East Godavari
-
జేఈఈ అడ్వాన్స్డ్–2026 ఫలితాలలో తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక జేఇఇ అడ్వాన్స్డ్ పరీక్షలో తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్లు తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో తమ విద్యార్థులు దేవశ్రీవేద్ 3వ ర్యాంకు, ఆకేటి సాయిసత్యరిత్విక్ 18వ ర్యాంకు, యవ్వాకుల సత్యసాత్విక్నాయుడు 29వ ర్యాంకు, గొల్లా ప్రభవ్తేజ 41వ ర్యాంకు, మోకా రోహన్ సందేష్ 90వ ర్యాంకు సాధించారన్నారు. ఇంకా 151, 159, 165, 172, 221, 230, 237, 256, 269, 275, 287, 297 ర్యాంకులు సాధించారన్నారు. 1000లోపు 79మంది ,3000లోపు 207మంది, 5000లోపు 318మంది, 10,000లోపు 456మంది ర్యాంకులు సాధించారన్నారు. సుమారు 320మంది విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించగలరని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
12 వరకు ప్రభుత్వ పాలనపై నిరసన కార్యక్రమాలు
రాజానగరం: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తూ రెండేళ్లు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వ పాలనపై ‘వెన్ను పోటుకు రెండేళ్లు’ పేరుతో ఈ నెల 12వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ని బుధవారం కోరుకొండలో విడుదల చేస్తామన్నారు. 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ హామీలు, బాండ్లను దగ్ధం చేసే కార్యక్రమాలు జరగాలన్నారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీలో జాప్యం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సర్వర్లో సమస్యలు తలెత్తడంతో జిల్లాలో సోమవారం పింఛన్ల పంపిణీ మందగించింది. జిల్లాలో మొత్తం 2,68,564 మంది లబ్ధిదారులకు రూ.118,84,95,000 పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేయల్సి ఉండగా 83 శాతం మాత్రమే పింఛన్లు అందచేయగలిగారు. ఉదయం ఇవ్వవలసిన పింఛన్లు మధ్యాహ్నానికి కాని అందజేయలేకపోయారు. మరి కొందరికి మంగళవారం వచ్చి ఇస్తామని వెళ్లిపోయారు. దీంతో పింఛన్లు అందని వారు ఆందోళన చెందారు. జేఈఈ అడ్వాన్స్డ్లో ‘శ్రీ షిర్డీసాయి’ విజయ భేరి ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో రాజమహేంద్రవరం శ్రీ షిర్డీ సాయి జునియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారని విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య తెలిపారు. తమ లక్ష్య ఐఐటీ అకాడమీలో శిక్షణ పొందుతున్న బీఏవీవీ భార్గవ్ 47, ఎం.శ్రీనివాసరెడ్డి 54, బీఎస్ నిషాంత్ 222, ఎం.శ్రీనివాస్ 246, బీఎస్ నిహాంత్ 387, ఎ.లోహిత్కుమార్ 885 ర్యాంకులు సాధించారని సోమవారం చెప్పారు. ఆరుగురు వెయ్యి లోపు, 12 మంది 2 వేల లోపు, 18 మంది 5 వేల లోపు, 22 మంది 10 వేల లోపు, 32 మంది 20 వేల లోపు ర్యాంకులు సాధించినట్టు వివరించారు. విజేతలను చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ అభినందించారు. -
ఇది మెగా కాదు.. దగా డీఎస్సీ
చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్సీ. డీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయి. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తామని దారుణంగా మోసం చేశారు. స్పోర్ట్స్ కోటా పోస్టులను అమ్ముకున్నారు. డీఎస్సీ నియామాకాలపై ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది మానేసి ప్రశ్నిస్తున్న వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. డీఎస్సీ పరీక్షలు రాసిన యువతతో ఆటాలాడుకుంటున్నారు. యువతకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదు. –చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అనుమానాలు నివృత్తి చేయాలి డీఎస్సీ నిర్వహణపై నిరుద్యోగ యువతలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగా డీఎస్సీ లక్షలాది కుటుంబాలను ప్రభావితం చేసే అంశం. మెరిట్ లిస్ట్ ప్రకటించకపోవడం, కేవలం ఎంపికై న అభ్యర్థులకే ఎస్ఎంఎస్లు పంపించడం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పక్కాగా పరీక్షలు నిర్వహించినప్పుడు జాబితా, మెరిట్ లిస్టు, మార్కుల వివరాలు బహిర్గతం చేయాలి. డీఎస్సీ జిల్లా స్థాయి టాపర్, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంక్ వచ్చిన అభ్యర్థి పేరు జాబితాలో మాయం కావడం అనుమానాస్పదం. – డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంట్ కో ఆర్డినేటర్ చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుదాం బందిపోటు కంటే హీనమైన వ్యక్తి చంద్రబాబు. ఉద్యోగాలు ఇస్తానంటూ డీఎస్సీ అభ్యర్థులను ఊరించి అన్యాయం చేశారు. చంద్రబాబును క్షమించాల్సిన అవసరం లేదు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో ఉద్యమించి తీరుతాం. ఇలాంటి అక్రమాలను, అన్యాయాలను ఏమాత్రం సహించబోం. యువత, నిరుద్యోగులు, ప్రజలు సంఘటితంగా ఉద్యమించి చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. –జక్కంపూడి విజయలక్ష్మి, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు -
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు ఆజ్యం
మోసానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు ఇలా.. అన్ని వర్గాలను మోసం చేస్తోంది. మెగా డీఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయి. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్మేశారు. స్పోర్ట్స్ కోటాలో గతంలో కొన్ని క్రీడలు, అంతర్జాతీయంగా అడిన వారికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం వాటి సంఖ్య భారీగా పెంచేశారు. జిల్లా స్థాయిలో ఆడినట్లు సర్టిఫికెట్లు ఉన్నా.. ఉద్యోగం కట్టబెట్టేశారు. ఒక్కో ఉద్యోగం రూ.15 లక్షలకు అమ్ముకున్నారు. అక్రమ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కలెక్టరేట్లో మెరిట్ లిస్ట్ పెట్టాలి చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చేసింది. జాబితా విడుదలలో పారదర్శకత లేదు. ప్రతి జిల్లా కలెక్టరేట్లో మెరిట్ లిస్టు పెట్టాలి. చంద్రబాబు ప్రభుత్వం వారికి నచ్చినట్టుగా మార్చేసుకుంది. తద్వారా డీఎస్సీ పోస్టులు అమ్మకానికి పెట్టి బడాబాబులు జేబులు నింపుతున్నారు. వెంటనే మెగా డీఎస్సీపై పూర్తిస్థాయి విచారణ జరపాలి. స్పోర్ట్స్ కోటా, కాల్ లెటర్లు, రిజర్వేషన్లపై ఆరోపణలు వచ్చాయి. నష్టపోయిన వారికి న్యాయం చేయాలి. – మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదికి ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. నాలుగేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారు. కేవలం ఇచ్చిన ఒక డీఎస్సీ 16 వేల ఉద్యోగాల్లోనే ఎన్నో అవకతవకలు జరిగాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగాలు ఎంతో పారదర్శకంగా ఇచ్చాం. ఎవరూ వేలెత్తిచూపకుండా చర్యలు తీసుకున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ ఉద్యోగాలు మార్కెట్లో అమ్మకానికి పెట్టడం దారుణం. – నాగులాపల్లి ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం సిట్టింగ్ జడ్జ్తో విచారణ చేపట్టాలి డీఎస్పీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడింది. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను వెంటనే బర్తరఫ్ చేయాలి. ఆయన శాఖలో జరిగిన అవినీతిపై ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం దారుణం. దీన్ని బట్టి చూస్తే అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అర్థం అవుతోంది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ యువజన విభాగం పోరాడుతుంది. – కంఠమని రమేష్, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
దగా డీఎస్సీపై దండయాత్ర
చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై వైఎస్సార్ సీపీ యువజన విభాగం కదం తొక్కింది. వైఎస్సార్ సీపీ, యువజన విభాగం, ప్రజలు, అభ్యర్థులు సంయుక్తంగా నిరసన బాట పట్టారు. బూటకపు డీఎస్సీపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్ల కార్డుతో పార్టీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మిసాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్, సీటీఆర్ఐ: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, తక్షణం విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాయి. వైఎస్సార్ సీపీ శ్రేణులు, యువజన నాయకులు, ప్రజలు, డీఎస్సీలో అన్యాయానికి గురైన బాధితులు బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘ మీ సుపుత్రుడి శాఖలో డార్క్ ఆపరేషన్ను ఎందుకు దాచిపెడుతున్నారు? మెగా లీక్.. మెగా అవినీతి.. మెరిట్ లిస్టు మాయం..మెగా డీఎస్సీకాదు.. దగా డీఎస్సీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా అక్కడే కూర్చుని ధర్నా చేపట్టారు. ప్రభుత్వ అవినీతిపై నేతలు చేసిన నినాదాలకు కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. అనంతరం మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాల వీర్రాజు (బాబు), తోట రామకృష్ణ, నగరపాలక సంస్థ డివిజన్ల ఇన్చార్జి మింది నాగేంద్ర, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆరే చిన్ని, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శులు దాట్ల పృథ్వీ, చాపరాజ, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి రుక్కియా సయ్యద్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి విప్పర్తి ఫణి, రాష్ట్ర రైతు విభాగ సంయుక్త కార్యదర్శి వెలుగుబంటి అచ్యుతరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు బొప్పన సుబ్బారావు, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ ఆరీఫ్ పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్ సీపీ, యువజన విభాగం ఆధ్వర్యంలో పోరుబాట బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయింపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, ధర్నా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ -
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీప్రకాష్ విద్యార్థి ప్రతిభ
తుని: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె.మోనిష్ కుమార్ ఓబీసీ కేటగిరిలో 167 ర్యాంకు, జనరల్ కేటగిరిలో 974 ర్యాంకు సాధించాడని ప్రిన్సిపాల్ వివిఎస్ఎస్.భానుమూర్తి సోమవారం తెలిపారు. శ్రీప్రకాష్లో స్కూల్ లెవెల్ నుంచి ఇస్తున్న పొసైటీ ఫర్ ప్రమోటింగ్ ఎకడమిక్ ఎక్స్లెన్స్ ఇన్ స్కూల్ (స్పేసెస్), శ్రీప్రకాష్ అచీవర్స్ అకాడమీ(స్పా) ఇంటిగ్రేటేడ్ ప్రోగ్రాం ద్వారా తమ విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకె. నరసింహరావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్, ఉపాధ్యాయులు అభినందించారు. -
అలా.. హామీల జెల్ల
● ఉమ్మడి జిల్లాకు పలు సందర్భాల్లో చంద్రబాబు వాగ్దానాలు ● నేటికీ అతీగతీ లేని వైనం ● నేడు చామవరంలో సీఎం పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగాను, ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తరువాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఆ సందర్భంగా ఎడాపెడా అనేక హామీలు ఇచ్చారు. అవేవీ ఆచరణకు నోచుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సోమవారం ఆయన పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే జనం గంపెడాశతో ఎదురు చూస్తూంటారు. ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడి నుంచి వెళ్లిన నెలకో, రెండు నెలలకో కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తారు. కానీ, గతంలో పలు సందర్భాల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ అమలుకు నోచలేదు. సీఎం పర్యటన సందర్భంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇలా తమకు జెల్ల కొట్టడం మాని, ఈసారైనా ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లాకు జెల్ల గతంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్సీ) 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఒక్క ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాకినాడ తీరంలో పారిశ్రామికీకరణను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. కానీ, ఒక్క పరిశ్రమ కూడా ఇప్పటి వరకూ పట్టాలెక్కిన దాఖలాల్లేవు. కాకినాడ ఎస్ఈజెడ్లో పరిశ్రమలు తెస్తానన్న హామీ కూడా గాల్లో కలిసిపోయింది. కోనసీమ.. ఒట్టి మాటలేనమ్మా..! సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం వచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తెస్తామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా ఇటు పర్యాటక అభివృద్ధీ లేదు.. అటు కొత్తగా కొబ్బరి అనుబంధ పరిశ్రమల ఊసూ లేదు. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉండటంతో ‘సీమ’ ప్రజలు పెదవి విరుస్తున్నారు. సీఎం అయిన తరువాత చంద్రబాబు గత ఏడాది మే 31న కాట్రేనికోన మండలం చెయ్యేరులో జరిగిన పీ4 కార్యక్రమానికి వచ్చారు. ఆ సందర్భంగా చెయ్యేరు చెరువు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన పనులు ఏడాదవుతున్నా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. స్వయంగా సీఎం చెప్పిన పనులకే దిక్కూమొక్కూ లేకుండా పోతే ఎలాగని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ‘తూర్పు’ తిరిగి దండమే.. గత ఏడాది ఏప్రిల్ 18న, ఈ ఏడాది చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా సందర్భాల్లో నిడదవోలులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చారు. నిడదవోలు పట్టణం పాటు ఆ మండలంలోని 23, చాగల్లు మండలంలోని 10 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ ఆసుపత్రి నిర్మాణంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టతా లేదు. ఎర్ర కాలువపై కంసాలపల్లి – మాధవరం వంతెన, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు హామీ ఎప్పుడు అమలవుతుందా అని 1,152 మంది టిడ్కో లబ్ధిదారులు ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వంతెన నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో నిడదవోలు మండలం కంసాలపల్లి, తాడేపల్లిగూడెం మండలం మాధవరం తదితర గ్రామాల రైతులు నిరాశ చెందుతున్నారు. అలాగే, గత ఏడాది జూలై 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా 5 ఎత్తిపోతల పథకాల మోటార్లు, పంపుల మరమ్మత్తులకు నిధుల మంజూరు, కొవ్వూరు డిగ్రీ కాలేజీకి భవనాలు, మౌలిక వసతుల కల్పన, కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేయడం వంటి హామీలిచ్చారు. అలాగే, చెంతనే గోదావరి ప్రవహిస్తున్నా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ఆ నది నీరు గుక్కెడు కూడా అందని సమస్యపై సానుకూలంగా స్పందించారు. కానీ, ఇవేవీ నేటికీ ఆచరణకు నోచుకోలేదు. గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని జనం అడుగుతున్నారు సార్!ఇంకా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 జనవరి 10న కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు మోపారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, రూ.50 బాటిల్ను రూ.200కు అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ, ఆయన గద్దెనెక్కిన రెండేళ్లుగా బీరు, బ్రాందీ, విస్కీ ఇలా ఏ బ్రాండ్ మద్యమైనా ప్రతి బాటిల్పై మద్యం మాఫియా రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా దోచుకుంటున్నా కనీస స్పందన కూడా లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పదేపదే హామీ ఇచ్చారు. కానీ, ఆయన గద్దెనెక్కిన తరువాత ఆ హామీ కాస్తా గాల్లో కలసిపోయిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు, అటు భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. తాజా పర్యటన సందర్భంగా గత హామీలపై చంద్రబాబు ఏం చెప్తారో.. కొత్తగా ఏ మాటల గారడీతో మభ్యపెడతారోనని అంటున్నారు. -
రైతు సంక్షేమం కోసమే ముందస్తు నీరు
● మంత్రి కందుల దుర్గేష్ ● గోదావరి డెల్టాకు ఖరీఫ్ నీటి విడుదల ● బ్యారేజీ మరమ్మతులకు రూ.148 కోట్లు ధవళేశ్వరం/నిడదవోలు: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగు నీటిని విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి ఆదివారం డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులతో వచ్చిన మంత్రి దుర్గేష్ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. తొలుత గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ముందస్తుగానే నాట్లు వేసుకొని పంటలను రక్షించుకోవాలని సూచించారు. గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ మూరలశెట్టి సునీల్ కుమార్, పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ శ్రీ మురళీకృష్ణరాజు, చీఫ్ ఇంజినీర్ చినబాబు, ధవళేశ్వరం ఎస్ఈ జి.శ్రీనివాసరావు, ఈఈ రామకృష్ణ, విజ్జేశ్వరం ఈఈ రమేష్ బాబు పాల్గొన్నారు. పశ్చిమ డెల్టాకు నీరు వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్విచ్ ఆన్ చేసి విజ్జేశ్వరం హెడ్ స్లూయిస్ నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు గోదావరి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా హెడ్ స్లూయిస్ను ప్రత్యేకంగా అలంకరించారు. ప్రభుత్వం కాటన్ బ్యారేజీ గేట్ల మరమ్మతులకు రూ.148 కోట్లు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. కాలువల మరమ్మతులకు మరో రూ.13 కోట్లు విడుదల చేసి, సాగునీటి సంఘాల ద్వారా 80 శాతం పనులు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. శెట్టిపేట ఈఈ రమేష్బాబు, తాడేపల్లిగూడెం డీఈ కె.ధర్మజ్యోతి, నిడదవోలు ఏఈ ఎంవీవీ పెద్దిరాజు పాల్గొన్నారు. -
సత్యదేవుని ఆలయం.. భక్తజన సంద్రం
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయం భక్తజన సంద్రమే అయ్యింది. వందలాది వాహనాల్లో భక్తులు ఉదయం నుంచీ రావడంతో రత్నగిరి, సత్యగిరి పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా సైతం వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3 వేల వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సూర్య భగవానుడు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఉష్ణోగ్రతతో చెలరేగిపోవడంతో భక్తులు అల్లాడిపోయారు. చెట్ల నీడన, విశ్రాంతి మండపాల్లోను సేద తీరారు. ఆలయం చుట్టూ గ్రీన్ షేడ్ ఏర్పాటు చేసినప్పటికీ ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పైబడితే వేడి దిగిపోయి, భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. తూర్పు రాజగోపురానికి ఉత్తరం వైపు విశ్రాంతి షెడ్డు ఉంది. అటువంటి షెడ్డు ఆలయం చుట్టూ నిర్మిస్తే ఏ కాలమైనా భక్తులకు ఉపశమనంగా ఉంటుంది. అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
మట్టి తవ్వకాలకు చెక్
తాళ్లపూడి: మండలంలోని గజ్జరం గ్రామంలోని కృష్ణమ్మ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు, రవాణాకు అధికారులు చెక్ పెట్టారు. ఈ విషయమై ‘చెరువు మట్టి స్వాహా’ పేరుతో ప్రచురితమైన కథనంపై ఇరిగేషన్ అధికారులు, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్పందించి సమాచారం సేకరించి గజ్జరంలో సాగుతున్న మట్టి తవ్వకాలను నిలిపివేయించినట్టు సమాచారం. సొంత పార్టీలోనే అసమ్మతి గజ్జరం చెరువులో సాగుతున్న మట్టి దోపిడీని కొందరు స్థానిక టీడీపీ నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్, టీడీపీ నాయకుడు దండమూడి శేషు ఆదివారం సోషల్ మీడియాలో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు నియోజకవర్గంలో వైరల్గా మారింది. అధికారుల అనుమతితోనే కృష్ణమ్మ చెరువులో మట్టి తవ్వకాలు అని ఆ వీడియోలో ప్రకటించడంపై అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో వచ్చిన వార్తలపై పోలీస్ శాఖ కూడా స్పందించి రహస్యంగా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. జలసిరి’ లేదు.. అనుమతులూ లేవు ఈ అక్రమ తవ్వకాలపై ఇరిగేషన్ ఏఈ రాహుల్ మాట్లాడుతూ తాళ్లపూడి మండలంలో ‘జలసిరి’ కార్యక్రమం కింద ఏ ఒక్క చెరువూ మంజూరు కాలేదని స్పష్టం చేశారు. గుర్తించిన పనులన్నీ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయన్నారు. చెరువులో మట్టి తవ్వేందుకు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, ఒకవేళ చెరువు లోతు పనులు చేపట్టాల్సి వస్తే కేవలం ఉపాధి పథకం ద్వారానే చేయాల్సి ఉంటుందని, అక్కడ యంత్రాలు (జేసీబీలు) ఉపయోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఆ ‘రహస్య హస్తం’ ఎవరిది? మూడు రోజులుగా మట్టి రవాణా జోరుగా సాగుతోంది. అధికారులు అనుమతులు లేవని చెబుతున్నా. అధికార పార్టీ పెద్దల పేర్లు చెప్టి మట్టి తరలిస్తున్నవారెవరు? రైతుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేయమన్నది ఎవరు? ఈ అక్రమ దందా వెనుక ఉన్న ‘రహస్య హస్తం’ ఎవరిది? అనే ప్రశ్నలు స్థానికంగా వెల్లువెత్తుతున్నాయి. సత్ప్రవర్తనతో మెలగాలి రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేర నియంత్రణ, శాంతిభద్రత పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర ఉన్న వ్యక్తులకు ఆదివారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక చర్యల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, రవాణా చేస్తే తీవ్ర చర్యలు తప్పవని న్నారు. రౌడీ షీటర్లు, క్రైమ్ సస్పెక్ట్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎటువంటి గొడవలు, నేరాలలో పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మొండి వైఖరి వీడని మిల్లు యాజమాన్యం
● విధులకు హాజరుకాని కార్మికులు ● 70 మంది కార్మిక నాయకులపై వేటు! కడియం: మండలం మాధవరాయుడుపాలెంలోని ఏపీ పేపరు మిల్లు యాజమాన్యం మొండి వైఖరి వీడడం లేదు. లాకౌట్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించినప్పటికీ కార్మికులపై ఆంక్షలు పెట్టడంతో వారు విధులకు హాజరు కాకుండా నిరసన కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పర్మెనెంట్ కార్మికులు 11 మంది, కాంట్రాక్టు కార్మికులు 59 మినహా మిగిలిన వారు విధులకు హాజరు కావచ్చంటూ ఏకపక్షంగా మిల్లు యాజమాన్యం ఆఫర్లు ఇస్తోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాడిన నాయకులను లక్ష్యం చేసుకుని యాజమాన్యం సాధిస్తోందని వారంటున్నారు. భవిష్యత్తులో పోరాటాలకు తావులేకుండా చేయాలన్న లక్ష్యంతో ఆ 70 మందిపై వేటు వేస్తోందని కార్మికులు చెప్తున్నారు. రాజమహేంద్రవరం పేపర్ మిల్లు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కందుల దుర్గేష్లకు క్లాస్ తీసుకున్న మర్నాడే ఇక్కడి మిల్లు లాకౌట్ ఎత్తేశారు. అయినప్పటికీ 70 మంది కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు మాత్రం యాజమాన్యం నిరాకరించింది. అంతే కాకుండా సమ్మె కాలంలో కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి కచ్చితమైన హామీ ఇవ్వలేదు. వేతన పెంపు, మౌలిక సదుపాయాలు, కార్మికుల పర్మెనెంట్ తదితర అంశాలను ప్రస్తావించలేదు. కార్మిక చట్టాలను అమలు చేయకపోయినా, పన్నులు చెల్లించకపోయినా.. వ్యర్థాలను నేరుగా నదీజలాల్లోకి వదిలేస్తున్నా.. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు మిల్లుకు వంతపాడుతుండడమే యాజమాన్యం మొండి వైఖరికి ప్రధాన కారణంగా ప్రజలు భావిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం తగిన చర్యలు చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ● పరిహారం కోసం మృత దేహంతో బాధిత కుటుంబం ధర్నా ● పోలీసులు నచ్చజెప్పడంతో విరమణ కోరుకొండ: స్థానిక శ్రీరంగపట్నానికి చెందిన వ్యవసాయ కూలీ కర్రి అప్పలరాజు (50) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల మేరకు ఈనెల 26వ తేదీన అప్పలరాజును రాజమహేంద్రవరంలోని ప్రముఖ సంస్థకు చెందిన వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయనను జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా ఢీకొన్న వాహనానికి చెందిన సంస్థ యాజమాన్యం బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అంబులెన్స్లోని మృతదేహంతో ధర్నా చేశారు. సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఎస్సై రమేష్ వాహనం ఢీకొట్టిన రోజే కేసు నమోదు చేశామని, బీమా వచ్చిన వెంటనే పరిహారం అందుతుందన్నారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు అప్పలరాజుకు అంత్యక్రియలు నిర్వహించారు. -
డీఎస్సీ అక్రమాలపై నేడు వైఎస్సార్ సీపీ ధర్నా
రాజమహేంద్రవరం రూరల్: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై సోమవారం వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో బొమ్మూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు బొమ్మూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లనున్నట్టు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, పార్టీ యువజన విభాగ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత, డీఎస్సీ బాధితులు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు. -
వేద గోదారిలో జూదఘోష!
● జిల్లా వ్యాప్తంగా జోరుగా పేకాట ● కూటమి నేతల అండదండలతో నిర్వహణ ● నిత్యం రూ.కోట్లలో చేతులు మారుతున్న వైనం ● ప్రత్యేక వాహనాల్లో జూదరుల తరలింపుసాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి జిల్లాలో జూదం జడలు విప్పుతోంది. అనధికార పేకాట శిబిరాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి జూదగాళ్లను తీసుకొచ్చి మరీ ఆడిస్తున్నట్టు తెలుస్తోంది. శని, ఆది వారాలు, సెలవు రోజుల్లో ఈ జూదాలు మరింత శృతి మించుతున్నాయి. రోజూ రూ.కోట్లలో చేతులు మారుతున్నాయి. కూటమి నేతల కనుసన్నల్లో ఈ దందా సాగుతుండడంతో ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదు. పేకాటపై గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కూటమి ప్రభుత్వంలో జూదగాళ్లకు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజమహేంద్రవరంలో రంజుగా.. నగరంలో అల్కాట్గార్డెన్స్, క్వారీ మార్కెట్, లింగంపేట, సీతంపేట, గోదావరి గట్టు, లంకల్లో జూదం విచ్చలవిడిగా జరుగుతోంది. నిత్యం సాయంత్రం 3 గంటల అనంతరం లంకల్లోకి వెళ్తున్న జూదరులకు అక్కడే మందు, విందు ఏర్పాటు చేస్తున్నారు. ఓ టీడీపీ నేత కనుసన్నల్లో ఈ తంతు సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆటలోకి ఎంట్రీ ఫీజు సైతం వసూలు చేస్తున్నట్లు తెలిసింది. గెలిచిన వ్యక్తి లాభంలో 20 శాతం నిర్వాహకులకు సమర్పించుకునేలా నిబంధలు పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి మరీ జూదం ఆడిస్తున్నారు. నగరంలోని నాలుగు పేకాట కేంద్రాల ద్వారా నిత్యం రూ.2 కోట్లకు పైగా సొమ్ము చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇటీవల నగరంలోని ఓ టీడీపీ నేత నిర్వహిస్తున్న పేకాట అడ్డాలో విజయవాడ నుంచి రహస్యంగా వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు రూ.కోటి పట్టుకున్నట్లు తెలిసింది. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. అనపర్తిలో.. అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అనధికారిక పేట శిబిరాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి బిక్కవోలు మండలం వూలపల్లి, పందలపాక, రంగంపేట మండలం వడిశలేరు, అనపర్తి మండలం పొలమూరు, అనపర్తి నగరంలో పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. కొవ్వూరులో.. పట్టణంలో ఓ ఫంక్షన్ హాల్లో అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ నిత్యం ఆట రంజుగా సాగుతోందని, ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ఆటగాళ్లు కార్లు, ద్విచక్ర వాహనాల్లో వస్తుండటంతో ఆ పరిసరాల్లో సందడి నెలకొంటోందని తెలుస్తోంది. రెండు శిబిరాల్లో రోజుకు రూ.కోటికిపైగా చేతులు మారుతున్నట్లు తెలిసింది. చాగల్లు మండలంలో.. కవలపల్లి, చిక్కాల గ్రామాల్లో గరువు పొలాలు పేకాట స్థావరాలుగా మారాయి. కవలపల్లిలో అనధికార జూదం నడుస్తోంది. ● రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ, రాఘవపురం, కోటికేశ్వరం, జంబూపట్నం, దోసకాయలపల్లిలలో నిత్యం అనధికారిక పేకాట శిబిరాలు సాగుతున్నాయి. వీటిపై అధికారుల స్పందన కరువడం, కూటమి నేతల ఆధ్వర్యంలో నడుస్తుండటంతో అటువైపు కన్నెతి చూసేవారు లేరు. సింగవరంలో.. నిడదవోలు మండలం సింగవరం గ్రామం పేకాట, ‘కోడిపందేలకు పెట్టింది పేరు. ఇతర జిల్లాల నుంచి భారీగా ఇక్కడికి తరలి వస్తారు. ప్రతి రోజూ రూ.కోట్లల్లో పందేలు నడుస్తుంటాయి. ఇక్కడి పరిస్థితి ‘మూడు ముక్కలు ఆరు కోళ్లు’ అన్న చందంగా మారుతోంది. శని, ఆది వారాల్లో పక్క జిల్లాల నుంచి ఆటగాళ్లు భారీగా తరలివస్తున్నారు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.కోటి, శని, ఆదివారాల్లో రూ.2 కోట్లు చేతులు మారుతున్నాయి. ఇటీవల పేకాటలో స్వాధీనం చేసుకున్న డబ్బుల్లో తేడాలు రావడంతో ఉన్నతాధికారులు ఓ కన్నేశారు. ఆరా తీసి అప్పట్లో పెరవలి ఎస్సై, నిడదవోలు సీఐలు వీఆర్కు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఖండవల్లి, ముక్కామలలో పేకాట జోరందుకుంటోంది. కానూరు, తీపర్రుల్లో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పేకాటగాళ్లు వస్తుంటారు. ఉండ్రాజవరం మండలంలో సైతం ఇదే సాగుతోంది. పోలీసుల పాత్రపై అనుమానాలు..? పేకాట కేంద్రాలపై అప్పుడప్పుడు పోలీసులు దాడులు నిర్వహిస్తున్నా.. ఎక్కువగా చిన్నస్థాయి నిర్వాహకులు లేదా ఆడేవారిపైనే కేసులు నమోదు అవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అసలు శిబిరాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లకు నెలవారీ మామూళ్లు చేరుతున్నాయన్న ప్రచారం కూడా స్థానికంగా చర్చకు దారితీస్తోంది. అందుకే పెద్ద నాయకుల అనుచరులు నిర్వహించే శిబిరాల జోలికి పోలీసులు వెళ్లరన్న వాదనలు వినిపిస్తున్నాయి. పేదలే సమిధలు పేదలు, మధ్య తరగతి ప్రజల బతుకులలో పేకాట పెను ప్రభావం చూపుతోంది. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బును వారు జూద క్రీడలో పెడుతున్నారు. ఆటలో ఓడి అప్పులపాలవుతున్నారు. తిరిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకుని అప్పుచేసి డబ్బులు తీసుకెళుతున్నారు. ఇలా ప్రతి సారి నిరాశే ఎదురవుతోంది. వెరసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి పాత రోజులు తీసుకువెళ్తోంది. జాతర ముసుగులో.. సీతానగరం మండలం చిన్న కొండేపూడిలో జాతర ముసుగులో శనివారం రాత్రి భారీ ఎత్తున పేకాట ఆడించినట్లు ఆరోపణలున్నాయి. క్యాసినో తరహాలో ఈ దందా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలతో ఈ జూదంలో ఆడినట్టు సమాచారం. టెంట్లు వేసి ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి ఆడించినట్లు తెలిసింది. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన పేకాట దిగ్గజాలందరూ ఇక్కడ ఆటలో పాల్గొన్నట్లు సమాచారం ఉన్నా పోలీసులు ఆవైపు కన్నెత్తి చూడకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రగ్బీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
పిఠాపురం: స్థానిక ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆదివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాల బాలికల రగ్బీ జట్టును ఎంపిక చేశారు. దీనికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 49 మంది హాజరుకాగా, 12 మంది బాలికలు, 12 మంది బాలురను ఎంపికయ్యారు. వీరందరూ జూన్ 6, 7 తేదీల్లో పల్నాడు జిల్లా నందిగామలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్ రగ్బీ బాల బాలికల పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రగ్బీ చైర్మన్ వియ్యపు రమణరాజు, సెక్రటరీ పి.కృష్ణ, కోచ్ పి.లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పవన్, బి.వంశీ, జి.శివప్రసాద్, సురేష్ వ్యవహరించారు. -
ఆపసోపాలు
గతమెంతో ఘనం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధికి గుజరాత్కు చెందిన అమూల్ డెయిరీతో ఒప్పందం కుదుర్చుకుని జగనన్న పాల వెల్లువ పథకాన్ని అమలు చేసింది. అతివలు పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా వృద్ధి చెందారు. ఆ సంస్థ ఆధునిక పరికరాలతో పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యతను బట్టీ లీటరు గేదె పాలు రూ.80 నుంచి రూ.100కి, ఆవు పాలు రూ.60 నుంచి రూ.80 వరకూ అందించే ఏర్పాటు చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడు సార్లు పాల సేకరణ ధరలను పెంచి రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది. 2022 మే 19న హైడ్రాలిక్ సిస్టమ్తో కూటిన వైఎస్సార్ సంచార వైద్యశాలను ఏర్పాటు చేశారు. ప్రమాదంలో మృతి చెందిన పశువుల బీమా కోసం కేవలం రూ.340 ప్రీమియంతో మూడేళ్ల కాల వ్యవధితో కూడిన వైఎస్సార్ పశు బీమా పథకం అమలు చేసింది. ఫ రెండేళ్లుగా పాడి పరిశ్రమకు ప్రోత్సాహం కరవు ఫ చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు కష్టాలు ఫ నేడు ప్రపంచ పాల దినోత్సవం కపిలేశ్వరపురం: పాడి, పంటలు ప్రగతికి మెట్లు.. ఈ రెండూ జొడెడ్ల బండ్లు.. వీటికి పాలకులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.. అదే చేసింది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం. అప్పట్లో అమలు చేసిన పథకాలను ప్రస్తుత చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. రెండేళ్ల పాలనలో ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రగతి మెట్లు ఎక్కించిన దాఖలాలు లేవు. జూన్ 1న ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. జిల్లాలో 2.75 లక్షల పశు సంపద ఉండగా, ఇందులో 1.30 లక్షల పాడి పశువులు ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు సగటున 7.80 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంది. ఇందులో 3.15 లక్షల లీటర్లు వర్తకుల ద్వారా ఇంటింటికీ చేరుతున్నాయి. జిల్లాలోని పశువులకు వైద్యం చేసేందుకు 9 ప్రాంతీయ ఆసుపత్రులు, 40 డిస్పెన్సరీలు, 21 రూరల్ లైవ్స్టాక్ యూనిట్లు ఉన్నాయి. పాలు చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఆరోగ్యదాయకం. ఇందులో పుష్కలంగా విటమిన్లు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, ఆమ్లాలు, లవణాలు, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి, మనుషుల అభిరుచిని బట్టి ఆవు, గేదె, మేక పాలను తాగుతారు. వీటన్నింటిలో పోషక విలువలు దాదాపు ఒకేలా ఉంటాయి. గేదె పాలలో వెన్నశాతం ఎక్కువగా, కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉంటాయి. మేక పాలు త్వరగా జీర్ణమవ్వడంతో పాటు ఎలర్జీ సమస్యలు తక్కువ వస్తాయి. లాక్టోస్ శాతం ఆవు పాలలో కంటే మేక పాలల్లో కొంచెం తక్కువ. పాలతో పాలకోవా, పన్నీరు, పెరుగు, మజ్జిగ, లస్సీ తదితర వాటిని తయారు చేస్తారు. స్వీట్ల తయారీలో నెయ్యి కీలకమైంది. తొలి మెట్టు ఇక్కడే.. పాల ఉత్పత్తి, పశువుల్లో చూడు శాతం పెంపుదల లక్ష్యంతో ప్రస్తుత బాపట్ల జిల్లా నిడుబ్రోలులో 1962లో రాష్ట్ర పశు సంవర్థక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. కపిలేశ్వరపురం జమిందారు, అప్పటి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎస్బీపీబీకే సత్యనారాయణరావు ప్రోద్భలంతో ఈ కేంద్రాన్ని 1963లో మండపేటకు తరలించారు. ఆరంభంలో దేశ విదేశీ పశు వైద్యులు ఇక్కడ శిక్షణ పొందేవారు. ఇప్పుడు స్వదేశీ పశు వైద్యులు ఏడాదికి సుమారు 150 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.60 లక్షల పాల కేంద్రాల ద్వారా పాలను సేకరిస్తున్నారు. పాలు కల్తీ జరిగితే ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబరు 1800 425 3857, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ హెడ్ ఆఫీస్ నంబరు 08645 297245కు సమాచారాన్ని చెప్పొచ్చు. పశు పోషణ... ఎంతో భారం ప్రస్తుతం ఎండుగడ్డి కొరత కారణంగా పశు పోషణ ఇబ్బందిగా మారింది. యంత్రాలతో కోసిన వరి గడ్డి పశుగ్రాసంగా పనికిరాదు. గతంలో ఎకరా వరి గడ్డి రూ.5 వేలు కాగా, ప్రస్తుతం రూ.9 వేల నుంచి రూ.11 వేలు పలుకుతోంది. పశుగ్రాసం ఇంటికి చేరుకోవడానికి కూలి, రవాణా ఖర్చులు రూ.13 వేల నుంచి రూ.15 వేల వరకూ అవుతాయి. తౌడు, చిరునూక దాణా బస్తా రూ.1,500 పలుకుతుంది. పాలన.. అవస్థల మాటున పాడి పరిశ్రమ అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 50 కిలోల బస్తా దాణా రూ.1,100 ఉండేది. ఇప్పుడు ఆ ధర కాస్తా రూ.1,500కి చేరింది. ఆర్ఎస్కే కేంద్రాల్లో పశు పోషకులకు 50 కిలోల దాణా రూ.550కు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్నప్పటికీ ఆచరణలో దాని ప్రభావం అత్యల్పం. గత చంద్రబాబు ప్రభుత్వంలో మినీ గోకులాల నిర్మాణానికి చెల్లించాల్సిన రాయితీ సొమ్మును ఎగ్గొట్టింది. తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బకాయిలు తాలుకూ కొంత సొమ్మును పాడి రైతులకు జమ చేసింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.10 లక్షలతో మెగా కమ్యూనిటీ గోకులం నిర్మిస్తామంటూ హడావుడి చేస్తుంది. మా తండ్రిని పోగొట్టుకున్నా.. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగిన ఘటనలో నా తండ్రి కడలి కృష్ణారావు ప్రాణాలు కోల్పోయారు. మమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా పెంచిన తండ్రిని కల్తీ కాటు వేయడం మా కుటుంబ సభ్యుల్ని కలచివేసింది. పాలను స్వచ్ఛమైన ఆహారంగా చెబుతారు. ఆ స్వచ్ఛత ఇప్పుడు లేకపోవడం విచారకరం. –సూరంపూడి శ్రీలక్ష్మి, అంగర పెట్టుబడులు భరించలేక.. నా పశువుల మకాంలో 15 గేదెలను మేపేవాడిని. పెట్టుబడులను భరించలేక ప్రస్తుతానికి ఐదు గేదెలు, ఒక ఆవును మాత్రమే మేపుతున్నాను. రోజుకు ఒక్కో పశువుకు అర కిలో చొప్పున జొన్నలు, తవుడు, పత్తి పిండి ఉదయం సాయంత్రం దాణాతో పాటు పెడతాం. కిలో జొన్నలు రూ.22, పత్తి పిండి రూ.30, శెనకచెక్క రూ.26, తవుడు రూ.17 ధర ఉంది. ఎకరా ఎండుగడ్డి రూ.11 వేలు పలుకుతుంది. ఇన్ని కష్టాలు పడితే లీటరు పాలు సేకరణ కేంద్రంలో రూ.80 చొప్పున మాత్రమే వస్తుంది. –సాధనాల శివభగవాన్, పాడి రైతు, మండపేట కలవరపెడుతున్న కల్తీ చారిత్రక రాజమహేంద్రవరంలో కూటమి ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 16న కల్తీ పాల సరఫరా ఘటన మొత్తం మానవ సమాజాన్ని భయాందోళనకు గురిచేసింది. సంపూర్ణ ఆహారంగా కీర్తించే పాలు కల్తీ కావడంతో 21 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అందులో 17 మంది కిడ్నీలు పాడై ప్రాణాలను కోల్పోయారు. -
చెట్టు పైనుంచి జారిపడి వ్యక్తి మృతి
కాకినాడ క్రైం: చెట్టు పైనుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ద్వారకానగర్కు చెందిన కుప్ప పోతురాజు (47) దినసరి కూలి. అతను ఆదివారం ఉదయం రామారావుపేట శివాలయం సమీపంలో ఉన్న కొబ్బరిచెట్టు ఎక్కి కొబ్బరి బొండాలు కొడుతూండగా చెట్టుపై నుంచి కాలు జారి పడిపోయాడు. ఈ ఘటనలో పోతురాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కట్టుకున్న భర్తే కాలయముడై.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే ఘటన అనపర్తి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్తే అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన సురేంద్ర బగర్ భీమవరంలోని రొయ్యల ఫ్యాక్టరీలో పని చేసేవాడు. ఆ సమయంలో సహచరిణి, ఒడిశా రాష్ట్రానికే చెందిన ఉష ఎక్క (26)ను ప్రేమించాడు. పరస్పర అంగీకారంతో గతేడాది డిసెంబర్లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం బతుకుదెరువు కోసం సురేంద్ర కాపవరంలోని ఫౌల్ట్రీ కాంప్లెక్స్కు వచ్చి అక్కడే గదుల్లో నివాసం ఉంటున్నాడు. ఉష హైదరాబాద్లో పనిచేస్తుంది. ఇటీవల ఫౌల్ట్రీలో పనిమానేసి ఒడిశా వెళ్లిన సురేంద్ర, రెండు రోజుల క్రితమే భార్య, తమ్ముడితో కలసి తిరిగి ఫౌల్ట్రీకి వచ్చాడు. అయితే ఉష ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో, ఆమె కుటుంబ సభ్యులు తనను చంపేస్తారనే భయంతో శనివారం రాత్రి నుంచి సురేంద్ర పిచ్చిపిచ్చిగా ప్రవర్తించసాగాడని, ఆదివారం తెల్లవారు జూమున పనికి కూడా వెళ్లలేదని చెబుతున్నారు. తోటి కార్మికులు ఉదయం పని ముగించుకొని వచ్చేసరికి సురేంద్ర ఒంటిపై రక్తపు మరకలను చూసిన వారు యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు క్వార్టర్లోకి వెళ్లి చూడగా, రక్తపు మడుగులో పడి ఉన్న ఉషను చూసి 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వచ్చి ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఉషను చిన్న గొడ్డలితో సురేంద్ర విచక్షణా రహితంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయినట్టు సీఐ తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకుల మృతి
దేవీపట్నం: రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఇందుకూరుపేటకు చెందిన అయినాల త్రిమూర్తులు, గంగాధర్ తండ్రీ కొడుకులు. ఆదివారం మోపెడ్పై వీరు ఇందుకూరుపేట నుంచి ముసుళ్లకుంట వైపు వెళ్తున్నారు. గోకవరం, దండంగి ఆర్అండ్బీ రహదారిలో ఎం.రావిలంక, ముసుళ్లకుంట గ్రామాల మధ్యలో ప్రమాదకర మలుపులో వీరి వాహనాన్ని పోశమ్మగండి నుంచి గోకవరం వైపు వెళుతున్న నలుపు రంగు కారు ఢీకొంది. ఈ ఘటనలో తండ్రి అయినాల త్రిమూర్తులు (60) అక్కడికక్కడే మృతిచెందాడు. గంగాధర్ (35) తీవ్రంగా గాయపడగా, గోకవరం ఆసుపత్రికి తరలించారు. అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆ నంబర్ ప్లేటే ఆధారం తండ్రీ కొడుకుల ప్రయాణిస్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. అయితే ఘటనా ప్రాంతంలో వీరిని ఢీకొన్న కారు నంబరు ప్లేటు సగభాగం విరిగి పడిపోయింది. దీనిని పోలీసులు గుర్తించి, ఆ కారును గుర్తించే పనిలో ఉన్నారు. ఈ మేరకు దేవీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పినాయిల్ తాగి యువతి ఆత్మహత్య
కొత్తపేట: మనస్తాపానికి గురై ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. కొత్తపేట అడిషనల్ ఎస్సై వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన అడపా ఈశ్వరరావు కుమార్తె భవానీ (21) కొత్తపేట మండలం అవిడి గ్రామంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి వరకూ చదువుకుంది. రెండు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి భవానీ పినతల్లి కుమార్తె పుట్టినరోజు అమ్మమ్మ ఇంట్లోనే నిర్వహించారు. ఆ సందర్భంగా భవానీకి, ఆమె పినతల్లికి ఖర్చు విషయంలో వాగ్వాదం జరిగింది. దానితో మనస్తాపం చెందిన భవానీ రాత్రి ఇంట్లో ఉన్న పినాయిల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వెంటనే బంధువులు కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందింది. దీనిపై మృతురాలి తాత రేలంగి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం అంటూ ఆందోళన భవానీకి వైద్యం అందించే విషయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ఆమె బంధువులు ఆరోపించారు. ఈ మేరకు అవిడి గ్రామానికి చెందిన పలువురు నాయకుల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి వచ్చి వైద్యులు, సిబ్బందిని నిలదీశారు. సంబంధిత వైద్యుడు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్ను ‘సాక్షి’ వివరణ కోరగా, పినాయిల్ తాగిన యువతికి డ్యూటీ డాక్టర్, సిబ్బంది తగిన చికిత్స అందించారని, అబ్జర్వేషన్లో ఉండగానే ఫిట్స్ వచ్చి మృతి చెందినట్టు తెలిపారు. అయితే ఆమె పినాయిల్ తాగిందా? లేక మరేదైనా తీసుకుందా? అనేది పోస్టుమార్టం రిపోర్టులో తేలాల్సి ఉందన్నారు. -
బండెనక బండి.. బరి తెగించారండి!
