breaking news
East Godavari
-
శాంతించిన గోదావరి
కాటన్ బ్యారేజీ నుంచి 3.58 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదలకాటన్ బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్న మిగులు జలాలుదవళేశ్వరం: గోదావరి క్రమంగా శాంతించింది. ధవళేశ్వరం వద్ద వరద నీటి ఉధృతి తగ్గింది. దీంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. ధవళేశ్వరం వద్ద సోమవారం సాయంత్రం 10.50 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి డెల్టా కాలువలకు సంబంధించి 14,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 5,000, మధ్య డెల్టాకు 2,600, పశ్చిమ డెల్టాకు 6,800 క్యూసెక్కుల నీటిని వదిలారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీలోని మొత్తం 175గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 6.34 మీటర్లు, పేరూరులో 9.61 మీటర్లు, దుమ్ముగూడెంలో 6.96 మీటర్లు, భద్రాచలంలో 23.30 అడుగులు, కూనవరంలో 11.34 మీటర్లు, కుంటలో 4.24 మీటర్లు, పోలవరంలో 8.68 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 14.33 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. మంగళవారం ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. -
ప్రతి సోమవారం కలెక్టరేట్లో చేనేత ప్రదర్శన
● పీజీఆర్ఎస్లో 238 అర్జీల స్వీకరణ ● కలెక్టర్ ప్రశాంతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ రంగ హస్తకళల అభివృద్ధి సంస్థ ‘‘ఆప్కో’’ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక వస్త్రాల స్టాల్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆప్కో స్టాల్ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రజలకు 30 శాతం రిబేట్పై ఆప్కో చేనేత వస్త్రాలు అందుబాటులో ఉంచామన్నారు. చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను వినియోగించటం ద్వారా వారికి మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చని, ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. ప్రతి శనివారం ప్రభుత్వ ఉద్యోగులు ఆప్కో చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకోవాలని, జిల్లా ప్రజలు చేనేతను ప్రోత్సహిస్తూ ఆప్కో వస్త్రాల కొనుగోలును ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కాగా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 238 అర్జీలను స్వీకరించామన్నారు. అర్జీదారునికి నాణ్యతతో కూడిన పరిష్కారం చూపించాలన్నారు. ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రాజమహేంద్రవరం రూరల్: పదవ తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఐటీఐలలో ప్రవేశం కోసం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025– 26 సంవత్సరానికి రెండవ విడత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సీహెచ్ సునీల్కుమార్ తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో ‘ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా 20వ తేదీ రాత్రి 11.55 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 22వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్లతో హాజరై వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వివరాలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. క్వాంటం టెక్నాలజీ ఎఫ్డీపీ ప్రారంభం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్యాంపస్లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో క్వాంటం టెక్నాలజీపై ఏఐసీటీఈ – ఏటీఏఎల్ స్పాన్సర్డ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) సోమవారం ప్రారంభమైంది. క్వాంటం టెక్నాలజీల రంగాన్ని అన్వేషించడమే లక్ష్యంగా ఇండియన్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) ల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అన్నారు. సమకాలీన విద్య, పారిశ్రామిక దృశ్యంలో క్వాంటం టెక్నాలజీల ఔచిత్యాన్ని వివరించారు. ఎఫ్డీపీ కన్వీనర్ డాక్టర్ వి. పెర్సిస్ మాట్లాడుతూ 50 మంది వరకు ఫ్యాకల్డీ సభ్యులు హాజరైన ఈ కార్యక్రమం ఈ నెల 19 వరకు జరుగుతుందన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వర్రావు, కో కన్వీనర్ డాక్టర్ జి. కీర్తి మరిట, సీఎస్ఈ హెచ్ఓడి డాక్టర్ బి.కెజియయారాణి పాల్గొన్నారు. పోలీసు పీజీఆర్ఎస్కు 36 ఫిర్యాదులు రాజమహేంద్రవరం రూరల్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘‘పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం’’(పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమానికి 36 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) ఎన్. బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీ (లా అండ్ ఆర్డర్) ఏ.వీ సుబ్బరాజు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. -
పప్పుతిప్పలు
గిట్టుబాటు కావడంలేదు రెండు నెలలుగా మార్కెట్లో పప్పునకు డిమాండ్ తగ్గింది. ఎగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుత ధర గిట్టుబాటుగా లేదు. మూఢానికి ముందు కిలో పప్పు రూ.800 పలకడంతో వ్యాపారం బాగుంది. – సుతాపల్లి వెంకన్నబాబు, అధ్యక్షుడు, శ్రీవేంకటేశ్వర, క్యాజూ మర్చంట్స్ అసోసియేషన్, దేవరపల్లి నాణ్యత తగ్గింది వర్షాలకు తడవడంతో జీడిగింజలు నల్లబడి పప్పు నాణ్యత తగ్గింది. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న గింజల పప్పు నాణ్యత బాగుంది. విదేశీ గింజలు బస్తాకు 21 కిలోలు పప్పు దిగుబడి వస్తుండగా, స్వదేశీ గింజలు దిగుబడి 24 నుంచి 25 కిలోలు వస్తోంది. గింజల ధర ఒకే విధంగా ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో సుమారు 90 పరిశ్రమలు ఉండగా, దాదాపు 500 మంది వ్యాపారులు ఉన్నారు. మూతబడిన పరిశ్రమలను తెరచి కార్మికులకు ఉపాధి కల్పించాలనే ఆలోచన చేస్తున్నాం. – పెంజర్ల గణేష్కుమార్, జీడిపప్పు వ్యాపారి, దేవరపల్లిజీడిపప్పును ప్యాకింగ్ చేస్తున్న మహిళలు● జీడిపప్పు పరిశ్రమకు ఆషాఢం ఎఫెక్ట్ ● రెండు వారాలుగా మూతబడిన వైనం ● మార్కెట్లో తగ్గిన డిమాండ్ ● గింజల బస్తా ధర రూ.12,500 ● పప్పు ధర కిలో రూ.700 ● గిట్టుబాటు కాదంటున్న రైతులు ● మెట్ట ప్రాంతంలో 90 పరిశ్రమలు దేవరపల్లి: జీడిపప్పు పరిశ్రమపై మూఢం, ఆషాఢం ఎఫెక్ట్ పడింది. ఆషాఢ మాసానికి ముందు నెల రోజులు మూఢం రావడంతో ముహూర్తాలు లేక జీడిపప్పునకు మార్కెట్లో డిమాండ్ తగ్గిందని వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో వినియోగం తగ్గడంతో పప్పు ధర తగ్గింది. మూఢానికి ముందు కిలో పప్పు ధర రూ.800 ఉండగా, ఆషాఢం ప్రారంభం నుంచి తగ్గుముఖం పట్టి ప్రస్తుతం రూ.700 నుంచి రూ.720 పలుకుతోంది. గింజల ధర బస్తా(80 కిలోలు) రూ.12,000 నుంచి 12,500 ఉండడంతో వ్యాపారులకు నష్టం వస్తోంది. బస్తా గింజలకు 24 నుంచి 25 కిలోల పప్పు తయారవుతుంది. కిలో పప్పు తయారు కావడానికి గింజల ధర రూ.690, ఖర్చులు రూ.20 అవుతాయి. అంటే కిలో పప్పు తయారు కావడానికి రూ.710 ఖర్చు అవుతుండగా, ఆదాయం రూ.700 వస్తోంది. దీనిని బట్టి కిలోకు రూ.10 నుంచి రూ.20 నష్టం వస్తోంది. మెట్ట ప్రాంతంలో విస్తరణ తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు డివిజన్ పరిధిలోని నిడదవోలు మండలం తాడిమళ్ల, చాగల్లు మండలం చిక్కాల, దేవరపల్లి మండలం దేవరపల్లి, నల్లజర్ల మండలం దూబచర్ల, గోపాలపురం మండలం గోపాలపురంలో జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. తాడిమళ్ల, దేవరపల్లి కేంద్రంగా జీడిపప్పు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి జరుగుతుంది. తాడిమళ్లలో సుమారు 45 పరిశ్రమలు, దేవరపల్లిలో 15 పరిశ్రమలు, చిక్కాలలో 5 పరిశ్రమలు, దూబచర్లలో 15 పరిశ్రమలు , గోపాలపురంలో 10 పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కువ ఉత్పత్తి తాడిమళ్ల, దేవరపలి, దూబచర్ల నుంచి జరుగుతుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన అధునాతన యంత్రాలను తీసుకు వచ్చి వ్యాపారులు జీడిపప్పు తయారీ పరిశ్రమలను నెలకొల్పారు. కార్మికుల ఉపాధికి గండి మార్కెట్లో జీడిపప్పునకు డిమాండ్ లేకపోవడం, గింజల ధర పెరగడంతో జీడిపప్పు కొనేనాథుడు కరువయ్యాడని వ్యాపారులు వాపోతున్నారు. తయారు చేసిన పప్పు నిల్వలు మిల్లుల వద్ద పేరుకుపోవడంతో అమ్మకాలు లేక రెండు వారాల నుంచి దేవరపల్లిలోని పరిశ్రమలకు యజమానులు సెలవు ప్రకటించి మూసి వేశారు. మండలంలోని 15 పరిశ్రమలు మూతబడడంతో పప్పు తయారీ నిలిచిపోయింది. శ్రావణమాసంపైనే ఆశలు ఆషాఢం అనంతరం ఈ నెల 27 నుంచి వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభముహూర్తాలు ఉండడంతో పప్పునకు డిమాండ్ పెరగవచ్చునని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఏటా ఆషాఢంలో పప్పు ధర తగ్గగా, శ్రావణంలో ధర పెరుగుతుంది. -
ఖరీఫ్కు నీటి కష్టం
జిల్లాలో నాట్లు పరిశీలిస్తే... వరి సాధారణ నాట్లు మండలం సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) (హెక్టార్లలో) రాజమహేంద్రవరం 1,460 716కడియం 2,137 1,875రాజానగరం 4,687 1,286అనపర్తి 3,739 2,874బిక్కవోలు 6,113 2,430కోరుకొండ 5,755 230సీతానగరం 5,710 1,530రంగంపేట 2,815 240చాగల్లు 3,421 2,712దేవరపల్లి 3,657 2,310గోపాలపురం 4,216 595కొవ్వూరు 4,507 4,210నిడదవోలు 7,253 4,830తాళ్లపూడి 3,787 1,214ఉండ్రాజవరం 4,923 1,892నల్లజర్ల 4,247 2,180● రుతు పవనాల దాగుడుమూతలు ● కరుణించని వరుణుడు ● వర్షాభావ పరిస్థితులతో మెట్ట రైతులకు ఇబ్బందులు ● జిల్లాలో వరి నాట్లకు శ్రీకారం చుట్టిన రైతులు ● సకాలంలో వర్షం కురవకపోవడంతో ఆలస్యంగా సాగుతున్న ప్రక్రియ ● గతేడాది ఈ సమయానికి విస్తారంగా వర్షాలు, గోదావరికి వరదలు సాక్షి, రాజమహేంద్రవరం: రుతుపవనాలు దాగుడుమూతలు ఆడుతున్నాయి. వరుణుడు కరుణించడం లేదు. వెరసి ఖరీఫ్ రైతుకు కన్నీటి కష్టం తప్పడం లేదు. గోదావరి చెంతనే ఉన్నా.. మెట్ట గ్రామాల్లో మాత్రం సాగునీటి కొరత వేధిస్తోంది. ఫలితంగా నాట్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. నైరుతి రుతుపవనాలు జూన్ నెల మొదటి వారంలో పలకరించనున్నట్లు వాతావరణ శాఖ అప్పట్లో సంకేతాలు వెలువరించింది. జూలై 10వ తేదీ నాటికి రాష్ట్రమంతా విస్తరించనున్నట్లు ఆ శాఖ అంచనా వేసింది. కానీ పరిస్థితి అందుకు విరుద్ధంగా సాగింది. ఎండలు ఉండాల్సిన సమయంలో అకాల వర్షాలు కురవగా తొలకరి సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. వెరసి నాట్లు వేసిన రైతులకు నీటిపాట్లు తప్పడం లేదు. ఈ సమయానికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా.. 50 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఆగిన రుతుపవనాల కదలిక ఖరీఫ్ సాగుకు రుతుపవనాలు సకాలంలో రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. అవసరమైన సామగ్రిని సిద్ధం చేసుకున్నారు. ఒక్కసారిగా రుతుపవనాల కదలిక ఆగిపోయింది. ఫలితంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. జూన్ నెల 19వ తేదీ వరకు తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచాయి. ఉక్కపోతతో ప్రజల అల్లాడిపోయారు. దీంతో సాగుకు కర్షకులు వెనకడుగు వేశారు. ప్రస్తుతం సాగుకు వర్షాల అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా నాట్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇప్పటికే పూర్తవ్వాల్సి ఉండగా.. ఇంకా సాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3,848 హెక్టార్లలో నారుమళ్లకు అవకాశముండగా.. సోమవారం నాటికి వంద శాతం పూర్తయినట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. కానీ నాట్ల ప్రక్రియ ఇంకా నడుస్తూనే ఉంది. వెదజల్లే పద్ధతి, యంత్రాలతో నాట్లు వేసే పద్ధతిలో ఇప్పటి వరకు 31,289 హెక్టార్లలో మాత్రమే పూర్తయింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల నీరు లేక నారుమళ్లు ఎండిపోయే పరిస్థితి తలెత్తిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తడారుతున్న నారుమళ్లు ● నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. వర్షం కురవకపోవడంతో నారుమళ్లు సైతం ఎండిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు కాలువల్లోని నీటిని ఇంజిన్ల సాయంతో తోడి నారుమళ్లు తడిపే పరిస్థితి తలెత్తింది. గతేడాది ఇదే సమయానికి వర్షాలు పుష్కలంగా కురిశాయి. నాట్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఈ ఏడాది మాత్రం నెల రోజులు ఆలస్యంగా సాగుతోంది. ● రాజానగరం నియోజకవర్గం దోసకాయలపల్లి, నందరాడ, నరేంద్రపురం, గాదరాడ, కోటి, శ్రీరంగపట్నం, బొమ్మిల్లంక, మునగాల గ్రామాల్లో మినహా మిగిలిన గ్రామాల్లో నారుమడి దశలోనే ఉన్నాయి. ఆకు మడులు ఎండుతున్న నేపథ్యంలో ఇంజిన్ల ద్వారా తడి ఇస్తున్నారు. బోర్ల నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో తప్ప .. మిగిలిన ప్రాంతాల్లో నారుమళ్లు ఎండిపోతున్నాయి. కోరుకొండ మండలంలో సుమారు 5,000 హెక్టార్లలో ఈ పరిస్థితి తలెత్తింది. ● గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం, దేవరపల్లి, తాళ్లపూడి మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటికోసం నిరీక్షణ తప్పడం లేదు. నీటి కోసం బోరుబావులపై ఆధారపడుతుండటం, అవి సక్రమంగా పనిచేయపోవడంతో నారుమళ్లు తడారుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 35 వేల హెక్టార్లలో నాట్లకు ఆటంకం ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. నాట్లు వేసిన అనంతరం నీరు పుష్కలంగా ఉండాలి. అప్పుడే పంట దిగుబడి ఆశించిన మేర అందుతుంది. ‘తూర్పు’లో 83,918 హెక్టార్లలో సాగు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 2025–ఖరీఫ్ సీజన్లో 83,918 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. అత్యధికంగా వరి 76,941 హెక్టార్లు, మినుములు 2,595 హెక్టార్లు, మొక్కజొన్న 181, చెరకు 1,480, వేరుశనగ 258, పత్తి 502, కందులు, పెసలు, పసుపు 416 హెక్టార్లలో సాగు చేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. సన్నరకాలైన ఎంటీయూ–1224, బీపీటీ–2841, 2270, 2846, ఎన్ఎల్ఆర్–3238 వంటి రకాలతో పాటు ఎంటీయూ–1318 వంటి నూతన రకాలను సాగు అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కరుణించని వరుణుడు జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభమైనప్పటి నుంచి వరుణడు కరుణించడం లేదు. ఈ నెల 8వ తేదీన చిరుజల్లులు కురిశాయి. నల్లజర్లలో 3.4 మిల్లీ మీటర్లు, గోకవరంలో 1.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో చినుకు జాడ లేదు. పంటసాగుకు అనువైన సమయంలో వర్షం కురవకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నాట్లు ఇలా.. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 76,941 హెక్టార్లలో వరి సాగు అవుతుంది. జిల్లావ్యాప్తంగా నాట్ల ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. గోకవరంలో 5,195 హెక్టార్లలో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 117 హెక్టార్లలో మాత్రమే నాట్ల ప్రక్రియ పూర్తయింది. పెరవలిలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 3,319 హెక్టార్లు కాగా.. నాట్లు కేవలం 48 హెక్టార్లలో మాత్రమే పడ్డాయి. కేవలం రెండు మండలాల్లోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తోంది. -
ప్రజల్లోకి కూటమి మోసాలు
క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ‘రీకాలింగ్ మేనిఫెస్టో’ రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవ.విజయ సారథి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని ఓ ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ‘రీకాలింగ్ మేనిఫెస్టో’ సమావేశం నిర్వహించారు. ఏడు నియోజకవర్గాల క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాబు మోసాలను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వంపై క్రైస్తవులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు చంద్రశేఖర్, రాజనగరం అధ్యక్షులు రెవ జొనాతన్, అనపర్తి అధ్యక్షులు రెవ దావీదు, నాయకులు రెవ.సుధాకర్, రెవ. చిట్టి బాబు, బ్రదర్ శామ్యూల్, బ్రదర్ ఐజియా, పాస్టర్ జాన్ బాబు పాల్గొన్నారు. కొబ్బరిచెట్లను మింగేస్తున్న గోదావరి మామిడికుదురు: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంతో వైనతేయ తీరంలో కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. రెండు రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. సుడులు తిరుగుతున్న నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు అమాంతంగా నదిలో కూలిపోతున్నాయి. అప్పనపల్లి పాటు రేవు సమీపంలో కొబ్బరి చెట్లతో పాటు సారవంతమైన భూమి నదిలో కలిసిపోయింది. పెదపట్నం, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పాశర్లపూడి గ్రామాల్లో సైతం పరిస్థితి నెలకొంది. -
లైంగిక వేధింపులపై మహిళా కమిషన్ విచారణ
ఆ నలుగురిని వదలం : చైర్పర్సన్ రాయపాటి శైలజకాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ సోమవారం విచారించారు. ఆమె కాకినాడ రంగరాయ వైద్య కళాశాల, జీజీహెచ్లను సందర్శించి విద్యార్థులు, బోధకులతో సమావేశమయ్యారు. తొలుత రంగరాయ వైద్య కళాశాలకు వెళ్లి, నేరుగా బాధిత విద్యార్థినులతో సమావేశమయ్యారు. సమావేశం నిర్వహించిన ఆర్ఎంసీ డైనింగ్ హాల్లోకి ఎవరినీ అనుమతించకుండా తాను మాత్రమే విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జరిగిన అకృత్యాలను తెలియజేయడానికి విద్యార్థినులు తొలుత భయపడ్డా, తానిచ్చిన భరోసాతో ఒకొక్కరుగా నోరు విప్పారన్నారు. ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీ రాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్ల వైఖరి తమను ఆవేదనతో పాటు భయానికి గురిచేసిందన్నారు. వారి దాష్టికాలు విద్యార్దులను మనో వేదనకు గురి చేశాయని వెల్లడించారు. ఏదో వంకతో తాకే ప్రయత్నం చేసేవారని, అసభ్య భంగిమల్లో ఫొటోలు తీసి వన్ టైం వ్యూ ద్వారా వాట్సాప్లో పంపేవారని బాధితులు వెల్లడించారన్నారు. వెకిలి చూపులు వెర్రి చేష్టలతో నరకాన్ని చూపారని, సింగిల్గా రూంకి రావాలంటూ ఒత్తిడి చేసేవారని చెబుతూ విద్యార్దులు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. సహ ఎల్టీలు, నిందితుల అనుయాయుల వల్ల తమకు హాని జరిగే అవకాశం ఉందని విద్యార్దినులు తమ భయాన్ని వెల్లడించారన్నారు. వారికి కమిషన్ తరఫున, పోలీస్ శాఖ తరఫున భరోసా ఇచ్చామన్నారు. లైంగిక వేధింపుల నిందితులు ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీ రాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్లను చట్ట ప్రకారం శిక్షిస్తామని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వీరు విద్యార్థినులతోపాటు జీజీహెచ్కు వచ్చే పలువురు మహిళా రోగులపైనా ఈ తరహా అకృత్యాలకే పాల్పడ్డారని తమ విచారణలో వెలుగు చూసిందని అన్నారు. ఈ కీచకులపై చట్ట ప్రకారం తీసుకోవలసిన అన్ని చర్యలపై ఇప్పటికే రాష్ట్ర డీజీపీతో చర్చించామన్నారు. భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి దాష్టీకాలకు పూనుకోకుండా గుణపాఠం నేర్చేలా చర్యలుంటాయని తెలిపారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, అదనపు ఎస్పీ దేవరాజ్ పాటిల్, ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పాల్గొన్నారు. -
వైవిధ్య వరితం!
ప్రయోగాత్మకంగా చేపట్టాను నేను 11 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటి వరకూ అన్ని రకాల పంటలు వేసి మంచి దిగుబడులు సాధిస్తున్నాను. ఇటీవల నీటి ఎద్దడిని అధిగమించేలా ఆరుతడి పద్ధతిలో వరి సాగు చేసే విధానాన్ని నా వ్యవసాయ క్షేత్రంలో చేపట్టాను. దీంతో మా పొలంలో ఒక ఎకరంలో ఈ పద్ధతిలో వరి సాగు చేశాం. దుక్కి దున్నిన పొలంలో ఎటువంటి తడి లేకుండా పొడి విత్తనాలను సాగు చేశాం. – పాటి శ్రీనివాసు, ప్రకృతి వ్యవసాయ రైతు, వెల్దుర్తి, పిఠాపురం మండలం పిఠాపురం: నీటి వినియోగంతో సాగయ్యే పంట కావడంతో వరికి వాతావరణ పరిస్థితులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారు పోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారులు అంటున్నారు. దీంతో ఆరుతడి పంటగా వరిని సాగు చేసే పద్ధతికి ప్రకృతి వ్యవసాయ శాఖాధికారులు శ్రీకారం చుట్టారు. తక్కువ పెట్టుబడితో నారు నీరు లేకుండా, కూలీలతో పని లేకుండా రైతులు నేరుగా వరి సాగు చేస్తున్నారు. ఆరుతడి పంటలు అంటే కేవలం వాణిజ్య పంటలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కాని మెట్ట ప్రాంతంలో నీరు అంతగా అందని పొలాల్లో వాణిజ్య పంటలకు బదులుగా వరి సాగు చేసే విధానాన్ని అధికారులు ప్రారంభించారు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తూ ఆరుతడి పద్ధతిలో వరి సాగును ప్రారంభించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తిలో ప్రకృతి వ్యవసాయ శాఖ డీపీఎం ఎలియాజరు నేతృత్వంలో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రారంభించారు. నష్టాల సాగుకు చెక్ పెట్టాలని.. వర్షాలు సరైన సమయంలో కురవక పోవడం తద్వారా కాలువల్లో సాగు నీరు ఆలస్యంగా విడుదల అవ్వడం వల్ల వరి సాగు కత్తిమీద సాముగా మారింది. దీంతో నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం నిర్ణీత సమయానికి వీలు పడడం లేదు. దీనివల్ల పంటలు ఆలస్యం అవ్వడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలకు బలవుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించినా రైతులు నష్టాల పాలవుతున్నారు. వ్యవసాయం చేయడం దండగ అనే నిరాశ రైతులను ఆవహిస్తోంది. చెరువులు, కాలువలు, నీటి వనరులపై ఆధారపడి పండించే పంటలు ఇప్పుడు భూగర్భ జలాల మీద ఆధార పడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. అయితే కొన్నిచోట్ల భూగర్భ జలాలు అందుబాటులో ఉండడం లేదు. దీనికి తోడు కూలీల కొరత, అధిక కూలీ రేట్లు వంటి సమస్యలకు చెక్ పెడుతూ తక్కువ పెట్టుబడితో తక్కువ నీటి వసతితో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి వరి సాగుకు రైతులను అధికారులు సంసిద్ధం చేశారు. ఆరుతడితో అన్నీ లాభాలే ఆరుతడి పద్ధతిలో సాగు చేసిన వరి.. మామూలు పంట కంటే 15 రోజుల ముందుగానే కోతకు వస్తుంది. పంట దిగుబడి 15 శాతం పెరుగుతుంది. కూలీల ఖర్చులు అవసరం లేదు. సాగు నీటి వసతి అంతంత మాత్రమే సరిపోతుంది. దీంతోపాటు నారుమడి తయారు చేయాల్సిన అవసరం, నారు వేసే ఖర్చు లేదు. నారు తీసే ఖర్చు ఉండదు. దీనివల్ల ఎకరానికి సుమారు రూ.10 వేలు మిగులుతాయి. ఈ పంట సాగుకు ఎక్కువ నీరు అవసరం ఉండదు. కేవలం వర్షం నీరు సరిపోతుంది. వేసవిలో దుక్కి అయిన తరువాత వర్షం పడినప్పుడు నేరుగా యంత్రాలతో ఎరువులు, విత్తనాలు పొడిగా ఉన్నప్పుడే చల్లుకోవచ్చు. అదే నారుమడి తయారీకి అయితే ఎకరానికి సుమారు 30 కేజీల విత్తనం అవసరం అవుతుంది. ఆరుతడి పంటకు అయితే కేవలం 15 కేజీల విత్తనంతో ఒక ఎకరం సాగు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 15 కేజీల విత్తనాలకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఆరుతడిలో వరుసల క్రమంలో దుబ్బుకు దుబ్బుకు మధ్య దూరం సమంగా ఉండడం వల్ల గాలి,వెలుతురు బాగా తగిలి పంట దిగుబడి మామూలు దాని కంటే ఎక్కువ వస్తుంది. తెగుళ్లు అంతగా సోకే ప్రమాదం కూడా ఉండదు. నారు, తడి లేని పంట! ఆరుతడి పంటగా వరి సాగు ప్రకృతి వ్యవసాయంలో ప్రయోగాత్మకంగా.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ వచ్చేలా కృషి కాకినాడ జిల్లా వెల్దుర్తిలో సాగు ప్రారంభంప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఆరుతడి వరి సాగు ప్రారంభించాం. వీటికి దేశీయ వరి రకాలైన నవారా, మైసూర్ మల్లిక, నారాయణ కామిణి, చిట్టి ముత్యాలు మోడల్ వేయించాం. ప్రస్తుతం నీటి ఎద్దడి అధికంగా ఉండడంతో ఈ పద్ధతిని అమలులోకి తీసుకువచ్చాం. ముందుగా ప్రధాన పొలంలో 400 కేజీల బయోచారు కలిపిన ఘనజీవామృతం వేయించాం. విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, విత్తనానికి విత్తనానికి మధ్య దూరం 25 సెంటీమీటర్లు ఉండేలా నాటించాం. నాలుగు వరుసలు వరి విత్తనాలు నాటిన తర్వాత ఒక వరుస ఆకుకూరలు, మళ్లీ నాలుగు వరుసలు వరి విత్తనాలు మళ్లీ కాయగూరలు 4:1 నిష్పత్తిలో నాట్లు వేయించాము. ఈ సాగు పద్ధతుల్లో ప్రధానంగా నీటిని ఆదా చేయవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పద్ధతిలో సాగు చేయవచ్చు. విభిన్న రకాల పంటలు వేయడం వలన పురుగులు, తెగుళ్ల ఉధృతిని అరికట్టవచ్చు. ప్రధాన పంట ఆదాయంతో పాటుగా అంతర పంటల వల్ల ఆదాయం పొందవచ్చు. రైతుకి పెట్టుబడి తగ్గడంతో పాటుగా ఆదాయం పెరుగుతుంది. ఈ పద్ధతిలో రసాయనిక ఎరువులు, పురుగుమందులకు బదులుగా, గో ఆధారతమైన బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, వృక్ష సంబంధమైన కషాయాలు ఉపయోగించి పంటలు పండించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు అందుబాటులోకి తీసుకురావచ్చు. వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో రైతుకు మంచి ఆదాయం కూడా సమకూరుతుంది. జిల్లాలో పిఠాపురం మండలం వెల్దుర్తిలో ప్రయోగాత్మకంగా సాగు చేపట్టాం. త్వరలో జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ దీనిని అమలు చేసే విధంగా రైతులను సంసిద్ధం చేస్తున్నాం. – ఎలియాజరు, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా మేనేజర్, కాకినాడ -
కోట శ్రీనివాసరావుతో ఏరా ఏరా అనుకునే స్నేహం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కోట శ్రీనివాసరావు మరణం పట్ల నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్మిత్రా తీవ్ర సంతాపం తెలిపారు. ‘కోట, నేను కలిసి దగ్గరగా 50 సినిమాలు చేశాం. ప్రాణం ఖరీదు, బాబాయి అబ్బాయి, అలీబాబా అరడజను దొంగలు, ఏవండీ ఆవిడ వచ్చింది, హై హై నాయక, చిన్నబ్బాయి, 420, కత్తి కాంతారావు తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఏరా ఏరా అనుకునేంత స్నేహం ఉంది. రాజమండ్రిలో నా ఆర్కెస్ట్రా 25వ వార్షికోత్సవానికి కోటశ్రీనివాసరావు హాజరై స్టేజ్పై మిమిక్రీ చేశాడు. చాలా గొప్ప కళాకారుడు, విలక్షణ నటుడు, మంచి వ్యక్తి. ఆయన చనిపోవటం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయనకు సద్గతులు కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ఆయన పేర్కొన్నారు. అన్నపూర్ణ టాకీస్ను సందర్శించిన ‘కోట’ అమలాపురం రూరల్: అప్పట్లో కోట శ్రీనివాసరావు అమలాపురం మండలం సమనసలోని స్టేట్బ్యాంకుకు విచ్చేశారు. ఆయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో అమలాపురం మండలం సమనసలోని స్టేట్ బ్యాంకుకు విచ్చేశారు. అక్కడ బ్యాంకు మేనేజర్ను కలిసిన సందర్భంగా అప్పటి సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావును కలుసుకుని ఆయన నడుపుతున్న అన్నపూర్ణ టాకీస్ను సందర్శించారు. అన్నపూర్ణ టాకీస్ వద్ద కోటను సర్పంచ్ రాజారావు ఆధ్వర్యంలో సత్కరించారు. అప్పట్లో కోట శ్రీనివాసరావు ను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. 1987 లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో అన్నపూర్ణ టాకీస్లో ప్రతిఘటన సినిమా ఆడుతోంది. కోట శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందడంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాజీ సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావు గుర్తు చేసుకుని ఆయన మృతికి సంతాపం తెలిపారు. భలే ఖైదీలు షూటింగ్లో కోటతో శ్రీరామ వరప్రసాద్ రాంకీ నిరోషా హీరో హీరోయిన్లుగా బీవీఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన భలే ఖైదీలు సినిమా షూటింగ్ 1992లో కాకినాడలో జరిగింది. ఈ సినిమాలో కై కాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను కాకినాడలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రైవేట్ బస్సు కండక్టర్గా అమలాపురం మండలం సవరప్పాలెం గ్రామానికి చెందిన సత్తి శ్రీరామవరప్రసాద్ నటించారు. కోట శ్రీనివాసరావు, సత్యనారాయణతో కలిసి నటించిన సన్నివేశాలు ఇప్పటికీ మర్చిపోలేనని శ్రీరామ వర ప్రసాద్ తెలిపారు.నటుడు, గాయకుడు జిత్మోహన్మిత్రా -
మాణిక్యాంబా అమ్మవారికి ఆషాఢం సారె
రామచంద్రపురం రూరల్: పంచారామాల్లో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12 వ శక్తి పీఠంగా అలరారుతున్న ద్రాక్షారామలో మాణిక్యాంబా అమ్మవారికి భీమేశ్వరస్వామి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢం సారెను అందజేశారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలతో శాకంబరిగా అలంకరించారు. ద్రాక్షారామకు చెందిన స్వీట్ స్టాల్ అధినేత కంచెర్ల చక్రధరరావు(చక్రి) సుమారు 150 కేజీల వివిధ రకాల స్వీట్లు అమ్మవారికి సారెగా సమర్పించారు. పలువురు మహిళా భక్తులు స్వీట్లు, పండ్లు అమ్మవారికి సారె తీసుకువచ్చారు. అమ్మవారి పుట్టిల్లు అయిన వేగాయమ్మపేట నుంచి శోభాయాత్రగా మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో సారెను తోడ్కొని వచ్చారు. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్, వేగాయమ్మపేట జమీందార్ వాడ్రేవు సుందర రత్నాకరరావు, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ పాల్గొన్నారు. -
జైలుకు లైంగిక వేధింపుల నిందితులు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ల్యాబ్ అటెండెంట్ వాడ్రేవు కళ్యాణ్ చక్రవర్తి, ల్యాబ్ టెక్నీషియన్లు బోడే జిమ్మీరాజు, సరిపల్లి గోపాలకృష్ణ, కొప్పిశెట్టి వీరవెంకటసత్యనారాయణ ప్రసాద్లకు ఆదివారం కాకినాడ సెకండ్ ఏజేఎఫ్సీఎం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం కాకినాడ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి థర్డ్ ఏజేఎఫ్సీఎం కోర్టు ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.20 వేలు వ్యక్తిగత పూచీకత్తుతో 41ఏ నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. రామకృష్ణారావుపేటకు చెందిన ఓ బాలిక ఫిర్యాదుతో కాకినాడ టూ టౌన్ పీఎస్లో కేసు నమోదు కాగా, ఈ కేసులో ఆదివారం మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులు కళ్యాణ్ చక్రవర్తి, జిమ్మీరాజు, గోపాలకృష్ణ, ప్రసాద్లను పోలీసులు కాకినాడ సబ్ జైలుకు తరలించారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి మృతిరాజమహేంద్రవరం సిటీ: గోదావరి రైల్వే స్టేషన్ – రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ల మధ్య సుమారు 55 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి ట్రాక్పై మృతి చెంది ఉన్నాడని రాజమహేంద్రవరం జీఆర్పీ ఎస్ఐ లోవరాజు ఆదివారం తెలిపారు. కేసు నమోదు చేసి మృత దేహాన్ని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించామన్నారు. మృతుడి ఒంటిపై బ్రౌన్ కలర్ చొక్కా, బ్లాక్ ప్యాంట్ ఉన్నాయని, చెవికి పోగులు ఉన్నాయని చెప్పారు. పై వ్యక్తి గురించి ఏదైనా సమాచారం ఉంటే సీఐ 9440627551,ఎస్ఐ–9491444022, నంబర్లకు తెలియజేయాలన్నారు. ఇంటికి వెళుతూ వృద్ధుడి మృతిబిక్కవోలు: మండలంలోని బలభద్రపురం గ్రామంలోని రాజానగరం వెళ్లే బస్సు స్టాప్ వద్ద వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం బలభద్రపురం గ్రామంలోని రాజానగరం బస్స్టాప్ వద్ద గుర్తు తెలియన వృద్ధుడు మృతి చెందినట్లు వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం అందిందన్నారు. మృతుడు కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామానికి గంపల రాముడు (79)గా గుర్తించారు. అతను అనపర్తి మండలం పులగుర్త గ్రామంలోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్నట్లు, సైకిల్పై ఇంటికి వెళుతూ బలభద్రపురం వచ్చిన తరువాత ఒక్కసారిగా పడిపోయి మృతి చెందినట్టు తెలిపారు. అతని కుమారుడు నానాజీ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీ తరలించినట్లు తెలిపారు. ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావుపై లైంగిక వేధింపుల కేసుఅమలాపురం టౌన్: అమలాపురం ఇరిగేషన్ కార్యాలయంలో డీఈఈగా పనిచేస్తున్న శ్రీనివాసరావు తనను ఉద్యోగ పరంగానూ, లైంగికంగానూ వేధిస్తున్నారని అదే కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న ఓ మహిళ పట్టణ పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావుపై శనివారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ నుంచి తనను డీఈఈ వేధిస్తున్నారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ సీతానగరం: మండలంలోని రఘుదేవపురం రవీంద్ర కాలనీలో తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ జరిగిందని ఎస్సై డి.రామ్ కుమార్ ఆదివారం తెలిపారు. సురవరపు మణికంఠ అక్క నిడదవోలులో ఉంటున్నారు. రెండు వారాల క్రితం ఇంటికి తాళం వేసి అక్కడికి వెళ్లారు. శనివారం తిరిగి ఇంటికి రాగా తాళం బద్దలు కొట్టి ఉంది. లోపల సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అది చూసిన మణికంఠ పోలీసులకు సమాచారం అందించాడు. నాలుగు కాసుల బంగారు బిస్కట్, 90 తులాల వెండి, రూ.3.90 లక్షల నగదు పోయిందని గుర్తించారు. ఎస్సై ఆదేశాలతో హెడ్ కానిస్టేబుల్ శ్రీను సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. క్లూస్ టీమ్ ఆధారాల కోసం పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆస్తి తగాదాలో ఒకరికి కత్తిపోట్లుకరప: గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి తగాదాలో ఒకరు కత్తిపోట్లకు గురికాగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప పోలీసులు కేసు నమోదు చేశారు. కరప గ్రామం మెరకవీధిలో బేరి రామకృష్ణ కింది పోర్షన్లోను, బేరి రాజ రాజేశ్వరి పైపోర్షన్లోను నివాసం ఉంటున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఆస్తి విషయమై వివాదం జరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బేరి రామకృష్ణ వియ్యంకుడు అమజాల వీరరాఘవ బిక్కవోలు నుంచి భోజనం క్యారేజీ పట్టుకుని వచ్చారు. అదే సమయంలో రాజరాజేశ్వరి ఆస్తి తగాదా విషయంపై రామకృష్ణతో గొడవ పడుతుండగా రాఘవ కూడా ఆ గొడవలో కలగచేసుకున్నారు. రాజరాజేశ్వరి కుమారుడు చంద్రశేఖర్ అక్కడకు వచ్చి రామకృష్ణ, రాఘవలతో వాగ్వాదానికి దిగాడు. వారిద్దరిని చంపాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ దగ్గరలో ఉన్న కత్తిని తీసుకొచ్చి రాఘవ ఎడమ చేతిపై రెండుచోట్ల నరికాడు. చుట్టుపక్కలవారు వచ్చి రాఘవను కాపాడి, చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎంఎల్సీ స్టేట్మెంట్పై కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఘనంగా కవలల సమ్మేళనం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కవల పిల్లల పెంపకం, వారి జీనవ విధాన శైలి తదితర అంశాలను తెలియజేయాలని వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 108 కవల పిల్లల జంటలను ఒకే చోట ఉంచి వారి ప్రతిభ పాటవాలను వెలికితీయడానికి కాకినాడ సూర్యకళా మందిరం ఆదివారం వేదికగా నిలిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాలతో సందడి చేశారు. వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ చైర్పర్సన్, అడ్మిన్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నాళం అండాళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుల రామకృష్ణ, జిల్లా గవర్నర్ బంగర్రాజు, వైస్ ప్రెసిడెంట్ సిద్దా వెంకటసూర్యప్రకాశరావులు హాజరై వాసవీ క్లబ్ ఆశయాలు, విశిష్టిత తెలియజేశారు. కవల పిల్లలకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి వారి ప్రతిభను కొనియాడారు. అనంతరం ఇద్దరు విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా సుచిత్ర, చావలిసూర్యకుమారి, రాజ్యలక్ష్మి వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు. క్లబ్ ఇంటర్నేషనల్ కార్యదర్శి గర్లపాటి శ్రీనివాసులు, బొడా సాయిసూర్యప్రకాష్, సూజాత, గ్రంధి బాబ్జి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.దక్షిణాది రాష్ట్రాల నుంచి 108 మంది హాజరు -
కృష్ణా జెడ్పీ చైర్పర్సన్పై దాడి హేయం
రాజమహేంద్రవరం సిటీ: కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళ అయిన ఉప్పాల హారికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడికి తెగబడడం దారుణమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తూంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూస్తూంటే, అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నా మా అనే అనుమానం కలుగుతోందన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఏడాదికి పైబడి వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. వేలాది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని, భవిష్యత్లో దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచించుకోవాలని భరత్రామ్ హెచ్చరించారు. ఎల్లకాలం ఒకరే అధికారంలో ఉండబోరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఉప్పాల హారికకు తాము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే అండగా నిలబడతామని భరోసా కూడా ఇచ్చారని భరత్రామ్ అన్నారు. ఇకపై కఠినంగా ప్లాస్టిక్ నిషేధం రాజమహేంద్రవరం సిటీ: నగరంలో ఇకపై ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ పి.ప్రశాంతి ఆదివారం తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్పై ఉన్న నిషేధాన్ని ఉల్లఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 75 మైక్రాన్ల లోపు మందం ఉండే ప్లాస్టిక్ కవర్లతో పాటు ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్క్లు, కత్తులు, స్పూన్లు, స్ట్రాలు, స్వీట్ బాక్సుల ప్యాకింగ్కు వాడే పలుచని ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్, ప్లాస్టిక్ జెండాలు, క్యాండీ స్టిక్స్, అలంకరణకు వాడే థర్మకోల్ తదితర వస్తువులపై నిషేధం ఉందని వివరించారు. ఈ నిబంధనలను అతిక్రమించే వారు శిక్షార్హులని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా చేటు చేస్తోందన్నారు. ప్లాస్టిక్ వినియోగం వలన ప్రజలు ఎన్నో రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం అమలుపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులతో ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువుల తయారీ, అమ్మకందారులు, నిల్వ చేసేవారు, పంపిణీదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని, లేకుంటే చట్ట ప్రకా రం చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధించడమే కాకుండా ట్రేడ్ లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ఇకపై క్లాత్, జ్యూట్ బ్యాగ్లే వినియోగించాలన్నారు. ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల ఏలేశ్వరం: ఖరీఫ్ సాగుకు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. -
మడి.. తడారి..
కృష్ణాకు నీరు తీసుకెళ్లాలనే తహతహ పోలవరం కుడి కాలువ పొంగి ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కాలువలో నీటి ప్రవాహం ఉంది. కృష్ణాకు నీరు తీసుకు వెళ్లాలనే ప్రభుత్వం తహతహలాడుతోంది. వర్షాలకు రైతులు నాట్లు వేశారు. ప్రస్తుతం కాలువకు నీరు ఇవ్వక పోవడంతో చేలు దెబ్బ తింటున్నాయి. పోలవరం కాలువ పొంగుతుండగా, తాడిపూడి ఎండిపోయింది. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తే పంటలు కోలుకుంటాయి.– సత్తి జగదీశ్వరరెడ్డి, అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం, గోపాలపురం నియోజకవర్గం ఇదీ.. తాడిపూడి.. తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి తీరాన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మన జిల్లా మెట్ట ప్రాంతంలోని కొవ్వూరు, గోపాలపురంతో పాటు ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి, నిరుపయోగంగా ఉన్న భూములను ఈ పథకం ద్వారా సాగులోకి తీసుకు రావాలని లక్ష్యంగా నిర్దేశించారు. సుమారు రూ.400 కోట్లతో ఈ పథకం పనులు పూర్తి చేశారు. ప్రధాన కాలువపై 4 సబ్ లిఫ్టులు ఏర్పాటు చేశారు. 2008లో పనులు పూర్తి కాగా, నాటి సీఎం వైఎస్సార్ నీటిని విడుదల చేశారు. 11 మండలాల్లో సుమారు 78 కిలోమీటర్ల పొడవున తాడిపూడి కాలువ విస్తరించి ఉంది. ప్రధాన పంపు హౌస్ వద్ద 8 మోటార్లు ఏర్పాటు చేశారు. వీటిలో 6 మోటార్లను వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం కాగా, వైఎస్ తదనంతరం వచ్చిన ప్రభుత్వం కాలువ పనులు పూర్తి చేయలేదు. దీనికితోడు ప్రధాన కాలువ గట్లు బలహీనంగా ఉండటం వంటి కారణాలతో అధికారుల లెక్కల ప్రకారం 1.56 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేస్తున్నారు. దేవరపల్లి మండలం బందపురం వద్ద ఏర్పాటు చేసిన తాడిపూడి ఎత్తిపోతల పథకం 5వ సబ్ లిఫ్టు ఫ తాడిపూడి ఆయకట్టులో ఎండిపోతున్న చేలు ఫ ఈ నెల 3న హడావుడిగా నీరు విడుదల చేసిన మంత్రి ఫ ఆ వెంటనే మోటార్లు ఆఫ్ చేసిన అధికారులు ఫ దేవరపల్లి సబ్లిఫ్ట్ మరమ్మతుల పేరుతో కాలయాపన ఫ కాలువకు విడుదల కాని నీరు ఫ ఆయకట్టులో దెబ్బ తింటున్న వరి చేలు ఫ తగ్గిన భూగర్భ జలాలు ఫ రైతుల గగ్గోలు దేవరపల్లి: సకాలంలో నీరు ఇవ్వకపోవడంతో వేసిన వరి చేలు ఎండిపోతున్నాయని, వెంటనే కాలువకు నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని తాడిపూడి ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజుల గడచినా ఇంత వరకూ కాలువకు నీరు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి చెంతనే ఉన్న తమ భూములకు చుక్క నీరు ఇవ్వకపోగా, ఎక్కడో ఉన్న కృష్ణా, రాయలసీమ రైతులకు పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. కాలువకు నీరు విడుదల చేసినట్టే చేసి, నిలిపివేయడంతో తాడిపూడి ఆయకట్టు పొలాల్లో వరి చేలు ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇంత వరకూ నాట్లు కూడా పడని దుస్థితి నెలకొంది. మరోవైపు బోర్ల కింద వేసిన చేలకు సైతం పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. భూగర్భ జలాలు 10 నుంచి 15 అడుగులకు పడిపోవడంతో బోర్ల నుంచి నీరు తక్కువగా వస్తోందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు కొద్ది రోజులుగా వేసవిని తలపించేలా ఎండలు కాస్తూండటంతో చెరువులు, బోర్ల కింద వేసిన వరి ఆకుమడులు దెబ్బ తింటున్న పరిస్థితి నెలకొంది. మంత్రి స్వయంగా నీరు విడుదల చేసినా.. కాలువలో జలకళ కానరాకపోవడంతో రైతులు డీలా పడుతున్నారు. ఒకపక్క ఎండిపోతున్న చేలను, మరోవైపు నీరు లేక వెలవెలబోతున్న కాలువను చూచి ఆవేదన చెందుతున్నారు. చుక్క నీరు లేని తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ చుక్క నీరు లేక.. ఈ చిత్రం చూడండి. ఇది తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ. ఈ పథకం నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఈ నెల 3న ఆర్భాటంగా సాగునీరు విడుదల చేశారు. ‘రాష్ట్రంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుంది. రైతులకు సకాలంలో సాగునీటిని అందజేస్తాం’ అంటూ అప్పట్లో మంత్రి గొప్పగా చెప్పారు కూడా. ఇది జరిగి అప్పుడే పది రోజులు గడిచింది. ఈపాటికే ఈ కాలువ నిండుగా ప్రవహించాలి. కానీ, చుక్క నీరు కూడా రావడం లేదు. మంత్రి మోటార్లు ఆన్ చేసి అలా వెళ్లగానే అధికారులు వెంటనే మోటార్లు ఆఫ్ చేసి, నీటి విడుదలను నిలిపివేశారు. కాలువ, సబ్ లిఫ్టుల నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయించని ప్రభుత్వ అసమర్థతే దీనికి కారణం. దేవరపల్లి సబ్ లిఫ్టు మరమ్మతులు పూర్తయితే తప్ప నీరు విడుదల చేసేది లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గోదావరిలో 6 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. అయినప్పటికీ తాడిపూడి కాలువలో నీరు ప్రవహించకపోవడంతో ఆయకట్టులో చేలు ఎండిపోతున్నాయి. గోదావరి జలాలు కృష్ణార్పణం ఈ చిత్రం కూడా చూడండి. ఇది తాడిపూడి కాలువ గట్టును ఆనుకునే ఉన్న పోలవరం కుడి కాలువ. పక్కనే ఉన్న తాడిపూడి కాలువలో చుక్క నీరు లేకపోగా.. పోలవరం కుడి కాలువ మాత్రం గోదావరి జలాలతో నిండుకుండను తలపిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ కాలువ నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములు ఇచ్చిన తమకు నీరు ఇవ్వకుండా.. ఎక్కడో ఉన్న కృష్ణా జిల్లాకు పది రోజులుగా నీరు తరలించుకుపోతున్నారని స్థానిక రైతులు ఆక్షేపిస్తున్నారు. తమ పంటలను ఎండబెట్టి, అక్కడి రైతులు మాత్రమే పచ్చగా ఉండాలని ప్రభుత్వం తాపత్రయపడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభమై నెల రోజులు దాటినా ఇప్పటి వరకూ నీరు ఇవ్వకపోతే పంటలు ఏవిధంగా సాగు చేయగలమని ఆవేదన చెందుతున్నారు. -
నాలుగు రోజులు ఇలాగే ఉంటే..
