో దిండు వంటిది ఏర్పాటు చేశాడు. భీష్మ పితామహుని వధోపాయం విన్న అర్జునుడు శోకనిమగ్నుడయ్యాడు. ‘బాల్యంలో ఆటలాడుకుంటూ దుమ్ము కొట్టుకుపోయిన వస్త్రాలతో ఆయన ఒడిలో ఆడుకున్నాం. ఒకసారి ఆయన్ను నేను నాన్నా అని పిలిచానట. నేను నీకు నాన్నను కాను. మీ నాన్నకు నాన్న వరుస అయిన వాడిని’ అని భీష్ముడు అన్నారని అర్జునుడు గుర్తు చేసుకున్నాడు’’ అని సామవేదం వివరించారు. అనంతరం భీష్మ పర్వాన్ని సామవేదం ముగించారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు పోతనామాత్య విరచిత ‘త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప..’ పద్యంతో ప్రవచనానికి శుభారంభం పలికారు. -
‘బంగారు’ భవ్యశ్రీ
రాజమహేంద్రవరం రూరల్: జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీల్లో కొంతమూరుకు చెందిన కెల్లా భవ్యశ్రీ బంగారు, రజత పతకాలు సాధించింది. గత నెల 25 నుంచి 30వ తేదీ వరకూ గ్వాలియర్లో జరిగిన 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్–14 సబ్ జూనియర్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున ఆమె పాల్గొంది. 500 మీటర్ల రోడ్ రేస్ విభాగంలో బంగారు, 500–డి విభాగంలో రజత పతకాలను సాధించింది. భవ్యశ్రీ స్థానిక బోధి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమెను, కోచ్లు కె.రాము, వి.ఈశ్వర్లను, తల్లిదండ్రులు సునీత, వీరబాబులను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డీఈఓ కె.వాసుదేవరావు, పాఠశాల డైరెక్టర్ ఎస్.ప్రీతి, ఉపాధ్యాయులు అభినందించారు. ఆసియా గేమ్స్లో భారతదేశం తరఫున పాల్గొనడమే తన లక్ష్యమని భవ్యశ్రీ ఈ సందర్భంగా పేర్కొంది. రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్కు కౌన్సెలింగ్ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు సంబంధిత ఎస్హెచ్ఓల ఆధ్వర్యాన ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించిన ట్లు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఒక ప్రకటన లో తెలిపారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, ఎటువంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. ఎవరూ గంజాయి తాగడం, విక్రయించడం చేయరాదన్నారు.రత్నగిరిపై రద్దీఅన్నవరం: సెలవు రోజు కావడంతో రత్నగిరికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. విశేషాలంకరణలో తలుపులమ్మ తల్లి తుని రూరల్: భక్త వరదాయినిగా ఖ్యాతికెక్కిన తలుపులమ్మ అమ్మవారు ఆదివారం విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 5 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.61,005, పూజా టికెట్లకు రూ.44,430, కేశఖండన శాలకు రూ.1,960, వాహన పూజలకు రూ.4,450, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.23,375, విరాళాలు రూ.47,790 కలిపి మొత్తం రూ.1,82,919 ఆదాయం సమకూరిందని వివరించారు. భజే విఘ్ననాయకా.. అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ చేసి వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 30 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 23 మంది భక్తులు పాల్గొన్నారు. 1672 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఈ ఒక్కరోజు ఆలయానికి రూ,2,90,586 ఆదాయం సమకూరిందని అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
బరి కొద్దీ సిరి!
సాక్షి, రాజమహేంద్రవరం: సంక్రాంతికి ముందే కూటమి నేతలు బరి తెగిస్తున్నారా? కోడిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా? కోడిపందేల కంటే బరులకే ప్రాధాన్యం ఇస్తున్నారా? ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారా? బరి స్థాయిని బట్టి ధర నిర్ణయించేశారా? వసూళ్లకు ప్రణాళికలు రూపొందించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సంక్రాంతి కోడిపందేలపై కూటమి ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. బరులు ఏర్పాటు చేయాలంటే తమ చేయి తడపాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా.. వసూళ్లపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటాలపై క్లారిటీ సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కోడిపందేల బరులపై చంద్రబాబు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. బరుల కోసం వేలం పాటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒక్కో బరికి ఇంత ధర అని నిర్ణయించి మరీ వసూళ్లకు తెర తీస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బరి స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తం ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తోంది. ఎవరు బరి ఏర్పాటు చేసుకోవాలి, ఎవరికి అనుమతి ఇవ్వాలి, ఎవరి వాటా ఎంత అన్న వ్యవహారం మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, పోలీసులు ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. కూటమి నేతల ప్రణాళికలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో జరిగిన సంక్రాంతి పండగకు కూటమి నేతలు భారీగా రంగంలోకి దిగారు. ప్రతి గ్రామంలో బరి ఉండేలా చక్రం తిప్పారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోపాలపురం, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు తదితర నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి ఒకటి, రెండు చొప్పున కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంతకుమించి కోడిపందేల బరులు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. టీడీపీ, జనసేన మధ్య పోటీ కోండిపందేల బరుల ఏర్పాటుపై టీడీపీ, జనసే నేతలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తామే బరులు ఏర్పాటు చేయాలని ఓ వర్గం, కూటమిలో తామూ భాగమని, తమకూ బరులు కావాలని మరో వర్గం నేతలు పోటీపడుతున్నట్లు తెలిసింది. తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతున్నారు. పోటీ అధికంగా ఉండటంతో బరులకు వేలం పాటలు నిర్వహించాలని ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్టు సమాచారం. ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే బరి దక్కేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పేకాట, గుండాటపై దృష్టి బరుల ఏర్పాటుకు పోటీ పెరుగుతుండటంతో కొందరు కూటమి నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తున్నారు. కోడిపందేల ముసుగులో సాగే గుండాటలు, పేకాట, బొమ్మ, బొరుసు వంటి వాటిని జోరుగా నిర్వహించి సందట్లో సడేమియా అన్నట్లు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రూ.కోట్లలో పందేలు గోదావరి జిల్లాలో రూ.వందల నుంచి రూ.కోట్లలో కోడిపందేలు జరుగుతుంటాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు బుల్లెట్లు, బైకులు బహుమతులుగా పెడుతున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురుతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు.సంక్రాంతంటే గోదావరి జిల్లాలే..ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ప్రబల తీర్థం, ఎడ్లబండి పోటీలు, గుర్రపు పోటీలు ఇలా ఎన్ని నిర్వహించినా.. కోడిపందేలు లేనిదే పండగ సందడి ఉండదు. ఇందులో భాగంగానే ఎవరు ఏమన్నా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఆంక్షలు పెట్టినా.. కోడిపందేలు ఆడి తీరుతారు. దేశ, విదేశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో గోదావరి జిల్లాలకు వస్తుంటారు. సంక్రాంతి పండగకు కుటుంబ సమేతంగా సొంతూళ్లకు వచ్చేస్తారు. కుటుంబమంతా సరదాగా గడిపేందుకే గోదావరి జిల్లాల బాట పడుతుంటారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రజాప్రతినిధులు, పోలీసులు, కోడిపందేల పేరుతో క్యాష్ చేసుకుంటున్నారు. సరదాగా, సంప్రదాయబద్ధంగా జరగాల్సిన కోడిపందేలు డబ్బులే ప్రామాణికంగా జరుగుతున్నాయి. రూ.కోట్లల్లో పందేలు వేస్తున్నారు. సరదాగా చూసేందుకు వచ్చిన వారు సైతం అందులో పాల్గొని తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు.వేలం పాటల ద్వారా కేటాయింపు కోడి పందేలు నిర్వహించే బరులను వేలం పాటల ద్వారా కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వేలం ద్వారా వచ్చే సొమ్మును ఎవరు ఎంత పంచుకోవాలన్న విషయమై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. రూ.20 లక్షల రూపాయల బరిలో ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు, పోలీస్ స్టేషన్కు రూ.2 లక్షలు, మిగిలిన సొమ్మును స్థానిక కూటమి నేతలు పంచుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రూ.10 లక్షల బరిలో కూడా ఇదే తరహాలో అందరూ సమానంగా పంచుకోవాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు పెట్టామని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలన్న తలంపుతో అందివచ్చిన ఏ అవకాశాన్ని కూటమి నేతలు వదలడం లేదు. వేలంపాట డబ్బు తమకు వదిలేయాలని గతేడాది పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను కోరారు. ఈసారి కూడా అదే పంథా అవలంబించాలని అనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
సంపూర్ణ ఉపనిషత్సారం గీత
సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సంపూర్ణ ఉపనిషత్సారం గీత. గంగ, గాయత్రి, గీత ఎవరి హృదయంలో ఉంటాయో వారికి పునర్జన్మ ఉండదని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శనివారం హిందూ సమాజంలో ఆయన వేదవ్యాసుడు ప్రసాదించిన భారతం, భీష్మపర్వంలోని యుద్ధ విశేషాలను వివరించారు. వర్షం మంచిదే, ఎప్పుడు ఎక్కడ పడాలో, ఎంత పడాలో అలా పడినప్పుడే మంచి ఫలితం వస్తుంది. దయ అనేది కూడా సర్వదా అభిలషనీయం కాదు, సమయం, సందర్భాన్ని పట్టి దయ అనేది చూపాలని సామవేదం అన్నారు. ఇరుపక్షాలు కురుక్షేత్రంలో మోహరించినప్పుడు ధర్మరాజు కవచం, ఆయుధాలు విసర్జించి భీష్ముని వద్దకు వెళ్లాడు. ఎవరికీ ఆయన అంతరంగం అర్థం కాలేదు. తాతా! యుద్ధంలో మాకు జయం కలగాలని దీవించమని ధర్మరాజు కోరాడు. నీవు ఇలా రాకపోతే, నిన్ను శపించేవాడినని భీష్ముడు అన్నాడు. ద్రోణ, కృపాచార్య, శల్యుల వద్దకు ఈ రీతిగానే వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నాడు ధర్మరాజు. ఆ తరువాత ఉభయ పక్షాల మధ్య నిలబడి, యుద్ధంలో మా పక్షాన నిలబడి పోరాడాలని ఎవరయినా రావాలనుకుంటే, రమ్మని ఆహ్వానిస్తున్నామని ఆయన ప్రకటించాడు. ధృతరాష్ట్రునికి ఒక వైశ్య కాంత వలన జన్మించిన యుయుత్సుడు పాండవ పక్షానికి వచ్చాడు. యుద్ధం ముగిసాక, ధార్తరాష్ట్రులకు పిండోదకాలు సమర్పించడం నీ బాధ్యతలాగా కనిపిస్తున్నది అని ధర్మరాజు అన్నాడు. అనేక యుద్ధ వ్యూహాలను సామవేదం వివరించారు. యుద్ధ సమయం నాటికి ద్రోణుని వయసు 400 సంవత్సరాలు. ‘యతో ధర్మస్తతః జయః, యతః కృష్ణస్తతో జయః–అన్న ద్రోణుని మాటలను భారత నినాదంగా పరిగణించాలని సామవేదం అన్నారు. యుద్ధ సమయంలో ధర్మరాజు చూపిన నీతిని మ్లేచ్ఛులు, ఆర్యులు సైతం అభినందించారు. ఆర్యులు, ద్రావిడులు అనే విభాగాలు పాశ్చాత్యుల సృష్టి మాత్రమేనని భారతదేశమంతా ఆర్యావర్తమేనని సామవేదం అన్నారు. విరాటరాజు కుమారుడు ఉత్తరుడు శల్యునితో వీరోచితంగా యుద్ధం చేసి మరణిస్తాడని సామవేదం అన్నారు. దుర్యోధనుని పరుషమైన మాటలతో కలత చెంది భీష్ముడు మండలాకారంలో బాణాలు ప్రయోగించి, రథం మీద నాట్యం చేస్తున్నట్టు కనపడతాడు. స్మరణ మాత్రాన సుదర్శన చక్రం కృష్ణుని చేతికి వచ్చింది. పార్థుని కోర్కైపె చక్రాన్ని కృష్ణుడు ఉపసంహరించుకుంటాడు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీ వీ నారాయణరావు పోతనామాత్య విరచితమైన ‘వేదాంత వీధుల విహరించు విన్నాణి..’ పద్యాన్ని ఆలపించి సభకు శుభారంభం పలికారు. -
బరి కొద్దీ సిరి!
సాక్షి, రాజమహేంద్రవరం: సంక్రాంతికి ముందే కూటమి నేతలు బరి తెగిస్తున్నారా? కోడిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారా? కోడిపందేల కంటే బరులకే ప్రాధాన్యం ఇస్తున్నారా? ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారా? బరి స్థాయిని బట్టి ధర నిర్ణయించేశారా? వసూళ్లకు ప్రణాళికలు రూపొందించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సంక్రాంతి కోడిపందేలపై కూటమి ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. బరులు ఏర్పాటు చేయాలంటే తమ చేయి తడపాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. సంక్రాంతికి ఇంకా సమయం ఉన్నా.. వసూళ్లపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటాలపై క్లారిటీ సంక్రాంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసే కోడిపందేల బరులపై చంద్రబాబు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఫోకస్ పెట్టారు. బరుల కోసం వేలం పాటలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఒక్కో బరికి ఇంత ధర అని నిర్ణయించి మరీ వసూళ్లకు తెర తీస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బరి స్థాయిని బట్టి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తం ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో నడుస్తోంది. ఎవరు బరి ఏర్పాటు చేసుకోవాలి, ఎవరికి అనుమతి ఇవ్వాలి, ఎవరి వాటా ఎంత అన్న వ్యవహారం మొత్తం దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, పోలీసులు ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. కూటమి నేతల ప్రణాళికలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో జరిగిన సంక్రాంతి పండగకు కూటమి నేతలు భారీగా రంగంలోకి దిగారు. ప్రతి గ్రామంలో బరి ఉండేలా చక్రం తిప్పారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గోపాలపురం, రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్, నిడదవోలు తదితర నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. ప్రతి పంచాయతీకి ఒకటి, రెండు చొప్పున కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంతకుమించి కోడిపందేల బరులు ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. టీడీపీ, జనసేన మధ్య పోటీ కోండిపందేల బరుల ఏర్పాటుపై టీడీపీ, జనసే నేతలు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో తామే బరులు ఏర్పాటు చేయాలని ఓ వర్గం, కూటమిలో తామూ భాగమని, తమకూ బరులు కావాలని మరో వర్గం నేతలు పోటీపడుతున్నట్లు తెలిసింది. తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతున్నారు. పోటీ అధికంగా ఉండటంతో బరులకు వేలం పాటలు నిర్వహించాలని ప్రజాప్రతినిధులు నిర్ణయించినట్టు సమాచారం. ఎవరు ఎక్కువ ధరకు పాడుకుంటే వారికే బరి దక్కేలా ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పేకాట, గుండాటపై దృష్టి బరుల ఏర్పాటుకు పోటీ పెరుగుతుండటంతో కొందరు కూటమి నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కోడిపందేల ముసుగులో సాగే గుండాటలు, పేకాట, బొమ్మ, బొరుసు వంటి వాటిని జోరుగా నిర్వహించి సందట్లో సడేమియా అన్నట్లు క్యాష్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. రూ.కోట్లలో పందేలు గోదావరి జిల్లాలో రూ.వందల నుంచి రూ.కోట్లలో కోడిపందేలు జరుగుతుంటాయి. పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు బుల్లెట్లు, బైకులు బహుమతులుగా పెడుతున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురుతో పాటు సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటారు. కోడిపందేలపై ప్రజాప్రతినిధుల ఫోకస్ క్యాష్ చేసుకునేందుకు కూటమి నేతల యత్నాలు డబ్బు కొట్టు.. బరి పట్టు అంటున్న నేతలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూళ్లకు కసరత్తు వేలం పాటల ద్వారా కేటాయింపు కోడి పందేలు నిర్వహించే బరులను వేలం పాటల ద్వారా కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వేలం ద్వారా వచ్చే సొమ్మును ఎవరు ఎంత పంచుకోవాలన్న విషయమై ఇప్పటికే క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది. రూ.20 లక్షల రూపాయల బరిలో ప్రజాప్రతినిధికి రూ.5 లక్షలు, పోలీస్ స్టేషన్కు రూ.2 లక్షలు, మిగిలిన సొమ్మును స్థానిక కూటమి నేతలు పంచుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రూ.10 లక్షల బరిలో కూడా ఇదే తరహాలో అందరూ సమానంగా పంచుకోవాలని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు పెట్టామని, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోవాలన్న తలంపుతో అందివచ్చిన ఏ అవకాశాన్ని కూటమి నేతలు వదలడం లేదు. వేలంపాట డబ్బు తమకు వదిలేయాలని గతేడాది పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను కోరారు. ఈసారి కూడా అదే పంథా అవలంబించాలని అనుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సంక్రాంతంటే గోదావరి జిల్లాలే.. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ప్రబల తీర్థం, ఎడ్లబండి పోటీలు, గుర్రపు పోటీలు ఇలా ఎన్ని నిర్వహించినా.. కోడిపందేలు లేనిదే పండగ సందడి ఉండదు. ఇందులో భాగంగానే ఎవరు ఏమన్నా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఆంక్షలు పెట్టినా.. కోడిపందేలు ఆడి తీరుతారు. దేశ, విదేశాలు, ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో గోదావరి జిల్లాలకు వస్తుంటారు. సంక్రాంతి పండగకు కుటుంబ సమేతంగా సొంతూళ్లకు వచ్చేస్తారు. కుటుంబమంతా సరదాగా గడిపేందుకే గోదావరి జిల్లాల బాట పడుతుంటారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రజాప్రతినిధులు, పోలీసులు, కోడిపందేల పేరుతో క్యాష్ చేసుకుంటున్నారు. సరదాగా, సంప్రదాయబద్ధంగా జరగాల్సిన కోడిపందేలు డబ్బులే ప్రామాణికంగా జరుగుతున్నాయి. రూ.కోట్లల్లో పందేలు వేస్తున్నారు. సరదాగా చూసేందుకు వచ్చిన వారు సైతం అందులో పాల్గొని తమ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. -
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లకు వివిద రకాల పూలతో విశేష అలంకరణ చేయటంతో స్వామివారిని చూసిన భక్తులు పులకించిపోయారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 12,500 మందికి ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కలెక్టర్ను కలసిన ఆర్ఐఓ రాజమహేంద్రవరం సిటీ: తూర్పు గోదావరి జిల్లా రీజనల్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐఓ) గా బాధ్యతలు స్వీకరించిన ఐ.శారద శనివారం కలెక్టర్ కీర్తి చేకూరిని కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకూ కాకినాడ జిల్లా ఇంటర్మీడియెట్ అధికారిగా విధులు నిర్వహించిన ఆమెను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ జిల్లా ఆర్ఐఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. డ్రైవర్లు నిబంధనలు పాటించాలిరాజమహేంద్రవరం సిటీ: రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ అన్నారు. శనివారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డిపోను సందర్శించి, అక్కడ శిక్షణ పొందుతున్న డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన నిర్వహించారు. రాజమహేంద్రవరం హుకుంపేటలోని డి–మార్ట్ సమీపంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ప్రణీత్కుమార్, ఉమామహేశ్వరరావు, ఆర్టీసీ డీఎం మాధవ్ పాల్గొన్నారు. -
నేడు 999 మంది నృత్య ప్రదర్శన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): భారత శాసీ్త్రయ కళల పరిరక్షణలో రాజమహేంద్రవరం మరో చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా మారనుంది. కళాప్రియ నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ‘‘భారతీయ శాసీ్త్రయ మహా బృంద నాట్యం’’ కార్యక్రమం, నోబుల్ వరల్డ్ రికార్ుడ్స సాధన లక్ష్యంగా ఘనంగా జరగనుంది. ఆదివారం స్థానిక జేఎన్రోడ్డులోని చెరుకూరి వీరరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ హాల్లో అచంట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 999 మంది నృత్యకళాకారులు ఏకకాలంలో మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతానికి నృత్యప్రదర్శన చేయనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తిరుపాణ్యం మాట్లాడుతూ యువత శాసీ్త్రయ కళల వైపు మరింత ఆకర్షితులవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వాహకుడు నాట్యాచార అచంట చంద్రశేఖర్ మాట్లాడుతూ శాసీ్త్రయ నాట్యాల ద్వారా దేశభక్తి, సంస్కృతి పరిరక్షణ, కళల పట్ల గౌరవాన్ని పెంపొందించడమే ఈ మహా బృంద నాట్య కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. తెలుగు శాఖ అధిపతి డాక్టర్ పీవీబీ సంజీవరావు మాట్లాడుతూ ఈ మహత్తర కార్యక్రమం చెరుకూరి వీరరాజు కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. బీజేపీ నాయకుడు దాసరి ధర్మరాజు, అధ్యాపకులు పల్లి సుధా, లలిత రమ్య, జై సుగుణ, ఎస్ రాజ్ కుమార్ పాల్గొన్నారు. -
అప్పనపల్లి... భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: బాల తిరుపతి అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. తొలి హారతితో స్వామివారు భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. ఏడుకొండల వాడా.. వెంకటరమణా.. గోవిందా.. గోవిందా.. అంటూ స్వామివారి దివ్య స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ఆనంద పరవశితులయ్యారు. అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.1,97,626 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4,500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, రెండు వేల మంది అన్న ప్రసాదం స్వీకరించారని చెప్పారు. నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.66,397 విరాళాలుగా అందించారన్నారు. అప్పనపల్లి బాల బాలాజీని దర్శించుకుంటున్న భక్తులు -
అంతర్ జిల్లాల దొంగ అరెస్ట్
నిడదవోలు: అంతర్ జిల్లాల దొంగను అరెస్టు చేసి, అతని నుంచి రూ.19.34 లక్షల విలువ చేసే 223 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి ప్లేట్, రూ.లక్షతో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉండ్రాజవరం గ్రామ భోగవల్లివారి వీధిలో గత ఏడాది అక్టోబర్ 9న కరుటూరి వెంకటరత్నంకు చెందిన ఇంట్లో 223 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండి, రూ.3.50 లక్షల నగదు చోరీకి గురైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా అల్లూరి జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం గ్రామ నివాసి అయిన చలపనశెట్టి సన్యాసిరావును అరెస్టు చేశారు. ఉండ్రాజవరంలో కేసుతో పాటు ఆత్రేయపురంలో రెండు, ప్రత్తిపాడు, గోకవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఐదు కేసులు అతనిపై ఉన్నాయి. 2018 నుంచి పలుచోట్ల దొంగతనాలకు పాల్పడిన సన్యాసిరావుపై ఇప్పటి వరకూ 35 కేసులు నమోదైనట్లు సీఐ తెలిపారు. కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ పర్యవేక్షణలో కేసును ఛేదించామన్నారు. ఉండ్రాజవరం ఎస్సై డి.రవికుమార్, జగన్మోహన్రావు, పోలీస్ సిబ్బంది వి.బుజ్జి, జ్యోతిబాబు, జి.సాంబయ్య, రెహమాన్, పి.కృష్ణాజీరావు, ఎన్వీ రామాంజనేయులును సీఐ తిలక్ అభినందించారు. బైక్ ఢీకొని వ్యక్తి మృతి తుని: స్థానిక డీమార్ట్ సమీపంలో బైక్ ఢీకొని వెలుగుల సత్తిబాబు (55) మృతి చెందాడు. శనివారం తుని పట్టణం సీతారాంపురానికి వెలుగుల సత్తిబాబు పని నిమిత్తం డీమార్ట్ సమీపంలో పాత ఇనుప సామగ్రి గోడౌన్కు వస్తుండగా ఓ బైక్ బ లంగా ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అతన్ని తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయామని భార్య, కుమారు డు కన్నీరు మున్నీరవుతున్నారు. పట్టణ పోలీసు లకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. -
మనస్తాపంతో గోదావరిలో దూకేసిన తల్లి
ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు తాళ్లపూడి: కుమార్తె కాపురం సరిగ్గా లేదనే మనస్తాపంతో ఓ తల్లి గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఈగల ధనలక్ష్మి (40), ఆమె కుమార్తె, మనుమరాలితో కలసి రాజమహేంద్రవరం వైపు నుంచి కొవ్వూరు వైపు ఆటోలో వస్తూ శుక్రవారం రాత్రి కొవ్వూరులోని రోడ్డు కం రైల్ బ్రిడ్జిపై దిగారు. ముందు ధనలక్ష్మి గోదావరిలోకి దూకేసింది. ఇంతలో ధనలక్ష్మి కుమార్తె భూసాల విజయకుమారి, ఏడాదిన్నర కుమార్తె లక్ష్మీప్రసన్నతో దూకుతుండగా అటుగా వెళుతున్న వారు రక్షించారు. ఆమె ఆచూకీ కోసం శనివారం ఉదయం నుంచి పట్టణ పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అసలేం జరిగిందంటే.. భూసాల విజయ కుమారికి 2020లో మండపేటకు చెందిన లారీ డ్రైవర్ వినయ్కుమార్తో వివాహం జరిగింది. వారికి నాలుగేళ్ల కుమారుడు మోక్షిత్, ఏడాదిన్న కుమార్తె లక్ష్మీప్రసన్న ఉన్నారు. భర్త వినయ్కుమార్ భార్యను అనుమానిస్తూ చాలా రోజుల నుంచి వేధించడంతో శుక్రవారం ఉదయం గొడవ జరిగింది. అత్త ధనలకి్ష్మ్ని మండపేట పిలిపించుకుని నీ కూతురిని తీసుకుపో అని చెప్పడంతో ఆమె భూసాల విజయకుమారి, లక్ష్మీప్రసన్నలను మండపేట నుంచి రాజమహేంద్రవరం వచ్చారు. కొంతసేపు అక్కడే ఉండి మాట్లాడుకున్నారు. నీ భర్త నిన్ను ఎలాగైనా చంపేస్తాడని, అతని చేతిలో చచ్చేది ఏంటని అందరూ కలసి చచ్చిపోదామని ముగ్గురు ఆటోలో కొవ్వూరు వైపు వస్తూ బ్రిడ్జిపై దిగారు. ముందు అనుకున్న ప్రకారం తల్లి ఈగల ధనలక్ష్మి గోదావరిలో దూకేసింది. అటుగా వెళుతున్న వాహనదారులు ఇది గమనించి విజయకుమారితో పాటు లక్ష్మీప్రసన్నను కాపాడారు. 112కు ఫోన్ సమాచారంతో కొవ్వూరు పట్టణ పోలీసులు అక్కడకు వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ విశ్వం తెలిపారు. -
హ్యాపీ న్యూ ఇయర్ర్ర్ర్ర్ర్
● రూ.19.2 కోట్ల మద్యం తాగించేశారు ● కొత్త సంవత్సర వేడుకల్లో పొంగిన బీర్లు ● రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు ● ముగింపు సేల్తో తాగి ఊగిన యువత చాగల్లు: సంపద సృష్టిస్తా అంటూ గొప్పగా చెప్పే సీఎం చంద్రబాబు తాను సృష్టిస్తున్న సంపద ఏమిటో కొత్త సంవత్సర వేడుకల పేరిట చూపించారు. జిల్లాలో మందుబాబులతో ఫుల్గా తాగించారు. ఏడాది చివరి మూడు రోజుల్లో ఏకంగా రూ.19.26 కోట్ల విలువైన మద్యం డిపో నుంచి లిక్కర్ షాపులకు, బార్లకు తరలిపోయి మందుబాబులకు చేరింది. వారం రోజుల్లో అమ్మాల్సిన సరకు కేవలం మూడు రోజుల్లో విక్రయించారు. ’సంవత్సరం ముగింపు సేల్’ పేరుతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు వారం రోజుల ముందు నుంచే వ్యాపారులను అప్రమత్తం చేసి ’ఇండెంట్’ మేరకు సరకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకున్నారు. చాగల్లులో ఉన్న ఐఎంఎల్ డిపో పరిధిలో సగటున రోజుకు రూ.3 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయి. చాగల్లు ఐఎంఎల్ డిపో పరిధిలో జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలుతో పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరు జిల్లాల్లోని 126 షాపులు,10 బార్లకు మద్యం సరఫరా అవుతోంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 29న రూ.7.30 కోట్లు, 30న రూ.8.36 కోట్లు, 31న రూ.3.60 కోట్లు చొప్పున మొత్తం రూ.19.26 కోట్ల విలువైన మద్యం తాగేశారు. మద్యం వ్యాపారులకు డబ్బే డబ్బు! మద్యం వ్యాపారులకు ఈ ఏడాది డబ్బుల పంట పండింది. కొత్త సంవత్సర వేడుకల పేరిట భారీగా విక్ర యాలు జరపటానికి ప్రభుత్వం ముందుగానే డిస్టిలరీల నుంచి మద్యాన్ని డిపోలకు, అక్కడి నుంచి ప్రైవేటు దుకాణాలకు తరలించింది. జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో ఏడాది పొడవునా అడ్డూ అదుపు లేకుండా మద్యం విక్రయాలు సాగించారు. అర్ధరాత్రి వరకు వ్యాపారులు మద్యం విక్రయాలు జరుపుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఎకై ్సజ్ లెక్కల ప్రకారం ఎకై ్సజ్ శాఖల లెక్కల ప్రకారం గత సంవత్సరం కంటే ఈసారి మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఏడాదంతా సుమారు రూ.700 కోట్ల మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు ఎకై ్సజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టిన తరుణంలో మందుబాబులు రెచ్చిపోయారు. పాత ఏడాదికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అర్ధరాత్రి వరకు మద్యం ప్రియులంతా పెద్ద ఎత్తున పార్టీలు చేసుకున్నారు. మామూలు రోజుల్లో ప్రతిరోజూ రూ.3 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 29, 30 తేదీలలో రూ.15.66 కోట్ల విలువ చేసే స్టాకు దుకాణాలు, బార్లలో నిల్వ చేసి మద్యం ప్రియులకు తనివి తీరా అందించి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. చాగల్లు డిపో నుంచి మూడు రోజుల్లో రూ.19.26 కోట్ల విలువైన మద్యం విక్రయించారు. ఇక్కడి నుంచి 25,381 లిక్కర్ కేసులు, 9,470 బీరు కేసులు మద్యం దుకాణాలకు తరలించారు. బీర్లు పొంగాయి... మద్యం పారింది ఆదాయాన్ని పెంచుకునేందుకు బార్లకు అర్ధరాత్రి వరకు ప్రభుత్వం అనుమతివ్వడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. లిక్కర్ షాపులు కూడా మద్యం ప్రియులతో చివరి రోజు కిక్కిరిసిపోయాయి. గడిచిన ఏడాదికి వీడ్కోలు, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకున్న వేడుక సాయంత్రం నుంచే ప్రారంభం కావడంతో బీర్లు పొంగాయి, మద్యం ఏరులై పారింది.కొత్త సంవత్సరం వేడుకల పేరిట మద్యం విక్రయాలు ఇలా... తేదీ లిక్కర్ కేసులు బీరు కేసులు విలువ (రూ.లలో) డిసెంబర్ 29 9,994 2,679 7,30,88,709డిసెంబర్ 30 10,688 4,272 8,36,16.437డిసెంబర్ 31 4,699 2,519 3,60,35,551జనవరి 01 1,625 1,356 1,38,36,548జనవరి 02 2,338 1,061 1,64,70, 666 -
దివ్య క్షేత్రం.. చరిత్ర ఘనం
ఆలయ ప్రత్యేకత ఇదిసాధారణ విష్ణాలయాల మాదిరిగా కాకుండా ఈ రాజగోపాల స్వామివారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో 108 దివ్య వైష్ణవ ప్రదేశాలున్నాయని వేద పండితులు చెబుతుంటారు. అందులో మన రాష్ట్రంలోని తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దివ్యక్షేత్రంతో పాటు దేశంలో ద్వారక కల్యాణరాముడు అనేక క్షేత్రాల్లో విష్ణుమూర్తి వివిధ రూపాల్లో కొలువై ఉన్నాడు. ఆయా ఆలయాల్లో స్వామివారి ప్రతిమలను కొత్తకోటలోని రాజగోపాలస్వామి ఆలయ ప్రతిష్ఠ సమయంలో నెలకొల్పారు. ఆలయంలోని రాజగోపాల స్వామివారు 109వ క్షేత్రంగా ప్రతిష్ఠించబడ్డారు. గోదావరికి ఆనుకుని ఉండటం, విజయనగరం రాజుల హయాంలో ప్రస్తుతం ఉన్నచోట ఆలయాన్ని నిర్మించడంతో కొత్తకోట గ్రామం వెలసిందని గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి నుంచి కొత్తకోట రాజగోపాలస్వామిగా ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఆలయంలోని రుక్మిణీ సత్యభామా సమేత రాజగోపాల స్వామివారి సన్నిధిలో 108 దివ్యక్షేత్ర ప్రతిమల గురించి ఆలయ గోడలపై ఆయా దివ్యక్షేత్రాలు దేశంలో ఎక్కడ ఉన్నాయో వివరించారు. ఫ 108 స్వామివార్ల ప్రతిమలతో ప్రసిద్ధి ఫ చరిత్రకెక్కిన కొత్తకోట రాజగోపాలస్వామి ఆలయం ఫ ధనుర్మాసంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు రామచంద్రపురం: ఒడిశాలోని పూరి జగన్నాథుడు.. అహోబిలంలోని నరసింహస్వామి.. గోకులంలోని నవమోహనకృషు్ుణ్డ.. మహాబలిపురంలోని తిరుశయనత్తుతైవర్.. తిరు అయోధ్యలోని శ్రీరామచంద్రమూర్తి.. ఇలా 108 దివ్య క్షేత్రాల్లో కొలువైన విష్ణుమూర్తి రూపాలను ఒకేచోట కొలువు తీర్చితే భక్తులకు మహదానందమే. అందుకే రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం కొత్తకోటలో కొలువైన రుక్మిణీ సత్యభామా సమేత రాజగోపాలస్వామి ఆలయానికి ప్రత్యేకత సంతరించుకుంది. విజయనగర సామ్రాజ్యం పరిపాలనలో రామచంద్రపురానికి చెందిన శ్రీరాజా కాకర్లపూడి రాజవంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. చరిత్ర తెలుసుకుందాం రండి గోదావరి తీరాన్ని, ప్రస్తుతం ఉన్న కోట రాజవైరిని ఆనుకుని 1,420లో శ్రీరాజా కాకర్లపూడి రామచంద్రరాజు బహుద్దూర్ కోటను నిర్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం గోదావరిలో కలసిపోయింది. బొబ్బిలిపై యుద్ధం అనంతరం విజయనగరం మహారాజు ఆనందరాజు ఈస్టిండియా కంపెనీతో ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులో ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రకారం తీర ప్రాంతాన్ని కంపెనీకి, ఎస్టేట్లను విజయనగరం రాజులకు ఇచ్చేందుకు అంగీకరించారు. కాగా ఎస్టేట్లను ఆక్రమించే ప్రయత్నం అప్పట్లో ఈస్టిండియా కంపెనీ చేసింది. ఇందులో భాగంగా పెద్దాపురంలో జరిగిన యుద్ధంలో రామచంద్రపురం రాజు రామచంద్రరాజు బహుద్దూర్ కుమారులు నీలాద్రిరాజు, జగన్నాథరాజు మరణించారు. యుద్ధంలో తన సోదరులు వీరమణం పొందడంతో కోటిపల్లి ఎస్టేట్కు రాజా కాకర్లపూడి నరసరాజు రాజయ్యారు. అయితే తన తోబుట్టువులు చనిపోవటంతో నరసరాజు వైరాగ్యంతో దైవభక్తిలోకి వెళ్లిపోయారు. ఓ గురువు సాయంతో మంత్రోపదేశం పొందారు. ఈ నేపథ్యంలో గోదావరికి అతి సమీపంలోని రాజకోటకు దగ్గరలో (ప్రస్తుతం కొత్తకోట గ్రామం) రాజగోపాలస్వామివారి ఆలయాన్ని నిర్మించారు. అనంతరం దేశంలోని వైష్ణవాలయాలను సందర్శించి, అక్కడి నుంచి 108 దేవతామూర్తుల ప్రతిమలను తీసుకొచ్చి ప్రతిష్ఠించిన నరసరాజు ఆలయం వద్దే తనువు చాలించారని ప్రతీతి. సంతానం కలుగుతుందని.. సంతాన రాజగోపాలస్వామిగా పేరొందిన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఏటా ధనుర్మాసంలో స్వామివారి దివ్య ప్రతిమలకు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలనాడు రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి ఎటువంటి లోటు రాకుండా ఉండేందుకు సుమారు వందెకరాల భూమిని విరాళంగా రాసినట్లు పూర్వీకులు చెబుతుంటారు. రామచంద్రపురం శ్రీరాజా కాకర్లపూడి వంశీయులు ఏటా ఈ ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ధనుర్మాసంలో ఈ స్వామివారిని దర్శించుకుంటే దేశంలోని వైష్ణాలయాలను దర్శించుకున్నట్లేనని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతిని పురస్కరించుకుని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కల్యాణం జరిపిస్తారు. -
హవ్వ.. 24 గంటలూ మద్యం అమ్మకాలా?
చంద్రబాబు సర్కారు తీరుపై మాజీ ఎంపీ భరత్రామ్ ధ్వజంరాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, 24 గంటలూ మద్యం విక్రయం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. శనివారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో గోవిందరాజులు గుడి వద్ద మందుబాబు వీరంగం చేయడం దుర్మార్గపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. అష్టాదశ పీఠాల్లో 12వ పీఠమైన ద్రాక్షారామ గుడి వద్ద కపిలేశ్వర లింగాన్ని టీడీపీ క్రియాశీలక సభ్యుడు ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో హిందూ ధర్మాన్ని మంటగలుపుతున్న వారిపై ఏ విధమైన చర్యలూ లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని పెద్ద రాద్ధాంతం చేసిందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ రకమైన జంతువుల కొవ్వు కలపలేదు అని నిర్ధారణ చేసినా చంద్రబాబునాయుడు ప్రభుత్వం గతంలోని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై బురదజల్లుతోందన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో 44 దేవాలయాలను ధ్వంసం చేయడం, గోదావరి పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు మరణించడం చంద్రబాబు హయాంలోనే జరిగినవేనన్నారు. జగనన్న ప్రభుత్వ హయాంలో రామపాద క్షేత్రంలో శివలింగం ధ్వంసం జరిగిన తర్వాత సంప్రోక్షణ చేయించి శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారని చెప్పారు. మా జగనన్న ప్రభుత్వం హిందూ ధర్మాన్ని ఎంత గౌరవిస్తుంది అన్న దానికి అది నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జరుగుతున్న పరిణామాలను నిలదీయకపోవడం అత్యంత దారుణమన్నారు. -
ఎమ్మెల్యే నల్లమిల్లి కక్ష సాధిస్తున్నాడు
రాజమహేంద్రవరం రూరల్: అంధురాలైన తన భార్య పింఛన్ నిలిపివేశారని జనసేన పార్టీ నేత వీరబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు తన భార్యకు పింఛన్ ఇవ్వడం లేదని బిక్కవోలు మండలం ఆరికిరేవుల గ్రామ పంచాయతీకి చెందిన జనసేన వార్డు మెంబర్ వీరబాబు తెలిపాడు. శనివారం ఆయన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల సెల్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవల్లి భరత్ కుమార్ తదితరులతో కలిసి డీఆర్డీఏ పీడీ ఎంవీఎస్ఎన్ మూర్తికి ఫిర్యాదు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కక్ష పెంచుకున్నారని తెలిపాడు. తన భార్య కొర్ల రాముకు వస్తున్న దివ్యాంగ పింఛన్ను గత నెలలో నిలిపివేశారని ఆరోపించారు. సదరం వెరిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు మెమో ఇస్తే.. ఆ మేరకు ఆన్లైన్లో వైద్యులు పరీక్షించి, 40 శాతం వైకల్యం ఉన్నట్లు నివేదిక ఇచ్చారన్నారు. అయితే గత నెల 31న పింఛను వచ్చినట్లు తన భార్య సెల్కు మెసేజ్ వచ్చిందన్నారు. కానీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగి నగదు ఇవ్వకుండా ఎంపీడీఓ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఆఫ్లైన్లో మరోసారి రీవెరిఫికేషన్ చేయించాలని, అప్పుడు కూడా 40 శాతం వస్తే పింఛను ఇస్తామని పీడీ చెప్పారని వీరబాబు తెలిపారు. -
ఎరువు దరువు!
సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్లో మోంథా తుపాను దెబ్బకు రైతులు అతలాకుతలం అయ్యారు. పంట చేతికి వచ్చే సమయంలో వచ్చిన తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీలోనైనా కోలుకుందామనుకుంటే పెరిగిన ఎరువుల ధరలు తిరిగి ఆందోళనలోకి నెడుతున్నాయి. అదుకోవాల్సిన ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి మరింత భారం మోపుతోంది. కొన్ని ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నామని చెబుతున్నా ధరల భారం తప్పడం లేదు. ఇప్పటికే పెరిగిన సాగు పెట్టుబడితో రైతులు సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో బస్తాకు రూ.200కు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో 1.97 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. వరి అత్యధికంగా 1,51,539 ఎకరాల్లో సాగవుతోంది. ఖరీఫ్తో పోలిస్తే రబీ సీజన్లోనే ఎరువుల ఆవశ్యకత అధికంగా ఉంటుంది. ఎకరానికి ఆరు నుంచి పది బస్తాల వరకు వివిధ రకాల ఎరువుల వినియోగం ఉంటుంది. ఇందులో యూరియా 30 శాతం, పొటాష్, సూపర్ ఫాస్పేట్, మిశ్రమ ఎరువులు 70 శాతం వినియోగిస్తారు. మిశ్రమ ఎరువుల్లో పొటాష్, ఫాస్పరస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఎకరానికి నాలుగు బస్తాల వరకు రెండు రకాల ఎరువులు, రెండు బస్తాల యూరియా, ఆర బస్తా వరకు పొటాష్ వినియోగిస్తుంటారు. రబీ సీజన్లో మొత్తం 1,15,781 మెట్రిక్ టన్నుల ఎరువల ఆవశ్యకత ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వేసింది. బస్తాకు రూ.200కు పైగా పెంపు గతేడాదితో పోలిస్తే ప్రస్తుత రబీ సీజన్లో ఎరువుల ధరలు అమాంతం పెంచేశారు. బస్తాకు రూ.100 నుంచి రూ.220 వరకు పెరిగింది. జిల్లాలో 1.97 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగు చేస్తుండగా రైతులపై ఎరువుల రూపంలో రూ.13.82 కోట్ల అదనపు భారం పడనుంది. రూ.13.82 కోట్ల భారం పెరిగిన ఎరువుల ధరలతో కర్షకులకు అదనపు భారం పడనుంది. రబీ సీజన్లో అధికంగా వినియోగించే ఎరువులను లక్ష్యంగా చేసుకుని కంపెనీలు ధరలు పెంచేశాయి. 10:26:26 కాంప్లెక్స్ ఎరువుల బస్తా (50 కిలోలు) రూ.220 పెరిగింది. 14:35:14, 20:20:013, ఇతర రకాల ఎరువులపై బస్తాకు రూ.వంద నుంచి రూ.150 పెరిగింది. ఎకరం పొలానికి వినియోగించే ఎరువులను గత సీజన్తో పోలిస్తే ప్రస్తుతం రూ.700 వరకు రైతులపై అదనపు భారం పడుతోందని వ్యవసాయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో రబీ సీజన్లో 1.97లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. రైతులపై రూ.13.82 కోట్ల అదనపు భారం ఎరువుల రూపంలో పడనుంది. బహిరంగ విపణిలో మాయ రబీలో వరి, మొక్కజొన్న, మినుము, పత్తి తదితర పంటలు అత్యధికంగా సాగవుతాయి. ప్రస్తుతం వరి నాట్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో సుమారు 10 వేల హెక్టార్లలో వరి నాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడిస్తోంది. ఇదే అదునుగా భావిస్తున్న వ్యాపారులు రైతులకు షాక్ ఇస్తున్నారు. యూరియా, ఫాస్ఫేట్ ఎరువుల కోసం దుకాణాలను ఆశ్రయిస్తే లింక్ ఎరువులు కొనాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న, వరి విత్తనాలు, పురుగు మందులు కొనుగోలు చేసిన రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఎరువుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తుండటం, సకాలంలో ఎరువులు అందుబాటులో పెట్టకపోవడం, ఒక వేళ సరుకు వచ్చినా.. పీఏసీఎస్లలో పచ్చ నేతలు సిఫార్సు చేసిన వారికే అందుతుండటంతో సామాన్య రైతులకు ఎరువులు చేరడం లేదు. అధికంగా వసూళ్లు ప్రభుత్వం అందించే సబ్సిడీ పోను 50 కేజీల యూరియా బస్తా ధర రూ.2,642 ఉంది. వాటిలో రూ.2,375 ప్రభుత్వ సబ్సిడీ కాగా.. బస్తా రూ.267 విక్రయించాల్సి ఉంది. హమాలీ ఖర్చుతో కలిపి గరిష్టంగా రూ.280 విక్రయించాలి. కానీ కొందరు వ్యాపారులు బస్తాపై రూ.100 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. పెరిగిన ఎరువుల ధరలు ఇలా..ఎరువుల రకం పాత ధర కొత్త ధర 10:26:26 రూ.1,700 రూ.1,920 14:35:14: రూ.1,800 రూ.1,950 20:20:013 రూ.1,300 రూ.1,400 రబీలో ఎరువుల ఆవశ్యకత ఇలా.. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో ఎరువుల ఆవశ్యకతపై వ్యవసాయ అధికారులు అంచనాలు రూపొందించారు. అవి ఇలా... ఎరువుల రకం ఆవస్యకత (మెట్రిక్ టన్నుల్లో)యూరియా 58,950 డీఏపీ 8,564 ఎంఓపీ 5,814 ఎన్పీకే 34,306 ఎస్ఎస్పీ 8,146 రబీ ఆరంభంలోనే అన్నదాతకు కష్టాలు కాంప్లెక్స్ ఎరువుల ధరల పెంపు మోంథాతో ఇప్పటికే కోలుకోలేని పరిస్థితి జిల్లాలో 1.97 లక్షల ఎకరాల్లో సాగు అత్యధికంగా వరి 1,51,539 ఎకరాల్లో 1,15,781 టన్నుల ఎరువుల ఆవశ్యకత రైతులపై రూ.13.82 కోట్ల భారం ధరల పెంపు దారుణం ఖరీఫ్లో వచ్చిన మోంథా తుపాను ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి పంటలకు తీరని నష్టం కలిగింది. 50 శాతానికి పైగా పంట దెబ్బతింది. రైతులు పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు అందక ఆర్థికంగా చితికిపోయారు. తుపాను పరిహారం నేటికీ ఇచ్చిన దాఖలాలు లేవు. రబీలోనైనా ఖరీఫ్ నష్టాలను అధిగమిద్దామనుకుంటే ఎరువుల బస్తాపై రూ.100 నుంచి రూ.220 వరకు ధరలు పెంచేశారు. రైతులపై మరింత అదనపు భారం పడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలి. – పరిమి సోమరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి -
శిఖండి తృతీయ ప్రకృతి కాదు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): చాలామంది భావిస్తున్నట్టు శిఖండి ఆడా మగా కాని తృతీయ ప్రకృతి కాదు. ముందు సీ్త్రగా పుట్టి తరువాత పురుషత్వం పొందినవాడు శిఖండి అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శుక్రవారం హిందూ సమాజంలో ఆయన వ్యాసభారతంలో ఉద్యోగపర్వాన్ని ముగించి, భీష్మపర్వంలోకి ప్రవేశించారు. తాను సీ్త్రతో కాని, సీ్త్రనామధేయం కలవారితో కాని, ముందు సీ్త్రగా జన్మించి పురుషునిగా మారినవారితో కానీ యుద్ధం చేయనని తన నియమాలను దుర్యోధనునికి వివరిస్తాడు. కురుపాండవులు కొన్ని యుద్ధ నియమాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు సాయం సమయంలో యుద్ధం ముగిసాక ఇరుపక్షాల మధ్య పరస్పర ప్రీతి ఉండాలి, మాటలతో యుద్ధం చేసేవారిని మాటలతోనే ఎదుర్కోవాలి, అలాగే రథంలో ఉన్నవారు రథంలో ఉన్నవారితో, ఏనుగు మీద ఉన్నవారు అటువంటి వారితో, అశ్వం మీద ఉన్నవాడు అటువంటి వానితో, పదాతి పదాతితోనే యుద్ధం చేయాలని నియమాలను ఏర్పరచుకున్నారు. భారతదేశంలో యుద్ధమనేది ఒక విద్యగా పరిగణింపబడింది. అందులో నీతిశాస్త్రం కూడా ఉన్నదని సామవేదం అన్నారు. వ్యాసుడు ధృతరాష్ట్రునితో నీవు యుద్ధం చూడాలనుకుంటున్నావా అని అడిగితే, క్షత్రియనాశనాన్ని చూడలేను, వినే యోగం ప్రసాదించమని అడిగాడు. వ్యాసుడు యుద్ధ విశేషాలు వివరించడానికి సంజయునికి దివ్యదృష్టిని ప్రసాదించాడు. జయాపజయాలు నిర్ణయించేది సంఖ్యా బలం కాదని–సత్యము, ధర్మము, క్రూరత్వము లేకపోవడం, ప్రయత్నము వంటి లక్షణాలని సామవేదం అన్నారు. ధృతరాష్ట్రుడు సంజయునితో మామకాః, పాండవాః.. మా వాళ్ళు, పాండవులు కురుక్షేత్రంలో ఏమి చేశారో చెప్పమని అడగడంలో అతని భేద దృష్టి కనపడుతున్నదని, పాండవులు ఎప్పుడూ ధృతరాష్ట్రుని తండ్రిగానే భావించారని సామవేదం వివరించారు. మోహానికి లోనైన అర్జునునికి కృష్ణ పరమాత్మ గీతను బోధించాడు. ‘క్షుద్రం హృదయ దౌర్బల్యం’ అని ఆయన అర్జునునికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. స్వామి వివేకానంద మాటల్లో గీతలోని శ్లోకాలను మరచిపోయినా, ఈ ఒక్క శ్లోకాన్ని యువత గుర్తు చేసుకుంటే చాలని అన్నాడని సామవేదం వివరించారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, మనం భారతం వింటున్నామనే మాట అబద్ధమని, చూస్తున్నామనడం సరి అయినదని అన్నారు. సమన్వయ సరస్వతి సామవేదం -
త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం
అనపర్తి: అనపర్తి శారదా సంగీత కళా సమితి ఆధ్వర్యంలో 27వ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో 8 రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన వీఎల్ తులసీ విశ్వనాథ్ గాత్ర కచేరీతో మొదటి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. మారెళ్ల పురుషోత్తమశర్మ, సీతామహాలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం, వారి కుమారుడు, ఆడిటర్ మారెళ్ల గంగరాజుశర్మ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మల్లిడి మాలతి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. కుమారి వి.నీరజ సహకార గానంతో పి.నందకుమార్ వయోలిన్, బి.సురేష్ బాబు మృదంగం సహకారం అందించారు. కార్యక్రమంలో కళాసమితి అధ్యక్షులు తమలంపూడి చిన ఆదిరెడ్డి, ఉపాధ్యక్షులు నల్లమిల్లి మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, సహాయ కార్యదర్శులు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, మారెళ్ల శ్రీకృష్ణ ఫణీంద్ర, సభ్యులు పాల్గొన్నారు. -
పర్యాటకంతో ఉపాధి
కలెక్టర్ కీర్తిసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా టూరిజం కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని పర్యాటక ప్రదేశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా చేపట్టాల్సిన పనులపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ బ్రిడ్జి లంక ద్వీపాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలిచి పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పనులు చేపట్టాలన్నారు. అక్కడ పిల్లల కోసం రిక్రియేషన్ యాక్టివిటీస్, అడ్వెంచర్ స్పోర్ట్స్, ఫుడ్, బెవరేజెస్ స్టాల్స్, ఓపెన్ ఎయిర్ వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నదిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు ఇరిగేషన్ బోట్లను లీజు పద్ధతిలో పర్యాటక బోట్లుగా నిర్వహించేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవాలని తెలిపారు. నది విహారాల ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలని సూచించారు. కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే క్రమంలో హోమ్ స్టేలను ప్రోత్సహిస్తూ స్థానిక రైతులు, గృహ యజమానులకు అవగాహన కల్పించి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా స్థానికులకు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
డ్రాగన్ పడవ పోటీలకు పటిష్ట భద్రత
● కలెక్టర్ మహేష్కుమార్ ● ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కొత్తపేట: ఆత్రేయపురం మండలంలో సంక్రాంతి డ్రాగన్ పడవలు, ఈత పోటీలను పటిష్ట రక్షణ భద్రతా ఏర్పాట్ల నడుమ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ డ్రాగన్ పడవల పోటీలు, ఈత, రంగోలి, పతంగుల పోటీలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం పులిదిండి గ్రామంలో కయాకింగ్ డ్రాగన్ బోటింగ్ను కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు లాంఛనంగా ప్రారంభించారు. కాలువలో పడవ పోటీల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. ట్రయల్ రన్లో భాగంగా కలెక్టర్ మహేష్ కుమార్ స్వయంగా కియా కింగ్ డ్రాగన్ పడవను నడుపుతుండగా పడవ అదుపు తప్పి ఎడమ వైపుకు ఒరిగిపోవడంతో ఆయన కాలువలోకి పడిపోయారు. ఆ సమయంలో లైఫ్ జాకెట్ వేసుకుని ఉండటం, పడవలోను, ఆ పడవను అనుసరిస్తున్న బోటులో గజఈతగాళ్లు అప్రమత్తమై వెంటనే కాలువలో దూకి కలెక్టర్ను రక్షించి, ప్రక్క బోటులోకి ఎక్కించారు. అనంతరం పోటీల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సందర్శకుల తాకిడికి అనుగుణంగా జెట్టీలు, లైఫ్ జాకెట్లతో రక్షణ పరమైన జాగ్రత్తలు పాటిస్తూ క్రియాశీలకంగా వహించాలన్నారు. ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గత ఏడాది కన్నా రెట్టింపు ఉత్సాహంతో పోటీలు నిర్వహించాలన్నారు. ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ గోదావరి తీరంలో సంక్రాంతిని పురస్కరించుకుని ఈ ఉత్సవాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.శ్రీకర్, డీఎస్పీ సుంకర మురళీమోహన్, జిల్లా పర్యాటక అధికారి అన్వర్, తహసీల్దార్ ఆర్డీ రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. పాస్ పుస్తకాల పంపిణీ ఆత్రేయపురం సచివాలయం వద్ద శుక్రవారం రైతులకు కొత్త పట్టాదాసు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ మహేష్ కుమార్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దాదాపు 921 పుస్తకాలను నిర్ణీత రుసుముతో రైతులకు పంపిణీ చేశారు. -
ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి
రామచంద్రపురం రూరల్: అనేక మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలని రామచంద్రపురం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ రెడ్డి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. రామచంద్రపురం ఆర్టీసీ డిపో గ్యారేజీలో శుక్రవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంవీఐ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డిపో మేనేజర్ భాస్కరరావు మాట్లాడుతూ డ్రైవర్లకు మంచి శిక్షణతో కూడిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదాలను ఎలా నివారించవచ్చు అనే అంశంపై వివరించారు. బస్సు కండిషన్ను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలన్నారు. సమావేశంలో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.రవికుమార్, అసిస్టెంట్ మెకానిక్ ఫోర్మెన్ జి.రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అన్నవరం @ 4వ స్థానం
● ఐవీఆర్ఎస్ సర్వేలో మెరుగుపడిన ర్యాంకు ● భక్తులకు అందించే సేవలలో పుంజుకున్న వృద్ధి ● డిసెంబర్లో 67.9 శాతం మంది సంతృప్తి అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్య క్షేత్రాలలో భక్తులకు అందుతున్న సేవలపై గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నాలుగో స్థానంలో నిలిచింది. నవంబర్లో నిర్వహించిన సర్వేలో ఆరో స్థానంలో నిలిచిన దేవస్థానం ఈ సారి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆ స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ దేవస్థానంలో నవంబర్లో నిర్వహించిన సర్వేలో 33 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేయగా ఈ సారి 32.1 శాతం మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు. ● గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన సర్వేలో దేవస్థానం అట్టడుగు స్థానం పొందడంతో జిల్లా లెక్టర్ షణ్మోహన్ ఆలయంలో తనిఖీలు చేసి ఎలాగైనా ఆలయాన్ని మొదటి స్థానంలో నిలపాలని సిబ్బందిని ఆదేశించిన విషయం తెలిసిందే. తరువాత కొంత మెరుగుపడినా మళ్లీ ఆరో స్థానానికి పడిపోయింది. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా ఆలయ ప్రతిష్టను దిగజార్చినట్టు చెప్తున్నారు. ● గత నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలలో నిర్వహించిన ఈ సర్వేలో శ్రీకాళహస్తి 71.2 శాతంతో ప్రధమ స్థానంలో నిలవగా 67.9 శాతం భక్తుల సానుకూల స్పందనతో అన్నవరం నాలుగో స్థానంలో నిలిచింది. 66 శాతం సానుకూల స్పందనతో కాణిపాకం ఏడో స్థానంలో నిలిచింది. నెల వారీగా భక్తుల సంతృప్త స్థాయిలు ఇవీ ● సత్యదేవుని దర్శనం విషయంలో డిసెంబర్లో 69.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 73, జూలైలో 74, ఆగస్టులో 75.8, సెప్టెంబర్లో 74.1, అక్టోబర్లో 68, నవంబర్లో 69.7 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● మౌలిక వసతుల కల్పనలో డిసెంబర్ నెలలో 61.9 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 66 శాతం, జూలైలో 65, ఆగస్టులో 64.9, సెప్టెంబర్లో 66, అక్టోబర్లో 63, నవంబర్లో 61.6 శాతం సానుకూలంగా స్పందించారు. ● స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై డిసెంబర్ నెలలో 78.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. జూన్లో 77, జూలైలో 78, ఆగష్టులో 76.9, సెప్టెంబర్లో 79.2, అక్టోబర్లో 76, నవంబర్లో 77.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● పారిశుధ్య నిర్వహణలో డిసెంబర్లో 63.1 శాతం మాత్రమే సంతృప్తి వ్యక్తం చేవారు. జూన్లో 70, జూలైలో 68, ఆగస్టులో 66.5, సెప్టెంబర్లో 64.5, అక్టోబర్లో 63, నవంబర్లో 64.2 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం మీద డిసెంబర్లో 67.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 32.1 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యం, మౌలిక వసతులపై అసంతృప్తి దేవస్థానంలో పారిశుద్యం, మౌలిక వసతుల కల్పన ఆశించిన మేర లేదని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవస్థానంలో గత మూడు నెలలుగా చిత్తూరుకు చెందిన పద్మావతి సంస్థ పారిశుధ్య నిర్వహణను చూస్తోంది. వయోపరిమితి పేరుతో అనుభవజ్ఞులైన 50 మంది సిబ్బందిని తొలగించారు. వారి స్థానంలో రాజకీయ ఒత్తిళ్లతో నియామకమైన కొత్తవారి అనుభవ లేమి వల్ల ఈ అసంతృప్తి నెలకొన్నట్టు చెప్తున్నారు. ధోబీలతో దుప్పట్లు ఉతికిస్తున్నారు ఆలయంలోని సత్రాలలొని మంచాలపై దుప్పట్లు, గలేబులు తదితర వస్త్రాలను వాషింగ్ మెషీన్లతో కాకుండా ధోబీలతో ఉతికిస్తుండడం వల్ల శుభ్రత లోపిస్తోందని తెలుస్తోంది. గతంలో కేఎల్టీసీ సంస్థ శానిటరీ మిషన్లతో వాటిని ఉతికేవారు. అలాగే నాణ్యమైన మెటీరియల్తో పారిశుధ్య పనులు చేస్తుండడం వల్ల కూడా నాణ్యత లోపానికి కారణంగా తెలుస్తోంది. ఈ విషయమై పద్మావతి సంస్థ ప్రతినిధులు వాషింగ్ మెషీన్ ఏర్పాటుకు తాము సిద్ధమేనని కానీ అందుకు అవసరమైన షెడ్డు లేదని చెప్తున్నారు. దీనిపై ఆలయ ఈఈ రామకృష్ణ వివరణ ఇస్తూ షెడ్డు నిర్మాణం పూర్తయ్యిందని త్వరలో ఆ సంస్థకు షెడ్డును అప్పగిస్తామని తెలిపారు. ప్రసాదం విషయంలో ఊరట స్వామివారి ప్రసాదం విషయంలో భక్తులు 78.6 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయడం కొంత ఊరట కలిగే విషయం. వాస్తవానికి గోధుమ నూక ప్రసాదంలో నూటికి నూరు శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేయాల్సినంత నాణ్యతగా ఉంటుంది. కాని 21 శాతం మంది అసంతృప్తికి కారణం ఎవరికి అర్ధం కావడం లేదు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సేపు క్యూ లైన్లలో నించోవడం వల్ల అసంతృప్తి, మౌలికవసతులు, పారిశుధ్యం బాగా లేకపోవడం వంటి వాటి ప్రభావం ప్రసాదంపై పడి ఉండవచ్చనే అభిప్రాయం అధికారులలో వ్యక్తమవుతోంది. వయసు మీరిందనే తొలగించాం శానిటేషన్ విభాగంలో 55 ఏళ్లు దాటిన వారిని కొనసాగించ వద్దని ప్రభుత్వం నిబంధన విధించడంతో ఆలయంలో 50 మందిని తొలగించాం. వారి వారసులలో ఎవరైనా సమర్ధులుంటే వారి స్థానంలో నియమిస్తాం. అటువంటి వారు ఉంటే దేవస్థానంలో తమ సూపర్వైజర్లను కలిస్తే పరిశీలిస్తాం. – భాస్కరనాయుడు, ఎండీ, పద్మావతి శానిటరీ సంస్థ -
లైఫ్ సర్టిఫికెట్లకు దరఖాస్తుల స్వీకరణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు సమర్పించాల్సిన వార్షిక జీవన ప్రమాణ ధ్రువపత్రాలను (లైఫ్ సర్టిఫికెట్లు) జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా స్వీకరిస్తున్నట్టు జిల్లా ఖజానా, లెక్కల అధికారి ఎ.గణేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్లను జీవన్ ప్రమాణ్ పోర్టల్లో కానీ, పెన్షనర్ల వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ లాగిన్ ద్వారా కానీ, ఏదైనా ఖజానా కార్యాలయంలో సమర్పించవచ్చునన్నారు. పెన్షనర్ల ఆధార్, మొబైల్ నంబర్ (ఓటీపీ కోసం), పీపీఓ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు సరిచూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి నెలఖారులోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని, లేకుంటే ఏప్రిల్ 1న ఇచ్చే మార్చి నెల పెన్షన్ నిలిచిపోతుందని గుర్తించాలని కోరారు. జిల్లా పరిధిలో కాకినాడ డివిజనల్ ఖజానా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని, జగ్గంపేట ఉప ఖజానా కార్యాలయాలలో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. పుష్కరాల నాటికి అన్ని సదుపాయాల ఏర్పాటు రాజమహేంద్రవరం సిటీ: వచ్చే 2027 పుష్కరాల నాటికి అన్ని మౌలిక వసతులు కల్పించి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. శుక్రవారం పుష్కరాల నిర్వహణపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్నందున శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, తాగునీరు, శానిటేషన్, పార్కింగ్, సేద తీరేందుకు ప్రత్యేక శిబిరాలు, టాయిలెట్లు వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. కేవలం పుష్కరాలకే కాకుండా శాశ్వత ప్రాతిపదికన భవిష్యత్తులో ఉపయోగపడేలా పనులు చేపట్టాలన్నారు. ప్రతి అభివృద్ధి పనినీ ఆన్లైన్ చేయాలని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపరచాలన్నారు. పోర్టల్లో అప్లోడ్ చేయడంతో ముఖ్యమంత్రి స్థాయిలో రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ వినూత్న, సీపీ (రుడా) జీవీఎస్ఎన్.మూర్తి, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, ఈఈలు మదర్సా అలీ, మాధవి, ఏడీహెచ్ అనిత, ఏఈలు పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ బోట్క్లబ్ (కాకినాడసిటీ): జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ శుక్రవారం స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
● పంట పండింది రోయ్..
పంట పండింది రోయ్ అంటూ మత్స్యకారులు సంబరాలు చేసుకుంటున్నారు. పల్లిపాలెం కేంద్రంగా సముద్రంపై వేట సాగించే వారికి వారంలో రెండు, మూడు రోజుల్లో వేటలో అరుదైన భారీ సైజు ల్యాబ్స్టర్ రకం రొయ్యలు చిక్కుడమే దీనికి కారణం. వలకు చిక్కి ఫిషింగ్ హార్బర్కు చేరిన వీటిని కొనుగోలు చేయడానికి ప్రజలు పోటీపడుతున్నారు. ఒక్కో ల్యాబ్స్టర్ రొయ్య సుమారు 750 గ్రాములు బరువు తూగుతూ, రూ.800 తక్కువ గాకుండా అమ్ముడుపోతోంది. సాధారణంగా ఈ రకమైన ల్యాబ్స్టర్ రొయ్యలు కన్యాకుమారి, మండపం, కేరళ వంటి కొన్ని తీరప్రాంతాల్లో మాత్రమే లభిస్తాయని, అంతర్వేది సముద్ర తీరంలో ఈ రకం భారీ సైజులో రొయ్యలు దొరకడం అరుదని వారు చెబుతున్నారు. సఖినేటిపల్లి -
రత్నగిరి వనదుర్గ ఆలయంలో ఖడ్గమాల పూజ
● ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం ● ప్రతి శుక్రవారం నిర్వహణ ● టిక్కెట్ ధర రూ.1,116గా నిర్ణయం అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని వనదుర్గ అమ్మవారి ఆలయంలో మరో కొత్త పూజకు శ్రీకారం చుడుతున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారికి శ్రీచక్రంపై కుంకుమపూజ నిర్వహించే కార్యక్రమాన్ని (ఖడ్గమాల పూజ) ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఛైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు శుక్రవారం తెలిపారు. వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 వరకూ ఈ పూజ జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు నిర్వహించే చండీహోమం, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో నిర్వహించే ప్రత్యంగిర హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఖడ్గమాల పూజలకు టిక్కెట్ ధరను రూ.1,116గా నిర్ణయించారు. ఈ పూజలో భార్యాభర్తలు పాల్గొనవచ్చు. విధి విధానాలపై చర్చ : ఖడ్గమాల పూజా విఽధి విధానాల రూపకల్పనపై పండితులతో చర్చిస్తున్నారు. విజ యవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే ఖడ్గమాల పూజ మాదిరిగానే నలు చదరంగా ఉండే పలక మీద గల శ్రీచక్రానికి భక్తులతో పూజలు చేయించి, అనంతరం రాగి శ్రీచక్రం గల డాలర్, పూజ చేసిన కుంకుమ, ప్రసాదం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. శ్రీచక్రం గల పలకను దేవస్థానం వెనక్కి తీసుకుని మరో భక్తుని పూజలో ఉపయోగిస్తారు. అయితే దీనిపై దేవస్థానం ఆస్థాన సిద్దాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణ ప్రసాద్, ఆగమ సలహదారు త్రివేది కపిలవాయి రామశాస్త్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని దేవస్థానం అధికారులు తెలిపారు. -
శివలింగం ఘటనపై బీజేపీ మాట్లాడదే?
