breaking news
East Godavari
-
తెల్లదోమ
రూగోస్ వైట్ ఫ్లై (సర్పిలాకార తెల్లదోమ) కొబ్బరిని అత్యంత ఎక్కువగా దెబ్బ తీసింది. తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతంలో 2018లో మొదలైన తెల్ల దోమ ఉధృతి దేశమంతా వ్యాపించింది. ఇది కొబ్బరి నుంచి అరటి, ఇతర పంటలతో పాటు కడియం నర్సరీలకు కూడా వ్యాపించింది. దీనివల్ల 30 శాతం దిగుబడి తగ్గిపోయిందని అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చెప్పారు. కొబ్బరి తోటలో లక్షల సంఖ్యలో ఆశిస్తున్న దోమలు పచ్చదనాన్ని హరిస్తూ చెట్టును బలహీనపరుస్తున్నాయి. పలు రకాల నివారణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేదు. దీని ఉధృతి ఇప్పటికీ అధికంగానే ఉంది. -
ప్రార్థనలకు వెళ్లి తిరిగి వస్తుండగా..
● వ్యాన్ను ఢీకొన్న ఆటో ● మహిళ మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు తొండంగి: క్రైస్తవ ప్రార్థనలకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆటో వ్యాన్ను ఢీకొన్న సంఘటనలో ఓ మహిళ మృత్యువాత పడగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బీచ్ రోడ్డుపై గోర్సపాలెం వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వాకదారిపేటకు చెందిన రాయుడు లక్ష్మి స్వగ్రామం సామర్లకోట. కాగా ప్రార్థనల కోసం తన స్వగ్రామమైన వాకదారిపేటకు రావాలని కొద్దిమంది క్రైస్తవులను ఆహ్వానించింది. దీంతో సామర్లకోట వద్ద ఉండూరు గ్రామానికి చెందిన పాస్టర్ రామిశెట్ట రాణి, సామర్లకోటకు చెందిన మంచాల అప్పలనర్స (45), పీత సింహాచలం, లావేటి వెంకటలక్ష్మి, బొట్టా నూకరత్నం, అనుబోయిన నాగమణి తదితరులు ఆటోలో సామర్లకోట నుంచి బయలుదేరారు. వాకదారిపేటలో ప్రార్థనలు ముగించుకున్న అనంతరం సామర్లకోటకు తిరిగి వస్తున్నారు. బయలుదేరిన కొద్ది నిమిషాల్లోనే గోర్సపాలెం వద్ద బీచ్రోడ్డుపై వారు బయలుదేరిన ఆటో ఉప్పాడ వైపు నుంచి ఒంటిమామి వైపు వెళ్తున్న వ్యాన్ను బలంగా ఢీకొంది. దీంతో మంచాల అప్పలనర్స అక్కడికక్కడే తలపగిలి మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా ఆటో డ్రైవర్ పరారయ్యాడు. ఈ ప్రమాద స్థలంతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. స్థానికుల సహాయంతో వెంటనే క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగన్మోహన్రావు తెలిపారు. బీచ్ రోడ్డులో ఇటీవల కాలంలో ట్రాఫిక్ రద్దీతో పాటు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శెట్టిబలిజపేటలో విషాదం సామర్లకోట: స్థానిక 22వ వార్డు శెట్టిబలిజపేటలో విషాదం అలముకుంది. ప్రార్థనలకు వెళ్లి ఆటోలో వస్తూండగా మంచాల అప్పలనర్స మృతి చెందడంతో అందరినీ కలచివేసింది. ఆ పేటలో అందరూ కలిసి మెలిసి ఉంటారని, ఏ శుభకార్యం జరిగినా హాజరవుతారని స్థానికులు తెలిపారు. ఇదిలాఉంటే క్షతగాత్రుల కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్న ఆస్పత్రులకు పరుగులు తీశారు. -
మహాగణపతీ మన్నుంచయ్యా
ఫ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో అనర్థాలు ఫ రసాయనాలతో పెనుముప్పు ఫ మట్టి ప్రతిమలే మేలంటున్న పర్యావరణవేత్తలు నిడదవోలు: గణనాథులు కొలువు దీరే వినాయక చవితి ఉత్సవాలకు సమయం దగ్గర పడుతోంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీ జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ విగ్రహాల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. మరోవైపు వేడుకలకు ఆయా ఆలయ కమిటీలు సన్నద్ధమవుతున్నాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వద్దని, వీటివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. ఈ విగ్రహాల తయారీలో వినియోగించే రసాయనాల కారణంగా నీటిలోని జలాచరాలకు ప్రమాదం పొంచి ఉంది. ఆ రసాయనాల నీటిని తాగే జీవరాశులు ప్రమాదాల బారిన పడతాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు.. మన్ను విగ్రహాలే మేలని నిపుణులు అంటున్నారు. జోరుగా అమ్మకాలు రాజస్థాన్, హైదరాబాద్, విజయవాడ, వరంగల్, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు, వ్యాపారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకుని ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో భారీ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. అడుగు నుంచి 12 అడుగుల ప్రతిమలను తీర్చిదిద్దిస్తున్నారు. పర్యావరణం కలుషితమవుతుందని సామాజికవేత్తలు, విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నా, ఈ విగ్రహాల వాడకం మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా అందమైన ఆకృతుల్లో నేత్రపర్వంగా రసాయన రంగులు దిద్ది విగ్రహాలు ఆకర్షించడంతో ఆయా ఆలయ కమిటీలు వాటికే మొగ్గు చూపుతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది గణపతి విగ్రహాలను గోదావరి నదిలో, కాలువల్లో నిమజ్జనం చేస్తున్నారు. జీవకోటికి పెనుముప్పు వినాయక విగ్రహాల తయారీకి ఉపయోగించే రంగుల్లో మెగ్నీషియం, గంధకం, కాడ్మియం, జిప్సం, సీసం వంటి రసాయన పదార్థాలు ఉండడం వల్ల విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు కరగవు. ఫలితంగా నీటి కాలుష్యం పెరుగుతోందని, ఈ రసాయనాల వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇది జీవకోటికి పెనుముప్పుగా పరిగణస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత తీసుకోవాలి మట్టి వినాయక ప్రతిమల వినియోగంపై ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పించాలి. కాలుష్యాన్ని మిగిల్చే వాటికన్నా మట్టి విగ్రహాలు వినియోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడిన వారమవుతామన్న భావన అందరిలో కలిగించాలి. ఆధునిక హంగులు, రసాయనాలతో కూడిన రంగుల విగ్రహాలను పూజించడం సమాజానికి హాని తెలియజెప్పాలి. అవగాహన లోపంతో.. లంబోదరుడి విగ్రహాలు ఆధునిక హంగులు, ఆకర్షిణీయమైన రంగులతో రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి పర్యావరణ కాలుష్యానికి మరింత ఊతమిస్తాయి. మట్టి గణపతులే మేలని, వాటిని పూజించి పర్యావరణాన్ని రక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి, పలు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, పలువురు పర్యావరణ హితులు సమావేశాలు, సదస్సులు నిర్వహించి ప్రచారం చేస్తున్నా పెద్దగా మార్పు కనబడడం లేదు. ప్రజల్లో అవగాహన లోపంతో నూటికి 90 శాతం విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో రూపొందించినవే కనబడుతున్నాయి. -
రైతుల కడుపు కొడతారా!
ఫ పురుషోత్తపట్నం ఎత్తిపోతల వద్ద ఆందోళన ఫ సాగునీటి విడుదలను అడ్డుకుని నిరసన ఫ పరిహారం అందించాలని డిమాండ్ సీతానగరం: బలవంతంగా సేకరించిన భూములకు పరిహారం ఎప్పుడిస్తారంటూ రైతులు మండిపడ్డారు. మంగళవారం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్ద భూములు కోల్పోయిన రైతులు నీటి విడుదలను అడ్డుకుని, మోటార్లను నిలిపివేశారు. పురుషోత్తపట్నం, రామచంద్రపురం, సీతానగరం, చినకొండేపూడి గ్రామాలకు చెందిన కరుటూరి శ్రీనివాస్, కోడేబత్తుల ప్రసాదరావు, దుద్దిపూడి శ్రీనివాసరావు, ఉండవల్లి రమేష్, నానిబాబు, మట్ట వసంతరావు, సుంకవల్లి పుష్పలతో పాటు సుమారు 45 మంది రైతులు ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుని పథకం మోటార్లను నిలిపివేశారు. అక్కడ టెంట్ వేసి నిరసన తెలిపారు. తమ భూములను అక్రమంగా తీసుకుని రోడ్డున పడేస్తారా, కంటి తుడుపు చర్యలతో ఎన్నాళ్లు మోసం చేస్తారని ధ్వజమెత్తారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం హెడ్వర్క్స్, పైప్లైన్ల పేరుతో రైతుల నుంచి దౌర్జన్యంగా భూములను లాక్కున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో కొంతమందికి అరకొర పరిహారం ఇచ్చారన్నారు. పరిహారం ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు సైతం రైతులకు అనుకూలంగా పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. జూలైలో ఎత్తిపోతల పథకం నుంచి నీటి విడుదలకు వచ్చిన ఎమ్మెల్యే బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కాకినాడ పార్లమెంట్ ఇన్చార్జ్ జ్యోతుల నవీన్ తదితరులను అడ్డుకున్నామని నెల రోజుల్లో పరిహారం అందిస్తామని, అలాకాని పక్షంలో మీతోపాటే ఆందోళనకు దిగుతామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. గడువు దాటి చాలా రోజులైనా పరిహారం మాటే ఎత్తడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చే వరకు పథకం నుంచి నీటి చుక్క వదిలేది లేదని రైతులు తేల్చిచెప్పారు. ఘటనా స్థలానికి జలవనరుల శాఖ ఈఈ పేరయ్య, డీఈ కోటేశ్వరరావు, జేఈ సుమంత్, నార్త్జోన్ డీఎస్పీ సీహెచ్ జీవన, సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఎస్సై ఎల్.శ్రీనునాయక్, ఇతర మండలాల ఎస్సైలు, స్పెషల్ ఫోర్స్ వచ్చింది. రైతులతో చర్చలు జరిపింది. ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు వెళ్లేది లేదని వారు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో సీఐ మూర్తి, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ మూర్తి రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణచౌదరికి ఫోన్లో పరిస్థితిని వివరించారు. నిర్వాసితులకు రూ. 32.10 కోట్ల పరిహారం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిమిత్తం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం, చట్టబద్ధమైన వడ్డీ చెల్లింపుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.32.10 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీఓ నంబర్ 496ను విడుదల చేశారు. సీతానగరం మండలానికి చెందిన బి.సత్యనారాయణ సహా 28 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా, 2025 అక్టోబర్ 31న కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని అధికారులు ఎదుర్కొంటున్న కోర్టు ధిక్కరణ కేసు విచారణకు వచ్చింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, ఆర్డీఓ ఆర్.కృష్ణ నాయక్లకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. మొండిచేయి చూపారు సేకరించిన భూములకు అందించాల్సిన పరిహారం అందుకోకుండా సుమారు ఎనిమిది మంది రైతులు మరణించారు. 2017లో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని మొండిచేయి చూపారు. పరిహారం అందించడంలో జాప్యం తగదు. అప్పటి సీఎం, ఇప్పటి సీఎం చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు. – కొండు నానిబాబు, రైతు, పురుషోత్తపట్నం నయా పైసా ఇవ్వలేదు ఎత్తిపోతల పథకం హెడ్వర్స్క్కు 2.50 ఎకరాలు, పైప్లైన్లో రెండెకరాలను బలవంతంగా తీసుకుని, మాపై కేసులు పెట్టారు. కోర్టును ఆశ్రయించగా సానుకూలంగా స్పందించినా, ప్రభుత్వం పరిహారం అందించడం లేదు. జూలైలో పథకం నుంచి సాగునీటి విడుదలకు వచ్చిన ప్రజాప్రతినిధులను అడ్డుకోగా నెల రోజుల్లో పరిహారం ఇప్పిస్తామని అన్నారు. అయినా పైసా ఇవ్వలేదు. –కరుటూరి శ్రీనివాస్, రైతు, రామచంద్రపురం -