తాడిపూడి కాలువ కింద వరి చేలు ఎండిపోతున్నాయి. కాలువకు నీరు విడుదల చేయడంతో నాట్లు వేశాం. మూడు మోటార్ల కింద 20 ఎకరాల్లో వరి పంట వేశాను. ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు పడిపోయి నీరు తక్కువగా వస్తోంది. ఇక్కడి రైతులకు నీరు ఇవ్వకుండా పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణాకు తీసుకు వెళుతున్నారు. గోదావరి చెంతనే ఉన్న పంటలకు నీటి సమస్య ఏర్పడింది. పరిస్థితి మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటే ఊడ్చిన చేలు ఎందుకూ పని చేయవు. సమస్య చెబుదామంటే అధికారులు ఫోన్ తీయడం లేదు. – కలగర భూపతిరావు, రైతు, కరుకూరు, దేవరపల్లి మండలం భూగర్భ జలాలు తగ్గాయి ఇంత వరకూ తాడిపూడి కాలువకు నీరు విడుదల చేయలేదు. ఈ ఏడాది వర్షాలు కూడా తక్కువగా ఉండటంతో భూగర్భ జలాలు తగ్గాయి. బోర్లు సరిగా తోడటం లేదు. బోర్ల కింద వేసిన వరి నాట్లు నీరు లేక దెబ్బ తింటున్నాయి. కాలువకు పూర్తి స్థాయిలో నీరు విడుదల చేస్తే అన్ని పంటలకూ మేలు జరుగుతుంది. ఆయకట్టుకు నీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి బోర్లు సమృద్ధిగా నీరు తోడతాయి. ప్రధాన కాలువ పనులు పూర్తి కావలసి ఉన్నాయి. పంట కాలువలు లేవు. కాలువ గట్లు వర్షాలకు గండ్లు పడి బలహీనంగా ఉన్నాయి. కాలువను ఆధునీకరించి, గట్టు పటిష్టం చేసి, పంట బోదెలు ఏర్పాటు చేయాల్సి ఉంది. – మల్లిన వెంకటేశ్వరరావు, రైతు, కురుకూరు, దేవరపల్లి మండలం మరమ్మతులు జరుగుతున్నాయి తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద దేవరపల్లి వద్ద ఉన్న సబ్ లిఫ్టు మరమ్మతులు ప్రస్తుతం జరుగుతున్నాయి. పంపు హౌస్లోకి వర్షపు నీరు వెళ్లి మోటార్లు మట్టితో పూడుకుపోయాయి. ఆ మట్టి తొలగింపు పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం వద్ద మూడు మోటార్ల ద్వారా నీరు ఎత్తిపోస్తున్నాం. 26వ కిలోమీటరు వరకూ నీరు సరఫరా అవుతోంది. రెండు రోజుల్లో కాలువకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తాం. ఈ సీజన్లో 1.60 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. – రామేశ్వర నాయుడు, డీఈఈ, తాడిపూడి ఎత్తిపోతల పథకం -
తగ్గుతున్న గోదావడి
ఫ నేడు మరింత తగ్గే అవకాశం ఫ కడలిలోకి 6.14 లక్షల క్యూసెక్కులు ధవళేశ్వరం: వరద గోదావరి తగ్గుముఖం పడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కూడా నీటి ఉధృతి తగ్గడంతో ఆదివారం సాయంత్రం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా ఉరవడి తగ్గింది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద ఉదయం అత్యధికంగా 6,56,341 మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. రాత్రికి నీటి ఉధృతి తగ్గడంతో మిగులు జలాల విడుదలను తగ్గించారు. రాత్రి 6,14,762 క్యూసెక్కుల నీటిని కడలిలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి సోమవారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం రాత్రి 10.90 అడుగులుగా ఉంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 30.60 అడుగులకు తగ్గింది. ఎగువన గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో..) కాళేశ్వరం 7.32 పేరూరు 11 దుమ్ముగూడెం 8.72 కూనవరం 14.78 కుంట 6.20 పోలవరం 10.59 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.09 అత్యవసర సహాయానికి సంప్రదించండి రాజమహేంద్రవరం సిటీ: గోదావరి వరద తగ్గుముఖం పట్టిందని, అయినప్పటికీ అత్యవసర సహాయం కావాల్సి వస్తే కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 112, 1070, 1800 425 0101 నంబర్లలో సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. గోదావరి వరద ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తున్నామని తెలిపారు. వరద పూర్తి స్థాయిలో తగ్గేంత వరకూ నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్లరాదని, చేపలు పట్టడం, ప్రయాణించడం, స్నానాలకు వెళ్లడం వంటివి చేయరాదని ప్రఖర్ జైన్ సూచించారు. -
పరిమితికి లోబడి పొగాకు సాగు
ఫ రైతులకు టొబాకో బోర్డు ఆర్ఎం ప్రసాద్ సూచన ఫ 2025–26 పంట కాలానికి ఉత్పత్తి ఖరారు ఫ రాష్ట్రంలో 142 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి దేవరపల్లి: పొగాకు బోర్డు 2025–26 పంట కాలానికి ఉత్పత్తిని ఖరారు చేసినందున రైతులు పరిమితికి లోబడే పొగాకు సాగు చేయాలని బోర్డు రాజమహేంద్రవరం రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ సూచించారు. ఆదివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రీజియన్ పరిధిలోని ఉత్తర తేలిక నేలలు (ఎన్ఎల్ఎస్) ప్రాంతంలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1, 2 వేలం కేంద్రాల పరిధిలో బ్యారన్కు 35.15 క్వింటాళ్ల చొప్పున 49.70 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతించిందని వివరించారు. 2024–25 పంట కాలంలో బ్యారన్కు 41.25 క్వింటాళ్ల చొప్పున 58.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, సుమారు 80 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2023–24 పంట కాలంలో బ్యారన్కు 25 క్వింటాళ్ల చొప్పున ఉత్పత్తికి అనుమతి ఇచ్చారని చెప్పారు. 2025–26 పంట కాలానికి రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల పరిధిలో 148 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చినట్టు ప్రసాద్ తెలిపారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో బ్యారన్కు 3,512 కిలోల చొప్పున 49.70 క్వింటాళ్లు, దక్షిణ ప్రాంత తేలిక నేలల (ఎస్ఎల్ఎస్) ప్రాంతంలో బ్యారన్కు 3,656 కిలోల చొప్పున 48.10 మిలియన్ల కిలోలు, దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలలు (ఎస్బీఎస్) బ్యారన్కు 3,565 కిలోల చొప్పున 42.10 మిలియన్ల కిలోలు, ఉత్తర ప్రాంత నల్లరేగడి నేలలోల్ల (ఎన్బీఎస్) బ్యారన్కు 2,102 కిలోల చొప్పున 2.10 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతించిందని వివరించారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న నిల్వలను దృష్టిలో పెట్టుకుని 142 మిలియన్ల కిలోల పంట ఉత్పత్తికి అనుమతించారని చెప్పారు. 2025–26 పంట కాలంలో రైతులు విధిగా పంట నియంత్రణ పాటించి, నాణ్యత పెంపుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. మూడేళ్లకోసారి బ్యారన్ల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది నుంచి మూడేళ్లకోసారి బ్యారన్ల రిజిస్ట్రేషన్లు చేయనున్నట్టు ప్రసాద్ తెలిపారు. బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులు మాత్రమే పొగాకు సాగు చేయాలని స్పష్టం చేశారు. కేటాయించిన కోటా మేరకు మాత్రమే పండించాలని, అధిక విస్తీర్ణంలో పండించరాదని చెప్పారు. అనధికారికంగా బ్యారన్లు నిర్మించరాదని, రిజిస్టర్ అయిన రైతులు అనధికారికంగా బ్యారన్లు నిర్మిస్తే రిజిస్ట్రేషన్లు నిలుపు చేస్తామని హెచ్చరించారు. పొగాకుతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకుని లాభాలు పొందాలని ఆయన సూచించారు. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తిలో మన దేశం 3, ఎగుమతుల్లో 2 స్థానాల్లో ఉందని తెలిపారు. ప్రపంచ దేశాల్లో పొగాకు ఉత్పత్తి 3,762 మిలియన్ల కిలోల నుంచి 4,197 మిలియన్ల కిలోలకు పెరిగిందని చెప్పారు. బ్రెజిల్, జింబాబ్వే, చైనా దేశాల్లో పొగాకు ఉత్పత్తి అధికంగా జరిగినందున ప్రస్తుతం మన రైతులు పండించిన పొగాకును మంచి ధరకు అమ్ముకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా లో గ్రేడ్ పొగాకు అమ్మకాలు మందకొడిగా జరుగుతున్నాయని ప్రసాద్ చెప్పారు. -
అస్మదీయులకే సంపద సృష్టి
● టీడీపీ నేతల చేతుల్లోకి ఎఫ్సీలు ● కాకినాడ, రాజానగరం ఏటీఎస్లు వారికే.. ● గతంలో రవాణా శాఖ పరిధిలోనే ఎఫ్సీల జారీ ● నేడు ప్రైవేటీకరించడంపై సర్వత్రా నిరసన సాక్షి, రాజమహేంద్రవరం: ఇప్పటికే మద్యం, ఇసుకను కట్టబెట్టడంతో కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి రాష్ట్ర రవాణా శాఖ కూడా చేరింది. ఈ శాఖలో అత్యంత కీలకమైన వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల (ఎఫ్సీ) జారీ సేవలను టీడీపీ నేతలకు చెందిన ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఎఫ్సీల జారీలో రాష్ట్ర రవాణా శాఖను డమ్మీగా చేసేశారు. స్థానికంగా ఏ అధికారికీ తనిఖీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఇప్పటి వరకూ రవాణా శాఖ కార్యాలయంలో వాహనాలకు ఎఫ్సీలు జారీ చేసేవారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీ ప్రకారం చలానా కట్టించుకుని ఎఫ్సీ మంజూరు చేసేవారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం లైట్, హెవీ మోటార్ వెహికల్స్కు ఎఫ్సీల జారీ చేసే పనిని తాజాగా ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీనిపై ఎవ్వరికీ అజమాయిషీ ఉండదు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. ఈ విధానాన్ని వాహన యజమానులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు. చక్రం తిప్పిన కీలక మంత్రి! కొత్త విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) మంజూరు చేశారు. తొలి దశలో 15 ఏటీఎస్లు ప్రారంభించారు. ఇదే అదనుగా రంగంలోకి దిగిన టీడీపీ నేతలు సింహభాగం సెంటర్లను కై వసం చేసుకున్నారు. అది కూడా యువగళం పాదయాత్ర చేసిన వారికే దక్కాయి. దీని వెనుక కీలక మంత్రి ఒకరు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ, రాజానగరం, అనకాపల్లి ప్రాంతాల్లో మాత్రం ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయులకు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తంతు నడిచినట్లు తెలిసింది. రూ.కోట్లు కొల్లగొట్టేలా.. ఒక ఏటీఎస్ ఏర్పాటుకు సుమారు రూ.5 కోట్లు ఖర్చవుతుంది. దీనిలో ప్రభుత్వం ఏకంగా రూ.3 కోట్ల సబ్సిడీ ఇస్తోంది. మిగిలిన రూ.2 కోట్లు మాత్రమే ఆ ప్రైవేటు సంస్థ వెచ్చించాలి. ఎఫ్సీల జారీ ద్వారా ప్రతి జిల్లాలో రూ.కోట్లు వసూలవుతాయి. కేంద్ర ట్రాన్స్పోర్ట్ ఇండియా సలహా మేరకు ఫిట్నెస్ టెస్ట్ల ద్వారా రెండేళ్ల పాటు వసూలు చేసిన సొమ్మును ఆ సంస్థ సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక పైసా కూడా చెల్లించనవవసరం లేదు. అటువంటప్పుడు ఆ సంస్థకు సబ్సిడీ ఇవ్వడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల వాహనాలూ కలిపి సుమారు 1.80 కోట్లు ఉన్నాయి. వీటిలో ఏటా 15 లక్షల వాహనాలు ఎఫ్సీ కోసం వస్తూంటాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎఫ్సీల జారీని ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ప్రభుత్వ ఆదాయానికి ఆమేరకు గండి పడింది. మరోవైపు ఎఫ్సీల జారీని ప్రైవేటు సంస్థకు ఏకంగా 20 ఏళ్లకు రాసివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థల నుంచి అప్పులు తీసుకువచ్చేందుకే కూటమి ప్రభుత్వం ఇలా దీర్ఘకాలిక లీజులు ఇస్తోందని వివిధ రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీమళ్లీ చలానాలు ఎఫ్సీ పొందేందుకు తొలుత సంస్థ నిర్దేశించిన మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం నిర్దేశించిన సమయంలోగా వాహనాన్ని తనిఖీ చేయించుకోవాలి. లేదంటే తిరిగి చలానా తీయాల్సి వస్తోంది. గతంలో చలానాకు వారం నుంచి 15 రోజుల వరకూ గడువుండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని వాహనదారులు వాపోతున్నారు. పైగా గతంలో కంటే చలానా మొత్తాన్ని భారీగా పెంచారని మండిపడుతున్నారు. గతంలో వాహనంలో చిన్నపాటి లోపాలుంటే సరిచేసుకుని వస్తే ఎఫ్సీ ఇచ్చేవారు. ప్రస్తుతం బ్రేక్ ఆయిల్ తక్కువగా ఉండటం చిన్నపాటి లోపాలున్నా అన్ఫిట్ చేసేస్తున్నారు. ఆ విషయం వారం తర్వాత మెసేజ్ ద్వారా తెలుస్తోంది. అప్పటికే చలాగా గడువు ముగిసిపోతూండటంతో మళ్లీ కట్టాల్సి వస్తోంది. ఇదే అదనుగా బ్రోకర్లు రంగంలోకి దిగి రూ.వేలు వసూలు చేస్తున్నారు. దూరాభారం ఏటీఎస్లను జిల్లా కేంద్రాలకు దూరంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి రాజానగరం వద్ద ఏటీఎస్ పెట్టారు. నల్లజర్ల నుంచి రాజానగరం వచ్చి వెళ్లాలంటే రాను పోను 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఇది దూరాభారమవుతోందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. దీనివలన పనులు మానుకుని రావాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు వాపోతున్నారు. ఎఫ్సీల జారీని ప్రైవేటీకరించడంపై మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, వివిధ రవాణా వాహన కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్లు వాసంశెట్టి గంగాధరరావు, బాక్స్ ప్రసాద్ తదితరుల ఆధ్వర్యాన రవాణా కార్మికులు రాజానగరం ఏటీఎస్ వద్ద ఇటీవల నిరసన తెలిపారు. చలానాల పెంపు (రూ.లు) వాహనం పాత కొత్త బాదుడు చలానా చలానా లారీ 920 1,320 400 మినీ వ్యాన్ 920 1,320 400 ఎల్ఎంవీ 720 920 200 ఆటో 620 820 200 జిల్లాలో వాహనాలు వాహనం సంఖ్య ద్విచక్ర వాహనాలు 3,41,117 కార్లు 45,404 ఆటో 21,726 గూడ్స్ క్యారియర్లు 20,465 ట్రాక్టర్లు 7,807 ట్రాలీలు 4,896 త్రీ వీలర్ గూడ్స్ వాహనాలు 3,599 ట్రైలర్ (అగ్రికల్చర్) 2,306 స్కూల్, కాలేజీ బస్సులు 1,827 లగ్జరీ టూరిస్ట్ క్యాబ్లు 342 అంబులెన్స్లు 230 జీపులు 150 రోడ్ రోలర్లు 67పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత కేంద్రం తీసుకు వచ్చిన ఎఫ్సీల జారీ ప్రైవేటీకరణ విధానాన్ని తొలుత రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో అమలు చేశారు. వాహన కార్మికుల నుంచి వ్యతిరేకత రావడంతో కర్ణాటక, రాజస్థాన్ ప్రభుత్వాలు దీని అమలును నిలిపివేశాయి. పాత, కొత్త విధానాల్లో ఎఫ్సీలు చేయించుకునేలా గుజరాత్ వెసులుబాటు కల్పించింది. మిగిలిన రాష్ట్రాలు నూతన విధానం అమలు చేయడం లేదు. కానీ, మన రాష్ట్రంలో సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం అస్మదీయులకు సంపద సృష్టించేందుకే ఈ విధానం అమలు చేస్తున్నట్లుందనే విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్ ప్రైవేటీకరణపై పోరాటం కార్మికులు ఏమీ చేయలేరన్న ఉద్దేశంతో ఫిట్నెస్ ప్రైవేటీకరణకు నాంది పలకడం దారుణం. దీనిని ఉపసంహరించుకునేంత వరకూ ఉధృతంగా పోరాడతాం. ఈ విషయంలో కార్మిక జేఏసీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్సార్ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. మాజీ సీఎం వైఎస్ జగన్ అండగా ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అది ఇవ్వడం లేదు. ఏ ప్రభుత్వం మంచి చేసిందో కార్మికులు గ్రహించాలి. – మార్గాని భరత్రామ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం ఉపసంహరించుకోవాలి ఫిట్నెస్ జారీని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిని తక్షణమే ఉపసంహరించాలి. చలానా విధానంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు సామర్థ్య పరీక్షలు అప్పగిస్తే పారదర్శకత ఏం ఉంటుంది? ఒక వాహనానికి పరీక్ష చేయాలంటే 40 నిమిషాలు పడుతోంది. కొన్ని పాఠశాలలు, కళాశాలలకు చెందిన వాహనాలు సెంటర్ వద్దకు రాకపోయినా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. – వాసంశెట్టి గంగాధరరావు, కార్మిక సంఘాల ప్రతినిధుల జేఏసీ కన్వీనర్, రాజమహేంద్రవరం -
రేపటి నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీలకు శిక్షణ
సామర్లకోట: ఉమ్మడి జిల్లాలోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులకు స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందని ప్రిన్సిపాల్ కరుటూరి నాగ వరప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నాయకత్వ శిక్షణలో భాగంగా మార్పు ద్వారా విజేతలు పేరిట గత నెల 23 నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లోని మహిళా ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాల సిబ్బంది శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 67 మందికి స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శిక్షణ ఇస్తామన్నారు. మహిళా ప్రతినిధులకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విధులు–బాధ్యతలు, భావవ్యక్తీకరణ వంటి అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణకు హాజరై సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుందన్నారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా దేవస్థానానికి రూ.3,73,904 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. లోవ భక్తులకు సత్యదేవుని ప్రసాదం సిద్ధం అన్నవరం: ఆషాఢ మాసం మూడో ఆదివారం తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి లోవ వెళ్లి వచ్చే భక్తులకు సత్యదేవున్ని గోధుమ నూక ప్రసాదం సిద్ధమవుతోంది. వారికి విక్రయించేందుకు లక్షకు పైగా సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న నమూనా ఆలయాల వద్ద లోవ భక్తులు సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సుమారు 60 వేలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం అంతకన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తారనే అంచనాతో అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 60 వేలలు, లోవ భక్తుల కోసం సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదివారం సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిక్కిరిసిన రత్నగిరిఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. రెండో శనివారం, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచే స్వామివారి సన్నిధికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుడు, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. -
గోదావరి పరవళ్లు
● కడలిలోకి 5.29 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న వరద ఉధృతి ధవళేశ్వరం: గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో నది ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 10.60 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 5,29,209 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉంది. కాటన్ బ్యారేజీ వద్దకు సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నది ఉధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద శనివారం 41.10 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ 40.90 అడుగులకు తగ్గింది. దీంతో, ఆదివారం సాయంత్రం నుంచి ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 8.77 పేరూరు 13.87 దుమ్ముగూడెం 11.50 కూనవరం 16.14 కుంట 7.30 పోలవరం 10.78 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 14.94 రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి ఉధృతి -
కూటమి పాలనలో దళితులకు రక్షణ కరవు
● బాధిత మహిళను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం దారుణం ● మాజీ హోం మంత్రి తానేటి వనిత అనపర్తి: కూటమి ప్రభుత్వ హయాంలో దళితులకు అందున మహిళలకు రక్షణ కరవైందని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. దుప్పలపూడి గ్రామానికి చెందిన దళిత మహిళ కొమ్ము బుజ్జిపై పాశవిక దాడి జరిగి, వారం రోజులు కావస్తున్నా బాధితురాలిని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కనీసంగా కూడా పరామర్శించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. గ్రామానికి చెందిన టీడీపీ నేత నల్లమిల్లి వెంకటరెడ్డి సెటిల్మెంట్ వ్యవహారంలో దాడికి గురై, అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ కొమ్ము బుజ్జిని వనిత శనివారం పరామర్శించారు. ఆమెతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి కూడా బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వనిత, చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అధికార పార్టీ నాయకులు పెత్తందారీ పోకడలకు పోతున్నారని విమర్శించారు. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఇంటికి వస్తున్న తనపై.. తమ మాట వినలేదనే కక్షతో సుమారు 15 మంది దారి కాచి, వీధి లైట్లు ఆర్పివేసి, రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసి, హతమార్చేందుకు ప్రయత్నించారని బాధిత మహిళ కొమ్ము బుజ్జి చెబుతోందని అన్నారు. అయినప్పటికీ పోలీసులు ఆమె రోదనను పట్టించుకోకుండా.. సంబంధం లేని సెక్షన్లు పెట్టి, కేసును నీరుగారుస్తున్నారని ఆరోపించారు. ఇదంతా చూస్తూంటే తన అనుచరులను కాపాడుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే ఒక పతకం ప్రకారమే ప్రజల్లో భయాందోళనలు సృష్టించి పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. మాజీ మంత్రి వేణు మాట్లాడుతూ, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ రెడ్బుక్ పట్టుకుని తిరుగుతూంటే.. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా వారి బాటలోనే అమాయక ప్రజలపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రాణభయంతో ఆందోళన చెందుతున్న బాధిత మహిళకు, ఆమె కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని, అలాగే కేసులోని సెక్షన్లు మార్చి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
శిష్యుడినని నమ్మించి శఠగోపం
● గురువు ఇంటికి సమీపంలోనే అద్దెకు దిగి అదను చూసి చోరీ ● రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణ ● నాలుగు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేసి సొత్తు రికవరీ అమలాపురం టౌన్: నేను మీ వద్దే చదువుకున్నానని.. ఆ ఉపాధ్యాయుడి ఇంటి పక్కనే మరో ఇంటిలో అద్దెకు దిగిన పూర్వ విద్యార్థి గురువు ఇంటికే కన్నం వేసి విలువైన బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ బి.కృష్ణారావు శనివారం విలేకరుల సమావేశంలో ఈ ఘటన వివరాలను వెల్లడించారు. రామచంద్రపురం పట్టణం రామదుర్గా వీధిలో ఓ డాబా ఇంట్లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు దొంతంశెట్టి శ్రీనివాస్ నివసిస్తున్నారు. దేవగుప్త వీరబ్రహ్మం అనే 30 ఏళ్ల యువకుడు ఆయన విద్యార్థినని పరిచయం చేసుకుని ఆయన ఇంటికి సమీపంలోనే మరో ఇంటిలో అద్దెకు దిగాడు. ఈనెల మూడున ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఇంటికి తాళం వేసి కుటుంబంతో విశాఖపట్నం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదనుగా వీరబ్రహ్మం ఇంటిలోని తలుపు బోల్టును పగలగొట్టి రూ.50 లక్షల విలువైన 463 గ్రాముల బంగారాన్ని దోచుకుని ఉడాయించాడు. ఈ నెల ఏడో తేదీన విశాఖ నుంచి తిరిగి వచ్చిన శ్రీనివాస్ తన ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి, సీసీ కెమేరా ఫుటేజీల సాయంతో చోరీకి పాల్పడిన వీరబ్రహ్మంను అరెస్టు చేసి అతని నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులకు ఎస్పీ అభినందనలు కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి సొత్తును రికవరీ చేసిన రామచంద్రపురం డీఎస్పీ బి.రఘువీర్, సీఐ ఎం.వెంకట నారాయణ, క్రైమ్ సీఐ ఎం.గజేంద్రకుమార్, రామచంద్రపురం ఎస్సై నాగేశ్వరరావు, ద్రాక్షారామ ఎస్సై లక్ష్మణ్, క్రైమ్ ఏఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ వీరబాబు, కానిస్టేబుళ్లు ఏసుకుమార్, సూరిబాబు, అనిల్ కుమార్, లోవరాజు, అర్జున్, ఐటీ కోర్ కానిస్టేబుల్ జాఫర్లను ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. -
సమన్వయంతో సత్వర న్యాయం
రాజమహేంద్రవరం రూరల్: సమన్వయంతో సత్వర న్యాయం లభించేందుకు అవకాశం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆధ్వర్యాన నగరంలో శనివారం కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది నమోదైన కేసులపై వివిధ శాఖలను సమన్వయపరిచేలా ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఈ అర్ధ సంవత్సర సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు కేసుల దర్యాప్తులో ప్రముఖ పాత్ర పోషించే న్యాయ, రెవెన్యూ, మెడికల్, మునిసిపల్, ఫోరెన్సిక్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, నేషనల్ హైవే అథారిటీ, ఎకై ్సజ్, జైళ్లు, రైల్వే, విద్య, ఏపీఎస్ ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో పోలీసు శాఖ నిత్యం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు తెలుసుకున్నారు. వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయా శాఖల ఉన్నతాధికారులు చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాఽధికారులను ఎస్పీ నరసింహ కిషోర్ సత్కరించారు. సబ్ డివిజన్ల వారీగా పనితీరు, డ్రోన్ కెమెరాల ప్రత్యేక స్టాల్స్ ఆహూతులను ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ నమోదైన కేసులపై జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ కూలంకషంగా చర్చించారు. వచ్చే అర్ధ సంవత్సర కార్యాచరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. గడచిన అర్ధ సంవత్సరంలో వివిధ కేసుల పరిష్కారంలో ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులను, సిబ్బందిని ఎస్పీ సత్కరించారు. సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లి క్షేత్రం జన సంద్రం
దేవస్థానం ఆదాయం రూ.62.53 లక్షలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న ఆలయం శనివారం జనసంద్రమైంది. అంతకంతకూ భక్తజనం పెరుగుతుండడంతో కోనసీమ తిరుమలగా ఈ క్షేత్రం ప్రఖ్యాతమవుతోంది. శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి ఆశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకస్వాములు ప్రత్యేక పూజలు చేసి విశేషంగా అలంకరించారు. సాధారణ భక్తులతో పాటు శ్రీఏడు శనివారాలశ్రీ నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి క్షేత్రం కిక్కిరిసిపోయింది. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం డీసీ అండ్ ఈఓ చక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వేద ఆశీర్వచనం, అన్నప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి రూ.62,52,971 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ఎస్సై రాము ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. -
వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వైద్య, ఆరోగ్య శాఖలో సిబ్బంది కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఇది ప్రజలకు సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) జిల్లా అధ్యక్షుడు పి.గిరప్రసాద్వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం శనివారం జరిగింది. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రవికుమార్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖలో కొన్ని వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాల నుంచి సిబ్బంది ప్యాటర్న్ మారలేదని, దీనిని మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. సిబ్బంది కొరత కారణంగా జిల్లాలోని ఆసుపత్రుల్లో వైద్య, ఆరోగ్య సేవలు సక్రమంగా అందడం లేదని చెప్పారు. కేవలం కొద్దిమంది కాంట్రాక్టు నర్సులు మాత్రమే ఉన్నారని, పలువురు నర్సులు అవసరమని తెలిపారు. అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అతి ముఖ్యమైన ధోబీ, బార్బర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ పోస్టులు ఎత్తివేశారని చెప్పారు. అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా నియమించాలన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఒకప్పుడు ఇరవై ముప్పై మంది మాత్రమే అవుట్ పేషెంట్లు ఉండేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య 300కు చేరిందని, కానీ అందుకు తగినట్టుగా సిబ్బంది పెరగలేదని చెప్పారు. -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: వేలాదిగా భక్తులు తరలిరావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీ ఏర్పడింది. రెండో శనివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు బీరకాయలతో విశేషంగా అలంకరించారు. సుమారు 7 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. -
భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం
● భక్తుల సూచనలు పాటించి సమస్యలు పరిష్కరిస్తాం ● డయల్ యువర్ ఈవోలో డీసీ అండ్ ఈఓ చక్రధరరావు కొత్తపేట: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కలిగేలా భక్తుల సూచనలు పాటిస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. భక్తుల సూచనలు, సలహాలు తీసుకునేందుకు, వారి సమస్యలు తెలుసుకునేందుకు శుక్రవారం శ్రీడయల్ యువర్ ఈవోశ్రీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సుమారు 40 ఫోన్ కాల్స్లో కొందరు భక్తులు ఆలయంలో వసతులపై సంతృప్తి వ్యక్తం చేయగా మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు సూచనలిచ్చారు. హైదరాబాద్, తాడేపల్లిగూడెం నుంచి ఫోన్ చేసిన భక్తులు పార్కింగ్ సమస్యలను, శనివారం రోజు వచ్చే భక్తులకు అరిటాకులో భోజనం పెట్టాలని కోరారు. దీనికి డీసీ స్పందిస్తూ ప్రతి శనివారం 20 వేల నుంచి 25 వేల మందికి ప్లేట్లలో అన్నప్రసాదం అందిస్తున్నామని, వకుళమాత అన్నదాన భవన నిర్మాణం పూర్తి కాగానే టేబుళ్లు ఏర్పాటు చేసి ఒకేసారి 3,500 మందికి వడ్డించేలా చర్యలు తీసుకుంటున్నామని, అప్పుడు అరటి ఆకులో భోజనం పెడతామని పేర్కొన్నారు. వచ్చే ప్రతి భక్తుడు స్వామివారిని కనులారా దర్శించి, సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దానిలో భాగంగా ఫ్లైఓవర్ ఏర్పాటు, క్యూలైన్లో తాగునీరు సదుపాయం, చిన్నపిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆలయం లోపల సెక్యూరిటీ సిబ్బందిని పెంచడంపై భక్తుల సలహాను పాటిస్తామన్నారు. -
అష్టదేవతల తీర్థయాత్ర స్పెషల్
రాజమహేంద్రవరం డిపో నుంచి ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢమాసాన్ని పురష్కరించుకుని రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అష్టదేవతల ఆలయాలు సందర్శనకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ డిపో నుంచి 50 మంది భక్తులతో బయలుదేరిన ప్రత్యేక బస్సు అష్ట దేవతల ఆలయాల దర్శనం అనంతరం రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకుంటుందన్నారు. ఒక్క రోజులో పూర్తయ్యే ఆ యాత్రలో కడియపులంక, చింతలూరు, మట్లపాలెం, కోవూరు వారాహిమాత, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట ఆలయాల దర్శనం అనంతరం తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. 18వ తేదీ శుక్రవారం మరికొన్ని ఆషాఢ మాసం అష్ట దేవతల బస్సులు నడిపేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో టిక్కెట్లు అవసరమైన భక్తులు 95023 00189, 73829 12141 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఓడలరేవు కేంద్రీయ విద్యాలయ భూసేకరణకు రూ.3.30 కోట్లు అల్లవరం: మండలం ఓడలరేవు గ్రామంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణానికి 7.50 ఎకరాల భూసేకరణకు రూ.3.30 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ గంటి హరీష్ బాలయోగి తెలిపారు.ఎన్నో ఏళ్లుగా కోనసీమ వాసులు ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయ కల సాకారం అవుతోందని తెలిపారు. మన ప్రాంతంలోని మత్స్యకార కుటుంబాలు, వ్యవసాయ కార్మికులు తదితర రంగాలలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు స్థానికంగా ఉన్నతమైన సీబీఎస్ఈ విద్యను అందించే అవకాశం కల్పిస్తుందని హరీష్ అన్నారు. మహిళపై బ్లేడుతో దాడి కాకినాడ క్రైం: కాకినాడ జగన్నాథపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చక ఆమె అతడికి దూరంగా ఉండగా కక్ష పెంచుకున్న మొహిద్దీన్ శుక్రవారం సాయంత్రం జగన్నాథపురం సమీపంలో ఉన్న జమ్మి చెట్టు వద్ద ఆమైపె బ్లేడుతో దాడికి పాల్పడి ముఖంపై లోతైన గాయాలు చేశాడు. రక్తమోడుతున్న బాధితురాలు కాకినాడ జీజీహెచ్లో చేరింది. కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
యాత్రికుల సేవలో రైల్వే వన్
● అందుబాటులోకి కొత్త యాప్ ● అనేక సౌకర్యాలతో రూపకల్పన ● కొత్త ఫీచర్ల చేరికతో మరిన్ని సేవలు రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల కోసం రైల్వే శాఖ అనేక సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. రైలు బోగీలోనే ప్రయాణికులకు వసతులన్నీ వచ్చి చేరేలా రైల్వే వన్ యాప్ను రూపొందించింది. ఇప్పటి వరకూ అనేక యాప్లు ఉన్నప్పటికీ, అన్నింటినీ ఏకం చేసి ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ రైల్వే వన్ యాప్లో ఐఆర్సీటీసీ సహా, భారతీయ రైల్వే అందించే దాదాపు అన్ని ప్రధాన సేవలు ఒకేచోట లభిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ఫారంల్లో లభ్యమయ్యే ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ సమాచారం, సీటు లభ్యత, ఫుడ్ ఆర్డర్ వంటి అనేక సేవలను పొందే అవకాశం ఉంది. మరిన్ని సేవలు మోర్ ఆఫరింగ్స్ విభాగంలో ప్రయాణికులు జర్నీ కోసం ముందుగానే భోజనాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. పీఎన్ఆర్ స్థితినీ చెక్ చేసుకోవచ్చు. కోచ్ స్థానాలను తెలుసుకోవచ్చు. రైల్వే సేవలపై ఫిర్యాదు చేయాలనుకునే వారు రైల్ మదద్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా పలు సమస్యలను నివేదించవచ్చు. ప్రధాన స్టేషన్లలోని అనేక రెస్టారెంట్లలో ఫుడ్ డెలివరీ బుక్ చేసుకునేందుకు పీఎన్ఆర్ నంబరును నమోదు చేసి, ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకోండిలా.. ● ముందుగా రైల్వే వన్ యాప్ను ఓపెన్ చేయాలి. ● హోమ్ పేజీలో రిజర్వ్ టికెట్ విభాగంపై క్లిక్ చేయాలి. ● ప్రయాణ వివరాలు, గమ్యస్థానం, తేదీని నమోదు చేయాలి. ● అమౌంట్ పే చేసి, బుకింగ్ను ధ్రువీకరించుకోవాలి. పీఎన్ఆర్ తెలుసుకునేదిలా.. ● హోమ్ పేజీలో మోర్ ఆఫరింగ్స్ కింద ఉన్న పీఎన్ఆర్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ● పీఎన్ఆర్ నంబర్ నమోదు చేసి, బుకింగ్ వివరాలు తెలుసుకోవచ్చు. ● రైలు సమాచారం, ప్రయాణ తేదీ, సీటు స్థితి, రాబోయే స్టేషన్లు, తదుపరి స్టాప్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. రైల్ మదద్లో ఫిర్యాదు వీడియో, చిత్రం, ఆడియో ఉపయోగించి సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు. ఏ రైలులో, ఏ రైల్వే స్టేషన్లో సహాయం కావాలనే విషయాన్ని స్పష్టంగా ధ్రువీకరించాలి. సమస్యను స్పష్టంగా వివరించి, ఫిర్యాదును సమర్పించాలి. అద్భుతమైన విధానం ఇప్పటివరకు రైలు ప్రయాణం కోసం టికెట్ల రిజర్వేషన్ కోసం రైలు ఎక్కడుందో తెలుసు కోవ డం కోసం పలు యాప్లలో వెతకాల్సి ఉండేది. నూతనంగా భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన రైల్వే వన్ యాప్ ద్వారా ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ఈ విధమైన యాప్ రావడం ప్రయాణానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యాప్ ద్వారా ప్రయాణీకులకు సౌకర్యమంతమైన, సులభతరమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. – జతిన్కుమార్ షెలత్, రాజమహేంద్రవరం యూజర్ల సౌలభ్యం కోసం.. ఈ యాప్లో యూజర్ ఇంటర్ఫేస్ సులభంగా ఉంటుంది. హోమ్ పేజీలో వినియోగదారులు రిజిస్టర్ చేసుకున్న తర్వాత, వారి పేరు కనిపిస్తుంది. దాని కింద అన్ని సేవలను సూచించే చిహ్నాలుంటాయి. ఈ విభాగంలో ప్రయాణికులు రిజర్వుడ్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్నూ బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తాము కోరుకునే టికెట్ను ఎంచుకుని, వివరాలను నమోదు చేసి, టికెట్లను పొందవచ్చు. -
కండక్టర్ కుటుంబానికి రూ.1.08 కోట్ల పరిహారం
రాజోలు: గత ఏడాది ఊడిమూడి శివారులో ధాన్యం ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కేఎస్ రావు కుటుంబానికి ఆర్టీసీ జోన్–2 ఈడీ విజయరత్నం రూ.1.08 కోట్లు చెక్కును శుక్రవారం అందజేశారు. కండక్టర్ భార్య కె.గంగాభవానికి ఈ చెక్కును అధికారులు అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పబ్లిక్ లయబిలిటీ ఫండ్ (ఈడీపీఎల్ఈ) ద్వారా ఈ పరిహారం వచ్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ అండగా నిలుస్తుందని ఈడీ అన్నారు. డీపీటీఓ ఎస్పీపీ రాఘవకుమార్, డిపో మేనేజర్ పి.ధనమ్మ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
దేవరపల్లి: మండలంలోని గొల్లగూడెంలో విద్యుదాఘాతానికి గురై యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు గోపాలపురం మండలం వేళ్లచింతలగూడేనికి చెందిన మందపాటి రాజేష్ (24) గోపాలపురంలోని కేబుల్ ఆపరేటర్ శ్రీధర్ రెడ్డి వద్ద పార్ట్ టైమ్ వర్కర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం దేవరపల్లి మండలం గొల్లగూడెంలో విద్యుత్ స్తంభం ఎక్కి కేబుల్ వైరు కడుతుండగా, పై భాగంలో ఉన్న 11 కేవీ హైటెన్షన్ లైన్ తీగలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం గోపాలపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజేష్ అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. మృతుడి తండ్రి చంటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు. -
బీఎల్ఓలు బాధ్యతగా ఉండాలి
● ఓటర్ల జాబితా తయారీలో బీఎల్ఓ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ● జిల్లా కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ ప్రశాంతి రాజమహేంద్రవరం సిటీ: ఓటర్ల జాబితా తయారీలో బీఎల్ఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్, ఇన్చార్జ్ కమిషనర్ పి.ప్రశాంతి సూచించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో బూత్ లెవెల్ అధికారులకు నిర్వహించిన ట్రైనింగ్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రసంగించారు. ఎన్నికల ప్రక్రియలో బీఎల్ఓల పాత్ర ఎంతో కీలకమన్నారు. శిక్షణ ద్వారా వారి పనితీరులో మెరుగుదలకు అవకాశం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఫారం–6, 6ఏ, 7, 8 ఓటర్ల జాబితా తయారీ, మార్పులు, చేర్పులు, మరణించినవారు, వలస వెళ్లిన వారి వివరాలను పరిశీలించి తుది సమాచారం ఏ విధంగా అందించాలో సూచించారు. విధి నిర్వహణలో బీఎల్ఓలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించిన ప్రాథమిక అంశాలపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. భారత రాజ్యాంగంలో గల అధికరణాల గురించి, ఎన్నికలకు సంబంధించిన ప్రజా ప్రాతినిధ్య చట్టం, ఎన్నికల నమోదు చట్టం, తదితర చట్టాలలోని ముఖ్యమైన సెక్షన్లు గూర్చి కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. బీఎల్ఓ పత్రికను ప్రతీ ఒక్కరూ తప్పక చదవాలన్నారు. అడిషనల్ కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, మేనేజర్ అబ్దుల్ మాలిక్, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
ధర గెలవలేదు
ఉపాధికి విఘాతం జిల్లాలో అరటి సాగుపై రైతులు 8వేల మంది ఆధారపడితే వీటిని నమ్ముకున్న కూలీలు, వెదురు వేసే కూలీలు, గెలలకు అరటి ఆకులు చుట్టే కూలీలు, అరటి గెలలను కోసే కూలీలు, అరటి వ్యాపారస్తులు సుమారు 30 వేల మంది ఉన్నారు. మార్కెట్టులో ధరలు తగ్గటం వలన వీరందరికి ఉపాధి లేకపోవటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. గత మేనెలలో అరటి కోతకు వెళ్లిన కూలీలకు రోజుకి రూ.500 నుంచి రూ.1,500 వచ్చేదని నేడు కూలి పనులు దొరకడం లేదని వాపోతున్నారు.● అరటి రేటు పతనంతో నష్టాలు ● మే నెలలో 10 టన్నుల లారీ రూ.2 లక్షలు.. నేడు రూ.90 వేలు ● ముందుకురాని వ్యాపారులు ● గతంలో 100 లారీల ఎగుమతి.. నేడు 40కి పరిమితం ● జిల్లాలో 7,500 హెక్టార్లలో సాగు ● 38 వేల మందికి ఉపాధి పెరవలి: మార్కెట్టులో అరటి ధరలు భారీగా పతనం అవ్వటంతో రైతులు గగ్గోలు పెడుతుండగా, వ్యాపారస్తులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. మే నెలలో 10 టన్నుల లారీ రూ.2 లక్షల ధర పలుకగా ప్రస్తుతం మార్కెట్టులో 10 టన్నుల లారీ రూ.90 వేలకు పడిపోవటంతో రైతులు, వ్యాపారస్తులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాడు జిల్లా నుంచి రోజూ 100 లారీలు ఎగుమతులు అయితే నేడు 30 నుంచి 40 లారీలే ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు అవుతున్నాయి. దీంతో రైతులు స్వచ్ఛందంగా పక్వానికి వచ్చిన అరటి గెలలను మార్కెట్టుకు తరలించి అయినకాడికి అమ్ముకుంటున్నారు. 6 వేల హెక్టార్లలోనే దిగుబడి జిల్లాలో అన్ని రకాల అరటి 7,500 హెక్టార్లలో సాగు అవుతోంది. ముఖ్యంగా జిల్లాలో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్ళపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఈ సాగు ఎక్కువగా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 వేల హెక్టార్లలో తోటలు దిగుబడి ఇస్తున్నాయి. కానీ ఇతర రాష్టాలకు ఎగుమతులు తగ్గటంతో స్థానిక మార్కెట్లో అమ్ముకునే దుస్థితి ఏర్పడటంతో ధరలు మరింత పతనం అవుతున్నాయి. తోటలను వదిలేస్తున్న వ్యాపారస్తులు అరటి మార్కెట్టులో జూన్ నెల నుంచి ధరలు పతనం అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కర్పూర అరటి మార్కెట్టులో 10 టన్నుల లారీ రూ.90 వేలు పలకటంతో రైతులు, వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు. చేల వద్దకు వ్యాపారస్తులు రాకపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. ధర పతనంతో అరటి తోటలను కొనుగోలు చేసే వ్యాపారస్తులే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్వానికి వచ్చిన గెలలను కోయకపోతే పండిపోయి మొత్తం పంట పాడైపోతుందని దీనితో కొనే నాథుడే లేకుండా పోతారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర కేళీ గెల ఒకటి రూ.250, ఎర్ర చక్కెర కేళీ గెల ఒకటి రూ.300 పలకటంతో వాటిని కొనుగోలు చేసిన వ్యాపారస్తులు తీవ్ర నష్టాలు పాలయ్యారు. ఎందుకంటే తోటలను కొనుగోలు చేసినప్పుడు చక్కెర కేళీ గెల ఒకటి రూ.250 నుంచి రూ.300 కొనుగోలు చేయగా, ఎర్ర చక్కెర కేళీ గెల ఒకటి రూ.300 నుంచి రూ.400కు కొనుగోలు చేశారు. కానీ మార్కెట్టులో కొనుగోలు చేసిన ధర లభించకపోవటంతో వ్యాపారస్తులు తోటలను వదలివేస్తున్నారు. మార్కెట్టులో ధరలు పతనం అవ్వటంతో రైతులే మార్కెట్టుకు అరటి గెలలను సైకిళ్లు, మోటారు సైకిళ్లపై తరలించి అమ్ముకుంటున్నారు. మార్కెట్టులో సైకిల్లోడ్ (6 గెలలు) కర్పూర అయితే నాణ్యతను బట్టి రూ.1,000 నుంచి రూ.1,400లు, చక్కెర కేళీ రూ.1,500 నుంచి రూ.2000కు, ఎర్ర చక్కెర కేళీ రూ.2,000 నుంచి రూ.2,500 ధరలు పలుకుతున్నాయి. తగ్గిన ఎగుమతులు జిల్లాలో అరటి ఎగుమతులు నెల రోజులుగా తగ్గిపోయాయి. గతంలో ఇతర రాష్ట్రాలైన ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు ప్రతి రోజూ 80నుంచి 100 లారీల సరకు ఎగుమతి అవ్వగా నేడు ఎగుమతులు 30 నుంచి 40 లారీలకు పడిపోయాయి. గతంలో బెంగాల్లో అరటి సాగు ఉండేది కాదు. నేడు అక్కడ ఇతర రాష్టాలకు ఎగుమతులు చేసే స్థాయికి సాగు రావటంతో ఎగుమతులు తగ్గాయి. ఒడిశాలో నెల రోజులుగా విపరీతమైన వర్షాలు కురవటంతో వినియోగం తగ్గి ఎగుమతులు మందగించాయి. తమిళనాడులో సరకు విపరీతంగా ఉండటంతో అక్కడికి ఎగుమతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీని ప్రభావంతో అరటి ధరలు పతనం అవుతున్నాయి. కొనే నాథుడు లేక.. గత ఏడాది కరోనా సమయంలో ఎగుమతులు లేక ఇబ్బందులు పడితే, నేడు కొనుగోలు చేసేవారు కరువవడంతో నానా పాట్లూ పడుతున్నాం. తోటలు కొనే నాథుడు లేక సైకిళ్లు, మోటారు సైకిళ్లపై మార్కెట్టుకు తరలించి అయిన కాడికి అమ్ముకుంటున్నాం. – యాతం మల్లికార్జునరావు, అరటి రైతు, అన్నవరప్పాడు గెలలు కోయటమే మానేశారు తోటలు అమ్మినప్పుడు ధరలు బాగానే ఉన్నాయి. ఒక్కో గెల ధర రూ.250కి అమ్మాను. కానీ వ్యాపారస్తులు సగం తోట కోసిన తరువాత ధరలు పతనం అవ్వటంతో గెలలు కోయటమే మానేశారు. దీంతో నష్టాలు పాలవుతున్నాం. – కాపకా పాపారావు, అరటి రైతు, కాకరపర్రు రైతులకు తప్పని నష్టాలు ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ధరలు తగ్గటంతో వ్యాపారస్తులు తోటలను అయిన కాడికి అడుగుతున్నారు. దీంతో ఈ సాగు చేస్తున్న రైతులు నష్టాల పాలవ్వక తప్పటం లేదు. – సంఖు ప్రభాకరరావు, అరటి రైతు, మల్లేశ్వరం -
పెరుగుతున్న గోదావరి వరద
● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ● ఆదివారం నాటికి 8లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదలయ్యే అవకాశం ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద వరద గోదావరి క్రమేపీ పెరుగుతుంది. శుక్రవారం సాయంత్రం కాటన్ బ్యారేజీ వద్ద 9.70 అడుగులకు నీటి మట్టం చేరింది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటిని ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 3,54,341క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉపనది ప్రాణహిత పొంగి పొర్లుతోంది. దీంతో కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి శనివారం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 8లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు దాటి ప్రవహించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. గోదావరి డెల్టా కాలువకు సంబంధించి 13,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,800, మధ్య డెల్టాకు 2,450, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. గోదావరి ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 11.79 మీటర్లు, పేరూరులో 15.42 మీటర్లు, దుమ్ముగూడెంలో 10.86 మీటర్లు, భద్రాచలంలో 37.20 అడుగులు, కూనవరంలో 13.60 మీటర్లు, కుంటలో 14.72 మీటర్లు, పోలవరంలో 9.01 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి దగ్గర 13.88 మీటర్ల వద్ద నీటి మట్టాలు కొనసాగుతున్నాయి. -
పవన్కల్యాణ్... ఇప్పుడేం అంటారు?