ఫ చెలరేగిపోతున్న మట్టి మాఫియా ఫ దేవస్థానం భూముల్లో యథేచ్ఛగా తవ్వకాలు ఫ పట్టించుకోని అధికారులు కరప: ఈ చిత్రం చూస్తే ఏదో ఇండస్ట్రీ నెలకొల్పి, వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తారేమో అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇది మట్టి మాఫియా బరి తెగింపునకు పరాకాష్ట. మమ్మల్ని ఆపేదెవరంటూ రేయింబవళ్లు అదేపనిగా మట్టిని తరలించుకుపోతున్నారు. కరపలోని దేవదాయ శాఖ భూముల్లో జరుగుతున్న తంతు ఇది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. కరపలో విష్ణ్వాలయం, శివాలయాలు ఉన్నాయి. వీటికి దేవదాయ శాఖ ఆధీనంలో విష్ణ్వాలయానికి సంబంధించి వేణుగోపాల స్వామివారికి సుమారు 18 ఎకరాలు, శివాలయానికి సంబంధించి రామలింగేశ్వర స్వామివారికి సుమారు 22 ఎకరాల పంట భూమి ఉంది. ఈ భూములకు మూడేళ్లకోసారి బహిరంగ వేలం పాట నిర్వహించి, పంట భూముల సాగుకు పాడుకున్న రైతులకు అప్పగిస్తారు. రైతులు ఎకరానికి ఒక్కొక్క పంటకు 10 బస్తాల చొప్పున కౌలుకు లెక్కకట్టి, తమ కాయకష్టాన్ని కలుపుకొని పాట పాడతారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్ల క్రితం అధికార పార్టీ నాయకుల కన్ను దేవస్థానం భూములపై పడింది. వేలం పాట సమయంలో సదరు నాయకులు వెళ్లి దేవుడికి ఆదాయం పెంచుతామని బిల్డప్ ఇచ్చి హెచ్చురేటుకు, అంటే ఎకరానికి రూ.10, రూ.15 వేలు అదనంగా పెట్టి పాడేసి, దేవస్థానం భూములను దక్కించుకున్నారు. రబీ పంట కోతలు పూర్తవ్వగానే సదరు దేవస్థానం భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి, రూ.వేలు వెనకేసుకుంటున్నారు. భూమిని సాగు చేసుకోవడమే కానీ సదరు భూముల్లో చెట్లను నరకడం, మట్టి తీయడం చేయకూడదని వేలం పాట సమయంలో దేవదాయ శాఖాధికారులు నిబంధనలు వెల్లడిస్తారు. ఆ భూములు పాడుకున్న అధికార పార్టీ నాయకులు సదరు నిబంధనలను తుంగలో తొక్కి, నిరంతరం మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వందల ట్రాక్టర్లతో సెలవు రోజుల్లో అధికారులు పట్టించుకోరులేనని మట్టి తవ్వి తరలించేస్తున్నారు. గతంలో మట్టి అక్రమ తవ్వకాలపై అధికారులు దాడులు జరిపి, ట్రాక్టర్లను, పొక్లెయినర్లను సీజ్ చేసేవారు. కూటమి ప్రభుత్వంలో తమ కళ్ల ముందే మట్టి ట్రాక్టర్లు తిరుగాడుతున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికై నా మైనింగ్, దేవదాయ, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖల అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి’
రాజమండ్రి: మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో టీచర్ రిక్రూట్మెంట్ స్కాం జరిగినట్టు ఆధారాలతో సహా వెలుగులోకి రావడంతో దానికి సమాధానం చెప్పుకునే ధైర్యం లేక గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇసుక అక్రమాల గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని చెప్పారు.వైఎస్సార్సీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ ద్వారా అత్యంత పాదర్శకంగా ఈ టెండర్లు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకి రూ.4 వేల కోట్లు వచ్చేలా చేశామని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఉచిత ఇసుక అంటూ ఆ డబ్బు ప్రభుత్వ ఖజానాకి రాకుండా నాయకులు జేబులు నింపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ మూలనైనా ఉచితంగా ఇసుక లభిస్తోందా అని ఆయన ప్రశ్నించారు. 2014-19 మధ్య గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఐదేళ్లలో ఇసుక పేరుతో 19 జీవోలు ఇచ్చి రకరకాలుగా ఇసుక దోపిడీకి పాల్పడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల ఆదాయం తీసుకొచ్చినవైఎస్సార్సీపీ ఇసుక విధానంలోనే దోపిడీ జరిగి ఉంటే, ఉచిత ఇసుక అంటూ ఖజానాకి ఒక్క రూపాయి కూడా లేకుండా చేస్తున్న కూటమి వల్ల ఇంకెంత నష్టం జరిగి ఉండాలని ప్రశ్నించారు. గోదావరి జిల్లాల పరిధిలో ఒక్కో ఎమ్మెల్యే ఇసుక ద్వారా నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారని,వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వారి బాగోతాలన్నీ బయటపెట్టి చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మార్గాని భరత్ హెచ్చరించారు.ఆయన ఇంకా ఏమన్నారంటే.. 80 లక్షల టన్నుల ఇసుక నెలరోజుల్లో లేపేశారుఒకపక్క డీఎస్సీ అక్రమాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంటే దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ అంటూ మరో డైవర్షన్ పాలిటిక్స్కి కూటమి ప్రభుత్వం తెరలేపింది. గత ప్రభుత్వంలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారంటూ ఈనాడు పత్రిక రాయించి ఒక అక్రమ కేసును సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక అక్రమాల గురించి చంద్రబాబు అండ్ కో మాట్లాడటమే పెద్ద జోక్. ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ఇసుక దొరుకుతుందేమో చూపించాలి. మా ప్రభుత్వంలో ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున, ఐదేళ్లలో నాలుగువేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కానీ ఇప్పుడు మరి ఆ డబ్బంతా ఎక్కడకు పోయింది? ఎవరి జేబులోకి వెళ్లిందో చెప్పాలి. మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అదికూడా లేదు. అధికార దుర్వినియోగంతో ఇసుక చుట్టూ ఒక మాఫియాను ఏర్పాటు చేసి మొత్తం దోచేస్తున్నారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి స్టాక్ యార్డుల్లో నిల్వ ఉంచిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం వచ్చి నెలరోజులు గడవక ముందే సగం ఇసుకను టీడీపీ నాయకులు కాజేశారు. గోదావరి జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్యే కేవలం ఇసుక ద్వారానే నెలకు రూ. కోటి సంపాదిస్తున్నారు.ఇసుక విధానంపై రోజుకో మాటచంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా వాదించినట్టుగా గత ఐదేళ్లవైఎస్సార్సీపీ పాలనలో 5.08 కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వేశారనేది వారి దృష్టిలో నిజమే అయినా, ప్రభుత్వానికి ఇసుక ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఉచిత ఇసుక అని ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకెన్ని వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి నష్టం జరిగి ఉండాలి? ఈ రెండేళ్లలో ఎంత ఇసుకను దోచేశారు. ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాకి చేరకుండా ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? ఇప్పుడే కాదు, 2014-19లో కూడా మధ్య ప్రభుత్వ ఖజానాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రానీయకుండా పక్కా అవినీతి పథక రచనతో ఇసుకను దోచేశారు. అదే వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఆరోజుల్లో ఇసుక బాధ్యతలను మొదట ఏపీఎండీసీకి అప్పగించారు. ఆ తర్వాత డ్వాక్రా సంఘాలకు ఇస్తున్నామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. 2 నెలలు కాకుండానే దాన్నీ రద్దు చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. చివరకు ఎలాంటి చట్టబద్ధత లేకుండా ఉచిత ఇసుక పేరుతో ఒకే ఒక్క మెమో ఇచ్చి అప్పనంగా వారి మనుషులకు అప్పగించారు. మొత్తంగా 19 జీవోలు ఆ ఐదేళ్లలో ఇచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూటమి నాయకుల ఇసుక దందాను ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొచ్చి అందుకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షించేదాకా పోరాడుతాం. నాడు పారదర్శకంగా ఇసుక ఈ టెండర్లు.. ఖజానాకి రూ.4 వేల కోట్ల ఆదాయంగత వైయస్సార్సీపీ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేశాం. దోపిడీలకు అడ్డుకట్ట వేసి ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, అటు వినియోగదారునికీ సరసమైన ధరకు అందేలా కేంద్ర ప్రభుత్వ ఫ్లాట్ పాం మీద ఈ-టెండర్లు నిర్వహించాం. రీచ్ల వద్ద ఆపరేషన్ ఖర్చులతో కలిపి టన్ను ఇసుకను రూ.475కే సరఫరా చేయడం జరిగింది. ఇందులో రూ.375లు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరేది. రవాణా ఛార్జీలతో కలిపి ప్రతి నియోజకవర్గానికీ ఇసుక రేట్లను ప్రకటించాం. వైయస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోసే పత్రికల్లో కూడా నియోజకవర్గాల వారీగా పారదర్శకంగా రేట్లపై ప్రకటనలు ఇచ్చాం. ప్రజలకు ఒకవైపు తక్కువ ధరకు ఇస్తూనే మరోవైపు రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చేట్టుగా చేశాం. రేట్లపై సెబ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి తప్పులకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. తద్వారా ఏడాదికి రూ.750 కోట్ల ఆదాయాన్ని ఖజానాకు వచ్చేలా చేశాం.డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలిసంక్షేమం, అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించడానికి నారా లోకేష్ చేసిన సవాల్నువైఎస్సార్సీపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా నేను స్వీకరిస్తున్నా. దీనిపై బహిరంగ చర్చకు ఎప్పుడు, ఎక్కడికి రమ్మన్నా రావడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. డీఎస్సీలో మొదటి ర్యాంకు తెచ్చుకున్న నవీన్ అనే వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూటిగా చెప్పగలరా? సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి రాలేదని చెబుతున్నారు. కానీ, ఇదే నవీన్ ప్రభుత్వం తన ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ రాకుండా చేసిందని హైకోర్టును కూడా ఆశ్రయించారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా మీడియా ముందుకొచ్చివైఎస్సార్సీపీ, డీఎస్సీ రాసి ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థుల ప్రశ్నలకు సమాధానాలు చెబితే డీఎస్సీలో ఎలాంటి మోసం జరగలేదని ప్రజలు నమ్ముతారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరికి ఉద్యోగాలు కేటాయించారు? ఏ నిబంధనల ప్రకారం వారికి ఉద్యోగాలిచ్చారో బయటపెట్టాలి. టీచర్ ఉద్యోగం కోసం రూ. 15 లక్షలు వసూలు చేశారని బయటకొచ్చిన ఆడియో టేపుల ద్వారా స్పష్టంగా తేలిపోయింది. దీనికి కూడా మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. -
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
రాజమహేంద్రవరం సిటీ: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై జూన్ 1న వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించడం, విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూడడం, మెరిట్ లిస్టులు వెబ్సైట్ నుంచి మాయం చేయడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడం, పోస్టులు అమ్ముకోవడం వంటి ఆరోపణలు బయటికి రావడం, స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకంలో అక్రమాలు వెలుగు చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
రత్నగిరిపై కరెంటు కష్టాలు
● సబ్ స్టేషన్ ఉన్నా తప్పని ఇబ్బంది ● లో ఓల్టేజీతో పని చేయని ఏసీలు, లిఫ్టు ● కాలిపోతున్న మోటార్లు ● భక్తులకు ఇక్కట్లు అన్నవరం: సత్యదేవుని భక్తులకు విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. దేవస్థానంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ లో ఓల్టేజీ సమస్యతో ఒక్కోసారి సత్రాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీలు సైతం పని చేయడం లేదు. దేవస్థానం ఏటా రూ.1.30 కోట్ల మేర విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది. గతంలో ఈ బిల్లు రూ.3 కోట్ల వరకూ ఉండేది. అయితే, సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేశాక సగానికి పైగా బిల్లు భారం తగ్గినా.. భక్తులకు మాత్రం విద్యుత్ కష్టాలు పెరిగాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇవీ సమస్యలు ● ఓవైపు వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడి నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూ.2 వేల వ్రతాలు చేయించుకుంటున్న భక్తులు.. ఆ మండపాల్లో ఏసీలు పని చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్రతం టికెట్టు రూ.1,500, ఏసీ ఖర్చు రూ.500 అని చెప్పి వసూలు చేస్తున్నా ఏసీలు పని చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ● వృద్ధులు, దివ్యాంగుల కోసం సత్యదేవుని ప్రధానాలయం వెనుక లిఫ్టు ఏర్పాటు చేశారు. లో ఓల్టేజీ కారణంగా ఆ లిఫ్టు ప్రస్తుతం సరిగ్గా పని చేయడం లేదు. తరచుగా మధ్యలో ఆగిపోతూండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. శనివారం రెండుసార్లు ఇలాగే జరిగింది. విద్యుత్ సరఫరాను ఆపి, మళ్లీ ఆన్ చేయడంతో లిఫ్టు పని చేసింది. ● పంపా నది ఒడ్డున ఉన్న బోర్ల నుంచి నిత్యం రత్నగిరిపై ఉన్న వాటర్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తూంటారు. ఈ మోటార్లు లో ఓల్టేజీ కారణంగా కాలిపోతున్నాయి. ఈ వేసవి మొదలయ్యాక ఇప్పటి వరకూ ఆరు మోటార్లు ఈవిధంగా కాలిపోయాయి. దీంతో రత్నగిరిపై నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. -
పవన్ వైఖరి ప్రచారార్భాటమే..
రాజమహేంద్రవరం సిటీ: పేపర్ మిల్లు రసాయన వ్యర్థాల నుంచి గోదావరి జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరి ఒట్టి ప్రచారార్భాటమేనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, గోదావరిని ప్రక్షాళన చేస్తానన్న పవన్ కల్యాణ్.. రాజమహేంద్రవరం దాటిన వెంటనే మాట మార్చారన్నారు. 262 పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దాలనడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. పేపర్ మిల్లు తెరచి ఉండగా కాలుష్య రహిత పుష్కరాలు సాధ్యమేనా అనే విషయం పవన్కు అర్థం కాలేదన్నారు. ఈ మాత్రం దానికి మంత్రి, కలెక్టర్లపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గోదావరి జలాలను శుద్ధి చేయమంటే పంచాయతీల మురుగును శుద్ధి చేస్తానంటున్న మాటలకు అర్థమేమిటో పవనే చెప్పాలన్నారు. రాజమహేంద్రవరంలో ఒకలా.. అమరావతిలో మరోలా మాట్లాడటానికి కారణమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ మాటలు వింటూంటే పేపర్ మిల్లు యాజమాన్యం ఆయనను రహస్యంగా కలిసిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. గోదావరి జల, వాయు కాలుష్యాలు పవన్ శాఖ పరిధిలోనివేనని, కానీ, పర్యాటక మంత్రి దుర్గేష్పై చిర్రుబుర్రులాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. గోదావరి జల, వాయు కాలుష్యం ప్రక్షాళనకయ్యే మొత్తం ఖర్చును పేపర్ మిల్లు యాజమాన్యమే భరించాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. -
చెరువు మట్టి స్వాహా!
తాళ్లపూడి: కూటమి ప్రజాప్రతినిధుల అండతో కొవ్వూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి మరీ చెరువులను గుల్ల చేస్తోంది. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలోని కృష్ణమ్మ చెరువును టార్గెట్ చేసిన మట్టి మాఫియా మూడు రోజులుగా రాత్రి, పగలు అనే తేడా లేకుండా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు సాగిస్తోంది. స్థానిక టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దందా మొత్తం సాగుతున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వస్తున్నాయి. జలసిరి కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకుని రైతుల పేరుతో పొక్లెయిన్లు, జేసీబీలతో భారీ స్థాయిలో చెరువు గర్భాన్ని తవ్వేసి ట్రాక్టర్లు, లారీలతో దూర ప్రాంతాలకు పెద్ద మొత్తంలో మట్టిని తరలిస్తున్నారు. సాధారణంగా చెరువుల్లో పూడికతీత పనులకు పరిమితులు, అనుమతులు ఉండాలి. కానీ, ఇక్కడ అవేమీ పట్టనట్లు మాఫియాయే అధికారులుగా, పరిశీలకులుగా వ్యవహరిస్తూ వందలాది ట్రాక్టర్లు, లారీలతో మట్టిని యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. ట్రాక్టర్ మట్టిని రూ.1,500కు, లారీ మట్టిని ఏకంగా రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకూ విక్రయిస్తూ నిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్నారు. ఈ వ్యవహారమంతా అమాత్యులదేనంటూ ఆ ప్రాంతానికి అధికారులు రాకుండా ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజులుగా కళ్ల ముందే ఇంత భారీ ఎత్తున మట్టి దందా సాగుతున్నా మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కృష్ణమ్మ చెరువులో మట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలని, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గజ్జరం కృష్ణమ్మ చెరువులో చెలరేగిన మాఫియా టీడీపీ నాయకుల కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు భారీ యంత్రాలతో 3 రోజులుగా దందా ట్రాక్టర్ మట్టి రూ.1,500.. లారీ ఐదారు వేలకు విక్రయాలు -
గోదావరి డెల్టాకు నేటి నుంచి సాగునీరు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్ సాగు నిమిత్తం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి కాలువలకు ఆదివారం నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. కాలువల మరమ్మతుల పరిస్థితిని బట్టి దశల వారీగా నీరు విడుదల చేయనున్నారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అధ్యక్షతన కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, బ్యారేజీ పరిరక్షణ చర్యలకు సుమారు రూ.148 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇరిగేషన్ ఎస్ఈ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖరీఫ్లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి ఉండదని చెప్పారు. అక్టోబర్ 31వ తేదీ వరకూ సాగు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మెగా డీఎస్సీ అక్రమాలపై రేపు కలెక్టరేట్ వద్ద ధర్నా పెరవలి (కొవ్వూరు): మెగా డీఎస్సీ–2025లో చోటు చేసుకున్న అక్రమాలపై రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమణి రమేష్ తెలిపారు. ఈ అక్రమాలకు బాధ్యుడిని చేస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేపడుతున్నామని వివరించారు. దీనికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు, నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు హాజరై, విజయవంతం చేయాలని రమేష్ కోరారు. జిల్లా విజిలెన్స్ కమిటీ ఏర్పాటురాజమహేంద్రవరం సిటీ: జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో వినియోగదారుల సంఘాలు, సోషల్ యాక్టివిస్టుల నుంచి సభ్యులుగా గొట్టిముక్కల అనంతరావు, డీఎస్ రాజేశ్వరరావు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, బిక్కిన సత్యనారాయణ, సలాది ఉదయ భాస్కర్, యార్లగడ్డ రాణిలను నియమించారు. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కమిటీ చైర్మన్గా కలెక్టర్, కో చైర్మన్లుగా జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. జాతీయ ఆహార భద్రత చట్టంలోని అన్ని పథకాల పర్యవేక్షణ, నిబంధనల ఉల్లంఘనలు, అవినీతి, నిధుల దుర్వినియోగం, అక్రమాలు, మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ పథకాల కింద సరఫరా చేస్తున్న ఆహార ధాన్యాలు, భోజనాల నాణ్యత పర్యవేక్షణకు ఈ కమిటీని ఏర్పాటు చేశారని అనంతరావు తెలిపారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పోలీసింగ్లో పారదర్శకత, పనితీరు మరింత మెరుగు పడతాయని ఎస్పీ డి.నరసింహ కిషోర్ అన్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు, కోర్టు కానిస్టేబుళ్ల పని తీరుపై జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో డేటా ఎంట్రీ, కేసుల రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ నమోదు, డిజిటల్ డాక్యుమెంటేషన్, కోర్టు కేసుల పురోగతి, సమన్లు, వారెంట్ల అమలు, పెండింగ్ కోర్టు వ్యవహారాలపై సమీక్షించారు. కేసుల విచారణలో కోర్టు కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషిస్తారని, సమన్లు, వారెంట్ల అమలు, సాక్షుల హాజరు, కేసు డాక్యుమెంట్ల సమర్పణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులు, కోర్టు సిబ్బందితో సమన్వయం పెంపొందించుకోవడం ద్వారా కేసుల కన్విక్షన్ రేటును గణనీయంగా మెరుగు పరచవచ్చని వివరించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నిర్వహణను కంప్యూటర్ ఆపరేటర్లు మరింత సమర్థవంతంగా చేపట్టాలన్నారు. సీసీటీఎన్ఎస్, ఇతర సాంకేతిక వ్యవస్థల వినియోగంలో ఎటువంటి లోపాలూ లేకుండా పని చేయాలని ఎస్పీ సూచించారు. శాంతిభద్రతల ఎస్పీగా సుబ్బరాజు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా శాంతిభద్రతల ఎస్పీగా అల్లూరి వెంకట సుబ్బరాజు నియమితులయ్యారు. ఈ మేరకు హోం శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటి వరకూ రాజమహేంద్రవరం పోలీసు కార్యాలయంలో ఏఎస్పీగా పని చేసిన ఆయనకు ఎస్పీగా పదోన్నతి లభించింది. విజయనగరం జిల్లా రాచగుమడానికి చెందిన సుబ్బరాజు 1989లో ఎస్సైగా పోలీసు శాఖలోకి వచ్చారు. 2001లో సీఐగా, 2010లో డీఎస్పీగా, 2020లో అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. ఉగాది పురస్కారాల్లో భాగంగా సుబ్బరాజుకు ఏపీ పోలీస్ సేవా పతకం లభించింది. -
టీడీపీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీ
● నిత్యం అసత్యాలతో కాలం వెళ్లదీస్తోంది ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు పెరవలి (కొవ్వూరు): టీడీపీ ఓ అబద్ధాల ఫ్యాక్టరీ వంటిదని, నిత్యం అసత్యాలు వల్లిస్తూ కాలం వెళ్లదీస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆధ్వర్యాన కొవ్వూరులో శనివారం జరిగిన బూత్ కమిటీల కన్వీనర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీడీపీ మహానాడులో చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదార్లు మాట్లాడుతూ, ఆశా వర్కర్ల జీతాన్ని రూ.10 వేలు చేసింది తమ నాయకుడేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. గతంలో ఉద్యోగాల కోసం యువత ఎదురు చూసేదని, కానీ కూటమి అధికారం చేపట్టిన తరువాత యువత కోసం ఉద్యోగం ఎదురు చూస్తోందని హోం మంత్రి చెప్పడం చాలా దారుణంగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికే కూటమిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. దోచుకో.. దాచుకో అన్నట్టుగా కూటమి నేతలు దొరికింది దొరికినట్లు దోచేస్తున్నారని, ఇసుక, మట్టి, మద్యం షాపుల నుంచి అన్ని రంగాల్లోనూ దోపిడీ పెరిగిపోయిందని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ, ఉచిత ఇసుక పేరుతో కూటమి నాయకులు గాదె కింద పందికొక్కుల్లా దోచేస్తున్నారని వేణు ధ్వజమెత్తారు. పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)పై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని కోరారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, దీనిని బతికించుకోవాలంటే యువతే ముందుకు రావాలని సూచించారు. గతంలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటే నేడు ప్రభుత్వాలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాయని, ఓట్ల తొలగింపే దీనికి ప్రధాన కారణమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ, సాధారణంగా ఎన్నికల్లో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారని, కానీ, ఈ కొత్త విధానంలో ప్రభుత్వాలే నిర్ణయిస్తాయని చెప్పారు. జూన్ నెలలో ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు ఆయా బూత్లలో ఏ ఓట్లు తొలగించవచ్చు, ఏవి ఉండాలో బూత్ కన్వీనర్లు జాగ్రత్తగా పరిశీలించాలని కోరారు. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ఓట్లు ఉన్నాయో, తొలగించారో పరిశీలించుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తొలుత దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి, నివాళులర్పించారు. సమావేశంలో కంఠమని రమేష్, పార్టీ కొవ్వూరు పట్టణ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం, తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, నాయకులు వెంపాటి సురేష్, కొలిశెట్టి నాగేశ్వరరావు, పరిమి సోమరాజు, సుంకర సత్యనారాయణ, గొరజాల పేర్రాజు, మట్టా వెంకట్రావు, పెండ్యల మమత, గోడసింగి తులసి, కొయ్యిలమూడి సుబ్బలక్ష్మి, గండ్రోతు సురేంద్ర, తోట రామకృష్ణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఏలూరి విజయలక్ష్మి, బూత్ కన్వీనర్ల కమిటీ జిల్లా అధ్యక్షుడు గుర్రాల లక్ష్మణ్, ఉప్పులూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఓట్లపై అప్రమత్తంగా ఉండాలి ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీలు ఓడిపోవడానికి ప్రధాన కారణం పలువురి ఓట్లు తొలగించడమేనని వేణు చెప్పారు. మన రాష్ట్రంలో కూడా వచ్చే నెల నుంచి ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపడతున్నారన్నారు. చనిపోయిన, వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని, ఇదే అదనుగా అధికార పార్టీ నాయకులు ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉంటుందని, అందువలన వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రతి ఓటుపై అప్రమత్తంగా ఉండాలని అన్నారు. -
పరేషన్ మొదలై ఏడాది
రాజమహేంద్రవరం నగరంలోని ఓ రేషన్ షాపు వద్ద రాత్రి వేళ లబ్ధిదారుల పడిగాపులు (ఫైల్) ● గత సంవత్సరం జూన్ 1 నుంచి రేషన్ వాహనాల నిలిపివేత ● ఇంటి వద్ద అందని సరకులు ● చంద్రబాబు సర్కారు నిర్ణయంతో లబ్ధిదారులకు ఇబ్బందులు ● ఉమ్మడి జిల్లాలో రోడ్డున పడిన 1,139 మంది కపిలేశ్వరపురం: ఇంటికి దూరంగా ఉన్న రేషన్ షాపుల వద్దకు వెళ్లి, సరకులు మోసుకుని తెచ్చుకునేందుకు అవ్వాతాతలు, దివ్యాంగులు, రోజు కూలీలు, చిరుద్యోగులు గత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అనేక వ్యయప్రయాసలకు లోనయ్యేవారు. వారి ఇబ్బందులను తప్పించేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. దేశంలోనే ఎక్కడా లేని విధంగా.. వినూత్నంగా ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానానికి శ్రీకారం చుట్టారు. లబ్ధిదారుల సౌలభ్యం, ఉపాధి మేళవింపుతో ఈ వ్యవస్థను రూపొందించారు. దీనిలో భాగంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ – రేషన్ వాహనాలు) ఏర్పాటు చేసి, పలువురికి ఉపాధి కూడా కల్పించారు. 2021 జనవరి 21న విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 2,503 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అదే సంవత్సరం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 12 పట్టణాల్లో ఇంటింటికీ రేషన్ సరకుల పంపిణీ ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా గ్రామాల్లో కాస్త ఆలస్యంగా ఫిబ్రవరి 23న ఈ విధానం ప్రారంభమైంది. రద్దు చేసి.. రోడ్డున పడేసి.. ఈ వ్యవస్థ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 18,81,494 రేషన్ కార్డులపై లబ్ధిదారులకు ఈ–పోస్ యంత్రం ద్వారా జీపీఎస్ ట్రాకింగ్ పద్ధతిలో నిత్యావసర సరకులను ఇళ్ల వద్దకే తీసుకెళ్లి అందించేవారు. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని 1,139 మందికి ఎండీయూ నిర్వాహకులుగా ఉపాధి దక్కింది. పోలవరం జిల్లాలో కూడా పలువురు ఎండీయూ ఆపరేటర్లుగా సేవలందించారు. 2019 నవంబర్ నుంచి సుమారు రెండేళ్ల పాటు కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అత్యధిక రోజులు ఇళ్లకే పరిమితమైపోయారు. ఆ సమయంలో రేషన్ వాహనాల వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపకరించింది. అయితే, గత ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ ఫొటో, ఆయన హయాంలో నిర్మించిన భవనాలు, ఆయన రూపొందించిన ప్రజోపయోగకరమైన పథకాలపై దుగ్ధతో వ్యవహరించనారంభించింది. ఇందులో భాగంగానే.. ఖజానాకు భారంగా మారిందన్న సాకుతో.. సరిగ్గా గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ వాహనాలను నిలిపివేసింది. 2027 వరకూ ఒప్పంద కాలం ఉన్నప్పటికీ చంద్రబాబు సర్కారు వీటిని రద్దు చేయడంతో లక్షలాది మంది రేషన్ లబ్ధిదారులకు మళ్లీ వ్యయప్రయాసలు తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ మూడు జిల్లాల్లో 1,139 మంది ఎండీయూ నిర్వాహకులు కూడా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రెండేళ్లుగా కానరాని కందిపప్పు రేషన్ వాహనాల ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కిలో కందిపప్పును రూ.67కే పంపిణీ చేసింది. దీంతో పాటు బియ్యం, పంచదార, గోధుమ పిండి వంటి నిత్యావసర సరకులనూ అందించింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి కందిపప్పు సరఫరా నిలిచిపోయింది. దీంతో, కార్డుదారులు కిలో కందిపప్పును రూ.150 నుంచి రూ.190కి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇంటి వద్దకు తీసుకెళ్లి నిత్యావసర సరకులు అందజేస్తున్న ఎండీయూ నిర్వాహకుడు (ఫైల్) ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డులు, లబ్ధిదారులు, ఎండీయూ వాహనాల వివరాలు జిల్లా రేషన్ మొత్తం మొత్తం ఎండీయూ షాపులు కార్డులు లబ్ధిదారులు వాహనాలు తూర్పు గోదావరి 871 5,73,197 15,68,969 364 కాకినాడ 926 6,54,000 16,81,387 420కోనసీమ 926 5,47,723 16,43,169 355 -
దొంగల భయంతో యువకుల గస్తీ
తుని రూరల్: ఎస్.అన్నవరం శివారు శేషాద్రి నగర్ కాలనీలో ఇటీవల తరచూ దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, పంపనబోయిన రాజబాబు (చంటి) ఆధ్వర్యంలో 15 మంది యువకులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో కర్రలతో వీధుల్లో తిరుగుతూ కాపలా కాస్తున్నారు. 15 రోజుల నుంచి ఇదే విధంగా కాపలా ఉంటున్నట్టు కనకాల వీరభద్రరావు, తేనే లోవరాజు, నడిమింటి ఎల్లంనాయుడు, దుంగ దారబాబు, పోలిశెట్టి చందు తదితరులు తెలిపారు. కొందరు దైవదర్శనాలకు, శుభకార్యాలకు రెండు, మూడు రోజులు ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారన్నారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
ఫ మరొకరికి తీవ్ర గాయాలు ఫ శృంగవరంలో ఘటన రౌతులపూడి: మండలంలోని రౌతులపూడి – కత్తిపూడి ఆర్అండ్బీ రహదారిలో శృంగవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శృంగవరానికి చెందిన యలమంచిలి అమ్మాజీ, యలమంచిలి చక్రవేణి గుడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రోడ్డుపైకి వెళ్లారు. అదే సమయంలో కత్తిపూడి వైపు నల్ల కంకరరాయి లోడుతో వెళుతున్న లారీ రోడ్డుపై ఉన్న వీరిని ఢీకొంది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ అంబులెన్స్లో కాకినాడ తరలిస్తుండగా మార్గం మధ్యలో అమ్మాజీ (52) మృతి చెందింది. చక్రవేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై వెంకటేశ్వరరావు వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అతి వేగంతో అదుపు తప్పిన కారు
ఫ కంటైనర్ను ఢీకొన్న వైనం ఫ ముగ్గురికి తీవ్ర గాయాలు దేవరపల్లి: అతి వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి, డివైడర్ను దాటి ఓ కంటైనర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గు రికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండుగొలను – కొవ్వూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై యర్నగూడెం వద్ద శనివారం అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కంటైనర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఏలూరు వైపు వెళుతున్న కారు అదుపు తప్పింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కాగా.. కారు ఢీకొనడంతో కంటైనర్ అదుపు తప్పి ఫ్లై ఓవర్ వంతెన గోడను ఢీకొని ఆగింది. దీంతో మిగిలిన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కాగా.. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై పి.మనోహర్ తెలిపారు. -
వెలి ఘటనపై తహసీల్దార్ విచారణ
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పాత కోరంగికి సంబంధించిన వెలి ఘటనపై శనివారం తహసీల్దార్ పితాని త్రినాథరావు విచారణ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణకు ఒకే సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్దలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు టేకుమూడి త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామపెద్దలు తమ కుటుంబానికి రూ.లక్ష జరిమానా విధించి, వెలివేశారని తెలిపాడు. గత మూడేళ్లుగా తమ కుటుంబాన్ని శుభ కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోయాడు. తన కుమార్తె వివాహాన్ని కూడా చెడగొట్టారని, తాను పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా చేసి నష్టపరిచారన్నాడు. తప్పు కట్టాలని, లేకుంటే ఊరి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. దీనిపై గతంలో కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా శాంతి కమిటీ వేసి సమస్యను పరిష్కరించారని, అయితే గ్రామ పెద్దల తీరులో మార్పు రాలేదన్నాడు. దీంతో గత ఏడాది అక్టోబర్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. కాగా.. సమస్యను గ్రామంలో తేల్చుకుంటామని, రెండు రోజులు సమయం ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ను గ్రామ పెద్దలు కోరారు. ఈ నేపథ్యంలో విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. సమస్య పరిష్కారం కాకుంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తహసీల్దార్ హెచ్చరించారు. సమావేశంలో శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, ఎంపీడీఓ కె.సత్యనారాయణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
చెరువులో పడి యువకుడి మృతి
కొత్తపల్లి: మోటారు సైకిల్పై వస్తూ ప్రమాదవశాత్తూ చెరువులో పడి యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పిఠాపురం – పాత ఇసుకపల్లి రహదారిలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ముగ్గురు యువకులు మైటారు సైకిల్పై అన్నవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోనపాపపేట, మూలపేట, పాత ఇసుకపల్లి మీదుగా పిఠాపురం వస్తుండగా ప్రమాదవశాత్తు పాత ఇసుకపల్లి శివారు ఉన్న చెరువులో పడ్డారు. ఈ ప్రమాదంలో సాఖా సాయిరాం (16) మృతి చెందగా, గాయపడిన ఇద్దరు యువకులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.20 లక్షల బంగారం దొరికినా.. ఆశపడలేదు!
తూర్పుగోదావరి (మండపేట): మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడూ.. అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఓ యువకుడు నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచి.. పది మందితో శభాష్ అనిపించుకున్నారు. మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన పేరిచర్ల శ్రీలేఖ తన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో ఓ శుభకార్యానికి బయల్దేరారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను పోగొట్టుకున్నారు. ఆ బ్యాగ్ ఏడిద గ్రామ శివారు దేవుడు కాలనీ సమీపాన అదే గ్రామానికి చెందిన యువకుడు నామాల లక్ష్మణరావుకు దొరికింది. అదే మహద్భాగ్యమనుకుని ఆ ఆభరణాలను పట్టుకుపోవాలనే దుర్బుద్ధికి అతడు లోనవలేదు. ఆ ఆభరణాల పట్ల ఎలాంటి వ్యామోహాన్నీ పెంచుకోకుండా.. పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని తపన పడ్డాడు. బ్యాగ్లో ఉన్న ఆధార్ కార్డులోని అడ్రస్కు సమాచారం అందించారు. సీఐ దొరరాజు, ఎస్సై వి.కిశోర్ సమక్షంలో బాధితురాలు శ్రీలేఖకు ఆ ఆభరణాల బ్యాగ్ను అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మణరావును పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందించారు. -
యువకుడి అదృశ్యంపై కేసు
అనపర్తి: కోచింగ్ కోసం సికింద్రాబాద్ బయలుదేరిన తన కుమారుడు అదృశ్యమైనట్టు దుంగల నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం రాత్రి బిక్కవోలు పోలీసులు కేసు నమోదు చేశారు. బలభద్రపురం గ్రామానికి చెందిన దుంగల దేవీశ్రీ వరప్రసాద్ (23) గేట్ కోచింగ్ నిమిత్తం ఈ నెల 25న సికింద్రాబాద్ బయలుదేరాడు. రాత్రి 8:30 గంటలకు బలభద్రపురంలో బస్సు ఎక్కి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు వెళ్లాడు. అక్కడి నుంచి ప్రత్యేక ట్రైన్లో సికింద్రాబాద్కు బయలుదేరి వెళ్లాడు. మరుసటి రోజు 26వ తేదీ ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని, అప్పటి నుంచి ఆచూకీ లభ్యం కాలేదని నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవిచంద్ర తెలిపారు. -
దగా డీఎస్సీపై ఆగ్రహం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మెగా డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నిర్వహణలో లోపాలు, ప్రశ్నపత్రం లీకేజీ, మెరిట్ జాబితా తొలగింపు, ఇతర అక్రమాలను నిరసిస్తూ.. అన్యాయానికి గురైన అభ్యర్థులకు అండగా.. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యాన స్థానిక కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. కందుకూరి వీరేశలింగం విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా బయలుదేరి, శ్యామలా సెంటర్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ సెంటర్కు చేరుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ సకల శాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత కొరవడిందని ఆరోపించారు. మెగా డీఎస్సీ కాస్తా ఒట్టి దగా డీఎస్సీగా తేలిందన్నారు. రూ.15 లక్షలు చెల్లిస్తే స్పోర్ట్స్ కోటా పోస్టుల్లో నియమించారన్నారు. క్రీడలంటే తెలియని వ్యక్తులకు ఈ కోటాలో ఉద్యోగాలిచ్చేశారని ఆరోపించారు. ఈ అక్రమాలను ఎత్తి చూపుతూ అన్యాయానికి గురైన 200 మంది అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా, న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. కానీ, కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమాయకులపై కేసులు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ, రాక్షస పాలనకు నిదర్శనమని వేణు ధ్వజమెత్తారు. ప్రశ్నపత్రం తయారు చేసే సంస్థలోని కాంట్రాక్టు ఉద్యోగికి డీఎస్సీలో కృష్ణా జిల్లా మొదటి ర్యాంకు రావడం, మెరిట్ జాబితాలు కనిపించకుండా చేయడం వంటి చర్యలతో అభ్యర్థుల్లో అనేక అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. వీటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వమే తప్పు చేసినందున ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారని విమర్శించారు. మహానాడు వేదికగా టీడీపీ నేతలు చేస్త్న్ను వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కంపెనీలు ఉద్యోగుల కోసం వెతుక్కునే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయనన్నారు. అధికారంలో ఉండి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రీతిలో కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకూ వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉండి పోరాటం చేస్తుందని వేణు స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు మానుకొండ చంద్రబాబు మాట్లాడుతూ, విద్య, వైద్య వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. చైతన్య, నారాయణ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఒక్కో పోస్టును రూ.15 లక్షల చొప్పున అమ్మేశారని వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని, మెగా డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ బేషరతుగా రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ ఆరిఫ్, విద్యార్థి విభాగం నిడదవోలు, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల అధ్యక్షులు రొట్టె నవీన్ కుమార్, ఉత్తేజ్, కల్యాణ్, విద్యార్థి సంఘ నాయకులు పండు, తగరం సోము, వినోద్, ఇన్నీసుపేట కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణరాజు, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, అరవ సురేష్ కుమార్, పార్టీ నేతలు కోడి కోట, అడపా అనిల్, కేతా స్వరూప్, దుంగా సురేష్, పవన్ కుమార్ పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నిరసన మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు డిమాండ్ -
పెద్ద పులిని బంధించేందుకు చర్యలు
రాజానగరం/ గంగవరం: గంగవరం మండలంఆర్డీ పురంలో పెద్ద పులి సంచరిస్తుందని, దానిని సురక్షితంగా బంధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని రాజమహేంద్రవరం సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జ్యోతి తుళ్లిమెల్లి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆ ప్రాంతంలో పర్యటించారు. వేములోవ గ్రామంలో కూడా ఆమె పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక్కడ రెండు ఆవులు చనిపోయాయని, నష్టపరిహారం అందించాలని ప్రజలు ఆమెను కోరారు. తగిన పరిహారం అందిస్తామని జ్యోతి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని కూర్మాపురంలో పట్టుకుని, గత ఫిబ్రవరి 14న పాపికొండలు జాతీయ వనంలో విడుదల చేసినప్పటి నుంచి పెద్ద పులి సంచారంపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. అయితే రెండోసారి దానిని ఇంతవరకూ పట్టుకోలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ, అది దట్టమైన అటవీ ప్రాంతం, మారుమూల ఆవాసాలలో రాత్రి వేళల్లో సంచరించడమేనన్నారు. అప్పుడప్పుడు పశువులపై దాడులు చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే రాజవొమ్మంగి రేంజ్ పరిధిలోని పెదరేలంగిపాడు, చికిలింతల వద్ద ఈ నెల 27న తొమ్మిది పశువులను హతమార్చిందన్నారు. దీంతో పైఅధికారుల సూచనల మేరకు ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఫీల్డ్ టీమ్స్, హనుమాన్ టీమ్స్ని మోహరింపజేశామన్నారు. అలాగే రేడియో టెలీమెట్రీ, వీహెచ్ఎఫ్ ట్రాకింగ్, కెమెరా ట్రాప్లు, డ్రోన్ పర్యవేక్షణ, విస్త్రత క్షేత్ర స్థాయి గస్తీ ద్వారా పులిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. -
చీకటి చట్టాలపై నిరంతర పోరాటం
సామర్లకోట: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేసిన చీకటి చట్టాలపై నిరంతరం పోరాటం చేస్తామని రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ తెలిపారు. శుక్రవారం స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దేశవ్యాప్తంగా రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. ఈ కుట్ర వెనుక ప్రధాని మోదీతో పాటు తెలుగు రాషా్ట్రల సీఎంలు చంద్రబాబు, రేవంత్రెడ్డి ఉన్నారని ఆరోపించారు. మోదీ చేసిన చట్టాలను మార్పు చేసే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. సామాజిక న్యాయం చేయాలనుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని పవన్కల్యాణ్ ఇవ్వాలని అన్నారు. దళితులను తెలంగాణలోని కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి, ఆంధ్రలో చంద్రబాబు నమ్మించి మోసం చేశారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ల కుట్ర దాగి ఉందన్నారు. 2004లో చంద్రబాబు చట్టం చేస్తే అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ప్రజలను చైతన్యం చేసేందుకు ఉద్యమం సామర్లకోట నుంచి ప్రారంభం అవుతుందన్నారు. వర్గీకరణ పేరుతో 100 మందిలో ఇద్దరికే లబ్ధి చేస్తున్నారని, కనీసం 10 మందికి లబ్ధి జరిగే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. దీనిని సాధించే వరకూ అందరూ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. సమావేశంలో మాల మహానాడు నాయకులు నేతల హరిబాబు, లింగం శివ, కొప్పుల ప్రేమ్బాబు, నెలి సూరిబాబు, బత్తుల రాంప్రసాద్, బీపెల్లి పండు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆట్యా పాట్యా ఆడేద్దామా..