కళ్యాణ్ జ్యూయలర్స్ ప్రారంభం
ప్రకాశంనగర్: స్థానిక మల్లిననగర్లో ప్రముఖ ఆభరణాల కంపెనీ కళ్యాణ్ జ్యూయలర్స్ను మంగళవారం సాయంత్రం సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, షోరూమ్ ప్రారంభోత్సవానికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నమ్మకం, పారదర్శకత, వినియోగదారులకు తొలి ప్రాధాన్యం వంటి విలువలను నిరంతరం ముందుకు తీసుకెళ్తున్న సంస్థకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ కళ్యాణ్ జ్యూయలర్స్ వారి ముహూరత్ (పెళ్లి ఆభరణాల శ్రేణి), ముద్ర (చేతితో తయారు చేసిన యాంటిక్ ఆభరణాలు), నిమః (టెంపుల్ జ్యూయలరీ) వంటి ప్రముఖ హౌస్ బ్రాండ్లతో పాటు మరెన్నో అద్భుతమైన డిజైన్లు వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. షోరూం ప్రారంభోత్సవానికి నాగార్జున వస్తున్నారనే సమాచారంతో అక్కినేని అభిమానులు భారీగా తరలివచ్చి సందడి చేశారు. నాగార్జున సోగ్గాడు చిన్ని నాయన సినిమాలోని వాసివాడి తస్సదియ్య డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు. -
మట్టి విగ్రహాలనే పూజిద్దాం
వినాయక ఉత్సవాల్లో పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే పూజిద్దాం. మట్టితో చేసిన గణపతులను పూజించడం ద్వారా అంతా మేలు జరుగుతోంది. వాటి నిమజ్జనం విషయంలో పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలి. –పొన్నా కృష్ణబాబు, సిద్ధాంతి, నిడదవోలు మట్టి గణపతిని పూజిస్తేనే వ్రత ఫలితం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని పూజించడం చాలా లాభదాయకం. ఇందులో సహజ సిద్ధంగా ఉన్న వనములో లభించే పదార్థాలతో స్వామిని ఆరాధించి పూజలు చేయడం ద్వారా వినాయక చవితి వ్రత ఫలితాన్ని పొందగలరని హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. నిమజ్జనం చేస్తే మట్టి విగ్రహాలు ప్రకృతిలో కలిసిపోతాయి. –శ్రీకాకుళపు లక్ష్మీనరసింహ శాస్త్రి, అర్చకుడు, నిడదవోలు -
నల్లబ్యాడ్జీలతో రెవెన్యూ ఉద్యోగుల నిరసన
రాజానగరం: అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజానగరంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన వారు భోజన విరామ సమయంలో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయన్నారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, ఐఆర్, డీఏ, ఇతర పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. -
పింఛన్ల సొమ్ముతో ఇంజినీరింగ్ అసిస్టెంట్ పరారీ
అమలాపురం రూరల్: మండలంలోని బండారులంక సచివాలయం–1లో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కరిబండి శివశంకర్ 75 మందికి పంపిణీ చేయాల్సిన రూ.3.11 లక్షల పింఛన్ల నగదుతో పరారయ్యాడు. మంగళవారం ఉదయం నుంచి ఒక్కరికి కూడా పింఛను పంపిణీ చేయకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. మధ్యాహ్నం 12 గంటలైనా పింఛను పంపిణీకి రాకపోవడంతో లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి అనపర్తి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు బిక్కవోలు ఎస్సై వి.రవిచంద్రకుమార్ తెలిపారు. ఈ ఘటన బలభద్రపురంలో జరిగింది. బాలవరం గ్రామానికి చెందిన ఎం.మరిడయ్య తన మోటార్ సైకిల్పై బలభద్రపురం నుంచి రాజానగరం వెళ్తున్నాడు. ఈ సమయంలో అటువైపు వెళుతున్న లారీ వేగంగా వెనుక నుంచి మరిడయ్యను ఢీకొంది. దీంతో అతని కాలు నుజ్జునుజ్జు అయ్యింది. వెంటనే అతన్ని అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బైక్ను ఢీకొన్న ఆటో ఇద్దరికి తీవ్ర గాయాలు ఆలమూరు: 216ఏ జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. చొప్పెల్ల గ్రామానికి చెందిన పి.ప్రసాద్ తన ఇంటి నుంచి బైక్పై బయలుదేరి జాతీయ రహదారిని దాటుతున్నాడు. అంతలో రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వైపు వస్తున్న ఆటో ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ తలకు బలమైన గాయాలు కాగా, 108 అంబులెన్స్ సిబ్బంది సత్వరమే సంఘటనా స్థలానికి వెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అలాగే ఆటో రహదారిపై బోల్తా పడటంతో అందులో ఉన్న ఇన్వర్టర్ బ్యాటరీలు కింద పడిపోగా, అమలాపురానికి చెందిన డ్రైవర్ దుర్గాప్రసాద్కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఆలమూరు ఎస్సై జి.నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీని ఢీకొన్న కారు : పదహారవ నంబరు జాతీయ రహదారిలోని మడికి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. రావులపాలెం వైపు నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న కారు స్థానిక పోస్టాఫీస్ సెంటర్ సమీపంలోకి వచ్చేసరికి ఆగి ఉన్న ఎన్హెచ్ఏఐకు చెందిన లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజమహేంద్రవరం బుచ్చయ్య నగర్కు చెందిన డ్రైవర్ కుమార్స్వామితో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. -
మూడు నెలలుగా తాగునీరేది?
రంగంపేట: పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వానికి వడిశలేరు బీసీ కాలనీలో తాగునీటి సమస్య నిలుస్తోంది. మూడు నెలలుగా కాలనీలో తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బిందెడు నీటి కోసం కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోందని, నిత్యావసరాలకు నీరు లేక పనులన్నీ మానుకుని నీటి అన్వేషణలోనే గడపాల్సి వస్తోందని మహిళలు మండిపడ్డారు. మంగళవారం బీసీ కాలనీ మహిళలు పంచాయతీ కార్యదర్శి శ్రీవల్లిని నిలదీశారు. గ్రామంలోని మిగతా వీధులకు, కాలనీలకు నిరంతరాయంగా మంచినీరు అందుతుండగా, కేవలం తమ కాలనీపైనే అధికారులు ఎందుకు వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పనులు, వ్యవసాయ కూలీ పనులు మానుకుని దూర ప్రాంతాల్లోని బోర్ల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని, గర్భిణులు, వృద్ధులు ఉన్న ఇళ్లలో తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య తీవ్రతపై గతంలో పలుమార్లు పంచాయతీ సిబ్బందికి విన్నవించినా, కంటితుడుపు చర్యలే తప్ప శాశ్వత పరిష్కారం చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీవల్లీ మాట్లాడుతూ రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన బోరు మోటారు వీక్ అవడంతో నీరు సన్నగా వస్తుందని, కొత్త మోటారు వేయాల్సి ఉందన్నారు. మరమ్మతులు చేపట్టి వారం రోజుల్లో నీటి సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. కాలనీకి చెందిన పలువురు మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఫ వడిశలేరు బీసీ కాలనీకి అందని నీరు ఫ పంచాయతీ కార్యదర్శిని నిలదీసిన మహిళలు -
రూ.10 వేల పింఛనంటూ.. ఉన్నదంతా లాక్కుపోయారు!
సామర్లకోట: ఆరు పదుల వయసు.. ఆపై అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇద్దరు ప్రబుద్ధులు ఓ వృద్ధురాలిని మోసం చేశారు. రూ.10 వేల పింఛను వస్తుందంటూ, ఉన్న రూ.4 వేలు తీసుకుపోయిన ఘటన అందరినీ విస్తుపోయేలా చేసింది. సినీ ఫక్కీలో జరిగిన ఘటనకు సంబంధించి స్థానికుల కథనం ప్రకారం.. సామర్లకోటలోని అయోధ్యరామపురానికి చెందిన వృద్ధురాలు కలిగట్ల వీరరాఘవ తన కోడలు మంగతో కలసి నివాసం ఉంటోంది. వృద్ధురాలి కుమారుడు ఇటీవల మృతి చెందడంతో కోడలు వితంతు పింఛను కోసం దరఖాస్తు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్పై మంగళవారం వారి ఇంటికి వచ్చారు. వితంతు పింఛను విచారణ కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చామని చెప్పి.. ఆధార్ కార్డు జిరాక్స్ తేవాలని కోడలిని బయటకు పంపించారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని పింఛను సొమ్ము ఎంత వచ్చిందని ప్రశ్నించారు. ఆమె రూ.4 వేలు వచ్చిందని చెప్పడంతో.. అదేంటి పింఛను సొమ్ము ప్రభుత్వం పెంచింది కదా అంటూ.. ఆ సొమ్ము తీసుకున్నారు. రేపు సచివాలయం సిబ్బంది రూ.10 వేలు ఇంటికి తెచ్చి ఇస్తారని నమ్మించి వెళ్లిపోయారు. కోడలు వచ్చే సమయానికి వారిద్దరూ లేకపోవడంతో అత్తను ఆరా తీయగా, జరిగిన మోసం తెలిసి లబోదిబోమన్నారు. వృద్ధురాలి మెడలో బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ వచ్చిన వ్యక్తులు పింఛను సొమ్ము రూ.4 వేలతోనే పరారయ్యారని కోడలు మంగ తెలిపింది. -
బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్య రంగాలు, సంక్షేమ పథకాల అమలులో బ్యాంకర్లు మరింత సమన్వయంతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశం నిర్వహించారు. జూన్ 30 నాటికి బ్యాంకింగ్ రంగం సాధించిన పురోగతిని సమీక్షించారు. కౌలు రైతులకు రుణాల మంజూరులో మరింత పురోగతి సాధించాలని జేసీ బ్యాంకర్లను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే వి.జోగేశ్వరరావు, యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ ఎ.విశ్వేశ్వరరావు, జిల్లా లీడ్ మేనేజర్ డీవీ ప్రసాద్, రిజర్వ్ బ్యాంక్ ఏజీఎం దాసరి కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
1996 తుపాను నుంచి..