● ఆ ఘటనపై విచారణ జరపాలి ● మాజీ ఎంపీ భరత్ రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధ శివాలయంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కపాలేశ్వరస్వామి శివలింగం ధ్వంసమైతే బీజేపీ ఎందుకు నోరు మెదపడం లేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ప్రశ్నించారు. ఆయన శుక్రవారం ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో శ్రీకాకుళంలోని శ్రీరామపాద క్షేత్రంలో శివలింగం ధ్వంసమైనప్పుడు, అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనల్లో తెలుగుదేశం పార్టీ రాద్ధాంతం చేసిందన్నారు. ప్రస్తుతం శివలింగం ధ్వంసమైతే కాతేరు నుంచి మరో శివలింగాన్ని తీసుకుని వచ్చి మూఢంలో నిబంధనలు పాటించకుండా ప్రతిష్ఠించడం సరికాదన్నారు. దీనిపై హిందువులకు ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవదాయశాఖ మంత్రి ఇక్కడికి వచ్చి, సమగ్ర విచారణ చేసి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రామచంద్రపురం కో ఆర్డినేటర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాశ్, వైస్ ఎంపీపీ శాకా బాబీ, ఉప సర్పంచ్ వల్లు శివ, నాయకులు కర్రి రవీంద్ర, రెడ్డింశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
వెలుగు చుక్కలు
విద్యాబోధన మామూలు విద్యార్థులకూ అంధులైన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పగలరు. సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే సేవలు అందించగలరు. ముందుగా పాఠాలను బ్రెయిలీ లిపిలోకి తర్జుమా చేసుకుంటారు. వాటిని స్పర్శిస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. సందేహాలను నివృత్తి చేస్తారు. ● అంధులకు ఆసరాగా బ్రెయిలీ లిపి ● ఆరు చుక్కలతో సమస్త విజ్ఞానం ● అన్ని రంగాల్లో ముందంజ ● రేపు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం రాయవరం: వారంతా అంధులు. పుట్టుకతోనే కొందరు, ప్రమాదవశాత్తూ మరి కొందరు చూపు పోగొట్టుకున్నారు. అయితే కళ్లు లేవని కలత చెందకుండా కేవలం స్పర్శ, శబ్దం, వాసనల ఆధారంగానే వారు అన్ని పనులు సమర్థంగా చేసుకుంటున్నారు. నేత్రాలను కోల్పోయినా తమ జ్ఞాన నేత్రానికి పదును పెడుతూ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. ఆరు చుక్కల లిపితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకొంటున్నారు. అంచలంచెలుగా.. సాధారణంగా చదువు కోవాలంటే పుస్తకాలు తప్పనిసరి. కానీ అంధులు చూడలేని కాబట్టి వారికి స్పర్శతో చదువు చెప్పే విధానం కావాలి. దీని కోసం స్పెయిన్కు చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతిని రూపొందించాడు. అనంతరం పారథస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతడి మిత్రుడు హెయిలీ కలిసి పేపరు మీద ఎత్తుగా ప్రింటు చేసే విధానం కనుగొన్నారు. అయితే అంధులకు లిపిని కనుగొన్న ఘనత బ్రెయిలీకి దక్కింది. ఆరు చుక్కల లిపి కేవలం చేతి వేళ్లతో ఆరు చుక్కలను స్పర్శించి అక్షర జ్ఞానాన్ని పొందడానికి అనువుగా లూయిస్ బ్రెయిలీ ఈ లిపిని రూపొందించారు. అన్ని భాషలకు ఆరు చుక్కలే ఆధారం. కుడి పక్కన 1, 2, 3 చుక్కలు, ఎడమ వైపున 4, 5, 6 చుక్కలు ఉంటాయి. ఈ ఆరు చుక్కల్లోనే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క నంబరు ఉంటుంది. అంధులు ఆ నంబర్లను గుర్తు పెట్టుకుని, మనో నేత్రంతో చదువుతూ విద్యను అభ్యసిస్తున్నారు. లూయిస్ బ్రెయిలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకొంటున్నారు. పట్టుదలతో.. పారిస్ సమీపంలోని కూపేవ్రేలో 1809 జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జన్మించారు. మూడేళ్ల వయసులో తండ్రి దుకాణంలో పనిముట్లతో ఆడుకుంటుండగా, ఒక పనిముట్టు ఆయన కుడి కంటికి తగలడంతో చూపును కోల్పోయారు. అయినా పట్టుదలతో ప్రసిద్ధ సంగీత విద్వాంసుడిగా మారాడు. తనలా బాధపడుతున్న వారి కోసం బ్రెయిలీ ఒక లిపిని కనిపెట్టారు. కేవలం పదిహేనేళ్ల వయసులో ఫ్రెంచ్ వర్ణమాల ఆధారంగా బ్రెయిలీ కోడ్ను అభివృద్ధి చేశారు. ఆత్మ విశ్వాసంతో.. పుట్టుకతోనే అంధత్వంతో జన్మించాను. తల్లిదండ్రులైన మంగమ్మ, వెంకన్నలు నన్ను కంటి పాపలా కాపాడారు. మండపేట అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపి ద్వారా విద్యాభ్యాసం చేశాను. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం టీచర్ శిక్షణ పొంది ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డాను. బ్రెయిలీ లిపితో నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. – వేల్పూరి వీరబాబు, ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయుడు, వెదురుమూడి, కపిలేశ్వరపురం మండలం కళ్లు లేవని బాధపడలేదు కళ్లు లేవని బాధపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. పుట్టుకతోనే నాకు రెండు కళ్లకూ చూపు లేదు. లూయిస్ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలనే పట్టుదలతో చదివాను. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. – పి.దొరబాబు, ఉపాధ్యాయుడు, ఎస్పీఎస్ఆర్ మున్సిపల్ స్కూల్, రాజకోట, రామచంద్రపురం, -
సత్యసాయిబాబా స్మారక నాణెం
రాజమహేంద్రవరం సిటీ: సత్యసాయిబాబా శత జయంతిని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ఆయన ముఖచిత్రంతో రూ.100 విలువైన స్మారక నాణేన్ని విడుదల చేసింది. తెలుగువారికి సంబంధించి గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జ్ఞాపకార్థం నాణెం విడుదలైంది. ఇప్పుడు సత్యసాయిబాబా పేరు మీద రెండో సారి విడుదల చేశారు. ఈ నాణేన్ని రాజమహేంద్రవరానికి చెందిన ప్రముఖ నాణేల సేకరణకర్త పెద్దిరెడ్డి శ్రీనివాస్ సేకరించారు. హైదరాబాద్లోని ప్రభుత్వ టంకశాలలో ముద్రించిన ఈ నాణెం బరువు 35 గ్రాములు. కాగా.. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్, 5 శాతం నికెల్తో దీన్ని తయారు చేశారు. -
ముదురుతున్న రజకుల చెరువు వివాదం
● చేప పిల్లలను వేయడాన్ని అడ్డుకున్న ఓ వర్గం ● రూ.1.50 లక్షల విలువైన చేప పిల్లల మృతి దేవరపల్లి: పేరం చెరువు వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. దీనిలో శుక్రవారం చెరువులో చేపపిల్లలను వేయడానికి రజకులు ఏర్పాట్లు చేయగా, దళితులు అడ్డుకున్నారు. దీంతో రజకులు చనిపోయిన ఆ చేప పిల్లలను పంచాయతీ కార్యాలయం ప్రధాన ద్వారం ముందు రాశిగా పోసి ఆందోళన చేశారు. రజక నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరపల్లి – బుచ్చియపాలెం రోడ్డులో సుమారు 3.96 ఎకరాల విస్తీర్ణంలో పేరం చెరువు ఉంది. దీన్ని దాదాపు 20 ఏళ్ల క్రితం రజకులకు ప్రభుత్వం కేటాయించింది. చెరువులో రజక వృత్తితో పాటు చేపలు పెంచుకుని ఫలసాయం పొందడానికి డివిజినల్ పంచాయతీ అధికారి ఉత్తర్వులు ఇచ్చారు. అయితే చెరువులో చేపల పెంపకం విషయంలో రజకులు, దళితులకు మధ్య వివాదం ఏర్పడింది. చెరువులో దుస్తులు ఉతకటానికి మాత్రమే హక్కు ఉందని, చేపలు పెంచడానికి వీలు లేదని చెరువు సమీపంలోని దళితులు అభ్యంతరం తెలిపారు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుంది. కాగా.. రజక సంఘం అధ్యక్షులు కొంజర్ల పాలిరాజు, గౌరవాధ్యక్షులు కడెల్లి సుబ్బయ్య, కార్యదర్శి నేతునూరి సుబ్బారావు మాట్లాడుతూ చెరువును శుభ్రం చేసుకుని చేపపిల్లలను వేయడానికి వెళ్లగా, కొందరు అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ చెరువులో చేపలు పెంచుకోవడానికి, బట్టలు ఉతకడానికి పూర్తి హక్కులు తమకు ఉన్నాయని తెలిపారు. సుమారు 1.50 లక్షల విలువైన 1.5 టన్నుల చేపపిల్లలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్.రవి కిషోర్ను ‘సాక్షి’ వివరణ కోరగా చెరువులో రజక వృత్తి చేసుకోవడానికి, చేపలు పెంచుకుని ఫలసాయం అనుభవించడానికి రజకులను హక్కు ఉందని చెప్పారు. ఈ సమస్యను రెండు సామాజక వర్గాలూ సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. -
అలా ముగిశాయి
దేవరపల్లిలో ఆశాజనకంగా ఉన్న వర్జీనియా పొగాకు తోట రెలుపుకు సిద్ధంగా ఉన్న పొగాకు తోట● 23,106 హెక్టార్లలో పొగాకు నాట్లు ● 43.89 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ● 11,351 మంది రైతులు ● 12,814 బ్యారన్లు ● ఆశాజనకంగా తోటలు ● సంక్రాంతికి ప్రారంభం కానున్న క్యూరింగ్లుదేవరపల్లి: టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్లోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల పరిధిలో వర్జీనియా పొగాకు నాట్లు ముగిశాయి. దాదాపు 1964లో దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో ఒక రైతు ఈ ప్రాంతంలో పొగాకు సాగుకు శ్రీకారం చుట్టారు. రెండెకరాల్లో ఆయన చేపట్టిన సాగు నేడు వేల ఎకరాలకు చేరుకుని, మెట్ట ప్రాంత రైతులకు కాసుల పంట పండిస్తోంది. కొంత కాలం గిట్టుబాటు ధర రాక రైతులు ఆర్థికంగా నష్టపోయారు. అయితే, నాలుగేళ్లుగా మార్కెట్లో మంచి ధర పలుకుతూండటంతో రైతులకు ఊహించని లాభాలు వచ్చాయి. దీంతో, ఆయిల్పామ్, కొబ్బరి, జీడిమామిడి, మామిడి వంటి ఉద్యాన తోటలను తొలగించి పలువురు పొగాకు సాగుకు మళ్లారు. ఉద్యాన పంటల కంటే అధిక ఆదాయం రావడంతో పొగాకు పంటపై మొగ్గు చూపుతున్నారు. ఏటా అక్టోబర్ 15 నుంచి పొగాకు నాట్లు ప్రారంభించి నవంబరు నెలాఖరుకు పూర్తి చేస్తారు. ఈ ఏడాది నాట్లు నెల రోజులు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ వాతావరనం అనుకూలించడంతో నాట్లు త్వరితగతిన పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. 23,106 హెక్టార్లలో నాట్లు 2025–26 సంవత్సరానికి గాను 11,351 మంది రైతులు, 12,814 బ్యారన్లను రిజిస్ట్రేషన్ చేయించుని, 23,106 హెక్టార్లలో ఇప్పటి వరకూ నాట్లు వేసినట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది 12,879 మంది రైతులు, 14,994 బ్యారన్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుని 29,503 హెక్టార్లలో సాగు చేశారు. 2024–25లో 61.27 మిలియన్ కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా, 84 మిలియన్ కిలోలు పండించారు. పంట నియంత్రణలో భాగంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గించి ఉత్పత్తిని 43.78 మిలియన్ల కిలోలకు తగ్గించింది. దీనికి లోబడి మాత్రమే పొగాకు సాగు చేయాలని రైతులకు సూచించారు. నిషేధిత భూములు బాడవ, నల్లరేగడి భూముల్లో పొగాకు పంట వేయవద్దని బోర్డు అధికారులు చెపుతున్నప్పటికీ కొంత మంది రైతులు ఆ భూముల్లో సాగు చేస్తున్నారు. బ్యారన్ ఖరీదు రూ.13.25 లక్షలు పొగాకు ధర 2024–25 సీజన్లో రికార్డు స్థాయికి చేరుకోవడంతో 2025–26 సంవతరంలో భూముల కౌలు, బ్యారన్ల ఖరీదు, అద్దె కూడా అదే స్థాయిలో పెరిగాయి. పొగాకు సాగుకు కౌలు, చిన్న, సన్నకారు రైతులు ఆసక్తి చూపుతూండటంతో భూముల కౌలు, బ్యారన్ల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గత ఏడాది బ్యారన్ ఖరీదు రూ.8 లక్షలు పలకగా, ఈ ఏడాది రూ.13.25 లక్షలకు చేరింది. నాలుగేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు రూ.2.25 లక్షలుండేది. అప్పట్లో చాలా మంది రైతులు బ్యారన్లను అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. వారు నష్టపోగా కొనుక్కున్న రైతులు లాభపడ్డారు. గత ఏడాది బ్యారన్ అద్దె రూ.50 వేల నుంచి రూ.లక్ష ఉండగా, ప్రస్తుతం రూ.2.50 లక్షల వరకూ పలుకుతోంది. భూమి కౌలు గత ఏడాది ఎకరం రూ.60 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.70 వేలకు పెరిగింది. పొగాకు క్యూరింగ్ చేసుకోవడానికి ఉపయోగించే గుల్ల బ్యారన్ అద్దె రూ.లక్ష పలుకుతోంది. ఆఫ్రికన్ దేశాల్లో పెరుగుతున్న ఉత్పత్తి ఈ పంట కాలంలో ఆఫ్రికన్ దేశాల్లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభానం మన పొగాకుపై ఉంటుందని అంటున్నారు. ఆయా దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో సంతకం చేయకపోవడంతో పంట నియంత్రణ లేదు. కొత్త నేలల్లో పంట వేస్తున్నందున నాణ్యమైన పొగాకు ఆయా దేశాల్లో తక్కువ ధరకు దొరుకుతుందని అధికారులు చెబుతున్నారు. వినియోగ విధానంలో మార్పు సాధారణంగా పొగాకును సిగరెట్ తయారీకి వినియోగిస్తారు. నికోటిన్ శాతం ఎక్కువగా ఉండాలి. దీనిని సిగరెట్ ద్వారా వినియోగదారులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వినియోగ విధానంలో మార్పు రావడంతో లిక్విడ్, టాబ్లెట్ రూపంలో తీసుకుంటున్నారు. దీంతో, సిగరెట్ల వినియోగం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తాము సూచించిన విధంగానే ఆచితూచి పొగాకు సాగు చేయాలని వారంటున్నారు. వేలం కేంద్రాల వారీగా వేసిన నాట్ల వివరాలు హెక్టార్లలో ఈ విధంగా ఉన్నాయి వేలం కేంద్రం రైతులు బ్యారన్లు వేసిన నాట్లు దేవరపల్లి 1,438 1,599 3,020 జంగారెడ్డిగూడెం–1 2,220 2,589 5,560 జంగారెడ్డిగూడెం–2 2,307 2,469 3,656 కొయ్యలగూడెం 2,526 2,817 5,263 గోపాలపురం 2,023 2,440 4,556 మొత్తం 11,351 12,814 23,106బాడవ భూముల్లో వేస్తే నష్టపోతారు వరి చేలు కోసిన బాడవ భూముల్లో పొగాకు నాట్లు వేస్తే రైతులు నష్టపోతారు. గత ఏడాది లో గ్రేడ్ పరిస్థితి బ్రైట్, మీడియం గ్రేడ్కు వస్తే ఎలా ఉంటుందో ఆలోచించాలి. అధిక ఉత్పత్తి ఇబ్బందికరం. నాణ్యమైన పొగాకునే ఉత్పత్తి చేయాలి. మొక్క అడుగు భాగంలోని నాలుగు ఆకులు కప్పడేలా దొయ్యి వేసుకోవాలి. దీని వల్ల లో గ్రేడ్ తగ్గుతుంది. ఉత్పత్తి పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. పరిమితికి మించి ఉత్పత్తి చేస్తే దెబ్బ తింటారు. తోటలు ఆశాజనకంగా ఉన్నాయి. నాట్లు దాదాపు పూర్తయ్యాయి. తుపానుకు ముందు వేసిన తోటల క్యూరింగ్ సంక్రాంతికి ప్రారంభమవుతుంది. – జీఎల్కే ప్రసాద్, టుబాకో బోర్డ్ రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం -
కోత ఖర్చులూ రావడం లేదు
మంచి ధర లభిస్తోందని రెండెకరాల్లో కొత్తిమీర సాగు చేపట్టాను. పంట చేతికి వచ్చిన సమయంలో కిలో ధర రూ.80 ఉండేది. నేడు రూ.15 దక్కుతోంది. కోత ఖర్చులు కూడా రావడం లేదు. – గుడాల వెంకటేశ్వరరావు,కొత్తిమీర, రైతు, కాకరపర్రు నష్టం మిగిలింది రెండెకరాలు కౌలుకు తీసుకుని కొత్తిమీర పంట వేశాను. పెట్టుబడి రూ.40 వేలైంది. పంట బాగా పండింది. మార్కెట్లో ధర లేకపోవడంతో అసలు పెట్టుబడి పోయింది. నష్టమే మిగిలింది. – పి.ఆదినారాయణ, కొత్తిమీర రైతు, ముక్కామల ముందొచ్చిన లాభం ఈ పంటలో పోయింది ఐదెకరాల్లో కొత్తిమీర సాగు చేశాను. ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి అయ్యింది. మూడెకరాల్లో పంట ముందుగానే రావడంతో కిలో రూ.80 చొప్పున ఆదాయం వచ్చింది. ఇప్పుడు మరో 2 ఎకరాలు సాగు చేశాను. మార్కెట్లో ధరలు లేకపోవటంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ముందు పంట లాభాలను ఈ పంట తినేసింది. – ఆకుల సూర్యనారాయణ, రైతు, ముత్యాలవారిపాలెం -
‘హ్యాపీ న్యూ ఇయర్ మేడమ్’
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు మరింత నిబద్ధతతో, జవాబుదారీతనంతో పని చేయాలని కలెక్టర్ కీర్తి కోరారు. నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు కలెక్టరేట్లో గురువారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ, తన పిలుపునకు స్పందించి, విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందజేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆధ్యాత్మిక జ్ఞానశక్తితో ఆశయ సాధన పిఠాపురం: జీవితాశయ సాధనకు మానసిక శక్తి, మనోధైర్యం, సంకల్పంతో కూడిన ఆధ్యాత్మిక తాత్త్విక జ్ఞానశక్తి అవసరమని విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి ఉమర్ ఆలీషా అన్నారు. నూతన ఆంగ్ల సంవత్సర ఆరంభం సందర్భంగా పీఠంలో గురువారం నిర్వహించిన జ్ఞాన మహాసభలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. మనసును స్థాయి పరచుకునే తత్వమే ఆధ్యాత్మిక తత్వమని, దీని ద్వారా జీవితంలో చిన్న చిన్న వివాదాలు తొలగించుకుని, నిరంతరం సుఖసంతోషాలతో జీవించడానికి, మంచి చెడుల విశ్లేషణతో కూడిన మానసిక స్థితిని ఏర్పరచుకోవాలని అన్నారు. మనలోని లోపాలను సవరించుకోకుండా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ లోపాలను తొలగించుకునే విధానమే ఆధ్యాత్మిక తత్త్వమన్నారు. మానవత్వాన్ని బోధించేదే మతమని, మానవత్వాన్ని హరించేది మతం కాదని, రాక్షసత్వమని అభివర్ణించారు. మనసును తాత్త్విక జ్ఞానశక్తితో నింపుకోవడానికి సద్గురు మార్గంలో త్రయీ సాధన ఆచరించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి, గురు దక్షిణగా ప్రకృతిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అమెరికాకు చెందిన కిరణ్ ప్రభ మాట్లాడుతూ, పీఠం నిర్వహిస్తున్న బాలవికాస్ కార్యక్రమాలను కొనియాడారు. డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగాదేవి తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో తాత్త్విక బాల వికాస్ చిన్నారుల ప్రసంగాలు అందరినీ అలరించాయి. ఉమా ముకుంద నేతృత్వంలో సంగీత విభావరి రంజింపజేసింది. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఉమర్ ఆలీషా మహిళా యువతకు వస్త్రాలు, దంగేటి రామకృష్ణ సహకారంతో పీఠాధిపతి చేతుల మీదుగా ధాన్యపు కుచ్చులు పంపిణీ చేశారు. ఉత్సాహంగా సైన్స్ రంగోలీ పోటీలు పెద్దాపురం (సామర్లకోట): నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని పట్టణ చిల్ట్రన్స్ క్లబ్ ఆధ్వర్యాన పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో విద్యార్థులకు గురువారం జిల్లా స్థాయి సైన్స్ ముగ్గుల పోటీలు నిర్వహించారు. జూనియర్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ విభాగాల్లో 300 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారని క్లబ్ గౌరవాధ్యక్షుడు బుద్దా శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షురాలు కూనిరెడ్డి అరుణ, ప్రతినిధులు అనూష, అంజలి, జస్విత, సాయి బంగారం, నేహా, రేణుకా, పవన్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. -
న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ
కోరుకొండ: మండలంలోని కోటికేశవరంలో గురువారం తెల్లవారుజామున న్యూ ఇయర్ వేడుకల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీనిలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. కోరుకొండ ఎస్సై శ్రీనివాసు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి న్యూ ఇయర్ వేడుకలను కోటి కేశవరం వాసులు, స్థానికేతరులు నిర్వహించుకున్నారు. గురువారం తెల్లవారుజాము 3 గంటలకు జగ్గంపేట మండలం రాజపూడి గ్రామానికి తిరిగి వెళ్తున్న సందర్భంగా కారు వేగంగా నడపడంతో స్థానిక ఎస్సీ సామాజికవర్గం వారు ప్రశ్నించడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మాటామాటా పెరిగి ఘర్షణ జరిగింది. అదే కారులో దళిత యువకులు మోరారి అఖిల్, నల్లమిల్లి నవీన్లను బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ పార్టీలో పాల్గొని తిరిగి వెళ్తున్న మరికొంతమందిని స్థానిక దళితులు ఆపేశారు. కిడ్నాపయిన వారిని వెనక్కి రప్పించమని డిమాండ్ చేస్తూ వారిని నిర్బంధించారు. నిర్బంధంలో ఉన్నవారు ఫోన్ చేయడంతో అఖిల్, నవీన్ను వెనక్కి తీసుకువచ్చారు. కానీ అప్పటికే తీవ్రంగా కొట్టడంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. అంతకుముందు స్థానిక ఎస్సీపేట వద్ద జరిగిన కొట్లాటలో అవతలి వర్గానికి చెందిన గోపాలకృష్ణ తలకు బలమైన గాయమయినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు ఆధారంగా అట్రాసిటీ, కొట్లాట కేసులు నమోదు చేసినట్టు, ఇరువర్గాలకు చెందిన ఆరుగురిని నిందితులుగా గుర్తించినట్టు తెలిపారు. వీరిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. డీఎస్పీ వై. శ్రీకాంత్ దర్యాప్తు అధికారిగా ఉన్నట్టు తెలిపారు. కోరుకొండ పోలీసు స్టేషన్ వద్ద ధర్నా నిందితులను తక్షణం అరెస్టు చేయాలని దళితులు గురువారం రాత్రి కోరుకొండ పోలీసుస్టేషన్ వద్ద ధర్నా చేశారు. దాడికి పాల్పడి, కులంపేరుతో దూషించి, ఇద్దరు యువకులను కిడ్నాప్ చేసిన ఘటనలో ఎస్సీలకు న్యాయం చేయాలని కోటికేశవరం వాసులు పోలీసులను కోరారు. కోటికేశవరం సర్పంచ్ ముడే సిందూదివ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దాడికి పాల్పడిన వారిని బేషరతుగా అరెస్టు చేయాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ దాడిలో ఒక సామాజిక వర్గానికి చెందిన యువకులు, స్థానికేతరులు ఎస్సీమాల సామాజిక వర్గానికి చెందిన మోరారి అఖిల్, నల్లమిల్లి నవీన్లను కొట్టడంతో రాజమహేంద్రవరం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. దీనిలో అఖిల్కు చేయి విరిగిందని, నవీన్ తలకు గాయాలయినట్టు పోలీసులకు తెలిపారు. దళిత నాయకుల పరామర్శ రాజమహేంద్రవరం జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను గురువారం దళిత నాయకులు పరామర్శించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. గుమ్ములూరు సర్పంచ్ నక్కా రాంబాబు మాట్లాడుతూ దళితులకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమన్నారు. దళితులను కులంపేరిట దుర్భాషలాడుతూ, దాడికి పాల్పడటమే కాకుండా, కిడ్నాప్ చేయడం కుల దురంహకారమే అన్నారు. దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. దళిత నాయకులు పిట్టా కృష్ణ, దారా రాంబాబు, రాయుడు యేసు, కందికట్ల జయకర్, గొల్లపల్లి ప్రవీణ్ పాల్గొన్నారు. గాయపడిన ఎస్సీ యువకులురాజమహేంద్రవరం జీజీహెచ్లో బాధితులతో మాట్లాడుతున్న దళిత నాయకులు ఎస్సీ యువకుల కిడ్నాప్, ముగ్గురికి గాయాలు కోరుకొండ పోలీసు స్టేషన్ వద్ద దళితుల ధర్నా -
ఉసురు తీసిన షికారు
● అతి వేగమే అనర్థానికి కారణం ● న్యూ ఇయర్ వేడుకలకు అంతర్వేది బీచ్కు వచ్చిన ముగ్గురు యువకులు ● ఒకరు మృతి, మరొకరు సురక్షితం ● బోరున విలపిస్తున్న సహచరులు సఖినేటిపల్లి: న్యూ ఇయర్ వేడుకలు చేసుకుందామని ఉల్లాసంగా, ఉత్సాహంగా అంతర్వేదికి వచ్చిన ముగ్గురు స్నేహితులలో ఒకరు ఊహించని రీతిలో మృత్యువాత పడడం వారిలో తీవ్ర విషాదం నింపింది. అంతర్వేది బీచ్ వెంబడి వాహనంలో వారు చేపట్టిన షికారు తోటి స్నేహితుడి ప్రాణాన్ని బలిగొనడాన్ని జీర్ణించుకోలేక సహచరులు బోరున విలపిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి సాగర సంగమం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన బొండాడ సూర్యకిరణ్, కాకినాడ జిల్లా ఇంద్రపాలెంకు చెందిన నిమ్మకాయల శ్రీధర్(35), వాకలపూడికి చెందిన నందమూరి వెంకట సాయినాథ్ గోపీకృష్ణ కలసి జీపులో కాకినాడ నుంచి బయలుదేరారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అంతర్వేది బీచ్ వద్ద సేద తీరేందుకు ఒక రెస్టారెంట్కు చేరుకున్నారు. కొంత సమయం గడిపాక ముగ్గురు స్నేహితుల్లో సూర్యకిరణ్ గదిలోనే ఉండిపోయాడు. అర్ధరాత్రి దాటాక శ్రీధర్, గోపీకృష్ణ జీపులో బీచ్ తీరం వెంబడి డ్రైవ్ చేసుకుంటూ షికారుకు బయలుదేరారు. వారిద్దరూ హుషారుగా మాట్లాడుకుంటూ వెళుతూ జీపు వేగం పెంచడంతో పాటు లైట్హౌస్ సమీపానికి వెళ్లే సరికి సంగమం వద్దనున్న మలుపును పసిగట్టలేకపోవడంతో వాహనం అదుపు తప్పి సంగమం జలాల్లోకి సరాసరి దూసుకుపోయింది. ప్రమాదాన్ని గ్రహించిన గోపీకృష్ణ, కారు నుంచి దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న శ్రీధర్ మాత్రం జీపుతో సహా సాగర సంగమం జలాల్లోకి దూసుకుపోయాడు. బయటపడిన గోపీకృష్ణ స్థానిక యువకులు, జాలర్లకు ప్రమాదం గురించి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద బాధితుడు గోపీకృష్ణను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం కొనసాగిన పోలీసుల గాలింపు చర్యల్లో సాగర సంగమం సమీపంలో జీపుతో సహా శ్రీధర్ మృతదేహం లభ్యమైంది. జీపును పొక్లెయినర్తో ఒడ్డుకు తెచ్చి, మృతదేహాన్ని తీసి అంబులెన్స్లో రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తోటి స్నేహితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఎస్సై దర్యాప్తు చేపట్టారు. -
‘కళ’కలం కనుమరుగు
● పల్లెల్లో తగ్గిన సంక్రాంతి సందడి ● రానురానూ చిక్కిపోతున్న కళారూపాలు ప్రత్తిపాడు: సంక్రాంతి వచ్చిదంటే చాలు గ్రామాలు ఒకప్పుడు ధాన్యరాశులతో పాటు వివిధ రకాల కళారూపాలతో సందడిగా ఉండేవి. ధనుర్మాసం రాకతో డూడూ బసవన్నలు, బుడబుక్కల వారు, గంటా సాహెబ్, పిట్టలదొర, హరిదాసు.. ఇలా పలు రకాల మనవైన సాంస్కృతిక కళారూపాల్ని ఊరిలో ప్రదర్శించి... తృణమో పణమో తీసుకుని సంతోషంగా జీవించేవారు. కానీ నేటి హైటెక్ యుగంలో ఆధునిక వినోదాల తాకిడికి ఈ కళారూపాలు చిక్కి శల్యమైపోయాయి. కళాపోషకులు కనుమరుగయ్యారు. కళాకారులు తెరమరుగయ్యారు. ● మెడలో దండ, చేతిలో చిడతలు, తంబూరాతో శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ ‘హరిలో రంగ హరి... హరిలో రంగ హరి’ అంటూ ఇల్లిల్లూ తిరుగుతూ ఈ నెల రోజులూ పల్లెల్లో వీధివీధినా హరిదాసులు సందడి చేసేవారు. ● కోసిన కోత కొయ్యకుండా వసపిట్టలా వాగుతూ, బడాయి కబుర్లు చెబుతూ ఆబాల గోపాలాన్నీ పిట్టల దొరలు ఆనంద పరచేవారు. ● గవ్వలతో కుట్టిన గొంగడి టోపీ ధరించి, ఒంటికి గొంగడి వస్త్రాన్ని కప్పుకొని, పిల్లనగ్రోవి వాయిస్తూ భిక్షమెత్తుకునే గొరవయ్యలు ఇంటింటికీ వచ్చేవారు. ● కనకదుర్గమ్మ పెట్టెతో, కొరడా ఝళిపిస్తూ, ఒంటిని కొరడాతో బాదుకుంటూ, వీధి మధ్యలో డోలు వాయిస్తూ పోతరాజులు సందడి చేసేవారు. ● రంగురంగుల పట్టు వస్త్రాలతో కాళ్ల నుంచి కొమ్ముల వరకూ బసవన్నలను అందంగా అలంకరించి గుడ్డి బూరలు, కోణంగి బుడ్డాళ్లతో సహా... ఇంటింటికీ వచ్చి ‘అయ్యవారికి దండం పెట్టూ....’ అంటూ తమకు చిల్లర పైసలూ, ఎద్దుకు బుట్టెడు వడ్లూ అడుగుతూ...గంగిరెద్దుల వారు పండగకే కళ తెచ్చేవారు. ● పాత గొడుగు వేసుకుని.. బుస్కోటు తొడుక్కుని.. బుడబుడక్ మంటూ డమరుకం వాయిస్తూ...‘అంబ పలుకు జగదాంబ పలుకు’ అంటూ ఇంటింటా భవిష్యవాణిని వినిపించేవారు బుడబుక్కల స్వాములు. ● ఎత్తైన చెట్టు కొమ్మ మీద కూచుని.. కనిపించిన మేర దృశ్యాలను తనదైన వ్యంగ్య ధోరణిలో కొమ్మదాసరిలు ప్రత్యక్ష వ్యాఖ్యానం చెప్పేవారు. ● నీళ్లు నింపిన కడవ మూతిలో కత్తి గుచ్చి, దాన్ని ఓ కావిడికి కట్టి ఊరంతా ఊరేగించి కనికట్టుతో మాసాబత్తినవాళ్లు అందర్నీ ఆకట్టుకునే వారు. ● ఇంటింటికీ తిరిగి సకల కులాల వారికీ తాతముత్తాతల నుంచి గోత్రాల వరకూ... పాటల రూపంలో వంశమూలాన్నీ పిచ్చికుంట్లవారు వివరించేవారు. ● రోజుకో వేషం వేసుకుని, హాస్యం, భయంతో సహా సకల రసాలనూ పలికిస్తూ.. ఆఖరి రోజు శక్తి వేషంతో ఊరంతటికీ వినోదం అందించేవారు పగటి భాగవతులు. ● తలపై పెద్ద కిరీటం, చేతిలో గంట, నుదిటిపై విబూది పట్టీలు, మెడలో శంఖంతో వచ్చి గంట నిండా ధాన్యం పెట్టమంటూ జంగం దేవర శుభోదయం పలికేవారు. ● తలపై పక్షి ఈకలు, పంచెకట్టు, పెద్ద బెల్టు, చేతిలో చిన్న చేతికర్ర, మెడలో పూసల దండలతో గిరిజన యాసతో జరిగింది చెబుతాం... జరగబోయేది చెబుతాం... అంటూ గడపలో తిష్ట వేసేవాడు కోయ దొర. ● చిన్న సంచికట్టుతో, విబూతి నామాలతో గడపలో తిష్టవేసి కనికట్టు, హస్తలాఘవం వంటి విద్యలతో అందర్నీ అచ్చెరువందించేవారు విప్ర వినోదులు. ● భుజాన కావిడి, కావిడి బద్ద పొడుగునా గొట్టంతో వచ్చి, గొట్టం విప్పితే ఏయే తప్పులకు నరకంలో ఏయే శిక్షలు విధిస్తారు కళ్లకు కట్టిచెప్పి జనం ఇచ్చే సంభావనలు కాశీ బ్రాహ్మణుడు స్వీకరించే వాడు. ● నెమలి ఈకలు తలకు కట్టుకుని, గంభీరమైన వేషధారణతో పాట పాడుతూ... కంచు గంట కానీ, శిబ్బెని మోగిస్తూ, శివయ్యను స్మరించే చెంచు దొరలు. ● ఎలుగు బంటిని తెచ్చేవారు... కోతులను ఆడించేవారు... కాటికాపర్లు... ఇలా అనేకానేక వృత్తుల వారు సంక్రాంతి పండగ సందర్బంగా ప్రతీ పల్లెలోనూ సందడి చేసేవారు. ఇవన్నీ ఒకప్పుడు. ప్రస్తుత హైటెక్ యుగంలో పల్లెజీవి పట్టణ వాతావరణానికి అలవాటు పడ్డాక... ఆ ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు కనుమరుగైపోతున్నాయి. మన తర్వాతి తరం వారికి ఈ కళారూపాలన్నీ పుస్తకాలలో బొమ్మల రూపంలో కనిపిస్తాయేమో! -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
కృష్ణుని మాటలకు అనుచితార్థాలు తీయరాదు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ద్రౌపది ఆరోవానిగా నిన్ను వరిస్తుంది’ అని కర్ణుడితో కృష్ణుడు అనలేదని, ఆ సమయంలో పరమాత్మ మాటలకు అనుచితార్థాలు తీయరాదని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందు సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఉద్యోగపర్వంలోని ప్రధాన సన్నివేశాలను గురువారం ఆయన వివరించారు. ‘‘రాయబారం ముగిశాక కర్ణుడిని కృష్ణుడు ఏకాంతంలో కలసి అతడి జన్మ రహస్యం చెప్పి, పాండవ పక్షానికి రావాలని ఆహ్వానిస్తాడు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఉపయోగించిన ‘షష్ఠే కాలే’ అనే పదానికి సరైన అర్థాన్ని తెలుసుకోవాలి. పంచమ కాలం అన్న పదం రామాయణంలో, చతుర్థ కాలం అనే పదం యజుర్వేదంలో కనపడుతాయి. షష్ఠే కాలే అనే పదానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం ‘పట్టాభిషేక సమయం’ అని అర్థం. ‘ఆ సమయంలో పాండవులతో పాటు ఆయనను సేవిస్తుంది’ అనే మాటకు విపరీతార్థాలు తీయరాదు’’ అని వివరించారు. ‘‘స్వయంవర సమయంలో తాను కర్ణుని వరించనని ద్రౌపది స్పష్టం చేసింది. నిండు సభలో ద్రౌపది వలువలు ఊడదీయమని దుశ్శాసనుడిని శాసించింది కూడా కర్ణుడేననే విషయం మనం విస్మరించరాదు. అటువంటి వాడిని ద్రౌపది ఎలా వరిస్తుంది?’’ అని సామవేదం ప్రశ్నించారు. భారత యుద్ధంలో మరణించిన రాక్షస శక్తులు నేడు మళ్లీ జన్మించి, మన మధ్యనే సంచరిస్తూ, కొన్ని పిట్ట కథలను అనేక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. ‘‘రాయబారం ముగిశాక, కుంతిని కృష్ణ పరమాత్మ కలసినప్పుడు ప్రతిక్రియ చేయడమే రాజధర్మమని తన మాటగా ధర్మరాజుకు చెప్పాలని ఆమె అడుగుతుంది. ద్యూతంలో పరాజయం, సంపదలు కోల్పోవడం కన్నా, మహాసాధ్వి ద్రౌపదిని అవమానించిన తీరు తనకు తీరని దుఃఖాన్ని కలిగిస్తోందని, అలా చేసిన వారిపై దండనీతి ప్రయోగించాలని ఆమె ధర్మరాజుకు సందేశం పంపుతుంది. కుంతి వీరపత్ని, వీరమాత. యుద్ధమే ఆ సమయంలో తగిన ధర్మమని, క్షత్రియుడు బిచ్చమెత్తుకుని జీవించరాదని తన సందేశంలో పేర్కొంటుంది. కర్ణుడు పాండవ పక్షానికి రాడని కృష్ణుడికి తెలుసు. అయినప్పటికీ తాను నిష్కపటంగా సంధికి ప్రయత్నిస్తానని ముందే ఆయన ప్రకటించాడు. కర్ణుడు ఈవలి పక్షానికి వస్తే, యుద్ధమే ఉండదు’’ అని సామవేదం అన్నారు. -
వీఆర్ఓలకు ఉద్యోగోన్నతులు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్ 1 గ్రామ రెవవెన్యూ అధికారులుగా పనిచేస్తున్న 34 మందికి సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ గురువారం జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకట్రావు ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా వీఆర్వో సంఘ నాయకులు కలెక్టర్, డీఆర్వోను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ పోస్టుల కోసం ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కృషి చేశారని వీఆర్వో సంఘ నాయకులు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మద్దాల బాపూజీ, సహాయ కార్యదర్శి అనిశెట్టి రామకృష్ణ, జిల్లా అధ్యక్షుడు యల్లేశ్వరావు పాల్గొన్నారు. -
నేటి నుంచి రహదారి భద్రతా మాసోత్సవాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజలు, వాహనదారుల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి ఆదేశించారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా సడక్ సురక్షా అభియాన్ పోస్టర్ను కలెక్టరేట్లో గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పరిమితికి మించి లోడింగ్ చేయడం వల్ల ఇసుక రోడ్లపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇసుక అధిక లోడింగ్ జరగకుండా క్షుణ్ణంగా పర్యవేక్షించాలని రవాణా అధికారులను ఆదేశించారు. హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తప్పనిసరి, మద్యం తాగి వాహనాలు నడపరాదు వంటి అంశాలపై వాహనదారులకు కచ్చితమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ మాట్లాడుతూ, ఈ నెల 31వ తేదీ వరకూ జిల్లావ్యాప్తంగా రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారిగా రాబర్ట్ పాల్ రాజమహేంద్రవరం రూరల్: జిల్లా వ్యవసాయ అధికారిగా కె.రాబర్ట్ పాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఉన్న మాధవరావు బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. పాల్ ఉమ్మడి జిల్లా ఆత్మ ప్రాజెక్ట్ మేనేజర్గా వ్యవహరిస్తూ, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారిగా నియమితులయ్యారు. ఆయనకు రాజమహేంద్రవరం ఏడీఏ సూర్యరమేష్, ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవ్, పలువురు వ్యవసాయ అధికారులు అభినందనలు తెలిపారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక కొనసాగింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణ భగవానుడిని పూజించారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహించనున్నారు. రూ.750 టికెట్టుతో భక్తులు ఈ హోమంలో పాల్గొనవచ్చు. -
ఇదేంధర బాబూ!
● పడిపోయిన కొత్తిమీర రేటు ● 6 నెలల కిందట కిలో రూ.300 ● నేడు రూ.15 ● కోత ఖర్చులు కూడా రావడం లేదని రైతుల ఆవేదన పెరవలి: కొత్తిమీర ధరలు దారుణంగా పతనమవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 450 హెక్టార్లలో దాదాపు 3 వేల మంది సన్న, చిన్నకారు రైతులు కొత్తమీర సాగు చేస్తున్నారు. పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, చాగల్లు, తాళ్లపూడి, రాజమహేంద్రవరం రూరల్, అనపర్తి, నల్లజర్ల, కడియం తదితర మండలాల్లో కొత్తిమీర సాగు జరుగుతోంది. సుమారు ఆరు నెలల కిందట రైతు వద్ద కిలో కొత్తిమీర ధర ఏకంగా రూ.300 వరకూ పలికింది. అటువంటిది నేడు రూ.15కు పడిపోవడంతో కనీసం కోత ఖర్చులు కూడా రావడం లేదని, పైగా చేతి సొమ్ము అదనంగా ఖర్చవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి, కష్టపడి పండించిన కొత్తిమీరకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో చేలల్లోనే వదిలేస్తున్నారు. కొందరు రైతులైతే కొత్తిమీర తీయకుండా ఉచితంగా పట్టుకెళ్లిపోవాలని ప్రజలకు చెబుతున్న దాఖలాలు కూడా ఉన్నాయి. దండిగా పెట్టుబడి ఎకరం విస్తీర్ణంలో కొత్తిమీర సాగుకు రూ.20 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. అన్నీ అనుకూలంగా ఉంటే రెండు మూడు టన్నుల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ధర ఉంటే రూపాయికి రూపాయి మిగులుతుంది. లేకపోతే పెట్టుబడి కూడా కోల్పోవలసి వస్తుంది. కొత్తిమీర తీయాలంటే కనీసం ఐదుగురు కూలీలు అవసరమవుతారు. వీరు 100 కిలోల కొత్తిమీర తీస్తే ఒక్కొక్కరికి రూ.350 చొప్పున రూ.1,750 అవుతుంది. సంచులు, రవాణా, ఇతర ఖర్చులు మరో రూ.850 వరకూ అవుతుంది. మొత్తంగా కోత ఖర్చు ఎకరాకు రూ.2,600 అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కొత్తిమీర విక్రయిస్తున్న రైతులకు కిలోకు రూ.15 చొప్పున రూ.రూ.1,500 మాత్రమే వస్తోంది. మార్కెట్లో కమీషన్ పోనూ చేతికి రూ.1,300 మాత్రమే వస్తోంది. దీంతో, తమకు చేతి సొమ్ము అదనంగా రూ.1,300 వరకూ వదిలిపోతోందని రైతులు వాపోతున్నారు. ధరల పతనం ఎందుకంటే.. గత ఏడాది జూలై నెలలో కిలో కొత్తిమీర ధర రైతు వద్ద రూ.300 పలికింది. ఆ సమయంలో అధిక వర్షాలు, వరదలు రావడంతో లంకల్లోని కొత్తిమీర తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటాయి. ఆ తరువాత వాతావరణం అనుకూలించడంతో రైతులు అధిక విస్తీర్ణంలో కొత్తిమీర సాగు చేపట్టారు. ఇదంతా ఒకేసారి తీతకు రావడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచీ కొత్తిమీర ఒక్కసారిగా మార్కెట్ను ముంచెత్తింది. ఫలితంగా ధరలు పాతాళానికి పడిపోయాయి. ఆరు నెలలుగా కొత్తిమీర ధరలు (కిలోకు రూ.లలో) తగ్గాయిలా.. నెల ధర జూలై 300 ఆగస్టు 250 సెప్టెంబర్ 200 అక్టోబర్ 150 నవంబర్ 100 డిసెంబర్ ప్రారంభం 80 నేడు 15 -
సంచార జీవితం.. సాపాటుకు సతమతం
అయినవిల్లి: కూటి కోసం కోటి విద్యలు అనే నానుడి అందరికీ తెలిసిందే. ఈ కోవలోదే వీరి జీవన విధానం. కమ్మరి పనిని జీవనాధారంగా చేసుకుని కుటుంబంతో పాటు దేశ సంచారం చేస్తూ పల్లెలు, పట్టణాలు తిరుగుతూ వీరు పొట్ట పోసుకుంటున్నారు. వ్యవసాయ, ఇంటి పనుల్లో వాడే పనిముట్ల తయారీలో వీరిది అందే వేసిన చేయి. పిల్లాపాపలతో కలిసి రోడ్డు పక్కన చిన్న గుడారాలు వేసుకుని వర్షం, ఎండ, చలిని లెక్క చేయకుండా జీవన పోరాటం చేస్తుంటారు. సంచార జాతులకు చెందిన రెండు కుటుంబాల వారు అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ స్థలంలో గుడారం వేసుకుని నెల రోజులుగా జీవనం సాగిస్తున్నారు. వీరిది మధ్యప్రదేశ్. చలిలో వణుకుతూ... గజగజ వణికించే చలిలోనూ పిల్లా పాపలతో గుడారంలో తలదాచుకుని వీరు జీవనం సాగిస్తున్నారు. పదిమందికి పైనే ఇక్కడ ఉంటున్నారు. ఈ ప్రాంతం వ్యవసాయం ఆధారం కావడంతో వీరి పనికి గిరాకీ బాగానే ఉంది. కత్తులు, కొడవళ్లు, గునపాలు, పారలు, ఇంటి అవసరాలకు ఉపయోగపడే పెనం, అట్లకాడ ఇలా పలు ఇనుప సామాన్లు వీరు తయారు చేస్తున్నారు. అప్పుడు మకాం మారుస్తాం గిరాకీ ఉంటే రోజుకు రూ.మూడు వేలు వస్తుంది. కుటుంబ ఖర్చులు పోను రూ.2 వేలు మిగులుతుంది. గిరాకీ లేకపోతే ఉన్న డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాం. డబ్బు మొత్తం ఖర్చయిపోతే పస్తులుండాల్సిందే. అప్పుడు మరో చోటుకు మకాం మారుస్తాం. – జగదీష్ చౌహాన్ రోగాలు వస్తే అంతే చలి అయిన ఎండ అయిన వాన అయిన రోడ్డు పక్కనే గుడారాల్లో జీవనం సాగిస్తాం. ఎవ్వరూ మమ్ముల్ని పక్కకు చేర నీయరు. ఊరు గానీ ఊరు మమ్మల్ని ఎవరూ నమ్మరు. రోగాలు వస్తే మా ఖర్మ మాదే. చిన్న పిల్లలతో అలాగే జీవనం సాగించాలి. – అర్జున్ కమ్మరి పనిలో కుటుంబం అంతా కష్టపడితే రోజుకు రూ.3 వేల ఆదాయం ఖర్చులు పోను మిగిలేది రూ.2 వేలు గిరాకీ లేకపోతే పస్తులే రోగమొస్తే దేవుడే దిక్కు -
అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం
● నిరాశ్రయులైన నాలుగు కుటుంబాల వారు ● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సాయం తుని రూరల్: తాళ్లూరు గ్రామంలో విద్యుత్ షార్టు సర్క్యూట్తో చెలరేగిన మంటలకు వాసాగారము (పొడవాటి తాటాకిల్లు) దగ్ధమైంది. అందులో నివాసం ఉంటున్న నాలుగు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. గురువారం నూతన సంవత్సరం సందడిలో ఉండగా ఆగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలియడంతో తుని నుంచి అగ్నిమాపక వాహనంతో వచ్చిన సిబ్బంది ఇతర ఇళ్లకు వ్యాప్తి చెందకుండా మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో షేక్ మహబూబ్ నిషా, షేక్ అమ్మాజీ, షేక్ సిలార్ బీబీ, షేక్ రంజాన్బీబీ కుటుంబాలకు చెందిన రేషన్కార్డులు, ఆధార్ కార్డులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్కార్డులు, దుస్తులు, గృహోపకరణలతో పాటు కొంత నగదు కాలిబూడిదయ్యాయి. రూ.రెండు లక్షలు ఆస్థి నష్టం జరినట్టు అంచనా వేశామని అగ్నిమాపక అధికారి కె.రాముడు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేస్తామని తహసీల్దార్ ప్రసాద్ తెలిపారు. దాడిశెట్టి రాజా సాయం బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సాయం అందించారు. దాడిశెట్టి రాజా రాజధానిలో ఉండడంతో వైఎస్సార్ సీపీ నాయకులు నాగం దొరబాబు, దుంగల నాగేశ్వరరావు, కీర్తి బాలకృష్ణతో బాఽధిత కుటుంబాలకు దుస్తులు, నగదు అందజేశారు. గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
రక్తపింజర్ల సంచారంతో ఆందోళన
అంబాజీపేట: ఇంటి ఆవరణలో తిరుగుతూ రెండు రక్తపింజర్లు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. అంబాజీపేట శ్రీనివాసనగర్ శ్రీ విజయబేతాళ స్వామి ఆలయం వెనుక ఉన్న పప్పుల శ్రీకాంత్ ఇంటి ఆవరణలో ఉదయం నుంచి రెండు రక్తపింజర్లు తిరుగుతూ స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. దాంతో భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఇంటి ఆవరణలో కలిసి ఉన్న మగ, ఆడ రక్త పింజర్లను చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించారు. ఈ పాములను జన సంచారం లేని అరణ్యంలో వదిలిపెట్టారు. రోడ్ల నిర్మాణానికి ఎర్ర కంకర వస్తుందని అందులో ఈ రక్త పింజర్లు వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. ఊడిమూడిలో ఘర్షణ ● ఇద్దరికి గాయాలు ● 10 మందిపై కేసు నమోదు పి.గన్నవరం: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండలంలోని ఊడిమూడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక వర్గానికి చెందిన ఇద్దరికి గాయాలు అయ్యాయి. దీంతో మరొక వర్గానికి చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్టు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ చెప్పారు. ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ఊడిమూడి గ్రామంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది యువకులు న్యూ ఇయర్ కేకును కట్ చేసి, బైకులపై తమ ఇళ్లకు తిరిగి వెళ్తూ.. రామాలయం వద్ద కూర్చొన్న మరొక వర్గం యువకులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మాటామాటా పెరిగి వారి మధ్య ఘర్షణ జరిగింది. రామాలయం వద్ద కూర్చున్న ఒక వర్గంపై మరో వర్గం దాడి చేసినట్టు ఎస్సై చెప్పారు. అక్కడ కూర్చొన్న ఒక యువకునిపై చాకుతోను, మరో యువకుడిపై సీసాతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. గాయపడిన ఒకరిని రాజమహేంద్రవరంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడని, మరో యువకుడు స్థానిక సీహెచ్సీలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. దాడికి పాల్పడిన 10 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ చెప్పారు. -
ప్రజలందరికీ మంచి జరగాలి
రాజమహేంద్రవరం రూరల్: నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరిగేలా అనుగ్రహించాల్సింది గా భగవంతుడిని కోరుకుంటున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయనను కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్య కర్తలు బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయాని కి గురువారం తరలివచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి, సత్కరించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి రోజూ పండగలా గడిచిందన్నారు. సంక్షేమ పథకాలకు వార్షిక క్యాలెండర్ ప్రకటించి, అమలు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని చెప్పారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలను ఇబ్బందులు వెంటాడుతున్నాయన్నారు. సూపర్ సిక్స్తో పాటు అనేక హామీలిచ్చి ప్రజలను మరోసారి మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. కొత్త సంవత్సరంలోనైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలతో పాటు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గిరజాల బాబు, గొందేశి శ్రీనివాసులురెడ్డి, కడియం మండల అధ్యక్షుడు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, పార్టీ నాయకులు చెల్లుబోయిన నరేన్, మింది నాగేంద్ర, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి అంగాడి సత్యప్రియ, రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి వెలుగుబంటి అచ్యుతరామ్, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి చాప రాజా, మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మీర్జా మౌలా ఆలీ తదితరులు పాల్గొన్నారు. -
మాధవరావు సేవలు ప్రశంసనీయం
రాజమహేంద్రవరం రూరల్: ప్రకృతి వ్యవసాయాన్ని ఉమ్మడి జిల్లాలో ప్రోత్సహించడానికి జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు విశేష కృషి చేశారని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు 33 సంవత్సరాలు సర్వీసు అనంతరం మంగళవారం పదవీ విరమణ చేశారు. స్థానిక సూర్యా కల్యాణ మండపంలో నిర్వహించిన అభినందన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహించడంలో క్షేత్ర స్థాయిలో రైతులతో మమేకమై వాటివల్ల లాభాలను వివరించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. జిల్లా సంయుక్త కలక్టరు మేఘ స్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, ఆర్డివో నాయక్, జేడీఏలు విజయకుమార్, జెడ్ వెంకటేశ్వరరావు, డాట్ శాస్త్రవేత్త నరసింహారావు, జిల్లా ఏపీ ఎన్జీజీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులు మీసాల మాధవరావు, విజయకృష్ణ పాల్గొన్నారు. -
బుచ్చయ్య వ్యాఖ్యలు హాస్యాస్పదం
● పొట్టేళ్ల నరికివేత మొదలైంది చంద్రబాబు ప్రభుత్వంలోనే.. ● విలేకరులతో మాజీ మంత్రి వేణు రాజమహేంద్రవరం రూరల్: సోషల్ మీడియా, ఏఐను అడ్డుపెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ జనసేన పార్టీకి చెందిన దేవరాజ్ ఆయన వదినను తోస్తే దానిని వైఎస్సార్ సీపీ నాయకుడు చేశాడంటూ హోంమంత్రి అనిత తప్పుడు ప్రచారం చేశారన్నారు. మరుసటిరోజు స్వయాన అతని అక్క తన తమ్ముడు దేవరాజ్ జనసేన పార్టీ కార్యకర్త అని, చేతిపై పవన్ కల్యాణ్ టాటూ ఉంటుందని తెలిపిందన్నారు. అలాగే వైఎస్సార్ సీపీకి చెందిన రవిచంద్రారెడ్డి బీజేపీలో చేరితే అతడి మూడేళ్ల క్రితం కేక్ కటింగ్ వీడియోను చూపించి హోంమంత్రి తప్పుడు ప్రచారం చేశారన్నారు. పొట్టేళ్ల నరికివేత మొదలైంది చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడేనన్నారు. 2024 జూన్ ఏడున బాలకృష్ణ చిత్రపటానికి 25 పొట్టేళ్ల తలకాయలను దండగా వేశారన్నారు. అలాగే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు గొర్రె, పొట్టేలును నరికి రక్తాభిషేకం చేసిన వీడియోలను సైతం చెల్లుబోయిన వేణు చూపించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజున గొర్రెపోతును నరికారని చట్ట ప్రకారం కొందరిని అరెస్టు చేశారన్నారు. కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని వారిని కొట్టి హోంమంత్రికి వీడియో చూపించడంతో పాటు రోడ్డుపై నడిపించడం జరిగిందన్నారు. చివరకు వెహికల్స్ లేకపోవడంతో నడిపించాల్సి వచ్చిందని డీజీపీతో చెప్పించారన్నారు. మేము కానీ తలుచుకుంటే రోడ్డుమీద తిరగగలరా అంటూ బుచ్చయ్య వ్యాఖ్యానించడం దారుణమన్నారు. చెలరేగిపోతున్న మాఫియా నియోజకవర్గంలో మట్టి, ఇసుక, మద్యం, రేషన్ బియ్యం మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోందన్నారు. ఉచిత ఇసుక ఎక్కడా లభించడం లేదన్నారు. ఏ ఇసుక లారీని అడిగిన బుచ్చయ్య తాలూకా అంటూ సమాధానం ఇస్తున్నారన్నారు. అలాగే మధ్యం ధరలు అధికంగా అమ్మడంతో బెల్టుషాపులు విచ్చలవిడిగా పెరిగిపోయాయన్నారు. గంజాయిని అరికట్టామంటూ చెబుతున్నారని, కానీ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల సమాజ వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. వైఎస్ జగన్ను తిడితే లోకేష్ దృష్టిలో పడి ఉన్నతమైన అవకాశం వస్తుందని గోరంట్ల ఆశపడుతున్నారన్నారు. యువత నిరుద్యోగభృతి, మహిళలు ఆడబిడ్డ నిధి, రైతులు పంటకు గిట్టుబాటు ధర కోసం ఎదురుచూస్తున్నారన్నారు. -
ఆకాంక్షలు సరికొత్తగా..
