breaking news
East Godavari
-
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండల పరిధిలోని వడిశలేరు-రంగంపేట మధ్య ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.సామర్లకోట ప్రాంతానికి చెందిన కూలీలు బాపట్ల కొల్లూరులో నిర్మాణ పనులకు వెళ్లేందుకు టాటా ఏస్ వాహనంలో బయలుదేరారు. వడిశలేరు-రంగంపేట మధ్యకు చేరుకోగానే వాహనం టైర్ ఒక్కసారిగా పంచర్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం రోడ్డుపై బోల్తా పడింది.ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనంలో ప్రయాణిస్తున్న బాబు, మురమర్ల రాజు, కాకాడ రాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా సామర్లకోటకు చెందిన వాళ్లుగా గుర్తించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.ఉదయం పనుల కోసం బయలుదేరిన కూలీలు ప్రమాదానికి గురవడంతో సామర్లకోట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
మాల సామాజికవర్గం ఐక్యం కావాలి
రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ కపిలేశ్వరపురం (మండపేట): మాల సామాజిక వర్గీయులంతా దేశ వ్యాప్తంగా ఐక్యం కావాల్సిన సమ యం ఆసన్నమైందని రాక్స్ అండ్ మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. మండపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో దళితులను అణచివేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఆయా పాలకులు చేసిన చట్టాలు శిలాశాసనాలు కాదని, వారి పాలనలో దళిత సామాజిక వర్గానికి లభిస్తున్న ఫలితాలేంటన్న అంశాలపై దృష్టిపెట్టాలని చెప్పారు. రిజర్వేషన్ల పేరుతో ఇచ్చే నూటికి రెండు శాతం ఫలితాలు ఎస్సీ జాబితాలోని అన్ని కులాలకూ ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అలా పరిమితంగా అమలు చేసేదాన్ని సామాజిక న్యాయమని ఎలా పిలవగలుతున్నారని నిలదీశారు. రిజర్వేషన్లు అనగానే కేవలం ఉద్యోగాల వరకు మాత్రమే కాదని, చంద్రబాబు, రేవంత్రెడ్డి మంత్రి వర్గంలో అమలు చేయరా అని ప్రశ్నించారు. న్యాయస్థానాల్లోని జడ్జిల నియామకాల్లోనూ, ఇతర రాజ్యాంగ వ్యవస్థల్లోనూ అమలు కావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అన్నది దళిత వర్గంపై జరుగుతున్న కుట్ర అని అన్నారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం దేశ వ్యాప్తంగా ఐక్యం కావాలని, ఆ దిశగా అన్ని రాజకీయ పార్టీల గొడుగుల కింద ఉన్న దళిత సామాజిక వర్గీయులు ఆలోచన చేయాలని రత్నాకర్ కోరారు. -
గోదావరిలో యువకుడి గల్లంతు
సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన కట్టుబోయిన అజయ్ (15) ప్రమాదవశాత్తూ పడవ నుంచి పడి గోదావరిలో గల్లంతయ్యాడు. సోమవారం ఉదయం గోదావరి మధ్యలోని ములకల్లంక పశు వుల పాకకు వెళ్లాడు. ఉదయం 11 గంటలకు తిరి గి బొబ్బిల్లంకకు రావడానికి గోదావరి ఒడ్డుకు చేరుకున్నాడు. స్థానికులు ప్రయాణం చేసే మరపడవలపై కాకుండా కూలీల పడవపై మరో ఇద్దరి తో అజయ్ ఎక్కాడు. పడవ తెడ్డు వేస్తుండగా గోదావరి మధ్యలోకి చేరుకున్న తరువాత అదుపుతప్పి గోదావరిలో జారిపడి గల్లంతయ్యాడు. మృతదేహం కోసం స్థానికులు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గోదావరిలో దూకి ఆత్మహత్య మండలంలోని ఇనుగంటివారిపేటకు చెందిన కుప్పాల పెదకాపు (43) ఆరోగ్య పరిస్థితి బాగాలేక సోమవారం ఉదయం గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుగర్ వ్యాధితో బాధపడుతున్న పెదకాపు కాలి వేళ్లు తీసివేయాలని వైద్యులు చెప్పడంతో మనస్థాపం చెంది ఉదయం 6 గంటలకు కాలకృత్యాలు తీర్చుకోవడానికి అని చెప్పి వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం 11 గంటలకు మృతదేహం లభ్యమవగా దహన సంస్కారాలు నిర్వహించారు. ఎటువంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు తెలిపారు. తల్లిని చంపిన కేసులో నిందితుడి అరెస్ట్ పిఠాపురం: అడిగిన వెంటనే మంచినీళ్లు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లిపై దాడి చేసి ఆమె మరణానికి కారణమైన కేసులో నిందితుడిని సోమవా రం అరెస్టు చేసినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం పిఠాపురం మండలం చిత్రాడకు చెందిన పెంటా రాజబాబు తన ఇంట్లో భోజనం చేస్తూ తల్లిని మంచినీరు ఇవ్వాలని అడిగాడు. తల్లి మంచినీరు ఇవ్వడానికి ఆలస్యం చేసిందన్న కోపంతో తన తల్లి నాగమణి ని తలను బల్లకేసి గట్టిగా అదిమి కొట్టాడు. దీంతో తలకు తీవ్రగాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితుడు రాజబాబుపై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచినట్లు ఆయన తెలిపారు. -
చర్యలకు వెనకడుగు ఎందుకో?
● టికెట్ల స్కామ్ కేసులో ఇప్పటికే పూర్తయిన విచారణ ● నివేదిక సిద్ధంగా ఉన్నా చర్యలు శూన్యం ● అధికారులు వెనకాడుతున్నారంటూ ఆరోపణలు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో ఈ ఏడాది మార్చి 15న వెలుగులోకి వచ్చిన రూ.200ల నకిలీ టికెట్ల స్కామ్ అప్పట్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. భక్తుల దర్శనం టికెట్ల వ్యవహారంలో చోటుచేసుకున్న ఈ అక్రమాలపై అప్పటి ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ ఫిర్యాదు మేరకు ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరిపిన భీమడోలు సీఐ పి.కృష్ణ నలుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ఎన్ఎంఆర్ ఉద్యోగి, ఒక సెక్యూరిటీ సూపర్ వైజర్, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, తాడేపల్లిగూడేనికి చెందిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని మొత్తం 9 మందిని అరెస్టు చేసి, రిమాండ్కు పంపారు. వారంతా ఇప్పటికే బెయిల్పై విడుదలయ్యారు. ఇదిలా ఉంటే అప్పట్లో శాఖాపరమైన విచారణ (డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ) నిర్వహించిన దేవస్థానం ఈఈ డీవీ భాస్కర్ సంబంధిత నివేదికను ఈఓ భద్రాజీకి ఏప్రిల్ 6న సమర్పించారు. జాబ్చార్ట్ ప్రకారం సదరు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. చర్యలు శూన్యం విచారణ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సంబంధిత ఉద్యోగులపై అధికారులు ఏ విధమైన శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. విచారణ నివేదిక సిద్ధంగా ఉన్నప్పటికీ దానిపై నిర్ణయం తీసుకునేందుకు అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తప్పుబడుతున్న భక్తులు నకిలీ టికెట్ల విక్రయాల స్కామ్ దాదాపు ఏడాది పాటు సాగిందని పోలీసులు తమ విచారణలో తేల్చారు. సంబంధిత అధికారులు, సిబ్బంది అలసత్వం, పర్యవేక్షణ లోపాలే ఈ స్కామ్ జరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆలయ ఆదాయానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే స్థాయిలో జరిగిన ఈ వ్యవహారంలో బాధ్యులపై ఇప్పటి వరకు శాఖాపరమైన చర్యలు తీసుకోకపోవడాన్ని భక్తులు, స్థానికులు తప్పుబడుతున్నారు. రెండూ వేర్వేరు.. డిపార్ట్మెంట్ ఎంక్వయిరీకి, పోలీసుల విచారణకు ఎలాంటి సంబంధం లేదని, శాఖాపరమైన విచారణ ఆధారంగా దేవస్థానం అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎవరి కోసం చర్యలు తీసుకోవడం లేదో అర్థంలేదని పలువురు అంటున్నారు. ఇదిలా ఉంటే టికెట్ల స్కాం కేసుకు సంబంధించిన చార్జ్షీట్ను పోలీసులు ఇంకా కోర్టులో దాఖలు చేయలేదు. -
అంతర్జాతీయ జర్నల్లో కాకినాడ వైద్యుడి పరిశోధన
కాకినాడ క్రైం: కోవిడ్ వేళ వ్యాధి నివారణకు తాను చేసిన మూడు మాత్రల పరిఽశోధన అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైందని కాకినాడ వైద్యుడు యనమదల మురళీకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జర్నల్ ఆఫ్ ప్రైమరీ కేర్ స్పెషాలిటీస్ మే–ఆగస్టు 2026 సంచికలో తాను ప్రయోగాత్మకంగా రూపొందించిన ఆస్ప్రిన్, ప్రెడ్నిసోలాన్, అజిత్రోమైసిన్ వైద్య విధానం ఎంతో సత్ఫలితాలనిచ్చిందని పేర్కొన్నారు. 2021లో అప్పటి వైద్య రీతులను అనుసరించిన 60 మందితో తన వైద్య విధానాన్ని సరిపోల్చితే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన నిపుణులు తన పరిశోధనను అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించారని మురళీకృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. -
నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ను పూర్తి చేయండి
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)– 2026 కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 25 నాటికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయడంతో పాటు, స్వీకరించిన ఫారాలను సమాంతరంగా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. సోమవారం రాజమహేంద్రవరం మండలం హుకుంపేట, మోరంపూడి పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, బీఎల్ఓల పనితీరు, ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగాన్ని పరిశీలించారు. సంబంధిత బీఎల్ఓలు మాట్లాడుతూ, తమ పరిధిలో 1,100 మందికి పైగా ఓటర్లు ఉన్నారని, అందులో సుమారు 60 శాతం మంది మ్యాపింగ్ పూర్తయ్యిందని తెలిపారు. కొంతమంది ఓటర్లు ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారని, ఓటర్ల తల్లిదండ్రుల పేర్లు, గత నివాస వివరాలను ధ్రువీకరిస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్ల వివరాల నిర్ధారణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ ప్రజలతో నేరుగా మాట్లాడి ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఇన్చార్జి డీఆర్వో కె.భాస్కర్రెడ్డి, సహాయ ఈఆర్వో శ్రీనివాస్, ఎంపీడీఓ కె.సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ అధికారులు, బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు. 1న డీసెట్ రాజమహేంద్రవరం రూరల్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్) 2026ను జూలై ఒకటిన నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ ఆర్జేడీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీడీఈఈసీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ లేదా సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. -
కొబ్బరి ధరహాసం..
నాణ్యతను బట్టి ధర వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.9 వేల నుంచి రూ.10 వేలు చెల్లిస్తున్నారు. కొబ్బరికి డిమాండ్ ఉండవలన మా పంట పండింది. – కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు గిట్టుబాటు ధర గతంలో వ్యాపారస్తుల చుట్టూ తాము తిరిగేవాళ్లం. కానీ నేడు వ్యాపారస్తులు మా చుట్టూ తిరుగుతున్నారు. గత పదేళ్లలో ఇంత ధర చూడలేదు. దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తోంది. – నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు కొబ్బరికి డిమాండ్ ఇతర రాష్ట్రాల్లో సరుకు లేకపోవటంతో కొబ్బరికి మంచి డిమాండ్ ఉంది. ఈ ధరలు ఎంత కాలం ఉంటాయో తెలియదు. అందుకే వచ్చిన కాయ వచ్చినట్లు మార్కెట్కు తరలిస్తున్నాం. – అడబాల బ్రహ్మయ్య, వ్యాపారి, అన్నవరప్పాడు పెరవలి: కొబ్బరి కాయలకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర లభించడంతో రైతులు, వ్యాపారస్తుల మోముల్లో ధరహాసం వెల్లివిరుస్తోంది. మార్కెట్లో నెల రోజుల క్రితం వెయ్యి కాయల ధర రూ.11 వేలు కాగా.. ప్రస్తుతం రూ.15 వేలు పలుకుతుంది. కాయల నాణ్యతను బట్టి రైతుల నుంచి కాయను రూ.9 నుంచి రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి కొబ్బరి కాయల ధర తగ్గడమే తప్ప పెరగలేదు. గత మూడు నెలల నుంచి కొబ్బరి కాయలకు డిమాండ్ లేకపోవడంతో బొండాలు తీయడంతో కొబ్బరి కాయలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతుల వద్దకే నేరుగా వ్యాపారస్తులు వచ్చి రూ.9 నుంచి రూ.10 ఇచ్చి కాయలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరికాయ ధర నాణ్యతను బట్టి రూ.14 వేల నుంచి రూ.15 వేలు పలుకుతున్నా రైతులకు మాత్రం దక్కేది కేవలం రూ.9 నుంచి రూ.10 అని అంటున్నారు. ఎందుకంటే దింపు తీయాలంటే దింపు కార్మికులకు, కాయలు పోగుచేసే కూలీలు, కాయల మోత కూలీలు, ఒలుపు, రవాణా వంటి ఖర్చులు పెరగడంతో రైతులకు మాత్రం దక్కేది ఇందులో సగమే. రైతులకు ఎటువంటి ఖర్చులు లేకుండా నేరుగా చేను వద్దకే వచ్చి కాయకు రూ.9 నుంచి రూ.10 చెల్లిస్తున్నారు. అదే రైతు దింపు తీసి ఒక్క చోట గుట్టగా పెడితే కాయ నాణ్యతను బట్టి రూ.14 వరకూ చెల్లిస్తున్నారు. జిల్లాలో సాగెంత? ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలో 70 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ఉన్నాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇదే కాకుండా చేలగట్లు, పుంత గట్లు, చెర్వు గట్లు, లంకభూముల్లోనూ కొబ్బరి సాగు చేస్తున్నారు. గతంలో ఎకరానికి 600 నుంచి 800 కాయలు పడితే.. నేడు తోటలు ఆరోగ్యంగా ఉండటం వల్ల 1200 నుంచి 1500 కాయల దిగుబడి వస్తుంది. ధరలు పెరగడానికి కారణాలివే.. కొబ్బరికి మార్కెట్లో ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గత మూడు నెలల నుంచి కొబ్బరికి డిమాండ్ లేకపోవడంతో రైతులు కొబ్బరి బొండాలను తీసివేయడంతో కాయలకు కొరత ఏర్పడింది. దీంతో ధర ఈ నెల నుంచి క్రమేపీ పెరుగుతూ నేడు రూ.15 వేలకు చేరింది. కేరళ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు అనూహ్యంగా తగ్గిపోవడం కూడా మరో కారణం. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతులు జరుగుతున్నాయి. పెరిగిన ఎగుమతులు ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి నిత్యం 300 నుంచి 400 లారీల కాయ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. ముఖ్యంగా కొబ్బరి ధరను పెంచేది, తగ్గించేది ఈ రెండు జిల్లాలో ప్రధాన మార్కెట్లు అంబాజీపేట, పాలకొల్లు నుంచి నిత్యం 300 నుంచి 400 లారీల సరకు వెళుతోంది. జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 70 వేల హెక్టార్లలో పంట వెయ్యి కాయలకు రూ.11 వేల నుంచి రూ.15 వేలకు ఎగబాకిన ధర నిత్యం 300 నుంచి 400 లారీల ఎగుమతులు -
రాష్ట్రంలో లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు
సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలు ఎంతో ప్రతిష్టాత్మకం. అలాంటి వేడుకలు 2027 జూన్ 27వ తేదీ నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా. భక్తుల వసతుల కల్పనకు ఆరు జిల్లాల పరిధిలో రూ.8,500 కోట్ల నిధులతో 7 వేల పనులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. నేటికీ నయాపైసా విడుదల కాకపోయినా.. నిధులు విడుదలపై గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే.. రానున్న సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభమవుతాయి. దీంతో గోదావరి పరివాహక ప్రాంత ఎమ్మెల్యేలంతా ఇప్పుడు పుష్కరాల బడ్జెట్ను టార్గెట్ చేశారు. ఈ పనులను దక్కించుకుని నిధులు కొల్లగొట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర పనులు దక్కాలంటే.. తమకు అనుకూలమైన అధికారులు ఉండాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే తమ అడుగులకు మడుగులొత్తే అధికారుల కోసం వెతుకుతున్నారు. తమకు అనుకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్ ఇప్పించుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. వీళ్లతో కాదులే..? తమకు అనుకూలమైన అధికారులకు పోస్టింగ్ తెప్పించుకునేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులను అవమానాలకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారులతో పుష్కర పనులు చేయడం సాధ్యం కాదని చెబుతున్నారని తెలిసింది. ఇందులో భాగంగానే అధికారులు చేపడుతున్న పనులను తప్పుబడుతున్నారు. వారు తయారు చేసిన ప్రతిపాదనలకు వంకలు పెడుతున్నట్లు సమాచారం. ఏదో విధంగా తమకు నచ్చని వారిని సాగనంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఓ జిల్లా స్థాయి అధికారి, మరో కార్పొరేషన్లో ఓ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. వారి స్థానంలో తాము ప్రతిపాదించిన వారిని నియమించాలని కోరినట్లు సమాచారం. కాంట్రాక్ట్ కొట్టేసేందుకు పావులు పుష్కర పనుల కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే వ్యహాలు రచిస్తున్నారు. దీనికోసం మరో అడుగు ముందుకేసి అవసరమైతే తామే స్వయంగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పుష్కరాల పనుల్లో ఎంత వీలైతే అంత ఆర్జించాలని భావిస్తున్నట్లు తెలిసింది. రూపాయి ఖర్చు చేసి రూ.వంద సంపాదించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. ఇందుకు కాంట్రాక్టుల కోసం బినామీ కంపెనీలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు సమాచారం. ఏం చేసినా ఈ ఏడాదిలోనే సంపాదించాలనే ఆశతో ఉన్నారు. పుష్కర బడ్జెట్లో ఎవరు ఎక్కువ నిధులు తెచ్చుకుంటే, అంత ఎక్కువ దండుకోవచ్చన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. అత్యధిక నిధులు తమకే కేటాయించాలని, జనసేన ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నట్లు తెలిసింది. ఈ విషయంలో జనసేన ఎమ్మెల్యేలు అందరూ కలసికట్టుగా ఉంటే.. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పుష్కర పనుల్లో ఏ పనైనా.. 20 శాతం వాటా మిగులుతుందని గత అనుభవాల ప్రకారం ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కొత్తగా మోడల్ స్నాన ఘట్టాలు నిర్మించాలని ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చైన్నె క్రౌడ్ మేనేజ్మెంట్ సంస్థతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు తయారు చేసింది. అందులో భాగంగా సీతానగరం మండలం మునికూడలి గ్రామంలో మోడరన్ స్నానఘట్టం నిర్మాణం, కొవ్వూరు మండలం పెద్ద వాడపల్లి గ్రామం వద్ద రెండు కిలోమీటర్ల మేరకు స్నానఘట్టం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో అభివృద్ధి పనులుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతుందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ అన్యాయాలు, స్థానిక ప్రజాప్రతినిధుల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి భరత్రామ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంలో కల్తీ పాల ఘటనలో బాధితులకు మెరుగైన చికిత్స అందక మృత్యుఒడిలోకి చేరుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రభుత్వ పెద్దలు కలసి బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రకటించారని, ఈ రోజు వరకూ సరైన వైద్యం అందించిన దాఖలాలు వేవనన్నారు. బాధిత బాలల కుటుంబాలకు ఇప్పటివరకూ రూ.మూడున్నర లక్షలు ఖర్చయ్యిందని, ప్రభుత్వం ఆ సొమ్ము ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా ఉండే బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై అక్రమంగా పీడీ చట్టం ప్రయోగించారని భరత్రామ్ మండిపడ్డారు. ఇదంతా ఈవీఎం ఎమ్మెల్యే కుట్రలో భాగమేనని, అతని ఒత్తిడి మేరకు పోలీసులు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజమహేంద్రవరం నగర టీడీపీలో 40వ వార్డు పరిసరాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయని, కొట్టిన వారు పెట్టిన కేసును పోలీసులు నమోదు చేశారని, దెబ్బలు తిన్న వారిని అరెస్టు చేశారన్నారు. ఇదేమి అన్యాయమని అడిగిన పీతా రామకృష్ణపై పీడీ యాక్ట్ అమలు చేయడం దారుణమన్నారు. బోట్మెన్ సొసైటీల పేరుతో గామన్ బ్రిడ్జి వద్ద రాత్రి పగలు తేడా లేకుండా డ్రెజ్జింగ్ బోట్లతో ఈవీఎం ఎమ్మెల్యే అనుచరులు ఇసుక దోపిడీ చేస్తున్నారన్నారు. గామన్ బ్రిడ్జి ప్రమాదంలో పడుతోందని, స్థానిక మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ ఇసుక దోపిడీ జరుగుతోందని, సామాన్యులకు మాత్రం ఇసుక దొరకడం లేదని విమర్శించారు. ఇసుక దోపిడీకి సంబంధించి సాక్ష్యాధారాలను జిల్లా కలెక్టర్కు అందజేశామని చెప్పారు. ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు వ్యతిరేకమని, తన హయాంలో వీరభద్రనగరం వద్ద పాత కబేలా స్థలంలో ముస్లింలకు 2,500 చదరపు గజాలు (50 సెంట్లు) షాదీ ఖానాకు కేటాయించానని, దానికి రూ.50 లక్షలు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఈ స్థలాన్ని ప్రస్తుతం ఈవీఎం ఎమ్మెల్యే ముస్లింలకు కేటాయించలేదని, పనులు కూడా ప్రారంభించలేదని, దీనిపై ప్రస్తుత ఎంపీ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. షాదీఖానా నిర్మాణం జరిగేంత వరకూ పోరాడతానని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలు కార్యకర్తలు ఉన్నారు. నిధుల ప్రతిపాదనలు ఇలా..గోదావరి పుష్కరాల్లో భాగంగా ఆరు జిల్లాల పరిధిలోని 242 గ్రామాల్లో గోదావరి పుష్కరాల పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తామని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ప్రకటించారు. ప్రస్తుతం అఖండ గోదావరి ప్రాజెక్టు కింద టూరిజం శాఖకు చెందిన రూ.94 కోట్లతో రాజమహేంద్రవరంలో రివర్ ఫ్రంట్, పుష్కర్ ఘాట్ ఆధునికీకరణ, హేవలాక్ బ్రిడ్జి పాదచారుల వంతెనగా పనులు చేస్తున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులపై టీడీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. తమ ప్రమేయం లేకుండా నాసిరకంగా పనులు చేస్తున్నారని ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు పుష్కర పనుల్లో భాగంగా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు రూ.240 కోట్లతో ప్రతిపాదించిన పనులకు శంకుస్థాపన చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గోదావరి జలాల కాలుష్య నివారణకు రూ.100 కోట్లు వెచ్చించాలని భావిస్తున్నారు. కేంద్రం సైతం రూ.100 కోట్లు కేటాయించింది. అయితే ఎమ్మెల్యేలు, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్రస్తుతం పుష్కర పనులపై గందరగోళం నెలకొంది. అందుకే ఎమ్మెల్యేలు అధికారులను బదిలీ చేసి... తమకు అనుకూలమైన వారిని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిసింది. గోదావరి పుష్కరాల నిధులు కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యేలు వ్యూహాలు రచిస్తున్నారా..? అభివృద్ధి పనుల టెండర్లు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తున్నారా..? ఇందుకు తమకు అనుకూలమైన అధికారులను తెచ్చుకునేందుకు పావులు కదుపుతున్నారా..? నిక్కచ్ఛిగా ఉన్న అధికారులను సాగనంపేందుకు కుట్రలు పన్నుతున్నారా..? ఆ దిశగా పైరవీలకు దిగుతున్నారా..? అందులో భాగంగా పుష్కరాలకు రూ.8,500 కోట్ల నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపారా..? అంటే అవుననే రాజకీయ విశ్లేషకుల సమాధానం వస్తోంది. ఫ పుష్కర నిధులు కొల్లగొట్టేందుకు వ్యూహాలు ఫ పైరవీలకు ప్రజాప్రతినిధుల కసరత్తు ఫ అనుకూల అధికారులను తెచ్చుకునేందుకు పావులు ఫ కల్తీ పాల ఘటనలో బాధితులకు అందని మెరుగైన వైద్యం ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ధ్వజం -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ జరిగింది. కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి కలసి ప్రజల నుంచి మొత్తం 186 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్, మీ సేవా కేంద్రాలు, అలాగే ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా కూడా తమ ఫిర్యాదులు, వినతులను నమోదు చేసుకోవచ్చన్నారు. అందిన ప్రతి అర్జీని సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, వారసత్వం, సర్వే తదితర రెవెన్యూ అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. చినవెంకన్న హుండీ ఆదాయం రూ.1.70 కోట్లు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రమోద కల్యాణ మండపంలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. గడచిన 14 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 1,70,53,076 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 147 గ్రాముల బంగారం, 2.510 కిలోల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని పాత రూ. 2 వేలు, రూ. 500 నోట్ల ద్వారా రూ.7,500 వచ్చిందన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. సత్యదేవునికి భారీగా హుండీ ఆదాయం అన్నవరం: పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 33 రోజులకు గాను రికార్డు స్థాయిలో రూ.1,96,59,883 ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో చైర్మన్, ఈఓలతో పాటు దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
లక్కీ డ్రా పేరుతో ప్రజలకు టోకరా
● రూ.6 కోట్ల వసూలు ● నిర్వాహకుడి అనుమానాస్పద మృతి ● పోలీస్స్టేషన్లో ఫిర్యాదు దేవరపల్లి: లక్కీ డ్రా స్కీమ్ పేరుతో వందలాది మందికి టోకరా వేసిన నిర్వాహకుల ఉదంతం నల్లజర్ల మండలం పోతవరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దాదాపు ఐదేళ్లుగా బల్లం రాజ్కుమార్, మరి కొంతమంది కలసి శ్రీశ్రీనివాస లక్ష్మి లక్కీ డ్రా స్కీమ్ నడుపుతున్నారు. నల్లజర్ల, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో సుమారు 1500 మంది నుంచి లక్కీ డ్రా పేరుతో సొమ్ములు కట్టించుకున్నారు. రూ.150, 300, 500, 1000 కార్డులను ఇచ్చి ప్రజల నుంచి వారం వారం, 15 రోజులకోసారి, నెల వారీగా సొమ్ము కట్టించుకున్నారు. డ్రాలో తగిలిన వ్యక్తులకు కొంత కాలం నిబంధనల మేరకు వస్తువులు ఇచ్చారు. ఈ విధంగా ప్రజల్లో నమ్మకం కలిగించారు. ఒక్కో బాధితుడు సుమారు రూ.52 వేల నుంచి రూ.55 వేల వరకు కట్టారు. సుమారు 100 మందికి డబుల్ కాట్లు, 60 మందికి సింగిల్ కాట్లు, పరుపులు, 200 మందికి ల్యాప్టాప్లు ఇవ్వాల్సి ఉంది. బాధితుల నుంచి సుమారు రూ.6 కోట్లు వసూలు చేశారు. డ్రాలో తగిలిన లబ్ధిదారులకు సరకులు ఇవ్వకుండా నిర్వాహకుడు రాజ్కుమార్ కాలయాపన చేస్తూ కుంటిసాకులు చెబుతూ వస్తున్నాడు. ఇటీవల నిర్వాహకుడు రాజ్కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు అతని ఇంటికి వెళ్లి తాము కట్టిన సొమ్ములు లేదా సరకులు ఇవ్వాలని అతడి కుటుంబ సభ్యులను కోరారు. దీనికి వారు సమాధానం చెప్పకపోగా, లక్కీ డ్రా గురించి తమకు తెలియదని, ఒత్తిడి చేస్తే కేసు పెడతామని బెదిరించినట్టు బాధితులు తెలిపారు. తాము మోసపోయామని గ్రహించిన పోతవరానికి చెందిన బాధితులు సోమవారం నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా సుమారు 1500 మంది మోసపోయినట్టు బాధితులు తెలిపారు. సుమారు రూ.6 కోట్లు నిర్వాహకులు వసూలు చేసి, మోసం చేసినట్టు లబ్ధిదారులు వివరించారు. నిర్వాహకుల్లో ఒకరు మృతి చెందినప్పటికీ మిగిలిన నిర్వాహకులు సొమ్ము చెల్లించడానికి ముఖం చాటేశారని బాధితులు వాపోతున్నారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను బాధితులు కోరారు. -
కాసులకు కక్కుర్తిపఢీ
సాక్షి, అమలాపురం: అఖండ గోదావరితో పాటు ఏలేరు.. పంపా.. తాండవ నదీ పాయల మధ్య దొరికే ఇసుక, లంకల్లోని మట్టి.. మెట్ట ప్రాంతంలోని తూర్పు కనుమల్లో లభ్యమయ్యే బ్లాక్ మెటల్.. రెడ్ గ్రావెల్ ప్రభుత్వానికి ఆదాయం అందించడంతో పాటు అక్రమార్కులకు అక్షయపాత్రలుగా మారాయి. వీటి రవాణా సామాన్యులకు ప్రాణసంకటంగా పరిణమించింది. అనుమతి ఉన్న ర్యాంపుల నుంచే కాకుండా, అక్రమ తవ్వకాల ప్రాంతాల నుంచి ఇసుక, గ్రావెల్, మట్టి తరలింపు సమయంలో టిప్పర్లు, క్వారీ లారీలు, ట్రాక్టర్లు వేగంగా వెళ్లి ఢీకొనడంతో పలువురు మృత్యువాత పడుతున్నారు. అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం సామాన్యుల ప్రాణాలను బలిగొంటోంది. ట్రిప్పులు ఎక్కువ వేస్తే సొమ్ము ఎక్కువగా వస్తుందనే అత్యాశ.. పలువురి ప్రాణాలను మింగేస్తోంది. ఇలా అనేక ప్రమాదాల్లో మృతువాత పడినవారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. అక్రమ ఇసుక, మట్టి రవాణా కోసం అర్ధరాత్రి రోడ్డెక్కుతున్న టిప్పర్లు, లారీల వల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారం వారం పెను విషాదాలకు కారణమవుతున్నాయి. రహదారుల్లో రక్తసిక్తం ● అయినవిల్లి మండలం చింతనలంక గ్రామానికి చెందిన విళ్ల గీతారాణి (24) గత నెల రెండో తేదీ తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో చనిపోయింది. తన తండ్రితో కలసి వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతున్న సమయంలో అతివేగంగా వస్తున్న టిప్పర్ వెనుక నుంచి ఢీకొంది. టిప్పర్ ఆమెను 30 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. తండ్రి వీర్రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలన్న ఆమె కలను కష్టపడి చదివి సాధించింది. మంచి కంపెనీలో ఉద్యోగం సైతం పొందింది. కానీ వీధి టిప్పర్ రూపంలో కాటేసింది. ● ఈ ఏడాది మార్చి 21న పి.గన్నవరంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఊడుమూడి గ్రామానికి చెందిన రైతు విళ్ల నాగేశ్వరరావు (63) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ లారీని ఆపకుండా తిరిగి లంక గ్రామంలోకి వెళ్లి మట్టిని దించి అక్కడి నుంచి పరారయ్యాడు. ● అంబాజీపేట మండలం గంగలకుర్రు వంతెన వద్ద ఈ నెల 21వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో కొర్లపాటివారిపాలేనికి చెందిన నందెపు ప్రణీత నాగ (ఫణి) మృతి చెందాడు. ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. నల్లా సుభాష్ అనే యువకుడు తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఫణి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ● అంబాజీపేట మండలం గంగలకుర్రులో గత ఏడాది ఏప్రిల్ 4న జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగిపూడి నాగరాజు అనే వ్యక్తి ఇసుక లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన అతని సోదరుడు రామచంద్రరావును ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో మృత్యువాత పడ్డారు. ● మండపేట పట్టణం ఏడిద బైపాస్ నాలుగు రోడ్ల జంక్షన్లో మే 9న టిప్పర్ ఢీకొన్న ఘటనలో పట్టణానికి చెందిన అన్నదమ్ముల కుమారులు దార్ల దుర్గాప్రసాద్ (43), దార్ల శివకుమార్ (34)లు అక్కడికక్కడే మృతి చెందారు. ● కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ వద్ద గత నెల 16న టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు ఉపాధి కూలీలు మృతి చెందారు. ● కోరుకొండలో గత నెల 18న మట్టి లోడు టిప్పర్ ఢీకొన్న ఘటనలో నొక్కి రాజీవర్మ (27) మృత్యువాత పడ్డాడు. ప్రమాదాలు.. ఇవే కారణాలు లారీ డ్రైవర్ రోజుకు 24 గంటల పాటు నిరాటంకంగా విధులు నిర్వహించాలి. రోజుకు రూ.వెయ్యి జీతం, అదనంగా రూ.ఐదు వందల బేటా. స్థానికంగా అయితే రోజుకు పది ట్రిప్పులు. దూరమైతే ఐదు ట్రిప్పులు వేస్తున్నారు. ఇసుక కొనుగోలు చేసేవారు ట్రిప్పునకు రూ.రెండు వందల వరకు అదనంగా ఇస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు బేటాలకు ఆశపడి అదనపు ట్రిప్పులే వేస్తే కొనుగోలుదారులు మరో రూ.రెండు వందలు, యజమానులు కూడా అదనంగా బేటా ఇస్తారనే అత్యాశతో మితిమీరిన వేగంతో లారీలు, టిప్పర్లు నడుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అనుభవం ఉన్న డ్రైవర్లను పెద్ద నిర్మాణ సంస్థలు అధిక జీతాలతో నెలల తరబడి ఉద్యోగాలకు తీసుకుంటున్నారు. దీంతో డ్రైవర్ల కొరత ఏర్పడింది. ఇసుక, గ్రావెల్ వాహనాలు నడుపుతున్న వారిలో చిన్న వయసు వారే ఎక్కువ. వయసులో ఉండే అతి ఉత్సాహం, వేగ నియంత్రణ లేకపోవడం ప్రమాదాలకు దారితీస్తోంది. సగం మందికి డ్రైవింగ్ లైసెన్సులు కూడా లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 24 గంటల పాటు ఏకధాటిగా పని. పైగా ఈ సీజన్లో ఓవర్ టైమ్ కూడా చేస్తున్నారు. దీంతో నిద్ర ఉండడం లేదు. పైగా మ ద్యం, ఇతర వ్యసనాలతో వారు టిప్పర్లు, లారీలను నడపడంతో నియంత్రణ కోల్పోతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పరీక్షకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
వ్యక్తి మృతి, యువతికి తీవ్ర గాయాలు కాజులూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసుల కథనం ప్రకారం.. పాతర్లగడ్డకు చెందిన పెండుం సుధీర్కుమార్ (30) తన సమీప బంధువైన మాదుర శ్రీవల్లిని తన బైక్పై రాజమహేంద్రవరంలో నీట్ రాసేందుకు తీసుకువెళ్లాడు. తిరిగి తీసుకువస్తుండగా, గొల్లపాలెం తిరుమల ఫంక్షన్ హాల్ వద్ద మలుపులో కాకినాడ వైపు నుంచి ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో సుధీర్కుమార్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందగా వెనుక కూర్చున్న మాదుర శ్రీవల్లికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రురాలు శ్రీవల్లిని గొల్లపాలెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులను చూసి పారిపోతూ బుక్కయ్యారు
రాజానగరం: పోలీసులను చూసి భయపడి పారిపోతూ, ఇద్దరు పాత నేరస్తులు దొరికారు. దీనికి సంబంధించి ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో నార్త్జోన్ డీఎస్పీ జీవన విలేకరుల సమావేశం నిర్వహించారు. కొంతమూరుకు చెందిన పసల బేబి ఏప్రిల్ 13న సాయంత్రం రాజమహేంద్రవరం నుంచి గండేపల్లి మండలం మురారికి ఆటోలో పయనమైంది. దివాన్చెరువులో అదే ఆటో ఎక్కిన ఇద్దరు మహిళలు ఆమెతో మాటామాటా కలిపి, బ్యాగులో ఉన్న రూ. 4.85 లక్షల విలువ చేసే బంగారు నగలు, వెండి వస్తువులను కాజేశారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు సీఐ వీరయ్యగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ఉదయం కొంతమూరులో వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి, గోకవరం నుంచి రాజమహేంద్రవరం వస్తున్న ఆటోలోని అంబటి జ్యోతి, నాగెళ్ల దుర్గ పారిపోయే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకుని తమదైన తరహాలో విచారించారు. పసల బేబి నుంచి బంగారు నగలు, వెండి వస్తువులు అపహరించింది తామేనని వారు అంగీకరించారు. జ్యోతి, దుర్గ నుంచి 176.470 గ్రాముల బంగారు నగలు, 197.300 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. ఆటోలు, బస్సుల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను లూటీ చేయడంలో ఆరి తేరిన ఈ మహిళలపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఇద్దరు పాత నేరస్తుల అరెస్ట్ -
గొల్లపల్లి ఇంట విషాదం
రావులపాలెం: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు ఇంట విషాదం నెలకొంది. సూర్యారావుకు ఇద్దరు కుమారులు కాగా, ఇందులో రెండో కుమారుడు ప్రసాద్ (45) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. దీర్ఘకాలిక అనారోగ్యానికి గురైన ప్రసాద్ రావులపాలెంలోని తన ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతి చెందారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చిన్న కుమారుడు గొల్లపల్లి ప్రసాద్ మృతి అత్యంత విషాదకరమని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంటనే జగ్గిరెడ్డి రావులపాలెంలో గొల్లపల్లి సూర్యారావు నివాసానికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రసాద్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జగ్గిరెడ్డి వెంట గ్రామ పార్టీ అధ్యక్షుడు కర్రి అశోక్రెడ్డి తదితరులు ఉన్నారు. నేతల సంతాపం గొల్లపల్లి సూర్యారావును పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శించి, సంతాపం తెలిపారు. ఇందులో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్రాజు, రావులపాలెం జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, మాజీ ఎంపీటీసీ జవ్వాది రవిబాబు తదితరులు ఉన్నారు.చిన్న కుమారుడి మృతి -
కాలిపోయిన కోళ్ల వ్యాన్
చింతూరు: రహదారి పక్కన ఆపిన కోళ్ల వ్యాన్ ఒక్కసారిగా కాలిపోయింది. ఈ సంఘటన చింతూరు కాటుకపల్లి వద్ద జాతీయ రహదారి–30పై ఆదివారం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చింతూరులోని కోళ్ల వ్యాపారి శ్రీనుకు చెందిన వ్యాన్ కోళ్లు తీసుకువచ్చే నిమిత్తం తెలంగాణలోని సత్తుపల్లికి బయలుదేరింది. ఈ క్రమంలో కాటుకపల్లి వద్ద వాటర్ బాటిల్ కొనేందుకు డ్రైవర్ వ్యాన్ను ఆపి పక్కనే ఉన్న షాపు వద్దకు వెళ్లగా, వ్యాన్ ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. దేవరపల్లిలో లారీ.. దేవరపల్లి: కడియం నుంచి రాజస్థాన్కు మొక్కలను తరలిస్తున్న లారీలో 16వ నంబరు జాతీయ రహదారిపై దేవరపల్లి వద్ద మంటలు రేగాయి. లారీ క్యాబిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. దీనిని గమనించిన డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలుపుదల చేసి కిందకు దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. హైవే పోలీసులు, అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వగా, సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దేవరపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
ప్రశాంతంగా నీట్
21ఆర్జేసీ361–270096 కలెక్టర్ కీర్తికలెక్టర్ కీర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ కీర్తి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష నిర్వహణకు అన్ని కేంద్రాల్లో పటిష్ఠ ఏర్పాట్లు చేసి, బయోమెట్రిక్ నమోదు, సీసీ కెమెరాలు, జామర్లు, భద్రతా చర్యలను సమర్ధంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాల్లో 3,363 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, 3,066 మంది హాజరయ్యారని, 297 మంది గైర్హాజరయ్యారని ఆమె తెలిపారు. మొత్తం హాజరు శాతం 91.17 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. పరీక్ష నిర్వహణలో సహకరించిన అన్ని శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. కేంద్రాల వారీగా హాజరు ఇలా.. ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 576 మందికి 526 మంది హాజరైయ్యారన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల (అటానమస్)లో 507 మందికి 457, నన్నయ వర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 504 మందికి 460, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో 240 మందికి గాను 225, కేంద్రీయ విద్యాలయ, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్లో 360 మందికి 328, ఎస్కేవీటీ ఈఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 360 మందికి 329, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 288 మందికి 261, దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 264 మందికి 244, నెహ్రూనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 264 మందికి 236 మంది హాజరైనట్టు తెలిపారు. -
సత్యదేవుని ధ్వజస్తంభంపై ఒరిగిన సుదర్శన చక్రం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ధ్వజస్తంభం మీది సుదర్శన చక్రం ఇటీవల ఈదురు గాలులకు ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో, ఆ చక్రాన్ని ఈ నెల 24న కిందకు దించి, ఆలయంలో భద్రపరచి, 25వ తేదీ ఉదయం సంప్రోక్షణ నిర్వహించి, తిరిగి పండితుల మంత్రోచ్చారణల నడుమ దానిని ధ్వజస్తంభంపై అమర్చనున్నట్లు అధికారులు తెలిపారు. సత్యదేవుని ఆలయంలో పాత ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరడంతో.. 2024 మే నెలలో కొత్తది ప్రతిష్ఠించారు. దీనికి బంగారు రేకును అదే ఏడాది ఆగస్టులో అమర్చారు. ఆ సమయంలోనే స్వర్ణ సుదర్శన చక్రాన్ని కూడా కలశలతో పాటు ధ్వజస్తంభంపై అమర్చారు. గత వారం భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలకు ఈ సుదర్శన చక్రం ఉత్తరం వైపు ఒరిగిపోయింది. ఈ విషయాన్ని అధికారులు ఈ నెల 16వ తేదీన గుర్తించి, దేవస్థానం ఆగమ పండితుల కమిటీతో చర్చించారు. వారి సూచన మేరకు ఆ చక్రానికి సంప్రోక్షణ చేయాలని నిర్ణయించారు. -
యూరియా బస్తాల చోరీకి యత్నం
● రైలు బోగీ నుంచి దించిన దుండగులు ● సంచలనం రేపిన ఘటన సామర్లకోట: రైలు బోగీలో యూరియా బస్తాల చోరీకి ప్రయత్నించిన సంఘటన ఇది. కాకినాడ నుంచి విశాఖపట్నంకు గూడ్స్ బోగీలో యూరియా బస్తాలు వెళుతున్నాయి. సామర్లకోట మండలం ఉండూరు రైల్వే గేటు వద్దకు వచ్చిన తరువాత బైపాస్ కేబిన్ వద్ద గూడ్స్ రైళ్లు విశాఖపట్నం వెళ్లడానికి సిగ్నల్ కోసం ఆగుతుంటాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం కాకినాడ నుంచి విశాఖపట్నం వెళుతున్న గూడ్స్ రైలు ఉండూరు రైల్వే గేటు దాటిన తరువాత సిగ్నల్ కోసం ఆగింది. ఈ క్రమంలో కొంత మంది దుండగులు రైలు బోగీ తాళం పగలు కొట్టి బోగీలో ఉన్న యూరియా బస్తాలను పొలాల వైపు దింపారు. ఇంజిన్ నుంచి మూడో బోగీలో ఈ చోరీ జరగడంతో శబ్దంతో పాటు కొంత మంది మనుషులు సంచరిస్తున్న విషయాన్ని సిబ్బంది గమనించి వెంటనే రైల్వే మేనేజరు ఎం.రమేష్కు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని వెంటనే ఐఆర్ఎంకు తెలియజేశారు. దాంతో స్థానిక ఆర్పీఎఫ్ అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని యూరియా బస్తాలు బోగీ నుంచి పొలాల్లోకి దింపిన విషయాన్ని గమనించారు. రైల్వే అధికారులు వస్తున్న విషయాన్ని గుర్తించిన దుండగులు పరారయ్యారు. పొలాల్లో దింపిన సుమారు 60 యూరియా బస్తాలను ఆర్పీఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకుని ఆర్పీఎఫ్ సీఐ మధు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిగిలిన యూరియా బస్తాలతో రైలు బోగీకి సీల్ వేసి గూడ్స్ రైలును పంపామని రైల్వే మేనేజర్ రమేష్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
24 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్
25 నుంచి సర్టిఫికెట్లు పరిశీలన రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైందని జిల్లా పాలిసెట్ కన్వీనర్, బొమ్మూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ అక్కుల మురళి తెలిపారు. ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ సర్టిఫికెట్ల పరిశీలన, ఫీజు పేమెంట్, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ నెల 25 నుంచి జూలై ఒకటో తేదీ వరకు విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తామన్నారు. ఇందుకోసం బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. షెడ్యూల్లో ప్రకటించిన ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు నిర్వహించే ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు విద్యార్థులు వారి ర్యాంకుల ప్రకారం హాజరుకావాలని సూచించారు. విద్యార్థులకు సూచనలివీ... ● విద్యార్థులు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఓసీ, బీసీలకు రూ.700, ఎస్సీ, ఎస్టీలకు రూ.250గా నిర్ణయించారు. ● ప్రాసెసింగ్ ఫీజు రసీదుతో పాటు, పాలిసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఎస్ఎస్సీ హాల్ టికెట్, ర్యాంకు కార్డు, ఎస్ఎస్సీ మార్కుల మెమో ఒరిజినల్ లేదా ఇంటర్నెట్ కాపీని కౌన్సెలింగ్కు తీసుకురావాలి. ● 4–10 తరగతుల స్టడీ సర్టిఫికెట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువపత్రం, కులధ్రువీకరణపత్రం, టీసీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుంది. ● ఓసీ అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2026–27 మీసేవలో తీసుకున్నది మాత్రమే ఈడబ్ల్యూఎస్ కేటగిరి వర్తిస్తుంది. ● ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు(ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సీఏపీ, పిడబ్ల్యూడీ, స్కౌట్స్ అండ్ గైడ్స్) విజయవాడలో బెంజిసర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు ఈ నెల 29, 30 తేదీల్లో హాజరుకావాల్సి ఉంటుంది. 29 నుంచి ఆప్షన్ల ఎంపిక ఈ నెల 29 నుంచి జూలై 3 వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. జూలై 4న ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఇస్తారు. జూలై 6న కళాశాలల్లో సీట్ల కేటాయింపు ఉంటుందని జిల్లా కన్వీనర్ మురళి వెల్లడించారు. మరిన్ని వివరాలకు హెచ్టిటిపిఎస్://ఏపీపీవోఎల్వైసీఈటీ.ఎన్ఐసి.ఇన్ ను సందర్శించవచ్చన్నారు. ర్యాంకులు వారీగా షెడ్యూల్ ఇదీ... తేదీ ర్యాంకులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నాం 1 గంట నుంచి జూన్ 25 1–10,000 10,001–20,000 26 21,001–31,000 31,001–42,000 27 42,001–54,000 54,001–65,000 28 65,001–77,000 77,001–88,000 29 88,001–99,000 99,001–1,10,000 30 1,10,001 నుంచి 1,20,000 1,20,001–1,30,000 జూలై 1 1,30,001 నుంచి 1,40,000 1,40,001 నుంచి చివరి వరకు విజయవాడలో ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్లు పరిశీలన ఇలా .. తేదీ కేటగిరీ ర్యాంకులవారీగా జూన్ 29 ఎన్సీసీ, సీఏపీ 1–60,000 ఆంగ్లో ఇండియన్, పీడబ్ల్యూడీ 1నుంచి చివరిర్యాంకు వరకు జూన్ 30 సీఏపీ, ఎన్సీసీ 60,001 నుంచి చివరిర్యాంకువరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ 1నుంచి చివరిర్యాంకువరకు -
లారీ ఢీకొని బాలుడి మృతి
అంబాజీపేట: ఇప్పుడే వస్తానంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన తమ కుమారుడు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గంగలకుర్రు – మొసలపల్లి రహదారిలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మొసలపల్లి టర్ఫ్ (వంతెన)కు కూతవేటు దూరంలో అంబాజీపేట కొర్లపాటివారిపాలేనికి చెందిన నందెపు ప్రణీత్ నాగ (ఫణి) (14), నల్లా సుభాష్లు యాక్టీవా స్కూటర్పై గంగలకుర్రు నుంచి అంబాజీపేట వైపు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పుల్లేటికుర్రు నుంచి గంగలకుర్రు వైపు వెళుతున్న ఇసుక లారీ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొంది. దాంతో ప్రణీత్ నాగ అక్కడికక్కడే మృతి చెందగా, సుభాష్కు తీవ్రగాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. మృతుడికు తల్లి, తండ్రి, అక్క ఉన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటి వరకూ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన ప్రణీత్ నాగ కొద్ది క్షణాలకే ఇలా కావడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన పలువురిని కలచివేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న బాలుడి తండ్రి, రామకృష్ణ, చిన్నాన్న రాజులు విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బయటకు వెళ్లి వస్తానని చెప్పిన కొద్ది క్షణాలకే నీవు లేవన్న మాట జీర్ణించుకోలేకపోతున్నామని బోరున విలపించారు. మృతుడు స్థానిక స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.మరొకరికి తీవ్ర గాయాలు -
ప్రశాంతంగా ‘నీట్’
90.02 శాతం హాజరు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 11 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 3,232 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,922 హాజరయ్యారు. ప్రశ్నపత్రం లీకవడంతో గత మే నెలలో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకూ ఈ పరీక్షమరోసారి నిర్వహించారు. స్థానిక గాంధీనగర్ మున్సిపల్ స్కూల్, జేఎన్టీయూకేలోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగిందని అన్నారు. మొత్తం 90.02 శాతం విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానానికి ఆదివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 32 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,61,690, పూజా టికెట్లకు రూ.4,65,646, కేశఖండన శాలకు రూ.20,880, వాహన పూజలకు రూ.7,416, కాటేజీలు. పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.98,430, విరాళాలు రూ.10,602 కలిపి మొత్తం రూ.8,89,014 ఆదాయం లభించిందని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. స్వగ్రామంలో ‘పెద్ది’ దర్శకుడి సందడి కొత్తపల్లి: ఉప్పెన, పెద్ది చిత్రాల దర్శకుడు సానా బుచ్చిబాబు ఆదివారం స్వగ్రామం కొత్తపల్లి వచ్చారు. తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలసి కేక్ కట్ చేసి, పెద్ది సినిమా విజయానందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి పలు విషయాలపై ఆయన ముచ్చటించారు. పెద్ది సినిమా తన జీవితంలో మరపురాని విజయాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించడానికి ప్రేరణ కలిగించిందన్నారు. త్వరలో మరో మంచి చిత్రానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. -
కూటమిలో విపొత్తు!