కొబ్బరి రైతుకు పరీక్షా కాలం 1996 నవంబర్ 6న సంభవించిన పెను తుపానుతో మొదలైంది. ఆ తుపానులో సుమారు 80 లక్షల చెట్లు వేర్లతో సహా నేల కూలాయి. పెనుగాలులకు మొవ్వు ఒడి తిరిగిపోయి చెట్లు జీవచ్ఛవాలుగా మారిపోయాయి. ఆ నష్టం నుంచి కోలుకోవడానికి కోనసీమ కొబ్బరి రైతులకు ఐదారేళ్లు పట్టింది. నల్లి తెగులు కొబ్బరిని 1998లో నల్లి తెగులు (ఇరియోఫీడ్ మైట్) ఆశించింది. తుపాను కన్నా ఎక్కువ నష్టం కలిగించిన ఈ పురుగు పిందెలపై దాడి చేసి, కాయలు చిన్నవిగా మారి, రాలిపోయేలా చేసింది. కొబ్బరి కాయలపై మచ్చలు ఏర్పడటంతో ఒకానొక సమయంలో బొండాలు తాగేందుకు సహితం జనం భయపడ్డారు. దిగుబడి సగానికి పడిపోయింది. దశాబ్ద కాలం పాటు కోలుకోలేని విధంగా కొబ్బరిని దెబ్బ తీసింది. ఇప్పటికీ దీని ప్రభావం కొనసాగుతూనే ఉంది. -
వైఎస్సార్ విగ్రహానికి నిప్పుపెట్టిన దుండగులు
దోషులను శిక్షించాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి డిమాండ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంగళవారం గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. మోటారు సైకిల్పై వచ్చిన వారు వెంట తెచ్చుకున్న పెట్రోలను విగ్రహంపై పోశారు. ఆయన కాళ్ల వద్ద నిప్పు పెట్టారు. దీనిని గమనించిన మెయిన్ రోడ్డులోని కొందరు దుకాణదారులు వెంటనే పరుగు పరుగున వచ్చారు. దీంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో వైఎస్సార్ విగ్రహం కాళ్ల వద్ద పెట్టిన మంటకు నల్లగా మారిపోయింది. స్థానిక దుకాణదారులు విగ్రహం పైనుంచి నీళ్లను పోసి కడిగారు. ఫ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నమహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టారంటే, వారిని క్షమించకూడదని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. ఈ దుశ్యర్యకు పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ విగ్రహం వద్దకు విజయలక్ష్మితో పాటు పార్టీ శ్రేణులు చేరుకున్నారు. జోహార్ వైఎస్సార్, దోషులను శిక్షించాలి, వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. సీపీ పుటేజీ ఆధారంగా నిందితుడిని మూడో పట్టణ పోలీసులు గుర్తించారు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ వర్రే అప్పారావు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, అడపా రాజు, కందకం శ్రీను పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్తో సాగుకు భరోసా
వరుస కరవుతో 2004కు ముందు రైతులు కష్టాలు పడేవారు. నాటి పాలకులు వ్యవసాయం దండగ అని మార్చేశారు. సాగుకు నోచుకోక పంట పొలాలు బీడు భూములుగా మారాయి. మరోవైపు విద్యుత్ చార్జీల మోతతో వ్యవసాయం కష్టంగా మారింది. అటువంటి సమయంలో అధికారం చేపట్టిన వైఎస్సార్ ఉచిత విద్యుత్ను అందించి వ్యవసాయాన్ని పండగ చేశారు. – కుంటముక్కల కేశవ నారాయణ, మలకపల్లి, తాళ్లపూడి పైసా ఖర్చు లేకుండా.. కుటుంబానికి పెద్ద దికై ్కన నాన్న షేక్ షౌకత్ లారీ డ్రైవర్గా పని చేస్తూ ఇల్లు గడిపేవారు. దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.లక్షలు అయ్యే చికిత్సను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాజమహేంద్రవరంలోని నెట్వర్క్ ఆస్పత్రిలో పైసా ఖర్చు లేకుండా ఉచితంగా పూర్తి చేశారు. –షేక్ సుబేదర్, సమిశ్రగూడెం, నిడదవోలు అప్పుల నుంచి విముక్తి నాకున్న మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసినప్పటికీ నాటి కరవు పరిస్థితుల వల్ల కలిసిరాలేదు. బ్యాంకులో తీసుకున్న రూ.1.5 లక్షల అప్పు తీర్చలేకపోయాను. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలుతో పాటు వడ్డీ కూడా మాఫీ చేయించారు. తర్వాత మళ్లీ కొత్తగా రుణం ఇప్పించారు. మహానేత వైఎస్సార్ దయ వల్ల అప్పుల నుంచి విముక్తి పొందాను. – జొన్నలగడ్డ సత్యనారాయణ, మిర్తిపాడు, సీతానగరం -
సీఐఐ ప్రాంతీయ సదస్సుకు సన్నాహాలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): విశాఖపట్నంలో నవంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా అక్టోబర్ 12న కాకినాడ జేఎన్టీయూలో సీఐఐ ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఇందులో పరిశ్రమలు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులు, నూతన ఆవిష్కరణలను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పరిచయం చేసేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. సముద్ర రవాణా, ఓడల నిర్మాణం, అమ్మోనియా, ఆక్వా ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్ తదితర ప్రాధాన్య రంగాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. సదస్సులో ప్రత్యక్షంగా ఉత్పత్తులను ప్రదర్శించగల 20 తయారీ రంగ ఎంఎస్ఎంఈలకు, మార్కెట్కు సిద్ధంగా ఉన్న పరిష్కారాలను కలిగిన ఐదు స్టార్టప్లు, సేవా సంస్థలకు స్టాల్స్ కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన ఉత్తమ పరిశ్రమలను విశాఖపట్నంలో జరిగే ప్రధాన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రదర్శనకు ఎంపిక చేసే అవకాశం ఉంటుందని వివరించారు. పారిశ్రామికవేత్తలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, పెట్టుబడిదారులతో నేరుగా సమావేశమై తమ ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలను వివరించవచ్చన్నారు. అర్హత కలిగిన ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, నూతన పారిశ్రామికవేత్తలు ఈ నెల 5 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 11న జిల్లా స్థాయి పరిశీలన, ఎంపిక, 20లోగా అవసరమైన పత్రాల సమర్పణ, 25న తుది జాబితా సమర్పణ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. వివరాలకు జిల్లా పరిశ్రమల అధికారి వనిధర్ రామన్ 94402 68563, ఇండస్ట్రీస్ ప్రమోషన్అధికారి సూర్య ప్రకాష్ 81435 79333 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. ఫ స్థానిక పరిశ్రమలు భాగస్వాములు కావాలి ఫ కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపు -
ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో వైద్య విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపుతూ 2026– 27 విద్యా సంవత్సరానికి వైద్య విద్య ఫీజులను పెంచాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే ఆశలను ఈ ఫీజుల పెంపు నిర్ణయం దెబ్బతీస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులపై వరుసగా ఆర్థిక భారాలు మోపడం దారుణమన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కని, డబ్బున్న వారికి మాత్రమే దక్కే వ్యాపార వస్తువు కాదన్నారు. యూజీ వైద్య విద్య ఫీజులను 10 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచే ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వం సామాన్య కుటుంబాలపై మరింత భారం మోపుతోందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, అధ్యాపకుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ముందుగా విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడం ఏంటన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే కలలు కనడం తప్పా, డబ్బులు లేవని ప్రతిభ ఉన్న విద్యార్థులు వైద్య విద్యకు దూరం కావాలా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు అన్నవరం: సత్యదేవునికి ఆగస్టు నెలలో హుండీ ఆదాయం దండిగా సమకూరింది. గత 33 రోజులకు గాను రూ.1,81,04,918 ఆదాయం వచ్చిందని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎన్.సూర్యచక్రధరరావు మంగళవారం తెలిపారు. నగదు రూ.1,71,50,672, చిల్లర నాణేలు రూ.9,54,246 మేర వచ్చాయని వివరించారు. శ్రావణ మాసం, పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం, వేలాదిగా భక్తులు తరలి రావడంతో వారు సమర్పించిన కానుకలతో హుండీలు నిండిపోయాయి. సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఖతార్ రియల్స్ 105, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 100, కెనడా డాలర్లు 20, అమెరికన్ డాలర్లు 20, మలేషియా రింగిట్స్ 2, యూరోలు 10, సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 15, ఇంగ్లండ్ పౌండ్లు 30, న్యూజిలాండ్ డాలర్లు 40, సింగపూర్ డాలర్లు 24, వియత్నాం కరెన్సీ 2 లక్షల డాంగ్స్, రష్యా రూబుల్స్ 50, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 200, నేపాల్ రూపాయలు 25, స్విస్ ఫ్రాంక్స్ 50 చొప్పున లభించాయని చైర్మన్, ఈఓ వివరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా నరేష్ కుమార్ కాకినాడ క్రైం: జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ నరేష్ కుమార్ పాట్నీడి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ లావణ్య కుమారి నెల రోజుల వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో డాక్టర్ నరేష్ కుమార్ను నియమిస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. జనరల్ సర్జరీ విభాగాధిపతిగా ఉన్న నరేష్ కుమార్ పూర్తి అదనపు బాధ్యతల్లో సూపరింటెండెంట్గా కొనసాగనున్నారు. -
వన్యప్రాణి చట్టాల అమలుపై వర్క్షాప్
రాజానగరం: లాలాచెరువులోని ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా సహకారంతో ‘వన్యప్రాణి చట్టాలు – అమలు’పై మంగళవారం వర్క్షాప్ జరిగింది. రెండు రోజులపాటు జరిగే ఈ వర్క్షాప్లో వన్యప్రాణి రక్షణ చట్టం– 1972, సవరణలు, సాక్ష్యాల సేకరణ, నేరాల గుర్తింపు, సీజ్ చేసే విధానం, కోర్టు ప్రక్రియలు, ప్రాసిక్యూషన్, మానవ– వన్యప్రాణి సంఘర్షణల చట్టపరమైన అంశాలు, అమలులో సాంకేతిక వినియోగం వంటి కీలక మాడ్యూల్స్పై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీటిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కలిగించి, వారిలో నైపుణ్యాలను పెంపొందించాలనే ఉద్ధేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అకాడమీ డైరెక్టర్ బి.విజయ్కుమార్ తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా గవర్నెన్స్, లా అండ్ పాలసీ డైరెక్టర్ డాక్టర్ విశేష్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు. అదుపు తప్పిన కారుదంపతులకు గాయాలు గంగవరం: 516 జాతీయ రహదారిపై గంగవరం సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. అడ్డతీగల మండలం ధాన్యంపాలెం గ్రామానికి చెందిన కురసం బాలుదొర (38), అతని భార్య రామతులసి కలసి కారులో బయలుదేరి గంగవరం మండలం పండ్రపొట్టిపాలెం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగవరం– అడ్డపల్లి చినవీధి మధ్యలో కారు ముందు టైరు ఫంక్చర్ కావడంతో అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. కారు నడుపుతున్న బాలుదొరకు రెండు కాళ్లకు గాయాలు కాగా, రామతులసికి తీవ్ర గాయాలై స్పృహ కోల్పోయింది. గంగవరం ఎస్సై ఎస్.వెంకయ్య సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆటోలో గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై వెంకయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోదారి గట్టుపై కారు బోల్తా కపిలేశ్వరపురం: గౌతమి గోదావరి గట్టుపై మంగళవారం కపిలేశ్వరపురం– తాతపూడి మధ్య కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని అంగర పోలీసులు తెలిపారు. కోరుమిల్లి వైపు నుంచి జొన్నాడ వైపునకు వెళ్తుండగా కారు బోల్తా పడినట్టు పలువురు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న తణుకుకు చెందిన నలుగురికి స్వల్ప గాయాలు కాగా, ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. -
‘చంద్రబాబుది క్రెడిట్ చోరీ’
రాజమండ్రి(తూ.గో. జిల్లా): చంద్రబాబు పూర్తి చేసిన కాలువ పనులు కూడా అవినీతిమయమేనని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ విమర్శించారు. వెలిగొండ ప్రాజెక్టుతో పాటు అనేక ప్రాజెక్టులు వైఎస్సార్ రెక్కల కష్టమన్నారు. చంద్రబాబుది క్రెడిట్ చోరీ తప్ప ఏమీలేదని ధ్వజమెత్తారు.పోలవరం ప్రాజెక్టు నుండి ఒక్క చుక్క నీరు కూడా ఎడమ కాలువ ద్వారా తరలించడం లేదని, పురుషోత్తపట్నం నుండి ఏలేరులో నీటిని ఎత్తిపోసి ఎడమ కాలువ ద్వారా పంపుతున్నారన్నారు. ఇది పోలవరం ప్రాజెక్టు నీరు కాదని.... గ్రావిటీపై ఒక చుక్క కూడా నీరు రావటం లేదన్నారు.‘పోలవరం ఎడమ కాలువ నుండి నీటిని విడుదల చేస్తామని చంద్రబాబు చెప్తున్నారు. వైఎస్సార్ హయాంలోనే రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ చాలావరకు పూర్తయ్యాయి. ఇది జల యజ్ఞం కాదు... ధన యజ్ఞం.. అని అప్పట్లో చంద్రబాబు అన్నారు. 45.72 మీటర్లు నీటిని నిల్వ చేస్తే తప్ప గ్రావిటీపై ఉత్తరాంధ్రకు నీటి సరఫరా సాధ్యం కాదు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు పరిమితం చేస్తే ఇది కేవలం బ్యారేజ్ గా మిగులుతుంది. కుడి, ఎడమ కాలువలు తవ్వించకపోతే అసలు పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లే పరిస్థితి ఉందా?, ఇప్పుడు ఉన్నదంతా జంజీ జనరేషనే... గతంలో చంద్రబాబు పవిత్ర సంగమం పేరిట డ్రామా చేశారు. మీరు చేసే పనులు వల్ల విద్యుత్ ఎంత అవుతుంది. చంద్రబాబు దారుణంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు’ అని విమర్శించారు.చంద్రబాబు మొగల్తూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ -
సమస్యలపై పోరుబాట
తమ సమస్యల కోసం కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం ఇస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద రేషన్ డీలర్ల నిరసన ప్రదర్శనసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పథకాలు అందక జనం.. ఉద్యోగ భద్రత లేక అనేక వర్గాలు విసుగుపోయారు.. చంద్రబాబు ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్నారు.. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేపట్టారు. ఆ వివరాలు ఇలా.. ఫ ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవం, ఆర్థిక ప్రయోజనాల సాధన కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో దశల వారీ ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కలెక్టర్ కీర్తి చేకూరిని కలిసి ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన నోటీసు అందజేశారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఐక్యంగా ఉద్యమిస్తున్నామని నేతలు తెలిపారు. సెప్టెంబర్ 1న ‘సీఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’ అనే నినాదంతో సెల్ఫోన్ డీపీలు ఏర్పాటు చేసి నిరసన తెలియజేయడం, 1 నుంచి 5 వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం వంటివి చేపడతారన్నారు. 2 నుంచి 8 వరకు హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమం ద్వారా కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం, సెప్టెంబర్ 3 నుంచి 5 వరకు భోజన విరామసమయంలో నిరసనలు నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 23న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, అలాగే 26న ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి ‘‘మా డబ్బులు మాకివ్వండి’’ నినాదంతో నిరసలు ఉంటాయన్నారు. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బాపిరాజు, ఏపీజేఏసీ అమరావతి విమెన్ వింగ్ చైర్పర్సన్ ఎం. నాగలకి్ష్మ్, మెన్ విభాగం సెక్రటరీ శివ, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతినిధులు సెక్రటరీ సురేష్, హెచ్ఎం అసోసియేషన్, మున్సిపల్ అసోసియేషన్, అవుట్సోర్సింగ్ అసోసియేషన్, నాలుగో తరగతి ఉద్యోగుల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. డీలర్ల సమస్యలు పరిష్కరించండి రేషన్ డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు శివప్రసాద్ అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డీలర్ చేస్తున్న డోర్ డెలివరీలో 5 కిలోల చొప్పున ప్యాకింగ్ చేయడానికి కవర్ల ఖర్చు వాటిని కార్డుదారుని ఇంటికి వెళ్లి ఇవ్వడానికి రవాణా ఖర్చు డీలర్ తనకు వస్తున్న స్వల్ప కమీషన్ నుంచి భరించాల్సి వస్తోందన్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ దుకాణానికి వచ్చే ప్రతి బస్తాపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, కార్డుదారునికి పంపిణీ చేసే ముందు కూడా మరోసారి స్కానింగ్ చేయాలని అధికారులు చెబుతున్నారన్నారు. ఇది ఇబ్బందిగా మారిందన్నారు. బియ్యం ఒక కిలోకి రూ.1 కమీషన్ ఇస్తుండగా రూ.3కు పెంచాలని, డీలర్లకు హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉదయేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు బుంగ రాజు, కోశాధికారి గెడ్డం పృథ్వీరాజ్ పాల్గొన్నారు. -
రాఖీ కట్టడానికి వచ్చి వివాహిత అదృశ్యం
నిడదవోలు రూరల్: రాఖీ పండగ రోజు సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన ఓ వివాహిత అదృశ్యమైంది. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తొట్టా వీర వెంకట సత్యనారాయణ, భార్య భారతీ ఏసురాణి (24) ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం బైక్పై మునిపల్లి గ్రామానికి వచ్చారు. భారతీ రాణి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు అక్క ఇంటి దగ్గర ఉండిపోయింది. సత్యనారాయణ ఆమెను అక్కడ దించి తిరిగి బ్రాహ్మణగూడెం వెళ్లిపోయాడు. అయితే భర్త వదిలి వెళ్లినప్పటి నుంచి భార్య భారతీ ఏసురాణి ఆచూకీ లభించలేదు. సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టూరిస్ట్ బస్సు ఢీకొని ల్యాబ్ టెక్నీషియన్ మృతి కరప: పెనుగుదురులోని ఓ రెస్టారెంట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి మృతి చెందాడు. కరప ఎస్సై తోట సునీత తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ వెంకటనగర్కు చెందిన యాళ్ల శేఖర్ కె.గంగవరం మండలం కుందూరు పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి బిర్యానీ తినేందుకు ఆదివారం పెనుగుదురులోని డాబా రెస్టారెంట్కు వెళ్లాడు. తిరిగి వస్తూ మోటార్ సైకిల్పై రోడ్డు దాటుతుండగా కాకినాడ నుంచి సిరిపురం వెళుతున్న టూరిస్ట్ బస్ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెచ్సీ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శేఖర్ మృత దేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృడినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంతా అయ్యాక వచ్చి..