సాక్షి, రాజమహేంద్రవరం: గడిచిన ఏడాది ఎన్నో మధుర స్మృతులు మిగిల్చింది.. నూతన సంవత్సరంలోనూ మరింత ఆనందం నిండాలని కాంక్షిస్తూ యువత కొత్త ఏడాదికి ఆహ్వానం పలికింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. మంగవారం అర్ధరాత్రి 12 గంటలకు యువకులు, ప్రజలు, అధికారులు ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. కేక్లు కట్ చేశారు. కూల్డ్రింక్లు పొంగించి ఆనందంగా గడిపారు. డీజేలు పెట్టుకుని స్టెప్పులతో అదరగొట్టారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పూజలు, ప్రార్థనలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. 2026కు స్వాగతం నూతన సంవత్సరం 2026కు ప్రజలు, యువకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి హాపీ న్యూఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. యువత బీర్లు, కూల్ డ్రింక్లు పొంగించి మరీ ఉత్సాహంగా గడిపారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో డీజేల శబ్దాలతో ఆ ప్రాంతాలు మారుమోగాయి. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్టెప్పులేశారు. నృత్యంలో మైమరచిపోయారు. రాత్రి 12 గంటలు దాటగానే ఒక్కసారిగా బాణసంచా పేల్చి నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పారు. ‘బైబై 2025’ వెల్కం ‘2026’ అంటూ కేరింతలు కొట్టారు. ప్రజల సందడితో నగరం మారుమోగింది. అపార్ట్మెంట్లలో అందరూ కలిసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రజల ఆశలు నూతన సంవత్సరంపై పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ‘సూపర్ సిక్స్’ పేరుతో హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటుతున్నా నేటికీ అతీగతీ లేదు. వాటి అమలుపై ప్రజలు ఎదురుచూస్తున్నారు. యువతకు ఉపాధి దక్కేనా? యువతకు 20 లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందజేస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. హామీ ఎప్పుడు అమలవుతుందా? అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. మహిళలకు చేయూత లేదు తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకూ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా.. నేటికీ అమలు చేయలేదు. ఈ ఏడాదైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పాలన స్వర్ణయుగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన స్వర్ణయుగమని ప్రజలు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, యువత చెబుతోంది. గత ప్రభుత్వంలో గడప గడపకూ అందిన సంక్షేమం, వైద్య సేవలు, ఉద్యోగ అవకాశాలపై మననం చేసుకుంటున్నారు. చరిత్రలో ఏ సీఎం చేయనంతగా అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారని కొనియాడుతున్నారు. ఆయన పాలనను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజలు 2026లోనైనా చంద్రబాబు ప్రభుత్వం పథకాలు అమలు చేయాలని డిమాండ్ కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలంటున్న జనం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను పదేపదే గుర్తు చేసుకుంటున్న వైనం -
మేలు చేసే ఆలోచనలతో ముందుకు..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నూతన సంవత్సర వేడుకలు సంయమనం, సామాజిక బాధ్యత, మంచి విలువలతో కూడిన సంప్రదాయానికి ప్రతీకగా జిల్లా ప్రజలంతా జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కుటుంబ సభ్యులతో ఇంటివద్దే నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ, సమాజానికి మేలు చేసే ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న సంవత్సరం జిల్లాలో శాంతి, అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావద్దని, వాటికి బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విద్యను ప్రోత్సహించే ఈ ఆలోచన నూతన సంవత్సర ఆరంభానికి ఒక మంచి సంప్రదాయంగా నిలుస్తుందన్నారు. -
ఆర్థిక నేరాల అడ్డా
సాక్షి, రాజమహేంద్రవరం: ఆర్థిక నేరాలకు 2025లో జిల్లా అడ్డాగా మారింది. ఈ ఏడాది ఆర్థిక నేరగాళ్లు రెచ్చిపోయారు. ఆర్థిక లబ్ధికోసం హత్యలు, దోపిడీ, చైన్ స్నాచింగ్, సాధారణ దొంగతనాలు విచ్చలవిడిగా జరిగాయి. ఈ నేరాలు 2024లో 886 నమోదు కాగా.. 2025లో 928 నమోదై.. 5 శాతం పెరిగాయి. రాత్రిపూట దొంగతనాలు 17 శాతం పెరిగాయి. రహదారులు రక్తసిక్తంగా మారాయి. 14 శాతం ప్రమాదాలు అధికంగా చోటు చేసుకున్నాయి. గంజాయి, బాలికల అదృశ్యం కేసులు నమోదయ్యాయి. మొత్తంగా జిల్లాలో 2025లో నేరాలు 15 శాతం తగ్గుముఖం పట్టాయని ఎస్సీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. జాంపేటలోని పోలీస్ కల్యాణ మండపంలో 2025 నేర నివేదికను ఆయన బుధవారం విలేకరులకు తెలిపారు. 2024లో వివిధ నేరాలపై 7,586 కేసులు నమోదు కాగా, 2025లో 6,477 నమోదైనట్టు చెప్పారు. రూ.3,78,42,525 కోట్లు మాత్రమే రికవరీ రాత్రి పూట దొంగతనాలు 17 శాతం పెరగ్గా.. సాధారణ దొంగతనాలు 3 శాతం పెరిగాయి. మొత్తం 465 కేసులు నమోదు చేయగా.. రూ.4 కోట్ల మేర ఆస్తి స్వాధీనం చేసుకున్నారు. 60 మంది అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. 2025లో వివిధ దొంగతనాల్లో రూ.7,79,82,812 కోట్లు తస్కరించగా.. కేవలం రూ.3,78,42,525 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. 4.735 కేజీల బంగారం రికవరీ చేశారు. 233 ద్విచక్ర వాహనాలు, 153 ట్రాన్స్ఫార్మర్లు, వాటర్ మోటార్లు రికవరీ చేశారు.ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల ద్వారా ప్రయాణిస్తూ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న వారిపై 11 కేసులు నమోదు చేసి రూ.40 లక్షల నగదు, 50 కాసుల బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. రోడ్డు ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా చోటు చేసుకుని రహదారులు రక్తసిక్తంగా మారాయి. మృతుల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. గతంతో పోలిస్తే..2025లో 14 శాతం రోడ్డు ప్రమాదాలు పెరగ్గా.. మృతి రేటు 12 శాతం అధికంగా నమోదైంది. 2024లో 729 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 309 మంది మృతి చెందారు. ● 2025లో 833 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 335 మంది మృతి చెందారు. జాతీయ రహదారులపై 350, రాష్ట్ర రహదారులపై 272, ఇతర రోడ్లపై 211 ప్రమాదాలు జరిగాయి. ● జిల్లాలో గతేడాది 30 బ్లాక్ స్పాట్లు ఉండగా.. ఈ ఏడాది 3 పెరిగి 33కు చేరాయి. ● ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన, రెడ్సిగ్నల్ జంపింగ్, ట్రిపుల్ రైడింగ్, డేంజరస్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, ఓవర్ లోడింగ్, హెల్మెట్, సీట్బెల్ట్, నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిన సందర్భంలో 56,971 కేసులు నమోదు చేశారు. ● 302 ఛీటింగ్ కేసులు, 66 షెడ్యూల్ కులాలపై వేధింపుల కేసులు, 51 గంజాయి కేసులు నమోదు చేశారు. 180 మంది ముద్దాయిల నుంచి 3000.74 కేజీల గంజాయి, 65 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బాలికల అదృశ్యం ● 2024లో 148 మంది బాలికలు అదృశ్యం కాగా.. 148 మందిని కనుగొన్నారు. 2025లో 141 మంది తప్పిపోగా.. 139 మంది ఆచూకీ లభించింది. ● 2024లో 522 పేకాట కేసులు నమోదవగా.. 2681 మంది నుంచి రూ.48,88,577 నగదు సీజ్ చేశారు. 2025లో 439 కేసులు నమోదవ్వగా.. 2245 మంది నుంచి రూ.44,74,295 సీజ్ చేశారు. ● 353 కోడి పందేల కేసులు నమోదవగా.. 1171 మంది నుంచి రూ.10,49,562 నగదు సీజ్ చేశారు. 793 కోళ్లు, 849 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 249 కేసులు 920 మంది నుంచి రూ.13,49,735 నగదు స్వాధీనం చేసుకున్నారు. 413 కోళ్లు, 1054 కోడికత్తులు స్వాధీనం చేసుకున్నారు. ● జిల్లాలో 843, ఇతర జిల్లాలకు చెందిన 141 రౌడీషీట్స్ ఓపెన్ చేశారు. 75 మందిని జైలుకు పంపారు. ● 136 మంది బ్లేడ్బ్యాచ్ సభ్యులపై కేసులు నమోదు చేశారు. 28 మందిని జైలుకు పంపారు. ● 21 మంది రౌడీ, బ్లేడ్బ్యాచ్ సభ్యులపై పీడీ యాక్ట్ అమలు చేశారు. సై‘డర్ ’క్రైం సైబర్ నేరగాళ్లు విజృంభించారు. పోలీసులు తేరుకొనేలోపే బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్షరాస్యుల నుంచి చదువుకున్న వారు సైతం బాధితులుగా మారారు. 2025లో 71 కేసులు నమోదవగా.. రూ.1,34,58,141 కోట్లు కోల్పోయారు. 44 శాతం సోషల్ మీడియా కేసులు జిల్లాలో సోషల్ మీడియా కేసులు గణనీయంగా పెరిగాయి. 2024లో 36 కేసులు నమోదవగా.. 2025లో వాటి సంఖ్య 52 (44 శాత)కు పెరిగింది. గతేడాదితో పోలిస్తే 5 శాతం పెరిగిన దోపిడీ, చైన్ స్నాచింగ్ కేసులు 17 శాతం పెరిగిన రాత్రి పూట దొంగతనాలు గతేడాది 886 కేసులుండగా.. ప్రస్తుతం 928కి పెరుగుదల రహదారులు రక్తసిక్తం.. 14 శాతం పెరిగిన రోడ్డు ప్రమాదాలు గతేడాది 729 జరగ్గా.. 833కు పెరిగిన వైనం 2025 నేర నివేదిక వెల్లడించిన ఎస్పీ నరసింహ కిషోర్ -
వన విహారికో విడిది..
● పర్యాటకుల కోసం ప్రత్యేక హట్లు ● ఆధునిక వసతులతో నిర్మాణం ● సర్వాంగ సుందరంగా వసతి గృహాలు తాళ్లరేవు: తూర్పున ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన కోరంగి అభయారణ్యాన్ని సందర్శించే పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేక హట్లను (వసతి గృహాలు) అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలో పశ్చిమ బెంగాల్లోని సుందరబన్ అడవుల తరువాత రెండో అతిపెద్ద మడ అటవీ ప్రాంతమైన కోరంగి అభయారణ్యాన్ని వేలాది పర్యాటకులు సందర్శిస్తుంటారు. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు విడిది చేసేందుకు అటు కాకినాడ కానీ, ఇటు యానాం, అమలాపురం కానీ వెళ్లవలసి వచ్చేది. అయితే కోరంగిలోనే పర్యాటకులు సేద తీరడంతో పాటు అక్కడ బస చేసేలా అత్యాధునిక సౌకర్యాలతో అటవీ శాఖ వసతి గృహాలను ప్రారంభించింది. కోరంగి పంచాయతీలోని ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న మూడు హట్లతో పాటు మరొక అటవీ శాఖ భవనాన్ని సైతం పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి రూములోనూ డబుల్ కాట్ బెడ్, ఏసీ, టీవీ, ఇన్వర్టర్ సౌకర్యాలను కల్పించారు. పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు పూర్తిస్థాయిలో రక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. అంతే కాకుండా ప్రాంగణంలో ఉన్న బయో డైవర్సటీ భవనాన్ని సందర్శిస్తే కోరంగి మడ అభయారణ్యం విశేషాలను తెలుసుకోవచ్చు. ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి ఈ హట్లు ఒక వరంగా చెప్పవచ్చు. అందుబాటు ధరలలోనే అద్దెలు.. అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ హట్లలో ఒక రోజు బస చేసేందకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఫారెస్ట్ కాంప్లెక్స్లో ఉన్న అటవీ శాఖ అధికారులను సంప్రదిస్తే ఈ రూములను కేటాయిస్తారు. పిల్లా, పాపలు, కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో వచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం ఒకప్పటి ఫారెస్ట్ బంగ్లాను వీఐపీ రూముగా సాధారణ పర్యాటకులకు సైతం అద్దెకు ఇవ్వనున్నారు. ఈ బంగ్లాకు రోజుకు రూ.3,000 చార్జి చేస్తారు. కోరంగి మడ అటవీ ప్రాంతాన్ని సందర్శించి ఒకరోజు ప్రకృతి ఒడిలో సేదతీరడం మరపురాని అనుభూతినిస్తుందని చెపుతున్నారు. కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ హట్లలో ఏసీ, టీవీ తదితర సౌకర్యాలు కోరంగిలో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన పర్యాటక హట్లు ఆన్లైన్లో సైతం బుకింగ్ కోరంగి ఫారెస్ట్ కాంప్లెక్స్ ప్రాంగణంలో పర్యాటకుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన హట్లను ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అటవీశాఖ కల్పించింది. నేరుగా వచ్చిన పర్యాటకులకు తమ సిబ్బంది ద్వారా గదులను కేటాయిస్తున్నాం. అలాగే ఏపీ టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే వీలు కల్పించాం. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలను సందర్శించి అక్కడ బస చేయాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం. ఇతర వివరాల కోసం 89859 52875 నెంబరులో సంప్రదించగలరు. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కోరంగి అభయారణ్యం -
ప్రలోభాలతో పరమాత్ముని వశం చేసుకోలేము
సమన్వయ సరస్వతి సామవేదం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పాండవుల పక్షాన ద్యూతగా వస్తున్న కృష్ణపరమాత్మకు రత్నాలు, వాహనాలు, ఇతర సంపదలు ఏమడినా ఇవ్వాలని ధృతరాష్ట్రుడు విదురుని ఆదేశిస్తాడు. దానికి సమాధానంగా విదురుడు ప్రలోభాలతో పరమాత్మను వశం చేసుకోలేమని ధృతరాష్ట్రునికి వివరించినట్టు సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. బుధవారం హిందూ సమాజంలో ఆయన కృష్ణరాయబారం ఇతివృత్తాన్ని వివరించారు. నీవు ఇచ్చే పూర్ణకలశంతోనో, పాదోదకంతోనే, కుశల ప్రశ్నలతోనో తప్పించి కృష్ణుడు ఇతర సంపదలవైపు కన్నెత్తి కూడా చూడడని విదురుడు చెబుతాడు. దుర్యోధనుడు కృష్ణునితో నీ కోసం ఏర్పాటు చేసిన అన్నపానీయాలను, శయ్యను అంగీకరించమని కోరతాడు. కృష్ణుడు దుర్యోధనుని ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ పాండవులను ద్వేషించిన వాడు నన్ను ద్వేషించినట్టే, వారిని ఆదరిస్తే నన్ను సత్కరించినట్టేనని చెబుతా డు. భగవంతునికీ, భాగవతులకీ తేడా లేదని ఆయన మాటల నుంచి మనం గ్రహించాలని సామవేదం అన్నారు. బాల్యం నుంచి వారి పట్ల దుర్భావంతో ఉన్న నీవు పెట్టే అన్నం కలుషితమైనదని చెప్పి, విదురిని ఇంటికి వెడతాడు శ్రీకృష్ణుడు. దుర్యోధనుడు మూఢుడు, వాడి పట్ల నీవు చెప్పే మంచి మాటలు వ్యర్థం అవుతాయని విదురుడు కృష్ణునితో చెబుతాడు. ఇరుపక్షాల వారికీ నేను కావలసినవాడిని, జ్ఞాతుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడితే సరిద్దిడానికి ప్రయత్నించకపోతే, లోకం నన్ను నిందిస్తుంది. నేను నిష్కపటంగా సంధి కోసం ప్రయత్నిస్తానని చెప్పాడు కృష్ణుడు. విదురుడు ప్రీతితో పెట్టిన అన్నాన్ని స్వీకరిస్తాడు. అనంతరం కృష్ణుడు కుంతిని కలసి పాండవుల క్షేమవార్తను తెలియచేస్తాడు. క్షత్రియకాంత ఏ ప్రయోజనాన్ని ఆశించి సంతానాన్ని కంటుందో, ఆ ప్రయోజనం నెరవేర్చే సమయం ఆసన్నమయిందని ధర్మరాజుకు చెప్ప మని కుంతి కృష్ణుని కోరుతుంది. అనేక మంది మహర్షులు, రాజర్షులు, దేవర్షు లు కృష్ణుని సందేశం వినడానికి సభకు వస్తారు. ముందుగా వారికి ఆసనాలు ఏర్పాటు చేయండి, వారు కూర్చోకుండా మనం ఆసీనులం కారాదని కృష్ణుడు సూచిస్తాడని సామవేదం అన్నారు. -
కోడి కత్తుల తయారీదారు అరెస్టు
దేవరపల్లి: గోపాలపురం మండలం హుకుంపేటలో కోడి కత్తులు తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 40 కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ బీఎన్ నాయక్ బుధవారం తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోడి కత్తులను తయారు చేసి విక్రయిస్తున్నట్టు ఎస్సై మనోహార్, ట్రైనీ ఎస్సై శివగణేష్కు అందిన సమాచారం మేరకు హుకుంపేటలో కోడికత్తులు తయారు చేస్తున్న బొల్లం హరికృష్ణను అదుపలోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు. అతని నుంచి 40 కోడి కత్తులు, కత్తులను సానపట్టే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. సంక్రాంతి సందర్భంగా వీటిని తయారు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గతంలో కోడిపందేల్లో అరెస్టయిన వారిని, కోడిపందాలు, పేకాటలు నిర్వహించి కేసులు నమోదైన వారందని బైండోవర్ చేసినట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో 350 మంది, దేవరపల్లి పోలీస్ స్టేషన్లో 350 మంది పాత నేరస్తులు ఉన్నట్టు ఆయన చెప్పారు. మూడు రోజులుగా పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నట్టు ఆయన చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఇప్పటికి 70 మందిని బైండోవర్ చేసినట్టు ఆయన తెలిపారు. -
లారీ ఢీకొని బాలుడి మృతి
నిడదవోలు రూరల్: రెండు నెలలు క్రితం బిర్యానీ కోసం వెళ్లిన తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. బుధవారం రాత్రి ఆరేళ్ల కొడుకు బిర్యానీ కోసం వెళ్లి వస్తుండగా లారీ ఢీకొని మృతిచెందాడు. మునిపల్లికి చెందిన అత్తిలి నాగరాజు అక్టోబర్ 17న మరణించాడు. కుమారుడు భరత్ మునిపల్లికి చెందిన చోళ్ల పద్మాకర్ బైక్పై కానూరు వెళ్లి బిర్యానీ తీసుకొస్తుండగా మునిపల్లి రామాలయం వద్ద వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో పద్మాకర్కు స్వల్పగాయాలు కాగా.. రోడ్డు వైపు పడిన భరత్పై లారీ టైర్ ఎక్కడంతో తలభాగం నుజ్జనుజ్జై ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. దీంతో తల్లి దుర్గాభవానితో పాటు కుటుంబీకులు గుండెలువిసేలా రోదించారు. భరత్ కానూరులోని ప్రైవేటు పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. సమిశ్రగూడెం ఎస్సై బాలాజీ సుందరరావు ఘటనాస్థఽలాన్ని పరిశీలించి బాలుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడపాటికి ‘కామధేను’ పురస్కారం పెదపూడి: ఢిల్లీలోని విశ్వగురు వరల్డ్ రికార్డ్ సంస్థ వైద్య శాస్త్రంలో విశేష సేవలు చేసిన వారికి అందజేసే కామధేను ఇంటర్నేషనల్ అవార్డు 2025కు తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామానికి చెందిన రాజవైద్యుడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, సినీ నటుడు డాక్డర్ మేడపాటి భామిరెడ్డి ఎంపికై య్యారు. మేరకు సంస్థ చైర్మన్, ఎండీ సత్యవోలు రాంబాబు ఇటీవల హైదరాబాద్లో ప్రకటించారు. ఆయన బుధవారం విలేకరులకు తెలిపిన వివరాల మేరకు విశ్వగురు వరల్డ్ రికార్డు జాబితాలో తన పేరు నమోదు చేశారన్నారు. జనవరి 7న తిరుపతిలో ఈ అవార్డు ప్రదానం చేస్తారన్నారు. తాను 25 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యంలో విలువైన నవరత్నాల భస్మాల రాజవైద్యంతో దేశ విదేశాలల్లోని ఎందరికో దీర్ఘకాలిక రోగాలు నయం చేశానన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు ఆర్ఐవోగా శారద కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా ఇంటర్బోర్డు రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్గా (ఆర్ఐవో) ఐ.శారద నియమితులయ్యారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కమిషనరేట్ నుంచి ఆమెకు బుధవారం ఉత్తర్వులు అందాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఆమె గురువారం విధుల్లో చేరనున్నారు. ఆమె ఇప్పటి వరకు కాకినాడ జిల్లా డీవీఈవో గా పని చేశారు. గతంలో జోన్ 2 పరిధిలో ఇంటర్బోర్డు ఆర్జేడీగా విధులు నిర్వర్తించారు. శారద నియామకంపై జిల్లాలోని అధ్యాపకులు, కళాశాల యాజమాన్యాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. -
21 కిలోల గంజాయి స్వాధీనం
ధవళేశ్వరం: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10.80 లక్షల విలువైన 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధవళేశ్వరం టిడ్కో ఇళ్లలో నివసిస్తున్న విడదవోలు సూర్యగాంధీ, రాజమహేంద్రవరం జెఎన్ రోడ్డులో నివసిస్తున్న గొలగాని బంగారు తిమ్మరాజు విశాఖ ఏజెన్సీ నుంచి తీసుకువచ్చిన 21 కిలోల గంజాయిని బుధవారం ఉదయం ధవళేశ్వరం చెరుకూరి లే అవుట్ వద్ద విక్రయానికి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ టి.గణేష్ సిబ్బందితో వెళ్లగా వారిని చూసి పారిపోయేందుకు యత్నించారు. పోలీసుల వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విడదవోలు సూర్యగాంధీపై మండపేట పోలీస్స్టేషన్లో, గొలగాని బంగారు తిమ్మరాజుపై రాజమహేంద్రవరం త్రీటౌన్లో రౌడీ షీట్లు ఉన్నాయన్నారు. గంజాయి స్వాధీనం చేసుకున్న డిఎస్పీ భవ్య కిషోర్, సీఐ టి.గణేష్, ఎస్సై బి.హరిబాబు, హెడ్కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుళ్లు లక్ష్మణ్, ప్రసాద్లను ఎస్పీ డి.నరసింహ కిశోర్ అభినందించారు. -
మహిళపై కత్తితో దాడి
సామర్లకోట: కొంత కాలంగా తనతో సహజీవనం చేస్తున్న మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనపై కేసు నమోదైంది. స్థానికుల కథనం ప్రకారం స్థానిక రైల్వే స్టేషన్లో సమోసాలు విక్రయించే కాయ రాజుతో స్టేషన్లో పువ్వులు విక్రయించే లక్ష్మి ఏడాదిగా సహజీవనం చేస్తోంది. స్థానిక సత్యనారాయణపురంలో ఒక అద్దె ఇంటిలో రాజు నివసిస్తున్నాడు. నర్సీపట్నానికి చెందిన లక్ష్మి ప్రతి మూడు రోజులకు రాజు ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం హోటల్ నుంచి భోజనం తెచ్చుకుని ఇద్దరు ఇంటిలోకి వెళ్లిన తరువాత కేకలు వినిపించాయి. అంతలోనే రాజు రక్తం వస్తున్న కత్తితో రైలు పట్టాలపై నుంచి పరుగుతీసి పారిపోయాడని స్థానికులు తెలిపారు. రాజు ఉంటున్న ఇల్లు కౌన్సిలర్ సేసెని సురేష్కు చెందినది కావడంతో స్థానికులు ఆయనకు సమాచారం ఇచ్చారు. స్థానికులు, కౌన్సిలర్ ఇంటిలోకి వెళ్లి చూసే సరికి లక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. కౌన్సిలర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని లక్ష్మిని ఆటోలో సామర్లకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రెండు కాళ్లు నరికి వేయడంతో పాటు మెడపై కత్తి వేటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో ఆమెకు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లక్ష్మికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, భర్త వృద్ధుడు కావడంతో రాజుతో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు
● నిబంధనలు అతిక్రమిస్తే జైలుకే ● జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ సూచన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సర వేడుకల్లో పాటించాల్సిన నియమ నిబంధనలపై మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీటిని పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యహరించే వారికి జైలు తప్పదని హెచ్చరించారు. ● ప్రభుత్వం నిర్దేశించిన సమయం ముగిసిన వెంటనే మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు విధిగా మూసివేయాలి. ● మద్యం తాగి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు. అటువంటి వారికి చట్ట ప్రకారం భారీ జరిమానాలతో పాటు, వారం రోజుల వరకూ జైలు శిక్ష తప్పదు. ● మద్యం తాగిన వారు ఆల్కహాల్ స్థాయి 30 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఉన్నచోటు నుంచి వేరే ప్రాంతానికి వెళ్లాలి. దీనిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తాం. ● బైకులపై విన్యాసాలు, రేసింగ్ల వంటివి చేసిన వారిపై రౌడీ షీట్లు తెరుస్తాం. ● రోడ్లపై, ర్యాష్ డ్రైవింగ్, జిగ్జాగ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ● మైనర్ బాలబాలికలు తల్లిదండ్రులు లేకుండా రాత్రి వేళ తిరగరాదు. ● రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో అర్ధరాత్రి వేళ కేక్ కటింగ్లు, మందుగుండు సామగ్రి కాల్చడం, ఇతర వేడుకలు పూర్తిగా నిషేధం. ● అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత సరైన కారణం లేకుండా రోడ్లపై తిరగరాదు. ● న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్ల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ ఎటువంటి శాంతిభద్రతల సమస్యలూ తలెత్తకుండా బాధ్యత వహించాలి. ● బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్లు, లౌడ్ స్పీకర్ల వినియోగించరాదు. శబ్ద కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తాం. ● మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. పోలీసులు, శక్తి టీములు మఫ్టీలో రంగంలోకి దిగుతాయి. ● నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు అన్ని రకాలుగా బందోబస్తు, డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అన్ని ప్రధాన రోడ్లు, ముఖ్యమైన జంక్షన్ల వద్ద పికెట్లు, చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలతో ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేశారు. ● న్యూ ఇయర్ వేడుకల ముసుగులో పేకాటలు, కోడిపందేలు, జూదం వంటివి నిర్వహించినా, ఆడినా, అశ్లీల నృత్యాలు నిర్వహించినా ప్రత్యేక బృందాల ద్వారా రైడ్లు నిర్వహిస్తాం. ● పోలీస్ కంట్రోల్ రూము నుంచి సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తాం. -
చంద్రబాబుది స్కాముల ప్రభుత్వం
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబుది స్కాముల ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 2025 సంవత్సరం చంద్రబాబు స్కాముల మయంగా మారిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పథకాలతో పాటు.. సూపర్ 6, సూపర్ 7 పథకాలంటూ ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టారని చెప్పారు. నేడు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశంలోనూ ఒక్కో స్కామ్ వెలుగు చూస్తోందన్నారు. పేదలు కొత్తగా ఒక్క పెన్షన్ మంజూరుకు మాత్రం నోచుకోవడం లేదని, చంద్రబాబు తన వాళ్లకు ప్రభుత్వ ఆస్తులను పంచిపెట్టేసి, అందులో నుంచి కమీషన్లు రాబట్టుకుంటున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల భూములను లీజుల పేరిట చౌకగా కట్టబెట్టేస్తున్నారన్నారు. రాజధాని పనుల విలువలు పెంచేసి నిబంధనలకు విరుద్ధంగా తనవారికే కట్టబెట్టి దోచుకుంటున్నారన్నారు. ఆలయ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారన్నారు. బిల్లు కట్టలేదని సాక్షాత్తూ విజయవాడ దుర్గ గుడికే కరెంటు కట్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తోందని వేణు ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలం ఆలయాల్లో అమాయక భక్తులు చనిపోవడం పాలకుల అసమర్థతకు నిదర్శమని దుయ్యబట్టారు. మాట నిలబెట్టుకోలేని వ్యక్తి పాలన ఎలా ఉంటుందో చంద్రబాబును చూస్తే అర్థమవుతుందన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతు ప్రాణాలు కోల్పోవడం చంద్రబాబు వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ప్రతి పనిలోనూ చంద్రబాబు స్వార్థం తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం ఉండటం లేదని అన్నారు. ప్రజల్లో భయాన్ని సృష్టించి, వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకోవాలని మాత్రమే చూస్తున్నారన్నారు. ఉద్యోగులు ప్రజలకు మాత్రమే జవాబుదారీ, వారు పని చేయాల్సింది ప్రజలకోసమేనని వేణు స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే నిర్ణయాలకు అభ్యంతరం చెప్పాలని, కానీ, రాష్ట్రంలో వ్యవహారం అందుకు విరుద్ధంగా సాగుతోందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చారని చెబుతూ, ప్రత్యర్థి నోట ప్రశంస పొందిన వారే నిజమైన పాలన అందించినట్లని, పేరు మార్పు ద్వారా జగన్ పాలన బంగారమని చంద్రబాబే ఒప్పుకున్నట్లయ్యిందని విశ్లేషించారు. 2025 చేదు జ్ఞాపకాలకు వీడ్కోలు పలికి.. 2026వ సంవత్సరం జిల్లా ప్రజల జీవితాల్లో ఆనందాలు తీసుకు రావాలని వేణు ఆకాంక్షిస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
కట్టెదుట వైకుంఠం..