● కాకినాడ, కోనసీమ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు ● రాణిస్తే విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆట్యా పాట్యా.. ఇది మన దేశ ప్రాచీనమైన సంప్రదాయ క్రీడ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది. మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోనూ ప్రాచుర్యం పొందుతుంది. ఇప్పటికే కాకినాడ, కోనసీమ జిల్లాల్లో శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఆట్యా పాట్యా క్రీడా చరిత్ర, కోర్టు కొలతలు, నియమ నిబంధనలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ఆట్యాపాట్యా క్రీడ ఐదు వేల ఏళ్ల నాటి చోళుల కాలం నుంచి ఉనికిలో ఉందని చరిత్రకారులు చెబుతారు. తమిళనాడలో పురాతన సంఘం సాహిత్యం ‘నత్రినై’లో ఈ ఆటకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. దీనిని తమిళనాడలో కిలితట్టు లేదా ఉప్పుపట్టి అని కూడా పిలుస్తారు. ఆధునిక నియమాలను రూపొందించి జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెచ్చేందుకు పూణెలోని డెక్కన్ జింఖానా తొలి ప్రయత్నం చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరిలో.. ఉమ్మడి తూర్పు గోదావరిలో కాకినాడ జిల్లా తునిలో, కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంకలో ఆట్యాపాట్యా క్రీడా శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. కొత్తలంకలో ఆరు నెలల కిందట ఈ శిక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఈ ఏడాది 100 మంది పిల్లలు ఎన్రోల్ చేసుకున్నారు. ఆట్యాపాట్యాని మూన్లైట్ గేమ్ అని కూడా అంటారు. ఇందులో రాణిస్తే సెంట్రల్ గవర్నమెంట్, పోస్టల్ ఉద్యోగాల్లో క్రీడా కోటా ఉంటుంది. సబ్ జూనియర్స్ బాలురు, బాలికలు 24, జూనియర్స్ బాలురు, బాలికలు 24, సీనియర్స్ బాలురు, బాలికలు 24 చొప్పున సంవత్సరానికి 72 మంది, 2020 నుంచి ఇప్పటి వరకూ 360 మంది జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17, 19 కేటగిరీల్లో ఈ క్రీడను చేర్చితే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు ఉపయోగపడుతుందని పీడీలు చెబుతున్నారు. క్రీడాభివృద్ధికి చర్యలు ఆట్యాపాట్యా క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరింత మంది గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ఈ క్రీడ చేరువ అవుతుంది. తక్కువ ఆట స్థలంలో, తక్కువ పరికరాలతో దీనిని ఆడుకోవచ్చు. –గంగుల లోవలక్ష్మి, కార్యదర్శి, ఆట్యాపాట్యా క్రీడా సంఘం, కోనసీమఆట స్థలం: ఆట స్థలంలో మొత్తం తొమ్మిది అడ్డ కందకాలు (కారిడార్లు), మధ్యలో ఒక పొడవైన కేంద్ర కందకం (సెంట్రల్ ట్రెంచ్) ఉంటాయి. మొత్తం తొమ్మిది కందకాలు ఒక్కొక్కటి 23 అడుగుల 1 అంగుళం పొడవు, 13 అంగుళాలు వెడల్పుతో ఉంటుంది. నియమాలు: ఆటగాళ్లు ఒక్కో జట్టులో మొత్తం 9 మంది ఆటగాళ్లు చొప్పున 18 మంది ఉంటారు. రక్షకులు డిఫెండింగ్ జట్టులోని ఆటగాళ్లు కందకంలో నిలబడి, ప్రత్యర్థిని క్రాస్ చేయకుండా అడ్డుకుంటారు. దాడులు చేసేవారు ఒక కందకం నుంచి మరో కందకానికి దూకుతూ, రక్షకుల చేతికి చిక్కకుండా క్రాస్ చేయాలి. స్కోరింగ్ : దాడి చేసే జట్టు ఆటగాళ్లు రక్షకుల చేత ట్యాగ్ చేయబడకుండా దాటిన ప్రతి కందకానికి ఒక పాయింట్ లభిస్తుంది. ఆట మొత్తం 7 నిమిషాల చొప్పున రెండు ఇన్నింగ్స్గా జరుగుతుంది. ఏ జట్టు ఎక్కువ పాయింట్లు స్కోర్ చేస్తే అది విజేతగా నిలుస్తుంది. -
ఘాట్ రోడ్డులో మినీ బస్సు బోల్తా
పది మందికి గాయాలు చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్ రోడ్డులో ప్రయాణికులతో వెళుతున్న మినీ ట్రావెల్ బస్సు శుక్రవారం ఉదయం బోల్తా పడిన ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా కోలంక, తూర్పుగోదావరి జిల్లా మండపేట, నిడదవోలుకు చెందిన 13 మంది సీతారాముల దర్శనం నిమిత్తం మినీ బస్సులో భద్రాచలం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులో టైరు పంక్ఛర్ కావడంతో బస్సు రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కావడంతో ఛత్తీస్గఢ్కు చెందిన ప్రైవేటు బస్సులో చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలైన వారిలో ఎనిమిది మందికి సాధారణ గాయాలకు కాగా, ఇద్దరికి ఎముకలు విరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి తెలిపారు. గాయాలైన వారిలో కోలంకకు చెందిన సత్యకల్యాణి, సుగుణ, సూర్యకుమార్, నాగేంద్ర, హైమావతి, నిడదవోలుకు చెందిన భరణి, సావిత్రదేవి, మండపేటకు చెందిన దేవి, జోగరత్నం, శివరామ్ ఉన్నారు. చింతూరు ఎస్సై సంతోష్కుమార్ ఆసుపత్రికి వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. -
లారీ ఢీ: దంపతులకు గాయాలు
తుని రూరల్: తుని మండలం తేటగుంట శివారు ఆర్టీఏ పాత చెక్పోస్ట్ వద్ద లారీ ఢీకొనడంతో మోటార్ సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనలో తొండంగి మండలం సీతారామపురం గ్రామానికి చెందిన దంపతులు గొర్లి సత్యనారాయణ, గొర్లి అప్పలరాజు (లక్ష్మి) తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్నారు. మోటారు సైకిల్ను లారీ కొంతదూరం ఈడ్చుకుపోవడంతో లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సమాచారం అందడంతో 108 అంబులెన్స్లో క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సత్యనారాయణ, లక్ష్మిలను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తునిలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తుండగా, ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజాయతీ చాటుకున్న సిబ్బంది తుని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి మోటార్ సైకిల్పై వస్తుండగా, జరిగిన ప్రమాదంలో గొర్లి సత్యనారాయణ, లక్ష్మి తీవ్రంగా గాయపడగా, వారికి చెందిన రూ.1.10 లక్షల నగదు బ్యాగ్ సంఘటనా స్థలానికి దూరంగా పడిపోయింది. దీనిని గమనించిన 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులతో పాటు నగదును ఆస్పత్రి వద్దకు తీసుకువచ్చారు. విధి నిర్వహణలో ప్రాణాలు కాపాడడంతో పాటు 108 ఈఎంటీ సూర్య, పైలెట్ అప్పారావు తమ నిజాయతీ చాటుకున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన నగదు బ్యాగ్ను క్షతగాత్రుల బంధువులకు అప్పగించారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
సామర్లకోట: చోరీ కేసుల్లో నిఽందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి సొత్తు రికవరీ చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ ఏబీజే తిలక్ తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన స్థానిక పోలీసు స్టేషన్లో కేసుల వివరాలను తెలిపారు. శుక్రవారం సాయంత్రం అనుమానంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించారని అన్నారు. నిందితులు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన గండేటి సాయి, అనకాపల్లి జిల్లా భయ్యవరం గ్రామానికి చెందిన సంగ శ్రీనులను అరెస్టు చేశామన్నారు. సామర్లకోటలో గాంధీనగర్కు చెందిన కొల్లూరి బాలసరస్వతి రాజమహేంద్రవరంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన సమయంలో ఈ నెల 23న దొంగతనం జరిగినట్లు గుర్తించారు. రెండు కిలోల 100 గ్రాముల వెండి, ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరగ్గా రికవరీ చేశారు. స్థానిక సాయి అభిలాష్నగర్లో మోటారు సైకిల్, సంపంగ తోటలోని అలమండ అప్పారావు ఇంట్లో సుమారు 9 గ్రాముల బంగారం, 11 తులాల వెండి వస్తువులు, టీవీని పై ఇద్దరూ దొంగించారని డీఎస్పీ అన్నారు. వీరి నుంచి మొత్తం రూ.1.96 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మరో కేసులో.. ఇటీవల సామర్లకోటలోని మొబైల్ షాపులో చోరీ జరిగినట్లు ఎర్రంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాత ముద్దాయి సోమాదుల విష్ణును పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.70 వేలు ఉంటుంది. ఇతనికి ఇద్దరు మైనర్లు సహకరించారు. వీరికి సర్పవరం, అన్నవరం కేసులతో సంబంధం ఉందని పోలీసులు వివరించారు. కాగా ఇటీవల మెహర్ కాంప్లెక్స్లో టీవీఎస్ షోరూమ్ షట్టర్ తొలగించి రూ.1.60 లక్షలు దొంగిలించిన నేరాన్ని వీరు అంగీకరించారు. నిందితులను వేగంగా పట్టుకున్న క్రెం సీఐ అంకబాబు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ఇతర సిబ్బందికి ఎస్పీ రివార్డులు ప్రకటించగా, వాటిని డీఎస్పీ అందజేశారు. -
వణికించిన గాలివాన
● పలు మండలాల్లో ప్రకృతి బీభత్సం ● ఈదురు గాలులు, కుండపోత వర్షంతో అతలాకుతలం ● నేలకూలిన చెట్లు, అరటి, కంద తోటలు ● ఒరిగిన విద్యుత్ స్తంభాలుపెరవలి/తాళ్లపూడి/సీతానగరం/దేవరపల్లి: జిల్లా లోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి బలమైన ఈదురు గాలులు, కుండపోత వర్షం బీభత్సం సృష్టించాయి. తీవ్రమైన గాలులు ప్రజలను హడలెత్తించాయి. గాలులు, వర్షం ప్రభావంతో అరటి, కొబ్బరి, మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు నేల కూలాయి. జిల్లావ్యాప్తంగా 6 వేల హెక్టార్లలో అరటి సాగు జరుగుతూండగా ఇందులో ఈనిన తోటలు 4 వేల హెక్టార్లు ఉన్నాయి. గాలుల తాకిడికి 800 హెక్టార్లలో తోటలు నేలమట్టమయ్యాయన్నది అధికారులు ప్రాథమిక అంచనా. ఒక్క నిడదవోలు నియోజకవర్గంలోనే 1,257 ఎకరాల్లో అరటి పంట నాశనమైందంటూ అధికారులు నివేదికలు ఇచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టం జరిగితే, వెంటనే బీమా వచ్చేది. కానీ, కూటమి సర్కారు ఈ బీమాను తీసివేయటంతో ఒక్క పైసా కూడా రాదని, కనీసం ప్రభుత్వమైనా నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. గాలుల తాకిడికి అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో చలువ పందిరి కూలిపోయింది. జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో చెట్లు విరిగి పడటంతో పెరవలి – తణుకు మధ్య సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ● తాళ్లపూడి మండలంలో కేవలం 20 నిమిషాల పాటు వీచిన గాలులు, కురిసిన కుంభవృష్టితో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఇళ్లపై రేకులు, ఫ్లెక్సీలు గాలికి ఎగిరిపోయాయి. వందలాది ఎకరాల్లో అరటి, కంద తోటలు నేలవాలాయి. చాలాచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపోవడంతో గురువారం రాత్రి 7 గంటల నుంచే చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ● సీతానగరం మండలం పురుషోత్తపట్నం రైతు సేవా కేంద్రం పిడుగు పడి, ధ్వంసమైంది. పిడుగుపాటుకు చెలరేగిన మంటల్లో అందులోని గోనె సంచులు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ● ఈదురు గాలుల బీభత్సానికి గోపాలపురం నియోజకవర్గంలోని మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కాయలు పూర్తిగా నేల రాలాయి. నల్లజర్ల మండలంలో మామిడికి ఎక్కువ నష్టం వాటిల్లింది. టన్ను కాయల ధర రూ.20 వేలు పలికేదని, ఇప్పుడు కాయలు రాలిపోవడంతో ధర దారుణంగా రూ.4 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పగలు ఉక్కపోత.. రాత్రి కుండపోత
● గంటపాటు దంచి కొట్టిన వాన ● తోడైన ఈదురు గాలులు ● విద్యుత్ సరఫరాకు అంతరాయందేవరపల్లి: పగలంతా 43 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఉక్కపోతతో సతమతమైన జిల్లా ప్రజలు.. గురువారం రాత్రి ఒక్కసారిగా కురిసిన కుండపోత వర్షంతో సేద తీరారు. దేవరపల్లి, రాజమహేంద్రవరం, రాజానగరం తదితర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం 6 గంటలకు వాతావరణం చల్లబడింది. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురు గాలులు వీచాయి. చూస్తూండగానే మొదలైన వాన దాదాపు గంట నుంచి రెండు గంటల పాటు దంచి కొట్టింది. రాత్రి కూడా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. వాతావరణం చల్లబడటంతో ఉష్ణతాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. మెట్టతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్ల కొమ్మలు, హోర్డింగులు పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. బలమైన గాలులకు జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్నాళ్లుగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలకు ఎండిపోతున్న ఉద్యాన పంటలు జీవం పోసుకున్నాయి. నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు పెదపూడి: మండలంలోని చింతపల్లి – జి.మామిడాడ గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డులో గురువారం ఉదయం వీచిన ఈదురు గాలులకు సుమారు 50 భారీ వృక్షాలు, 20 విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. దీంతో, ఉదయం 10 గంటల నుంచి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. గాలుల తాకిడికి రాజుపాలెం, గండ్రేడు గ్రామాల్లో రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. ఫలితంగా రాజుపాలెం, పైన, వేండ్ర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని, సాయంత్రానికి సరఫరాను పునరుద్ధరించారు. డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన గ్రామ పంచాయతీ, ఇతర అధికారులు, స్థానికుల సహాయంతో రోడ్డుపై విరిగి పడిన భారీ వృక్షాలను తొలగించారు. -
కొనుఘొల్లు
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026● మొక్కజొన్న కొనుగోలు చేయని ప్రభుత్వం ● ఎక్కడికక్కడ పేరుకుపోయిన నిల్వలు ● క్వింటాల్కు మద్దతు ధర రూ.2,100 ● రూ.1,600కు అడుగుతున్న దళారులు ● దిక్కు తోచని స్థితిలో రైతులుపెరవలి: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం దళారులకొదిలేసింది. దండిగా దిగుబడి వచ్చిన వేళ.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గత్యంతరం లేక రైతులు.. దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా వారు అయిన కాడికి అడుగుతూ, రైతు కష్టాన్ని దోచుకుంటున్నారు. 16,713 ఎకరాల్లో.. జిల్లావ్యాప్తంగా 16,713 వేల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట విస్తీర్ణం 1,500 ఎకరాలు పెరిగింది. దీంతోపాటు గతంలో దిగుబడి 30 క్వింటాళ్లు వస్తే ఈ ఏడాది 35 నుంచి 40 క్వింటాళ్ల వరకూ వస్తోంది. దండిగా దిగుబడి వస్తున్నా ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ నిర్వాకంతో ఎక్కడి నిల్వలు అక్కడే పేరుకుపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో దళారులు రంగంలోకి దిగారు. క్వింటాల్ మొక్కజొన్నకు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,100 కాగా, దళారులు అరువు అయితే రూ.1,800, వెంటనే నగదు ఇవ్వాలంటే రూ.1,600కే అడుగుతున్నారు. పంటను నిల్వ చేసుకోలేక, తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. అప్పు చేసి, సాగు చేసిన కొందరు రైతులు మాత్రం మరో దారి లేక అయిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. పడిపోయిన ప్రభుత్వ ‘మద్దతు’ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించింది. 2019 నుంచి 2024 వరకూ మొక్కజొన్న రైతులకు స్వర్ణయుగమనే చెప్పాలి. గత ప్రభుత్వంలో ఽక్వింటాల్ మద్దతు ధర రూ.2,600 ఉండగా.. నేడు ప్రభుత్వం రూ.2,100కు తగ్గించింది. మద్దతు ధర ప్రకటనతోనే రైతులకు లాభం సగానికి సగం తగ్గిపోయినట్లయ్యింది. ఎకరం మొక్కజొన్న సాగుకు రూ.55 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. మద్దతు ధర ప్రకారం రైతులకు లాభం చేకూరాలి. కానీ, ప్రభుత్వం దళారులకు వదిలేయడంతో దారుణంగా నష్టపోతున్నామని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. దళారులు చెబుతున్న రూ.1,600 రేటుకు పెట్టుబడి సొమ్ము మాత్రమే వస్తోందని అంటున్నారు. అదే కౌలు రైతులైతే ఏమాత్రం మిగులకపోగా చేతి సొమ్ము పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దెబ్బ మీద దెబ్బ గత ఏడాది మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయంలో బర్డ్ప్లూ సోకి లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. మొక్కజొన్న దిగుబడిలో 80 శాతం కోళ్ల ఫారాలకు మేతగా వెళ్లేది. ఇప్పుడు కోళ్ల పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూండటంతో వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. దీనికి తోడు ఈ ఏడాది ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు వచ్చినా గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లయ్యింది. నష్టపోతున్నాం మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోంది. కేవలం మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదు. – మిద్దే వీరాంజనేయులు, రైతు, కానూరు అగ్రహారం ఏమిటీ దారుణం? మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో, దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మద్దతు ధర రూ.2,100 ఉంటే దళారులు కేవలం రూ.1,600కు అడుగుతున్నారు. ఏమిటీ దారుణం?. – జన్ని వెంకటేశ్వర్లు, రైతు, కానూరు -
కారాఘోరం!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కేంద్ర కారాగారంలోనే ఖైదీలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉత్తర ప్రదేశ్కు చెందిన ఖైదీలు యోగేంద్ర సింగ్, సాహుల మధ్య బుధవారం ఘర్షణ జరగడం.. వీరిలో సాహు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రి పాలవడం విదితమే. ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఈ ఇద్దరు ఖైదీల మధ్య కొన్నాళ్లుగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతో ఒక్కసారిగా పరస్పర దాడులకు దిగినట్లు సమాచారం. సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చినా.. ఈ సంఘటన జైలులో భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా జైలులో ఉన్నప్పుడే ఖైదీల ప్రవర్తన అదుపు తప్పితే.. ఇక వారు విడుదలయ్యాక పరిస్థితి ఏవిధంగా ఉంటుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అనుమానాలెన్నో... సిబ్బంది పర్యవేక్షణలో అదుపులో ఉండాల్సిన ఖైదీలు ఇలా ఘర్షణకు దిగడం వెనుక జైలు అంతర్గత వ్యవస్థ వైఫల్యం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జైళ్లలో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు బయటపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో కూడా కొందరు ఖైదీలు అక్రమ మార్గాల్లో ఫోన్లు, మత్తు పదార్థాలు వినియోగించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. సిబ్బంది చేతులు తడిపితే జైలులో ఏదైనా సాధ్యమేననే ఆరోపణలున్నాయి. అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు ఖైదీల సంస్కరణకు కేంద్రాలుగా ఉండాల్సిన జైళ్లు, వర్గ పోరాటాలకు వేదికలుగా మారుతున్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. ఖైదీల ఘర్షణకు కారణాలేమిటి.. ఎవరి నిర్లక్ష్యం వల్ల వారు కొట్టుకునే స్థాయికి వెళ్లారు.. ఖైదీల మధ్య పరస్పర సంబంధాలు.. పాత కక్షలు, ఆధిపత్య పోరు, బయట ఉన్న అనుచరులతో సంబంధాలు కొనసాగుతున్నాయా తదితర అన్ని అంశాలపై లోతైన విచారణ చేపట్టి, జైలులో శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరాన్ని ఈ సంఘటన చెప్పకనే చెబుతోంది. తాజా ఘటన తర్వాత జైలు అధికారుల తనిఖీలు మరింత కఠినతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 1,200 మంది ఖైదీలకు మాత్రమే అవకాశం ఉంది. కానీ, ఇక్కడ 1,300 మంది ఖైదీలున్నారు. వీరందరినీ పర్యవేక్షించేందుకు కేవలం 120 మంది సిబ్బందే ఉన్నారు. వాస్తవానికి జైలులో అన్ని క్యాడర్లూ కలిపి 212 మంది సిబ్బంది ఉండాలి. కానీ, 92 పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. సిబ్బంది కొరత కారణంగా ఖైదీల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. జైలులోని సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించాలి. ఉన్న సిబ్బందే అరకొర కావడంతో ప్రతి షిఫ్టులో అందుబాటులో ఉండాల్సిన వారి సంఖ్య చాలడం లేదని సమాచారం. ఇప్పటికే ఉన్న సిబ్బంది తీవ్ర ఒత్తిళ్ల నడుమ పని చేస్తూండగా, ఖైదీల సంఖ్య పెరగడం వారిపై మరింత భారాన్ని పెంచుతోంది. హత్య కేసుల నిందితులు, రౌడీషీటర్లు, హైరిస్క్ ఖైదీలపై జైలు సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచాలి. కానీ, సిబ్బంది కొరతతో పూర్తి స్థాయి నిఘా పెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది. ఫిర్యాదు చేశాం సెంట్రల్ జైలులో ఇద్దరు ఖైదీలు కొట్లాడుకున్న సంఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. దీనిపై దర్యాప్తు జరుగుతోంది. సెంట్రల్ జైలులో సిబ్బంది కొరత ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. జైలులో శాంతిభద్రతలు చాలా బాగున్నాయి. – ఎస్.రాహుల్, సెంట్రల్ జైలు సూపరింటెండెంట్, రాజమహేంద్రవరం ఖైదీల కొట్లాటతో కలకలం సెంట్రల్ జైలులో భద్రతపై కలవరం మొత్తం ఖైదీలు 1,300 ఉండాల్సిన సిబ్బంది 212 ఉన్నవారు 120 మంది అరకొర సిబ్బందితో ఇబ్బందులు -
● కూటమిగా బరితెగింపు
ప్రజలు మెచ్చే పనులేవీ చేయని కూటమి నాయకులు ప్రచారం మాత్రం పీక్స్లో చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రజలకు నిత్యం తమ ముఖాలు మాత్రమే కనిపించేలా భారీ ఫ్లెక్సీలు వేయిస్తున్నారు. వీటిని ఆయా నాయకుల స్థలాల్లో ప్రదర్శించుకుంటే ఎవ్వరికీ అభ్యంతరాలుండవు. కానీ, ఏకంగా సచివాలయాన్నే మూసివేసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. కడియం మండలం జేగురుపాడు పంచాయతీలో అమ్మవారి జాతర శుభాకాంక్షల నెపంతో.. జనసేన, టీడీపీ నాయకులు తమ ఫ్లెక్సీలను నేరుగా గ్రామ సచివాలయానికే కట్టేశారు. సచివాలయం బోర్డును కూడా మూసివేసేలా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటువంటి బరితెగింపు వ్యవహారాలపై అభ్యంతరం చెప్పాల్సిన అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి టాస్క్ఫోర్స్ -
రైతు సేవా కేంద్రంపై పిడుగు
● కూలిన శ్లాబు ● గోనె సంచులకు మంటలు సీతానగరం: పురుషోత్తపట్నంలోని రైతు సేవా కేంద్రం(ఆర్ఎస్ఎకే)పై పిడుగు పడి మంటలు చెలరేగడం గ్రామంలో కలకలం రేపింది. గురువారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసింది. ఆ సమయంలో ఆర్ఎస్కే భవనంపై ఒక్కసారిగా పిడుగు పడింది. దాని తాకిడికి శ్లాబ్ ధ్వంసమై, లోపల ఉన్న గోనె సంచులకు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు. సమాచారం అందడంతో రాజమహేంద్రవరం నుంచి అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి ఫైరింజన్తో మంటలను అదుపు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనేది శుక్రవారం అంచనా వేస్తామని మండల వ్యవసాయ అధికారి గౌరీదేవి చెప్పారు. -
విద్యుత్ కోతలపై మహిళల నిరసన
● మద్దతుగా నిలిచిన వైఎస్సార్ సీపీ ● సబ్ స్టేషన్ను ముట్టడించిన నాయకులు కాట్రేనికోన: విద్యుత్ శాఖ ఇష్టారాజ్యంగా కోతలు విధించడంతో కాట్రేనికోన విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించిన మహిళలకు మద్దతుగా వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మండల కేంద్రంతో పాటు శివారు ప్రాంతాల వారు కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. మండలంలో విద్యుత్ లైన్లు 1996 తుపానుకు వేసినవి కావడంతో శివారు ప్రాంతాల్లో పాడైపోయాయని, మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి ఓఎన్జీసీ (వేదాంత) సంస్థకు చెందిన భారీ వాహనాల రాకపోకల కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ నల్లా నరసింహమూర్తి, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు గంటి వెంకట సుధాకర్ అన్నారు. కరెంట్ లేక మహిళలు, వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాట్రేనికోన, ఉప్పూడి ఫీడర్ నుంచి వేట్లపాలెం, సత్తెమ్మ చెట్టు, రాజానగరం, కాపులపాలెం, నాగపట్టణం, మర్రిచెట్టు కాలనీ, గచ్చకాయలపోర, చిర్రయానంలకు కరెంట్ కోత అధికంగా ఉండటంపై మండిపడ్డారు. సిబ్బంది అలసత్వంపై విద్యుత్ శాఖ ఎస్ఈ బి.రాజరాజేశ్వరికి ఫోన్లో వివరించారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ నాయకులు సంగాని మునేంద్ర, కముజు మల్లికార్జునరావు, రంబాల శ్రీను, నల్లా చిన్నాజీ, గిడ్ల శ్రీనివాసరావు, నీలం బాలయ్య పాల్గొన్నారు. విద్యార్థినికి అబార్షన్పై డీఎంహెచ్ఓ విచారణ అమలాపురం టౌన్: స్థానిక నల్ల వంతెన ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్ విద్యార్థినికి అబార్షన్ చేసిన ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఎం.దుర్గారావుదొర, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ భరతలక్ష్మి విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినికి అబార్షన్ చేసిన విధానం, కేస్ షీటు తదితర అంశాలను పరిశీలించారు. అబార్షన్కు వాడిన మందులు, కేస్షీటులో పేర్కొన్న మందులకు పొంతన లేదని గుర్తించారు. విచారణ అంశాలను కలెక్టర్ మహేష్కుమార్కు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ జి.మమ్మీ, డీఎంహెచ్ఓ దుర్గారావుదొర, ఐసీడీఎస్ పీఓ కె.నాగమణి తదితర అధికారులతో కలెక్టర్ ఓ కమిటీని నియమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్కు రెండు రోజుల్లో అందజేస్తామని డీఎంహెచ్ఓ డాక్టర్ దుర్గారావుదొర తెలిపారు. మూతపడిన ఆస్పత్రి ఈ ఘటనతో విద్యార్ధినికి అబార్షన్ చేసిన ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని డీఎంహెచ్ఓ ఆస్పత్రి వైద్యురాలు శిరీషను ఆదేశించారు. ఆస్పత్రిలో అబార్షన్ అయి, చికిత్స పొందుతున్న విద్యార్థినికి మాత్రమే వైద్యం అందించాలని సూచించారు. కొత్తగా పేషెంట్లను పరీక్షించడం గాని, చేర్చుకోవడం గాని వద్దని ఆదేశించారు. ఈ ఘటనపై నిందితులపై కేసులు నమోదు కాలేదు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిసింది. ఆస్పత్రి వద్ద మోటారు సైకిళ్లు వదిలేసి విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులు పరారయ్యారు. ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహణను ప్రభుత్వ వైద్యాధికారిణి పర్యవేక్షిస్తున్న తీరును విచారణ కమిటీ తప్పు పడుతోంది. -
పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేత!
కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం మొండి వైఖరి కారణంగా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే. ఆఖరి దశ చర్చల్లో పర్మినెంట్ కార్మికులు 11 మంది, కాంట్రాక్టు కార్మికులు 59 మంది మినహా మిగిలిన వారందరూ విధులకు హాజరు కావచ్చంటూ యాజమాన్యం తరఫున కొద్ది రోజులుగా అనధికారిక రాయబారాలు కొనసాగిస్తున్నారు. అయితే, రాజమహేంద్రవరంలో గురువారం 11 మంది పర్మినెంట్ కార్మికులపై విచారణ జరిగింది. ఈలోపునే మిల్లులోని డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి లాకౌట్ ఎత్తివేసినట్లు పర్మినెంట్ కార్మికులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. శుక్రవారం నుంచి విధులకు రావాలని చెబుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా నిష్కారణంగా లాకౌట్ ప్రకటించి, ఇప్పుడు ఎత్తివేస్తున్నట్లు కూడా చెబుతూండటంపై కార్మిక వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలూ లేకపోవడాన్ని కార్మికులు విమర్శిస్తున్నారు. యాజమాన్యం తీరు ఎప్పుడూ ఇలా ఏకపక్షంగానే ఉంటోందని, ప్రభుత్వ యంత్రాంగం దీనిపై సమగ్రంగా దృష్టి పెట్టి, తమ హక్కులు కాపాడాలని వారు కోరుతున్నారు. అయితే, 11 మంది పర్మినెంట్, 59 మంది కాంట్రాక్టు కార్మికులను కూడా అనుమతిస్తేనే విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించినట్లు సమాచారం. యాజమాన్యం పిలుపునకు కార్మికులు ఎంతవరకూ స్పందిస్తారో వేచి చూడాలి. -
పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి
నిడదవోలు: పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిడదవోలు రైల్వే స్టేషన్ వద్ద ఐఎఫ్టీయూ ఆధ్వర్యాన ఆటో కార్మికులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఉన్నత విద్య అభ్యసించి కూడా ఉద్యోగాలు దొరక్క, అప్పులు చేసి మరీ ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్నామని, ఇంధన ధరల పెంపుతో తమ జీవనోపాధి కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు గెడ్డం రవీంద్రబాబు, ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ, ఒకే దేశం, ఒకే పన్ను అంటూ కేంద్రంలోని మోదీ, అమిత్షాల ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అదనపు పన్ను వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించడం ద్వారా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. తద్వారా అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు పెరిగేందుకు దొడ్డి దారిన అవకాశం కల్పిస్తూ పేదల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బహిరంగ సభల్లో పెట్రో ధరలు పెంచబోమని మాయమాలు చెప్పిన కూటమి నేతలు.. ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మరిచారని, కేంద్రం ఇష్టారాజ్యంగా పెట్రో ధరలు పెంచుతుంటే వంత పాడుతున్నారని దుయ్యబట్టారు. తక్షణమే రాష్ట్ర పన్ను వాటాలోనైనా రవాణా రంగ కార్మికులకు మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. -
నేడు, రేపు డీఎస్ఏలో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో గురు, శుక్రవారాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ను ఎల్ఈడీ స్క్రీన్స్పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత దత్త గురువారం తెలిపారు. స్థానిక కృషీభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐపీఎల్ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫ్యాన్ పార్స్క్ను నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి మ్యాచ్లను ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరీష్ మాట్లాడుతూ క్రికెట్ అభిమానులకు ఫ్యాన్ పార్కు ఒక పెద్ద పండుగ లాంటిదన్నారు. స్టేడియానికి వెళ్లలేని అభిమానులకు తమ నగరంలోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి స్టేడియంలో ఉన్న అనుభూతిని కల్పిస్తుందన్నారు. సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, చిల్ట్రన్స్ గేమ్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు ద్వారకాతిరుమల: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేసి, పిల్లలతో సహా ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసిన భర్త, అత్తమామలపై గురువారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే. మండలంలోని దేవినేనివారిగూడేనికి చెందిన కావేరికి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, రేమెల్ల గ్రామానికి చెందిన కొనకాల ఉమామహేశ్వరరావుతో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వివాహ సమయంలో కావేరి తల్లిదండ్రులు వరకట్నంగా రూ. 5 లక్షలు, 30 సెంట్ల భూమి, బంగారు ఆభరణాలను ఇచ్చారు. మద్యానికి అలవాటుపడిన భర్త తనను చిత్రహింసలు పెట్టడంతో పాటు, అదనపు కట్నం కోసం అతని తల్లిదండ్రులు కొనకాల సావిత్రి, దుర్గారావులు వేధిస్తున్నారని కావేరి పేర్కొంది. గతేడాది జూన్ 8న తనను కొట్టి, పిల్లలతో పాటు ఇంటి నుంచి బయటకు గెంటేసినట్టు కావేరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
ఉష్ణోగ్రతలతో పెరిగిన విద్యుత్ వినియోగం
● అంతరాయాల నివారణకు కంట్రోల్ రూమ్లు ● విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ ప్రసాద్ సాక్షి, పాడేరు: కొద్దిరోజులుగా ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అల్లూరి సర్కిల్ విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాల గాలులు, పిడుగులతో కూడిన వర్షాలతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. తమ సర్కిల్ పరిధిలోని ఈ రెండు జిల్లాల వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పాడేరులోని సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ (టెక్నికల్) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్ నంబరును సంప్రదించాలని ఎస్ఈ కోరారు. సెంట్రలైజ్డ్ టోల్ఫ్రీ నంబర్ 1912, సర్కిల్ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు పాడేరు డివిజన్ 9440812491 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), పోలవరం జిల్లా పరిధిలో 73825 85554, 94906 10027 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. -
ఆన్లైన్ సేవలు సద్వినియోగం చేసుకోండి
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఆన్లైన్ సేవలను మనమిత్ర వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. గురువారం ఆలయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే అర్చకులు, వేద పండితుల బృందం సభ్యులు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ ఆవరణలో సామూహిక అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి తొలి హారతి, సుప్రభాత సేవ, వేంకటేశ్వర సహిత లక్ష్మీ హోమం జరిపారు. వడగాడ్పుల నేపథ్యంలో ఆలయ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. -
పట్టపగలే సంచోరిస్తూ..
● అదును చూసి దొంగతనాలు ● నిందితుడిని పట్టుకున్న సర్పవరం పోలీసులు కాకినాడ రూరల్: పట్టపగలే దొరలా వస్తాడు.. అదును చూసి దోచుకుపోతాడు.. ఇలా కొన్నేళ్లుగా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2024, 2025, 2026లో ఆరు పగటి పూట చోరీ కేసులు నమోదయ్యాయి. ఇందులో నిందితుడు కాకినాడ అర్బన్ రేచర్లపేట బర్మాకాలనీకి చెందిన ములపర్తి దుర్గాప్రసాద్ (నాని) అనే ప్రసాద్ను సర్పవరం పోలీసులు ఆర్టీఓ కార్యాలయం రోడ్డులోని కోటయ్య కన్వెన్షన్ హాలు వద్ద గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.32 లక్షల విలువైన 225 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడతుండగా పోలీసులకు మాత్రం చిక్కడం ఇదే మొదటి సారి అన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళాలు బయటకు కనపడేలా వేయరాదని, ఇళ్లకు ఇన్నర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) అనే పోలీస్ అప్లికేషన్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు యాప్లో రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఉచిత పోలీసు సర్వీస్ను ఉపయోగించుకుని, నేరాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. సర్పవరం సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్సై ఏసుబాబు, క్రైం ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ధరల్లో ఊరగాయాలు
● చుక్కల్లో మామిడి ధర ● ఆవకాయ రుచికి దూరం ● భారీగా పెరిగిన ముడిసరకు ● నిల్వ పచ్చళ్ల తయారీపై ప్రభావం ఆలమూరు: ఘుమఘుమల సమ్మేళనం ఆవకాయ గొప్పదనం.. మామిడి కాయలు, గుంటూరు కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతులు, పప్పు నూనె కలిపి తయారు చేసే ఆవకాయకు అమృతపు రుచి వస్తోంది.. వేసవిలో ప్రతి ఇంటా ఈ తయారీ మొదలవుతుంది. తెలుగువారి నోట ఆవకాయ ముద్ద పడందే తృప్తి ఉండదు. దేశాలు దాటినా ఆవకాయ వాసన మాత్రం తెలుగువారిని తనవైపు లాక్కుంటుంది. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అన్నట్లు తెలుగువారి సంస్కృతిలో ఒదిగిపోయిన ఈ పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకొని తింటే ఆ అనుభూతి వేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల ప్రతి ఒక్కరి మదిలో ఈ రుచి పెనవేసుకుంది. నోరూరించే ఈ ఊరగాయలను తయారు చేసుకోవడం పెను భారమైంది. వంద మామిడి కాయలు కొనుగోలు చేస్తే సుమారు ఐదు కుంచాల ముక్కలు అవుతాయి. ఒక్కో కుంచం పచ్చడికి రూ.నాలుగు వేల వరకూ ఖర్చు అవుతుంది. వందకాయల ఆవకాయ పచ్చడి పెడితే దాదాపు రూ.20 వేల వరకూ ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం అన్నిచోట్ల పచ్చళ్ల సీజన్ ఊపందుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, వేరుశెనగ, గానుగ నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరకు కొరత అధికమైంది. ఈ ప్రభావం పచ్చళ్ల తయారీపై పడింది. తగ్గిన వ్యాపారం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారి పక్కన ఉన్న అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో, రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ, తుని, మండపేటలోని తదితర హోల్సేల్ మార్కెట్లో పచ్చడికి ఉపయోగించే మామిడికాయల ఽవ్యాపారం ఈ ఏడాది తగ్గిపోయింది. ఆ మార్కెట్లకు ప్రతి రోజూ నూజివీడు, కత్తిపూడి, జగ్గంపేట తదితర చాగల్నాడు, మెట్ట ప్రాంతాల నుంచి పచ్చళ్ల తయారీకి వినియోగించే మామిడి రకాలు గతంలో వందల టన్నుల్లో రాగా, ప్రస్తుతం పదుల సంఖ్యలోకి పడిపోయింది. గ్రామీణ ప్రాంత వ్యాపారులు అక్కడ నుంచి కొనుగోలు చేసుకున్న మామిడికాయలను పరిసర ప్రాంతాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపారులు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. మామిడికాయ రకాన్ని బట్టి ధర నిర్ణయించ బడుతుంది. ఎంతో ఇష్టంగా.. ఆవకాయ, మాగాయ, ఉల్లి ఆవకాయ తదితర పచ్చళ్లు అంటే అందరూ ఇష్టపడతారు. తొలి ఏడాది అత్తవారింటికి కోడలు తప్పనిసరిగా పచ్చళ్లు కావడి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. పచ్చళ్ల కావళ్లు స్థోమతను బట్టి ఉంటుంది. పెరిగిన ధరల ప్రభావం పెళ్లింట కూడా పడింది. పెళ్లిళ్లలో ఇటీవల తరచూ ఆవకాయ అన్నం, ఆవకాయ ఫ్రైడ్రైస్, ఆవకాయ పులిహోర, ఆవకాయ బిర్యానీ వంటి వంటకాలు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగింటి లోగిళ్లలో ఏ శుభకార్యం జరిగినా ఆవకాయను వడ్డించకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ ఆవకాయ తెలుగువారి కీర్తిని దశదిశలా చాటుతోంది. పచ్చళ్ల తయారీలో ఉపయోగించే ముడిసరకుల ధరలు ఇలా సరకులు గత ఏడాది ఈ ఏడాది కిలో ధర కిలో ధర అవకాయ కారం 400 650 మాగాయ కారం 310 550 గానుగ నూనె 380 450 వేరుశెనగ నూనె 180 270 ఆవాలు 150 220 మెంతులు 120 170 వెల్లుల్లి 200 250 ఉప్పు 12 20 పరిమితంగానే తయారీ పెరిగిన మామిడికాయ, ముడి సరకుల ధరతో ఊరగాయ పెట్టడం పెనుభారంగా మారింది. దీనివల్ల పరిమితంగానే ఆవకాయ, మాగాయి పచ్చళ్లు పెట్టుకున్నాం. వచ్చే ఏడాది వరకూ ఈ పచ్చళ్లు సరిపోవు. మార్కెట్ ముడి సరకుల ధరలు ఎప్పుడూ ఇంతలా పెరగలేదు. –పి.శివకల్యాణి, నార్కెడిమిల్లి, ఆత్రేయపురం మండలం -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
పెరవలి (కొవ్వూరు): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన మణికంఠ (26) రెండు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి తెలిపాడు. ఆ అమ్మాయితో వివాహం చేయాలని తెలపడంతో వారు నిరాకరించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది మోటార్ సైకిల్పై కొవ్వూరు మండలం మద్దూరు వద్ద గోదావరి బ్యారేజీ వద్దకు వచ్చి, అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు గోదావరిలో దూకిన సమయంలో బ్యారేజీ తలుపులపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. మద్యం మానుకోమన్నందుకు కుమారుడి ఆత్మహత్య తుని: మద్యం అలవాటు మానుకోవాలని తండ్రి చెప్పిన మాటలకు మనస్తాపం చెందిన కొడుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తుని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు కథనం ప్రకారం. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన పులుగు పెద్దిరాజుకు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు హైదరాబాద్లో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు పులుగు అనిల్కుమార్ (25) లారీ డ్రైవర్. వీరు ఉంటున్న పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా మద్యం అలవాటు ఉన్న అనిల్కుమార్ను తండ్రి పెద్దిరాజు మద్యం తాగడం మానేసి ఇంటి నిర్మాణానికి సహకరించాలని చెప్పాడు. దీంతో అనిల్కుమార్ బుధవారం రాత్రి మోటారు సైకిల్పై ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి రావికంపాడు – అన్నవరం మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నవరం రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ త్రినాథరావు తెలిపారు. 3న కాకినాడలో క్రికెట్ జట్టు ఎంపికలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జూన్ 3న కాకినాడ ఆర్ఎంసీ మైదానంలో జిల్లా క్రికెట్ క్రీడాకారిణుల ఎంపికలు జరుగుతాయని సంఘ కార్యదర్శి నక్కా వెంకటేష్ గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 7 గంటలకు సీనియర్ మహిళలు, అండర్–23, 19, 15 బాలికల విభాగాల్లో ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి గల వారు అర్హత ధ్రువపత్రాలు, క్రికెట్ డ్రస్, షూతో హాజరుకావాలని ఆయన కోరారు. బావిలో పడిన అప్పన్నెద్దు బయటకు తీసిన స్థానికులు తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం ప్రధాన రహదారిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చెంతన ప్రమాదవశాత్తూ అప్పన్నెద్దు బావిలో పడింది. ఇరుకుగా ఉన్న బావిలో పడడంతో సుమారు రెండు గంటలకుపైగా అప్పన్నెద్దు నరకయాతన అనుభవించింది. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని చాలాసేపు తాళ్లతో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో స్థానిక కాంట్రాక్టరు మంథా కృష్ణమూర్తి (నాని) జేసీబీని తీసుకువచ్చి బావికి సమాంతరంగా తవ్వారు. తరువాత బావి వరను పగులగొట్టి అప్పనెద్దును జాగ్రత్తగా బయటకు లాగారు. మానవత్వంతో అప్పన్నెద్దును బయటకు తీసి కాపాడిన వారందరికీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. అంబాజీపేట కొబ్బరి మార్కెట్ కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పార్టీ సమావేశంలో..
తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. బాలురే డ్రైవర్లు! తాళ్లరేవు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు.. మట్టిని తరలిస్తూ బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లు దొరక్క బాలురతో ట్రాక్టర్లను నడిపించేస్తున్నారు. ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ట్రాక్టర్లతోపాటు భారీ వాహనాలైన జేసీబీలను కూడా పట్టుమని పదేళ్లయినా నిండని పిల్లలతో డ్రైవింగ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం పి.మల్లవరం పంచాయతీ పెదపేటలో మట్టిని ట్రాక్టర్లతో తరలించారు. ఆ మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపే జేసీబీ డ్రైవర్ ఒక బాలుడు కావడం గమనార్హం. 14 ఏళ్ల లోపు ఉండే ఆ బాలుడు ప్రమాదకర రీతిలో జేసీబీని ఆపరేట్ చేయడాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. సాధారణంగా 18 ఏళ్లు దాటితేనే తప్ప టూవీలర్ లైసెన్స్ మంజూరు చేయరు. అలాంటిది 14 ఏళ్ల లోపు బాలుడు జేబీసీని ఆపరేట్ చేయడం గమనార్హం. మట్టి ట్రాక్టర్లను కూడా లైసెన్స్లేని బాలురు నడుపుతున్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి మట్టి మాఫియా ఆగడాలను నియంత్రించాలని, బాలురు వాహనాలు నడపకుండా చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. -
ఐపీఎల్ ఫీవర్!
పల్లెల్లో సైతం అదే క్రేజ్ క్రికెట్కు పల్లెల్లో సైతం క్రేజ్కు తక్కువేమీ లేదు. చిన్న పిల్లలు సైతం బ్యాట్, బాల్, మూడు నాలుగు కర్రముక్కలు పట్టుకుని మైదానాల బాట పడుతున్నారు. పగటి పూట మైదానంలో సాధన.. రాత్రి పూట టీవీల్లో ఐపీఎల్ వీక్షణగా సాగుతున్నాయి పల్లె యువత వేసవి సెలవులు. క్రీడల ప్రోత్సాహానికి చిన్నారుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే నాణ్యమైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – ముత్యాల పవన్ కిశోర్, పీడీ, జెడ్పీ ఉన్నత పాఠశాల, ముక్కామల ● పగలు సాధన.. రాత్రి వీక్షణ.. ● పల్లెల్లో సందడి చేస్తున్న యువత ● ఉత్సాహంగా వేసవి సెలవులు కొత్తపేట: కళ్లు చెదిరే ఫోర్లు.. ఆకాశాన్నంటే సిక్సులు.. మిరుమిట్లు గొలిపే లేజర్ షో.. చీర్ గళ్స్ చిందులు.. ప్రపంచ క్రికెట్లో మేటి ఆటగాళ్ల ఏకై క వేదిక ఐపీఎల్. ప్రపంచంలో ఏ క్రీడకూ లేని క్రేజ్ క్రికెట్ సొంతం. ఐపీఎల్ 19వ సీజన్ చివరి అంకానికి చేరింది. అభిమాన జట్ల విజయాలు.. అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభకు ఈలలు, చప్పట్లు, అరుపులు కేకలతో మజాను ఆస్వాదిస్తున్నారు. వేసవి సెలవుల్లో.. పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మార్చి నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభమైంది. అన్నీ కలిసొచ్చాయి. క్రికెట్ కిట్లు తీశారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదానాల్లో టీమ్లుగా విడిపోయి క్రికెట్ మ్యాచ్లు. రాత్రి ఇళ్లలో ఐపీఎల్ మ్యాచ్ల సందడి. -
● వెనుక చూపేదీ?
ప్రయాణమేదైనా లక్ష్యం వెనకున్నవారి శ్రేయస్సు కోసమే. ఆ ప్రయాణమే ప్రమాదకరంగా ఉంటే.. ఆ లక్ష్యానికి అర్ధం లేదు. ఇదిగో ఈ చిత్రాలే అందుకు నిదర్శనం. ఎన్నో కుటుంబాలు వారి రాకకోసమో.. క్షేమంగా చేరారన్న సమాచారం కోసమో వారిళ్లలో ఎదురు చూస్తుంటారు. అనుకోని ఘటనలో జరగరానిది జరిగితే వారిపై ఆధారపడి ఉన్నవారి జీవితాలు తలకిందులేగా..! ఎవరి జీవితాలను వారు తేలిగ్గా తీసుకుని ఇలా ప్రయాణాలు చేస్తుంటే అధికారులు సదస్సులు, అవగాహనలు పెట్టి ఏం లాభం? మండల పరిధిలో నిత్యం రద్దీగా ఉండే హైవేలో నిత్యం చిన్నో పెద్దో ప్రమాదాలు మామూలే. వాహన చోదకులకు కాదు.. ప్రయాణికులకు ‘వెనుక’ చూపు ఎంతో అవసరం. – గండేపల్లి -
ఆరు ఇసుక లారీల సీజ్
సీతానగరం: మండలంలోని రఘుదేవపురం ర్యాంపు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు లారీలను మైన్స్ ఏడీ ఫణి భూషణ్రెడ్డి, అసిస్టెంట్ జియాలజిస్ట్ విఘ్నేష్ మంగళవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. రాత్రి సమయంలో ఇసుక రవాణ చేస్తున్న లారీలను అడ్డుకుని వాటి బిల్లులు పరిశీలించారు. వే బిల్లులు లేకుండా తరలిస్తున్న లారీలు, కొన్ని లారీలకు ఉదయం ఇచ్చిన వే బిల్లులు ఉండటంతో లారీలను సీజ్ చేసి సీతానగరం పోలీస్ స్టేషన్కు తరలించారు. రికార్డుల పరిశీలన అనంతరం లారీలకు జరిమానా విధించామని వారు తెలిపారు. -
వ్యర్థంతో అర్థం
వక్క చెట్టు (పోక చెట్టు)జిల్లాలో 200 ఎకరాలు సాగు అవుతుండగా ఆకులను రైతులు వ్యర్థాలుగా వదిలేస్తున్నారు. వీటిని సేంద్రియ ఎరువుగా తయారు చేయడంతోపాటు రకాల వస్తువులను తయారు చేస్తే రైతులు అదనపు ఆదాయం పొందే అవకాశముంది. దళసరిగా, బలంగా ఉండే ఈ ఆకుతో ఆహారం తినే ప్లేట్లు, బౌల్స్ తయారీకి ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా పర్యావరణానికి అనుకూలమైంది. వీటిని వాడటం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాలుష్యాన్ని నివారించే అవకాశముంది. ఈ ఆకులతో తయారు చేసిన ప్లేట్లలో రసాయనాలు ఉండవు. వేడి ఆహారాన్ని కూడా ఈ ఆకుల ప్లేట్లలో వడ్డించడం ఆరోగ్యానికి సురక్షితం. వక్క ఆకులతో పర్యావరణ అనుకూలమైన ప్లేట్లు, గిన్నెలు తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటికే అనకాపల్లి వంటి జిల్లాలో ఇటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేశారు. కాని జిల్లాలో సుమారు మూడు వేల ఎకరాల్లో వక్క సాగు జరుగుతున్నా ఇటువంటి పరిశ్రమలను మాత్రం ఏర్పాటు చేయలేదు. ఐ.పోలవరం: వ్యవసాయ వ్యర్థాలను అర్థవంతంగా వినియోగిస్తే మేలైన ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. వ్యవసాయ ఆధారిత కోనసీమ జిల్లాలో ఆ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా తక్కువే అని చెప్పాలి. కొబ్బరి డొక్కతో తప్ప మిగిలిన వ్యవసాయ వ్యర్థాలను వినియోగిస్తున్న దాఖలాలు లేవు. ఇటువంటి వాటితో మహిళా స్వయం శక్తి సంఘాలు, రైతు సంఘాలు, నిరుద్యోగ యువతతో చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశమున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తూడు, గుర్రపుడెక్కతో.. గోదావరి డెల్టా రైతులను కడగండ్లు పాల్జేసే తూడు, గుర్రపు డెక్కతో పలు రకాల ఉత్పత్తులను తయారు చేసే అవకాశముంది. ఇది వ్యవసాయ వ్యర్థం కాకున్నా జిల్లాలో వ్యవసాయానికి ప్రధాన అవరోధంగా మారిన విషయం తెలిసిందే. తూడు, గుర్రపు డెక్క ఇటు రైతులను, అటు ఇరిగేషన్ అధికారులను దశాబ్దాల కాలం పాటు ముప్పుతిప్పలు పెడుతున్న కలుపు మొక్కలు. కాలువల్లో టన్నుల కొద్దీ లభిస్తోంది. వీటి వల్ల జరుగుతున్న నష్టం భరించలేక రైతులు ఏటా ఐదు వేల ఎకరాల్లో వరిసాగునే వదిలేందుకు సిద్ధమవుతున్నారు. గోదావరి డెల్టా పరిధిలో పంట కాలువలు, మురుగునీటి కాలువల్లో పేరుకుపోతున్న వీటిని తొలగించేందుకు ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోంది. ● గుర్రపుడెక్కతో తయారు చేసే కంపోస్టులో పోషకాలు మెండు. కుళ్లిన గుర్రపుడెక్కను సేంద్రియ ఎరువుగా తయారు చేస్తే దానిలో సేంద్రియ కర్భనం 60 శాతం, సల్వమోతాదులో నత్రజని 2.5 శాతం, భాస్వరం 1.8 శాతం, పొటాషియం 4 శాతం ఉంటుంది. వీటితోపాటు మాలిడియన్, మెగ్నీషియం వంటి అరుదైన పోషకాలు ఉంటాయి. ఇది కొబ్బరి పొట్టుతో సమానంగా నీటి నిల్వను చేసి మొక్కకు అందజేస్తోంది. వరి చేలల్లో మిగిలిన పోషకాలు డ్రెయిన్లలో వెళ్లిన తరువాత గుర్రపుడెక్క ఎక్కువగా స్వీకరిస్తోంది. కంపోస్టుగా తయారు చేసి వినియోగిస్తే చేలల్లో నష్టపోయిన పోషకాలు చెట్లకు అందుతాయి. పంచాయతీలలో నిర్మించిన చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు ఖాళీగా ఉన్నాయి. రైతు సంఘాలు, మహిళా స్వయం శక్తి సంఘాలతో వీటిని ఉత్పత్తి చేయవచ్చు. ● గుర్రపు డెక్క నార తీసి చేతి సంచులు, బుట్టలు, ఇతర గృహోపకర అలంకార వస్తువులు తయారు చేసే అవకాశముంది. కృష్ణ, గుంటూరు జిల్లాలో డ్వాక్రా సంఘాలు వీటిని ప్రయోగాత్మకంగా తయారు చేస్తున్నాయి. ఇటువంటి వాటిని ఇక్కడ కూడా స్వయం శక్తి సంఘాల ద్వారా తయారు చేయించే అవకాశముంది. వ్యవసాయ వ్యర్థాలను సొమ్ము చేసుకోవచ్చు గుర్రపు డెక్క, తూడుతో సేంద్రియ ఎరువు నారతో అలంకరణ వస్తువులు అరటి నార, పోక ఆకులతో పలు ఉత్పత్తులు అరటి బొందలతో.. జిల్లాలో అరటి 15వేల ఎకరాల్లో పెద్ద ఎత్తున సాగవుతున్న విషయం తెలిసిందే. కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతోపాటు రాజోలు, మామిడికుదురు, ముమ్మిడివరం మండలాల్లో ఈ సాగు అధికం. అరటి గెలల సేకరణ తరువాత బొందలు, ఆకులను రైతులు వదిలేస్తున్నారు. వీటిని వినియోగించి సేంద్రియ ఎరువు తయారు చేయడంతోపాటు అరటి ఆకుల ఆహారాన్ని వడ్డించే కంచాలు, ప్లేటులుగా తయారు చేయవచ్చు. అరటి బొందల నుంచి నారను సేకరించి వీటితో కూడా గృహోపకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. జిల్లాలో గతంలో అరటి నారతో ఉత్పత్తుల తయారీకి పలు ప్రయోగాలు జరిగినా ఫలితం ఇవ్వలేదు. అంబాజీపేట మండలం ముక్కామల, రావులపాలెంలో ఈ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి పెద్దగా ప్రోత్సాహం లేకుండా ఉంది. -
‘నన్నయ’లో ఓపెన్ ఎయిర్ థియేటర్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన ఓపెన్ ఎయిర్ థియేటర్ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. పూర్వ విద్యార్థి అయిన ఎలైట్ ప్రాసెస్ టెక్నాలజీస్ ఇండియా ఎండి తోట సుబ్రహ్మణ్యం తన తండ్రి హరిబాబు సంన్మరణార్థం దీనిని నిర్మించారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. యూనివర్సిటీ పరంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇది చక్కటి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. దీనిని స్పూర్తిగా తీసుకుని పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో దాత సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతోపాటు రిజిస్టార్ ఆచార్య కెవి స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
బతుకు పోరులో మృత్యువేట
● ఆటోను లారీ ఢీకొని ఇద్దరి మృతి ● ఘటన స్థలంలో మహిళ.. ఆస్పత్రిలో ఆటో డ్రైవరు.. ● మరో ఐదుగురు మహిళలకు గాయాలు సామర్లకోట/కొత్తపల్లి: స్థానిక కాకినాడ రోడ్డులోని ఐదు తూముల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం బుధవారం ఉప్పాడ శివారు కొత్తపేటకు చెందిన ఆరుగురు మత్స్యకార మహిళలు, రామిశెట్టిపేటకు చెందిన ఎరిపల్లి ప్రేమకుమార్ (38) ఆటోలో ఉదయం మట్లపాలెంలో చేపలు కొనుక్కుని అక్కడి నుంచి సామర్లకోటలో విక్రయించేందుకు వస్తున్నారు. వారి ఆటోను తాడేపల్లిగూడెం నుంచి సామర్లకోట మీదుగా కాకినాడ వెళుతున్న లారీ ఐదు తూముల వద్ద ఢీకొంది. ఈ సంఘటనలో గంపల చిట్టెమ్మ (35) అక్కడిక్కడే మృతి చెందగా మిగిలిన వారంతా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అడపా గరగారావు క్షతగాత్రులను ఆటోలో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమకుమార్ మృతి చెందాడు. కాగా గరికిన సింహాద్రి, రామిశెట్టి నాగమణి, వెరిపల్లి చిట్టెమ్మ, మేకల పోరిమేరీ, దొడ్డి సత్యవతి చికిత్స పొందుతున్నారు. వీరిలో గరికిన సింహద్రి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిట్టెమ్మ మృతదేహాన్ని పెద్దాపురం సీహెచ్సీకి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఉప్పాడలో విషాదఛాయలు ఈ ప్రమాదంలో ఇద్దరు ఉప్పాడ వాసులు మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్ ప్రేమకుమార్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. అతడికి భార్య, కవల కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతడి మృతితో వారితో పాటు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కాగా చిట్టెమ్మ భర్త ఇటీవలే మృతి చెందాడు. చేపలు విక్రయంతో వచ్చిన సంపాదనతోనే తన ముగ్గురు కుమార్తెలకు వారు వివాహాలు చేశారు. కొంతకాలంగా చేపల వ్యాపారం మానేసిన ఆమె ఇటీవల 15 రోజులుగా వ్యాపారానికి వెళ్తోంది. ఆమె ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. -
వేంకటేశ్వర ఆలయంలో చోరీ
సామర్లకోట: మండల పరిధి అచ్చంపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రా చోరీ జరిగింది. స్వామివారికి నివేదన అనంతరం అర్చకుడు కృష్ణమాచార్యులు ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచేందుకు రాగా తెలుపులు తెరచి ఉన్నాయి. దీంతో స్వామివారి ఆభరణాలు పరిశీలించి చోరీ జరిగినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్, వేలిముద్ర నిపుణులు ఆలయానికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆలయ తాళాన్ని నకిలీ తాళంతో తెరిచినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ రమేష్బాబు, ఈఓ ప్రతాప్కుమార్ ఆలయానికి చేరుకుని స్వామి, దేవేరులకు అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించారు. మూడు కిలోల వెండి, మూడు కాసులు బంగారు ఆభరణాలు చోరీ జరిగిన్నట్లు అర్చకుడు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఆభరణాలకు బీమా చేయించినట్టు తెలిసింది. ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాతో ఫుటేజీ స్టోర్ అయ్యే హార్డ్డిస్క్ సైతం చోరీకి గురైనట్టు గుర్తించారు. దీంతో ఆలయానికి సంబంధించిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రామంలోని సెల్ షాపులో చోరీ జరిగి 24 గంటలు గడువక ముందే ఆలయంలో చోరీ జరగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. రూ.13 లక్షల విలువైన సొత్తు అపహరణ -
విద్యుదాఘాతంతో గడ్డి టెక్కీల దగ్ధం
అనపర్తి: విద్యుత్ తీగ తెగిపడి ఎండు గడ్డి టెక్కీలు అగ్నికి ఆహుతయ్యాయి. బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 1200 ఎండు గడ్డి టెక్కీలు దగ్ధమైనట్టు బాధిత రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విద్యుత్ లైన్కు సంబంధించిన తీగ తెగి రోడ్డు పక్కన నిల్వ ఉంచిన గడ్డి టెక్కీలపై పడడంతో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వీటిలో కొర్ల శ్రీనివాస్కు చెందిన ఐదు వందల టెక్కీలు, మందనక్క సత్యనారాయణకు చెందిన 300, కోరాడ రాఘవ 180, మహిపాల చంద్రరావుకు చెందిన 190 టెక్కీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న రామచంద్రపురం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గంజాయి కేసులో రెండు నెలల జైలు రాజమహేంద్రవరం రూరల్: ఎన్డీపీఎస్ కేసులో నామవరం డి బ్లాక్ ఒడియాపేటకు చెందిన భీమవరపు ఆదిలక్ష్మికి రెండు నెలలు జైలుశిక్ష విధిస్తూ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్టేట్ కోర్టు న్యాయమూర్తి కుమారి కె.సాయిమౌనికరావు బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గంజాయి కలిగి ఉన్న సమాచారంపై 2017 జూలై 25న ఆదిలక్ష్మిని అదుపులోకి తీసుకుని 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు సమగ్ర దర్యాప్తు అనంతరం పై విధంగా తీర్పు ఇచ్చారు. -
పుష్కరాలకు రోడ్ మ్యాప్ సిద్ధం
రాజమహేంద్రవరం రూరల్: 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు రోడ్ మ్యాప్ సిద్ధమైందని, ప్లాస్టిక్ రహితంగా పుష్కరాలను నిర్వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. బుధవారం హుకుంపేటలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గోదావరి కాలుష్య నివారణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ను నోడల్ ఏజెన్సీగా చేస్తూ, వివిధ శాఖల అధికారులతో కూడిన ’స్పెషల్ టాస్క్ ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఉదయమే జీవో విడుదలయిందన్నారు. త్వరలో ’పొల్యూషన్ ఆడిట్’ నిర్వహిస్తామని చెప్పారు. ‘ఎఫ్ లెంట్ ట్రీట్మెంట్ చేసే గోదావరిలోకి నీళ్లు వదులుతున్నామని ఆంధ్రా పేపర్ మిల్లు వారు మాకు దొంగమాటలు చెబుతున్నారు. నిన్న డిప్యూటీ సీఎం, నేను కళ్లారా చూసి నీటి గాఢతను చెక్ చేస్తే పీహెచ్ విలువ 7 కంటే ఎక్కువగా ఉంది. లాభాలు పొందుతూ కార్మికులకు కనీసం వేతనాలు ఇవ్వరు‘ అని పేపర్ మిల్లు యాజమాన్యంపై మంత్రి ఫైర్ అయ్యారు. మున్సిపాలిటీకి ఆంధ్రా పేపర్ మిల్లు రూ.13 కోట్ల బకాయిలను నేటికీ కట్టలేదని, ఇకపై ఉపేక్షించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. పరిశ్రమలు, ఇతరులు మురుగును నేరుగా నదిలోకి వదిలితే ఇకపై నేరుగా జైలుకు పంపుతామన్నారు. రూ. 8,500 కోట్లతో ప్రణాళిక పుష్కరాలు జరిగే 6 జిల్లాల పరిధిలో దాదాపు రూ.8,500 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విజ్జేశ్వరం – సిద్ధాంతం ఏటిగట్టు రహదారి (33 కి.మీ) అభివద్ధికి రూ. 66 కోట్లతో డిప్యూటీ సీఎంకు ప్రతిపాదనలు ఇచ్చామని మంత్రి తెలిపారు. సినిమా పరిశ్రమ అభివృద్ధికి డిప్యూటీ సీఎం ఇచ్చిన సలహాలను పాటిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. మంత్రి దుర్గేష్ -
అందుబాటులోకి శాశ్వత క్యూ కాంప్లెక్స్
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో పెద్ద తిరుపతిలో మాత్రమే ఉన్న శాశ్వత క్యూ కాంప్లెక్స్ను.. ఇప్పుడు చిన్నతిరుపతిలో నిర్మించి, భక్తులకు అందుబాటులోకి తెచ్చినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. శ్రీవారి క్షేత్రంలో రూ.12.50 కోట్లతో నూతనంగా నిర్మించిన క్యూ కాంప్లెక్స్ను బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా నూతన అనివెట్టి మండపంలో ఈఓ త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్, ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులతో కలసి విలేకరులతో మాట్లాడారు. పెద్ద తిరుపతిలో మినహా ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ దేవాలయంలోనూ శాశ్వత క్యూ కాంప్లెక్స్ లేదన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించాలన్న లక్ష్యంతో ఈ క్యూ కాంప్లెక్స్ను నిర్మించామన్నారు. ట్రైల్ రన్ వేసిన తరువాతే ఈ క్యూ కాంప్లెక్స్ను ప్రారంభించినట్టు చెప్పారు. గతంలో నిర్మించిన తాత్కాలిక క్యూ కాంప్లెక్స్ 3 వేల మంది భక్తులకు సరిపోయేదని, ఈ శాశ్వత క్యూ కాంప్లెక్స్లో ఒకేసారి 4,500 మంది భక్తులు కూర్చోవచ్చన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాడేందుకు ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. భక్తులకు నిరంతరాయంగా మంచినీటిని అందిస్తున్నామన్నారు. భక్తులు శ్రీవారి దర్శనానంతరం తిరిగి బయటకు వెళ్లి, అక్కడ ఉచిత ప్రసాదాన్ని అందుకుంటున్నారని అన్నారు. శాస్త్రబద్ధంగానే ఏర్పాట్లు.. నూతన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఇతర కట్టడాలు, దర్శన ఏర్పాట్లు పూర్వ ఆచారాలు, సనాతన సంప్రదాయాల ప్రకారమే జరిగాయని ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. స్వామివారిని ఎదురుగా దర్శించుకోవాలన్న కోరికను గతంలో భక్తులు తన వద్ద వ్యక్తపరిచారని ఇప్పుడు అది సాకారమైందని తెలిపారు. ఈఓ వేండ్ర త్రినాథరావు -
పథకాల అమలుకు నిరంతర పర్యవేక్షణ
● ఆర్జేడీ నాగమణి ● డీవైఈఓ, ఎంఈఓలకు ఒకరోజు శిక్షణ ● రూ.9 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు.. ● రూ.80 వేల నగదు అపహరణ రాజమహేంద్రవరం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, నాణ్యమైన బోధనా పద్ధతులు మెరుగు పరచడానికి నిరంతర పర్యవేక్షణ అవసరమని జోన్–2 ప్రాంతీయ విద్యా సంచాలకురాలు జి.నాగమణి పేర్కొన్నారు. పాఠశాలల పర్యవేక్షణపై జోన్–2 పరిధిలోని డీవైఈవోలు, ఎంఈవోలకు బుధవారం స్థానిక ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్సనలైజ్డ్ అడాప్ట్ లెర్నింగ్ (పాల్ ) ఎలా నిర్వహించాలి.. విద్యార్థుల సామర్ాధ్యలను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పటిష్ట అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. రాష్ట్ర పాల్ సమన్వయకర్త కిశోర్ బాబు, సీమాట్ సీనియర్ లెక్చరర్ ఎస్.ప్రసాద్, సమగ్ర శిక్ష సీనియర్ ఫ్యాకల్టీ మాధవీలత ఈ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ కంది వాసుదేవరావు, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి, తూర్పుగోదావరి జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్, సుమారు 200 మంది ఎంఈవోలు, డీవైఈఓలు, మానిటరింగ్ అధికారులు పాల్గొన్నారు. నడకుదురులో భారీ చోరీ కరప: మండలం నడకుదురులో భారీ దొంగతనం జరిగింది. ఇంటి తాళాలు బద్దలు కొట్టి లోపలి బీరువాలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైనట్టు పోలీసులు తెలిపారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందిగాన అరుణ్కుమార్, కోకిల దంపతులు నడకుదురులో నివసిస్తున్నారు. అరుణ్కుమార్ కాకినాడలో వైన్షాపులో పనిచేస్తుండగా, కోకిల అదే గ్రామంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నది. ఆమె ఈ నెల 22న బ్యుటీషియన్ తరగతుల నిమిత్తం విజయవాడ వెళ్లారు. ఈ నెల 25న అరుణ్కుమార్ వేసవి సెలవులకు విశాఖ వెళ్లి తన పిల్లలను తీసుకువచ్చేందుకు విశాఖ వెళ్లారు. 26న కోకిల తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరచి ఉండి బీరువా సైతం తెరిచి ఉంది. అందులోని 54 గ్రాముల బంగారు, 400 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.80 వేల నగదు చోరీకి గురైనట్టు ఆమె గుర్తించింది. సీసీ ఫుటేజీని పరిశీలించగా టోపీ ధరించిన వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సునీత సిబ్బందితో వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోక్సో కేసు నమోదు దేవరపల్లి: నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఓ యువకుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తైపె అత్యాచారం చేసిన కొక్కిరిపాటి కిరణ్ కుమార్పై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్ తెలిపారు. -
నీట్ పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే
గోకవరం: నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని, సంబంధిత మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరంజనేయులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సంఘం ఆధ్వర్యాన శివరామపట్నంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కర్నాకుల మాట్లాడుతూ, గతంలో కూడా అనేకసార్లు పేపర్ లీకవడంతో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని విమర్శించారు. ఈ ఏడాది కూడా నీట్ పేపర్ లీకవడంతో రేయింబవళ్లు కష్టపడి చదివిన సుమారు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేసిందన్నారు. నీట్ పరీక్షల నిర్వహణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కర్నాకుల డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్, రాష్ట్ర కన్వీనర్ కడితి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
పి.గన్నవరం: మండలంలోని వై.కొత్తపల్లి గ్రామానికి చెందిన రామేశ్వరపు వెంకటేశ్వరరావు (68) ఉపాధి పని చేస్తుండగా వడగాడ్పులకు తట్టుకోలేక మృతి చెందాడు. గ్రామంలో మంగళవారం ఉపాధి పథకం పనులు చేస్తుండగా ఎండ తీవ్రతకు అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో అతడిని సహచర కూలీలు పి.గన్నవరం సీహెచ్సీకి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి అమలాపురం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్థరాత్రి మృతి చెందాడు.రైలు ఢీకొని వ్యక్తి.. నిడదవోలు: స్థానిక రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్ వెంబడి నడచి వస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రైలు ఢీకొని అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయలో ఉన్నాడు. నలుపు రంగు జీన్స్ ప్యాంటు, తెలుపు, నలుపు రంగుల చొక్కా ధరించి ఉన్నాడు. తాడేపల్లిగూడెం రైల్వే హెస్సీ డి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శబరిలో మునిగి మహిళ.. చింతూరు: మతి స్థిమితం లేని మహిళ స్థానిక శబరినదిలో మునిగి మృతిచెందిన సంఘటన మండలం చట్టిలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన లాడె కుమారి (55) మతి స్థిమితం లేకపోవడంతో పాటు క్షయవ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం చింతూరు, వీఆర్ పురం ప్రధాన రహదారిలోని ఎయిర్టెల్ టవర్ వద్ద శబరినదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెంది ఉండవచ్చని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్కుమార్ తెలిపారు. పాముకాటుకు గురై..రాజానగరం: మండలంలోని తూర్పుగానుగూడేనికి చెందిన సిద్దాబత్తుల ధనలక్ష్మి (60) పాము కాటుకు గురై మృతి చెందింది. ఉపాధి కూలీ పనులు చేస్తూ జీవించే ఆమె మంగళవారం రాత్రి ఇంటి వద్ద బాత్రూంలో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తూర్పు గానుగూడెం క్రైస్తవ సంఘ ప్రతినిధి జి.సుందరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
గోకవరం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి శివారులో మంగళవారం జరిగింది. వివరాలు.. జగ్గంపేట మండలం మల్లిసాలకు చెందిన కందికట్ల ముసలయ్య, భార్య దుర్గ, కుమారుడు కందికట్ల లక్కీ (1), కుమార్తె నవ్యతో పాటు ముసలయ్య తమ్ముడు రమణకుమార్, దుర్గ సోదరి బల్లెల పద్మ (19), మరో యువకుడు కొండేపూడి వివేక్ (19) కారులో రంపచోడవరం వెళ్లారు.మల్లిసాలకు తిరిగి వస్తున్న క్రమంలో కొత్తపల్లి దాటిన తరువాత జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో కారు అదుపు తప్పి ట్రాన్స్ఫార్మర్ను, గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో వివేక్, పద్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఏడాది వయసున్న లక్కీ గోకవరం ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ముసలయ్య తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గోకవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోళ్లుకోలేని వడదెబ్బ
పెరవలి: వేసవి తాపానికి ప్రజలతో పాటు కోళ్లు కూడా గుడ్లు తేలేస్తున్నాయి. జిల్లాలో ప్రతి రోజూ 10 వేల కోళ్లు మృత్యువాతకు గురవుతున్నాయని పౌల్ట్రీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో బర్డ్ఫ్లూతో కోళ్ల పరిశ్రమ కుదేలైంది. ఇప్పడు అధిక ఉష్ణోగ్రతల వలన కోళ్లు మృత్యువాత పడటంతో యజమానులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోళ్ల ఫారాల నుంచి ఉత్పత్తి అవుతున్న గుడ్లకు గిట్టుబాటు ధర లభించకపోవటంతో మరింత ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు గుడ్లకు ధర లేక అల్లాడుతుంటే గోరుచుట్టుపై రోకటి పోటులా వడగాడ్పులకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయని, మరోవైపు కోళ్ల మేత ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కోళ్ల ఫారాలు ఇలా.. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 245 కోళ్ల ఫారాల్లో 1.50 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. ఇవన్నీ 50 వేలకు పైగా ఫారాలు. ఇవే కాకుండా 5వేల నుంచి 40 వేల సామర్థ్యం గల కోళ్ల ఫారాలు ఉన్నాయి. వీటిలో మరో కోటి కోళ్లను పెంచుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలోనే 70 లక్షల కోళ్లు, నిడదవోలు నియోజకవర్గంలో 50 లక్షల కోళ్లు, నల్లజర్ల, గోపాలపురం, కొవ్వూరు, కడియం నియోజకవర్గాల్లో మరో 30 లక్షల కోళ్ల పెంపకం జరుగుతున్నది. ఉత్పత్తి ఉన్నా తీవ్ర నష్టాలు జిల్లాలో కోడిగుడ్ల ఉత్పత్తి రోజుకి 60 లక్షలకు పడిపోయింది. అధిక ఉష్ణోగ్రతల వల్ల మేతలు తినక ఎండ వేడి తట్టుకోలేక కోళ్లు మృత్యుబారిన పడుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు గుడ్డు ధరలు ప్రస్తుతం (మంగళవారం) రూ.5.30 పైసలు ఉండటంతో రైతులకు గిట్టుబాటు కావటం లేదు. ఫిబ్రవరి నెలలో ఈ ధర రూ.6.15 ఉంది. ఏప్రిల్ నెల నుంచి ధరల పతనం కొనసాగుతుండడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. తగ్గని పిల్ల ధర, పెరిగిపోతున్న మేత ధరలు ఎండల తీవ్రతకు కోళ్లు చనిపోతున్నా కోడిపిల్లల ధర మాత్రం రూ.50 తగ్గటం లేదు. దీంతో మృత్యువాత పడిన కోళ్ల స్థానంలో మరో బ్యాచ్ పెంచుదామంటే గుడ్డు ధరలు పెరగకపోగా, మరింత పతనమవ్వటంతో రైతులు ఆర్థికంగా నలిగిపోతున్నారు. ఇక మేత ధరలు కొండెక్కి కూర్చోవటంతో రైతులు ఉన్న కోళ్లను మేపలేక, పెరిగిన మేత ధరలకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రోజుకి 10 వేల కోళ్లు మృత్యువాత గగ్గోలు పెడుతున్న పౌల్ట్రీల యజమానులు పెరుగుతున్న మేత ధరలు మేత (టన్నుల్లో) ధరలు (రూ.లలో) మార్చిలో మే నెలలో చేప 48వేలు 55 వేలు మొక్కజొన్న 18వేలు 23 వేలు నూకలు 20వేలు 22 వేలు సోయా 40 వేలు 75 వేలు తవుడు 15వేలు 20 వేలు ఉత్పత్తి సగానికి పడిపోయింది ఎండ దెబ్బకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు గుడ్ల ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది. దీనికి తగ్గట్టు మార్కెట్టులో గుడ్లకు ధరలు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రతిరోజు వీటికి అయ్యే మేత ఖర్చులు, విద్యుత్ బిల్లులు, ఎండ వేడి సోకకుండా తీసుకున్న జాగ్రత్తలకు పెట్టుబడి తడిసి మోపెడు అవుతోంది. – మండ తాతారెడ్డి, కోళ్లఫారం యజమాని, పిట్టల వేమవరం, రూ.లక్షల్లో నష్టపోతున్నాం ప్రస్తుతం మార్కెట్టులో గుడ్డు ధర రూ.5.30 ఉంది. ప్రస్తుత మేత ధరల ప్రకారం రూ.5.50 ధర ఉంటే గిట్టుబాటు అవుతుంది. అధిక ఉష్ణోగ్రతలు వలన కోళ్లు మృత్యువాత పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గుడ్డు ధరలు పడిపోయి రూ.లక్షల్లో నష్టపోతున్నాం. ఏమి చెయ్యాలో తెలియటంలేదు. – భూపతిరాజు వరహాలరాజు, రైతు, ఖండవల్లి -
ఇసుక అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలన
అల్లవరం: మండలంలోని ఓడలరేవు, కొమరగిరిపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. పలు పత్రికల్లో వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్ స్పందించి క్షేత్ర స్థాయిలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని అల్లవరం తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావును ఆదేశించారు. దీంతో రెవెన్యూ, పోలీసు, మత్స్యశాఖల అధికారులు సంయుక్తంగా సోమవారం క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. సర్వే నెంబర్లు 1037, 1033 పొలాల్లో ఇసుక తవ్వకాలు నిలిపివేసినట్లుగా అధికారులు నివేదిక ఇచ్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. నేటికి ఓడలరేవులో టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్న ఇసుక తవ్వకాలపై రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో వివరణ ఇవ్వాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ ఇసుక దందాకు రెవెన్యూ అధికారులు కనుసన్నలో జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ వెంట ఎస్సై సంపత్కుమార్, వీఆర్ఓ సతీష్ పాల్గొన్నారు. -
జాతీయ బీచ్ వాలీబాల్ జట్టు కెప్టెన్గా రామకృష్ణంరాజు
ఆత్రేయపురం: భారత పురుషుల బీచ్ వాలీబాల్ జట్టు కెప్టెన్గా మండలంలోని తాడిపూడికి చెందిన ముదునూరి రామకృష్ణంరాజు ఎంపికయ్యారు. చైనాలో ఈ నెల 4 నుంచి 7 వరకు జరిగే ఏబీసీ సీనియర్ ఆసియన్ బీచ్ వాలీబాల్ జట్టుకు కెప్టెన్గా ఆయన వ్యవహరిస్తారు. ఈయన తండ్రి శివాజీ రాజు గతంలో హైదరాబాద్ బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేస్తూ ఆటలు పోటీలకు కోచ్గా వ్యవహరించారు. కాగా.. రామకృష్ణంరాజు ఎంపికపై ఈ ప్రాంత ప్రముఖులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జట్టులో ఈ ప్రాంతానికే చెందిన పెన్మత్స కృష్ణ చైతన్య సభ్యుడు కావడం విశేషం. -
వ్యవసాయ క్షేత్రంలో గడ్డి దగ్ధం
కపిలేశ్వరపురం: పడమర ఖండ్రిక గ్రామానికి చెందిన సీహెచ్.సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో వరి పంటను కోసి వదిలేసిన గడ్డి మంగళవారం దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తి అజాగ్రత్తగా సిగరెట్ కాల్చి పడేయడంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో రైతుకు చెందిన రూ.పది వేల విలువైన ఆరు ఎకరాల్లోని గడ్డి పూర్తిగా కాలిపోయింది. మండపేట అగ్నిమాపక కేంద్రం లీడింగ్ ఫైర్మెన్ పి.లోవరాజ, సిబ్బంది జి.భరత్బాబు, ఎన్ కిరణ్ కుమార్ మంటలను ఆర్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో.. మండపేట కొండపల్లివారి వీధిలోని బి.వెంకట రమణమూర్తి ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గృహోపకరణాలు కాలిపోయాయి. అనపర్తి అగ్నిమాపక కేంద్రం అధికారి వి.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలోని సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంటిలోని ఏసీ, మంచం, పరుపులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లినట్టు ఫైర్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
క్వారీ గోతిలో ఈతకు వెళ్లి.. యువకుడి మృతి!