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026● నిడదవోలులో కొనసాగుతున్న విభేదాలు ● రేండేళ్ల వియోత్సవానికి టీడీపీ డుమ్మా ● టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తి నిడదవోలు: నియోజకవర్గ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పట్టణంలో లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సీటు జనసేన అభ్యర్థికి కేటాయించినప్పటి నుంచి వారి విభేదాలు నేటికీ కొనసాగుతున్నాయి. టీడీపీ నేతలు సిఫారసు చేస్తున్న పనులకు కనీసం రూ.లక్ష కూడా కేటాయించకపోవడం, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం ఇవ్వకపోవడం సహజమైపోయింది. కూటమి విజయోత్సవాల్లో సైతం మాజీ ఎమ్మెల్యే శేషారావుతో పాటు టీడీపీ వారు హాజరుకాకపోవడంతో నియోజకవర్గంలో అసలు పొత్తు ధర్మం పాటిస్తున్నారా లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించిన వత్రోత్సవాలకు శేషారావుతో పాటు టీడీపీ ముఖ్య నేతలు హాజరుకాకపోవడం గమనార్హం. పట్టణంలోని పాటిమీద సెంటర్లో అన్న క్యాంటిన్ పునఃప్రారంభానికి సైతం ఆ వర్గీయులు డుమ్మా కొట్టారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాత్రం మూడు పార్టీలు ఎప్పటికీ కలిసే ఉంటాయని ప్రచారం చేసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలతో మొదలై.. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేనకు ఈ సీటు కేటాయించినప్పుడే టీడీపీ, జనసేన మధ్య గొడవలు మొదలయ్యాయి. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని అప్పట్లో మాజీ ఎమ్మెల్యే బూరుగు పల్లి శేషారావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళనలు, నిరసన ర్యాలీలు నిర్వహించారు. అప్పటికి ఏదో సర్దుబాటు జరిగినా ఆనక దుర్గేష్ గెలిచి మంత్రి పదవి వచ్చాకా కూడా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. జనసేన వైఖరిపై ఆగ్రహించిన టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు తన పదవికి సైతం రాజీనామా చేశారు. అధిష్టానం జోక్యంతో ఆయన తిరిగి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.. కోటసత్తెమ్మ ఆలయ ట్రస్టు బోర్డుపై ప్రభావం టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గపోరుతో పాటు సమన్వయ లోపంతో రాష్ట్రంలోనే పేరుగాంచిన కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయ ట్రస్టుబోర్డు నియామకం చేపట్టకపోవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు కుర్చుని పరిష్కరించుకునే సమస్యలు సైతం పెండింగ్లో ఉంటున్నాయి. 2024 డిసెంబర్లో ఆలయ ట్రస్టు బోర్డు పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి కూటమి అధికారం చేపట్టి రెండేళ్లైనా ఆలయ ట్రస్టు బోర్డును నియమించకపోవడంతో ఇరు పార్టీల్లో ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కుమ్ములాటల్లో ఆలయాన్ని గాలికి వదిలేశారనేంత వరకు విమర్శిస్తున్నారు. మరోసారి నేనే పోటీ చేస్తా.. పట్టణంలో లయన్స్ ఆడిటోరియంలో నిర్వహించిన రెండేళ్ల విజయోత్సవ సభలో మంత్రి కందుల దుర్గేష్ ఆశక్తికరమైన వ్యాఖ్యాలు చేశారు. వచ్చె రెండు పర్యాయాలు కూడా నేను నిడదవోలు నుంచి పోటీ చేస్తాననడం మళ్లీ చర్చనీయాంశమైంది. కందుల దుర్గేష్ వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుండి పోటీ చేస్తారనే ప్రచారానికి ఆయన తెర దించడంతో టీడీపీలో అంతర్మధనం ప్రారంభమైందని జనసేన నేతలు బాహాటంగానే చెప్తున్నారు. శేషారావు ఫ్లెక్సీల తొలగింపుతో.. మంత్రి దుర్గేష్ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో భాగంగా కూటమిలో ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. జనసేన నేతలు పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఉన్న శేషారావు ఫ్లెక్సీలను తొలగించారు. ఇది మళ్లీ వారి మధ్య తీవ్ర వివాదం సృష్టించింది. పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమ్మిన వెంక టేశ్వరరావు పార్టీ కార్యకర్తలతో కలసి శేషారావు చిత్రంతో ఉన్న ఫ్లెక్సీలతో ఓవర్ బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది తొలగించిన శేషారావు చిత్రపటాలను గోదావరి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో పడవేసి నిరసన తెలపడం దుమారం రేపింది. -
పిచ్చుక ఆకట్టుకుంది!
నాలుగు గోడలు లేక పోయినా కోట కంటే గొప్పదది.. గడ్డి పోచల అమరికలతో అందమైన గూడు అది. చలిగాలులను తట్టుకునే ఆనంద నిలయమది.. పిచ్చుకలు తమ ఇంజినీరింగ్ ప్లాన్తో నిర్మించుకున్న కట్టడమది. ఈ చిత్రం కిర్లంపూడి నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారి పక్క పొలం వద్ద ఆకట్టుకుంది. ఇక్కడి హై టెన్షన్ స్తంభం వద్ద అమర్చిన రక్షణ తీగలపై ఇలా వరుసగా పిచ్చుకలు గూళ్లు నిర్మించుకున్నాయి. అడపాదడపా వర్షాలు కురుస్తుండడంతో ఈ గూళ్లను నిర్మించుకుని, తమ పిల్లలను సాకుతున్నాయి. – కిర్లంపూడి -
థార్ దొంగల సంచారం
పెరవలి (కొవ్వూరు): కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో మధ్యప్రదేశ్లో థార్ ప్రాంతానికి చెందిన దొంగల ముఠా సంచరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టౌన్ సీఐ పి.విశ్వం తెలిపారు. దొంగలు చూస్తుండగానే మెడలో చైన్లు, బొందులు వంటివి లాక్కుని వెళ్లిపోతారని, తాళాలు వేసిన ఇళ్లు లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడతారని వివరించారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా దొంగల ఫొటోలను ఆయన విడుదల చేశారు. పిడుగు పడి పాడి గేదెల మృతికాట్రేనికోన: పిడుగు పాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఆ వివరాల్లోకి వెళ్తే.. కందికుప్పకు చెందిన కూరాకుల మల్లేశ్వరరావుకు రెండు గేదెలు ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఆదాయంతో అతను జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడడంతో ఆ రెండు గేదెలు మృతి చెందాడు. దీంతో అతను కన్నీరు మున్నీరయ్యారు. అధికారులు స్పందించి తనను ఆదుకోవాలని మల్లేశ్వరరావు కోరారు. వేళంగిలో చైన్ స్నాచింగ్కరప: ఉదయాన్నే తుడిచిన చెత్తను పారబోయడానికి బయటకెళ్లిన మహిళ మెడలోని పుస్తెల తాడును అపహరించుకుపోయిన ఘటన కరప మండలం వేళంగిలో జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. వేళంగి శివారు దళమ్మచెరువు గట్టుకు చెందిన వాసంశెట్టి నాగవరలక్ష్మి ఆదివారం ఉదయం 5 గంటలకు ఇంట్లోని చెత్తను ఊడ్చి, రోడ్డుపక్క వేయడానికి వెళ్లింది. ఆ సమయంలో మోటార్సైకిల్పై అటుగా వెళుతున్న ముగ్గురు వ్యక్తులు నాగవరలక్ష్మి మెడలోని పుస్తెలతాడును తెంచుకుని, ఆమెను పక్కనే ఉన్న కంకర గుట్టపైకి తోసేసి పరారయ్యారు. పసుపుతాడుకు ఉన్న 8 గ్రాముల శతమానాలు చోరీకి గురైనట్టు బాధితురాలు కరప పోలీసులకు ఫోన్చేసి, సమాచారం అందించారు. కరప ఎస్ఐ టి.సునీత సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. కేసు వెనక్కి తీసుకోవాలని భర్త బెదిరింపుఅమలాపురం టౌన్: తనపై పెట్టిన పోలీస్ కేసును వెనక్కి తీసుకోకపోతే చంపుతానని ఓ భర్త తన భార్యను బెదిరించిన ఘటనపై అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు కథనం ప్రకారం.. అల్లవరం ఎస్బీఐ బ్రాంచ్లో మట్టపర్తి సందీప్ ఉద్యోగి. గతంలో తన భార్య ఫిర్యాదుపై కోర్టులో ఇద్దరి మధ్య కేసు నడుస్తోంది. అప్పటి నుంచి భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. తన భార్య తల్లి (సందీప్ అత్త) మోటారు సైకిల్పై ఆదివారం వెళుతుండగా, ఆమెను సందీప్ ఫాలో అయ్యాడని ఎస్సై తెలిపారు. అమలాపురం నుంచి కొమరిగిరిపట్నం వెళ్లే మార్గంలో పేరూరు వై.జంక్షన్ వద్ద తన అత్త, భార్యను ఆపి సందీప్ బెదిరించాడన్నది అభియోగం. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై సందీప్పై కేసు నమోదు చేసి పట్టణ సీఐ పి.వీరబాబు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
అంతకుమించి..!
దిగబడిన ఊక లారీకాజులూరు: మూతికి మించిన ముద్ద.. వాహనానికి మించిన ఓవర్ లోడ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపై అధిక వేగంతో ఊక లారీలు యథేచ్ఛగా తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై వెళ్లే జనం ప్రాణాలతో చెలగాటంలా మారింది. భారీ భారం.. ఆపై ఊక కారణంగా ఇబ్బంది తెచ్చిపెడుతోంది. అయినా రవాణా శాఖ కళ్లప్పగించి చూస్తోంది. కాజులూరు నియోజకవర్గంలోని కాకినాడ, కోటిపల్లి ప్రధాన రహదారిలో ఊక లారీలు, ట్రాక్టర్ల రాకపోకలతో ఇబ్బంది ఎదురవుతోంది. వాహనానికి ఇరుపక్కలా లోడు వేయడంతో రహదారిని మొత్తం ఆక్రమిస్తోంది. దీనివల్ల ఎదురుగా వచ్చే, పక్క నుంచి వెళ్లే వాహనాలకు దారి ఉండడం లేదు. గతంలో రాత్రి సమయాల్లో రాకపోకలు సాగించే ఈ ఊక లారీలు, ట్రాక్టర్లు ఇటీవల పగలూ యథేచ్ఛగా తిరుగుతున్నాయి. కాజులూరు మండలంలోని దుగ్గుదుర్రు, జగన్నాథగిరి, ద్రాక్షారామ పరిసర గ్రామాల్లోని రైస్మిల్లుల నుంచి ఇటుక బట్టీలకు ఊక, బూడిద రవాణా జరుగుతోంది. లారీ, ట్రాక్టర్ వంటి వాహనాలకు ఇరువైపులా బరకాలు కట్టి ఊక, కాలిన బుడిద లోడు చేయడం వల్ల వాహనం సైజు భారీగా మారి, రోడ్డును ఆక్రమిస్తోంది. ఈ వాహనాలు వేగంగా వెళ్లే సమయాల్లో ఊక, బూడిద ఎగిరి వెనుక వచ్చే వాహనదారుల కళ్లలో పడుతుంది. ఇలా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ వాహనాలు రోడ్డుపై ప్రయాణించే సమయంలో పైన విద్యుత్ తీగలకు తగులుకుని మంటలు రావడం, లేకుంటే వాహనాలు మలుపులు తిరగలేక విద్యుత్ స్తంభాలను ఢీకొనడం తరచూ జరుగుతున్నాయి. గతంలో కాజులూరులో రోడ్డుపై వెళ్తున్న ఊక ట్రాక్టరుకు పైన విద్యుత్ తీగలు తగులుకుని మంటలు సంభవించగా, స్థానికులు గమనించి సకాలంలో ఆర్పివేశారు. ఇటీవల కోలంకలో యానం, ద్వారపూడి రహదారిపై ఊక ట్రాక్టర్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, అది విరిగి ముక్కలై నేలపై పడింది. ఆ సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులకు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. అధికారుల కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆలమూరు: కొత్తూరు –వెదురుమూడి రోడ్డులోని పెదపళ్లలో ఆదివారం ఊక లారీ రోడ్డుపై దిగబడింది. అసలే ఇరుకు రోడ్డు కావడంతో పాటు భారీ వర్షం పడడంతో బెర్ములు పూర్తిగా ధ్వంసం కావడంతో ఈ పరిస్థితి వచ్చింది. దీంతో ఇరువైపులా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఐదు దశాబ్దాలుగా ఈ రోడ్డు విస్తరణ జరగకపోవడంతో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ వల్ల ఏదో ఒకచోట ట్రాఫిక్కు అంతరాయం కలగడం లేదా ప్రమాదాలు జరగడం నిత్యకృత్యమైంది. ఇబ్బంది పడుతున్నాం ఊక, బూడిద లోడు చేసిన వాహనాలు రోడ్లపై వేగంగా వెళ్లే సమయాల్లో ఇబ్బందిగా ఉంటోంది. ఆ ఊక, బూడిద ఎగిరి వచ్చి వెనుక వచ్చే వాహనదారుల కళ్లలో పడుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొని ప్రమాదాల బారిన పడుతున్నాం. – నల్లమిల్లి శ్రీవిష్ణురెడ్డి, ప్రయాణికుడు, మొగలిపాలెం రోడ్డును ఆక్రమించేసి.. లారీ, ట్రాక్టర్ వంటి వాహనాలకు ఇరువైపులా బరకాలు కట్టి ఊక, కాలిన బుడిద లోడ్ చేస్తున్నారు. వాహనం సైజు భారీగా మారి రోడ్డు ఆక్రమిస్తుంది. ఇవి ముందు వెళ్తుంటే ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. వీటిని తప్పించుకుని వెళ్లే సమయంలో అనేక మంది ప్రమాదాల పాలయ్యారు. – రాయుడు నూకరాజు, గొల్లపాలెం వాహనాల సామర్థ్యానికి మించి లోడు అధిక లోడుతో ఊక, బూడిద లారీల పయనం రోడ్లను ఆక్రమిస్తుండడంతో ప్రయాణం నరకం -
యోగక్షేమం ఇదేనా!
ఫ యోగాపై ప్రచారానికే ప్రభుత్వం పెద్దపీట ఫ కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రూ.కోట్ల ఖర్చు ఫ ఆనక ఆ ఊసెత్తని వైనం ఫ నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం కపిలేశ్వరపురం: గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సాటి ఎవరూ రారు. యోగాంధ్ర 2025 పేరుతో గతేడాది జూన్లో ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు సుమారు రూ.350 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. రాష్ట్రంలో 3,03,654 మందితో విశాఖ తీరాన యోగాసనాలు వేయించి గిన్నిస్ బుక్ సంస్థ నుంచి ప్రపంచ రికార్డు పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుకుంది. 22,122 మంది గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు చేసిన సూర్య నమస్కారాలతో రెండో గిన్నిస్ రికార్డు దక్కింది. 61,266 పాఠశాలల్లో యోగాంధ్ర నిర్వహించినట్టు సమగ్ర శిక్షా ఏఎస్పీడీ శ్రీనివాసరావు గతేడాది ప్రకటించారు. అప్పుడు మాత్రమే చెప్పిన ఈ లెక్కలు అంతకు ముందూ లేవు, ఇప్పుడూ లేవు. యోగా కేవలం ప్రచార ఆయుధం మాత్రమే అన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పురాతన కాలం నుంచీ యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. దాని ప్రాశస్త్యాన్ని ప్రచారం చేయడమే జీవిత లక్ష్యంగా అనేక సంస్థలు, వ్యక్తులు ఎలాంటి ప్రచారాన్ని కోరుకోకుండా యోగా కోసం పాటుపడుతున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నం యోగా డే నెలలో మాత్రమే ఆర్భాటం చేస్తుంది. ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు గతేడాది విశాఖలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని నిర్వహించిందన్న వాదన ఉంది. జిల్లాలో సుమారు రూ.కోటి పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. సకల సమస్యలకు యోగానే మందు అనే రీతిలో చంద్రబాబు ఉపన్యాసాల్లో చెప్పారు. జిల్లాలో 8,72,916 మంది యోగా చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు, వారికి యోగా శిక్షకులను కేటాయిస్తూ మ్యాపింగ్ చేసినట్టు, 4,600 ప్రాంతాల్లో యోగా శిబిరాలను నిర్వహించినట్టు గతేడాది ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది. రాజమహేంద్రవరంలోని గ్రాండ్ ట్రంక్ రోడ్డులో 2 కిలోమీటర్ల మేర ప్రాంతంలో యోగాసనాలు చేయించింది. పాలన, ఇతర ప్రజావసరాలను పక్కన పెట్టి నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే సిబ్బంది కార్యాలయాల్లో కూర్చుని యోగా చేసుకునేందుకు అంగీకరిస్తున్నానంటూ ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్లు చేసేశారు. మీ విజ్ఞప్తి మేరకు పలానా చోట యోగా చేసేందుకు అనుమతిస్తున్నామంటూ ప్రజలకు మెస్సేజ్ రావడాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. విశాఖకు జనాన్ని తరలించేందుకు జిల్లాలోని విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. దూరాన ఉన్న విశాఖకు వెళ్లేందుకు అర్ధరాత్రి 12 గంటలకే బస్సుల్లోకి ఎక్కించారు. కార్యక్రమం పూర్తయ్యాక అందిస్తామన్న ఆహార ప్యాకెట్లు అందక ఆకలితో అలమటించిన వారెందరో ఉన్నారు. ఆ రోజు గడిచాక నేటి వరకూ యోగాపై తీసుకున్న చర్యలేవీ లేవు. ఈ ఏడాది జిల్లాలో కార్యక్రమాలు ఇలా.. జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ, ఆయుష్ సంస్థ, పర్యాటక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో యోగాంధ్ర–2026ను నిర్వహిస్తున్నాయి. ఈ నెల 8న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో యోగాభ్యాసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి చేకూరి, పలు ప్రభుత్వ శాఖల, నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 11న కడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, జేసీ మేఘ స్వరూప్ పాల్గొన్నారు. 14న రాజమహేంద్రవరం గౌతమీ ఘాట్ ప్రయాణ ప్రదేశంలో జిల్లా స్థాయి సామూహిక యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం యోగా దినోత్సవ జిల్లా స్థాయి కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. యోగా.. వ్యాధులను తరిమికొట్టే దివ్యౌషధం.. నిశ్చలమైన మనసుతో నిండుగా జీవించేందుకు ఓ ఆయుధం.. మన ‘యోగ’క్షేమాలకు ఇదో శక్తివంతమైన పురాతన చికిత్సా విధానం.. అలాంటి యోగాను సైతం చంద్రబాబు ప్రభుత్వం ప్రచార ఆయుధంగా మార్చుకుంది.. యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నామంటూ చెప్పుకొంటూ రూ.కోట్లు ఖర్చు చేసి, ప్రచార హంగామా చేస్తోంది.. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం..ప్రాధాన్యం ఇదీ.. ఆధునిక కాలంలో తలెత్తుతున్న రుగ్మతల నేపథ్యంలో ధ్యానం, యోగా వంటి ప్రాచీన విధానాలకు ప్రాధాన్యం పెరిగింది. యోగా అనేది సంస్కృతంలోని ‘యుజ్’ అనే పదం నుంచి వచ్చింది. ‘యుజ్’ అనే పదానికి ఐక్యం కావడమని అర్థం. మనసు, శరీరమూ ఒకదానితో మరొకటి ప్రభావితమై ఉంటాయి. ఆ రెండింటినీ ఏకం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. యోగాలోని 84 ఆసనాల్లో 32 అతి ముఖ్యమైనవి. క్రమం తప్పకుండా యోగాసనాలను వేయడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. మానసిక, శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆలోచనలను నియంత్రించుకోగలుగుతారు. సూర్య నమస్కారాల్లోని పదకొండు ఆసనాల్లో ఆరోగ్య, ఆధ్యాత్మిక అంశాలు ఒదిగి ఉంటాయి. వాటిని చేయడం ద్వారా కదలికలు ఏర్పడి శరీర అవయవాల్లోని భాగాలకు రక్త ప్రసరణ వృద్ధి చెందుతుంది. -
రైలు నుంచి జారిపడిన కష్టజీవి
కాలు తెగిపోయి రక్తస్రావమై మృతి అనపర్తి: రోజూ రైళ్లలో సమోసాలు విక్రయించుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ చిరు వ్యాపారి జీవితం విషాదాంతమైంది. అనపర్తి రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన ప్రమాదంలో అతను మృత్యువాత పడడం అందరినీ కలచివేసింది. స్థానికులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. చిరు వ్యాపారి సత్యబాబు (55) రైళ్లలో సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం రోజూ రైలు బోగీల్లో తిరుగుతూ ప్రయాణికులకు సమోసాలు విక్రయించేవాడు. అదే జీవన పోరాటం చివరకు అతని ప్రాణాలను బలిగొంది. శనివారం సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలు అనపర్తి స్టేషన్లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో సత్యబాబు రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ జారి రైల్వే ట్రాక్పై పడిపోయాడు. ప్రమాదంలో అతని కుడి కాలు తెగిపోగా తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన సత్యబాబును చూసి ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ దుర్గాభవానీ, పైలెట్ ఆనందరావులు హుటాహుటిన అతికష్టంపై సత్యబాబును ప్లాట్ఫారమ్పైకి చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రుడిని అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కారణంగా సత్యబాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శంకుస్థాపన
తుని: విద్యతో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, సంపాదన పట్ల అవగాహన ఉండాలని పతంజలి గ్రూప్ ఎండీ, పతంజలి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బాలకృష్ణ అన్నారు. తునికి వచ్చిన ఆయన పొరుగునే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో నిర్మించనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు శనివారం శంకుస్థాపన చేశారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, వ్యర్థాలను పునర్వినియోగం చేసే విధానంపై తమ యాజమాన్యంతో పతంజలి సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుందని శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు తెలిపారు. ఆయుర్వేద చికిత్సాలయం, ఔషధ వనం, పరిపాలన విభాగం నూతన భవనాలను ఆచార్య బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి యోగా శక్తిని, ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. త్వరలో శ్రీప్రకాష్ విద్యా సంస్థల సహకారంతో సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టు మోడల్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్టు ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. ఆయనను నరసింహారావు జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో కంటిపూడి నరేంద్రబాబు, విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మనస్తాపంతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఏపీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వంశీ (33) మృతదేహం శనివారం లభ్యమైంది. పెళ్లి విషయంలో వేరే మహిళతో వాగ్వాదం అనంతరం, వంశీ శుక్రవారం తెల్లవారు జామున రోడ్డు కం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పాడు. తాను చాలా ఇబ్బంది పడుతున్నానని, ఇంక జీవించలేనని, గోదావరిలో దూకేస్తున్నానంటూ చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీనిపై రెండో పట్టణ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. వంశీ మృతదేహం స్థానిక దోభీ ఘాట్ వద్ద ఉన్న గోదావరి నదిలో కనిపించింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టంనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుల్లెట్ నుంచి మంటలు అంబాజీపేట: స్థానిక నాలుగు రోడ్ల సెంటర్కు సమీపంలో సూర్యప్రభ డెంటల్ హాస్పిటల్ వద్ద శనివారం బుల్లెట్ నుంచి ఆకస్మికంగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ హాస్పటల్ వైద్యుడు బిల్ల నీరజ్కుమార్కు చెందిన బుల్లెట్ను బయట నిలుపుదల చేశారు. బుల్లెట్ నుంచి మంటలు వస్తున్నాయని బయట నుంచి స్థానికులు కేకలు వేశారు. దాంతో ఆ మంటలను అదుపు చేసేందుకు స్థానికులు, నీరజ్కుమార్లు ప్రయత్నించారు. కూతవేటు దూరంలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి ఫైర్ ఫోమ్ను తీసుకువచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రేపు కాకినాడలో ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ కొత్తపేట: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీఎస్సీ 2008, 1998 ఎస్జీటీ మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఆ జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ తెలిపారు. ఆ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ – 2008 ఎస్జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 196 మంది ఉపాధ్యాయులకు, డీఎస్సీ– 1998 ఎస్జీటీ (ఎంటీఎస్)గా పనిచేస్తున్న 184 మంది ఉపాధ్యాయులకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ సమగ్ర శిక్ష మీటింగ్ హాల్ నందు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. డీఈఓఈజీ.ఓఆర్జీ వెబ్సైట్ నందు పొందుపరిచిన జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. -
కచిడి అధరగొట్టింది
సఖినేటిపల్లి: గోదావరిలో దొరికే పులస చేపలకు ఎంత డిమాండ్ ఉంటుందో.. సముద్రంలో అరుదుగా లభ్యమ య్యే కచిడి చేపలకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటోంది. ఇందులో ఆడ చేప కన్నా, మగ చేపకు డిమాండ్ ఎక్కువ. మగ చేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని చెబుతారు. పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారులకు శనివారం మూడు మీడియం సైజులో కచిడి చేపలు చిక్కాయి. వీటిని హార్బర్లో కొనుగోలుదారుడు రూ.1.35 లక్షలకు దక్కించుకున్నాడు. కచిడి చేపను గోల్డెన్ ఫిష్గా కూడా పిలుస్తారు. -
కొంపముంచిన ఫోన్పే
ఫ రూ.ఐదు లక్షలు ఉన్నాయని తెలుసుకుని హత్య ఫ ఆక్వా రైతు హత్య కేసులో కూలీలే నిందితులు ఫ ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు ఐ.పోలవరం: ఫోన్ పే కొంపముంచింది.. బ్యాంక్ అకౌంట్లో రూ. 5 లక్షలు ఉన్నాయని తెలుసుకుని ఓ ఆక్వా రైతును కూలీలే హత్య చేయడం చర్చనీయాంశమైంది. ఐ.పోలవరం మండలం మురమళ్ల ఆక్వా చెరువు వద్ద రైతు దాట్ల కృష్ణంరాజు (64) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను శనివారం పాత ఇంజరం పోలీస్ స్టేషన్ వద్ద అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ మోహన్కుమార్ విలేకరులకు తెలిపారు. ఈ నెల 17న మురమళ్లకు చెందిన దాట్ల కృష్ణంరాజు తన ఆక్వా చెరువు వద్ద హత్యకు గురయ్యారు. చెరువు వద్ద పనిచేసే ఇద్దరు కూలీలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. నిందితుల్లో ఒకరు విశాఖ జిల్లా కొయ్యూరు గ్రామానికి చెందిన సలాపరెడ్డి బాబ్జీ కాగా, మరొకరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన బాలుడు. వారం రోజుల క్రితం వీరిద్దరూ కృష్ణంరాజు చెరువు వద్ద పనికి కుదిరారు. పని చేయకపోతే రైతు కృష్ణంరాజు ఊరుకునేవారు కాదని, ఇక్కడ పని చేయలేమని నిర్ధారించుకుని వారు మానేయాలని నిర్ణయించుకున్నారు. వారం రోజుల కూలీ డబ్బులు ఇచ్చేయండి, మేం వెళ్లిపోతామని కృష్ణంరాజుతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో 14న బాబ్జీ భార్య సెల్ఫోన్కు రూ.వెయ్యి ఫోన్పే చేయించుకున్నారు. అప్పుడే యజమాని కృష్ణంరాజు ఫోన్పేలో రూ.5 లక్షలు ఉన్నట్లు నిందితులు గుర్తించారు. 17న మధ్యాహ్నం కృష్ణంరాజు చెరువు వద్ద కుర్చీలో కూర్చుని ఫోన్ చూస్తుండగా, నిందితులు ఏరియేటర్ రాడ్డుతో ఆయన తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహం కాళ్లకు నైలాన్ తాడు చుట్టి, ఆ తాడుకు నాలుగు ఫెన్సింగ్ రాళ్లు కట్టి ఎవరికీ కనిపించకుండా చెరువులో పడేశారు. మృతుడు కుర్చీని, షెడ్డు వెనుక మురికి కాలువలో పడేశారు. మోటార్ సైకిల్ను ఎవరికీ కనిపించకుండా రేకుల షెడ్డు పక్కన బాత్రూమ్ గోడకు ఆనుకుని ఉంచి, రాడ్ను సెప్టిక్ ట్యాంక్పై ఉన్న నల్లని బరకల్లో దాచిపెట్టారు. సాయంత్రం 4 గంటల సమయంలో మృతుడి ఫోన్, హత్య సమయంలో రక్తపు మరకలు అంటిన తమ దుస్తులు తీసుకుని నిందితులు కాకినాడకు వెళ్లిపోయారు. నిందితులను పట్టుకున్న పోలీసులు మృతుడి ఫోన్ స్వాధీనం చేసుకుని, ఫోన్పే ద్వారా రూ.90 వేలు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకున్న సీఐ మోహన్ కుమార్, ఎస్సై రవీంద్రబాబును డీఎస్పీ అభినందించారు. -
నాన్న స్ఫూర్తితో ప్రజా సేవకుడిగా..
1901 జూలై 15న జన్మించిన రామచంద్రపురం పట్టణానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్ చెలికాని రామారావు కాకినాడ నుంచి 1952లో పార్లమెంటు సభ్యుడిగా పని చేశారు. అంతకు ముందు జాతీయోద్యమంలో చేరి స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఆ క్రమంలో 1922లో జైలు జీవితాన్ని సైతం గడిపారు. 1985 సెప్టెంబర్ 25లో మరణించే వరకూ ప్రజల మనిషిగా, ప్రజా వైద్యుడిగా తన జీవితాన్ని ప్రజలకు అంకితమిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు డాక్టర్ చెలికాని స్టాలిన్.. తండ్రిని ఆదర్శంగా తీసుకున్నారు. నాన్న బాటలోనే పయనిస్తూ, ప్రజా వైద్యుడిగా రాణించారు. రిక్షా కార్మికులు, ఇతర శ్రామిక ప్రజలు ఆయన ఆసుపత్రి వద్ద బారులు తీరి చికిత్స పొందేవారు. ఇప్పటికీ ఓపిక మేరకు వైద్య సలహాలు ఇస్తూనే ఉన్నారు. తండ్రి పేరున డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ స్థాపించి రామచంద్రపురం కేంద్రంగా సాహిత్య కృషి చేస్తున్నారు. తండ్రి జీవిత చరిత్రతో పాటు అనేక సామాజిక అంశాలపై పుస్తక రచన, ప్రచురణ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. సాహిత్య సదస్సులకు హాజరవుతూ నేటి తరానికి, తన తండ్రి రామారావు తరానికి వారధిగా నిలుస్తున్నారు. సమాజమే ఇల్లు ఆలమూరుకు చెందిన హోమియో వైద్యుడు, కమ్యూనిస్టు నాయకుడు డాక్టర్ చల్లా వెంకట్రావు పలు రంగాల్లో విశేషంగా శ్రమించారు. మండపేట పట్టణానికి చెందిన ఆయన కుమారుడు, ప్రముఖ హోమియో వైద్యుడు చల్లా రవికుమార్ తన తండ్రి వెంకట్రావు బాటలో హోమియో వైద్యుడిగా, సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుకు సాగుతున్నారు. తన తండ్రితో తాను గడిపిన రోజులు తక్కువ అని, నాన్న ఎప్పుడూ ప్రజల్లో తిరుగుతూ వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూ గడిపేవారని రవికుమార్ తెలిపారు. అలా ఉండటాన్ని తొలి రోజుల్లో తాను బాధపడ్డానని, దానికి గల కారణాలను నాన్న ద్వారా తెలుసుకున్నప్పుడు చాలా సంతోషించానన్నారు. సమాజాన్నే ఇల్లు అనుకున్నప్పుడు తాను దూరంగా ఉన్నా నీకు దగ్గరగానే కనిపిస్తాననేవారన్నారు. తన తండ్రి వె వెంకట్రావు మరణానంతరం ఆయన పేరున, ఆయన మెచ్చిన సామాన్య ప్రజల పక్షాన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నానన్నారు. సాహిత్య సేవకులు అద్దేపల్లి రామ్మోహనరావు కాకినాడకు చెందిన ప్రముఖ కవి, రచయిత. సంఘం శరణం గచ్ఛామి, పొగచూరిన ఆకాశం, అభ్యుదయ విప్లవ కవిత్వం – సిద్ధాంతాలు – శిల్పరీతులు వంటి పేరు మోసిన కవితా సంపుటాలెన్నో వెలువరించారు. శ్రీశ్రీ కవితా ప్రస్థానం పేరుతో శ్రీశ్రీ కవితలలోని సారాంశాన్ని రచించారు. లెక్కలేనన్ని సాహిత్య సమావేశాలు నిర్వహించారు. ఆయన కుమారులు ప్రభు, ఉదయ భాస్కరరావు, రాధాకృష్ణ వెంకటరమణ సాహిత్య కృషిలో నాన్న బాటలో పయనిస్తున్నారు. నాన్నతో కలిసి అమలాపురంలో నిర్వహించిన మినీ కవితల సదస్సుకు తాను వెళ్లినప్పుడు అక్కడ మరో గొప్ప ప్రజా కవి అలిశెట్టి ప్రభాకర్తో గడిపానని అద్దేపల్లి ప్రభు అన్నారు. ప్రతి కవితా శ్రమజీవుల జీవన రేఖ కావాలని నాన్న చెబుతుండేవారని, అందుకే తాను రాసే ప్రతి పదమూ సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండేట్టు జాగ్రత్త పడుతుంటానన్నారు. తన సోదరులు ఉదయ భాస్కరరావు వ్యక్తిత్వ వికాసం మనస్తత్వ రంగాల్లో పుస్తకాలు రాశారని, వెంకట రమణ కవిత్వం, కథా రచనలో కృషి చేస్తున్నారని, అందరికీ నాన్నే స్ఫూర్తి అని ప్రభు అంటున్నారు. ● జీవితానికి భరోసా నాన్న ● గమనానికి వెలుగు రేఖ ● సమాజానికి దిక్సూచి ● నేడు ఫాదర్స్ డేఅద్దేపల్లి రామ్మోహనరావుతో ఆయన కుటుంబ సభ్యులు -
కక్షసాధింపులే లక్ష్యంగా చంద్రబాబు పాలన
● కారుమూరి సునీల్పై అక్రమ కేసులు దారుణం ● కూటమి నేతలే లిక్కర్ డాన్లు ● డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతున్న ప్రభుత్వం ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ధ్వజం సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కక్షసాధింపులే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం వైఎస్సార్ సీపీ నేతలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బ తీసేలా ప్రభుత్వం పని చేస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనలే ఇందుకు ఉదాహరణని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీని పారదర్శకంగా అమలు చేశామన్నారు. అలాంటి పాలసీలో అవకతవకలంటూ వైఎస్సార్ సీపీ నాయకులపై చంద్రబాబు సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయన్నారు. కూటమి నేతలు, కార్యకర్తలు టెండర్ వేసే వాళ్లను బెదిరించి, భయపెట్టి మద్యం షాపులను చేజిక్కించుకున్నారని చెప్పారు. టీడీపీ, జనసేనతో పాటు మంత్రి లోకేష్ గల్లాపెట్టెకి వాటాలు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. 2014–19 మధ్య మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.16,912 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. 2023–24 వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న చివరి ఏడాదికి మద్యం ఆదాయం రూ.24,760 కోట్లకు పెరిగిందన్నారు. అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే రూ.8 వేల కోట్ల ఆదాయం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో పెరిగిందని గుర్తు చేశారు. కేవలం వైఎస్సార్ సీపీ నేతలను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతోనే లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఆరోపించడం తగదని మండిపడ్డారు. ఎంపీ మిధున్రెడ్డి నుంచి కారుమూరి సునీల్ వరకూ లిక్కర్ కేసుతో సంబంధం లేకపోయినా అరెస్టు చేశారని అన్నారు. బీసీ వర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారనే దుగ్ధతో కేసులతో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ ఆధారాలతో దొరికిపోతే కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. పోలీసు వ్యవస్థలో సీఐడీ, ఏసీబీని అడ్డం పెట్టుకుని వైఎస్సార్ సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఆయన ఆరోపించారు. చిన్నారి మిస్సింగ్ కేసులో పురోగతి ఏదీ? తునిలో చిన్నారి మిస్సింగ్ కేసులో నేటికీ పురోగతి లేదని రాజా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు. పోలీసు వ్యవస్థ వీటిపై దృష్టి సారించకుండా కేవలం పోలీస్ స్టేషన్లను టీడీపీ కార్యాలయాలుగా మార్చి, వారికి అనుకూలంగా పని చేస్తోందని విమర్శించారు. పోలీసులు ఎంతకు బరితెగించారంటే.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని మర్డర్ చేయడానికి కూడా వెనుకాడటం లేదని దుయ్యబట్టారు. పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. యువనేత కారుమూరి సునీల్కు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ బాసటగా నిలుస్తుందని రాజా స్పష్టం చేశారు. -
నాన్న చెప్పారని..