కోరుకొండ: అంతా అయ్యాక వచ్చి.. మళ్లీ మొదలెట్టారు అన్నట్టు ఉంది పరిస్థితి. ఆ వివరాల్లో వెళ్తే.. దోసకాయలపల్లి గురుకుల హాస్టల్లో శుక్రవారం రాత్రి కలుషితాహారం తిని 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వైద్య సేవలు అందించడంతో వారి పరిస్థితి శని, ఆదివారాల్లో మెరుగుపడింది. ఈ మేరకు ఆదివారం డీఎంహెచ్ఓ డాక్టర్ పితాని కోమల వచ్చి హాస్టల్లోని విద్యార్థులను పరిశీలించి, ఆరోగ్యం నిలకడగా వెల్లడించారు. ఇదంతా అయ్యాక.. విద్యార్థులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం వచ్చారు. ఈ నేపథ్యంలో కోలుకున్న విద్యార్థులను మళ్లీ మంచాలపై పడుకోబెట్టి వైద్య సేవలు అందిస్తున్నట్లు, ఎమ్మెల్యే చూస్తున్నట్లు ఫొటోలు తీయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
కానిస్టేబుల్పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
దేవరపల్లి: విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్పై గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కత్తితో దాడి చేసిన సంఘటన దేవరపల్లి మండలం యర్నగూడెంలో 16వ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైవే పెట్రోలింగ్ వాహనంలో ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం తెల్లవారు జామున యర్నగూడెం గ్రామ శివారులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఫ్లైఓవర్పై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడకు సమీపంలోని బస్ షెల్టర్లో నలుగురు అనుమానాస్పదంగా ఉన్నారు. విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ వేముల వెంకటేశ్వరరావు వారి వద్దకు వెళ్లి వివరాలు అడిగే ప్రయత్నం చేయగా, వారిలో ఇద్దరు పారిపోయారు. మరో ఇద్దరు చాకుతో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును పొట్ట భాగంలో పొడిచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వరరావును అక్కడి నుంచి తొలుత దేవరపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. వెంకటేశ్వరరావు స్వగ్రామం దేవరపల్లి మండలం బందపురం. దుండగుల కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని సీఐ బి.నాగేశ్వర్ నాయక్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. ఫ కత్తితో పొడిచి పరారైన దుండగులు ఫ వారి కోసం పోలీసుల గాలింపు -
కొత్త కష్టాలు మాకొద్దు
● రేషన్ డీలర్ల ఆవేదన ● క్యూఆర్ కోడ్ విధానంపై విముఖత ● సాంకేతిక సమస్యలు తప్పవని గగ్గోలు అంబాజీపేట: ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం తమకు తలనొప్పిగా మారిందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. క్యూఆర్ కోడ్ పద్ధతితో తలనొప్పి తప్పడం లేదని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో క్యూఆర్ కోడ్ విధానానికి శ్రీకారం చుట్టింది. సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లు తీసుకెళ్లే బియ్యానికి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఆపై దుకాణాల వద్దకు సరఫరా అయ్యే బియ్యానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలి. దీన్ని సెప్టెంబర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ అమలు చేయనుంది. అయితే ఈ కొత్త విధానం తమకు ఇబ్బందిగా మారిందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 779 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా 4,58,874 మంది రేషన్ కార్డుదారులు సరుకులు తీసుకుంటున్నారు. డీలర్ల వ్యతిరేకత గోడౌన్ల నుంచి స్కానింగ్ ద్వారా రేషన్ షాపులకు బియ్యం చేరుతుంది. డీలర్లు స్కాన్ చేసి ఆపై తమ పీపీఎస్ (పెడ్డీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్) యాప్ ద్వారా సబ్మిట్ చేసి ఈ–పాస్ ద్వారా ఆర్వో జనరేట్ చేసి ట్రాక్ షీట్ చేపట్టాలి. ఇదంతా కష్టతరమని డీలర్లు చెబుతున్నారు. ఎందుకంటే కొందరు డీలర్లకు స్మార్ట్ ఫోన్లు లేవు. వీరు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలంటే కొత్త లింకును పంపిస్తున్నారు. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో వారికి అవగాహన లేదు. అలాగే బియ్యం బస్తాలను షాపుల వద్దకు దించే హమాలీలు ప్రతి మూటను స్కానింగ్ చేసేందుకు గంటల సమయం పడుతుంది. బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్లు చిరిగిపోయి ఉంటే మరింత ఇబ్బందిగా మారుతుంది. పెరిగిన పనిభారం చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా రేషన్ డీలర్లపై విపరీతమైన పని భారం పెంచింది. రకరకాల నిబంధనలు విధించడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రతి బియ్యం బస్తాను రెండు సార్లు స్కానింగ్ చేయాలంటూ కొత్తగా నిబంధన తీసుకువచ్చారు. కానీ కిలోకు రూపాయి కమిషన్ తప్ప ఒక్క పైసా కూడా పెంచలేదు. -
సత్యదేవునికి ధరల భారం!
అన్నవరం: పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అయితే ఈ భారం రత్నగిరిపై సత్యదేవునికీ తప్పేలా లేదు. ప్రసాదం తయారీతో పాటు అన్నదాన పథకం నిర్వహణకు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఏటా నిత్యావసరాల కొనుగోళ్లకు సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఈ సారి పెరిగిన ధరలతో మరో రూ.ఆరు కోట్ల వరకు ఆదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా. పంచదార, యాలకులు, గోధుమల ధర పెరగడంతో సత్యదేవుని ప్రసాదం తయారీకి ఖర్చు ఎక్కువ కానుంది. అలాగే పెరిగిన బియ్యం, నూనెల ధరలతో నిత్యాన్నదాన ప్రసాదంలో భోజనం తయారీ వ్యయం పెరుగుతుంది. ఆరు నెలలకు టెండర్ అన్నవరం దేవస్థానంలో ఉపయోగించే బియ్యం, పప్పులు, నూనె, కందిపప్పు, పంచదార, నెయ్యి, గోధుమలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ కం వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈసారి అక్టోబర్ ఒకటి నుంచి 2027 మార్చి 31 వరకు టెండర్ వేయడానికి సెప్టెంబర్ 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆయా టెండర్లను తెరచి, తక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారు. మరి ఈ సారి ఎంతకు టెండర్ వెళుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా.. ఏటా రూ.25 కోట్లతో కొనుగోలు చేసే నిత్యావసరాల్లో సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి, పంచదార, గోధుమలు, యాలకులు, గ్యాస్కు రూ.15 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో, నివేదనశాలకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పామాయిల్, కూరగాయలకు రూ.2.5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక స్వామివారి వ్రతాల విభాగంలో ఉపయోగించే దీపాల నూనె, అగరవత్తులు, హారతి కర్పూరం, పసుపు, కుంకుమ, గావంచాలు, జాకెట్ ముక్కల కొనుగోలుకు మరో రూ.మూడు కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు. పెరిగిన ధరలు దేవస్థానంలో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు ఆరు నెలల క్రితానికి ఇప్పటికి దాదాపు 30 శాతం పెరిగాయి. ఆ మేరకు సెప్టెంబర్ మూడో తేదీన తెరవనున్న టెండర్లులో కూడా ఆ మేరకు సప్లయిదారులు కోట్ చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిత్యావసర పరిమాణం టెండర్ ధర మార్కెట్ రేటు వస్తువులు (6 నెలలకు) (6 నెలల క్రితం) (ప్రస్తుతం) కేజీ రూ.బియ్యం 180 టన్నులు 42 50 – 60 గోధుమలు 400 టన్నులు 32.50 45 – 50 పంచదార 500 టన్నులు 44 68 – 72 కందిపప్పు 25 వేల కేజీలు 129 160 – 180 పామాయిల్ 2 వేల కేజీలు 130 165 – 170 యాలకులు 800 కేజీలు 2,800 4000 ప్రసాదం, భోజనం తయారీకి ఏటా రూ.25 కోట్ల ఖర్చు ఇప్పుడు మరో రూ.6 కోట్లు పెరిగే అవకాశం 3 వరకు టెండర్కు గడువు ఈసారి ఎంత వెళుతుందోనని ఉత్కంఠ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 24,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ప్రయాణికుల పడిగాపులు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొనడంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కూర్చునేందుకు సైతం బెంచీలు లేక వృద్ధులు, చిన్నారులు, మహిళలు అవస్థలు ఎదుర్కొన్నారు. సోమవారం సింహాచలం నుంచి కొండపల్లి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో జిల్లా మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. గంటలకొద్దీ ఆలస్యం కావడంతో ప్రయాణికులు రైళ్ల రాక కోసం ఎదురుతెన్నులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్లో కూర్చునేందుకు సైతం బెంచీలు లేక ప్లాట్ఫామ్ నేలపై, ఫుట్వే బ్రిడ్జి మెట్లపై కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్, బొకారో ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి, తిరుపతి– కాకినాడ సికింద్రాబాద్ – అనకాపల్లి, కోణార్క్ ఎక్స్ప్రెస్లు మూడు గంటల నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. విజయవాడ వైపు వెళ్లే సంత్రాగచ్చి– తిరుపతి, కోరమండల్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు 3 గంటల నుంచి 6 గంటల ఆలస్యమైంది. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703) పదిన్నర గంటలు ఆలస్యంగా నడిచింది. గూడ్స్ వ్యాగన్ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడడంతో రైల్వే శాఖ అధికారులు తక్షణమే స్పందించి ప్రయాణికులకు సమాచారం అందించేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లో డెస్క్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు రైల్వే సీటీ సుంకర చంద్రమౌళి తెలిపారు. బెంచీలు కూడా లేక.. రైళ్లు తీవ్ర ఆలస్యం కావడంతో ఇబ్బంది పడ్డాం. స్టేషన్ లో కూర్చునేందుకు సైతం బెంచీలు లేవు. సరైన సమ యానికి రైళ్లు రాకపోవడంతో సమయానికి గమ్యం చేరలేకపోతున్నాం. షెడ్యూల్ టైం ప్రకారం స్టేషన్కు వచ్చినా రైలు కోసం ఎదురు తెన్నులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. –ప్రసన్న, ప్రయాణికురాలు, రాజమహేంద్రవరం సరైన సమాచారం ఇవ్వలేదు రైలు గంటలకొద్దీ ఆలస్యమైనప్పటికీ రైల్వే శాఖ హెచ్చరికలు చేయడం సక్రమంగా లేదు. రైలు ఆలస్యాన్ని సరిగా ప్రకటించకపోవడం దారుణం. రత్నాచల్ ఎక్స్ప్రెస్ నాలుగు గంటలు ఆలస్యమైనప్పటికీ 15 నిమిషాల్లో వచ్చేస్తుందంటూ సమాచారం ఇవ్వడం సరికాదు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. –లక్ష్మి, ప్రయాణికురాలు ఫ కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ ఫ ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు ఫ రాజమహేంద్రవరంలో ప్రయాణికులకు కష్టాలు -
రంగు పేరుతో కక్ష సాధింపు!