దేవరపల్లి: వేసవి తాపానికి తట్టుకోలేక క్వారీ గోతిలో ఈతకు వెళ్లిన యువకుడు మృతి చెందాడు. దేవరపల్లి మండలం లక్ష్మీపురంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మీపురానికి చెందిన ర్యాలి త్రినాథ్ (20), మరో ఆరుగురు యువకులు కలిసి గ్రామ శివారున గల పాడుబడిన (తవ్వి విడిచిపెట్టిన) క్వారీ గోతిలో స్నానానికి వెళ్లారు.గోతిలోని నీటిలో యువకులు ఈత కొడుతుండగా, త్రినాథ్ మాత్రం ఊబిలో కూరుకుపోయి మునిగిపోయాడు. తోటి యువకులు ఇచ్చిన సమాచారంతో త్రినాథ్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు క్వారీ వద్దకు వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు విషయం తెలిపారు.పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో క్వారీ గోతిలో గాలించి త్రినాథ్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పి.మనోహర్ తెలిపారు. కాగా.. త్రినాథ్ రాజమహేంద్రవరంలోని ఓ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. -
కమిటీల ఏర్పాటులో రాజానగరం రోల్ మోడల్
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణురాజానగరం: మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటులో రాజానగరం నియోజకవర్గం రాష్ట్రానికి రోల్ మోడల్ వంటిదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజానగరంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్ల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఓటర్ల జాబితా పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, మన పార్టీకి సపోర్టుగా ఉండే ఓట్లను తొలగించకుండా నిశితంగా గమనించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో పనిచేయడం మీరంతా చేసుకున్న అదృష్టమన్నారు. కోరుకొండలో మట్టి టిప్పర్ ఢీ కొని మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచి, రూ.20 లక్షల పరిహారాన్ని ఇప్పించడంలో రాజా చేసిన పోరాట పటిమను అభినందించారు. పక్కనే ఉన్న రాజమహేంద్రవరం నియోజకవర్గాలకే కాకుండా జిల్లాకు రాజా వంటి నాయకుడి బలం ఎంతో అవసరమన్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజకీయ నాయకుల భవితను మార్చేవి ఎన్నికలేనన్నారు. ఎన్నికల ముందు ఓట్ల తొలగింపులు జరిగే సమయంలో అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందని నిర్లిప్తంగా ఉండటం మంచిది కాదన్నారు. బెంగాల్లో లక్షల మంది ఓట్లను ఉద్దేశ పూర్వకంగానే తొలగించారని గుర్తు చేశారు. బూత్ ఏజెంట్లకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలన్నారు. మీ పరిధిలో ఉన్న ఓటర్లను తరచు కలుసుకుంటూ ఓట్ల జాబితాలను పరిశీలిస్తూ ఉండాలని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి బాధ్యతలను వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు తోట రామకృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిది భారీ దోపిడీ
అనపర్తి: స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే భారీ దోపిడీ జరుగుతుండటం వల్ల అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. స్థానిక రామచంద్రుని చెరువును చూస్తుంటే సింగరేణి గనులను చూస్తున్నట్టు ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రామచంద్రుని చెరువులో జరుగుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంటరీ సమన్వయకర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తదితరులు మంగళవారం పరిశీలించారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ రామచంద్రుని చెరువులో 50 అడుగుల లోతున తవ్వకాలు జరుపుతూ ప్రకృతి సంపదను దోచేస్తున్నారన్నారు. జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యావరణాన్ని కాపాడుతానని చెబుతున్న మాటలకు కట్టుబడి ఉంటే, ఇక్కడ జరుగుతున్న దోపిడీని చూడాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం, అధికారులు దీనిపై స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పెదపూడి మండలంలో రైతులు మెరక తీసే మట్టిని తరలించే క్రమంలో టిప్పర్లు ఎంపీ పురందరేశ్వరి కారుకు అడ్డు వచ్చాయని, దీంతో 7 టిప్పర్లను అదుపులోకి తీసుకుని ఉక్కుపాదం మోపుతాను అంటూ స్థానిక ఎమ్మెల్యే ప్రగల్భాలు పలుకుతున్నారని అదేదో అక్రమ మైనింగ్పై మోపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల్లో మట్టి, గ్రావెల్, ఇసుక దోపిడీ విపరీతంగా పెరిగిపోయిందని చెప్పారు. అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ తవ్వకాల వెనుక కోట్లాది రూపాయల అవినీతి దాగి ఉందని ఆరోపించారు. ఇక్కడ కొన్నిచోట్ల 30నుంచి 50అడుగుల లోతు వరకు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై గతంలోనే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి లేఖ రాసి, రికార్డు చేసిన వీడియోలు పెన్ డ్రైవ్ పంపితే ఆయన వ్యంగ్యంగా మాట్లాడారే తప్ప చర్యలు తీసుకోలేదని చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత మట్టి తీయడానికి వీల్లేదన్న నిబంధనను, 3 మీటర్ల లోతు పరిమితిని ఇక్కడ తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. గతంలో రామకృష్ణారెడ్డి హయాంలో కాపవరం చెరువులో ముగ్గురు, రంగాపురంలో ఇద్దరు, రామచంద్రుని చెరువులో ఒక యువకుడు పశువులను కడగడానికి వెళ్లి లోతైన గుంతల వల్ల చనిపోయిన ఉదంతాలను ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువ లోతుగా తవ్వుతున్నారని అన్నారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఒక అవినీతి కొండలా మారారని, పక్కనే ఆఫీస్ ఉన్నా రూ.కోట్లలో ముడుపుల కోసమే ఇక్కడికి రావడం లేదని ఆరోపించారు. నాయకులు ఇక్కడికి వచ్చి రీల్స్ చేసుకుని వెళ్తున్నారంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ, ఇది రీల్స్ కాదని, రియాలిటీ అని, ధైర్యముంటే ఎమ్మెల్యే కూడా వచ్చి ఇక్కడి యదార్థాన్ని చూడాలని సవాల్ విసిరారు. డీఆర్వోకు ఫిర్యాదు రామచంద్రుని చెరువులో అక్రమ మైనింగ్ పై చర్యలు కోరుతూ పార్టీ నాయకులు మంగళవారం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తికి వినతి పత్రం అందజేశారు. పార్టీ మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి(రాంబాబు), జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కొండేటి భీమేష్, రాజానగరం నియోజకవర్గ పరిశీలకులు తోట రామకృష్ణ, పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, టాస్క్ఫోర్స్ జిల్లా ఇన్చార్జీ వామిశెట్టి పరమేశ్వరరావు పాల్గొన్నారు. సింగరేణి గనులను తలపిస్తున్న రామచంద్రుని చెరువు వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా క్షేత్రస్థాయిలో పరిశీలించిన నేతలు -
బేలెన్స్ చేసేదెలా!
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిఽధిలోని 298 సహకార సంఘాలకు గాను 130 సంఘాల్లో సుమారు రూ.400 కోట్ల మేర ఇంబేలెన్స్ (అసమతుల్యత) ఏర్పడింది. దీని వల్ల సంఘాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని, బ్యాంక్ రికవరీలు, లిక్విడిటీ, వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని డీసీసీబీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో సహకార సంఘాలు కూడా తమ వాదన వినిపిస్తున్నాయి.సంఘాల వద్ద రైతులు రుణాలు తీసుకునేటప్పుడు వారి నుంచి వసూలు చేసే షేర్ ధనం (క్యాపిటల్) డీసీసీబీకే చెల్లించేస్తున్నామని, ఆ షేర్ ధనాన్ని తమకు బ్యాంక్ ఇచ్చిన రుణాలకు జమ చేసుకోకపోవడం వల్లే ఇంబాలెన్స్ సమస్య తలెత్తుతోందని చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని డీసీసీబీ పూర్తిగా కొట్టి పారేస్తోంది. సంఘాలు ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చులను తగ్గించుకుంటే మంచిదని సూచిస్తోంది.షేర్ ధనం అంటే..ఉదాహరణకు సంఘంలో ఒక రైతు రూ.లక్ష అప్పు తీసుకుంటే షేర్ ధనం కింద రూ.10 వేలను అప్పుడే డీసీసీబీకి చెల్లించి వేస్తున్నామని సంఘాల సీఈవోలు చెబుతున్నారు. అదే రైతు అప్పును క్లోజ్ చేస్తున్నప్పుడు, ముందుచ్చిన షేర్ ధనం రూ.10 వేల తగ్గించి మిగిలిన రూ.90 వేలు చెల్లిస్తున్నాడు. అలా ఆ 10 వేలు డీసీసీబీ వద్దే ఉండిపోతున్నాయి. ఆ లెక్కన ఇప్పుడు ఇంబాలెన్స్గా ఉన్న 130 సంఘాలకు చెందిన కోట్లాది రూపాయల షేర్ ధనం డీసీసీబీ వద్దే నిల్వ ఉండిపోతోంది.ఆ షేర్ ధనం నిల్వలు తమకే చెందుతాయని, అయితే తాము దానిపై వచ్చే వడ్డీ నష్టపోతున్నామని సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డీసీసీబీ, సంఘాల మధ్య ఇప్పుడు షేర్ ధనం చిచ్చు రగులుతోంది. షేర్ ధనం డీసీసీబీ వద్ద నిల్వ ఉండడం వల్లే సంఘాలు ఇంబాలెన్స్కు గురవుతున్నాయే తప్ప మేము చేసే ఖర్చుల వల్ల కాదని సంఘాల సీఈవోలు, త్రీమెన్ కమిటీల ప్రతినిధులు చెబుతున్నారు.డీసీసీబీ పొదుపు మంత్రంసంఘాలు ఇంబాలెన్స్ క్రమంగా తగ్గించుకునేందుకు, భవిష్యత్తులో అది మరింత పెరగకుండా నివారించేందుకు డీసీసీబీ కొన్ని సూచనలు చేసింది. ఆ ప్రకారం.. సంఘాల సభ్యులైన రైతులకు మంజూరు చేసిన అప్పులపై వడ్డీని సక్రమంగా లెక్కకట్టి వసూలు చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది జీత భత్యాలు, ఇతర భత్యాలు (ఎలవన్స్లు) పెంచకూడదు. డిస్ట్రిక్ట్ లెవెల్ ఎన్పవర్ కమిటీ (డీఎల్ఈసీ) అనుమతి లేకుండా సంఘాల్లో శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన పోస్టులు నియామకాలు చేపట్టకూడదు.గత ఆర్థిక సంవత్సరం ఖర్చులతో పోల్చి కనీసం 25 శాతం ఖర్చులను తగ్గించుకుని సంఘాల నిర్వహణ చేయాలి. సభ్యుల నుంచి డిపాజిట్లు సేకరించి బ్యాంక్లో డిపాజిట్ చేయడం ద్వారా మార్జిన్ వడ్డీ పొందడం, సభ్యుల డిపాజిట్లపై సొంత వ్యాపారాలు నిర్వహిస్తూ సంఘాల ద్వారా అప్పులు మంజూరు చేసి సక్రమంగా వసూలు చేసి లాభాలు ఆర్జించాలి. ఇలా మొత్తం 18 పొదుపు సూత్రాలను డీసీసీబీ సహకార సంఘాలకు సూచిస్తూ ఆంక్షలు విధించింది.ఖర్చులు తగ్గించుకోవాలిప్రభుత్వ నిబంధనలకు లోబడి సహకార సంఘాలు ఖర్చులను తగ్గించుకోవాలి. అప్పుడే ఇంబాలెన్స్ సమస్యలన్నీ తీరుతాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వ్యవసాయ సహకార సంఘాలు డీసీసీబీ నుంచి తీసుకున్న రుణాన్ని రైతుల నుంచి సక్రమంగా వసూలు చేసుకోవాలి. అప్పుడే డీసీసీబీకి, పీఏసీఎస్లకు ఆర్ధిక స్థితిగతులు బాగుంటాయి. - సీఈవో, డీసీసీబీ, కాకినాడ -
ఉప్పు నీటి పంజా
ఎట్టకేలకు పూర్తయిన లైడార్ సర్వే గోదావరి డెల్టాలో నీటి మట్టం లెవెల్స్ గుర్తించేందుకు ఉమ్మడి గోదావరి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతాంగం పట్టుబట్టడంతో ఎట్టకేలకు ప్రభుత్వం లైడార్ సర్వేకు ఉపక్రమించింది. గత నెల రోజులుగా విశాఖపట్నం కేంద్రంగా రూ.13 కోట్లతో విమానం సాయంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే పూర్తి చేశారు. పశ్చిమ, తూర్పు డెల్టాల రిపోర్టు సిద్ధం కాగా, సెంట్రల్ రిపోర్టు తయారవుతోంది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. లైడార్ సర్వేతో ప్రయోజనం ఏమిటంటే... భూమి కుంగిందా లేదా అనే వాస్తవం పక్కన పెడితే డెల్టాను ఉప్పునీరు ముంచెత్తుతోందనే మరో వాస్తవం లైడార్ సర్వేతో కళ్లకు కనిపిస్తోంది. పంట చేలు చనిపోవడం, రైతాంగం నష్టపోవడం కూడా కళ్లకు కనిపిస్తోంది. కాటన్ కాలం నాటి లెవెల్స్, స్ట్రక్చర్ల సామర్థ్యం వంటి వాటితో పాటు లైడార్ ద్వారా సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల డ్రెయిన్లు, నదుల్లోకి ఎంత మేరకు ఉప్పునీటి ప్రవాహం పెరిగింది.. పంట కాలువల్లోకి కూడా ఈ ఉప్పునీటి ప్రవాహం ఏ మేరకు చేరిందనే అంచనాలు లైడార్ సర్వేతో తేలుతాయి. ఆధునికీకరణలో భాగంగా ఏం చేస్తారంటే... లైడార్ సర్వే పూర్తి కావస్తోన్నందున ఆధునికీకరణ పనుల్లో భాగంగా సముద్ర తీరంలోని డ్రెయిన్లు, పంట కాలువల గట్లును ఎత్తు చేస్తారు. లేనిచోట్ల కొత్తగా గట్లు నిర్మిస్తారు. ఆయా డ్రెయిన్లు గోదావరి, సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లు నిర్మిస్తారు. ఇక్కడ ప్రధానంగా ప్రవహించే శంకరగప్తం, కూనవరం వంటి మేజర్ డ్రెయిన్లకు ఈ రెగ్యులేటర్ల ఆవశ్యకత ఉంది. ఇప్పటికే డెల్టా పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాలో నల్లి క్రీక్, కోనసీమలోని శంకరగుప్తం డ్రెయిన్ల పూడికతీత, గట్టు పటిష్ట పనులు చేపట్టారు. అయితే నిధుల విడుదలలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోంది. నాటి సీఎం వైఎస్సార్ ఆధునికీకరణ ఫైల్ బయటకు.. గోదావరి డెల్టాలో ఈనాటి దుస్థితిని ఆనాడే గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ధవళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో గోదావరి డెల్టాను ఆధునికీకరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆయన హయాంలోనే రూ.3,500 కోట్లతో పనులు కూడా ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ వైఎస్సార్ మరణానంతరం అధికారం చేపట్టిన అప్పటి కాంగ్రెస్, కూటమి ప్రభుత్వాలు ఆ పనులను అర్ధాంతరంగా వదిలేశాయి. పరిస్థితి నానాటికీ దిగజారడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కళ్లు తెరుస్తోంది. లైడార్ సర్వే లేకుండానే వాస్తవాన్ని అప్పటి సీఎం రాజశేఖరరెడ్డి గుర్తిస్తే... ప్రస్తుత కూటమి ప్రభుత్వం రూ.13 కోట్లతో ఏకంగా విమానాల సాయంతో లైడార్ సర్వే చేస్తేనే గానీ తీర గ్రామాలపై ఉప్పునీటి పంజాను గుర్తించకపోవడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం నిధులిచ్చేనా? చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లనా ఇరిగేషన్ పనుల జోలికి వెళ్లడం లేదు. ఇప్పటి వరకు చేసిన అరకొర పనులకు బిల్లులు కూడా చెల్లించలేదు. ఇటువంటి సరిస్థితుల్లో ఆధునికీకరణ పనులు ఎలా చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. 2006లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన అంచనాల ప్రకారం గోదావరి డెల్టా ఆధునికీకరణకు అప్పట్లోనే రూ.3,500 కోట్లు అంచనా వేశారు. ప్రస్తుతం 20 ఏళ్ల తర్వాత ఆ ఫైల్ను కూటమి సర్కారు బయటకుతీసి రీ ఎస్టిమేట్ వేస్తోంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత పనులు చేపట్టాలన్నా పెరిగిన ధరలు, కొత్త ప్రతిపాదనలు చేర్చడం వల్ల రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆ స్థాయిలో నిధులను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫొటోల్లో కనిపిస్తున్న పంట కాలువలను చూస్తే చాలా ఆనందంగా ఉంది కదా, వేసవిలో సైతం నిండుగా నీరు ప్రవహిస్తోందని భావిస్తున్నారా, కానీ వాస్తవం అది కాదు.. ఇది సముద్రం నుంచి గ్రామాల్లోకి పోటెత్తుతున్న ఉప్పు నీరు. ఇదే కోనసీమ ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. సుమారు 50 ఏళ్లుగా సాగుతున్న ఓఎన్జీసీ కార్యకలాపాల వల్ల ఇక్కడ భూమి కుంగుతోందని, ఫలితంగానే ఉప్పు నీరు గ్రామాలను ముంచెత్తుతోందని పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నా వాస్తవాలను శాస్త్రవేత్తలు మాత్రం ప్రకటించరనే ప్రచారం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇక్కడ కోట్లాది రూపాయల ఆయిల్ వ్యాపారాలను ప్రజలు అడ్డుకుంటారని భయం. – మలికిపురం సముద్రం నుంచి గ్రామాల్లోకి పోటెత్తుతున్న ఉప్పునీరు వేసవిలోనూ డెల్టా ప్రాంత కాలువల్లో నీటితో తీవ్ర నష్టం మరోవైపు లైడార్ సర్వేలోనూ వెలుగు చూస్తున్న వాస్తవాలు ఉప్పు నీటి ప్రవేశంతోపచ్చని పంట పొలాలు నాశనం అడ్డుకట్ట వేయకుంటే డెల్టా ప్రాంత వాసుల భవిష్యత్తు దుర్భరమే -
తల్లి మందులకు వెళుతూ..!
మామిడికుదురు: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి మందులు తీసుకు వచ్చేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై కుమారుడు మృతి చెందాడు. మొగలికుదురులో మంగళవారం జరిగిన ఈ విషాద ఘటన వివరాలు ఇవీ.. గెద్దాడకు చెందిన గుబ్బల మనోహర్ (22) విజయవాడలో ఏసీ మెకానిక్గా పని చేస్తున్నాడు.తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో సోమవా రం రాత్రి స్వగ్రామం వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమెకు మందులు తీసుకు వచ్చేందుకు బైక్పై వెళుతుండగా మొగలికుదురు ప్రధాన రోడ్డుపై వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఓ మోటార్ సైకిల్ సడన్ గా మలుపు తిరిగి మనోహర్ బైకును ఢీకొంది.ఈ ఘటనలో రోడ్డుపై పడి గాయపడిన మనోహర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి బాల శ్రీను ఫిర్యాదుపై నగరం ఎస్ఐ ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేశా రు. మృతుడు అవివాహితుడు. చేతికి అందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
విషాదం మిగిల్చిన విహారం
ఫ కారు ప్రమాదంలో ముగ్గురి మృతి ఫ మరొకరి పరిస్థితి విషమం ఫ మృతుల్లో ఏడాది బాలుడు గోకవరం/జగ్గంపేట: వారందరూ కారులో ఎంతో ఉత్సాహంగా రంపచోడవరానికి విహార యాత్రకు వెళ్లారు. చక్కగా ఆటపాటలతో సందడి చేస్తూ సంతోషంగా గడిపారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. జగ్గంపేట మండలం మల్లిసాలకు చెందిన కందికట్ల ముసలయ్య (నాని) మంగళవారం జగ్గంపేటలోని ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఇన్నోవా కారుని అద్దెకు తీసుకున్నాడు. భార్య దుర్గ, కుమారుడు లక్కీ (ఏడాది వయసు), కుమార్తె నవ్యతో పాటు తనకు వరుసకు తమ్ముడు అయిన రమణ కుమార్, దుర్గ సోదరి బల్లెల పద్మ (19), మరో యువకుడు కొండేపూడి వివేక్ (19)లను తీసుకుని రంపచోడవరం విహార యాత్రకు వెళ్లాడు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడ సంతోషంగా గడిపారు. తిరిగి మల్లిసాలకు తిరిగి వస్తున్న క్రమంలో కొత్తపల్లి దాటిన తర్వాత జీడిపిక్కల ఫ్యాక్టరీ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఫ్యాక్టరీ గోడను, తర్వాత విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వివేక్, పద్మ అక్కడికక్కడే మృతి చెందగా, ఏడాది వయసున్న లక్కీ గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కారు నడుపుతున్న ముసలయ్య తీవ్రంగా గాయపడగా, రాజమహేంద్రవరం తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో దుర్గ, నవ్య, రమణ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కోరుకొండ సీఐ మూర్తి, గోకవరం ఎస్సై పవన్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు కారులో ప్రయాణిస్తున్న కందికట్ల దుర్గ కథనం మేరకు వీరు ప్రయాణిస్తున్న కారు కొత్తపల్లిలో ఓ బైక్ను చిన్నగా ఢీకొట్టింది. దీంతో కంగారు పడిన ముసలయ్య కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. మరో 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే క్షేమంగా ఇంటికి చేరుకునేవారు. ఈలోపు ఈ ప్రమాదం జరిగిన ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే ముసలయ్య కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. నెల రోజుల్లో పెళ్లి బల్లెల పద్మకు వివాహం కుదిరింది. వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. ఈ లోపు రోడ్డు ప్రమాదంలో ఆమె మృత్యుఒడికి చేరింది. పద్మకు చిన్నప్పుడే తల్లిదండ్రులు దూరం కావడంతో అమ్మమ్మ దిమ్మల అర్జమ్మ ఎంతో కష్టపడి పెంచింది. మనవరాలి వివాహం కళ్లారా చూడాలనుకుంటున్న సమయంలో జరిగిన ప్రమాదం అర్జమ్మను విషాదంలో ముంచేసింది. నిరుపేద కుటుంబం కొండేపూడి వివేక్ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులకు అండగా ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సరదాగా విహార యాత్రకు వెళ్లిన వివేక్ మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చేతికంది వచ్చిన కుమారుడు చనిపోవడంతో ఎంతగానో రోదిస్తున్నారు. కలసి రావడంతో.. కందికట్ల ముసలయ్య (నాని), దుర్గ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు పుట్టిన తర్వాత ముసలయ్యకు ఆర్థికంగా కలిసి రావడంతో ఆ బాబుకు లక్కీ అని పేరు పెట్టారు. పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదం లక్కీని కాటేసింది. ఆ కుటుంబంలో తీరని విషాదం మిగిల్చింది. -
ఆటో కార్మికుల ధర్నా
నిడదవోలు : పది రోజుల్లో 4 విడతలుగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ఆటో కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ఽపెట్రో ధరలతో రవాణా చార్జీలు పెరిగి నిత్యవసరాల ధరలు కూడా పెరగడంతో ఽపేదల బాతుకులు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతీస్తూ వారి జీవితాలతో ప్రభుత్వాలు ఆటలాడుతున్నాయని విమర్శించారు. ఆటో, లారీ, మోటార్ ఫీల్డు కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఉచిత బస్సు పథకం తెచ్చిన నేపథ్యంలో ఆటో కార్మికులు అర్ధాకలి జీవితాలు గడుపుతున్నామన్నారు. పాలకులు బడా పెట్టుబడిదారులకు ఇస్తున్న వివిధ రాయితీల మాదిరిగా రవాణా వాహనాల కార్మికులకు పెట్రోల్, డీజిల్ తగ్గింపు ధరలకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈమని గ్రీష్మకుమార్, తీట్ల సతీష్ , నాగరాజు, గాలింకి సురేష్, హుస్సేన్, కరుణ, మద్దాల శ్రీను, ఆరిఫ్ పాల్గొన్నారు. ఓపెన్ స్కూలు పరీక్షలు వాయిదా కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 28న జరగాల్సిన పది, ఇంటర్ ఓపెన్ స్కూలు పరీక్షలు బక్రీదు కారణంగా వాయిదా వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు మంగళవారం తెలిపారు. తిరిగి ఈ పరీక్షలు జూన్ 2వ తేదీన జరుగుతాయన్నారు. పదవ తరగతి గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్ష, ఇంటర్లో రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్ థియరీ పరీక్షలను వచ్చే నెల 2 కు వాయిదా వేసిన కారణంగా ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు 7వ తేదీకి వాయిదా పడ్డాయన్నారు. పూతరేకుల దుకాణాల్లో తనిఖీలు ఆత్రేయపురం: ఉచ్చిలి, ఆత్రేయపురం సమీపంలోని పూతరేకుల తయారీ, విక్రయాలు జరిపే దుకాణాల్లో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి వై.రామయ్య ఆధ్వర్యంలో అధికారులు ఆయా దుకాణాల్లో వినియోగిస్తున్న నెయ్యిని పరిశీలించారు. స్థానికంగా కొందరి నుంచి కల్తీ నెయ్యిపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆరోగ్య సిబ్బందితో కలిసి దుకాణాల్లో వినియోగిస్తున్న నెయ్యి నమూనాలను సేకరించారు. వీటిని పరీక్షల కోసం ల్యాబ్లకు పంపించి, రిపోర్టులు వచ్చిన అనంతరం కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తామని వై.రామయ్య తెలిపారు. పూతరేకుల పరిశ్రమ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందున ఇక్కడి తయారీదారులు బ్రాండెడ్ నెయ్యిని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. దేశ, విదేశాలకు ఎగుమతి అవుతున్నందున నాణ్యతా ప్రమాణాలు పాటించాలని వ్యాపారులకు తెలిపారు. తనిఖీలో వైద్య శాఖ సిబ్బంది పీహెచ్ అరుణకుమారి, సూపర్ వైజర్ మూర్తి, వీఆర్వో జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
తండ్రిని హత్య చేసిన బాలుడు!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మద్యానికి బానిసై, తన తల్లిని నిత్యం చిత్ర హింసలకు గురి చేస్తున్న తండ్రిని 14 ఏళ్ల బాలుడు హత్య చేసిన సంఘటన రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ నగర్కు చెందిన ఉర్నాల దుర్గాప్రసాద్ (42) పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో నిత్యం మద్యం తాగి వచ్చి తన భార్య వెంకట రమణతో గొడవ పడుతూ ఉండేవాడు. అదే విధంగా సోమవారం రాత్రి ఫుల్గా మద్యం తాగి వచ్చిన దుర్గాప్రసాద్ భార్యతో గొడవ పడుతున్నాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం బాగా పెరిగిపోయింది.ఆ సమయంలో అక్కడే ఉన్న కుమారుడు తన తండ్రి గుండెల్లో స్కూడ్రైవర్ లాంటి పరికరంతో గుచ్చాడు. వెంటనే దుర్గాప్రసాద్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. నిందితుడైన బాలుడిన ఇజువైనల్ హోమ్కు తరలించనున్నారు. -
గబ్బర్ సింగ్ పారిపోయావా..!
భానుడి భగభగలు, కార్మికుల నిరసనల మధ్య ప్రయాణం ఎందుకనుకున్నారో ఏమో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తన పర్యటనను సూర్యుడు రాక ముందే ప్రారంభించి చకచకా పూర్తి చేసుకున్నారు. సోమవారం గోదావరి పుష్కర పనుల పరిశీలనలో భాగంగా రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఉదయం 5.30 గంటలకు పుష్కరఘాట్ వద్దకు చేరుకుని బోట్లో అధికారులతో కలిసి కోటిలింగాల రేవు వద్దకు చేరుకున్నారు.బోట్లోనే అధికారులు ఆయనకు గోదావరి పుష్కర పనుల గురించి వివరించారు. పేపరుమిల్లు వల్ల జరుగుతున్న నదీ కాలుష్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనదైన స్టైల్లో బోట్లో స్టిల్స్ ఇచ్చి కార్యక్రమాన్ని గంటన్నరలో పూర్తి చేశారు. కోటిలింగాల రేవు వద్ద నుంచి కొద్ది దూరంలో ఉన్న నల్లకాలువ మురుగునీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమం కూడా కొన్ని నిమిషాలలో ముగిసిపోవడం విశేషం. అక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్మికుల ధర్నా రెల్లి జాతి ఇష్టమని చెప్పి కార్మికులను చూసి పారిపోతావా? అంటూ మున్సిపల్ కార్మికులు తమ నిరసనను తెలియచేశారు. కాకినాడ ఎన్నికల సభలో రెల్లి జాతిలో పుట్టడం అంటే అదృష్టమని, నేను రెల్లి జాతిని దత్తత తీసుకుంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ తమను చూసి పారిపోయారని రెల్లి కార్మికులు ఆవేదన చెందారు. ఉప ముఖ్యమంత్రి పవన్ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారుల వద్దకు వచ్చి ‘మేము ఆయనను కలవనిస్తాం. మీరు జెండాలు తీసివేయాల’ని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించారు. మూడు గంటలపాటు అక్కడే నిరీక్షించగా పవన్కల్యాణ్ బయటకు రాగానే కార్మికులను చూస్తూ చెయ్యి ఊపుతూ వెళ్లిపోయారు. కనీసం వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్ కార్మికులు గేటు వద్ద కూర్చుని ఆందోళన చేశారు. సుమారు గంటపాటు గేట్లు వేసి ఆందోళన చేపట్టారు. ‘గబ్బర్ సింగ్ పారిపోయావా, మా గోడు వినవా, మున్సిపల్ మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం అదనపు కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. కేవలం 1,200 మంది కార్మికులతో పుష్కరాల్లో పని చేయగలమా అని నిలదీశారు. ఆప్కాస్ను ఎత్తివేసే కుట్ర ఆపాలని, మరణించిన కుటుంబీకులకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరారు. చాలా సంవత్సరాలుగా రిక్షా కార్మికులు కేవలం రూ.9,000కు పని చేస్తున్నారని ఇప్పుడున్న ధరలతో ఆ వేతనంతో కుటుంబం జీవించగలదా అని ప్రశ్నించారు. రిక్షా కార్మికులను ఆప్కాస్లో కలిపి రూ.21 వేలు జీతం ఇవ్వాలన్నారు. లేకుంటే పుష్కరాల కంటే ముందుగానే సమ్మె చేస్తామని కార్మికులు హెచ్చరించారు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. ఒక్క రోజు ముందే ఘాట్ల శుభ్రంపవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనకు ఒక్క రోజు ముందు గోదావరి ఘాట్లలో ఉన్న చెత్త, చెదారాలను శుభ్రం చేశారు. ఘాట్ల వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించారు. నల్లా చానల్ వద్ద ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా ఘాట్ల వద్ద చెత్త, చెదారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వెయ్యకుండా మున్సిపల్ సిబ్బందిని కాపలాగా పెట్టారు. అయినా గోదావరి నదీ కాలుష్యాన్ని చూసిన పవన్ కల్యాణ్ ఆ«శ్చర్యపోయారు. ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా నీటిలో కలుస్తున్నాయో తెలుసుకుని నదీ జలాల్లో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): -
పెట్రో బాంబ్
మళ్లీ ● పది రోజుల్లో నాలుగు సార్లు బాదుడు ● తాజాగా పెట్రోల్పై రూ. 2.84 డీజిల్పై రూ.2.86 చొప్పున పెంపు ● సామాన్యుడిపై పెను భారం సాక్షి, రాజమహేంద్రవరం: అమెరికా–ఇరాన్ యుద్ధ సంక్షోభాన్ని చూపుతూ ప్రభుత్వం చమురు మంట పెట్టింది. పెట్రోల్, డీజిల్ ధరలపై బాదుడే.. బాదుడు విధానాన్ని కొనసాగిస్తోంది. గడిచిన పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ధరలు పెంచి సామాన్యుడిపై మోయలేని భారాన్ని మోపింది. తాజాగా లీటర్ పెట్రోల్పై రూ.2.84 పైసలు, డీజిల్పై రూ.2.86 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ప్రతి రోజూ లీటర్ పైట్రోల్పై రోజుకు రూ.13.54 లక్షలు, డీజిల్పై రోజు రూ.16.50 లక్షల అదనపు భారం పడుతోంది. వెరసి రోజుకు పెట్రోల్, డీజిల్పై రూ.30.04 లక్షల భారం వినియోగదారులు మోయాల్సి వస్తోంది. నెలకు సుమారు రూ.9.01 కోట్ల భారం పడుతోంది. పెరిగిన ధరలతో లీటర్ పెట్రోల్ రూ.118.06, డీజిల్ రూ.105.69గా విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలు సోమవారం తెల్లవారుజాము నుంచే అమల్లోకి వచ్చాయి. ధరల పెంపుతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. పెంచుకుంటూ పోతే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆటో, కార్ తదితర వాహన దారులు ఆవేదన చెందుతున్నారు. పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీన లీటరు పెట్రోల్పై రూ.3.29, డీజిల్పై రూ.3.14 పెంచారు. ఈ నెల 19న లీటర్ పెట్రోల్పై రూ.92 పైసలు, డీజిల్పై రూ.91 పైసలు పెరిగింది. 23న లీటర్ పెట్రోల్పై రూ.97 పైసలు, డీజిల్పై రూ.99 పైసలు పెంచారు. వినియోగదారులపై రూ.29.94 కోట్ల భారం: జిల్లా వ్యాప్తంగా 200 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ చమురు కంపెనీల పెట్రోల్ బంకులు 177, ప్రైవేటువి 23 ఉన్నాయి. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ బంకుల ద్వారా రోజువారీ సాధారణ పెట్రోలు అమ్మకాలు 4.77 లక్షల లీటర్లు, డీజిల్ 5.77 లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. మొదటి సారి పెరిగిన ధరలతో రోజుకు రూ.33.81 లక్షలు, రెండో సారి రూ.9.63 లక్షలు, మూడో సారి రూ.9.66 లక్షలు, తాజాగా నాలుగో సారి పెరిగిన ఇంధన ధరలతో రోజుకు వినియోగదారులపై రూ.30.04 లక్షల భారం పడుతోంది. నాలుగు దఫాలుగా పెరిగిన ధరలతో రోజుకు వినియోగదారులపై రూ.83.14 లక్షల భారం పడుతోంది. నెలకు రూ.24.94 కోట్ల అదనపు భారం భరించాల్సి వస్తోంది. -
పిట్టల్లా రాలిపోతున్న జనం
వడదెబ్బకు నలుగురి మృతి రాజవొమ్మంగి/ కరప/ జగ్గంపేట/ : వడదెబ్బ మృతుల రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు అంతకంతకూ పెరుగుతుండడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం నలుగురు మృతి చెందారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగికి చెందిన జలగం ఆదిలక్ష్మి (76) సోమవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి అస్వస్థతకు గురై మృతి చెందింది. వడగాల్పుల కారణంగా వాంతులు అయ్యాయని, ఆసుపత్రికి తరలించేలోగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫ కాకినాడ రూరల్ కూరాడ గ్రామానికి చెందిన టేకుమూడి సూర్యనారాయణ (80) పంట కాలువలో పూడికతీత పనికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత సైకిల్పై ఇంటికి తిరిగి వస్తుండగా వేసవి తాపానికి తట్టుకోలేక మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఫ జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో పొలంలో గేదెలు మోపడానికి వెళ్లిన పాలిపిరెడ్డి నూకరాజు (52) వడదెబ్బకు పొలంలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఫ వడదెబ్బకు గురై తొండంగి గ్రామానికి చెందిన నేమాల నూకరాజు (55) మృత్యువాత పడ్డారు. నూకరాజుకు స్వల్పంగా అనారోగ్యంగా ఉండటంతో కాకినాడ ఆస్పత్రికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నారు. వడదెబ్బకు గురై అపస్మారక స్ధితికి చేరుకోగా స్థానిక వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు తెలిపారు. -
సంపద సృష్టి అంటే ఇదేనా!