రాజమహేంద్రవరం రూరల్: తన తండ్రి కోరిక మేరకు పోలీసు అధికారి అయ్యానని జిల్లా ఎస్పీ (లా అండ్ ఆర్డర్), ప్రస్తుతం విజయవాడ సీఐడీ ఎస్పీగా బదిలీ అయిన అల్లూరి వెంకట సుబ్బరాజు అన్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం రాచగుమడాం తన స్వగ్రామమన్నారు. కాంగ్రెస్ నాయకుడైన తన తండ్రి చిన్న నరసింహరాజు రాచగుమడాం గ్రామానికి 25 ఏళ్ల పాటు ఏకగ్రీవ సర్పంచ్గా, రెండేళ్లు చీపురుపల్లి సమితి ప్రెసిడెంట్గా సేవలందించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా విద్యార్థి దశలో తన తండ్రితో పాటు అధికారులను కలిసేందుకు వెళ్లేవాడనని, ప్రజల్లో పోలీసులకు ఉన్న గౌరవాన్ని గమనించిన తన తండ్రి.. తనను పోలీసు అధికారి కావాలని కోరారన్నారు. అలా 1989లో ఎస్సైగా ఎంపికయ్యానని, అనంతరం సివిల్ సబ్ ఇన్స్పెక్టర్గా, 2001లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా, 2010లో డీఎస్పీగా, 2020లో అదనపు ఎస్పీగా, నాన్ కేడర్ ఎస్పీగా పదోన్నతి పొందడం జరిగిందని సుబ్బరాజు తెలిపారు. అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎస్పీ -
నీట్ పరీక్ష కేంద్రం పరిశీలన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నీట్ (యూజీ)2026 రీ ఎగ్జామినేషన్ను పారదర్శ కంగా, ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ శివరాముడు అన్నారు. ఆదివారం ఆ పరీక్ష జరగనున్న ఎస్కేవీటీ డిగ్రీ ప్రభుత్వ కళాశాలను శనివారం ఆయన పరిశీలించారు. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, సూచిక బోర్డులు, కూర్చునే సౌకర్యాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో శనివారం ద్వారకాతిరుమలలోని చిన వెంకన్న ఆలయ రద్దీగా మారింది. ఉదయం నుంచే భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదాలు విక్రయ కేంద్రాలు, అన్నదాన సదనం, కల్యాణకట్ట తదితర విభాగాలు కిటకిటలాడాయి. అయితే గత వారంతో పోలిస్తే ఈ వారం భక్తుల రద్దీ కొంత మేర తగ్గింది. గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి ధవళేశ్వరం: రాజమహేంద్రవరం అర్బన్ పరిధి శంభూనగర్ సచివాలయంలో వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటేషన్పై పని చేస్తున్న ధవళేశ్వరానికి చెందిన నిమిషకవి దేవీ వరప్రసాద్ (37) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధవళేశ్వరంలోని నివాస గృహంలో వర ప్రసాద్ పార్దివదేహానికి కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ మేఘాస్వరూప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రెవెన్యూ అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు,సచివాలయ ఉద్యోగులు ఆయన నివాసానికి చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పించారు. కారుమూరి సునీల్ అరెస్ట్ అక్రమంపెరవలి (కొవ్వూరు): మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ అక్రమ అరెస్ట్ దారుణమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్ ధ్వజమెత్తారు. కొవ్వూరు ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్ బుక్ పాలనలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ను అరెస్టు చేసి జైలుకు పంపించాలన్నారు. యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చౌటుపల్లి వీరన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మద్యం కేసులు బనాయిస్తున్నారన్నారు. అసలు మద్యం అక్రమాలు కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని ఆరోపించారు. వీధికో బెల్టు షాపు ఏర్పాటు చేసి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని, బాటిళ్లపై అదనంగా రూ.20 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ‘అన్నదాత’ నిధులు రూ.88.64 కోట్ల విడుదల రాజమహేంద్రవరం సిటీ: అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలోని 1,33,156 మంది రైతులకు రూ.88.64 కోట్ల మేర తొలి విడత సాయం అందిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. రాజానగరం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన నిధుల విడుదల కార్యక్రమంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజమహేంద్రవరంలో శనివారం వందల మంది కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, జీతాలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పటి వరకూ నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. నగరాన్ని అందంగా తీర్చిదిద్దే మున్సిపల్ కార్మికుల బతుకులు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర దేశాలు తిరగడానికి డబ్బులు ఉంటాయే కానీ, కార్మికులు జీతాలు పెంచడానికి, సక్రమంగా జీతాలు ఇవ్వడానికి మాత్రం ఉండవన్నారు. మున్సిపల్ సేవలను ప్రైవేటుపరం చేసే 673 జీవోను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ధనాలు దుర్గమ్మ, రాష్ట్ర కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి రెడ్డి రమణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిటీ కమిటీ ప్రధాన కార్యదర్శి కాకి శారద, ఉపాధ్యక్షులు బంగారు గిరి, సహాయ కార్యదర్శులు మీసాల రమణ, దేవి, రెడ్డి శ్రీనివాస్, కోశాధికారి సరస్వతి, జ్యోతి, రాజేశ్వరి, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
సాయికృష్ణ లాకప్ డెత్పై విచారణ జరపాలి
● బాధ్యులందరినీ కఠినంగా శిక్షించాలి ● మాజీ హోం మంత్రి తానేటి వనిత డిమాండ్ దేవరపల్లి: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్ డెత్పై పూర్తి స్థాయి విచారణ జరిపించి, బాధ్యులందరిపై హత్య కేసు నమోదు చేయాలని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ తానేటి వనిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆమె విలేకర్లతో మాట్లాడారు. రక్షణ కల్పించాల్సిన రక్షణ భటులు ప్రజల పాలిట భక్షక భటులుగా మారి, ప్రాణాలు తీసేస్తూ, కనీసం వారి శవాలను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని మండిపడ్డారు. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలకు కారణమైన వారిపై విచారణ చేపట్టాలని, వారి వెనుక ఉన్న వారెవ్వరో బయటకు రావాలని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఈ రెండు సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అనిత తీరు దారుణం కాకినాడ జిల్లా తునిలో బాలిక అదృశ్యమైన ఘటనపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు హోం మంత్రి అనిత నవ్వుతూ సమాధానం చెప్పడమేమిటని వనిత ప్రశ్నించారు. సాయికృష్ణ నేరస్తుడే కావచ్చునని, అతడిని శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు. సాయికృష్ణపై సీఐ నాగరాజు థర్డ్ డిగ్రీ ఎందుకు ప్రయోగించాడని ప్రశ్నించారు. సాయికృష్ణ జనసేన కార్యకర్తని, కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ కార్యకర్తకే ఇలాంటి పరిస్థితి ఉంటే, సామాన్యుల పరిస్థితేమిటని వనిత ప్రశ్నించారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించేంత వరకూ ప్రభుత్వం, పోలీసులు ఆ తల్లి గోడును పట్టించుకోలేదని అన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు వ్యవస్థ పని తీరు చాలా బాగుందని హోం మంత్రి అనిత గొప్పలు చెప్పుకోవడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. ప్రజలను ఏం ఉద్ధరించారని రెండేళ్ల పరిపాలనకు విజయోత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. -
కన్న తండ్రికి కన్నీటి వీడ్కోలు అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు
అయినవిల్లి: కని, పెంచి, పెద్ద చేసి.. అనారోగ్యంతో మంచం పట్టి.. తనువు చాలించిన తండ్రికి కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించి, కన్నీటి వీడ్కోలు పలికిన సంఘటన అయినవిల్లి మండలం కె.జగన్నాథపురంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పిచ్చిక సత్యనారాయణ (52)కు భార్య, ముగ్గురు కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్న ఉన్నారు. క్యాటరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సత్యనారాయణ భార్య సరస్వతి మానసిక దివ్యాంగురాలు. ఏడాది క్రితం సత్యనారాయణకు పక్షవాతం రావడంతో పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, కుటుంబ భారం పెద్ద కుమార్తె ప్రసన్నపై పడింది. ఆమె ముమ్మిడివరంలోని ఐస్క్రీమ్ పార్లర్లో పని చేస్తూనే కుటుంబాన్ని పోషిస్తోంది. మిగిలిన ఇద్దరు కుమార్తెలు జ్యోతిక, జ్యోత్స్న కవలలు. వీరు అదే గ్రామంలో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. ఈ పరిస్థితుల్లో సత్యనారాయణ శుక్రవారం తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. సత్యనారాయణకు అక్క, తమ్ముడు ఉన్నారు. వారి కుటుంబాల్లో శుభకార్యాలు జరుగుతూండటంతో మృతి చెందిన సోదరుడి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తండ్రి సత్యనారాయణ మృతదేహానికి కుమార్తెలు ప్రసన్న, జ్యోతిక, జ్యోత్స్నలు అంత్యక్రియలు నిర్వహించారు. వారి పరిస్థితిని చూసి, చలించిన గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. తల్లికి మతిస్థిమితం లేకపోవడం, తండ్రి మృతి చెందడంతో.. ఆ అక్కాచెల్లెళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ కల్యాణ్ పచ్చి అబద్ధాలు
సాక్షి, కాకినాడ: సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలు వల్లె వేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో సాక్ష్యాలు తారుమారు కాగా, గత ప్రభుత్వంలో తారుమారు చేశారంటూ పచ్చి అబద్ధాలు చెప్పారు. సుగాలి ప్రీతి తల్లిని వంచించేలా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను వచ్చి ఫస్ట్ కేసు అదే తీసుకుందామంటే సాక్ష్యాధారాలన్నీ లాస్ట్ గవర్నమెంట్లోనే చెరిపేశారు. పోయిన సాక్ష్యాధారాలను మనం తిరిగి తీసుకురాలేం. ఫాల్స్ డీఎన్ఏ పెట్టేశారు. క్రైమ్ సీన్లో సాక్ష్యాధారాలు కీలకం. నిర్థారించడానికి కోర్టులు అడిగేవి ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్.. ఎవిడెన్స్ లేకపోతే మాత్రం మనం ఎవరిని కూడా మన కళ్ల ముందు తెలిసినా సరే మనం ఏమీ చేయలేం’’ అంటూ సుగాలి ప్రీతి కేసు విచారణపై పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు. -
షేర్ల అమ్మకం సరికాదు
రాజమహేంద్రవరం రూరల్: జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీ ఇన్సూరెన్స్లో కేంద్ర ప్రభుత్వం 5శాతం షేర్లు అమ్మాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాజమండ్రి డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ఆర్జే మాథ్యూస్, ఎం.కోదండరామ్లు శుక్రవారం ప్రకటనలో ఖండించారు. ఇంతకు ముందు 2017లో 14.22 శాతం షేర్లు , 2024 సెప్టెంబర్లో 3.4 శాతం షేర్లు ఓఎఫ్ఎస్ ద్వారా అమ్మారన్నారు. ఇప్పుడు మరో 5 శాతం అమ్మడంతోప్రభుత్వ వాటా 77.4 శాతానికి పడిపోతుందన్నారు. ఇది చాలా ప్రమాదకరమని, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. లాభాల్లో నడుస్తున్న, వ్యూహాత్మకంగా ముఖ్యమైన జిఐసిరీ లాంటి సంస్థల్లో ప్రభుత్వ వాటాను మళ్లీ మళ్లీ తగ్గించడం ప్రమాదకర విధానమన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ సాధించాలని ప్రభుత్వం చెప్తోందన్నారు. కానీ తక్షణ డబ్బు కోసం దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదన్నారు. జిఐసిరీ లో గానీ, మరే వ్యూహాత్మక ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో గానీ ఇకపై డిస్ఇన్వెస్ట్మెంట్ నిలిపి వేయాలన్నారు. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచే విధానాలను ఏఐఈఈఏ గట్టిగా వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోందన్నారు.వారాహి మాతకు వెండి వస్తువుల సమర్పణ పెదపూడి: జి.మామిడాడ గ్రామం శివారు సూర్యనారాయణపురానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి లక్ష్మీకాంతం దంపతులు, వారి కుమారుడు సత్యనారాయణరెడ్డి (యూఎస్ఏ) గ్రామంలో ప్రసిద్ధి చెందిన వారాహి అమ్మవారికి సుమారు రూ.లక్షల విలుగల 650 గ్రాముల వెండితో శంకు, చక్ర,హస్తాలను తయారు చేయించారు. వాటిని మల్లిడి శ్రీనివాసరెడ్డి కూమార్తె అల్లుడు కర్రి దుర్గా అర్జున్రెడ్డి లలితా దంపతులు, వారి కుమార్తె వన్షికతేజస్విని రెడ్డి చేతుల మీదుగా మణికంఠ ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులకు శుక్రవారం అందజేశారు. అనంతరం శాస్త్రోక్తంగా సంప్రోక్షణ గావించి అమ్మవారికి వాటిని అలంకరించారు. దాత శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులకు కమిటీ తరఫున శేష వస్త్రాలను సమర్పించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సత్తి భగవాన్రెడ్డి, కార్యదర్శి మండ రాజారెడ్డి, కోశాధికారి డీఆర్కే రెడ్డి, సభ్యులు సబ్బెళ్ల మోహనరెడ్డి, ద్వారంపూడి బాలవెంకట సత్యనారాయణరెడ్డి, నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, ద్వారంపూడి యువరాజారెడ్డి పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల్లో 93.90 ఉత్తీర్ణత శాతం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలకు మొత్తం 2,772 మంది హాజరుకాగా, 2,603 మంది పాసయ్యారు. 93.30 ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఆ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు తెలిపారు. జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 5 వరకు జరిగాయి. ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రీ కౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 ఫీజు నిర్ణయించారు. ఈ నెల 20 ఉదయం 10 గంటల నుంచి 26వ తేదీ రాత్రి 11 గంటల వరకు సీఎఫ్ఎంఎస్ ఆన్లైన్ చలానా ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వానికి బీసీలంటే చిన్నచూపని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు అన్నారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ యాదవ, బీసీ సంఘాల ఆధ్వర్యాన శుక్రవారం జ్యోతిరావు ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాజబాబు మాట్లాడుతూ, రెడ్బుక్ రాజ్యంగంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులకు అణగదొక్కుతున్నారని, బీసీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ఇటువంటి అక్రమ అరెస్టులకు కేరాఫ్గా నిలుస్తోందని దుయ్యబట్టారు. -
పిప్పితో ఉపయోగాలు
● రసం తీసిన తరువాత వచ్చే పిప్పిని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా వాడవచ్చు. ● వర్మీ కంపోస్టుగాను ఉపయోగపడుతుంది. ● గోవా రాష్ట్రంలో ఈ పిప్పిని లిక్కర్ తయారీకి వాడతారు. ● ఈ పిప్పి నుంచి ‘పెక్టిన్’ అనే ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఇది జామ్, చాస్, జెల్లీ, కెచప్ తయారీలలో చిక్కదనం రావడానికి తోడ్పడుతుంది. పలు రకాల మందుల తయారీలోను, పౌడర్లు, పేస్టుల తయారీలోను వాడతారు. ఔషధకారిగా.. ● జీడిమామిడి పండులో లభ్యమయ్యే సి–విటమిన్ నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. పసుపు, ఎరుపు, గులాబి రంగులలో దొరికే ఈ పండ్లలో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. రసంలో ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు, మాలిక్ ఆమ్లం ఉంటాయి. ● జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడానికి పండు ఉపయోగపడుతుంది. ● మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. జీడిమామిడి పండు తిని అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు. ● వీటి విత్తనాలతో తయారు చేసిన పొడి పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. -
కూతురితో పాటు తల్లిదండ్రులూ ఇంటర్ పాస్
రంగంపేట: మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం విద్యా ప్రస్థానంలో అరుదైన ఘనత సాధించింది. తండ్రి, తల్లి, కుమార్తె ముగ్గురూ ఒకేసారి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. గ్రామానికి చెందిన కారి దాసు, ఆయన భార్య ప్రభావతి, కుమార్తె మేఘన మే నెలలో జరిగిన ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షలను రాజమహేంద్రవరం సమీపంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో రాశారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ముగ్గురూ విజయం సాధించారు. కారి దాసు 291 మార్కులతో సెకండ్ క్లాస్, ప్రభావతి 208 మార్కులతో థర్డ్ క్లాస్, కుమార్తె కారి మేఘన 330 మార్కులతో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులయ్యారు. విద్యకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు కూడా చదువు కొనసాగించి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం పలువురి ప్రశంసలు అందుకుంది. ఇంటర్లో ఉత్తీర్ణులైన దాసు, ప్రభావతి, మేఘన -
సునీల్కుమార్ అరెస్ట్ ప్రభుత్వ కక్ష సాధింపే..
రాజమహేంద్రవరం సిటీ: చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైఎస్సార్ సీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కారుమూరి సునీల్కుమార్ యాదవ్ను అక్రమంగా అరెస్టు చేసిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో సంహిత కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలు పరాకాష్టకు చేరాయన్నారు. సునీల్ కుమార్ అక్రమ అరెస్టు దారుణమని, ఇది ప్రజాస్వామ్య విరుద్దమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు అత్యంత పారదర్శకంగా జరిగాయన్నారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడం కోసమే మద్యం దుకాణాలు తగ్గించి, ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించిందన్నారు. పర్మిట్ రూములను, బెల్ట్ షాపులను రద్దు చేసిందన్నారు. అయినప్పటికీ మద్యం కేసు సృష్టించి పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీ వర్గంలో బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వాస్తవానికి 2014–19 మధ్య రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు మద్యం సరఫరా విక్రయాల్లో ఎన్నో అక్రమాలు చేశారన్నారు. బార్లకు మేలు చేకూర్చే విధంగా ప్రివిలేజ్ ఫీజును రద్దుచేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారన్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ల చేతుల్లో ఉంచుకుని పర్మిట్ రూములు ఊరూరా, బెల్ట్ షాప్లు వాడవాడలా నిర్వహించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించి జనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై చంద్రబాబుపై కేసు కూడా నమోదయిందన్నారు. అధికారంలోకి రాగానే ఆ కేసును మాఫీ చేసుకోవడంతో పాటు జనం దృష్టిని మరలించడం కోసం లేని కేసును సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్నారన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు దుర్గారావు -
మెడికల్ కళాశాలలో సికిల్ సెల్ అనీమియా దినోత్సవం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ సికిల్ సెల్ అనీమియా దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంఎస్.రాజు ఆదేశాల మేరకు కళాశాలలో చదువుతున్న రెండవ, మూడవ సంవత్సరం వైద్య విద్యార్థులకు ఆ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వాల్పోస్టర్ ప్రదర్శన నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ ఈ ఏడాది నినాదంలో ఈక్విటీ అనే అంశం అత్యంత ప్రాధాన్యమైనదని, ప్రతి వ్యక్తికి వారి అవసరాలకు అనుగుణంగా వైద్య సేవలు అందించడమే ఆరోగ్య సమానత్వం ప్రధాన లక్ష్యమన్నారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా సరైన వైద్యం, కౌన్సెలింగ్ అందించవచ్చన్నారు. ఇది వారసత్వంగా సంక్రమించే జన్యుపరమైన వ్యాధి కావడంతో వివాహానికి ముందు స్క్రీనింగ్ నిర్వహించడం అవసరమని, జన్యు సలహాలు అందించడం ఎంతో ముఖ్యమన్నారు. జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు పాథాలజీ, బయోకెమిస్ట్రీ, అనాటమీ, మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ విభాగాలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు. -
సాయికృష్ణ మృతిపై సీబీఐ విచారణ జరపాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న దళిత యువకుడు సాయికృష్ణ వమరణంపై పౌరహక్కుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పౌరహక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. సాయికృష్ణ కస్టడీ మరణం, ఆ తర్వాత అతని శవాన్ని మాయం చేయడం వెనుక ఉన్న నిజాలను వెలికితీసేందుకు కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. కేసును నీరుగార్చే ప్రయత్నం సరికాదని, ప్రతిపక్షాలు, న్యాయవాద సంఘాలు, హక్కుల సంఘాల నిరంతర ఆందోళనల వల్ల ప్రభుత్వం కేవలం కృష్ణలంక సీఐ నాగరాజుపై మాత్రమే హత్య నేరం కింద కేసు నమోదు చేసిందన్నారు. 20 రోజులుగా ఈ దారుణ ఘటనను దాచడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం వెనుక కేసును నీరుగార్చే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ మరణం, శవాన్ని మాయం చేయడం వెనుక ఎస్పీ స్థాయి కంటే పై అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. అటువంటప్పుడు కేవలం ఎస్పీ స్థాయి అధికారితోనే విచారణ జరిపించడం హేతుబద్ధం కాదని చెప్పారు. విజయవాడకు చెందిన ఉన్నత పోలీస్ అధికారులందరినీ ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి తక్షణమే విచారించాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ఇవ్వాలన్నారు.పౌరహక్కుల సంఘం డిమాండ్ -
పుష్కరాల నాటికి అభివృద్ధి పనుల పూర్తి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాల నాటికి ఆలయాల అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పుష్కర ఘాట్లు, ఆలయాలను పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి, పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల దేవదాయ, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తుల్లో సుమారు 70 శాతం మంది సమీప దేవాలయాలను కూడా దర్శించుకుంటారన్నారు. ఈ నేపథ్యంలో తొమ్మిది ప్రముఖ దేవాలయాలతో పాటు ఘాట్లకు సమీపంలోని మరో 543 ఆలయాలను గుర్తించినట్లు తెలిపారు. వీటిలో 162 ఆలయాల అభివృద్ధి పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు జారీ చేసినట్లు, టెండర్ల ప్రక్రియ పూర్తయి 43 ప్రాంతాల్లో పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మిగిలిన ఆలయాల్లో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల సందర్భంగా పిండ ప్రదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నియంత్రించి, పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని కమిషనర్ సూచించారు. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల మహిళల ద్వారా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే సంస్థలను ముందుగానే గుర్తించి, ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయంతో అన్ని అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పుష్కర స్పెషల్ ఆఫీసర్ రాహుల్ మీనా వివిధ శాఖల వారీగా చేపట్టిన ఏర్పాట్లపై వివరాలు వెల్లడించారు. పుష్కర్ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్, మహేష్, సీఐ శ్రీనాథ్, దేవదాయ శాఖ అధికారులు వి.త్రినాథ్రావు, టి.దుర్గేష్, డి.ఎల్.వి.రమేష్బాబు, జిల్లా దేవదాయ శాఖ అధికారి ఈ.వి.సుబ్బారావు, ఏలూరు జిల్లా దేవదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎస్. హరి సూర్యప్రకాశ్ పాల్గొన్నారు. దేవదాయ కమిషనర్ రామచంద్ర మోహన్ -
● నగరాన్ని ముంచెత్తే
కాకినాడ ప్రధాన రహదారిలోని దిగుమర్తి వారి వీధిలో డస్ట్బిన్లు, రోడ్లపై చెత్త ముంచెత్తింది. ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. జనం ముక్కుమూసుకుని వెళ్లాల్సి వస్తోంది. ఇటుగా అనేక మంది అధికారులు ఇటుగా వెళ్తుంటారు. వారు కనీసం పట్టించుకోవడం లేదు. దీనివల్ల విష జ్వరాల భయం వెంటాడుతోంది. – నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ) ● బురద బజారుకెక్కింది! ఇది నిజమేనండి.. బురద బజారుకొచ్చింది. తుని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన రైతు బజారులో వర్షానికి ఇలా బురదమయంగా మారింది. ఇక్కడకు తునితో పాటు రౌతులపూడి, తుని, కోటనందూరు, తొండంగి మండలాల నుంచి నిత్యం వందలాది మంది రైతులు వచ్చి కూ రగాయలు విక్రయిస్తుంటారు. వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ యార్డు వ్యాపారుల నుంచి చెస్ వసూలు చేస్తున్నా, సమస్యను మాత్రం బురదలో వదిలేసింది. – తుని ● విసిగివేసారేలా.. ఆ రోడ్డుపై ప్రయాణం విసిగివేసారేలా ఉంది. ఏలేశ్వరం ప్రధాన రహదారి మూగజీవాలతో పెద్ద చిక్కే వస్తోంది. రాత్రి వేళలో మరీ ఇబ్బందిగా మారుతోంది. యజమానులు ఆవులను వదిలేయడంతో గుంపులు గుంపుగా రోడ్లపైనే తిష్టవేస్తున్నాయి. వీటిని గమనించని పలువురు వాహనదారులు ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అధికారులు ఈ సమస్యను పట్టించుకోకుంటే ప్రజల ప్రాణాలకు ముప్పే. – ఏలేశ్వరం -
గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్?
ఆచూకీ కోసం నదిలో గాలింపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి దూకి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఆ వివరాల ప్రకారం.. రాజానగరం మండలం దివాన్చెరువు శ్రీరామపురానికి చెందిన చంద్రమళ్ల వంశీ కాకినాడలోని ఏపీఎస్పీ మూడో బెటాలియన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. అదే శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మహిళతో పరిచయం ఏర్పడింది. దీనిపై ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారు. వివాహం కుదుర్చేందుకు అమ్మాయి ఇంటికి వెళ్లారు. ఆ అమ్మాయి బాగోలేదని వంశీ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదిలాఉండగా అతనికి వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. దీనిపై వంశీకి ఆ మహిళా కానిస్టేబుల్ ఫోన్ చేసి నిలదీసింది. దీనికి అతను ముఖం చాటేస్తుండడంతో రాజమహేంద్రవరం దిశా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వంశీని పోలీస్ స్టేషన్కు పిలిచి అక్కడ పోలీసులు మాట్లాడారు. ఇదిలా ఉండగా రెండు రోజుల నుంచి వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. దీంతో వంశీ శుక్రవారం తెల్లవారు జామున తన తండ్రి వెంకట్రావుకు ఫోన్ చేసి, తాను రైల్వే బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి, ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఈ విషయాన్ని వెంటనే ఆయన పోలీసులకు తెలిపాడు. వారు అక్కడకు వెళ్లి చూడగా, రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నాలుగో ఫిల్లర్ వద్ద వంశీ మోటారు సైకిల్, చెప్పులు లభించాయి. సెల్ఫోన్ కనిపించలేదు. అక్కడ గోదావరి నదిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. వంశీ నిజంగా గోదావరిలో దూకాడా లేదా అనేది తెలియడం లేదు. దీంతో రెండో పట్టణ పోలీసులు వంశీది అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమస్యల్లోకి లాగేసారూ..
అక్షర దీపాన్ని వెలిగించే దైవ స్వరూపం గురువు.. అజ్ఞానపు చీకట్లను తరిమేసి, విద్యార్థి జీవితానికి అర్థాన్ని నేర్పే తొలి సారథి ఆయనే.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సారాన్ని బోధించే ఉన్నతజీవి.. జీవించే విధానాన్ని నేర్పించే గురువు గురించి ఎంత వర్ణించినా తక్కువే.. అలాంటి ఉపాధ్యాయులనూ చంద్రబాబు ప్రభుత్వం క్షోభకు గురిచేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తోంది. కొత్త విద్యా సంవత్సరంలోనూ వారికి భరోసా దక్కకుంది. కపిలేశ్వరపురం: సమాజాన్ని సన్మార్గంలో నడిపించే ఉపాధ్యాయులనూ చంద్రబాబు ప్రభుత్వం సమస్యల్లోకి తోసింది. తమ సమస్యలు పరిష్కరించాలని గత విద్యా సంవత్సరంలో గురువులు చేసిన ఉద్యమాలనూ పట్టించుకోకుండా వదిలేసింది. కనీసం ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభమైనా తమ సమస్యలకు పరిష్కారం చూపలేదని ఉపాధ్యాయులు నిట్టూర్పు వదులుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4,570 ప్రభుత్వ పాఠశాలలకు గానూ, 18,316 మంది ఉపాధ్యాయులు విద్యా బోధన చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 962 ప్రభుత్వ పాఠశాలల్లో 5,814 మంది, కాకినాడ జిల్లాలోని 1,246 పాఠశాలల్లో 6,493 మంది, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,562 పాఠశాలల్లో 4,109 మంది, పోలవరం జిల్లాలో 800 ప్రభుత్వ పాఠశాలల్లో 1,900 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులను ఆకట్టుకునేందుకు వారికి కూటమి నేతలు పలు హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. అధికారం చేపట్టి రెండేళ్లయినా సీపీఎస్ రద్దు చేసే ప్రక్రియ ప్రారంభం కాలేదు. కనీసం హామీకి కట్టుబడి రద్దు చేస్తామన్న భరోసా కూడా ఇవ్వడం లేదు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించ లేదు. 29 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) విడుదల చేయాలన్న డిమాండ్ను ఖాతలు చేయలేదు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను నేటికీ ఇవ్వలేదు. ఉద్యోగుల పెన్షనర్ల బకాయి చెల్లింపులకు ఇప్పటి వరకూ రూప్ మ్యాప్ ప్రకటించలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైరైన రోజే పెన్షనరీ బెనిఫిట్లు చెల్లిస్తామన్న హామీ నీటి మీద రాత అయ్యింది. హెల్త్ కార్డు, మెడికల్ బిల్లుల చెల్లింపుల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. 2004 ముందు నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాల్లో చేరిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర ఉద్యోగులకు, కేంద్రం ఇచ్చిన మెమో నంబర్ 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్పై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. సమస్యలు ఎన్నో.. 2025–26 విద్యా సంవత్సరంలో పాఠశాల నిర్వహణ నుంచి పరీక్షలు, మూల్యాంకనం, ఉపాధ్యాయ శిక్షణ తరగతుల నిర్వహణ సమస్యలమయమైంది. నిడదవోలు మండలం సమిశ్రగూడెం జెడ్పీ హైస్కూల్లో ఈ నెల 7న 1, 2 తరగతులు బోధించే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులపై పని ఒత్తిడిని పెంచడం, బోధనేతర పనులను అప్పగించడంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. గత విద్యా సంవత్సరంలో ఉద్యమాలిలా.. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు అనేక మార్లు సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఎస్టీయూ ఆధ్వర్యంలో కాకినాడ, రాజమహేంద్రవరంలలోని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు సీఎం చంద్రబాబుకు లక్ష ఉత్తరాలు రాశారు. సీపీఎస్ రద్దు చేయాలని, పాఠశాలల మూసివేత, విలీనం విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించగా, ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తరలివెళ్లారు. యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ‘ఉపాధ్యాయ రణభేరి’ పేరుతో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఎన్నికల హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది. ఫిబ్రవరి 17న చలో విజయవాడను విజయవంతంగా చేపట్టింది. ఈ ఏడాది మార్చి 3న ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ ఎదుట, ఏప్రిల్ 1న యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద, ఏప్రిల్ 21న పీఆర్టీయూ ఆధ్వర్యంలో అమలాపురంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. వారిచ్చిన హామీలే అవి! ఉపాధ్యాయులు ప్రభుత్వం ముందు ఉంచినవన్నీ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలే. ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనైనా అమలు చేస్తారని చూస్తున్నాం. – పి.సురేంద్రకుమార్, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్ జిల్లా కమిటీ, కాలేరు గురువుల గోడు వినని సర్కారు హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం ఉద్యమాలు చేస్తున్నా పట్టని వైనం కొత్త విద్యా సంవత్సరంలోనూ దక్కని భరోసా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 23,000 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
రైల్వే గడ్డర్లో ఇరుక్కున్న లోడ్ లారీ
కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు సామర్లకోట: పిఠాపురం నుంచి అచ్చంపేట ఏడీబీ రోడ్డు మీదుగా సామర్లకోట వైపు వస్తున్న లోడ్ లారీ శుక్రవారం ఉండూరు రైల్వే గేటు వద్ద రైల్వే గడ్డర్లో ఇరుక్కుపోయింది. దాంతో ఉండూరు రోడ్డులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిఠాపురం నుంచి మండపేట వెళ్లాల్సిన లోడ్ లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ద్వారా వస్తున్నారు. దీనివల్ల అచ్చంపేట ఏడీబీ రోడ్డు నుంచి ఉండూరు మీదుగా రావడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. లారీలో లోడ్ ఎత్తుగా ఉండటంతో ఉండూరు ఫిల్టర్ బెడ్ వైపు ఉన్న రైల్వే గడ్డర్ దాటి, రైల్వే పట్టాల తరువాత రెండో వైపు గడ్డర్లో చిక్కుకుంది. దాంతో రైల్వే గడ్డర్ కూలిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో లారీపై ఇరుకున్న గడ్డర్ను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. రైల్వే పోలీసులు లారీ డ్రైవర్ నుంచి రికార్డులను స్వాఽధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. హత్య కేసులో నిందితుడికి జైలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విఽధిస్తూ నాల్గవ అదనపు జిల్లా న్యాయస్థానం, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి జి.షణ్ముఖరావు శుక్రవారం తీర్పునిచ్చారు. దీనికి సంబంఽధించిన వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఏవీ అప్పారావు రోడ్డుకు సమీపంలోని శ్రీనివాసనగర్లో చప్పిడి సునీల్కుమార్ (37) నివాసం ఉంటున్నారు. అతన్ని రాజవోలుకు చెందిన డెన్వర్ విలియమ్స్, అతని భార్య మేరీ విలియమ్స్ కలసి హత్య చేశారు. దీనిపై అప్పటి సీఐ ఆర్జే రవికుమార్ కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్, కోర్టు కానిస్టేబుల్ పీవీవీఎస్డీ రమేష్ కేసు విచారణ సమయంలో సాక్ష్యాలను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. ఏపీపీ కె.కనకలింగేశ్వరరావు వాదనలు వినిపించారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. ఈ కేసులో రెండో నిందితురాలు మేరీ విలియమ్స్ 2022లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యువతి ఆత్మహత్య రాజమహేంద్రవరం రూరల్: ఉరివేసుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమహేంద్రవరం ఆవ వాంబే కాలనీలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఆవ వాంబే కాలనీకి చెందిన ముత్యాల భువనేశ్వరి (32) ఆరు నెలలుగా ఓ ప్రైవేటు సంస్థలో డేటా ఆపరేటర్గా పనిచేస్తుంది. గురువారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో భువనేశ్వరి వంట గదిలోకి వెళ్లి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భువనేశ్వరి తరచూ వంశీ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండేదని, పొరుగింట్లో ఉన్న లక్ష్మి అనే మహిళ భువనేశ్వరి పెద్దన్నయ్యకు గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఫోన్ చేసి చెప్పింది. వెంటనే అతను ఇంటికి వచ్చి చూడగా, వంట గదిలో భువనేశ్వరి ఉరివేసుకుని మృతి చెంది ఉంది. ఆమె తండ్రి ముత్యాల వీర్రాజు ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వరికి వంశీతో ఉన్న ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
బాలిక అదృశ్యం రోజున పెంపుడు కుక్క సంచారం
గోప్యంగా ఉంచిన విచారణ అధికారులు తుని రూరల్: మండలంలోని దొండవాక పంచాయతీ శివారు సీహెచ్ అగ్రహారంలోని ఆయిల్పామ్ తోటలో రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క అదేరోజు అదృశ్యమైందని అంతా భావించారు. అయితే ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అక్కడి వినాయకుడి గుడి వద్ద కుక్క సంచరించినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న జ్ఞానేశ్వరితో పాటు పెంపుడు కుక్క అదృశ్యమైన విషయం తెలిసిందే. చిన్నారితో పాటు అదృశ్యమైన ఆ కుక్క ఒంటరిగా మూడు రోజుల తర్వాత మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంటికి చేరింది. ఇలా చేరుకున్న కుక్క చిన్నారి తల్లి వద్దకు వెళ్లి చీరను నోటితో పట్టుకుంది. చిన్నారి జాడ చూపిస్తుందేమోనన్న ఆత్రుతలో కుక్క వద్దకు గాలింపు బృందాలు చేరుకున్నాయి. దీంతో ఆందోళన చెందిన కుక్క పరారైంది. అలా వెళ్లిన కుక్క అర్ధరాత్రి ఇంటికి చేరడంతో గాలింపు బృంద సభ్యులు వలలతో పట్టుకుని కట్టేశారు. మరుసటి రోజు సాయంత్రం కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చి, చిన్నారి జాడ తెలుసుకునేందుకు గాలింపు బృందాలు ప్రయత్నించాయి. జీపీఎస్ అమర్చిన తర్వాత ఎనిమిది కిలోమీటర్లు సంచరించిన కుక్క ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో నిరసించిపోవడంతో ఇనుప కోళ్లగూడులో ఉంచారు. మరుసటి రోజు ఉదయం ఆరుస్తూ అది చనిపోయింది. చనిపోయిన కుక్క కళేబరాన్ని ఎన్.సూరవరం వెటర్నరీ ఆస్పత్రికి తీసుకువెళ్లి పోస్ట్మార్టం నిర్వహించారు. కుక్క మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఏ కారణంతో చనిపోయిందో నిర్ధారించేందుకు కుక్క అవయవాలు సేకరించి ల్యాబ్కు పంపించారు. ఒకటి రెండు రోజుల్లో నివేదిక రానున్న సమయంలో చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం ఆ గ్రామంలో వినాయకుడి గుడి వద్ద కుక్క సంచరించినట్టు ప్రచారం జరిగింది. చిన్నారి అదృశ్యమైన సంఘటనలో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క సంచారాన్ని గోప్యంగా ఉంచడం, కొందరికే సమాచారం ఇవ్వడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 6న మధ్యాహ్నం గుడి వద్ద సంచరించిన కుక్క, జ్ఞానేశ్వరితో అదృశ్యమైన కుక్క ఒక్కటేనని ఎస్ఐ కృష్ణమాచారి శుక్రవారం తెలిపారు. మూడో రోజు కుక్క ఇంటికి రావడంతో సీసీ ఫుటేజ్లో గుర్తించిన విషయాన్ని దర్యాప్తులో భాగంగా వెల్లడించలేదన్నారు. అదృశ్యమైన జ్ఞానేశ్వరి వెంట పెంపుడు కుక్క వెళ్లలేదా, వెళ్తే చిన్నారిని రక్షించేందుకు వెళ్లొస్తూ అటువైపుగాా కనిపించిందా అనే సందిగ్ధత నెలకొంది. ఈ ఆధారమే చిన్నారి ఆచూకీ బయట పెడుతుందనే చర్చ జరుగుతోంది. -
ఆక్వా రైతులకు కూటమి వెన్నుపోటు
● అంతకంతకూ ఫీడ్ ధరల పెంపు సరికావు ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు రామారావు అల్లవరం: ఆక్వా రైతులకు అండగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం కంపెనీలతో కుమ్మకై ్క వెన్నుపోటు పొడుస్తుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబీ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు సిండికేట్గా మారి దశల వారీగా పెంచిన రూ. 14 మొత్తాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లవరం మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ ఆక్వా, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా రూ.వేల కోట్లు ప్రభుత్వానికి వస్తున్నాయన్నారు. ఆక్వా సాగు చేస్తున్న రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్ తయారు చేసే కంపెనీలు సిండికేట్గా మారి దశల వారీగా కిలోకి రూ.14 పెంచారని అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతుల రక్షణ కోసం అప్సాడా చట్టాన్ని ఏర్పాటు చేసి.. ఫీడ్ ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అంతేకాకుండా మూడు సార్లు ధరలు పెంచితే కంపెనీలతో మాట్లాడి ధరలు స్థిరంగా ఉండేలా చూశారన్నారు. ధరల స్థిరీకరణ ద్వారా రొయ్యల ధరలు పడిపోకుండా కాపాడారని తెలిపారు. ఆక్వా రైతులకు అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం, ఫీడ్ తయారీదారులకు బాసటగా నిలుస్తుందని విమర్శించారు. గత ఫిబ్రవరిలో కిలోకు రూ. 4 పెంచి, ఇప్పుడు మరో రూ. 10 పెంచి మొత్తంగా రూ. 14 అయిన తర్వాత దాని నుంచి కేవలం రూ. 4 తగ్గించి ఫీడ్ ధరలు తగ్గించామని కూటమి ప్రభుత్వం నాటాకాలు ఆడుతుందని మండిపడ్డారు. రొయ్యలు కిలోకు రూ. 50 తగ్గించి, తిరిగి రూ. 20 పెంచినట్లు చూపుతూ రైతులను మోసగిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, కంపెనీలు ఏకమై ఆక్వా రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. పెరిగిన ధరలను పూర్తి స్థాయిలో తగ్గించేంత వరకూ వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని రామారావు అన్నారు. -
చోరీ కేసులో పని మనిషే నిందితురాలు
ఉప్పలగుప్తం: చోరీ కేసులో పని మనిషే నిందితురాలిగా తమ విచారణలో తేలిందని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఎస్.యానాం గ్రామానికి చెందిన చెలుకూరి రాంబాబు భార్య అనంతలక్ష్మి వైద్యం నిమిత్తం 2022 నుంచి విశాఖపట్నం జిల్లా మధురవాడలో ఉండేవారు. అనంతలక్ష్మికి సహాయకురాలిగా విజయనగరం జిల్లా గట్యాడ మండలం, బుడతనపల్లి గ్రామానికి చెందిన బోనంగి శాంతిని పనిలో పెట్టుకున్నారు. ఇటీవల రాంబాబు, అనంతలక్ష్మి దంపతులు మధురవాడలో ఇల్లు ఖాళీ చేసి స్వగ్రామం ఎస్.యానాం వచ్చేశారు. అయితే ఇంట్లో పనిచేస్తున్న శాంతిని కూడా వెంట తీసుకొచ్చి మూడు రోజులున్న తర్వాత ఆమెను ఊరికి పంపించారు. ఆమె వెళ్లిన తర్వాత ఇంట్లో బీరువా తాళాలు కనబడకపోవడంతో పగులు గొట్టి తెరిచారు. అందులో 18 కాసుల బంగారు ఆభరణాలు కనిపించక పోవడంతో గత నెల 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసి, పనిమనిషే నిందితురాలు అని తేల్చారు. దీనిపై శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రసాద్, సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్ఐ జానీ బాషాలు వివరాలు వెల్లడించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. యజమాని రాంబాబుకు ఆభరణాలను అందజేశారు. కేసును ఛేదించిన సిబ్బంది, హెచ్సీలు బీవీ గిరి, హరినాథ్, కానిస్టేబుళ్లు నాగరాజు, కరీంచంద్, ఆర్.కనకదుర్గలను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. బ్లేడ్తో దాడి చేసిన వ్యక్తికి రిమాండ్ సీతానగరం: దాడి కేసులో ఓ వ్యక్తికి కోర్టు రిమాండ్ విధించింది. ఎస్సై ఎల్.శ్రీనునాయక్ కథనం ప్రకారం.. రాజానగరం మండలం రఘునాథపురానికి చెందిన మట్ట చిన్నారావు తన మేనత్త కుమారుడి వివాహ వేడుకకు ఏప్రిల్ 26న బొబ్బిల్లంక వచ్చాడు. తర్వాత రోజు మధ్యాహ్నం 3 గంటలకు బొబ్బిల్లంకలోని రామాలయం వద్ద కూర్చుని ఉండగా.. బత్తిన దుర్గాప్రసాద్, మట్ట శివకృష్ణ, లంజపల్లి సుధీర్లు మోటారు సైకిల్పై వచ్చి చిన్నారావు వీపుపై పోల్డింగ్ బ్లేడ్తో గాయపరిచారు. బాధితుడు సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కవలగొయ్యి గ్రామంలో నిందితుడు దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారని ఎస్సై తెలిపారు. -
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షల్లో ఫస్టియర్ 28.7, సెకండియర్ 46.9 శాతం చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ పరీక్షలకు ఎయిడెడ్ కళాశాలల నుంచి 31 మంది హాజరవగా ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ సంస్థల నుంచి 60 మంది పరీక్షలు రాయగా 23 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి 673 మందికి 203 మంది, హైస్కూల్ ప్లస్ విభాగంలో 179 మందికి 33, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో 1,967 మందికి 575 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో ఎయిడెడ్ కళాశాలల నుంచి 33 మందికి ఏడుగురు ఉత్తీర్ణులయ్యారు. ఏపీఎస్డబ్ల్యూఆర్ నుంచి 32 మందికి 16 మంది, ప్రభుత్వ కళాశాలల నుంచి 552కు 269, హైస్కూల్ ప్లస్ విభాగంలో 122కు 48, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలల్లో 2,046 మందికి 967 మంది చొప్పున విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వారకా తిరుమల.. అ‘ద్వితీయం’ ద్వారకా తిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకా తిరుమల దేవస్థానానికి రెండో ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం, తాగునీటి వసతులు, ప్రసాదం రుచి, పారిశుధ్యం అంశాలపై ప్రభుత్వం సర్వే చేస్తోంది. ఇందులో గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించిన ద్వారకా తిరుమల దేవస్థానం, జూన్ నెలకు సంబంధించి ఈ నెల 16న వెలువడిన సర్వేలో ఓ మెట్టు దిగి, ద్వితీయ స్థానంలో నిలిచింది. దర్శనం, సౌకర్యాల కల్పన, ఇతర అంశాల్లో శ్రీకాళహస్తి 1, ద్వారకా తిరుమల 2, 3, సింహాచలం 4, 5, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం 6, శ్రీశైలం 7 (చివరి) స్థానాలు సాధించాయి. వెంకన్న హుండీ ఆదాయం రూ.2.44 కోట్లు ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 34 రోజులకు రూ.2.44 కోట్ల ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరావు తెలిపారు. దేవదాయ శాఖ పర్యవేక్షణాధికారులు సహాయ కమిషనర్, మందేశ్వర స్వామి ఆలయ ఈఓ దారపు రెడ్డి సురేష్బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈఓలు, ఆత్రేయపురం బి.నరేంద్ర, వెలిచేరు ఎం.సత్యనారాయణల సమక్షంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించామని పేర్కొన్నారు. ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి ఆలయ హుండీలతో కలిపి రూ.1.77 కోట్లు, అన్నప్రసాద హుండీల ద్వారా రూ.66.55 లక్షల ఆదాయం లభించిందని వివరించారు. అలాగే, 52 గ్రాముల బంగారం, 1.588 కిలోల వెండి, 18 దేశాలకు చెందిన 77 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని ఈఓ తెలిపారు. -
సేంద్రియ సాగుపై యువత దృష్టి సారించాలి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): యువత సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించేలా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. స్థానిక ఐసీఏఆర్ – జాతీయ వాణిజ్య పంటల పరిశోధన సంస్థ (నిర్కా) ఆధ్వర్యాన ఆ సంస్థ సెమినార్ హాలులో గురువారం నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆయన గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గ్యాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై ఏడాది పాటు అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, ప్రతి రైతూ సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి సారించాలని అన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, రైతునేస్తం ఫౌండేషన్ అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరరావు, నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్, జిల్లా వనరుల కేంద్రం సహాయ సంచాలకులు ఎస్.జయరామలక్ష్మి తదితరులు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా నేల పరీక్ష – పంట స్పందన ఆధారిత ఎరువుల సిఫారసు మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. దీని ద్వారా రైతులు తమ నేల పరీక్ష ఫలితాలు, లక్ష్య దిగుబడి ఆధారంగా వివిధ పంటలకు అవసరమైన శాసీ్త్రయ ఎరువుల మోతాదులను తక్షణమే తెలుసుకోవచ్చని, సమతుల ఎరువుల వినియోగాన్ని అమలు చేయవచ్చని శాస్త్రవేత్తలు వివరించారు. ‘నేల ఆరోగ్య నిర్వహణలో వినూత్న సాంకేతికతలు’ బులిటెన్ను కూడా ఆవిష్కరించారు. -
రాళ్లు కట్టి చెరువులో పడేసి..