● రత్నగిరిపై ఘనంగా ‘ముక్కోటి’ వేడుకలు ● ఉత్తర ద్వారం నుంచి సత్యదేవుడు, అమ్మవారి దర్శనం ● వేకువజాము నుంచే వేచి ఉన్న భక్తులు ● సాయంత్రం వరకూ రద్దీ అన్నవరం: పాల కడలిలో శేషశయ్యపై ఉత్తరాభిముఖంగా తల పెట్టి పవళించిన శ్రీమహావిష్ణువులా సత్యదేవుడు.. ఆయన పాదాలు ఒత్తుతూ శ్రీమహాలక్ష్మిగా అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు.. సర్వాలంకార భూషితులై భక్తులకు దర్శనమిచ్చిన ముక్కోటి ఏకాదశి పర్వదినమైన మంగళవారం.. రత్నగిరి అపర వైకుంఠంలా శోభిల్లింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు వేకువజామున 3 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరారు. స్వామివారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం వద్ద సుగంధభరిత పుష్పాలంకరణతో శోభిల్లుతున్న మండపంలో స్వామి, అమ్మవార్లకు తెల్లవారుజామున 4 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గర్భాలయంలోని సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టుకు స్వర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించి, పంచహారతులు, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులను స్వామి, అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనానికి అనుమతించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు 2 గంటల సమయం పట్టింది. ఉత్తర ద్వార దర్శనానంతరం భక్తులు తూర్పు ద్వారం నుంచి ప్రధానాలయంలోకి ప్రవేశించి సత్యదేవుడు, అమ్మవార్లను, దక్షిణ ద్వారం నుంచి వెలుపలకు వచ్చి, దిగువన యంత్రాలయాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఉత్తర ద్వార దర్శనం కొనసాగింది. అనంతరం, భక్తులను యథావిధిగా గర్భాలయంలోకి దక్షిణ ద్వారం నుంచి సత్యదేవుని దర్శనానికి అనుమతించారు. కూరగాయలతో ప్రత్యేకంగా వండిన కదంబం ప్రసాదాన్ని స్వామి, అమ్మవార్లకు నివేదించిన అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. ఆకట్టుకున్న పుష్పాలంకరణ ముక్కోటి ఏకాదశి సందర్భంగా సత్యదేవుని ప్రధానాలయంలో చేసిన పుష్పాలంకరణ అందరినీ ఆకట్టుకుంది. స్వామివారి ఆలయానికి దారి తీసే ఉత్తరం వైపు మెట్లను రంగురంగుల విద్యుద్దీపాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చిన మండపాన్ని కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానాలయం, అనివేటి మండపం ముందు సత్యదేవుడు, అమ్మవారి నమూనా విగ్రహాల వద్ద పుష్పాలంకరణ పలువురిని ఆకర్షించింది. ఈ రెండుచోట్లా చాలా మంది భక్తులు ఫొటోలు దిగారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో వెండి రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం 11 గంటలకు పండితుల ప్రత్యేక పూజల అనంతరం, ఈఓ త్రినాథరావు దంపతులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. రథం లాగేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు.స్వామి, అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శనానికి వెల్లువెత్తిన భక్తులుఅనివేటి మండపం వద్ద ఆకట్టుకున్న పుష్పాలంకరణ -
జాతీయ స్థాయి హాకీకి ఎంపిక
చాగల్లు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జీఎఫ్ఐ) అండర్–19 జాతీయ స్థాయి హాకీ పోటీలకు చాగల్లు గ్రామానికి చెందిన ఉయ్యూరు శాంతి ఎంపికై ంది. స్థానిక వ్యాయామోపాధ్యాయిని జె.విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. గత నెల 19 నుంచి 22వ తేదీ వరకూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన ఎస్జీఎఫ్ఐ అండర్–19 రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో శాంతి అత్యద్భుత ప్రతిభ చూపింది. తద్వారా జనవరి 2 నుంచి 6వ తేదీ వరకూ గ్వాలియర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆమెను ప్రధానోపాధ్యాయులు వాసవి, ఇతర ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్పర్సన్ నందిని, గ్రామస్తులు అభినందించారు. ఏపీఎన్జీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మాధవరావు రాజమహేంద్రవరం సిటీ: ఏపీఎన్జీజీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా మీసాల మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు మంగళవారం రాజమహేంద్రవరంలో జరిగాయి. ప్రధాన కార్యదర్శిగా సీహెచ్ విజయకృష్ణ. కోశాధికారిగా ఎం.సత్యనారాయణరాజు, సహాధ్యక్షుడిగా త్రినాథ్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.ధర్మేంద్ర, ఎస్కే ఖాసిం సాహెబ్, కె.కేదారేశ్వరరావు, షేక్ సత్తార్, జి.ఆశవల్లి, మహిళా ఉపాధ్యక్షురాలిగా వి.కమల, కార్యనిర్వాహక కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా ఎన్వీఎస్ ప్రతాప్, పి.ఆనందరావు, కె.కృష్ణప్రియ, సీహెచ్ ఆంజనేయులు, షఫియా, మహిళా సంయుక్త కార్యదర్శిగా సూర్యకల్పన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ఎస్బీవీ రాంప్రసాద్ తెలిపారు, సహాయ ఎన్నికల అధికారిగా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, పరిశీలకుడిగా షేక్ నాగూర్ షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కార్యదర్శి మాధవరావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు రామ్మోహనరావు, కార్యదర్శి మూర్తిబాబు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలి రాజమహేంద్రవరం సిటీ: చిరకాల డిమాండ్ అయిన ఐదు రోజుల పనిదినాల సాధనకు నిరంతర పోరాటం సాగిస్తామని బ్యాంక్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు తెలిపారు. ఈమేరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యాన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంబాల చెరువు బ్రాంచి వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సంఘం నాయకుడు లక్ష్మీపతి మాట్లాడుతూ, పదేళ్లుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వాలు తమ ప్రథాన డిమాండ్ను పెడచెవిన పెడుతున్నాయని ధ్వజమెత్తారు. పాపారావు మాట్లాడుతూ, బ్యాంకుల్లో ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో మిగతా రంగాల మాదిరిగానే బ్యాంకు ఉద్యోగులకు కూడా ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని,, పెద్దాపురం మండలంలో తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి మంగళవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు జిల్లా నలుమూల నుంచీ ఆలయానికి చేరుకోవడం ప్రారంభమైంది. వేకువజామున 3.30 నుంచి 4 గంటల వరకూ స్వామి వారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ఆధ్వర్యాన సుప్రభాత సేవ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఉచిత, రూ.20, రూ.50 క్యూలలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులను అనుమతించారు. స్వామివారిని ఎమ్మె ల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ చైర్మ న్ తుమ్మల బాబు దర్శించుకుని, పూజలు చేశారు. సుమారు 18 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాలుగా అందజేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయాన్ని పూలతో అలంకరించారు. -
ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా ముఖచిత్రం
జిల్లా కేంద్రం : రాజమహేంద్రవరం విస్తీర్ణం : 2,560.7 చదరపు కిలోమీటర్లు అటవీ ప్రాంతం : 89.9 చదరపు కిలోమీటర్లు రెవెన్యూ డివిజన్లు : 2 మండలాలు : 19 (ఇకపై 22) మున్సిపల్ కార్పొరేషన్ : 1 మున్సిపాలిటీలు : 2 (మండపేటతో కలిపి ఇకపై 3) రెవెన్యూ గ్రామాలు : 272 గ్రామ పంచాయతీలు : 300 ఓటర్లు : 16 లక్షలకు పైగా.. -
హైదరాబాదులో హత్య.. కోనసీమలో మృతదేహం
● వీడిన మహిళ అదృశ్యం మిస్టరీ ● ముగ్గురు నిందితుల అరెస్టు మామిడికుదురు: హైదరాబాద్లో హత్యకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని జిల్లాలో పోలీసులు గుర్తించారు. నాచారం సీఐ కె.ధనుంజయ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మల్లాపూర్ బాబానగర్లో సూరెడ్డి సుజాత (65) నివాసం ఉంటోంది. డ్రైవర్గా పనిచేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపల్లికి చెందిన ఎం.అంజిబాబు ఆమె ఇంట్లో రెండు నెలల క్రితం అద్దెకు దిగాడు. సుజాత ఒంటరిగా ఉండడం, ఆమె ఒంటిపై బంగారాన్ని చూసిన అంజిబాబుకు దుర్బుద్ధి పుట్టింది. బంగారాన్ని కాజేయాలన్న ఉద్దేశంతో ఈ నెల 19న వంటగదిలో ఉన్న సుజాతపై వెనుక నుంచి దుప్పటి కప్పి, ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం పెరవలి మండలం ఖండవిల్లికి చెందిన స్నేహితుడు యువరాజు, అనకాపల్లికి చెందిన నూకల దుర్గారావు సహాయంతో ఈనెల 20వ తేదీన ఆ మృతదేహాన్ని అద్దె కారులో తీసుకువచ్చి గోదావరిలో పడేశాడు. కాగా.. సుజాత కనిపించడం లేదంటూ ఈ నెల 24న ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంతో అంజిబాబును అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతడి సమాచారం మేరకు పెదపట్నం గ్రామంలోని మధ్యలంకలో సుజాత మృతదేహాన్ని గుర్తించారు. బాగా పాడైపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
అమ్మవార్లను ఆకట్టుకునేలా..
రాయవరం: దేవుడిపై ఉన్న భక్తిని పలువురు వివిధ రకాలుగా ప్రదర్శిస్తుంటారు. దానిలో భాగంగా లొల్ల గ్రామానికి చెందిన సుతాపల్లి శిరీష వినూత్నంగా తన భక్తిని చాటుకున్నారు. చీరపై అష్టోత్తరం, గోవింద నామాలను రాసి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమర్పించారు. ఈ చీరను అమ్మవార్లకు అలంకరించేందుకు వినియోగించాలన్నారు. ఇప్పటి వరకు కాకినాడలోని కన్యకా పరమేశ్వరి, పిఠాపురంలోని పురూహుతికా అమ్మవారు, మండపేటలోని కన్యకా పరమేశ్వరి, లొల్లలోని శివాలయం, కాకినాడలో శ్రీపీఠం.. ఇలా తొమ్మిది ఆలయాల్లో అమ్మవార్లకు లలితా సహస్ర నామాలు రాసిన చీర్లను సమర్పించినట్లు తెలిపారు. రాయవరంలోని శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు రెండు చీరలు, శ్రీవారికి పంచెను బహూకరిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆమెను సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకట రమణ, స్థానిక నేతలు పీఎస్ఆర్, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట సుబ్బారెడ్డి, పులగం శ్రీనివాసరెడ్డి, మంతెన అచ్యుత రామరాజు తదితరులు అభినందించారు. -
రత్నగిరి.. వివాదాలే సరి..
● అన్నవరం దేవస్థానానికి చేదు జ్ఞాపకాలు ● కలిసిరాని 2025 ● పెరగని ఆదాయం, కానరాని అభివృద్ధి ● పాత ఈఓ వివాదాస్పద నిర్ణయాలుఅన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి 2025 పెద్దగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభం నుంచి చివరి వరకు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచింది. ఆదాయంలో కానీ, నిర్మాణాలలో కానీ పెద్దగా పురోగతి లేకుండానే ఏడాది జరిగిపోయింది. దీనికి తోడు రాజకీయ జోక్యం పెరిగిపోయింది. ముఖ్యంగా పాత ఈఓ సుబ్బారావు వైఖరిపై అనేక విమర్శలు వచ్చాయి. ఆయన 2024 డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం దేవస్థానంలో ఆయన కుటుంబ సభ్యుల జోక్యం పెరిగింది. ప్రొటోకాల్తో సంబంధం లేకుండా సినిమా, టీవీ, జబర్దస్ నటులతో పాటు, కూటమి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేల బంధువులకూ బ్రహ్మరథం పట్టడం, పాలనలో అనుభవ లేమి దేవస్థానాన్ని వివాదాల పాలు చేశాయి. భక్తులకు కొంచెం ఊరట 2025లో దేవస్థానంలో పూర్తి చేసిన ఏకై క నిర్మాణం రూ.కోటితో చేపట్టిన రెండో మెట్లదారి ఒకటే అని చెప్పవచ్చు. మిగిలిన పనులన్నీ భక్తుల రద్దీకి అనుగుణంగా చేసిన ఏర్పాట్లే. దాదాపు పదేళ్లుగా ఇదిగో.. అదిగో అంటూ సాగిన కేంద్ర ‘ప్రసాద్ ’ స్కీం నిర్మాణాలకు ఈ ఏడాది టెండర్లు ఖరారయ్యాయి. సుమారు రూ.20 కోట్ల కేంద్ర నిధులతో అన్నదాన భవనం, భక్తులు వేచి ఉండే భవనం, టాయిలెట్ల బ్లాకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారస్ కంపెనీ 2023లో వాగ్దానం చేసిన విశ్రాంతి షెడ్డును.. రెండేళ్ల తరువాత ఈ ఏడాది నిర్మించడం భక్తులకు ఊరట నిచ్చే విషయం. ఆదాయంలోనూ వెనుకంజ శిథిలావస్థకు చేరిన సీతారామ సత్రాన్ని 2024లోనే కూల్చివేసి నూతన సత్రం నిర్మించాల్సి ఉంది. కానీ దాన్ని కూల్చివేయాలా, వద్దా అనే మీమాంసలోనే 2025 ఏడాది గడిచిపోయింది. చివరకు గత నెలలోనే ఈ సత్రాన్ని కూల్చివేసి, దాని స్థానంలో కొత్త సత్రం నిర్మాణానికి అనుమతి రావడంతో ఆ పనులు మొదలయ్యాయి. ఆదాయ పరంగా దేవస్థానం పెద్డగా ముందడుగు వేయలేదు. గతేడాది రూ.135 కోట్ల ఆదాయం, రూ.134 కోట్ల వ్యయం ఉంటే, ఈసారి కూడా ఆదాయానికి సమానంగా వ్యయం పెరిగింది. సేవల్లో చివరి ర్యాంకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు విచ్చేసిన భక్తులకు ఆయా దేవస్థానాలు అందించిన సేవలపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. దానిలో అన్నవరం దేవస్థానానికి గత ఫిబ్రవరిలో చివరాఖరు ఏడో ర్యాంకు వచ్చింది. దీంతో జిల్లా కలెక్టర్.. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం కార్తిక మాసం ఏర్పాట్లను దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ స్వయంగా పర్యవేక్షించడంతో ఏ వివాదాలు లేకుండా జరిగాయి. ఆవు నెయ్యిపై.. స్వామి వారి ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని 2024 ఆగస్టు నుంచి సహకార డైయిరీ నుంచి కొటేషన్లపై కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ పిలవాలని కమిషనర్ ఆదేశాలివ్వగా ఈఓ అమలు చేయలేదు. దీంతో ఈఓపై దేవదాయశాఖ కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నెల ఒకటిన టెండర్ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రోక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. సంగం డైయిరీ కేజీ రూ.639.90కు ఆవు నెయ్యి సరఫరా చేయడానికి లోయెస్ట్ టెండర్ కోట్ చేసి దక్కించుకుంది. ప్రజాప్రతినిధుల జోక్యం అన్నవరం దేవస్థానాన్ని ఏడాది కాలంగా ప్రజాప్రతినిధుల చేతుల్లో పెట్టారన్న విమర్శలు బలంగా వినిపించాయి. దేవస్థానంలో ఉన్న చిన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను సైతం ప్రజాప్రతినిధులకు చెప్పడం, వారి సూచించిన వారినే నియమించడం జరిగింది. వివాదాస్పదం ఈఓ సుబ్బారావు ఇక్కడ నుంచి బదిలీ అయ్యాక కూడా ఆయన ఇచ్చిన ఉత్తర్వులు వివాదస్పదమయ్యాయి. గో ఆధారిత ఉత్పత్తులు, స్వామివారి పూజలు, వ్రతాలలో వాడిన పత్రి పూలతో చేసినవి అంటూ ఫినాయిల్, కాళ్ల పగుళ్ల నివారణ ఆయిల్ అమ్మకాలు చేస్తుండడం దుమారం రేపింది. దీనిపై ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడంతో వాటి విక్రయాలను దేవస్థానం నిలిపివేసింది. అలాగే పాలకొల్లులో నిర్వహించిన సత్యదేవుని వ్రతాలలో కానుకలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై ఆరుగురు పురోహితులను సస్పెండ్ చేయడం సంచలనం రేపింది. ఈఓగా త్రినాథరావు దేవస్థానం ఈఓ (ఫుల్ అడిషనల్ చార్జి)గా ఈ నెల పదో తేదీన రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయన దేవస్థానంలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు సీతారామసత్రం నిర్మాణం ప్రారంభించడం, మెట్లదారి పెండింగ్ పనులు పూర్తి చేసి దానిని భక్తులకు అందుబాటులోకి తేవడం, ఇంకా దాతల సహకారంతో సత్యగిరిపై భక్తులకు ఉచితంగా వసతి ఇచ్చేందుకు డార్మెట్రీ నిర్మించడం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. 2027 పుష్కరాల కోసం ఇప్పటి నుంచి ప్రణాళిక రూపొందించి ఆ మేరకు పనిచేయాలి.పాలనా వైఫల్యాలు గత ఈఓ పాలనా వైఫల్యాలపై ఈ ఏడాది ‘సాక్షి’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను వసతి సత్రాలలో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ మార్చిలో ఈఓ ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ఈఓ కుమారుడు దేవస్థానంలో షాడో ఈఓగా వ్యవహరించేవారు. దానిపై వార్త రావడంపై సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం సిబ్బందిని ఈఓ వేధిస్తున్నారన్న ఆరోపణలపై పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొందరు వలంటరీ రిటైర్మెంట్కు దరఖాస్తు చేసుకోవడం సంచలనం రేకెత్తించింది. దీనిపై కూడా ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. దీనిపై కూడా వార్త రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. -
సూర్యబలిజల ఐక్యత కోసం వెబ్సైట్
సామర్లకోట: రాష్ట్రంలో ఐదు సంఘాలుగా ఉన్న సూర్యబలిజలను ఒకే తాటిపైకి తీసుకు రావడానికి సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభిస్తున్నట్లు ఆ సామాజికవర్గ ఐక్య వేదిక నాయకులు అన్నారు. ఈ మేరకు స్థానిక గణపతినగరం వాటర్ ట్యాంకుల వద్ద మంగళవారం రాష్ట్ర సూర్యబలిజ సంఘ నాయకుడు జీవీకే మోహనరావు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్యబలిజ సంఘ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం.. సూర్యబలిజ వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం ఏలూరి సుబ్రహ్మణ్యం, జీవీకే మోహనరావు, వైబ్సైట్ రూపకర్త పైడిముక్కల ఆనంద్ మాట్లాడుతూ సూర్యబలిజ కులస్తులకు చంద్రబాబు ఇచ్చిన హామీ 18 నెలలు గడిచినా అమలు చేయలేదన్నారు. ఈ వెబ్సైట్లో సూర్యబలిజ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కులస్తుల పేర్ల నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రాష్ట్రాల కమిటీల ఎన్నికలను ముఖ్య నాయకులు సమక్షంలో నిర్వహిస్తామన్నారు. సామాజికవర్గీయులందరూ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రాష్ట్ర సూర్యబలిజ.కమ్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా సంఘ అధికార ప్రతినిధి కాలే వెంకటరత్నం, ప్రముఖులు యండమూరి ఈశ్వరరావు, అల్లు భాస్కరరావు, కాకరపల్లి శ్రీధర్, బి.కామేశ్వరరావు, కాలే సతీష్ ప్రసాద్, పెండ్యాల ధర్మ తదతరులు పాల్గొన్నారు -
నర్సరీ రైతుల సమస్యలు పరిష్కరించాలి
కడియం: నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కీర్తి చేకూరికి సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో ఆమెను అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, పాలకవర్గ సభ్యులు కలిశారు. మొక్కలను అంతర్జాతీయంగా ఎగుమతి చేసేటప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ప్రభుత్వం నుంచి మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తే అంతర్జాతీయ ఎగుమతులకు అవకాశాలు పెరుగుతాయన్నారు. సాయిల్ లెస్ మీడియాపై కోకోపిట్ స్టబిలైజేషన్, టిష్యూకల్చర్ ల్యాబ్ వంటి తదితర అంశాలపై చర్చించారు. కాగా.. తాము వివరించిన పలు అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అయ్యప్ప తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా ఉద్యానశాఖ అధికారి మల్లికార్జున, కడియం ఉద్యానశాఖ అధికారి లావణ్య, అసోసియేషన్ పాలకవర్గం బోడపాటి గోపి, కొండేపూడి నాగు, తాడాల నాగేశ్వరరావు, బాబ్జీ, పిల్లా శ్రీనివాస్, బోడపాటి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ నొడగల బుచ్చిరాజు పాల్గొన్నారు. రమ్యసుధకు జాతీయ ఉత్తమ పరిశోధన అవార్డురంగంపేట: అహ్మదాబాద్ సైన్స్ సిటీలో ఈ నెల 21న ఆల్ ఇండియా రామానుజన్ మ్యాథ్స్ క్లబ్, గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సదస్సులో రంగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయురాలు రమ్యసుధ జాతీయ ఉత్తమ పరిశోధన ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు అయిన ఆమె అనేక పరిశోధనా వ్యాసాలు రాసి, పలు శాసీ్త్రయ ప్రాజెక్టులు తయారు చేసి, పలు ప్రదర్శనలలో ఉత్తమ బహుమతులు పొందుతున్నారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో పదికి పైగా పరిశోధనా పత్రాలు ప్రచురితమయ్యాయి. రమ్యసుధ పరిశోధనలు మన దేశంతో పాటు జపాన్, మలేషియా, నేపాల్ వంటి దేశాల్లో ప్రదర్శింపబడి సందర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. కాగా.. రమ్యసుధను రంగంపేట హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి.పార్థసారథి, ఉపాధ్యాయులు వీసీ జాకబ్, వరలక్ష్మి అభినందించారు. -
‘యుద్ధం.. కుక్కల కొట్లాట వంటిది’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూర ల్): యుద్ధం అంటే మాంసం కోసం కుక్క ల కొట్లాట వంటిదంటూ కృష్ణుడికి ధర్మ రాజు విన్నవించుకుంటాడని సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఆయన మంగళవారం ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను వివరించా రు. ‘‘తమ తరఫున ద్యూత కార్యం నిర్వహించాల్సింది గా సోదరులు, భార్యతో కలసి కృష్ణ పరమాత్మకు ధర్మ రాజు విన్నవించుకుంటాడు. అయితే, రాజ్యం కోల్పో యి సంపాదించుకునే శాంతి మరణంతో సమానమని అంటాడు. కనీసం ఐదు ఊళ్లు ఇవ్వాలని అడిగాం. కానీ, మేం యుద్ధానికి భయపడ్డామని దుర్యోధనుడు భావించి, దానికి కూడా సిద్ధపడటం లేదు. క్షత్రియ వంశం నాశనం కాకూడదని భావించి, మేము ఐదు ఊళ్లు ఇవ్వాలని అడుగుతున్నాం. కృష్ణా, మమ్మల్ని ఆపదల నుంచి గట్టెక్కించడానికి నీవు తప్ప మరొకరు లేరు’’ అని ధర్మరాజు అంటాడని చెప్పారు. ఈ మాట ల్లో శరణాగతి కనపడుతోందని, ఇలా ప్రతివారూ భగవంతుడిని ప్రార్థించాలని అన్నారు. కర్ణ దుర్యోధనుల ది ఆదర్శ మైత్రి కాదని, అవసరార్థం మైత్రి అని చెప్పారు. ‘‘అర్జునుడిని ఎదు ర్కొంటాడని భావించే కర్ణుడిని దుర్యోధనుడు చేరదీశాడు. అర్జునుడిని నిగ్రహించడానికి రాజాశ్రయం కావాలనే త లంపుతో దుర్యోధనుడి అండ చేరాడు క ర్ణుడు. సినిమాలో చూపినట్లు వీరు ఆద ర్శ స్నేహితులు కారు’’ అని సామవేదం వివరించారు. కులవివక్ష లేని నాటి కాలాన్ని కుల విద్వేషంతో నేడు కొందరు విమర్శిస్తున్నారని, సంజయుడు, విదురుడు ఏ కులానికి చెందిన వారైనా, వారిని ‘రాజర్షి’ అని, మహాప్రాజ్ఞ అని ధృతరాష్ట్రుడు సంబోధించడాన్ని గమనించాలని చెప్పారు. కృష్ణుడు ద్యూత కార్యానికి వస్తున్నాడన్న వార్త సంజయుని ద్వా రా విన్న ధృతరాష్ట్రుడు ‘కళ్లున్న వారు ఎంత అదష్టవంతులు’ అని ఆవేదన చెందుతాడని, పరమాత్మ మీద దృష్టి లేని వారందరూ అంధులేనని సామవేదం అన్నా రు. ‘ధృతరాష్ట్రునిలో రెండు ప్రవృత్తులున్నాయి. అంతఃకరణంలోని జీవుడొకరు, ఇంద్రియాలను అంటిపెట్టుకున్నది మరొకరు. ఇటువంటి స్వభావం అనేక మందిలో ఉంటుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. -
క్యాన్సర్ రోగులకు అత్యాధునిక టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నంవిశ): క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారిగా అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. ఆ హాస్పటల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆ యూనిట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏపీలోనే తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు క్యాన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పటల్ ఎండీ మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్ల విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్ 3 కేటగిరి హాస్పటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జనసేన నాయకుడి దాడి కేసుపై విచారణ
రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడి, కుల దూషణకు పాల్పడిన జనసేన నాయకుడిపై కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ మంగళవారం విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 25న జరిగిన శివకోటి ముసలమ్మ తల్లి ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన పాలపర్తి భవ్యశ్రీ ఇక్కడ మెట్లపై నుంచి పడి మృతి చెందింది. మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో భవ్యశ్రీ కుటుంబానికి మద్దతుగా రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజోలు నియోజకవర్గ బహుజన సమాజ్వాది పార్టీ ఇన్చార్జి ఆకుమర్తి భూషణం వచ్చారు. అక్కడ వారిపై జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణాధికారి అయిన కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్ద నేరస్థలాన్ని, ఫిర్యాదు దారుడు, కేసులో కొందరు సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. -
● ఇక దగ్గర పంటుగే
● యమడేంజరే మరి● పూత వేసి.. కనువిందు చేసిహెల్మెట్ ధరిస్తారా.. నా దగ్గరకు వస్తావా అంటూ వాహనదారులను యమ ధర్మరాజు వేషధారణలో ఓ కళాకారుడు హెచ్చరిస్తూ, రోడ్డు ప్రమాదాల నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లా ఎస్పీ బింధుమాధవ్ ఆదేశాలతో స్థానిక సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కళాకారులు యమ ధర్మరాజు, చిత్రగుప్తుడు వేషధారణతో జగ్గంపేట ప్రధాన రోడ్డుపై ప్రజలల్లో ఇలా అవగాహన నింపారు. – జగ్గంపేట మామిడికి పూత వచ్చేసింది.. ఆ చెట్లకు కళ తెచ్చింది.. పాశర్లపూడిబాడవలోని 216 జాతీయ రహదారి పక్కన ఉన్న నిమ్మల అప్పారావు ఇంటి ప్రాంగణంలో మామిడిచెట్టు ఇలా పూత పూసింది. చెట్టుకు ఉన్న ఆకుల కన్నా పూతతో నిండుగా కనిపిస్తోంది. ఆ మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరికీ కనువిందు చేస్తోంది. దేశవాళీ రకానికి చెందిన ఈ మామిడి చెట్టు ప్రతి ఏడాది ఇదే విధంగా పూత పూసి కాయలు కాస్తోందని అప్పారావు తెలిపారు. – మామిడికుదురు కోటిపల్లి – ముక్తేశ్వరం మధ్య పంటు ప్రయాణం సోమవారం నుంచి పునః ప్రారంభించారు. ఈ ఏడాది జూలైలో గోదావరికి వరదల కారణంగా మూతపడింది. అప్పటి నుంచి అమలాపురం వెళ్లాల్సిన ప్రయాణికులు సుమారు 54 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో వెళ్లేవారు. పంటు ప్రయాణం ప్రారంభించడంలో కేవలం 15 కిలోమీటర్లు వెళ్తే సరిపోతుందని ఆనందిస్తున్నారు. – కె.గంగవరం -
సామర్లకోటకు ‘ఎర్నాకుళం రైలు’ ప్రమాద బాధితులు
సామర్లకోట: టాటానగర్ – ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు అగ్ని ప్రమాద బాధితులను అనకాపల్లి జిల్లా యలమంచిలి నుంచి సోమవారం ఉదయం కాకినాడ జిల్లా సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కు తీసుకువచ్చారు. ఈ రైలులోని రెండు బోగీల్లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగి విజయవాడకు చెందిన ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. ఆ రెండు బోగీల్లో మిగిలిన సుమారు 125 మంది ప్రయాణికులను మూడు బస్సుల్లో సామర్లకోట తీసుకు వచ్చారు. వారిని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ), సీఐ ఎ.కృష్ణభగవాన్ ఆధ్వర్యాన పోలీసులు, రైల్వే అధికారులు, సిబ్బంది విశ్రాంతి గదులకు తరలించారు. అనంతరం, సోమవారం ఉదయం 10.25 గంటలకు ఆ రైలు సామర్లకోట చేరుకుంది. కాకినాడ నుంచి 2, విశాఖపట్నం నుంచి ఒకటి చొప్పున ఏసీ బోగీలు తీసుకువచ్చి ఆ రైలుకు తగిలించి, బస్సుల్లో తీసుకు వచ్చిన ప్రయాణికులను ఎక్కించామని సామర్లకోట స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ తెలిపారు. ఆ ప్రయాణికులకు స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అమలకంటి శ్రీనివాసరావు, కార్యదర్శి బడుగు బాబీ, కోశాధికారి యేలేటి రమేష్లు అల్పాహారం, వాటర్ బాటిల్స్ అందించారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకూ ఆయా శాఖల అధికారులు ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. యలమంచిలిలో ప్రమాదం జరిగిన సమయంలో రైలులోని తన బ్యాగ్ చోరీ అయ్యిందని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ప్రతీష్ కుమార్ స్థానిక ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫ యలమంచిలి నుంచి ప్రత్యేక బస్సుల్లో రాక ఫ బోగీలుఏర్పాటు చేసి రైలులో తరలింపు -
అంతర్వేది ఉత్సవాలకు సమన్వయంతో ఏర్పాట్లు
అమలాపురం రూరల్: అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవాలకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి, దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులతో మూడో విడత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దివ్య కల్యాణోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా చర్యలు చేపట్టాలన్నారు. భక్తుల తాకిడి రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్, పార్కింగ్, శానిటేషన్, తాగునీరు, విద్యుత్, వైద్య సేవలు తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. జనవరి 28న కల్యాణోత్సవం, 29న రథోత్సవం, ఫిబ్రవరి 1న చక్రస్నానం, ఫిబ్రవరి 2న తెప్పోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలన్నారు. పంచాయతీరాజ్ విభాగం లైటింగ్, బారికేడ్ల ఏర్పాట్లు చేయాలని, ఆర్డబ్ల్యూఎస్ శాఖ తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఆర్అండ్బీ శాఖ బస్సులు అంతర్వేది వరకూ చేరుకునేలా రహదారిని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రత కోసం బీచ్, దేవాలయం వద్ద రాష్ట్ర విపత్తుల స్పందన దళాలను నియమించాలన్నారు. మూడు క్యూలు ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా, స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలన్నారు. జనవరి 26 నుంచి ఐదు రోజుల పాటు ఆలయానికి సమీప ప్రాంతాల్లో మద్యం షాపులకు సెలవు ప్రకటించాలన్నారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ ఉత్సవాలకు 1,500 మంది పోలీస్ సిబ్బందిని నియమించి శాంతి భద్రతలకు ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. ఆర్డీఓ కె.మాధవి మాట్లాడుతూ అంతర్వేది ఆలయానికి ఉన్న ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అన్ని శాఖలు సమన్వయంతో సాగాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి, ఆర్డీఓలు పి.శ్రీకర్ డి.అఖిల, డీఎస్పీ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటా..
● అధికారుల వద్ద ఓ వ్యక్తి నిరసన ● అడ్డుకున్న కలెక్టరేట్ సిబ్బంది బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తన సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని సోమవారం కాకినాడ కలెక్టరేట్లో ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్య పరిష్కరించకుంటే పురుగు మందు తాగుతానని జేబులో నుంచి తీయడంతో అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. కాకినాడ పెద్ద మార్కెట్కు చెందిన తాళ్లూరి కృష్ణమోహన్ తన స్థలం కబ్జాకు గురైందని కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో పలుమార్లు ఫిర్యాదు చేశారు. రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కృష్ణమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టరేట్కు వచ్చి తన సమస్య పరిష్కరించకుంటే ఇక్కడే చనిపోతానని జేబులో నుంచి పురుగు మందు డబ్బా బయటకు తీయబోగా, అక్కడే ఉన్న సిబ్బంది అతన్ని వారించి జేసీ అపూర్వ భరత్ వద్దకు తీసుకు వెళ్లారు. బాధితుడితో జేసీ మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాకినాడ త్రీ టౌన్ ఎస్ఐ భీష్మ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ విలేకర్లతో మాట్లాడుతూ కాకినాడ టౌన్ ప్లానింగ్ అధికారులు డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
సంగతాలెన్నో..