● చమురు ధరలు పెంచడం అన్యాయం ● కూటమికి ప్రజలే బుద్ధి చెబుతారు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అమలాపురం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్పి, చమురు ధరలు పెంచుకుంటూ పోతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి దుయ్యబట్టారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై అమలాపురంలో ఏబీసీ ఫుడ్ కోర్టు వద్ద జగ్గిరెడ్డితో పాటు ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్, పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే చమురు ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వ్యాట్ ట్యాక్స్ పేరులో దోచేస్తున్నారని అన్నారు. జిల్లాలో సుమారు 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసిన రైతులు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు రోడ్డెక్కి మరీ ధర్నాలు చేస్తుంటే, కనీసం ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతుందన్నారు. ఆక్వా రైతులు రొయ్యల ధరలు పెంచాలని ఆందోళన చేస్తున్నా, పట్టించుకోవడం లేదని జగ్గిరెడ్డి అన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి సామాన్యులకు మేలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. -
అర్జీ ఇవ్వడానికి వచ్చిన మహిళకు వడదెబ్బ
● తక్షణం స్పందించిన అధికార యంత్రాంగం ● పీజీఆర్ఎస్లో 145 అర్జీల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు అర్జీ ఇవ్వడానికి వచ్చిన కల్లేపల్లి ప్రియాంక వడగాడ్పుల ప్రభావంతో అస్వస్థతకు గురికాగా అధికారులు తక్షణమే స్పందించారు. ఆమెకు వెంటనే నీరు అందించి ప్రాథమిక చికిత్స చేయడంతో పాటు నర్సింగ్ సిబ్బందిని పిలిపించి రక్తపోటు, సుగర్ పరీక్షలు నిర్వహించారు. 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి మాట్లాడుతూ ఆమె ఆరోగ్యం కుదుటపడేలా వైద్యాధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఆమె పెన్షన్, రేషన్ కార్డు సంబంధిత సమస్యలను పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆనన్లైన్లో పరిశీలించగా ఆమె దరఖాస్తు ఆమోద దశలో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా కూడా ప్రజలు తమ అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పీజీఆర్ఎస్లో 145 అర్జీలను స్వీకరించామని చెప్పారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు అందగా, వాటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట, ఇతర కేసులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరై వారి సమస్యలను వివరించారు. -
ఉత్తమ నర్తకిగా త్రినయని
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దక్షిణ భారత దేశ ఉత్తమ నర్తకిగా త్రినయని ఎంపికై ంది. ద స్టార్ ఆఫ్ ఇండియా సంస్థ ఆదివారం విశాఖపట్నంలో దక్షిణ భారత స్థాయి శాసీ్త్రయ నృత్య పోటీలను నిర్వహించింది. ఇందులో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన కూచిపూడి నర్తకీమణులు పోటీ పడ్డారు. కాకినాడకు చెందిన కూచిభొట్ల త్రినయని ప్రథమ స్థానాన్ని, స్టార్ ఆఫ్ సౌత్ ఇండియా అవార్డును కై వసం చేసుకుంది. దక్షణాది రాష్ట్రాల్లో వెయ్యి మందికి పైగా కూచిపూడి నర్తకీమణులు తమ నృత్య వీడియోలు ద స్టార్ ఆఫ్ ఇండియా సంస్థ వారికి పంపగా, న్యాయ నిర్ణేతలు పరిశీలించారు. ఇందులో కూచిపూడి విభాగం నుంచి 16 మందిని ఎంపిక చేసి ప్రత్యక్షంగా పోటీలు నిర్వహించగా, కాకినాడకు చెందిన నాట్యాచార్యులు కృష్ణకుమార్ శిష్యురాలు త్రినయని ప్రథమ స్థానం సాధించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నృత్య పోటీల్లోనూ ప్రథమ బహుమతి, ఉత్తమ నర్తకి అవార్డు గెలుచుకుంది. తన సహచర నర్తకీమణులతో కలసి ఆమె ఈ నెల 28న ఊటీలో, కొడైకెనాల్లో నృత్య ప్రదర్శనకు వెళుతున్నట్లు నాట్యాచార్య కృష్ణకుమార్ తెలిపారు. జూన్ 3న శ్రీలంకలోని కొలంబోలో అంతర్జాతీయ నృత్యోత్సవాల్లో పాల్గొనుందని వివరించారు. హత్య కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష తుని: ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష పడిందని తుని పట్టణ ఎస్సై ఎం.గీతా రామకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక రైల్వేగెస్ట్ హౌస్ వద్ద 2024లో ఏప్రిల్ 25న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని అప్పట్లో వీఆర్వో ఆదిలక్ష్మి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో మృతుడు భిక్షాటన చేసుకునే డేవిడ్రాజ్గా తేలింది. అతనికి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లికి చెందిన యడ్ల అప్పారావు రూ.1500 ఇచ్చారు. తిరిగి అడిగినందుకు వారిద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో డేవిడ్రాజుపై కక్ష పెంచుకుని అప్పారావు దాడిచేసి హత్య చేసి పరారయ్యాడు. పిఠాపురం ఏడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరగ్గా, నేరం రుజువు కావడంతో ముద్దాయి అప్పారావుకు జడ్జి పి.భాస్కరరావు యావజ్జీవ శిక్షతో పాటు రూ.ఐదు వేల జరిమానా విధించారు. -
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి సాక్షి, విశాఖపట్నం: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లినప్పటికీ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విద్యుత్ లైన్లపై పడటంతో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, లైన్లు తెగిపోవడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తెగిపోయిన లైన్లు, దెబ్బతిన్న స్తంభాల పునరుద్ధరణ పనులు వేగంగా చేపడుతున్నామన్నారు. ఎక్కడైనా ప్రమాదకర విద్యుత్ పరిస్థితులు కనిపిస్తే వెంటనే కాల్ సెంటర్ నంబర్ 1912కు లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కోరారు. -
మత స్వేచ్ఛ హక్కు రద్దు కుట్రను ఆదివాసీలు అడ్డుకోవాలి
రంపచోడవరం: ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జనజాతి సురక్ష మంచ్ ఆధ్యర్యంలో జరిగిన సమావేశంలో భారత రాజ్యాంగం ఆదివాసులను గుర్తించి, చేర్చే అధికారం కలిగిన ఆర్టికల్ 342 రద్దు చేయాలని, మత స్వేచ్ఛ హక్కు కల్పిస్తున్న ఆర్టికల్ 25కు భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం రంపచోడవరంలో సోమవారం జరిగిన గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం తీవ్రంగా ఖండించింది. కేంద్ర బీజేపీ గిరిజన గుర్తింపు మత స్వేచ్ఛ రక్షణ కల్పించే 342, 25 ఆర్టికల్ రద్దు డిమాండ్పై కూటమి ప్రభుత్వం వైఖరి తెలపాలని డిమాండ్ చేశారు. భారత దేశ వ్యాప్తంగా మతం మారిన గిరిజనులకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆదివాసులకు గుర్తింపు నిచ్చే ఆర్టికల్ 342 రద్దు చేయాలని బీజేపీ, జనజాతి సురక్ష మంచ్ ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి సమావేశం డిమాండ్ చేయడాన్ని ఆదివాసీ గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం మత స్చేచ్ఛ హక్కు కల్పించబడిందన్నారు. భారత రాజ్యాంగం ఆదివాసీలకు గుర్తింపు మత స్వేచ్చ రక్షణ కల్పిస్తున్న ఆర్టికల్కు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆదివాసుల రిజర్వేషన్లు హక్కు రద్దు చేసే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, పోలవరం జిల్లా కార్యదర్శి పి.సంతోష్, అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి పి.బలదేవ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.చిన్నం నాయుడు, పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆడపిల్లల చదువును ప్రోత్సహించాలి
రంపచోడవరం: ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహమివ్వాలని జిల్లా కలెక్టర్ కె.దినేష్కుమార్ అన్నారు. ఇందుకు తగిన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ఐటీడీఏ సమావేశ హాలులో సోమవారం అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామానికి చెందిన గిరిజన బాలిక బూడిద లోవకుమారి విశాఖపట్నంలో లా పూర్తి చేసి మాస్టర్ లా చేసేందుకు జిల్లా కలెక్టర్ను ఆర్థిక సహాయం చేయమని కోరింది. లా పూర్తి చేసిన బూడిద లోవకుమారిని జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్కుమార్ శాలువాతో సన్మానించారు. బూడిద లోవకుమారి తల్లిదండ్రులైన బూడిద దేవుడు, లక్ష్మీదేవీ కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను న్యాయవాదిగా చదివించడం చాలా గొప్ప విశేషమన్నారు. పోలవరం జిల్లాలోని ప్రతి గిరిజన బాలికలు తల్లిదండ్రులకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా చదివించాలని అందుకు జిల్లా యంత్రాంగం ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత విద్య, ఉచిత భోజన వసతి సౌకర్యంతో పాటు విద్యార్థులకు కావలసిన మెటీరియల్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. అంబేద్కర్, డీడీ రుక్మాంగదయ్య, ఏపీవో డీఎన్వీ రమణ, డీహెచ్ఓ దేవదానం తదితరులు పాల్గొన్నారు. జీడిమామిడి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రంపచోడవరం: క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద రబ్బరు, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం క్లస్టర్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె.దినేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మార్గదర్శకాల ప్రకారం పోలవరం జిల్లాలో రబ్బరు, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ రూ.200 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో, జిల్లాలో ఉన్న సహజ వనరులు, గిరిజన ప్రాంతాల సామర్థ్యాలను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ, క్లస్టర్ విధానంలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా సూక్ష్మ పరిశ్రమలకు యంత్రాలు, ప్రాసెసింగ్, నాణ్యత ప్రమాణాలు, మార్కెటింగ్, శిక్షణ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ముఖ్యంగా రబ్బరు, జీడిపప్పు ఆధారిత పరిశ్రమలకు మంచి అవకాశాలు ఉన్నందున జిల్లా హార్టికల్చర్ అధికారి, జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. గౌతమి బోర్డు తిప్పేసిందా?బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడలో జయలక్ష్మి, కార్తికేయ సొసైటీలు బాధితులను ముంచిన ఘటనలు మరవకముందే మరో సొసైటీ వ్యవహారం వెలుగు చూసింది. నగరంలోని జన్మభూమి పార్క్ వద్దన్న గౌతమి సిటిజన్స్ పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం బోడ్డు తిప్పేసిందన్న సమాచారంతో డిపాజిట్దారులు గగ్గోలు పెడుతున్నారు. రెండు సంవత్సరాల నుంచి సహకార సంఘాలు సభ్యుల ఫిక్స్డ్ డిపాజిట్లు గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు సహకార సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ విచారణ చేయాలని జిల్లా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమి సొసైటీ చైర్మన్ వాకలపూడి తిరుపతిరాయుడు నగరంలోని రిటైర్డు ఉద్యోగుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించినట్లు తెల్సింది. గౌతమి సహకార సంఘంపై విచారణ చేయాలని కాకినాడ సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జె శివకామేశ్వరరావును ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఈ నెల 29,30 తేదీల్లో సంఘంలో పొదుపు చేసిన డిపాజిట్దారుల నుంచి వాంగ్మూలాలు తీసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా సహకార అధికారి శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా సంఘ చైర్మన్కు ఇప్పటికే నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు. -
దూసుకొచ్చిన టిప్పర్
ఫ ఆటోను ఢీకొని ఈడ్చుకుపోయిన వైనం ఫ మహిళ మృతి, ఏడుగురికి గాయాలు పి.గన్నవరం: రాజవరం – పొదలాడ రోడ్డులో నాగుల్లంక వద్ద సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆటో డ్రైవర్తో పాటు ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. తాటిపాక మఠం గ్రామానికి చెందిన నాట్ర శివకుమార్ (42) రాజమహేంద్రవరంలో స్థిరపడ్డాడు. అతను ఆదివారం వడగాడ్పులకు మృతి చెందాడు. దీంతో శివకుమార్ అంత్యక్రియల నిమిత్తం తాటిపాక మఠం, పక్కనే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం పెదలంక గ్రామాలకు చెందిన కుటుంబ సభ్యులు ఎనిమిది మంది సోమవారం తెల్లవారు జామున ఆటోలో రాజమహేంద్రవరానికి వెళ్లారు. అక్కడ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 1 గంటకు తిరిగి ఇంటికి ఆటోలో పయనమయ్యారు. వారి ఆటో నాగుల్లంక యూనియన్ బ్యాంకు సమీపానికి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టి, కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో శివకుమార్ అక్క చింతలమోరికి చెందిన మల్లాడి పద్మ (55) అక్కడికక్కడే మృతి చెందింది. జొన్నల్లంకకు చెందిన ఆటో డ్రైవర్ తిరుమాని నాగరాజు, తాటిపాక మఠం, పెదలంక ప్రాంతాలకు చెందిన నాట్ర శ్రీనివాసరావు, అతని భార్య నివేదిత దేవి, నాట్ర నరసింహరాజు గాయాల పాలయ్యారు. అలాగే నాట్ర ఉదయ కుమార్కు స్వల్ప గాయాలు కాగా, అతని భార్య కృష్ణకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. నాట్ర లక్ష్మి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, వైదాని లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. క్షత గాత్రులకు స్థానిక పీహెచ్సీ వైద్య సిబ్బంది సేవలు అందించారు. మిగతా క్షతగాత్రులను 108 అంబులెన్స్లలో స్థానికులు హుటాహుటిన పి.గన్నవరం సీహెచ్సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడి అంత్యకియలకు వెళ్లి.. రాజమహేంద్రవరంలో తమ్ముడు నాట్ర శివకుమార్ అంత్యక్రియల్లో పాల్గొని తిరిగి వస్తున్న అక్క మల్లాడి పద్మ (55) దారిలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పద్మ మృతదేహం వద్ద వారు బోరున విలపించారు. న్యాయం చేయాలని ఆందోళన ఆటో ప్రమాదంలో మల్లాడి పద్మ మృతి చెందగా, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగుల్లంకలో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని బంధువులు తెలిపారు. టిప్పర్ను డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. -
ఇలా వచ్చి.. అలా వెళ్లి..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): భానుడి భగభగలు, కార్మికుల నిరసనల మధ్య ప్రయాణం ఎందుకనుకున్నారో ఏమో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ తన పర్యటనను సూర్యుడు రాక ముందే ప్రారంభించి చకచకా పూర్తి చేసుకున్నారు. సోమవారం గోదావరి పుష్కర పనుల పరిశీలనలో భాగంగా రాజమహేంద్రవరంలో పర్యటించారు. ఉదయం 5.30 గంటలకు పుష్కరఘాట్ వద్దకు చేరుకుని బోట్లో అధికారులతో కలిసి కోటిలింగాల రేవు వద్దకు చేరుకున్నారు. బోట్లోనే అధికారులు ఆయనకు గోదావరి పుష్కర పనుల గురించి వివరించారు. పేపరుమిల్లు వల్ల జరుగుతున్న నదీ కాలుష్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనదైన స్టైల్లో బోట్లో స్టిల్స్ ఇచ్చి కార్యక్రమాన్ని గంటన్నరలో పూర్తి చేశారు. కోటిలింగాల రేవు వద్ద నుంచి కొద్ది దూరంలో ఉన్న నల్లకాలువ మురుగునీటి శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమం కూడా కొన్ని నిమిషాలలో ముగిసిపోవడం విశేషం. అక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్మికుల ధర్నా రెల్లి జాతి ఇష్టమని చెప్పి కార్మికులను చూసి పారిపోతావా? అంటూ మున్సిపల్ కార్మికులు తమ నిరసనను తెలియచేశారు. కాకినాడ ఎన్నికల సభలో రెల్లి జాతిలో పుట్టడం అంటే అదృష్టమని, నేను రెల్లి జాతిని దత్తత తీసుకుంటానని చెప్పిన ఉప ముఖ్యమంత్రి పవన్ తమను చూసి పారిపోయారని రెల్లి కార్మికులు ఆవేదన చెందారు. ఉప ముఖ్యమంత్రి పవన్ గోదావరి పుష్కరాల నేపథ్యంలో పరిశీలనకు వచ్చిన సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆయనను కలవడానికి ఉదయం 6 గంటల నుంచి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు పెద్ద ఎత్తున ఆందోళనకారుల వద్దకు వచ్చి ‘మేము ఆయనను కలవనిస్తాం. మీరు జెండాలు తీసివేయాల’ని చెప్పడంతో కొద్దిసేపు ఆందోళన విరమించారు. మూడు గంటలపాటు అక్కడే నిరీక్షించగా పవన్కల్యాణ్ బయటకు రాగానే కార్మికులను చూస్తూ చెయ్యి ఊపుతూ వెళ్లిపోయారు. కనీసం వినతి పత్రం స్వీకరించకపోవడంతో మున్సిపల్ కార్మికులు గేటు వద్ద కూర్చుని ఆందోళన చేశారు. సుమారు గంటపాటు గేట్లు వేసి ఆందోళన చేపట్టారు. ‘గబ్బర్ సింగ్ పారిపోయావా, మా గోడు వినవా, మున్సిపల్ మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్ ఏఐటీయూసీ జిందాబాద్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా అనంతరం అదనపు కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. కేవలం 1,200 మంది కార్మికులతో పుష్కరాల్లో పని చేయగలమా అని నిలదీశారు. ఆప్కాస్ను ఎత్తివేసే కుట్ర ఆపాలని, మరణించిన కుటుంబీకులకు ఆప్కాస్ ద్వారా జీతాలు ఇవ్వాలని కోరారు. చాలా సంవత్సరాలుగా రిక్షా కార్మికులు కేవలం రూ.9,000కు పని చేస్తున్నారని ఇప్పుడున్న ధరలతో ఆ వేతనంతో కుటుంబం జీవించగలదా అని ప్రశ్నించారు. రిక్షా కార్మికులను ఆప్కాస్లో కలిపి రూ.21 వేలు జీతం ఇవ్వాలన్నారు. లేకుంటే పుష్కరాల కంటే ముందుగానే సమ్మె చేస్తామని కార్మికులు హెచ్చరించారు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ సుడిగాలి పర్యటన గంటన్నరలో ముగిసిన పుష్కర పనుల పరిశీలన పుష్కరఘాట్ నుంచి బోట్లో కోటిలింగాల రేవుకు ప్రయాణం సినిమా స్టైల్లో ఫొటోలకి పోజు కార్మికులు కలవకుండా అడ్డుకున్న పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కార్మికులు ఒక్క రోజు ముందే ఘాట్ల శుభ్రం పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనకు ఒక్క రోజు ముందు గోదావరి ఘాట్లలో ఉన్న చెత్త, చెదారాలను శుభ్రం చేశారు. ఘాట్ల వద్ద ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలిగించారు. నల్లా చానల్ వద్ద ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా ఘాట్ల వద్ద చెత్త, చెదారాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు వెయ్యకుండా మున్సిపల్ సిబ్బందిని కాపలాగా పెట్టారు. అయినా గోదావరి నదీ కాలుష్యాన్ని చూసిన పవన్ కల్యాణ్ ఆఽశ్చర్యపోయారు. ఈ వ్యర్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎలా నీటిలో కలుస్తున్నాయో తెలుసుకుని నదీ జలాల్లో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
గురి తప్పని బాణాలు
జాతీయ స్థాయి ఆర్చరీ పోటీల్లో ప్రతిభ పిఠాపురం: మాటలు నేర్చుకునే వయసులో ఆటలు ఆడారు. మేథస్సు అంటే ఏంటో తెలియని వయసులో ధనుస్సు పట్టుకుని బాణం ఎక్కుపెట్టి లక్ష్యాన్ని అలవోకగా చేరారు. పిల్లలు కాదు చిచ్చర పిడుగు అనిపించుకున్నారు. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకూ గోవాలో జరుగుతున్న ఫస్ట్ ఆలిండియా ఓపెన్ ఇండోర్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో పిఠాపురం నుంచి ఇండియన్ రౌండ్ విభాగంలో అండర్ టెన్ విభాగంలో సీహెచ్ అశ్విన్, కె.సంపత్ జై, సీహెచ్ హనీత్ రతన్ పాల్గొని కాంస్య పతకాలు సాధించారు. పదేళ్ల లోపు వయసులో జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికై పతకాలను సాధించిన చిన్నారులను, వీరిని తీర్చిదిద్దిన ఆర్చరీ కోచ్ లక్ష్మణరావును పలువురు అభినందించారు. -
ఆటహాసంగా..
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): వేసవి సెలవులు అంటేనే ఆటల ప్రపంచంలో మునిగితేలే రోజులు.. అలాంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువ తరంగం ఉత్సాహంగా ముందుకు వస్తోంది. వీరి కోసం కాకినాడ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 35 వేసవి శిక్షణా శిబిరాలు, కాకినాడ డీఎస్ఏలో 15 శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 3 వేల మంది వరకూ శిక్షణ పొందుతున్నారు. పిఠాపురం, విరవ, అన్నవరం, జగ్గంపేట, కాట్రావులపల్లి, గొల్లపాలెం, కాజులూరు, రమణయ్యపేట, వాకలపూడి, చీడిగ, కిర్లంపూడి, లంపకలోవ, సామర్లకోట, తుని, యు.కొత్తపల్లి, ఎండపల్లి, ఏలేశ్వరం, ముసలయల్యపేటతో పాటు కాకినాడ అర్బన్ ఎంఎస్ఎన్ చారిటీస్, సాలిపేట, ఏపీఎస్పీ, డీఎస్ఏలో ఈ శిబిరాలు జరుగుతున్నాయి. 30 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. బాస్కెట్బాల్, ఆర్చరీ, ఖోఖో, కబడ్డీ, క్రికెట్, స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్, వాలీబాల్, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, జిమ్నాస్టిక్స్, లాన్ టెన్నిస్, ఫుట్బాల్, అథ్లెటిక్స్ తదితర 15 క్రీడాంశాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 50 వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వి.సతీష్కుమార్ తెలిపారు. ఆసక్తి గలవారు 94400 31601 నంబరులో సంప్రదించాలని కోరారు. -
సెల్ఫీలు దిగిన లోకేష్ ఎక్కడున్నాడు
గత ప్రభుత్వంలో పెట్రోల్ బంకుల వద్ద సెల్ఫీ దిగి ధరలు పెరిగాయని విమర్శించిన లోకేష్.. ఇప్పుడు ఎక్కడున్నాడు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రం ఇంధన ధరలు ఎందుకు పెంచుతున్నారు. ఇది అసమర్థ పాలనకు నిదర్శనం. – చెల్లుబోయిన వేణు, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రజలకు కాదని కాంట్రాక్టర్లకు వత్తాసు పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోని సీఎం చంద్రబాబు.. అమరావతిలో కాంట్రార్లకు ధర తగ్గించమని కేంద్రానికి లేఖ రాసి తెప్పించుకున్నారు. దీన్ని బట్టి చూస్తే బాబుకు రాష్ట్ర ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని అర్థమవుతోంది. – –మార్గాని భరత్రామ్, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ రాష్ట్రంలో అభివృద్ధి గాలికి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని గాలికి వదిలేసింది. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు పెంచమని ప్రగల్భాలు పలికిన లోకేష్. ప్రస్తుతం పెరుగుతున్న ధరలపై ఎందుకు స్పందించడం లేదు. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వాహనాలు నడిపేదెలా? పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేనంగా పెరుగుతున్నాయి. కొన్నాళ్లు డీజిల్ కొరత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ధరలు పెంచడంతో కిరాయిలకు వెళ్లలేకపోతున్నాం. ఒకవేళ వెళ్లినా కిరాయి పెంచాల్సి వస్తోంది. పెంచితే ఎవరూ పిలవడం లేదు. – బాలం రమేష్, డ్రైవర్ సమిశ్రగూడెం, నిడదవోలు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
కొత్త అల్లుడికి పసందైన విందు
గోదావరి జిల్లాల అంటే ఆతిథ్యానికి పెట్టింది పేరు. ఆదివారం కడియం మండలం వేమగిరి తోటలో ఓ కొత్త అల్లుడికి పసందైన విందును ఏర్పాటు చేశారు. వేమగిరి తోటకు చెందిన నరాల గణపతి తన మనవరాలు (కొడుకు కుమార్తె) గీతికను, తన మనవడు (కూతురి కుమారుడు) మణికంఠకు ఇచ్చి వివాహం చేశారు. ఆ జంటకు 101 రకాల వంటకాలతో మణికంఠకు విందు భోజనం పెట్టారు.-తూర్పుగోదావరి చోటుమాటు కాదండోయ్.. నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నా, తలకెక్కించుకోవడం లేదు. నిడదవోలు– నరసాపురం ఆర్అండ్బీ రహదారిపై 14 మంది మహిళలతో పెరవలి నుంచి తీపర్రు వైపునకు ఆటో ఇలా వెళ్లగా, వెనుక మహిళలు ప్రమాదకరంగా కూర్చున్నారు. ఉసులుమర్రు వద్ద అధిక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్పై, తీపర్రు వద్ద అరటి లోడు వ్యాన్పైన కూలీలు కూర్చుని వెళ్లడం కనిపించింది. ద్వారకాతిరుమల క్షేత్రానికి వచ్చిన కొందరు భక్తులు ఆటోల వెనుక కూర్చుని ప్రమాదపు అంచున ప్రయాణం సాగించారు. –పెరవలి , ద్వారకాతిరుమల -
108లో గర్భిణికి ప్రసవం
నిడదవోలు: ఓ గర్భిణికి ఆదివారం 108 అంబులెన్స్లో సుఖ ప్రసవం జరిగింది. ఆ వివరాల ప్రకారం.. నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన సీహెచ్ శకుంతలకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఆ సిబ్బంది వెంటనే గ్రామానికి చేరుకుని గర్భిణి శకుంతలను అంబులెన్స్లో ఎక్కించుకుని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో వాహనాన్ని మార్గం మధ్యలో నిలిపివేసి ఫైలెట్ ఎల్.నాగరాజు, ఈఎంటీ జి.శ్రీనివాస్, ఆశ కార్యకర్తలు శకుంతలకు డెలివరీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. 108 వాహన సిబ్బందిని స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు. పడిపోతున్నట్లు నటించి.. నగదు దొంగిలించి నిడదవోలు: ఉండ్రాజవరం మండలం వెలగదుర్రు గ్రామంలో ఆదివారం చోరీ జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. వెలగదుర్రు గ్రామానికి చెందిన వృద్ధుడు డి.అప్పారావుకు ఇంటి ఖర్చుల నిమిత్తం దూర ప్రాంతంలో ఉంటున్న తన కుమారుడు గ్రామంలోని స్నేహితునికి రూ. 5 వేలు ఫోన్ పే చేశారు. ఆ నగదును అప్పారావు తీసుకు ని గ్రామ సెంటర్లో కూర్చున్నాడు. డబ్బులు తీసుకోవడం గుర్తించిన ఇద్దరు వ్యక్తులు అక్కడకు బైక్పై వచ్చారు. కిందకు పడిపోతున్నట్లు నటించారు. అది చూసిన అప్పారావు బైక్ వద్దకు వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. క్షణాల్లో అతని జేబులో ఉన్న రూ. 5 వేలు తీసుకుని బైక్పై ఉడాయించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా ఆ దొంగలు వేరే ప్రాంతానికి చెందిన వారని గుర్తించారు. మోర్త గ్రామంలో ఇటీవల ఆంధ్రాబ్యాంక్ ప్రాంతంలో ఇదే తరహాలో ఎం.రామకృష్ణకు చెందిన రూ. 10 వేలు లాక్కుని పరారయ్యారు. ఇటీవల గ్రామంలో రెండు చోట్ల కోకో గింజలు బస్తాలు చోరీ చేసి వ్యాన్లో తరలించడం, ఇప్పుడు డబ్బులు దొంగిలించటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి నిడదవోలు: నిడదవోలు – నవాబ్పాలెం రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం గుర్తుతెలియని (35) వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. అతను రైలు నుంచి జారి కిందపడటంతో మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఎత్తు 5.5 అడుగులు ఉండగా, ఒంటిపై నాచురంగు షర్ట్ ఉంది. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు సంఘటనా స్థలానికి చేకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 85733, 80191 57528 నంబర్లకు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కొరారు. -
ఫ అదీ సంగోతి
కుడితిలో పడిన ఎలుక బయటకు రావడానికి నానా పాట్లూ పడుతుంది. అలాగే, ఈ పల్లెవెలుగు బస్సు అనుకోకుండా నడి రోడ్డుపై ఉన్న ఓ గోతిలో దిగబడిపోయింది. గోపాలపురం మండలం దొండపూడి నుంచి ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఆదివారం రాజమహేంద్రవరానికి బయలుదేరింది. దొండపూడి సెంటర్కు చేరగానే.. అక్కడ రోడ్డుపై ఉన్న ఓ గోతిలో వెనుక చక్రం పడింది. డ్రైవర్ ఎంతసేపు ప్రయత్నించినా ఆ బస్సు గోతిలో నుంచి బయటకు రాలేదు. దీంతో, ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. చివరకు ఓ ట్రాక్టర్తో గ్రామస్తులు ఆ బస్సును గోతిలో నుంచి బయటకు లాగడంతో గమ్యానికి బయల్దేరింది. ఇంతకూ గోతుల్లేని రోడ్లే తమ లక్ష్యమని ఘనంగా ప్రకటించిన కూటమి సర్కారు వారు ఈ గోతిపై ఏం చెబుతారో మరి! – దేవరపల్లి -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గోకవరం: స్థానిక ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వన్నేటి వెంకటేశ్వరరావు (53) గోకవరంలో ఓ హోటల్లో పని చేస్తున్నాడు. సింగారమ్మ చింత ఆలయం వద్ద భోజనానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో సాయంత్రం మృతి చెంది ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై పవన్కుమార్ అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
రాజమహేంద్రవరం టు అరకు వ్యాలీ
సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం నుంచి అరకువ్యాలీకి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. ఈ సర్వీసును ఆదివారం ప్రారంభించారు. ఈ బస్సు ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు రాజమహేంద్రవరంలో బయలుదేరి గోకవరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కేడీ పేట, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు అరకువ్యాలీ చేరుకుంటుందని వివరించారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు అరకువ్యాలీలో బయలుదేరి, అదే మార్గంలో రాత్రి 9 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు. ఈ సర్వీసుకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. టికెట్టు ధర రూ.580గా నిర్ణయించామని చెప్పారు. 20.75 లక్షల కిలోల పొగాకు విక్రయాలు దేవరపల్లి: టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి 20,75,720 కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్టు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. దీని విలువ రూ.53.96 కోట్లని చెప్పారు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి రెండు నెలలైందని, మార్కెట్లో సరైన ధర పలకకపోవడంతో రైతులు వేలానికి బేళ్లు తీసుకు రావడం లేదని అన్నారు. రోజుకు ఐదు వేలం కేంద్రాల్లో దాదాపు 5 వేల బేళ్లు వేలానికి రావాల్సి ఉండగా, 400 నుంచి 500 మాత్రమే వస్తున్నాయని, వీటిలో సగం బేళ్లను కొనుగోలుదారులు తిరస్కరిస్తున్నారని ఆయన తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రానికి శుక్రవారం కేవలం 7 బేళ్లు మా త్రమే వేలానికి రాగా, కిలో గరిష్ట ధర రూ.236 పలికిందన్నారు. ఐదు వేలం కేంద్రాల్లో 493 బేళ్లు వేలానికి రాగా, 223 తిరస్కరించగా, 270 కొనుగోలు చేశారని పేర్కొన్నారు. కిలోకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.210, సగటున రూ.260.72 చొప్పున ధర పలికిందని తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 2,96,035 కిలోలు, జంగారెడ్డిగూడెం–1లో 5,63,013 కిలోలు, జంగారెడ్డిగూడెం–2లో 4,31,649 కిలోలు, కొయ్యలగూడెంలో 3,54,660 కిలోలు, గోపాలపురంలో 4,30,362 కిలోల మేర విక్రయాలు జరిగాయని సురేంద్ర కుమార్ తెలిపారు. తప్పిన ప్రమాదందేవీపట్నం: పాపికొండలు పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటక అభివృద్ధి సంస్థ బోటు ముందు భాగంలో పగులు ఏర్పడటంతో నీరు లోపలకు చేరింది. 40 మంది సామర్థ్యం ఉన్న ఈ బోటు పర్యాటకులతో తిరుగుతుంటుంది. ఈ బోటులో వెళ్లేందుకు 38 మంది ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారంతా ఆదివారం ఉదయం గండిపోశమ్మ ఆలయం వద్ద బోట్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే బోటులోకి నీరు చేరడాన్ని సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో, వారు వేరే బోటులో పర్యాటకులను పంపించారు. -
అగ్నిగుండం
రాజమహేంద్రవరంలో వెలవెలబోతున్న దేవీచౌక్ సెంటర్రాజమహేంద్రవరం రూరల్: ఎల్నినో ప్రభావంతో కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. వారం రోజులుగా 45 డిగ్రీల సెల్సియస్కు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి కొనసాగింపా అన్నట్టు ఆదివారం జిల్లా అగ్నిగుండమే అయ్యింది. ఇండియన్ లీఫ్ టొబాకో డెవలప్మెంట్ (ఐఎల్టీడీ) రికార్డుల ప్రకారం జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఏకంగా 49 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే ఇది అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత కావడం గమనార్హం. గోపాలపురం మండలం చిట్యాలలో కూడా అత్యధికంగా 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిడదవోలు తదితర ప్రాంతాల్లో కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే.. ఉదయం 9 గంటల నుంచి వాతావరణం క్రమంగా వేడెక్కిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి ప్రజలు సాహసించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు రోడ్లపై ప్రయాణిస్తూంటే అగ్నిగుండంలో వెళ్తున్న అనుభూతికి గురయ్యారు. మండిపడిన మార్తాండుడి ధాటికి కాళ్ల కింద నేల.. వీస్తున్న గాలి అన్నీ వేడెక్కిపోవడంతో నిప్పురవ్వలు రాజుకున్నట్టు అనిపించింది. అగ్నికి వాయువు తోడైనట్టు.. చండప్రచండంగా కాస్తున్న ఎండలకు గోదావరిలోని నీరు ఆవిరవుతోంది. మరోవైపు గోదావరిలోని ఇసుక తిన్నెలు వేడెక్కిపోతున్నాయి. రాజమహేంద్రవరం నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు ఈ పరిస్థితులు కూడా కారణమవుతున్నాయి. అదే సమయంలో నీరు ఆవిరవుతూండటంతో గాలిలో తేమ కూడా పెరిగిపోతోంది. దీంతో, ఇటు తీవ్రమైన ఎండలు, అటు ఉక్కపోతకు తాళలేక, నిద్ర పోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు వేసినా వేడిగాలే రావడంతో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన వేడి వాతావరణం ఏర్పడటంతో మధ్యాహ్నం వేళల్లో ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. పలు ప్రాంతాల్లో వ్యాపారులు మధ్యాహ్నం వేళ దుకాణాలను సైతం మూసివేశారు. బతుకుతెరువు కోసం రోడ్ల పక్కన చిరు వ్యాపారులు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో గొడుగులు వేసుకుని, చెట్ల నీడన కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తూ వ్యాపారాలు సాగించారు. పెరుగుతున్న డీహైడ్రేషన్ బాధితులు తీవ్రమైన ఎండలతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎండ తీవ్రత కారణంగా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బోధనాసుపత్రితో పాటు జిల్లాలోని సీహెచ్సీలు, పీహెచ్సీల్లో డీహైడ్రేషన్, వడదెబ్బ, జ్వరం బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నారుల్లో చర్మ సంబంధమైన ఇబ్బందులు, వృద్ధుల్లో బీపీ, షుగర్ లెవెల్స్లో హెచ్చుతగ్గుల వంటి సమస్యలు వస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలి రానున్న రెండు రోజులకు వాతావరణ శాఖ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. వడదెబ్బకు గురవకుండా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎండల తీవ్రత నేపథ్యంలో వైద్య నిపుణులు సైతం పలు సూచనలిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలోకి రాకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు. ఆ సమయంలో వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలని, తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలని, మజ్జిగ, ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్ల వంటివి ఇవ్వాలని, పరిస్థితి విషమిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచిస్తున్నారు. నిర్మానుష్యంగా ఉన్న నిడదవోలు ఆర్ఓబీ రాజమహేంద్రవరంలో జనం కానరాని ఆజాద్ చౌక్ సెంటర్మధ్యాహ్నం వేళ దేవరపల్లి వద్ద వాహన సంచారం లేని 16వ నంబర్ హైవే ఈ జాగ్రత్తలు మేలు ఫ దాహం వేయకపోయినా ప్రతి గంటకు ఒకసారి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఫ మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ ద్రావణాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తాయి. ఫ పుచ్చకాయ, ఖర్బూజ, ద్రాక్ష, నారింజ వంటి నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఫ వేసవిలో జంక్ఫుడ్, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని నాన్వెజ్ వంటకాలను సాఽ ద్యమైనంతగా తగ్గించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఫ తప్పనిసరి పరిస్థితిల్లో బయటకు వెళ్లాల్సి వస్తే, తలకు టోపీ/రుమాలు చుట్టుకోవాలి. గొడుగు వినియోగించడం మంచిది. ఫ లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి చెమటను పీల్చుకుని, శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. ఫ వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంది. ఎప్పటికప్పుడు తాజాగా వండుకున్న ఆహారాన్ని తీసుకోవాలి. ఫ రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. ఫ భగ్గుమన్న భానుడు ఫ రాజమహేంద్రవరంలో 49 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత ఫ చిట్యాలలో 48.3 డిగ్రీలు ఫ సెగభగలతో ప్రజలు విలవిల -
తంటికొండలో సినీ సందడి
గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో ప్రసిద్ధి గాంచిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సినీ సందడి నెలకొంది. ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న నూతన సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. టీసీ సుగుమార్ దర్శకత్వంలో చిత్రీకరిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ బాబి ఆధ్వర్యంలో ఆలయానికి వచ్చిన చిత్ర యూనిట్ను దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్నదొర ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతించి, స్వామివారి ప్రసాదం అందజేశారు. -
గోదారమ్మకు గర్భశోకం
వాడపల్లి ఇసుక ర్యాంపులు ● నిబంధనలకు తెలుగు తమ్ముళ్ల నీళ్లు ● డ్రెడ్జర్లతో యథేచ్ఛగా తవ్వకాలు ● వందల లారీల్లో తరలింపు పెరవలి (కొవ్వూరు): నిబంధనలను గోదాట్లో తొక్కేస్తున్న తెలుగు తమ్ముళ్లు గోదారమ్మకు నిలువెల్లా తూట్లు పొడుస్తూ గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. కొవ్వూరు మండలం వాడపల్లిలో రెండు ర్యాంపులున్నాయి. వీటిని ఇసుక తవ్వకాల కోసం అధికారులు బోట్స్మెన్ సొసైటీకిచ్చారు. ఇదే అదునుగా అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు గోదావరిలో ఇష్టానుసారం ఇసుక తోడేస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనలు ఇలా.. ● నదీ గర్భంలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయకూడదు. కేవలం పడవలతో నదిలోకి వెళ్లి బకెట్లతో మనుషులు మాత్రమే ఇసుక తీయాలి. కానీ, వాడపల్లి ర్యాంపుల్లో తమ్ముళ్లు కాసులపై దురాశతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇష్టానుసారం డ్రెడ్జర్లతో ఇసుక తోడేస్తున్నారు. నదీగర్భాన్ని నిలువునా చీల్చేస్తున్నారు. ● మైనింగ్ చట్టం ప్రకారం గోదావరి గట్టుకు 200 మీటర్ల పరిధిలో మాత్రమే ఇసుక తవ్వకాలు జరపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యంత్రాలతో నదీగర్భంలోని ఇసుకను తవ్వకూడదు. ఈ నిబంధనను ఇక్కడ పట్టించుకున్నవారే లేకుండా పోయారు. ● ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చిన తరువాత జియో కో ఆర్డినేషన్ ప్రకారం హద్దులు నిర్ణయిస్తారు. దాని ప్రకారమే తవ్వకాలు జరపాలి. కానీ, ఇక్కడ అటువంటి నిబంధనలను ఎవ్వరూ ఖాతరు చేయడం లేదు. ● ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. తవ్విన ఇసుకను అక్కడ గుట్టలుగా నిల్వ వేస్తున్నారు. ముఖ్యంగా కుమారదేవం, కొవ్వూరు, ఔరంగబాద్, ఆరికరేవుల, వాడపల్లి, ప్రక్కిలంక, పురుషోత్తపల్లి గ్రామాల్లో భారీ స్థాయిలో నిల్వ చేస్తున్నారు. పగలంతా నిల్వలు వేస్తూంటే రాత్రుళ్లు ఐదు యూనిట్ల లారీలతో అమ్మకాలు చేస్తున్నారు. ● నిబంధనలు అమలు చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా వాడపల్లిలోని రెండు ర్యాంపుల నుంచి రోజుకు 200 నుంచి 300 లారీల్లో ఇసుకను యథేచ్ఛగా తరలించేస్తున్నారు. వివిధ శాఖల అధికారులు చూసీచూడనట్లు వదిలేయడానికి గాను ఈ ర్యాంపుల్లో నెలకు రూ.7.80 లక్షల మేర ముట్టజెబుతున్నట్లు కూలీలే బహిరంగంగా చెప్పుకొంటున్నారు. వాడపల్లి వద్ద గోదావరిలో డ్రెడ్జర్లతో ఇసుక తోడేస్తున్నారిలా.. ఆరికరేవుల వద్ద వేసిన ఇసుక గుట్టలు -
అలరించిన ‘గజల్’ గానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్య కళా మందిరంలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్ నగర వాసులను అలరించాయి. సరస్వతీ గానసభ, గజల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన తెలుగు గజల్స్ లెజెండ్, గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన మాస్ట్రో గజల్ శ్రీనివాస్చే 40 వసంతాల గజల్ గాన ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గజల్ శ్రీనివాస్తో పాటు సరస్వతీ గానసభ జీవితకాల అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీరామనరసింగరావు, గౌరవాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ, 40 సంవత్సరాలుగా తన గజల్స్తో నిర్విరామంగా తెలుగు ప్రేక్షక శ్రోతలను మైమరపింపజేయడం శ్రీనివాస్కే సాధ్యమన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, 125 సంవత్సరాలుగా నిర్విరామంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ, తెలుగు వారు గర్వించదగిన సరస్వతీ గానసభలో గజల్స్ గానం చేయడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అనంతరం ఆయన పలు గజల్స్తో పాటు భక్తిగీతాలను ఆలపించారు. -
వాసు.. కస్సుబుస్సు
సాక్షి, రాజమహేంద్రవరం: నగరంలో టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు నెలకొన్నాయా.. పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య సఖ్యత కొరవడిందా.. పైకి ఇద్దరు నేతలూ కలిసి ఉంటున్నట్టున్నా.. ఇద్దరి మధ్య అంతర్గతంగా అంతరం నెలకొందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కర ఘాట్లో చేపట్టిన పనులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ పనులను ఇటీవల మంత్రి దుర్గేష్తో పాటు, జిల్లా అధికారులు ప్రత్యేకంగా పడవలో వెళ్లి మరీ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వాసు గైర్హాజరయ్యారు. దీనికితోడు పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో పుష్కర ఘాట్ పనులపై వాసు బహిరంగ విమర్శలు చేయడం రాజమహేంద్రవరంలో చర్చనీయాంశంగా మారింది. వాసు ఏమన్నారంటే.. పుష్కర ఘాట్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే వాసు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. పనులు నిర్వహిస్తున్న తీరును తప్పు పట్టారు. ఈ పనులు జరుగుతున్న సమాచారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు లేదన్నారు. కనీసం మంత్రి దుర్గేష్కై నా సమాచారం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ఘాట్లో కొత్తగా అమరుస్తున్న టైల్స్ జారుడు స్వభావం ఉన్నట్లు గమనించామన్నారు. గత పుష్కరాల దుర్ఘటన నేపథ్యంలో అలాంటి టైల్స్ అమర్చడమేమిటని ప్రశ్నించారు. అంతే కాకుండా గోదావరి మాత విగ్రహం ఎదురుగా వాటర్ ఫౌంటైన్ అవసరమా అని ప్రశ్నించారు. దీనిపై ఎంపీ పురంధేశ్వరి సైతం అసహనం వ్యక్తం చేశారన్నారు. ఫౌంటైన్ పనులు ఆపిస్తామని ఎంపీ చెప్పారన్నారు. ఈ విషయమై మంత్రి దుర్గేష్తో చర్చిస్తానని ప్రకటించారు. వాస్తవానికి పుష్కర ఘాట్లో పనులు రెండు నెలలకు పైగా జరుగుతున్నాయి. అయినప్పటికీ ఈ విషయం ఎమ్మెల్యేకి తెలియకపోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. వాసు వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రితో సఖ్యత ఏ మేరకు ఉందో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమన్వయం లేకపోతే ఎలా? గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహిస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటిస్తోంది. కానీ, క్షేత్ర స్థాయిలో శాఖల మధ్య సమన్వయం ఉండటం లేదు. స్వపక్ష నేతల మధ్యనా అదే పరిస్థితి. రూ.94 కోట్లతో చేపడుతున్న పనులపై కూటమి పార్టీల నేతల మధ్యనే సమన్వయం లేకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. పరిస్థితి ఇలాగే ఉంటే పుష్కరాల నిర్వహణ ఎలాగనే ప్రశ్న తలెత్తుతోంది. వాసు విమర్శలు అందుకేనా? గోదావరి పుష్కరాల నేపథ్యంలో సుమారు రూ.94 కోట్ల పర్యాటక శాఖ నిధులతో పుష్కర ఘాట్ సుందరీకరణ చేపడుతున్నారు. మొత్తం పనులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఆ శాఖకు జనసేనకు చెందిన మంత్రి దుర్గేష్ సారఽథ్యం వహిస్తున్నారు. ఈ పనుల టెండర్లను జనసేన నేతల అనుగ్రహం ఉన్న వారికే కట్టబెట్టారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన ప్రమేయం లేకుండానే రూ.కోట్ల విలువైన పనులు చేపడుతున్నారనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే వాసు ఈ విమర్శలు చేశారా అనే ప్రశ్న తలెత్తుతోంది. తమ పార్టీ నేతలెవరూ లబ్ధి పొందడం లేదనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కాంట్రాక్టర్ను సైతం ‘ఒళ్లు దగ్గరపెట్టుకుని పనులు చేయాలి’ అంటూ ఎమ్మెల్యే బహిరంగంగా హెచ్చరించడం వెనుక వేరే ఆంతర్యం దాగి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని నెలల నుంచి పనులు జరుగుతున్నా ఏనాడూ బహిరంగంగా మాట్లాడని వాసు ఇప్పుడు విమర్శలు గుప్పించడం వెనుక ఉద్దేశమేమిటోనని పలువురు కూటమి నేతలే చర్చించుకుంటున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో కూటమిలో విభేదాలు బహిర్గతం పుష్కర ఘాట్ పనుల్లో నాణ్యతపై టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ విమర్శలు లోకల్ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం పర్యాటక మంత్రికై నా చెబుతున్నారా అంటూ అసహనం నేడు పనులను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం పవన్ చర్చనీయాంశంగా మారిన వాసు వ్యాఖ్యలు -
వడగాడ్పులకు నలుగురి మృతి
అంబాజీపేట: వడగాడ్పులకు ఆర్ఎంపీ వైద్యుడు ఆదివారం మృతి చెందారు. వాకలగరువు అగ్రహారం వీధికి చెందిన పేరాబత్తుల వెంకటరత్నం (44) ఆర్ఎంపీ వైద్యుడిగా జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న వారికి వైద్యం చేసేందుకు వెళ్లిన వెంకటరత్నం మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చారు. అనంతరం ఎవరి నుంచో ఫోన్ రావడంతో మధ్యాహ్నం మూడు గంటలకు మోటార్ సైకిల్పై వెళ్లారు. తర్వాత ఏటిగట్టుపై మోటార్ సైకిల్తో పడి ఉన్న వెంకటరత్నంను స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దాంతో 108కు ఫోన్ చేయగా వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అంబాజీపేట పోలీసులతో పాటు వైద్యాధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పనపాడులో.. కపిలేశ్వరపురం (మండపేట): ఇప్పనపాడులోని లింగరాజుపేటకు చెందిన తిరుశూల సత్యనారాయణ (50) వడగాడ్పులకు మృతి చెందారు. ద్వారపూడి స్వీట్ స్టాల్లో పని చేస్తున్న తన భార్య వీరకు భోజనం ఇచ్చి సైకిల్పై ఇంటికి తిరిగి వస్తూ ఇంటి సమీపంలో అతను వడదెబ్బకు గురై మృతి చెందారు. ఆత్రేయపురం, కపిలేశ్వరపురం (మండపేట): వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయ అన్నదాన భవనంలో సేవ చేస్తూ వాడపల్లికి చెందిన సరిదే భాను (73) వడగాడ్పులకు మృతి చెందింది. మండపేట మండలం ఏడిద అంబేడ్కర్ నగర్కు చెందిన బూరిగ కన్నమ్మ (84) వడదెబ్బకు మృత్యువాత పడింది. -
ఇవేం పన్నులో బాబూ..