ఫ ఆక్వా రైతు దారుణ హత్య ఫ కూలీలపైనే అనుమానం ఫ కోనసీమ జిల్లాలో కలకలం బయటి వ్యక్తులే అధికం ఈ హత్య ఘటన జిల్లాలో ఆక్వా రైతుల్లో కలవరం రేపింది. ఆక్వా చెరువుల వద్ద స్థానిక కూలీల కన్నా కాకినాడ జిల్లాతో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన వారు, ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన స్థానికేతరులు అధికంగా ఉంటున్నారు. 90 శాతానికి పైగా వీరే కావడం గమనార్హం. గత ఏడాది నవంబరు 19న రావులపాలెంలో మావోయిస్టు సరోజ్ మడవి (మాడ్వీ హాంధా)ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను మావోయిస్టు అగ్రనేత మాద్వి హిడ్మాకు అనుచరుడు. అదే సమయంలో మావోయిస్టుల కమ్యూనికేషన్ కమాండర్గా పనిచేశాడు. కోనసీమలో దాచుకోవడానికి వచ్చిన ఆయన సఖినేటిపల్లిలో ఆక్వా చెరువుల వద్ద సుమారు ఆరు నెలల పాటు పనిచేశాడు. అతని అరెస్టుతో అప్పట్లో ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తాజాగా కృష్ణంరాజు హత్యతో మరోసారి ఉలిక్కిపడ్డారు. స్థానిక కూలీల కంటే సగం ధరకే ఇతర ప్రాంతాల వాసులు చెరువుల వద్ద పనులకు రావడం, వారు 24/7 చెరువుల వద్దనే నివాసముండి పనిచేయడంతో ఆక్వా రైతులతో పాటు పీచు ఉత్పత్తిదారులు వీరిపైనా ఆధారపడుతున్నారు. అయితే పనులకు పెట్టుకుంటున్న వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డు లు చూడకుండా, కనీసం తెలుసున్న జట్టు మేస్త్రితో సంబంధం లేకుండా నేరుగా కూలీలను నియమిస్తే ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఐ.పోలవరం: దాడి చేసి, ఆపై రాళ్లతో కట్టి చెరువులో ఓ ఆక్వా రైతును పడేసి దారుణంగా హత్య చేశారు. అక్కడ పనికి వచ్చిన వారే ఈ ఘటనకు పాల్పడినట్టు స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మురమళ్లకు చెందిన ఆక్వా రైతు దాట్ల కృష్ణంరాజు అనే లొల్ల కృష్ణ (64) బుధవారం రాత్రి తన సొంత చెరువుల వద్ద హత్యకు గురయ్యాడు. కొత్త మురమళ్ల వద్ద ఉన్న తన సొంత ఆక్వా చెరువుల వద్దకు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లాడు. ఎంత సేపటికీ రాకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాప్ అని వస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సహకారంతో అతని వెతికేందుకు ఆక్వా చెరువుల వద్దకు వెళ్లారు. అక్కడ చెప్పులు, రక్తపు మరకలు కనిపించాయి. కాని రైతు కృష్ణంరాజు జాడ తెలియలేదు. ఇదే సమయంలో చెరువుల వద్ద పనిచేస్తున్న కూలీలు కనిపించలేదు. వారికి ఫోన్ చేయగా, రైతు కృష్ణంరాజు తమకు రూ.ఏడు వేల సొమ్ము ఇచ్చేశారని, ఇంటికి వెళ్లిపోతున్నామని, ఆయన గురించి తమకేమీ తెలియదని చెప్పారు. కృష్ణంరాజు మోటారు సైకిల్ మురమళ్ల ఇరిగేషన్ రెగ్యులేటర్ వద్ద కనిపించింది. ఇవన్నీ చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, వారికి అనుమానం వచ్చి చెరువులో వెతుకులాట ప్రారంభించారు. చెరువులో అతని మృతదేహం లభ్యమైంది. రాళ్లు కట్టి.. చెరువులో వదిలేసి కృష్ణంరాజు మృతదేహాన్ని చూస్తే కొట్టి చంపి, రాళ్లు కట్టి రొయ్యల చెరువులో పడేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక్కడ పనికి వచ్చిన వారే ఈ దుర్ఘటనకు పాల్పడినట్టు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. పది రోజుల క్రితమే ఆ కూలీలు ఇక్కడ పనిచేసేందుకు వచ్చినట్టు తెలిసింది. పైగా వీరికి గంజాయి తాగే అలవాటు ఉందని అనుమానంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారిస్తున్నారు. విశాఖ జిల్లా కొయ్యూరు ప్రాంతానికి చెందిన కూలీలుగా పోలీసులు నిర్ధారించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చెరువు వద్ద కృష్ణంరాజుకు పని చేసేందుకు వచ్చిన వారి మధ్య అరుపులు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు ఘటనా స్థలానికి వచ్చి హత్య జరిగిన తీరును పరిశీలించారు. కృష్ణంరాజు హత్య ఘటనలో కూలీలపైనే బలమైన అనుమానం ఉందని జిల్లా డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఘటన అనంతరం పనివారు తమ నివాసాన్ని ఖాళీ చేసి పరారైనట్లు గుర్తించామన్నారు. వారిని పట్టుకునేందుకు విజయవాడ నుంచి ఎఫ్ఎస్ఎల్ బృందాన్ని రప్పించామన్నారు. -
ఉద్యోగం వల.. రూ.లక్షల్లో జెల్ల
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉద్యోగం పేరుతో ఎర వేశాడు.. ఆశ పడిన వారిపై వల విసిరాడు.. లక్షల రూపాయలు వసూలు చేశాడు.. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాడు.. చివరకు జాడ లేకుండా మాయమయ్యాడు.. ఆ మోసగాడు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ నకిలీదని తేలడంతో బాధితులు గొల్లుమంటున్నారు. వివరాలివీ.. విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన కొచెర్ల వెంకటేశ్వరరావుకు సికింద్రాబాద్ చిరునామాతో ఉన్న ఓ కన్సల్టెన్సీ పేరిట 90309 12837 నంబర్ నుంచి వివిధ ఉద్యోగాలకు సంబంధించి వాట్సాప్ మెజేజ్లు వచ్చేవి. గత ఏడాది అక్టోబర్ 15 నుంచి ఈ మెసేజ్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైద్య, ఆరోగ్య శాఖలో వివిధ ఖాళీలు భర్తీ చేస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం కొచెర్ల వెంకటేశ్వరరావుకు మెసేజ్ వచ్చింది. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నర్సింగ్ విభాగంలో పని చేస్తున్న తన తమ్ముడి భార్య లక్ష్మికి అతడు ఈ మెసేజ్ చూపించాడు. దీంతో, ఆశ కలిగి ఆ నంబరులో సంప్రదించారు. తన పేరు వెంకటేశ్వరావు అని, విజయవాడలో ఉంటామని అవతలి వ్యక్తి (నిందితుడు) చెప్పాడు. విశాఖపట్నంలో 2, రాజమహేంద్రవరంలో ఒకటి చొప్పున జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపాడు. జీతం నెలకు రూ.38 వేల నుంచి రూ.48 వేల వరకూ వస్తుందని ఎర వేశాడు. ఈ ఉద్యోగం కావాలంటే రూ.8 లక్షలు ఖర్చవుతుందని, తనను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో కలవాలని చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాధితులు ఈ నెల 9న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చి ఆ మోసగాడికి ఫోన్ చేశారు. దీంతో, మార్చురీ నుంచి ఒకరు, బ్లడ్ బ్యాంక్ నుంచి మరొకరు వచ్చి బాధితులను కలిశారు. అనంతరం, ప్రభుత్వ అఽధికారిక వెబ్సైట్ అయిన హెచ్ఎంఎఫ్డబ్ల్యూ.ఏపీ.జీఓవీ.ఇన్లో లక్ష్మి వివరాలు నమోదు చేసి, 4291 నంబర్తో ఎంప్లాయీ ఐడీ కూడా చూపించారు. రాజమహేంద్రవరంలో ఉద్యోగం వచ్చేసిందని చెప్పారు. ఆ మాటలు నమ్మిన లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు ఆ మోసగాడి చేతికి రూ.7.50 లక్షల నగదు ఇచ్చారు. నిందితుడి భార్య కురుకు సంతోషి పేరుతో ఉన్న నంబర్కు మరో రూ.50 వేలు ఫోన్పే చేశారు. డబ్బులు చెల్లించిన అనంతరం, ఉద్యోగం వస్తుందని నమ్మకమేమిటని ప్రశ్నించగా ఆ మోసగాడు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పేరిట రూ.8 లక్షలకు కె.సంతోషి సంతకంతో ఉన్న ఓ చెక్ కూడా వారికి ఇచ్చాడు. దీంతో, అతడిని వారు పూర్తిగా నమ్మారు. అనంతరం, వారిని ఆ మర్నాడు రమ్మని ఆ మోసగాడు చెప్పాడు. ఆ మేరకు అతడిని వారు ఆ మర్నాడు కలిశారు. సీఎం చంద్రబాబు ఫొటో, ప్రభుత్వ లోగోతో ఉన్న అపాయిట్మెంట్ లెటర్, సర్వీస్ రిజిస్టర్ను వారి చేతిలో ఆ మోసగాడు పెట్టాడు. అయితే, మొదట్లో జరిగిన చర్చల్లో తమకు విశాఖపట్నంలో పోస్టింగ్ కావాలని బాధితులు కోరారు. ఈ నేపథ్యంలో బాధితుడు మరో ఎత్తు వేసి, వారిని బురిడీ కొట్టించాడు. విశాఖపట్నంలో ఎంపికై న వారు జాయి్ అవడం లేదని, వెంటనే కేజీహెచ్కు వెళ్లాలని, తాను మధ్యలో కలుస్తానని లక్ష్మికి, ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో, వారు ఆనందంగా విశాఖపట్నం బయల్దేరారు. మార్గం మధ్యలో ఆ మోసగాడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో, అనుమానం వచ్చిన వారు రాజమహేంద్రవరంలోని వైద్య, ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో, ఆ ప్రబుద్ధుడు చేసిన మోసం బట్టబయలైంది. లక్ష్మికి అతడు ఇచ్చిన నియామక పత్రాన్ని, సర్వీస్ రిజిస్టర్ను పరిశీలించిన అధికారులు అవి నకిలీవని నిర్ధారించారు. ఈ మేరకు బాధితులు గురువారం స్థానిక త్రీటౌన్ పోలీసులను ఫిర్యాదు చేశారు. సీఐ వి.అప్పారావు వారిచ్చిన ఫోన్ నంబర్ ప్రకారం వివరాలు సేకరించారు. అందులో నిందితులు అనంతపురానికి చెందిన వనం నాగరాజు, వనం రామానుజమ్మగా గుర్తించారు. జీఎన్ఎం పోస్టు ఇస్తామంటూ ఎర రూ.8 లక్షల వసూలు నకిలీ అపాయింట్మెంట్ లెటర్ అందజేత నిజం తెలిసి గొల్లుమంటున్న బాధితులు -
వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు
● మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుకు మద్దతుగా వచ్చిన జనం ● అనుమతి లేకుండా నినాదాలు చేశారని 100 మందిపై కేసు దేవరపల్లి: స్థానిక పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై నిలబడి నినాదాలు చేసిన వైఎస్సార్ సీపీ శ్రేణులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పాత జీఎన్టీ రోడ్డుపై వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఆయన ఇద్దరు కుమారులు, సుమారు 100 మంది కలసి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా గుమిగూడారని, రోడ్డుపై నినాదాలు చేస్తూ సమావేశం నిర్వహించారని చెప్పారు. మేకా శేషుబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేయడంతో పాటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని అన్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న అందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసు విచారణ త్వరితగతిన చేపట్టి, ఫొటోలు, వీడియోలు, డ్రోన్ వీడియోల ద్వారా అందరినీ గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాహనాలను కూడా సీజ్ చేస్తామని సీఐ తెలిపారు. విచారణకు శేషుబాబు హాజరు దేవరపల్లి పోలీస్ స్టేషన్లోని సర్కిల్ కార్యాలయంలో విచారణకు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు హాజరయ్యారు. ఆయనను సీఐ నాయక్ సుమారు 2 గంటల పాటు విచారించారు. అనంతరం 41 నోటీసు ఇచ్చి ఈ నెల 29న మళ్లీ విచారణకు హాజరు కావాలని పంపించారు. విచారణ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, గౌడ సంఘాల నాయకులు శేషుబాబుకు మద్దతుగా పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన శేషుబాబు మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదలను చూడలేక కూటమి నాయకుల అండదండలతో తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కంపెనీలకు సంబంధించిన వివాదం న్యాయస్థానం పరిధిలో ఉందన్నారు. అయినప్పటికీ అక్రమంగా కేసులు పెట్టి, విచారణకు పిలిచి అవమానిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలపై నిలదీస్తున్నామనే కక్షతో, రాజకీయ ఒత్తిళ్లతో తనపై అక్రమ కేసులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. -
ఉర్రూతలూగించిన నాటక ప్రదర్శనలు
ఫ వానపల్లిలో ప్రముఖ రంగస్థల నటుల సందడి ఫ వందలాదిగా తరలివచ్చిన కళాభిమానులు కొత్తపేట: మండలంలోని వానపల్లి శ్రీభద్రాద్రి సీతారామస్వామివారి ఆలయం వద్ద బుధవారం రాత్రి పౌరాణిక నాటక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, పళ్లాలమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ కామిశెట్టి అమ్మన్న నాయుడు, పద్మావతి దంపతులు సుమారు రూ.20 లక్షలతో రామాలయాన్ని పునర్నిర్మించారు. బుధవారం విగ్రహాల ప్రతిష్ఠను పురస్కరించుకుని పౌరాణిక నాటకాలను, ఆ కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఆలయ నిర్మాత అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తున్న ప్రముఖ నటులను ఏరికోరి ఆయా పాత్రలకు కూర్చారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పౌరాణిక రంగస్థల కళాకారులుగా రాణిస్తున్న నటీనటులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో సత్యహరిశ్చంద్ర (వారణాసి, కాటి సన్నివేశం), రామాంజనేయ యుద్ధం నాటక ప్రదర్శనలు ఇచ్చారు. వారణాసి సన్నివేశం నుంచి ప్రస్తుత మూడో తరం నటుల్లో రంగస్థల రారాజుగా గుర్తింపు పొందిన జూనియర్ డీవీ సుబ్బారావు హరిశ్చంద్రునిగా, రంగస్థల కోకిలగా ఖ్యాతి పొందిన రత్నశ్రీ చంద్రమతిగా, నక్షత్రకునిగా లతాశ్రీ , వీరబాహుడిగా సత్యప్రసాద్ తదితరులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. యువకులు సైతం ఆ రాగాలాపనలో లీనమైపోయి ఈలలు, కేరింతలతో కళాకారులను ఉత్సాహపరిచారు. డీవీ సుబ్బారావు, రత్నశ్రీ ఉన్నత శృతిలో ఆలపించిన పద్యాలను గమనిస్తే రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలను తలపించాయి. ఇవి అందరినీ ఆకట్టుకున్నాయి. పోటాపోటీగా తండ్రీ తనయులు రామాజంజనేయ యుద్ధం నాటకంలో ఆంజనేయుడి పాత్ర అంటే గుర్తువచ్చే పేరు పేపకాయల లక్ష్మణరావు (సంపత్ నగర్). నంది అవార్డు గ్రహీత, అభినవ ఆంజనేయునిగా పేరొందిన లక్ష్మణరావు తనయుడు రామాంజనేయులు రాముడిగా, మనుమడు జూనియర్ లక్ష్మణరావు ఆంజనేయుడిగా యుద్ధ సన్నివేశంలో నువ్వా.. నేనా అన్నట్టు పోటాపోటీగా నటించారు. పద్యాలు ఆలపించి ప్రేక్షకులను మెప్పించారు. కళాభిమానులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి గురువారం ఉదయం వరకూ ఉండి ప్రదర్శనలను తిలకించారు. అనంతరం రంగస్థల నటులను అమ్మన్న నాయుడు ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల ప్రముఖులు ఘనంగా సత్కరించారు. బిళ్లకుర్రు మాజీ సర్పంచ్ నెల్లి లక్ష్మీపతిరావు, ట్రాన్స్కో డీఈఈ రామకృష్ణ, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి బండారు దొరబాబు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, ప్రముఖ వ్యాపారవేత్తలు గొలకోటి సోమరాజు, సింగిరెడ్డి గోవిందస్వామి, చీకట్ల నాని తదితరులు పాల్గొన్నారు. -
లగ్గం కుదిరింది..
ఆషాఢంలో మళ్లీ విరామం ఆషాఢ మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదనే అభిప్రాయం ఉంది. దాని ప్రకారం ఏ సంవత్సరంలోనూ ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు. అదే ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు వివాహాది శుభ కార్యాలు జరగవు. తిరిగి శ్రావణ మాసం అంటే, ఆగస్టు 15 నుంచి మళ్లీ పెళ్లి బాజా మోగనుంది. ఫ నేటి నుంచి రత్నగిరిపై మోగనున్న పెళ్లి బాజా ఫ నెల రోజుల తర్వాత తిరిగి సందడి ఫ నవ దంపతులతో కళకళలాడనున్న సత్యదేవుని ఆలయం అన్నవరం: మూడు ముళ్ల బంధానికి లగ్గం కుదిరింది.. ఏడడుగులతో సాగే పయనానికి మంచి గడియ రానే వచ్చింది.. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో నిజ జ్యేష్ట మాసం సందర్భంగా తిరిగి శుక్రవారం నుంచి పెళ్లి బాజా మోగనుంది. అధిక జ్యేష్ట మాసం నేపథ్యంలో నెల రోజులు పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. తిరిగి రత్నగిరి నవ దంపతులతో సందడిగా మారనుంది. ఈ మాసంలో సుమారు 600 వివాహాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏటా చైత్ర మాసం నుంచి అంటే మార్చి– ఏప్రిల్ నుంచి జ్యేష్ట మాసం అంటే జూలై వరకూ వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది చైత్ర, వైశాఖ మాసాల్లో అంటే మార్చి తొమ్మిదో తేదీ నుంచి ఏప్రిల్, మే 11 వరకూ వివాహాలు జరిగాయి. ఆ తరువాత అధిక జ్యేష్ట మాసం వివాహాది శుభకార్యాలకు మంచిది కాదన్న పండితుల సూచనలతో మే 17 నుంచి జూన్ 15 వరకూ వివాహాది శుభకార్యాలేవీ జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ట మాసం ప్రారంభమైంది. తిరిగి 19వ తేదీ శుక్రవారం నుంచి వివాహ శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. పెళ్లిళ్లన్నీ కల్యాణ మండపాల్లోనే.. ఫ అన్నవరం దేవస్థానంలో ఏటా చైత్ర మాసం నుంచి జ్యేష్టం వరకు వివాహాలు ఆలయ ప్రాంగణంతో పాటు కల్యాణ మండపాల్లో జరుగుతాయి. అయితే వర్షాకాలం ప్రారంభం కావడంతో ఈ సారి వివాహాలన్నీ కల్యాణ మండపాలు, విశ్రాంతి షెడ్లలోనే జరుగనున్నాయి. ఫ సత్యగిరిపై దాత, పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే శ్రీనివాస్ దంపతులు నిర్మించిన శ్రీసత్య శ్రీనివాసా కల్యాణ మండపంలో 12 చిన్న వివాహ మండపాలు, అదే విధంగా విశాఖపట్నానికి చెందిన పారిశ్రామికవేత్త ఎంఎస్ రెడ్డి నిర్మించిన శ్రీఎంఎస్ రెడ్డి అంజనీ వివాహ వేదికలో 12 చిన్న కల్యాణ మండపాల్లో వివాహ ముహూర్తానికి 24 వివాహాలు జరుగనున్నాయి. ఈ కల్యాణ మండపాలను పెళ్లి బృందాలు ఇప్పటికే రిజర్వ్ చేసుకున్నాయి. ఫ దేవస్థానంలోని సత్యగిరిపై విష్ణు సదన్ సత్రంలోని 36 మ్యారేజ్ హాళ్లలో ఈ ముహూర్తాలకు వివాహాలు జరుగనున్నాయి. వీటితో పాటు రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో కూడా వివాహాలు చేయనున్నాయి. ఫ అన్నవరంలోని సుమారు 20 లాడ్జీలలో కల్యాణ మండపాలలో కూడా వివాహాలు జరుగనున్నాయి. సందడే సందడి.. పెళ్లిళ్ల సందడి మొదలు కావడంతో క్యాటరింగ్, సన్నాయి మేళం, పురోహితులకు డిమాండ్ ఏర్పడింది. వివాహ ముహూర్తాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి కూడా భక్తుల తాకిడి పెరగనుంది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు కూడా సత్యదేవుని ఆలయానికి విచ్చేయనున్నారు. వచ్చే నెల తొమ్మిది వరకు.. శుక్రవారం జ్యేష్ట పంచమి ఆశ్రేష నక్షత్రం సందర్భంగా రాత్రి 9.15 గంటల ముహూర్తంలో వివాహాలు జరుగనున్నాయి. ఈ నెల 20, 21, 22, 24, 25, 26, 27 తేదీల్లో, తిరిగి జూలై ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. -
ఏదీ సిరుల ఝరి?
● వచ్చే ఏడాదే గోదావరి పుష్కరాలు ● జిల్లాలో వివిధ పనులకు రూ.2 వేల కోట్లతో అంచనాలు ● ఏడాది కిందటే ప్రతిపాదనలు పంపిన అధికారులు ● నేటికీ నయాపైసా ఇవ్వని ప్రభుత్వం ● మంజూరుపై స్పష్టత కరువు సాక్షి, రాజమహేంద్రవరం: అంతన్నారింతన్నారే.. అన్నట్టుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పని తీరు. గోదావరి పుష్కరాలకు సరిగ్గా ఏడాది కాలం ఉంది. అలా చేసేస్తాం.. ఇలా చేసేస్తాం.. పుష్కరాలను కుంభమేళాలా నిర్వహించేస్తాం.. అని ప్రభుత్వ పెద్దలు తరచుగా చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు నెలలో రెండుమూడుసార్లు సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఘాట్లను పరిశీలించడం, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించడం మంత్రి, ఎమ్మెల్యేలకు నిత్యకృత్యమవుతోంది. పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభించేస్తామని అంటున్నారు. మాటలు కోటలు దాటుతున్నాయి. కానీ, చేతలు మాత్రం క్షేత్ర స్థాయిలో గడప దాటడం లేదు. పుష్కర నిధుల కోసం ప్రతిపాదనలు పంపించి ఏడాది దాటుతున్నా.. చంద్రబాబు ప్రభుత్వం నయాపైసా కూడా విదల్చలేదు. దీంతో, నిధులు విడుదల చేయకుండా పనులు ఎలా చేపట్టగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆరు జిల్లాలు.. రూ.8 వేల కోట్లు.. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆరు జిల్లాల్లో పుష్కరాల పనులు చేపట్టేందుకు అధికారులు రూ.8 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. తూర్పు గోదావరి జిల్లాలో 102, పశ్చిమ గోదావరి జిల్లాలో 40, కోనసీమలో 175, కాకినాడలో 6, ఏలూరు జిల్లాలో 36 చొప్పున ఘాట్లు అభివృద్ధి చేసేందుకు అంచనాలు సిద్ధం చేశారు. వీటితో పాటు వివిధ అభివృద్ధి పనులకు రూ.8 వేల కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఏడాది దాటుతున్నా ఈ ప్రతిపాదనలకు నేటికీ అతీగతి లేదు. వీటిని ఆమోదించారా.. తిరస్కరించారా.. అసలు నిధులు విడుదల చేస్తారా.. లేదా.. అనే విషయంపై స్పష్టత కరువైంది. నిధుల ప్రవాహమేదీ! జిల్లావ్యాప్తంగా పుష్కరాల పనులకు తొలి దశలో రూ.1,578 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. వాటిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేదు. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో వివిధ పనులు చేపట్టేందుకు రూ.2,105.96 కోట్లతో ఏడాది క్రితం రెండోసారి ప్రతిపాదనలు అందజేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం నయాపైసా కూడా విడుదల చేయలేదు. పైగా పుష్కరాలకు సంబంధించి ఇటీవల మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగా చేపట్టాల్సిన పనుల జాబితాను ఆయనకు అధికారులు అందించారు. ఆ సందర్భంగా నిధులు త్వరలోనే విడుదల చేస్తామని మాత్రం చెప్పారు. సమీక్ష జరిగి నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినా.. పుష్కరాల పనులు, గోదావరి కాలుష్యం పరిశీలనకు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం వచ్చారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమై, గోదావరి పుష్కరాల పనులపై చర్చించారు. పనులు అలా చేయాలి.. ఇలా చేయాలని అంటూ అధికారులకు సూచనలు చేశారు. నిధులు విడుదల కాకుండా పనులు ఎలా చేస్తారని అక్కడే ఉన్న ఓ బీజేపీ నేత, మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వచ్చే వరకూ చూడకుండా శాఖల వారీగా నిధులు వెచ్చించాలంటూ పవన్ ఓ ఉచిత సలహా ఇచ్చి మిన్నకుండిపోయారని అంటున్నారు. దీనినిబట్టి చూస్తే.. పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందా, లేదా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రం పైనే ఆశలు? పుష్కరాలకు నిధులు విడుదల చేయకుండా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని, కేంద్రం నుంచి విడుదలయ్యే నిధుల పైనే ఆధారపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపాదనలు పంపినా.. నిధుల విడుదలపై స్పష్టత ఇవ్వడం లేదనే వాదన వినిపిస్తోంది. మరోవైపు నిధుల విడుదలపై కేంద్రం సైతం ఎలాంటి స్పష్టతా ఇవ్వడం లేదు. దీంతో, పుష్కర నిధులపై సందిగ్ధత నెలకొంది. స్వల్ప వ్యవధిలో సాధ్యమేనా? పుష్కరాలకు ఏడాది మాత్రమే గడువు ఉంది. ఈలోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి. మౌలిక వసతులు కల్పించాలి. ప్రధానంగా ఘాట్ల విస్తరణ, దగ్గరగా ఉన్నవాటి అనుసంధానం, కొవ్వూరు, నిడదవోలుల్లో ఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం పుష్కర ఘాట్లో ఉన్న రాళ్లను తీసి కొత్తవి అమర్చడం, వీఐపీ ఘాట్ వద్ద ఆధునీకరణ, అప్పర్ రివర్ఫ్రంట్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. మిగిలిన వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వచ్చే నెల నుంచి గోదావరికి వరదలు వస్తాయి. వర్షాలు విస్తారంగా కురుస్తాయి. దీంతో, పనుల నిర్వహణ అసాధ్యం. ఆ తరువాత పుష్కరాలకు ఆరు నెలలు మాత్రమే సమయం ఉంటుంది. అంత స్వల్ప వ్యవధిలో పుష్కరాల పనులు చేయడం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో పనులు ఈపాటికే ప్రారంభించాలి. కానీ, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు ప్రశ్నార్థకమవుతున్నాయి. చివరిలో హడావుడిగా పనులు చేపట్టి, వచ్చిన నిధులు మింగేసేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ప్రభుత్వం ఈ తాత్సారం చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్
14 బైక్ల స్వాధీనం అనపర్తి: వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఓ బాలుడితో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. గురువారం అనపర్తి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బుధవారం స్థానిక ఐఎల్టీడీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా, అనపర్తితో పాటు పది చోట్ల ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్టు అంగీకరించారని అన్నారు. ఇందులో రాజమహేంద్రవరం రామదాసుపేటకు చెందిన దుప్పాడ అనిల్ కుమార్ (బూస్ట్), అనపర్తికి చెందిన బహదూర్ బబ్లు, మరో బాలుడు ఉన్నారన్నారు. వారి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన 14 బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. అనిల్కుమార్పై ఇప్పటికే 16 చోరీ కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించడంలో ప్రధాన భూమిక పోషించిన అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, ఎస్సై వినయ్ ప్రతాప్, సిబ్బంది శివ, త్రిమూర్తులును డీఎస్పీ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ కవి మృతి
పి.గన్నవరం : రాజవరం – పొదలాడ రోడ్డులో బెల్లంపూడి గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావులపాలెం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న ప్రముఖ కవి కొప్పాడి శ్రీనివాస్ (47) మృతి చెందారు. పి.గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ముమ్మిడివరం ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆయన పలు కవిత్వాలు రాశారు. కొన్ని తెలుగు ఆల్బమ్స్కు పాటలు కూడా రాశారు. గురువారం రాజమహేంద్రవరం నుంచి నుంచి పోతవరం గ్రామంలోని స్వగృహానికి మోటార్ సైకిల్పై వస్తుండగా, బెల్లంపూడి వద్ద అదుపుతప్పి కొబ్బరి చెట్టును ఢీకొని పడిపోయారు. దీంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనకు భార్య ఉషారాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరితో మంచిగా ఉండే కవి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ తెలిపారు. -
‘రెడ్బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడింది’
సాక్షి, కాకినాడ జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం నిజ స్వరూపం బయటపడిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను విచ్చలవిడిగా చేతిలో అస్త్రంలా టీడీపీ వాడుకొంటోంది. విజయవాడ లాకప్ డెత్ ఘటన.. చట్టాలు, మానవ హక్కులు లేవని చెప్పింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ మాట్లాడితే కులం రంగు పులుముతున్నారని ఆయన మండిపడ్డారు.‘‘లాకప్ డెత్ మానవ హక్కులకు సంబంధించిన విషయం. దీంట్లో కులాల్ని, మతాలను తీసుకువచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు. చంద్రబాబుకు మద్దతుగా సొంత మీడియా రంగంలోకి వచ్చేసింది. లాకప్ డెత్ ఇష్యూలో పవన్ కళ్యాణ్ను ఇరికించాలని వైఎస్ జగన్ మాకు ఆదేశించినట్లు.. దానికి పర్యవేక్షణ బాధ్యత నాకు ఇచ్చినట్లుగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది. పవన్ను ఇరికించాలని వైఎస్ జగన్ ఎందుకు అంటారు?. వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.రాష్ట్రంలో శాంతి భద్రతలు చూసే హోం మంత్రి, ముఖ్యమంత్రి లాకప్ డెత్ ఘటనకు బాధ్యులు. వీరితో పాటుగా డీజీపీ, సీపీ, ఏసీపీ, సీఐ, ఇతర స్టాప్ బాధ్యులు. చంపేసి బూడిద చేయడం పోలీసుల పరాకాష్ట. లాకప్ డెత్పై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్ జగన్ డిమాండ్ను ఆమోదించాలి. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్నారన్న వాస్తవం లాకప్ డెత్ కళ్లకు కట్టినట్లుగా చెప్పింది. చట్టాన్ని అమలు చేయాలనే గౌరవం, భయం పోలీసులకు పోయింది’’ అని కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. -
ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు
● అక్రమ కట్టడాలు, మైనింగ్పై చర్యలు తీసుకోవాలి ● ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీను ● కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రం అందజేత చింతూరు: డివిజన్ పరిధిలోని ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన చట్టాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ సాగుతున్న అక్రమ కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన చింతూరులో కలెక్టర్ దినేష్కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు, భూములను రక్షించడంలో స్థానిక అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతూరు మండలం మోతుగూడెం, వీఆర్ పురం మండలం కొల్లూరులో ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ రిసార్టులపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. డివిజన్లోని అటవీ ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా ఎలాంటి లీజులు, పర్యావరణ అనుమతులు లేకుండా విలువైన తెల్లరాయిని అక్రమంగా తవ్వేస్తూ సరిహద్దులు దాటిస్తున్నారని, దీనివల్ల స్థానిక వాగులు, ధ్వంసమవుతున్నాయని ఆయన తెలిపారు. అడవులను నరికివేస్తూ పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న మైనింగ్ మాఫియా ఆగడాలను అరికట్టాలని, దీనికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్షుడు కూర చిట్టి బాబు పాల్గొన్నారు. -
పశ్చిమ రాజగోపురం వద్ద హెల్త్ సెంటర్
● 24 గంటలు వైద్య సహాయం అందేలా ఏర్పాటు ● ఈఓ ఆదేశం అన్నవరం: సత్యదేవుని భక్తులకు 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు గాను రత్నగిరిపై పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న విశ్రాంతి షెడ్డు వద్ద హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదేశించారు. రత్నగిరిపై సకాలంలో వైద్యం అందక భక్తులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ‘దివ్యక్షేత్రం.. వైద్యం పూజ్యం’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 5న కథనం ప్రచురించింది. 50 సంవత్సరాలు దాటిన పలువురు భక్తులు ఉపవాసంతో సత్యదేవుని వ్రతాలాచరించి స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు రాగానే డీ హైడ్రేషన్కు లోనై తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీనికితోడు గుండెపోటు, సుగర్, బీపీ తదితర వ్యాధిగ్రస్తులు వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంటున్నారు. వారికి తక్షణ వైద్యం అందించే ఏర్పాటు దేవస్థానంలో లేదు. కొండ దిగువన దేవస్థానం వైద్యశాలకు తరలించినా అక్కడ సరైన వైద్యం అందడం లేదు. దీంతో, మార్గం మధ్యలోనే కొంత మంది భక్తులు మృతి చెందుతున్నారు. గడచిన ఆరు నెలల్లో ఇద్దరు ఇదే విధంగా రత్నగిరిపై గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ అంశాలను ‘సాక్షి’ కథనం ప్రస్తావించింది. దీనిపై స్పందించిన ఈఓ దేవస్థానంలో కార్పొరేట్ ఆస్పత్రికి కేటాయించిన హెల్త్ సెంటర్లో ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానం వైద్యాధికారి హరికృష్ణతో పాటు ఇద్దరు నరులలో ఒకరిని షిఫ్టుల వారీగా భక్తులకు సేవలందించాలని ఆదేశించారు. ఈ మేరకు వారు అక్కడ సేవలందిస్తున్నారు. దీనిపై ‘రత్నగిరిపై ఎట్టకేలకు వైద్య సేవలు’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 14న కథనం ప్రచురించింది. రత్నగిరిపై 24 గంటలూ వైద్య సేవలు అందించేందుకు శాశ్వత ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అందులో ప్రస్తావించింది. దీంతోపాటు హెల్త్ సెంటర్లో వైద్య సేవల వలన కలిగే ఇతర ఇబ్బందులను వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన ఈఓ సూర్యచక్రధరరావు పశ్చిమ రాజగోపురం ఎదురుగా లారెల్స్ విశ్రాంతి షెడ్డు వద్ద ఉన్న ఖాళీ స్థలంలో 24 గంటలూ పని చేసేలా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులకు అందుబాటులో ఉండేలా, అత్యవసరమైతే దిగువకు తరలించేలా ఘాట్ రోడ్డుకు దగ్గరగా దీనిని ఏర్పాటు చేయాలని సూచించారు. -
చేయని పనికి ఉపాధి!
● పని చేసినది ఇరిగేషన్ అధికారులు ● బిల్లు పెట్టి స్వాహా చేసినది ఉపాధి విభాగం ● రూ.5.45 లక్షలకు బాధ్యులు ఎవరో మరి? ఆలమూరు: ఉపాధి పథకం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. అధికార పార్టీ సానుభూతి పరులకు పని చేయకుండానే మస్తర్లు వేస్తూ ఉపాధి నిధులు కాజేస్తున్నారు. మండలంలోని మోదుకూరు వెంబడి ప్రవహిస్తున్న మైనర్ ఇరిగేషన్ కాలువ పనుల్లో అక్రమాలు జరిగినట్లు ఆ గ్రామానికి చెందిన పలువురు ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడంతో ఆ దోపిడీ ఆలస్యంగా వెలుగు చూసింది. మోదుకూరులోని ముత్యాల కృష్ణమూర్తి మకాం నుంచి గుమ్మిలేరులోని శ్రీశంఖేశ్వర పార్శ్వనాథ్ (బుద్ధుడు) ఆలయం వరకూ ఉన్న కాలువ పరిధిలో నీటిపారుదల శాఖ గడ్డి మందు చల్లి సంబంధిత బిల్లును ఆమోదం కోసం పంపింది. ఇదే క్రమంలో మండల ఉపాధి విభాగం ఇదే పనిని చేయకపోయినా నాలుగు వారాలు పాటు చేశామంటూ ప్రత్యేక ఐడీని రూపొందించి రూ.5,45,600 డ్రా చేయడం గమనార్హం. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించగా రెండో పంట పూర్తయిన తరువాత మొత్తం బిల్లులు పెడతామని వివరించారు. కాగా చేయని పనికి బిల్లు పెట్టడం, కనీస పర్యవేక్షణ లేకపోవడం, గుడ్డిగా బిల్లులు మంజూరు చేయడంపై అధికారులు ఏం చర్యలు తీసుకోనున్నారో వేచి చూడాలి మరి. -
స్వయం సహాయక సంఘాలకు రుణాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం‘ కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా రుణాలు పంపిణీ చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి కందుల దుర్గేష్, కలెక్టర్ కీర్తి డీఆర్డీఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ నగేష్, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. డీఆర్డీఏ ద్వారా బ్యాంకు అనుసంధానంతో 270 మంది లబ్ధిదారులకు రూ.3.95 కోట్ల రుణాలు మంజూరు చేశారు. స్వయం సహాయక సంఘాల పురోగతికి బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి పథకాల కింద 2,534 సంఘాలకు చెందిన 16,386 మందికి రూ.252.14 కోట్లు రుణాలుగా మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరిజనానికి నీరాధనం..
రంపచోడవరం: ఏజెన్సీలో సహజసిద్ధంగా లభించే జీలుగు నీరా ద్వారా గిరిజనులు ఆదాయం పొందేలా పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం ఫుడ్ సైంటిస్టు డాక్టర్ పీసీ వెంగయ్య కృషి చేస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే తాటిపై పరిశోధనలు జరుగుతుండగా ఏజెన్సీలో విస్తరంగా లభించే జీలుగు చెట్ల నుంచి నీరా సేకరణపై ఆయన దృష్టి సారించి సత్ఫాలితాలు సాధించారు. తాడిచెట్ల కంటే జీలుగు చెట్లు నుంచి ఎక్కువ మొత్తంలో నీరాను సేకరించే అవకాశం ఉంది. ఈ ఏడాది జీలుగు నీరా నుంచి వివిధ రకాలైన ఆహార ఉత్పత్తులను తయారు చేయించి పాలగెడ్డ గిరిజనులకు ఆదాయ మార్గాలను చూపేందుకు ప్రయోగత్మకంగా చర్యలు చేపట్టారు. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో మరికొన్ని గ్రామాల్లో ఈ ఉత్పత్తుల తయారీకి కార్యాచరణ రూపొందిస్తున్నారు. రెండు నెలల్లో పది వేల లీటర్ల నీరా పందిరిమామిడి ఉద్యాన పరిశోధన స్థానం ఆధ్వర్యంలో రెండు దశాబ్దాలుగా తాటి ఉత్పత్తులపై వివిధ పరిశోధనలు జరుగుతున్నాయి. తాటి జాతికి చెందిన జీలుగు నీరా ద్వారా ఆహార ఉత్పత్తులు తయారు చేసేందుకు హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్త వెంగయ్య క్షేత్రస్థాయిలో జీలుగు నీరా సేకరించి సిరప్, బెల్లం, బెల్లం పొడిని తయారు చేశారు. ఏజెన్సీలో దాదాపు లక్ష వరకు జీలుగు మొక్కలు ఉంటాయని అంచనా. సాధారణంగా గిరిజనులు జీలుగు చెట్ల నుంచి కల్లు మాత్రం సేకరించి విక్రయిస్తారు. నీరా ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పడంతో నీరా సేకరణపై వారు దృష్టి పెట్టారు. ఈ ఏడాది గుర్తేడు మండలం పాలగెడ్డ గ్రామానికి చెందిన 17 మంది గిరిజనులతో ప్రయోగాత్మకంగా నీరా సేకరణ చేయించారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పది వేల లీటర్ల నీరాను సేకరించి బెల్లం, బెల్లం పొడి, సిరప్ తయారు చేశారు. కిలో బెల్లాన్ని రూ.800కు, సిరప్ 500 ఎంఎల్ను రూ. 300కు విక్రయించారు. హెచ్ఆర్ఎస్ ద్వారానే మార్కెట్ సదుపాయాన్ని కల్పించారు. ఈ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు రంపచోడవరం, మారేడుమిల్లి, గుర్తేడు మండలాల్లో 28 గ్రామాల్లో గిరిజనులకు నీరా సేకరణ, బెల్లం, సిరప్ తయారీపై శిక్షణ ఇచ్చారు. వచ్చే సీజన్కు శిక్షణ పొందిన గిరిజనుల ద్వారా పూర్తిస్థాయిలో జీలుగు నీరా సేకరించి ఆహార ఉత్పత్తుల తయారీకి హెచ్ఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధిం చేస్తోంది. ఎందుకు అంత డిమాండ్ జీలుగు బెల్లంలో (జీఐ) గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల సాధారణ మధుమేహ రోగులు పంచదార, బెల్లానికి బదులుగా వాడవచ్చు. అలాగే జీలుగు బెల్లంలో ఖనిజ లవణాలు ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి కల్తీకి అవకాశం లేకపోవడంతో జీలుగు బెల్లానికి ఎక్కువ డిమాండ్ ఉంది. దేశంలో ఎక్కడా జీలుగు నీరా నుంచి ఆహార పదార్థాలు తయారు కావడం లేదు. కేవలం ఈ ప్రాంతంలోనే వివిధ ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. నాటిన ఆరేళ్లలో ఆదాయం జీలుగు మొక్కలు నాటిన ఆరేళ్ల కాలంలో దిగుబడి ఇ స్తాయి. రోజుకు 30–40 లీటర్లు మధ్య నీరాను సేకరించవచ్చు. ఈత, తాటి కంటే ఎక్కువ మొత్తంలో నీరాను జీలుగు చెట్ల నుంచి సేకరించవచ్చు. వంద లీటర్ల నీరాను ఉడికించడం ద్వారా 15 కిలోల వరకు బెల్లం తయారవుతుంది. ఏజెన్సీలో విరివిగా లభించే జీలుగు నీరా నుంచి గిరిజనులు ఆదాయం పొందేలా ప్రణాళికలు అధికారులు రూపొందిస్తున్నారు. పాలగెడ్డ గిరిజనులు నిత్యం రెండు గంటల పాటు రెండు నెలలు కష్టపడితే రూ.2 లక్షలు ఆదాయం వచ్చింది. జీలుగు నుంచి మరిన్ని ఉత్పత్తులు బెల్లం, సిరప్ తదితర వస్తువుల తయారీ పాలగెడ్డలో ప్రయోగాత్మకంగా చర్యలు రానున్న సీజన్లో మరిన్ని గ్రామాలకు విస్తరణ గిరి పుత్రులను ప్రోత్సహిస్తున్న హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్త -
అన్నదాత గుండె చెరువు!
పెరవలి: ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తే తప్పితే సాధారణ ఫిర్యాదులకు అధికార యంత్రాంగం స్పందించడంలేదు. ఇక్కడ ఒక సమస్య ఉంది.. పలానా వారు ఈ సమస్యకు కారణమని రుజువులు, సాక్ష్యాలు చూపి ఫిర్యాదు చేస్తున్నా వారు స్పందించకపోవడానికి అధికార మదం తలకెక్కిన పలువురు చోటా మోటా నాయకులేనని చెప్పక తప్పదు. వివరాల్లోకి వెళితే కానూరు అగ్రహారంలో కొంత కాలంగా పంట భూములను రొయ్యల చెరువులుగా తవ్వేస్తున్నారు. రాత్రిపూట చెరువు తవ్వకాలు మొదలుపెట్టగా ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు ఆ తవ్వకాలను చూసి ప్రశ్నించగా ఎవరికివ్వాల్సిన మామూళ్లు వారికిచ్చాం.. దిక్కున్న చోట చెప్పుకోండని తవ్వకాలు జరుగుతున్న భూ యజమాని బదులిచ్చారు. దీంతో ఆ రైతులు గ్రామంలోకి వెళ్లి మరికొందరిని తీసుకువచ్చారు. వచ్చేటపుడు వారితో పురుగుమందు డబ్బాలు వెంట తెచ్చుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. ఇంకొక్క అంగుళం తవ్వినా సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక సదరు యజమాని తవ్వకాలను ఆపారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు కె.నిరంజన్ హుటాహుటిన క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. దీంతో రైతులు, మహిళలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పురుగుమందు డబ్బాలు చూపిస్తూ వెంటనే చెరువును పూడ్చాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆయన వెంటనే చెరువులను ధ్వంసంచేయాలని, రెవెన్యూ, వీఆర్వో, ఆర్ఐ అక్కడే ఉండి చెరువు పూడుస్తున్న ఫొటోలను ఎప్పటికప్పుడు తనకు పంపాలని ఆదేశించారు. ఎవరైనా అడ్డుకున్నా, ఎదురు తిరిగినా పొక్లెయిన్లను సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పొక్లెయిన్ డ్రైవర్లు అక్కడి నుంచి జారుకోవడంతో అధికారులు వారికి ఫోన్ చేసి చెరువులను పూడుస్తారా.. పొక్లెయిన్లను సీజ్ చేయమంటారా అని హెచ్చరించారు. దీంతో చేసేది లేక వారు వచ్చి చెరువులను పూడ్చడం ప్రారంభించారు. పూడ్చివేత పనులు పూర్తయ్యే వరకు తాము వెళ్లేది లేదని రైతులు అక్కడే భీష్మించారు. కాగా ఇప్పటికే కానూరు అగ్రహారంలో సుమారు 15 ఎకరాల్లో రొయ్యల చెరువులను తవ్వినట్టు రైతులు తెలిపారు. ఈ చెరువులు తవ్వుతున్నవారు అధికార టీడీపీ వర్గీయులు కావడంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువుల తవ్వకంపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అప్పటికప్పుడు పనులను అడ్డుకుంటున్నారు తప్ప పూడ్చివేత చర్యలు చేపట్టలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిషేధాజ్ఞలు చెరువుల తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వరాదని 2021లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. నాటి నుంచి 2024 వరకు ఒక్క చెరువు కూడా తవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఆ జీవోను రద్దు చేయలేదు కానీ రాజకీయ పలుకుబడితో గుట్టుగా చెరువు తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. 2025లో పెరవలి మండలం కానూరు అగ్రహారంలో అక్రమంగా రాత్రిళ్ళు తవ్వకాలు చేపడితే స్దానిక రైతులు అడ్డుకుని తవ్వకాలను నిలుపుదల చేసారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 15 ఎకరాలు చెరువులుగా మారిపోవడంతో సరిహద్దు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు పంట భూముల్లో చెరువుల తవ్వకానికి ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు. కానూరు అగ్రహారంలో చెరువు తవ్వుతున్నారని ఫిర్యాదు వచ్చిన వెంటనే అక్కడికి వెళ్లి పనులను అడ్డుకున్నాం. అంతే కాకుండా చెరువును పూడ్చాలని ఆదేశాలిచ్చాం. – కె.నిరంజన్, తహసీల్దార్, పెరవలి పంట భూముల్లో అక్రమంగా రొయ్యల చెరువు తవ్వకాలు సరిహద్దు రైతుల ఫిర్యాదులకు స్పందించని అధికారులు ఆత్మహత్యలే శరణ్యమని పురుగు మందు డబ్బాలతో నిరసన ఆగమేఘాలపై వచ్చి పూడ్చివేతకు ఆదేశించిన తహసీల్దార్ వైఎస్సార్ సీపీ హయాంలో తవ్వకాలపై నిషేధాజ్ఞలు ఏడాది కూటమి పాలనలో యథేచ్ఛగా పంట భూముల ధ్వంసం -
హమ్మయ్య.. వానొచ్చింది!