దేవరపల్లి: నల్లజర్ల మండలం దూబచర్లలో వైఎస్సార్ వసంత్ నగర్ ద్వారం రంగుల వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో వైఎస్సార్ వసంత్ నగర్ పేరున గతంలో పార్టీ శ్రేణులు ద్వారం ఏర్పాటు చేశారు. దానికి వైఎస్సార్ సీపీ రంగులు వేశారు. కానీ అనివార్య కారణాలతో అప్పటి నుంచి ఆ ద్వారం ప్రారంభోత్సవం కాలేదు. అలాగే అక్కడే వైఎస్సార్ విగ్రహం, బస్షెల్టర్ కూడా నిర్మించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ద్వారం, విగ్రహం, బస్షెల్టర్ ప్రారంభోత్సవానికి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని నాలుగు రోజులుగా కొత్తగా వైఎస్సార్ సీపీ రంగులు వేసి సిద్ధం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ చేబ్రోలు చిన వెంకటేశ్వరరావు(కొండ), మాజీ జెడ్పీటీసీ సభ్యులు బంకా అప్పారావు, మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ మునాఫ్, గ్రామ కమిటీ అధ్యక్షులు దోవా సాయి ఆధ్వర్యంలో నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్డుకున్న పోలీసులు ద్వారానికి వైఎస్సార్ సీపీ రంగులు తొలగించి, తెలుపు రంగు వేయాలని పోలీసులు పార్టీ నాయకులకు సూచించారు. ద్వారానికి తెలుపు రంగు వేయడానికి పంచాయతీ సిబ్బంది రంగు డబ్బాలతో అక్కడకు చేరుకోగా, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గతంలో వేసిన రంగులనే మళ్లీ వేశామని, రంగు మార్చడానికి వీలు లేదని పోలీసులకు పార్టీ నాయకులు తెలిపారు. దీంతో వారి మధ్య సోమవారం వాగ్వాదం జరిగింది. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున దూబచర్ల చేరుకుని ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు ద్వారం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లజర్ల సీఐ రవికుమార్, ఎస్సై ఆంజనేయబాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు ద్వారానికి పార్టీ రంగులు వేయవద్దంటూ ఆదేశాలు గతంలో వేసిన వాటికే మెరుగు పెడుతున్నా అడ్డగింపు దూబచర్లలో ఉద్రిక్తత -
చట్ట సభల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి
అమలాపురం టౌన్: స్థానిక సంస్థలు, చట్ట సభల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగ మహా సంఘటన్ జాతీయ అధ్యక్షుడు నండూరి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్సన్ విత్ డిజబిలిటీ (పీడబ్ల్యూడీ) ఫెడరేషన్, దివ్యాంగ మహా సంఘటన్, కోనసీమ జిల్లా దివ్యాంగ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రమేష్ హాజరయ్యారు. పీడబ్ల్యూడీ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి దొడ్డిపట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకట ప్రసాద్, దివ్యాంగుల మహా సంఘటన్ రాష్ట్ర అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్ మాట్లాడుతూ దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 50 శాతం రాయితీపై ఏ విధమైన బ్యాంక్ హామీలు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దివ్యాంగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కులు, రాయితీలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల జేఏసీ చైర్మన్ పెనుమాల నాగరాజు, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు కొమ్ముల కోటేశ్వరరావు, నల్లమాటి లంకరాజు, కానూరు శంకరరావు, కె.సుబ్రహ్మణ్యం, జి.కొండలరావు పాల్గొన్నారు. -
గజం స్థలం కోసం గొడవ
● అస్వస్థతకు గురై వ్యక్తి మృతి ● చేబ్రోలులో ఘటన పిఠాపురం: ఇంటి సరిహద్దులో గజం స్థలం కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సోమవారం జరిగిన ఈ ఘటనపై ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇవీ.. చేబ్రోలులోని కొత్తపేటకు చెందిన ఉలవకాయల సత్తిబాబు (65)కు పక్కింటి దూళిపూడి మహేష్కు ఇటీవల ఇంటి సరిహద్దులో గజం స్థలంపై వివాదం నెలకొంది. ఇది గ్రామ పెద్దల వద్దకు చేరడంతో వారు.. స్థలాన్ని సర్వే చేయించి, హద్దులు తేల్చుతామని, అప్పటి వరకు గొడవలు పడొద్దని చెప్పారు. అయితే సోమవారం సాయంత్రం ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ మాటామాటా పెరిగింది. ఈ వివాదంలో తన తల్లిని తిట్టాడని ఆరోపిస్తూ ఉలవకాయల సత్తిబాబుతో దూళిపూడి మహేష్ గొడవ పడి, చేయి చేసుకున్నాడు. ఇంతలో స్థానికులు అక్కడకు వచ్చి, ఇద్దరినీ విడదీసి పంపించి వేశారు. కొంతసేపటికి సత్తిబాబు తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి మృతి చెందాడు. మహేష్ కొట్టడం వల్లే సత్తిబాబు మృతి చెందాడని మృతుడి బంధువులు పోలీసులు ఫిర్యాదు చేశారు. -
పోలీస్ పీజీఆర్ఎస్కు 42 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 42 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి ఎస్పీ డి.నరసింహకిషోర్కు సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలపై వెంటనే స్పందించి సంబంధిత స్టేషన్ల పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సత్వరమే న్యాయం చేయాలని ఉత్వర్వులు ఇచ్చారు. ఈ అర్జీల్లో సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్, కొట్లాట కేసులు ఉన్నాయి. ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్గా సోఫియా కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ సోఫియా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు పనిచేసిన కేఏవీ సుబ్రహ్మణ్యం ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఆ బాధ్యతలను డాక్టర్ సోఫియాకు అప్పగిస్తూ డీఎంఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఆమె ప్రభుత్వ వైద్య కళాశాలలో అనస్తీషియా విభాగంలో హెచ్ఓడీగా విధులు నిర్వస్తున్నారు. సిబ్బంది అందుబాటులో ఉండాల్సిందే.. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించేందుకు ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు సంబంధిత సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సిబ్బంది హాజరు, ప్రజలకు అందుబాటులో ఉన్న తీరును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 164 అర్జీలు స్వీకరించామన్నారు. సహాయ కలెక్టర్ కె.ఆదిత్యశర్మ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి, డీఎస్పీ ఎ.శివప్రియ, డీడీఓ కె.రత్నకుమారి, సీపీఓ ఎల్.అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాన్ ఢీకొని మహిళ మృతి
రామచంద్రపురం రూరల్: మండలంలోని జగన్నాయకులపాలెంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంటూరు శివారు చొల్లంగిపేటకు చెందిన చొల్లంగి అనంతలక్ష్మి (55) మృతి చెందింది. ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. చొల్లంగిపేటకు చెందిన చొల్లంగి సత్యనారాయణ, భార్యతో అనంతలక్ష్మి తో కలసి రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట బంధువుల ఇంటికి ఆదివారం వచ్చారు. రాత్రి తిరిగి ఇంటికి వెళుతుండగా జగన్నాయకులపాలెం గ్రామంలో బొలెరో వాహనం వీరిని ఢీకొంది. దీంతో కిందపోయిన అనంతలక్ష్మి పైనుంచి వాహనం వెళ్లిపోయింది. సత్యనారాయణ కుడి భుజానికి గాయమైంది. అనంతలక్ష్మిని స్థానికులు 108లో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆసుపత్రి సమాచారం, మృతురాలి కుమారుడు చొల్లంగి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్ కాట్రేనికోన: కుండలేశ్వరంలోని పుష్కరాల రేవు సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నాగవరపు సుధీర్ను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, ఇన్చార్జి ఎస్సై బి.శివకృష్ణ, కాట్రేనికోన తహసీల్దార్ రవికిరణ్ సంఘటనా స్థలానికి చేరుకుని అమలాపురం కరక్కాయపేటకు చెందిన ఆ యువకుడిని పట్టుకున్నారు. రెండు కేజీలు గంజాయిని తీసుకువచ్చి, దానిలో కొంత అమ్మినట్లు సుధీర్ అంగీకరించాడు. మిగిలిన 1.58 కేజీల గంజాయిని, మోటారు సైకిల్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
మాస్టర్స్ అథ్లెటిక్స్లో స్వర్ణ పతకం
ఎటపాక: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్లో ఆంధ్యా వ్యాయామ ఉపాధ్యాయుడు స్వర్ణ పతకం సాధించారు. తెలంగాణ, నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ అఫ్ ఇండియా, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ గుర్తింపుతో సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో 35–90 ఏళ్ల మధ్య వయస్సు పురుషులు, మహిళలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఎటపాక మండలం నల్లకుంట ఆశ్రమ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు సొడె నాగిరెడ్డి 45 ఏళ్ల విభాగం షాట్పుట్లో స్వర్ణ పతకం సాధించారు. ఆయనను పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
రంగులు కళకళ.. బతుకులు వెలవెల!
నిడదవోలు రూరల్: వినాయక చవితి వస్తోందంటే చాలు భక్తుల్లో కోలాహలం మొదలవుతుంది. గణనాథుడి విగ్రహాలతో పట్టణాలు, గ్రామాలు కళకళలాడతాయి. కానీ ఆ విగ్రహాలకు జీవకళ ఇచ్చే కార్మికుల జీవితాలు వెలవెలబోతున్నాయి. నెలల తరబడి శ్రమించి, అప్పులు చేసి రూ.లక్షలు పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారు చేస్తున్నా.. విక్రయాలపై నమ్మకం లేకపోవడంతో ఏటా నష్ట భయంతోనే పండగ కోసం ఎదురుచూస్తున్నారు. ఉత్పత్తి వ్యయానికి తగిన గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. వచ్చే నెల 14 నుంచి గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండడంతో ఇప్పటికే విగ్రహా ఏర్పాటు కమిటీ సభ్యులకు ఇష్టమైన రీతిలో గణనాథుల విగ్రహాలను కళాకారులు సిద్ధం చేస్తున్నారు. అప్పులు తెచ్చి తయారీ చేతుల్లో అద్భుతమైన కళ.. కళ్లముందు వినాయకుడి రూపం.. కానీ కళకు తగ్గ పైకం మాత్రం చేతిలో కనిపించడం లేదు. నిడదవోలు మండలంలోని సమిశ్రగూడెం, డి.ముప్పవరం గ్రామాల్లో వినాయక ఉత్సవాల కోసం నెలల ముందు నుంచే విగ్రహాలు తయారు చేస్తుంటారు. ముడి సరకులు, పెయింటింగ్, కూలీలు, రవాణా తదితర ఖర్చులు పెరుగుతున్నా.. విగ్రహాల ధరలు మాత్రం ఆ మేరకు పెరగడం లేదు. విగ్రహాల తయారీకి ఏటా సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చవుతోందని గత మూడేళ్లుగా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టపోతున్నామని కళాకారులు చెబుతున్నారు. ఈ కళను నమ్ముకున్న వారు సొంత నిధులతో అప్పులు తెచ్చి విగ్రహాలను రూపొందిస్తున్నారు. తీరా ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగకపోతే చేసిన అప్పులు తీర్చడం పెనుభారంగా మారుతోంది. అంతేగాక విగ్రహాల తయారీ పూర్తయ్యాక వాటిని భద్రపరచడం మరో పెద్ద సవాలుగా మారింది. వర్షం కురిస్తే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలు తడిసి రూపురేఖలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే చవితి పూర్తయ్యే వరకూ వాతావరణం ఎలా ఉంటుందోనన్న ఆందోళన కళాకారుల్లో వ్యక్తమవుతోంది. మట్టి విగ్రహాలతో జీవనోపాధికి దెబ్బ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాల వినియోగంపై జోరుగా ప్రచారం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు సైతం ఉచితంగాా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి. పర్యావరణ స్పృహ ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్న సంప్రదాయ కళాకారులకు ప్రత్యామ్నాయ మార్కెటింగ్, పునరావాసం చూపకపోవడంతో వారి జీవనోపాధి తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రభుత్వం స్పందించి రాయితీపై ముడిసరుకులు, తక్కువ వడ్డీ రుణాలు, మార్కెటింగ్ సదుపాయం కల్పించి తమను ఆదుకోవాలని కళాకారులు కోరుతున్నారు. విగ్రహాలెన్ని చేసినా లాభాలు కరవు రూ.లక్షల్లో పెట్టుబడి.. అదే స్థాయిలో నష్టాలు గిట్టుబాటు ధరలేక వ్యాపారుల గగ్గోలు నిడదవోలు పరిసరాల్లో విక్రయానికి సిద్ధంగా వినాయక విగ్రహాలుకరోనా కాలం నుంచీ కష్టాలే.. 16 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నాం. ఏటా సుమారు రూ.10 లక్షల పెట్టుబడి వ్యయం అవుతోంది. కరోనా కాలం నుంచి ఏటా రూ.2 లక్షలు పైగా నష్టం వస్తోంది. డిమాండ్కు తగ్గ ధర లేకపోవడమే ప్రధాన సమస్య. పర్యావరణ పరిరక్షణతో పాటు మా లాంటి కళాకారులు బతికేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. – సంగినీడి సత్యనారాయణ, విగ్రహాల తయారీదారుడు, డి.ముప్పవరం -