ఫ పదోన్నతుల కౌన్సెలింగ్లో పంచాయితీ ఫ సీనియారిటీని కాకుండా పన్నుల వసూళ్లకే ప్రాధాన్యం ఫ జీఓ జారీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఫ సర్వీస్ రూల్స్ అతిక్రమణ అంటున్న ఉద్యోగులు ఆలమూరు: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్యదర్శులకు కల్పించిన పదోన్నతుల కౌన్సెలింగ్లో సీనియారిటీని పక్కనబెట్టింది. ఇందులో ఇంటి పన్నుల వసూళ్ల ఆధారంగా ఉద్యోగులను ఆయా స్థానాల్లో భర్తీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ జీఓ జారీ చేయడం వివాదాస్పదమైంది. దీనివల్ల సర్వీస్ రూల్స్ అతిక్రమణతో పాటు ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్ల అమలుకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో అనుభవం, సామర్థ్యం, రిజర్వేషన్లు ఉన్న పంచాయతీ కార్యదర్శులు కౌన్సెలింగ్లో వెనుకబడే ప్రమాదముంది. అనుభవంతో సంబంధం లేకున్నా రిజర్వేషన్లతో పనిలేకుండా కౌన్సెలింగ్ను త్వరితగతిన పూర్తి చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ సీనియర్లకు, అనుభవజ్ఞునులకు మధ్య చిచ్చుపెట్టి తీరని అన్యాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో గ్రేడ్–3గా పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు (పీడీఓ)లను గ్రేడ్–2లోకి పదోన్నతులు కల్పించేందుకు జీఓ జారీ చేసింది. ఈ పదోన్నతుల్లో రాష్ట్రంలో జోన్–2 పరిధిలోని ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లా వ్యాప్తంగా 227 మంది అర్హత సాధించారు. ఇందులో కొంత మందిని అంతర జిల్లాల బదిలీకి ఒప్పించారు. అధికార పార్టీ ఆశీస్సులు ఉన్నవారిని, వెళ్లేది లేదంటూ ఎదురుతిరిగిన వారిని సొంత జిల్లాల్లోనే పంచాయతీరాజ్ శాఖ ఉంచేసింది. ఒక్కోచోట ఒక్కో విధంగా? రాష్ట్రంలోని జోన్–2 పంచాయతీరాజ్ విభాగంలో ఉన్న ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో కౌన్సెలింగ్ ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంది. జోన్–2 పరిధిలోని ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటి వరకూ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీఓను పట్టించుకోకుండా ఈ నెల 23న అక్కడి అధికారులు ఆన్లైన్లోనే సీనియారిటీ ప్రాతిపదికన కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇచ్చేశారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ నెల 25న ఇంటి పన్నుల వసూళ్ల ఆధారంగానే కౌన్సెలింగ్ ఇస్తామని ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఇంకా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలో పీడీఓల కౌన్సెలింగ్ నిర్వహణపై ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కౌన్సెలింగ్లో సీనియారిటీ, లేక ఇంటిపన్నుల వసూళ్లకు ప్రాధాన్యం ఇస్తారా అనే దానిపై అంతా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద జీఓల వల్ల పంచాయతీరాజ్ ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి జ్వాలలు రగిలి గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2కు పదోన్నతి పొందిన పీడీఓలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే పీడీఓల సీనియారిటీ పరంగా ఒక జాబితా, ఇంటి పన్నుల వసూళ్లలో అగ్రస్థానంలో ఉన్న మరొకరి జాబితాను రూపొందించి కౌన్సెలింగ్కు సిద్ధంగా ఉన్నాం. –డి.శాంతాలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిజంగా ఉద్యోగులను ఇరుకున పెట్టే ఆలోచన ఇది.. చంద్రబాబు సర్కారు పదోన్నతుల ప్రక్రియలో ఎప్పుడూ లేని విధానాన్ని తీసుకొచ్చింది.. సీనియారిటీని పక్కనబెట్టి కొత్త సంప్రదాయానికి తెరపైకి తెచ్చింది.. దీనిపై సర్వత్రా నిరసన వెల్లువెత్తుతోంది.. ఇది సర్వీస్ రూల్స్ అతిక్రమణే అంటూ ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. జీఓ జారీపై మండిపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1,071 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో గ్రేడ్–3 నుంచి గ్రేడ్–2 పదోన్నతులు పొందిన వారు 198 మంది, జోన్–2 పరిధిలో పదోన్నతి పొందిన పీఈఓలు 29 ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రూల్స్ను, రిజర్వేషన్ల ప్రక్రియను ఉల్లంఘిస్తూ సీనియారిటీని, సమర్థతను కాదని పీడీఓల పదోన్నతులకు సంబంధించి కౌన్సెలింగ్ను నిర్ణయించడంపై పంచాయతీరాజ్ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విధానం కొనసాగితే ప్రభుత్వ శాఖల్లో అనేక దుష్ట సంప్రదాయాలు వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అనారోగ్య సమస్యలు, స్పౌజ్ పరిస్థితుల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా, కేవలం ఇంటి పన్ను వసూళ్ల ఆధారంగా కౌన్సెలింగ్ను చేపడితే ఉద్యోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనిపై కొందరు పీడీఓలు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా, ఫలితం లేకపోయింది. సాక్షాత్తు రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనరేట్ ఇచ్చిన జీఓ, సర్క్యూలర్ కాబట్టి తామేమి చేసేదే లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ప్రథమార్థంలో గ్రామ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించినా, కేవలం సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతిని పంచాయతీరాజ్ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. -
గుదిబండాగారం
● గ్రంథాలయాలపై సర్కారు నిర్లక్ష్యం ● పేరుకుపోయిన రూ.50 కోట్ల బకాయిలు ● రెండు నెలలుగా ఉద్యోగులకు జీతాల్లేవు ● పింఛన్ దారులదీ అదే పరిస్థితిఆలమూరు: విజ్ఞాన బాండాగారాలుగా ప్రఖ్యాతి గాంచిన గ్రంథాలయాలు కూటమి పాలనలో అధ్వానంగా మారుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల నుంచి వసూలు కావాల్సిన గ్రంథాలయ పన్ను సుమారు రూ.50 కోట్ల వరకూ బకాయి ఉండటంతో వెలవెలబోతూ నీరసించి పోతున్నాయి. రెండు నెలల నుంచి గ్రంథాలయాల ఉద్యోగులకు, మూడు నెలల నుంచి పింఛన్ దారులకు వేతనాలు మంజూరు జరగలేదు. ఈ నెల ముగిసి జూన్ వస్తే 4 నెలల జీతాలు బకాయి రూ.4.5 కోట్లు వరకూ ఉంటుంది. అప్పులతో జీవనం పింఛన్దారులైతే తమ అనారోగ్య పరిస్థితుల నుంచి బయట పడేందుకు అప్పులు తెచ్చి మరీ మందులు, ఇతర నిత్యావసరాలను కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే సామాజిక పింఛన్లను అందిస్తున్న విధంగానే తమకు ఎందుకు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని పింఛన్ దారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలో గ్రంథాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కలగలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ సీపీ హయాంలో అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ప్రజలకు విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రంథాలయాల అభివృద్ధికి రూ.130 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో కేవలం రూ.42 కోట్లు కేటాయించడం పరిస్థితికి అద్దం పడుతుంది. అలాగే అప్పటి సీఎం వైఎస్ జగన్ పరిపాలన సాగించిన ఐదేళ్ల కాలంలో క్రమం తప్పకుండా వేతనాలు అందించారు. ఇప్పుడు చంద్రబాబు పాలనలో మూడు నెలలు పూర్తయ్యి నాలుగో నెల వస్తున్నా జీతాల మంజూరుపై స్పష్టత లేకుండా పోయింది. గ్రంథాలయాలకు పునరుజ్జీవం రావాలంటూ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నును సత్వరమే గ్రంథాలయ శాఖకు జమ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజలు చెల్లిస్తున్నా.. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీలలో నివసించే ప్రజలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా 08 శాతం మేర గ్రంథాలయ పన్ను చెల్లిస్తున్నా జిల్లా కేంద్ర గ్రంథాలయ శాఖకు జమ కావడం లేదు. దీనివల్ల ఉద్యోగులు, పింఛన్దారులకు జీతాలు ఇవ్వకపోవడంతో కొత్త పుస్తకాల కొనుగోళ్లు, గ్రంథాలయాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటంతో గ్రంథ పాలకుల సేవలు సక్రమంగా అందడం లేదు. కొత్త పుస్తకాల కొనుగోలు లేకపోవడంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయాలు 102 ప్రస్తుతం పనిచేస్తున్నవి 100 గ్రామీణ గ్రంథాలయాలు 04 పుస్తక నిక్షిప్త కేంద్రాలు 161 గ్రంథాలయాల్లో ఉద్యోగులు 294 ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు 57 ఉద్యోగుల ఖాళీలు 237 పింఛన్దారులు 167 -
మళ్లీ పెట్రో మంట
● పెట్రోల్ 97 పైసలు.. ● డీజిల్ 99 పైసలు పెంపు సాక్షి, రాజమహేంద్రవరం: కేంద్ర ప్రభుత్వం మరోసారి ఇంధన ధరలలు పెంచింది. 13 రోజుల వ్యవధిలోనే ఇలా పెంచడం మూడో సారి. తాజాగా పెంచిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. లీటరు పెట్రోల్పై 97 పైసలు, డీజిల్పై 99 పైసలు పెంచింది. ప్రస్తుతం పెట్రోలు లీటరు ధర రూ.113.86 ఉండగా శనివారం ఉదయం 6 గంటల నుంచి రూ.114.86కు పెరిగింది. డీజిల్ లీటరు రూ.100.55 ఉండగా రూ.102.55కు చేరింది. రూ.9.66 లక్షల భారం ఈ పెంపుతో ప్రజలపై రోజుకు రూ.9.66 లక్షల భారం పడనుంది. జిల్లా వ్యాప్తంగా 200 పెట్రోల్ బంకులు ఉన్నాయి. జిల్లాలో సగటున రోజుకు 4.77 లక్షల పెట్రోల్, 5.77 లక్షల డీజిల్ వినియోగిస్తారు. దీన్ని బట్టి పెట్రోల్పై రూ.4.55 లక్షలు, డీజిల్పై రూ.5.71 లక్షల భారం పడనుంది. మొత్తంగా రోజుకు సుమారు రూ.9.66 లక్షల అదనపు భారం ప్రజలపై పడనుంది. కంపెనీలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ వరుస ధరల పెంపుతో తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. -
ప్రచండాడుతున్నాడు!
సాక్షి, రాజమహేంద్రవరం: భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యా ప్తంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వ రకు తన విశ్వరూపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీనికి వడగాలులు తోడై ప్రజలలో జవసత్వాలను తోడెస్తున్నాయి. ఐదు రోజులుగా ఈ పరిస్థితి మరింత ఎక్కువై గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 50 మందికి పైగా వడదెబ్బ బారిన పడి మృతి చెందినట్టు సమాచారం. గతంలో ఎన్నడూ లేనంతగా.. కొన్నేళ్ల గణాంకాలు పరిశీలిస్తే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల లోపే. ఈ ఏడాది భానుడు ప్రచండుడైపోయాడు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణలు వెల్లడిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, మొక్కలు పెంచకపోవడం, ఉన్నవాటిని నరికేయడం తదితర కారణాలు ఇందుకు ప్రధాన కారణమని వారంటున్నారు. పచ్చని చెట్ల స్థానే లే అవుట్లు వేయడం, ఇటుక బట్టీలకు కలపగా వినియోగించడం కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు భీతిల్లుతున్న ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకు వేడి కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలు నమోదవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పనివారు డీహైడ్రేషన్కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఉపశమన చర్యలు శూన్యం ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపశమన చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశాల్లో టెంట్లు, నీడనిచ్చే పరిస్థితులు, చలివేంద్రాలు వంటివి ఎక్కడా ఏర్పాటు చేయడం లేదు. అక్కడక్కడ ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణ సరిగా ఉండడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల ఒకటో తేదీన ఆదేశాలు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు. కూలీలే ఇళ్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు రావొద్దని సలహాలు ఇచ్చేందుకే అధికారులు పరిమితమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. బాధితులను ఆదుకునేనా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మే నెలలో వడదెబ్బ బారిన పడి సుమారు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధితుల వివరాల సేకరణకు సైతం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. జీజీహెచ్కు బాధితులు కాకినాడ, రాజమండ్రి, కోనసీమ జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య శాలలకు వడదెబ్బ బాధితులు క్యూ కడుతున్నారు. ఐదు రోజులుగా డీహైడ్రేషన్, త లనొప్పి, నీరసం సమస్యలతో వ స్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 300 మందికి పైగా ఇలా వైద్యులను ఆశ్రయిస్తున్నారు. 30 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. నిర్థారణ ఇలా.. ● వడదెబ్బ మృతిగా నిర్థారించాలంటే సదరు మృతుని సంబంధీకులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ● మృతదేహానికి తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. రెవెన్యూ అధికారుల శవ పంచనామా, మధ్యవర్తుల రిపోర్టు పోలీసు విచారణ వంటివి జరిపి నిర్థారించాలి. ● వడదెబ్బతో మృతి చెందినవారికి అంతిమ సంస్కారం చేస్తున్నారు తప్ప పోలీసు ఫిర్యాదును విస్మరిస్తున్నారు. ● గతంలో ప్రభుత్వం నిబంధనలు సడలించి వైద్యాధికారి, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, తహసీల్దార్లతో త్రిసభ్య కమిటీ నియమించింది. ఆ కమిటీలు దరఖాస్తులను పరిశీలించి మృతుల ఇళ్లకు వెళ్లి నిర్థారించాల్సి ఉంది. ● వాటిని కలెక్టరేట్కు నివేదిస్తే ఆ మేరకు ప్రభుత్వం పరిహారం నిధులు విడుదల చేస్తుంది. ● కానీ ఈ ఏడాది ప్రభుత్వం నిర్థిష్ట ప్రకటన చేయకపోవడంతో ఫిర్యాదులు లేక సంబంధిత నిధుల విడుదలలో సైతం మొండి చేయి చూపుతున్నారు. యేసుబాబు (ఫైల్)సతులు (ఫైల్) కాకినాడ జిల్లా సామర్లకోట కుమ్మర వీధికి చెందిన లోడ సత్తులు తన పనుల నిమిత్తం బయటకు వెళ్లగా.. వడగాల్పుల తీవ్రతతో శనివారం మృతి చెందారు. అతని కుమారుడు సైతం ఇటీవలే మృతి చెందాడు. ఎండ తీవ్రతకు ఐదు రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ పెద్దపై ఆధారపడి జీవించే ఐదేళ్ల మనవడు, కోడలు, భార్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ సర్పవరం గ్రామానికి చెందిన గుర్రం అప్పన్న పారిశుద్ధ్య కార్మికుడు. విధి నిర్వహణలో ఉండగా ఎండ వల్ల అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. అతడి మృతితో కుటుంబలో విషాదం నెలకొంది.నిడదవోలు రూరల్ మండలానికి చెందిన గారపాటి ధర్మతేజ (24) వడదెబ్బతో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఉష్ణోగ్రతలతో అస్వస్థతకు గురికావడంతో అతని కుటుంబ సభ్యులు నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఎన్నో తలెత్తుతున్నాయి.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇలా.. వారం కనిష్టం గరిష్టం మంగళవారం 37 45బుధవారం 37 45 గురువారం 39 46 శుక్రవారం 39 46 శనివారం 37 45 అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో పిట్టల్లా రాలుతున్న జనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు ఉక్కిరిబిక్కిరి వడదెబ్బకు పదుల సంఖ్యలో మరణాలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఉపశమన చర్యలు శూన్యం ఉపాధి ప్రదేశాల్లో నిబంధనలు బేఖాతరు అప్రమత్తంగా ఉండాలి మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని వేసవి కాలంలో హీట్ స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలు తరచుగా తీసుకోవాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. – కీర్తి చేకూరి, కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట: స్థానిక కుమ్మరి వీధికి చెందిన వ్యవసాయ కూలీ లోడ సతులు (55) వడగాడ్పులకు గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పనికి వెళ్లిన సతులు ఇంటికి వచ్చిన వెంటనే కుప్పకూలిపోయాడని, వెంటనే అతడిని మంచంపై పడుకొపెట్టి సేద తీరుస్తుండగా కొంత సేపటికే మృతి చెందాడని వారు తెలిపారు. సుమారు ఐదేళ్ల క్రితమే కుమారుడు చనిపోవడంతో కొడలు గంగ, భార్య చంద్ర, మనవడు సాత్విక్లను సతులే పోషిస్తున్నాడు. అతడి మృతితో ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పొయింది. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ పట్టణ అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డికి వినతి పత్రం అందజేసినట్టు దర్శిపాటి తెలిపారు. కొత్త సూరవరంలో.. తుని రూరల్: ఎస్.అన్నవరం పంచాయతీ కొత్త సూరవరం గ్రామానికి చెందిన తోట యేసుబాబు (40) వడగాడ్పునకు గురై మృతి చెందినట్టు వీఆర్వో సత్యవతి శనివారం తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు యేసుబాబు శుక్రవారం పనికి వెళ్లి వచ్చి ఇంటి వద్ద రాత్రి ఎనిమిది గంటల సమయంలో నీరసించి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే తుని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే1 మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించాన్నారు. యేసుబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె, తండ్రి ఉన్నారు. -
ఓవర్ లోడ్తోనే విద్యుత్ సమస్య
● పైడిమెట్టలో మూడు 15కేవీ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ● ‘కట్లపై కన్నెర్ర’కు స్పందించిన అధికారులు తాళ్లపూడి: విద్యుత్ కోతలపై ప్రజలు కన్నెర్ర చేయడంతో అధికారులు స్పందించారు. సహజంగానే వేసవిలో విద్యుత్ అధిక వినియోగం వల్ల డిమాండ్ సప్లైల మధ్య భారీ వ్యత్యాసంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటాయి. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి విద్యుత్ అధికారులు సత్వర చర్యలు తీసుకుని ఏ సమస్యా రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. శుక్రవారం రాత్రి కూడా వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంకలో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వేగేశ్వరపురంలో సబ్ రిజిస్టార్ వీధిలో రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యుత్ లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ విషయమై సాక్షిలో ‘కట్లపై కన్నెర్ర’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. ఓవర్లోడుతో పైడిమెట్ట, వేగేశ్వరపురం గ్రామాల్లో విద్యుత్ సమస్య ఏర్పడిందని ఏఈ శ్రీనివాస్ తెలిపారు. వేగేశ్వరపురంలో అదనపు ట్రాన్సఫార్మర్ వేయనున్నామని, పైడిమెట్టలో మూడు 15 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్టు ఏఈ తెలిపారు. ఏలూరు రేంజి ఐజీ వార్షిక తనిఖీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో ఏలూరు రేంజి ఐజీ జీవీజీ అశోక్కుమార్ శనివారం వార్షిక తనిఖీ నిర్వహించారు. ఎస్పీ నరసింహ కిశోర్ ఆయనకు స్వాగతం పలికారు. కార్యాలయంలో వివిధ విభాగాల తీరు, రికార్డుల నిర్వహణను ఆయన పరిశీలించారు. ప్రజా భద్రత, క్రమశిక్షణ, సమర్థవంతమైన సేవలపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సిబ్బంది, కంప్యూటర్ పరిజ్ఞానం, స్మార్ట్ పోలీసింగ్ విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీటీ కోర్టును ప్రారంభించారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రాజపాలేనికి చెందిన మురళీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ విరాళంగా అందజేసిన 25 హెల్మెట్లను ఐజీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో ‘క్లీన్ స్వీప్’ రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో శనివారం ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ ప్రారంభించారు. జూన్ 20 వరకు నాలుగు వారాల పాటు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. నగరంలో మున్సిపల్ కార్యాలయం నుంచి ఆనం కళాకేంద్రం మీదుగా గోదావరి రైల్వే స్టేషన్ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి ఆమె నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకట రమణ, సెక్రటరీ జి.శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్. మూర్తి, ఎంహెచ్ఓ వి . వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, వివిధ కార్పొరేషన్ ల డైరెక్టర్లు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘లయ విన్యాసం’
ముగిసిన త్యాగరాజ సమితి అమృతోత్సవం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో పెరవలి జయభాస్కర్ బృందం లయ విన్యాసం ఆకట్టుకుంది. సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో 18 రోజుల పాటు సాగిన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరిరోజు శనివారం సాయంత్రం పెరవలి జయభాస్కర్ బృందంచే లయ విన్యాసం పేరిట వాద్య సమ్మేళనం హృద్యంగా సాగింది. కళాకారులు, కార్యవర్గంతో కలిసి మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. పెరవలి జయభాస్కర్ మృదంగం, రాజశేఖర్ వయోలిన్, కె. నందకుమార్ సితార, సరస్వతుల హనుమంతరావు ఘటం, లింగంగుంటి ప్రసాద్ మోర్సింగ్, వీఎస్ కళాధర్ కంజీరా, కోడూరు ప్రకాష్ కీబోర్డ్పై కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. విశ్వనాథం భాస్కర రామ్, వాడ్రేవు వెంకట రమణారావు, సీఎస్ వెంకట్రావు, జోస్యుల సరస్వతి, వక్కలంక శ్రీరామచంద్రం, వి.కృష్ణకుమారి తదితర సమితి కార్యవర్గం పర్యవేక్షించింది. -
శ్రీవేంకటేశా మనసా స్మరామి
వాడపల్లికి పోటెత్తిన భక్తులు ఆత్రేయపురం: భానుడు ఉగ్రరూపం దాల్చినా.. భక్తిభావం సడలలేదు.. ఆ శ్రీనివాసుని దర్శనానికి భక్తజనం క్యూ కట్టింది. వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం కిక్కిరిసింది. సుమారు 80 వేల నుంచి లక్ష వరకూ వచ్చినట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నీరాజనం, ఐశ్వర్య లక్ష్మీహోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న క్షేత్రపాలకులు, అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. వేసవి తీవ్రతకు అనుగుణంగా భక్తులకు చల్లని మజ్జిగ, నీరు అందించడానికి చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే సత్యసాయి సేవా సంస్థలు సైతం చలివేంద్రాన్ని నిర్వహించారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈఓ సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
పొదుపు అంటే ఇదేనా బాబూ?
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు మేరకు ప్రజలు తమ కార్లు, మోటారు సైకిళ్లు వదిలేసి సైకిళ్ల బాట పడుతుంటే, కూటమి ముఖ్య నేతలు మాత్రం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ధ్వజమెత్తారు. ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనండి.. అలా కంటే రూ. 30 వేలు, రూ.40 వేలు ఇస్తానంటున్న చంద్రబాబు సంపద సృష్టి, పొదుపు అంటే ఇదేనా అని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఇంధన పొదుపు, సంపద సృష్టి అంటూ ప్రకటనలు చేయడం కాదని, ఆచరణలో తాను చూపించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్సీ హితవు పలికారు. ఎక్కువ మంది పిల్లలను కనాలంటున్న చంద్రబాబు అలా పుట్టినప్పుడు రూ. వేలల్లో ఇస్తే సరిపోతుందా..? వారి చదువులు, ఉద్యోగాలు వంటివి గాలికొదిలేస్తారా..? అని తల్లిదండ్రులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోట్లు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు నెల నెలా రూ.1500 ఇలాంటి హామీలకు మంగళం పాడిసినట్లేననిపిస్తోందన్నారు. ప్రభుత్వ విధి విధానాలు అన్నదాతలకు శాపాలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరి, ఆక్వా రైతులు నేడు గిట్టుబాటు ధర లేక విలవిల్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు బూటకపు మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఈసారి సిద్ధంగా లేరని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. -
క్రూర జంతువులకే సవాల్ విసిరే హనీ బ్యాడ్జర్!
ఏలూరు జిల్లా: పాపికొండల అభయారణ్యంలో ఉన్న అరుదైన వన్యప్రాణుల్లో హనీ బ్యాడ్జర్ ఒకటి. ఈ జంతువు ఎత్తు కేవలం 12 అంగుళాలు. హనీ బ్యాడ్జర్ పంజాకు గోళ్లు మూడు అంగుళాల పొడవు ఉంటాయి. తల నుంచి వరకు తెలుపు, తెలుపు గీతలతో మందపాటి, దట్టమైన నల్లని బొచ్చును కలిగి ఉంటాయి. చూసేందుకు ఎలుగుబంటిలా పొట్టిగా ఉంటుంది. పౌరుషంలో ఈ హనీ బ్యాడ్జర్కి మరో వన్యప్రాణి సాటిరాదు. పులినైనా ఎదురించ గల ధైర్యశాలి హనీ బ్యాడ్జర్లు చాలా ధైర్యం కలిగిన వన్యప్రాణులు. హనీ బ్యాడ్జర్ చర్మం ఎలాస్టిక్గా ఉంటుంది. పదునైన పళ్లు ఉంటాయి. అడవిలో ఎంత పెద్ద క్రూర జంతువుతోనైనా ధైర్యంగా పోరాడగల జంతువు. పులి, చిరుత, కొండ చిలువతో పాటు ఏ జంతువుతోనైనా ఎదురించి పోరాడే ధైర్య శాలి. పాము విషం కూడా ఈ హనీ బ్యాడ్జర్లను ఏమి చేయలేదు. వాసన పసిగట్టి ఆహారాన్ని సేకరించడంలో స్నీపర్ డాగ్ను మించిన నైపుణ్యాన్ని హనీ బ్యాడ్జర్స్ కనబరుస్తుంటాయి. ప్రపంచంలోనే భయం లేని జంతువు ఉందంటే అది హనీ బ్యాడ్జర్ ఒక్కటే అని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ హనీ బ్యాడ్జర్ జీవిత కాలం కేవలం ఏడేళ్లు మాత్రమే అని అధికారులు వివరిస్తున్నారు. తేనె తుట్టెల్లోని లార్వా అంటే ఇష్టం హనీ బ్యాడ్జర్కు అడవిలో లభించే తేనె తుట్టెల్లోని తేనె టీగ లార్వా అంటే ఎంతో ఇష్టం. తేనెటీగ లార్వా వాసనను పసిగట్టి ఎంతో ఇష్టంగా తింటాయి. అందువల్లే ఈ జంతువును హనీ బ్యాడ్జర్ అని పిలుస్తారు. తేనెటీగ లార్వాతో పాటు కీటకాలు, కుందేళ్లును ఆహారంగా తింటాయి. ఈ హనీ బ్యాడ్జర్లు మాంసాహారులు. వీటి ఆహారంలో 25 శాతం పాములే ఉంటాయి. పాములు ఈ జంతువుల కంట పడితే వేటాడి వెంటాడి చంపి మరి తినేంత వరకు వెనక్కి వెళ్లవు. పాపికొండల్లో సంచారం అరుదైన హనీ బ్యాడ్జర్ల సంచారం పాపికొండల్లో ఎక్కువగానే ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు వివరిస్తున్నారు. అభయారణ్యంలో సుమారు 1200 పైగా హనీ బ్యాడ్జర్లు నివసిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పాపికొండల అభయారణ్యంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమేరాలకు హనీ బ్యాడ్జర్లు జాడ చిక్కినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. వీటి సంతతి కూడా అధికంగా పెరుగుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. -
సయ్యంటే సై అన్న ఎద్దులు.. జనాల్లో భయం..!
కాకినాడ: ఏ విషయంలో తేడా వచ్చిందో ఏమో.. సయ్యంటే సైయ్యంటూ ఢీకొన్నాయీ వృషభరాజాలు. సహజంగానే బలిష్టంగా ఉండే ఆ ఎద్దులు నడిరోడ్డుపై అలా వీరంగం సృష్టింస్తుంటే చుట్టుపక్కల వారు.. వాహన చోదకులు.. పాదచారులు ఒకింత భీతిల్లారు. ఏ మాత్రంఅదుపుతప్పి అవి తమ మీద పడినా అంతే సంగతులు. ఓ అరగంట తరవాత అవే అలసిపోయి తలోదారీ వెళ్లాక కానీ వారి ఆందోళన తీరలేదు. అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్లో శుక్రవారం ఉదయం ఈ వీరంగం స్థానికులకు గగుర్పొడిచేలా సాగింది. -
● అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం
కాకినాడలోని వైఎస్సార్ మున్సిపల్ స్కేటింగ్ రింక్ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాం. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించారు. ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి పోటీలు ఇదే రింక్లో జరుగుతున్నాయి. స్కేటింగ్లో రాణించే వారికి భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉన్నాయి. –రాజ్గోపాల్, స్కేటింగ్ సంఘ అధ్యక్షుడు అనుభవజ్ఞులైన కోచ్లతో శిక్షణ రోలర్ స్కేటింగ్లో ఈ ఏడాది నుంచి ఆర్టిస్టిక్, స్కేట్ బోర్డు, స్కూటర్, డౌన్ హిల్లో శిక్షణను ప్రారంభించాం. క్రీడాకారులు ఉత్సాహంగా ఈ విభాగాల్లో శిక్షణకు హాజరవుతున్నారు. కాకినాడ నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో అనుభవజ్ఞులైన కోచ్లతో శిక్షణ ఇస్తున్నాం. –సత్య, అంతర్జాతీయ స్కేటింగ్ కోచ్ ● -
రెండు ఆలయాలకు.. ఒకే ఒక్కడు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేవదాయ శాఖలో జోడు గుర్రాల సవారీ పరిపాటిగా మారింది. కారణాలేమిటో తెలీదు కానీ రెండు మూడు ఆలయాలకు ఒక్కరినే ఈఓగా నియమిస్తున్నారు. చిన్న చిన్న ఆలయాలకు ఇలా నియమిస్తున్నారంటే పోనీలే అనుకోవచ్చు. కానీ, లక్షల మంది భక్తులు.. రూ.కోట్ల ఆదాయం వస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇదే ఫార్ములా అమలు చేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి, కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాలకు నిత్యం వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఈ ఆలయాలకు ఇద్దరు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను ఈఓలుగా నియమించాలి. కానీ, రెండు ఆలయాలకు కలిపి నల్లం సూర్యచక్రధరరావుకు బాధ్యతలు అప్పగించారు. భక్తుల నుంచి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా ఈ రెండు ఆలయాల నిర్వహణ బాధ్యతలను ఒకే ఈఓకు ఎలా అప్పగిస్తారనే ప్రశ్న వస్తోంది. జిల్లాల పునర్విభజన అనంతరం ఎక్కడ పని చేస్తున్న ఈఓలకు అదే జిల్లాలో బాధ్యతలు అప్పగించాలనే నిబంధన కూడా ఉందని అంటున్నారు. పైగా ఈ రెండు ఆలయాలు దగ్గర్లో ఉన్నవి కావు. రెండింటి మధ్య దూరం 100 కిలోమీటర్ల పైనే. అంత దూరం ఉన్న రెండు ఆలయాల బాధ్యతలను ఒకే ఒక్క ఈఓ ఎలా పర్యవేక్షిస్తారనే కనీస ఆలోచన లేకపోవడం విమర్శల పాలవుతోంది. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేశారు. అన్నవరం, వాడపల్లి ఆలయాల విశిష్టత ఆయనకు తెలియంది కాదు. అయినప్పటికీ ఈ రెండు ఆలయాలకు ఒక్కరినే ఈఓగా ఎలా కొనసాగిస్తురనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. తలకు మించిన భారం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన తరువాత వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. శుక్ర, శనివారాల్లో భక్తుల సంఖ్య 70 వేలకు పైనే ఉంటోంది. హుండీ ఆదాయం రోజువారీ ఐదారు లక్షల రూపాయలు, నెలకు రూ.కోటిన్నర పైనే ఉంటోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.6.25 కోట్లతో వకుళమాత శాశ్వత అన్నదాన భవనం నిర్మాణానికి అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆలయం ఎదురుగా రూ.2 కోట్లతో కోనేరు నిర్మిస్తున్నారు. వీటితో పాటు రథశాల, శ్రీనివాసం వసతి భవనం సహా పలు అభివృద్ధి పనులు రూ.20 కోట్లతో జరుగుతున్నాయి. రెండుచోట్ల పార్కింగ్ స్థలాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ని పనుల పర్యవేక్షణే ఇక్కడి ఈఓ చక్రధరరావుకు తలకు మించిన భారంగా ఉండగా.. ఆయనకే అన్నవరం దేవస్థానం ఇన్చార్జి బాధ్యతలు కూడా అప్పగించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న వస్తోంది. అన్నవరం క్షేత్రానికి నిత్యం 30 వేల నుంచి 40 వేల మంది వరకూ భక్తులు వస్తూంటారు. అదే కార్తిక పౌర్ణమి, ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షకు పైనే వస్తారు. ఏటా 6 లక్షలకు పైగా సత్యనారాయణస్వామి వ్రతాలు జరుగుతూంటాయి. గత ఏడాది ఆదాయం రూ.160 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.170 కోట్లు వస్తుందనే అంచనా ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ కింద రూ.40 కోట్లతో అన్నదాన భవనంతో పాటు పలు పనులు జరుగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన సీతారామస్వామి సత్రం స్థానంలో దేవస్థానం నిధులు రూ.12 కోట్లతో 135 గదుల వసతి బ్లాక్ నిర్మాణం జరుగుతోంది. ఇన్ని కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్న ఈ రెండు ఆలయాల బాధ్యతను ఒకే ఈఓకు అప్పగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు ఆక్షేపిస్తున్నారు. రద్దీ అధికంగా ఉండే శుక్ర, శనివారాల్లో వాడపల్లి, సోమవారం సహా మరో రెండు రోజులు అన్నవరంలో ఆయన విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ఆలయాల పర్యవేక్షణ ఆయనకు మరింత భారంగా మారుతోంది. పర్యవసానంగా పాలన గాడి తప్పుతోందనే విమర్శలు వస్తున్నాయి. అన్నవరం.. ఇన్చార్జితోనే సరి కృష్ణా జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సూర్యచక్రధరరావు వాడపల్లి ఈఓగా నియమితులై రెండేళ్లవుతోంది. గత నెలలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణరెడ్డి వాడపల్లి, అన్నవరం దేవస్థానాల్లో పర్యటించారు. ఆయన వాడపల్లిలో ఉండగానే చక్రధరరావును అన్నవరం దేవస్థానం ఇన్చార్జిగా నియమిస్తున్న విషయం బయటకు వచ్చింది. మంత్రి పర్యటన ముగియగానే చక్రధరరావును గత నెల 13న అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమించారు. అప్పటికే 4 నెలలుగా అన్నవరం ఇన్చార్జి ఈఓగా పని చేస్తున్న దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావును ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానానికి బదిలీ చేశారు. అప్పుడు, ఇప్పుడు కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానానికి ఇన్చార్జి ఈఓతోనే సరిపెట్టడంలో ఆంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అన్నవరం, వాడపల్లి దేవస్థానాలకు ఒక్కరే ఈఓ రెండు క్షేత్రాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పర్యవేక్షణలో ఇబ్బందులు దూరాభారంతో సతమతం సర్కారు నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు -
‘పద్మావతి’ పనితీరుపై పరిశీలన
తొండంగి: రత్నగిరిపై శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్పై పారిశుధ్య సిబ్బంది నుంచి పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ‘ఇలాగైతే ఎలా పద్మావతీ!’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. పారిశుధ్య పనుల నిర్వహణకు ఆ సంస్థ సక్రమంగా మెటీరియల్ ఇవ్వడం లేదని, ఇబ్బందులపై ప్రశ్నిస్తే తొలగిస్తామంటూ బెదిరిస్తోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సత్రాల్లోని రూముల్లో ఏర్పాటు చేస్తున్న బెడ్షీట్లు, దుప్పట్లు, ఇతర మెటీరియల్ను ఈఓ స్వయంగా పరిశీలించారు. అవి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్వైజర్, అధికారుల పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి సంస్థ ఏర్పాటు చేసిన వాషింగ్ మెషీన్లు పని చేయడం లేదని శానిటరీ అధికారులు బదులిచ్చారు. దీంతో, సంస్థ నిర్వహణ తీరుపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాఖాపరంగా నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని కింది స్ధాయి అధికారులను ఆదేశించారు. -
వడదెబ్బకు 14 మంది మృతి
పిఠాపురం రూరల్/కాకినాడ రూరల్/సీతానగరం/నిడదవోలు రూరల్/ఆత్రేయపురం: తీవ్రమైన ఎండలు, వడగాడ్పులకు తాళలేక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో 14 మంది మృతి చెందారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన పిల్లి రమణ (55) ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిఠాపురం సినిమా సెంటర్లో కొల్లు అప్పారావు, అన్న క్యాంటీన్ వద్ద ఓ యాచకుడు, పాదగయ క్షేత్రం వద్ద లారీ డ్రైవర్, మండలంలోని గోకివాడలో దూలపల్లి అప్పారావు (43), ఎఫ్కే పాలెం మద్యం దుకాణంలో పని చేస్తున్న కొమ్ము వెంకట రమణ (44) వడదెబ్బతో మృతి చెందినట్టు ఎస్సై ఎస్కే జానీబాషా తెలిపారు. కాకినాడ రూరల్ భావనారాయణపురానికి చెందిన గుర్రం అప్పన్న (38) సర్పవరం గ్రామ పంచాయతీలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడు. విధి నిర్వహణలో వడద్బెకు గురైన అతడు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో వైఎస్సార్ సీపీ గ్రామ యువజన నాయకుడు గారపాటి ధర్మతేజ (24) ఎండవేడిమితో డీహైడ్రేషన్కు గురై శుక్రవారం మృతి చెందారు. సీతానగరం మండలం చినకొండేపూడిలో పెడూరి చిట్టిబాబు (33), వెలమపేటలో 58 ఏళ్ల వ్యక్తి గురువారం రాత్రి మరణించారు. పురుషోత్తపట్నం పంచాయతీ రామచంద్రపురంలో కండవల్లి మంగమ్మ (88) శుక్రవారం మృతి చెందారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న నాగిరెడ్డి రాముడు (60), నాగిరెడ్డి పనస రాముడు (75) వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఉచ్చిలి గ్రామానికి చెందిన మాగాపు శ్రీను (45) వడగాలుల ప్రభావంతో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. -
● వృషభ వీరంగం
26 నుంచి ‘గురుకులాల్లో’ కౌన్సెలింగ్ రాజమహేంద్రవరం రూరల్: ఏపీ బీఆర్ఏజీసెట్–2026లో అర్హత సాధించి సీట్లు పొందని విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమన్వయకర్త జి.రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతి ప్రవేశాల కోసం బాలికలకు ఈనెల 26న కాకినాడ పి.వెంకటాపురంలోని గురుకుల పాఠశాలలో, 27న లక్ష్మీ నరసాపురంలోని గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం బాలికలకు 29వ తేదీన కాకినాడ పి.వెంకటాపురం గురుకుల పాఠశాలలో, బాలురకు 30వ తేదీన ఉదయం లక్ష్మీ నరసాపురంలోని గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏపీ బీఆర్ఏజీసెట్ అప్లికేషన్, హాల్ టికెట్, అలాట్మెంట్ కామీ, మార్కుల మెమో, ర్యాంకు కార్డు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలు తీసుకురావాలని కోరారు. ప్రవేశ పరీక్ష రాసిన వారు సీటు వచ్చి వేరొక స్కూల్ కోరుకుని స్లైడింగ్/ట్రాన్స్ఫర్ పెట్టుకున్న విద్యార్థులు కూడా హాజరుకావాలన్నారు. వివరాలకు పి.వెంకటాపురం ప్రిన్సిపాల్ సీహెచ్ఎంజీ ప్రమీలను 94401 16298, లక్ష్మీనరసాపురం ప్రిన్సిపాల్ కె.రామును 95157 57614 నంబర్లలో సంప్రదించాలని రాజకుమారి కోరారు. -
రయ్ రయ్ రారా..
● ఉత్సాహంగా రోలర్ స్కేటింగ్ ● ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ ● వేసవి శిక్షణకు 300 మంది హాజరు కాకినాడలోని వైఎస్సార్ స్కేటింగ్ రింక్లో ఓనమాలు నేర్చుకుంటున్న చిన్నారులు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడలోని వైఎస్సార్ మున్సిపల్ స్కేటింగ్ రింక్లో వేసవి శిక్షణ తరగతులు ఉత్సాహంగా జరుగుతున్నారు. ఇక్కడ నాలుగేళ్ల నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికలకు రోలర్ స్కేటింగ్లో శిక్షణ ఇస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం 6 నుంచి 9 వరకూ, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోలర్ స్కేటింగ్లో ఫ్రీ స్టైల్, ఇన్లైన్ ఫ్రీ స్టైల్, స్కేట్ బోర్డు, స్కూటర్, డౌన్హిల్, ఆల్పేన్, స్పీడ్లో క్వాడ్, ఇన్లైన్, ఆర్టిస్టిక్ విభాగంలో కోచ్లు సత్య, చంటి, ఈశ్వర్లు శిక్షణ అందిస్తున్నారు. సుమారు 300 మంది చిన్నారులు ఈ వేసవి శిక్షణలో చేరి ఓనమాలు నేర్చుకుంటున్నారు. స్కేటింగ్తో పాటు ఫిట్నెస్లో తర్ఫీదు ఇస్తున్నారు. రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్కేటింగ్ రింక్లో ఈ శిక్షణ జరుగుతుండడంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను స్కేటింగ్లో చేర్పించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వైఎస్సార్ స్కేటింగ్లో రింక్లో శిక్షణ పొందిన ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాయ స్థాయిలో రాణించారు. ఈ నెల 30 వరకూ ఈ వేసవి శిక్షణ తరగతులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. -
జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించామని వివరించారు. అలాగే, జెడ్పీ యాజమాన్యంలో పని చేస్తూ అకాల మరణం చెందిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను కూడా ఆయన అందజేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జిల్లా పరిషత్కు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. -
కట్లపై కన్నెర్ర
● 48 గంటలుగా నిలిచిన విద్యుత్ సరఫరా ● మండిపడిన పైడిమెట్ట గ్రామస్తులు ● ప్రక్కిలంక సబ్ స్టేషన్ ముట్టడి తాళ్లపూడి: అసలే ఓవైపు 45 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోతతో ఆపసోపాలు పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తూండటంతో మండల ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధులు, అనారోగ్య పీడితులు నానా అగచాట్లూ పడుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూండటంతో నరకం చవి చూస్తున్న ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. గురువారం పలుమార్లు అధికారులు కరెంట్ కట్ చేశారు. రాత్రి 10 నుంచి 12 గంటల వరకూ సరఫరాను నిలిపివేశారు. తిరిగి శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ విద్యుత్ కోత విధించారు. పైడిమెట్ట గ్రామం పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత 48 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ గ్రామమంతా అంధకారంలో మునిగిపోయింది. ఈపీడీసీఎల్ అధికారుల తీరుపై ఆగ్రహించిన పైడిమెట్ట గ్రామస్తులు గురువారం అర్ధరాత్రి ప్రక్కిలంక విద్యుత్ సబ్ స్టేషన్ను ముట్టడించారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఇదేం పద్ధతని సిబ్బందిని నిలదీశారు. లోడ్ ఎక్కువ కావడంతో సరఫరాలో సమస్య తలెత్తుతోందని అధికారులు చెప్పారు. రెండు రోజులుగా గ్రామం చీకట్లో మగ్గుతున్నా, సమస్యను పరిష్కరించడంలో అధికారులు, స్థానిక నాయకులు చొరవ చూపడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, పైడిమెట్ట గ్రామానికి తక్షణమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని, మండలంలో అప్రకటిత విద్యుత్ కోతలను అరికట్టాలని డిమాండ్ చేశారు. -
మీరు వైఎస్సార్సీపీ వాళ్లు.. ఉపాధి పని ఇవ్వం!