రాజమహేంద్రవరం/మండపేట (కపిలేశ్వరపురం): దాదాపు మూడు నెలల నుంచి ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణంతో అల్లాడుతున్న ప్రజలు బుధవారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం, చల్లని గాలులకు ఊపిరి పీల్చుకున్నారు. రాజమహేంద్రవరం నగరం, రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కడియం మండలాన్ని వాన ముంచెత్తింది. కడియం, వేమగిరి, కడియపులంక, జేగురుపాడు, మురమండ, వీరవరం తదితర గ్రామాల్లో భారీ వర్షంతో ఎక్కడికక్కడే జనజీవనం స్తంభించి పోయింది. మెట్ట ప్రాంతంలో జోరు వాన కురిసింది. దేవరపల్లిలో సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉరుములు, మెరుపుల ధ్వనులతో ఆకాశం దద్ధరిల్లింది. ద్వారపూడి పరిసర గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఏకథాటిగా గంటపాటు వర్షం కురిసింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక వాడలు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. -
కార్పొరేషన్ ఎన్నికలేనా?
● రాజమహేంద్రవరంలో వీడని ప్రతిష్టంభన ● 2027లో గోదావరి పుష్కరాలు ● అప్పటిలోగా ఎన్నికల నిర్వహణ అసాధ్యం ● ఎమ్మెల్యేల పంతంతో ముందుకు కదలని ప్రక్రియ సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కలగానే మిగలనున్నాయా? ఇందుకు రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఒక కారణంగా నిలుస్తోందా? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన హామీకే దిక్కులేదా..? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఎన్నికల నిర్వహణపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం లేకపోవడంతో మేయర్ పీఠం ఆశిస్తున్న నేతల ఆశలు అడియాసలుగానే మిగలనున్నాయన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇదీ సంగతి రాజమహేంద్రవరం కార్పొరేషన్కు 2012 తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. 2018 నుంచి పాలకవర్గం లేకపోవడంతో కార్పొరేషన్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాలను నగరంలో విలీనం చేసే అంశం న్యాయస్థానం పరిధిలో ఉంది. రూరల్లోని గ్రామాలు విలీనం చేయకుండా ప్రస్తుతమున్న 50 డివిజన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, విలీన గ్రామాలతో ఎన్నికలు నిర్వహించాలని రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పట్టుబడుతుండటంతో ఈ వ్యవహారం ఎటూ తేలడం లేదు. మంత్రి హామీకి దిక్కేది? గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. పుష్కర పనులు, ఏర్పాట్లు, నిర్వహణ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలోనే జరగనుంది. పనులు సవ్యంగా జరగాలంటే కార్పొరేషన్కు పాలకవర్గం అవసరం. ఇందులో భాగంగానే ఇటీవల రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(రుడా) చైర్మన్ పోస్టును సైతం ప్రభుత్వం భర్తీ చేసింది. ఇక కార్పొరేషన్ ఎన్నికలు సైతం నిర్వహిస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ కాకినాడలో జరిగిన జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. వివాదాలను పరిష్కరించి రెండు మాసాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి వ్యాఖ్యలతో గతేడాది డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. మంత్రి హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అతీగతీ లేదు. ఈ పరిణామం నగర వాసుల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న మీమాంస ప్రజల్లో నెలకొంది. పుష్కర పనుల పేరుతో హడావుడి 2027 పుష్కరాల నిర్వహణపై అధికారులు, ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో సమీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నయాపైసా నిధులు మంజూరు కాకపోయినా.. పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. నెలలుగా పుష్కర ఏర్పాట్లు, నిధుల ప్రతిపాదనలపై తలమునకలవుతున్నారు. ఫలితంగా కార్పొరేషన్ ఎన్నికల ప్రస్తావనే లేకుండా పోయింది. గ్రామాల విలీనం అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో వార్డుల విభజన ప్రక్రియ సైతం చేపట్టిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తుంటే ఇప్పట్లో కార్పొరేషన్కు ఎన్నికలు జరిగే పరిస్థితులు కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది. గ్రేటర్ హోదా దక్కేనా? కార్పొరేషన్కు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఇక పుష్కరాల తర్వాతైనా జరుగుతాయా? అన్న స్పష్టత కొరవడింది. గ్రామాల విలీనం అంశం కోర్టు పరిధిలో ఉండటంతో రాజమహేంద్రవరం కార్పొరేషన్లో రూరల్లోని 25 గ్రామాల విలీనం జరిగి ‘గ్రేటర్ రాజమహేంద్రవరం’ హోదా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అన్ని సజావుగా జరిగితే గ్రేటర్ రాజమహేంద్రవరంగా ప్రాధాన్యం దక్కుతుంది. పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. పుష్కర పనులపై మాటల యుద్ధం పుష్కరాల నిర్వహణ సమయం దగ్గర పడుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పుష్కర ఘాట్ ఆధునీకరణ పనుల్లో సైతం టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన మంత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కూటమిలో భాగమైనా పనుల్లో తమకు వాటాలు ఇవ్వలేదన్న ఉద్దేశంతో రాజమండ్రి సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు జనసేన మంత్రి కందుల దుర్గేష్పై బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. విడుదల కాని నిధులు గోదావరి పుష్కరాలకు కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగి పాలకవర్గం కొలువుదీరితే ఆయా వార్డుల్లో ఎవరు నెగ్గితే వారి ఆధ్వర్యంలో నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు కార్పొరేటర్లుగా నెగ్గితే వారి పెత్తనం ఎక్కడ భరించాల్సి వస్తుందో..? పుష్కర నిధుల పనుల్లో వాళ్లకు సైతం పర్సంటేజీలు పంచాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఎన్నికల నిర్వహణకు ముందుకు రాలేదు. ఎన్నికలు జరిగితే టీడీపీతో పాటు కూటమిలో భాగమైన జనసేన, బీజేపీ అభ్యర్థులకు కొన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తుంది. దీనికితోడు మేయర్ స్థానం తమదేనంటూ జనసేన నేతలు ఇప్పటికే ప్రకటిస్తున్నారు. మరోవైపు బీజేపీ సైతం మెజార్జీ కార్పొరేటర్ స్థానాలు ఆశిస్తోంది. ఇలాంటి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎన్నికలు జరిగితే తాము పట్టుకోల్పోతామన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఎన్నికలకు మొగ్గు చూపడం లేదు. పుష్కరాల సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటి వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయాపైసా విడుదల కాలేదు. -
గోదావరిలో ఇద్దరు యువకుల గల్లంతు
● ఒకరి మృతదేహం లభ్యం ● కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు ● మరొకరి కోసం గాలిస్తున్న సిబ్బంది పెరవలి (కొవ్వూరు): స్నేహితుల సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. స్నానం కోసం వచ్చిన ఇద్దరు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లితండ్రులకు కడుపుకోత మిగిల్చారు. కొవ్వూరు మండలం మద్దూరు లంక వద్ద బుధవారం ఇద్దరు యువకులు గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరానికి చెందిన మురముళ్ల ప్రవచన కిషోర్, మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన పైడిమల్ల ప్రవీణ్ నిడదవోలుకు చెందిన మరో నలుగురు స్నేహితులు గోదావరిలో స్నానాలు చేయడానికి నిశ్చయించుకున్నారు. ప్రవచన కిషోర్, పైడిమల్ల ప్రవీణ్ రాజమహేంద్రవరం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు మద్దూరు లంక చేరుకున్నారు. నిడదవోలు నుంచి స్నేహితులు ఇంకా రావడం లేదని ఎండ వేడి ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో వారిద్దరూ గోదావరిలో స్నానానికి దిగారు. స్నేహితులు వచ్చేటప్పటికి నదీ తీరంలో వారిద్దరి బట్టలు, షూష్ చూసి స్నేహితులు వచ్చి ఉంటారని ఆనందంతో ముందుకు వెళ్లారు. ఎంతసేపటికీ వారు కనపడకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన వచ్చి ఆ ప్రాంతం అంతా జల్లెడ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో ప్రవచన కిశోర్ (21) మృతదేహం దొరికింది. మృతదేహాన్ని ఒడ్డుకి తీసుకురావటంతో తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గల్లంతైన పైడిమల్ల ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. ప్రవీణ్ కోసం వారి తల్లితండ్రులు, బంధువులు తల్లిడిల్లిపోతున్నారు. కిశోర్ మృతదేహం వద్ద తండ్రి కన్నీరు పెట్టుకుంటూ లేవరా కిషోర్ ఎక్కడికి వెళ్లిపోయావురా, మమ్మల్ని ఒంటరివాళ్లను చేసి వెళ్లిపోయావా అంటూ రోదిస్తుంటే చుట్టుపక్కల వాళ్లు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. -
19న పీఎంవీబీఆర్వై నిర్వహణ
భవిష్యనిధి కమిషనర్ వెంకటేశ్వర్లు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): భారత ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన’ (పీఎంవీబీఆర్వై) కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం 4 గంటలకు దివాన్చెరువులోని ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్ వెంకటేశ్వర్లు కలువాయి అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి కల్పనకు ప్రోత్సాహం, యువతకు ఉద్యోగ అవకాశాల పెంపు, సామాజిక భద్రత పరిధి విస్తరణ లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఈ పథకం కింద మొదటిసారి ఉద్యోగంలో చేరే అర్హులైన ఉద్యోగులకు ఒక నెల వేతనానికి సమానంగా గరిష్టంగా రూ.15 వేల వరకు ప్రోత్సాహకం అందజేస్తారన్నారు. అదనపు ఉపాధి అవకాశాలు కల్పించే యజమానులకు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయన్నారు. తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించే యజమానులకు ఈ ప్రయోజనాలు మరో రెండేళ్ల పాటు పొడిగిస్తారన్నారు. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు సృష్టించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. చికిత్స పొందుతూ యువతి మృతి మామిడికుదురు: సిలిండర్ ట్యూబ్ నుంచి గ్యాస్ లీకై వ్యాపించిన మంటల్లో తీవ్రంగా గాయపడిన ఈదరాడ కమ్మవారిలంకకు చెందిన చుట్టుగుళ్ల చంద్రప్రియ (23) కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్టు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ బుధవారం తెలపారు. ఆమె మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అమలాపురం ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తున్న చంద్రప్రియ ఆదివారం సెలవు రోజు కావడంతో తండ్రి వెంకటేశ్వరరావు అమలాపురం నుంచి ఆమెను ఇంటికి తీసుకు వచ్చారు. ఆయనకు వంట చేసి పెట్టాక ఆమ్లెట్ వేసుకునేందుకు వంటింటిలోకి వెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేయగా ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆమె తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు తొలుత ఆమెను రాజోలుకు అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె అక్కడ మృతి చెందింది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఆమె తల్లి సాయిజ్యోతి ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లారు. ఆమెకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు. గొలుసు చోరీ కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు రాయవరం: చైన్ స్నాచింగ్ కేసులో నేరారోపణ రుజువు కావడంతో కోర్టు ముద్దాయికి జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై డి.సురేష్బాబు బుధవారం విలేకరులకు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు 2025లో మండలంలోని వెంటూరులో గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి అనే మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కువెళ్లినట్టు వచ్చిన ఫిర్యాదుపై నిందితుడు సాధనాల వెంకటేష్ను అరెస్ట్ చేసి, స్వాధీనం చేసుకున్న గొలుసును కోర్టుకు సమర్పించారు. నేరం రుజువుకావడంతో అనపర్తి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.వంశీకృష్ణ వెంకటేష్కు ఆరు నెలల జైలు, రూ.50 జరిమానా విధించారు. ఈ కేసులో ఏపీపీ ఒ.మహాలక్ష్మి వాదనలు వినిపించినట్టు ఆయన తెలిపారు. కోర్టు కానిస్టేబుల్ సత్యకుమార్ను ఉన్నతాధికారులు అభినందించినట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
నీట్ అభ్యర్థులకు ఉచిత బస్సు సౌకర్యం
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీన జరుగనున్న నీట్ రీ ఎగ్జామ్స్కు హాజరయ్యే అభ్యర్థులందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలిపిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా ప్రజా రవాణా అధికారి వై.సత్యనారాయణమూర్తి బుధవారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు డిపోల నుంచి బస్సులు నడుపుతున్నట్లు తెలియజేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లు చూపించి పరీక్షా కేంద్రాలకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులలో ప్రయాణం చేయవచ్చునన్నారు. బస్ స్టేషన్లో సహాయక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి పీఠంలో యథావిధిగా శ్రీచక్ర అర్చనలు రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో శుక్రవారం నుంచి యథావిధిగా శ్రీచక్ర అర్చనలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు బుధవారం విలేకరులకు తెలిపారు. విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ఈ నెల 5న విజయదుర్గాదేవి సాయుజ్యం పొందిన నేపథ్యంలో పీఠంలో అమ్మవారికి నిర్వహించే నిత్య పూజలు, అర్చనలు ఏకాంతంగా నిర్వహిస్తున్నా రు. శుక్రవారం ఉదయం 9.15 గంటల నుంచి పీఠంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు. అన్నవరం.. తృతీయం ● ఐవీఆర్ఎస్ సర్వేలో దేవస్థానానికి మూడో స్థానం ● వెల్లడించిన ప్రభుత్వం అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం ఈ నెలలో నిర్వహించిన సర్వేలో 73 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం మూడో స్థానంలో నిలిచింది. గత నెలలో అయితే 70.7 శాతంతో ఏకంగా ఐదో స్థానానికి పడిపోగా.. ఈసారి రెండు స్థానాలు అధిగమించి మూడో స్థానానికి ఎగబాకింది. గత నెల కన్నా 2.3 శాతం ఎక్కువగా మాత్రమే భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. గత మార్చి నెలలో నిర్వహించిన సర్వేలో 75 శాతం భక్తుల సంతృప్తితో అన్నవరం దేవస్థానం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత నుంచి ఆ ర్యాంకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత నెల 15 నుంచి ఈ నెల 15వ తేదీ వరకూ వాట్సాప్ యాప్, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలపై నిర్వహించిన ఈ సర్వేలో 75.8 శాతం భక్తుల సంతృప్తితో శ్రీకాళహస్తి మొదటి, 74.2 శాతంతో ద్వారకా తిరుమల రెండు స్థానాల్లో నిలిచాయి. వరుసగా తరువాతి స్థానాల్లో సింహాచలం, కాణిపాకం, విజయవాడ, శ్రీశ్రీలం దేవస్థానాలు నిలిచాయి. -
చెట్లు తొలగించకుంటే గట్టుకు ముప్పే
అడ్డతీగల: మద్దిగడ్డ జలాశయం ఎడమ గట్టుపై మొలిచిన పిచ్చి మొక్కలు ప్రస్తుతం చెట్లుగా మారి అడవిని తలపిస్తున్నాయి. వాటిని తొలగించకుంటే ఎడమ గట్టుకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. జలాశయం ఎఫ్ఆర్ఎల్ లెవెల్ 188 మీటర్లు కాగా, ప్రస్తుతం 179 మీటర్ల నీటి మట్టం ఉంది. అడపాదడపా వర్షాలు పడుతున్న నేపథ్యంలో రానున్న కాలంలో ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా పడితే జలాశయం నిండిపోతుంది. అసలే ఎడమ గట్టు ప్రాంతంలో కొన్నాళ్లుగా లీకేజీలు ఉన్నా అధికారులు సరి చేయడం లేదు. వృక్షాలతో గట్టు బలహీన పడిన నేపథ్యంలో దురదృష్టవశాత్తూ గట్టుకు గండి పడితే నాలుగు ఎకరాల ఆయకట్టులో సాగు ప్రశ్నార్థకమవుతుంది. -
సమన్వయంతో నీట్ నిర్వహణ
● జూన్ 21న పరీక్ష ● 9 కేంద్రాల్లో ఏర్పాట్లు ● హాజరుకానున్న 3363 మంది ● డీఆర్వో భాస్కర్ రెడ్డి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ)–2026ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన చాంబర్లో ఈ పరీక్షల నిర్వహణపై పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, వైద్య, అగ్నిమాపక, పోస్టల్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను 21వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ (ఆఫ్లైన్) విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 7, రాజానగరం మండలంలో 2 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో మొత్తం 3,363 మంది పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ కళాశాల (ఆటానమస్), ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం, ఎస్కేవీటీ ఈఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేంద్రీయ విద్యాలయ, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పరీక్షల నిర్వహణలో భద్రతా ఏర్పాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థుల సజావు రాకపోకలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమన్వయ కమిటీ సభ్యులు ముందుగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
కుటుంబ సభ్యుల చెంతకు సుజాత
● 7 నెలల అనంతరం సొంత గూటికి చేరిన వైనం రాజమహేంద్రవరం సిటీ: భర్త, కుటుంబ సభ్యుల నిరాదరణతో వీధి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందిన కల్లేపల్లి లక్ష్మీ సుజాత ఏడు నెలల అనంతరం ఆశ్రమం నుంచి మంగళవారం అయినవారింటికి చేరింది. వివరాల్లోకి వెళ్తే 50 ఏళ్ల లక్ష్మీ సుజాత తల్లిదండ్రులది ద్వారపూడి కాగా ప్రస్తుతం భీమవరంలో నివసిస్తున్నారు. అత్తవారిది విశాఖపట్నం జిల్లా నక్కపల్లి. పైళ్లె 30 ఏళ్లయినా పిల్లల కలగలేదని భర్త, ఆడపడుచులు, అత్తగారి సూటిపోటి మాటలతో ఏడు నెలల క్రితం ఆమె ఇల్లు విడిచి వచ్చి రాజమహేంద్రవరం లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది. భర్త, కుటుంబ సభ్యులు ఆమె వెతుకుతుండగా ఇక్కడి ఆశ్రమంలో ఉన్నట్లు తెలియడంతో వారు వచ్చి నిర్వాహకుడు గుబ్బల రాంబాబును కలసి మాట్లాడారు. వారితో మాట్లాడిన అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు ఒప్పుకున్నారు. నిర్వాహకుడు రాంబాబు సుజాతను ఆమె తల్లి చేకూరి సుబ్బలక్ష్మి, అన్నయ్య శ్రీనివాసరాజు, తమ్ముడు రామరాజులకు అప్పగించారు. తన కుమార్తెను ఇన్ని రోజులు సంరక్షించిన రాంబాబుకు వారు ధన్యవాదాలు తెలిపారు. సుజాతకు స్వర్ణాంధ్ర వృద్ధులు అందరూ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరి కృష్ణ, జి.దివ్యపూర్ణ తదితరులు పాల్గొన్నారు. దేవీపట్నం పరిసరాల్లో పులి దేవీపట్నం: మండలంలోకి పదిహేను రోజుల క్రితం మళ్లీ ప్రవేశించిన పెద్దపులి ప్రస్తుతం దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఈ నెల మూడో తేదీన గంగంపాలెం వద్ద 13 లేగ దూడలను చంపిన ఈ పులి రామదుర్గం, నేలకోట ఆవ పరిసర ప్రాంతాల్లో సంచరించి, నాలుగు రోజుల క్రితం దండంగి వాగు దాటింది. ప్రస్తుతం గోదావరి నది పరీవాహక గ్రామాలైన దేవీపట్నం, మంటూరు పరిసర ముంపు గ్రామాల్లో దీని కదలికలను అటవీ అధికారులు గుర్తించారు. -
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: రైలు ఢీకొని సుమారు 65 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ హెచ్సీ గంగరాజు మంగళవారం తెలిపారు. బొమ్మూరు గురుకుల పాఠశాల ఎదురుగా ఈ ఘటన జరిగిందన్నారు. మృతుడు సుమారు 5.6 అడుగుల ఎత్తు, నలుపు రంగు ఛాయ కలిగి ఉన్నాడని, ఒంటిపై నలుపు రంగు ఫుల్ హాండ్స్ చొక్కా, నీలం, తెలుపు గల్ల లుంగీ ఉన్నాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు 94948 19898, 94407 79249, 0883 2442821 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. మేడపై నుంచి పడి..శంఖవరం: మేడపై నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శంఖవరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. శంఖవరం గ్రామానికి చెందిన కుర్రే రామచక్రరావు (34)సోమవారం రాత్రి మేడపై పడుకున్నాడు. తెల్లవారుజామున కిందకు దిగొస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ మేడపై నుంచి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. రామచక్రరావుకు వివాహమైంది. తాపీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాణం తగిలి గాయపడిన వ్యక్తి డిశ్చార్జి కాకినాడ క్రైం: ఈ ఏడాది మే 29న ప్రమాదవశాత్తూ బాణం తగిలి గాయాల పాలైన రంపచోడవరానికి 49 ఏళ్ల చొల్లా లచ్చిరెడ్డి కోలుకొని కాకినాడ జీజీహెచ్ నుంచి డిశ్చార్జి అయ్యాడు. వైద్యులు సకాలంలో స్పందించి కుడి ఊపిరితిత్తులో దిగిన బాణాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. లచ్చిరెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 7 రోజుల జైలు పిఠాపురం రూరల్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి ఏడు రోజుల జైలు శిక్ష విధిస్తూ పిఠాపురం సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బొమ్మిడి భారతి మంగళవారం తీర్పు ఇచ్చారని రూరల్ ఎస్సై ఎస్కే జానీబాషా ప్రకటనలో తెలిపారు. మండలంలోని ఎఫ్కే పాలెం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా గడ్డం సుబ్రహ్మణ్యం మద్యం తాగి ఆటో నడుపుతూ పట్టుబ డ్డాడు. అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి పై విధంగా తీర్పునిచ్చారు. మోసగించిన ముగ్గురిపై కేసు కోటనందూరు: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, మోసగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ మంగళవారం తెలిపారు. వివరాలు ఇవీ.. పాతకొట్టాం గ్రామానికి చెందిన మాడెం సతీష్ను కేఈ చిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన లాలం రవితేజ, అతడి తండ్రి లాలం నాగరాజు, తల్లి గంగారత్నం ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మపలికారు. దీనిపై పలుమార్లు రవితేజ కుటుంబ సభ్యులు సతీష్ ఇంటికి వెళ్లి స్వయంగా, ఆన్లైన్ ద్వారా రూ.8.50 లక్షల వరకూ వసూలు చేశారు. అనంతరం ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుండడంతో సతీష్ తండ్రి మాడెం పెంటయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ మీట్కు విద్యార్థినులు ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): నాగరాజా మున్సిపాల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఆర్.సంజన, ఆర్.అమృత రాష్ట్ర స్థాయి క్రికెట్ మీట్కు ఎంపికయ్యారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చక్రధర్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నంలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్ – 15 క్రికెట్ పోటీల్లో వీరు తలపడతారన్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. -
ఖరీఫ్ నారుమడి.. సంరక్షణ తప్పనిసరి
ఫ జోరుగా నారుమళ్లు ఫ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వ్యవసాయాధికారులు ఆలమూరు: ఖరీఫ్ సీజన్కు సంబంధించి నారుమళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం అధిక శాతం వెదజల్లు సాగు చేపడుతుండగా, మిగతా భూమిలో నారుమళ్ల ద్వారా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 19 మండలాల్లో ఖరీఫ్లో 1.29 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ ఏడాది అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఖరీఫ్ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. నారుమడిలో యాజమాన్య పద్ధతులు నారుమడి తయారీలో కనీస యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను పాటిస్తే పెట్టుబడి ఆదా కావడంతో పాటు నాణ్యమైన పంటలు పండించొచ్చని ఆలమూరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు సీహెచ్కేవీ చౌదరి చెబుతున్నారు. ఫ తొలుత 80 శాతం మొలక కలిగిన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేయాలి. నారుమడులు ఏర్పాటు చేసుకునేందుకు 10 – 12 రోజుల మధ్య దమ్ము చేసి నేలను చదును చేసుకోవాలి. ఫ పొలాల్లో నీరు పారేందుకు చిన్న కాలువలను ఏర్పాటు చేసుకుని, ప్రతి మొక్కకు నీరందేలా చూడాలి. ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, ఒక కిలో పొటాష్ ఎరువులను మిశ్రమం చేసి దుక్కులో వేయాలి. ఫ చలి తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశంలో భాస్వరాన్ని రెట్టింపు చేయాలి. వరి నారు ఆకుగా విచ్చుకునే వరకూ ఆరుతడులుగా నీటిని అందించాలి. వరినాట్లకు ముందు జాగ్రత్తలు ఫ నారుమడిలో బాటలు వేసి నీటిని తొలగించాలి. మొక్కలు కోలుకోవడానికి ఎకరా నారుమడికి యూరియా, పొటాష్ ఎరువులను 10 కేజీల చొప్పున అందించాలి. వరి నారుమడి వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఫ నారు వేయడానికి పక్షం రోజుల ముందు పొలాన్ని మురుగు దమ్ము చేయాలి. 15 సెంటీమీటర్లకు మించి లోతుగా దమ్ము చేయరాదు. పొలాన్ని దమ్ము చెక్కతో లేదా యంత్ర పరికరంతో చదును చేయాలి. ఫ నారుమడి లేత ఆకు రంగులో ఉన్నప్పుడే నాటడం ద్వారా త్వరగా మూన కడుతుంది. నాలుగు నుంచి ఆరు ఆకుల ఉన్న నారును ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. ఈ వంగడాలకు ప్రాధాన్యం ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే వరి వంగడాలకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతో పాటు తొందరగా కోతకు వచ్చే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ ఈ ఖరీఫ్లో స్వర్ణ 7029, ఎంటీయూ 1318, ఎంటీయూ 1121 రకాలను వినియోగించాలని సూచిస్తోంది. అయితే రైతుల మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ 7029 రకానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. నారుమళ్ల దశలో సరైన యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా చీడపీడలను నివారించడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చని వ్యవసాయశాఖ చెబుతోంది. జూన్ తృతీయార్థంలో నారుమళ్ల పక్రియ చేపట్టి జూలై 20 నాటికి వరినాట్లు పూర్తి చేయాలని, దీని వల్ల అక్టోబర్ నెలాఖరు నాటికి వరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని భావిస్తోంది. -
జేసీబీలతో తొక్కించి చంపబోయారు
రంగంపేట: మండలంలోని పెద్ద దొడ్డిగుంట గ్రామంలో గల ముసలయ్య చెరువు పూడ్చివేత మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. చెరువు పూడ్చివేతను అడ్డుకున్న ఆయకట్టు రైతులపై జేసీబీలతో దాడి చేసి తొక్కించి చంపేందుకు ప్రయత్నించారని రైతులు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడినట్టు తెలిపారు. గ్రామంలోని 799 సర్వేలో ఉన్న ఈ చెరువును కొందరు గత నెల 30వ తేదీ నుంచి అక్రమంగా పూడ్చివేస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపించారు. ఆ పూడ్చివేత నిలిపివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదన్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రిలో జేసీబీలు, ట్రాక్టర్లతో చెరువు పూడ్చివేస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమపై దాడికి పాల్పడి జేసీబీలతో తొక్కించి చంపేందుకు ప్రయత్నించారని రైతులు అడబాల శ్రీను, రమేష్, రామదాసు, వీరభద్రరావు, కృష్ణ, వెంకట్రావు, చిన్నారావు, కనకం ఆరోపించారు. ఈ ఘటనపై తహసిల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చామని, దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని జేసీబీలు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తహసీల్దార్ కార్యాలయ ఆవరణకు తరలించారని రైతులు తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను డిమాండ్ చేశారు. పూడ్చివేతపై వైఎస్సార్ సీపీ ఆగ్రహం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండదండలతోనే టీడీపీ నాయకులు ముసలయ్య చెరువును పూడ్చివేస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు ఆరోపించారు. కొద్ది రోజులుగా టీడీపీకి చెందిన పలువురు వ్యక్తులు ఈ చెరువును పూడ్చివేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడే చెరువులను కబ్జా చేసి పూడ్చివేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. చెరువు పూడ్చివేస్తున్న టీడీపీ నాయకులు రైతులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని, ఈ ఘటనపై ఎమ్మెల్యే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
ఈ ప్రవేషాలు ఏంటో?
ఫ పాలిసెట్ ఫలితాలు వెలువడి 40 రోజులు ఫ పాలిటెక్నిక్లో ప్రవేశాలకు రాని ప్రకటన ఫ అయోమయంలో విద్యార్థులు రాజమహేంద్రవరం రూరల్: పదో తరగతి.. విద్యార్థి జీవితానికి మైలురాయి. ఇక్కడి నుంచి పడే బాటే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలాంటి విద్యార్థులను ప్రభుత్వం అయోమయంలోకి నెట్టేస్తోంది. సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే వారికి ఆటంకాలు తెచ్చిపెడుతోంది. పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులు చదివితే పలు పరిశ్రమలు, కంపెనీల్లో ఉద్యోగాలకు అవకాశం ఉంటోంది. అందుకే చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్లో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్లలో ప్రవేశాల ప్రక్రియ సకాలంలో ప్రారంభం కాక ప్రతి ఏడాది వేలాది సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ సమస్య ఏటా పునరావృతం అవుతున్నా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పాలిసెట్ ఫలితాలు ప్రకటించి 40 రోజులైనా, ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఉన్నత విద్యా శాఖ ఇంకా విడుదల చేయలేదు. తప్పని ఎదురుచూపులు ఉమ్మడి జిల్లాలో ఏడు ప్రభుత్వ, 19 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,200 సీట్లు ఉంటాయి. పాలిసెట్ ఫలితాలు వెలువడి 40 రోజులకు పైగా అయ్యింది. అయితే ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. గతంలో ప్రవేశాలు ఆలస్యం కావడం వల్ల సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ కాకపోయాయనే ఉద్దేశంతో ఈసారి పరీక్షను ముందుగానే నిర్వహించి ఫలితాలను కూడా త్వరగా విడుదల చేశారు. ఈ సమయానికి మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికీ షెడ్యూల్పై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా అనేక సీట్లు ఖాళీగా మిగిలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కళాశాలల్లో ఇంటర్ తరగతులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు ప్రత్యామ్నాయంగా ఇతర కోర్సుల్లో చేరిపోతున్నారు. ఉమ్మడి తూర్పులో మెరుగైన ఫలితాలు ఈ ఏడాది ఏప్రిల్ 25న నిర్వహించిన పాలిసెట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. తూర్పుగోదావరి జిల్లాలో 5,668 విద్యార్థులు హాజరు కాగా 5,260 మంది, కాకినాడ జిల్లాలో 10,791 మంది హాజరుకాగా 9,802 మంది, డాక్టర్ డీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 5,331 మందికి 4,807 మంది, పోలవరం జిల్లాలో 771 మంది విద్యార్థులకు 736 మంది పాలిసెట్లో అర్హత సాధించారు. జాప్యానికి కారణాలేంటి? ఈ సారి ప్రవేశాల జాప్యంపై పలు కారణాలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వ పాలిటెక్నిక్లకు అనుమతులు లభించినప్పటికీ, కొన్ని ప్రైవేటు కళాశాలలకు ఇంకా ఆమోదం రాలేదని తెలుస్తోంది. కొన్ని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తమ క్యాంపస్లో కొత్తగా పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో కొన్ని కోరుకున్న బ్రాంచ్లకు అనుమతులు రాక ప్రవేశాల ప్రక్రియలో ఆలస్యం జరుగుతోందనే చర్చ విద్యా వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో సీట్ల భర్తీ కొంతమేర సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రైవేట్ కళాశాలల్లో అనేక బ్రాంచ్ల్లో సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. వాటిని భర్తీ చేయడానికి యాజమాన్యాలు ప్రత్యక్ష ప్రవేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. -
గంజాయితో ఎనిమిది మంది అరెస్ట్
నిడదవోలు: పట్టణ శివారు శశి స్కూల్ రోడ్డులోని కోళ్ల ఫారం వద్ద ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో గంజాయితో ఎనిమిది మందిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. గంజాయి కలిగి ఉన్నారనే సమాచారంతో పట్టణ ఎస్సై జగన్మోహన్రావు, సిబ్బందితో దాడి చేసి రాజమహేంద్రవరానికి చెందిన తడాల సాయి అజయ్, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన షేక్ రహీమ్ (అజ్జు), మహమ్మద్ సలీంలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 500 గ్రాముల గంజాయి, రూ.5 వేలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి తాగుతున్న కొవ్వూరుకు చెందిన వాగాల విజయ్ కుమార్, నిడదవోలుకు చెందిన కొల్లూరి దీపేష్ పవన్ కుమార్, షేక్ నవీద్ అహ్మద్, నల్లమాటి చైతన్య రవితేజ, పాటి నాగ వేగేశ్వర సత్య రాకేష్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 100 గ్రాముల గంజాయి, రూ.1000 స్వాధీనం చేసుకున్నారు. గంజాయికి అలవాటు పడిన ఐదుగురు యువకులపై కూడా కేసు నమోదు చేసి, కౌన్సెలింగ్ కోసం రాజమహేంద్రవరంలోని డీఎడిక్షన్ సెంటర్కు తరలించారు. గంజాయి విక్రయిస్తున్న తడాల సాయి అజయ్పై గతంలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో రెండు గంజాయి కేసులు, ఒక కొట్లాట కేసు, షేక్ రహీమ్ (అజ్జు) పై గతంలో పెరవలి పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉన్నాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 24,000 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
అన్నవరానికి ‘భారత్మాల’
అన్నవరం: భారతమాల పథకం కింద కాకినాడ సమీపంలోని వాకలపూడి లైట్హౌస్ నుంచి అన్నవరం వరకూ 41 కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి (ఎన్హెచ్– 516ఎఫ్) నిర్మాణం చురుకుగా సాగుతోంది. దీని నిర్మాణానికి అన్నవరంలో సేకరించిన భూమికి రైతులు కోరిన విధంగా కాకుండా గతంలో నిర్ణయించినట్టు 9 శాతం వడ్డీతో పరిహారం చెల్లించారు. దీంతో, పనులు ఊపందుకున్నాయి. అన్నవరం, తొండంగి మండలంలోని ఎ.కొత్తపల్లి, కోదాడ, యు.కొత్తపల్లి మండలాల మీదుగా నాలుగు లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవేగా ఈ హైవే నిర్మిస్తున్నారు. 2021లోనే శ్రీకారం సాగర తీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధికి భారత్మాల పరియోజన ఫేజ్–1 రహదారిని రూ.1,040 కోట్లతో నిర్మించేందుకు 2020లోనే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) 2021లో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసింది. తిరిగి గత ఏడాది జూలైలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పట్లో అరవిందో రియాల్టీ కంపెనీ టెండర్ అత్యంత తక్కువకు టెండర్ దాఖలు చేసింది. అయినప్పటికీ సాంకేతిక కారణాలతో దానిని రద్దు చేసి, అదే సంవత్సరం ఆగస్టులో మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి 9 సంస్థలు టెండర్లు దాఖలు చేయగా రాయలసీమలోని కూటమి ఎమ్మెల్యేకి చెందిన కాంట్రాక్టు సంస్థ దీనిని దక్కించుకుంది. 225 హెక్టార్ల భూ సేకరణ ఈ రహదారి నిర్మాణానికి రైతుల నుంచి 195 హెక్టార్లు సేకరించారు. మరో 45 హెక్టార్లు ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 225 హెక్టార్ల భూమి సేకరించారు. ఇందులో అన్నవరం, ఆరెంపూడి రైతులకు చెందిన 12 ఎకరాలున్నాయి. ఆరెంపూడి రైతులకు పరిహారం చెల్లించినా, అన్నవరం రైతులకు చెల్లించడానికి ఐదేళ్లు పట్టింది. రహదారి నిర్మాణం ఇలా.. వాకలపూడి లైట్హౌస్ నుంచి కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల మీదుగా 516ఎఫ్ రహదారి నిర్మిస్తున్నారు. ఇది అన్నవరం సమీపాన రాజమహేంద్రవరం – విశాఖపట్నం మార్గంలోని సత్యదేవుని నమూనా ఆలయం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారికి కలుస్తుంది. మొత్తం 21 గ్రామాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రహదారి పొడవునా 169 బ్రిడ్జిలు, అండర్పాస్లు, ఓవర్ పాస్లు నిర్మించనున్నారు. అలాగే, చైన్నె – హౌరా రైల్వే లైన్ మీద అన్నవరం వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తారు. యు.కొత్తపల్లి వద్ద టోల్ ప్లాజా నిర్మించనున్నారు. 2027 డిసెంబర్ నాటికి దీని నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు.ఇన్చార్జి వీసీ డి.మునిరత్నంనాయుడును సత్కరిస్తున్న వర్సిటీ అధికారులురాజమహేంద్రవరం రూరల్: అమెరికాలో డల్లాస్ నగరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సిలికానాంధ్ర యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సిలికానాంధ్రా, మనబడి స్నాతకోత్సవం ఘనంగా జరిగినట్టు ఇన్చార్జి వైస్ చాన్సలర్ ఆచార్య డి.మునిరత్నం నాయుడు తెలిపారు. అమెరికా పర్యటన ముగించుకుని మంగళవారం వర్సిటీకి వచ్చిన ఆయనకు ఇన్చార్జి రిజిస్ట్రార్ ముసుగు శ్రీనివాసరావు అధ్యక్షతన సిబ్బంది, విద్యార్థులు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీసీగా ఇదే తొలి అమెరికా పర్యటన అన్నారు. స్నాతకోత్సవంతో పాటు కాలిఫోర్నియా, డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిపారు. దాతలు అందించే నగదును శాశ్వతనిధిగా ఏర్పాటు చేసి సాహిత్యం, కీర్తి పురస్కారాలు అందజేస్తామన్నారు. వర్సిటీ పూర్వ వైభవానికి అందరూ కృషిచేయాలని కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు కోర్సుల్లో చదువుతున్న వారు ఏడువేల మంది విద్యార్థులయితే, అమెరికాలో ఈ ఏడాది సంగీతం, నృత్యం కోర్సుల్లో చేరిన వారు 3వేల మంది అన్నారు. అక్కడ తెలుగుభాషపై ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చిలుకోటి కూర్మయ్య, ఎంఏ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. చురుగ్గా అన్నవరం–వాకలపూడి రహదారి నిర్మాణం ఎన్హెచ్–516 (ఎఫ్) గ్రీన్ఫీల్డు రోడ్డుగా నామకరణం రూ.1,040 కోట్లతో 41 కిలో మీటర్ల పొడవైన మార్గం అన్నవరం వద్ద హైవేను కలుపుతూ భారీ ఫ్లై ఓవర్ 2027 డిసెంబర్కి పూర్తి చేసేలా కసరత్తు -
క్యాబిన్లో ఇరుక్కుపోయిన లారీ డ్రైవర్
రాజానగరం: జాతీయ రహదారిపై దివాన్ చెరువు పెట్రోలు బంకు సమీపంలో జరిగిన ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. అతడి కాలు, చెయ్యి విరిగిపోయాయి. విజయవాడ నుంచి డీ మార్టు సామగ్రి లోడుతో వెళుతున్న లారీ సోమవారం అర్ధరాత్రి దివాన్ చెరువులో ముందు వెళుతున్న మరో లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ తుక్కుతుక్కయిపోయి, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు చెందిన డ్రైవర్ సూరజ్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. అతడిని స్థానికుల సాయంతో 108 అంబులెన్స్ సిబ్బంది బయటకు తీశారు. అయితే అప్పటికే అతని ఎడమ చేయి, కుడి కాలు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసును బొమ్మూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
మహారాణిపేట (విశాఖపట్నం): వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపొద్దని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అన్నారు. విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో భాగంగా ఆ సంస్థ కాల్ సెంటర్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాల్ సెంటర్ పనితీరు, వినియోగదారుల నుంచి అందుతున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను సమీక్షించారు. ఫిర్యాదుల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో ఏఈలు వ్యవహరిస్తున్న తీరును ప్రత్యేకంగా పరిశీలించారు. పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న కొన్ని ఫిర్యాదులపై కాల్ సెంటర్ నుంచే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరణ కోరారు. వినియోగదారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎండీ మాట్లాడుతూ కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లు 24 గంటలూ అందుబాటులో ఉండి, కాల్ సెంటర్ నంబర్ 1912కు వచ్చే ప్రతి కాల్కు తప్పనిసరిగా స్పందించాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలో ఏఈలు అందిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం లేదా నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్లు వినియోగదారులతో మాట్లాడుతున్న తీరును సీఎండీ స్వయంగా పరిశీలించారు. పలువురు వినియోగదారులతో జరిగిన కాల్ రికార్డులను విని, మరింత మర్యాదపూర్వకంగా, సహనంతో మాట్లాడాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు, బలమైన గాలుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తనిఖీలో ఆపరేషన్స్ డైరెక్టర్ టీవీ సూర్యప్రకాశ్, సీజీఎం పి.సోలమన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రవేశ పరీక్షలో శ్రీప్రకాష్ విద్యార్థి ప్రతిభ
తుని: ఇండియన్ స్టాటిస్టికల్ ప్రవేశ పరీక్షలో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె.మోనిష్ కుమార్ ఆల్ ఇండియా లెవెల్ ఓబీసీ క్యాటగిరీలో 15వ ర్యాంక్, ఓపెన్ క్యాటగిరిలో 107 ర్యాంక్ సాధించాడు. ప్రిన్సిపాల్ వీవీఎస్ఎస్ భానుమూర్తి మంగళవారం ఈ విషయం తెలిపారు. తమ విద్యాసంస్థలో 6 నుంచి 12వ తరగతి వరకు ఇస్తున్న ఏడేళ్ల క్లాస్ రూం ప్రోగ్రాంతో పాటు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణతో విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రతిభ చూపిన జె.మోనిష్ కుమార్ను విద్యా సంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయులు అభినందించారు. -
‘ప్రజల ప్రాణాలంటే బాబు సర్కార్కు లెక్కే లేదు’
సాక్షి, తాడేపల్లి: రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో 16 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనపై ప్రభుత్వ స్పందన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కల్తీ పాల ఘటనపై ఇప్పటివరకు పూర్తి నివేదిక ఇవ్వలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని మార్గాని భరత్ విమర్శించారు. ప్రజల ప్రాణాలపై ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.బాధిత కుటుంబాలను పరామర్శించే తీరిక లేదా?రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 16 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు సహా రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలను పరామర్శించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆరోగ్య శాఖ మంత్రి కూడా బాధితులను కలవలేదు. ఇదే ఘటనలో చికిత్స పొందుతున్న చిన్నారి రుహానియా పూర్తిగా కోలుకోలేదు. మొదట పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన అధికారులు తర్వాత డిశ్చార్జ్ చేయాలని ఒత్తిడి చేయడం దురదృష్టకరం. బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కల్తీ పాల ఘటనపై ఇప్పటికీ పూర్తి నివేదిక కూడా ఇవ్వలేదు.ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలిమీకు ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా చంద్రబాబు? గతంలో గోదావరి పుష్కరాల సమయంలో 26 మంది చనిపోతే అది భక్తుల అత్యుత్సాహం వల్లే అని నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పించుకోవడానికి ప్రజలపై నెపం మోపారు. మిల్క్ ప్రొక్యూర్మెంట్ యాక్ట్లో పిరియాడిక్ చెకప్ జరగాలని వైయస్ జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసినా ఈ ప్రభుత్వం అమలు చేయలేదు. కల్తీ పాల ఘటనలో బాధిత కుటుంబాలకు ఇచ్చిన రూ.10 లక్షల పరిహారం తక్కువ, వెంటనే దాన్ని రూ.20 లక్షలకు పెంచాలి. భవిష్యత్తులో చికిత్స ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి. ఈ ఘటనలో బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం” అని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు.ఎవరూ పట్టించుకోవడం లేదు: రితిక్ తండ్రి లవ్రాజుకల్తీ పాలు తాగి మా బాబు రితిక్ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. మొదటి మూడు రోజులు కలెక్టర్, అధికారులు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మా బాబును ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించమని స్థానిక ఎమ్మెల్యేను కలిస్తే కలెక్టర్ను కలవమన్నారు. ఎవరూ మాకు న్యాయం చేయలేదు. ఎవరూ పట్టించుకోలేదు.ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవాలి: రుహానియా తండ్రి రాకేష్ఫిబ్రవరి 16వ తేదీన మా పాప కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైంది. 17వ తేదీన ఆసుపత్రిలో చేర్పించాం. రెండు ఆసుపత్రుల్లో కలిపి మాకు రూ.3.50 లక్షల వరకు ఖర్చు అయింది. తర్వాత రాజమండ్రి రెయిన్బో చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్పించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చికిత్స జరుగుతోంది. మా పాప కిడ్నీ ట్యూబ్స్ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు. కానీ పాపను డిశ్చార్జ్ చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అధికారులను కలిస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. నాలుగు నెలలుగా డాక్టర్లు కృషి చేసి మా పాపను బతికించారు. ప్రభుత్వం మొదట ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. లిఖితపూర్వకంగా భరోసా ఇవ్వాలి. ఇవాళ మాజీ ఎంపీ మార్గాని భరత్ ద్వారా వైఎస్ జగన్ను కలిశాం. ఆయన మాకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు” అని రాకేష్ తెలిపారు. -
ఆదిపైత్య పోరు
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మధ్య విభేదాలు ఊహించని స్థాయికి చేరాయి. ఇద్దరు నేతల పార్టీలు కూటమిలో భాగస్వామ్యమైనా సఖ్యత ఉండటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు రాజమహేంద్రవరంలో జరుగుతున్న ప్రభుత్వ, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి, ఎమ్మెల్యే ఒకరినొకరు ఆహ్వానించుకోకపోవడం నిదర్శనం. మంత్రి నేతృత్వంలో జరిగే కార్యక్రమాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం అందకపోవడం, ఎమ్మెల్యే నిర్వహించే ప్రోగ్రామ్స్కి మంత్రిని పిలవకపోవడం పరిపాటిగా మారింది. మీరు పిలవనప్పుడు మేం ఎందుకు పిలవాలన్నది ఇరు పక్షాల ప్రశ్నగా మారింది. కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాలకు మంత్రి తప్ప మిగిలిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనసేన నేతలకు ఆహ్వానం అందుతోందని, తమ పార్టీ నాయకులే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వెంట నడుస్తుండటం, తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం మంత్రి దుర్గేష్కు నచ్చడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాజమహేంద్రవరంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొనకపోవడం, పలు కార్యక్రమాల ఫ్లెక్సీల్లో ఎవరి ప్రోగ్రామ్లో వాళ్ల ఫొటోలు మాత్రమే ఉండటం, మిత్రపక్షం నేతలవి కనిపించకపోవడం, మంత్రి దుర్గేష్ స్థానిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫొటో వేయకపోవడం, ఎమ్మెల్యే కార్యక్రమాల్లో మంత్రి ఫొటోను వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇవన్నీ ఉద్దేశ పూర్వకంగానే జరుగుతున్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. పర్యాటక పనులే కారణమా? రాజమహేంద్రవరం సిటీలో మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వర్గాల మధ్య విభేదాలకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పుష్కర పనులే కారణమన్న ఆరోపణలున్నాయి. నగరంలో సుమారు రూ.92 కోట్లతో రివర్ఫ్రంట్ డెవలప్మెంట్, పుష్కర్ ఘాట్ ఆధునికీకరణ, అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. పనుల్లో తమకు భాగస్వామ్యం కల్పించకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే వాసు అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో తమ ప్రమేయం లేకపోవడం ఏంటన్న ప్రశ్న టీడీపీ శ్రేణుల నుంచి వెల్లువెత్తుతోంది. పనుల వివరాలు తనకు చెప్పడం లేదని వాసు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం పర్యటనకు వచ్చిన సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు కనీస సమాచారం, ఆహ్వానం కూడా అందలేదని ఎమ్మెల్యే వాసు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో మంత్రి దుర్గేష్ పెత్తనానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. మరోపక్క మంత్రి దుర్గేష్ రాజమహేంద్రవరం సిటీ జనసేన నేతలతో సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేని కార్యక్రమాలకు జనసేన నేతలు ఎందుకు హాజరవుతున్నారని ప్రశ్నించినట్లు సమాచారం. బుచ్చయ్య కూడా.. పుష్కర ఘాట్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం వ్యక్తం చేశారు. పుష్కరఘాట్లో పనులు సరిగా జరగడం లేదన్నారు. కట్టడాలు కట్టి పుష్కర ఘాట్ వ్యూ అంతా చెడగొడుతున్నారని మండిపడ్డారు. కూటమిలో భాగస్వామ్యమైన జనసేన మంత్రి దుర్గేష్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులపై కూటమికి చెందిన ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం దాగుందన్న విమర్శలు వస్తున్నాయి. పుష్కర పనుల్లో తమకు, తమ అనుచరులకు లబ్ధి చేకూరలేదన్న ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రిని టార్గెట్ చేస్తూ ఇలాంటి విమర్శలకు దిగడం ఎంత వరకు సమంజసమని జనసేన నేతలు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే.. జనసేన, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య ఏ మేరకు సఖ్యత ఉందో అర్థమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏఐ సహాయంతో అందించిన చిత్రం మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే వాసు వర్గాల మధ్య విభేదాలు పైకి కలసి ఉంటున్నా.. అంతర్గతంగా అంతరం పుష్కర పనుల్లో మొదలైన వైరం అధికారిక కార్యక్రమాల్లో సైతం కనిపించని ఇద్దరు నేతలుమంత్రి టార్గెట్గా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు మంత్రి కందుల దుర్గేష్ను టార్గెట్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగ వ్యాఖ్యలకు దిగారు. పుష్కర పనులు మంత్రి ఆధ్వర్యంలో నడుస్తుండటం, వాటిలోతమ అనుచరులు, తాము పనులు చేసుకునే వెసులుబాటు కల్పించలేదన్న భావనతో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. పుష్కర ఘాట్లో పనుల పరిశీలనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే వాసు బహిరంగంగా విమర్శలు చేశారు. పుష్కరఘాట్లో పనులు నిర్వహిస్తున్న తీరును ఎమ్మెల్యే వాసు ప్రెస్మీట్ పెట్టి మరీ తప్పుబట్టారు. ఘాట్లో అభివృద్ధి పనులు జరుగుతున్న సమాచారం స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు లేదన్నారు. కనీసం మంత్రి దుర్గేష్కు అయినా సమాచారం ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఘాట్లో నూతనంగా అమరుస్తున్న టైల్స్ జారుడు స్వభావం ఉన్నవని, గత పుష్కరాల దుర్ఘటన నేపథ్యంలో అలాంటి టైల్స్ అమర్చడం ఏంటని ప్రశ్నించారు. గోదావరి మాత విగ్రహం ఎదురుగా వాటర్ ఫౌంటేన్ అవసరమా? అని ప్రశ్నించారు. దీనిపై ఎంపీ పురందేశ్వరి సైతం అసహనం వ్యక్తం చేశారన్నారు. ఫౌంటేన్ పనులు ఆపిస్తామని ఎంపీ చెప్పినట్లు వెల్లడించారు. ఈ విషయమై మంత్రి దుర్గేష్తో చర్చిస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు. స్వపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఇలా ప్రశ్నించడంతో పనుల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. -
కాళ్లు చేతులూ చచ్చుబడి..