కాకినాడ క్రైం: ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరగడం అమానవీయమని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకి లెక్కలు చూపి మహిళలపై ఘోరాలు జరిగిపోతున్నాయని మొసలి కన్నీరు కార్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమంటారని నిలదీశారు. ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆమె కాకినాడలోని జీజీహెచ్కు వచ్చారు. లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఏడవ నంబరు, అంబానీ ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం లెక్చర్ గ్యాలరీ సమీపంలో ఉన్న హెచ్వోడీ రూంలో ఆసుపత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్లు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి అధికారుల మాటలు పొంతన లేకుండా ఉన్నాయని, నిందితులకు నేర చరిత్ర ఉన్న విషయాన్ని దాస్తున్నారని ఆరోపించారు. శక్తి యాప్ ద్వారా ఉద్దరించిందేంటని నారా లోకేష్ను నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వేలకొద్దీ దుర్యోధనులు, లక్షల కొద్దీ దుశ్శాసనులను శక్తి యాప్ ఏం చేయగలదని ప్రశ్నించారు. కీచకుల కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం బెయిలబుల్ కేసులు పెడుతూ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. విజయలక్ష్మి వెంట పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహిళా వర్దినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, కాకినాడ మాజీ మేయర్ సరోజ, మహిళా నేత భవానీ ప్రియ ఉన్నారు. -
మహిళలు, బాలికలపై దాడులు అరికట్టేందుకు ప్రణాళిక
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో మహిళలు, బాలికలపై జరిగే దాడులు అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నామని, శక్తి టీమ్ల ద్వారా అందుబాటులో ఉంటున్నామని ఎస్పీ డి.నరసింహకిషోర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మహిళల రక్షణ కోసం వుమెన్స్ హాస్టళ్లలో ప్రతిచోటా పాయింట్ బుక్స్ పెట్టి తరచుగా శక్తి టీమ్లు సందర్శిస్తున్నట్టు చెప్పారు. మహిళలు, బాలికల స్కూళ్లు, కాలేజీలు, హాస్టల్స్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, సరైన నడవడిక కలిగిన వార్డెన్లను ఏర్పాటు చేసేలా, యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామన్నారు. రాత్రి సమయాలలో అసాంఘిక శక్తులను అరికట్టేందుకు ఆరు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశామన్నారు. విద్యాసంస్థల వద్ద ఉదయం, సాయంత్రం సమయాలలో ఈవ్ టీజింగ్ జరగకుండా శక్తి టీం, డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామన్నారు. పబ్లిక్ అండ్ పోలీస్తో సంయుక్తంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సమాచారాన్ని సులువుగా మార్పిడి చేసుకునే విధంగా సుమారు 100 వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బహిరంగ ప్రదేశాలు, గోదావరి నది పరీవాహక ప్రాంతాలు, పాడు పడిపోయిన ఇళ్లు, తోటలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్ నేరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 42 మహిళలు, చిన్నపిల్లల మిస్సింగు కేసులను గంటల వ్యవధిలోనే ఛేదించామని తెలిపారు. -
షంపద సృష్టికి పర్మిట్!
సాక్షి, రాజమహేంద్రవరం: సంపద సృష్టించేందుకు కూటమి సర్కారు అడ్డదారులు తొక్కుతోందా..? మద్యం దుకాణాల పక్కన పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సన్నాహాలు ప్రారంభించిందా..? తద్వారా ప్రజలను మరింతగా తాగుడుకు బానిసలు చేసేందుకు కుట్రలు పన్నుతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ప్రజల నుంచి. మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూమ్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నామని, ఇక షాపుల పక్కనే తాగిస్తే.. తాగుబోతుల వీరంగాన్ని భరించలేమంటూ ఆందోళన చెందుతున్నారు. ఇదీ సంగతి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ తెరపైకి తెచ్చింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడచిన మద్యం షాపులను పూర్తిగా ఎత్తివేసి ప్రైవేటు పేరుతో కూటమి నేతలకు కట్టబెట్టింది. ఇదే అదనుగా భావించిన కూటమి నేతలు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రూ.లక్షల ఆదాయం ప్రభుత్వానికి వస్తోంది. రూ.99కే క్వార్టర్ మద్యం బాటిళ్లను అందుబాటులోకి తెచ్చి ప్రజలను తాగుబోతులుగా సర్కారు మార్చేసింది. పర్మిట్ రూమ్లకు గ్రీన్ సిగ్నల్ మద్యం ద్వారా ప్రస్తుత ఆదాయం చాలదన్నట్లు మరింతగా పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. మద్యం దుకాణాల వద్దే పర్మిట్ రూమ్లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. మద్యం విక్రయాల ద్వారా వస్తున్న ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పర్మిట్ రూమ్ల విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టేందుకు ఎకై ్సజ్ శాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నెలాఖరులోపు దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని ఎకై ్సజ్ శాఖ భావిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. జిల్లాలో రూ.62 కోట్ల ఆదాయం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపుల నిర్వహణకు అబ్కారీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుబంధంగా ఒక్కో షాపునకు ఒక్కో పర్మిట్ రూమ్ చొప్పున 125 సిట్టింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. పర్మిట్ రూమ్లకు ప్రభుత్వం ధర నిర్ణయించింది. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో మద్యం షాపునకు అనుగుణంగా ఏర్పాటు చేసుకునే పర్మిట్ రూమ్కు రూ.7.50 లక్షలు, ఇతర ప్రాంతాల్లోని పర్మిట్ రూమ్లకు రూ.5 లక్షల చొప్పున ఫీజును ప్రభుత్వం ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. సగటున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసినా.. ప్రభుత్వానికి అదనంగా రూ.62 కోట్ల ఆదాయం ఏటా సమకూరనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా.. అన్ని పర్మిట్ దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పర్మిట్ రూమ్ ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మార్పు చేస్తున్నారు. దుకాణాల పక్కన పర్మిట్ రూమ్లకు అవకాశం కోసం మద్యం దుకాణ యజమానులు ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన పాలసీతో ఇప్పటికే రూ.కోట్లలో ఆదాయం నూతన మద్యం పాలసీతో ఇప్పటికే ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లల్లో ఆదాయం లభించింది. జిల్లా వ్యాప్తంగా 125 షాపులకు 4,384 దరఖాస్తులు అందాయి. ఒక్కో టెండర్కు రూ.2 లక్షలు వసూలు చేశారు. అంటే రూ.87.68 కోట్ల ఆదాయం వచ్చింది. షాపులు దక్కించుకున్న వ్యాపారులు ఆరు విడతల్లో లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక లైసెన్సు ఫీజులో 1/6 వంతు చెల్లించారు. దీని ద్వారా రూ.14.85 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం విక్రయాల్లోనూ దూకుడే.. మద్యం షాపుల ద్వారానే కాకుండా.. మద్యం విక్రయాల్లోనూ ప్రభుత్వానికి రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. రాజమహేంద్రవరం రూరల్ ఐఎంఎల్ డిపో పరిధిలో తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్, అల్లూరిసీతారామరాజు, కోనసీమ జిల్లాల పరిధిలోని 134 మద్యం షాపులు, 27 బార్ అండ్ రెస్టారెంట్లకు మద్యం, బీర్లు సరఫరా చేస్తున్నారు. ప్రతి నెలా దాదాపుగా 1.17 లక్షల వివిధ రకాల మద్యం కేసులు, 44,300 బీర్ కేసులు సరఫరా చేస్తుంటారు. వీటి విలువ రూ.103 కోట్లు. ● చాగల్లు ఐఎంఎల్ డిపో పరిధిలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరు పరిధిలో 111 షాపులు, 10 బార్లకు మద్యం సరఫరా అవుతోంది. ప్రతి నెలా సుమారు 43,743 మద్యం కేసులు, 13,354 బీర్ కేసులు సరఫరా చేస్తున్నారు. వీటి ద్వారా రూ.కోట్లలో ఆదాయం లభిస్తోంది. తాగినోళ్లకు తాగినంత.. ఇప్పటికే మద్యం అక్రమ విక్రయ దందా బెల్టు షాపులే కేంద్రంగా నడుస్తోంది. సింహభాగం మద్యం షాపులను హస్తగతం చేసుకున్న కూటమి నేతల సిండికేట్ మద్యం దుకాణాలకు అనుగుణంగా బెల్టు షాపులు తెరిచింది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా ఎక్కడికక్కడ దుకాణాలు వందల సంఖ్యలో వెలిశాయి. అనధికారిక విక్రయాల కోసం ఏకంగా వేలం పాటలు నిర్వహించి మరీ ఎవరు ఎక్కడ విక్రయించాలో సిండికేటే నిర్ధారించింది. ఒక్కో బెల్ట్ షాపునకు డిపాజిట్గా ఆ ప్రాంతం, వ్యాపారాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ వసూలు చేశారు. మద్యం దుకాణాలు లేని ప్రధాన కూడళ్లలో, మారుమూల గ్రామాల్లో బెల్ట్షాపులు, డోర్ డెలివరీ మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. గుడి, బడి అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ విక్రయించేస్తున్నారు. మద్యం దుకాణం దక్కించుకున్న వ్యాపారే సరుకు ఇస్తుండటంతో బెల్ట్ షాప్ నిర్వాహకులు తమకు ఇష్టమొచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. బహిరంగంగానే రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. శివారు ప్రాంతాలకు సైతం మద్యం దుకాణ యజమానులు సరకు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం నేరుగా పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇస్తుండటంతో అసాంఘిక కార్యక్రమాలు విస్తృతంగా జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తప్పతాగి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించే పరిస్థితి తలెత్తుతుందన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ధనార్జనే ధేయ్యంగా షాపుల వద్దే కూర్చోబెట్టి తాగించే ఏర్పాట్లు చేస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఏరులై పారుతున్న మద్యం అనధికారిక బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా విక్రయాలు వాటిని ఇంకా పెంచేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు మద్యం షాపుల వద్ద పర్మిట్ రూములకు గ్రీన్ సిగ్నల్ గొడవలకు ఆజ్యం పోసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఆందోళనలో సమీప ప్రజలు సంపద సృష్టించడమంటే ఇదేనా..? అని మండిపాటు -
డొక్కలెండుతున్నాయ్!
విద్యుత్ బిల్లుల షాక్ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పీచు పరిశ్రమల యజమానులకు విద్యుత్ చార్జీల షాక్ తగులుతోంది. యూనిట్ విద్యుత్ ధర రూ.ఆరు. కానీ అదనపు లోడు వినియోగం, ఇంధన చార్జీలు, అపరాధ రుసుం పేరుతో ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. యూనిట్ ధర రూ.10 నుంచి రూ.12 వరకూ కావడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. నాలుగు వేల యూనిట్లు వచ్చే మధ్య తరహా పరిశ్రమకు రూ.24 వేల విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా, కొంతమందికి రూ.40 వేల వరకూ వస్తోంది. ● కొండెక్కిన కొబ్బరి కాయలు ● తిరోగమనంలో డొక్క ధర ● రైతుల వద్ద టన్నుల కొద్దీ నిల్వలు ● రెండు నెలల కిందట ట్రాక్టర్ సరకు రూ.1,500 ● ఇప్పుడు రూ.500 ఎదురు ఇచ్చి ఎగుమతులు సాక్షి, అమలాపురం: కొబ్బరి ధర కొండెక్కింది.. రికార్డు స్థాయిలో పెరిగింది.. దానికి తగ్గట్టు పెరగాల్సిన పీచు ఉత్పత్తుల ధర తిరోగమనంలో కొట్టుమిట్టాడుతుంది.. ఇలా పీచు పరిశ్రమ విలవిల్లాడుతోంది.. టన్నుల కొద్దీ పేరుకుపోతున్న కొబ్బరి డొక్క రైతులుకు శిరోభారంగా మారింది. అత్యంత విలువైన డొక్క కొంత రోడ్ల వెంబడి, తోటల్లో చెత్తగా మారిపోతుండగా, మరికొంత అగ్నికి ఆహుతవుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పీచు పరిశ్రమ అత్యంత పెద్దది. కొబ్బరి సాగు జరుగుతున్న ప్రాంతాల్లో పీచు, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు భారీ ఎత్తున ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.80 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, ఒక్క డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాలు ఉంది. ఇక్కడ కొబ్బరి అనుబంధ పరిశ్రమల్లో క్వాయర్ ఉత్పత్తులది అగ్రస్థానం. విలువ ఆధారిత పరిశ్రమల్లో 80 శాతం క్వాయర్ ఆక్రమించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 వరకూ చిన్న, పెద్దా పీచు ఉత్పత్తి కేంద్రాలు ఉంటే, ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 740 వరకూ పీచు, తాళ్ల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పీచు ఉత్పత్తి కేంద్రంలో రోజుకు టన్ను నుంచి ఐదు టన్నుల వరకూ పీచు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి రూ.125 కోట్ల విలువైన పీచు, ఇతర ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని అంచనా. ఎగుమతుల్లో సింహభాగం అంటే 70 శాతం చైనాకు వెళ్తుండగా, మిగిలిన ఎగుమతి మలేషియా, సింగపూర్, జపాన్తోపాటు గల్ఫ్, యూరప్ దేశాలకు ఉంటుంది. అంతకంతకూ పతనం ప్రస్తుతం కొబ్బరి కాయ ధర రూ.22 పలుకుతోంది. కానీ విచిత్రంగా కొబ్బరి పీచు ధరలు మాత్రం పతనమయ్యాయి. ఎగుమతులూ తగ్గాయి. తడి పీచు కిలో రూ.ఆరు పలుకుతుండగా, పొడి పీచు రూ.8 వరకూ ఉంది. తడి పీచు ఎండబెట్టి బేళ్లుగా మార్చి విక్రయిస్తే కిలో రూ.12 వరకూ వస్తోంది. కానీ పెట్టుబడి వ్యయం పెరగడంతో గిట్టుబాటు కావడం లేదు. తడి పీచు సగటు ధర కిలో రూ.తొమ్మిది వరకూ ఉండగా, ఇప్పుడు రూ.ఆరుకు చేరింది. చివరకు కొబ్బరి తాళ్ల ధరలు సైతం తగ్గాయి. 24 అడుగుల 100 ముక్కల కట్ట హైదరాబాద్ మార్కెట్లో రూ.150 మాత్రమే ఉంది. గతంలో ఇది రూ.220 వరకూ పలికేది. ముంబయికి వెళుతున్న తాళ్లకు మాత్రం రూ.180 వరకూ వస్తోంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం ఇటీవల కాలంలో పీచు, తాళ్లు, కొబ్బరి పొట్టు వంటి ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరిగింది. పీచు పరిశ్రమ నష్టాలకు ఇది కొంత కారణమవుతోంది. ఒక్క కార్మికుడికి రోజు వేతనం రూ.600 వరకూ ఉంది. ఆధునిక యంత్రాలు వచ్చిన తరువాత కార్మికుల సంఖ్య తగ్గిందని, కానీ వారికి చెల్లించే జీతం పెరిగిందని ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఎక్కడికక్కడే పేరుకుపోయి.. రెండు నెలల కిందట టన్ను కొబ్బరి డొక్కను స్థానిక పీచు ఉత్పత్తిదారులు రూ.1,500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు కొనుగోలు నిలిచిపోవడంతో కొబ్బరి తోటల్లో డొక్క టన్నుల కొద్దీ ఉండిపోయింది. ఈ డొక్కను ఉచితంగా తీసుకు వెళ్లాలని రైతులు పరిశ్రమల యజమానులను వేడుకుంటున్నారు. అవసరమైతే ట్రాక్టర్కు రూ.500 నుంచి రూ.వెయ్యి వరకూ ఎదురిచ్చి వదిలించుకునే పనిలో పడ్డారు. ఇదే సమయంలో తమిళనాడులో కొబ్బరి ఉత్పత్తి తగ్గడం వల్ల అక్కడ పీచు పరిశ్రమల యజమానులు రాష్ట్రంలోని చిత్తూరు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి డొక్క కొనుగోలు చేసి తీసుకు వెళ్తుండడం గమనార్హం. ఇక్కడ తోటల్లో పేరుకుపోయిన డొక్కను నిర్జీవ ప్రాంతాలకు తరలించడం, లేకుంటే తగలబెట్టడం చేస్తున్నారు. భారీ పరిశ్రమలు రావాలి పీచు పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే జిల్లాలో భారీ పరిశ్రమలు రావాలి. ఒక్కో పరిశ్రమ వద్ద పలు రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు కావాలి. ప్రతి మండలంలో క్వాయర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ప్రైమిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ)లో ఇప్పుడు రూ.50 లక్షల వరకూ రాయితీతో కూడిన రుణం ఇస్తుంది. ఇది కనీసం రూ.కోటికి పెంచాలి. అప్పుడు పలు రకాల ఉత్పత్తులు తయారు చేయవచ్చు. – వేగి వెంకటేశ్వరరావు, డైరెక్టర్, కోనసీమ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ డైరెక్టర్ యాంత్రీకరణ అవసరం తమిళనాడు పీచు ఉత్పత్తిదారులు ఒక్కడి కొబ్బరి డొక్కను కొనుగోలు చేసి పీచు ఉత్పత్తి చేస్తున్నారు. కొనుగోలు, రవాణా ఖర్చులు భారమే అయినా వారికి లాభాలు వస్తున్నాయి. మన పీచు ఉత్పత్తిదారులకు ఆధునిక యంత్రాలు లేక లాభాలు రావడం లేదు. స్థానికంగా ఉత్పత్తి తగ్గడం వల్ల రైతుల వద్ద డొక్క వృథాగా పేరుకుపోతోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపాలి. – పెదమల్లు నాగబాబు, క్వాయర్ రంగ నిపుణుడు, పాశర్లపూడిలంక -
ఎమ్మెల్యే అనుచరుల నుంచి రక్షణ కల్పించండి
– దళిత మహిళా బాధితురాలి భర్త కొమ్ము సత్తిబాబు అనపర్తి : తన భార్య కొమ్ము బుజ్జిపై హత్యాయత్నం చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరులు దుప్పలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి వెంకటరెడ్డి(ఎన్వీ), అతని అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని బాధిత మహిళ భర్త కొమ్ము సత్తిబాబు అన్నారు. గురువారం పరామర్శకు వచ్చిన ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయల్ వద్ద ఆయన తమ గోడు చెప్పుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి చెప్పకోవడానికి ఉదయం 9గంటలకు రామవరంలోని ఆయన ఇంటికి వెళ్లగా ఎమ్మెల్యే తన వద్ద ఉన్న ఫోన్ లాక్కుని దానిలో ఉన్న ఫొటో, వీడియో ఆధారాలను డిలీట్ చేసి సాయంత్రం ఏడు గంటలకు ఫోన్ తిరిగి ఇచ్చారని సత్తిబాబు ఆరోపించారు. తాను అబద్దం చెప్పడం లేదని ఎక్కడికై నా వచ్చి ప్రమాణం చేస్తానని సత్తిబాబు ఇజ్రాయిల్ వద్ద వాపోయారు. నెల రోజుల క్రితం కుక్కను తప్పించే క్రమంలో తన తోడల్లుడు వీరబాబు వృద్ధుడిని మోటార్ సైకిల్తో ఢీకొట్టాడని, ఆయన మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేయగా వీరబాబు బెయిల్ పై బయటకు వచ్చారన్నారు. పది రోజులుగా మాజీ సర్పంచ్ కుమారుడు ఎన్వీ విపరీతంగా వేధిస్తున్నాడని దీంతో ఎన్వీ ఇంటికి వెళ్ళగా రూ.2 లక్షలు ఇవ్వకపోతే వీరబాబును చంపేస్తామని బెదిరించారని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన తన భార్య బుజ్జి, తోడల్లుడు వీరబాబుపై విచక్షణారహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సత్తిబాబు డిమాండ్ చేశారు. -
సంపూర్ణ వికాస వేదిక పీటీఎం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సంపూర్ణమైన వికాసానికి పేరెంట్ టీచర్స్ మీటింగ్ చక్కటి వేదిక అని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ సమీపంలోనున్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పీటీఎంకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంచి పౌరులుగా విద్యార్థుల్ని తీర్చి దిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం అందిస్తే చక్కటి ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందన్నారు. డీఈఓ కే.వాసుదేవరావు, ప్రధానోపాధ్యాయురాలు శారదాదేవి, జిల్లా అధ్యక్షుడు పక్కి నాగేంద్ర, పేరెంట్ కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లితండ్రులు, సంరక్షకులు పాల్గొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు వద్దు ● మాజీ ఎంపీ హర్షకుమార్ ● రిలే దీక్ష చేపట్టిన డీసీసీ అధ్యక్షుడు విశ్వేశ్వరరెడ్డి రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం తక్షణం నిలిపివేసి, ఆదానీ సంస్థతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ స్థానిక గోదావరి గట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం ఎదుట గురువారం డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించి సంఘీభావం తెలిపారు. టీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించి, కరెంటు బిల్లులు వసూలు ప్రజల జీవన ప్రమాణాలను దివాలా తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ వినియోగదారులు ముందస్తుగా రీచార్జ్ చేసుకోవాలనే విధానం చాలా ప్రమాదకరమన్నారు. ఈ ప్రక్రియలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కో రేటు నిర్ణయించారని, ఇది ప్రజలను దోపిడీ చేయడమేనని ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, ిీసీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్, రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్ జైన్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ కుమారి, కాంగ్రెస్ రాజానగరం మండల కో ఆర్డినేటర్ వై.శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్
దేవరపల్లి: పొలాల్లోని వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న అంతర జిల్లా చోరీ ముఠాను దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి పలు ట్రాన్స్ఫార్మర్లు, 65 రాగి దిమ్మలను, 116.600 కిలోల రాగి తీగతో పాటు రెండు కార్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ ఆ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన కడలి సతీష్, ఏలూరు జిల్లా కృతివెన్ను మండలం లక్ష్మీపురానికి చెందిన వేండ్రపు దుర్గాశ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన బళ్లా విజయరత్నం, భీమవరం మండలం దెయ్యాలతిప్పకు చెందిన ఏలూరి పోసయ్య ముఠాగా ఏర్పడి రెండు కార్లు సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రెండు బైక్లతో ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి పూట ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి వాటిలోని రాగి తీగను దొంగిలించేవారు. ఇలా తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. అందులోని రాగి తీగను భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన పావురాయల కోటేశ్వరరావు, దిరుసుమర్రుకు చెందిన సవరపు భీమారావులు కొనుగోలు చేసి తీగను కరిగించి దిమ్మలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. నిందితులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023లో 49 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించి చేబ్రోలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాగా, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఇప్పటి వరకూ వివిధ జిల్లాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించగా, 67 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో ఆ ముఠాను బుధవారం సాయంత్రం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేశారన్నారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ ముఠాను పట్టుకోవడానికి సహకరించిన రాజమహేంద్రవరం సీసీఎస్ సిబ్బంది, దేవరపల్లి స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, రాజమహేంద్రవరం సీసీఎస్ సీఐ శ్రీధర్, బాలశౌరీ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ అభివృద్ధికి రూ.5.50 లక్షల విరాళం
ఆలమూరు: చింతలూరులో వేంచేసి ఉన్న నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి దాతలు విరాళాలు అందిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రస్తుతం జరుగుతున్న రాజగోపురాల నిర్మాణం కోసం తమ వంతు సాయంగా మండపేటకు చెందిన పారిశ్రామికవేత్త వంక సాయికుమార్ బాబు గురువారం దేవదాయ శాఖకు రూ.5.50 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు అల్లంరాజు రామకృష్ణమూర్తి, వైట్ల శేషుబాబు, నీటి సంఘం చైర్మన్ వైట్ల గంగరాజు, గన్ని వెంకట్రావు పాల్గొన్నారు. -
గోదారి ఇబ్బందులు
రాకపోకలకు బ్రేక్ అయినవిల్లి: ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారిపై ఓ ప్రయాణికుడు బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పడబోతుండగా తోటి ప్రయాణికుడు కాపాడాడు. దీంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉండటంతో రేవులో పూర్తిగా రాకపోకలను నిలిపేశారు. పి.గన్నవరం: వరద వచ్చేసింది.. లంక వాసులకు కష్టాలు తెచ్చిపెడుతోంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవు వద్ద నాలుగు లంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం గతేడాది వశిష్ట నదీపాయలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి గురువారం ఉదయం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లో సుమారు 3 వేల మంది నివసిస్తున్నారు. గతంలో 200 మీటర్ల పొడవున మట్టితో నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రేవులో రెండు ఇంజిన్ పడవలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడవలపై రాకపోకలు ప్రారంభించారు. అలాగే వరద ఉధృతికి ఊడిమూడిలంక వద్ద మట్టి లారీల రాకపోకల కోసం నిర్మించిన రహదారి, యర్రంశెట్టివారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బాటలు కూడా కొట్టుకుపోయాయి. వైవీ పాలెం వద్ద బాటలు కొట్టుకుపోవడం వల్ల పి.గన్నవరం మండలానికి సరిహద్దులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. గతంలో వరద బాధితులను పరామర్శించేందుకు ఇక్కడకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.49.5 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విధితమే. ఇప్పటికి 60 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఫ జి.పెదపూడిలో వరద ఉధృతి ఫ కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి ఫ నాలుగు లంక గ్రామాలకు మార్గం కట్ -
కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జక్కంపూడి కుటుంబం కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని ఆ పార్టీ యువజన విభాగం గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త జక్కంపూడి గణేష్ స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు తన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వహననానికి పాల్పడుతూ కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న ట్రోలింగ్పై గణేష్ తీవ్రంగా స్పందించారు. గురువారం రాత్రి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్ల మీద తమపై జనసేన నేతలు చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇక్కడితో కట్టిపెట్టాలన్నారు. లేదంటే అందుకు తగిన రీతిలో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్పై తన సోదరుడు రాజా అభివృద్ధి విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారన్నారు. ఇదే పవన్కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తమ కుటుంబ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు తామెంత బాధపడ్డామో వారికి తెలియదా అని గణేష్ ప్రశ్నించారు. తన తండ్రి రామ్మోహన్రావుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వారు గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. తన సోదరుడు రాజా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేస్తున్న ప్రచారాన్ని గణేష్ ఖండించారు. తమ కుటుంబం రాజశేఖర్రెడ్డితో కలసి ప్రయాణించిందని, ఆయన బిడ్డ జగన్ వెంటే ఉంటుందన్నారు. తమ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు. తమ పార్టీ ఓడిపోయినా తాము మాత్రం ఎక్కడికీ పారిపోలేదన్నారు. గెలిచినప్పుడు ఎలా పని చేశామో... ఓటమి తరువాత అదే విధంగా నియోజకవర్గంలో పని చేస్తున్నామన్నారు. తన తండ్రికి దక్కిన గౌరవమే తన అన్న రాజాకు దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తన సోదరుడు మరో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాకనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తామన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడండి 1999 ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం సాధిస్తే ఒకే ఒక స్థానం కడియం నుంచి జక్కంపూడి రామ్మోహనరావు మాత్రమే గెలిచిన చరిత్ర తెలుసుకుని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహా ఆ పార్టీ నేతలు మాట్లాడాలని గణేష్ హితవుపలికారు. రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ ఇద్దరికీ ఒకటే భయం పట్టుకుందన్నారు. జక్కంపూడి కుటుంబం జనసేనలోకి వచ్చేస్తే వారిని తట్టుకోలేమనే భయం వారిని వెంటాడుతోందన్నారు. జక్కంపూడి కుటుంబం చివరి వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని గణేష్ పునరుద్ఘాటించారు. తాజాగా రైజ్ అనే సంస్థ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి, అక్రమాలపై నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో పంతం నానాజీ, రెండో స్థానంలో బత్తుల బలరామకృష్ణ ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు. ఫ అనవసర ప్రేలాపనలు కట్టిపెట్టండి ఫ వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రాంతీయ సమన్వయకర్త గణేష్ -
కష్టాలు కొనసాగేలా..
అధిక ధరకు విక్రయాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఉన్న ఊళ్లోనే సేవలు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువులు అందుబాటులో లేకుండా చేసింది. ప్రస్తుతం అన్ని ప్రైవేట్ షాపుల్లో ఎరువులు దొరకడం లేదు. ఉన్న షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. –పెదపూడి బాపిరాజు, అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎరువుల సరఫరాకు చర్యలు గ్రామాల్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు ఇండెంట్ను గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) పెట్టాలి. ప్రస్తుతం వీఏఏల బదిలీలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆ ప్రక్రియ ముగుస్తుంది. వీఏఏలు చేరిన వెంటనే ఎరువుల ఇండెంట్ పెట్టించి, రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఈ లోపు పలు సొసైటీల ద్వారా సరఫరా చేయిస్తున్నాం. –ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట కొత్తపేట: తొలకరి పలకరించింది.. ఖరీఫ్ సాగుకు ఆహ్వానం పలికింది.. ఎన్నో ఆశలతో ప్రతి రైతు అడుగు పొలాల వైపు పడింది.. వరి నారుమడులు, పొలాల దమ్ము పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. ఇలా సాగు ఊపందుకుంటుంటే, ప్రభుత్వం నుంచి సన్నద్ధత కరవైంది. నేటికీ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు మాత్రం అందించడం లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, రైతు ప్రోత్సాహక పథకాలను అందించేవారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, తదితర సేవలు సకాలంలో అందించేవారు. ముందుగానే సర్వం సిద్ధం చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)గా పేరుపెట్టి వాటి ద్వారా సేవలకు మాత్రం మంగళం పాడింది. ఇవి ప్రస్తుతం అలంకారప్రాయంగా మిగిలాయని రైతులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1,74 లక్షల ఎకరాలు. ఈ సీజన్లో యూరియా, కాంప్లెక్స్, డీఏపీ, ఎంఓపీ, సూపర్ ఎరువులు సుమారు 45,775 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. అయితే ఇంకా రైతు సేవా కేంద్రాలకు ఎరువులు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. ముందస్తు అంటూ.. నిర్లక్ష్యం చూపుతూ ముందస్తు సాగుకు వెళ్లాలని అధికారులు చెబుతూనే రైతులకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల సాగు పంట ఆలస్యమవుతుంది. దీనివల్ల పంట చేతికొచ్చే సమయంలో అంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, భారీ వర్షాలకు పంట తడిసిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పక్కాగా ముందస్తు సాగుకు చర్యలు తీసుకునేది. ఇందులో భాగంగా ముందుగానే సాగునీరు విడుదల చేసేది. సకాలంలో రాయితీపై విత్తనాలు, రసాయన ఎరువులు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది. అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. గత రబీ ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా నేటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభమైనా, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ఇంకా రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం లేదు. ప్రైవేట్ డీలర్ల హవా ప్రస్తుతం నాట్లు వేసే సమయం. యూరియా, డీఏపీ అత్యవసరం. ఆర్ఎస్కేల వద్ద ఎరువులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదు. కొంతమంది వద్దే స్టాక్ ఉంది. తప్పక ఆ షాపులకు వెళితే ఎంఆర్పీ రూ.265 ఉన్న యూరియా బస్తా రూ.320 చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇదేంటని అడిగితే తామే రూ.290కి కొనుగోలు చేశామని, రూ.30 కిరాయి, రూ.5 దిగుమతి చార్జి కలిపి మొత్తం రూ.325 అయ్యిందని అంటున్నారని వాపోతున్నారు. పైగా అవసరం లేకపోయినా యూరియాతో పాటు దానికి అనుసంధానంగా జింకు, సల్ఫర్ వంటి మందులు అంటగడుతున్నారని చెబుతున్నారు. ఫ ఎరువులు అందక అన్నదాతకు తిప్పలు ఫ నిరుపయోగంగా రైతు సేవా కేంద్రాలు ఫ సాగు కాలం మొదలైనా కానరాని సన్నద్ధత -
సుగుణారెడ్డికి రెడ్క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెడ్క్రాస్ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్క్రాస్ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలపడంలో కృషి చేస్తున్న సుగుణారెడ్డికి పురస్కారం రావడం పట్ల పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. అత్యధిక స్థాయిలో ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు. విద్యుత్ షాక్కు గురై వ్యక్తి మృతి సీతానగరం: చినకొండేపూడిలో నివాసం ఉంటున్న పోలవరం ప్రాజెక్టు ఉద్యోగి అంకిత్ కటియార్ (34) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడని ఎస్సై డి.రామ్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పోలవరం ప్రాజెక్టులో ఫీల్డ్ ఇంజినీర్గా ఉత్తరప్రదేశ్లోని బెహత్ జిల్లా లాల్పూర్ జమల్పురానికి చెందిన అంకిత్ కటియార్ పని చేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ఉత్తరప్రదేశ్లో ఉంటున్న తన భార్యతో ఫోన్లో మాట్లాడాడు. తర్వాత బంధువులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో సహ ఉద్యోగి వచ్చి చూడగా అంకిత్ మృతి చెంది ఉన్నాడు. చేతిలో చిన్న ఫ్యాన్కు విద్యుత్ రావడంతో షాక్కు గురై మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహ ఉద్యోగి గిరిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రామ్కుమార్ తెలిపారు. అక్కాచెల్లెళ్ల అదృశ్యం రావులపాలెం: ఇద్దరు బాలికల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.శేఖర్బాబు తెలిపారు. గోపాపురానికి చెందిన ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్లు. గురువారం వారి తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ అక్కాచెల్లెళ్లు కనిపించలేదు. ఈ మేరకు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు డబ్బు డిమాండ్
రాజోలు: చనిపోయిన ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం అడిగిన రాజోలు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.రాంబాబును గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్ కథనం ప్రకారం.. రాజోలుకు చెందిన గుబ్బల కృష్ణతులసి భర్త బాలకృష్ణ స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. బాలకృష్ణ మృతి చెందడంతో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన లబ్ధిని పొందేందుకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ తదితర ధ్రువీకరణ పత్రాలకు కృష్ణతులసి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలుగా ఆమెకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆర్ఐ రాంబాబు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో కృష్ణతులసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. 20 వేలు ఆర్ఐ రాంబాబు తన కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్, సీఐలు భాస్కరరావు, సతీష్, వాసుకృష్ణ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు రాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. తన భర్త బాలకృష్ణ చనిపోయిన నాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నానని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ రాంబాబు రూ. 15 వేలు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నానని బాధితురాలు కృష్ణతులసి చెప్పారు. మళ్లీ నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ సర్టిఫికెట్స్ కోసం రూ. 20 వేలు డిమాండ్ చేస్తే విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆర్ఐ రాంబాబు నాలుగు నెలల కిందట రామచంద్రపురం నుంచి రాజోలు బదిలీపై వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఆయనపై తమకు పలు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
రక్షణ కల్పించాలని ప్రజల ఆందోళన
మామిడికుదురు: ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి వద్ద బుధవారం జరిగిన గ్యాస్ కిక్ సంఘటన నేపథ్యంలో స్థానికులు గురువారం ధర్నా చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. పాశర్లపూడి – పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులోని డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న రిగ్ వద్ద ఈ ధర్నా జరిగింది. ఓఎన్జీసీ కార్యకలాపాలతో అనుక్షణం తాము భయం, భయంగా గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎక్కడో కూర్చుని పరిస్థితి అదుపులో ఉందని చెప్పడం ఏంటంటూ నిరసన తెలిపారు. డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రజలకు తగిన వివరణ, భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ చేపట్టిన రిఫైర్స్ పనులను అడ్డుకున్నారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, పొన్నమండ రామస్వామి, బిరుదుగంటి నరసింహమూర్తి, మోకా దుర్గారావు, అడబాల దొరబాబు, గోనిపాటి మధుబాబు, తాడి శ్రీనివాసు, రొక్కాల రాజశేఖర్, పొలమూరి గోపాల్, ఉండ్రు చిన్న, నాగిడి వీరవెంకటరమణ, కోలా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ తీరుపై రోడ్డెక్కిన జనసేన
● సొసైటీ పదవుల్లో అన్యాయం చేశారని ఆవేదన ● మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు నియోజకవర్గంలోని కూటమి నాయకుల మధ్య కుంపటి రాజుకుంది. ఇటీవల ప్రకటించిన సొసైటీ చైర్మన్లు, ఇతర కమిటీ సభ్యుల ఎంపికలో జనసేనకు పదవులు ఇవ్వకపోవడంపై ఆ పార్టీ నాయకులు టీడీపీపై మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం కొవ్వూరులోని టోల్ గేట్ రోడ్కం రైల్ బ్రిడ్జ్జి వద్ద ఆందోళన చేపట్టారు. కొవ్వూరు జనసేన ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని జనసేన నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాలని నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా టీవీ రామారావు మాట్లాడుతూ నియోజకవర్గంలో సొసైటీ అధ్యక్ష పదవుల నియామకం విషయంలో తమను సంప్రదించలేదని అన్నారు. ప్రాధాన్యం కల్పించాలని కోరగా అసలు తమను పట్టించుకోలేదని తెలిపారు. వారి మోచేతి కింద నీళ్లు తాగే పరిస్థితి లేదని, తమకు గౌరవం, గుర్తింపు ఇవ్వాలని తేల్చి చెప్పారు. కూటమి లక్ష్యాలు దెబ్బతినే విధంగా ఉన్నాయని అన్నారు. తమను మానసిక క్షోభకు గురిచేశారని అన్నారు. తమను తక్కువగా చూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు.జనసేన నాయకులు సిద్దా శివరామకృష్ణ, నామన మూరయ్య, ఐతం మణికంఠ, పూలపల్లి బాలకృష్ణ, దూసనపూడి ఆంజనేయులు, సాయన సుబ్బారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పేపర్ మిల్లు సమస్యలపై స్పందించకుంటే ఆమరణ దీక్ష
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025● వైఎస్సార్ సీపీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ● జక్కంపూడి రాజా అల్టిమేటం సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం, ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. అప్పటిలోగా స్పందించకపోతే ఈ నెల 14వ తేదీ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అల్టిమేటం జారీ చేశారు. బుధవారం రాజమహేంద్రవరం ప్రకాష్నగర్లోని కార్తికేయ అపార్ట్మెంట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా పేపర్ మిల్లు యాజమాన్యం చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందన్నారు. కర్మాగారంలో 3,500 మంది శాశ్వత కార్మికులు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 700 మంది మాత్రమే ఉన్నారన్నారు. కీలకమైన విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులతోనే పనులు చేయించడం దారుణమన్నారు. 2017 నుంచి 2019 వరకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గుర్తింపు యూనియన్ ఉండేదని, 2019 తర్వాత ఆ యూనియన్ కాల పరిమితి ముగిసిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు కొత్త గుర్తింపు యూనియన్ ఎన్నిక జరగలేదన్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి గుర్తింపు యూనియన్ ఎన్నిక జరగాల్సి వుందని గుర్తుచేశారు. యాజమాన్యంతో బ్రోకర్లతో కొందరు కార్మిక నాయకులు కుమ్మక్కయి దేశంలో ఎక్కడా లేనివిధంగా పరంపర అనే పథకం పెట్టి ఒక్కొక్క ఉద్యోగానికి సుమారు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున అమ్ముకున్నారని ఆరోపించారు. పరంపర ఉద్యోగాల ముసుగులో మహిళలను వేధింపులకు గురిచేసారని వివరించారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు. సంగీతం సత్యనారాయణ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. పేపర్ మిల్ యూనియన్ పేరుతో అరాచకాలకు పాల్పడుతున్న ముఖేష్ జైన్, జయకృష్ణ, ప్రవీణ్ చౌదరిలను అరెస్టు చేసి రాజమహేంద్రవరం నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమయ్యారు? తాము అధికారంలోకి వస్తే పేపర్ మిల్ కార్మికులకు న్యాయం చేస్తామన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కార్మికులను వాడుకున్నారని, ఎన్నికల అనంతరం కార్మికుల సంక్షేమాన్ని మరిచారని ఎద్దేవా చేశారు. ఒక్కొక్క కార్మికుడికి రూ.లక్ష వరకు బకాయిలు ఇవ్వాల్సి ఉందన్నారు. రోజుకు 350 టన్నుల నుంచి 600 టన్నుల ఉత్పత్తికి పేపర్ మిల్లు సామర్థ్యం పెరిగిందని, రూ.100 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు లాభాలు గడిస్తోందన్నారు. లాభాలు తెచ్చిపెడుతున్న కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు ఈ నెల 14వ తేదీలోగా పరిష్కరించకపోతే.. నా తల్లి గాని, నేను గాని ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జగన్తోనే జక్కంపూడి కుటుంబం సినిమాలు వేరు రాజకీయాలు వేరు. చిరంజీవి అంటే మా కుటుంబానికి అభిమానం. మా నాన్న చిరంజీవి సినిమాలు ఎక్కువగా ఇష్టపడి చూసేవారు. జనసేనలోకి జక్కంపూడి కుటుంబం వెళుతోందన్న వార్తలను ఆయన కొట్టి పారేశారు. తమ కుటుంబం ఎప్పుడూ వైఎస్ జగన్ వెంటే ఉంటుందని గతంలోనే ప్రకటించానని గుర్తుచేశారు. కొంతమంది సైకో ఫాన్స్ వదంతులు సృష్టిస్తున్నారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. -
నానాటికీ ప్రభంజనం..