పిఠాపురం: రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఉపాధి హామీ మంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే ఉపాధి పనుల కల్పనలో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్సీపీ సానుభూతిపరులంటూ పలువురికి పని కల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా జనసేన నేతలు అడ్డుకోవడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ‘మీరు వైఎస్సార్సీపీకి చెందినవారు. కాబట్టి మీకు ఉపాధి పనులు కల్పించేది లేదు’ అంటూ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి వీరబాబు గురువారం ఐదుగురు మేట్లకు (గ్రూప్ లీడర్లు) పని కల్పించకుండా నిర్దాక్షిణ్యంగా అడ్డుకున్నాడు. తనకు జనసేన నేతల నుంచి ఈ విషయంలో తీవ్ర ఒత్తిడి ఉందని చెప్పుకున్నాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్వాకంపై ఐదుగురు మేట్ల కింద పనిచేసే దాదాపు 250 మంది కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలకు పని కల్పించే ఉపాధి హామీ పథకంలో రాజకీయాలు ఏంటంటూ వందలాది మంది కార్మికులు పనిప్రదేశం వద్దే తీవ్ర ఆందోళన చేపట్టారు. దుర్గాడ గ్రామంలో గత 15 సంవత్సరాల కాలంలో ఉపాధి పథకంలో ఎన్నడూ ఇటువంటి దారుణమైన రాజకీయం చూడలేదని, ఉపాధి హామీలో రాజకీయం చేసిన వ్యక్తులు ఎవరో బయటపెట్టాలని కూలీలు డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఉదయం ఐదున్నర గంటలకు పని ప్రదేశానికి చేరుకున్న ఉపాధి కూలీలు 11 గంటల వరకు ఎండలోనే కూర్చున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకుడు, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు అధికారులతో మాట్లాడారు. దీంతో గొల్లప్రోలు ఎంపీడీవో సెలెట్ రాజు కార్మికులు ఆందోళన చేస్తున్న చోటుకు చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపిన ఎంపీడీవో.. ఎట్టకేలకు లాగిన్ నిలిపివేసిన మేట్లకు లాగిన్ పునరుద్ధరించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ వీరబాబు మమ్మల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. 15 రోజులు పనికి వస్తే కేవలం వారం రోజులకే నమోదు చేస్తున్నాడు. తనకు నచ్చినవారికి, తాను మెచ్చిన వారికి మాత్రం పనికి రాకపోయినా హాజరు నమోదు చేస్తున్నాడు. రాజకీయ దురుద్దేశంతోనే తమ ఉపాధి మేట్ల లాగిన్లు నిలిపివేశాడు. జనసేన నాయకులతో చేతులు కలిపి ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడుతున్నాడు. – ఉపాధి కూలీల ఆవేదన ఉపాధి కూలీలతో రాజకీయం చేస్తే ఊరుకోం పొట్టకూటి కోసం మండుటెండలో కష్టపడుతున్న నిరుపేదలపై రాజకీయం చేయడం పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడే చూస్తున్నాం. పేదల పొట్ట కొట్టడానికి ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడంతోపాటు దుర్గాడలో రాజకీయం చేస్తున్న ఉపాధి సిబ్బందిపై అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలి. మళ్లీ ఇటువంటి ఘటన జరిగితే తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. – వంగా గీతావిశ్వనాథ్, వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్చార్జ్ -
ఐటీఐ కోర్స్... ఉపాధికి సోర్స్
● ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 30వ తేదీ తుది గడువు ● జిల్లాలో 1,210 సీట్లు రాజమహేంద్రవరం రూరల్: పదో తరగతి పూర్తి కాగానే విద్యార్థులు ఏ కోర్సులో చేరాలా అని ఆలోచిస్తారు. అధిక శాతం మంది ఇంటర్మీడియెట్లో చేరుతారు. పలువురు పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులకు ప్రాధాన్యమిస్తారు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్కు (ఐటీఐ) ప్రాధాన్యమిస్తున్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పాసై, ఇంటర్మీడియెట్ ఫెయిలైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. త్వరగా ఉద్యోగావకాశాలు యువతకు స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యాన ఐటీఐ శిక్షణ కొనసాగుతోంది. పదో తరగతి పూర్తి కాగానే అతి తక్కువ కాలంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ చక్కని వేదికగా నిలుస్తోంది. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే వివిధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే, నైపుణ్యం తప్పనిసరి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. ఏడాది, రెండేళ్ల వ్యవధి కోర్సులు ఐటీఐల్లో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో రెగ్యులర్ కోర్సులు ఉంటాయి. రెండేళ్ల కాలపరిమితితో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్, మెకానికల్, డ్రాఫ్ట్స్మన్ సివిల్ వంటి కోర్సులుంటాయి. ఏడాది కాలపరిమితిలో డీజిల్ మెకానిక్, వెల్డర్, కోపా, హార్టికల్చర్ కోర్సులుంటాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న కోర్సులు ఏయే ఐటీఐల్లో ఉన్నాయో పరిశీలించుకోవాలి. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హత సాధిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతుల ప్రవేశానికి షెడ్యూల్ విడుదల చేస్తారు.ఉన్నత చదువులకు అవకాశం ధవళేశ్వరంలోని ప్రభుత్వ ఐటీఐతో పాటు జిల్లాలో 13 ప్రైవేటు ఐటీఐలున్నాయి. వీటిలో ఏడాది, రెండేళ్ల కాలపరిమితితో 1,210 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంటుంది. ఐటీఐ పూర్తి చేసిన వారు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందవచ్చు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు బీటెక్లో ప్రవేశం పొందవచ్చు. ఈవిధంగా ఏటా పలువురు లేటరల్ ఎంట్రీ పొంది, ఉన్నత విద్య అభ్యసించి, ఉద్యోగావకాశాలు పొందుతున్నారు.మెరుగైన అవకాశాలు ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు గతంతో పోలిస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీఐల్లో చేరగోరే విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా హెచ్టీటీపీఎస్://ఐటీఐఏడీఎంఐఎస్ఎస్ఐఓఎన్ఎస్.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఐటీఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల పరిశీలన కోసం ధవళేశ్వరం ప్రభుత్వ ఐటీఐకి విఽధిగా హాజరు కావాలి. కౌన్సెలింగ్ షెడ్యూలు వివరాలను విద్యార్థుల మొబైల్ నంబర్కు పంపిస్తాం. పదో తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్లు ఉంటాయి. – సీహెచ్ సునీల్ కుమార్, జిల్లా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల కన్వీనర్, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, రాజమహేంద్రవరం -
అధిక ఉష్ణోగ్రతలపై అప్రమత్తత
89779 35611 నంబరుతో కలెక్టరేట్లో కంట్రోల్ రూము సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ కీర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు కలెక్టరేట్లో 89779 35611 నంబరుతో కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోలు రూము ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అవసరమైన వారు వెంటనే ఈ నంబరును సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ నెల 24వ తేదీ వరకూ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండే అవకాశముందన్నారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే కార్మికులు, రోజువారీ కూలీలు రానున్న మూడు రోజులూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో పరిస్థితులను పర్యవేక్షించేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారిని నోడల్ అధికారిగా నియమించామని కలెక్టర్ తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా 38 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ తెలుగు, హిందీ, సంస్కృతం, ఒకేషనల్ కోర్సుల్లో పరీక్షలు జరిగాయి. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 2,430 మందికి 2,229 మంది పరీక్షలు రాయగా 201 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్యా కోర్సుల్లో 291 మందికి 264 మంది హాజరు కాగా, 27 మంది పరీక్షలు రాయలేదు. ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 1,239 మందికి 1,038 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 201 మంది పరీక్షలు రాయలేకపోయారు. వృత్తి విద్యా కోర్సుల్లో 209 మందికి 191 మంది పరీక్షలు రాయగా, 18 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి ఐ.శారద బృందం, సిట్టింగ్, ఫ్లయింగ్ స్వాడ్స్ బృందాలు 19 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాయి. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల్లో ఇద్దరిని వివిధ హోదాల్లో నియమించారు. మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన రుకియా సయ్యద్ నియమితులయ్యారు. అనపర్తి నియోజకవర్గానికి చెందిన సుందరంపల్లి సుధాకర్బాబును జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. 15 రోజులు.. రూ.2.06 కోట్లు చినవెంకన్నకు దండిగా హుండీల ఆదాయం ద్వారకా తిరుమల: హుండీల ద్వారా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి దండిగా ఆదాయం సమకూరింది. గడచిన 15 రోజులకు నగదు రూపేణా రూ.2,06,21,794 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. అలాగే, భక్తుల కానుకల రూపేణా 281 గ్రాముల బంగారం, 2.887 కేజీల వెండి, అధికంగా విదేశీ కరెన్సీ లభించాయని వివరించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.2 వేలు, రద్దయిన పాత రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా లెక్కింపు లోకి రాని ఆదాయం రూ.31 వేలు వచ్చిందని ఈఓ తెలిపారు. సగటున రోజుకు చిన వెంకన్నకు రూ.13,74,786 ఆదాయం సమకూరిందని ఈఓ చెప్పారు. పొల్లూరు జలపాతంలో పడి యువకుడి మృతి మోతుగూడెం: పొల్లూరు జలపాతంలో మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై నాజీర్ కథనం ప్రకారం.. తెలంగాణలోని భద్రాచలానికి చెందిన ఎం.మోజెస్ (21) రాజమహేంద్రవరం గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నాడు. అతడు, మరో నలుగురు స్నేహితులు కలసి గురువారం పొల్లూరు జలపాతానికి విహార యాత్రకు వచ్చారు. అందరూ స్నానం చేస్తుండగా, మోజెస్ నీటిలో మునిగిపోయాడు. వెంటనే అతడిని బయటకు తీసి, సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సీసీ కెమెరాలు పెంచుతాం
ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అమలాపురం టౌన్: రేంజ్ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. నేర పరిశోధనల్లో సీసీ ఫుటేజీలు కీలకం అవుతున్న క్రమంలో ఈ వ్యవస్థను అన్ని దుకాణాలు, ముఖ్య కూడళ్లు, పోలీస్ స్టేషన్ల వద్ద పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్) జిల్లా కార్యాలయాన్ని ఐజీ గురువారం తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లో ఎస్పీ రాహుల్ మీనాతో కలసి విలేకర్లతో మాట్లాడారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులు, దాతల సహకారంతో సీసీ కెమెరాలను పెంచుతామని చెప్పారు. నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఇటీవల ప్రజలకు పోలీస్ శాఖ విస్తృత అవగాహన కల్పిస్తున్న క్రమంలో రేంజ్ పరిధిలో డిజిటల్ అరెస్టులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగులపై స్పందించి ఎలాంటి ప్రతి పోస్ట్లూ పెట్టవద్దని తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్మార్ట్ ఫోన్లలో అనవసర యాప్లను, లింకులను తొందర పడి ఓపెన్ చేయవద్దని ఐజీ అశోక్ కుమార్ సూచించారు. విలేకర్ల సమావేశంలో ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, ఆర్మ్డ్ రిజర్వ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్పీ సీఐ వి.పుల్లారావు పాల్గొన్నారు. -
ప్రజలకు ఇబ్బందులు
పెరిగిన నూనె ధరలతో ఊరగాయలు పెట్టాలంటే భయపడుతున్నారు. మార్కెట్లో పచ్చడి మామిడి కాయలున్నా.. కొనుగోలు చేసేవారు లేదు. దీనికి తోడు పాలు, పెరుగు, కూరగాయల ధరలు సైతం పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. – మాణిక్యాంబ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాదుడు డబుల్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ డబుల్ బాదుడు బాదుతోంది. రష్యా 56 డాలర్లకు బ్యారెల్ ముడి చమురు ఇస్తూంటే దానిని కాదని అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఆ దేశం నుంచి 120 డాలర్లకు ముడి చమురు కొనడం ద్వారా దేశ ప్రజలపై మరింత భారం మోపుతున్నారు. రాష్ట్రంలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగాయి. ఎన్నికలకు ముందు బాదుడే బాదుడంటూ కూటమి నేతలు ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ధరలను నియంత్రించలేని స్థితికి చేరారు. – టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి -
మా కారు.. మా ఇష్టం
● ఒకే వాహనానికి పలు రకాల నంబర్ ప్లేట్లు ● రోడ్లపై దర్జాగా స్వైర విహారం ● పట్టించుకోని రవాణా అధికారులుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): బుధవారం మధ్యాహ్నం.. స్థానిక శ్రీరామ్ నగర్ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ తన కుమార్తెను తీసుకుని బయల్దేరాడు. మార్గం మధ్యలో ఆమెను ఆటోలోనే కూర్చోబెట్టి తినుబండారాల కొనుగోలుకు పక్కనే ఉన్న దుకాణంలోకి వెళ్లాడు. అదే సమయంలో ఏపీ 39 యూజెడ్ 3393 నంబరు కారు వేగంగా దూసుకువచ్చి, ఆ ఆటోను, ఆ తరువాత మరో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టింది. కారు ఢీకొట్టడంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడి, అందులో ఉన్న ఆటో డ్రైవర్ కుమార్తె తలకు తీవ్ర గాయమైంది. ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆ కారును స్థానికులు అడ్డుకున్నారు. దీంతో, అందులోని వ్యక్తులు కిందకు అక్కడున్న వారిపై నోరేసుకుని పడిపోయారు. ‘మా కారు.. మా ఇష్టం.. మేము రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ట్యాక్స్లు కడుతున్నాం’ అంటూ దబాయించే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా.. అప్పటి వరకూ కారుకు బిగించి ఉన్న సొంత వెహికల్ నంబర్ ప్లేట్ తీసేసి ట్రావెల్స్ వాహనాలకు ఇచ్చే పసుపు రంగు నంబర్ ప్లేటును దర్జాగా పెట్టేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ.. రాజమహేంద్రవరం నగరంలో రోడ్లపై నిత్యం వేలాది వాహనాలు సంచరిస్తూంటాయి. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు లేకుండా అనేక వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. కొన్ని ప్రైవేటు, టూరిస్టు వాహనాలు, ట్రావెల్స్ కార్లు ఇంకా పాత నంబర్ ప్లేట్లతోనే కనిపిస్తున్నాయి. ఫిట్నెస్, కాలుస్య నియంత్రణ ధ్రువపత్రాలు లేకపోయినా రోడ్ల పైకి వస్తున్నాయి. అనుమతి గడువు ముగిసిన వాణిజ్య వాహనాలు సైతం తిరుగుతున్నాయి. వీటి వలన ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని ట్రాఫిక్ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బ్రేకులు సరిగ్గా లేని వాహనాలు, ఫిట్నెస్ గడువు ముగిసిన బస్సులు, అక్రమంగా మార్పులు చేసిన కార్లు రోడ్లపై తిరగడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. నిబంధనల ఉల్లంఘన కళ్ల ముందే జరుగుతున్నా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ) చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రజల వాహనాలపై కఠిన చర్యలు తీసుకునే అధికారులు, ఇటువంటి వాహనాలపై మాత్రం మౌనం పాటిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనల అమలు, వాహన తనిఖీలు, ఫిట్నెస్ పరిశీలన తదితర విధుల్లో వారు కఠినంగా వ్యవహరిస్తే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ వాహనాలపై చర్యలు ఒకే వాహనానికి రెండు రకాల నంబర్ ప్లేట్లు ఉపయోగించడం చాలా పెద్ద నేరం. దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అలాగే, నంబర్ ప్లేట్లపై ఎంవీఐలతో ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న వాహనాలపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వాటిని సీజ్ చేస్తాం. – ఆర్.సురేష్, జిల్లా రవాణా శాఖ అధికారి, రాజమహేంద్రవరం -
మళ్లీ ‘శ్రీవారి దేవస్థానమే’ టాప్
వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడిద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికే మళ్లీ మొదటి ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? దేవాలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అందులో ప్రతి నెలా ఏదో ఒక అంశంలో మొదటి ర్యాంకు సాధిస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం, గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించింది. తాజాగా మూడు రోజుల క్రితం వెలువడిన మే నెల సర్వేలో మళ్లీ అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ పొందింది. దర్శనం ఇతర అంశాల్లో.. ద్వారకాతిరుమల 73.4 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీకాళహస్తి 73.1 శాతంతో రెండవ ర్యాంక్, విజయవాడ 71.4 శాతంతో మూడవ ర్యాంక్, కాణిపాకం 70.8 శాతంతో నాల్గవ ర్యాంక్, అన్నవరం 70.7 శాతంతో ఐదవ ర్యాంక్, సింహాచలం 70.4 శాతంతో ఆరవ ర్యాంక్ సాధించగా, శ్రీశైలం 70.1 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది. సౌకర్యాల కల్పనలో.. ద్వారకాతిరుమల 73.25 శాతంతో మొదటి ర్యాంక్, శ్రీకాళహస్తి 72.73 శాతంతా రెండవ ర్యాంక్, విజయవాడ 71.42 శాతంతో మూడవ ర్యాంక్, కాణిపాకం 70.86 శాతంతో నాల్గవ ర్యాంక్, అన్నవరం 70.55 శాతంతో ఐదవ ర్యాంక్, శ్రీశైలం 69.85 శాతంతో ఆరవ ర్యాంక్, సింహాచలం 69.79 శాతంతో ఏడవ (ఆఖరి) ర్యాంక్ సాధించాయి. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
రాయవరం: జిల్లాలో గురువారం నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తమవుతోంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. జూన్ 4వ తేదీ వరకు జరిగే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలను 24,814 మంది విద్యార్థులు రాయనున్నారు. ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 38 పరీక్షా కేంద్రాలు పరీక్షలకు 38 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 13 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్, మూడు సోషల్ వెల్ఫేర్, ఒక కోఆపరేటివ్, 19 ప్రైవేట్ కళాశాలల్లో పరీక్షాల కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 16,004 మంది దరఖాస్తు చేశారు. వీరిలో జనరల్ పరీక్షలకు 15,168, ఒకేషనల్ 836 మంది రాయనున్నారు. సెకండియర్కు 8,810 మంది దరఖాస్తు చేయగా, వీరిలో జనరల్ పరీక్షలకు 8,102, ఒకేషనల్ 708 మంది హాజరు కానున్నారు. మొత్తం మీద ఫస్టియర్, సెకండియర్ జనరల్ పరీక్షలకు 23,270, ఒకేషనల్ 1,544 మంది పరీక్షలు రాయనున్నారు. మాస్ కాపీయింగ్ నిరోధానికి రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్, రెండు సిట్టింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా డీఈసీ, హైపవర్, ఆర్జేడీ, డీవీఈవో, ఆర్ఐవో అధికారుల స్క్వాడ్స్ ఉంటాయి. -
26 వరకు వడగాడ్పులు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసరం అయితేనే బయటకు రావాలని, తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణాలు తీసుకోవాలని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, రైతులు, నిర్మాణ కార్మికులు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించుకోవాలని సూచించారు. తలపై గుడ్డ, టోపీ ధరించడం, తరచుగా నీరు తాగడం, నేరుగా ఎండలో ఎక్కువ సేపు ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. గ్రామ, వార్డు స్థాయిలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. 29 నుంచి వేసవి ప్రత్యేక రైళ్లు రాజమహేంద్రవరం సిటీ: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జిల్లా మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు బుధవారం తెలిపారు. సికింద్రాబాద్ నాహర్ లాగున్ మధ్య మే 29వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు ఈ రైళ్లు నడవనున్నాయన్నారు. ప్రతి శుక్రవారం సికింద్రాబాద్– నహర్ లాగున్(07046)రైళ్లు , ప్రతీ సోమవారం నహర్ లాగూన్(07047) రైళ్లు నడవనున్నాయన్నారు. ఈ రైళ్లు జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట రైల్వేస్టేషన్లో ఆగడున్నాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. కల్వర్టు నిర్మాణం.. ట్రాఫిక్ మళ్లింపు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్):రాజమహేంద్రవరం ఐఎల్టీడీ జంక్షన్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించారు. దీంతో ధవళేశ్వరం మీదుగా కాకినాడ, మండపేట, రామచంద్రపురం, రావులపాలెం, అమలాపురం, రాజోలు, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను మోరంపూడి, బొమ్మూరు, వేమగిరి జాతీయ రహదారి మీదుగా రాకపోకలు సాగిస్తాయి. రైల్వేస్టేషన్కు వెళ్లే ఆటోలను, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. కార్లను, ఇతర ఆటోలను గోదావరి గట్టు, ధవళేశ్వరం సాయిబాబాగుడి మీదుగా మళ్లిస్తున్నారు. ధవళేశ్వరం ,బొమ్మూరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు బొగ్గులదిబ్బ, ఐదుబళ్ల మార్కెట్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలో చర్యలు చేపడుతున్నారు. -
అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలి
● వైఎస్సార్ సీపీ నేతల బృందం డిమాండ్ ● భీమోలు పెద్ద చెరువు పరిశీలన దేవరపల్లి: జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మాజీ హోం మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, గోపాలపురం నియోజకవర్గం పరిశీలకులు చందన నాగేశ్వర్లతో కూడిన నేతల బృందం బుధవారం గోపాలపురం మండలం భీమోలు పెద్ద చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకం పనులను పరిశీలించింది. మండుటెండ, వడగాడ్పులను లెక్క చేయకుండా ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో సాగుతున్న ఈ తరహా దోపిడీని తక్షణం ఆపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడికి వైఎస్సార్ సీపీ సన్నద్ధమవుతుందన్నారు. తప్పు జరిగితే ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎందురు నోరు విప్పడం లేదన్నారు. అనుమతికి మించి తవ్వకాలు : మాజీ హోం మంత్రి వనిత మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ చెరువు మట్టిని పంట పొలాలకు తోలుకోవడానికి 2 వేల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వడానికి అనుమతి తీసుకుని, సుమారు 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వినట్టు తెలిపారు. దేవరపల్లి మండలంలో త్యాజంపూడి ఆవ చెరువు, నల్లజర్ల మండలంలో పోతవరం, సుభద్రపాలెం చెరువులు, ద్వారకాతిరుమల మండలంలో పంగిడిగూడెం, తిరుమలంపాలెంలోని చెరువుల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారని చెప్పారు. టీడీపీ నాయకులు ఏ ఒక్క చెరువును విడిచిపెట్టడం లేదన్నారు. అక్రమ తవ్వకాలతో పాటు నిర్లక్ష్యంగా టిప్పర్లు నడుపుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నారని చెప్పారు. ప్రకృతి వనరుల దోపిడీ : జక్కంపూడి రాజా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వనరుల దోపిడీ ఘోరంగా జరుగుతోందన్నారు. యంత్రాలు, లారీలతో చెరువుల్లో మట్టిని దోచుకుంటున్నారని చెప్పారు. రైతుల పేరున కూటమి నాయకులు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని దోపిడీ చేస్తున్నారని అన్నారు. భీమోలు చెరువులో 10 యంత్రాలు, వందల కొద్దీ లారీలతో మట్టిని దోపిడీ చేసి రూ.కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. రోజుకు 3 వేల లారీల మట్టి, 2 వేల లారీల ఇసుక, 4 వేల లారీల గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోందని వివరించారు. చెరవుల్లో అక్రమ మట్టి తవ్వకాలను నియంత్రించాలని కొవ్వూరు ఆర్డీఓను చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఫోన్లో కోరారు. గోపాలపురం, నల్లజర్ల మండలాల అధ్యక్షులు వెలగా శ్రీరామమూర్తి, వెల్లంకి సుబ్రహమణ్యం, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వల్లభనేని సత్యనారాయణ, పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొండాడ వెంకటన్నబాబు, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సాలి వేణు, జిల్లా అధికార ప్రతినిధి గడా జగదీష్, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి నరహరిశెట్టి రాజేంద్రబాబు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి సత్తి సాయి ఈశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి జ్యోతిశ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నమని జనార్ధనరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సులు ఉండాలిలా..
● బస్సు మెట్లు (ఫుట్బోర్డ్) భూమి నుంచి 325 మిల్లీమీటర్లకు మించి ఉండకూడదు. ● పిల్లలు ఎక్కే, దిగే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా రెయిలింగ్ ఉండాలి. ● బస్సులో పిల్లల కదలికలు తెలుసుకునేందుకు డ్రైవర్ వద్ద అద్దం, అగ్నిమాపక సిలిండర్, తలుపులకు సురక్షిత లాకింగ్ సిస్టం, సిగ్నల్ లైట్లు పనిచేస్తూ ఉండాలి. ● అత్యవసర సమయంలో పగులగొట్టేందుకు సుత్తి ఉండాలి. ● సైడ్ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించకుండా అడ్డంగా మూడు లోహపు కడ్డీలు ఏర్పాటు చేయాలి. సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. ● డ్రైవరుకు ప్రతి మూడు నెలలకు బస్సు యాజమాన్యం బీపీ, గుండె, మధుమేహం, కంటి పరీక్షలు చేయించాలి. కానీ ఇందులో సగం నిబంధనలు కూడా పాటించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఏటీఎస్ కేంద్రంసాక్షి, రాజమహేంద్రవరం: విద్యాసంస్థల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు తెర తీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్కూల్, కళాశాలల బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ గతంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో నడిచేది. ఫిట్నెస్ లేకపోతే ధ్రువీకరణ పత్రం జారీని తిరస్కరించేవారు. ఏడాది క్రితం నుంచి ఈ పనిని ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. యువగళం పాదయాత్రలో లోకేష్తో పాల్గొన్న వారికి కట్టబెట్టారు. అందులో భాగంగానే ఏడాది క్రితం రాజానగరం వద్ద ఏటీఎస్ (ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్) వెలిసింది. అప్పటి నుంచి అందులోనే వాహనాల ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏటీఎస్ కేంద్రంలో ఫిట్నెస్ టెస్ట్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అది కలెక్షన్ కేంద్రంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఏదైనా విద్యాసంస్థకు చెందిన బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటే బస్సును ఏటీఎస్, రవాణా శాఖ కార్యాలయం వద్దకు తీసుకెళ్లాలి. అక్కడ 43 రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి. కానీ ఇక్కడ అలాంటివేమీ అమలు కావడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇవి ఏవీ? ప్రతి బస్సులో వెహికల్ లోకేషన్ ట్రాకింగ్ డివైస్ ఉండాలి. 1989 మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పానిక్ బట్టన్, ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టం తప్పనిసరి. 2023 మోటార్ వెహికల్ చట్టం ప్రకారం స్కూలు బస్సు మొత్తం తడిసే విధంగా పైపులైను స్పిన్నర్లు ఉండాలి. ఇవేమీ లేకపోయినా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తుండటంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 8 టెస్ట్లకే పరిమితం జిల్లా వ్యాప్తంగా సుమారు 1,705 స్కూల్ బస్సులు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 1,500లకు పైగా బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. ఏటీఎస్ సెంటర్లో బస్సు ఫిట్నెస్ తెలుసుకొనేందుకు 43 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. 8 మాత్రమే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముడుపులు పుచ్చుకుని మిగిలిన వాటిని చేసినట్లు చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి. 15 సంవత్సరాల లోపు కాలపరిమితి పూర్తయిన బస్సులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. కాలపరిమితి ఉన్న బస్సుల నెంబర్లను కాలం చెల్లిన బస్సులకు పెట్టి ఒకే నంబర్తో రెండేసి బస్సులు నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే కొనసాగితే ఆర్టీఓ అవకతవకలపై గతంలో నెల్లూరు ఘటన రాజమండ్రిలో కూడా పునరావృతం అవుతుందేమో అన్న ఆందోళన నెలకొంది. స్కూల్ వద్దకే అధికారులు? జిల్లాలో స్కూల్, కాలేజీ బస్సులపై రవాణా శాఖ ఈ నెల ఒకటో తేదీ నుంచి తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రత్యేక తనిఖీలు కాసుల వర్షం కురిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. అత్యధికంగా బస్సులు కలిగిన కొన్ని స్కూల్స్ వద్దకే వెళ్లి అక్కడే తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. నిబంధనలను సడలించి ఒక్కొక్క బస్సు నుంచి రూ.7,500 నుంచి రూ.8 వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నిబంధనలు ఇలా.. ఏపీ ఎంవీరూల్ (158(జీ) ప్రకారం విద్యా సంస్థల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి. సంబంధిత వెబ్సైట్లో స్కూల్ అడ్రస్, సెల్ నంబర్, బస్సు నంబర్, డ్రైవర్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాడ్జీ, బీమా, ట్యాక్స్లతో పాటు వాహన వివరాలు పూర్తిగా పొందుపరచాలి. బస్సులో ఉండే అటెండర్ పేరు, వయసు, ప్రయాణించే పిల్లల సంఖ్య ఉండాలి. డ్రైవర్, అటెండర్ వయసు 18 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. అవినీతికి కేరాఫ్ అడ్రస్గా బస్సుల ఫిట్నెస్ పరీక్ష కేంద్రం రూ.8 వేల చొప్పున వసూలు ఇష్టారాజ్యంగా స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ 43 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా కేవలం 8తోనే సరి విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన -
మెడికల్ షాపుల బంద్ సక్సెస్
● కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ర్యాలీ ● మందుల ఆన్లైన్ అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్, ది రాజమండ్రి కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల యజమానులు బుధవారం చేసిన సమ్మె సక్సెస్ అయింది. బంద్ నేపథ్యంలో నగరంలోని మెడికల్ షాపులన్నీ మూతపడ్డాయి. ఆనం కళాకేంద్రం వద్ద నుంచి గోకవరం బస్టాండ్ మీదుగా దేవీచౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ మానవ హారం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనన్లైనన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్తో పూర్తిగా 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 20వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరుకు మెడికల్ షాపులు హోల్ సేల్ అండ్ రిటైల్ బంద్ చేసినట్టు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2,250 మెడికల్ షాపులు ఉన్నాయని వారంతా బంద్ పాటించారన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడతామని హెచ్చరించారు. నగరంలోని నాలుగు ప్రధాన కూడళ్లలో నాలుగు దుకాణాలు తెరచి మందుల విక్రయం విషయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహకరించామన్నారు. తమకు మద్ధతుగా నిలిచిన ఐఎంఏ, కార్పొరేట్ మెడికల్ షాపుల యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ అధ్యక్షుడు బలభద్ర వెంకట రాజు (రాజా), రాజమండ్రి అధ్యక్షుడు పిల్లా బాల, అసోసియేషన్ ప్రతినిధులు పిండి గణపతి, కె.శ్రీనివాసరావు, సిహెచ్ ఫణీంద్ర పాల్గొన్నారు. ఏపీ హోమియోపతి డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో అన్ని హోమియోపతి మందుల షాపులు బంద్ నిర్వహించాయని నగర అధ్యక్షుడు ఎస్వీస్ నాయుడు తెలిపారు. -
తన స్నేహితుడే పెద్ది
కొత్తపల్లిలో తనతో పాటు క్రికెట్ ఆడే పెద్దిరాజు అనే యువకుడి కథనే సినిమాగా తీసినట్లు ఆయన తెలిపారు. తాపీమేస్త్రిగా పని చేసే పెద్దిరాజు తనతో పాటు క్రికెట్ ఆడుతుండేవాడని, మంచి క్రికెటర్ కావడంతో తాము వెళ్లే మ్యాచ్లకు అతడికి డబ్బులిచ్చి తీసుకువెళ్లేవారమని ఆయన వివరించారు. అలాగే బుచ్చిరాజు, తనతో పాటు క్రికెట్ ఆడిన కొండెవరానికి చెందిన రాంబుజ్జి పేర్లను తన చిత్రంలో పాత్రలకు పెట్టినట్టు దర్శకుడు చెప్పకనే చెప్పారు. సానా బుచ్చిబాబు -
కుర్రాళ్లకు కర్రతలామలకం!
● కత్తులతో వీర విద్య సాధన ● ఉత్సాహంగా చెడీ తాలింఖానా శిక్షణ అమలాపురం టౌన్: ఏడాది పాటు పుస్తకాలతో కలాల సాము చేసి ఓ మెట్టెక్కేసిన ఆ కుర్రకారు నేడు వాటికి విరామమిచ్చి కర్ర, కత్తిసాము చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం స్థానిక రవణం వీధిలోని శివాలయం ఎదుట చెడీ తాలింఖానా సాధన చేస్తున్నారు. 8 నుంచి 20 ఏళ్ల లోపు విద్యార్థులు సుమారు 110 మందికి అమలాపురానికి చెందిన చెడీ తాలింఖానా శిక్షకుడు వంటెద్దు సత్తిబాబు ‘శ్రీ కోనసీమ యుద్ధ కళా కేంద్రం’ పేరుతో ఈ ఉచిత వేసవి శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఈ శిక్షణ ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ సాగుతోంది. ఏటా దసరా ఉత్సవాల్లో ఈ వీర విద్య ప్రదర్శించడం అందరికీ తెలిసిందే. సుమారు 187 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ వీర విద్యను భావి తరాలకు అందజేయాలన్న సంకల్పంతో ఈ శిక్షణ ఇస్తున్నట్టు సత్తిబాబు తెలిపారు. వారసత్వాన్ని కాపాడాలనే.. చెడీ తాలింఖానా వారసత్వాన్ని కాపాడాలనే తపనతో ఈ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాను. పాఠశాల విద్యార్థులు ప్రతి వేసవి సెలవుల్లోనూ ఈ శిక్షణకు ఉత్సాహంగా వస్తున్నారు. స్వీయ ఆత్మ రక్షణకు తీసుకోవాల్సిన మెళకువలు నేర్పుతున్నాను. – వంటెద్దు సత్తిబాబు, చెడీ తాలింఖానా ట్రైనర్, అమలాపురం ఆత్మ రక్షణకు అవసరం ఆత్మ రక్షణకు ఈ విద్య ఎంతోగానో ఉపయోగపడుతుంది. అందుకే నేర్చుకుంటున్నాను. ఈ విద్యలో అమలాపురానికి ఉన్న పేరును కాపా డాలని రెండో ప్రాధాన్యంగా ఈ విద్య నేర్చుకుంటున్నాను. కర్ర, కత్తి సాము ఎలా చేయాల న్న విషయంపై రోజూ శిక్షణ పొందుతున్నాం. – పి.నాగ సూర్యలక్ష్మి, అమలాపురం గర్వంగా ఉంది ఈ వీర విద్య అమలాపురంలో చాలా మంది పెద్దవాళ్లకు వచ్చు. పిల్లలకు కూడా నేర్పుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ శిక్షణలో నేర్పుతున్న వీర విద్య అటు వారసత్వంగా, ఆత్మ రక్షణకు ఉపయోగపడుతోంది. – వి.శ్రీచరణ్, అమలాపురం -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
ఏలేశ్వరం: మండలంలోని జాతీయ రహదారిపై చిన్నింపేట జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి లారీ ఢీకొని సింద్రీపు అప్పలరాజు (50) తీవ్ర గాయాల పాలై మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ప్రత్తిపాడుకు చెందిన అప్పలరాజు తన అత్తగారి ఊరు సిరిపురానికి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. చిన్నింపేట జంక్షన్ వద్ద జాతీయ రహదారి దాటుతుండగా రాజమహేంద్రవరం నుంచి తుని వైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అప్పలరాజును ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతునికి భార్య బేబి, కుమారై, కుమారుడు ఉన్నారు. ఏడాది క్రితమే కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లి ప్రియుడిని హత్య చేసిన మైనర్ పోలీసుల అదుపులో నిందితులు కాకినాడ క్రైం: తన తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మైనర్ తన స్నేహితుడితో కలిసి అంతమొందించాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కర్రి చందు (39) కోటిపల్లిలో ఉంటున్నాడు. ఏడేళ్ల క్రితం కాకినాడ ప్రేజర్పేటలో ఉండేవాడు. ఆ సమయంలో సమీపంలో నివసించే ఓ మహిళతో ఏర్పడ్డ పరిచయం సహజీవనానికి దారి తీసింది. మహిళకు ఇద్దరు పిల్లలు కాగా చందుకు భార్య, పిల్లలు ఉండేవారు. వారిద్దరూ అందరినీ వదిలేసి కోటిపల్లి వెళ్లిపోయి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళ 17ఏళ్ల కుమారుడు చెడు వ్యసనాలకు బానిసై, గంజాయి సహా చిన్నపాటి నేరాలు చేస్తూ కాకినాడలోనే ఉంటున్నాడు. చందు వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతానికి వెళ్లడం, ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం చందు తన స్నేహితులతో కలిసి రాజమహేంద్రవరం సమీపంలో గండిపోచమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి రాత్రి కాకినాడకు వచ్చాడు. మద్యం మత్తులో యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఈ గొడవలో ఆ బాలుడు 24 ఏళ్ల స్నేహితుడు బర్ణి కల లక్ష్మణరావుతో కలిసి బండరాయితో చందు తలపై కొట్టేశారు. దీనిని చూసిన వాహన చోదకులు క్షతగాత్రుడిని జీజీహెచ్లో చేర్చారు. బుధవారం చందు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.కోటి విలువైన దేవదాయ భూమి స్వాధీనం రావులపాలెం: మండలంలోని వెదిరేశ్వరం వీరేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన రూ.కోటి విలువైన 37 సెంట్ల భూమిని అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 2011 నుంచి అన్యాక్రాం తంలో ఉన్న ఈ భూమిని హైకోర్టు ఉత్తర్వులతో స్వాధీనం చేసుకున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. -
చేలకు పెట్టిన నిప్పే ఊపిరి తీసింది
రామచంద్రపురం రూరల్: మండలం వేగాయమ్మపేట శివారు కుందాలమ్మచెరువుకు చెందిన కౌలు రైతు గుబ్బల సూరిబాబు (36) పంట చేలకు పెట్టిన నిప్పుతో ఊపిరాడక మృతి చెందాడు. ఈ హృదయ విదారక ఘటన బుధవారం చోటు చేసుకుంది. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్, ఎంఏఓ టీవీఆర్ మణిదీప్, స్థానికులు తెలపిన వివరాలా ఉన్నాయి. గ్రామంలో సూరిబాబు 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పండిస్తున్నాడు. బుధవారం కోతలు ముగిసాక మిగిలిన వరిగడ్డిని తగులబెట్టి వెళ్లిపోయాడు. అప్పుడే మధ్యాహ్న భోజనం ముగించి కూర్చున్న అతడికి తన పొలంలో నిల్వ చేసిన గడిమేటుకు మంటలు అంటుకున్నాయని తెలిసి పరుగున వెళ్లాడు. అప్పటికే భుక్తాయాసంతో ఉన్న అతడు అక్కడ దట్టంగా అలముకున్న పొగకు ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై లక్ష్మణ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సూరిబాబుకు భార్య, ఏడాది, మూడేళ్లు, ఆరేళ్ల ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు. తాము దిక్కులేని వాళ్లం అయ్యామంటూ వారు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది. ఎంత అవగాహన కల్పిస్తున్నా రైతులు వరి పొలాల్లో నిప్పు పెట్టడం మానడం లేదని ఏఓ మణిదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ● కౌలు రైతు ప్రాణం తీసిన పొగ ● దిక్కులేని వారైన భార్య, ముగ్గురు చిన్నారులు -
ఇద్దరి గొడవ వర్గాలకు వ్యాప్తిచేస్తారా?
● తోటపేట వెలి ఘటనపై అధికారుల ఆగ్రహం ● ఇరుపక్షాలతో శాంతి సమావేశం, కౌన్సెలింగ్ ● 20 మందిపై బైండోవర్ నమోదు ● 23న స్నేహపూర్వక సమావేశం ఏర్పాటు తాళ్లరేవు: పోలేకుర్రు పంచాయతీ తోటపేటలో వెలి ఘటనపై బుధవారం ఇరుపక్షాలతో శాంతి సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ పితాని త్రినాథరావు అధ్యక్షతన తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఇరు వర్గాల్లోని ఊడా వెంకటరమణ, రేవు భద్రయ్య, పెయ్యల సత్యనారాయణ, ఉండ్రు సత్యనారాయణ, న్యాయవాదులు పెయ్యల రమేష్, దడాల సత్యనారాయణ తదితరుల నుంచి వివరాలు తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్న సమస్యలను పెద్దవి చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామంలో ఇద్దరి గొడవ రెండు వర్గాల ఘర్షణలకు దారితీసిందన్నారు. గతంలో ఒకసారి సయోధ్య కుదిర్చినా మారకపోవడంతో ఇరుపక్షాల్లోని 20 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు. ఇకనైనా అందరూ కలసి గ్రామంలో ప్రశాంతతను కాపాడాలని కోరారు. ఇరుపక్షాల అంగీకారంతో ఈ నెల 23వ తేదీన రెండు వర్గాలకు చెందిన ప్రతినిధులతో స్నేహపూర్వక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ సత్యనారాయణ, కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ ఎం.సూరిబాబు, ఎండీయూడబ్ల్యూఏ అధ్యక్షుడు కన్నీడి వెంకటరమణ, దళిత నాయకులు పాల్గొన్నారు. -
ముగిసిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు
విజేలకు ఎంపీ హరీష్ మాధుర్ బహుమతి ప్రదానం అమలాపురం రూరల్: అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్, ఆసియా ఫెడరేషన్, కామన్ వెల్త్ ఫెడరేషన్ అనుబంధంతో 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్, జూనియర్ మెన్ అండ్ ఉమెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించడం ద్వారా కోనసీమకు జాతీయస్థాయి గుర్తింపు లభించిందని ఎంపీ హరీష్ మాధుర్ అన్నారు. రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కోనసీమ హెల్త్ అండ్ ఫిట్నెస్ క్లబ్ అసోసియేషన్ అధ్వర్యంలో స్థానిక సత్యనారాయణ గార్డెన్స్లో నిర్వహించిన పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. 29 రాష్ట్రాల నుంచి వచ్చిన 990 మంది పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపారు. ముగింపు కార్యక్రమంలో ఎంపీ హరీష్, ఎస్పీ రాహుల్ మీనా పాల్గొని విజేతలకు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, అసోసియేషన్ సభ్యులు కోనసీమకు రైల్వే సౌకర్యం కల్పించాలని ఎంపీ హరీష్ను కోరారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు తదితరులతో పాటు జిల్లా, రాష్ట్ర, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు డీవీ రమణ, పప్పుల శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు స్వర్ణ పతక విజేతలు వీరే : గుజరాత్కు చెందిన అస్మా జబువాలా 84 ప్లస్ కేజీల విభాగంలో టోటల్లో స్వర్ణ పతకం సాధించింది. సబ్ జూనియర్ 120 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన భాగ్య ధావన్ మొత్తం 590 కేజీలతో టోటల్లో స్వర్ణ పతకం సాధించాడు. ఒడిశాకు చెందిన ఆకాంక్ష పరిడా 84 ప్లస్ కేజీల విభాగంలో 500.5 కేజీల టోటల్తో స్వర్ణ పతకం సాధించింది. -
అచ్చియ్యమ్మకు పెద్దిపీట
● చిత్రంలో పాత్రల పేర్లన్నీ దర్శకుడు బుచ్చిబాబు గ్రామస్తులవే ● సొంతూరిపై మమకారం చిత్రం కథాంశం ● వైరల్ అవుతున్న ఉప్పాడ కొత్తపల్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్తపల్లిలో ముప్పారపు అచ్చియ్యమ్మ కల్యాణ మండపం ఉప్పాడ కొత్తపల్లిలో పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా సొంతిల్లు పిఠాపురం: ఇప్పటి వరకు సముద్రకోత, ఉప్పు చేపలు, జాంధానీ చీరలతో దేశ వ్యాప్త గుర్తింపు పొందిన కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి త్వరలో విడుదల కానున్న పెద్ది సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందనుంది. ఆ గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సానా బుచ్చిబాబు తన జీవితంలో సహచరులతో అల్లుకున్న అనుబంధాలనే చిత్రంగా రూపొందించి వారి పేర్లనే పాత్రలకు పెట్టడంతో ఇప్పుడు ఆ గ్రామం దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. పలు ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పిన కొత్తపల్లి విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముప్పారపు అచ్చియ్యమ్మ కల్యాణ మండపం కొత్తపల్లిలో తొలి కల్యాణ మండపంగా పేరొందిన ముప్పారపు అచ్చియ్యమ్మ కల్యాణ మండపానికి బుచ్చిబాబు తన పెద్ది సినిమాలో పెద్ద పీట వేశారు. కొత్తపల్లికి చెందిన అచ్చియ్యమ్మ తన భూమిని ప్రభుత్వం తీసుకోగా వచ్చిన సొమ్ముతో ఊరిలో తొలి కల్యాణ మండపాన్ని నిర్మించింది. ఆమె పేరునే చిత్ర కథానాయిక జాన్వీకపూర్ క్యారెక్టర్కు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఉబ్బితబ్బిబవుతున్న స్థానికులు తమ గ్రామంలో పుట్టి తమతో పాటు తిరిగిన కుర్రాడు సినీ దర్శకుడిగా ఇది వరకే ఉప్పెన చిత్రంతో మంచి పేరు తెచ్చుకుని, తాజాగా పెద్ది చిత్రంతో పాన్ ఇండియా స్థాయికి ఎదగడంతో స్థానికుల ఆనందానికి అవధులు లేవు. అదీగాక రామ్ చరణ్తో చిత్రం తీసి స్టార్ డైరెక్టర్గా ఎదగడం వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. -
స్నానానికి దిగి యువకుడి మృతి
ఆత్రేయపురం: కాటన్ బ్యారేజీ బొబ్బర్లంక సమీపంలో బుధవారం మధ్యాహ్నం స్నేహితుడితో కలిసి స్నానానికి దిగిన వెలుకొండ వెంకట చక్రవర్తి (21) నీటిలో మునిగి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి రాజానగరం మండలం రాధేయపాలేనికి చెందిన చక్రవర్తి ఇంటర్ వరకు చదివి, భవన నిర్మాణంలో సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. బుధవారం అతడు స్నేహితులతో స్నానానికి దిగి మృతి చెందడంపై తండ్రి నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు బోరున వినిపిస్తున్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్.రాము తెలిపారు. గురువారం పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అందించనున్నట్లు తెలిపారు.