పెళ్లయి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మద్ది సత్యకు కోరియా వ్యాధి సోకడంతో 2023లో కాళ్లు చేతులూ చచ్చుబడిపోయాయి. 33 సంవత్సరాలకే ఇటువంటి పరిస్థితి ఎదురవడంతో బాధతో కుమిలి పోతోంది. భర్త తన ఇద్దరి పిల్లలతో పాటు భార్యని కూడా చిన్న పిల్లలా చూసుకుంటూ అన్ని పనులు చేస్తున్నాడు. ఇటువంటి స్థితిలో భార్యకి పింఛన్ వస్తే పరిస్థితి కొంచెం మెరుగు పడుతుందనే ఆశతో 2024 నుంచి పెన్షన్ కోసం తిరుగుతున్నాడు. కాని ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాలేదు. – మద్ది సత్య, కోరియా వ్యాధిగ్రస్తురాలు, రాజమహేంద్రవరం న్యాయం కోసం వినతి చాగల్లుకు చెందిన జగత చంద్రిక రాణికి 14 సంవత్సరాలు వచ్చినా రెండున్నర అడుగుల ఎత్తుతో ఆమె పెరుగుదల ఆగిపోయింది. స్కూల్కి వెళితే అవమానాలు, వీధిలో ఆడుకోవడానికి వెళితే ఛీదరింపులు. ఇవన్ని భరించలేని ఆ అమ్మాయి మానసికంగా కుంగిపోయింది. 9వ తరగతి చదువుతున్న తన కూతురికి పెన్షన్ వస్తే కొంత ఆసరాగా ఉంటుందనే ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. సదరన్ సర్టిఫికెట్కు దరఖాస్తు చేయగా ఇది అంగవైకల్యం కిందకి రాదని చెప్పడంతో పెన్షన్ వచ్చే పరిస్థితి కనిపించక న్యాయం చేయాలని కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. – జగత చంద్రిక రాణి, చాగల్లు -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఇన్చార్జి జిల్లా రెవవెన్యూ అధికారి భాస్కర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం వివిధ ఉద్యోగ సంఘాలతో సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గుర్తింపు పొందిన వివిధ సంఘాలు ఇచ్చిన విజ్ఞప్తులు పరిశీలిస్తున్నామని జిల్లా పరిధిలో పరిష్కారమయ్యే సమస్యలను ఇక్కడే పరిష్కరించి మిగిలిన సమస్యలను ఆయా విభాగాల రాష్ట్ర శాఖ అధిపతులకు పంపుతామన్నారు. జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షులు మీసాల మాధవరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ కార్యాలయాల్లో మహిళలకు టాయిలెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా ఔట్ పేషెంట్ విభాగం ఏర్పాటు చేయాలని, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ, సరెండర్ లీవ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ బోధనేతర పనులను తమకు అప్పగించవద్దని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గిరి ప్రసాద్ వర్మ, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి వేణుమాధవ్, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు షరీఫ్, రాజారావు, కేవీవీ సత్యనారాయణ, డేనియల్ బాబు, రెవెన్యూ ఉద్యోగ సంఘ నాయకులు, బాపిరాజు, ప్రసాద్ 4వ తరగతి ఉద్యోగ సంఘ నాయకులు రమణ, వెంకటేశ్వరరావు, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యం రాజు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి ఉద్యోగుల సమస్యలు వివరించారు. -
మళ్లీ మళ్లీ కలెక్టరేట్కు
● పీజీఆర్ఎస్లో పరిష్కారం కాని సమస్యలు ● పేరుకుపోతున్న అర్జీలు ● అసహనంతో సమాధానం ఇస్తున్న అధికారులు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) వల్ల ఉపయోగం లేకుండా పోయిందని అర్జీదారులు వాపోతున్నారు. కలెక్టరేట్కి వస్తున్న అర్జీదారుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తమ సమస్యల పరిష్కారం కోసం జనం మళ్లీ మళ్లీ కలెక్టరేట్కి వస్తూనే ఉన్నారు. తమ సమస్యల పట్ల అధికారులు అసహనంతో సమాధానం చెబుతున్నారని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిలో పెన్షన్కి సంబంధించిన అర్జీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. పెన్షన్కి సదరం అడ్డంకి విభిన్న ప్రతిభావంతులు ఎవరికై నా పెన్షన్ రావాలంటే సదరం సర్టిఫికెట్ ఉండాలి. కాని ఈ సర్టిఫికెట్ తీసుకురావాలంటే పెద్ద యుద్ధమే చేయవలసి వస్తుంది. 2026 జనవరి 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు పీజీఆర్ఎస్కి అన్ని రకాల సమస్యల కోసం (రెవెన్యూ తప్ప) 13,024 అర్జీలు వచ్చాయి. వీటిలో 9,810 అర్జీలు పరిష్కరించగా ఇంకా 3 వేలకి పైగా పరిష్కారం కాలేదు. వీటిలో పెన్షన్ కోసం వచ్చిన అర్జీలే అధికం. 2025 డిసెంబర్ 29 నుంచి రెవెన్యూ క్లినిక్లో 1,856 అర్జీలు వచ్చాయి. వీటిలో 1,198 పరిష్కారం చూపించారు. ఇంకా 658 మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 15 నుంచి నూతన పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. కొత్త పెన్షన్లు అర్హలందరికీ ఇస్తామని గొప్పలు పోతుంది. కాని ఈ రెండు సంసవత్సరాల కాలంలో పెన్షన్ కోసం కాళ్లరేగిలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న అర్జీదారులు అవేదనను అర్థం చేసుకోలేకపోతోంది. పాత పెన్షన్కే దిక్కులేదు.. కొత్త పెన్షన్లు ఎక్కడ ఇస్తారని అర్జీదారులు పెదవి విరుస్తున్నారు. బోరు బావికి అనుమతులివ్వండి ముక్కుపాటి సత్యవాణి గోకవరం మండలం తిరుమలపాలెంలో 3 ఎకరాల 50 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. ఈ స్థలం తమదని పక్కనున్న వారు తగదాకు దిగారు. కోర్టును ఆశ్రయించగా సత్యవాణికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కాని ప్రత్యర్థులు అధికారులతో కుమ్మక్కు కావడంతో వారి పొలంలో బోరు వేసుకోవడానికి కింది స్థాయి అధికారులు సహకరించడం లేదు. దీనిపై ఇప్పటికి 8 సార్లు కలెక్టరేట్కి వచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదని, అధికారులు లంచం డిమాండ్ చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. – ముక్కుపాటి సత్యవాణి, తిరుమలపాలెంగూడు చెదిరిన బాధ రాజమహేంద్రవరంలోని 44, 47 డివిజన్లోని పుంత రోడ్డులో 50 సంవత్సరాలుగా నివసిస్తున్న వారి ఇళ్లను ఈ నెల 13వ తేదీన కూల్చివేశారు. తమకి న్యాయం చేయాలని నిరాశ్రయులందరూ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. సాక్షిలో వచ్చిన గూడు చెదిరి... గుండె పగిలి.. కథనాన్ని కలెక్టర్కి చూపించారు. అంతేకాకుండా పుంతలో టీడీపీ నాయకులు సైట్ ఫర్ సేల్ అనిబోర్డును పెట్టారని, తెలపడంతో కలెక్టర్ పరిశీలిస్తామని చెప్పారు. కలెక్టర్కి వినతి పత్రం ఇస్తున్న పుంత ప్రజలు -
‘సర్’కు ప్రాధాన్యమివ్వాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 కార్యక్రమాన్ని ప్రాధాన్యంతో నిర్వహించి, ఓటరు జాబితాల కచ్చితత్వాన్ని మరింత మెరుగుపరిచే దిశగా పనిచేయాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. సోమవారం బొమ్మూరులోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అందిన అర్జీలను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో 243 అర్జీలు అందాయి. రెవెన్యూ క్లినిక్కు సంబంధించిన 106 అర్జీలను జాయింట్ కలెక్టర్ వై. మే స్వరూప్, ఆర్డీవోలు స్వీకరించగా, ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలను కలెక్టర్ కీర్తి ఇతర అధికారులతో కలిసి స్వీకరించారు. విద్యా దోపిడీకి ప్రభుత్వం బాధ్యత వహించాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేట్ విద్యా దోపిడీకి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని, దోపిడీని అరికట్టడంలో విఫలమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిరణ్కుమార్ తెలిపారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో డీఈవోను కలిసి సోమవారం పరిస్థితి వివరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులను దారుణంగా దోచుకుంటున్నాయన్నారు. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా, ప్రత్యేక తరగతులు, ఇతర అదనపు వసూళ్ల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తూ సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా ఛిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయిన ప్రభుత్వం నేడు ప్రైవేట్ విద్యా వ్యాపారుల ప్రయోజనాలకే పని చేస్తోందన్నారు. అనేక ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. మంత్రి లోకేష్ తన పదవికి రాజీనామా చేయకపోతే పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ కార్యాలయాల ముట్టడులు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కే.భాను ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, చంద్రశేఖర్ జిల్లా నాయకులు, శ్రీను పాల్గొన్నారు. పోలీసు స్పందనకు 20 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ అర్జీదారులతో నేరుగా మాట్లాడారు. ఎస్పీ జూమ్ వీడియో కాన్ఫరెన్స్లో సంబంధిత ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, డీఎస్పీలతో బాధితుల సమక్షంలోనే ఫిర్యాదులను పరిశీలించి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించి, న్యాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు. -
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సహా 12 మందిపై కేసు
అనపర్తి: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మరో 11మంది వైఎస్సార్ సీపీ నాయకులపై అనపర్తి పోలీసులు ఈ నెల 13న కేసు నమోదు చేశారు. ఈ నెల 12న దేవి సెంటర్లో డాక్టర్ సూర్యనారాయణరెడ్డి నేతృత్వంలో చేసిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు గుమిగూడారంటూ కేసు నమోదు చేశారు. మాజీ సర్పంచ్ వెంకటరమణ (రాజుపాలెం), నాగిరెడ్డి (కుతుకులూరు), సబ్బెళ్ల కృష్ణారెడ్డి (రామవరం), మాదాబత్తుల శంకర్ , మందా వెంకటరెడ్డి(మందా శ్రీను), మహిళా నేత విజయలక్ష్మి, అద్దంకి ముక్తేశ్వరరావు, కర్రి శ్రీవెంకటరెడ్డి (మామిడాడ), వల్లభశెట్టి రామసతీష్ (దుప్పలపూడి), కర్రి యేసుదాసు, కొండేటి భీమేష్లతో పాటు మరికొందరు నిరసనకారులు వైఎస్సార్ సీపీ జెండాలను ప్రదర్శిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీటీసీ సభ్యుడు మట్టా శ్రీనుపై కేసు నమోదు రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎంపీటీసీ సభ్యుడు మట్టా శ్రీనుపై శనివారం అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. తమ నాయకుడు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై అనపర్తిలో జరిగిన ఒక కార్యక్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎంపీటీసీ శ్రీనుపై అందిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. చెరువును కబ్జా చేస్తున్నారని రైతుల ఆందోళన – గ్రీవెన్స్లో ఫిర్యాదు రంగంపేట: మండలంలోని పెద్ద దొడ్డిగుంట గ్రామంలోని ముసలయ్య చెరువులో అక్రమంగా మట్టి తవ్వి చెరువును పూడ్చివేస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో అర్ధరాత్రి వేళ చెరువులోని మట్టిని తరలిస్తూ చెరువును సగం వరకు కప్పివేస్తున్నారని రైతులు తెలిపారు. ముసలయ్య చెరువుకు మెరక తూము, పల్లం తూము ఉండగా, ఈ తూముల కింద రెండు కాలువలు ఉన్నాయని పేర్కొన్నారు. చెరువును పూడ్చివేయడం వల్ల ఆయకట్టు భూములకు సాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై గ్రామ రైతులు వీఆర్వో, ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేసి సమస్యను పరిష్కరించాలని కోరినప్పటికీ, పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెనన్స్లో ఫిర్యాదు చేసినట్లు రైతులు అడబాల శ్రీను, రమేష్, రామదాసు, వీరభద్రరావు, కష్ణ, వెంకట్రావు, చిన్నారావు, కనకం తెలిపారు. ఆధ్మాతికతకు కేంద్ర బిందువుగా విజయదుర్గా పీఠం – గజల్ శ్రీనివాస్ రాయవరం: విజయదుర్గా పీఠం ఆధ్మాత్మికతకు కేంద్ర బిందువుగా మారిందని, ఈ ఘనత పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం(గాడ్)కు దక్కుతుందని గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయదుర్గా పీఠాధిపతి గాడ్ ఈ నెల 5న విజయదుర్గాదేవి సాయుజ్యం పొందిన నేపథ్యంలో సోమవారం గాడ్ దశ దిన కర్మ సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ విజయదుర్గా పీఠం ఏర్పాటు చేసి, నిత్యం వేలాది మంది భక్తుల సమస్యలకు పరిష్కారం చూపారన్నారు. గాడ్ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలన్నారు. సంస్మరణ సభలో పలువురు గాడ్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గాడ్ గొప్పదనాన్ని కీర్తిస్తూ శ్రీనివాస్ గజల్స్ ఆలపించారు. గాడ్ సోదరుడు వీవీ బాపిరాజు, కుమార్తెలు బలిజేపల్లి రమ, గాదె సత్యవెంకటకామేశ్వరి, పెదపాటి సత్యకనకదుర్గ, అల్లుళ్లు గాదె భాస్కరనారాయణ, పెదపాటి శ్రీనివాసమూర్తి, పీఠం పీఆర్వో వాడ్రేవు వేణుగోపాల్(బాబి)ల ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. ఎంపీపీ నౌడు వెంకరటమణ, వైద్యులు జీఎస్ఎన్రెడ్డి, తేతల నవీన్రెడ్డి, గోపిరవితేజ, సర్పంచ్ల సమాఖ్య రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పడాల వెంకటరామారెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ తేతల సుబ్బరామారెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు తేతల కమలారెడ్డి, శివశంకరరెడ్డి పాల్గొన్నారు. -
జ్ఞానేశ్వరి కేసు: కీలకంగా మారిన కుక్క పోస్టుమార్టం నివేదిక
తుని రూరల్: చిన్నారి అడుగుజాడలు ఇంకా చిక్కలేదు.. తొమ్మిది రోజులైనా ఎటువంటి ఆధారాలు లభించలేదు.. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ల అగ్రహారం గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకలేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదివారం ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ రాఫిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీమ్, ఎస్డీఆర్ఎఫ్, సబ్ డివిజన్ పోలీసు బృందాల సభ్యులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అత్యాధునిక థర్మల్ డ్రోన్లతో అణువణువూ పరిశీలించారు. అడవి జంతువులు సమీప చెరువులు, కుంటల వద్దకు తాగునీటికి వచ్చినప్పుడు దాడి జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేశారు. అయితే అలాంటి జాడలేమీ కనిపించలేదని అధికారులు పేర్కొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కాదని, చిట్టడవి కావడంతో క్రూర మృగాలు సంచరించే అవకాశం లేదన్నారు. అడవి, ముళ్ల పందులు, కొండ చిలువలు, ప్రమాదకర పాములు సంచరించే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతంలో అడవి జంతువులతో ఎటువంటి నష్టం జరగలేదన్నారు. అడవిలో తప్పిపోవడం, అడవి జంతువుల వల్ల చిన్నారికి ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లభించలేదన్నారు. వేర్వేరుగా నియమించిన వివిధ బృందాలు పలు కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. దారితప్పిన జ్ఞానేశ్వరిని కంచె వద్ద చూసిన వ్యక్తి నేరుగా తమకు చెప్పకుండా గ్రామానికి వెళ్లి విషయం చెప్పడంపై చిన్నారి తల్లి సుంకర భవానీ అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్నా తమ బిడ్డ ఇంటికి చేరుతుందన్న నమ్మకంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. తల్లి అనుమానం, అటవీశాఖ అధికారుల అంచనాల ప్రకారం జ్ఞానేశ్వరి అడవిలో తప్పిపోలేదని, ఎవరో అపహరించి ఉంటారని భావిస్తున్నారు. కుక్క కళేబరానికి పోస్టుమార్టం చిన్నారి జ్ఞానేశ్వరితో పాటు అదృశ్యమై మూడు రోజుల తర్వాత ఇంటికి చేరిన పెంపుడు కుక్క శనివారం మధ్యాహ్నం మృతి చెందిన విషయం తెలిసిందే. కుక్క కళేబరాన్ని ఎన్.సూరవరం వెటర్నరీ ఆస్పత్రికి తరలించి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. మృతికి కారణాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు నమూనాలు సేకరించి విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ల్యాబ్ నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
గోదారి తీరాన..నృత్యఝరులు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదారి తీరాన నృత్య ఝరులు వెల్లివిరిశాయి. నాలుగు రోజులుగా రాజమహేంద్రవరంలోని రివర్బే హోటల్ ఆహ్వానం ఫంక్షన్ హాలులో శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వహించిన కళాసమ్మేళన్–2026 అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సంగీత, నృత్య పోటీల్లో దేశంలోని 13 రాష్ట్రాల నుంచి వచ్చిన 750 మంది కళాకారులు 13 గ్రూపులుగా తమ కళాకౌశలాన్ని అద్భుత రీతిలో ప్రదర్శించారు. తొలి రోజైన గురువారం వంద మంది నాట్యకారిణులు నృత్య ప్రదర్శన చేశారు. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన 175 మంది శుక్రవారం ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకన్ల పాటు 108 అన్నమయ్య కీర్తనలకు నృత్యాభినయం చేసి, నృత్యాభిమానుల కరతాళధ్వానాలు అందుకున్నారు. చివరి రోజైన ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శ్రీపుష్పయాగం వైభవంగా నిర్వహించారు. సనాతన కాలభైరవ వైభవం నృత్యరూపకాన్ని లక్ష్మీదీపిక ఆధ్వర్యాన ప్రదర్శించి, ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రం నిర్వాహకుడు జి.బదరీ నారాయణ మాట్లాడుతూ, కూచిపూడి నృత్య వైభవాన్ని నేటి తరం తెలుసుకోవాలనే సంకల్పంతో గతంలో 63 రోజుల పాటు 22 రాష్ట్రాలు, 17 వేల కిలోమీటర్లు ప్రయాణించి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శించామని చెప్పారు. కూచిపూడికి పూర్వ వైభవం తీసుకు రావడానికి 2003లో భగీరథ ప్రయత్నం మొదలుపెట్టామని అన్నారు. కళాసమ్మేళన్–2026 ద్వారా వందల మంది నృత్యప్రదర్శనలు చేశారని, వీటిని తిలకించి మరికొంత మంది నృత్యం నేర్చుకుంటే తన జన్మ ధన్యమైనట్లేనని అన్నారు. ముగిసిన అంతర్జాతీయ కళాసమ్మేళన్ ప్రతిభ ప్రదర్శించిన 13 గ్రూపులు శ్రీరాధాకృష్ణ కళాక్షేత్రానికి ప్రథమ బహుమతి -
యంత్రటి కుట్రో..!
● వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో నిబంధనల కొర్రీ ● మూడేళ్ల ఈ–క్రాప్ ఉన్నవారే అర్హులంట ● పచ్చచొక్కాలకే లబ్ధి అంటున్న రైతులురాజమహేంద్రవరం రూరల్: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చంద్రబాబు ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తోంది. నిబంధనల పేరుతో రైతులకు రాయితీ యంత్రాలను దూరం చేస్తోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల తర్వాత రాయితీపై యంత్రాల పంపిణీకి సిద్ధం కాగా, రైతుల మెడపై నిబంధనల కత్తి పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు మొత్తం 1,238 యూనిట్ల ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో హార్వెస్టింగ్, నూర్పిడి యంత్రాలు 18 యూనిట్లు, స్ప్రేయర్లు 817, పంట తరువాత మరియు విలువ జోడింపు యంత్రాలు 16 యూనిట్లు, పవర్ టిల్లర్లు 59, అవశేష నిర్వహణ/ ఎండుగడ్డి మరియు మేత సామగ్రి 53 యూనిట్లు, స్వీయచోదక ఇంప్లిమెంట్ యూనిట్లు 100, విత్తడం మరియు నాటడం తవ్వే యంత్రాలు 13 యూనిట్లు, ట్రాక్టర్ పనిముట్లు 118, ట్రాక్టర్లు (40 హెచ్పీ) మరియు మినీ ట్రాక్టర్లు 44 యూనిట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ.4.43 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేక కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా, అవన్నీ టీడీపీ వారికే ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పథకం ఏదైనా పచ్చ చొక్కాలకే వెళ్తున్నాయని అంటున్నారు. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలూ అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అర్హత ఉన్నా, అదృష్టం కావాలి చంద్రబాబు ప్రభుత్వం రాయితీ యంత్ర పరికరాలు పొందేందుకు పలు నిబంధనలు విధించి సామాన్య రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. మూడేళ్లలో మూడుసార్లు ఈ–పంట నమోదు చేసి ఉండాలన్న నిబంధన చాలామంది రైతులకు ఇబ్బందిలా మారింది. ఒకవేళ అర్హత సాధించినా, లాటరీలో అదృష్టం వరించాలి. ఆపై జిల్లా ఇన్చార్జి మంత్రి ఆమోదంతోనే జాబితా తయారవుతోంది. ట్రాక్టర్ మంజూరై డిపాజిట్లు మొత్తం ముందే చెల్లించినా, రాయితీ మాత్రం జూలైలో అందజేస్తామని పేర్కొనడం గమనార్హం. ఆమోదం ఉంటేనే! నిబంధనల పేరిట ప్రభుత్వం ఈ పథకాన్ని అర్హులకు దూరం చేయనుందనే విమర్శలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా మూడేళ్లపాటు ఈ–క్రాప్ నమోదు కలిగి ఉండాలి. కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన తప్పనిసరి చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో 3,02,640.86 ఎకరాల్లో 1,55,977 మంది రైతులు ఈ–క్రాప్ కలిగి ఉన్నారు. సన్న, చిన్నకారు రైతులు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి వరకూ బాగున్నా.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లా ఇన్చార్జి మంత్రి ఎంపిక చేయనున్నారు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. లాటరీలో టీడీపీకి చెందని వారి పేరు వస్తే వారికి యంత్ర పరికరాలను అందించేందుకు ఆమోదముద్ర వేస్తారని చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కాదని ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారికి యంత్రాల పంపిణీ కలగానే మిగలనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.వ్యవసాయదారులకు యంత్ర సాయమన్నారు.. మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు.. నిబంధనల కొర్రీ పెట్టి అర్హులకు అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు.. పచ్చ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళిక రచించారు.. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో నిబంధనల కొర్రి పెట్టారు.. చంద్రబాబు ప్రభుత్వంలో సాగుదారులకు అన్యాయం చేస్తున్నారని అంతా కోడై కూస్తున్నారు.అప్పట్లో పంటగే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వెంటనే వైఎస్సార్ రైతు సేవా పథకంలో భాగంగా ప్రతి ఏటా రాయితీపై ట్రాక్టర్లు, ట్రాక్టరు పనిముట్లు, వ్యవసాయ యంత్ర పరికరాలను పారదర్శకంగా అందజేశారు. పంపిణీ చేసిన రోజే వాటికి సంబంధించిన రాయితీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టరు మంజూరు చేశారు. ఇక వ్యవసాయ పనిముట్లు అడిగిన రైతులందరికీ అందించారు. ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, వరికోత మెషీన్లు, ట్రాక్టరు పనిముట్లు, రోటోవేటర్, స్ప్రేయర్లు అందజేశారు. -
సిద్ధమేనా సర్!
● నేటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ● ఇప్పటికే ఓటర్ల మ్యాపింగ్ పూర్తి ● జిల్లాలో మ్యాపింగ్ కాని ఓట్లు 6,06,011 కపిలేశ్వరపురం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సిఫైడ్ రివిజన్ – ఎస్ఐఆర్) ప్రక్రియ జిల్లాలో సోమవారం ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఓటు హక్కుకు సంబంధించి ఈ ప్రక్రియ ఎన్నో ఆరోపణలు, మరెన్నో సందేహాలు, సంచలనాలు రేపింది. లక్షలాదిగా ఓట్లు తొలగించారనే ఆరోపణలు అనేక రాష్ట్రాల్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న సర్ ప్రక్రియపై ఓటర్లు, రాజకీయ పార్టీల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. దీనిపై ఆయా పార్టీల ప్రతిధులతో అధికారులు ఇప్పటికే సమావేశాలు నిర్వహించి, అవగాహన కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదీ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా 22 మండలాల్లో 7,77,700 ఇళ్లు ఉన్నాయి. మొత్తం 1,799 పోలింగ్ బూత్ల పరిధిలో 18,46,723 మంది ఓటర్లున్నారు. వారందరి ఓటు వివరాలను 2002 ఓటరు జాబితాతో సరిపోల్చుతూ ఇప్పటికే మ్యాపింగ్ చేశారు. 2026 జూన్ ఆరో తేదీ నాటికి మొత్తం 12,40,712 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయ్యింది. ఇంకా మ్యాపింగ్ కాని ఓటర్లు 6,06,011 మంది ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఓటు హక్కుకూ ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది. 1987 లేదా అంతకంటే ముందు జన్మించిన పౌరుల వివరాలను ఇంటింటి సర్వే ద్వారా సేకరించి, సోమవారం నుంచి చేపట్టే ఎన్యూమరేషన్లో సంబంధిత ఫామ్లలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఓటర్ల జాబితాతో 2002, 2011 ఓటర్ల జాబితాలను ఈ నెల 18వ తేదీ వరకూ మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ పూర్తి కాని వారి వివరాలు 2026 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఉండే అవకాశం లేదు. శ్రీసర్శ్రీ షెడ్యూల్ ఇదీ.. సర్ నిర్వహణ కోసం బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) ఈ నెల 5 నుంచి శిక్షణ ఇచ్చారు. వీరు సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. అనంతరం, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఆగస్టు 1 నుంచి 31వ వరకూ కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ, పేర్ల తొలగింపు ప్రక్రియ చేపడతారు. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఓటర్లు ఏం చేయాలంటే.. బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఇచ్చే ఎన్యూమరేషన్ పత్రాలను ఓటర్లు పూర్తి చేసి, తిరిగి వారికి ఇవ్వాలి. 2002 ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఆ వివరాలను ఆ పత్రంలో పేర్కొనాలి. పేరు లేకపోతే తల్లిదండ్రులు, భార్య, భర్త లేదా ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఉంటే ఆ వివరాలు పొందుపరచాలి. పుట్టిన తేదీ, ఆధార్, మొబైల్ నంబర్లు, తండ్రి/సంరక్షకుడి పేరు, తల్లి, భార్య, భర్త పేరు, వారి ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) నంబరు నింపాలి. కొత్తగా దిగిన పాస్పోర్టు సైజు కలర్ ఫొటోలు రెండు ఇవ్వాలి. ఈవిధంగా రెండు పత్రాలు నింపాలి. ఒకటి బీఎల్ఓ తీసుకుని, మరో దానిపై సంతకం చేసి ఓటరుకు రసీదుగా అందజేస్తారు. 2002 జాబితాలో ఓటు ఉండి 2025 జాబితాలో లేకపోతే తగిన ధ్రువపత్రం అందిస్తే ఓటుకు ఢోకా ఉండదు. బీఎల్ఓ ఇంటిని మూడుసార్లు సందర్శించినప్పటికీ ఓటరు అందుబాటులో లేకపోతే ఇంటికి నోటీసు అతికించి, ఓటు తొలగింపునకు ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అయితే, అందుబాటులో లేని కారణంగా ఏ ఒక్కరి ఓటు హక్కునూ తొలగించేందుకు బీఎల్ఓలు ప్రతిపాదించకూడదు. ఆ ఓటరుకు సంబంధించి కుటుంబ సభ్యులు ఎన్నికల కమిషన్ సూచించిన 13 ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి చూపించి, వివరాలు చెప్పినా సరిపోతుంది. ఏ కారణం చేతనైనా ఓటును తొలగిస్తే ఫామ్–6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎల్ఓ నిష్పక్షపాతంగా ఉండాలి ప్రతి పోలింగ్ బూత్కు ఒక్కో బీఎల్ఓ ఉంటారు. రాజకీయ పార్టీలు ప్రతిపాదించిన బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) సమక్షంలో బీఎల్ఓలు ఇంటింటి సర్వే చే స్తారు. ఈ క్రమంలో అధికార పక్షం ఒత్తిళ్లకు ఎవరైనా బీఎల్ఓలు తలొగ్గితే.. ఆయా పార్టీల బీఎల్ఏలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చు. ఏవైనా సమస్య లుంటే ఓటర్లు 1950 టోల్ ఫ్రీ నంబరుతో పాటు తమ తహసీల్దార్ లేదా బీఎల్ఓలను సంప్రదించవచ్చు. అప్రమత్తంగా ఉండాలి రాజ్యాంగంపై నమ్మకమున్న ఓటర్లు తమ ఓటు హక్కు తొలగిపోదనే విశ్వాసంతో ఉంటారు. సర్ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టాలి. ఓటర్లు సైతం అవగాహనతో, అప్రమత్తంగా వ్యవహరించాలి. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, మండపేట -
అర్హులందరికీ ఇవ్వాలి
వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు అందించాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సైతం అందలేదు. కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇచ్చి, వారికి రాయితీపై యంత్ర పరికరాలు ఇవ్వాలి. – వెలుగుబంటి అచ్యుతరామ్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగ సంయుక్త కార్యదర్శి, వేమగిరి యంత్ర సాయం అందజేయాలి రైతులు ఎంతో ఆశతో రాయితీ పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కూటమి పాలనలో అర్హులకు యంత్ర పరికరాలు అందుతాయనే నమ్మకం కలగడం లేదు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రమాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి. – తోరం శోభన్బాబు, రైతు, సీతానగరం ● -
ఇదేం క్రెడిట్ చోరీ!
● 322 పారా మెడికల్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం నోటిఫికేషన్ ● ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన విడుదల ● కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పూర్తయిన ప్రక్రియ ● ‘తూర్పు’న 162 పోస్టులు తామే భర్తీ చేసుకుంటామన్న అధికారులు ● తొలుత 77, తరువాత 79 పోస్టుల భర్తీకి ప్రత్యేకంగా నోటిఫికేషన్లు, రద్దు ● గత ఏడాది డిసెంబర్లో 60 పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ ● ఈ ఏడాది ఏప్రిల్లో 39 పోస్టులకు మరొకటి.. ● ఇవన్నీ తామే ఇచ్చామంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గొప్పలు బేరం పెట్టడానికేనా! ఈ పోస్టుల భర్తీకి బేరసారాలు సాగుతున్నాయని, అందువల్లనే నియామక ప్రక్రియను ముందుకు సాగనీయకుండా నోటిఫికేషన్ల రద్దుతో కుట్ర చేస్తున్నారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరం వైద్య కళాశాలలో అవుట్సోర్సింగ్ ఉద్యోగానికై నా అర్హత లేని తన ప్రియురాలికి రెగ్యులర్ పోస్టు ఇచ్చి ఓ సీనియర్ అసిస్టెంట్ సస్పెండ్ అయ్యాడు. నిజాయితీగా పని చేస్తున్న మహిళా ఏఓ సీటు మార్చిన ఘనులు, ఉద్యోగాలు హోల్సేల్గా అమ్ముకున్న ఉద్దండులు ఇక్కడే కొలువై ఉన్నారు. వీటన్నింటి నేపథ్యంలో 3, 4 నోటిఫికేషన్లలోనూ జాప్యం కొనసాగుతూండటంపై అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము చెప్పిన వారికే ఉద్యోగాలివ్వాలనే రాజకీయ ఒత్తిళ్లు నియామక ప్రక్రియను ఏమాత్రం ముందుకు కదలనీయడం లేదని ఆరోపిస్తున్నారు. నియామక ప్రక్రియలో జాప్యంపై ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ రాజును ‘సాక్షి’, నిరుద్యోగులు వివరణ కోరగా స్పందించలేదు. దీనిపై తాము ప్రిన్సిపాల్ను కలవగా.. బయటకు వెళ్లమంటూ విసుక్కున్నారని కొందరు నిరుద్యోగులు ఆరోపించారు. వాసూ.. ఇదేంటి బాసూ.. ఇన్ని అవాంతరాల మధ్య నియామక ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై నిరుద్యోగులు ఆందోళన చెందుతూండగా.. దీనిపై అబద్ధాలు చెప్పి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నవ్వులపాయ్యారు. ఈ నెల 10న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఆయన.. ఈ పోస్టులు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నోటిఫికేషన్ పరిధిలోనివనే విషయాన్ని తొక్కిపెట్టి, తాము వచ్చాకే నోటిఫికేషన్లు ఓపెన్ చేశామని, తాము వచ్చాకే 99 మందిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని చెప్పారు. తద్వారా గత ప్రభుత్వ క్రెడిట్ను చోరీ చేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు వెల్లువెత్తాయి.కాకినాడ క్రైం: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత. గత ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు తన గొప్పగా తరచూ చెప్పుకుంటూంటారు. దీనికి తానేమీ తక్కువ కాదన్నట్టుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తీరు ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఏం జరిగిందంటే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 322 పారామెడికల్ పోస్టుల భర్తీకి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ), ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) పరిధిలో ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి 162 పోస్టులున్నాయి. వీటికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అప్పట్లోనే కాకినాడలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయంలో నియామక ప్రక్రియ చేపట్టారు. కాకినాడ, కోనసీమ జిల్లాలకు సంబంధించి 160 మందినీ నియమించారు. కానీ, రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, కళాశాలకు సంబంధించిన ఉద్యోగాలను తామే భర్తీ చేసుకుంటామని అప్పట్లో అధికారులు చెప్పారు. ఈ మేరకు నియామక ప్రక్రియను రాజమహేంద్రవరంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆలోగా ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదీ రద్దుల పద్దు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి, కళాశాల పరిధిలో మొత్తం పోస్టులు 162. అయితే, ఎన్నికల అనంతరం, అక్కడి అధికారులు మొదట కేవలం 77 పోస్టులకే ఉద్యోగ ప్రకటన ఇచ్చారు. తరువాత వివిధ కారణాలతో దానిని రద్దు చేసి, రెండో నోటిఫికేషన్ 79 పోస్టులకు ఇచ్చారు. అనంతరం, దానిని కూడా రద్దు చేసి, గత ఏడాది డిసెంబర్ 22న 60 పోస్టులతో మూడో నోటిఫికేషన్ విడుదల చేశారు. తరువాత మరో 39 ఉద్యోగాలకు ఈ ఏడాది ఏప్రిల్ 7న నాలుగో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం మూడు, నాలుగు నోటిఫికేషన్ల కింద 99 పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ పోస్టులన్నీ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినవే కావడం గమనార్హం కలెక్టర్కే టోకరా! వాస్తవానికి ఈ పోస్టుల భర్తీ ఉమ్మడి జిల్లా పరిధిలో జరగాలి. నియామక ప్రక్రియను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యాన చేపడతారు. ఈ కమిటీ చైర్మన్ కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంఽధిర ప్రసాద్. అయితే, ఇన్నిసార్లు నోటిఫికేషన్ ఇచ్చి, రద్దు చేసిన విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టకుండానే.. అధికారులు మరోసారి ఆయన సంతకాలతోనే నోటిఫికేషన్లు విడుదల చేయడం గమనార్హం. దీని వెనుక జరిగిన అసంబద్ధత కలెక్టర్కు తెలిసి ఉంటే తప్పకుండా ఆరా తీసేవారని నిరుద్యోగులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కలెక్టర్ కావడంతో విషయం ఆయనకు తెలియకుండా రాజమహేంద్రవరం వైద్య కళాశాల అధికారులు జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు. ఈసారైనా నియామక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా కలెక్టర్ నేరుగా జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. -
క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలి
సామర్లకోట: ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. పెద్దాపురం రామారావుపేటలోని శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఈ నెల 12 నుంచి జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ పోటీల్లో అండర్– 11, 13, 15, 17, 19 విభాగాల్లో 230 మంది బాల బాలికలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్బాబు మాట్లాడుతూ మూడు రోజుల పాటు విద్యార్థులు, కోచ్లు, అంపైర్లకు వసతి, సదుపాయాలు కల్పించడంపై శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ప్రకాష్ను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డవలప్మెంట్ కమిటీ చైర్మన్ విజయ్ప్రకాష్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో ఉంటూ వారి క్రీడను మరింత పదును పెట్టుకునేందుకు ప్రయత్నించారన్నారు. చీఫ్ రిఫరీ సింగరాజు, అసిస్టెంట్ చీఫ్ రిఫరీ డాక్టర్ డీవైఎస్వై శర్మ, సీనియర్ కోచ్ వేణు, పాఠశాల అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రశాంతి, మీడియా కోఆర్డినేటర్ ఉషా చైతన్య పాల్గొన్నారు. మూడో రోజు విజేతలు వీరే.. టేబుల్ టెన్నిస్ అండర్– 17 బాలికల విభాగంలో శ్రీకర లాస్య (ఫన్టైమ్స్) ప్రథమ, అనన్య ఆనంద్ (ఫన్టైమ్స్) ద్వితీయ, బాలుర విభాగంలో కమిల్ భార్గవ్ (ఫన్టైమ్స్) ప్రథమ, సాయి మాన్విత్ (ఫన్టైమ్స్) ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. అండర్– 19 బాలికల విభాగంలో ఆనన్య ఆనంద్ (ఫన్టైమ్స్) ప్రథమ, హనినీ (గీతం) ద్వితీయ, బాలుర విభాగంలో వేదాంత్ (ఫన్ టైమ్స్) ప్రథమ, సాయి చరణ్ (రైజ్) ద్వితీయ బహుమతులు సాధించారు. మహిళల విభాగంలో మౌపర్ణదాసు (సినర్జీ) ప్రథమ, చార్వి ఫల్గుణ్ (ఆర్జీటీటీఏ) ద్వితీయ, పురుషుల విభాగంలో తేజ సూర్య (గీతం) ప్రథమ, మణికుమార్ (పీఎప్టీటీఏ) ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. -
తలుపులమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 35 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసినట్టు కార్యనిర్వహణ అధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.292095, పూజా టికెట్లకు రూ.6,33,440, తలనీలాలకు రూ.22,400, వాహన పూజలకు రూ.7,030, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.91,965, విరాళాలు రూ.24,585, వెరసి మొత్తం రూ.10,71,515 ఆదాయం సమకూరిందని వివరించారు. -
అట్లాస్తో మెరుగైన అభ్యసనం
కొత్తపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందజేస్తున్న సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంతో పాటు ప్రపంచ భౌగోళిక ప్రాంతాలను గుర్తించే అట్లాస్ (ప్రపంచ దేశ పటాల పుస్తకం) కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం విజ్ఞప్తి చేసింది. అట్లాస్తో విద్యార్థులకు సులువుగా ప్రపంచ జ్ఞానం లభిస్తుందని తెలిపింది. ప్రయోజనాలు ఇవే.. పాఠ్య పుస్తకాల్లో వచ్చే నదులు, పర్వతాలు, పీఠ భూములు, మైదానాల కచ్చితమైన ఉనికిని అట్లాస్ ద్వారా గుర్తించవచ్చు. దీని వల్ల విద్యార్థికి మెరుగైన అభ్యసన జరుగుతుంది. వివిధ ప్రాంతాల వాతావరణం, వర్షపాతం, పవనాల కదలికలను థీమాటిక్ పటాల ద్వారా సులభంగా విశ్లేషించవచ్చు. అడవులు, ఖనిజాలు, నేలల రకాలు, పంటలు పండే ప్రాంతాలను అట్లాస్లో చూసి గుర్తుంచుకోవడం సులువవుతుంది. దేశాలు, వాటి రాజధానులు, రాష్ట్రాలు, అంతర్జాతీయ సరిహద్దుల గురించి కచ్చితమైన సమాచారం లభిస్తుంది. చదవడం కంటే పటాల రూపంలో చూడటం వల్ల సమాచారం మెదడులో ఎక్కువ కాలం గుర్తుంటుంది. స్కేల్, దిశలు, సంకేతాలను చదవడం, అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలు అలవడతాయి. పరీక్షల్లో మ్యాప్ పాయింటింగ్ మార్కులను సులభంగా సాధించవచ్చు. విద్యార్థులు తమకు తాముగా కొత్త ప్రాంతాల గురించి అన్వేషించే అలవాటు పెరుగుతుంది. తప్పనిసరిగా చేర్చాలి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాకిట్లో అట్లాస్ను ప్రభుత్వం తప్పనిసరిగా చేర్చాలి. అది విద్యార్థి అభ్యసనకు, ఉపాధ్యాయుడి ద్వారా మెరుగైన జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతుంది. – కేఎస్వీ కృష్ణారెడ్డి. అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం, రావులపాలెం -
విద్యుత్ షాక్తో యువకుడి దుర్మరణం
కె.గంగవరం: రొయ్యల చెరువు వద్ద విద్యుత్ షాక్కు ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కె.గంగవరం గ్రామానికి చెందిన నేమాని అబ్బుకు దంగేరు శివారు చిట్టూరివారిపాలెం వద్ద రొయ్యల చెరువులు ఉన్నాయి. అక్కడ పని చేసేందుకు ఒడిశాలోని కోరాపూల్లోని కొంగ గ్రామానికి చెందిన త్రినాథ్గౌడ్ (20) నెల రోజుల కిందట చేరాడు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కె.గంగవరం ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ లీకై గాయాలు
మామిడికుదురు: గ్యాస్ సిలిండర్ లీకై ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఈదరాడలోని కమ్మవారిలంకకు చెందిన చుట్టుగుళ్ల చంద్రప్రియ (23) అమలాపురంలోని ఓ ప్రైవేట్ డెంటల్ ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తుంది. ఆదివారం సెలవు కావడంతో ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంట్లోని వంట గదికి ఆమ్లెట్ వేసేందుకు వెళ్లింది. లైటు వేయగా, గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చంద్రప్రియ తీవ్రంగా గాయపడింది. ఆమెను 108 అంబులెన్స్లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థి తి విషమించడంతో అమలాపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. గ్యాస్ లీకేజీ కారణంగా ఇలా జరిగిందని తండ్రి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆమె తల్లి సాయి జ్యోతి ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉన్నారు. -
చెరువులను చెరబట్టారు
రంగంపేట: అధికార పార్టీ నాయకులు చెరువులను చెరబట్టారు. వేసవి ప్రారంభమైనప్పటి నుంచి రంగంపేట మండలంలోని పలు గ్రామాల్లో నిత్యం ఏదో ఒక చెరువులో మట్టిని అక్రమంగా తవ్వేస్తూ, ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సుభద్రంపేట గ్రామంలోని పంతం వారి చెరువు, పెద్ద చెరువుల్లో ఎటువంటి అనుమతులూ లేకుండా జేసీబీలతో మట్టి తవ్వేస్తున్నారు. సుమారు 30 అడుగుల లోతు వరకూ తవ్వేసి, మట్టి తరలించుకుపోతున్నారు. వర్షాలు కురిసి, ఆ అగాధాల్లో నీరు చేరితే స్థానిక రైతులు, పశువుల ప్రాణాలకు ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా స్పందించి మట్టి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మందకొడిగా పొగాకు కొనుగోళ్లు దేవరపల్లి: రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని టొబాకో బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ఆసక్తి చూపడం లేదన్నారు. అమ్మకానికి వచ్చిన బేళ్లలో 40 శాతం తిరస్కరిస్తున్నారన్నారు. కిలో పొగాకుకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.179, సగటున రూ.255.98 చొప్పున ధర పలుకుతోందని వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ 33.01 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయన్నారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 2,96,035, జంగారెడ్డిగూడెం–1లో 5,63,013, జంగారెడ్డిగూడెం–2లో 4,31,649, కొయ్యలగూడెంలో 3,54,660, గోపాలపురం వేలం కేంద్రంలో 4,30,362 కిలోల చొప్పున విక్రయాలు జరిగాయని వివరించారు. సుమారు 80 రోజులుగా వేలం ప్రక్రియ జరుగుతోందన్నారు. ఘనంగా సత్యదేవుని రథసేవ అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆదివారం ఘనంగా ఊరేగించారు. ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై వేంచేయించారు. అనంతరం, అర్చకులు పూజలు చేసి రథసేవ ప్రారంభించారు. రథం లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను రథంపై ఆలయ ప్రాకారంలో మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారిని తిరిగి ఆలయానికి చేర్చారు. నేడు ప్రత్యంగిర హోమం అధిక జ్యేష్ట మాస అమావాస్య సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి సోమవారం ఉదయం 9 గంటలకు ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.1,116 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చు. -
గోదావరిలో మునిగి యువకుడి మృతి
కె.గంగవరం: మండలంలోని కోటిపల్లి రేవులో స్నేహితులతో కలసి స్నానానికి దిగిన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. కె.గంగవరం పోలీసుల కథనం ప్రకారం.. మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన జాగ్ దయాకర్ (18) తన స్నేహితులు కట్ట అభిషేక్, ఉడత శ్యామ్తో కలసి ఆదివారం కోటిపల్లికి వెళ్లారు. అక్కడి పుష్కర ఘాట్ వద్ద గోదావరిలో స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా, దయాకర్ గల్లంతయ్యాడు. వెంటనే గమనించిన స్నేహితులు గట్టుపైకి వచ్చి స్థానికులకు తెలపడంతో, వారు గోదావరిలో గాలించారు. సుమారు రెండు గంటల పాటు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టగా, దయాకర్ మృతదేహం లభించింది. కె.గంగవరం ఎస్సై సోమేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేపల వేటకు వెళ్లి.. ఆత్రేయపురం: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ నదిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము కథనం ప్రకారం.. బొబ్బర్లంక గ్రామానికి చెందిన మోత గంగాధర్ (31) ఆదివారం ఉదయం 9 గంటల సమీపంలో గోదావరి నదిలో వేటాడుతుండగా, ప్రమాదవశాత్తూ నదిలో పడి మృతి చెందాడు. దీనిపై అతని అన్నయ్య మోత వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. కాలువలో మత్స్యకారుడి గల్లంతు పి.గన్నవరం: మొండెపులంక గ్రామం వద్ద ప్రధాన పంట కాలువలో ఆదివారం చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ నీట మునిగి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఎల్.గన్నవరం శివారు జొన్నల్లంకకు చెందిన మత్స్యకారుడు చందాడి శ్రీనివాసరావు (45) ఆదివారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. మొండెపులంక పాత వంతెన సమీపంలోని కాలువలో అతని వల నీటిలో రాయికి చిక్కుకుంది. దీంతో దానిని తొలగించేందుకు కాలువలోకి దిగి ప్రమాదవశాత్తూ నీట మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రధాన పంట కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన శ్రీనివాసరావుకు భార్య వరలక్ష్మి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. దీనిపై అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోగన్నమఠం డ్రైన్లో.. మలికిపురం: గొల్లపాలెం గ్రామంలోని గోగన్నమఠం డ్రైన్లో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఉదయం స్థానిక ఓఎన్జీసీ బావుల సముదాయం వద్ద స్నేహితులతో కలసి ఆటలు ఆడుతుండగా, పక్కనే ఉన్న డ్రైన్లో బంతి పడడంతో దానిని తీసేందుకు గుండుమేను శ్రీరామ్ (16) దిగాడు. అతనికి ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీరామ్ తండ్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు గుండుమేను శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. -
గూడు చెదిరి.. గుండె పగిలి..