ఆలమూరు: భారతదేశం జన ప్రభంజనం అవుతుంది.. నియంత్రించకుంటే భవిష్యత్ అధోగతిగా మారుతుంది.. చిన్న కుటుంబం– చింతలు లేని కుటుంబం. ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు. ఈ నినాదాలకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడుతోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ జనాభా కేవలం 35 కోట్లు కాగా, 80 ఏళ్ల అనంతరం నాలుగు రెట్లకు పైగా చేరుకుందని అంచనా. రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా వల్ల నానాటికీ కరిగిపోతున్న వనరులతో భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారింది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆహారం, ఉపాధి, వివిధ అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు భారం అవుతోంది. అధిక జనాభాతో అడవులు సైతం అంతరించి పోతుండగా పంట భూములు ఆవాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణంలో సమతుల్యత లోపించి భవిష్యత్లో పుడమికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ జనాభా 2011 గణాంకాల ప్రకారం 51,54,296 మంది ఉండగా, ఇందులో 25,69,888 మంది పురుషులు, 25,84,608 మంది సీ్త్రలు ఉన్నారు. అయితే 2025 మార్చి 31 నాటికి ఈ జనాభా సుమారు 55.38 లక్షలుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లాను 2022 ఏప్రిల్ 4న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కాగా, రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేశారు. దీంతో జనాభా గణాంకాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడింది. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10.98 శాతంగా ఉన్న పెరుగుదల 2011కు వచ్చేసరికి 13.86 శాతంగా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనాభా శాతం మరింత పెరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరం అవుతుంది. జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అందువల్ల వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గణనకు షెడ్యూల్ విడుదల జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2011లో జరిగిన జనగణన తరువాత పదేళ్ల తరువాత 2021లో జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో కోవిడ్–19 ప్రభావం అధికంగా ఉండటంతో వాయిదా పడుతూ వస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గణనలో భాగంగా 2026 ఏప్రిల్ ఒకటి నుంచి తొలుత ఇళ్లు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అనంతరం 2027 ఫిబ్రవరి నుంచి జన, కుల గణనలను ఒకేసారి చేపట్టేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ జన, కుల, ఆస్తుల గణనలో ప్రతి ఒక్కరి నుంచి 36 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించనుంది. ప్రాధాన్యం ఇస్తే మేలు ఉమ్మడి జిల్లాలో అధిక జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. జనాభా పెరుగుదలతో కలిగే దుష్ఫరిణామాలను ప్రజలకు వివరించేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలి. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి ప్రోత్సాహకాలను అందజేయాలి. సమాజంలో వీలైనంత మేరకు అధిక వయసు పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం చేసుకున్న ప్రతి జంట స్వచ్ఛంద నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అధిక జనాభాతో వనరుల లభ్యత కరవు 2027 ఫిబ్రవరి 1 నుంచి జన, కులగణన రేపు ప్రపంచ జనాభా దినోత్సవం జిల్లాల వారీగా జనాభా వివరాలు జిల్లా జనాభా పురుషులు సీ్త్రలు వైశాల్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 17,19,013 8,58,632 8,60,381 2,083 కి.మీ కోనసీమ కాకినాడ 20,92,374 10,45,269 10,47,105 3,020 కి.మీ తూర్పుగోదావరి 18,32,332 9,15,325 9,17,007 2,561 కి.మీ -
చివరికి దిగొచ్చి... కొబ్బరి కాయలు వినియోగించి..
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి కల్యాణంలో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించారు. కొబ్బరి ధరలు పెరగడంతో వాటిని పక్కనబెట్టి అభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ‘సాక్షి’ దినపత్రికలో ‘వీరేశ్వరా.. క్షమించవా’ అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో దేవస్థానం అధికారులు స్పందించి స్వామివారికి నిర్వహించే అభిషేకాల్లో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించడం మొదలు పెట్టారు. రూ.వెయ్యి పెట్టి అభిషేకం చేయించుకుంటున్న భక్తుల పేరున వినియోగించాల్సిన రెండు కొబ్బరి కాయలను వాడకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనికి స్పందించిన ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ కొబ్బరికాయలతో అభిషేకం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో గతంలో జరిగినట్లే కల్యాణ అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో కల్యాణ భక్తులకు అసౌకర్యం కలిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఆలయ సూపరింటెండెంట్ను ఆరా తీయగా కొబ్బరి కాయల పాటదారుడు సకాలంలో కొబ్బరికాయలు సరఫరా చేయకపోవడం వల్ల అసౌకర్యం కలిగిందని, ఇది తన దృష్టికి రాగానే చర్యలు తీసుకున్నానని చెప్పారు. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
రాజానగరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి నామవరంలోని ఒక ఇంట్లో చోరీ చేసిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్ తెలిపారు. ఈ వివరాలు మీడియాకు ఆయన బుధవారం తెలిపారు. నామవరానికి చెందిన రేలంగి లోవరాజు ఈ నెల 2న ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో కలసి తలుపులమ్మ లోవకు వెళ్లారు. దానిని గమనించి నిందితులు రాజమహేంద్రవరం రూరల్ మండలానికి చెందిన నలబా సత్యనారాయణ అనే సత్తిబాబు (32), బెదంపూడి రత్నరాజు అనే నాని (20), ఇనకోటి పవన్కుమార్ (20)లు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 22 కాసుల బంగారు నగలు, రూ. 1.75 లక్షలు దొంగించారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాజానగరం సీఐ వీరయ్య గౌడ్ తమ సిబ్బందితో దర్యాప్తును ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నిందితులను అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన తరువాత నగదులో కొంత తమ విలాసాలకు వాడుకున్నారు. నిందితుల నుంచి 22 కాసుల బంగారు నగలతోపాటు రూ. 1.15 నగదును స్వాధీనపర్చుకున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ పత్రికలో కంట్రిబ్యూటర్గా పని చేస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరంలోని ఓ పత్రికలో మెట్ల కుమార్ పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వస్థలం అమలాపురం కాగా, రాజమహేంద్రవరం రూరల్ నేతాజీ నగర్లో నివసిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో మనస్థాపం చెందిన కుమార్ గత నెల 23న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం బంధువులు, స్నేహితులు గాలించినా ఫలితం లేదు. ఈ ఘటనపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రాజమహేంద్రవరం తూర్పు రైల్వే స్టేషన్ క్వార్టర్స్లోని పార్కు నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించారు. ఈ విషయాన్ని టూ టౌన్ పోలీసులకు తెలిపారు. వెంటనే వారు ఆ ప్రాంతానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. అతని జేబులో పుస్తకం లభించింది. అందులో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు తనను క్షమించాలని రాసి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
దళిత మహిళపై దాడి అమానుషం
అనపర్తి: దుప్పలపూడి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ కొమ్ము బుజ్జిపై దాడికి పాల్పడిన టీడీపీ నేత ఎన్.వెంకటరెడ్డి, అతని అనుచరులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని మాదిగ న్యాయవాదుల సమాఖ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. బుధవారం అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని వారు పరామర్శించారు. నిందితులు ఎంత పలుకుబడి కలిగిన వారైనా భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షుడు కొండేపూడి ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 6న దుప్పలపూడి గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఎన్.వెంకటరెడ్డి (ఎన్వీ) దళిత మహిళ బుజ్జిపై అమానుషంగా దాడి చేయడంతో మాదిగ సంఘాల తరఫున నిజ నిర్ధారణ కమిటీగా తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. తమ పరిశీలనలో ఇది కచ్చితంగా కుల వివక్షతోనే జరిగిన దాడిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేయడం బుజ్జి మరిది వీరబాబు బెయిల్ పై రావడం వ్యవహారం కోర్టులో నడుస్తుండగా దళితులను, అమాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ వెంకటరెడ్డి తన అధికార మదంతో ఇంటి వద్ద ప్రైవేట్ పంచాయితీ నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా ఇటువంటి పనులను చేస్తున్న వెంకటరెడ్డిని మూడు రోజులు కావొస్తున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీఎస్ నాయకులు కొత్తపల్లి ప్రసాద్, ధూళి జయరాజు, ఆకుమర్తి చిన్నా, మానవ హక్కుల సంఘ సభ్యురాలు ఖండవిల్లి లక్ష్మి, ఎమ్మార్పీఎస్ నాయకులు గాలంకి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడు ఎన్వీ రెడ్డిని అరెస్టు చేయాలి మాదిగ సంఘాల నాయకుల డిమాండ్ -
ఏటీఎం మార్చేసి.. సొమ్ము డ్రా చేసి
యానాం: నగదు తీసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన ఓ విశ్రాంత పోలీసు అధికారినే మోసం చేసిన ఘటనలో నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. యానాం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్–2 కట్టా సుబ్బరాజు కథనం ప్రకారం.. గత నెల 28న యానాం పిల్లారాయ వీధిలో ఎస్బీఐ ఎటీఎం నుంచి విశ్రాంత పోలీసు అధికారి సత్యనారాయణ రూ.10 వేలు డ్రా చేశారు. అయితే మినీ స్టేట్మెంట్ రాకపోవడంతో పక్కనే ఉన్న పిఠాపురం వద్ద నరసింగపురానికి చెందిన కాసీబు రాంబాబును మినిస్టేట్మెంట్ తీయమని అడిగి పిన్ నంబరు చెప్పారు. మినీ స్టేట్మెంట్ రావడం లేదని చెప్పి రాంబాబు తన వద్ద ఉన్న మరో కార్డును సత్యనారాయణకు ఇచ్చాడు. అనంతరం రాంబాబు బయటకు వెళ్లి ఆ ఏటీఎం కార్డు నుంచి రూ.70 వేలు తస్కరించాడు. జరిగిన మోసంపై సత్యనారాయణ యానాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యానాం క్రైమ్ టీమ్ సభ్యులు జాంటీ, దుర్గారావు, మల్లాడి గణేష్లు నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకుని రూ.వెయ్యి నగదు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై దువ్వాడ, కాకినాడ ప్రాంతాల్లో పలు కేసులు ఉన్నాయి. -
ఆ క్రెడిట్ కొట్టేద్దామని..
కూటమి ప్రభుత్వ ప్రమేయమే లేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రసాద్ నిధుల విడుదల, పనుల ప్రారంభోత్సవం జరిగాయి. ఇందులో కూటమి ప్రభుత్వ ప్రమేయమేదీ లేదు. ప్రస్తుతం టెండర్లు మాత్రమే ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. సత్యదేవుని భక్తుల సౌకర్యార్థం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం ప్రసాద్ నిధులు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. వాస్తవానికి రూ.92 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు అప్పట్లో ప్రతిపాదించాం. ప్రస్తుత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మిగిలిన నిధులు సాధించి, అప్పుడు ప్రచారం చేసుకోవాలి. – వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నవరం: కష్టపడింది ఎవరైనా.. దానికి మంచి ఫలితం వస్తే చాలు.. ఏమాత్రం జంకూగొంకూ లేకుండా ఆ క్రెడిట్ కొట్టేయడానికి కూటమి పెద్దలు తెగ తాపత్రయపడుతూంటారు. ఆ విషయంలో కూటమిలోని జనసేన పార్టీకి చెందిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంటున్నారనే విమర్శ వస్తోంది. అన్నవరం దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్రం మంజూరు చేసిన ‘ప్రసాద్’ స్కీమును తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలే దీనికి కారణమవుతున్నాయి. ఏం జరిగిందంటే.. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పిలిగ్రిమేజ్ రీజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీముకు అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం 2016లో ఎంపికై ంది. అయితే, 2019 వరకూ ఉత్తరాది రాష్ట్రాల్లోని వారణాశి, మధుర తదితర పుణ్యక్షేత్రాల అభివృద్ధి పైనే కేంద్రం దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాకినాడ ఎంపీగా వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికయ్యారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రసాద్ స్కీము ద్వారా ఎక్కువ నిధులు సాధించి, అన్నవరం దేవస్థానంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అప్పటి ఎంపీ వంగా గీతను నాటి సీఎం జగన్ ఆదేశించారు. అప్పటి నుంచీ ఆమె ఈ స్కీము నిధుల కోసం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ అధికారులతో పలు దఫాలు చర్చలు జరిపారు. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి అన్నవరం దేవస్థానానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని కోరారు. తొలుత అన్నవరం దేవస్థానానికి రూ.100 కోట్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం చెప్పింది. ఆవిధంగా ప్రతిపాదించగా అందులో రూ.8 కోట్లు తగ్గించి, రూ.92 కోట్లకు పరిమితం చేసింది. చివరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) వద్దకు వచ్చేసరికి రూ.54 కోట్లకు తగ్గించింది. చివరకు కేంద్రం రూ.20.06 కోట్లు మాత్రమే మంజూరు చేయడం కొంత అసంతృప్తికి కారణమైంది. ఒక దశలో రూ.10 కోట్లు మాత్రమే మంజూరు చేస్తారనే సమాచారం రావడంతో నాటి ఎంపీ గీత.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలసి, ప్రసాద్ స్కీము నిధులు పెంచాలని కోరారు. ఆమె కృషితో కేంద్రం ఎట్టకేలకు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.11.09 కోట్లతో రెండంతస్తుల్లో అన్నదాన భవనం, రూ.5.9 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.61.78 లక్షలతో టాయిలెట్ బ్లాకులు, రూ.1.08 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్, రూ.91.96 లక్షలతో భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రూ.కోటి వ్యయంతో 2 బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి గత ఏడాది మార్చి 7న వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో అప్పటి ఎంపీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వంగా గీత, పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, నాటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. అనంతరం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రసాద్ పనుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల టూరిజం శాఖ సీఈ ఈశ్వరయ్య తదితరులు ప్రసాద్ స్కీము నిర్మాణాల స్థలాలను పరిశీలించి వెళ్లారు. త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ నెలాఖరు నుంచి నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు. పనులు ప్రారంభమయ్యే సూచనలతో.. ప్రసాద్ స్కీము పనులు ఈ నెలాఖరున ప్రారంభమ య్యే అవకాశం ఉండటంతో ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టా రు. ప్రసాద్తో పాటు అనేక విషయాల్లో అన్నవరం దేవస్థానం అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మాజీ ఎంపీ వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కాకినాడ ఎంపీగా ఉన్న తాను ప్రసాద్ స్కీము కోసం మొక్కవోని పట్టుదలతో కృషి చేసి నిధులు సాధించానని గుర్తు చేశారు. అయితే, ఇదంతా ఆయన గొప్పే అన్నట్టు ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ప్రచారం చేసుకోవడం దారుణమని విమర్శించారు.ఫ ‘ప్రసాద్’ను తన ఖాతాలో వేసుకునేందుకు ఎంపీ ప్రయాస ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం కోసం కృషి ఫ అప్పటి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని పలుమార్లు కలసిన నాటి ఎంపీ గీత ఫ ఫలితంగా పచ్చజెండా ఊపిన కేంద్రం ఫ అప్పట్లోనే వర్చువల్గా శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ ఫ అయినప్పటికీ ఇదంతా తన కృషి వల్లనేనంటూ తంగెళ్ల ప్రచారం -
శృంగేరిలో పద్య రచనా శిక్షణ శిబిరం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కర్ణాటకలోని దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠంలో జగద్గురువుల ఆదేశం మేరకు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ‘సాహిత్య శారదా’ అనే శీర్షికతో పద్య రచనా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. తెలుగు పద్య రచన నేర్చుకొనే ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/TeluguPadya వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ శిబిరంలో సుప్రసిద్ధ శతావధానులైన డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, డాక్టర్ తాతా సందీప్ శర్మ, విద్వాన్ గన్నవరం లలితాదిత్య శర్మ పాల్గొని, పద్య రచనలో మెళకువలు నేర్పిస్తారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. సంగీత, నృత్య పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): నగరంలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలో వివిధ కోర్సులకు గాను 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎస్.నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక సంగీతం, గాత్రం, వాద్యం, నాట్యం, మృదంగం, డోలు, శాసీ్త్రయ నృత్య విభాగాల్లో నాలుగేళ్ల డిప్లొమా, రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించనున్నామన్నారు. కర్ణాటక సంగీతం, నాట్యం తదితర విభాగాల్లో ప్రతిభా ప్రదర్శన ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. సర్టిఫికెట్ కోర్సులో చేరే విద్యార్థుల వయస్సు ఈ నెల ఒకటో తేదీ నాటికి పదేళ్లు, డిప్లొమా కోర్సులో చేరే వారికి 15 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువుగా పేర్కొన్నారు. మరింత సమాచారానికి 0883–2421669 ఫోన్ నంబర్లో కార్యాలయ పని వేళల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించాలని నాగలక్ష్మి సూచించారు. బూత్ లెవెల్ అధికారులకు నేటి నుంచి శిక్షణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులకు బుధవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 1,581 మంది బూత్ లెవెల్ అధికారులు ఈ శిక్షణకు హాజరవుతారన్నారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం ఆరు బ్యాచ్లుగా వీరికి శిక్షణ ఇస్తామన్నారు. దీనికి బూత్ లెవెల్ అధికారులతో పాటు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, నమోదు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అనపర్తిలో 228, రాజానగరం 216, రాజమహేంద్రవరం రూరల్ 241, రాజమహేంద్రవరం అర్బన్ 176, కొవ్వూరు 205, నిడదవోలు 246, గోపాలపురంలో 269 మందికి శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు. కేంద్ర పథకాలు ప్రజలకు అందించాలి రాజమహేంద్రవరం సిటీ: కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, వారు లబ్ధి పొందేలా చూడాలని ఎంపీ, జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ సంఘం (దిశ కమిటీ) చైర్మన్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం జరిగిన దిశా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, ఘన వ్యర్థాల నిర్వహణ, జల్జీవన్ మిషన్, అమృత్, ఫసల్ బీమా యోజన, పింఛన్లు, గృహ నిర్మాణం, క్షయ వ్యాధి నివారణ, పీఎం సూర్య ఘర్ పథకాలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ పి.ప్రశాంతితో కలసి అధికారులతో సమీక్షించారు. ప్రతి పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, నమోదైన లబ్ధిదారుల సంఖ్య, పురోగతి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారి
కాకినాడ క్రై: సాధారణ గస్తీలో భాగంగా కాకినాడలో భద్రతను పర్యవేక్షిస్తున్న కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సర్పవరంలోని విశాఖ డైయిరీ సమీపంలో మంగళవారం తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో ఒక వ్యక్తి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో అతడికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. గస్తీలో భాగంగా అటుగా వెళ్లిన సీఐ సునీల్ కుమార్ ఆ వ్యక్తిని చూశారు. వెంటనే మంచినీరు తాగించి, సపర్యలు చేసి కూర్చోబెట్టారు. నీరసంతో పడిపోయానని అతడు చెప్పడంతో పోలీసులు సురక్షిత ప్రాంతానికి చేర్చి, ఓఆర్ఎస్ ద్రావణాలు కొని ఇచ్చారు. కాగా.. రోడ్డుపై పడిఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన సునీల్ కుమార్ను ఎస్పీ బిందుమాదవ్, డీఎస్పీ దేవానంద్ పాటిల్ అభినందించారు. -
సేద్య పద్ధతులతో కోకోలో అధిక దిగుబడి
అంబాజీపేట: కోకో సాగులో నూతన సేద్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు అన్నారు. అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ క్యాష్వేనట్ అండ్ కోకో డెవలప్మెంట్ ప్రోత్సాహంతో మంగళవారం కోకో సాగుపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు మాట్లాడుతూ కోకో తోటల్లో యాజమాన్య పద్ధతులు అవలంబించాలన్నారు. కొమ్మ కత్తిరింపు, పురుగుల నియంత్రణ పద్ధతులపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను సాగు చేయడం వల్ల అదనపు రాబడి పొందవచ్చన్నారు. డాక్టర్ నామాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోకో కాయ తయారయ్యే సమయంలో తోటలను రైతులు పరిశీలించి ఎలుకల బెడద ఉంటే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. హార్టికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కోకో ప్రొడక్షన్, కోకో వాల్యూ అడిషన్, ప్రోసెసింగ్ విధానాలను వివరించారు. శాస్త్రవేత్తలు బి.నీరజ, ఎ.కిరీటి, వి.అనూష తదితరులు కోకోలో సూక్ష్మపోషకాల యాజమాన్య విధానాలను తెలిపారు. -
10 నుంచి పొగాకు విత్తనాల విక్రయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ –నిర్కా) (పూర్వపు సీటీఆర్ఐ)లో 2025–26 సీజన్కు ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నాణ్యమైన వర్జినీయా పొగాకు విత్తనాలు విక్రయించనున్నారు. వీటిని ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్, ఎన్బీఎస్, ఎన్ఎల్ఎస్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మంగళవారం ప్రకటనలో కోరారు. అలాగే 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కందుకూరులోని వాణిజ్య వ్యవసాయ పరిశోధనాసంస్థ పరిశోధనా స్థానం (పూర్వపు సీటీఆర్ఐ)లో కూడా పొగాకు విత్తనాల విక్రయాలు ప్రారంభమవుతాయన్నారు. జీబీఆర్ఎస్ పాస్బుక్ ఉన్న రైతులకు ప్రతి బ్యారన్కు 500 గ్రాముల చొప్పున కిలో రూ.1300కు విక్రయిస్తారన్నారు. కావాల్సిన రైతులు బ్యారన్ రిజిస్ట్రేషన్ పాస్బుక్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. క్యాష్లెస్ లావాదేవీలు అనగా యూపీఐ (గూగుల్ పే, ఫోన్ పే ), క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మాత్రమే అనుమతి ఉందన్నారు. పొగాకు బోర్డు ద్వారా రిజిస్టర్ చేయించిన కమర్షియల్ నారుమడులకు సంబంధించిన రైతులకు కిలో విత్తనాలను రూ.2,200కు విక్రయిస్తారన్నారు. -
చికిత్స పొందుతూ యువతి మృతి
అంబాజీపేట: గంగలకుర్రు అగ్రహారం శివారు పీర్మాయిపాలెం హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువతి సోమవారం రాత్రి మృతి చెందింది. అంబాజీపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కొర్లపాటివారిపాలేనికి చెందిన మిండుగుదిటి పవిత్ర ధనలక్ష్మి (21) ఈ నెల 5న మోటారు సైకిల్పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన మోటారు సైకిలిస్టు ఢీకొన్నాడు. ఈ ఘటనలో ధనలక్ష్మి తీవ్రంగా గాయపడింది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె సోదరుడు మిండుగుదిటి సిద్ది వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్సీ వి.సత్యనారాయణ తెలిపారు. మరో ఘటనలో.. అంబాజీపేట: తను ఒంటరిగా జీవిస్తూ మరొకరిని ఇబ్బందులకు గురి చేయడం ఇష్టం లేక పురుగుమందు తాగిన వృద్ధుడు.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిరతపూడికి చెందిన దార్లంక సత్యనారాయణ (75) ఈ నెల 5న పురుగుల మందు తాగి వాంతులు చేసుకున్నాడన్నారు. బంధువులు వెంటనే కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందాడన్నారు. మృతుడి అన్న కుమారుడు దార్లంక గోపికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావు తెలిపారు. పశువైద్యాధికారి శ్రీనివాసు మృతి ఆలమూరు: నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఏడీ నాన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చైర్మన్, పినపళ్ల గ్రామీణ పశు వైద్యాధికారి ఈదల శ్రీనివాసు (61) మంగళవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజమహేంద్రవరం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గుమ్మిలేరు, చింతలూరు, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, పినపళ్ల గ్రామాల్లో ఆయన పశువైద్యాధికారిగా సేవలందించారు. -
రక్కసీ కోత
ఉప్పాడ తీరంలో పంట పొలాల్లోకి చొచ్చుకు వచ్చిన సముద్రపు నీరు ప్రస్తుతం మాయాపట్నం వద్ద కడలిలో కలిసిపోయిన జియోట్యూబ్ రక్షణ గోడ● కోత బారిన ఉప్పాడ తీరం ● సముద్రంలో కలసిపోతున్న భూములు ● రక్షణ చర్యలు చేపట్టని ప్రభుత్వం ● నెరవేరని పవన్ కల్యాణ్ హామీ పిఠాపురం: ఉప్పాడ తీరంలో సముద్రం తరచూ ఉగ్రరూపం దాల్చుతుంటుంది. తుపాను రానప్పటికీ, ఉపద్రవాల హెచ్చరికలు లేనప్పటికీ సముద్ర కెరటాలు ఒక్కసారిగా ఉప్పొంగుతుంటాయి. దీంతో తీరం వెంబడి భూమి మీటర్ల మేర కోతకు గురవుతోంది. ఉప్పాడతో పాటు దాని శివారు గ్రామాలు కడలిలో కలిసి పోతుంటాయి. ఇలా సుమారు శతాబ్ద కాలంగా కడలి కబలించేస్తున్నా శాశ్వత రక్షణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నవి గుడిసెలే కదా అని రూ.లక్షల్లో ఉన్న ప్రతిపాదనలను పట్టించుకోక పోవడం వల్ల వందల ఎకరాల పంట భూములు, పురాతన ఆలయాలు, భవంతులు కడలి గర్భంలో కలిసిపోయాయి. కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభం లాంటి బీచ్ రోడ్డు నిర్మించిన నాటి నుంచే కడలిపాలవుతూనే ఉంది. ఉప్పాడ రక్షణకు చర్యలు ఉత్తిమాటేనా? కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.వందల కోట్లతో చర్యలు తీసుకుంటున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరిచిపోయారు. గత ఏడాది ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన రక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో తీర ప్రాంత రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో గత ఏడాది జూలై 24న కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎఫ్ఓ భరణి, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ (ఎన్సీసీఆర్) జాయింట్ సెక్రటరీ రమణ మూర్తి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప్పాడ నుంచి కాకినాడ పోర్టు వరకు తీర ప్రాంతం అభివృద్ధి, ఉప్పాడ తీరం కోత, ఇతర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఇవన్నీ జరిగి ఏడాది పూర్తవుతున్నా కనీసం ప్రణాళికలు కూడా తయారు కాలేదు. పెరిగిన కోత గత కొన్ని నెలలుగా ఉప్పాడ తీర ప్రాంతం తీవ్ర కోతకు గురవుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా నిత్యం కోత బారిన పడుతోంది. ఇప్పటి వరకు రక్షణగా ఉన్న జియోట్యూబ్ టెక్నాలజీ రక్షణ గోడ పూర్తిగా కడలిలో కలిసి పోగా, పక్కనే ఉన్న పంట పొలాలు సైతం సముద్రంలో మునిగిపోతున్నాయి. ఇలా ఇప్పటి వరకు 1,360 ఎకరాల పంట భూమి కోతకు గురై కడలి గర్భంలో కలిసి పోయింది. ఈ తీర ప్రాంత రక్షణకు రూ.250 కోట్లతో ప్రణాళికలు అన్న మాట కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్సీసీఆర్ అధ్యయనం ప్రకారం కోస్తా తీరంలో ఉప్పాడ కొత్తపల్లి, సఖినేటిపల్లి మండలాలు ప్రమాద స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. 1956 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉప్పాడ గ్రామంలోనే సుమారు 85 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయినట్లు గుర్తించారు. కోతకు కారణమేదే! గోదావరి ఇసుక కొట్టుకు రావడం వల్ల కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ ఐలాండ్ సముద్రంలో 40 చదరపు మైళ్ల విస్తీర్ణం గల లోతు లేని అగాధం (కాకినాడ బే) సృష్టించడం వల్ల దీని సమీపంలోని ఉప్పాడకు ముప్పు ఉందని నిర్ధారించారు. ఉత్తరం వైపు నుంచి తెరుచుకుని ఉండే ఈ అగాధం దక్షిణ వైపు నుంచి తీరానికి వెళ్లే అలలను అడ్డుకుంటోంది. దీంతో అలలతో పాటు వెళ్లే పదార్థాలు (లిట్టోకల్ డ్రిప్టు) తీరం చేరడం లేదు. దానివల్ల అలల తాకిడితో హోప్ ఐలాండ్లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు తీరంలో మట్టి కోతకు గురవుతుంది. గ్రామాలు కోతకు గురైన భూమి (ఎకరాల్లో) ఉప్పాడ 84.51 రమణక్కపేట 13.01 అమరవిల్లి 133.50 సుబ్బంపేట 141.30 కోనపాపపేట 233.56 మూలపేట 359.78 కొమరగిరి 362.83 మొత్తం 1360 75 ఏళ్ల క్రితమే.. 1950లోనే ఉప్పాడ తీరానికి సముద్ర కోత వల్ల ముప్పు ఉందని అఽధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఈ మేరకు సర్వే జరిపిన విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. 1971లో కోత తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 1992లో పూణేలోని అప్పటి పీడబ్ల్యూఆర్ఎస్ డైరెక్టర్ సీవీ గోలే అధ్యక్షతన ఒక సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం సాంకేతిక పరంగా సర్వేలు జరిపి ఉప్పాడ ప్రాంతం కోత.. విశేష స్వభావం కలిగినదిగా తెలిపింది. పొంచిఉన్న ప్రమాదం కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభమైన ఉప్పాడ తీరం శాశ్వత రక్షణకు చర్యలు చేపట్టలేకపోతే, ప్రత్యామ్నాయం అయినా చూడాలి. ఉప్పాడ కోతకు అడ్డుకట్ట వేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశశించిన తీర ప్రాంత వాసులకు నిరాశ మిగిలింది. దీంతో గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర కోత కారణంగా ఇప్పటి వరకూ సుమారు 32 వేల నివాస గృహాలు కడలిలో కలసిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. -
ఈవోలదే సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అన్ని ఆలయాలలో సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని, అవి పనిచేయకపోతే ఈవోలే పూర్తి బాధ్యత వహించాలని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని దేవదాయశాఖ ఆలయాలు, సత్రాల ఈవోలతో మంగళవారం కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. రమేష్ బాబు మాట్లాడుతూ ఆలయాల్లో దేవుడి వెండి, బంగారం ఆభరణాలకు బీమా చేయించాలన్నారు. ఆలయాలు, సంస్థలకు సంబంధించి భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా అన్యాక్రాంతమైతే సంబంధిత ఈవోలు వెంటనే నోటిసులు ఇచ్చి, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జ్యుయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ విళ్ల పళ్లంరాజు, దేవదాయశాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ దాసరి భారతి, జిల్లా దేవదాయశాఖాదికారులు కె.నాగేశ్వరరావు, ఈవీ సుబ్బారావు పాల్గొన్నారు. -
వీరేశ్వరా.. క్షమించవా..
● మురమళ్ల ఆలయంలో అపచారం ● అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం ● అభిషేకానికి ఉపయోగించే కొబ్బరి కాయలు పక్కదారి ఐ.పోలవరం: మురమళ్ల భఽధ్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి కొబ్బరి కాయలతో అభిషేకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. అధికారుల నిరక్ష్యంతో కొబ్బరికాయలు పక్కదారి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆలయంలో ప్రతి రోజూ రాత్రి జరిగే కల్యాణాలకు సంబంధించి ఉదయం అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అభిషేకానికి సంబంధించి ఒక టిక్కెట్టుకు రెండు కొబ్బరి కాయలు కేటాయిస్తారు. పండితులు వీటితో భక్తుల గోత్రనామాలతో స్వామికి, వినాయకునికి అభిషేకాలు చేస్తారు. ప్రతి నిత్యం సుమారు 116 కల్యాణాలు ఇక్కడ జరుగుతాయి. అంటే రోజుకు 232 కొబ్బరికాయలు కొట్టాలి. కానీ ఆలయంలో 15 రోజులకు సంబంధించి కేవలం ఒక్క రోజు మాత్రమే స్వామికి అభిషేకాల కొబ్బరి కాయలు కొట్టారు. మిగిలిన రోజులు స్వామికి ఎగనామం పెట్టేశారు. అభిషేకాలకు సంబంధించిన కొబ్బరి కాయలు ఎక్కడకు వెళ్లాయో తెలియదు. కొబ్బరి కాయల పక్కదారి స్వామివారి కల్యాణానికి రుసుము రూ.1,000 తీసుకుంటారు. భక్తుల నమ్మకాన్ని కొందరు అవినీతి పరులు సొమ్ము చేసుకొంటున్నారు. స్వామివారి అభిషేకానికి ఉపయోగించాల్సిన కొబ్బరి కాయలను పక్కదారి పట్టించి, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచార, సంప్రదాయాలను, పూజాది కార్యక్రమాలు తుంగలోకి తొక్కేస్తున్నారు. కొబ్బరి ధర హెచ్చును సాగుగా చూపుతూ కొబ్బరి నీళ్ల అభిషేకానికి స్వస్తి పలికేశారు. దీనిపై ఆగ్రహించిన కొందరు భక్తులు నేరుగా ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపొయింది. కొబ్బరి కాయల పాటదారునికి షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆయన తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే అభిషేకాలకు ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదాలకు రుచి, శుచి కరువైయ్యిందనే భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై సహాయ కమిషనర్ వి.సత్యనారాయణను వివరణ కోరగా కొబ్బరి కాయలు ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిందని, సంబంధిత పాటదారునికి నోటీసులు అందజేసి యథావిధిగా అభిషేకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తూ వివిధ సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పత్రాలను అందజేసినట్లు డీపీటీఓ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పది మందిని కండక్టర్ గ్రేడ్–2 ఉద్యోగం కోసం ఎంపిక చేసి, నియామక పత్రాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి
తుని: రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం, కుమ్మరికిమ్ముడుపల్లికి చెందిన బోనంగి నూకరాజు(50) తుని రైల్వే స్టేషన్లో రెండో నంబర్ ఫ్లాట్పారం నుంచి ఒకటో నంబరు ఫ్లాట్ఫారానికి వెళ్లడానికి పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే రైలు ఢీకొట్టింది. దీంతో నూకరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం శవాన్ని బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి కరప: ఇంట్లో వంట చేస్తుండగా విషసర్పం కాటువేయగా, కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లి గ్రామానికి చెందిన బోనంగి లోవతల్లి(31) ఈనెల 3వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో వంట చేస్తుండగా ఒక విషసర్పం కాటువేసింది. వెంటనే ఆమెను చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. మృతురాలు లోవతల్లి భర్త ప్రసాద్కు మధ్య గొడవలు జరిగి ఏడాది కాలంగా గురజనాపల్లిలో తల్లితో పాటు ఉంటోంది. ఆమెకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా 2 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆమె సోదరి రాచకొండ శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప ఎస్ఐ టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మోసానికి చిరునామా చంద్రబాబు
రాజమహేంద్రవరం రూరల్: మోసానికి చిరునామాగా చంద్రబాబు ప్రభుత్వం నిలిచిందని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా క్రీస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రెవ.విజయసారథి అన్నారు. సోమవారం కొంతమూరులోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ యోగాంధ్రా కార్యక్రమంలో పాల్గొనని తనకు పార్టిసిఫేషన్ సర్టిఫికెట్ పంపారన్నారు. అంతకంటే దారుణం ఏమిటంటే కాటవరం సెక్రటరియేట్, సీతానగరం మండలం అనే అడ్రస్సులో నివసిస్తున్నట్లుగా ఆ సర్టిఫికెట్లో తెలియజేశారన్నారు. గిన్నిస్బుక్ రికార్డుల కోసం మృతిచెందిన వారి పేరిట సైతం యోగాలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు జారీచేయడం, వారి పనితీరుకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. పేదవాడికి అందించాల్సిన ఏ ఒక్క స్కీమును అందించని సీ ఎం చంద్రబాబు, ఒక్కరోజు యోగా దినోత్సవం కోస ం రూ.300 కోట్లు ఖర్చు పెట్టడం దారుణం అన్నారు. -
అరుణాచల క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ
● అట్టహాసంగా 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠ ● హాజరైన ప్రముఖ ఆథ్యాత్మిక గురువులు, రాజకీయ నేతలు ప్రత్తిపాడు రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లిలో ఆంధ్ర అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన అపిత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఆధ్మాత్మికత వెల్లివిరిసింది. అరుణాచల మాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన 63 మంది నాయనార్ల ప్రతిష్ఠ మహోత్సవాన్ని తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానం అర్చకులు డాక్టర్ టి.అరుణాచల కార్తికేయ శివాచార్య వైభవంగా నిర్వహించారు. వీటితోపాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని జెట్టి శివకుమార్ దంపతులు, లక్ష్మీ హయగ్రీవుడు విగ్రహాన్ని శ్రీహరి రాజబాబు దంపతులు, సూర్యభగవానుడు విగ్రహాన్ని దంతులూరి సుభద్రరామరాజు దంపతులు, కాలబైరవుడు విగ్రహాన్ని గిరిధరరెడ్డి దంపతులు, గంగామాత విగ్రహాన్ని బలభద్రుడి సత్యనారాయణ దంపతుల ఆర్థిక సహాయంతో ప్రతిష్ఠించారు. అనంతరం కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం నుంచి సోమవారం వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగాణం మార్మోగింది. రాచపల్లి వెళ్లే ప్రధాన రహదారి భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తి మార్గమే శరణ్యం భక్తిమార్గమే అందరికీ శరణ్యమని తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని ధర్మపురి ఉత్తర పీఠాధిపతి సుక్కా స్వామిజీ అన్నారు. అరుణాచలక్షేత్రంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వేత్త అరుణాచల మాధవి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. తమిళనాడులో 5–10 శతాబ్దాల మధ్య కాలంలో నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లని చెప్పారు. వీరు భక్తి మార్గం ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు తెలిపారు. నాయనార్లలో రాజుల నుంచి మానవుల వరకు ఉన్నారని తెలిపారు. భగవంతుడిని చేరడానికి నిష్కలమషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదన్నారు. సభలో సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణాజిల్లా, పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీ, శ్రీరమణాసేవాశ్రమం వ్యవస్థాపకులు స్వామి రామానందతో పాటు పలువురు ఆథ్యాత్మిక వేత్తలు ప్రసంగించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోకల వంశీ నాగేంద్రమాధవ్, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్, ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రు, నిమ్మకాయల చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. ప్రత్తిపాడు ఎస్సై లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. -
ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు
● స్పోర్ట్సు అథారిటీ వైస్ చైర్మన్కు ఫిర్యాదు ● ఫెన్సింగ్ క్రీడాకారుడు గౌతమ్రాజ్ సామర్లకోట: సాఫ్ట్బాల్, ఫెన్సింగ్ స్పోర్ట్సు కోటా ద్వారా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక ప్రముఖ ఫెన్సింగ్ క్రీడాకారుడు ఎం గౌతమ్రాజ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం విజయవాడలో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైస్చైర్మన్కు వినతి పత్రం అందజేశానన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నీట్ పరీక్ష రాసే అభ్యర్థి పేరుపై మరోకరు టోర్నమెంట్లో పాల్గొంటున్నారన్నారు. దాంతో స్పోర్ట్సులో కనీస పరిజ్ఞానం లేనివారు స్పోర్ట్సు కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సంపాదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడల్లో ప్రాతినిధ్యం వహించని వారికి నకిలీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. సాఫ్ట్బాల్ ఆటకే పరిమితం కాకుండా ఫెన్సింగ్ ఆటలోనూ ఇదే విధంగా జరుగుతోందన్నారు. ఫెన్సింగ్ ఆటను ముసుగు ధరించి ఆడటం వలన ఎవరు ఆడుతున్నారో తెలియడం లేదన్నారు. దీనిని ఆసరాగా తీసుకొని దందా జరుగుతోందని చెప్పారు. విద్యార్ధులను క్రీడలలో ప్రాత్సహించవలసిన ఫెన్సింగ్ అసోసియేషన్ క్రీడాస్ఫూర్తిని అణగదొక్కుతోందన్నారు. దొడ్డిదారిలో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్న వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని గౌతమ్రాజ్ కోరారు. -
తమ్ముళ్ల కారు కూతలు!