మహిళ హత్యకు కుట్రపై కేసు నమోదు
● పోలీసుల అదుపులో నిందితులు? ● కేసు నమోదులో నిర్లక్ష్యంపై వీఆర్కు ఎస్సై ● జీజీహెచ్ ఔట్పోస్టు సిబ్బంది తొలగింపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బొమ్మూరుకు చెందిన వివాహితపై గాడాలకు చెందిన యువకుల హత్యాయత్నం కేసుకు సంబంధించి ఎట్టకేలకు కోరుకొండ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ఐదు రోజుల తరువాత కానీ పోలీసులకు విషయం తెలియకపోవడంపై ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ‘పుట్టిన రోజుకని పిలిచి హత్యకు కుట్ర’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఎస్పీ డి.నరసింహ కిశోర్ సంబంధింత అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఆదివారం రాత్రి నిందితులు మట్టాడి అయ్యప్ప, మట్టాడి దేవీ వరప్రసాద్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి మెరుగ్గా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై ఎస్పీ ఆగ్రహం శాంతిభద్రతలతో ముడిపడి ఉన్న ఈ ఘటన ఆలస్యంగా తెలియడం పోలీసుల వైఫల్యంగా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రియాంక ఘటన సైతం ఇలాగే బయటపడకపోవడం, మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే.. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉంటుండడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తీసుకున్న ఎస్పీ కోరుకొండ ఎస్సై రమేష్ను వీఆర్లోకి పంపినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వాసుపత్రి పోలీసు ఔట్పోస్ట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని కూడా అక్కడనుంచి తొలగించారు. పరువు కాపాడుకునేందుకే వివాహితపై దాడి చేసి హత్యయత్నానికి ప్రయత్నించిన యువకుల కోసం రెండు పోలీసు బృందాలు ఆదివారం గాలించి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ప్రకటన విడుదల చేస్తూ కోరుకొండ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న చిత్రాన్ని ప్రదర్శించారు. పోలీసులు వారిని విచారించగా హత్య చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తమేనని ఒప్పుకున్నారు. చావు బతుకుల నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధనలక్ష్మి భర్త నుంచి విడిపోవడంతో నిందుతుల్లో ఒకరైన మట్టాడి దేవీవరప్రసాద్ నాలుగేళ్లుగా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తరచూ ఇంటికి కూడా వెళ్లేవాడు. అతడికి పెళ్లి సంబంధాలు చూస్తున్న అతని అన్నయ్య మట్టాడి అయ్యప్పకు ఈ విషయం నచ్చలేదు. కుటుంబం పరువు పోతుందనే ఉద్దేశంతో తమ్ముడితో కలసి ఆమె హత్యకు పథకరచన చేశారు. ఈ మేరకు ఈనెల 25వ తేదీ రాత్రి ఆమెను పుట్టినరోజు సాకుతో పిలిచి గాడాలలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి హత్యయత్నానికి పాల్పడినట్టు తెలిపారు. -
అన్నపూర్ణమ్మకు వెండి మకర తోరణం సమర్పణ
పెద్దాపురం: స్థానిక విశ్వేశ్వర చంద్రశేఖర స్వామి దేవస్థానంలోని అన్నపూర్ణ అమ్మవారికి పెద్దాపురానికి చెందిన భక్తులు రూ.10 లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని ఆదివారం సమర్పించారు. పట్టణానికి చెందిన యినుమర్తి సత్యనారాయణ, వీరవెంకట పద్మావతి దంపతులు ఈవో కె.జగదీఽశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో అమ్మవారికి వెండి మకరతోరణాన్ని అందజేశారు. జాతీయ రహదారిపై లారీ బోల్తాడ్రైవర్ నిద్ర మత్తుతో ఘటన రాజానగరం: జాతీయ రహదారిపై జీపీఆర్ గార్డెన్స్ వద్ద సిమెంటు లోడుతో వెళ్తున్న లారీ ఆదివారం తిరగబడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి కాకినాడకు ఆ లారీ లూజ్ సిమెంటు తీసుకువెళ్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్రకు చెందిన డ్రైవర్ కేతా శ్రీనివాస్ నిద్రమత్తలో షడన్ బ్రేక్ వేయడంతో లారీ అదుపుతప్పి, రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మలు, చెట్లపై నుంచి పల్టీ కొట్టింది. ఈ ఘటనకు కొద్దివేటు దూరంలోనే ఉన్న ఒక కారు, చిన్నపాటి హోటల్ నిర్వాహకులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ను 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రకాలనీలో చోరీ● రూ.3.5 లక్షల నగదు బంగారు, వెండి ఆభరణాల అపహరణ కడియం: మండలంలోని దుళ్ల గ్రామంలోని ఎర్ర కాలనీలో ఆదివారం ఓ ఇంటిలో చోరీ జరిగి రూ.3.5 లక్షల నగదు, 10 కాసుల బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి యజమాని మానెం సత్యనారాయణ కుటుంబ సభ్యులతో ఆదివారం ఉదయం వేములపల్లి ఫంక్షన్కు వెళ్లారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఒక వ్యక్తి ఇంటిలోకి చొరబడి బీరువాలోని నగదు, బంగారు, వెండి వస్తువులను చోరీ చేసినట్టు సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని సౌత్జోన్ డీఎస్పీ శివప్రియ, ఎస్సై దుర్గాప్రసాద్ పరిశీలించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అగ్ని ప్రమాదంలో సరుగుడు తోట దగ్ధం
మలికిపురం: మండలంలోని తూర్పుపాలెంలో సుమారు ఐదు ఎకరాల్లో సరుగుడు తోటలకు నిప్పు అంటుకుంది. మొగలి డొంకలు అంటించిన క్రమంలో పక్కనున్న సుమారు ఐదు ఎకరాల సరుగుడు తోటలకు మంటలు వ్యాపించాయి. వీటితో పాటు కొన్ని కొబ్బరి చెట్లు మామిడి చెట్లు, జీడి మామిడి చెట్లు కూడా దగ్ధమైనట్టు రైతులు చెబుతున్నారు. అడబాల వెంకట నరసయ్య, అడబాల సత్యనారాయణ మూర్తి, అడబాల రామ్మూర్తి, నాగమోహన్రావు, అడవుల వెంకటేశ్వరరావు, నల్లి గణేశ్వరరావు తదితర రైతులకు సంబంధించిన తోటలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు ప్రాథమిక అంచనా వేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. -
గ్రీన్ఫీల్డ్ హైవేపై రోడ్డు ప్రమాదం
● భార్యాభర్తలకు, డ్రైవర్కు తీవ్ర గాయాలు ● రెండేళ్ల బాలుడు సురక్షితందేవరపల్లి, కంబాలచెరువు: ఖమ్మం–దేవరపల్లి 365 బీజీ గ్రీన్ఫీల్డ్ హైవేపై దేవరపల్లి సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య, భర్తలు తీవ్రంగా గాయపడగా, రెండేళ్ల బాలుడు, డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్లోని చందానగర్ నుంచి ఇంటి సామాన్లతో ఖండవల్లి సుబ్రహ్మణ్యం, కామేశ్వరి దంపతులు తమ రెండేళ్ల చిన్నారి కృష్ణతో కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి ఐసర్ వ్యాన్లో బయలుదేరారు. దేవరాపల్లి సమీపంలో వారి ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో జరిగిన ప్రమాదంలో ఆ దంపతులతో పాటు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. రెండేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. క్షతగాత్రులకు చికిత్స మెరుగైన చికిత్స కోసం గోపాలపురం నుంచి హైవే అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో కామేశ్వరికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని, వ్యాన్ డ్రైవర్కు చేయి విరిగిందని చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు. -
బిడ్డ భారం కాకున్నా.. పోషణకు సాయం చేయండన్నా..!
● పింఛను కోసం తల్లిదండ్రుల ఎదురు చూపు ● వంద శాతం వైకల్య ధ్రువపత్రం ఉన్నా అధికారుల నిర్లక్ష్యంఅల్లవరం: పుట్టుకతో అంధుడు.. మాట్లాడలేడు.. నడవలేడు ఆపై మానసిక రుగ్మత ఇన్ని సమస్యలు ఎదురుగా కనిపిస్తున్నా అతడు ప్రభుత్వ పింఛనుకు నోచుకోని అభాగ్యుడు అతడు. అల్లవరం మండలం రెల్లుగడ్డ పంచాయతీ ఎలువుల్లంక గ్రామానికి చెందిన బొంతు కోటేశ్వరరావుకు మొదటి సంతానంగా వివేకానంద పుట్టాడు. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు పుట్టారు. కొడుకు పుట్టిన ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలువలేదు. ఆరు నెలలు గడిచేసరికి చిన్నారి చూడలేకపోతున్నాడని ఆ తల్లి గ్రహించింది. అతడి చూపు కోసం తిరగని ఆస్పత్రి లేదు. స్థోమతకు మించి ఖర్చు చేశారు. తలలో నీరు పట్టింది, దాని వల్లే చూపు కోల్పోయాడు, ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందన్న వైద్యుల సలహాతో తొమ్మిది నెలలకు ఆపరేషన్ చేశారు. రెండేళ్లు నిండాక మరో శస్త్ర చికిత్స చేశారు. అయినా ఆ బాబు చూపులో ఎలాంటి మార్పు రాలేదు. అప్పటి నుంచి తల్లే అన్నీ తానై కుమారుడు వివేకానందకు సపర్యలు చేస్తూ వచ్చింది. వివేకానంద పెరిగి పెద్దవాడైనా నేటికీ తల్లిదండ్రులను సరిగా పిలవలేడు. ఆ తల్లిదండ్రులకు అతడు భారం కాకపోయినా పన్నెండేళ్లుగా సాకుతూనే ఉన్నారు. అతడికి ప్రభుత్వం ద్వారా ఏదైనా సాయం అందించాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. సామాజిక భద్రత ద్వారా పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సదరమ్ శిబిరంలో పరీక్షలు నిర్వహించి టెంపరరీ సర్టిఫికేట్ ఇవ్వగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 100 శాతం అంగవైకల్యం ఉన్నట్లు శాశ్వత సర్టిఫికెట్ ఇచ్చారని తల్లి నాగమణి చెప్పంది. అయినా నేటికీ ప్రభుత్వం వారు పింఛన్ మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి తన ప్రత్యేక అధికారాలతో వివేకానందకు వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
లోవకు భక్తుల తాకిడి
తుని రూరల్: తలుపులమ్మ తల్లి దర్శనానికి వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన పది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.1,36,615, పూజా టికెట్లకు రూ.2,39,780, కేశ ఖండనశాలకు రూ.12,720, వాహన పూజలు, ఇతర సేవలకు రూ.13,340, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.50,670, విరాళాలు రూ.37,192, వేదాశీర్వచనములు రూ.9,486, వెరసి మొత్తం రూ.5,01,803 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. చైర్మన్ పెంటకోట భాస్కర సత్యనారాయణ, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. -
కృష్ణబాబు సేవలు చిరస్మరణీయం
చాగల్లు: దివంగత మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబుకు సమాజంపై ఎంతో బాధ్యత ఉందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో, కొవ్వూరు గామన్ బ్రిడ్జి కూడలి వద్ద ఆదివారం కృష్ణబాబు విగ్రహాలను ఆవిష్కరించారు. స్పీకర్తో పాటు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి దుర్గేష్, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేవీపీ రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. దొమ్మేరులో విగ్రహాన్ని మంత్రి తుమ్మల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు ఆయన సేవలను కొనియాడారు. -
అందిన ద్రాక్ష.. తీయన..
అందని ద్రాక్ష పుల్లన అంటారు.. కానీ. తమ ఇంట్లో చేతికి అందేలా పండుతున్న ఈ ద్రాక్ష ఎంతో తీయన అని అంటున్నారు అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన రవణం సత్యకుమార్, వెంకట కనకదుర్గ దంపతులు. ద్రాక్ష సాగుకు కోనసీమ జిల్లా సాధారణంగా అనుకూలంగా ఉండదు. కానీ, సత్యకుమార్ దంపతులు ప్రత్యేక శ్రద్ధతో తమ ఇంట్లో ద్రాక్షపాదును పెంచారు. ఈ ద్రాక్ష తీగను మూడేళ్ల కిందట కడియపులంక నుంచి తెచ్చి నాటారు. ఎటువంటి రసాయన ఎరువులూ వాడకుండా ఇంట్లో ఉపయోగించే కూరగాయల ఆకులు, ఎర్రమట్టి, వర్మి కంపోస్టు ఎరువుగా వేశారు. దీంతో, ద్రాక్ష తీగ డాబా వరకూ వేగంగా పాకింది. రెండేళ్ల నుంచి గుత్తులుగుత్తులుగా నల్ల ద్రాక్ష పండ్లను విరగకాస్తోంది. ఏటా 10 నుంచి 15 కేజీల వరకూ నల్ల ద్రాక్ష పండ్లు వస్తున్నాయని సత్యకుమార్ చెప్పారు. ఈ పండ్లను బంధువులకు, గ్రామస్తులకు పంచుతామని, తమ ఇంట్లో ద్రాక్ష పండ్లు పండించడం అనందంగా ఉందని అన్నారు. – అమలాపురం రూరల్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 24,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
రత్నగిరిపై జోరుగా వివాహాలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రత్నగిరిపై సాధారణంగా రాత్రి, తెల్లవారుజామున ముహూర్తాల్లోనే వివాహాలు జరుగుతాయి. ఆదివారం మాత్రం ఉదయం 11 గంటల ముహూర్తంలో వివాహాలు జరగడంతో అందరూ ఆసక్తితో తిలకించారు. రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం విశేషం. శ్రావణ మాసం సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఉండగా, వివాహ ముహూర్తాలు మాత్రం ఆరో తేదీ వరకు మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్ 12 నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. ఆ మాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు. అక్టోబర్ 11వ తేదీ నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంబం కానుండటంతో మరలా వివాహాలు జరుగుతాయి. పోటెత్తిన భక్తులు çÜ™èlÅ-§ólÐ]l#° BÌS-Ķæ*-°MìS B¨-ÐéÆý‡… MýS*yé ¿ýæMýS$¢Ë$ ´ùsñæ-™é¢Æý‡$. Æý‡™èl²-WÇ çÜ™èlÅ-§ólÐ]l#° çܰ²«¨¯]l, Æ>çÙ‰…ÌZ° ç³Ë$ {´ë…™éÌZÏ ÑÐé-àË$ ^ólçÜ$-MýS$¯]l² ¯]lÐ]l §ýl…ç³-™èl$Ë$, ÐéÇ º…«§ýl$-Ñ${™èl$-ÌS™ø ´ër$ çÜ™èlÅ-§ólÐ]l#° BÌS-Ķæ*°MìS Ñ^ólaíܯ]l ¿ýæMýS$¢Ë$ ÝëÓÑ$ÐéÇ {Ð]l™é-Ìê-^èlÇ…_ çÜ™èlÅ-§ólÐ]l#° §ýlÇØ…^éÆý‡$. ©…™ø MýS*ÅOÌñæ¯]l$Ï, {Ð]l™èl Ð]l$…yýl-´ëË$, BÌSĶæ$ {´ë…VýS׿… ¿ýæMýS$¢ÌS™ø °…yìl-´ù-Ķæ*Ƈ$$. ˘ సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది స్వామివారి ఉచిత అన్నప్రసాదం స్వీకరించారు. -
సర్కారు పగాకు
● మెరుగుపడని వర్జీనియా పొగాకు ధర ● రూ.300 దిగువనే నాణ్యమైన రకం ● గిట్టుబాటు కాక కౌలురైతుల ఆందోళన ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఈ ఏడాది పొగాకు రైతులు నీరసించారు.. ధర పెరిగేది లేక దిగాలు చెందుతున్నారు.. కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.. విక్రయాలు ప్రారంభించి 150 రోజులు దాటినా, మార్కెట్లో ధరలు పుంజుకోక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం, రైతులను మరింత కుంగదీస్తోంది. దేవరపల్లి: పొగాకు మార్కెట్ మందగమనంలో ఉంది. వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు 150 రోజులు దాటినా, ఆశించిన మేర ధర రాకుంది. కొనుగోళ్ల తీరును చూసి రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. వచ్చినకాడకు అమ్ముకుని చేసిన అప్పులు తీర్చుకుందామన్నా కొనుగోలు చేసే నాథుడు లేక నిరాశ చెందుతున్నారు. 2017–28 పంట సీజన్ ప్రారంభమై నారుమడులు పడుతుండగా, గత ఏడాది పండించిన పంటను ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. వచ్చే ఏడాదికి పొగాకు పంట వేయాలా? వద్దా? అనే సందిగ్ధంతో ఉన్నారు. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో 2025–26లో 85 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు కేవలం 20.56 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఇంకా రైతుల వద్ద సుమారు 65 మిలియన్ల కిలోల కొనుగోలు చేయాల్సి ఉంది. రీజియన్ పరిధిలో 12,938 మంది రైతులు, 30,145 హెక్టార్లలో పొగాకు పంట సాగు చేశారు. టోబాకో బోర్డు 23,299 హెక్టార్లలో పంట సాగుకు అనుమతి ఇవ్వగా, అదనంగా సుమారు 7 వేల హెక్టార్లలో పంట సాగు చేశారు. 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 85 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. ప్రంపంచ వ్యాప్తంగా ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరగడం, ఎగుమతి ఆర్డర్లు పూర్తి స్థాయిలో ఖరారు కాకపోవడంతో మార్కెట్ సంక్షోభంలో పడింది. ఆశలు ఆవిరి ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకుని, అధిక ధరకు భూముల కౌలు, బ్యారన్ల అద్దెకు తీసుకుని చిన్న, సన్నకారు రైతులు పొగాకు సాగు చేశారు. కనీసం సెంటు కూడా సొంత భూమి లేనివారు 10 నుంచి 30 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేశారు. ఎకరాకు సుమారు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టారు. బ్యారన్ లైసెన్స్పై బ్యాంకులు బ్యారన్కు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలు ఇచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు సగటున రూ.240 పలకడంతో బ్యాంకు అప్పులు కూడా తీరే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కిలోకు పెట్టుబడి రూ.300 కాగా, వచ్చే రాబడి రూ.240 ఉందని అంటున్నారు. కిలోకు రూ. 60 నుంచి రూ.70 నష్టం వస్తోందని ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతుల ఇళ్లలోనే బేళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పొగాకు రంగు, నాణ్యత దెబ్బతింటున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదించి.. కోత విధించి 2026–27 పంట కాలానికి పొగాకు ఉత్పత్తిలో పొగాకు బోర్డు కోత విధించింది. ఈ మేరకు సాగు ప్రణాళికను ఖరారు చేసింది. 2025–26 పంట కాలంలో రీజియన్ పరిధిలో 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 85 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. దీంతో వచ్చే ఏడాది 28.02 మిలియన్ల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం బ్యారన్కు రెండు ఎకరాల్లో పంట వేసి, 20 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 2025–26 పంట కాలంలో 143 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 243 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. వచ్చే ఏడాది పంట పరిమాణాన్ని 81.02 మిలియన్ల కిలోలకు కుదించారు. దీనికి లోబడి పంట పండించాలని బోర్డు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అనుమతి మేరకే సాగు చేయాలి బోర్డు అనుమతించిన మేరకే పొగాకు సాగు చేయాలి. బ్యారన్కు రెండు ఎకరాల విస్తీర్ణంలో పంట వేసి, 20 క్వింటాళ్ల ఉత్పత్తి చేయాలి. సాగు విస్తీర్ణం తగ్గించి పొగాకు నాణ్యతపై రైతులు దృష్టిపెట్టాలి. 2026–27 పంట ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి తగ్గించారు. పొగాకు నారుమడులు వేసే రైతులు, వ్యాపారులు తప్పనిసరిగా బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. –పి.హేమస్మిత, టొబాకో బోర్డు వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి అదనపు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలి బోర్డు ఇచ్చిన కోటా ప్రకారం బ్యారన్కు 35 క్వింటాళ్లు పొగాకు అమ్మకాలు పూర్తయిన రైతులకు అదనపు పంట అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలి. వాతావరణం కలిసి రావడం వల్ల బ్యారన్కు అదనంగా 10 నుంచి 20 క్వింటాళ్ల ఉత్పత్తి జరిగింది. గ్రేడింగ్లు పూర్తయి 6 నెలలు గడవడంతో రంగు, నాణ్యత దెబ్బతింటుంది. అదనపు పంట అమ్ముకోవాడానికి అనుమతి ఇవ్వాలి. –సుంకవల్లి శ్రీనివాస్, రైతు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం -
చికిత్స పొందుతూ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
తగరపువలస (విశాఖ): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి ఆదివారం మృతి చెందాడు. భీమిలి పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన కంఠమణి తరుణ్కుమార్ (19) సంగివలసలోని అనిట్స్ కళాశాలలో రెండో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గత శనివారం పార్ట్టైమ్ ఉద్యోగం ముగించుకుని బైక్పై తగరపువలస వైపు బయలుదేరగా.. రాత్రి 9 గంటల సమయంలో తాళ్లవలస సర్వీస్ రోడ్డులో ఎదురుగా కారులో వస్తున్న సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యుడు వెంకటేష్ కారు ఢీకొట్టింది. దీంతో తరుణ్కుమార్ తలకు, ఎడమ కాలు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్పృహ కోల్పోయిన అతడిని స్నేహితులు సంగివలస ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 6 గంటలకు మరణించాడు. మృతుడి తల్లి సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీట్ పీజీ పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో నీట్ పీజీ పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఆదివారం జరిగిన నీట్ పీజీ పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సాఫ్ట్ టెక్నాలజీ, ఐయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతున్న తీరును, వసతుల కల్పన, విద్యార్థుల హాజరు ఇతర భద్రత ఏర్పాట్లను నేరుగా పరిశీలించి, అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్ష ముగిసిందని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు కాకినాడ జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో 1159 మందికి గాను 1147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95 శాతం హాజరు నమోదైందని కలెక్టర్ చెప్పారు. -
పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్
దేవరపల్లి: నల్లజర్ల మండలంలోని ఓ గ్రామంలో బాలిక(13)పై అత్యాచార యత్నానికి పాల్పడిన కొక్కిరిపాటి కిరణ్ను ఆదివారం అరెస్ట్ చేసినట్టు నల్లజర్ల స్టేషన్ సీఐ ఆర్జే రవికుమార్ తెలిపారు. నిందితుడు కిరణ్ను తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లా జైలుకు తరలించినట్టు తెలిపారు. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం కోరుకొండ: దోసకాయలపల్లి గురుకుల వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పితాని కోమల తెలిపారు. ఆదివారం డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్లు, ఏరియా హాస్పటల్, అనపర్తి నుంచి వచ్చిన పీడియాట్రీషియన్లు వసతి గృహాన్ని సందర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐసోలేషన్లోని 40 మంది విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆదివారం కొత్తగా అస్వస్థత కేసులు నమోదు కాలేదన్నారు. జీడీఎస్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి కొత్తపేట : తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) ఉద్యోగులందరికీ నెలవారీ పింఛను సౌకర్యం కల్పించాలని జీడీఎస్ యూనియన్ జాతీయ మాజీ అధ్యక్షుడు బీవీ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమలాపురం డివిజన్ జీడీఎస్ ఉద్యోగుల ద్వైవార్షిక సమావేశం ఆదివారం కొత్తపేట సబ్ పోస్టాఫీసు సమీపంలోని ఆర్ అండ్ బీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. యూనియన్ కొత్తపేట బ్రాంచ్ అధ్యక్షుడు వీ సూర్యరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న రూ.1.50 లక్షల గ్రాట్యుటీని రూ.5 లక్షలకు పెంచాలని, జీడీఎస్ ఉద్యోగులందరికీ 8 గంటల పనిదినాన్ని కేటాయించాలని, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఏటా ఒకే రకమైన ఇంక్రిమెంట్లు వర్తింపజేయాలని, కమలేష్ చంద్ర కమిటీ సూచించిన పెండింగ్ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని, టార్గెట్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం 15 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షునిగా వీ సూర్యరాజు, అధ్యక్షునిగా కాశి గోపీచంద్ ఎన్నికయ్యారు. సమావేశంలో అమలాపురం, రాజోలు, కొత్తపేట ప్రాంతాలకు చెందిన జీడీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
దుమ్మెత్తిపోస్తున్నారు.. !