ఇంటి వద్ద చికిత్స పొందుతున్న పక్షవాతం రోగిని పక్కన కూర్చోబెట్టిన సిబ్బందిపోలీసు బలగాల భద్రత నడుమ ఇళ్లను కూల్చివేస్తున్న నగరపాలక సంస్థ సిబ్బందిప్రత్యామ్నాయం చూపించాలి గత 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్న పుంత ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఖాళీ చేయమనడం దారుణం. గత ప్రభుత్వ హయాంలో ఎంపీ భరత్ తమకు రోడ్లు వేసి ఇక్కడే స్థిర నివాసం ఉండేలా చేయాలని చూశారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో అంతా తారుమారైంది. రెండేళ్లుగా ఇక్కడ నివసిస్తున్న వారిని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఖాళీ చేయమని భయపెడుతున్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తే వెళ్లడానికి వీరందరూ సిద్ధంగానే ఉన్నారు. అంతా కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవాళ్లే. అర్ధంతరంగా వీరిని పంపించేస్తే ఎక్కడికి వెళ్తారు? – తిరగటి దుర్గారావు, స్థానికుడు పక్షవాతం రోగి అని కూడా చూడలేదు మా మామయ్యకి పక్షవాతం వచ్చి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం ఇంటికి తీసుకువచ్చాం. ఇంటి వద్దే చికిత్స చేయిస్తున్నాం. శనివారం వచ్చి పక్షవాతంతో బాధపడుతున్న మా మామయ్యని బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నా ఇంటిని కూల్చేశారు. బయట మాతో మాట్లాడుతూనే వెనుక నుంచి ఇంటిని కూల్చేయడం దారుణం. – కె.లక్ష్మి, బాధితురాలు ఓట్లడిగిన నాయకులేరీ? ఇళ్లలోకి దూరి ఓట్లు అడిగిన నాయకులు ఏమయ్యారు? ఇంటింటికీ వచ్చి ఓట్లు అడిగి గెలిచిన ఎమ్మెల్యే ఏమయ్యారు? ఇంటికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మా ఇళ్లు పడగకొడతారని తెలియదా? ఓట్లు వేయించికుని నెగ్గి ఇప్పుడు కట్టుబట్టలతో నడివీధిలోకి నెట్టేస్తుంటే కనీసం మమ్మల్ని అదుకోవడానికి రాలేదు. – కొల్లు గ్రేస్, బాధితురాలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డాం మాకు వేరే చోట స్థలాన్ని ఇవ్వకుండా సామాన్లు కూడా తీసుకోకుండా ఇంటిని కూల్చివేశారు. కూలి చేసుకుని జీవించే వాళ్లం. ఇప్పటికిప్పుడు పొమ్మంటే ఎక్కడికి పోవాలి? అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. – దొమ్మేటి లోవ తల్లి ఇది దారుణం మా వాళ్లవి నాలుగు ఇళ్లు కూల్చేశారు. అందరం రోడ్డున పడ్డాం. అండగా ఉండవలసిన ఎమ్మెల్యే కనీసం ఇంత దారుణం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారు. ఇప్పుడు అద్దె ఇల్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. చిన్న పిల్లలు, ముసలి వాళ్లు అని చూడకుండా బలవంతంగా ఖాళీ చేయించారు. వారం ముందు నోటీసులు అందించారు. అంత తొందరగా అద్దె ఇళ్లు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. – కొమ్ము సత్యవతి, బాధితురాలు ఇళ్లు కోల్పోయి.. కన్నీరు మున్నీరై... 50 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లు కూల్చివేత ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చేశారని బాధితులు ఆవేదన టీడీపీ నాయకులు ఇళ్లు, స్థలాలు మాత్రం భద్రం దిక్కుతోచని స్థితిలో ఉన్నాం.. ఆదుకోండని అర్తనాదాలు -
మందపల్లికి పోటెత్తిన భక్తులు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామి వారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. అమావాస్య ముందు వచ్చిన శని త్రయోదశి కావడంతో వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు జెడ్పీ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో పూజలు నిర్వహించి, స్వామి, అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యాన భక్తుల పూజలు, దర్శనాలకు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అర్చకులు, వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపిన అనంతరం శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులకు మజ్జిగ చలివేంద్రాలు, బిస్కెట్ ప్యాకెట్లు, పాలు, అన్నప్రసాదం, ఉచిత ఆటో సర్వీసుల వంటి సేవలు అందించారు. ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.22,48,130, పరోక్ష పూజల ద్వారా రూ.8,63,800 అన్నప్రసాద విరాళాలుగా రూ.46,646 కలిపి మొత్తం రూ.31,58,576 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. -
రత్నగిరి.. భక్తజన ఝురి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. రెండో శనివారం సెలవు కావడంతో సత్యదేవుని దర్శనానికి భక్తులు వెల్లువలా తరలి వచ్చారు. దూరప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో తరలి రావడంతో పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా కూడా భక్తుల వాహనాలు బారులు తీరడంతో పలుమార్లు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదల నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 2026–27 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ఎంపికై న అభ్యర్థుల జాబితాను రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) శనివారం విడుదల చేసింది. ప్రత్యేక కేటగిరీ కోటా మినహా 4,040 సీట్లకు ఎంపికై న విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. ఎంపికై న వారికి ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకూ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ట్రిపుల్ ఐటీకి కాకినాడ జిల్లా నుంచి 199 మంది, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి 234 మంది, తూర్పు గోదావరి జిల్లా నుంచి 110 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి నలుగురు ఎంపికయ్యారు. కోనసీమ జిల్లా పి.లక్ష్మీవాడ జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని నంద్యాల కార్తిక, గాలిదేవర హర్షిణి సత్యదుర్గ, కాకినాడ జిల్లా తుని జెడ్పీ బాలిక హైస్కూల్ విద్యార్థిని పత్రి హర్షిణి, దాడి భానుక్రాంతి, శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని సైపిరెడ్డి స్వాతి టాప్ టెన్లో నిలిచారు. పర్యాటక బోట్ల రాకపోకలకు తాత్కాలికంగా బ్రేక్ రంపచోడవరం: గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణ తీరుపై పలు ఆరోపణలు, భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా వాటి రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. రంపచోడవరం ఆర్డీఓ కె.స్వాతి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆదేశాల మేరకు గోదావరిలో తిరుగుతున్న పర్యాటక బోట్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిపారు. వాటి ఫిట్నెస్, సాంకేతిక పరిస్థితి, ప్రయాణికుల సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, లైఫ్ జాకెట్లు, అత్యవసర రక్షణ పరికరాలు, పర్యాటకుల భద్రత కోసం తీసుకున్న చర్యలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. రెవెన్యూ, పోలీసు, పర్యాటక, మత్స్యశాఖ, విపత్తు నిర్వహణ, ఇరిగేషన్ శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం ఈ తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. ఆ బృందం నివేదిక ఆధారంగా అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారణ అయిన అనంతరం సంబంధిత బోట్లకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని, తనిఖీలు పూర్తయ్యే వరకు గోదావరిలో పర్యాటక బోట్లను నడపరాదని బోట్ యాజమాన్యాలకు ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘ఆడబిడ్డ’కు బాబు మంగళం వైఎస్సార్ సీపీ మహిళా నేతల ధ్వజం సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆడబిడ్డ నిధికి నిధులు లేవని తిరుపతి సభలో చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్, పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి శనివారం మీడియా సమావేశంలో స్పందించారు. గద్దెనెక్కి రెండేళ్లు దాటిపోతున్నా నిధుల్లేవంటూ యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మరో మోసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం సంగతలా ఉంచితే, అప్పుల్లో చంద్రబాబు ప్రపంచ రికార్డు సృష్టించారని విమర్శించారు. కోట్లాది రూపాయల అప్పులు చేస్తున్నా మహిళలకు కనీసం ఒక్క పథకం కూడా అమలు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా, అధికారంలోకి వచ్చాక చెప్పని పథకాలను సైతం అమలు చేసి, మహిళల ఆర్థికాభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన ఏకై క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. దగా పడిన ఆడబిడ్డకు ఆయన మాత్రమే న్యాయం చేస్తారన్నారు. అబద్ధాలు చెప్పి, మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు ప్రజలు 2029లో బుద్ధి చెప్పి జగన్ను అధికారంలోకి తీసుకురావడం ఖాయమని మహిళా నేతలు స్పష్టం చేశారు. -
సర్కారు వారి కుట్టు కథ
ఫ టైలరింగ్ శిక్షణ పేరుతో ఆర్భాటం ఫ ఉచితంగా కుట్టు మెషీన్లు ఇస్తామంటూ గొప్పలు ఫ శిక్షణ ఇచ్చి చేతులు దులుపేసుకున్న ప్రభుత్వం ఫ ఏడాదైనా అందని కుట్టు మెషీన్లు ఫ మహిళల ఆగ్రహం పిఠాపురం: మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు కుట్టు శిక్షణ ఇచ్చి, ఉచితంగా మెషీన్లు ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఆ మాటలను నమ్మి వేలాది మంది మహిళలు ఎంతో ఆశతో శిక్షణ పొందారు. తీరా చూస్తే ప్రభుత్వం శిక్షణతో సరిపెట్టేసి, కుట్టు మెషీన్లు ఇవ్వకుండా చేతులు దులుపేసుకుంది. ఇదంతా చంద్రబాబు మార్కు కట్టు కథలా ఉందంటూ ప్రభుత్వ తీరుపై మహిళలు మండిపడుతున్నారు. రెండు విడతలుగా.. బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యాన బీసీ, ఆర్థికంగా వెనుక బడిన తరగతి (ఈబీసీ), కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు సామాజికవర్గాల్లో అర్హులైన మహిళలకు 2024–25 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గత ఏడాది ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. దీనికోసం సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సీయూఆర్డీ), సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ (ఎస్ఏపీఈ) ఆధ్వర్యాన శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో ఒక ట్రైనర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. శిక్షణ, కేంద్రం అద్దె, కుట్టు మెషీన్, ఇతర పరికరాల కోసం ఒక్కో మహిళకు సుమారు రూ.22 వేల చొప్పున కేటాయించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ రెండు విడతలుగా పలువురు మహిళలు ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందారు. మెషీన్లు ఇవ్వకుండా పరీక్షలు నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టు మెషీన్ అందజేస్తామని అప్పట్లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ అలా జరగలేదు. పైగా 75 శాతం హాజరు ఉన్న మొదటి బ్యాచ్ మహిళలకు ఇటీవల పరీక్షలు నిర్వహించారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఉచితంగా కుట్టు మెషీన్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. శిక్షణ పొందితే మెషీన్లు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూంటే తమకివేం పరీక్షలంటూ మహిళలు మండిపడుతున్నారు. కేవలం మెషీన్లు ఇవ్వకుండా కాలయాపన చేయడానికే ఇలా సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. శిక్షణ పూర్తయి ఏడాది గడుస్తున్నా కుట్టు మెషీన్లు ఎందుకివ్వడం లేదో చెప్పాలని, కనీసం ఎప్పుడిస్తారో స్పష్టత ఇవ్వాలని నిలదీస్తున్నారు. అలాగే శిక్షణ ఇచ్చిన సిబ్బందికి సైతం ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం. ప్రతిపాదనలు పంపించాం జిల్లాలో గత ఏడాది పలువురు మహిళలు టైలరింగ్ శిక్షణ పొంది, పరీక్షలు కూడా రాశారు. 75 శాతం హాజరున్న వారికి ఉచితంగా కుట్టు మెషీన్లు అందజేయాల్సి ఉంది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. బడ్జెట్ విడుదల చేస్తే త్వరలోనే పంపిణీ చేసే అవకాశముంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తర్వాత ట్రైనర్లకు, ఆపరేటర్లకు వేతన బకాయిలు అందజేస్తాం. – శ్రీనివాస్, బీసీ కార్పొరేషన్ ఈడీ, కాకినాడ కుట్టుశిక్షణ కేంద్రాల వివరాలు జిల్లా కేంద్రాలు శిక్షణ పొందిన వారు కాకినాడ 50 4,920 తూర్పుగోదావరి 25 2,904 కోనసీమ 29 3,190 పోలవరం 5 566 మొత్తం 104 11,104 -
రత్నగిరిపై ఎట్టకేలకు వైద్య సేవలు
అన్నవరం: సత్యదేవుని భక్తులకు ఎట్టకేలకు రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. రత్నగిరిపై వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో రత్నగిరిపై వైద్య సేవల ఆవశ్యకతను వెలుగులోకి తెచ్చేలా ‘దివ్యక్షేత్రం.. వైద్యం పూజ్యం!’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. ప్రతి రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానం వైద్యాధికారి వంశీకృష్ణతో పాటు ఇద్దరు నర్సులలో ఒకరు షిఫ్టుల వారీగా రత్నగిరిపై భక్తులకు సేవలందించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి రావడంతో డాక్టర్ వంశీకృష్ణ, సీనియర్ నర్సు సరోజిని శనివారం రామాలయం ఎదురుగా కార్పొరేట్ ఆసుపత్రికి కేటాయించిన హెల్త్ సెంటర్లో సేవలందించారు. శాశ్వత వైద్యశాల మేలు రత్నగిరిపై వైద్య సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం వరకూ బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ భక్తులకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా శాశ్వత ప్రాతిపదికన ఆసుపత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. వాస్తవానికి భక్తులకు ప్రథమ చికిత్స అందించేందుకు రత్నగిరి రామాలయం ఎదురుగా కార్పొరేట్ ఆసుపత్రికి గది కేటాయించడంపై విమర్శలున్నాయి. కొన్నిసార్లు దేవస్థానంలోనే భక్తులు మృతి చెందుతున్నారు. మరి కొంత మంది ఆసుపత్రికి తరలించగానే మృతి చెందుతున్నారు. దైవదర్శనం తరువాత భక్తులు అక్కడే సేద తీరుతారు. అక్కడే ప్రసాదాల విక్రయ కేంద్రం ఉంది. అటువంటి చోట మృతి చెందిన వారిని తరలించడం కొంత ఇబ్బందితో కూడుకున్న పని. ఇలా జరిగినా ప్రతిసారీ ఆలయ ప్రాంగణంలో సంప్రోక్షణ చేయాల్సి ఉంటుంది. అందువలన ప్రకాష్ సదన్ సత్రం వెనుక ఖాళీ స్థలంలో శాశ్వత ఆసుపత్రి నిర్మిస్తే అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి అందుబాటులో ఉంటుందనే అభిప్రాయం వస్తోంది. ఇది ఆలయానికి దూరంగా ఉండటం వలన ఎవరైనా మృతి చెందినా పక్కనే ఉన్న ఘాట్ రోడ్డు ద్వారా దిగువకు తీసుకువెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఇదిలా ఉండగా దేవస్థానం వైద్యుడిని మధ్యాహ్నం వరకూ రత్నగిరిపై పని చేయాలని ఆదేశించడంతో ఆ సమయంలో కొండ దిగువన వైద్య సేవలు అందే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కొండ దిగువన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పని చేసేలా మరో వైద్యుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తక్షణ వైద్యం అందించేందుకే.. రత్నగిరిపై భక్తులకు తక్షణ వైద్య సహాయం అందడం లేదు. ఎంత సీరియస్ కేసు అయినా కొండ దిగువ ఆసుపత్రికి తరలించాల్సి వస్తోంది. ఈ క్రమంలో మార్గం మధ్యలోనే ప్రాణం పోతోందన్న విమర్శలున్నాయి. అందువలన తక్షణ వైద్యం అందించేందుకు డాక్టర్, నర్స్ను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవస్థానంలో పని చేయాలని ఆదేశించాం. రత్నగిరిపై పర్మినెంట్ ఆసుపత్రి నిర్మించే అంశాన్ని పరిశీలిస్తాం. – నల్లం సూర్య చక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
అంతర్ జిల్లా దొంగ అరెస్టు
ఫ రూ.8 లక్షల విలువైన 62 గ్రాముల బంగారం స్వాధీనం ఫ వివరాలు వెల్లడించిన సీఐ తిలక్ నిడదవోలు: పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడిన అంతర్ జిల్లా దొంగను సమిశ్రగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను శనివారం నిడదవోలు సీఐ కార్యాలయంలో సీఐ పీవీజీ తిలక్ వెల్లడించారు. రాజమహేంద్రవరంలోని ఆనంద్ నగర్కు చెందిన గోడి సతీష్ కుమార్ 2025 నవంబర్ 4న నిడదవోలు మండలం సమిశ్రగూడెం కెనాల్ రోడ్డులోని కాసాని సత్యనారాయణ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుపై సమిశ్రగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నేర స్థలంలో లభించిన భౌతిక, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల సాయంతో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు డి. ముప్పవరం గ్రామ శివారున నిందితుడు గోడి సతీష్ కుమార్ను అరెస్టు చేసి సుమారు రూ.8 లక్షల విలువైన 62 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై వివిధ జిల్లాల్లో సుమారు 50 దొంగతనం కేసులు నమోదయ్యాయి. నిందితుడు సతీష్ కుమార్ ముందుగా పగటి పూట రెక్కి నిర్వహించి, తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తాడు. రాత్రి పూట ఆ ఇంటి తలుపులకు వేసిన తాళాలను బద్ధలుకొట్టి దొంగతనాలు చేస్తాడు. పలుమార్లు ఒంటరిగా, కొన్నిసార్లు పరిచయం ఉన్న నేరస్తులతో కలిసి నేరాలు చేశాడు. కాగా.. కేసును చేధించిన సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు, సర్కిల్ క్రైమ్, స్టేషన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్, కొవ్వూరు డీఎస్పీ ఎ.దేవకుమార్లు అభినందించి రివార్డులు ప్రకటించారు. -
శ్రీగోకులం.. అధ్వానం..
ఫ వర్షం కురిస్తే కారిపోతున్న నీరు ఫ తడిచిపోతున్న గోవులు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ గోకులం రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్దయింది. గోకులం పైన రెల్లిగడ్డితో నేసిన కప్పు నుంచి నీరు కారిపోవడంతో సప్త గోవులతో బాటు మధ్యలోని శ్రీకృష్ణుడి విగ్రహం కూడా తడిసిపోయింది. రెండేళ్ల క్రితం కప్పుపై తడికలు పేర్చి దానిపై రెల్లి గడ్డి వేశారు. అయితే రత్నగిరిపై తిరుగుతున్న కోతుల కారణంగా రెల్లిగడ్డి ఊడిపోవడంతో లోపలకు వర్షం కారిపోతోంది. దీంతో గోవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కాగా.. 2007లో దేవదాయశాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా రత్నగిరిపై శ్రీగోకులాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత మిగిలిన దేవస్థానాలలో కూడా ప్రారంభమైనా అన్నవరంలోని శ్రీగోకులం బాగా ప్రాచుర్యం పొందింది. సత్యదేవుని దర్శించుకున్న భక్తులందరూ ఇక్కడకు వచ్చిన గోవులకు పూజలు చేస్తారు. శ్రీగోకులంలో నిత్యం ఉదయం ఏడు గంటల నుంచి గోపూజ నిర్వహిస్తున్నారు. వీటితో బాటు గో సంరక్షణార్థం విరాళాలు స్వీకరిస్తున్నారు. రూ.1,116 నుంచి ఎంత మొత్తమైనా విరాళంగా చెల్లించవచ్చు. గోవులకు మేత పెట్టేందుకు రూ.పదితో పచ్చగడ్డి, తర్వాత దాణాను విక్రయిస్తున్నారు. ఇలా గోపూజ, మే త విక్రయాలు, హుండీ ద్వారా ఏటా రూ.50 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు. -
19 క్వారీ లారీలపై కేసులు
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడి ప్రధాన రహదారిలో మైనింగ్, రవాణా శాఖల సంయుక్తాధ్వర్యంలో రెండో రోజు శనివారం నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలు పాటించని 19 క్వారీ లారీలపై కేసులు నమోదు చేశారు. నల్లరాయిని తరలించే భారీ వాహనాలకు సంబంధించి రికార్డులు సక్రమంగా లేకపోవడం, అధిక లోడు, భద్రతా నియమాలు పాటించకపోవడంతో వాటి నుంచి రూ.1.90 లక్షల జరిమానా విధించారు. తనిఖీల్లో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ డి.సోనీప్రియ, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గౌరీ శంకర్, మైనింగ్ టెక్నికల్ సిబ్బంది సత్యతేజ, రవీంద్ర, కాకినాడ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. 8 మట్టి ట్రాక్టర్లపై కేసులు అమలాపురం రూరల్: నిబంధనలు పాటించని 8 మట్టి ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి, రూ.38 వేల అపరాధ రుసుం విధించామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రెడ్డిపల్లి – కామనగరువు రోడ్డు మార్గంలో తనిఖీలు నిర్వహించామని, ఈ సందర్భంగా మట్టిపై టార్పాలిన్ కప్పకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, రోడ్డు పన్ను ఎగవేత అంశాలపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుపడితే తండ్రి బాధ్యత వహించాలని, రహదారి భద్రతా నియమాల ఉల్లంఘనకు పాల్పడే వారిపై మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తప్పవని డీటీఓహెచ్చరించారు. టేబుల్ టెన్నిస్ పోటీల రెండో రోజు విజేతలు సామర్లకోట: పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి టెబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ పోటీల్లో రెండో రోజు శనివారం విజేతల వివరాలను ఆంధ్రప్రదేశ్ టెబుల్ టెన్నిస్ అసోసియేషన్ కార్యదర్శి పి.విశ్వనాథ్ ప్రకటించారు. అండర్ – 11 బాలికల విభాగంలో మిషిక గోవిందరాజు (డీటీటీఎ) ప్రథమ, గీతి ఆప్రోజ్ (ఫన్ టైమ్స్) ద్వితీయ, బాలుర విభాగంలో వీర సాత్విక్ (ఫన్ టైమ్స్) ప్రథమ, పల్లా మహాసవిన్ (ఫన్ టైమ్స్) ద్వితీయ స్థానాల్లో నిలిచారు. ఫ అండర్ – 13 బాలిక విభాగంలో శ్రీకర లాస్య, కొల్లి హైత్విక (ఫన్ టైమ్స్), బాలుర విభాగంలో జె.వైభవ్, జి.తరుణ్ తేజ (ఫన్టైమ్స్) వరుస స్థానాల్లో నిలిచారు. ఫ అండర్ – 15 విభాగంలో శ్రీకర లాస్య, కొల్లి హైత్విక (ఫన్ టైమ్స్), బాలుర విభాగంలో ఎన్.వేదాంశ్ (ఫన్టైమ్స్), నల్ల మోక్షజ్ఞ తేజ (రైజ్) ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ సీహెచ్ విజయ్ ప్రకాష్, కార్యదర్శి విశ్వనాథ్ బహుమతులు అందజేశారు. ఈ పోటీలను నిర్ణీత సమయంలో పూర్తి చేసిన చీఫ్ రిఫరీ సింగరాజు, అసిస్టెంట్ చీఫ్ రిఫరీ డీవైఎస్వై శర్మ, ఇతర అంపైర్లను అభినందించారు. -
కేసుల ఛేదనలో ఏఐ కీలకం
ఏలూరు టౌన్: పోలీస్ వ్యవస్థలో నిందితులకు శిక్షలు విధించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సాధనాలు కీలకమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిశోర్ అధ్యక్షతన పోలీస్ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై శనివారం ఏలూరులో కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ నిర్వహించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పోలీస్ అధికారులు దీనికి హాజరయ్యారు. ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ విధుల్లో దర్యాప్తు, కోర్టు విచారణల రిపోర్టుల తయారీలో ఏఐ ఉపయోగపడుతుందన్నారు. ఏలూరు జిల్లాలో ఎస్పీ శివ కిశోర్ ఆధ్వర్యంలో ఏఐని వినియోగిస్తూ మెరుగైన ఫలితాలు సాధించటం అభినందనీయమన్నారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లో ఏఐ టూల్స్ వినియోగించాలని కోరారు. 20 శాతం పెరిగిన కేసుల పరిష్కారం ఏలూరు జిల్లా ఎస్పీ శివ కిశోర్ మాట్లాడుతూ ధర్మా (డిజిటల్ హాలీస్టిక్ ఏఐ డ్రైవెన్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ అసిస్టెంట్) యాప్ను రూపొందించటంలో స్మార్ట్ పోలీసింగ్కు కృషి చేశామన్నారు. ధర్మా యాప్ పోలీస్ విధి నిర్వహణలో ఏఐ ఆధారిత సహాయక వేదికగా పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే కేసుల పరిష్కారం 20 శాతం పెరిగిందని, ఏకంగా 2,344 కేసులు పరిష్కారం కావటం విశేషమన్నారు. నేరాలకు సంబంధించి ఫొటోలు, సాక్ష్యాలు, చార్జిషీట్లు, ప్రకటనలు వంటి అంశాల్లో ఏఐ విశ్లేషణలతో దర్యాప్తులో కచ్చితత్వం మరింత పెరిగిందన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలపై పోరాడాలి
అమలాపురం టౌన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయిస్తూ చట్ట సవరణ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలు, ఆర్థిక పరమైన ప్రయోజనాలు సాధించేందుకు ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జీవీ రమణ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని సమష్టిగా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా వ్యవహరించి, గ్రామాల్లో బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం, జీఓ–45 ప్రకారం ఉపాధ్యాయుల పునర్విభజన అంశంపై ఆయన అవగాహన కల్పించారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీఏఎస్ సుబ్బారావు ఈ విద్యా సంవత్సర ప్రణాళికను వివరించారు. జిల్లా గౌరవాధ్యక్షుడు పెంకే వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి జ్యోతిబసు తదితరులు మాట్లాడారు. -
వాడపల్లి.. భక్తులతో శోభిల్లి..
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని శనివారం సుమారు 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో, ఆలయ ప్రాంగణం, క్యూలు కిక్కిరిసిపోయాయి. స్వామివారికి సుప్రభాత సేవ, తొలి హారతి, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవారి దర్శనానంతరం భక్తులు క్షేత్ర పాలకులు శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు అందించామని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆర్యవైశ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా స్వామి వారికి రూ.70,71,526 ఆదాయం సమకూరింది. -
పాపికొండలు: గోదావరి మధ్యలో నిలిచిపోయిన బోటు
సాక్షి, పోలవరం: పాపికొండల పర్యటనలో గోదావరి మధ్యలో శ్రీలక్ష్మి బోటు నిలిచిపోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో పాపికొండల బోట్లు నిర్వహణలో డొల్లతనం బయటపడింది. గండి పోచమ్మ దేవస్థానం ప్రాంగణం నుండి పాపికొండలు విహారయాత్రకు 89 మంది పర్యాటకులతో బోటు బయలుదేరింది. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్ళే సరికి సాంకేతిక లోపం తలెత్తడంతో బోటును సరంగు నిలిపివేశారు.మరో బోటులో పర్యాటకులను బోటు యజమానులు తీసుకెళ్లారు. శ్రీలక్ష్మి బోటు ఆగిపోవడంతో జలశ్రీ బోటులో పర్యాటకులను వెళ్లారని నిర్వాహకులు చెబుతున్నారు. బోట్ నిలిచిపోవడంతో పాపికొండల బోట్లు ఫిట్నెస్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోట్లో వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు.. తాత్కాలికంగా పాపికొండలు టూరిజం బోట్లను నిలిపివేశారు. -
పాఠాలకు వేళాయె..
● తొలిరోజు 50 శాతం హాజరు ● విద్యార్థులకు అందని పుస్తకాలు ● గొడౌన్లకు ఉపాధ్యాయుల పరుగు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వేసవి సెలవుల అనంతరం గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు 50 శాతం హాజరయ్యారు. తరగతుల ప్రారంభం రోజే ఇవ్వాల్సిన పాఠ్య పుస్తకాలను విద్యాశాఖాధికారులు ఇంకా తీసుకురాలేదు. హైస్కూళ్లకు ఇప్పటికే అందజేసినా, ప్రాధమిక పాఠశాలలకు ఇంకా అందజేయలేదు. దీంతో ఉపాధ్యాయులు తరగతులు పక్కన పెట్టి గొడౌన్లకు పరుగులెడుతున్నారు. కాగా పాఠశాలలు తెరిచిన తొలిరోజు తూతూ మంత్రంగా కొన్ని పాఠశాలల్లో పుస్తకాలను పంపిణీ చేసారు. ఇక యూనిఫాం, స్కూలు బ్యాగులు, షూస్ మాటే లేదు. అవి ఇంకా గొడౌన్ వరకూ రాలేదు. అవి చేరడానికి ఇంకా 10 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 1,126 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వాటిలో 843 ప్రాథమిక పాఠశాలలు, 44 ప్రాధమికోన్నత పాఠశాలలు, 261 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 93,849 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నప్పటికీ, విద్యా సంవత్సరం ప్రారంభానికి అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లు పూర్తికాకపోవడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు పూర్తి చేసి, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేసేలా విద్యాశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సర్లో బీఎల్ఓల పాత్ర కీలకం కలెక్టర్ కీర్తి చేకూరి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సర్ ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్, అర్బన్ ప్రాంతాల బీఎల్వోల కోసం శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మార్గనిర్దేశం చేశారు. జేసీ మేఘా స్వరూప్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్ రెడ్డి, సహాయ రిటర్నింగ్ అధికారి (రూరల్ తహసీల్దార్) శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ను ఎంత సమగ్రంగా నిర్వహిస్తే, అంత తక్కువ సంఖ్యలో క్లెయిములు, అభ్యంతరాలు వస్తాయని తెలిపారు. ప్రతి బీఎల్వో తప్పనిసరిగా ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని సూచించారు. డోర్ లాక్ ఉన్న ఇళ్ల వద్ద నోటీసులు జారీ చేయడంతో పాటు, తదుపరి సందర్శన తేదీని తెలియజేయాలని, ఆ నోటీసులో ఈఆర్వో, ఏఈఆర్వో, బీఎల్వో ఫోన్ నంబర్లు కూడా పొందుపరచాలని కలెక్టర్ ఆదేశించారు. సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షించి, ఎన్యుమరేషన్ ప్రక్రియ నాణ్యతను నిర్ధారించాలని స్పష్టం చేశారు. జేసీ మేఘస్వరూప్ మాట్లాడుతూ జిల్లాలో జనాభా పెరుగుదల, వలసల వల్ల ఓటర్ల వివరాల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అందెల రవమిది పదములదె!
● నేత్ర పర్వంగా సాగిన నృత్యాభినయం ● అన్నమయ్య కీర్తనలకు 175 మంది నృత్య నీరాజనం ● గోదారి తీరం.. ఆనంద తాండవం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అందెల రవమిది పదములదా.. అంబరమంటిన హృదయముదా అంటూ అంతర్జాతీయ సంగీత కళా సమ్మేళన్ ఫెస్ట్ 2026 రెండో రోజు హృద్యంగా సాగింది. ఒక్కటి కాదు రెండు కాదు 108 అన్నమయ్య పద సంకీర్తనల ఝురిలో గోదారి తీరం తడిసి ముద్దయ్యింది. భక్తి, శృంగార, కరుణ రసాలలో ఆయన రచించిన కీర్తనలకు రసరమ్యంగా నృత్యం చేశారు. 175 మంది ప్రదర్శించిన నృత్యాభినయం నేత్రపర్వంగా సాగింది. 44వ అంతర్జాతీయ సమ్మేళనంలో భాగంగా రాజమహేంద్రవరం రివర్బే వద్ద గల ఆహ్వానం ఫంక్షన్ హాల్లో సాగిన ఈ కార్యక్రమంలో వీక్షకులు తన్మయులయ్యారు. శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతోంది. తిరుమల వేంకటేశ్వర స్వామి వారికి జరిగే తిరుప్పావడ సేవ (పులిహోర) సేవను అక్కడ జరిగినట్టే ఇక్కడా నిర్వహించారు. పులిహోర, వివిధ రకాల పుష్పాలు, ఫలాలతో స్వామి వారి ప్రతిమను చేసి సేవ అనంతరం వీక్షకులకు ప్రసాదంగా వితరణ చేశారు. 9 గంటల 9 నిమషాల 9 సెకండ్ల పాటు నృత్యాభినయం.. శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6.6 గంటల వరకు 175 మంది నృత్యకారులు పదకవితా పితామహుడు కలియుగ దైవం వేంకటేశ్వరునిపై రచించిన కీర్తనలకు నృత్యం చేశారు. చిన్నారులు సైతం నర్తించి వేదికకు శోభ తెచ్చారు. అనంతరం రాత్రి వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వహకుడు, హిందు ధర్మ పరిషత్ ట్రస్టు రాష్ట్ర సాంస్కృతిక శాఖ కో ఆర్డినేటర్ డాక్టర్ జీబీ నారాయణ మాట్లాడుతూ నేటి తరం సంప్రదాయ కళల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు తిరిగి పునరుజ్జీవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. -
వెన్నుపోటుపై ప్రజాగ్రహం
హోరెత్తిన నినాదాలు మండపేట పట్టణంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పాలనను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. రాజారత్నం సెంటర్ లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలువపువ్వు సెంటర్ కేపీ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మోసాలు సామాన్య ప్రజలకు అర్థమయ్యాయన్నారు. నిరసన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కూటమి పాలనను కూకటివేళ్లతో పెకిలించే సమయం ఆసన్నమైందన్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో హామీలు తుంగలో తొక్కి ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు నిరసనకు దిగారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో జిల్లా వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మాజీ సీఎం, వైఎస్ జగన్ పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. బాబు పథకాల పేరుతో చేసిన నయవంచనను ఎండగట్టారు. బాబు హామీలను చూపుతూ వినూత్న నిరసనకు దిగారు. ర్యాలీలకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నాయకులు తరలివచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అడుగడుగునా అడ్డంకులు చంద్రబాబు వెన్నుపోటుకు నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. కోటగుమ్మం సెంటర్లోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నుంచి డీలక్స్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ శాంతియుతంగా నిర్వహించారు. ర్యాలీ చేపట్టేందుకు వీలు లేదంటూ హెచ్చరిస్తూనే ఒకానొక దశలో అక్కడి నుంచి తోసేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు నిరసనగా పార్టీ నేతలు, మాజీ ఎంపీ భరత్ అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. తన నివాసంలోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి వ్యక్తిగత గదుల వరకు తనిఖీలు నిర్వహించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు. తన నివాసంలోకి ప్రవేశించిన పోలీసు అధికారులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని భరత్ హెచ్చరించారు. సంబంధిత అధికారులపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. నీకు 15.. నీకు 15.. అంటూ మంత్రి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అనుసరిస్తూ.. ప్రత్యేకంగా ఓ వ్యక్తిని సైకిల్పై తిప్పుతూ నిరసన తెలిపారు. అనంతరం మార్గాని ఎస్టేట్ వద్ద సైకిల్ను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం మహిళలు, నిరుద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.వేల కోట్లు ఉన్నాయని భరత్ పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తుతో ఆటలాడటం దారుణమని మండిపడ్డారు. రెండేళ్ల పాలన సిగ్గుసిగ్గు చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలన సిగ్గు సిగ్గని, ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, జిల్లా పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. రెండేళ్ల పాలనపై విజయోత్సవాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ జంక్షన్లో వేణు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ కోటిపల్లి బస్టాండ్ సెంటర్ నుంచి మెయిన్రోడ్లోని పొట్టిశ్రీరాములు విగ్రహం వరకు వెళ్లి తిరిగి కోటిపల్లి బస్టాండ్ వరకు సాగింది. ర్యాలీకి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు నాయకులు తరలివచ్చి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుష్క వాగ్దానాలు తప్ప.. చేసింది శూన్యమన్నారు. ఏ ఒక్క హామీని అమలు చేయకుండా బూటకపు హామీలతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ డొల్లతనాన్ని ప్రజలు గుర్తించారని, అందుకే వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం సిగ్గుపడాలి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అబద్ధమని, రెండేళ్లపాలనపై కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలని వైఎస్సార్ సీపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలు చేస్తున్నది దోచుకున్నది దాచుకోవడానికే అన్నట్లు ఉందన్నారు. రెండేళ్ల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కేసులకు భయపడం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని, ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని, అలాంటి వాటికి పార్టీ శ్రేణులు భయపడేది లేదని రాజమండ్రి పార్లమెంటు పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. కార్యకర్తల జోలికొస్తే ఉపేక్షించం అధికార మదంతో కూటమి ప్రభుత్వ నేతలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చేస్తున్న వేధింపులు మానుకోవాలని పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు‘ కార్యక్రమం ముగింపు సందర్భంగా శుక్రవారం రాజానగరంలో నిర్వహించిన ర్యాలీకి వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. సూర్యారావుపేట–రాజానగరం రహదారి జనసంద్రంగా మారింది. సూర్యారావుపేట దుర్గమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభమైన ర్యాలీ సాయిబాబా ఆలయం, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా రాజానగరంలోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరింది. కూటమి ఇచ్చిన అబద్ధపు హామీల ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రచారం తారాస్థాయిలో ఉందని, ప్రజలకు చేసింది మాత్రం శూన్యమన్నారు. ఈ దుర్మార్గపు పాలనపై పోరాటం సాగిస్తామన్నారు. కార్యక్రమంలో కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినూత్న నిరసన చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసగా అనపర్తిలో వైఎస్సార్ సీపీ శ్రేణులు వినూత్న నిరసనకు దిగారు. చంద్రబాబు ప్రకటించిన పథకాలు ఇవ్వకుండా చేస్తున్న మోసంపై పథకాల ప్లకార్డులు చేతబట్టుకుని రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో భౌతికదాడులు, ఆస్తుల ధ్వంసం, హత్యలు, కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పథకాల పేరుతో నయవంచన వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జ్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో కొవ్వూరులో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో పార్టీ శ్రేణులు నిరసనకు దిగారు. తొలుత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవిహార్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు నిర్వహించారు. ర్యాలీలో ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి చేస్తున్న అక్రమాలపై ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తలారి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు ప్రజలకు తీరని మోసం చేశారని మండిపడ్డారు. వృద్ధులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాల ప్రజలను నయవంచనకు గురి చేశారని దుయ్యబట్టారు. పాలన ఇలాగే సాగితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. గోపాలపురంలో నిరసన నియోజకవర్గం నల్లజర్లలో మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో స్థానిక పెట్రోల్ బంక్ నుంచి మండల పార్టీ కార్యాలయం నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన జరిగింది. ప్లకార్డులు చేతపట్టి చంద్రబాబు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వరకు నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి వనిత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తామని నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. బాబు రెండేళ్ల పాలనలో మహిళలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. హోరెత్తిన నిరసన ర్యాలీ కూటమి ప్రభుత్వ దగాను నిరసిస్తూ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జ్ జి.శ్రీనివాసులు నాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు కదం తొక్కారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నుంచి ప్రారంభమైన ర్యాలీ నంగాలమ్మ గుడి యాదవుల వీధి ఓవర్ బ్రిడ్జి సెంటర్ గణేశ సెంటర్ మీదగా తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం అని చెప్పి దగా చేశారన్నారు. 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు వైఎస్సార్ సీపీ పిలుపునకు భారీ స్పందన రాజానగరంలో అర్ధనగ్న ప్రదర్శన అనపర్తిలో వినూత్న నిరసన జనసంద్రమైన రాజానగరం, మండపేట -
మన్నుకుండిపోయారు!