● నడిరోడ్డుపై బయటపడ్డ వర్గ పోరు ● కారు అడ్డం వచ్చిందనే వంకతో దుర్భాషలు టాస్క్ఫోర్స్: టీడీపీ నేతల గ్రామాల పర్యటన కుమ్ములాట, తోపులాటలకు నిలయమైంది. వారి మధ్య వర్గపోరును బహిర్గతం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఎంపీ పురందేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కుమారుడు పెందుర్తి అభిరామ్ సోమవారం కాన్వాయ్లో బయలుదేరారు. రాజానగరం మండలం పాలచర్ల, కోరుకొండ మండలం గాడాల అనంతరం మునగాలకు బయలుదేరిన కాన్వాయ్లో మొదటి నుంచి వాహనాలు ఓవర్ టేక్ చేసుకోవడం వివాదానికి కారణమయ్యింది. అటు నుంచి పలు గ్రామాలకు కాన్వాయ్ వెళ్లింది. కోరుకొండ మండలం మునగాలలోని కార్యక్రమానికి వెళ్తుండగా పెందుర్తి కారుకు మరో వర్గం కారు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పెందుర్తి వర్గానికి చెందిన నాయకుడిని దుర్భాషలాడటంతో వివాదం తీవ్రతరమయ్యింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అరుపులు, కేకలతో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి ఉండడంతో రుడా చైర్మన్ పదవి పెందుర్తి అభిరామ్కు వస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అది అభిరామ్కు దక్కకపోవడంతో నాటి నుంచి వివాదాలు అంతర్గతంగా ఉన్నాయి. ఆ వివాదాలు మునగాల ఘటన ద్వారా బయట పడ్డాయి. కూటమిలోని ఇతర నాయకులు జోక్యం చేసుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. పార్టీలో ఆధిపత్య పోరు ఇలా నడిరోడ్డుపై దుర్భాష లాడటం వరకూ వెళ్లింది. కూటమిలోని పార్టీ నాయకులు, స్థానికులు, రైతుల్లో ఈ వ్యవహారం చర్చనీయాంఽశమైంది. -
సంక్షేమ మంత్రం.. ప్రగతి సంతకం
మహానేత వైఎస్సార్ ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచారు. 2004కు ముందు నాటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రూ.75 మాత్రమే వృద్ధాప్య పింఛను ఇచ్చేవారు. దీనిని వైఎస్సార్ ఒకేసారి రూ.200కు పెంచారు. దివ్యాంగ పింఛనును రూ.500కు పెంచిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. తన పాలనా కాలంలో ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు ఒక్కసారి కూడా పెంచకుండా ఆయన చర్యలు తీసుకున్నారు.నేల విడిచి సాము చేస్తూ.. హైటెక్ మాయాలోకంలో ముంచేస్తూ.. అదే అంతిమ లక్ష్యమనే భ్రమలు కల్పిస్తూ.. 70 శాతం ప్రజలు జీవిస్తున్న పల్లెలను విస్మరించేలా.. ప్రశ్నించిన వారిని అణచివేసేలా దుర్మార్గమైన పరిపాలన సాగిన రోజులవి. ఎటు చూసినా కరవు. ప్రభుత్వం నుంచి నయాపైసా సాయం ఉండేది కాదు. విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు గ్రామీణులకు అందని దుస్థితి. అంతటా ‘ప్రైవేటు’ తంత్రమే.. సంక్షేమ విస్మరణే. ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా సొమ్ము ఇచ్చుకోవాల్సిందే..అటువంటి దుర్భర పరిస్థితుల్లో.. అణగారిన జనం కోసం నేనున్నానంటూ ఆ మహనీయుడు భరోసా ఇచ్చారు. నిరుపేదల గుండెసడిగా.. కష్టజీవులకు కొండంత అండగా నిలిచారు.. పాతాళానికి పయనిస్తున్న రాజకీయ విలువలకు.. ప్రజలకు దూరమవుతున్న ప్రభుత్వ పాలనకు పగ్గాలు వేశారు. జనం బాటలోకి మళ్లించారు. పరిపాలనకు మానవత్వాన్ని జోడించారు. పండుటాకులకు పెద్ద కొడుకుగా.. రైతుజనబాంధవుడిగా.. అపర భగీరథుడిగా.. ఆరోగ్యశ్రీతో ఆరోగ్యప్రదాతగా.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో విద్యా ప్రదాతగా నిలిచారు. ‘అన్నా.. కష్టమొచ్చింది’ అంటూ ఎవరైనా వస్తే కరిగిపోతూ.. వారికి భరోసాగా నిలిచారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికీ పెద్ద పీట వేశారు. ఆ జనబాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లా ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముద్ర ఎప్పటికీ చెరగనిది. తన పరిపాలనా కాలం 2004–09 మధ్య ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూనే అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. విద్య, వైద్యం, పరిశ్రమలతో పాటు దేశానికి వెన్నుదన్నుగా నిలిచే వ్యవసాయ రంగాన్ని అగ్రభాగంలో నిలిపేందుకు అవిశ్రాంత కృషి చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మండు వేసవిని సైతం లెక్క చేయకుండా సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. నాడు స్వయంగా గుర్తించిన సమస్యలకు అధికారంలోకి వచ్చాక శాశ్వత పరిష్కారం చూపారు. ఆ మహానేత నేడు భౌతికంగా లేకపోయినా.. ఆయన సేవలను జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.అభివృద్ధి జాడలివిగో..● విజయవాడ – విశాఖపట్నం మధ్య దూరాన్ని తగ్గించేందుకు.. ఈ నగరాల మధ్య రాకపోకలు మరింత వేగవంతమయ్యేందుకు.. వైఎస్సార్ హయాంలో 2006లో రూ.800 కోట్లతో గోదావరి నదిపై నాలుగు వరుసల్లో గామన్ బ్రిడ్జి, అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. 14 కిలోమీటర్ల మేర అప్రోచ్ రోడ్డు, 4.5 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంతో విశాఖ – విజయవాడ మధ్య దూరం సుమారు 40 కిలోమీటర్లు తగ్గింది.● అత్యధిక అనుంబంధ కళాశాలలతో రాష్ట్రంలోనే అతి పెద్దదిగా ఎదిగిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో శంకుస్థాపన చేశారు. నాడు ఆయన శ్రీకారం చుట్టిన ఈ విశ్వవిద్యాలయం నేడు వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తోంది.● రాజమహేంద్రవరం నగరంలోని మురుగు నీటిని నేరుగా కాకుండా శుద్ధి చేసి గోదావరిలోకి వదిలేందుకు హుకుంపేట పంచాయతీ పరిధిలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం చేపట్టారు.● నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన నేషనల్ అకడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (న్యాక్) భవనం నిర్మాణాన్ని సుమారు రూ.22 కోట్లతో వైఎస్ హయాంలోనే చేపట్టారు. ప్రస్తుతం ఆ భవనమే జిల్లా కలెక్టరేట్గా సైతం సేవలందిస్తూండటం విశేషం.● నిడదవోలు పట్టణానికి 2005లో వచ్చిన నాటి సీఎం వైఎస్సార్ సుమారు రూ.కోటితో రోడ్లు, డ్రై న్ల నిర్మాణం చేపట్టారు. మరో రూ.కోటితో సెంట్రల్ విద్యుత్ లైటింగ్, విద్యానగర్లో రూ.10 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. బాలాజీ నగర్లో రూ.1.64 కోట్లతో నిర్మించిన 500 కిలోలీటర్ల మంచినీటి రిజర్వాయర్కు శంకుస్థాపన చేశారు. పేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిమ్మ ఇళ్ల పథకంలో భాగంగా 28వ వార్డు శివారున 832 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించారు. రూ.70 లక్షలతో నూతన మునిసిపల్ కార్యాలయం నిర్మించారు.రైతు బాంధవుడిగా..వ్యవసాయం దండగ అని పేర్కొంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఫలితంగా రైతులు తీవ్రంగా చితికిపోయారు. ఆ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు సానుకూల విధానాల ద్వారా వ్యవసాయాన్ని తిరిగి పండగ చేశారు. అన్నదాతలకు మేలు చేసేలా ఎన్నో పనులు, పథకాలు చేపట్టారు. పావలా వడ్డీ రుణాలు, రుణమాఫీతో వెన్నుదన్నుగా నిలిచారు. కాడి వదిలిన కర్షకుడు మళ్లీ కాడి పట్టేలా చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.● బ్రాహ్మణగూడెంలో రూ.2.73 కోట్లు పైగా వెచ్చించి 1,200 ఎకరాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. తద్వారా 600 ఎకరాల్లో ముంపు సమస్యకు పరిష్కారం చూపారు.● తాళ్లపూడి మండలంలో 4,950 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.8.59 కోట్లతో పైడిమెట్ల ఎత్తిపోతల పథకం నిర్మించారు.● రూ.3.60 కోట్లు పైగా వ్యయంతో చాగల్లులో ఎత్తిపోతల పథకం నిర్మించారు.● 16 మండలాల్లో 2,06,600 ఎకరాలకు సాగునీరు అందించే తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని తాళ్లపూడి మండలంలో సుమారు రూ.500 కోట్లతో చేపట్టారు.● కొవ్వాడ కాలువ వరద ముంపు నివారణకు రూ.56 కోట్లతో అవుట్ఫాల్ స్లూయిజ్ నిర్మించారు. దీనివలన కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల పరిధిలోని 15 వేల ఎకరాలకు వరద ముంపు సమస్య తీరింది.● పోలవరం ప్రాజెక్టులో ఎక్కువ పనులను వైఎస్సార్ హయాంలోనే పూర్తి చేశారు. కేంద్రం నుంచి అన్ని రకాల అనుమతులూ తీసుకువచ్చారు. కుడి, ఎడమ ప్రధాన కాలువలు తవ్వించారు.● మెట్ట రైతులకు మేలు చేయాలనే తలంపుతో గోదావరి నదిపై తాడిపూడి సమీపాన చింతపూడి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. తద్వారా కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు కృషి చేశారు.● రూ.15.26 కోట్లతో కొవ్వూరు, తాళ్లపూడి, దేవరపల్లి మండలాల్లోని 4,950 ఎకరాలకు సాగునీరు అందించే ఆరికిరేవుల ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.● కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని రూ.1.75 కోట్లతో పునరుద్ధరించారు.● వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత వైఎస్సార్కే దక్కుతుంది. దీని ద్వారా మెట్ట ప్రాంత రైతులకు ఎంతో మేలు జరిగింది. నీరు పుష్కలంగా లభించడంతో రైతులు ఇబ్బడిముబ్బడిగా పంటలు పండించారు. దీంతో వ్యవసాయ దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. దేశవిదేశాల్లో ఎంతో పేరొందిన కడియం నర్సరీలకు కూడా ఉచిత విద్యుత్ సరఫరా అందించారు.నీటి విలువ తెలిసిన నేత వైఎస్సార్దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాం స్వర్ణయుగం. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించారు. రైతుబాంధవుడిగా ఖ్యాతి గడించారు. సర్ ఆర్థర్ కాటన్ అనంతరం నీటి విలువ తెలిసిన నేతగా వైఎస్సార్ ఖ్యాతి గడించారు. ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేసిన నేత ఆయన. మెట్ట రైతులకు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందించిన మహనీయుడు. ఆరోగ్యశ్రీతో ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. అంతటి మహానేత జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణుల ఆధ్వర్యాన భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాం. కొవ్వూరులో భారీ రక్తదాన శిబిరం నిర్వహిస్తాం.– చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడురోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిపై పాదయాత్రడాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర దేశ, రాష్ట్ర రాజకీయాలను పెను మలుపు తిప్పింది. నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పాదయాత్ర రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. ఆ సమయంలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో వైఎస్సార్ కొంతమూరు వద్ద అస్వస్థతకు గురయ్యారు. అక్కడే అరగంట పాటు విశ్రాంతి తీసుకుని తిరిగి యాత్ర కొనసాగించారు. అనంతరం మధురపూడిలోని విమానాశ్రయం ఎదురుగా ఉన్న తోటలో ఆరు రోజుల పాటు వైద్య సేవలు పొందారు. ఆ సందర్భంగా నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలువురు ప్రముఖ నాయకులు ఆయనను కలుసుకున్నారు. -
రత్నగిరిపై కొనసాగుతున్న భక్తుల అసంతృప్తి
అన్నవరం: సత్యదేవుని సన్నిధికి వస్తున్న భక్తుల్లో ఇంకా అసంతృప్తి కొనసాగుతున్నట్లు గత నెలలో ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. అయితే, మే నెలలో దాదాపు 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి అది 25 శాతానికి పరిమితమైంది. మే 26 నుంచి జూన్ 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో భక్తులకు అందుతున్న సేవలపై ప్రభుత్వం సర్వే నిర్వహించింది. అన్నవరం దేవస్థానానికి వచ్చేసరికి సత్యదేవుని దర్శనం విషయంలో మే నెలలో 68 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా జూన్ నెలలో అది 73 శాతానికి పెరిగింది. మౌలిక వసతుల కల్పనలో మే నెలలో 61 శాతం మంది, జూన్లో 66 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై మే నెలలో 78 శాతం మంది సంతృప్తి చెందగా జూన్లో అది 77 శాతంగా నమోదైంది. పారిశుధ్య నిర్వహణకు సంబంధించి మే నెలలో 64 శాతం, జూన్లో 70 శాతం మంది సంతృప్తి చెందారు. -
పొగాకు.. గిట్టుబాటలో..
దేవరపల్లి: రెండు వారాలుగా పొగాకు మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. నానాటికీ ధర పెరుగుతూండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెల 24వ తేదీ వరకూ మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర లభించక దిగాలు పడిన రైతులు ప్రస్తుత ధర చూసి కొంత వరకూ ఊపిరి పీల్చుకున్నారు. కిలో గరిష్ట ధర రోజురోజుకూ పెరుగుతూండటంతో పాటు లో గ్రేడు తప్ప మిగిలిన గ్రేడుల పొగాకు అమ్ముడుపోతోంది. లో గ్రేడు పొగాకులో కూడా నాణ్యమైన సరకును కొనుగోలు చేస్తున్నారు. బ్రైట్, మీడియం గ్రేడు పొగాకు ఎక్కువగా అమ్ముడు పోతోంది. ఈ రెండు గ్రేడుల పొగాకుకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడటంతో కొనుగోలుదారులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని అధికారులు అంటున్నారు. గత నెల 24వ తేదీ వరకూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.290 పలకగా, అనంతరం అంచెలంచెలుగా పెరుగుతూ సోమవారం ఏకంగా రూ.336కు చేరింది. రెండు వారాల వ్యవధిలో కిలో గరిష్ట ధర రూ.46 పెరిగింది. కిలో కనిష్ట ధర రూ.220, సగటు ధర రూ.275.45 చొప్పున లభించినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ అంతర్జాతీయ మార్కెట్లో మన పొగాకుకు డిమాండ్ ఏర్పడింది. ట్రేడర్లు మొన్నటి వరకూ వేలం కేంద్రాల్లో మొక్కుబడిగా పొగాకు కొనుగోలు చేసేవారు. అటువంటిది విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు ఖరారు కావడంతో మార్కెట్లో కొనుగోలుదారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ధర పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రతి రోజూ కిలో గరిష్ట ధర రూ.15 నుంచి రూ.20 వరకూ పెరుగుతోంది. పెరుగుతున్న బేళ్లు ధర పెరగడంతో వేలం కేంద్రాలకు తీసుకు వస్తున్న బేళ్ల సంఖ్య కూడా పెరిగింది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్లోని ఐదు వేలం కేంద్రాలకు ప్రతి రోజూ 5 వేలకు పైగా బేళ్లు వస్తున్నాయి. సోమవారం దేవరపల్లి వేలం కేంద్రానికి 796, జంగారెడ్డిగూడెం–1కు 1,410, జంగారెడ్డిగూడెం–2కు 1,311, కొయ్యలగూడేనికి 1,146, గోపాలపురం వేలం కేంద్రానికి 829 చొప్పున బేళ్లు అమ్మకానికి వచ్చాయి. మొత్తం 5,492 బేళ్లు అమ్మకానికి రాగా, ట్రేడర్లు 4,118 బేళ్లు కొనుగోలు చేశారు. ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.734.90 కోట్ల విలువైన 26.68 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. రైతులకు అనుకూలంగా మార్కెట్ పొగాకు మార్కెట్ రైతులకు అనుకూలంగా కొనసాగుతోంది. దీనిని అందిపుచ్చుకుని రైతులు పంటను అమ్ముకోవాలి. నికోటిన్ శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన గ్రేడు పొగాకు మార్కెట్కు రావడంతో ట్రేడర్లు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. ఉన్నంత వరకూ రైతులు త్వరితగతిన పంటను అమ్ముకోవాలి. అన్ని రకాల గ్రేడులూ అమ్ముడుపోతున్నాయి. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్, రాజమహేంద్రవరం వేలం కేంద్రాల వారీగా పొగాకు విక్రయాలు (మిలియన్ కిలోలు) దేవరపల్లి 4.31 జంగారెడ్డిగూడెం–1 6.28 జంగారెడ్డిగూడెం–2 5.83 కొయ్యలగూడెం 5.17 గోపాలపురం 5.07 పరుగులు పెడుతున్న మార్కెట్ కొనుగోలుకు పోటీ పడుతున్న ట్రేడర్లు రూ.336 పలికిన కిలో గరిష్ట ధర సగటు ధర రూ.275.47కు చేరిక -
ఎరువుల కొరత లేదు
జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో ప్రస్తుతం ఎటువంటి ఎరువుల కొరతా లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ అన్ని రకాలూ కలిపి జిల్లా వ్యాప్తంగా 35,869 టన్నుల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615, పొటాష్ 2,918, సూపర్ 6,324, కాంప్లెక్స్ ఎరువులు 8,716 టన్నులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 83 వేల ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ 27,950 ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారని తెలిపారు. రైతులు అవసరం మేరకే ఎరువులు కొనుగోలు చేయాలని మాధవరావు సూచించారు. నేడు ‘దిశ’ సమావేశం రాజమహేంద్రవరం సిటీ: జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్, ఇన్చార్జి కమిషనర్ పి.ప్రశాంతి సోమవారం ఈ విషయం తెలిపారు. శాఖల వారీగా అమలు చేస్తున్న పథకాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ వివరించారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 35 అర్జీలుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 35 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ స్వయంగా అర్జీలు స్వీకరించి, వారి సమస్య అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఏఎస్పీలు ఎంబీఎం మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 216 అర్జీలు రాజమహేంద్రవరం సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 216 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్జీల పరిష్కారంలో లోపాలకు తావు ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్జీదారుల స్పందన నిరంతరం తీసుకుంటున్నారన్నారు. అధికారులు సరిగ్గా మాట్లాడుతున్నారా, బెదిరించారా, లంచాలు అడుగుతున్నారా, ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారా అనే అంశాలపై దృష్టి సారిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ సీతారామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. లండన్ సీఎంఏ సమావేశానికి ఆహ్వానం అమలాపురం టౌన్: ప్రపంచంలో 56 దేశాల సభ్యత్వం కలిగిన కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్ (సీఎంఏ) ఆధ్వర్యంలో ఈ నెల 18న లండన్లో జరగనున్న సర్వసభ్య సమావేశానికి భారతదేశం నుంచి అమలాపురానికి చెందిన సీఎంఏ సభ్యుడు డాక్టర్ పీఎస్ శర్మ హాజరవుతున్నారు. ఈ మేరకు సీఎంఏ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది. స్థానిక ప్రెస్క్లబ్ భవనంలో డాక్టర్ శర్మ సోమవారం విలేకర్ల సమావేశంలో ఈ విషయం వివరించారు. సీఎంఏ అనుబంధ స్టాప్ టీబీ ఇనిషియేటివ్ సబ్ కమిటీ సభ్యుడిగా తాను నియమితులైన సంగతిని కూడా డాక్టర్ శర్మ తెలిపారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డ చనిపోయాడని ఆందోళన
ఐ.పోలవరం: వైద్యుల నిర్లక్ష్యంతో తమ బిడ్డను కోల్పోయామని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పెదమడి గ్రామానికి చెందిన గర్భిణి ధరణికి పురిటి నొప్పులు రావడంతో శనివారం టి.కొత్తపల్లి సీహెచ్సీలో చేర్చించారు. ఆదివారం ఉదయం ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేయగా, పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సాయంత్రం బిడ్డకు అనారోగ్యంగా ఉందని బంధువులు గుర్తించడంతో బిడ్డ పరిస్థితిపై వైద్యులను నిలదీశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ బిడ్డకు మెరుగైన వైద్యం చేయించాలని సూచించగా, అమలాపురం కిమ్స్కు తీసుకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. మార్గ మధ్యంలో శిశువు మృతి చెందడంతో స్థానిక వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయినట్లు, తమకు న్యాయం చేయాలని జనం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎస్సై రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళకారులతో చర్చలు జరిపారు. దీనిపై విచారణ జరిపి తగు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. గుర్తు తెలియని వృద్ధుడి మృతి కాకినాడ రూరల్: కాకినాడ జీజీహెచ్లో గుర్తుతెలియని వృద్ధుడు (75) మృతి చెందాడు. గత నెల 30న మధ్యాహ్నం కాకినాడ ఆర్టీఓ ఆఫీసు రోడ్డులో కోటయ్య కన్వెన్షన్ వద్ద మాటలేకుండా పడిపోయి ఉండడంతో స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా జీజీహెచ్కు తరలించారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చరీలో భద్రపరిచారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడిని గుర్తిస్తే సర్పవరం పోలీసు స్టేషన్ నంబర్ 0884 2379284, సెల్ నంబర్ 94407 96554కు సమాచారం ఇవ్వాలని సీఐ పెద్దిరాజు కోరారు. -
మధ్యాహ్న భోజనంలో బల్లి
గండేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకంలో పర్యవేక్షణ పక్కదారి పడుతోంది. రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందజేయడంలో అలసత్వం ఆవరిస్తుంది. మధ్యాహ్న భోజన పథకంలో వండిన కూరలో బల్లి అవశేషాలు ఉండడం, అది విద్యార్థుల కంచాల్లో వేశారనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని తల్లిదండ్రులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఘటన మల్లేపల్లి జెడ్పీ స్కూల్లో జరిగింది. ఇక్కడ సుబ్బయమ్మపేట, ఉప్పలపాడు, మల్లేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మంది చదువుతున్నారు. గత నెల 23న మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వండిన కూరలో బల్లి పడిన విషయాన్ని గుర్తించిన విద్యార్థులు ఉపాధ్యాయులు, నిర్వాహకులకు తెలియజేశారు. దీంతో ఆ కూరను ఉపయోగించకుండా మరో కూరను వండి వడ్డించినట్టు ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే అప్పటికే విద్యార్థులకు అన్నం, కూర వడ్డించిన కంచాల్లో బల్లి అవశేషాలు కనిపించడంతో తినకుండా నిలుపుదల చేసినప్పటికీ కొందరు రెండు, మూడు ముద్దలు తిన్నారని విద్యార్థులు చెబుతున్నారు. ఉడకని అన్నం, పప్పు, నీళ్లను తలపించే విధంగా సాంబారును వడ్డిస్తున్నారని, తమకు పెట్టాల్సిన కోడిగుడ్లను పెట్టడం లేదని వాపోతున్నారు. భోజనంలో నాణ్యత లేక ఇంటి నుంచే తెచ్చుకుంటున్నామని మరికొందరు విద్యార్థులు చెబుతున్నారు. బల్లి పడిన కూరను తింటే పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై స్కూల్ హెచ్ఎం అన్నపూర్ణ, ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లగా బల్లి పడిన వెంటనే తీయించేశామని చెప్పారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన గోప్యంగా ఉంచిన నిర్వాహకులు -
వెజిట్రబుల్స్
ఆలమూరు: ఏం కొంటాం.. ఏం తింటాం.. అనేట్టుంది కూరగాయల పరిస్థితి. వీటి ధర అంతకంతకూ పెరుగుతోంది. ఉల్లిని కొంటేనే కన్నీరు వస్తోంది. పచ్చిమిర్చికి ఘాటు ఎక్కువైంది. వాతావరణ మార్పులు, దిగుబడి తగ్గడంతో కూరగాయల ధర రోజురోజుకూ పెరిగిపోతుంది.ఽ బహిరంగ మార్కెట్లో ఇప్పటి వరకూ సరైన ధర లేక ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ధరలు పెరుగుతున్నా దిగుబడి లేక దిగాలు చెందుతున్నాయి. రిటైల్ మార్కెట్లో గత నెలతో పోలిస్తే ఈ వారంలో కూరగాయల ధరలు రెట్టింపయ్యాయి. గోదావరిలో వరద ఉధృతి పెరిగినా, వర్షాలు కురిసినా ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ నిలకడగా ఉన్న నాణ్యమైన ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో రూ.40కు చేరుకుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడం వల్ల దిగుబడి క్రమేపీ తగ్గిపోయినందువల్లే ప్రస్తుత ధరల పెరుగుదలకు కారణమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పంట తుది దశకు చేరుకోవడంతో.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని చాగల్నాడు, మెట్ట, లంక పరివాహక ప్రాంతాల్లో సుమారు 38 వేల ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలల నుంచి కూరగాయల దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో ఉద్యాన రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో టమోటా, కొత్తిమీర, వంకాయ, దొండకాయ ధరలు కిలో రూ.పదికి పడిపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. అయితే కూరగాయల సాగు ప్రస్తుతం తుది దశకు చేరుకోవడంతో దిగుబడులు తగ్గిపోతుండటంతో డిమాండ్ పెరిగి, ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోని మడికి, రావులపాలెం, అమలాపురం, పిఠాపురం, రాజమహేంద్రవరం, కాకినాడ తదితర హోల్సేల్ మార్కెట్లకు గత వారం రోజుల నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గిపోవడం ధరల పెరుగుదలకు కారణమవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. వరద పెరిగినా.. వర్షం పడినా.. గోదావరికి ఈ నెలాఖరు నాటికి పూర్తి స్థాయిలో వరదల వచ్చే అవకాశం ఉంది. దీంతో లంకల్లో సాగు చేసే పంట పూర్తిగా తగ్గిపోతుంది. అదే క్రమంలో వర్షాలతో మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లోని పంట దిగుబడి అరకొరగా ఉండే అవకాశం ఉంది. దీంతో కూరగాయలను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉత్పన్నమైతే ధర మరింత పెరిగే అవకాశం ఉంది. లంక పరివాహక ప్రాంత రైతులు మళ్లీ వరదలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన అక్టోబర్ నెల తరువాత గాని కూరగాయల సాగు చేపట్టే అవకాశం లేదు. దిగుబడి కోసం మరో మూడు నెలల వేచి ఉండాలి. దీంతో పెరుగుతున్న కూరగాయల ధరలు రాబోయే సంక్రాంతి వరకూ ఆకాశానికి ఎగబాకి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకూ కిలో రూ.10 నుంచి రూ.20 వరకూ పలికిన పలు కూరగాయల ధరలు ప్రస్తుతం రూ.50కి దాటాయి. అలాగే చిక్కుళ్లు, ఆకాకర, అల్లం ధరలు కిలో రూ.100కు పైగా వరకూ విక్రయిస్తున్నారు. కొత్తిమీర సాగు పూర్తి కావడంతో బెంగళూరు నుంచి దిగుమతి చేసుకోవడం వల్ల కిలో రూ.150 పలుకుతుంది. దీంతో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర తదితర ఆకుకూరలకు డిమాండ్ పెరగడంతో, వాటి ధరలు పెరుగుతున్నాయి.కూరగాయలు గతం ప్రస్తుతం కిలో రూ. ధర ఉల్లి 25 50 పచ్చిమిర్చి 20 70 అల్లం 70 120 బంగాళదుంప 20 35 వంకాయలు 20 60 బెండకాయలు 20 50 బీట్రూట్ 30 50 క్యాబేజీ 20 50 చిక్కుడు 80 120 అరటికాయ 05 10 కాలీఫ్లవర్ 25 50 దొండకాయలు 25 40 టమోటా 25 60 బీరకాయ 30 60 గోరుచిక్కుళ్లు 25 40 ఆనబకాయ 10 20 కాకరకాయ 25 60 కంద దుంప 40 60 పెండలం దుంప 35 50 బీన్స్ 60 80 కొత్తిమీర 70 150 క్యాప్సికం 40 60 ఆకాకర 70 120ఒక్కసారిగా పెరగడంతో... కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరల పెరుగుదలకు కారణమైంది. ఇప్పటి వరకూ బహిరంగ మార్కెట్లో స్థిరంగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరుగుపోతుండడంతో ఆ ప్రభావం రిటైల్ వ్యాపారంపై పడింది. పెరుగుతున్న ధరలతో కూరగాయల వ్యాపారం లాభసాటిగా ఉండటం లేదు. – చిన్నం రాజు, రిటైల్ కూరగాయల వ్యాపారి, ఆలమూరు సరకు కొరత ఏర్పడింది లంక, మెట్ట, చాగల్నాడు ప్రాంతాల్లో కూరగాయల దిగుబడి ఒకేసారి తగ్గిపోవడంతో ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇదే క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా సరకు కొరత ఏర్పడింది. దీంతో డిమాండ్కు సరఫరాలో భారీ వ్యత్యాసం ఉండడంతో కూరగాయల ధరల పెరుగుదలకు కారణమైంది. – చెల్లుబోయిన సింహాచలం, హోల్సేల్ కూరగాయల వ్యాపారి, మడికి కొనుగోలు చేయలేకపోతున్నాం.. పెరిగిన ధరలతో కూరగాయలను కొనుగోలు చేయలేకపోతున్నాం. వర్షాలతో కూరగాయల ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తుంది. అలాగే రైతు బజార్లలో కూడా అన్ని కూరగాయలు అందుబాటులో ఉండటం లేదు. – కె.నాగమణి, గృహిణి, పెదపళ్ల వంటింట్లో ధరల మంట పంట దిగుబడి తగ్గడమే కారణం వినియోగదారులపై పెను భారం -
భజే విఘ్ననాయకా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయం తొలి ఏకాదశి పర్వదినం, ఆదివారం సందర్భంగా రద్దీగా మారింది. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 119 మంది, స్వామి పంచామృతాభిషేకాల్లో ఇద్దరు దంపతులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి హోమంలో 37 జంటలు, స్వామివారికి 17 మంది భక్తులు ఉండాళ్ల పూజ, ఏడుగురు చిన్నారులకు అక్షరాభ్యాసం, పది మంది చిన్నారులకు తులాభారం నిర్వహించారు. 29 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 3,689 మంది స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఆలయానికి రూ.4,49,089 ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
పిచ్చికుక్కల స్వైరవిహారం
కాట్రేనికోన/ అమలాపురం టౌన్: పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కనిపించిన వారిపై దాడికి దిగాయి. ఈ ఘటనలు అమలాపురం, కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. ఆదివారం పల్లం గ్రామంలో పిచ్చికుక్క దాడి చేయడంతో సుమారు 18 మంది గాయపడ్డారు. అక్కడ చేపల మార్కెట్ జరుగుతున్న సమయంలో మహిళలతో పాటు అధిక సంఖ్యలో వ్యాపారులు ఉండటంతో బెంబేలెత్తిపోయారు. బాధితులకు కాట్రేనికోన పీహెచ్సీ వైద్యురాలు నీలిమ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే అమలాపురం కంసానికాలనీలో అదే ప్రాంతానికి చెందిన కుంచే శాన్విశ్రీ (9)పై వీధి కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలికతో పాటు మరో వ్యక్తిని ఆ కుక్క కరిచింది. ఈ బాధితులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. శాన్విశ్రీ కాళ్లు, నడుం, చేతులపై కుక్క కరవడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 19 మందికి గాయాలు అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స -
తైక్వాండో క్రీడాకారులకు అభినందన
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తాడిపత్రిలో ఇటీవల జరిగిన జాతీయ, రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఆదివారం కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ స్కూల్లో జరిగింది. దీనికి డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమానికి జిల్లా తైక్వాండో సంఘ కార్యదర్శి, కోచ్ బి.అర్జునరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో 11వ సారి ఓవరాల్ చాంపియన్ షిప్ను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారులు సాధించారన్నారు. హరిద్వార్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో 12 పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణం అన్నారు. తైక్వాండో కోచ్ అర్జునరావు మాట్లాడుతూ స్టేట్ మీట్లో 38 బంగారు, 12 రజత, 17 కాంస్య పతకాలు తూర్పు క్రీడాకారులు కై వసం చేసుకున్నారని తెలిపారు. జీజీహెచ్ వైద్యులు ప్రవీణ, అసోసియేషన్ సభ్యులు సత్యనారాయణ, తులసి, రత్నం, అఖిల, కేవీ సత్యనారాయణ, తేజ, అరుణ, ప్రసన్న పాల్గొన్నారు. కామనగరువులో అగ్ని ప్రమాదంఅమలాపురం రూరల్: కామనగరువు గ్రామ పరిధి జంగంపాలెంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. తొలిత వాసంశెట్టి మంగతాయారు ఇంటి నుంచి రేగిన నిప్పు రవ్వల కారణంగా దొంగ నాగలక్ష్మి, కుంచే వెంకటేశ్వరరావు, కుంచే శాంతమ్మ కుటుంబాలకు చెందిన తాటాకిళ్లు కాలి బూడిదయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక అధికారి ఎం.రాజా అధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో వివిధ ధ్రువీకరణ పత్రాలు, వడ్రంగికి సంబంధించిన ఫర్నీచర్, నగదు, 30 కొబ్బరి చెట్లు, వివిధ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. సర్పంచ్ నక్కా అరుణకుమారి చంద్రశేఖర్ దంపతులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. బాధితులకు ప్రభుత్వ పరంగా బియ్యం, పంచదార అందజేశారు. రైలు ఢీకొని వ్యక్తి మృతితుని: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానిక జీఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రేగుపాలెం – నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (50) పట్టలు దాటుతుండగా, రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తెలుపు చొక్కా, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని తుని మార్చురీలో భద్రపరిచారు. వివరాలకు 94906 19020 ఫోన్ నంబరులో సంప్రదించాలని ఎస్సై తెలిపారు. -
లాలిస్తూ.. బుజ్జగిస్తూ..
పెంచిన బంధం పెనవేసుకుంది.. పెంపుడు జంతువులంటే ఎనలేని ప్రేమ కనిపించింది.. లాలిస్తూ, బుజ్జగిస్తూ వాటికి యజమానులు టీకాలు వేయించారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు వేశారు. ఆదివారం రాజమహేంద్రవరం ఏరియా పశు వైద్యశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ తమ పెంపుడు శునకాలు, పిల్లులు, కోళ్లకు యజమానులు దగ్గరుండి మరీ టీకాలు వేయించారు. అలాగే ఇక్కడకు పాములను సైతం తీసుకురావడం గమనార్హం. శునకాలను అల్లారు ముద్దుగా చూసుకున్నారు. అవి సైతం యజమానులపై ఎంతో ప్రేమ చూపుతూ.. విధేయతతో మెలిగాయి. – ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్)/ సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
కలల తీరం చేరాలిలా..
ఏపీ ఈఏపీ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు కాకినాడ 6,343 కోనసీమ 2,868 తూర్పు గోదావరి 6,011 మొత్తం 15,222 బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంచుకున్న లక్ష్యం గొప్పదే కావచ్చు.. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకునే దారిపై కూడా అవగాహన ఉండాలి. ఆ ప్రయాణంలో సానుకూల అంశాలు.. అవరోధాల వంటి వాటిని ముందే తెలుసుకుంటే.. అడుగు ముందుకు ఎలా వేయాలో అర్థమవుతుంది. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి.. ఏపీ ఈఏపీ సెట్లో మంచి ర్యాంకులు సాధించి.. ఇంజినీరింగ్ చదివి బంగారు భవిష్యత్తును అందుకోవాలనుకునే విద్యార్థులకు.. ఆ మార్గంలో తొలి అడుగు వేసే తరుణం వచ్చేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ విడుదల చేసింది. గత ఏడాది ఇంజినీరింగ్ కోర్సులకు అడ్మిషన్ షెడ్యూల్ను జూలై 1న ప్రారంభించగా ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. కౌన్సెలింగ్ సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ నెల 23 నుంచి కళాశాలల్లో చేరాలి. దీంతో, ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్లకు హడావుడి మొదలైంది. ఇప్పటికే ఏ కోర్సు చదవాలి, ఏ కళాశాలలో చేరాలి తదితర అంశాలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు క్షుణ్ణంగా పరిశీలించుకున్నారు. కౌన్సెలింగ్లో తాము ఎంచుకున్న కళాశాలకు ఆప్షన్ ఇవ్వడంపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చారు. వెబ్ ఆప్షన్ల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని విద్యానిపుణులు సూచిస్తున్నారు. అందుబాటులోకి కొత్త కోర్సులు ఇంజినీరింగ్లో ఈసీఈ, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, సివిల్ వంటి సంప్రదాయ కోర్సులతో పాటు కొత్తవి కూడా అందుబాటులోకి వచ్చాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రొబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చరల్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్లు వచ్చాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఇలా.. ఆన్లైన్ కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు cets.apsche.ap.gov.in&25 వెబ్సైట్లో అడ్మిషన్పై క్లిక్ చేయాలి. అనంతరం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో రిజిస్ట్రేషన్ ఫామ్లోకి ప్రవేశించాలి. అక్కడ అడిగిన సమాచారం పూర్తిగా నింపి. సబ్మిట్ కొట్టాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్ మార్కుల జాబితాలు, 6 నుంచి ఇంటర్ వరకూ స్టడీ, టీసీతో పాటు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, రేషన్ కార్డులను అప్లోడ్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రం ఉన్న వారికి గత ప్రభుత్వం 2022 నుంచి 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తోంది. అర్హత ఉన్న ప్రతి విద్యార్థీ దీనిని వినియోగించుకోవాలి. స్వయంగా చూసుకోవడం మేలు వెబ్ కౌన్సెలింగ్ సందర్భంగా రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఆన్లైన్ ఫీజు చెల్లింపు, కళాశాల, కోర్సు ఎంపిక వంటివి ఎంపిక చేసుకునే సమయంలో ఎవరికి వారే స్వయంగా దగ్గరుండి చూసుకోవాలి. ఎవరైనా స్నేహితుల ద్వారానో మరొకరితోనో ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేయిస్తే అనేక తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రైవేటు కళాశాలల సిబ్బంది విద్యార్థి అభీష్టం మేరకు కళాశాల ఆప్షన్, కోర్సు వారే ఎంపిక చేస్తున్నారు. అయినప్పటికీ విద్యార్థి అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. మొదటి కౌన్సెలింగ్ దశ చాలా కీలకం. కాబట్టి విద్యార్థులు తమ ర్యాంకును బట్టి మంచి కళాశాలను ఎంపిక చేసుకుని అడ్మిషన్ పొందాలి. వెబ్ కౌన్సెలింగ్ విద్యార్థి స్వీయ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి అతనే పూర్తి బాధ్యుడు అవుతాడు. – ఎన్.రామకృష్ణయ్య, సీఎస్ఈ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకోవాలి విద్యార్థులు కళాశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆసక్తి ఉన్న బ్రాంచ్నే ఎంచుకుని, అందులో ప్రతిభ చూపాలి. ముఖ్యంగా ఒకే కోర్సుకు డిమాండ్ అనే భావన నుంచి బయట పడి, ఏ కోర్సుకు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులో వాటికి ఉన్న డిమాండ్ తదితర అంశాలపై విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకుకోవాలి. అందుకు తగిన బ్రాంచ్ ఎంచుకోవాలి. ఒకే కోర్సులో అందరూ చేరడం ఏమాత్రం సరి కాదు. ఇటీవల సాఫ్ట్వేర్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తద్వారా సీఎస్ఈ కోర్సు ఒక్కటే ప్రాధాన్యము కాదనేది గుర్తించాలి. అభివృద్ధి అనేది కేవలం ఒక్క రంగంతోనే సాధ్యపడదు. ఆన్లైన్ కౌన్సెలింగ్కు కావలసిన అన్ని పత్రాలూ సరి చూసుకోవాలి. – డాక్టర్ ఎ.గోపాలకృష్ణ, మెకానికల్ ప్రొఫెసర్, జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాల నేటి నుంచి ఈఏపీ సెట్ వెబ్ కౌన్సెలింగ్ కాకినాడలో 2 హెల్ప్ లైన్ కేంద్రాలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న విద్యావేత్తలు -
మడిలో.. సందడి
జిల్లాలో ఖరీఫ్ వరి సాగు వివరాలు (హెక్టార్లలో) సాధారణ సాగు విస్తీర్ణం 76,941నారుమడుల లక్ష్యం 3,847ఇప్పటి వరకూ వేసిన నారుమడులు 2,122ఇంకా వేయాల్సిన విస్తీర్ణం 1,725నాట్లు వేసిన విస్తీర్ణం 1,339 ● జోరందుకుంటున్న ఖరీఫ్ సాగు ● నారుమడులు, నాట్లలో రైతులు బిజీ దేవరపల్లి: చాలా మంది రైతులకు ప్రభుత్వం రబీ ధాన్యం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. అన్నదాతా సుఖీభవ పథకం కింద ఇస్తామన్న పెట్టుబడి సాయం అందించలేదు. ఈవిధంగా పుట్టెడు కష్టాల్లో మునిగి తేలుతున్నా.. పుడమిని పిండి పసిడి గింజలు పండించడం తప్ప మరో పని తెలియని అన్నదాతలు.. అప్పోసొప్పో చేసి మరీ ‘సాగు’దారిలోనే ముందుకు సాగుతున్నారు. కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు కాలువలకూ నీరు విడుదలైంది. దీంతో, జిల్లావ్యాప్తంగా రైతన్నలు మడిలో హడావుడి పడుతున్నారు. ఫలితంగా ఖరీఫ్ సాగు పనులు క్రమంగా జోరందుకుంటున్నాయి. పుష్కలంగా నీరు లభిస్తున్న మడుల్లోను, చెరువుల కింద ఆకుమడులు వేస్తున్నారు. దమ్ములు చేస్తున్న రైతులు భూసారం పెంచేందుకు ఇప్పటికే వేసిన జీలుగు, జనుము, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట పంటలను భూమిలో కలియదున్నుతున్నారు. బోర్ల కింద ముందస్తుగా ఆకుమడులు వేసిన కొంత మంది ఇరవై రోజులుగా వరి నాట్లు కూడా ప్రారంభించారు. వర్షాలకు చెరువుల్లో నీరు చేరడంతో చెరువుల కింద భూముల్లోని రైతులు దంప ఆకుమడులు, నారు సిద్ధంగా వారు నాట్లు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ 356 హెక్టార్లలో నేరుగా పంట వేయగా, 966 హెక్టార్లలో దమ్ము చేసి నాట్లు వేశారు. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 43 వేల మంది రైతులతో 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 35 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఉద్యాన, 2 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. మరికొంత మంది రైతులు వంగ, బెండ, టమాటా, మిర్చి, సొర, దోస వంటి కూరగాయ పంటల సాగుకు కూడా సిద్ధమవుతున్నారు. దీనికి అవసరమైన విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్లో సుమారు 3,200 హెక్లార్లలో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. బెంగాలీ కూలీల సందడి ఖరీఫ్ పనులు ప్రారంభం కావడంతో పలు ప్రాంతాల్లోని పొలాల్లో బెంగాలీ కూలీలు సందడి చేస్తున్నారు. వారు ఒక క్రమ పద్ధతిలో నాట్లు వేయడం వలన దుబ్బు బాగుంటుందని, పంట బాగా పెరిగి, అధిక దిగుబడులు వస్తాయని రైతులు అంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సుమారు 2 వేల మంది బెంగాలీ కూలీలు వచ్చినట్లు చెబుతున్నారు. వీరితో ఎకరం పొలంలో నాట్లు వేయడానికి రూ.3,500 వరకూ ఖర్చవుతుందని రైతులు తెలిపారు. ప్రారంభమైన వరి నాట్లు జిల్లాలో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. తొలుత బోర్ల కింద ముమ్మరంగా జరుగుతున్నాయి. కాలువలు, చెరువుల కింద ఆకుమడులు వేసి, నాట్లకు రైతులు సన్నద్ధమవుతున్నారు. నాట్లు ఈ నెలాఖరుకు ఊపందుకోనున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఆగస్టు నెలాఖరుకు దాదాపు పూర్తవుతాయి. ఖరీఫ్లో 3,847 హెక్టార్లలో వరి ఆకుమడులు అవసరం కాగా, ఇప్పటి వరకూ 2,122 హెక్టార్లలో వేశారు. మిగిలినవి చెరువుల కింద వేయాల్సి ఉంది. వేసిన ఆకుమడులు ఆరోగ్యకరంగా ఉన్నాయి. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం సేంద్రియ ఉత్పత్తుల పట్ల ఆసక్తి సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దీంతో, ప్రకృతి వ్యవసాయం చేయడానికి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. దీని ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడంతో పాటు పురుగు మందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. వరితో పాటు కొబ్బరి, ఆయిల్పామ్, పండ్ల తోటలు, కూరగాయల పంటల సాగును సేంద్రియ విధానంలో ప్రోత్సహిస్తున్నాం. – బొర్రా తాతారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయం విభాగం, రాజమహేంద్రవరం -
● పుడమితల్లికి పచ్చబొట్లు
తనను ఒకరు పొగడాలనే ఆశతో మేఘం వర్షించదు.. వర్షించడం తన ధర్మం కాబట్టి నెరవేరుస్తుంది. తన పైకి రాళ్లు విసిరిన వారికి, కత్తి దూసిన వారికి సైతం చెట్టు నీడనిస్తుంది. అన్నదాత తీరు కూడా అంతే. ‘పొలంబాట’లో కష్టాల కంటకాలు గుచ్చుకున్నా.. నష్టాల సుడిగుండాల్లో నిండా మునిగిపోతున్నా.. ఎదురీదుతూ.. సమస్త ప్రజానీకానికీ తిండిగింజలు పండిస్తూనే ఉంటాడు. కొన్నాళ్లుగా భారీ వర్షాలు కురుస్తూండటంతో రైతన్నలు సేద్య యజ్ఞానికి ఉపక్రమించారు. మడులను సిద్ధం చేస్తున్నారు. నారు, నాట్లతో పుడమి తల్లికి ‘ఆకుపచ్చ’ బొట్లు పెడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకున్నా.. ఆదుకోకపోయినా.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా.. ఈ మహాయజ్ఞం ఆగదంటూ ముందుకు సాగుతున్నారు. పెరవలి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనుల చిత్రాలివి. – పెరవలి -
మరిడమ్మ సన్నిధి.. భక్తుల పెన్నిధి
పెద్దాపురం: ఆషాఢ మాస మహోత్సవాల్లో భాగంగా పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని ఆదివారం వేలాదిగా భక్తులు దర్శించుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ చ్చిన భక్తులు అమ్మవా రి దర్శనానికి భారీగా బారులు తీరారు. సుమారు 50 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సీఐ విజయ్ శంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ చేశారు. లోవకు పోటెత్తిన భక్తులు ● భక్త జనసంద్రమైన దేవస్థానం ● తలుపులమ్మ తల్లిని దర్శించిన 33 వేల మంది ● తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి లక్ష తులసి పూజతుని: ఆషాఢ మాసం ఆదివారం, తొలి ఏకాదశి పర్వదినం కావడంతో లోవ దేవస్థానానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ 33 వేల మంది తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారి మూలవిరాట్కు పండితులు లక్ష తులసి పూజ నిర్వహించారు. పంచలోహ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ పూజను భక్తులు తిలకించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.3,12,930, పూజా టికెట్లకు రూ.3,07,630, కేశఖండన టికెట్లకు రూ.22,440, వాహన పూజ టికెట్లకు రూ.6,560, కాటేజీలకు రూ.86,722, విరాళాలు రూ.1,19,911 కలిపి దేవస్థానానికి మొత్తం రూ.8,50,543 ఆదాయం వచ్చిందని ఈఓ విశ్వనాథరాజు వివరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి డ్రోన్తో ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నెల 13న తలుపులమ్మ అమ్మవారికి 3 టన్నుల కూరగాయలతో శాకంబరి అలంకరణ చేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. -
కడలిలోకి 2.18 లక్షల క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటి ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. బ్యారేజీ నుంచి 2,18,257 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గాను 172 గేట్లను పైకి లేపి మిగులు జలాలు విడిచిపెడుతున్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 12,450 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,200, మధ్య డెల్టాకు 2,450, పశ్చిమ డెల్టాకు 5,800 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.10 అడుగులుగా నమోదైంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో నీటి ఉధృతి పెరిగిందని, సోమవారం నాటికి తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 12 వరకూ రేబిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాజమహేంద్రవరం రూరల్: ప్రపంచ జునోసిస్ డే సందర్భంగా రేబిస్ వ్యాధి నివారణకు ఈ నెల 12వ తేదీ వరకూ నిర్వహించే ముందస్తు వ్యాక్సినేషన్ డ్రైవ్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జంతువుల నుంచి, ప్రధానంగా కుక్కల నుంచి వ్యాపించే ప్రాణాంతక వ్యాధి రేబిస్ అని అన్నారు. ఇది నరాల వ్యవస్థను దెబ్బ తీసి మరణానికి దారి తీయవచ్చన్నారు. దీనిని యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ద్వారా పూర్తిగా నివారించవచ్చన్నారు. అందుకే, జంతువులతో క్రమం తప్పకుండా మసలే వ్యక్తు లు, పశు వైద్యులు, పారిశుధ్య కార్మికులు ముందస్తుగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ డ్రైవ్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సీహెచ్సీ, పీహెచ్సీ, యూపీహెచ్సీలలో ఈ నెల 12వ తేదీ వరకూ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎపిడెమాలజిస్ట్ డాక్టర్ సుధీర్బాబు పాల్గొన్నారు. ఇంద్ర బస్సు ప్రయాణంలో రాయితీరాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసం సందర్భంగా రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు సూపర్ లగ్జరీ ధరకే ఇంద్ర ఏసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కె.మాధవ్ ఆదివారం తెలిపారు. ఇంద్ర ఏసీ బస్సు చార్జీలో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు ఇంద్ర ఏసీ బస్సు టికెట్టు రూ.1,060 ఉండగా రాయితీపై రూ.920కే అందిస్తున్నామని తెలిపారు. -
పనస.. ‘ఫల’ప్రదం
పనస సాగుకూ కోనసీమ పెట్టింది పేరు. మార్చి నుంచి జూలై వరకూ పనస సీజన్. ఒక్కో చెట్టుకు 50 నుంచి 100కు పైగా కాయలు వస్తాయి. జిల్లావ్యాప్తంగా కొబ్బరిలో అంతర పంటగా సుమారు 100 ఎకరాల్లో సాగవుతుందని అంచనా. అంబాజీపేట కేంద్రంగా ఏటా రూ.కోటి విలువైన పనస కాయలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి.ఏ దిల్ ‘మ్యాంగో’మోర్కోనసీమ జిల్లా మలికిపురం మండలం గూడపల్లిలో పండే బంగినపల్లి కాయకు యమ క్రేజ్ ఉంది. ఈ సీజన్లో ఇక్కడ పండే బంగినపల్లికి ఉమ్మడి రాష్ట్రాలతో పాటు చైన్నె, బెంగళూరులో కూడా డిమాండ్ ఉంది. గూడపల్లితో పాటు చుట్టుపక్కల సుమారు 2 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. -
● గోదారి.. ఎర్రబారి..
గోదావరి పరవళ్లుధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పాటు పోలవరం నుంచి విడుదలవుతున్న నీటితో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగింది. బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రం 1,89,129 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీలోని మొత్తం 175 గేట్లకు గానూ 157 గేట్లను 0.40 మీటర్ల మేర పైకి లేపి మిగులు జలాలను వదులున్నారు. ధవళేశ్వరం ఆర్మ్లో 66, ర్యాలీ ఆర్మ్లో 42, మద్దూరు ఆర్మ్లో 20, విజ్జేశ్వరం ఆర్మ్లో 29 గేట్లను పైకి లేపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.80 అడుగులుగా నమోదైంది.రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఎర్రబారిన గోదావరినిన్నటి వరకూ నీలి రంగు జలాలతో కనువిందు చేసిన గోదావరి.. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఎర్రబారింది. గోదావరికి ఏటా జూన్లో వరద రావడం.. నీరు అరుణవర్ణం దాల్చడం ఆనవాయితీ. అయితే, ఈ ఏడాది వరద నీరు రావడం ఆలస్యమైంది. వరద నీటితో కొత్తందాలను సంతరించుకున్న గోదావరిని చూసేందుకు రాజమహేంద్రవరం పుష్కర ఘాట్కు శనివారం పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం -
కందిపప్పు.. ఉడకట్లే..
సాక్షి, రాజమహేంద్రవరం: రేషన్ షాపుల్లో కందిపప్పు సరఫరాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడిందా.. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు క్రమంగా తగ్గిస్తూ వస్తోందా.. అందుకే అధికారం చేపట్టినప్పటి నుంచీ చౌక దుకాణాలకు సక్రమంగా సరఫరా చేయడం లేదా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రేషన్ కార్డుదారుల నుంచి. లబ్ధిదారులకు నిరాశే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు నిత్యావసరాలైన కందిపప్పు, బియ్యం, చక్కెర, పామాయిల్ను సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందజేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలం నుంచి ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఇంటింటికీ రేషన్ సరకులు అందించే మొబైల్ డిస్పెన్సరీ యూనిట్లను (ఎండీయూ) తొలగించింది. పది నెలలుగా అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. దీంతో, ప్రతి నెలా కార్డుదారులకు నిరాశే ఎదురవుతోంది. ఈ నెల కూడా కందిపప్పు రాలేదని రేషన్ డీలర్లు చెబుతూండటంతో చేసేది లేక ఇచ్చిన సరకులే తీసుకుని వారు వెనుతిరుగుతున్నారు. ఈ నెలలో ఒక్క కేజీ కూడా సరఫరా చేసిన దాఖలాలు లేవు. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.180 వరకూ పలికింది. ఈ ధర కొన్ని మాసాల పాటు కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో సబ్సిడీ ధరకు కందిపప్పు సరఫరా చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేతులేత్తేసింది. టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు అధిక ధరకు కోట్ చేస్తారన్న భయంతో పూర్తిగా పంపిణీకే మంగళం పాడేసింది. అప్పుడు మొదలైన అరకొర సరఫరా నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర కిలో రూ.130 ఉంది. రేటు ఎక్కువగా ఉన్నప్పుడు సబ్సిడీపై ఇవ్వలేని ప్రభుత్వం.. కనీసం ధర దిగివచ్చినప్పుడైనా ప్రజలకు అందించేందుకు ముందుకు రావడం లేదు. రేషన్ కార్డుదారులకు సబ్సిడీపై కిలో కందిపప్పు రూ.67కే అందించాలి. ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో హోల్సేల్లో కొన్నా కిలో రూ.100కు లభిస్తుంది. అది కొని ప్రజలకు పంపిణీ చేసినా రూ.30కి మించి ప్రభుత్వంపై భారం పడదు. అయినా ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్టుగా సర్కారు మిన్నకుండిపోతోంది. పేదలపై భారం జిల్లావ్యాప్తంగా 5 (మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ల ద్వారా నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏ ఒక్క ఎంఎల్ఎస్ పాయింటులోనూ కందిపప్పు కిలో కూడా నిల్వ లేకపోవడం గమనార్హం. రేషన్ షాపులు, ఎంఎల్ఎస్ పాయింట్లలో కందిపప్పు నిల్వలు నిండుకోవడంతో కార్డుదారులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనాల్సిన దుస్థితి నెలకొంటోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోంది. జిల్లాలో ఇలా.. రేషన్ డీలర్లు ప్రతి నెలా 20వ తేదీ లోపు డీడీలు తీసి, తమ పరిధిలోని కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పంచదార తదితర సరకులు దిగుమతి చేసుకుంటారు. కొన్ని నెలలుగా డీలర్లు డీడీలు తీస్తున్నా పౌర సరఫరాల శాఖ మాత్రం అవసరమైన మేరకు కందిపప్పు సరఫరా చేయడం లేదు. జిల్లాకు 564.9 టన్నుల కందిపప్పు అవసరం కాగా, వంద, 150 టన్నులు మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో, కార్డుదారులకు పూర్తి స్థాయిలో కందిపప్పు అందడం లేదు. కందిపప్పు కోసం డీడీలు తీయవద్దని డీలర్లకు అధికారులు ముందుగానే సమాచారం ఇచ్చారు. దీంతో వారు పూర్తి స్థాయిలో డీడీలు కట్టడం మానేశారు. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు కావాలని ప్రజలు అడుగుతూంటే.. తమకే రాలేదని డీలర్లు బదులిస్తున్నారు. ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తూంటే రేషన్ షాపుల నుంచి కందిపప్పు పంపిణీని పూర్తిగా ఎత్తివేసేలా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పది నెలలుగా సక్రమంగా జరగని సరఫరా ఈ నెల పూర్తిగా నిలిపివేసిన ప్రభుత్వం కార్డుదారులకు అవస్థలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనలేక గగ్గోలుజిల్లాలో రేషన్ షాపులు కార్డుల వివరాలు మండలం రేషన్ రేషన్ షాపులు కార్డులు అనపర్తి 39 22,488 బిక్కవోలు 40 22,480 చాగల్లు 36 21,072 దేవరపల్లి 34 25,416 గోకవరం 36 22,644 గోపాలపురం 43 21,128 కడియం 45 29,138 కోరుకొండ 43 26,991 కొవ్వూరు 55 33,320 నల్లజర్ల 42 27,554 నిడదవోలు 51 34,483 పెరవలి 43 23,233 రాజమహేంద్రవరం రూరల్ 59 50,511 రాజమహేంద్రవరం అర్బన్ 105 83,403 రాజానగరం 48 36,324 రంగంపేట 30 19,778 సీతానగరం 44 24,085 తాళ్లపూడి 34 16,811 ఉండ్రాజవరం 44 24,135 జిల్లావ్యాప్తంగా రేషన్ కార్డులు 5,64,000 కార్డుల్లోని సభ్యులు 15,77,393 వీరికి అవసరమైన కందిపప్పు 564.9 టన్నులు అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే సరఫరా చేసినది 25 టన్నులు -
ఆశ్చర్య‘పోక’ తప్పదు
కోనసీమలోని అంబాజీపేట, పి.గన్నవరం, అయినవిల్లి, కొత్తపేటతో పాటు మండపేట మండలం ద్వారపూడి ప్రాంతంలో సుమారు 386 ఎకరాల్లో పోక (వక్క) సాగు జరుగుతోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా, తోటల చుట్టూ గట్ల మీద ఈ పంట సాగవుతోంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాకు పోక ఎగుమతి అవుతోంది. పోక విస్తృతంగా పండే కేరళను మించి ఇక్కడ వక్క సాగవుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు. ఎర్ర చెక్కల (పూజా సుపారీ) తయారీ ఇక్కడి ప్రత్యేకత. ‘కోకో’ల్లలుగా గింజల దిగుబడి ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో పండే కోకో గింజలు మాత్రమే నాణ్యమైనవని నిన్న మొన్నటి వరకూ పేరుండేది. కోనసీమలో పండే కోకో గింజలు ఇప్పుడు ఆ పేరును తుడిచిపెట్టేశాయి. జిల్లాలోని 3,800 ఎకరాల్లో కొబ్బరిలో అంతర పంటగా కోకో సాగవుతోంది. ఏటా సగటున 1,140 టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటును బట్టి ఏటా రూ.54.20 కోట్ల విలువైన కోకో గింజల దిగుబడి వస్తోందని అంచనా. -
అభినందన సీమ
ఉద్యాన పంటలు భేష్ ● అరుదైన ఎర్ర చక్కెరకేళీ సాగులో అగ్రస్థానం ● ‘పాన్’కు పెట్టింది పేరు సీమ తమలపాకు ● కేరళను మించిన ‘వక్క’ ● ఘనా దేశానికి దీటుగా కోకో నాణ్యత ● గూడపల్లి మామిడికి యమ క్రేజ్సాక్షి, అమలాపురం: ఉద్యాన పంటల సాగులో కోనసీమ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ పండే పంటలకు దేశవ్యాప్తంగా గిరాకీ ఉంది. ఇక్కడి ఉత్పత్తుల కొనుగోలుకు ఉత్తరాది వ్యాపారులు ఎంతో ఆసక్తి చూపుతారు. సాగులో నాణ్యతా ప్రమాణాలు పాటించడం, రుచిలోనూ చవులూరించడమే దీనికి కారణం. ఆను‘పాను’ తెలుసు కోనసీమ నుంచి వెళ్తున్న తమలపాకును ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో కిళ్లీల తయారీలో ఎక్కువగా వినియోగిస్తారు. ఆనుపానులు తెలుసుకుని ఇక్కడి రైతులు పండించే తమలపాకు రుచి బాగుంటుందని ఉత్తరాది వ్యాపారులు చెబుతారు. జిల్లాలోని పి.గన్నవరం, రావులపాలెం, అయినవిల్లి మండలాల్లో సుమారు 240 ఎకరాల్లో ఈ పంట పండుతోందని అంచనా. ఇప్పుడు పశ్చిమ గోదావరి నుంచి వచ్చే ఆకుతో కలిపి రోజుకు ఒక లారీ వరకు ఎగుమతి జరుగుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. -
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: దశమి శనివారం కలసి రావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేకువజామునే ఆలయానికి తరలివచ్చి, స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారికి అభిషేకం అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. స్వామి, అమ్మవార్లను వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించారు. దాతల ఆర్థిక సాయంతో 6,500 మందికి అన్నసమారాధన నిర్వహించామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఇసుక లోడు పరిమితికి మించితే కఠిన చర్యలు రాజమహేంద్రవరం సిటీ: పరిమితికి మించి ఇసుక లోడు చేస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని, ఆ వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఇసుక అంశంపై తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురాల్లో పూడికతీత చేసే రీచ్ల వద్ద వాహనాల్లో ఇసుకను అధికంగా లోడు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించని పూడికతీత రీచ్ల లైసెన్సులు రద్దు చేయాలన్నారు. వాహనాల లోడింగ్, రహదారిపై పడిన ఇసుక తొలగింపు బాధ్యత ఆయా ఏజెన్సీలదేనని, వీటి పర్యవేక్షణ బాధ్యతను ఆయా మండల స్థాయి అధికారులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని స్పష్టం చేశారు. రహదారిపై పడిన ఇసుకను అదే రోజు సాయంత్రంలోగా సంబంధిత ఏజెన్సీ తొలగించాలన్నారు. ఇసుక తొలగింపునకు ముందు, తర్వాత తీసిన ఫొటోలను ఆయా ఏజెన్సీలు జిల్లా యంత్రాంగానికి సమర్పించాలని ఆదేశించారు. ఈ నిబంధనలు పాటించని ఏజెన్సీల ఆథరైజేషన్ను ఎటువంటి ముందస్తు నోటీసూ లేకుండా రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో ఇసుక తవ్వకాలపై అక్టోబర్ 15 వరకూ నిషేధం ఉందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి ఎం.ఫణిభూషణ్రెడ్డి, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ కుమార్ పాల్గొన్నారు. -
ఢిల్లీ ఎయిమ్స్లో జాన్వికి సీటు
చాగల్లు: గ్రామానికి చెందిన గారపాటి జాన్వి పద్మజ చౌదరి ఢిల్లీలోని ఏఐఐఎంఎస్ (ఎయిమ్స్)లో సీటు సాధించింది. ఎయిమ్స్ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఆమె ఆలిండియా 163వ ర్యాంకు సాధించి ఈ ఘనత సాధించింది. ఆమె వైజాగ్ ఆంధ్ర మెడికల్ కళాశాల (కేజీహెచ్)లో ఎంబీబీఎస్ చేసిన ఆమె ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అత్యుత్తమ ప్రతిభ చూపింది. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులు గారపాటి శ్రీనివాసరావు, నాగలక్ష్మి దంపంపతుల ప్రోత్సాహంతో ఈ సీటు సాధించడంపై బంధువులు, శ్రేయోభిలాషులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. -
760 టన్నుల ఇసుక అక్రమ నిల్వ స్వాధీనం
రాజానగరం: మండలంలోని దివాన్చెరువు, బీజాపురి టౌన్షిప్లో రోడ్లపై అక్రమంగా నిల్వ చేసిన గోదావరి ఇసుకను వాహనాలతో సహా టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు మనీషా, శైలజ, ఎస్సై ఆంజనేయులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి దాడి చేసి రెండు చోట్ల నిల్వ చేసిన 760 టన్నుల ఇసుకను, అదే సమయంలో అక్కడకు అర టన్నులోడుతో వచ్చిన లారీని సీజ్ చేశారు. కాగా ఇసుక రవాణా బిల్లు ఉదయం తీసుకున్నప్పటికీ దానితోనే రోజంతా వీలైనన్ని ట్రిప్పులు వేస్తున్నట్టు గుర్తించారు. ఇసుక అక్రమ నిల్వలపై ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ అధికారి డి. ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. -
కూటమిలో మట్టి పంచాయతీ!
మర్లావ, ఆర్బీ పట్టణాల్లో జనసేన వెర్సస్ టీడీపీ పెద్దాపురం: గ్రామాల్లో కూటమి నేతల మధ్య ఆధిపత్యపోరు మొదలైంది. మండలంలోని మర్లావ గ్రామంలో టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్ తోట రామకృష్ణ జేసీబీతో ఏలేరు కాలువ మట్టిని తరలించుకుపోవడాన్ని జనసేన నాయకులు గవరసాని దివాకర్ వర్గీయులు వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాతో పాటు, బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. అలాగే మండలంలోని దివిలి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమాలు టీడీపీ తమకు చెప్పకుండానే చేస్తున్నారని నీటి సంఘం ఉపాధ్యక్షుడు జనసేన నాయకుడు జట్లా విజయ్బాబు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అదే విధంగా మండలంలోని ఆర్బీ పట్నంలో చెరువు మట్టి తవ్వకాల విషయంలోనూ జనసేన, టీడీపీ వర్గీయుల మధ్య పోరు సాగుతోంది. అధికారులు ఇరువర్గాలకు చెప్పలేక మౌనం దాల్చడంతో ఆధిపత్యపోరులో కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. 18 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టివేత ● కేసు నమోదు చేసిన అధికారులు ● రూ.8.28 లక్షల సరకు స్వాధీనం దేవరపల్లి: నల్లజర్లలోని ఓ బియ్యం మిల్లు నుంచి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలుకు లారీలో తరలిస్తున్న 400 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. మండలంలోని యర్నగూడెం–పోతవరం రోడ్డులో పట్టుకున్న బస్తాల్లో సుమారు రూ.8.28 లక్షల విలువైన 18 మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నట్టు మండల పౌరసరఫరాల అధికారి ఎ.సత్యనారాయణ తెలిపారు. కాగా అధికారులు నిర్వహించిన వేలంలో ఈ బియ్యాన్ని పాడుకుని తరలిస్తున్నట్టు మిల్లు యజమాని చూపిన పత్రాలు కాల పరిమితి ముగిసినవని గుర్తించినట్టు అధికారులు గుర్తించారు. లారీని, అందులోని బియ్యాన్ని స్వాధీనం చేసుకుని 6ఎ, 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. విచారణ అనంతరం వివరాలు తెలుస్తాయని డీటీ తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఎస్. తాతారావు, సీఐ మధుబాబు, ఏఎస్ఓ నాగాంజనేయులు, వీఆర్వో ఎస్కే బాషా, సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మోనియా లీకేజీపై మాక్ డ్రిల్
కాకినాడ రూరల్: రూరల్ మండలం వాకలపూడి గ్రామ పరిధిలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎరువుల కర్మాగారంలో నిల్వ ఉన్న అమ్మోనియా లీక్ అయితే తీసుకోవలసిన చర్యలుపై శనివారం మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిశ్రమలశాఖ అధికారుల పర్యవేక్షణలో సంస్థ యూనిట్ హెడ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరావు, ఇన్స్పెక్టర్ రాంబాబు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. -
రాజీ మార్గం రాజ మార్గం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల జాతీయ లోక్ అదాలత్ శనివారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని నిర్వహించారు. దీనికి హాజరైన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 85 వేలకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, వీటిలో 60,642 కేసులు రాజీ చేసుకోదగినవని పేర్కొన్నారు. వీటిలో తాము 9,272 సివిల్ క్రిమినల్ కేసులు, 2,136 ప్రీ లిటిగేషన్ కేసు లు, మొత్తం 11,415 రాజీ చేసుకోదగిన కేసులుగా ఈ బెంచ్ రిఫర్ చేయడం జరిగినద న్నారు. కక్షిదారులు వెంటనే లాభం పొందాలనే ఉద్దేశంతో కేసులను రాజీమార్గంలో పరిష్కరిస్తున్నామన్నారు. గత ఏడాదిలో చేపట్టిన నాలుగు లోక్ అదాలత్లలో రూ.167 వందల కోట్లు కక్షి దారులకు నష్టపరిహారంగా అందజేసినట్టు తెలిపారు. తాజాగా పీడీజే కోర్టులోని 01/2025 కేసుకు బాధితుల కుటుంబానికి రూ.1.15 కోట్లు, 379/2023 కేసులో రూ.80 లక్షలు, 135/2025 కేసులో రూ.38.5 లక్షల చెక్కులను అంద చేశామన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శోభనాద్రి శాస్త్రి, పలువురు జడ్జిలు పాల్గొన్నారు. మొత్తం బెంచీలు 47 కాగా 6179 కేసులకు అవార్డులు ఇచ్చారు. రాత్రి 9.30 గంటల వరకు 473 సివిల్ కేసులు, 5514 క్రిమినల్ కేసులు, 192 పీఎల్సీ కేసులకు తీర్పులు ఇచ్చారు. ఇంకా కేసుల సంఖ్యను లెక్కిస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
● ఏఈఓ సంఘం అధ్యక్షుడు వేణుమాధవరావు ● నూతన కార్యవర్గం ఎన్నిక ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలోని విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యల పరిష్కారానికి ఏఈఓ సంఘం కృషి చేస్తోందని అధ్యక్షుడు డి.వేణుమాధవరావు అన్నారు. స్థానిక ధర్మంచర కమ్యూనిటీ హాల్లో శనివారం విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారుల రాష్ట్ర సంఘ సమావేశం నిర్వహించారు. మాధవరావు మాట్లాడుతూ విశ్రాంత అధికారుల వైద్య బిల్లులు, తదితర సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎస్.పాపినాయుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా టి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా జి.మార్టిన్ శాంతకుమార్, సహధ్యక్షుడిగా ప్రగడ సంజీవరావు, ఉపాధ్యక్షులుగా జి.సింహాచలం, బి.సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సి.ఓంకారయ్య, సంయుక్త కార్యదర్శిగా ఎస్వీ శ్రీనివాస్, వి.నాగసత్య శ్రీనివాస్, కోశాధికారిగా కె.నాగరాజు, కార్యవర్గ సభ్యులుగా కె.ఫ్రాన్సిస్, డి.సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు కేజీకే మూర్తి, నగర ఎన్జీవో సంఘ ఉపాధ్యక్షుడు మీసాల మాధవరావు, ఉమ్మడి జిల్లా ఏఈఓ సంఘ కార్యదర్శి సతీష్, కోశాధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
ప్రేమ.. ప్రాణాంతకం కావచ్చు!
జిల్లాలో జంతువులు వివరాలు ఇలా... పెంపుడు కుక్కలు 11,159 ఆవులు 70,846 గేదెలు 1,67,106 గొర్రెలు 1,67,052 మేకలు 72,076 పందులు 1,207 పౌల్ట్రీ 1,77,86,778 ● మూగజీవాల పెంపకంపై అవగాహన అవసరం ● వాటిపై ప్రేమ మాటున పొంచి ఉన్న వ్యాధుల ముప్పు ● అశ్రద్ధ చేయవద్దంటున్న వైద్యులు ● నేడు ప్రపంచ జునోసిస్ డే రాజమహేంద్రవరం రూరల్/బిక్కవోలు: సమాజంలో జంతు ప్రేమ రోజురోజుకూ పెరుగుతోంది. అదే సమయంలో వాటి వల్ల వచ్చే వ్యాధులపై వాటిని పెంచుకునేవారికి లేదనేది వాస్తవం. వైద్య పరిశోధన ప్రకారం జంతువల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సుమారు 190 రకాల వ్యాధులు సోకే అవకాశం ఉంది. ఇలా సోకే వ్యాధులను జునోసిస్ అంటారు. జూనిటిక్ వ్యాధులను వైరస్ బ్యాక్టీరియల్, పారసైటిక్ వ్యాధులుగా విభజించారు. వైరస్ వలన సంక్రమించే వ్యాధులలో రేబిస్, మెదడువాపు వ్యాధి, బర్డ్ఫ్లూ వంటివి ముఖ్యమైనవి. బాక్టీరియా వలన సంక్రమించే వ్యాధుల్లో బ్రూసెల్లా, సాల్మోనెల్లా, లెప్టోసైరోసిస్ మొదలైనవి ఉన్నాయి. కుక్కకాటుతో రేబీస్, పందుల వల్ల మెదడువాపు, పశువులు, గొర్రెల నుంచి టీబీ వ్యాధులు సంక్రమిస్తాయని, వీటన్నింటిలో రేబిస్ ప్రమాదకరమైనదని వైద్యులు పేర్కొంటున్నారు. జునోసిస్ ఎలా వచ్చిందంటే... పిచ్చికుక్క కాటుకు గురైన వ్యక్తికి లూయీపాశ్చర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6న మొట్టమొదటిసారిగా యాంటీ రేబిస్ టీకా ఇచ్చారు. ఇది విజయవంతమై అత్యంత ప్రాచుర్యం పొందింది. ఆ రోజుకు గుర్తుగా ఏటా ప్రపంచ జునోటిక్ డే నిర్వహిస్తున్నారు. వ్యాక్సినేషన్ ఎంతో అవసరం పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్పై చాలా మందికి అవగాహన ఉండదు. కొందరు ఖర్చుతో కూడినదని, సమయం లేక అశ్రద్ధ చేస్తుంటారు. దీని వల్ల అవి కరిచిన, రక్కిన సందర్భాలలో ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. అందువల్ల వాటికి వ్యాక్సినేషన్ చేయించడం ఎంతో అవసరమని గుర్తించాలి. జాగ్రత్తలివీ ● పెంపుడు జంతువులకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు సకాలంలో వేయించాలి. ● టీకాల షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించాలి. ● పెంపుడు జంతువులను, వాటి ఆహారాన్ని లేదా వ్యర్థాలను తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి. లిట్టర్ బాక్సులు, పంజరాలను తరచుగా శుభ్రం చేయాలి. ● బయట తిరిగే జంతువులకు క్రమం తప్పకుండా క్రిములను తొలగించాలి. ● పెంపుడు జంతువులు అడవి జంతువులతో కలవకుండా చూడటంతో పాటు, సరైన రక్షణ లేకుండా గాయపడిన అడవి జంతువులను రక్షించడానికి ప్రయత్నించకూడదు. ● జంతువుల అనారోగ్య లక్షణాలను గమనించాలి. ప్రవర్తన, ఆకలి, లేదా ఏవైనా మార్పులను గమనించడం, ఏదైనా ఆసాధారణమైనది గమనిసై వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలి. పాడి రైతులకు ఇలా.. ● బలమైన జీవభద్రతా చర్యలను అమలు చేయాలి. ● పశువుల దగ్గరకు అవసరమైన వ్యక్తులను మాత్రమే అనుమతించాలి. ● జంతు సమూహాల మధ్య కదిలేటప్పడు పాద రక్షలు, రక్షిత దుస్తులను ఉపయోగించాలి. ● పశుశాలలు, పాలు పిండే ప్రదేశాలు, పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ● క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. ● అనారోగ్యంతో ఉన్న జంతువులను వెంటనే మంద నుంచి వేరు చేయాలి. కోళ్ల రైతులకు జాగ్రత్తలివీ ● ఒకే వయస్సు ఉన్న పక్షులను కలిపి పెంచాలి. ● గుంపుల మధ్య పూర్తిగా శుభ్రపరిచి, ఆ ప్రాంతంలో క్రిమి సంహార మందులు చల్లాలి. ● అడవి పక్షులతో సంపర్కాన్ని నివారించడానికి వలలు లేదా మూసిన గూళ్లను ఉపయోగించాలి. ● ఆహారం తీసుకోవడంలో లేదా గుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల వంటి ఆనారోగ్య లక్షణాలను గమనించడంతో పాటు, అసాధారణ మరణాలు లేదా లక్షణాలను వెంటనే పశువైద్య అధికారులకు తెలియజేయాలి. అవగాహన పెంచుకోవాలి ● జూనోటిక్ వ్యాధుల సమాచారాన్ని ఎప్పటి కప్పడు తెలుసుకోవాలి. ● జంతు ఆరోగ్యం, జూనోసిస్పై వర్క్షాప్లు లేదా సెమినార్లకు హాజరుకావాలి. ● అనుమానిత జూనోటిక్ వ్యాధులను గుర్తిస్తే పశువైద్యులు, అధికారులకు తెలియజేయాలి. వైద్యుల సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను జునాటిక్ డిసీజెస్ అంటారు. ఎబోలా, బర్డ్ఫ్లూ, రేబిస్, మెదడువాపు వంటివి ఈ రకమైనవే. ఇవి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వైద్యుల సలహాలు తప్పనిసరి. ఇంట్లో కుక్కలను పెంచేవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన వ్యాక్సిన్ వేయించకుండా పెంపుడు జంతువులు, కుక్కలతో సన్నిహితంగా ఉండొద్దు. ఆదివారం రాజమ హేంద్రవరం ఏరియా పశువైద్యశాలలు, అనపర్తి, బి క్కవోలు, పెదపూడి, రంగంపేట మండలాల్లోని పశువైద్యశాలల్లో టీకాలు వేస్తున్నాం. జునోసిస్ వ్యాధులపై వైద్యాధికారులు అవగాహన కల్పిస్తారు. అలాగే పెంపుడు జంతువులకు, వాటితో దగ్గరగా మెలిగే యజ మానులకు, పశుసంవర్ధకశాఖ సిబ్బందికి, మున్సిపల్ వర్కర్లుకు, జంతువధశాఖ సిబ్బందికి, జంతు ప్రేమికులకు ఉచితంగా యాంటీ రాబీస్ టీకాలు వేస్తాం. –టి.శ్రీనివాసరావు, జిల్లా పశువైద్యాధికారి, తూర్పుగోదావరి ముందుస్తు నివారణ మేలు జునోసిస్ వ్యాధులు ప్రబలకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల మనుషులకు, అటు జంతువులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రాణాంతక జోనోసిస్ వ్యాధులపై సరైన అవగాహన ఉంటే చాలా వరకు వీటిని ఆరికట్టవచ్చు. జునోసిస్ వ్యాధుల సంక్రమణ, నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. – డాక్టర్ శ్రీనివాస్, పశుసంవర్థక శాఖ ఏడీ, అనపర్తి ప్రేమ ఒక మత్తు. అది మనుషుల మీదైనా.. మూగ జీవాల మీదైనా. వీటి ప్రేమ అన్కండీషనల్. చిన్న బిస్కెట్ ముక్క పెడితే చాలు.. ఏళ్ల తరబడి ప్రేమ కురిపిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమకి పడిపోని మనిషుండడు. అవి ఏ స్థితిలో ఉన్నా దానిని ముద్దుచేస్తూ.. దాని నోటిలో చేతులు పెడుతూ.. దగ్గరకు తీసుకుని గాఢాలింగనాలు చేసుకుంటూ ప్రేమ వ్యక్తపరుస్తుంటారు. ఇది కొన్నిసార్లు ప్రమాదకరం కావొచ్చు. పాముకు పాలు పోసి పెంచినా దాని సహజ లక్షణం కాటు వేయడం. అలాగే కుక్కలు.. పిల్లులు.. కోతులు.. కుందేళ్ల వంటి మూగ జీవులను ఎంత ప్రేమగా పెంచినా స్వాభావికంగా చర్మం.. విసర్జకాలు.. వెంట్రుకలు.. చొంగ తదితరాలు ఎప్పటికీ ప్రమాద హేతువులే. వీటి నుంచి వచ్చే ఉపద్రవాలను గుర్తెరిగి తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని పెంచుకోవడం ఎంతైనా అవసరం. అలాగే వాటికి సంక్రమించి పలు రకాల వ్యాధులు మానవులకు హానికరం కాకుండా చూసుకుంటూ వాటికి సకాలంలో ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే వాటిని పెంచుకునేవారికి ఆ దుష్ప్రభావాలు సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మూగజీవాలు.. వాటి వల్ల వచ్చే వ్యాధులపై సరైన అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన జునోసిస్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. -
కూటమి మోసాలపై ప్రజల్లో ప్రచారం
అనపర్తి : కూటమి ప్రభుత్వం నమ్మించి చేసిన మోసాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వ మ్యానిఫెస్టోని క్యూఆర్ కోడ్ ద్వారా చేరువ చేయాలని ఆయన సూచించారు. గురువారం అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర యుజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా పార్టీ పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, రాజమహేంద్రవరం పార్లమెంట్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను వారికి వివరించి ఎప్పుడు ఎన్నికలు జరిగినా సంసిద్ధంగా ఉండి వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకువచ్చి వైఎస్ జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, నాలుగు మండలాల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నేతలు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన యోధుడు అల్లూరి సీతారామరాజు అని కలెక్టర్ ప్రశాంతి కొనియాడారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 128 జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ఆంధ్రులకు గర్వకారణంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న పుట్టి, యువకుడిగా స్వాతంత్య్ర పోరాటంలో అడుగు పెట్టారన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి నిలిచిన యోధుడిగా పేరుగాంచారన్నారు. ఆయన జీవితం, పోరాటాలు ఈ తరం ప్రజలకు గొప్ప స్ఫూర్తిదాయకమన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసీల హక్కుల కోసం, బ్రి టిష్ హింసాత్మక పాలనకు వ్యతిరేకంగా, అత్యంత ధైర్యంతో గళమెత్తిన తొలి పోరాట యోధుడున్నారు. ఆయన చూపిన త్యాగం, ధైర్యం, నాయకత్వ గుణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ చిన్నరాముడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలి రాజానగరం: చదువుతోపాటు క్రీడలలోనూ ప్రతిభను కనబరిచేలా విద్యార్థులను ప్రోత్సహించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనుబంధ కళాశాలల సీనియర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీతో శుక్రవారం సమావేశమై, ఇంటర్ యూనివర్సిటీ క్రీడా పోటీల నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు. ప్రతి కళాశాలలోను క్రీడా మైదానాలను సద్వినియోగపర్చేలా క్రీడలపై విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రిజిస్టార్ ఆచార్య కేవీ స్వామి పాల్గొన్నారు. పంటల బీమా వినియోగించుకోవాలి రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలోని రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పున సంస్థాపిత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం ద్వారా ఖరీఫ్ 2025లో రైతులు బీమా చెల్లించాలని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో పంటల బీమాకు సంబంధించిన కరపత్రాలను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు మాట్లాడుతూ వరి పంటకు బీమా ఎకరానికి 570 రూపాయలు ఆగస్టు 15 లోపల చెల్లించాలని, మినుముకు ఎకరానికి 300 రూపాయలు ఈ నెల 15 లోపు చెల్లించాలని, అరటి పంటకు ఎకరానికి మూడు వేల రూపాయలు చెల్లించాలన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ శనివారం ఉదయం 9.45 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత హాజరవుతారు. కక్షిదారులు కేసులను ఆయా కోర్టుల్లో పరిష్కరిస్తారు. జాతీయ లోక్అదాలత్ రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రాంగణంలోని కోర్టుల్లోను, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన కోర్టుల్లోను జరుగనుంది. -
విద్యుదాఘాతంతో ఇద్దరి మృతి
● విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లేనని బాలిక కుటుంబీకుల ఆందోళన ● న్యాయం చేయాలని డిమాండ్ తాళ్లపూడి(కొవ్వూరు): విద్యుదాఘాతంతో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన కొవ్వూరు మండలం ధర్మవరంలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన జొన్నకూటి సౌమ్య (15) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. శుక్రవారం ఉదయం ఇంటి వద్ద దుస్తులు ఆరేసే తీగపై విద్యుత్ లైన్ తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై ఆమె మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు విద్యుదాఘాతంతో విలవిలలాడుతున్న ఆమెను కాపాడటానికి తన అన్నయ్య, ఓ స్నేహితుడు చేసిన ప్రయత్నంలో వారు సైతం స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తమ కుటుంబాలకు తగిన న్యాయం వెంటనే చేయాలని కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి పంచనామా కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మృతురాలి బంధువులు మాట్లాడుతూ ధర్మవరం గ్రామంలో సర్వీస్ వైరు కిందకి ఉందని పదే పదే చెబుతున్నా పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైందని వారు ధర్నా చేశారు. బాలిక కుటుంబానికి తగిన న్యాయం జరగాలని, గ్రామంలో విద్యుత్ స్తంభాలన్నీ వెంటనే మార్చి మరో ప్రాణం పోకుండా చూసుకోవాలని కోరారు. పోలీసులు సద్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సంఘటనపై కొవ్వూరు రూరల్ పోలీసులు, ఎస్సై శ్రీహరి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. గాదరాడలో యువకుడు.. కోరుకొండ: మండలంలోని గాదరాడ గ్రామానికి చెందిన సేనాపతి శ్రీను (34) గురువారం విద్యుదాఘాతంతో మృతిచెందిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై కూన నాగరాజు తెలిపారు. వ్యవసాయకూలీగా జీవించే శ్రీను గురువారం తన ఇంటి వద్ద మోటార్ ఆన్ చేయగా విద్యుత్ షాక్ తగిలింది. అతడిని కాపాడబోయిన తల్లి మోటార్ను ఆపే క్రమంలో తానూ షాక్కు గురైనా విద్యుత్ సరఫరాను ఆపగలిగింది. దీంతో కింద పడిపోయిన శ్రీనును స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే అతడు మృతి చెందాడు. శ్రీనుకు భార్య ఉంది. విద్యుదాఘాతంతో మృతిచెందినట్టు కేసు నమోదు చేసి శుక్రవారం రాజమహేంద్రవరం జీహెచ్లో శవపంచనామా నిర్వహించారు. -
సీఎం చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
అన్నవరం: పల్నాడు జిల్లా రెంటపాడులో పరామర్శకు వెడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో సత్తెనపల్లి వద్ద ప్రమాదవశాత్తూ కారు కింద పడి మృతిచెందిన సింగయ్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుక్కపిల్లతో పోల్చడం దారుణమని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడ్డారు. దళితుడిని అవమానించిన చంద్రబాబుపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరుతూ పార్టీ జిల్లా శాఖ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా, ప్రత్తిపాడు నియోజకవర్గ పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు సరమర్ల మధుబాబు ఆధ్వర్వంలో పార్టీ నాయకులు అన్నవరం పోలీసుస్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. జగన్మోహన్రెడ్డి కాన్వాయ్లో కారు సింగయ్యను ఢీకొట్టలేదని వేరే కారు ఢీ కొట్టిందని మొదట ప్రకటించిన జిల్లా ఎస్పీ నాలుగు రోజుల తరువాత సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియో ఆధారంగా జగన్మోహన్ రెడ్డి కారు ఢీ కొట్టిందని చెప్పడం వెనుక కుట్ర దాగుందన్నారు. సింగయ్య భార్య లూర్తు మేరీ మాట్లాడుతూ కారు ఢీ కొట్టి పడిపోయినపుడు పెద్దగా గాయాలు లేవని, అంబులెన్స్లో ఎక్కించాక మృతి చెందడం వెనుక కుట్ర దాగుందని పేర్కొన్నారని తెలిపారు. దీనిని కప్పిపుచ్చడానికి గాను సింగయ్యను కుక్కపిల్లలా పక్కన పడేశారని సీఎం వ్యాఖ్యానించడం దళితులను అవమానించడమే అన్నారు. దీనిపై కేసు నమోదు చేయాలని వారు అన్నవరం పోలీస్స్టేషన్ హెచ్సీ ప్రభాకరావుకు ఫిర్యాదు అందజేశారు. పార్టీ నాయకులు ఆశిన శ్రీనివాస్, సింగంపల్లి రాము, కొండి సతీష్, కొండి సూరిబాబు పాల్గొన్నారు. -
నాట్ల మాటున కాట్ల బెడద
రాయవరం: తొలకరి పలకరించడంతో రైతులు పొలంబాట పడుతున్నారు. వాతావరణం చల్లబడడంతో పంట పొలాల్లోని బొరియల్లో ఉన్న విష పురుగులు, పాములు బయటకు వస్తుంటాయి. వ్యవసాయ పనుల్లో తలమునకలయ్యే రైతులు పాము కాటుకు గురై నిండు ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.పాముకాటుకు గురైన సందర్భాలలో సకాలంలో వైద్యం అందక పోతే మత్యువాత పడుతుంటారు. పాము కాటుకు గురికాకుండా ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రాథమిక చికిత్సపై అవగాహన అందరికీ అవసరం.ప్రాణసంకటమే..రబీ ముగిశాక వేసవిలో రైతులు పొలాల వద్దకు తక్కువుగా వెళ్తుంటారు. సుమారు రెండు నెలల పాటు పొలాల్లో అంతగా అలికిడి ఉండక పోవడంతో అక్కడికి పాములు చేరతాయి. తిరిగి ఖరీఫ్ పనులు మొదలుపెట్టే సందర్భంలో పాములు బయటకు వచ్చి కాటు వేస్తుంటాయి. ఏటా వర్షాకాలం ప్రారంభంలో ఇలాంటి ఘటనలు అధికమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పొలం గట్ల పక్కన నివాసం ఉండే ప్రాంతాల్లో ఎక్కువుగా పాముకాటు మరణాలు సంభవిస్తుంటాయి.అప్రమత్తంగా ఉండాలి● రైతులు చేల గట్లపై నడిచే సమయంలో పాదరక్షలు ధరించాలి.● కర్రతో చప్పుడు చేస్తూ నడవడం వల్ల అలికిడికి పాములు వెళ్లిపోతాయి.● ధాన్యపు గాదెలు, గడ్డివాములు, తడిగా ఉండే చోట కప్పలు, ఎలుకల కోసం పాములు తిరుగుతుంటాయి.● దుంగలు, కట్టెల్లో పాములు ఎక్కువుగా ఉండే అవకాశం ఉంటుంది.● రైతులు ఇళ్ల వద్ద ఏర్పాటు చేసుకునే పిడకలు, డొక్కల గూళ్ల మధ్య విష కీటకాలు ఉండే అవకాశం ఉంది.● రాత్రి పూట మోటార్ వేయడానికి, పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లేటప్పుడు విధిగా టార్చిలైట్ ఉపయోగించాలి.● మోటార్ షెడ్లో స్టార్టర్ వద్ద కూడా పాములు ఉండే అవకాశం ఉంటుంది.● ఇళ్ల చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎలాంటి చెత్తాచెదారం, ముళ్ల పొదలు ఉండకూడదు.● గోడల వారన పాములు నక్కే అవకాశం ఉన్నందున కట్టెల వంటివి ఉంటే వాటిని తొలగించాలి.రెండు గాట్లు పడితేసాధారణ విష సర్పం కాటు వేసిన ప్రదేశంలో కోరల గాయం స్పష్టంగా కన్పించి, నొప్పి తీవ్రంగా ఉంటుంది. నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం వల్ల నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు, గొంతులో ఏదీ దిగని పరిస్థితి తలెత్తవచ్చు. చొంగ కారడంతో పాటు కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. రెండు గాట్లు పడితే విషపూరితమైన పాము అని గుర్తించాలి. తాచు పాము కంటే కట్లపాము ప్రమాదకరం. కట్లపాము కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తుంది. రక్తపింజర కాటేస్తే విషం రక్తంలో చేరుతుంది. నోరు, ముక్కు ద్వారా రక్తం బయటకు వస్తుంది. వెంటనే బాధితులను ఆస్పత్రికి చేర్పించాలి. తాచుపాము కాటేసిన 15 నిమిషాల్లోనే శరీరంలోనికి విషం ప్రవేశిస్తుంది.ధైర్యం చెప్పాలి● పాము విషం కన్నా చాలా మంది షాక్తోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. పాముకాటుకు గురైన వ్యక్తికి ధైర్యం చెప్పాలి.● చాలా పాములకు విషం ఉండదు. తాచుపాము, కట్లపాము, రక్తపింజరి, పొడపాము వంటి 15శాతం సర్పజాతులు ప్రమాదరకమైనవి.● నాటు వైద్యం, మంత్ర తంత్రాలు అని ఆలస్యం చెయ్యకుండా సాధ్యమైనంత త్వరగా దగ్గర్లోని ఆస్పత్రికి రోగిని తీసుకెళ్లాలి. రోగిని ఎట్టి పరిస్థితుల్లో నడిపించకూడదు.● సాధ్యమైనంత వరకు 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించాలి. పాము కాటు వేసిన ప్రదేశం పైభాగంలో రక్త ప్రసరణ జరగకుండా బలంగా కట్టుకట్టాలి.ఆధునిక చికిత్సతో లాభాలు● విషం విరుగుడు ఇంజెక్షన్ రూపంలో త్వరగా పనిచేస్తుంది.● బాధితునికి ఆందోళన, షాక్ వల్ల తలెత్తే ఇతర సమస్యలు సమర్ధవంతంగా నివారించవచ్చు.● సైలెన్ రూపంలో చికిత్సను మెరుగ్గా అందించే వీలుంటుంది.● చికిత్స ఆలస్యం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే మెడికో లీగల్ కేసుగా అధికారికంగా నమోదై ఆపద్బంధు పథకం కింద ప్రభుత్వం నుంచి పరిహారం పొందవచ్చు.జిల్లాలో పరిస్థితి ఇదీకోనసీమ జిల్లాలో 2014 జనవరి నుంచి ఈ ఏడాది జూన్ 27వ తేదీ వరకు 72 మంది పాముకాట్లకు గురయ్యారు. వీరిలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలో ప్రస్తుతం 1,724 యాంటీ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి పీహెచ్సీలోనూ 20 వరకు యాంటీ వీనమ్ వైల్స్ అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు.ఇంజెక్షన్ల కొరతలేదుప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైనందున విషసర్పాల సంచా రం అధికమవుతుంది. ముఖ్యంగా పొలాలకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాము కాటు బాధితులు ఆస్పత్రికి చేరేలోగా ప్రాథమిక వైద్యం చాలా ముఖ్యం. యాంటీ వీనమ్ ఇంజెక్షన్లకు కొరతలేదు. – దుర్గారావు దొర, జిల్లా వైద్యాధికారి,డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నిర్లక్ష్యం చేయకూడదుఎటువంటి పాముకాట్లకు గురైన వారైనా ముందుగా ఆస్పత్రికి చేర్చితే ప్రాథమిక చికిత్స చేసి యాంటీ వీనమ్ ఇంజెక్షన్ చేస్తారు. పాముకాటుకు గురైన వారు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా చూసుకోవాలి. పాము కరిచిన వ్యక్తికి చుట్టుపక్కల వారు ధైర్యం చెప్పాలి. పాము, కుక్కకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి.– వి.అనిరుధ్, ప్రాథమిక వైద్యాధికారి, పీహెచ్సీ, రాయవరం. -
పీపీపీ విధానంతో ఎంబీబీఎస్కు దూరం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనిల్ కాకినాడ రూరల్: వైద్య కళాశాలల్లో పీపీపీ విధానం అంటూ చంద్రబాబు ప్రభుత్వం కొత్త పాట పాడడంతో కొన్ని వందల మంది మెరిట్ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పూసల అనిల్ పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లోని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మెడికల్ కళాశాలలను 100 శాతం ప్రభుత్వపరంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పడు దానిని విస్మరించి ప్రైవేట్ విద్యా సంస్థలకు దోచి పెట్టేందుకు పీపీపీ విధానం తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫలితంగా వైద్య కళాశాలలు పూర్తిగా కార్పొరేట్ శక్తుల పరమై రాష్ట్రంలో పేద మెరిట్ విద్యార్థులకు ఎంబీబీఎస్ కలగా మారుతుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం అంటూ ప్రభుత్వ సంస్థలను తమ వారికి కారు చౌకగా అమ్మేందుకు అధికార పార్టీ చేస్తున్న కుట్ర అన్నారు. ఈ కుట్రలో ప్రజా ప్రతినిధులు, మంత్రులు భాగస్వాములని, 50 ఎకరాల భూమిని కేవలం రూ.5వేలకు 66 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో పలు వైద్య కళాశాలల్లో 750 మెడికల్ సీట్లు అందుబాటులో ఉండగా వాటిని రద్దు చేయమని నేషనల్ మెడికల్ కమిషన్కు కూటమి ప్రభుత్వం లేఖ రాసిందన్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమకు మెడికల్ సీట్లు కేటాయించాలని కోరుతుందని, కానీ ఏపీలో మాత్రం సీట్లను రద్దు చేయాలని కోరడం సిగ్గు చేటు అన్నారు. పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే కుతంత్రాలకు తక్షణం స్వస్తి పలకాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి ఉంగరాల సంతోష్, రాష్ట్ర కార్యదర్శి కరణం భాను నాయుడు, పార్టీ నాయకుడు రాయి సూరిబాబు పాల్గొన్నారు. -
అట్టహాసంగా పట్టాల పండగ
●● ఘనంగా జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం ● కులపతి హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ● బంగారు పతకాలు, పట్టాల ప్రదానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్టీయూకేలో శుక్రవారం 11వ స్నాతకోత్సవం వర్సిటీ ఆవరణలో అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 16 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వర్సిటీ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహూతులతో కార్యక్రమం నిర్వహించారు. 2023 మే 31న 9వ స్నాతకోత్సవం, 2024 జనవరి 30వ తేదీ వర్సిటీ 10వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు వరుసగా మూడవ సారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్డీలు పొందేవారు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ డాక్టర్ సీఎస్ఆర్కే ప్రసాద్ కళాశాల పూర్వ విద్యార్థి కోట సుబ్రహ్మణ్యంకు(సుబుకోటా)కు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. గంటా ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో పటిష్ట బందోబస్తు మధ్య 40మంది విద్యార్థులకు బంగారు పతకాలు, ఎండోమెంట్స్ అవార్డ్స్ అందజేశారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సెల్ఫీలతో సందడి చేశారు. పరిమితంగా అనుమతి ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. షెడ్యూల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని సమాచారం ఇవ్వగా ఆయన వేడుకలకు హాజరుకాలేదు. ముఖ్యఅతిథి శ్రీ కోట సుబ్రహ్మణ్యం (సుబు కోట)మాట్లాడుతూ సాంకేతిక రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగుమెంటెడ్ రియాల్టీల ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు స్టార్టప్ల కోసం ఏర్పాటయ్యే ఇంక్యుబేషనన్ సెల్స్ విశిష్టతను తెలిపారు. రేపటి యూనికార్న్లుగా మారేందుకు సొంత స్టార్టప్లను ప్రారంభించాలనుకునే జేఎన్టీయూకే విద్యార్థులను ఆయన అభినందించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని చేపడుతున్న పరిశోధనల ద్వారా నూతన ఆవిష్కరణలు, ఐటీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ రంగాలలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఉప కులపతి ప్రొఫెసర్ సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలను ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతో తీర్చిదిద్దాలని, మార్పులు చేయడంలో ధైర్యం, ధృడ నిశ్చయం, పెద్ద కలలు కనే సాహసం, సాంకేతిక కార్యకలాపాలలో లోతైన పరివర్తనకు ధైర్యం అవసరమని పట్టభద్రులకు సూచించారు. పరిశోధన కోసం నూతన కోణాలను అవలంబించాలని, సమాజ శ్రేయస్సు కోసం పరిశోధనా ప్రాజెక్ట్లను చేపట్టాలని కోరారు. పరిశ్రమ, విశ్వవిద్యాలయాలకు అనుసంధానంగా పాఠ్యాంశాలు, కోర్సు రూపకల్పనలు, పరిశ్రమలలో పరిశోధనలను జాతీయ విద్యా విధానం ప్రోత్సహిస్తుందన్నారు. పరిశోధక విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు జాతీయ క్వాంటమ్ మిషన్లో పాల్గొని సమాజ ప్రయోజనం కోసం అధునాతన విప్లవాత్మక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావాలన్నారు. అమృత్ కాల్కు సంబంధించి స్పష్టమైన విజన్ను రూపొందించడానికి, వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. అధిక కొవ్వు గల పదార్థాలను తీసుకోరాదని, పొగ తాగడం, మద్యం, డ్రగ్స్కు దూరంగా ఉండాలన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యకరంగా ఉంటుందని, దీనికి ప్రతీ ఒక్కరూ యోగా సాధన చేయాలని సూచించారు. అనంతరం ఉప కులపతి ప్రొ.సి.ఎస్.ఆర్.కె.ప్రసాద్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను శాలువాతో సత్కరించి మెమెంటోను బహూకరించారు. ఈ స్నాతకోత్సవంలో 99 మంది రీసెర్చ్ స్కాలర్స్కు పీహెచ్డీ అవార్డులు అందజేశారు. కలెక్టర్ శ్రీ ఎస్.షణ్మోహన్, ఎమ్మెల్సీ శ్రీమతి కర్రి పద్మశ్రీ, రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ రవీంద్రనాఽథ్, నల్లమిల్లి శేషారెడ్డి, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కొప్పిరెడ్డి పద్మరాజు, శ్రీనివాసకుమార్, కే.మురళీకృష్ణ, శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
గంజాయి కోసం బైక్ చోరీలు
● ముగ్గురి అరెస్టు, మరొకరు పరారీ ● 14 కిలోల గంజాయి, 14 బైక్ల స్వాధీనం గోకవరం: గంజాయికి అలవాటు పడిన యువకులు చోరీల బాట పట్టారు. బైక్లను చోరీ చేస్తూ వాటిని గంజాయి ముఠాకి అప్పగించి వారి వద్ద నుంచి గంజాయి తెచ్చుకుంటూ జల్సాలు చేస్తున్నారు. ఈ విధంగా బైక్లు చోరీ చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని 14 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను స్థానిక పోలీస్స్టేషన్లో నార్త్జోన్ డీఎస్పీ శ్రీకాంత్ శుక్రవారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన పాశం కొండలరావు అలియాస్ నాని అలియాస్ కళ్యాణ్, వాకాడ పవన్కుమార్ అలియాస్ ముక్కా పవన్, కాకర్ల వెంకటకుమార్ అలియాస్ వెంకట్, గోకవరానికి చెందిన ఆవుల వంశీ వ్యసనాలకు బానిసలయ్యారు. వీరు మరికొంత మందితో కలిసి గంజాయి కోసం ఇళ్ల బయట నిలిపిఉంచిన ఖరీదైన స్పోర్ట్స్ బైక్లను దొంగతనాలు చేసి ఏజెన్సీలోని గంజాయికి మారకం చేసి ఆ మత్తును సేవిస్తున్నారు. శుక్రవారం గోకవరం శివారు కొత్తపల్లికి వెళ్లే మార్గంలో బాపనమ్మ ఆలయం వద్ద ఎస్సై పవన్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బైక్లపై వస్తున్న వీరిని పోలీసులు గుర్తించి నిలువరించగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. సిబ్బంది వారిని చాకచక్యంగా పట్టించుకునే ప్రయత్నంలో వంశీ తప్పించుకున్నాడు. మిగిలిన ముగ్గురు నుంచి 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని వారిని విచారించారు. ఈ సందర్భంగా బైక్ల చోరీ గురించి వెల్లడించారు. ఈ సమాచారంతో కామరాజుపేట శివారున ఫారెస్టు చెక్పోస్టు సమీపంలోని పైపులైన్ బ్రిడ్జి కింద దాచి ఉంచిన 14 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం తరలించనున్నామనని, తప్పించుకున్న మరో యువకుడిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. మండలంలో గంజాయి రవాణా, విక్రయాల సమాచారం ఉంటే తమకు చెప్పాలని ఆయన కోరారు. కోరుకొండ సీఐ సత్యకిశోర్, ఎస్సై పవన్కుమార్, ఇతర సిబ్బంది ఈ దర్యాప్తులో పాల్గొన్నారు. -
ఉత్సాహంగా జిల్లా స్థాయి ఎడ్ల పందేలు
జగ్గంపేట: మండలంలోని మామిడాడలో కోటాలమ్మ అమ్మవారి జాతరను పురస్కరించుకుని గ్రామ కమిటీ ఽఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎడ్ల పందేలు శుక్రవారం నిర్వహించారు. సీనియిర్స్ విభాగంలో గుమ్మిలేరు, జూనియిర్స్ విభాగంలో దుళ్ల ఎద్దులు ప్రధమ స్థానంలో నిలిచాయి. విజేతలకు మాజీ మంత్రి, జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి తోట నరసింహం, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ బహుమతులు, జ్ఞాపికలు అందచేసారు. సీనియిర్స్ విభాగంలో ప్రధమ స్థానంలో కూర వీరవెంకట సత్యవేణి (గుమ్ములేరు), ద్వితీయ స్థానంలో వల్లూరి లత (మండపేట) తృతీయస్థానంలో కానుమల్లి జైవర్దన (ఏడిద) గెలుపొందారు. అలాగే జూనియిర్స్ విభాగంలో తూము శ్రీను (దుళ్ల), బొజ్జ నారాయణరావు(పిఠాపురం), బండారు శ్రీను మెమోరియిల్(కొప్పవరం)ప్ర ధమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో గెలుపొందారు. -
తలుపులమ్మకు చీర, సారె
వైభవంగా సామూహిక కుంకుమ పూజ, హోమం తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలను పురష్కరించుకుని తలుపులమ్మ అమ్మవారికి తుని వాసవీ కన్యకా పరమేశ్వరి మహిళా భక్త సమాజం, వివిధ గ్రామాల మహిళలు చీరసారెలను సమర్పించారు. శుక్రవారం చీరసారెలతో వచ్చిన మహిళలకు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు ఆధ్వర్యంలో వేద పండితులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి చీరసారె సమర్పించిన తర్వాత సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దేవస్థానం తరఫున భక్తులందరికీ పసుపు, కుంకుమ, రవిక, గాజులు, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ నెల 24న సప్తనదీ జలాలతో అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్టు ఈఓ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మహిళను హత్య చేసిన ముగ్గురికి జీవిత ఖైదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మహిళను హత్య చేసి బంగారం, నగదు దోచుకువెళ్లిన కేసులో ముగ్గురికి జీవితఖైదు విధిస్తూ 10వ అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్ కోర్టు కమ్ ఎస్సీఅండ్ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎస్.ఉమసునంద శుక్రవారం తీర్పునిచ్చారు. రాజమహేంద్రవరం జాంపేట వద్ద పుచ్చల నాగభారతి హోటల్ నిర్వాహకురాలు. లలితానగర్కు చెందిన దేవబత్తుల నాగమహేష్, దేవబత్తుల లక్ష్మణరావు ఆమె హోటల్కు సమోసాలు సరఫరా చేసేవారు. ఈ నేపధ్యంలో నాగభారతి ఇంటిలో ఓ ఫంక్షన్కు సమోసాలు ఆర్డర్ ఇచ్చింది. వారు సమోసాలు తీసుకువచ్చిన సమయంలో భారతి ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఉండడంతో వాటిని దోచుకోవాలని భావించారు. ముందస్తు పధకం ప్రకారం అన్నపూర్ణమ్మపేటకు చెందిన నక్క చందు అనే వ్యక్తిని తీసుకుని నాగమహేష్, లక్ష్మీనారాయణ 2013 డిసెంబర్ 2న మధ్యాహ్నం నాగభారతి ఇంటికి వెళ్లారు. ఆమె ఒంటిపై బంగారు నగలు లాక్కునేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో వారు ఆమెను హతమార్చి ఆభరణాలు తీసుకుని పారిపోయారు. నాగభారతి భర్త ప్రసాదరావు ఫిర్యాదు మేరకు మూడో పట్టణ సీఐ ఎం.రమేష్, ఎస్.గంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ముద్దాయిలను అదుపులోకి తీసుకుని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్ పీపీలు ఎ.రాధాకృష్ణరాజు, డి.శ్రీవాణిబాయి వాదనలు వినిపించారు. నిజనిర్ధారణ కావడంతో నిందితులకు జీవిత కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. నిందితులకు శిక్ష పడడంలో కేసును పర్యవేక్షించిన ప్రస్తుత సీఐ అప్పారావు, కోర్టు ఏఎస్సై జి.వెంకటేశ్వర్లును ఎస్పీ డి.నరసింహకిశోర్ ప్రత్యేకంగా అభినందించినారు. -
9 నుంచి ‘నన్నయ’లో సెమినార్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఈ నెల 9,10 తేదీలలో ఇంటర్నేషనల్ సెమినార్ జరుగనుంది. తాడేపల్లిగూడెం క్యాంపస్లోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ అనలిటికల్ అండ్ ఫార్మాస్యూటికల్ డెవలప్మెంట్’ అనే అంశంపై జరిగే ఈ సెమినార్కి సంబంధించిన బ్రోచర్ను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ గురువారం విడుదల చేశారు. ఈ సెమినార్లో స్పీకర్స్గా ప్రొఫెసర్ కేవీ రామానుజాచారి (యుఎస్ఏ), సైంటిస్టు డాక్టర్ ఎన్.నాగన్న (చైనా), ప్రొఫెసర్ పి.నాగేశ్వరరావు (వరంగల్), డాక్టర్ రాంబాబురెడ్డి (ఐఐటీ – ఖరగ్పూర్) పాల్గొంటారన్నారు. దీనికి కన్వీనర్గా డాక్టర్ బి. జగన్మోహన్రెడ్డి వ్యవహరిస్తారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
నిలువ నీడేదీ!