రాయవరం: అనుభవాలను అక్షరాల్లోకి మార్చి, పుటలుగా పేర్చితే.. డైరీ అవుతుంది. మనసు స్పందించే ప్రతి భావాన్ని, సంఘటనను, ప్రతి ఆలోచనను తనలో నిక్షిప్తం చేసుకునే అపురూప పుస్తకం ఈ డైరీ. గుండె పొరల్లో ఒదిగి ఉన్న జ్ఞాపకాలు, కంటి వెనుక కలలను అందంగా తనలో అమర్చుకుంటుందీ హస్త భూషణం. అందుకే ఎన్ని మారినా డైరీ మారలేదు. దాని ప్రాధాన్యం తగ్గలేదు. మరో రెండు రోజుల తర్వాత ‘2025’ గతంలోకి వెళ్లి 2026 సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ గత కాలపు జ్ఞాపకాన్ని దాచి పెట్టడానికి డైరీలు ఉంది. కొత్త ఏడాదికి సరికొత్త రూపంలో డైరీలు స్వాగతం పలుకుతున్నాయి. పాత డైరీలు గత జ్ఞాపకాలను మూటకట్టుకున్నాయి. కొత్త డైరీల్లో రేపటి కోసం కొత్త పేజీలు ఎదురు చూస్తున్నాయి. డిసెంబర్ నెలాఖరు నుంచే వీటి కొనుగోలు ఆరంభమవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నగరాలు, పట్టణాల్లోని పుస్తక విక్రయ శాలలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని షాపుల్లో డైరీలు విరివిగా లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ.30 నుంచి రూ.వెయ్యి విలువ చేసేవి విక్రయిస్తున్నారు. వీటిని హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రధాన పట్టణాల్లో ఒక్కో షాపు యజమాని రూ.30 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే డైరీలను ఇప్పటికే విక్రయాలకు సిద్ధంగా ఉంచారు. వీటిని తమ స్నేహితులు, బంధువులకు బహుమతులుగా ఇచ్చేందుకు చాలామంది ఉత్సుకత చూపుతున్నారు. వ్యక్తిగతం.. నిక్షిప్తం పర్సనల్ డైరీ అంటే.. ఓ వ్యక్తికి సంబంధించి వ్యక్తిగత అంశాలను అందుకే నిక్షిప్తం చేస్తారు. ప్రతి రోజు తన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ రాత్రి వేళ నిద్ర పోయే ముందు ఆ రోజున రాసుకుంటారు. తమ జీవితంలో ఎన్నో ముఖ్య విషయాలు, తీపి జ్ఞాపకాలను అందులో పొందుపర్చుకుంటారు. వాటిని కొంతకాలం తర్వాత తెరిచి చదివి పాత జ్ఞాపకాలను నెమరవేసుకోవచ్చు. ప్రొఫెషనల్ డైరీలు వృత్తిపరంగా బాధ్యతలు అధికంగా ఉండేవారు, క్రమం తప్పకుండా ఉపయోగించేవి ప్రొఫెషనల్ డైరీలు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ డైరీ ఓ పర్సనల్ ఆసిస్టెంట్గా సహకరిస్తుందంటే అందులో అతిశయోక్తి లేదు. దైనందిన వ్యవహారాలను మర్చిపోకుండా సమయానుకూలంగా చేయాల్సిన పనిని చెబుతుంది. ఈ డైరీ రోజువారీ షెడ్యూల్ మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల వివాహాలు, పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, ఊరు ప్రయాణాలతో పాటు సమావేశాల తేదీలను, సమాచారాన్ని అందులో రాసుకోవచ్చు. ప్రణాళికతో కూడిన పనులను చేసేందుకు డైరీ సగటు మానవునికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఫ జ్ఞాపకాలను పేర్చిన పుస్తకం డైరీ ఫ గతాన్ని నిక్షిప్తం చేసే సాధనం ఫ వీటికి తగ్గని ప్రాధాన్యం -
ఒకే వేదికపైకి వక్క రైతులు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని వక్క రైతులు, వ్యాపారులు ఒకే వేదికపైకి వస్తున్నారు. ఇందులో భాగంగా జనవరి 5న మండపేట రూరల్ మండలం ద్వారపూడి సమీపంలో వేములపల్లిలోని భవాని గార్డెన్స్లో సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వక్క ఆదర్శ రైతులు దొరయ్యచౌదరి, ఉప్పలపాటి చక్రపాణిలు సదస్సు వివరాలను వెల్లడించారు. ఈ సదస్సులో తెలుగు రాష్ట్రాల్లోని వక్క సాగు, విలువ జోడింపు, మార్కెటింగ్పై రైతులు – వ్యాపారుల సమ్మేళనం, ఎఫ్పీవో ఏర్పాటుపై చర్చించడంతో పాటు పుస్తకావిష్కరణ ఉంటుందన్నారు. కర్ణాటక రాష్ట్రం వక్క సాగుకు పెట్టింది పేరన్నారు. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో కూడా వక్క సాగు బాగానే ఉందని, అక్కడ ప్రోత్సాహం కూడా అందుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా, విశాఖ, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం తదితర జిల్లాల్లో వక్క సాగు అవుతోందన్నారు. కొబ్బరి, పామాయిల్ తోటల్లో అంతర్ పంటగా సాగు చేస్తున్నామని దొరయ్య చౌదరి, చక్రపాణి చెప్పారు. ఎకరానికి మూడు, నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, ఇందులో రూ.లక్ష వరకూ మిగిలే అవకాశం ఉందని చెప్పారు. విత్తనం వేసిన ఐదారేళ్ల తర్వాత పంట చేతికి వస్తుందని, దాదాపు 30 ఏళ్లకు పైగా పంట ప్రతి ఏటా చేతికి వస్తుందని తెలిపారు. ఒక రకం విత్తనం అయితే ఆగస్టు నుంచి జనవరి వరకూ, మరో విత్తనం జనవరి నుంచి ఏప్రిల్ వరకు దిగుబడి వస్తుందని అన్నారు. అయితే మన రాష్ట్రంలో వక్క సాగుకు ప్రోత్సాహం, రాయితీలు వంటివి లేవని దొరయ్య చౌదరి, చక్రపాణి అన్నారు. మార్కెటింగ్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నామన్నారు. అందుకే ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు, అందరినీ సంఘటితం చేస్తున్నామన్నారు. కాసర్ గడ్ సీపీసీ ఆర్ఐ పూర్వ డైరెక్టర్ పి.చౌడప్ప, ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్ అండ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి చిరంజీవ్ చౌదరి దీనికి హాజరై సూచనలు చేస్తారని వారు చెప్పారు. ఈ అవకాశాన్ని వక్క సాగు, ఔత్సాహిక రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో టి.బాలాజీకుమార్, సీహెచ్ కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు.ఫ వచ్చే నెల 5న వేములపల్లిలో సదస్సు ఫ ఆదర్శ రైతులు దొరయ్యచౌదరి, చక్రపాణి వెల్లడి -
యువకుడి దుర్మరణం
కడియం: స్థానిక కెనాల్ రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. జేగురుపాడు పరిధి పాములమెట్ట కాలనీకి చెందిన జగతా వీరవెంకట సత్యశివశంకర్ (19) మోటారు సైకిల్పై వెళుతూ కారును తప్పించబోయి ఎదురుగా వస్తున్న గ్రావెల్ లోడు లారీని ఢీకొని రోడ్డుపై పడిపోయాడని పోలీసులు తెలిపారు. దీంతో అతని తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కడియం ఎస్ఐ ప్రసన్న ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మొబైల్ షాపులో చోరీ శంఖవరం: కత్తిపూడిలోని ఓ మొబైల్ షాపులో చోరీ జరిగినట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆ గ్రామంలోని తవ్వల రాజేష్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో చొరబడి 13 శ్యామ్సంగ్ ఫోన్లు దొంగిలించారు. వీటి విలువ రూ.2 లక్షలు ఉంటుందని బాధితుడు వివరించారు. క్లూస్ టీమ్తో వేలు ముద్రలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కరపలో భారీ చోరీ ఫ 31 కాసుల బంగారం అపహరణ కరప: వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి.. ఇంట్లోకెళ్లి బీరువా తెరచి చూస్తే బంగారు ఆభరణాలు, నగదు దోచుకుపోయిన ఘటన కరపలో చోటుచేసుకుంది. ఆ గ్రామంలో సోమవారం ఈ భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువా బద్దలు కొట్టి 31 కాసుల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు అపహరించుకుపోయారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక నీలయ్యతోట వీధిలోని ఒక డాబాలో సలాది వీరవెంకట సత్యనారాయణ (వీరబాబు), అతని భార్య రాణి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరబాబు సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. అతని భార్య రాణి ఒక ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున వీరబాబు బయటకు వెళ్లారు. రాణి తన ఇద్దరు పిల్లలను తీసుకుని స్కూల్కు వెళ్లారు. ప్రతి రోజూ ఆమె స్కూలుకెళ్లేటప్పుడు తలుపులకు తాళం వేసి, తన భర్తకు తెలిసేలా మేడ మెట్ల కింద ఒక డబ్బాలో తాళం పెడుతుండడం జరుగుతుంది. వీరబాబు పని నుంచి మధ్యాహ్నం సమయంలో వచ్చాక డబ్బాలోని ఆ తాళం తీసుకోవడం రోజూ జరుగుతూ వస్తోంది. వీరబాబు సోమవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి, డబ్బు అవసరమై బీరువా లాకర్ తెరచి చూసేసరికి అందులోని బంగారు నగలు, రూ.లక్ష నగదు కనిపించలేదు. దీంతో కంగారుపడిన వీరబాబు కుటుంబ సభ్యులతో కలసి కరప పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరప ఎస్ఐ టి.సునీత సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను, పరిసర ప్రాంతాల వారిని పిలిచి వివరాలు అడిగారు. కాకినాడ నుంచి క్లూస్ టీమ్ వచ్చి ఆ ప్రాంతాల్లో వేలుముద్రలు, ఆధారాలను సేకరించారు. దొంగలు మేడ మెట్ల కింద ఉంచే తాళం తీసుకుని ఇంట్లోకి ప్రవేశించి, బీరువా తెరచి బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అంతా తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కరప పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇదో మంచి అలవాటు
చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు ఉంది. ఉద్యోగం వచ్చే వరకూ పర్సనల్ డైరీ రాసేవాడిని. ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించిన డైరీ రాస్తున్నాను. ఇలా రాయడం వల్ల మనం చేసే పనులను సమీక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరీ రాయడం మంచి అలవాటు. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం గతం నెమరు వేసుకునేలా.. చిన్నతనం నుంచి విద్యార్థులకు డైరీ రాయడం అలవాటు చేయాలి. గత అనుభవాలు నెమరువేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. మర్చిపోయిన విషయాలను డైరీ చూసి తెలుసుకోవచ్చు. ఇది అందరికీ ఉపయుక్తం. నేనూ డైరీ రాస్తుంటాను. – పి.నాగేశ్వరరావు, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ -
ముక్కోటికి ముస్తాబైన ‘వాడపల్లి’
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ముక్కోటి ఏకాదశికి సిద్ధమైంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయాన్ని రంగు రంగుల వుష్పాలు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. దీనితో క్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందుతుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు, వేద పండితులు ఆలయాన్ని తెరిచి ఏకాంతంగా స్వామివారి పూజాది కై ంకర్యాలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించనున్నారు. ఆలయ సంప్రదాయం అనుసరించి తొలుత ప్రముఖులకు స్వామి దర్శనం అనంతరం భక్తులకు కల్పించనున్నారు. రాత్రి 7 గంటల వరకూ వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం అదనపు ఏర్పాట్లు చేసినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. సాధారణ రోజుల్లో కంటే మించి భక్తులు తరలి వస్తారనే అంచనాతో అదనపు క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా భద్రతా పరమైన చర్యలు చేపట్టామన్నారు. 400 మంది సేవకులను నియమించామన్నారు. స్వామివారిని దర్శించుకునే భక్తులందరికీ తీర్థ, ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం నిరంతరాయంగా అందిస్తామన్నామన్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు -
రెవెన్యూ క్లినిక్తో అర్జీలకు రియల్ టైమ్ పరిష్కారం
పీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)తో పాటు రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల రెవెన్యూ సమస్యలను రియల్ టైమ్లో పరిష్కరించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రెవెన్యూ క్లినిక్లో సంబంధిత అధికారులందరూ ఉండి సమస్యలు పరిష్కరించేలా ఆమె పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక తొలిసారి నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా స్వీకరించిన అర్జీల్లో మూడు రెవెన్యూ ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించామని తెలిపారు. మిగిలిన వాటికి సంబంధించి సమస్య ఏ స్థాయిలో ఉందో గుర్తించి, తగిన ఎండార్స్మెంట్ జారీ చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై రెవెన్యూ సమస్యలు పరిష్కరించడమే ఈ క్లినిక్ ప్రధాన ఉద్దేశమన్నారు. దేవదాయ భూములకు ప్రాపర్టీ రిజిస్టర్లో తప్పనిసరిగా 1బీ రికార్డులు వచ్చేలా తహసీల్దార్లు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి కేసును సమగ్రంగా పరిశీలించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రికార్డుల సవరణలను సకాలంలో పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకూ గ్రామసభలు నిర్వహించి, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లూ లేకుండా ఆర్డీఓలు, తహసీల్దార్లు పాసు పుస్తకాల పంపిణీ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో 214, రెవెన్యూ క్లినిక్లో 103 చొప్పున అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, డీఆర్ఓ టి.సీతారామ్మూర్తి, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సర్వే అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, 19 మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్
నల్లజర్ల: వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని, దెబ్బకు దెబ్బ తీసే సమయం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని వైఎస్సార్ సీపీ నాయకులు హెచ్చరించారు. నల్లజర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ హోం మంత్రి తానేటి వనిత, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్లు సోమవారం సాయంత్రం విలేకర్లతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో ఫ్లెక్సీ వద్ద పొట్టేలు బలిచ్చారని, రప్పారప్పా అన్నారని ఆరోపిస్తూ స్థానిక కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించడమే కాకుండా.. వారిని పోలీసులు అరెస్టు చేసి, నడిరోడ్డుపై నడిపించిన తీరుపై మండిపడ్డారు. చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ దన్నుతో పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని, వ్యవస్ధలు దిగజారుతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. ఇటువంటి చర్యలతో న్యాయ వ్యవస్థ బతుకుతుందా అని ప్రశ్నించారు. జంతుబలిని సాకుగా చూపుతున్నారని, నిజానికి ఫ్లెక్సీల ముందు జంతుబలులు, రక్తతర్పణాల సంసృతికి తెర లేపిందే టీడీపీ అని చెప్పారు. గతంలో టీడీపీ కార్యకర్తలు ఇటువంటి పని చేసినప్పుడు ఏ చర్యలూ తీసుకోని ప్రభుత్వం.. ఇప్పుడే కొత్తగా చట్టం తెచ్చినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు, బాలకృష్ణ ఫ్లెక్సీల వద్ద పదుల సంఖ్యలో పొట్టేళ్ల తలలు నరికి, రక్తతర్పణం చేశారని గుర్తు చేశారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు గుండాగిరి చేస్తే సహించేది లేదన్నారు. తూర్పు చోడవరంలో కార్యకర్తలు చేసిన తప్పేమిటని ప్రశ్నించారు. తప్పు చేస్తే చట్ట పరిధిలో కేసులు పెట్టి, అరెస్టు చేసి, కోర్టుకు పంపాలని, అంతే కానీ వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి దేశ ద్రోహులన్నట్టుగా నడిబజార్లో నడిపించి తీసుకువెళ్తారా అని ప్రశ్నించారు. అలా తీసుకెళ్లాలని ఎక్కడ రాసి ఉందో చెప్పాలన్నారు. హోం మంత్రి అనిత వ్యాఖ్యలతో పోలీసులు మరింత అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్ డిగ్రీకి పాల్పడిన పోలీసు అధికారులకు రాబోయే రోజులలో ఫోర్త్ డిగ్రీ తప్పదని హెచ్చరించారు. మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత మాట్లాడుతూ, జగన్ జన్మదిన వేడుకలు, కోటి సంతకాల కార్యక్రమం విజయవంతం కావడాన్ని అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, జగన్ కటౌట్ చూస్తేనే ఆ పార్టీ శ్రేణులకు వణుకు పుడుతోందని అన్నారు. ఒక సినీ డైలాగ్ను చిన్న పిల్లలు ఫ్లెక్సీపై రాయడాన్ని సాకుగా చూపి, మూడు గ్రామాల్లోని కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా.. వారిని అక్రమంగా నిర్బంధించి, కొట్టి హింసించారని అన్నారు. తద్వారా స్థానిక ఎమ్మెల్యే పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలు తట్టుకుని నిలబడుతున్నారని, ఎంత ప్రయత్నించినా తమకు లొంగని వారందరిపై ఏదో ఒక విధంగా తప్పుడు కేసులు పెట్టి, తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, నాయకులను బలి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంత్రిభద్రతలున్నాయా అని ఆమె ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టిన వారు ఎదురు ప్రశ్నిస్తే గంజాయి కేసులు పెడతామంటూ హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలీసులు నడుస్తున్నారని, వారు ప్రజల పక్షాన స్వేచ్ఛగా విధులు నిర్వహించాలని, ఎవరికో బానిసలుగా, తొత్తులుగా పని చేయడం సరి కాదని హితవు పలికారు. అన్యాయానికి గురైన కార్యకర్తలందరికీ అండగా ఉంటామని, వారి తరఫున న్యాయపోరాటం చేస్తామని, మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ మూడు మండలాల అధ్యక్షులు వెలగా శ్రీరామ్మూర్తి, కూచిపూడి సతీష్, ప్రతాపనేని వాసుబాబు, నాయకులు బంక అప్పారావు, సాలి వేణు, ముప్పిడి వెంకటరత్నం, తాడిగడప శ్రీనివాసరావు, సయ్యద్ మునాఫ్, యువరాజు, చిన్నీ నాగూ యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జనార్దనరావు పాల్గొన్నారు. ‘జై జగన్’ అన్నా వేధిస్తారా? అక్రమ అరెస్టులే కాకుండా నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్తారా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మూల్యం తప్పదు వైఎస్సార్ సీపీ నేతల హెచ్చరిక -
పోలీసు పీజీఆర్ఎస్కు 30 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 30 ఫిర్యాదులు చేశారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోనులో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. జాతీయ త్రోబాల్ పోటీకి ఎంపిక తాళ్లపూడి: మండలంలోని ప్రక్కిలంక గ్రామానికి చెందిన యువకుడు ప్రేముల ఫణిభూషణ్ 47వ జాతీయ త్రోబాల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. సామాన్య దళిత కుటుంబానికి చెందిన రమేష్ అబీదా దంపతుల కుమారుడైన ఫణిభూషణ్ తాళ్లపూడి పరసా పద్మ రాజారావు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివాడు. ప్రస్తుతం గుంటూరు ఏపీఆర్డీసీ కాలేజీలో బీఎస్సీ చదువుతున్నాడు. క్రీడలపై ఆసక్తితో త్రోబాల్లో నైపుణ్యం సాధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అదృష్టం దక్కించుకున్నాడు. కోచ్ టీఎస్ఎన్ కుమార్ తనకు మంచి శిక్షణ ఇస్తున్నారని ఫణిభూషణ్ చెప్పాడు. బుధవారం జరిగే తుది పోటీల్లో అర్హత పొందడానికి జరిగే లీగ్ మ్యాచుల్లో ప్రస్తుతం ఆడుతున్న అతడు విజయం సాధించాలని మండలంలోని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. యాగశాల పక్కన మెట్లదారి విస్తరణ అన్నవరం దేవస్థానం చైర్మన్ ఆదేశం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని యాగశాల పక్క నుంచి దిగువకు వెళ్లేందుకు ఉన్న మెట్లను మరింత వెడల్పుగా విస్తరించాలని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ మెట్ల దారిని సోమవారం ఆయన పరిశీలించారు. కార్తిక మాసంలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, సత్యదేవుని దర్శనానంతరం వారు దిగేందుకు తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న మెట్లు మాత్రమే సరిపోవని 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ భావించారు. ఈ మేరకు రావిచెట్టు పక్క నుంచి యాగశాల వద్దకు చేరుకునేలా అదనంగా మెట్లు నిర్మించారు. అక్కడి నుంచి రామాలయ ప్రాంగణంలోకి వెళ్లడం సులువవుతుందని ఆయన భావించారు. అయితే ఈ మెట్లు 10 అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో సరిపోవడం లేదు. గత కార్తిక మాసంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు భక్తుల తోపులాట జరిగింది. దీంతో ఈ మెట్లను మరో 10 అడుగుల వెడల్పున విస్తరించాలని చైర్మన్ ఆదేశించారు. అయితే, దీనివలన యాగశాల దక్షిణం వైపు మెట్లు సగం వరకూ పోయే అవకాశముంది. ఈ విషయమై సిద్ధాంతితో మాట్లాడగా.. దక్షిణం వైపు మెట్లు సగం తొలగించి, వాటికి బదులు ఎల్ ఆకారంలో తూర్పునకు మెట్లు నిర్మించి, వాటిని మిగిలిన వాటికి అనుసంధానం చేయాల్సిందిగా సూచించారని ఈఈ రామకృష్ణ తెలిపారు. త్వరలోనే ఈ మెట్ల వెడల్పునకు అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవనున్నారు. రాష్ట్ర స్థాయి కబడ్డీలో జిల్లా జయకేతనం సామర్లకోట: కర్నూలులో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకూ జరిగిన రారష్ట్ర స్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు జయకేతనం ఎగురవేసి, ప్రథమ బహుమతి సాధించింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. పశ్చిమ గోదావరితో జరిగిన తుది పోటీలో జిల్లా జట్టు అత్యంత ఉత్తమ ప్రదర్శన చేయడం ద్వారా చాంపింయన్షిఫ సాధించిందన్నారు. జట్టు సభ్యులను అంతర్జాతీయ కోచ్ పోతుల సాయి, ప్రో కబడ్డీ రిఫరీ బోగిళ్ల మురళీ కుమార్, ఉపాధ్యక్షుడు నిమ్మకాయల కిరణ్, అంతర్జాతీయ క్రీడాకారిణి శ్వేత, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాస్, కోశాధికారి తాళ్లూరి వైకుంఠం అభినందించారు. -
ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణం
● భారతంలో విదుర నీతి, సనత్సుజాతీయం అత్యంత ముఖ్యమైనవి ● మోసంతో విద్య నేర్చుకోవడమే కర్ణుడి శాపానికి కారణం ● సామవేదం షణ్ముఖ శర్మ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ధర్మాధర్మాల విషయంలో ధర్మరాజే ప్రమాణమంటూ ధృతరాష్ట్రునితో సంజయుడు చెబుతాడని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవచనాన్ని సోమవారం ఆయన కొనసాగించారు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కురుపాండవుల మధ్య జరిగిన అనేక చర్చోపచర్చలను ఆయన వివరించారు. ‘‘పాండవుల వద్దకు ధృతరాష్ట్రుని తరఫున సందేశాన్ని తీసుకువెళ్లిన సంజయుడు.. తిరిగి వచ్చి, ధర్మరాజు సహనానికి, సమరానికి కూడా సిద్ధంగా ఉన్నాడని చెబుతాడు. ధర్మరాజు మెత్తటి వాడే కానీ, చేతకాని వాడు కాడు. మనశ్శాంతి కోసం విదురుడిని ఆహ్వానించిన ధృతరాష్ట్రుడు.. జరుగుతున్న పరిణామాల వలన తాను నిద్రకు దూరమయ్యానని అంటాడు. ‘బలవంతుడు దండెత్తి వస్తే తగిన సాధనాలు లేని దుర్బలుడు, సంపద కోల్పోయిన వాడు, కాముకుడు, దొంగ– ఈ నలుగురికీ నిద్ర పట్టదు. నీలో ఈ దోషాలు లేవు కదా?’ అని విదురుడు అడుగుతాడు’’ అని వివరించారు. విదురనీతి, సనత్సుజాతీయం భారతంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నవని, విదురనీతిని విద్యార్థి దశ నుంచే బోధించాలని సామవేదం అన్నారు. సామాన్య ప్రజలు, సీ్త్రలు సైతం ధర్మరాజు విజయాన్ని కాంక్షిస్తున్నారని ధృతరాష్ట్రునితో సంజయుడు అంటాడని చెప్పారు. కర్ణుడికి బ్రహ్మాస్త్రం పని చేయదని పరశురాముడు శపించడంలో కుల ప్రస్తావన లేదని, మోసంతో విద్యను నేర్చుకోవాలని కర్ణుడు భావించడమే ఆ శాపానికి కారణమని వివరించారు. ‘‘ఇటు ద్రోణ, కర్ణులు, అటు అర్జునుడనే ముగ్గురిలో ఏ ఒక్కరు మరణించినా శాంతి ఉంటుంది. అర్జునుడు, గాండీవం, కృష్ణుడు అనే మూడు శక్తులున్న చోటే జయం ఉంటుంది. నా కొడుకు నా మాట వినడు. నేనేం చేయాలి’’ అంటూ ధృతరాష్ట్రుడు విలపిస్తాడు. స్మరించగానే ధృతరాష్ట్రుని వద్దకు వ్యాసుడు వచ్చి, కృష్ణ మహిమను వివరిస్తాడు. కృష్ణుడు సర్వవ్యాపకుడు, సర్వలోకేశ్వరుడని నీకు తెలిసినట్టు నాకెందుకు తెలియదని వ్యాసుడిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. నీవు అవిద్యలో ఉన్నవాడివి కనుక తెలుసుకోలేకపోతున్నావని వ్యాసుడు చెబుతాడు’’ అని చెప్పారు. ధృతరాష్ట్రుని మించిన శ్రోత లేడని, ఆసక్తికరంగా వింటాడని, లోపలకు ఎన్ని విషయాలు వెళ్తున్నాయో మనకు తెలీదని సామవేదం అన్నారు. పరమాత్మను తెలుసుకోలేకపోవడానికి అవిద్యయే కారణమని చెప్పారు. -
భవితకు భద్రత బీమా..
● ఆరు పథకాలతో ఎన్నో ప్రయోజనాలు ● విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న వైనం ● ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న తపాలా శాఖ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమానిస్తున్నాయి. పీఎస్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతోమంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా ఈ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో నమోదు చేసుకున్న కంపెనీల ఉద్యోగులకూ వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్ఎస్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్ దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 ఏళ్ల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 ఏళ్లుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 ఏళ్లు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ పథకంలో ఉన్న లబ్ధిదారులకు ఏడాదికి ఒకసారి రూ.వెయ్యికి రూ.48 చొప్పున బోనస్ లభిస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 55 ఏళ్ల మధ్య గలవారు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 ఏళ్లుగా ఎంచుకునే అవకాశం కల్పించారు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకోవచ్చు. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే ఎలాంటి బోనస్లు వర్తించవు. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారునికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్ ప్రయోజనాలను చెల్లిస్తారు. కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 19 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ఏటా రూ.వెయ్యికి రూ.76 చొప్పున బోనస్ లభిస్తుంది.. ఎండోమెంట్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 18 నుంచి 50 ఏళ్ల వారు అర్హులు. కనీస బీమా రూ.20 వేలు కాగా గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్కు అవకాశం ఉం టుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనస్లలో కోతలు తప్పవు. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. జాయింట్ లైఫ్ అస్యూరెన్స్ ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్పై బోనస్లలో కోత ఉంటుంది. పాలసీ దారుడి మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు లభిస్తాయి. ఏటా రూ.వెయ్యికి రూ.52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు. చిల్డ్రన్ పాలసీ.. పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయసు ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు వయసు ప్రకారం బీమా తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాల పరిమితి తీరాక బీమా సొమ్ము బోనస్లు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనస్లు వర్తిస్తాయి. దరఖాస్తు ఇలా పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి పథకంలో భాగస్వాములు కావచ్చు. -
అటు రంకెలేస్తూ.. ఇటు దౌడు తీస్తూ..
● రసవత్తరంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బళ్లు, గుర్రపు స్వారీ పోటీలు ● వివిధ జిల్లాల నుంచి వచ్చిన 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు ● సందడిగా మారిన ఏడీబీ రోడ్డు రంగంపేట: మండలం వడిశలేరు సమీపంలో గన్ని వ్యవసాయ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి ఎడ్లబళ్లు, గుర్రాల పోటీలు రసవత్తంరంగా సాగాయి. దివంగత ఆదర్శరైతు గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం ఆయన కుమారుడు, రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సహకారంతో కూటి కోటేశ్వరరావు, బొప్పన బ్రహ్మాజీరావుల నిర్వహణలో ఈ పోటీలు జరిగాయి. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు సాగిన ఈ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు చూడడానికి వచ్చారు. రాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు పోటీలకు హాజరు కాగా, సీనియర్స్ 1600 మీటర్ల విభాగంలో 11 జతలు, జూనియర్స్ విభాగం వెయ్యి మీటర్లలో 56 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీల వల్ల వడిశలేరు నుంచి రంగంపేట వరకు గల ఏడీబీ రోడ్డు కోలాహలంగా మారింది. పోలీసు బందోబస్తు నడుమ పోటీలు ప్రశాంతంగా ముగిసాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోటీలు తిలకించారు. విజేతలు వీరే... సీనియర్స్ విభాగంలో 11 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ను జి.మేడపాడుకి చెందిన మలిరెడ్డి అన్నపూర్ణ, గుమ్మిలేరుకు చెందిన కోరా శృతి చౌదరి ద్వితీయ, తృతీయ బహుమతులుగా బైక్లను గెలుచుకున్నారు. మరికొందరు కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. జూనియర్స్ విభాగంలో 56 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ను చౌడవాడకు చెందిన గెడ్డం అప్పారావు, ద్వితీయ బహుమతిని కంకటపాలేనికి చెందిన కొండేటి పద్మ, తృతీయ బహుమతిని బి.కొత్తూరుకు చెందిన మురుకుర్తి శంకరరావు గెలుచుకున్నారు. గుర్రాల పందెం విజేతలు వీరే.. మొదటి బహుమతి రూ.40 వేలను అగ్రహారానికి చెందిన చేమల మణికంఠ, ద్వితీయ బహుమతి రూ.30 వేలను యలమంచిలికి చెందిన ఎల్లపు జగదీష్, తృతీయ బహుమతి రూ.25 వేలను రామన్నపాలేనికి చెందిన చోడమాంచిక విక్రమ్ సాధించారు. నాల్గవ బహుమతి సాధించిన సింగపూర్ సత్యనారాయణకు రూ.20 వేలు, ఐదో బహుమతిని అరకుపాలేనికి చెందిన మోదమాంబ మురుగన్కు రూ.15 వేలు, ఆరో బహుమతి సాధించిన సోమలింగంపాలేనికి చెందిన యల్లపు జగదీష్కు రూ.10 వేలు, ఏడో బహుమతి సాధించిన కోటనందూరుకు చెందిన శివరాజుకు రూ.10 వేల చొప్పున నగదు అందించారు. విజేతలకు గన్ని కృష్ణ నగదు బహుమతులు అందజేశారు. -
గోదావరిలో పడి వృద్ధుడి మృతి
మామిడికుదురు: పెదపట్నంలంక గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక గెడ్డంవారి పేటకు చెందిన గెడ్డం సంజీవరావు (65) స్థానిక గోదావరి వద్దకు బహిర్భూమికి వెళ్లి మృతి చెందాడు. సంజీవరావు కుమారుడు రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన సంజీవరావు కనిపించక పోవడంతో అతని కోసం గాలించగా గోదావరిలో మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడు సంజీవరావుకు భార్య గవరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంజీవరావు మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. -
మున్సిపల్ డీఈ రీకాల్
● రామచంద్రపురం మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం ● 17 మంది ఏకగ్రీవ ఆమోదం ● డీసెంట్ తెలిపిన ఏడుగురు కౌన్సిలర్లు రామచంద్రపురం: మున్సిపాలిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మున్సిపల్ డీఈనీ రీకాల్ చేస్తూ ఆదివారం కౌన్సిలర్లు తీర్మానం చేశారు. కొంతకాలంగా కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ డీఈ శ్రీకాంత్ను రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత నెలలో జరిగిన సమావేశంలో కూడా సభ్యులు ఆయనను రీకాల్ చేయాలని కోరారు. ఈ మేరకు స్థానిక మంత్రి సుభాష్కు, మున్సిపల్ ఆర్డీ, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. తాజాగా శనివారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో టేబుల్ అజెండాగా డీఈ శ్రీకాంత్ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కౌన్సిల్ తీర్మానించింది. మున్సిపల్ చైర్పర్సన్తో సహా 17 మంది కౌన్సిలర్లు దీనికి మద్దతు తెలపగా ఏడుగురు మాత్రం డీసెంట్ తెలిపారు. సమావేశంలో అజెండాలోని తొమ్మిది అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం కౌన్సిలర్లు మాట్లాడుతూ డీఈ శ్రీకాంత్ పట్టణాభివృద్ధికి ఆటంకంగా మారారని, కౌన్సిల్ సభ్యులను అవమానపర్చడం, పనులు పూర్తి చేసినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం, నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనికి నలుగురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవితో సహా 17 మంది సభ్యులు డీఈని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఒక కౌన్సిలర్ వాడిన పదజాలాన్ని తప్పుపడుతూ పలువురు కౌన్సిలర్లు బైఠాయించారు. దీంతో చైర్పర్సన్ వారికి నచ్చచెప్పి అతి కష్టం మీద సమావేశాన్ని అదుపులోకి తీసుకొచ్చి డీఈని సరెండర్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అదే సమయంలో ఏడుగురు కౌన్సిలర్లు డీసెంట్ తెలుపుతూ రాసిన పత్రాన్ని కమిషనర్ రాజుకు అందజేశారు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ వాడ్రేవు సాయి ప్రసాద్ విప్ జారీ చేసినప్పటికీ, ఆ పార్టీ నలుగురు కౌన్సిలర్లు విప్ను ధిక్కరించి డీసెంట్పై సంతకాలు చేయడం గమనార్హం. -
నకిలీ వే బిల్లులతో ఇసుక తరలింపు
● రెండు లారీల సీజ్ తాళ్లపూడి: మండలం ప్రక్కిలంకలో ఆదివారం తెల్లవారుజామున జిల్లా గనులు, భూగర్భశాఖ, టాస్క్ఫోర్స్ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను సీజ్ చేశాయి. ఇసుక రీచ్ ఏజెన్సీలు నకిలీ వే బిల్లులతో ఇసుక తరలిస్తున్నట్టు తేలితే ఆ ఏజెన్సీని రద్దు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్రెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఇసుకను తరలిస్తున్న ఏపీ 39 టీక్యూ 0007, ఏపీ 37 టీఈ 6979 నంబర్లు ఉన్న రెండు వాహనాలను తనిఖీ చేసి వే బిల్లులను స్కాన్ చేశారు. ఏపీఎస్ఎంఎస్ పోర్టల్లో ఎటువంటి డిస్పాచ్ వివరాలు లేవని గుర్తించి బిల్లులు నకిలీవని గుర్తించి రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అలాగే ప్రక్కిలంక–1 డీసిల్టేషన్ రీచ్లో ఇసుక రవాణాకు ఏజెన్సీగా ఎంపికై న ‘ది గణేష్ బోట్స్మెన్ – శాండ్ వర్కర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్’ సంస్థ నకిలీ ఇసుక వే బిల్లులు జారీ చేసినట్లు గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఎస్సై రామకృష్ణకు సూచించారు. అనంతరం సొసైటీకి కేటాయించిన శాండ్ సప్లై పాయింట్ లాగిన్ ఐడీని ఏపీఎస్ఎంఎస్ పోర్టల్లో బ్లాక్ చేశారు. ఈ దాడుల్లో జిల్లా మైనింగ్ సర్వేయర్ పట్నాల శ్రీనివాస్, జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్సై కె.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వబ్రాహ్మణులను చట్ట సభలకు పంపాలి
● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు అమలాపురం టౌన్: విశ్వ బ్రాహ్మణులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి ఇచ్చి చట్ట సభలకు పంపించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక దుడ్డివాని అగ్రహారంలోని విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హనుమంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ తమ వర్గానికి రాజకీయ పదవులు వచ్చినపుడే మనకు గుర్తింపు, హోదా వస్తాయని పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక సామాజిక, రాజకీయ రంగాల్లో తమ వర్గం అభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆ దిశగానే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. యువజన నాయకుడు ఆవుపాటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆ సామాజిక వర్గ పెద్దలు, అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్ కట్టోజు సన్నయ్యదాసు, వరద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతరావు, ఆ వర్గం పెద్దలను సంఘీయులు గజమాలతో సత్కరించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే ఆనందరావు వద్దకు వెళ్లి తమ వర్గీయులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని వినతి ప్రతాన్ని అందించారు. -
అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం
● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం కడియం: మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధిలోని దోసాలమ్మకాలనీలో తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఎల్లంశెట్టి సముద్రుడుకు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి, ఇంటిని చుట్టుముట్టడంతో ఇల్లు, అందులోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.4.5 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని వారు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక శకటం అక్కడికి చేరుకుని మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా సిబ్బంది ఆర్పారు. బాధితులను ఆదివారం పలువురు పరామర్శించి సాయం అందజేశారు. కడియపులంక ఉప సర్పంచ్ పాటంశెట్టి రాంజీ రూ.10వేలు, ఏపీఐఐసీ సభ్యుడు మార్గాని సత్యనారాయణ నగదు సాయం అందజేశారు. అలాగే తహసీల్దార్ ఆదేశాల మేరకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను వీఆర్వో జ్యోతి బాధితులకు ఇచ్చారు. ఘనంగా శశి రీ యూనియన్నిడదవోలు: ఉండ్రాజవరం మండలం వేలువెన్ను శశి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం శశి రీ యూనియన్–2025ను ఘనంగా నిర్వహించారు. సుమారు 1200 మంది తల్లిదండ్రులు, 2025 టాపర్స్, ర్యాంక్ హోల్డర్లు, అలుమ్నిలు పాల్గొన్నారు. శశి విద్యార్థుల నృత్యాలు, సంగీతం వంటి సాంస్తృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథి రాజమహేంద్రవరంలోని శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని, బోధన–వైద్య వృత్తులు పవిత్రమైనవన్నారు. గౌరవ అతిధి వరంగల్ ఎమిరిటస్ ప్రొఫెసర్ డి.దినాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, స్కిల్ డెవలప్మెంట్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2025లో వివిధ విభాగాల్లో టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శశి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బూరుగుపల్లి రవి కుమార్, వైస్ చైర్మన్ లక్ష్మీ సుప్రియ సత్కరించారు. ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల డైరెక్టర్ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సీనియర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు. కోడి పందేలు ఆడుతున్న ముగ్గురి అరెస్టు జగ్గంపేట: మండలంలోని గొల్లలగుంట గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై ఎస్సై రఘునాథరావు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందేలు ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5.6 వేలు, వీటితో పాటు 2 పందెం కోళ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. మండలంలో జూద క్రీడలు ఎక్కడ నిర్వహించినట్టు కనిపించినా, తెలిసినా 94949 33233కి నంబర్కు కానీ, 100కు కానీ, 112 నంబర్కు కాల్ చేసి కానీ ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజల సహకారంతోనే జూదాలు నిరోధించగలమని తెలిపారు. -
ఇదేం శిక్షణ బాబూ!