కూటమిగా ఏర్పడ్డారు.. ఉన్నమట్టుకు దోచేస్తున్నారు.. ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు.. అనుమతులు లేకుండా మట్టి తవ్వేసి తరలించుకుపోతున్నారు.. ఈ దందా అధికారుల కళ్లెదుటే జరుగుతున్నా, మిన్నకుండిపోతున్నారు.. ఇలా అక్రమార్కులు రూ.లక్షల్లో ఆర్జిస్తూ మాకెవరు అడ్డు అన్నట్టు చెలరేగిపోతున్నారు. ఫ మట్టి దందాను పట్టించుకోని అధికారులు ఫ చెలరేగిపోతున్న మాఫియా ఫ రూ.లక్షల్లో ఆర్జిస్తున్న వైనం తాళ్లపూడి: అక్రమార్కులు కొండలను కరిగించేస్తున్నారు. తాళ్లపూడి మండలంలోని పరిసర గ్రామాలైన పోచవరం, రాగోలపల్లి, తుపాకులగూడేనికి చెందిన రెవెన్యూ పరిధిలోని గోపాలపురం వైపు సగ్గొండ వెళ్లే దారిలో కొండలను తవ్వేస్తున్నారు. కొంతమంది సిండికేట్గా ఏర్పడి పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని తరలించుకుపోతున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. తాళ్లపూడి, గోపాలపురం మండలాల్లో అధికార పార్టీ నేతలు ఈ దందాకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మట్టి లారీ లోడు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ అమ్మకాలు సాగిస్తున్నారు. వందల లారీల్లో గ్రావెల్ బయటకు పోతోంది. ఆయా గ్రామాల్లోని కొండలపై ఉన్న జామాయిల్, భారీ చెట్లను నిర్ధాక్షిణ్యంగా తొలగించి, తవ్వకాలు సాగిస్తున్నారు. రోడ్డు లెవెలింగ్కు అనుమతులు తీసుకుని, ఆ ముసుగులో గ్రావెల్ను లేఅవుట్లకు తరలిస్తున్నారు. ఈ దందాపై ప్రశ్నించిన వారిని మాఫియా బెదిరిస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుపోతున్నారు. దీనిపై మండల బీజేపీ అధ్యక్షుడు ఇండుగుల రామకృష్ణ స్థానిక నాయకులతో కలసి కొవ్వూరులో శుక్రవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మైనింగ్ ఏడీ ఫణిభూషన్రెడ్డి ఇతర అధికారులతో కలసి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. -
అనువణువూ జల్లెడ
తుని రూరల్: కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ చిక్కుళ్ల అగ్రహారంలో ఈ నెల 6న అదృశ్యమైన చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఏడు రోజులైనా లభించలేదు. శుక్రవారం పెద్దాపురం డీఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, ఏఎన్ఎస్ కూంబింగ్, క్యూఆర్టీ బృందాలతో గాలింపు చర్యలు కొనసాగించారు. హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన జీపీఎస్ ట్రాకర్ను పెంపుడు కుక్కకు అమర్చి బయటకు వదిలారు. దీంతో పరిసర ప్రాంతాల్లో కుక్క ఎనిమిది కిలోమీటర్లు సంచరించినట్టు ట్రాకర్ ద్వారా గుర్తించారు. ఆ ప్రాంతాలను దర్యాప్తు బృందాలు అణువణువూ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు కుక్క నిరసంగా ఉండడంతో వెటర్నరీ సిబ్బందితో వైద్య సేవలు అందించారు. అదేవిధంగా చిన్నారి కాళ్లకు ఉన్న వెండి పట్టీలను గుర్తించేందుకు సిల్వర్ మెటల్ డిటెక్టర్ (డివైజ్) నిపుణులతో జ్ఞానేశ్వరి చివరిసారిగా కనిపించిన ప్రాంతంలో తనిఖీలు చేయించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిలక్ మాట్లాడుతూ చిన్నారి ఆచూకీ తెలిసేవరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామన్నారు. చిన్నారి తండ్రి సుంకర గణేష్కు ఉన్న విరోధులు, ఆర్థిక లావాదేవీలు, సెల్ఫోన్ సిగ్నల్స్, గతంలో పనిచేసి మానేసిన కూలీలు, ఇతరేతర కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. టవర్ డంప్, సీడీఆర్లు, సీసీ కెమెరాల సీపీ ఫుటేజీలు, తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. అనుమానితులు, గంజాయికి అలవాటుపడిన వ్యక్తులపై దృష్టి సారించామన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గాలింపు కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు. పురోగతిపై సంబంధిత అధికారులతో డీఎస్పీ సమీక్షించారు. తల్లిదండ్రుల చెంతకు చేరాలి చిక్కుళ్ల అగ్రహారంలో అదృశ్యమైన జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు వద్దకు చేరాలని మాజీ మంత్రి, కాకినాడ జిల్లా వైఎస్సార్ సీసీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. ఎస్.అన్నవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. చిన్నారి ఆయురారోగ్యాలతో తల్లిదండ్రుల వద్దకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. పాప కోసం అధికారులు గాలిస్తున్నారన్నారు. ఇటువంటి మనోవేదన మరెవరికి రాకూడదని అన్నారు. ఫ చిన్నారి కోసం ముమ్మరంగా గాలింపు ఫ 8 కిలోమీటర్లు సంచరించిన పెంపుడు కుక్క ఫ ఆయా ప్రాంతాల్లో బృందాల తనిఖీలు -
సంక్షేమానికి బాటలు పరచిన పాదయాత్ర
● నేడు ఉమ్మడి జిల్లాలోకి అడుగుపెట్టిన రోజు ● మరపురాని ఆ అరుదైన జ్ఞాపకాలు కపిలేశ్వరపురం: నడుస్తున్న చరిత్రలో లిఖించదగిన అరుదైన ఘటనల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఒకటి. జనం చూపిన మార్గంలో పయనించాలన్న సంకల్పం నుంచి వైఎస్ జగన్ రాష్ట్రంలో 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. 2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమై 2019 జనవరి 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ సాగి విజయవంతంగా ముగిసింది. అంతటి మహాయాత్ర 2018 జూన్ 12న అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోకి అడుగు పెట్టింది. గోదారమ్మ చలవతో యాత్ర విజయవంతమై, ఆగస్టు 14న విశాఖ జిల్లా మీదుగా ముందుకు సాగింది. అడుగడుగునా నీరాజనం పాదయాత్ర 187వ రోజైన 2018 జూన్ 12న పశ్చిమ నుంచి గోదావరిపై రోడ్ కం రైల్ బ్రిడ్జి బీదుగా పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమలో వీడ్కోలు, తూర్పులో స్వాగత కార్యక్రమాలు వంతెనపై జననేతతో అడుగులో అడుగేస్తూ ముందుకు సాగిన అశేష జనంతో గోదావరి ప్రాంతం పులకించింది. జనం తాకిడికి బ్రిడ్జి పలుమార్లు ఊగడంతో అప్పట్లో టీడీపీ ప్రభుత్వం గుండెల్లో ప్రకంపనలు కలిగాయంటూ అభిమానులు చమత్కరించారు. గోదావరి వెంబడి 600 పడవలు ఆకర్షణీయంగా నిలిచాయి. 13న కోనసీమ జిల్లాలోకి ప్రవేశించింది. బొబ్బర్లంక– రావులపాలెం రహదారి జనగోదావరిలా మారింది. యానాం, ధవళేశ్వరం తదితర వంతెనలు ఆకర్షణీయంగా మారాయి. బొబ్బర్లంక– రావులపాలెం రహదారి వెంబడి కాలువలో నవరత్నాల నావలు ఆకట్టుకున్నాయి. జగన్ హృదయంలోంచి జనం వెళ్లేటట్టుగా కాకినాడ రూరల్, తునిలలో ఏర్పాటు చేసిన ప్రవేశ ద్వారం విశేషంగా ఆకట్టుకుంది. కోనసీమ కడలిలో కొబ్బరి కమ్మలు, కాయలు, పలు ప్రాంతాల్లో ధాన్యం గుత్తులతో ఘన స్వాగతం పలికారు. అమలాపురం, రౌతులపూడి మండలం గిడజాం, ఎస్.అగ్రహారం తదితర ప్రాంతాల్లో పూలతో స్వాగతం ఎంతో ఆకట్టుకుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం పారుపాక క్రాస్ వద్ద ఆదివాసీయుల దినోత్సవం సందర్భంగా గిరిజనులు కొమ్ము తలపాగను జగన్కు ఇవ్వగా ధరించారు. ఆగస్టు 14న విశాఖ జిల్లాలోకి పాదయాత్ర ప్రవేశించింది. అప్పటి దుష్టపాలనలో చెప్పుకొన్న సమస్యలనేకం అప్పటి చంద్రబాబు ప్రభుత్వ పాలనతో తాము ఎలా సతమతమవుతున్నామో సామాన్య జనం వైఎస్ జగన్ వద్ద చెప్పుకొన్నారు. నిలువ నీడ లేకున్నా ఇళ్ల స్థలం ఇవ్వడం లేదని, వైకల్యం కళ్లకు కనిపిస్తున్నా పింఛను ఇచ్చేందుకు కనికరం చూపడం లేదని, తమను ఆదరించడం లేదని అనేక వృత్తిదారులు సమస్యలు చెప్పుకొన్నారు. తమ కుటీర పరిశ్రమలు నిర్వహణ కష్టమవుతుందని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు తమ గోడు వెల్లబోసుకున్నారు. జీఎస్టీ వర్తింపు వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటూ నార్కెడిమిల్లిలో పచ్చళ్ల తయారీ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీవనోపాధిని సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయంటూ ఆత్రేయపురంలో పూతరేకుల వ్యాపారులు అన్నారు. వీరవరంలో బెల్లం తయారీ వ్యాపారులు, చెరుకు రైతులు తమ సమస్యలను చెప్పుకొన్నారు. తలసేమియా, మోకాలు, జీర్ణ వ్యవస్థ ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న వారు జగన్ను కలిశారు. భరోసాగా నిలిచి.. జనం విన్నపాలే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోగా రూపాంతరం చెందాయి. రెండే రెండు పేజీలతో మొత్తం నవ్యాంధ్ర ప్రదేశ్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఆశా జ్యోతిగా, భరోసాగా మ్యానిఫెస్టో నిలిచింది. ప్రజల దీవెనలతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మ్యానిఫెస్టోను పరిపూర్ణంగా అమలు చేసి దేశాన్ని ఆంధ్రప్రదేశ్ పాలన వైపు దృష్టి సారించేలా చేసింది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా విపత్కర పరిస్థితులను సైతం అధిగమించి ఖర్చుకు వెనకాడకుండా పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమాన్ని అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుంది. అంతటి ఽధైర్యాన్ని ఇచ్చింది ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రే. -
ఇక సర్కారీ బడి గంట
● సందడికి సిద్ధమైన ప్రభుత్వ పాఠశాలలు ● జిల్లాలో 93,849 మంది విద్యార్థులు ● ఇంకా చేరని విద్యామిత్ర కిట్లు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వేసవి సెలవులు ముగిశాయి. జిల్లాలోని విద్యాసంస్థలు నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధమయ్యాయి. జిల్లావ్యాప్తంగా శుక్రవారం బడి గంట మోగనుంది. పాఠశాలల పునఃప్రారంభంతో విద్యార్థుల కేరింతలు, ఉపాధ్యాయుల బోధనలు, ఉదయపు ప్రార్థనలతో విద్యాలయాలు మళ్లీ కళకళలాడనున్నాయి. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల హాజరు పెంపు, పాఠ్యపుస్తకాల పంపిణీ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే బోధన సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. అయితే కీలకమైన విద్యామిత్ర కిట్లు ఇంకా పాఠశాలలకు చేరలేదు. తగ్గిన ప్రవేశాల సంఖ్య జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,126 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 843 ప్రాథమిక పాఠశాలలు, 44 అప్పర్ ప్రాథమిక పాఠశాలలు, 261 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థల్లో 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 93,849 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో అధికారులు పలు సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వీటిని విద్యార్థులు, తల్లిదండ్రులకు చూపిస్తూ ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి పెరిగిలా ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాల భవనాల పరిశుభ్రత, తరగతి గదుల మరమ్మతులు, బెంచీలు, డెస్కులు, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి పనులను వేగవంతం చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో భవనాల భద్రత, విద్యుత్ సదుపాయాలపై కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య గతంతో పోల్చితే చాలా తగ్గిపోయింది. విద్యార్థులు, తల్లిదండ్రులు కార్పొరేట్ విద్యాలయాల వైపు పరుగులు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో పాఠశాలలకు కొత్తరూపు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన నాడు–నేడు కార్యక్రమం ద్వారా జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక రూపును సంతరించుకున్నాయి. తరగతి గదుల అభివృద్ధి, స్మార్ట్ టెలివిజన్లు, డిజిటల్ బోధన, మెరుగైన ఫర్నిచర్, ప్రహరీలు, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కూడా కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రావడం విశేషం. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు శాతం పెంపు, డ్రాప్అవుట్ల నివారణ, నాణ్యమైన విద్య అందించడం వంటి అంశాలకు విద్యాశాఖ ప్రాధాన్యం ఇస్తోంది. ఇంకా రాని యూనిఫాం, స్కూలు బ్యాగులు, షూస్ విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ మాత్రమే చేరాయి. వాటిని తొలిరోజే అందించేందుకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నా విద్యార్థులకు యూనిఫాం దుస్తులు, స్కూలు బ్యాగులు, షూస్ ఇంకా రాలేదు. మొదటి రోజు నుంచే తరగతులు ప్రారంభమయ్యేలా ఉపాధ్యాయులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఏఐ జెనరేటెడ్ చిత్రం -
అంతర్జాతీయ సంగీత ఫెస్ట్ ఆరంభం
● 14వ తేదీ వరకు అలరించనున్న సంగీత, నృత్యోత్సవాలు ● దేశంలోని 13 రాష్ట్రాల నుంచి కళాకారుల ప్రదర్శన సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నెమలికి నేర్పిన నడకలివీ... అంటూ నాట్యకారిణిలు తమ నృత్యంతో అలరించగా... పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు వంటి అన్నమయ్య కీర్తనలతో సంగీత విద్యాంసులు తమ గానామృతంతో గురువారం గోదావరి తీరాన్ని పులకింపచేశారు. నాలుగురోజుల పాటు గోదావరి తీరం సంగీత, నృత్యాలతో పులకించనుంది. రోజుకు వంద మందికి పైగా కళాకారులు ఒకే వేదికపై తమ నాట్య, సంగీత ప్రదర్శనతో నగర వాసుల పరవశులను చేయనున్నారు. దానికి రివర్ బే వద్ద గల ఆహ్వానం ఫంక్షన్ హాల్ వేదిక అయ్యింది. గత 43 సంవత్సరాలుగా కళా సమ్మేళన్ పేరుతో సంగీత, నృత్యోత్సవాలు శ్రీరాధాకృష్ణ కళాక్షేత, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి 14వ తేదీ వరకు జరగనున్న 44వ కళా సమ్మేళన్ అంతర్జాతీయ సంగీత, నృత్య ఫెస్ట్ – 2026ను మంత్రి కె.దుర్గేష్ ప్రారంభించారు. ఈ కళా సమ్మేళన్లో 13 రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొంటున్నారు. నేడు 155 మంది కళాకారులతో నృత్య నీరాజనం శుక్రవారం 155 మంది 9 గంటల 9 నిమిషాల 9సెకండ్ల పాటు నిర్విరామంగా ఒకే ఆహార్యంతో 108 అన్నమయ్య సంకీర్తనా వైభవం నృత్య ప్రదర్శనలు ఇస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీవెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో జరిగే విధంగా 18 సేవలను ప్రత్యక్షంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. వీరితో పాటుగా 9మంది సంగీత విద్యాంసులు కూడా పాల్గొననున్నారు. 13వ తేదీ 13గ్రూపులు పోటీ పడనున్నాయి. ఒక్కొక్క గ్రూప్లో 25 నుంచి 30 వరకు కళాకారులు ఉంటారు. 14వ తేదీ సోలో పోటీలు, సర్టిఫికెట్లు ప్రధానం చేయనున్నారు. ఈ బృందాలకు పర్యవేక్షకురాలిగా ప్రముఖ నాట్యాకారిణి లక్ష్మీదీపిక వ్యవహరిస్తున్నారు. గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 90 మంది నాట్యకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరికి బహమతులను అందజేశారు. -
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు
నేడు జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో నిరసన ర్యాలీలు రాజమహేంద్రవరం రూరల్: జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనపై నిరసనగా శుక్రవారం ర్యాలీలు ఆయా నియోజకవర్గ కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో దగాపడ్డ రైతులు, మహిళలు, విద్యార్థులు, ఇలా దగాపడిన ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ ప్రజల తరఫున జిల్లాలోని నియోజకవర్గాలలో ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలుపుతున్నామన్నారు. దీంతో పాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యానికి దివ్యౌషధం యోగా కడియం: ప్రపంచ శాంతికి, సంపూర్ణ ఆరోగ్యానికి దివ్యౌషధం యోగా అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శివాంజనేయ నర్సరీ ప్రాంగణంలో గురువారం జిల్లా స్థాయి యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ , ఆయుష్, ఏపీ ఎం ఐ పి, హార్టికల్చర్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ యోగా ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప వరమని అన్నారు. జూన్ 21న అమరావతిలో ‘యోగాంధ్ర’ రాష్ట్ర స్థాయి అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. జేసీ మేఘాస్వరూప్ మాట్లాడుతూ జూన్ 14 సరస్వతి ఘాట్లో పర్యటక కాన్సెప్ట్ పై, ఆర్ట్స్ కళాశాలలో జూన్ 21 జిల్లా స్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుతున్నామని చెప్పారు. కడియం ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్ రెడ్డి, ఆర్డీవో ఆర్.శివరాముడు పాల్గొన్నారు. బస్సులో బంగారు హారం చోరీ అనపర్తి: బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్లో ఉంచిన బంగారు హారాన్ని దొంగలు అపహరించారు. రాజమహేంద్రవరం మోరంపూడికి చెందిన టి.మంగయమ్మ ఈ నెల 4న తన కుమార్తె ఇంటికి వెళ్లడానికి రాజమహేంద్రవరం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అనపర్తి చేరుకున్న తర్వాత తన బ్యాగ్లో ఉంచిన 40 గ్రాముల బంగారు హారం కనిపించకుండా పోయినట్లు గమనించారు. ఈ మేరకు గురువారం అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. -
వేమగిరి జంక్షన్లో రోడ్డు ప్రమాదం
– భార్య మృతి, భర్తకు గాయాలు కడియం: మండలంలోని వేమగిరి వద్ద జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త గాయాలపాలవ్వడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడియం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో వెంకాయమ్మపేట గ్రామానికి చెందిన పసుమర్తి శ్రీనివాసరావు, మంగతాయారు (50) మోటారు సైకిల్పై రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తున్నారు. అదే సమయంలో రావులపాలెం వైపు నుంచి అరటికాయల లోడుతో కటక్ వెళుతున్న వ్యాన్ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మంగతాయారు తలమీదుగా వ్యాన్ చక్రాలు వెళ్లిపోవడంతో తల మొత్తం ఛిద్రమైపోయి, ఆమె అక్కడికక్కడే కన్నుమూసింది. శ్రీనివాసరావు కాలితో సహా పలు శరీర భాగాలపై గాయాలయ్యాయి. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారని పోలీస్లు తెలిపారు. యమునా పుష్కరాల నుంచి గురువారమే భార్యాభర్తలిద్దరూ ఇంటికి చేరుకున్నారని, గురువారం బ్యాంకు పని నిమిత్తం రాజమహేంద్రవరం వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని బంధువులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి కడియం ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూ.25 లక్షలు కాజేసిన సహోద్యోగిపై కేసు అనపర్తి: తమను నమ్మించి రూ.25 లక్షలు కాజేసిన సహోద్యోగిపై చర్యలు తీసుకుని, డబ్బును వాపసు ఇప్పించాలని కోరుతూ అనపర్తికి చెందిన ఇద్దరు యువకులు మంగళవారం రాత్రి ఫిర్యాదు చేసినట్టు పోలీసులు గురువారం తెలిపారు. అనపర్తి గ్రామానికి చెందిన జంపా వెంకట సుభాష్, వైరాల చిరంజీవి స్థానికంగా ఉన్న ఒక ప్రయివేటు బ్యాంకులో లోన్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. వీరు బంగారు రుణాల టేకోవర్ లావాదేవీల కోసం రాజశేఖర్రెడ్డి, స్వామిశేఖర్రెడ్డిల వద్ద డబ్బు అప్పుగా తీసుకుని, ముందుగా మాట్లాడుకున్న ప్రకారం వడ్డీతో తిరిగి చెల్లిస్తూ వచ్చేవారు. ఇదిలా ఉండగా 2026 జనవరిలో వారి టీమ్ లీడర్గా చేరిన కొక్కిరిమెట్ల వెంకట రామకృష్ణ రామచంద్రపురంలోని ముత్తూట్ బ్రాంచ్లో రూ.24 లక్షల విలువైన గోల్డ్ లోన్ ఉందని, అది క్లియర్ చేసి తమ బ్యాంకుకు బదిలీ చేస్తే లాభం వస్తుందని వారిని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఫిర్యాదుదారులు, రాజశేఖర్రెడ్డి, అతని సహచరుల ద్వారా విడతల వారీగా మొత్తం రూ.24,58,000ను రామకృష్ణకు అందజేశారు. కొన్ని రోజుల తరువాత తమ డబ్బు తిరిగి ఇవ్వాలని కోరినప్పుడు, రామకృష్ణ మరుసటి రోజే గోల్డ్ లోన్ను తమ బ్యాంకులో తాకట్టు పెట్టి మొత్తం బకాయిని చెల్లిస్తానని, అదనంగా వచ్చిన లక్ష రూపాయల లాభాన్ని అందరికీ పంచుతానని హామీ ఇచ్చాడు. కనీసం వడ్డీ అయినా జమ వేయమని కోరగా తన ఫోన్పే ఖాతాలో రూ.30,000 మాత్రమే ఉన్నాయని చెప్పి ఆ మొత్తాన్ని చిరంజీవి ఖాతాకు బదిలీ చేశాడు. నగదు రూపంలో మరో రూ.28,000 ఇవ్వగా ఆ మొత్తాన్ని స్వామి శేఖర్రెడ్డికి చెల్లించారు. మిగిలిన మొత్తం ఇవ్వడానికి కాలయాపన చేస్తూ వచ్చాడు. అనంతరం రామకృష్ణ పరారైనట్లు అతని బావమరిది ద్వారా ఫిర్యాదుదారులకు తెలిసింది. కొంతకాలం తర్వాత రామకృష్ణ తాను క్రికెట్ బెట్టింగ్లో డబ్బంతా పోగొట్టుకున్నానని, అందువల్ల డబ్బు తిరిగి చెల్లించలేనని చెప్పడమే కాకుండా తమను బెదిరించాడని బాధితులు పేర్కొన్నారు. తమను మోసం చేసిన రామకృష్ణ, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని, న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఇచ్చిన ఫిర్యాదుపై అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. ‘రంపచోడవరం’ పరిశీలకుడిగా పాపారాయుడు కపిలేశ్వరపురం: పోలవరం జిల్లా రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ పరిశీలకులుగా తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన కర్రి పాపారాయుడు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ప్రకటన వెలువడింది. -
అభివృద్ధి పనులన్నీ మా హయాంలోనివే
● రెండేళ్లలో ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం చూపలేని ప్రభుత్వం ● మాజీ ఎంపీ భరత్రామ్ రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం ఇండోర్ స్టేడియం, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి పూర్తిగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషి ఫలితమేనని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమహేంద్రవరంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖేలో ఇండియా పథకం ద్వారా మంజూరైన 13 కోట్ల రూపాయలను కూటమి నేతలు తమ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో నిరంతరం సమన్వయం చేస్తూ గత ప్రభుత్వ హయాంలోనే 58 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదాలు తెచ్చామన్నారు. రెండేళ్లుగా ఇండోర్ స్టేడియం అభివృద్ధి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసిన నేతలు ఇప్పుడు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. మోరంపూడి ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయలేని ప్రభుత్వం అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. ఫ్లై ఓవర్లు, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, ఎయిర్పోర్ట్ టెర్మినల్ విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు, నిధులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే తాను ఎంపీగా ఉన్న సమయంలో తీసుకొచ్చానన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో రాజమహేంద్రవరంలో కొత్తగా ఒక్క ప్రధాన అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదన్నారు. విద్యుత్ ట్రానన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినా ప్రచార ఆర్భాటం చేసుకోవడం స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకు అలవాటుగా మారిందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎంతో హడావుడిగా ప్రారంభించిన ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రాజెక్టు ఘోరంగా విఫలమైందని, దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గత రెండేళ్లలో రాజమహేంద్రవరం అభివృద్ధికి చేసిన కృషి ఏమిటో ప్రజలకు వివరించాలని కోరారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రచారాలతో కాలం గడుపుతోందని, కానీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజల తీర్పు కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెబుతుందని మార్గాని భరత్రామ్ హెచ్చరించారు. -
అమలాపురంలో గోల్డ్ స్కాం కలకలం
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: అమలాపురంలో గోల్డ్ స్కాం కలకలం రేపుతోంది. సిద్ధేశ్వరి జ్యువెలర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తానని చెప్పిన నగల దుకాణం నిర్వహకుడు అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డుపై బైఠాయించారు.కష్టపడి కూడబెట్టిన సొమ్మును సంస్థలో పెట్టుబడిగా పెట్టామని.. ఇప్పుడు తమ డబ్బులు తిరిగి వస్తాయో లేదో తెలియని పరిస్థితి నెలకొందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే న్యాయం చేసి, బంగారం ఆభరణాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతలు సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. పూర్తి స్థాయిలో బంగారం తిరిగి వచ్చే వరకు పోరాటం చేస్తామని బాధితులు తేల్చి చెప్పారు. -
వెంకటేశ్వర మార్కెట్లో అగ్ని ప్రమాదం
రూ.5 లక్షల ఆస్తి నష్టం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక వెంకటేశ్వర మార్కెట్లోని ఓరియంట్ ఫ్యాన్ల సర్వీస్ దుకాణంలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే విషయాన్ని 101కు ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డి.శ్యామ్సుందర్ అనే వ్యక్తి వెంకటేశ్వర మార్కెట్లోని ఒక భవనంలోని మొదటి అంతస్తులో ఓరియంట్ ప్యాన్ల సర్వీసింగ్ నిర్వహిస్తున్నాడు. దుకాణంలో షార్ట్ షర్యూట్ జరిగి మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. రూ.10 లక్షల విలువైన సామగ్రిని మంటలకు ఆహుతికాకుండా ఫైర్ సిబ్బంది నివారించారు. డెల్టాలకు 8,300 క్యూసెక్కుల విడుదల ధవళేశ్వరం: గోదావరి డెల్టా కాలువలకు బుధవారం 8,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,100, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 4,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. కాటన్ బ్యారేజీ వద్ద 9.15 అడుగులకు నీటి మట్టం చేరింది. విద్యార్థుల వివరాల సవరణలకు అవకాశం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షల అభ్యర్థుల వివరాల్లో అవసరమైన సవరణలను చేయడానికి ఈ నెల 15వ తేదీ వరకు అవకాశాన్ని పొడిగించినట్లు డీఈఓ కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. హెచ్ఎంలు, విద్యార్థుల వివరాలను జాగ్రత్తగా సరిచూసుకుని, సవరణలు ఉంటే నిర్దేశిత సమయంలో హెచ్ఎం లాగిన్ ద్వారా సమర్పించాలన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ -
గోపాలపురంలో గరంగరం
నియోజకవర్గ జనసేనలో ఆధిపత్య పోరు తరాస్థాయికి చేరింది. కొంత కాలంగా అంతర్గతంగా ఉన్న విభేదాలు గ్రామ కమిటీ నియామకంతో భగ్గుమన్నాయి. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డి.సువర్ణరాజు, నియోజకవర్గ నేత దిరిసిన ఫాతిమా రాణిల మధ్య వర్గపోరు నెలకొంది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో సువర్ణరాజు వ్యవహరిస్తున్న తీరు స్వపక్షీయులకు మింగుడు పడడం లేదు. పార్టీ కోసం ఆది నుంచీ శ్రమించినవారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తుండడంపై వారు గుర్రుగా ఉన్నారు. అగ్గి రాజేసిన ఇన్చార్జి పదవి? ఏడాది క్రితం జనసేనలో చేరిన దేవరపల్లి మండలం గౌరీపట్నానికి చెందిన దిరిసిన ఫాతిమా రాణికి నియోజకవర్గ ఇన్చార్జి పదవి కట్టబెట్టేందుకు పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇది ఆమెకు, సువర్ణరాజుకు మధ్య ఆధిపత్యపోరుకు కారణమైందన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల దేవరపల్లి గ్రామ కమిటీ నియామకంతో ఇవి బట్టబయలయ్యాయి. 2025 అక్టోబర్లో వచ్చిన మోంథా తుపాను బాధితుల కోసం సువర్ణరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా సేకరించిన బియ్యాన్ని పంపిణీ చేయకపోవడంతో అవికాస్తా పాడైపోయాయి. వాటని సుమారు రూ.15 లక్షలకు విక్రయించారు. ఆ సొమ్మును సకాలంలో ప్రభుత్వానికి అందజేయకపోవడంతో సువర్ణరాజు కార్యకర్తల నుంచి పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం బియ్యం సొమ్మును సువర్ణరాజు ప్రభుత్వానికి అందజేశారు. దిరిసిన ఫాతిమారాణి, జనసేన నాయకురాలు, గౌరీపట్నంసువర్ణరాజు, నియోజకవర్గ ఇన్చార్జి, దేవరపల్లి -
తాగునీరు కలుషితమవుతున్నా పట్టించుకోరా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు జెడ్పీటీసీ సభ్యులు నిలదీశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజాపరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. తొలుత చైర్మన్ ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్షించారు. ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, విద్యుత్ తదితర శాఖల్లో వివిధ పనుల పురోగతి, కొత్త ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో చర్చించారు. గొల్లప్రోలు, ప్రతిపాడు, జగ్గంపేట గ్రామాల్లో సరఫరా చేస్తున్న తాగునీరు మట్టి వాసన వస్తోందని, రంగు మారుతోందని, అయినప్పటికీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు సభ్యులు నిలదీశారు. రావులపాలెం, యు.కొత్తపల్లి గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు మట్టి తవ్వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు మాట్లాడుతూ, ధాన్యానికి గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కడలిన మత్స్యకారులు
పిఠాపురం: సుదీర్ఘ వేట విరామం తరువాత గంగపుత్రులు బోట్లకు లంగరు తీసి కడలి ఒడిలోకి బుధవారం పయనమయ్యారు. వాస్తవానికి ఈ నెల 14వ తేదీ నుంచి చేపల వేట పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నాలుగు చేపలు వెనకేసుకోవాలనే గంపెడాశతో మత్స్యకారులు నాలుగు రోజులు ముందుగానే తమ జీవన పోరాటాన్ని పునఃప్రారంభించారు. రెండు రోజులుగా తమ బోట్లు, వలలను సిద్దం చేసుకున్న మత్స్యకారులు బుధవారం తెల్లవారుజాము నుంచి తమ ఇష్ట దైవాలకు పూజలు, ప్రార్థనలు చేసుకుని సముద్రంపై వేటకు బయలుదేరారు. ఇటు ఐస్ ఫ్యాక్టరీలు, ఆయిల్ అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు నిత్యం చేపల రవాణా చేసే వందలాది వాహనాలు సాగర తీరానికి ఇప్పటికే చేరుకున్నాయి. దీంతో, గత 55 రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న సాగరతీరం మళ్లీ పూర్వ కళను సంతరించుకుంది. -
సర్కారీ గదుల్లో పార్టీ పనులేంటి సర్?
సాక్షి, టాస్క్ఫోర్స్: తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కడియంలోని మహిళా శక్తి సమాఖ్య భవనం, రూరల్ మండలంలో కోలమూరులో సొసైటీ భవనాల్లో టీడీపీ నాయకుడు డాక్టర్ గోరంట్ల రవిరామ్కిరణ్ ముఖ్యఅతిథిగా ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఏ అభ్యంతరాలు ఉండవు. కానీ టీడీపీ తరఫున పార్టీ కండువాలు, ఐడీ కార్డులు ధరించి మరీ నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు దొంగ నిద్ర నటిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడియం మండల పరిషత్ కార్యాలయంల ఆవరణలో ఉన్న మహిళా శక్తి భవనానికి మరోవైపు సరిహద్దులో తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది. అక్కడే ఈ కార్యక్రమం నిర్వహించడం చర్చనీయాంశమైంది. -
పర్యాటక, జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాలు – 2027ను దృష్టిలో ఉంచుకుని జిల్లాను పర్యాటకంగా, విద్య, ఉపాధి, మౌలిక వసతుల రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్షించారు. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ కీర్తి పలు అభివృద్ధి ప్రతిపాదనలు వివరించారు. ఎంపీ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను జిల్లాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చే అవకాశంగా వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా నుంచి పంపే ప్రతి అభివృద్ధి ప్రతిపాదనకు సమగ్ర డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ పర్యాటక, విద్య, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు, సీఎస్ఆర్ ద్వారా ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతులకు కార్యాచరణ చేపట్టినట్టు వివరించారు. పాండవమెట్ట, పిచ్చుకలంక, హ్యావ్లాక్ వంతెన, గోదావరి తీర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్, పర్యావరణహిత మౌలిక వసతులు, సందర్శకుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ వై.మేఘ స్వరూప్, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ప్రాంతీయ పర్యాటక అధికారి ఎన్వీవీఎస్ మూర్తి, ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కె. తిలక్ కుమార్, జిల్లా అటవీ అధికారి బి.ప్రభాకరరావు వివిధ శాఖల జిల్లా అఽధికారులు పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
అనపర్తి: తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దుండగులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పి విద్య వివరాలు వెల్లడించారు. బిక్కవోలులోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు నగదు చోరీ అయ్యిందని వచ్చిన సమాచారంతో రెండు టీములు ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. కేసు విచారణలో ఉండగా బలబద్రపురంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా బిక్కవోలులో చోరీ చేసింది వారేనని గుర్తించారన్నారు. బిక్కవోలుతో పాటు మండపేట, జగ్గంపేట పిఠాపురం పరిసరాలలో ఏడు చోరీలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.27,13,620 విలువైన బంగారు ఆభరణాలు, రూ.2,59,720 విలువైన వెండి వస్తువులు, రూ.2.5 లక్షల నగదు మొత్తం రూ.32,23,360 విలువైన సొత్తు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులు కాకినాడకు చెందిన సుంకర తేజ, టేకుమూడి శ్రీకాంత్, పెద్దపురానికి చెందిన మర్రి స్వామికుమార్ అలియాస్ శ్యామ్గా గుర్తించామన్నారు. రూ.32,23,360 విలువైన సొత్తు, నగదు స్వాధీనం -
సేంద్రియ సాగుపై దృష్టి సారించాలి
పెరవలి(కొవ్వూరు): జిల్లాలో సేంద్రియ సాగుపై రైతులు దృష్టిపెట్టి సాగు విస్తీర్ణం పెంచి భూ పరిరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కొవ్వూరులో ఖేత్ బచావో అభియాన్లో బుధవారం ఆమె పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఎరువుల పంపిణీలో ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా యూరియా, డీఏపీ వంటి ఎరువులను విక్రయిస్తారని తెలిపారు. వ్యవసాయంలో యూరియా వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేసి వర్మీ కంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ విధానం వల్ల ఖర్చులు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 1,66,840 హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవుతాయని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ సీజన్ మొత్తం 33,289 మెట్రిక్ టన్నులు యూరియా, 6617 మెట్రిక్ టన్నులు డీఏపీ అవసరమవుతాయని తెలిపారు. జూన్ నెల వరకు 6,150 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ప్రస్తుతం 9,837 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, అదనంగా ఈ నెలలో 8,330 మెట్రిక్ టన్నులు యూరియా జిల్లాకు చేరనున్నదని తెలిపారు. ఆర్ఎస్కే పరిధిలోని డీలర్లు మ్యాపింగ్, రైతుల ధ్రువీకరణ తదితర ప్రక్రియల ద్వారా ఎరువుల పంపిణీ జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.ఆనందరావు, వ్యవసాయాధికారులు, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి -
ధాన్యం డబ్బులెప్పుడిస్తారు?
జగ్గంపేట: ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటూండగా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యాన్ని మిల్లులకు పంపించి 15 రోజులవుతున్నా ఇప్పటి వరకూ సంబంధిత సొమ్ము ఇవ్వలేదని ఆగ్రహిస్తూ కాట్రావులపల్లి వద్ద రైతులు బుధవారం రాస్తారోకో చేయడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. రైతుల కథనం ప్రకారం.. కాట్రావులపల్లి, రామవరం గ్రామాలకు చెందిన అన్నదాతలు గత నెల 19కి ముందు సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించారు. తామంతా వేరే పనుల్లో బిజీగా ఉన్నామని.. మిల్లులకు ధాన్యం తరలించాలని, మిగిలిన ప్రొక్యూర్మెంట్ పని తాము పూర్తి చేస్తామని రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ అధికారులు ఆ సమయంలో చెప్పారు. ఆ మేరకు తాము మిల్లులకు ధాన్యం తరలించామని, ఆ డబ్బుల కోసం అధికారులను అడిగితే, తమ ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరగలేదని, సివిల్ సప్లయిస్ టార్గెట్ అయిపోయిందని ఇప్పుడు చెబుతున్నారని రైతులు మండిపడ్డారు. మిల్లులకు పంపిన ధాన్యానికి ఎవరు డబ్బులిస్తారని ప్రశ్నించారు. రైతుల ఆందోళనతో కాట్రావులపల్లి – పెద్దాపురం రోడ్డులో ట్రాఫిక్ స్తంభించిపోయింది. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తహసీల్దార్ జేవీఆర్ రమేష్, మండల వ్యవసాయ అధికారి (ఎంఏఓ) ఎస్.నరసింహం తదితరులు రైతులతో చర్చించారు. -
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలోని పలు జ్యూస్, రోజ్మిల్క్, టీ దుకాణాల్లో బుధవారం ఫుడ్ సేప్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ కె.సుప్రియ, లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో ఆహార, పానీయాల నాణ్యత, తయారీ విధానాలు, నిల్వ పరిస్థితులు, పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ తనిఖీల్లో కొన్ని దుకాణాల్లో వినియోగిస్తున్న పదార్థాలు, మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యంగా ఫ్రూట్ జ్యూస్లు, రోజ్మిల్క్ తయారీలో ఉపయోగిస్తున్న కొన్ని పదార్థాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం కావడంతో నమూనాలను సేకరించి ప్రయోగశాల పరీక్షలకు పంపామన్నారు. ప్రయోగశాల నివేదికలు అందిన అనంతరం నిబంధనల ఉల్లంఘించినట్టు తేలితే సంబంధిత నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు, పానీయాలు విక్రయాలు గమనిస్తే తమ దృష్టికి తీసుకురావాలని, 08645 2410295 కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. -
మడ అడవుల విస్తరణకు ప్రాధాన్యం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): హరిత వాతావరణ నిధి (జీసీఎఫ్) లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో మడ అడవుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు, రెవెన్యూ, మత్స్య, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఏడాది కొత్తగా మరో 115 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపట్టాలని, దీంతో పాటు గతంలో 180.58 హెక్టార్లలో పునరుద్ధరించిన అడవుల సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. తీరప్రాంత పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారులు, వెనుకబడిన వర్గాలు, ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంయుక్త సహకారంతో జీసీఎఫ్ నిధులతో కోరింగ వన్యప్రాణి అభయారణ్యం, పరిసర తీర ప్రాంత గ్రామాల్లో చేపడుతున్న వివిధ వాతావరణ అనుకూల అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి సాధించిన ఫలితాలను అధికారులు వివరించారు. జిల్లాలో మడ అడవుల పునరుద్ధరణ, జీవనోపాధి రంగాల్లో గణనీయమైన ప్రగతి నమోదైందని రామచంద్రరావు తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ టి.తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాద ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి
కపిలేశ్వరపురం (మండపేట): విశాఖ స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాపులో మెటల్ లిక్విడ్ లాడిల్ పేలుడు ఘటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. ఘటన పట్ల మంగళవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది కార్మికులు సజీవ దహనం కావడం, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవడం తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనల కారణంగా ప్రమాదం జరిగిందన్నారు. కర్మాగారంలో సరిపడా కార్మికులు ఉండాలని, వారికి తగిన రక్షణ, ఆర్థిక, సామాజిక అవసరాలు తీర్చగలిగే సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి వాటిని ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. అమాయక కార్మికుల ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీతో వెంటనే విచారణ జరపాలని, చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాయపడినవారు పూర్తిగా కోలుకునేవరకూ మెరుగైన చికిత్స అందించాలన్నారు. అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అధ్యాపక నియామకాలకు ఆసక్తి, అర్హత ఉన్నవారు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చని రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి మంగళవారం తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం హార్డ్ కాపీలను కూడా ఈ నెల 22లోగా రిజిస్టార్ కార్యాలయానికి పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ని పరిశీలించాలని సూచించారు. వివాదాస్పద ‘దేవాన్ష్ ఘాట్’ బోర్డు తొలగింపు సీతానగరం: మండలంలోని మునికూడలి వద్ద గోదావరి తీరాన గల చారిత్రాత్మక శ్రీ అఖండ గౌతమి గోదావరి స్నాన ఘటం పేరును మార్చి ఏర్పాటు చేసిన దేవాన్ష్ ఘాట్ బోర్డును అధికారులు ఎట్టకేలకు తొలగించారు. 2015 పుష్కరాల సమయంలో సీఎం మనవడు దేవాన్ష్ పేరును ఈ ఘాట్కు పెడుతూ బోర్డు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధి అత్యుత్సాహంతో దేవాన్ష్ ఘాట్ సోషల్ మీడియాలో వైరల్ అయి వివాదాస్పదం కావడంతో అధికారులు మునికూడలి ఘాట్లో దేవాన్ష్ ఘాట్ బోర్డును తొలగించారు. -
రేషన్ డిపోల్లో అవకతవకలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల్లో తీవ్ర అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని రాష్ట్ర సబ్ ఆర్డినేట్ కమిటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ మండపేట కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. ప్రధానంగా డీలర్ల వద్దకు వెళ్లకుండానే రేషన్ బియాన్ని పక్కా దారి పట్టిస్తున్నారన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల అధికారి సమన్వయకర్తగా వి.పార్వతి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ తొలి సమావేశానికి జేసీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ పౌర సరఫరా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో నిద్రపోతున్నారని ఆరోపించారు. ఎంఎస్ఓల కనుసన్నల్లో ఈ కోటా బియ్యం వ్యాపారం సాగుతోందని దుయ్యబట్టారు. అంగన్వాడీ సెంటర్లలో గర్భిణులకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహార వివరాలను ప్రదర్శించాలన్నారు. కొత్తగా తీసుకొచ్చిన రేషన్ పాలసీలో హైదరాబాద్, విజయవాడ, విశాఖ వంటి సుదూర ప్రాంతాలకు వృత్తిరీత్యా వెళ్లిన లబ్ధిదారుల రేషన్ సరకులను కూటమి నేతల సహకారంతో పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చిందో పూర్తి వివరాలు తెలపాలని కోరారు. జేసీ వై.మేఘాస్వరూప్ మాట్లాడుతూ నిబంధనల ఉల్లంఘనలు, అవకతవకలు గమనిస్తే జిల్లా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 1952 ద్వారా,1100 టోల్ ఫ్రీ నంబర్కు లేదా లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఆహార భద్రతకు సంబంధించి 2025లో 445 అర్జీలు రాగా వాటిని పరిష్కరించామని, 2026లో ఇప్పటి వరకు 80 అర్జీలు స్వీకరించగా 75 పరిష్కరించినట్టు తెలిపారు. ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీఎస్వో వి.పార్వతీ పేర్కొన్నారు. జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు సలాది ఉదయ భాస్కరరావు, గొట్టిముక్కల అనంతరావు మాట్లాడారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్డీవోలు ఆర్.శివరాముడు, కె.ఆనందరావు పాల్గొన్నారు.విజిలెన్స్ సమావేశంలో రాష్ట్ర సబ్ ఆర్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు