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని పశ్చిమ రాజగోపురం ఎదురుగా విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి 2023లో విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ముందుకు వచ్చింది. రత్నగిరి రామాలయం పక్కన రేకులతో వేసిన విశ్రాంతి షెడ్డు లాగే ఇక్కడ కూడా నిర్మించాలని నిర్ణయించారు. అందుకు ఆ సంస్థ కూడా అంగీకరించింది. ఆ తర్వాత కొత్త ఈఓ రావడంతో ఆ ప్రతిపాదన కాస్తా అటకెక్కింది. దీంతో ఆ నిధులను సంస్థ మరో కార్యక్రమానికి వినియోగించింది. అనంతరం ఇక్కడ రేకుల షెడ్డు కాకుండా, ప్లాస్టిక్ క్లాత్లా టెన్సిల్ రూఫ్ షెడ్డు వేయాలని దేవస్థానం ప్రతిపాదించింది. దీనిపై ఆలోచన చేస్తామని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ క్రమంలో నీడ లేక, చలువ పందిరిలో వర్షానికి తడిసి భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నీడ లేక అవస్థలు పశ్చిమ రాజగోపురం వద్ద భక్తులకు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గతంలో 60 గదులతో సత్యదేవ అతిథి గృహం (సత్రం) ఉండేది. భక్తుల కోసం (గ్యాలోరిమ్ టైల్స్ రూఫ్ షెడ్) విశ్రాంతి షెడ్డు నిర్మించాలనే ఆలోచనతో ఆ సత్రాన్ని 2023 అక్టోబర్లో తొలగించారు. అక్కడ విశాల షెడ్డు నిర్మించాలని అప్పటి ఈఓ చంద్రశేఖర్ అజాద్ ప్రణాళిక రూపొందించారు. విశాఖపట్నానికి చెందిన లారెస్ సంస్థ రూ.1.99 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఆ ఏడాది కార్తిక మాసం ప్రారంభం కావడంతో తాత్కాలిక షెడ్డు నిర్మించారు. కార్తిక మాసం అనంతరం షెడ్డు నిర్మించడానికి ఆ సంస్థ మెటీరియల్ కూడా సిద్ధం చేసింది. ఈఓ బదిలీతో.. కాగా, ఈఓ చంద్రశేఖర్ అజాద్ బదిలీ కావడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఆయన స్థానంలో ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ బాధ్యతలు చేపట్టారు. రేకుల షెడ్డు నిర్మిస్తే రాజగోపురం కనిపించదని ఆయన ఆ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్పారు. ఈ నేపథ్యంలోనే లారెస్ సంస్థ ఆ నిధులను వేరే పనులకు వినియోగించింది. పార్కింగ్గా షెడ్డు స్థలం పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్రం కూల్చివేయడంతో, ఆ ప్రదేశం పార్కింగ్ స్థలంగా మారింది. దేవస్థానం బస్సులు కూడా ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారు. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ నుంచి సత్యదేవుని ఆలయానికి రాకపోకలు సాగిస్తుంటారు. వేసవిలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేస్తున్నారు. ఈ ఏడాదీ అలాగే చేశారు. వర్షం పడితే చలువ పందిళ్ల నుంచి నీరు కారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవస్థానం వారు కనీసం షెడ్డు వేయలేరా అని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు గత ఫిబ్రవరిలో లారెస్ సంస్థ ప్రతినిధులను షెడ్డు నిర్మించాలని కోరారు. నాలుగు నెలలైనా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆ సంస్థ ముందుకు రాకపోతే దేవస్థానం నిధులైనా వెచ్చించి, షెడ్డు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. శ్రావణ మాసంలో రద్దీ ప్రస్తుతం ఆషాఢ మాసంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్నా.. జూలై 25 నుంచి శ్రావణ మాసంలో సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు తరలివస్తారు. వివాహాల సీజన్ కావడంతో రాత్రి వేళల్లో కూడా పెద్ద సంఖ్యలో పెళ్లి బృందాలు వస్తాయి. అదే సమయంలో వర్షాలు కూడా అధికమవుతాయి. దీంతో భక్తుల అవస్థలు చెప్పనలవి కాదు. అధికారులు ఏమన్నారంటే.. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి లారెస్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో నిధులు లేవని తెలిపింది. చిన్న షెడ్డు నిర్మిస్తామని చెప్పింది. పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామన్నారు. వారు అంగీకారం తెలిపిన వెంటనే దేవస్థానం చైర్మన్, ఈఓల అనుమతి తీసుకుని షెడ్డు నిర్మిస్తామన్నారు. ఫ పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణమెప్పుడో? ఫ 2023లో 60 గదుల సత్యదేవ సత్రం కూల్చివేత ఫ రూ.1.99 కోట్లతో షెడ్డు నిర్మాణానికి లారెస్ ఫార్మా సంసిద్ధత ఫ ఆ నిధులను మరో కార్యక్రమానికి వెచ్చించిన సంస్థ ఫ నీడ లేక సత్యదేవుని భక్తులకు ఇక్కట్లు -
నేడే పట్టాభిషేకం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీటెక్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదివినవారికి గుర్తింపుగా యూనివర్సిటీ అందజేసే పట్టాల వేడుకలకు జేఎన్టీయూ కాకినాడ వేదిక అవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న వారికి సైతం పట్టా అందుకోవడానికి వర్సిటీ ఆహ్వానాలు పంపింది. విద్యార్థులు సంప్రదాయ వస్త్రధారణలో పట్టా (ఒరిజనల్ డిగ్రీ) తీసుకోవడానికి ఏర్పాట్లు చేసింది. జీవితంలో మధురానుభూతిగా నిలిచే ఈ వేడుకలకు అర్హులైనవారు తమ వివరాలు వర్సిటీకు పంపించారు. గత ఏడాది డిసెంబర్లో స్నాతకోత్సవం నోటిఫికేషన్ జారీ చేసి గవర్నర్ అనుమతితో శుక్రవారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 11వ స్నాతకోత్సవ వేడుకల్లో భాగంగా 2023–24 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పట్టాలు అందజేస్తున్నారు. బీటెక్ విభాగంలో 41,258, బిఫార్మశీ 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1115, ఎంఫార్మశీ 458, బీబీఏ 115, ఫార్మడీ 274, బీఆర్క్ 83 ఓడీ (ఒరిజనల్ డిగ్రీ)లు విద్యార్థులు పొందనున్నారు. వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు 40మందికి, పీహెచ్డీలు 99 మందికి అందజేయనున్నట్టు వర్సిటీ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. పూర్వ విద్యార్థి కోట సుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్.. స్నాతకోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థి, అమెరికా బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యంకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. విజయవాడలో జన్మించిన ఈయన జేఎన్టీయూ కాకినాడ కళాశాలలో బీటెక్, ఐఐటీ ఖరగ్పూర్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1986లో అమెరికాలో బోస్టన్ గ్రూప్ స్థాపించి సుమారు 2,500 మందికి యూఎస్లో ఉద్యోగ అవకాశాలు కల్పించి మలేషియా, ఇండోనేషియా, ఫిలిఫిన్స్ వంటి దేశాల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించే విధంగా జేఎన్టీయూకేలో సుబుకోటా ఫౌండేషన్ స్థాపించి కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ప్రతి ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థులకు పోటీలు నిర్వహిహించి నగదు బహుమతితో ప్రొత్సహిస్తున్నారు. జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవం వర్సిటీ కులపతి, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు -
ఎయిర్ వాల్వ్లో పడిన కారు
తప్పిన ప్రమాదంపి.గన్నవరం: స్థానిక ఏజీ రోడ్డులో వెళ్తున్న ఒక కారు రోడ్డు మార్జిన్లో ఉన్న మంచినీటి పైపులైన్ ఎయిర్ వాల్వ్ గోతిలో పడటంతో ముందు చక్రం విరిగిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం నుంచి కారులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పి.గన్నవరం ప్రధాన పంట కాలువ నుంచి ముంగండ మంచినీటి ప్రాజక్టుకు వెళ్లే పైపులైన్లు గతంలో రోడ్డు మార్జిన్లో ఉండేవి. అయితే ఇటీవల రోడ్డును వెడల్పు చేశారు. దీంతో మూడుచోట్ల పైపు లైన్ల ఎయిర్ వాల్వ్లు సీసీ రోడ్డులోకి వచ్చాయి. దీంతో అక్కడ రంధ్రాలు ఏర్పడటంతో సిమెంట్ వరలు ఏర్పాటు చేశారు. ఆ వరలు విరిగిపోవడంతో గోతులు ఏర్పడ్డాయి. వీటిని గమనించని వాహన చోదకులు వాటిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల పలువురు ద్విచక్ర వాహన చోదకులు ఆ గోతుల్లో పడి గాయాల పాలయ్యారు. తక్షణమే ఎయిర్ వాల్వ్లు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రభుత్వాలు ప్రోత్సహించాలి
వంట నూనెల కొరత దృష్ట్యా ఆయిల్పామ్ రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. కనీస ప్రోత్సాహక ధరగా రూ.25 వేలు చెల్లించాలి. దిగుమతి సుంకాలతో ఆయిల్పామ్ గెలల ధరకు ముడి పెట్టకూడదు. వైట్ ఫ్లై (తెల్లదోమ) కారణంగా గెలల దిగుబడి తగ్గిపోవడం వలన కూడా రైతు నష్టపోతున్నాడు. నూనె శాతాన్ని నిర్ణయించే పెదవేగి ఆయిల్పామ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించరాదు. – పెండ్యాల బుజ్జిబాబు, తూర్పు గోదావరి జిల్లా ఆయిల్పామ్ రైతు సంఘం అధ్యక్షుడు, రంగంపేట -
రైతు కంట చెమ్మ
● పతనమైన నిమ్మ ధర ● కిలో రూ.7 ● కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన ● అంతంత మాత్రంగా ఎగుమతులుదేవరపల్లి: నిమ్మకాయల ధర పతనమవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో నిమ్మకాయలకు రూ.7 నుంచి రూ.10 మధ్య మాత్రమే రైతులకు దక్కుతోంది. అదే వినియోగదారుల వద్దకు వచ్చేసరికి కిలో రూ.50 నుంచి రూ.55 వరకూ పలుకుతోంది. సైజును బట్టి ఒక్కో నిమ్మకాయ ధర రూ.2 నుంచి రూ.5 వరకూ కూడా చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో ధర భారీగా ఉన్నప్పటికీ తమకు మాత్రం దక్కుతున్నది చాలా స్వల్పంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఈ ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని, కోత కూలి డబ్బులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూండటంతో కాయల కోతలు జరగడం లేదు. నిమ్మకాయలు చెట్ల కింద రాలిపోయి ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలంలో వినియోగం తక్కువగా ఉండటంతో, ఎగుమతులు నిలిచి, నిమ్మకాయలకు ధర కూడా తక్కువగా పలుకుతుంది. ఇదే సమయంలో తోటల నుంచి లేత కాపులు ఒకేసారి అందుకోవడంతో మార్కెట్కు కాయలు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. దీనికి తోడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, టెక్కలి, నర్సన్నపేట ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎక్కువగా మెట్ట నిమ్మకాయల దిగుబడి వస్తుంది. ఇవి అక్కడి మార్కెట్లను ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు ఉండవు. దిగుబడి ఎక్కువగా ఉండడటం, డిమాండ్ లేక ఎగుమతులు తగ్గడంతో తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, ప్రస్తుతం ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు. వేసవిలో గిరాకీ ఈ ఏడాది వేసవిలో నిమ్మకాయలకు మంచి గిరాకీ ఏర్పడింది. కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకూ రైతుకు దక్కింది. దిగుబడులు కూడా ఆశాజనకంగా వచ్చాయి. రైతులు పెట్టుబడులు, కౌలు డబ్బులు దక్క డంతో ఒడ్కెక్కారు. సాధారణంగా ఎండల తీవ్రత అ ధికంగా ఉండే ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ మార్కె ట్లో నిమ్మకాయలకు గిరాకీ ఉంటుంది. జూలై నుంచి జనవరి వరకూ గిరాకీ అంతంత మాత్రంగానే ఉంటుంది. దేవరపల్లి మండలంలోని యాదవోలు మార్కె ట్ నుంచి ప్రతి రోజూ వివిధ ప్రాంతాలకు నిమ్మకాయ ల రవాణా జరుగుతుంది. ఇక్కడ రైతులే వ్యాపారు లుగా తయారై ఇతర రైతుల నుంచి ఎటువంటి కమీషన్ లేకుండా నిమ్మకాయలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూంటారు. దాదాపు 50 ఏళ్లుగా ఉన్న యాద వోలు నిమ్మ మార్కెట్కు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. సీజన్లో ఇక్కడి నుంచి రోజుకు సుమారు 100 టన్నుల నిమ్మకాయలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. కొద్ది రోజుల కిందట 35 నుంచి 40 టన్నుల కాయలు మార్కెట్కు వచ్చేవి. ఇటీవలి వర్షాలకు రోజుకు 10 నుంచి 12 టన్నులు మాత్రమే వస్తున్నాయి. అయినప్పటికీ, డిమాండ్ లేకపోవడంతో రైతుకు ధర రావడం లేదు. మంగు తెగులు నిమ్మకాయలకు మంగు తెగులు, కాయ అడుగు భాగం మచ్చ (డాట్) వచ్చాయి. ప్రస్తుత వాతావరణానికి మంగు తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. కాయలకు కోత కూలి డబ్బులు కూడా రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ధర పతనమైంది. మే 1 నుంచి 10వ తేదీ వరకూ కిలో రూ.35 నుంచి రూ.42 మధ్య పలికిన ధర అనంతరం రూ.20కి తగ్గింది. ఈ ధర గత నెలలో రూ.7 నుంచి రూ.10 మధ్యకు పడిపోయింది. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది. – అనిశెట్టి సూర్యచంద్రరావు, రైతు, యాదవోలు -
సమర్థవంతంగా నేరాల కట్టడి
● పోలీసు అధికారులు, సిబ్బంది సహకారం భేష్ ● ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి ● నేర సమీక్షలో ఎస్పీ నరసింహ కిశోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లాలో నేరాలను సమర్థంగా అరికట్టగలుగుతున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అర్థ సంవత్సర నేర సమీక్ష నిర్వహించారు. 2025లో ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసులు ఛేదించిన కేసులు, సాధించిన విజయాలను చర్చించారు. కేసుల దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై తక్షణమే స్పందించాలని, బాధితులకు అండగా నిలవాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కట్టడి చేయాలన్నారు. ఈ సమీక్షలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని, రాబోయే ఆరు నెలలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధనదైన్యాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా ఖ్యాతినొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు పీకల్లోతు దైన్యంలో కూరుకుపోయారు. రబీ ధాన్యం డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీరని జాప్యం అన్నదాతలకు శాపంగా మారింది. ఒకటీ రెండూ రోజులు కాదు.. ఒకరో ఇద్దరో రైతులూ కారు.. వందా రెండు వందల రూపాయలు అంతకంటే కాదు.. ఏకంగా రెండు నెలలుగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం రూ.399 కోట్ల మేర ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే సమయంలో ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైపోయింది. ఈ నెల 15లోగా నారుమళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు గత వైఎస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా అందించడం లేదు. పైగా ఈ పథకం పేరును అన్నదాతా సుఖీభవగా మార్చి రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ నయాపైసా కూడా ఇవ్వలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. ప్రభుత్వమే నెలల తరబడి ధాన్యం సొమ్ము తొక్కిపెడితే ఖరీఫ్ సాగు ఏవిధంగా చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ రైతును కదిలించినా ధాన్యం సొమ్ము రాలేదంటూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. గొప్ప చెప్పి.. చిప్ప చూపి.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కూటమి నేతలందరూ ధాన్యం అమ్మిన 24 లేదా 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామమని గొప్పగా చెప్పారు. మంత్రి నాదెండ్ల అయితే ధాన్యం కొనుగోళ్లు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ధాన్యం సొమ్ముపై రైతులకు ఆశలు కల్పించారు. కొనుగోళ్లు ప్రారంభమైన తొలి పక్షంలో మాత్రం ప్రచారార్భాటం కోసం రైతుల ఖాతాల్లో సొమ్ము వేశారు. మే మొదటి వారం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో, కడుపు మండిన అన్నదాతలు ధాన్యం సొమ్ము కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అంతే కాకుండా, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్; కాకినాడ జిల్లా పెద్దాపురం; కోనసీమ జిల్లా అమలాపురం తదితర ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. రైతులు తక్కువలో తక్కువ ఎకరాకు 50 బస్తాల (75 కేజీలు) దిగుబడి సాధించారు. ఈ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ప్రతి రైతుకు ఎకరానికి రూ.86 వేలు పైగా రావాలి. ఈవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం రూ.399 కోట్ల మేర ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది ఓవైపు ఖరీఫ్ ఖరీఫ్ సాగు ప్రారంభమైపోయినా ధాన్యం బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ పెద్దల నుంచి ఉలుకూపలుకూ లేదు. కాకినాడలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. అప్పు పుట్టక.. కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి మార్కెట్లో నగదు చలామణీ భారీగా పడిపోయింది. దాదాపు అన్ని వర్గాల వద్ద డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. ఏటా పంట పెట్టుబడిలు సమయంలో సొమ్ము సర్దుబాటు చేసే కమీషన్ ఏజెంట్లు కూడా ఈసారి చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అప్పు పుట్టడం లేదు. ఖరీఫ్కు సమాయత్తమయ్యే తరుణంలో రైతులు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతు నేతలు మండిపడుతున్నారు. జిల్లాల వారీగా రబీ ధాన్యం బకాయిలు కాకినాడ రూ.80 కోట్లు కోనసీమ రూ.189 కోట్లు తూర్పు గోదావరి రూ.130 కోట్లు మొత్తం రూ.399 కోట్లు నెలలు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఇవ్వని సర్కారు ఉమ్మడి జిల్లాలో మొత్తం బకాయి రూ.399 కోట్లు ఖరీఫ్ పెట్టుబడికి రైతుల అగచాట్లు ధాన్యం సొమ్ము ఇస్తారా.. ఇవ్వరా అని ప్రశ్న అప్పులతోనే ఖరీఫ్ సాగు అట్లపాడులో 9.2 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఎకరాకు రూ.45 వేల వరకూ పెట్టుబడి పెట్టి రబీ సాగు చేశాను. ఎకరాకు 49 బస్తాల దిగుబడి వచ్చింది. ఏప్రిల్ 27న రైస్మిల్లుకు తోలాను. రూ.7.60 లక్షల వరకూ రావాల్సి ఉంది. రెండు నెలలు గడచినా ప్రభుత్వం ఇంకా మా డబ్బులు జమ చేయలేదు. దీంతో, మళ్లీ అప్పులు చేసి ఖరీఫ్ సాగు చేపట్టాను. – కొత్తపల్లి సత్యనారాయణ, కౌలు రైతు, సమిశ్రగూడెం, నిడదవోలు మండలం -
కూటమి సర్కారువి దిగజారుడు రాజకీయాలు
● సంక్షేమం మరచి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు ● మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుచాగల్లు: దళితుడైన చీలి సింగయ్య మృతిలో కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తోందని, ఇది కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ధ్వజమెత్తారు. చాగల్లు మండలం నందిగంపాడులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సింగయ్య మృతిపై అక్రమ కేసులు పెట్టి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కారు కింద పడి, మరణించినట్లు చూపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దానిలో భాగంగానే 37 సెకెన్ల నిడివితో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారని, దాని ఆధారంగా అక్రమ కేసులు కట్టారని ఆరోపించారు. ఈ కేసులపై జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, కోర్టుకు ప్రభుత్వం ఇప్పటికీ ఆధారాలు చూపించలేక వాయిదాలు అడుగుతోందని అన్నారు. నిజంగా 4 టన్నుల బరువున్న జగన్ కారు కింద పడి చనిపోయి ఉంటే సింగయ్య తల నుజ్జునుజ్జు కాకుండా ఎలా ఉందో చంద్రబాబే చెప్పాలని ప్రశ్నించారు. కారు చక్రం ఎక్కి ఉంటే దాని తరువాత వీడియో కానీ, కారు కింద నుంచి సింగయ్యను బయటకు తీసిన వీడియో కానీ ప్రభుత్వం వద్ద ఎందుకు లేవని నిలదీశారు. వీడియోతో ప్రభుత్వం ఆడుతున్న నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. ప్రమాదాలు జరిగితే వాహనం డ్రైవర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న వారిపై కేసులు పెట్టిన చరిత్ర ఎక్కడా ఎప్పుడూ లేదని, తొలిసారి కూటమి ప్రభుత్వమే ఆ రికార్డు కూడా నమోదు చేసుకుందని విమర్శించారు. బస్సు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అందులోని ప్రయాణికులదరిపై కేసు పెడతారా అని ప్రశ్నించారు. సింగయ్య మృతిపై సీబీఐ విచారణ జరిపి, దీని వెనుక ఉన్న కుట్రను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. కేవలం జగన్ను కేసులో ఇరికించే దురుద్దేశంతో కూటమి నాయకులు ఒక నిండు ప్రాణం బలిగొన్నారని అన్నారు. గతంలో గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు పబ్లిసిటీ కోసం 29 మంది ప్రాణాలు తీశారని, ఈ ఘటనలో మొదటి ముద్దాయి ఆయనేనని వెంకట్రావు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి ఎనిమిది మంది మరణానికి, వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో ఆరుగురు భక్తుల మృతికి కారకులయ్యారని, వీటన్నింటికీ సంబంధించి చంద్రబాబుపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. అక్రమ కేసులు కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలవుతున్నా ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వెంకట్రావు దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులతో నందిగం సురేష్, వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి, జోగి రమేష్ కుమారుడిని అరెస్టు చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన భార్య జయసుధపై అక్రమ కేసులు పెట్టి అరెస్టుకు ప్రయత్నించారన్నారు. అసలు జరగని లిక్కర్ స్కామ్ను జరిగినట్లు చూపించి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కూడా అక్రమంగా అరెస్టు చేసి జైలులో నిర్బంధించారని చెప్పారు. ఐపీఎస్ అధికారులు, కొమ్మినేని శ్రీనివాసరావు వంటి జర్నలిస్టులను సైతం కేసులు, అరెస్టులతో కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు వైఎస్సార్ సీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు 240 మందిని జైళ్లకు పంపించారని చెప్పారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని వెంకట్రావు అన్నారు. -
పంట కాల్వలు కలుషితం
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పంట కాల్వల ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలు మానవ తప్పిదాలతో కలుషిత అవుతున్నాయని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. అమలాపురంలో గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ మానవ నిర్లక్ష్యం, తప్పిదాలపై తాను హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. కాల్వల ద్వారా ప్రవహించే గోదావరి జలాలతో పంటల సాగే కాకుండా పలు గ్రామాల్లో తాగునీటి ప్రాజెక్ట్లు నిర్వహిస్తున్నారని వివరించారు. కొందరు తమ ఇళ్ల మరుగుదొడ్ల గొట్టాలు కాల్వల్లోకి అమర్చుకొని కలుషితం చేస్తున్నారని, తద్వారా పంట కాల్వలు మానవ మల మూత్రాలతో ప్రవహిస్తున్నాయని ఎమ్మెల్సీ ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగునీరు కోసం కాటన్ దొర పంట కాల్వల వ్యవస్థను తీసుకుని వస్తే స్వార్థుపరులు, కాల్వలను పర్యవేక్షించాల్సి అధికారుల నిర్లక్ష్యం వల్ల కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. కాల్వలను కలుషితం చేయవద్దని, వ్యర్థాలను వదల వద్దని న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నాయని గుర్తు చేశారు. కాల్వలను కలుషిత చేసే వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేయనున్న ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు -
‘ఫోర్జరీ పోలీస్’ సస్పెన్షన్
కాకినాడ క్రైం: రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ సంతకాన్నే ఫోర్జరీ చేసిన హెడ్ కానిస్టేబుల్పై ఉన్నతాధికారులు కొరడా ఝుళిపించారు. విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరం జీఆర్పీ స్పెషల్ బ్రాంచ్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు ఏకంగా రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ సంతకాన్నే ఫోర్జరీ చేసి ఎస్ఐని అని ఓ నకిలీ ఐడీ కార్డును తన పేరుతో తయారు చేసుకున్నాడు. ఈ కార్డుని వాడుతూ, పలుచోట్ల బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ తరహాలోనే కాకినాడలోని రైల్వే గెస్ట్ హౌస్లో ఓ కుటుంబ వివాదంలో విచారణ పేరుతో కామేశ్వరరావు జోక్యం చేసుకున్నాడు. విచారణ సమయంలో ఓ మహిళను తాను ఎస్ఐని అని చెబుతూ నకిలీ ఐడీ కార్డు చూపించి మరీ బెదిరించారు. అయితే, అప్పటికే కామేశ్వరరావుది హెడ్ కానిస్టేబుల్ హోదా అని తెలుసుకున్న మహిళ నకిలీ ఐడీ కార్డు వ్యవహారాన్ని కాకినాడ జిల్లా ఎస్పీబిందుమాధవ్, ఇంటెలిజెన్స్ అధికారులకు వెల్లడించి, కాకినాడ టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ మొదలు కాగా, ప్రాథమిక ఆధారాల ప్రాతిపదికగా రాజమహేంద్రవరం జీఆర్పీ నుంచి అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖకు కామేశ్వరరావును పంపారు. లోతైన విచారణ అనంతరం ఆరోపణలన్నీ వాస్తవాలని తేలడంతో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా కామేశ్వరరావును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కాకినాడ జిల్లా పోలీస్ శాఖకు సిఫారసు చేశారు. కాకినాడలోని రైల్వే గెస్ట్ హౌస్ వద్ద మహిళను నకిలీ ఎస్ఐ ఐడీ కార్డుతో బెదిరించిన నేరంలో కామేశ్వరరావుకి సహకరించిన ఓ మహిళా కానిస్టేబుల్ పైనా చర్యలు తీసుకోవాలని, బదిలీపై తూర్పుగోదావరి జిల్లా పోలీస్ శాఖకు వెళుతున్న నేపథ్యంలో అక్కడి పోలీసులకు అనకాపల్లి ఎస్పీ సిఫారసు చేశారు. -
సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులపై దాడి దారుణం
సీటీఆర్ఐ: గోకవరం మండలం మల్లవరం గ్రామంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులు, అర్చకత్వం చేస్తున్న వారిపై దాడికి పాల్పడి వారి గృహలను ధ్వంసం చేయడమే కాకుండా దేవుడి పూజా సామగ్రి, బంగారం, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అయినాపురపు సూర్య నారాయణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు గుడిలో అర్చకత్వం చేస్తున్న పసుపులేటి సింగారలక్ష్మి, వి.సీతామహలక్ష్మితో కలిసి మాట్లాడారు. సింగారమ్మ చింతగా పేరొందిన అది ప్రైవేటు ఆలయమే అయినప్పటికీ భక్తులు ఇటీవల భారీగా తరలివస్తున్నారని, అమ్మవారికి పూజలు చేస్తున్నారని తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఈ ఆలయాన్ని తమ చేతిలో పెట్టుకోవాలనే దురుద్దేశంతో ఏప్రిల్ 23వ తేదీ రాత్రి వట్టికూటి వీర రాఘవమ్మ, పసుపులేటి సింగారలక్ష్మిపై దాడి చేసి గృహలను, షాపులను కూల్చి వేశారని, సుమారు రూ.25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను దోచుకుని పోయారని అన్నారు. గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేదన్నారు. తాము హైకోర్టులో జూన్న్20న రిట్ పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆదేశించిందన్నారు. బాధితులు మే 26న జిల్లా కలెక్టర్కు ఈ ఘటనపై ఫిర్యాదు చేశారని తెలిపారు. 1880 నాటి కాలంలో వారి ముత్తాత పసుపులేటి వెంకన్న, పసుపులేటి వీరరాఘవమ్మ దంపతులు చింతచెట్టు కింద వెలసిన సింగారమ్మ తల్లికి సుమారు 5 ఎకరాల అడవిని చదును చేసి ఆలయ ప్రాంగణంగా రూపొందించారన్నారు. వంశ పారంపర్యంగా ఆలయం వద్దనే నివాసాలు ఏర్పర్చుకుని పూజారులుగా, ట్రస్టీలుగా కొనసాగుతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి గుడిని రక్షించాలని కోరుతున్నామన్నారు. వట్టికూటి దుర్గాప్రసాద్, వట్టికూటి జనార్ధనరావు, సీతామహలక్ష్మి, ఆలమూరు ధనలక్ష్మి, పసుపులేటి శ్రీ వెంకట సూర్య చక్ర ధనుష్కుమార్ పాల్గొన్నారు.హైకోర్టు న్యాయవాది సూర్యనారాయణ -
రెండు కార్లు ఢీ : ఒకరి మృతి
రావులపాలెం: కారు టైరు పేలడంతో ఆ కారు డివైడర్ను దాటి అవతల దారిలో ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. రావులపాలెం మండలంలో ఈతకోట టోల్ ప్లాజా సమీపంలో గురువారం జరిగిన ఈ ప్రమాదంలో పాలకొల్లుకు చెందిన బొండాల నరసింహ గుప్తా (55) మృతి చెందారు. పాలకొల్లుకు చెందిన గుప్తా భార్య వీర వెంకట లక్ష్మీదేవితో కలిసి రాజమహేంద్రవరం బంధువుల ఇంటికి బయలుదేరారు. ఈతకోట టోల్ ప్లాజా దాటాక కొంతదూరంలో కారు టైరు పేలడంతో ఆ కారు డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన కేవీఎస్ఎస్ రామారెడ్డి, దివ్య పద్మజ్యోతి దంపతులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. వీరు రాజమహేంద్రవరం నుంచి పాలకొల్లు బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గుప్తా, అతని భార్య వీర వెంకట లక్ష్మీదేవి, మరో కారులో ఉన్న జ్యోతి గాయపడ్డారు. వీరిని హైవే అంబులెన్స్లో స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలో గుప్తా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలిని రావులపాలెం పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. హైవే టోల్ ప్లాజా సిబ్బంది క్రేన్ సాయంతో కార్లను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కారు టైరు పేలి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టిన వైనం ఇద్దరికి గాయాలు -
మధ్యాహ్న భోజనం అమలులో అలసత్వం వద్దు
రికార్డుల నిర్వహణపై రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుల అసంతృప్తి కరప: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో అలసత్వం వహించవద్దని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్, ఈ.లక్ష్మీరెడ్డి నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. కోడిగుడ్లు ఎక్కువ నిల్వ ఉండటం, విద్యార్ధులకు దొడ్డుబియ్యంతో భోజనం పెట్టడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కమిషన్ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం వారు మండల అధికారులతో కలసి కరప మండలంలో అంగన్వాడీ కేంద్రాలను, హైస్కూలు, రేషన్ షాపులను, ఎంఎల్సీ పాయింట్ను తనిఖీ చేశారు. కొరిపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. 3వ, 4వ ఫేజ్లో వచ్చిన 140 కోడిగుడ్లు ఎక్కువ ఉండటాన్ని గుర్తించారు. అంగన్వాడీ టీచర్కు షోకాజ్ నోటీసు జారీచేయాలని సీడీపీఓ వై.లక్ష్మిని ఆదేశించారు. కూరాడ జెడ్పీ హైస్కూల్లో దొడ్డు బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టటం ఏమిటని హెచ్ఎం ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు జారీచేయాలని ఎంఈఓ కె.బుల్లికృష్ణవేణిని ఆదేశించారు. -
రైతు సమస్యలపై సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నెల దాటినా ధాన్యం సొమ్ము ఇవ్వరు...అదను దాటిపోతున్నా మెట్టలో ఖరీఫ్కు సాగునీరు ఇవ్వరు...ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వదు...కానీ రైతులపై భారం మోపుతూ సర్చార్జీలతో కలిపి నీటి తీరువా వసూలు చేస్తామంటారు...మెట్ట ప్రాంతంలో ఖరీఫ్ సాగుకు నీరు విడుదలపై స్పష్టత ఇవ్వరు...కోనసీమలో మేజర్ డ్రైన్లు పట్టించుకోకుండా ఖరీఫ్ ఎలా ముందుకు సాగేది...అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపై సభ్యులు మూకుమ్మడిగా నిలదీసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కోట్లాది రూపాయల ధాన్యం సొమ్ము జమ చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తప్పుపట్టారు. జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రభుత్వ తీరును మూకుమ్మడిగా నిలదీశారు. ధాన్యం సొమ్ము కోట్లలో బకాయిలున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు, 24 గంటల్లో జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి రైతులను నట్టేట ముంచేసిందని మండిపడ్డారు.ఽఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో వైఎస్సార్ సీపీ నుంచి కూటమికి ఫిరాయించిన జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు కల్పించుకుని ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేద్దామనడంతో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఒక్కసారిగా అనుబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన మీకు రైతుల కోసం మాట్లాడే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదంటూ సభ్యులు నినాదాలు చేస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. నీటి తీరువా వసూలుపై ఆగ్రహం కొద్దిసేపు సమావేశం బయట నిరసన వ్యక్తం చేసిన అనంతరం తిరిగి సభకు వచ్చారు. ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి ఇవ్వకపోగా నీటితీరువా వసూలు చేయడం అన్యాయమంటూ గొల్లప్రోలు, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, బెహరా రాజరాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్లో పెట్టుబడులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే అన్యాయంగా సర్చార్జీలతో కలిపి నీటితీరువా ఎలా వసూలు చేస్తారని సభ్యులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కల్పించుకుని సర్చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటితీరువా కచ్చితంగా వసూలు చేయడం తప్పదన్నారు. రైతులకు సంబంధించి ప్రాధాన్యం కలిగిన ఈ అంశంపై కూటమి ప్రజాప్రతినిధులు పెదవి విప్పకుండా మిన్నకుండి పోవడం ఏమిటని పలువురు సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా : ఎమ్మెల్సీ తోట పీడీఎస్ బియ్యాన్ని చేరువలో ఉన్న ఆలమూరు, రామచంద్రపురంలోని గోడౌన్లలో కాకుండా ద్వారపూడిలోని ప్రైవేట్ గోడౌన్లో నిల్వచేయడం ద్వారా ప్రజాధనం వృథా అవుతోందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ అధికారులు ఖరీఫ్ సాగునీటి ప్రణాళికను వివరిస్తూ గోదావరి మూడు డెల్టాల పరిధిలో 10.13 లక్షల ఎకరాలకు జూన్ ఒకటిన నీరు విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాలకు విడుదల చేసినట్లే, మెట్ట ప్రాంతంలోని ఏలేరు, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్ ల కింద ఉన్న 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా జూన్ 1 నుంచి ఎందుకు నీరు విడుదల చేయలేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిలదీశారు. ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువలలో మానవ విసర్జితాలను వదులుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్–1 నాటికి పురుషోత్తపట్నం వద్ద కనీస నీటి మట్టం స్థాయి 14 అడుగులకు దిగువకు ఉన్నందున ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతానికి నీటి విడుదల సాధ్య పడలేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 14.5 అడుగుల స్థాయికి జలాలు ఉన్నందున పుష్కర ద్వారా గురువారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని, మిగిలిన మెట్ట ప్రాంత ప్రాజెక్టుల ద్వారా జూలై 15 నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పారిశ్రామిక కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుల్యభాగ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. కోనసీమలో కూనవరం డ్రైన్ వెంబడి చల్లపల్లి –చింతలపూడి లాకుల వరకూ ఉప్పునీరు వెనుకకు తన్నుకు రావడంతో వందలాది ఎకరాల్లో సేద్యం దెబ్బతింటోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కల్పించుకుని పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, డ్రైనేజీ బోర్డు ఏర్పాటుకు చైర్పర్సన్ వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకే ఆధార్ నంబర్తో మూడు కరెంటు మీటర్లు ఉండటంతో తల్లికి వందనం మంజూరు కాకపోవడం తగదని, గ్రామ పంచాయతీలకు 2023 నుంచి స్టాంపు డ్యూటీ జమ చేయాలని, ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని, గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్ వ్యాధులను నివారించాలని, మండలాల్లో చేసిన పనులకు చెల్లింపులు చేపట్టాలని జెడ్పీటీసీలు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరం మన్యం ప్రాంతంలో రహదారులు అధ్వానంగా మారాయని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్సీ అనంతబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో సాగునీరు, డ్రైనేజి వ్యవస్థల ఆధునీకరణకు, డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు ప్రభుతాన్ని కోరుతూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత రాజోలు ఎంపీపీ అధ్యక్షుడు కేతా శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ధాన్యం సొమ్ము ఎప్పుడిస్తారు ? మెట్టకు సాగునీరు మాటేమిటి ? జెడ్పీ సమావేశంలో గళమెత్తిన సభ్యులు -
డ్రెయిన్లో పడి యువకుడి మృతి
కాజులూరు: మోటార్ బైక్ అదుపు తప్పడంతో స్థానిక టేకి డ్రెయిన్లో పడి దాకమూరి నాగరాజు (22) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం కోలంక గ్రామానికి చెందిన దాకమూరి నాగరాజు హైదరాబాద్లో ర్యాపిడో సర్వీసులో పనిచేస్తున్నాడు. ఇటీవల గ్రామంలో అమ్మవారి జాతరకు వచ్చాడు. సోమవారం రాత్రి కోలంక నుంచి ద్రాక్షారామ వెళుతుండగా, ఉప్పుమిల్లి శివారు గొప్పిరేవు వద్ద మోటార్ బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో నాగరాజు శిథిలమైన రెయిలింగ్ నుంచి టేకి డ్రెయిన్లో పడిపోయాడు. మృతదేహం కొట్టుకుపోయి, తాళ్లరేవులో లభ్యమైంది. కాగా, నాగరాజుకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు. కోలంకలో మృతుని ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు గొల్లపాలెం పోలీసులు తెలిపారు. ఎస్సై మోహన్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని ప్రాథమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే అన్ని కేటగిరిలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2025 కు దరఖాస్తు చేసుకునే పక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు బుధవారం తెలిపారు. ప్రతిపాదనలు నేషనల్ అవార్ట్స్ టు టీచర్స్.ఎడ్యుకేషన్.గవ్.ఇన్/లాగిన్.ఎస్పీఎక్స్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలన్నారు. గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం పథకానికి ఆమోదం రాజమహేంద్రవరం రూరల్: భారత ప్రభుత్వం ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం(ఈఎల్ఐ) పథకానికి ఆమోదం తెలిపిందని రాజమహేంద్రవరం ప్రాంతీయ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) రీజనల్ పీఎఫ్ కమిషనర్–2 కె.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన పీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. స్థిరమైన ఉపాధి కల్పన, ఆర్థిక చేయూతను ప్రోత్సహించేందుకు ఈఎల్ఐ పథకం రూపొందించారన్నారు. ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి 2027 జూలై 31మధ్య సృష్టించిన ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. యజమానుల ప్రోత్సాహక చెల్లింపులు పాన్–లింక్డ్ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామన్నారు. భీమేశ్వరాలయం నుంచి తలుపులమ్మకు సారె రామచంద్రపురం రూరల్: ప్రసిద్ధి చెందిన తలుపులమ్మ అమ్మవారికి ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆషాఢం సారెను ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని బుధవారం సమర్పించారు. లోవ తలుపులమ్మ తల్లి దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు నేతృత్వంలో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భీమేశ్వరాలయ అర్చకుడు మద్దిరాల రాజ్కుమార్శర్మ, చండీ పారాయణదారులు జుత్తుక చిన్న, వైదిక సిబ్బంది పాల్గొన్నారు. -