● మెషీన్ల పంపిణీ ఏదీ? ● 8 నెలలుగా ఎదురుచూపులు ● ఉమ్మడి జిల్లాలో 11,014 మందికి మొండిచేయి కొత్తపేట: మహిళల స్వయం ఉపాధి కల్పనలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చింది. శిక్షణ అనంతరం ఇవ్వాల్సిన ఉచిత కుట్టు మెషీన్లను మాత్రం ఇవ్వలేదు. అసలు ఇస్తారా? ఇవ్వరా? అంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి నుంచి ఉచిత కుట్టు శిక్షణ ప్రారంభించారు. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన కులాల వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖల ద్వారా మండల కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. ఎంపీడీవోలు ఈ కేంద్రాల్లో వసతులను పర్యవేక్షించారు. మూడు నెలల చొప్పున దశల వారీగా అన్ని మండలాల్లో శిక్షణ పూర్తి చేశారు కానీ. శిక్షణ పొందిన మహిళలకు ఇవ్వాల్సిన కుట్టు మెషీన్లను ఆరేడు నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఇవ్వలేదు. హాజరు బాగుంటేనే మెషీన్ మహిళలకు ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీ పథకానికి ఆయా గ్రామ సచివాలయాల ద్వారా మూడు వేలకుపైగా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుదారులు 3 నెలల పాటు కుట్టు శిక్షణ పొందితేనే ధ్రువీకరణ పత్రంతో పాటు, ఉచిత కుట్టు మెషీన్ అందిస్తామని చంద్రబాబు ప్రభుత్వం మెలిక పెట్టింది. ప్రజా ప్రతినిధుల సిఫారసుల నేపథ్యంలో మహిళలకు ఈ శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎంపికై న వారి హాజరు 75 శాతం కచ్చితంగా ఉండాలనడంతో 445 మంది మాత్రమే ఉచిత కుట్టు మెషీన్ పొందేందుకు అర్హత సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంతవరకు ఏమీ లేదు ఉచిత కుట్టు శిక్షణకు మూడు నెలల పాటు హాజరై, 75 శాతం హాజరు పొంది అర్హత సాధించి 6, 7 నెలలు గడుస్తున్నా ధ్రువీకరణ పత్రాలు, ఉచిత కుట్టు మెషీన్ల పంపిణీపై ప్రభుత్వం నేటి వరకూ ఎటువంటి స్పందనా లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. శిక్షణ పూర్తయి నెలలు గడుస్తున్నా కుట్టు యంత్రాలు ఆందకపోవడంతో రోజూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. ఉచిత కుట్టు మెషీన్లతో పాటు నేరుగా దర్జీ దుకాణాల ఏర్పాటుకు అవసరమైన బ్యాంక్ రుణాలు ఇస్తామని శిక్షణ సమయంలో అధికారులు భరోసా ఇచ్చారు. ఈ ఏడాది మార్చిలో బీసీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న స్వయం ఊపాధి సోపానం రుణాల పైనా చంద్రబాబు సర్కారు నేటీకీ ఏ విధమైన ప్రకటన చేయడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి పాలకులు నాడు ఎన్నికల్లో అన్ని వర్గాలను ముఖ్యంగా మహిళాలోకాన్ని ఉద్దరిస్తామని హామీ ఇచ్చినా ఇంతవరకు చేసిందేమీ లేదని మహిళలు పెదవి విరుస్తున్నారు. కుట్టు మెషీన్లకు అర్హత పొందిన లబ్ధిదారుల వివరాలు ఇలా.. జిల్లా శిక్షణకు వచ్చిన శిక్షణ దరఖాస్తులు పొందినవారు కోనసీమ 21,908 3,190 తూర్పు గోదావరి 12,118 2,904 కాకినాడ 27,722 4,920 మొత్తం 61,718 11,014 -
‘కోట’ నృత్య కళాకారులకు గిన్నిస్లో చోటు
సామర్లకోట: స్థానిక చిన్నారి నృత్య కళాకారులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. హైదరాబాద్కు చెందిన భారత్ ఆర్ట్ ఆకాడమీ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో ఏడు వేల నృత్య కళాకారులతో కూచిపూడి కళా వైభవాన్ని నిర్వహించి ఈ రికార్డు సాధించారు. ఆ బృందంలో సామర్లకోటకు చెందిన 30 మంది చిన్నారులు పాల్గొన్నారు. నాట్యాచార్యుడు బేత సత్యనారాయణ వద్ద వారు నృత్యాన్ని అభ్యసించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ మంత్రి, ప్రముఖుల సమక్షంలో వారికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ుడ్స ప్రతినిధులు సర్టిఫికెట్లు అందుకున్నారు. ఆదివారం పట్టణ ప్రముఖులు ఆ చిన్నారులను అభినందించారు. -
మహిళల ఆశలు నీరుగార్చారు
చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సంక్షేమ పట్ల ముఖ్యంగా మహిళా పథకాలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1,500 ఇస్తామన్న హామీ ఏడాదిన్నర అవుతున్నా అమలు కాలేదు. అనేక కొర్రీలతో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు నేటికీ మెషీన్లు ఇవ్వకపోడం దారుణం. వారు ఈ శిక్షణ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోగలం అని ఆశించారు. ఆలస్యం కావడంతో వారు వేరే ఉపాధి మార్గాలను వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. మహిళల ఆశలను ప్రభుత్వం నీరుగార్చింది. – గూడపాటి రమాదేవి, జెడ్పీటీసీ సభ్యురాలు, కొత్తపేట మహిళల స్వయం ఉపాధిలో భాగంగా కుట్టు మెషీన్ల ద్వారా జీవనోపాధి పొందుతూ, కుటుంబ ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు సంక్షేమ పథకాల అమలులో భాగంగా ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చాం. అయితే ప్రభుత్వంలో కొన్ని బిల్లులు పండింగ్ ఉన్నాయి. అవి క్లియర్ అయ్యాక మెషీన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్హులైన అందరికీ మెషీన్లు ఇస్తాం. – ఎ.శ్రీనివాసరావు, ఈడీ, బీసీ కార్పొరేషన్, కాకినాడ -
అలా ఆటాడుకుంటున్నారు
● జీఎంసీలో వివాదాస్పదంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ● మొత్తం ఖాళీలు 162 ● గత ఏడాది మొదటి నోటిఫికేషన్లో చూపినవి 77 ● రెండో విడతలో 79కి పెంపు ● వేర్వేరు కారణాలతో మొదటి రెండు నోటిఫికేషన్లూ రద్దు ● మూడోసారి పోస్టులు 60కి కుదింపు ● అధికారులు తమతో ఆటలాడుకుంటున్నారని అర్హుల ఆగ్రహంకాకినాడ క్రైం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ) ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల(జీజీహెచ్)లో వివిధ కేడర్లలో పారామెడికల్ సిబ్బంది నియామకానికి చేపట్టిన ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కు సంబంధించి 350కి పైగా పారామెడికల్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం జీఎంసీ, కాకినాడ జీజీహెచ్, రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)తో పాటు వివిధ పీహెచ్సీలు, యూహెచ్సీలు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో వివిధ పారామెడికల్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించారు. కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయం ద్వారానే ఉమ్మడి జిల్లా పోస్టుల భర్తీ చేపట్టారు. అన్నిచోట్లా నియామకాలూ పూర్తయ్యాయి. అయితే, రాజమహేంద్రవరం జీఎంసీ, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల (జీజీహెచ్) పరిధిలోని 79 పోస్టులను తామే భర్తీ చేసుకుంటామని అధికారులు దాదాపు ఏడాదిన్నర కిందట చెప్పారు. కానీ, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను సంబంధిత అధికారులు ఇప్పటి వరకూ పూర్తి చేయలేదు. ఈ పోస్టులకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అర్హులెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కలెక్టర్నే తప్పుదోవ పట్టించారా.. ఉమ్మడి జిల్లా ఉద్యోగాల నోటిఫికేషన్ కావడం వల్ల నియామక ప్రక్రియ ఆసాంతం కాకినాడ జిల్లా కలెక్టర్ పరిధిలోకే వస్తుంది. జీఎంసీలో పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకూ మూడుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కొద్ది కాలం ముందు మొదటిసారి ఇచ్చిన నోటిఫికేషన్లో 77 ఖాళీలు చూపించారు. అభ్యర్థుల అభ్యంతరాల పేరుతో దానిని రద్దు చేసి, గత ఏడాది డిసెంబర్లో రెండోసారి నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం 79 పోస్టులు చూపారు. అనివార్య కారణాలంటూ దీనినీ రద్దు చేసినట్లు ప్రకటించారు. అయితే, రోస్టర్ నిర్వహణలో లోపం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం వంటి కారణాలతోనే రెండో నోటిఫికేషన్ రద్దు చేశారన్నది అభ్యర్థుల వాదన. తాజాగా ఈ నెలలో మూడోసారి ఇచ్చిన నోటిఫికేషన్లో 60 మాత్రమే ఖాళీలున్నాయని తెలిపారు. కొన్ని ఉద్యోగాలకు విద్యార్హతలు నిర్ణయించలేదని, అందువలన మూడో నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య కుదించామని చెబుతున్నారు. అదే నిజమైతే అంతకు ముందు రెండుసార్లు అవే పోస్టులకు నోటిఫికేషన్లు ఎలా ఇచ్చారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మూడుసార్లు వేర్వేరుగా ఖాళీలు చూపుతూ, కలెక్టర్నే తప్పుదోవ పట్టించి మరీ ఆయా నోటిఫికేషన్లపై సంతకాలు చేయించారని ఆరోపిస్తున్నారు. మొత్తం 162 ఖాళీలు రాజమహేంద్రవరం జీజీహెచ్, జీఎంసీలలో మొత్తం 162 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతానివే 79 కాగా, తాజాగా జీజీహెచ్లో మరో 83 ఖాళీలు ఏర్పడ్డాయి. రోగులకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆస్పత్రి అధికారులు కోరినా జీఎంసీ అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ 162 పోస్టులను గత నెల నాటికే భర్తీ చేయాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించినా ఫలితం లేకపోయింది. కేవలం 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చారు. పాతవి 19, కొత్తవి 83 కలిపి మిగిలిన 102 పోస్టులు ఎందుకు భర్తీ చేయకుండా నిలిపివేశారనేది జవాబు లేని ప్రశ్నగానే ఉంది. 11 కేడర్లకు ఎగనామం మొత్తం 21 కేడర్లలో సిబ్బందిని నియమించాల్సి ఉండగా.. 10 కేడర్ల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన 11 కేడర్లలోని కంప్యూటర్ ప్రోగ్రామర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్, ఎలక్ట్రికల్ హెల్పర్, మార్చురీ అటెండెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైకియాట్రీ సోషల్ వర్కర్, స్పీచ్ థెరపిస్ట్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, చైల్డ్ సైకాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు పోస్టులను పక్కన పెట్టేశారు. విద్యార్హతలు నిర్ణయించలేదు ఖాళీలు ఎక్కువగా ఉన్న మాట నిజమే. అన్ని పోస్టుల భర్తీకీ బదులు 60 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చాం. కొన్ని పోస్టులకు విద్యార్హతలు ఇంకా నిర్ణయించలేదు. సూపర్స్పెషాలిటీ పోస్టులు ఇవ్వొద్దని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) ఆదేశించారు. అందుకే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. అన్నీ నెమ్మదిగా అవుతాయి. కొత్త కాలేజీలకు ఇంకా ఉద్యోగ నియామకాలు జరగలేదు. – డాక్టర్ కేవీ శివప్రసాద్, ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం జీఎంసీ పోస్టులు తగ్గించాలని చెప్పలేదు సూపర్స్పెషాలిటీ సహా ఏ పోస్టులూ తగ్గించాలని లేదా పెంచాలని మేం ఎటువంటి ఆదేశాలూ ఇవ్వలేదు. భర్తీకి అనుమతి మాత్రమే ఇచ్చాం. ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినా అది పూర్తిగా వారి బాధ్యతే. జీఓ ప్రకారం ఎప్పటికప్పుడు పోస్టులు భర్తీ చేయాలి. పోస్టుల కుదింపునకు గల కారణాలపై రాజమహేంద్రవరం జీఎంసీ అధికారులు మాకు ఎటువంటి సమాచారమూ ఇవ్వలేదు. – డాక్టర్ రఘునందన్ గంభీర, డీఎంఈ నా జీవితంతో ఆడుకున్నారు నిరుద్యోగినైన నా జీవితంతో జీఎంసీ అధికారులు ఆడుకున్నారు. నా వయసు 48 ఏళ్లు. మూడోసారి విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ నాటికి నా వయో పరిమితి ముగిసింది. రెండో నోటిఫికేషన్ సమయానికి వయసు ఉన్నా, అకారణంగా నోటిఫికేషన్ రద్దు చేశారు. నేను మంచి మార్కులతో ఐటీఐ ఎలక్ట్రికల్ ఉత్తీర్ణుడినయ్యాను. మెరిట్లోనూ ముందున్నాను. రెండో నోటిఫికేషన్ కొనసాగి ఉంటే, మెరిట్ ఆధారంగా నాకే ఉద్యోగం వచ్చేది. అధికారుల నిర్వాకంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగానికి దూరమయ్యాను. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. వారిని పోషించడానికి ఇంటింటికీ కేబుల్ వైర్లు వేస్తూ పూట గడుపుకొంటున్నాను. – పి.అశోక్, అభ్యర్థి, కాకినాడ -
నేటి నుంచి రెవెన్యూ క్లినిక్
రాజమహేంద్రవరం సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అధికంగా వస్తున్న భూ సంబంధిత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిని సోమవారం ప్రారంభిస్తున్నామన్నారు. ఇకపై ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్తో పాటు ఈ క్లినిక్ కూడా కొనసాగుతుందని తెలిపారు. ఇకపై జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీఓలు ప్రతి సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు ల్యాప్టాప్, కంప్యూటర్ ఆపరేటర్, అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. నేడు పీజీఆర్ఎస్ కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ కీర్తి తెలిపారు. దీనిని సమర్థంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులు, ప్రత్యేక అవసరాలున్న పౌరులకు వసతులు కల్పించాలని సూచించారు. ప్రజలు 95523 00009 వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్రా యాప్ ద్వారా 36 ప్రభుత్వ శాఖలకు చెందిన 700కు పైగా సేవలను పొందవచ్చని వివరించారు. ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడిగా బాపిరాజు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం సిటీ): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీఆర్ఎస్ఏ) జిల్లా యూనిట్ అధ్యక్షుడిగా డిప్యూటీ తహసీల్దార్ గొలుగూరి బాపిరాజు వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. అసోసియేషన్ ఎన్నికలు స్థానిక ఇన్నీసుపేటలోని రెవెన్యూ భవన్లో ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. సహాధ్యక్షుడిగా డిప్యూటీ తహసీల్దార్ ఎం.కాంతి ప్రసాద్, కార్యదర్శిగా డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ సురేష్బాబు, కోశాధికారిగా డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే ఎండీ లాల్ అహ్మద్తో పాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా కాకినాడ కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎం.రామ్మోహన్, పరిశీలనాధికారిగా కపిలేశ్వరపురం డిప్యూటీ తహసీల్దార్ జి.శ్రీనివాస్ వ్యవహరించారు. ఎన్నికై న సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కమిటీ 2028 వరకూ మూడేళ్లపాటు కొనసాగుతుందని రామ్మోహన్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న బాపిరాజు మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని విధులకు హాజరయ్యే రెవెన్యూ ఉద్యోగులకు మంచి బస ఏర్పాటుకు రెవెన్యూ భవన్ను ఆధునీకరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఇన్సూరెన్స్, కలిసి వచ్చే ఉద్యోగులతో సొసైటీగా ఏర్పడి ఇళ్ల స్థలాల సాధనను ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నామని అన్నారు. ఈ లక్ష్యాలను పుష్కరాల్లోపే సాధిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షుడు, డిప్యూటీ తహసీల్దార్ వి.శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం అర్బన్, కొవ్వూరు డివిజన్ అధ్యక్షుడు డిప్యూటీ తహసీల్దార్ కె.రవివిక్రమ్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షుడు బి.కృష్ణశాస్త్రి, మూడు యూనిట్ల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. లోవలో ఆన్లైన్ సేవలు ప్రారంభం తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవ స్థానంలో ఆదివారం నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. aptemples.ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి ఆన్లైన్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రతి శుక్రవారం, పౌర్ణమి నాడు నిర్వహించే మహాచండీ హోమం, అమ్మవారి తిరు నక్షత్రం స్వాతి సందర్భంగా ని ర్వహించే పంచామృతాభిషేకాలతో పాటు ఊయ ల సేవ, వాహన పూజలు తదితర నిత్య సేవలకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఆన్లైన్లో నమోదు చేసుకుని వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశామన్నారు. కాటేజీలు, వసతి గదులు సైతం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచామన్నారు. వేలాదిగా భక్తుల రాక తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం వివిధ జిల్లాల నుంచి వచ్చిన 8 వేల మంది భక్తులు క్యూలో దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల ద్వారా రూ.61775, పూజా టికెట్లకు రూ.91960, కేశఖండన శాలకు రూ.3,080, వాహన పూజలకు రూ.4,750, వసతి గదులు, కాటేజీల అద్దెలు రూ.36,020, విరాళాలు రూ.33,867, కలిపి మొత్తం రూ.2,31,452 ఆదాయం సమకూరిందని వివరించారు. -
సనాతన ధర్మ పరిరక్షణతోనే దేశాభివృద్ధి
● సామవేదం షణ్ముఖశర్మ ● బ్రహ్మజోస్యుల స్మారక పురస్కారం ప్రదానంసీతానగరం: భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం అవసరమని, సనాతన ధర్మ పరిరక్షణతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక తొలి పురస్కారాన్ని కుటుంబ సభ్యులు ఆయనకు ప్రదానం చేశారు. సీతానగరం కస్తూర్బాగాంధీ ఆశ్రమంలో ఆదివారం జరిగిన ఈ వేడుకలో సామవేదం మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం బ్రహ్మజోస్యుల చేసిన పోరాటం మరువరానిదని అన్నారు. అటువంటి మహనీయుని పేరిట ఇస్తున్న ఈ పురస్కారాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నానని చెప్పారు. భారతీయ సంస్కృతీ పరిరక్షణకు మరో స్వాతంత్య్ర ఉద్యమం అవసరమన్నారు. భారతీయ సంస్కృతి యుగయుగాలుగా కొనసాగుతూ వస్తోందని, ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో మనదేశం వెలుగొందిన విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. దేశాభ్యున్నతి దేశ సంస్కృతిలోనే దాగి ఉందన్న విషయం మరచిపోరాదన్నారు. హిందూ మత ప్రతినిధిగా స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యం గురించి విశ్వవేదికపై చాటి చెప్పారని గుర్తు చేశారు. సనాతన ధర్మం బాగుంటే దాని నీడన అన్ని మతాలూ క్షేమంగా ఉంటాయని చెప్పారు. హిందూ అనేది మతం కాదని, ధర్మమని స్పష్టం చేశారు. అందుకే ఇక్కడ మతం అనే మాటకు బదులు హిందూ ధర్మం, హిందూ సంస్కృతి అని అనాలన్నారు. ఇక్కడ ఎప్పుడూ అసహనం లేదన్నారు. క్షేత్రాలు, నదుల గురించి చెప్పి, ఆనాడే వ్యాస భగవానుడు ఐక్యత కలిగించాడని చెప్పారు. భూమిని తల్లిగా చూడాలని మన ధర్మం చెబుతోందని, తల్లిని గౌరవించలేనప్పుడు అది ధర్మమెలా అవుతుందని ప్రశ్నించారు. భరతవర్షం బాగుండాలని దేవతలు కూడా కోరుకుంటారని సామవేదం అన్నారు. సామవేదం షణ్ముఖశర్మకు ఇవ్వడం వలన బ్రహ్మజోస్యుల పురస్కారానికి మరింత విలువ ఏర్పడిందని బెంగళూరుకు సచ్చిదానంద సరస్వతి మహాస్వామీజీ అన్నారు. బ్రహ్మజోస్యుల ఫౌండేషన్ కన్వీనర్ వారణాసి ధర్మసూరి మాట్లాడుతూ, డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం పేరుతో ఫౌండేషన్ పెట్టి, పురస్కారం ఇవ్వాలని నిర్ణయించి, సామవేదం పేరును ప్రతిపాదిస్తే అందరూ ముక్తకంఠంతో ఆమోదించారని అన్నారు. మన సంస్కృతిని నాశనం చేయడానికే మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టారని, ఇప్పటికీ అదే ఆంగ్ల భాషను పట్టుకుని వేళ్లాడుతున్నామని ఆవేదన చెందారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ మానసికంగా రాలేదని అన్నారు. డాక్టర్ దోర్భల ప్రభాకరశర్మ మాట్లాడుతూ, మన సంస్కృతి, మన భాష సంస్కృతాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన గేయం ఆలపించడంతో కరతాళధ్వానాలు మిన్నంటాయి. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు మాట్లాడుతూ, శకునాలన్నీ సీతమ్మకు చేరేసరికి శుభకరమైనవిగా మారినట్లు.. పురస్కారాలు సామవేదం వారిని చేరి గౌరవం పెంచుకుంటున్నాయని అన్నారు. సీతానగరం ఆశ్రమం గురించి డాక్టర్ బొంగు రాజారావు వివరించారు. డాక్టర్ సీహెచ్వీ రమణీ కుమారి సన్మాన పత్రం చదివారు. సామవేదం వారిపై స్వీయ పద్యాలను కవితా ప్రసాద్ చదివి, సన్మాన సమితి తరఫున సమర్పించారు. డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి స్వాగతం పలికి, ప్రార్థన చేశారు. హైదరాబాద్కు చెందిన సామాజిక సేవావేత్త జేవీ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధి సుశీల, ఫౌండేషన్ కన్వీనర్ బ్రహ్మజోస్యుల వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
గాడిద పట్ల మార్దవం.. గోవు పట్ల కరకుదనం..
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘దుర్యోధనుడి పట్ల మృదువుగా మాట్లాడేవాడు గాడిద పట్ల మార్దవం, గోవు పట్ల కరకుదనం చూపేవాడవుతాడు’ అని ద్రుపదుడు అంటాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా ఉద్యోగ పర్వంలోని పలు అంశాలను ఆయన ఆదివారం వివరించారు. ‘‘అజ్ఞాతవాసం ముగిశాక బలరామ కృష్ణులు, ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు తదితర ప్రముఖులతో పాండవులు సమావేశయ్యారు. ‘దుర్యోధనునితో సౌమ్యంగా మాట్లాడాలని, శకునితో ద్యూతం ఆడటం ధర్మరాజు తప్పు’ అని బలరాముడు అంటాడు. ద్రుపదుడు ఈ మాటలను అంగీకరించక పై పోలిక తెస్తాడు. ఇందులో గాడిద ఎవరో, గోవు ఎవరో సుస్పష్టం’’ అని సామవేదం అన్నారు. ‘‘ధృతరాష్ట్రుని తరఫున పాండవుల వద్దకు వచ్చిన సంజయుడు యుద్ధం అవాంఛనీయమని చెబుతాడే కానీ, వారి రాజ్యభాగం గురించి మాట్లాడడు. యుద్ధం ధర్మరహితమైనదని అంటాడు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ధర్మసమ్మితమైన భోగాన్ని మాత్రమే కోరుతున్నామని ధర్మరాజు సమాధానం చెబుతాడు. దుర్యోధనుడు ఇతరుల మానాన్ని ధ్వంసం చేయాలనుకుంటాడు. అటువంటి వాడిని మానధనుడని ఎలా అనగలం?’’ అని సామవేదం ప్రశ్నించారు. ‘‘మా రాజ్యాన్ని దుర్యోధనుడు కోరుకుంటున్నాడు. మేము జీవించి ఉండగా మా రాజ్యాన్ని ఇంద్రుడు కూడా సొంతం చేసుకోలేడు. ఇంద్రప్రస్థంలో మా రాజ్యం మాకు ఇవ్వాలి’’ అని ధర్మరాజు స్పష్టం చేస్తాడు. ‘‘దీంతో, సంజయుడు వేదాంతం మాట్లాడతాడు. యుద్ధం చేయడం కన్నా భిక్షాటన మేలని అంటాడు. వేదాంతాన్ని అసందర్భంగా ఎలా అన్వయించుకోవచ్చునో ఈ వృత్తాంతం నుంచి తెలుసుకోవచ్చు’’ అని సామవేదం అన్నారు. -
విద్యారంగం.. గడ్డుకాలం
● ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై శీతకన్ను ● ‘తల్లికి వందనం’లో కోతలు ● ఫీజు రీయింబర్స్మెంట్కు ఎగనామం ● గురువులకిచ్చిన హామీలు గాలికి..రాజమహేంద్రవరం రూరల్/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నేడు సర్కారీ పాఠశాలల అభివృద్ధికి కా నరాని చేయూత.. ప్రభుత్వ చదువులకు కరవవుతున్న ప్రోత్సాహం.. విద్యారంగంలో సంక్షేమానికీ దాదాపు తిలోదకాలు ఇస్తున్న ధోరణి.. మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులపై విపరీతమైన బోధనేతర భారం.. పదో తరగతి పరీక్షల్లో 87.99 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ఆరో స్థానం సాధించడం మినహా.. ఇతరత్రా అన్ని రూపాల్లోనూ ప్రభుత్వ విద్యారంగం ఈ ఏడాది గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. తల్లికి ‘వంచన’ పేదింటి పిల్లలను బడికి పంపించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ పథకం పేరును ‘తల్లికి వందనం’గా మార్చింది. ప్రతి ఇంట్లోను చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రకటించింది. తీరా చూస్తే తొలి ఏడాది ఈ సాయాన్ని ఎగ్గొట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఈ ఏడాది ఈ పథకాన్ని అమలు చేసినా.. లబ్ధిదారుల్లో.. వారికిచ్చే సాయంలో భారీగా కోత పెట్టారు. జిల్లాలో 1,88,220 మంది విద్యార్థులుండగా, అధికారుల లెక్కల ప్రకారం 1,22,799 మంది తల్లుల ఖాతాల్లో రూ.240 కోట్లు జమ చేశారు. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే కొందరు తల్లులకు రూ.8 వేలు, మరికొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.11 వేల చొప్పున మాత్రమే జమ చేశారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే తల్లుల ఖాతాల్లో వేస్తామంటూ మెలిక పెట్టి, తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం పంగనామం పెట్టింది. ఉన్నత విద్య భారం పేద విద్యార్థులు ఎటువంటి ఆటంకమూ లేకుండా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉన్నతాశయంతో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం దాదాపు పూర్తిగా పక్కన పెట్టేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఫీజు రీయింబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. ఈ ఏడాదైనా నిధులు విడుదల చేస్తారని ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశే ఎదురైంది. కంటితుడుపుగా కొందరు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వాస్తవానికి చాలామంది విద్యార్థులు నిధులు విడుదల కాక మధ్యలోనే చదువులు ఆపేయాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నారు. కొంతమంది తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లించాల్సి వచ్చింది. నాణ్యత లేని ‘విద్యార్థి మిత్ర’ కార్పొరేట్కు దీటుగా పేద విద్యార్థులు చదువుకోవాలనే ఉన్నతాశయంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వినూత్న రీతిలో జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరచిన రోజున విద్యార్థులకు పాఠ్య, నోట్ పుస్తకాలు, డిక్షనరీలు, యూనిఫాం, బెల్టు, షూ, సాక్సులు, నాణ్యమైన స్కూల్ బ్యాగ్ వంటివి అందించింది. ఈ పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’గా మార్చింది. తీరా ఆచరణకు వచ్చేసరికి ఆ మహనీయునికే మచ్చ తెచ్చేలా విద్యార్థులకు ఇచ్చే వస్తువుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చింది. స్కూల్ బ్యాగులు రెండు నెలలకే చిరిగిపోయాయి. బూట్లు ఇప్పటికే పాడైపోయాయి. దీంతో, విద్యార్థులు తరగతులకు చెప్పులతోనే హాజరవుతున్నారు. ట్యాబ్లు గోవిందా.. విద్యార్థుల్లో డిజిటల్ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యార్థులకు బైజూజ్ కంటెంట్తో ట్యాబులు పంపిణీ చేసింది. తద్వారా విద్యార్థులు తరగతిలో పాఠంతో పాటు ఇంటికి వెళ్లాక కూడా ఆ ట్యాబ్ల ద్వారా ఆ పాఠాలకు సంబంధించి మరిన్ని విషయాలను లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉండేది. అర్థం కాని విషయాలను కూడా వాటి ద్వారా సులభంగా గ్రహించేవారు. ఈ ట్యాబుల పంపిణీకి చంద్రబాబు ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. ఎక్కడి నిర్మాణాలు అక్కడే.. మన బడి నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ పథకం పేరును ప్రస్తుత ప్రభుత్వం ‘మన బడి – మన భవిష్యత్తు’గా మార్చింది. నిధులు విదిల్చినప్పటికీ.. పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో ప్రస్తుతం తరగతి గదుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. బోధనేతర భారం మరోవైపు ఉపాధ్యాయులు బోధనేతర భారంతో సతమతమవుతున్నారు. ఫలితంగా విద్యార్థులు చదువులకు దూరమవుతున్న పరిస్థితి నెలకొందని ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల నాయకులు వాపోతున్నారు. యాప్ల భారాన్ని తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. టీచర్లపై హాజరు నమోదు, ఇన్స్పెక్షన్, యూనిఫాం, పరిశుభ్రత, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, సాసా, కర్మయోగి తదితర పలు రకాల యాప్ల బాధ్యతలు అప్పగించింది. దీంతో పాటు పేరెంట్స్ – టీచర్స్ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు భారంగా మారాయి. ఈ సమావేశాల కోసం గురువులు తమ జేబులోని సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. హామీల అమలెప్పుడో! ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలును చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది కూడా గాలికొదిలేసింది. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన సర్కారు.. ఇప్పటి వరకూ కొత్త కమిటీని వేయలేదు. కనీసం ఐఆర్ కూడా ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు డీఏల చెల్లింపుపై కూడా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలైకి సంబంధించి ఉపాధ్యాయులకు డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మూడు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో మరో డీఏ అంటే మొత్తం నాలుగు డీఏలను ప్రభుత్వం చెల్లించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. హుకుంపేట జెడ్పీ హైస్కూలులో నత్తనడకన తరగతి గదుల నిర్మాణం -
డూడూ బసవన్నా.. ఆదరణ ఏదన్నా!
ఫ వైభవాన్ని కోల్పోతున్న గంగిరెద్దులాట ఫ ఇతర వృత్తులకు మళ్లుతున్న నిర్వాహకులు రాయవరం: అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్లు గ్రామాల్లో సందడి చేస్తుంటారు. తలకు పాగా ధరించి, వివిధ రకాల దుస్తులను ధరించి, బూర ఊదుకుంటూ గంగిరెద్దులను తీసుకు వస్తారు. అందంగా అలంకరించిన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికీ వెళ్లి వారి వంశ ప్రతిష్టను కీర్తించే గంగిరెద్దుల వారికి గ్రామాల్లో గంగిరెద్దులాటకు రానురానూ ఆదరణ తగ్గుతోంది. సాధారణ రోజుల్లో గంగిరెద్దులను ఆడిస్తూ గ్రామాల్లో తిరిగినా సంక్రాంతి సమయంలోనే నిర్వాహకులకు ఓ ప్రత్యేకత ఉంటుంది. హరిదాసులతో పాటు డూడూ బసవన్నల రాకతోనే సంక్రాంతి పండగకు పరిపూర్ణత వస్తుందని చెప్పవచ్చు. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఇళ్ల ముంగిట్లో ఎక్కడ చూసినా గంగిరెద్దులు దర్శనమిచ్చేవి. వీటి నిర్వాహకులు ప్రతి ఇంటికి వచ్చి సన్నాయితో పాటలు పాడుతూ.. ఇంటి యజమానుల వంశాన్ని కీర్తిస్తూ.. బసవన్నను ఆడిస్తూ యజమానులు ఇచ్చే కానుకలను స్వీకరిస్తారు. నిర్వాహకులు సన్నాయితో పాడే పాటలకు అనుగుణంగా గంగిరెద్దుతో నాట్యం, విన్యాసాలు చేయిస్తారు. గ్రామాల్లో చిన్న పిల్లలు గంగిరెద్దుల వెంట తిరుగుతూ సెలవు దినాలను ఆనందోత్సాహాలతో గడిపేవారు. ఉమ్మడి జిల్లాలో 15 వేల మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 15 వేల మంది గంగిరెద్దుల సామాజిక వర్గం వారు ఉన్నారు. వీరు 25 సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. అమలాపురం, కొత్తపేట, రాయవరం, పసలపూడి, రాజమహేంద్రవరం, వెదురుమూడి, ముక్కామల, భీమనపల్లి, మురముళ్ల, నీలపల్లి, కాకినాడ, అనపర్తి, ద్వారపూడి తదితర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో గంగిరెడ్ల సామాజిక వర్గం వారు జీవిస్తున్నారు. ఈ వృత్తిలో ఆదరణ తగ్గిపోవడంతో ఇతర వృత్తుల్లోకి మరలిపోతున్నారు. కొందరు ఇంకా పక్కా ఇళ్లకు కూడా నోచుకోలేక పోతున్నారు. ఇప్పటికీ మార్కెట్ షెడ్లలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ కొందరు గంగిరెద్దులను తీసుకుని సంక్రాంతికి జిల్లాలోని కందికుప్ప, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు తరలివెళ్లారు. తగ్గుతున్న ఆదరణ గంగిరెద్దులకు కాలక్రమంలో ఆదరణ తగ్గుతుంది. ఇదే విషయాన్ని గంగిరెద్దుల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రజల్లో ఆదరణ తగ్గడానికి ఇంటింటికి ఉన్న టీవీలు కూడా ఒక కారణమని అంటున్నారు. టీవీలతోనే పిల్లలు, పెద్దలు కాలక్షేపం చేస్తూ గంగిరెద్దుల ఆటను తనివితీరా ఆస్వాదించ లేకపోతున్నారని, ఆట చూడడానికి కూడా తీరిక ఉండడం లేదని నిర్వాహకులు అంటున్నారు. గతంలో గంగిరెద్దుల ఆటలు జనరంజకంగా ఉండేవి. గంగిరెద్దుల ఆటను చూసిన అనంతరం ఇంటి యజమానుల నుంచి కానుకలు స్వీకరించే ముందు వారిని ఆశీర్వదించేవారు. -
కృషి, పట్టుదలతో లక్ష్య సాధన
కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని సాధించాలంటే నిరంతర కృషి, పట్టుదల అవసరమని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ఆవరణలో శనివారం ఇన్స్పిరిట్–2025 కార్యక్రమాన్ని ఆ విద్యా సంస్థల అధినేత నున్న తిరుమలరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసవర్మ మాట్లాడుతూ తిరుమల విద్యా సంస్థలు స్థాపించిన అనతికాలంలోనే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాట వేశారన్నారు. ఈ విద్యా సంస్థ దేశానికి ఎంతో మంది ఇంజినీర్లను, వైద్యులను అందించడమే కాకుండా తల్లిదండ్రుల ఆలోచనలకు తగినట్లుగా పిల్లలను తీర్చిదిద్దిందన్నారు. తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జరిగిన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్–2025 పరీక్షలలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులైన తమ 667 మంది విద్యార్థులు వివిధ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, బిట్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన కళాశాలల్లో సీట్లు సాధించడం సంతోషదాయకమన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ తాను జన్మించిన కాతేరులో తిరుమల విద్యా సంస్థలు స్థాపించిన నున్న తిరుమలరావు సేవలను కొనియాడారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి లేకుండా చక్కని వాతావరణంలో చదువుకోవాలన్నారు. అనంతరం ఇంజినీరింగ్ సీట్లు సాధించిన విద్యార్థులకు జ్ఞాపికలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. విద్యా సంస్థల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్పర్సన్ శ్రీరష్మి, అకడమిక్ డైరెక్టర్ సతీష్బాబు, ప్రిన్సిపల్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధికి వెళ్లి గుండెపోటుతో మృతి
అమలాపురం రూరల్: అమలాపురం మండలం వన్నెచింతలపూడికి చెందిన ఓ యువకుడు ఉపాధి నిమిత్తం దేశం కాని దేశం వెళ్లి గుండెపోటుతో మృతి చెందాడు. కేసీఎం అధికారుల చొరవతో అతని మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకు వచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన ముంగండ రవితేజ (33) ఉపాధి నిమిత్తం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖతార్ దేశానికి వెళ్లి హౌస్ కేరింగ్ వర్క్ చేస్తున్నాడు. అయితే ఈ నెల 16న రాత్రి అక్కడ గుండెపోటుతో మరణించాడు. దీనిపై మృతుని కుటుంబ సభ్యులు ఈ నెల 17న కలెక్టర్ మహేష్ కుమార్ను సంప్రదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నోడల్ అధికారి కె.మాధవి, సమన్వయ అధికారి గోళ్ల రమేష్, సిబ్బంది ఎంఎం సఫియా, కడియాల సత్తిబాబు, బద్రి దుర్గా అమ్మాజీలు బాధిత కుటుంబాన్ని కలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం భారత రాయబార కార్యాలయంతో పాటు ఖతార్లోని ప్రతినిధులు శ్రీనివాస్, రాజ్కుమార్, విజయ్ చార్లీ, సోలామాన్, రమణ, శశిలతో నిరంతరం సమన్వయం జరిపారు. అనంతరం మృతదేహాన్ని వన్నెచింతలపూడికి శనివారం చేర్చారు. వ్యక్తి ఆత్మహత్య సామర్లకోట: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం ప్రకారం.. స్థానిక గాంధీనగర్కు చెందిన సిరికి రవికుమార్ (49) లారీ స్టాండ్ సమీపంలో చెట్టుకు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి ఆర్థిక ఇబ్బందులు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో సమాచారం మేరకు సీఐ కృష్ణభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
అమలాపురం రూరల్: రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, ప్రజల సంకల్పాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ, పీడీఎస్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయూ ప్రజా సంఘాలు శనివారం అమలాపురం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కోకన్వీనర్, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏఐకేఎంఎస్ నాయకుడు వెంటపల్లి భీమశంకరం, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్కుమార్, బీఎస్పీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అభివృద్ధి ముసుగులో జిల్లాల పునర్విభజన చేయడంతో ప్రజల మధ్య అనేక చీలికలు, అయోమయం, పరిపాలనా సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. భౌగోళికంగా, చారిత్రకంగా, పరిపాలనా పరంగా శతాబ్దాలుగా కాకినాడ జిల్లాతో అనుసంధానమైన రామచంద్రపురం నియోజకవర్గాన్ని, గోదావరి నదిని దాటి వెళ్లాల్సిన దూర ప్రాంతంతో అనుసంధానం చేయడం ప్రజలకు మేలు చేసే నిర్ణయం కాదని అన్నారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి పదవి అందుకున్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. అఖిలపక్ష జేఏసీ గౌరవ అధ్యక్షుడు దొమ్మలపాటి సత్యనారాయణ, ఐఎఫ్టీయూ నాయకులు చింతా రాజారెడ్డి, నాయకులు నాగరాజు, అలీ, కె.నవీన్, బుల్లి రాజు, పట్టాభి, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీలు ప్రారంభం
రావులపాలెం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు అన్నారు. రావులపాలెం మండలం వెదిరేశ్వరం గ్రామంలో శనివారం మాజీ వైస్ ఎంపీపీ దండు సుబ్రహ్మణ్యేశ్వర వర్మ ఆధ్వర్యంలో దండు సాయిఆకాష్వర్మ మెమెరబుల్ టోర్నమెంట్ 10వ రాష్ట్ర స్థాయి నెట్బాల్ సీనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే రాష్ట్ర స్థాయి నెట్బాల్ ఆటలో అత్యున్నత ప్రతిభ కనబరిచి దురదృష్టవశాత్తూ మరణించిన దండు సాయిఆకాష్ వర్మ ఆసక్తి మేరకు అతని తండ్రి దండు సుబ్రహ్మణ్యేశ్వరవర్మ, సుజాత దంపతులు ఈ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం జగ్గిరెడ్డి టాస్ వేసి తూర్పుగోదావరి– నెల్లూరు జట్ల మధ్య మ్యాచ్ను ప్రారంభించారు. అలాగే క్రీడాకారులకు టీషర్ట్లు పంపిణీ చేశారు. 13 జిల్లాల నుంచి మెన్, ఉమెన్ కేటగిరీల్లో మొత్తం 26 టీమ్లు పాల్గొనగా లీగ్ కమ్ నాకౌట్ విధానంలో తొలి రోజు పోటీలు జరిగాయి. పురుషుల విభాగంలో పది మ్యాచ్లు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. రెండో రోజు క్వార్టర్స్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని నెట్బాల్ రాష్ట్ర సెక్రటరీ పల్లా శ్రీను తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కొత్తపేట ఎంపీపీ మార్గన గంగాధరరావు, అముడా మాజీ చైర్మన్ గొల్లపల్లి డేవిడ్రాజు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ గన్నవరపు వెంకట్రావు, సర్పంచులు బొక్కా కరుణాకరం, సబ్బితి మోహనరావు, కొత్తపేట వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు పాల్గొన్నారు. -
అన్నదాన ట్రస్ట్కు రూ.లక్ష సమర్పణ
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన పథకానికి విశాఖపట్నానికి చెందిన దాత కవికొండల అప్పలనర్సమ్మ తన భర్త, దివంగత వెంకట్రావు పేరుపై శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన ఘటనలో జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి)పై రాజోలు పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 25న శివకోటి ముసలమ్మ ఆలయ కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి రాజమహేంద్రవరానికి చెందిన బాలిక పాలపర్తి భవ్యశ్రీ మృతి చెందింది. ఈ ఘటనలో నిజ నిర్ధారణ కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చిన జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజో లు నియోజకవర్గ బహుజన సమాజ్వాది పార్టీ ఇన్చార్జి ఆకుమర్తి భూషణంలపై పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడి పాల్పడినట్లు చెబుతున్నా రు. మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన తమను బుజ్జి కులం పేరుతో దూషించి, దాడి చేసినట్లు జనుపల్లి సత్యానందం, ఆకుమర్తి భూష ణంలు రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బుజ్జిపై రాజోలు ఎస్సై రాజేష్కుమార్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. -
వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి
గతంలో మాదిరిగా గంగిరెద్దుల ప్రదర్శనకు ఆదరణ అంతగా ఉండడం లేదు. కుల వృత్తిని వీడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం గంగిరెద్దుల సామాజిక వర్గాన్ని గుర్తించి ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ వృత్తిని కొనసాగించగలం. –బొడ్డు రాజు, పసలపూడి, రాయవరం మండలం పండగ సమయంలోనే.. ఒకప్పుడు అన్ని కాలాల్లో గంగిరెద్దుల ఆటను ప్రతి ఒక్కరూ ఆదరించేవారు. ఇప్పుడు కేవలం సంక్రాంతి సమయంలోనే ఆట ఉంటుంది. ఆదరణ తగ్గుతుండడంతో యువత ఈ వృత్తిని స్వీకరించడం లేదు. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునేందుకు, కూలి పనులకు వెళ్లిపోతున్నారు. –బొడ్డు ప్రకాష్, కందరాడ, పిఠాపురం మండలం ఆర్థికంగా ఆదుకోవాలి గంగిరెడ్ల సామాజిక వర్గం అనాది నుంచి సంచార జాతులుగా ఉంటున్నాం. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి గంగిరెద్దులను ఆడించుకుని పోషణ పొందుతున్నాం. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకుంటే మా జీవితాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి. –జానపాటి ఏసు, మాధవపట్నం, కాకినాడ రూరల్ ఎస్టీ జాబితాలో చేర్చాలి ఊరూరా తిరుగుతూ ఉంటే సంచార జాతులమైన గంగిరెడ్ల సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలి. ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న గంగిరెడ్ల సామాజిక వర్గానికి కనీసం పక్కా ఇళ్లు లేవు. వృత్తి కూడు పెట్టకపోవడంతో చిన్న చిన్న సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం. –బొమ్మన పరంజ్యోతి, అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గంగిరెడ్ల సంక్షేమ సంఘం -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు
సామర్లకోట: గొంచాల–అచ్చంపేట రోడ్డులో జరిగిన ప్రమాదంలో పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. నక్కపల్లి యూనియన్ బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్గా పని చేస్తున్న సందీప్రాజు కారు అతి వేగంగా రావడంతో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరర చదువుతున్న బెహరా రాజు తీవ్రంగా గాయపడ్డాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. తాను ఏమి చేయలేనని సందీప్రాజు చెప్పడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. దాంతో సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం రాత్రి ఇరువర్గాలను పిలిచి చర్చలు జరిపారు. బాధితుడి కాలు పూర్తిగా తీసి వేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తోందని, నష్ట పరిహారం ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దానికి కారు యజమానికి చెందిన బంధువులు అంగీకరించక పోవడంతో బ్యాంకు వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు సీఐ సూచించారు. అయితే రాత్రి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. -
పరుగు పందెంలో బంగారు పతకం
బాలాజీచెరువు: ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని బి.నాగవిహారిక ప్రతిభ కనబరిచింది. ప్రో స్పోర్ట్స్ 100 ప్లస్ టీం, హైదరాబాద్ డిస్ట్రిక్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 12 సెకన్లలో పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్తో పాటు రూ.30 వేల నగదు సాధించారు. అలాగే గత నెలలో నన్నయ వర్సిటీలో నిర్వహించిన అథ్లెటిక్స్ నన్నయవర్సిటీ చాంపియన్షిప్ పోటీల్లో పాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ సాఽధించారు. కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బీఏ విద్యార్థి వి.రేష్మయాదవ్ ప్రతిభ చూపి బంగారు పతకంతో పాటు నొయిడాలో జనవరి 3 నుంచి నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు, ఇన్చార్జి ప్రిన్సిపాల్ సంజీవ్కుమార్, పీడీ రమణ, డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్ అభినందించారు. -
కన్నీరే మిగిలింది
సాక్షి, రాజమహేంద్రవరం: కర్షకులకు ఈ ఏడాది కన్నీరు తప్పలేదు.. చంద్రబాబు ప్రభుత్వం నుంచి సహకారం కొరవడటం.. ఆపై విపత్తుల విశ్వరూపం వెరసి.. అన్నదాతలకు ఆక్రందనే మిగిలింది. పంట సాగుకు ప్రోత్సాహం అందించాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసింది. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధులకు ఎగనామం పెట్టింది. ఉచిత పంటల బీమాకు మంగళం పాడి రైతుల నెత్తిన ప్రీమియం భారాన్ని మోపింది. పంట చేతికొచ్చే సమయంలో మోంథా తుపాను ప్రభావంతో నోటికాడ కూడు నీటి పాలైంది. నష్టపోయిన పంటలకు నేటికీ పరిహారం అందించిన దాఖలాలు లేవు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) నిర్వీర్యం చేసింది. రబీలో ఎరువుల కొరతతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ధాన్యం కొనుగోలు డబ్బులు సైతం సకాలంలో అందించకుండా కాలయాపన చేసింది. ఇలా అన్నింటా రైతులను నట్టేట ముంచింది. వెరసి 2025 ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రైతులకు నిరాశ మిగిల్చింది. అన్నదాతకు మొండిచేయి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా రూ.20 వేలు అందజేస్తామని ప్రకటించి మోసం చేసింది. అధికారం చేపట్టిన తొలి ఏడాది నిధులు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రెండో దశలో 18,511 మంది రైతులకు మొండిచేయి చూపింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి రైతు భరోసా పథకంలో నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుతం వాటి సంఖ్య 1,14,991కు చేరింది. సుమారు 1.10 లక్షల మంది కౌలు రైతులకు నయా పైసా ఇవ్వకుండా కంట తడి పెట్టించింది. గత నాలుగేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేసింది. విద్యుత్ కోతలు వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని ప్రకటనలు గుప్పించిన చంద్రబాబు ప్రభుత్వం కొన్ని రోజులకే 9 గంటల విద్యుత్ సరఫరాను 7 గంటలకు తగ్గించింది. దీంతో పంట సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బీమాకు ఎగనామం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలన్న నిబంధనను తెరపైకి తెచ్చింది. 2024–25 రబీ సీజన్కు ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం రైతులే కట్టుకోవాలంటూ ఆదేశాలిచ్చింది. వరి పంట హెక్టారుకు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. రైతుల భాగస్వామ్యం పేరుతో భారాన్ని మోపింది. ఫలితంగా వేల సంఖ్యలో రైతులు బీమాకు దూరమయ్యారు. ఆర్బీకేల నిర్వీర్యం రైతులకు వ్యవసాయ సేవలు, విత్తనాలు, పురుగు మందులు అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 367 రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) ఏర్పాటు చేసింది. వీటి ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, ఉద్యాన పంటలకు సైతం ఎంతగానో ప్రోత్సాహం అందించింది. అలాంటి వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎరువుల పంపిణీ బాధ్యతను పీఏసీఎస్లకు అప్పగించింది. తద్వారా రైతులు ఎరువులు తీసుకునేందుకు అవస్థలు పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ధాన్యం సేకరణకు నిబంధనలు ఖరీఫ్ ధాన్యం సేకరణకు నిబంధనలు తీసుకురావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధాన్యం తడిచినా, మొలకెత్తినా, రంగుమారినా కొనుగోలు చేయలేదు. మిల్లర్లకు నచ్చి.. వాళ్లు ఇచ్చే ధరకు విక్రయించుకోండంటూ చేతులేత్తసింది. ముంపునకు గురైన పంటలో తేమ శాతం అధికంగా ఉంటుందని, రంగు మారి, మొలకలొచ్చే అవకాశం ఉండటంతో తాము మద్దతు ధర ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు, దళారులు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక రైతులు తక్కువ ధరకు తెగనమ్ముకున్నారు. బస్తాపై రైతులు రూ.400 నష్టపోయారు. అందని మోంథా సాయం మోంథా తుపాను రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లా వ్యాప్తంగా మోంథా తుపాను నష్టాలపై అధికారులు తుది నివేదిక ప్రభుత్వానికి పంపారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 18 మండలాల పరిధిలో 33,262 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక రూపొందించారు. మొత్తం 16,540 హెక్టార్లలో వివిధ రకాల పంటలు నష్టపోగా, వాటి విలువ సుమారు రూ.40.96 కోట్లుగా నిర్ధారించారు. 31,074 మంది రైతులకు చెందిన వరి, మినుముకు సంబంధించి 15,738.607 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దీని విలువ దాదాపు రూ.38.21 కోట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రక్రియ జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదల చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉద్యాన పంటలకు గిట్టుబాటు లేక.. 2025 ఏడాదిలో ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కరువైంది. జిల్లా వ్యాప్తంగా 90 వేల మంది రైతులు ఉద్యాన పంటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా మామిడి రైతులు తీవ్ర నష్టాలు చవి చూశారు. టన్నుకు రూ.50 వేలు అందాల్సి ఉండగా, కేవలం రూ.17 వేలు మాత్రమే దక్కింది. కొబ్బరిదీ అదే దారి జల్లా వ్యాప్తంగా 8,050 హెక్టార్లలో కొబ్బరి సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి ప్రతి నిత్యం దాదాపు 50 లారీల కాయలు ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 175 కాయల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది కుంభమేళా సందర్భంగా ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. వెయ్యి కాయల ధర ఏకంగా రూ.32 వేలు పలికింది. ప్రస్తుతం అది కాస్తా రూ.8 వేలకు పడిపోయింది. ఇలా కొబ్బరి ధరల్లో ఒడిదొడుకులతో రైతులు నానా అవస్థలు పడ్డారు.అరటి రైతుల అవస్థలు జిల్లాలో 7,500 హెక్టార్లలో అరటి తోటలను సాగు చేస్తున్నారు. ప్రధానంగా చక్కెరకేళీ, ఎర్ర చక్కెరకేళీ, అమృతపాణి, కర్పూరం రకాలను ఇక్కడి రైతులు పండిస్తున్నారు. జిల్లా నుంచి నిత్యం సుమారు 40 లారీల్లో అరటి గెలలను వివిధ ప్రాంతాలు, రాష్టాలకు తరలిస్తారు. మే నెలలో 10 టన్నుల లారీ ధర రూ.2 లక్షలు పలికింది. అది కాస్తా ప్రస్తుతం రూ.40 వేలకు పడిపోయింది.ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం ధాన్యం విక్రయించిన 24 గంటల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం.. నెలలు గడిచినా నగదు ఇవ్వలేదు. గత రబీలో 3.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.632.6 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు చెల్లించేందుకు నెలలు గడిచింది. దీంతో రైతులకు ఆర్థికంగా అవస్థలు తప్పలేదు. వ్యవసాయం ఈ ఏడాది రైతులకు అష్టకష్టాలు చంద్రబాబు ప్రభుత్వ సహకారం కరవు ఆపై విపత్తులతో భారీ నష్టం ఖరీఫ్ను ముంచేసిన మోంథా తుపాను నేటికీ అందని నష్టపరిహారం -
పార్థుని సంస్కారం ప్రశంసనీయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): పార్థుని సంస్కారం ప్రశంసనీయమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. ఆయన శనివారం హిందూ సమాజంలో 31వ రోజు విరాట పర్వ ప్రవచనం ముగించి, ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. పాండవులు తన వద్దనే అజ్ఞాతవాసం ముగించారని తెలుసుకున్న విరాటరాజు అనందభరితుడవుతాడు. తన కుమార్తె ఉత్తరను వివాహం చేసుకోవాలని అర్జునుడిని కోరతాడు. అర్జునుడు దానిని అంగీకరించక, ఉత్తరను కోడలిగా చేసుకుంటానని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. ‘ఏడాది పాటు ఉత్తరకు నాట్యం నేర్పాను, ఆమె నన్ను ఆచార్యునిగా, తండ్రిగా భావించింది. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకుంటే లోకం నా నడవడిని శంకిస్తుంది. ఆమెను కోడలిగా చేసుకుంటే నన్నుగానీ, నీ కుమార్తెను గానీ ఎవరూ శంకించరు. నేనులోకాపవాదుకు భయపడతాను’ అన్న అర్జునుని ఉత్తమ సంస్కారం మనకు ఆదర్శం కావాలని సామవేదం అన్నారు. ఉత్తరాభిమన్యుల వివాహంతో విరాట పర్వం ముగిసింది. సినిమాల్లో చూపినట్లు వివాహానికి ముందు ఉత్తరాభిమన్యులు యుగళగీతాలను పాడుకోలేదని ఆయన అన్నారు. నేడు సామవేదంకు బ్రహ్మజోస్యుల పురస్కారం ప్రముఖ స్వాతంత్య్ర పోరాట యోధుడు, గాంధేయవాది, సీతానగరం ఆశ్రమ వ్యవస్థాపకుడు డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాన్ని సామవేదం షణ్ముఖశర్మ అందుకోనున్నారు. ఆదివారం ఉదయం 10.45 గంటలకు సీతానగరం కస్తూర్బా ఆశ్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుందని భగవత విరించి టీవీ నారాయణరావు వేదికపై వివరాలను వెల్లడించారు. -
పరుగు పోటీలకు ఎడ్లు, గుర్రాలు సిద్ధం
● వడిశలేరులో నేడు రాష్ట్ర స్థాయి పోటీలు ● విజేతలకు బహుమతులుగా మోటారు సైకిళ్లు రంగంపేట: సంక్రాంతి శోభను ముందుగానే తీసుకువస్తూ వడిశలేరు రాష్ట్ర స్థాయి గ్రామీణ క్రీడా సంబరానికి ముస్తాబైంది. ఆదర్శ రైతు దివంగత గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం, జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో 7వ వార్షిక రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారం నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సుమారు వంద ఎడ్ల బళ్లు, 50 గుర్రాలు ఈ పోటీల్లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అటు ఎడ్లు, గుర్రాల పరుగు పోటీలను వేర్వేరు ట్రాక్లపై ఒకే సమయంలో నిర్వహించడం ఈసారి ప్రత్యేకత. టైమ్ రికార్డింగ్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా విజేతలను నిర్ణయిస్తారు. బహుమతుల వివరాలు ఎడ్లబళ్ల పోటీలకు సంబంధించి సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలకు మొత్తం ఆరు మోటారు బైక్లు అందజేస్తారు. విజేతలకు మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, ద్వితీయ, తృతీయ బహుమతులుగా హోండా షైన్ ఇవ్వనున్నారు. 3టీ ఇన్నోవేషన్స్ సౌజన్యంతో 75 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నారు. గుర్రాల విభాగంలో మొదటి ఏడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు అందించనున్నారు. మొదటి బహుమతిగా రూ.40 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా 25 వేలు చొప్పున అందిస్తారు. మొత్తం ఏడుగురికి వీటిని అందజేస్తారు. -
సమాజానికి సాయితత్వం అవసరం
తాళ్లపూడి: నేటి సమాజానికి సాయితత్వం ఎంతో అవసరమని ఆధ్యాత్మిక వేత్తలు అన్నారు. బల్లిపాడులోని కాకర్ల రామయ్య ఫంక్షన్ హాల్లో షిరిడీ సాయి సేవాదళ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత షిరిడీ సాయి భక్త సమ్మేళనం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా సాయి ఆధ్యాత్మిక వేత్తలు అనఘానందస్వామి, కర్లపూడి కృష్ణ, సాయి శ్రీనివాస్, మధు సాయి, ఆదిపూడి సాయిరాం, రమణ మూర్తి తదితరులు సచ్ఛరిత్ర సాధన మార్గాలు, సమర్థ సద్గురుతత్వం, సాయి నామ మహిమలు, నేటి సమాజంలో సాయితత్వం ఆవశ్యకతపై ప్రసంగించారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. వచ్చిన భక్తులకు సాయి సచ్చరిత్ర పుస్తకాలు, విభూతి, ప్రసాదాలను పంపిణీ చేశారు. సంస్థ చైర్మన్ సింహాద్రి జనార్దనరావు, ఫౌండర్ కాళ్ల రత్నాజీరావు ఆధ్వర్యంలో తాళ్లపూడి రైస్ మిలర్స్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. అల్లూరి విక్రమాదిత్య, అప్పన రాజా, గోకవరపు సూరిబాబు, కొండూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. యూత్ రెడ్క్రాస్ సభ్యత్వ నమోదుకు కార్యాచరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విద్యార్థులను అధిక సంఖ్యలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సొసైటీల్లో సభ్యులుగా నమోదు చేయించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలల జాబితాను సేకరించి, ఆయా విద్యాసంస్థలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, విద్యార్థులను సభ్యులుగా నమోదు చేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రతి కళాశాల, పాఠశాలలో ఒక నోడల్ ఆఫీసర్ను నియమించి, సభ్యత్వ నమోదుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాకారానికి కృషి చేయాలన్నారు. విద్యా సంస్థల్లో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్న్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యానికి 5న బహిరంగ వేలం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో అక్రమ కేసులలో స్వాధీనం చేసుకున్న 33.85 క్వింటాళ్ల రేషన్ (పీడీఎస్) బియ్యాన్ని నిబంధనల మేరకు బహిరంగ వేలం విధానంలో విక్రయించనున్నట్లు జేసీ మేఘ స్వరూప్ శనివారం తెలిపారు. 2026 జనవరి 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ వద్ద గల పౌర సరఫరాల కార్యాలయంలో సంబంధిత అధికారుల సమక్షంలో ఆ ప్రక్రియ జరుగుతుందన్నారు. పాల్గొనే ఆసక్తి కలిగినవారు జనవరి 3న పౌర సరఫరాల అధికారి కార్యాలయంలో అందుబాటులో ఉంచిన బియ్యం నమూనాలను పరిశీలించుకోవచ్చన్నారు. అలాగే నిబంధనల ప్రకారం రూ.50 వేలు ధరావత్తు చెల్లించి, నిర్దిష్ట నమూనాలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఇప్పటికే 6ఏ కేసులు నమోదై, పెండింగ్లో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఈ ప్రక్రియలో పాల్గొనడానికి అనర్హులన్నారు. హిందువులందరూ ఏకం కావాలి కరప: భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు హిందువులందరకూ ఏకం కావాలని కాకినాడ గీతాశ్రమం స్వామీజీ దివ్యానంద సరస్వతి పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాల్లో భాగంగా శనివారం నీలయ్య తోటలోని ఒకలే అవుట్లో మండల సహ కన్వీనర్ కొక్కెరమట్ల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2.50 లక్షల హిందూ సమ్మేళనాలు నిర్వహించాలన్న ఆశయంలో ఇంత వరకూ 1.50 లక్షల సమ్మేళనాలు జరిగాయన్నారు. హిందూ ధర్మాన్ని దశ దిశలా వ్యాపింపజేయాలన్నారు. -
పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి
● విద్యుత్ ఓసీ ఉద్యోగుల డిమాండ్ ● కాకినాడలో సంఘ వార్షికోత్సవం కాకినాడ రూరల్: పదోన్నతుల్లో సీనియారిటీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్డలోని జి.కన్వెన్షన్ హాల్లో శనివారం రాష్ట్ర స్థాయిలో సంఘ 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దూళిపాల వెంకట రంగారావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో 2026 సంవత్సర కేలండర్, డైరీలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వరుపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి హాజరయ్యారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓసీల ప్రయోజనాల కోసం పోరాటానికి విద్యుత్ సంస్థలో విద్యుత్ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘాన్ని ప్రారంభించామన్నారు. ముఖ్యంగా ఓసీలకు ప్రతిభ ఉన్నా ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల వలన అన్యాయం జరుగుతోందన్నారు. పదోన్నతుల్లో రిజర్వేషన్ల కంటే సీనియారిటీకే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉద్యోగుల పీఆర్సీ, న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫారం నేషనల్ ప్రెసిడెంట్ ఎం.నాగరాజు, ఓసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి, సౌత్జోన్ ఏఐఈఎఫ్ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్ డల్, ఈపీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ అప్పలరాజు, కంపెనీ సెక్రటరీ త్వరగా రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ప్రాంతీయ అధ్యక్షుడు కేవీవీ రమణ, కాకినాడ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు డి.సురేష్బాబు, జ్యోతుల వీరబాబు, బొజ్జా వాసు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
కల్తీ పెట్రోలు కొట్టారంటూ ఆగ్రహం
పెట్రోల్ బంక్ను సీజ్ చేసిన అధికారులు జగ్గంపేట: కాట్రావులపల్లి గ్రామంలోని శ్రీజయలక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్లో కల్తీ పెట్రోల్ కొడుతున్నారంటూ వినియోగదారులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు పరిశీలించి తేడాలు గుర్తించి బంక్ను సీజ్ చేశారు. ఆ వివరాల ప్రకారం.. కాట్రావులపల్లిలో ఆ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోలు కొట్టించుకున్న మోటార్ సైకిళ్లు కొద్దిరోజులుగా మరమ్మతులకు గురవుతున్నాయి. ఒక్కసారిగా చాలా మోటారు సైకిళ్లు పాడవడంతో మెకానిక్లు పెట్రోల్లో తేడా వల్లే ఇలా జరిగిందని వివరించడంతో సుమారు 28 మంది వాహనదారులు పెట్రోల్ బంక్ వద్ద సాయంత్రం ఆందోళనకు దిగారు. తమ వాహనాల మరమ్మతులకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో యాజమాన్యానికి, వినియోగదారుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాధరావు ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ నేపథ్యంలో జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ సమాచారంతో జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి సత్యనారాయణ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు, పెట్రోల్ సాంద్రత, నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంద్రతలో చాలా తేడాలు గుర్తించామని చెప్పారు. దీని ప్రకారం కల్తీ జరిగిందని నిర్ధారణకు వచ్చి బంక్ సీజ్ చేశామని, అలాగే యజమాని కనిగిరి వెంకట రమణమూర్తి, గుమస్తా వాకాడ రమేష్పై 6ఏ కేసు నమోదు చేశామని తెలిపారు. కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ను తాత్కాలికంగా జగ్గంపేటలోని ఎస్ఆర్ బంక్ అప్పగించామని చెప్పారు. జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ, వీఆర్వో కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● మంచి మార్కులకు దోహదం
దస్తూరి అందంగా ఉంటేనే మంచి మార్కులు వస్తాయి. ప్రజెంటేషన్ బాగా చేయడానికి దస్తూరి ఒక కారణంగా చెప్పవచ్చు. ఏకాగ్రతతో 10 రోజులు సాధన చేస్తే కచ్చితంగా అద్భుతమైన చేతిరాతను సొంతం చేసుకోవచ్చు. వేల మందికి చేతిరాతను తీర్చిదిద్దడంలో తర్ఫీదునిచ్చాను. –కుంచే బాలకృష్ణ, కాలిగ్రాఫర్, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ), జెడ్పీహెచ్ఎస్, తొండవరం ● మెలకువలు నేర్చుకోవాలి చేతిరాతను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే కొన్ని మెలకువలు తప్పనిసరిగా పాటించాలి. పెన్ను పట్టుకునే విధానం కూడా చేతిరాతను మారుస్తుంది. ప్రతి రోజూ కొంత సమయాన్ని చేతిరాతను తీర్చిదిద్దుకునేందుకు కేటాయించాలి. చేతిరాత బాగుంటే తలరాత కూడా మారుతుంది. –టి.గణేశ్వరరావు, హ్యేండ్ రైటింగ్ ఇంప్రూవర్, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), కాండ్రకోట, పెద్దాపురం మండలం ● తప్పుల్లేకుండా రాయాలి ముత్యాల్లాంటి అక్షరాలతో మంచి మార్కులను సంపాదించవచ్చు. చేతిరాత మెరుగుపర్చేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. సమాధానాలు దిద్దేవారికి సులభంగా అర్థమైనప్పుడే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది. తక్కువ రాసినా తప్పుల్లేకుండా అందంగా రాయడం వల్ల మంచి మార్కులు సాధించవచ్చు. –సీహెచ్ జాన్ప్రసాద్, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం, ప్రత్తిపాడు -
క్రీస్తు మార్గం అనుసరణీయం
రాజమహేంద్రవరం రూరల్: మానవాళికి ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని వక్తలు పునరుద్ఘాటించారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి నేతృత్వంలో కొంతమూరు క్రీస్తు నిరీక్షణాలయ ప్రాంగణంలో మెగా క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్వెస్లీ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, పార్టీ కొవ్వూరు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి తదితరులు ప్రసంగించారు. ‘తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును’ అనే క్రీస్తు బోధన అక్షర సత్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే విషయాన్ని తనకు చెప్పేవారని, ఆయన చెప్పిన మాటలు నేటికీ పాటిస్తున్నానని వెల్లడించారు. కరుణ, దయతో ఏసుక్రీస్తు లోకానికి కొత్త మార్గాన్ని చూపారని, ఆ మార్గం ఆచరణనీయమని వేణు అన్నారు. క్రీస్తు జననం శాంతికి సంకేతమని, తన జీవితం, మరణం ద్వారా లోకానికి సరైన మార్గాన్ని ఏసుప్రభువు చూపారని భరత్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రిస్టియన్ సంస్థలు సేవా తత్పరతతో సాగుతున్నాయని, ప్రతి ఒక్కరూ స్వార్థాన్ని వీడాలని జాన్వెస్లీ అన్నారు. క్రిస్టియన్ మైనారిటీ శాఖ రూపకల్పనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాంది పలికారని, ఆయన చొరవతోనే క్రైస్తవులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తలారి వెల్లడించారు. సేవకులు, విశ్వాసులతో కలిసి కేక్ కట్ చేసి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వక్తలు, ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
రాతనాల్లా మార్చుకుందామా..
ఫ మంచి దస్తూరితో భవితకు బాట ఫ పదో తరగతిలో మంచి మార్కులకు దోహదం ఫ విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్న ఉపాధ్యాయులు రాయవరం/ ప్రత్తిపాడు: మా అబ్బాయి చాలా బాగా చదువుతాడు.. కానీ అందుకు తగ్గట్టుగా మార్కులు రావడం లేదు.. మా అమ్మాయి లెక్కలు బాగా చేస్తోంది. సూత్రాలు, ఫార్ములాలు మాత్రం ఎందుకో తప్పుగా కనిపిస్తుంటాయని ఉపాధ్యాయులు తరచూ చెప్పే మాటలివి.. ఇందుకు కారణం చేతిరాతే. ‘రాత బాగుంటే గీత బాగుంటుంది’ అన్న నానుడి పరీక్ష రాసే విద్యార్థికి ‘అక్షరాలా’ సరిపోతుంది. మంచి దస్తూరి ఉంటే మూల్యాంకనం సమయంలో సమాధాన పత్రాలు దిద్దే ఉపాధ్యాయుడికి మంచి భావన కలుగుతుంది. ఆ ప్రభావం మార్కులపై ఉంటుంది. అందుకే పరీక్షల్లో తెలివితో పాటు అక్షరాలు కూడా ఆయుధాలుగా పనిచేస్తాయని ఉపాధ్యాయులు చెబుతారు. ఇవి పాటిస్తే మంచిది ఫ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అంగుళం మార్జిన్ విడిచి పెట్టాలి. ఫ సమాధాన పత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా ఉండాలి. ఫ అక్షరాలు వంకర టింకరగా, గజిబిజిగా ఉంటే మార్కులు తగ్గినట్టే. ఫ పేజీకి 16 నుంచి 20 లైన్లకు మించకుండా రాయాలి. ఫ సమాధానాలు రాసే సమయంలో ప్యాడ్పైకి వాలిపోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయాలి. ఫ రెండు పదాల మధ్య ఒక అక్షరం లేదా ‘0’ పట్టేంత ఖాళీ స్థలం ఉండాలి. రెండు వరుసల మధ్య అర అంగుళం దూరం వదలాలి. ఫ కంటికి పేపరుకు 30–35 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ఫ అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే లైనులో ఉంటేనే రాత అందంగా వస్తుంది. ముందుగా ఫోర్ రూల్, తర్వాత డబుల్ రూల్, అనంతరం సింగిల్ రూల్పై ప్రాక్టీస్ చేయాలి. ఫ ఇంగ్లిష్లో కర్సివ్, లుసిడా రైటింగ్ను ప్రాక్టీస్ చేయాలి. వరుస క్రమంలో కనీసం పది రోజులు తర్ఫీదు తీసుకోవాలి. ఫ మొదటగా లెటరింగ్, తర్వాత వర్డింగ్, అనంతరం సెంటెన్సెస్ రాయడం నేర్చుకోవాలి. ఫ గొలుసుకట్టు రాత ఉండకూడదు. ప్రతి అక్షరం ఒకే పరిమాణంలో రాయాలి. ఫ పెన్నును మామూలుగా పట్టుకోవాలి. బిగుసుగా పట్టుకుంటే వేగంగా రాయలేం. అక్షరాల స్పష్టతకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫ ప్రాథమిక స్థాయి నుంచే మంచి రాత అలవాటు చేసుకోవాలి. తెల్ల కాగితంపై వరుస తప్పకుండా రాయగలగాలి. సాధనతోనే సాధ్యంప్రతి విద్యార్థికి తెలివి తేటలకు తోడు, సమయ పాలనకు, సహనానికి దస్తూరి ఓ సూచికగా చెప్పవచ్చు. అందుకే మంచి దస్తూరి ఉన్న విద్యార్థులే దాదాపు టాపర్లుగా నిలుస్తున్నారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి దిద్దుబాట్లు, కొట్టివేతలు లేకుండా రెండున్నర గంటల్లో స్పష్టంగా పరీక్ష రాయాలి. అందుకే ఇప్పుడు అందరి దృష్టి చేతిరాతపై పడింది. ఇందుకు తగిన తర్ఫీదును ఉపాధ్యాయులు ఇస్తూ సాధన చేయిస్తున్నారు. పరీక్ష నెమ్మదిగా రాస్తే సమయం సరిపోదు. వేగంగా రాసేటప్పుడు తప్పులు దొర్లకుండా చూసుకోవాలి.ఇలా చేయాలంటే ముందుగా ప్రత్యేక తరగతులు, స్లిప్, గ్రాండ్ టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు. ముత్యాల్లాంటి అక్షరాలు మంచి మార్కులు తెచ్చిపెడతాయి.. విద్యార్థి భవితకు బాటలు వేస్తాయి.. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళిక ప్రకారం అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించడంతో పాటు, మంచి దస్తూరితో అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.. మనం ఏం రాశామన్నది పేపర్లు మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం అయ్యేట్టు ఉంటేనే ఎక్కువ మార్కులు వస్తాయి.. దీనికోసం మంచి దస్తూరిపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే పదో తరగతి పరీక్షల్లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. -
‘ఎగ్’నామం పెట్టేందుకా?
బాలాజీచెరువు (కాకినాడ): మధ్యాహ్న భోజన పథకం అపహాస్యం అవుతోంది.. సంబంధిత ప్రైవేట్ ఏజెన్సీలు మధ్యాహ్న భోజనంలో మెనులో భాగంగా ఉడకబెట్టిన గుడ్లను నిర్వాహకులకు పంపిస్తుండగా, ఇందులో రోజుకు 10 నుంచి 20 వరకూ పాడైపోతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పాడైన గుడ్లు వచ్చాయి. వాటిని వారు తినకుండా వదిలేశారు. ఇక్కడ మొత్తం 240 మంది మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో రోజూ సుమారు పది వరకూ గుడ్లు పాడవుతున్నాయని చెబుతున్నారు. ఈ విషయమై అధికారులకు చెబుతున్నా మార్పు ఉండటం లేదని పలువురు వాపోతున్నారు. స్నేహితుడిపై దాడి: వ్యక్తికి జైలు కాకినాడ లీగల్: స్నేహితుడిపై దాడి చేసిన వ్యక్తికి 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నిరూప భంజ్ డియో శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. తిమ్మాపురానికి చెందిన కొప్పిశెట్టి రాజేష్ అదే ప్రాంతానికి చెందిన జియ్యన శ్రీమన్నారాయణ స్నేహితులు. వారి మధ్య కక్షలు ఉండడంతో శ్రీమన్నారాయణపై రాజేష్ రాయితో దాడి చేశాడు. దీనిపై తిమ్మాపురం పోలీసులు 2022లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో రాజేష్పై నేరం రుజువు కావడంతో 9 నెలల జైలు, రూ.మూడు వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
జాతీయ మహిళా క్రికెట్కు ఎంపిక
దేవరపల్లి: మండల కేంద్రమైన దేవరపల్లికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయి మహిళా క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల కృష్ణా జిల్లా నున్నలో అండర్–17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరిగాయి. ఇందులో స్థానిక భాష్యం స్కూలు విద్యార్థినులు జి.తస్యశ్రీ, టి.యశశ్రీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టులో ఆడి ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయికి ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ పేరయ్య నాయుడు తెలిపారు. 31న పింఛన్ల పంపిణీ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను ఈ నెల 31న పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కీర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమయానికి పంపిణీ జరిగేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ‘కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) ధర్మరాజును కేవలం మానవమాత్రుడేనని అనుకోరాదని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో కొనసాగిస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా కీచక వధ వృత్తాంతాన్ని శుక్రవారం ఆయన వివరించారు. ‘‘నిండు సభలో కామరోగ పీడితుడైన కీచకుడు.. ద్రౌపదిని కాలితో తన్ని అవమానిస్తాడు. ఆ రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో భీముని వద్దకు వెళ్లి ద్రౌపది తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. ‘యుధిష్టిరుని భర్తగా పొందిన సీ్త్ర.. శోకం లేనిదెలా అవుతుంది? – అశోచ్యత్వం కుతస్తస్యాః యస్యా భర్తా యుధిష్ఠిరః’ అని తీవ్ర దుఃఖంతో అంటుంది. భీముడు సాంత్వనవచనాలతో ఆమెను ఓదార్చి, కీచకుడిని నర్తనశాలకు రాత్రి వేళ రావాల్సిందిగా ఆహ్వానించాలని, వాడిని అక్కడే గుట్టుగా మట్టు పెడతానని చెబుతాడు. ద్రౌపది తన తొందరపాటును నిందించుకుంటూ, ఆవేశంలో, దుఃఖాన్ని తట్టుకోలేక, ధర్మరాజు గురించి పరుషమైన పదాలు పలికానని, ఆ మహానుభావుని దివ్యత్వం తనకు తెలుసునని అంటుంది. ‘ఎవని చరిత్రము ఎల్ల లోకాలకు గురుస్థానంలో నిలచి పూజనీయమవుతుందో, ఎవని కడగంటి చూపు మానిత సంపదలు కలగచేస్తుందో, అట్టి మహానుభావుడు ధర్మరాజును కేవలం మానవమాత్రుడని అనుకోరాదు. కేవల మర్త్యుడె ధర్మసుతుడు?’ అని తన అంతరంగాన్ని వెల్లడిస్తుంది. చక్కగా అలంకరించుకుని నర్తనశాలకు వచ్చిన కీచకుడిని భీముడు గుట్టుగా మట్టు పెడతాడు. అతడి పార్థివ శరీరంతో పాటు ద్రౌపదిని దహనం చేయాలనుకున్న ఉపకీచకులు 105 మందిని భీముడు వధిస్తాడు. హస్తినలో వేగుల ద్వారా కీచకుని మరణ వార్త విన్న దుర్యోధనుడు ఈ పని చేసింది భీముడేనని, కీచకుడు మనసు పడ్డ సైరంధ్రి ద్రౌపది అనే నిర్ణయానికి వస్తాడు. ధర్మరాజు ఉన్న రాజ్యం సుఖశాంతులతో ఉంటుందని భీష్ముడు చెబుతాడు’’ అంటూ సామవేదం వివరించారు. అప్పటికే పాండవుల అజ్ఞాతవాస గడువు పూర్తయిందని అన్నారు. -
సానుకూల దృక్పథంతో లక్ష్య సాధన
రాజమహేంద్రవరం రూరల్: విద్యార్థులు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని సాధించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి, టెలికమ్యూనికేషన్ మంత్రి పెమ్మ సాని చంద్రశేఖర్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కాతేరు తిరుమల విద్యా సంస్థల ఆవరణలో శుక్రవారం మెడ్సినాప్స్–2025 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దీనికి తిరులమ విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ నీట్–2025లో ఉత్తీర్ణత సాధించిన తిరుమల విద్యార్థుల్లో 251 మంది వివిధ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. 2011లో 700 మంది విద్యార్థులతో ప్రారంభమైన తిరుమల విద్యా సంస్థలో నేడు 43 వేల మంది విద్యార్థులు ఉండడం వెనుక ఒక కఠోరమైన శ్రమ ఉందన్నారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతంలో విద్యా సంస్థలు అంటే గుంటూరు, విజయవాడ మాత్రమే అనుకునేవారని, ఇప్పుడు రాజమహేంద్రవరంలో తిరుమల విద్యాసంస్థలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం ఆనందదాయకమన్నారు. రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు నేర్చుకోవాలన్నారు. హైదరాబాద్ యశోధ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యురాలు కోన లక్ష్మీకుమారి మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఎంతో నిబద్ధతతో పనిచేయాలన్నారు. తిరుమల విద్యాసంస్థల అధినేత నున్న తిరుమలరావు మాట్లాడుతూ నీట్–2025లో ఆలిండియా 19వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రాజమహేంద్రవరం విద్యార్థి సాధించారన్నారు. అలాగే రాజమహేంద్రవరం క్యాంపస్ నుంచి 188 మంది వైద్య సీట్లు సాధించారన్నారు. వైద్య సీట్లు సాధించిన విద్యార్థులకు స్టెత్స్కోప్, జ్ఞాపికలను ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేశారు. అకిరా కంటి ఆసుపత్రి అధినేత డాక్టర్ ఎన్.ప్రభాకరరావు, తిరుమల విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ శ్రీరేష్మి, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ సతీష్బాబు, ప్రిన్సిపాల్ శ్రీహరి పాల్గొన్నారు. -
చిన్నారి ప్రాణాలు కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్ వైద్యులు ఒక పసివాడి ప్రాణాలు కాపాడారు. ఆ వివరాల్లోకి వెళితే.. పండా విజయదుర్గ అనే మహిళ మూడు రోజుల నుంచి జీజీహెచ్లోని న్యూరో మెడిసిన్ విభాగంలో ఫిట్స్తో చికిత్స పొందుతుంది. ఆమెకు ఎనిమిది నెలల కుమారుడు. ఆస్పత్రిలో తల్లితో పాటు ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం ఆ చిన్నారి ఆడుకుంటూ అక్కడే ఉన్న మెంతోప్లస్ బామ్ డబ్బా ప్రమాదవశాత్తూ మింగేశాడు. డబ్బా బయటకు రాక ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయం గుర్తించిన తల్లి విజయదుర్గ తోటి రోగుల సహాయంతో బాలుడిని కింద అంతస్తులోని అత్యవసర విభాగంలో చేర్చింది. అప్పటికే బాలుడి నోటి నుంచి రక్తం కారడం మొదలైంది. తక్షణమే స్పందించిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుష్మ, సహ వైద్యులు సత్యవాణి, మాణిక్యం, కాంతిమ సహకారంతో అరగంట పాటు శ్రమించి బాలుడి గొంతు నుంచి మెంతోప్లస్ బామ్ డబ్బాను బయటకు తీసి ప్రాణాలు నిలిపారు. వైద్యుల కృషిని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి అభినందించడంతో పాటు బాలుడి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. -
సాయి తత్వాన్ని అందరూ తెలుసుకోవాలి
తాళ్లపూడి: సాయి అంటే ఒక కులానికి, ఒక మతానికి చెందిన వారు కాదని, సమస్త జీవులందరిలో ఉన్నారని, ఆ మహనీయుడు పంచిన ప్రేమ, శాంతి, క్షమ గుణాలను అందరూ ఆచరించి సాయి తత్వం తెలుసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. మండలంలోని బల్లిపాడు కాకర్ల రామయ్య ఫంక్షన్ హాలులో హైదరాబాద్కు చెందిన శ్రీ షిర్డీ సాయి సేవాదళ్ ఆధ్వర్యాన శుక్రవారం అఖిల భారత శ్రీ షిర్డీ సాయి భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తొలుత తాళ్లపూడిలోని సాయిబాబా ఆలయం వద్ద పూజలు, అభిషేకాలు నిర్వహించి, బల్లిపాడు వరకూ పల్లకీతో బాబా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగిన సమ్మేళనంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాయి భక్తులు ఎం.మహీధర్రెడ్డి, సుబ్రహ్మణ్యరెడ్డి, మైనంపాటి ప్రసాద్, పిప్పళ్ల ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. బాబా సంకీర్తనలు, భజనలు, లీలలు, వేదాంత రహస్యాలు, బాబా ప్రవచనాలు, అవతార విశిష్టత, మధ్యాహ్న హారతి, ఉపనిషత్తుల సారం, సాయి తత్త్వం వంటి అంశాల గురించి వివరించారు. సంస్థ చైర్మన్ సింహాద్రి జనార్దనరావు, ఫౌండర్ కాళ్ల రత్నాజీరావు ఆధ్వర్యాన తాళ్లపూడి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో అప్పన రాజా, గోకవరపు సూరిబాబు, మండల రైస్ మిల్లర్ల సంఘం సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
కాకినాడ టు శబరిమల
ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్ర నగరి: సాధారణంగా అయ్యప్ప భక్తులు పంబ నుంచి, లేకుంటే ఎరిమేలి నుంచి పెద్ద పాదలో గానీ పాదయాత్రగా శబరి కొండపైకి వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం పరిపాటి. అయితే కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ఇద్దరు భక్తులు 1,470 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అయ్యప్ప దర్శనానికి వెళ్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా, తణుకు మండలం మండపాక గ్రామానికి చెందిన అర్జున్ (63), కాకినాడ రూరల్ రేపూరు గ్రామానికి చెందిన ముమ్మిడి భవానిశంకర్ (44) అయ్యప్ప స్వామి మాల ధరించారు. 18 ఏళ్ల క్రితం అర్జున్ స్వామి తన 18వ శబరియాత్రను చేపట్టగా, ముమ్మిడి భవాని శంకర్ కన్నిస్వామిగా మాల ధరించి ఆయన వెంట కాకినాడ నుంచి శబరికొండ వరకు పాదయాత్రగా వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆపై ఇరువురు సొంతంగా అయ్యప్ప ఆలయాలను నిర్మించి కలసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఇద్దరూ పాదయాత్ర చేసినా కలసి వెళ్లలేదు. మరో 18 ఏళ్లకు వారి ఆశయం నెరవేరింది. ఇద్దరూ వారి ప్రాంతాల్లో నూతన అయ్యప్ప ఆలయాల నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఏడాది కలసి పాదయాత్ర ప్రారంభించారు. భవానీ శంకర్ 18వ సారి శబరి యాత్ర చేస్తుండగా, అర్జున్ స్వామి 36వ సారి తన యాత్రను కొనసాగిస్తున్నారు. వారు శుక్రవారం చిత్తూరు జిల్లా నగరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ యాత్ర వివరాలను మీడియాకు తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోరుతూ ఇరుముడి ధరించి 1,470 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగిస్తున్నామన్నారు. భవానీ శంకర్ నవంబరు 30న రేపూరు నుంచి యాత్రను ప్రారంభించగా, అర్జున్ స్వామి డిసెంబరు 4వ తేదీ తణుకు నుంచి యాత్రను ప్రారంభించారు. 22 రోజులుగా కలసి యాత్ర కొనసాగిస్తున్నామని మకర జ్యోతికి శబరిమలకు చేరుకుంటామని వారు తెలిపారు. వేల కిలోమీటర్ల యాత్రలో.. శబరి కొండకు వీరు చేసే యాత్రలు విని అందరూ నోరెళ్లబెడుతున్నారు. వీరిలో అర్జున్ స్వామి ఏడుసార్లు ఇలా తణుకు నుంచి శబరి కొండకు ఇరుముడితో పాదయాత్ర చేశారు. ఇందులో నాయుడుపేట మీదుగా మూడు సార్లు, సేలం, దిండిగల్ మీదుగా రెండు సార్లు, తిరుత్తణి, అరకోణం మీదుగా రెండు సార్లు పాదయాత్రగా వెళ్లగా, మోటారుసైకిల్ మీదుగా మూడుసార్లు, సైకిల్పై ఐదుసార్లు యాత్ర కొనసాగించారు. ప్రస్తుతం 62 సంవత్సరాల వయస్సులో ఇరుముడి ధరించి పాదయాత్ర చేస్తున్న ఈయన భక్తికి పరవశించి అందరూ ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు. గణపతి గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నానని ఆయన తెలిపారు. ముమ్మిడి భవానీశంకర్ నాలుగు సార్లు పాదయాత్రగా వెళ్లగా, ఒకసారి బైక్యాత్ర చేశారు. ప్రస్తుతం ఐదవసారి యాత్ర చేస్తున్నారు. వేలు గురుస్వామి ద్వారా తాను ఈ భక్తిమార్గంలో నడుస్తున్నాని ఆయన తెలిపారు. పెట్రోలు బంకులు, ఆశ్రమాలు, గుళ్ల వద్ద తలదాచుకుంటూ మార్గంలో ఉన్న ప్రముఖ పుణ్య క్షేత్రాలు దర్శించుకుంటూ యాత్రను కొనసాగిస్తున్నారు.