అన్నదాత ఇంట.. సిరుల పంట
ఆలమూరు: వ్యవసాయంలో అధిక పెట్టుబడిని, కూలీల కొరతను ఎదుర్కొనేందుకు రైతులు అనేక అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో వరి సాగులో ఏటా అనేక మార్పులు సంభవిస్తూ, వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యాధునిక, పురాతన సంప్రదాయాలతో వ్యవసాయం చేపట్టడం ద్వారా రైతులు పెట్టుబడిని నియంత్రించుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో దిగుబడి ఆశాజనకంగా ఉన్నా, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్లో ధాన్యం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోయినా, అన్నదాత సుఖీభవ అమలు చేయకపోయినా రైతులు మాత్రం ఖరీఫ్ సీజన్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, కూలీల కొరత వల్ల పెట్టుబడిని తగ్గించుకునేందుకు ఈసారి అధికంగా రైతులు వినూత్న రీతిలో వెదజల్లు సాగు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 1.64 లక్షల ఎకరాల్లో 1.06 లక్షల మంది రైతులు వ రిసాగు చేపట్టారు. స్వర్ణ (7029)కు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ కొత్త వంగడాల వల్ల నారుమడులు సరైన రీతిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే, చీడపీడలు నివారించి నష్ట నివారణను అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు. స్వర్ణ (7029)కే రైతుల మొగ్గు రైతులు మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సీజన్లో 70 శాతం మేర స్వర్ణ రకం సాగు చేస్తుండగా, మిగతా ఇతర రకాలను సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సాగుకు 35 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేయగా, రైతుల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల సేకరణ ఇప్పటికే జరిగింది. ప్రస్తుతం వివిధ గ్రామాల్లో దాదాపు వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు ఆర్ఎస్కేలకు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. ఈ సీజన్లో సుమారు 80 శాతం మేర వెదజల్లు సాగును ఎంచుకోగా, మిగిలిన రైతులు వరినాట్ల పద్ధతిని అవలంబిస్తున్నారు. సాగునీటి ఎద్దడి దృష్ట్యా వ్యవసాయ శాఖ ఈ నెల 15 నాటికి నాట్లు పూర్తి చేయాలని సూచించడంతో, రైతులు పనులను వేగవంతం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా వెదజల్లు వల్ల లాభాలపై అవగాహన కల్పించడంతో రైతులు ఈ విధానంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది విత్తనాలు రైతులకు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో, సమయానికి ముందే రైతులు సాగు చేపట్టారు. డ్రమ్ సీడర్ వినియోగంతో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా, రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఆ దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు. కలుపు యాజమాన్య పద్ధతి పంట తొలి దశలో నీరు నిలగట్టక ఆరుతడిగా సాగు చేయడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతిలో కలుపు మందును తప్పనిసరిగా వాడాలి. ఎకరాకు 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ లేదా ప్రెటిలాక్లోర్ మందును ఎకరాకు 400 మి.లీ లేదా పైరజో సల్ఫ్యురాన్ ఇథైల్ 100 గ్రాముల మందును 20 కిలోల పొడి ఇసుకలో కలపాలి. ఈ మందును వెదజల్లు విధానంలో విత్తిన 3–5 రోజుల్లో పొలంలో పలచగా, నీరు పెట్టి కలుపు మందును పిచికారీ చేయాలి. తర్వాత పొలంలో నీరు తీసి వేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. రెండో దశ నుంచి పొలంలో ఏర్పడిన కలుపును మొక్కల మధ్ద తొక్కడం ద్వారా ఎరువుగా మలచుకోవచ్చు. నీటి యాజమాన్యం విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వచ్చే వరకూ పొలంలో నీరు నిల్వ ఉండకుండా కేవలం బురదగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువైన నీటిని బయటకు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వరి కంకి వేర్లు ఆరోగ్యంగా పెరిగి, ఎక్కువ పిలకలకు అవకాశం ఉంటుంది. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే పది రోజుల ముందు రెండు సెం.మీ. నీరు నిల్వ ఉండేలా చూడాలి. డ్రమ్ సీడర్ పద్ధతిలో.. దమ్ము చేసిన అనంతరం చదును చేసిన భూమిలో పలచటి నీటి పొర ఉండేలా చూసుకుని, మండి కట్టిన విత్తనాన్ని చల్లాలి. డ్రమ్ సీడర్ పరికరానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సె.మీ. దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూతను బిగించాలి. గింజలు నింపి, డ్రమ్ సీడర్ను లాగితే ఎనిమిది వరుసల్లో 20 సెం.మీ. దూరంలో గింజలు పడతాయి. దీంతో వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5–8 సెం.మీ. దూరం ఉంటుంది. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పులో కాలిబాటలు వేసుకోవాలి. తాడు లాగి డ్రమ్ వాడితే వరుసలు బాగా వచ్చి, విత్తు సక్రమంగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో వెదజల్లుపై రైతుల ఆసక్తి పెట్టుబడి ఆదా.. అధిక దిగుబడి డ్రమ్ సీడర్ పద్ధతితో మరింత మేలు కనీస జాగ్రత్తలు కీలకం వెదజల్లు సాగు విధానంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు చెబుతున్నారు. వెదజల్లు విధానంలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ విత్తనాలను గోనె సంచె కప్పి నిల్వ ఉంచాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లగా మోసు వచ్చే క్రమంలో పొలంలో విత్తనాలను వెదజల్లాలి. విత్తనాలకు మొక్కలు వచ్చే వరకూ పొలంలో నీరు లేకుండా కాలువలు ఏర్పాటు చేసి, నీటిని బయటకు పంపాలి. వారం తర్వాత ఒకసారి పంటకు నీరును అందజేసి, మరుసటి రోజు తొలగించాలి. దమ్ము చేసే సమయంలో పొలంలో ఎగుడుదిగుడులు లేకుండా నేలను సమాంతరంగా ఉండేలా చూడాలి. ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనాలను నాటాలి. వరినాట్లు నాటే 15 రోజుల ముందు ఒకసారి దమ్ము చేయాలి. నాలుగు రోజుల ముందుగా చదును చేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలను ఏర్పాటు చేయాలి. కలుపు నివారణకు బింతియోకార్బ్ లేదా అనిలోఫాస్ 1.25 లీటర్ల మందును 27 కిలోల ఇసుకలో కలిపి చల్లితే కలుపును నివారించవచ్చు. వెదజల్లుతో ప్రయోజనాలు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, కూలీల కొరతను అధిగమించవచ్చు. సాగునీటి ఎద్దడిని అధిగమించవచ్చు. పంట పది రోజుల ముందే కోతకు వస్తుంది. భూమి సారవంతమవుతుంది. మొక్కలో సాంద్రత పెరిగి, పది శాతం మేర అధిక దిగుబడికి అవకాశం ఉంది. సాధారణ పద్ధతిలో వరి సాగుకు ఎకరం పొలంలో నారుమడికి 30 కేజీల విత్తనాలు అవసరం. వెదజల్లులో కేవలం 12 నుంచి 18 కేజీలు చాలు. కలుపు మొక్కలను సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఎరువుగా మలుచుకోవచ్చు. నారుమడులు పోసి ఊడ్చేందుకు పట్టే ఎక్కువ సమయాన్ని, వెదజల్లు సాగుతో అరికట్టవచ్చు. పెట్టుబడి పరంగా రూ.మూడు వేల వరకూ ఆదా అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా, నీరు అందుబాటులో ఉన్నప్పుడే సాగుకు అవకాశం ఉంటుంది. -
మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
ఏడు బైక్లు స్వాధీనం కాకినాడ రూరల్: వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసులో కాకినాడ అర్బన్ కామేశ్వరినగర్ రామకృష్ణారావుపేటకు చెందిన యువకుడు కడియాల ప్రేమ్కుమార్ అలియాస్ దుర్గాప్రసాద్ అలియాస్ జిజ్జును సర్పవరం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సై పి.శ్రీనివాస్కుమార్ వివరాల మేరకు, నిందితుడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడ్డాడు. అతడిపై నిఘా ఉంచి, అరెస్టు చేశారు. సుమారు రూ.3.5 లక్షల విలువైన ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై శ్రీనివాస్కుమార్తో పాటు, ఏఎస్సైలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, హెచ్సీలు సత్తిబాబు, రాజు, ప్రసాద్, పీసీలు అనిల్, కిశోర్ను సీఐ పెద్దిరాజు అభినందించారు. -
పెరిగిన పొగాకు ధర
దేవరపల్లి: మార్కెట్లో పొగాకు ధర పెరిగింది. ధర రోజురోజుకు పెరుగుతోంది. జూన్ 24 వరకు కిలో గరిష్ఠ ధర రూ. 290 ఉండగా, అనంతరం ఈ ధర రోజు రోజుకు పెరుగుతూ రైతుల్లో ఆశలు కల్పిస్తోంది. ముందు ముందు ధర మరింత పెరుగుతుందని రైతులు ఆశిస్తున్నారు. మార్చి 24న పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించింది. కిలో గరిష్ఠ ప్రారంభ ధర రూ.290 ఉండగా, అప్పటి నుంచి జూన్ 24 వరకు అదే ధర కొనసాగింది. దీంతో ధర గిట్టుబాటు కాక రైతులు ఆందోళన చెందారు. ఈ నెల 25 నుంచి మార్కెట్లో ధర స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. జూన్ 24న కిలో గరిష్ఠ ధర రూ. 290 పలకగా, 26న రూ. 291, 26న రూ. 293, 27న రూ. 296, 28న రూ.299, 30న 300, జూలై 1న కిలో గరిష్ఠ ధర రూ.300 పలకగా బుధవారం మార్కెట్లో కిలోకు గరిష్ఠ ధర రూ. 10 పెరిగి రూ.310 చేరుకుకుంది. ఒక్కరోజునే కిలోకు రూ.10 పెరగడంతో రైతులకు ఊరట లభించినట్లయింది. గత ఏడాది కిలో గరిష్ఠ ధర రూ.410 పలికింది. మార్కెట్లో ధర పెరుగుతుండడంతో వేలానికి వస్తున్న బేళ్ల సంఖ్య పెరుగుతోంది. గురువారం వేలానికి ఐదు వేలం కేంద్రాల నుంచి 5,171 బేళ్లు విక్రయానికి రాగా, 3,758 బేళ్లు కొనుగోలు చేశారు. 1,413 బేళ్లు అమ్ముడు పోలేదు. 4.76 లక్షల కిలోల పొగాకు విక్రయం జరిగినట్టు బోర్డు అధికారులు తెలిపారు. కిలో గరిష్ఠ ధర రూ.310, కనిష్ఠ ధర రూ.200, సగటు ధర రూ.275.10 లభించింది. ఇప్పటి వరకు 80 రోజులు వేలం జరిగింది. 16 కంపెనీలు వేలంలో పాల్గొన్నట్టు అధికారులు తెలిపారు. కిలో గరిష్ఠ ధర రూ.310 ఒక్కరోజులో పెరిగిన ధర రూ.10 -
గవర్నర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
కాకినాడ సిటీ: కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్శిటీ 11వ స్నాతకోత్సవానికి శుక్రవారం విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్లో గవర్నర్ అబ్ధుల్ నజీర్ కాకినాడ పర్యటన సందర్భంగా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్మీనాతో కలిసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. సంబంధిత అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవానికి గవర్నర్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన జేఎ న్టీయూ అతిథి గృహానికి చేరుకుంటారన్నారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు సెమినార్ హాల్లో నిర్వహించే స్నాతకోత్సవంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ అధికారులు పాల్గొన్నారు. -
కారు ఢీకొని వ్యాపారి మృతి
ఏలేశ్వరం: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యాపారి మృతి చెందిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, పట్టణానికి చెందిన గూడపాటి నాగసత్య చంద్రశేఖర్(44) పాత ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. షాపు వద్దే అతడి ఇల్లు కూడా ఉంది. షాపు వెనుక భాగంలో భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లరాయి చిప్స్ లారీ వస్తుందని సమాచారం రావడంతో, మంగళవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వర్షం కురుస్తోంది. గొడుగు వేసుకుని.. షాపు ఎదురుగా రోడ్డు దాటుతుండగా, యర్రవరం రోడ్డులో ఏలేశ్వరం వైపు అతివేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని షాపులో ఉన్న సీసీ కెమెరాలో ప్రమాద సంఘటన రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నవ్వుతూ ఉండే.. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే చంద్రశేఖర్.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని అతడి బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. వీరిని ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. -
పేపర్మిల్లో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి ఆంధ్రపేపర్ మిల్లులో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. పేపర్ మిల్లు నార్త్ గేటు వద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. గత నెల 29వ తేదీన బరోడా నుంచి రాజమండ్రి పేపర్ మిల్కు హైడ్రోజన్ పెరాకై ్సడ్ లోడులో ఓ ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్లోని గ్యాస్ను వెంటనే దిగుమతి చేసుకోకపోవడంతో, ట్యాంకర్ అలాగే ఉండిపోయింది. నాలుగు రోజులుగా పేపర్ మిల్ నార్త్ గేటు వద్ద ట్యాంకర్ నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు అగ్నిమాపక దళ వాహనాలు గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు చేపట్టారు. ఘటన స్థలానికి పక్కనే పెట్రోల్ బంక్, పేపర్ మిల్ టింబర్ డిపో ఉన్నాయి. దీంతో ఎలాంటి ముప్పు వాటిల్లుతుందోనని పరిసర ప్రాంతాల ప్రజలు భీతిల్లారు. వ్యూహాత్మకంగా నియంత్రణ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉదయం 9.15 నిమిషాలు.. రాజమహేంద్రవరం ఫైర్ ఆఫీసుకు ఫోన్ వచ్చింది. పేపర్ మిల్కు వచ్చిన తన లారీ ట్యాంకర్ నుంచి హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీక్ అవుతుందని చెప్పాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆర్యాపురం ఫైర్ ఆఫీసు నుంచి ఫైరింజిన్ బయలుదేరింది. ట్యాంకర్ నుంచి లీకవుతున్న హైడ్రోజన్ పెరాకై ్సడ్ అధిక మొత్తంలో వ్యాపిస్తే, దానిని పీల్చిన వారి ఊపిరితిత్తులు పాడైపోతాయి. శరీరంపై పడితే పెద్ద బొబ్బలు ఏర్పడుతాయి. అప్రమత్తమైన అగ్నిమాపక బృందాలు జిల్లా ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్కింగ్ నేతృత్వంలో సంఘటన స్థలంలో నియంత్రణ చర్యలు చేపట్టాయి. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఫైర్ ఆఫీసు నుంచి మరో రెండు, కొవ్వూరు నుంచి ఒక ఫైరింజిన్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టెండర్ వాహనాన్నీ రప్పించారు. హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీకేజీతో ప్రజలకు ఏం కాకుండా పోలీసుల సహకారంతో పేపర్ మిల్ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ట్యాంకర్లోని హైడ్రోజన్ పెరాకై ్సడ్ను పూర్తిగా నిర్వీర్యం చేసేలా అగ్నిమాపక అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక కెమికల్ సూట్లు, సెపరేట్ డ్రెస్ను ధరించారు. ట్యాంకర్లో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూలింగ్ వాటర్, వాయువులను చిమ్మారు. ఆపరేషన్ ప్రారంభించిన ఉదయం 9.30కు 47 డిగ్రీలున్న ఉష్ణోగ్రతను, మధ్యాహ్నం 12 గంటలకు 26 డిగ్రీలకు తగ్గించగలిగారు. లీకవుతున్న హైడ్రోజన్ పెరాకై ్సడ్పై నీటిని చల్లి, భూమిలోకి ఇంకిపోయేలా చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్ నుంచి హైడ్రోజన్ పెరాకై ్సడ్ పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టిన ఫైరాఫీసర్ శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బందిని అందరూ అభినందించారు. 4 గంటలు శ్రమించి నియంత్రించిన అగ్నిమాపక యంత్రాంగం భీతిల్లిన పరిసర ప్రాంతాల ప్రజలు -
నేడు వ్యూహలక్ష్మికి మహాభిషేకం
సీటీఆర్ఐ: వ్యూహలక్ష్మి అమ్మవారికి గురువారం మహాభిషేకం జరుగుతుందని శ్రీమాన్ చిన్నవెంకన్నబాబు స్వామి అన్నారు. బుధవారం స్థానిక ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గాడాల శ్రీమహాలక్ష్మీ సమేత చిన్న వేంకటేశ్వరస్వామి పీఠంలో ప్రతి ఏడాది ఆషాఢ మాస రెండో గురువారం శ్రీవ్యూహలక్ష్మి అమ్మవారికి ఈ ఒక్కరోజు మాత్రమే విశేష మహా భిషేకం జరుగుతుందన్నారు. భక్తులంతా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని అన్నారు. ఈ గుప్త నవరాత్రుల్లో భాగంగా గురువారం వ్యూహలక్ష్మికి మహాభిషేకం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అన్ని ఆటంకాలు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని అనుగ్రహ ప్రద ఫౌండేషన్ అంతర్జాతీయ వైస్ చైర్మన్ సింగంశెట్టి మహితోష్ తెలిపారు. మనగుడి– మనసేవ భారతీయ ఆధ్యాత్మిక సేవా సమితి ఉభయ రాష్ట్రాల చైర్మన్ మతల రమేష్ మాట్లాడుతూ గత సంవత్సరం గుప్త నవరాత్రులకు ఎంతోమంది భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అయ్యారన్నారు. కార్యక్రమంలో పీఠం వైస్ చైర్మన్ దుర్గా వెంకట హేమావతి తదితరులు పాల్గొన్నారు. -
అనధికార మద్యం అపాయకరం
జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి లావణ్య రాజమహేంద్రవరం రూరల్: లైసెన్స్ పొందిన రిటైల్ దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య ఓ ప్రకటనలో తెలిపారు. అనధికార (లైసెన్స్ లేని) వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు చేయడం చాలా అపాయకరమన్నారు. అటువంటి మద్యం నకిలీది కావచ్చన్నారు. వివాహాలు, పార్టీలు లేదా ఇతర సామూహిక వేడుకల సందర్భాల్లో మద్యాన్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తామంటూ మోసం చేసే అవకాశం ఉందన్నారు. వారు సరఫరా చేసే నకిలీ మద్యం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించవచ్చని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చన్నారు. అటువంటి అనుమానిత వ్యక్తుల వివరాలను వెంటనే ఎకై ్సజ్ శాఖకు తెలియజేయాలన్నారు. ట్రోల్ ఫ్రీ నంబరు 14405కి కానీ, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి 96767 14547 నంబర్కు కానీ తెలపాలని కోరారు. -
ఊరు.. బేజారు!
‘కొత్త బట్టలు ఎక్కడ్నుంచి తేవాలయ్యా...? అర్థం చేసుకోవేం? ఏడాదిగా శని పట్టుకుంది. ఎట్లా చెప్పాల్రా నీకు..?’ – తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో కుమారుడి ఎదుట వానపల్లి దుర్గాదేవి నిర్వేదం!‘నేనేం చేయనవ్వా? నన్నే తీసేశారు.. ఏడాదిగా దరిద్రాన్ని చూస్తున్నా..’ – జక్కంపూడి నగర్లో పెన్షన్ కోల్పోయిన 80 ఏళ్ల వృద్ధురాలి వద్ద మాజీ వలంటీర్ సయ్యద్ బాషా నిస్సహాయత!!‘పండగొస్తే గుండె దడ వస్తోంది. పైసా అప్పు కూడా పుట్టడం లేదు. చుట్టాలొస్తున్నారంటే భయమేస్తోంది. సంతోషంగా ఉన్న రోజు లేదు. ఊరంతా కలిసి పండగ చేసుకుని ఏడాది దాటింది...’ – అనపర్తి ఎస్సీ కాలనీలో లక్ష్మీ భవాని, కోటేశ్వరి ఆక్రోశం!‘అవును మరి.. తాపీగా కూసున్నా...! సెంద్రబాబు డబ్బులు పంపాడని...! వడ్లు కొని ఇరగదీశాడని...! మా ఆవిడ ఫ్రీ బసెక్కి ఊరెళ్లింది...ఇంటినిండా గ్యాస్ బండలున్నాయి..!’ – సింగగూడెం, లింగపాలెం దగ్గర గోదావరి జిల్లాల యాసలో గండుల సుబ్బారావు, పొట్టవూరు శ్రీనివాస్ వ్యంగ సంభాషణ!!వనం దుర్గాప్రసాద్ – ఉభయ గోదావరి జిల్లాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : గోదారి పల్లెలంటే.. ఉప్పొంగే సంతోషాల పరవళ్లు! పచ్చని తోరణాల లోగిళ్లు! మర్యాదలతో అతిథులను ఉక్కిరిబిక్కిరి చేసే గోదారమ్మ తీరం ఏడాదిగా బావురుమంటోంది! పల్లె కళ తప్పింది. గత ప్రభుత్వ హయాంలో సాఫీగా సాగిన బతుకు బండి ఇప్పుడు గతుకుల బాటలో కూరుకుపోయి నరకం అనుభవిస్తోంది! వైఎస్ జగన్ పాలనలో ఏదో ఒక పథకం కింద నెలనెలా డబ్బులొచ్చేవి. అమ్మ ఒడి... విద్యా దీవెన.. వసతి దీవెన.. రైతు భరోసా... చేయూత... చేదోడు.. కాపునేస్తం... వాహన మిత్ర.. ఇలా ఒకదాని వెంట మరొకటిగా డబ్బులు అందేవి. పండుగలు వస్తే పేదలు సంతోషంగా జరుపుకొనేవారు. నెలకు సరిపడా సరుకులు ముందే తెచ్చుకునేవారు. స్కూళ్లు తెరవటమే ఆలస్యం.. పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు, పుస్తకాలు.. విద్యా కానుక సిద్ధంగా ఉండేది! చేతిలో ట్యాబ్లతో పిల్లలు ఆత్మ విశ్వాసంతో ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లేవారు. టీడీపీ కూటమి సర్కారు ఏడాది పాలనలో అంతా తిరగబడింది! బతుకు బండి తలకిందులైంది!! మావోడు ఏమయ్యాడు..? ఊరితో బంధం తెగిందవ్వా..! కాళ్ల మండలం వేంపాడులో గ్రామ సచివాలయానికి వచ్చిన ఓ 60 ఏళ్ల అవ్వ ‘మావోడు ఏమయ్యాడయ్యా?’ అంటూ వలంటీర్ గురించి ఆరా తీసింది. ఇంటికే వచ్చేవాడు. పెన్ష¯న్Œ తెచ్చి ఇచ్చేవాడు. బిడ్డలా అండగా ఉండేవాడు.. అంటూ పేగు బంధమే తెగినంతగా బా«ధ పడింది. ఉండి దగ్గర ఉప్పులూరు గ్రామ వలంటీర్ కనిపించడంతో ఊరిలో వారంతా చుట్టూ చేరి ఆప్యాయంగా పలుకరించారు. ‘ఏమయ్యావ్ తండ్రీ..?’ అంటూ 80 ఏళ్ల లక్ష్మి ఆదుర్దాగా ఆరా తీసింది. మాసిన దుస్తులు, పెరిగిన గడ్డం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. రాజమహేంద్రవరంలో రోజూ కూలీకి వెళ్తున్నానని ఆ వలంటీర్ చెప్పాడు. ‘ప్రభుత్వం మారింది. మన ఊరితో బంధం తెగిందవ్వా..’ అంటూ కంట తడి పెట్టాడు. వీరవాసరం కొణితివాడలోనూ ఇదే సన్నివేశం. గణపవరం మండలం కొమ్మూరులో వలంటీర్ కోసం గ్రామస్తులు వాకబు చేస్తున్నారు. బడ్డీ కొట్టు బంద్.. కొవ్వూరు డివిజన్ పైడిమెట్ట, పోచారం, తాళ్లపూడి, బల్లిపాడు, చింతలపూడిలోని లింగపాలెం... ఇలా ఏ ఊరు చూసినా ఉసూరుమంటున్నాయి. ఆ పథకం... ఈ పథకం వచి్చందని, టీ కోసం నేను డబ్బులిస్తానంటే నేనిస్తానని పోటీ పడ్డ వాతావరణం ఇప్పుడు కానరావడం లేదు. బడ్డీ కొట్టు నరేష్ వ్యాపారం సాగక ఊరొదిలి వెళ్లాడు. ఊరందరికీ కూరలు అమ్మే సుజాత పట్నం చేరుకుంది. గ్రామంలో ట్యూషన్లు చెప్పే మాణిక్యం కాకినాడ కాలేజీలో అధ్యాపకుడిగా చేరాడు. పథకాలు వచ్చినన్నాళ్లు జనం చేతిలో డబ్బులుండేవి. పిల్లలకు ట్యూషన్లు చెప్పించేవాళ్లు! ఏడాదిగా పైసా రాకపోవడంతో గ్రామాల్లో గుబులు రేగుతోంది! చిన్న వ్యాపారాలు నడవడం లేదు. ఆటోవాలాలు డీలా పడ్డారు. ‘మేం టీడీపీనే... అయినా జగన్ పాలనే బాగుంది..’ ధర్మాజీ గూడెం వద్ద ఆటోవాలా నరేష్ తేల్చి చెప్పేశాడు! రైతుల ఆనందం ఆవిరి.. గోదావరి జిల్లాల్లో రైతన్న పరిస్థితి దయనీయంగా ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఈ ప్రభుత్వం దళారీల దయకు వదిలేసింది. ధాన్యం అమ్మితే డబ్బులివ్వకుండా తిప్పలు పెడుతోంది. తేమ శాతం అంటూ కోతలు పెడుతోంది. రైతు కూలీలకు పనులు లేవు. పట్టణాల్లో తాపీ పనులకు వెళ్తున్నారు. పిల్లల చదువులకు అప్పులే శరణ్యమయ్యాయి. వైఎస్ జగన్ పాలన సాగిన ఐదేళ్లూ స్వర్ణ యుగమని, ఇప్పుడు మాకు ఖర్మ పట్టుకుందని ఆవేదనగా చెబుతున్నారు. రైతుల ఆనందం ఆవిరైందని వ్యవసాయదారుడు సుబ్బారావు కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చెయ్యి తడిపితేనే అర్జీలు తీసుకునే పాడు రోజులు మళ్లీ దాపురించాయని చెప్పాడు.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడకు చెందిన టైలర్ కృష్ణారావు ఏడాదిగా అష్ట కష్టాలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు పథకాలు ఏవీ రాకపోవడంతో బట్టలు కుట్టించేందుకు తనవద్దకు ఎవరూ రావడం లేదని, గతంలో నెలకు రూ.15 వేలు సంపాదించిన తాను రూ.3 వేలు ఆర్జించడం కూడా గగనంగా ఉందని చెబుతున్నాడు. కుమార్తెను చదివించేందుకు అప్పులు చేయాల్సి వచ్చిందని, భీమవరం వస్త్ర దుకాణంలో సగం రోజులు కూలీకి వెళ్తున్నానని చెప్పాడు. ఆ దేవుడి దయే..! ఆ దేవుడే నాకు తిండి పెట్టే ఏర్పాటు చేశాడు.. పెన్షన్ మంజూరు చేశాడు (వైఎస్ జగన్ను తలచుకుంటూ...) వలంటీర్ ఇంటికొచ్చి పలకరించేవాడు. ఇప్పుడు పలకరించే దిక్కులేదయ్యా. ఊరే బావురు మంటోంది – జోగి రామలక్ష్మి, (జక్కంపూడి నగర్, తూ.గో)బంధం తెగిపోయింది ఇంటర్ వరకు చదివా. జగనన్న పుణ్యమా అని వలంటీర్గా చేరి ఊరందరి కష్టసుఖాలు తెలుసుకునే భాగ్యం దక్కింది. మీకు ఐదు వేలు ఏమిటి.. పదివేలు ఇస్తానన్న చంద్రబాబు మమ్మల్ని రోడ్డున పడేశారు. దీనికి బాధపడటం లేదు గానీ మా పల్లెతో బంధం తెగిపోయిందని ఏడుపొస్తోంది. – సయ్యద్ బాషా (మాజీ వాలంటీర్) -
పరిమళించిన మానవత్వం
తూర్పు గోదావరి: ఏం చేస్తుందో ఆమెకు తెలియడం లేదు. ఎండైనా.. వానొచ్చినా మురుగు కాలువలోకి దిగి గంటల తరబడి ఉండిపోతోంది. ఎట్టకేలకు కొందరు చొరవ చూపడంతో.. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని ఓ యువతి దయనీయ స్థితిలో మురికి కాలువలోనే రెండు రోజుల పాటు గడిపిన హృదయ విదారక సంఘటన కోరుకొండ బస్టాండ్ సెంటర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎక్కడి నుంచి వచ్చిందో, కోరుకొండలో ఆమె సంచరిస్తోంది. మతి స్థిమితం లేకపోవడంతో ఎవరైనా పెట్టింది తిని కాలం వెళ్లదీస్తోంది. రెండు రోజుల నుంచి స్థానిక బస్టాండ్ సెంటర్ను ఆనుకుని ఉన్న మురుగు కాలువలోకి దిగి, మళ్లీ బయటకు వస్తోంది. దుర్వాసన వస్తున్నా.. వ్యర్థాల మధ్యే రెండు రోజులుగా ఇలా చేస్తుండడాన్ని స్థానికులు గమనించారు. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు ఈ కాలువ నుంచే గోదావరి నదిలోకి వెళ్తుంది. కొన్ని రోజులుగా కాలువకు వర్షపు నీరు రాకపోవడంతో ఆమెకు ఎటువంటి అపాయం కలగలేదు. కొందరు స్థానికులు ఈ విషయాన్ని పంచాయతీ వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పారిశుధ్య కార్మికులు మంగళవారం ఆమెను కాలువ నుంచి బయటకు తీసుకొచ్చారు. సైగలు చేస్తూ, పొడిపొడిగా మాట్లాడుతూ ఆమె భయంగా ఉంటోంది. పారిశుధ్య కార్మికులు జలడుగుల చిన్నపార్వతి, సోమాజుల బంగారమ్మ, రాజమహేంద్రవరానికి చెందిన డివైన్హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. -
తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచింది..
తూర్పు గోదావరి: బాగా చదువుకుంది. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగంలో చేరింది. చిరుద్యోగులైన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది. తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలచిందని.. ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఆశలన్నీ కల్లలయ్యాయి.తెలంగాణలో పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చాగల్లుకు చెందిన యువతి మృతి చెందడంతో చాగల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ప్రసన్న(22) ఈ దుర్ఘటనలో మృతి చెందింది. రెండు నెలల క్రితమే ఫ్యాక్టరీలో కెమిస్ట్గా ఉద్యోగంలో చేరిన ప్రసన్న మరణాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తండ్రి శ్రీనివాసరావు మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి రామలక్ష్మి ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్న కాగా, చిన్న కుమార్తె ప్రభుకుమారి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతుంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. ప్రసన్న అత్త కొడుకు కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామానికి చెందిన యాతం మహేష్ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రసన్న కూడా రెండు నెలల క్రితమే అదే ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ పనిపై మహేష్ బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దుర్ఘటన విషయం తెలుసుకుని.. అదే సమయంలో డ్యూటీలో ఉన్న ప్రసన్న కూడా ప్రమాదానికి గురైందని గ్రహించి ఆమె తల్లిదండ్రులకు మహేష్ సమాచారం అందించాడు. సోమవారం సాయంత్రం శ్రీనివాసరావు, రామలక్ష్మి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.ఎన్నో ఆశలతో..దుర్ఘటనలో మృతిచెందిన ప్రసన్న బీ–ఫార్మసీ చది వింది. ఉన్నత చదువు అభ్యసించి జీవితంలో మంచి స్థానం సాధించాలని ఆశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఫ్యాక్టరీలో స్టైఫండ్ తీసు కుంటూ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగంలోకి చేరింది. ఎం–ఫార్మసీ చేయాలన్న తపనతో ఓ శిక్షణ సంస్థలో కూడా చేరింది. ఇదే విషయాన్ని దుర్ఘటనకు ముందురోజు ఆమె తల్లితో ఫోన్లో చెప్పింది. తాను ఎం–ఫార్మసీ చదివేందుకు ఫీజు చెల్లించానని ఆనందం పంచుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగే క్లాసులకు వెళుతున్నానని తల్లికి చెప్పింది. ఎంతో ఆనందాన్ని పంచుకున్న కుమార్తె తమను విషాదంలో విడిచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు రోదించారు.కన్నీరుమున్నీరైన చెల్లెలు చిన్ను(ప్రసన్న) కుటుంబ సభ్యులందరితో కలివిడిగా ఉండేదని, తామిద్దరం అక్కాచెల్లెలైనా.. స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని ప్రసన్న చెల్లెలు ప్రభుకుమారి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రసన్న ఇంటి వద్ద బంధువుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కనకాయలంక కాజ్ వే వద్ద వంతెన నిర్మాణం
రూ.22.83 కోట్లకు పరిపాలనా ఆమోదం పి.గన్నవరం: కొద్దిపాటి వరదకే కాజ్ వే నీటమునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ ప్రజలకు వరద కష్టాలు తీరనున్నాయి. మండలంలోని చాకలిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న కనకాయలంక కాజ్ వే వద్ద హై లెవెల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.83 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం ఇచ్చినట్టు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ (ధవళేశ్వరం) ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. కనకాయలంక, చాకలిపాలెం (వశిష్ట ఎడమ ఏటిగట్టు) గ్రామాలను కలుపుతూ వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. రూ.24 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, రూ.22.83 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కనకాయలంక గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వారి జీవన విధానం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంతో ముడిపడి ఉంది. నిత్యం కాజ్ వే దాటి పి.గన్నవరం మండలానికి వస్తుంటారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తే కనకాయలంక కాజ్ వే మునిగిపోతోంది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో కాజ్ వే దాటి వస్తుంటారు. వరద నీరు మరీ ఎక్కువైతే పడవలపై ప్రయాణిస్తారు. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తయితే కనకాయలంక గ్రామాల ప్రజల వరద కష్టాలు తీరతాయి. పెదలంక వద్ద వంతెన అలాగే వరద సమయాల్లో ప్రజల రాకపోకల కోసం వశిష్ట ఎడమ ఏటిగట్టు నుంచి యలమంచిలి మండలం పెదలంకకు రూ.80.8 లక్షలతో సింగిల్ లైన్ రోడ్డు వంతెనకు కూడా పరిపాలనా ఆమోదం లభించినట్టు ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. టెండర్లు పూర్తయిన తర్వాత ఈ వంతెన పనులు ప్రారంభమవుతాయని ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ వివరించారు. -
టెండర్ ఖరారు రేపే..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సహా, రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్, క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ గురువారం ఖరారు కానుంది. దీని ప్రైస్ బిడ్ను విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం తెరవనున్నారు. సోమవారం టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ గురువారం ఓపెన్ చేసి, లోయెస్ట్ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ‘పద్మావతి’కి టెండర్ కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య రాష్ట్రంలో అన్నవరం దేవస్థానం సహా, పలు దేవస్థానాల్లో శానిటరీ టెండర్ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్ల కాల పరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు, తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించింది. ఇప్పుడు మరలా అదే సంస్థ టెక్నికల్ బిడ్లో క్వాలిఫై కావడంతో, మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పద్మావతి సంస్థ యజమాని భాస్కరనాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే కారణంగా చెబుతున్నారు. ప్రముఖ దేవస్థానాల్లో రీ టెండర్ గత ఏప్రిల్ నెలలో పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలను వ్యక్తం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్ను జూన్ 12న విడుదల చేసింది. టెండర్దారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జూన్ 26గా నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది తప్పుకొన్నారు. చివరకు చైతన్యజ్యోతి, పద్మావతి సంస్థలు ప్రైస్ బిడ్కు ఎంపికయ్యాయి. ఏడు దేవస్థానాల్లో శానిటరీ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాల పరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రహదార్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు నిర్వహించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో విడివిడిగా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానాల వారీగా శానిటరీ టెండర్లు ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని పది నెలలు జాప్యం చేసింది. ఒకే యూనిట్గా టెండర్లు నిర్వహించాలని గతేడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా.. అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గతేడాది నవంబర్తో ముగిసింది. ఆ కాంట్రాక్ట్ ముగియడానికి ఒక నెల ముందుగానే గత అక్టోబర్లో టెండర్ విడుదల కావాల్సి ఉంది. టెండర్లు ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి ఒకటి నుంచి తాము విధులు నిర్వహించలేమని దేవస్థానానికి లేఖ సమర్పించారు. దీంతో టెండర్ పిలవకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థకు తాత్కాలికంగా పనులు అప్పగించారు. పెరగనున్న కాంట్రాక్ట్..? గత నవంబర్తో ముగిసిన కేఎల్టీసీ సంస్థ శానిటరీ టెండర్ నెలకు రూ.49 లక్షలు. దేవస్థానం కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలుగా చెల్లిస్తున్నారు. రూ.12 లక్షలు మెటీరియల్కు ఖర్చు చేస్తున్నారు. మొత్తం నెలకు రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి సెంట్రలైజ్డ్ టెండర్లో అత్యాధునిక మెషినరీలు ఉపయోగించాలనే షరతు విధించారు. శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాల చెల్లింపుతో పాటు, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్స్గా కొంతమందిని నియమించనున్నారు. ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్ట్ రూ.80 లక్షలకు పైమాటే అంటున్నారు. ప్రముఖ దేవాలయాలకు గత ఏప్రిల్లో నోటిఫికేషన్ దానిని రద్దు చేసి మళ్లీ జూన్ 12న రీటెండర్ కొత్త షరతుల ప్రకారం రూ.80 లక్షలకు పెరిగే అవకాశం -
ప్రైవేట్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి
కలెక్టరేట్ వద్ద రవాణా జేఏసీ ధర్నా అమలాపురం రూరల్: రవాణా శాఖాధికారులను పక్కనపెట్టి, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రవాణా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రవాణా జేఏసీ జిల్లా కో–ఆర్డినేటర్, ఆంధ్రా ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, కలెక్టర్ మహేష్కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తిరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల మోటారు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయడానికి జిల్లా రవాణా అధికారులను విస్మరించి, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాహన యాజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. యాంత్రీకరణ విధానం నిలిపి, పాత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా జేఏసీ అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు ఈ నెల 4న అమలాపురంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. రవాణా జేఏసీ జిల్లా కన్వీనర్ రాగుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు పోలిశెట్టి సీతారాంబాబు, బొంతు బాలరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, ఎల్లమెల్లి పెద్దా తదితరులు పాల్గొన్నారు. -
14 నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణ
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శిక్షణ ఉంటుందని శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ ఎ.రవిశంకర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ఎంపీటీసీ సభ్యులకు సామర్లకోట ఈటీసీలోనే శిక్షణ ఇవ్వాలని తొలుత నిర్ణయించారని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈటీసీ సిబ్బంది ఆయా జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చాయన్నారు. దాంతో ఉమ్మడి జిల్లాల్లోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు మంగళవారం శిక్షణ ప్రారంభించినట్టు వివరించారు. కోర్సు డైరెక్టర్గా కేఆర్ నిహారిక, ఫ్యాకల్టీలు వి.జగన్నాథం, ఖాజా మొహీద్దీన్ శిక్షణ ఇస్తారన్నారు. రెండో తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రాంగణంలో, ఎనిమిదో తేదీ నుంచి విశాఖపట్నంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని జెడ్పీ మీటింగ్ హాల్లో శిక్షణ ఉంటుందన్నారు. నెల రోజులు సెక్షన్–30 అమలు అమలాపురం టౌన్: అమలాపురం పోలీస్ సబ్ డివిజన్లో నెల రోజుల పాటు సెక్షన్–30 అమలులో ఉంటుందని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అమలాపురం పట్టణం, అమలాపురం రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈ నెల 31 వరకూ ఈ సెక్షన్ వర్తిస్తుందని చెప్పారు. ఈ నేప థ్యంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలు జరపడానికి ముందుగా తన అనుమతి పొందాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.