అమలాపురం టౌన్: అమలాపురంలో టీడీపీ జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ (తాగునీటి విభాగం)కు చెందిన రెండెకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనపై అన్ని వైపుల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నాయి. చివరకు టీడీపీ మిత్రపక్షమైన అమలాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కూడా ఈ కేటాయింపుపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. మున్సిపల్ మాజీ చైర్మన్, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు యాళ్ల సతీష్ ఈ కేటాయింపుపై బాహాటంగా అభ్యంతరం చెబుతున్నారు. కేటాయింపు విషయం తెలిసిన మరుక్షణమే సతీష్తో పాటు కొంతమంది జనసేన నాయకులు మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్కుమార్ను స్వయంగా కలిసి కేటాయింపుపై తమ అసంతృప్తిని, వ్యతిరేకతను తెలిపారు. మరో మిత్రపక్షమైన బీజేపీ నాయకులు కూడా అంతర్గతంగా భూమి కేటాయింపును వ్యతిరేకిస్తున్నారు. ఇక అధికార టీడీపీ నాయకులు మాత్రం ఈ విషయంలో మౌనం పాటిస్తూ స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు భూమి కేటాయింపుపై చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నారు. ఇక నియోజకవర్గ విపక్షాలు, ప్రజా సంఘాలు, నియోజకవర్గ ప్రజానీకం ఈ భూమి కేటాయింపు అంశంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్న తాగునీటి రిజర్వాయరు భూములను ఇలా టీడీపీ లాక్కునే ప్రయత్నం చేయడంపై ధ్వజమెత్తుతున్నాయి. ప్రభుత్వ శాఖల నుంచే అభ్యంతరాలు స్టేట్ మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ (డీఎంఏ) శాఖ నుంచి గత జూలై 14న అమలాపురం మున్సిపాలిటీకి వచ్చిన అధికారిక ఉత్తర్వుల్లో రెండు ఎకరాల భూమిని కేటాయించాలని ఆదేశాలు వచ్చాయి. మున్సిపల్ అధికారులు దీనిపై అంతర్గతంగా చర్చించుకున్నారు. అధికార పార్టీ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలు కాబట్టి భూమి కేటాయింపుపై మౌనం దాల్చారు. మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి పాలనలో ఉండడంతో ప్రభుత్వం వారిదే కాబట్టి రెండు ఎకరాల భూమి కేటాయింపు ప్రక్రియకు సంబంధించి కౌన్సిల్ తీర్మానం (సీఆర్) అయిపోయింది. అయితే.. మున్సిపల్ కమిషనర్ ఈ భూయి కేటాయింపుపై నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఇవ్వలేదు. ఇక్కడి నుంచే స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి అభ్యంతరాలు మొదలయ్యాయి. సాధారణంగా ఎలాంటి భూసేకరణ అయినా రెవెన్యూ అధికారుల నుంచి జరగాలి. స్థానిక సంస్థలకు చెందిన భూమి.. అందులోకీ భవిష్యత్ తాగునీటి అవసరాల కోసం సేకరించి ఉంచుకున్న భూమిని ఎలా కేటాయిస్తారని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. గతంలో ఈ తాగునీటికి చెందిన భూమిలోని రెండు ఎకరాలను సస్పెన్షన్లో ఉన్న ఓ రెవెన్యూ అధికారి చేత అధికార దర్పంతో సర్వే చేయించడం గమనార్హం. అటు రెవెన్యూ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారుల నుంచి ఈ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమన్న చర్చ అయితే సాగుతోంది. ఓ పక్క అధికారుల నుంచి మరోపక్క విపక్షాలు, ప్రజా సంఘాలు, ప్రజానీకం నుంచి మున్సిపాలిటీ తాగునీటి అవసరాల కోసం ఉన్న రెండు ఎకరాల భూమి కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తమవుతుంటే టీడీపీ అదే భూమి కావాలని పట్టుబట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తాగునీటి కొరతతో ప్రజల అవస్థలు అమలాపురం పట్టణంలో రోజుకు మున్సిపాలిటీ 55 లక్షల లీటర్ల తాగునీటిని అందిస్తున్నా ఇంకా 40 లక్షల లీటర్ల నీరు అందించాల్సిన లోటు స్పష్టంగా ఉంది. దీంతో పట్టణ ప్రజలు రోజూ తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని శివారు ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణంలో తాగునీటి రిజర్వాయర్లు, ట్యాంకులు, పైపులైన్లను విస్తరించాల్సి ఉంది. ఈ క్రమంలో వాటర్ వర్క్స్కు చెందిన రెండు ఎకరాల భూమిని టీడీపీ లాగేసుకునే ప్రయత్నం చేస్తుంటే దీనిపై ప్రజల నుంచే కాకుండా విపక్షాలు, ప్రజా సంఘాల నుంచి ఉద్యమాలు పుట్టక మానవు. టీడీపీ కార్యాలయానికి వాటర్ వర్క్స్ భూమి కేటాయింపుపై తీవ్ర ఆగ్రహం భూపందేరంపై అభ్యంతరాల వెల్లువ ధ్వజమెత్తుతున్న విపక్షాలు, ప్రజా సంఘాలు మిత్రపక్షం జనసేన నుంచీ బాహాటంగా వ్యతిరేకత నిబంధనలకు విరుద్ధమంటూ రెవెన్యూ ఉద్యోగుల్లోనూ చర్చ -
సూర్యుడే సమయ సూచిక..
ద్వారకాతిరుమల: చేతికి వాచ్.. సెల్ఫోన్లో డిజిటల్ టైమ్.. గోడకు క్లాక్.. ఇలా క్షణాల్లో సమయాన్ని తెలుసుకునే ఆధునిక రోజుల్లో సూర్యుడి నీడను చూసి కాలాన్ని లెక్కించిన పద్ధతి ఊహకే ఆశ్చర్యం కలిగిస్తుంది. గడియారాలు అందుబాటులోకి రాక ముందు మనిషికి సూర్యుడే సమయ సూచిక. ఆ సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన పరికరమే సన్ డయల్ (సూర్య ఘడియారం). కాలాన్ని కొలవడమే కాకుండా అప్పటి మనిషి ఖగోళ, గణిత పరిజ్ఞానానికి ఇవి అద్దం పడుతున్నాయి. చారిత్రక సాక్ష్యం సన్ డయల్ ప్రస్తావన వచ్చినప్పుడు అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలయ తూర్పు రాజగోపురం సమీపంలో సూర్య ఘడియారం ఉంది. ఈ సన్ డయల్ను 1943 జూలైలో పునర్నిర్మించారు. ద్వారకా తిరుమలలోని శ్రీవారి క్షేత్రంలో ఆధునిక సన్ డయల్ ఉంది. 2011 సెప్టెంబర్ 10న ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సూర్యయంత్ర పథక నిర్వహణలో శ్రీవేద భారతి సంస్థాపకులు డాక్టర్ రేమెళ్ల అవధానులు కీలక పాత్ర పోషించారు. -
ఇష్టమైన వాడి కోసం భర్తను వదిలొచ్చి..
● అనుమానిస్తున్నాడని ఆత్మహత్య ● బంజారాహిల్స్లో ఘటనబంజారాహిల్స్: ఇష్టమైన వాడి కోసం కట్టుకున్న భర్తను వదిలి వచ్చిన ఓ యువతి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనుమానపు భర్తతో వేగలేక, అవమానాలు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ కొట్టూర్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరానికి చెందిన ఎం.రాజేశ్వరి (23) వివాహం 2023లో ముత్యాలరావుతో జరిగింది. అదే ఏడాది హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2 ఇందిరానగర్లో నివసించే అంతటి సాయికుమార్ (28)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ముత్యాలరావుతో పెళ్లి జరిగిన నెల రోజులకే ఏప్రిల్లో ఫేస్బుక్లో సాయికుమార్కు రాజేశ్వరి పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. అదే ఏడాది జూన్లో సాయికుమార్ ప్రేమించిన యువతి రాజేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను ఇందిరానగర్ తీసుకువచ్చి కాపురం పెట్టాడు. ఓ నగల షాపులో పనిచేస్తున్న రాజేశ్వరిని నెల రోజుల తర్వాత జూలైలో మొదటి భర్త ముత్యాలరావు వచ్చి తీసుకువెళ్లాడు. ఆగస్టు 13న సాయికుమార్ మళ్లీ వెళ్లి ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చి ఆగస్టు 16న ఇందిరానగర్లోని అద్దె గదిలో తాళి కట్టాడు. అప్పటి నుంచి ఇద్దరూ భార్యాభర్తల్లాగా కాపురం పెట్టారు. నగల షాపులో సేల్స్గర్ల్గా పనిచేస్తున్న రాజేశ్వరి గత నాలుగైదు నెలల నుంచి ఇన్స్ట్రాగామ్లో మరో యువకుడితో చాటింగ్ చేస్తుండడం, ఫోన్లో మాట్లాడుతుండడాన్ని సాయికుమార్ గుర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వేరే యువకుడితో ఆమె చేస్తున్న చాటింగ్ వల్ల ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ నెల 25వ తేదీ ఉదయం ఇదే విషయంలో రాజేశ్వరి, సాయికుమార్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అనుమానంతో సాయికుమార్ ఆమెను తిట్టడంతో పాటు తీవ్రంగా వేధించి మానసికంగా హింసించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి డ్యూటీలకు వారు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంలో మళ్లీ ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదానికి దారితీసింది. ఈ అనుమానాన్ని, అవమానాన్ని భరించలేక రాజేశ్వరి బాత్రూమ్లోకి వెళ్లి షవర్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంట గడిచినా ఆమె బాత్రూమ్లో నుంచి బయటకు రాకపోయేసరికి సాయికుమార్ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా షవర్ కొక్కానికి వేలాడుతూ కనిపించింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు సాయికుమార్పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
62 మంది హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
కోరుకొండ/కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఓ ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన వసతి గృహంలో 62 మంది విద్యార్థులు శనివారం అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పితాని కోమల శనివారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం, రాత్రి పప్పుతో భోజనం చేసిన విద్యార్థులు, 28వ తేదీ ఉదయం అల్పాహారంలో మైసూర్ బజ్జీ తిన్నారు. దీంతో విద్యార్థులకు కడుపునొప్పి మొదలైంది.రాత్రికి వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. దోసకాయలపల్లి పీహెచ్సీ వైద్య బృందం అందించిన వైద్య సేవలతో విద్యార్థులంతా కోలుకున్నారని చెప్పారు. వీరిలో ఆరో తరగతి విద్యార్థిని బండి భవానీశంకరి తీవ్ర అస్వస్థతకు గురవడంతో రాజమహేంద్రవరం లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సబ్కలెక్టర్, ఇతర అధికారులు వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అత్యవసర విభాగంలో వైద్య సేవల అనంతరం భవానీశంకరి కోలుకుంటున్నట్టు తెలిపారు. -
స్కూలు బస్సు, ఆటో ఢీ
ముగ్గురికి స్వల్ప గాయాలు రాజమహేంద్రవరం రూరల్: స్కూలు బస్సు, ఆటో ఢీకొన్న సంఘటనలో ముగ్గురికి స్వల్పగాయాలైన ఘటన లాలాచెరువు–స్వరూప్నగర్ రోడ్డులో చోటచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం శనివారం శ్రీకృష్ణపట్నం నుంచి ఆటోడ్రైవర్ కొల్లి రాజు ఇద్దరు మహిళలను ఎక్కించుకుని రాజమహేంద్రవరం వస్తున్నాడు. ఓ ప్రైవేటు స్కూలు బస్సు లాలాచెరువు నుంచి స్వరూప్నగర్ వైపు వెళ్తోంది. రాజు ఆటో ముందున్న కారును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజుతో పాటు శ్రీకృష్ణపట్నానికి చెందిన సీత, భద్రమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు 108 అంబులెన్స్లో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజు పిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టిన రోజుకని పిలిచి హత్యకు కుట్ర
● ఒంటరి మహిళపై ఇద్దరు యువకుల దాడి ● తలపై సుత్తితో కొట్టి క్వారీలో పడేసిన వైనం ● రాత్రంతా మృత్యువుతో పోరాటం ● ఫెన్సింగ్ వేస్తున్న సిబ్బంది సహకారంతో ప్రభుత్వాస్పత్రికి తరలింపు ● కేసు నమోదుకు మూడు పోలీసు స్టేషన్ల తాత్సారం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): భర్త నిరాదరణకు గురైన ఒంటరి మహిళపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె స్థానిక జీజీహెచ్లో చికిత్స పొందుతోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బొమ్మూరు ప్రాంతానికి చెందిన గెడ్డం ధనలక్ష్మికి ఈనెల 25వ తేదీన గాడాలకు చెందిన మట్టాడి ప్రసాద్, మట్టాడి అయ్యప్ప ఫోన్ చేసి తమ ఇంటిలో పుట్టిన రోజు ఉందని రమ్మని పిలిచారు. పరిచయస్తులే కదా అని వెళ్లిన ఆమెను వారిరువురూ గాడాలలోని నిర్జన ప్రాంతానికి తీసుకువెళ్లి కొద్దిసేపు మాట్లాడారు. ఆమె ఆదమరచి ఉన్న సమయంలో వారి వెంట తెచ్చుకున్న సుత్తి తీసి ఆమె తలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆమె అపస్మారకస్థితికి చేరడంతో చనిపోయిందని భావించి ఆమెను ఆటోలో రాజమహేంద్రరం త్రీటౌన్ పరిధిలోని క్వారీ ప్రాంతానికి తీసుకువచ్చి అక్కడి గోతుల్లో పడేసి వెళ్లిపోయారు. ఆమె పడిన ప్రాంతంలో మట్టి ఉండడంతో ఉదయం వరకు కొన ఊపిరితో కొట్టుమిట్టాడింది. కాగా క్వారీ ప్రాంతంలో ప్రమాదాల నివారణకు ఫెన్సింగ్ వేస్తున్న సిబ్బంది ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడి గోతిలోంచి మూలుగులు వినబపడడంతో అటుగా వెళ్లి చూసి బయటకు తీసి 108 అంబులెన్స్లో ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తలపై తగిలిన గాయంతో ఆమె స్పష్టంగా మాట్లాడలేకపోతోంది. స్ధానికంగా నివాసముంటున్న వైఎస్సార్ సీపీ నాయకులు బర్రే కొండబాబు విషయం తెలుసుకుని ఆమెను కాపాడిన వారి నుంచి సమాచారం సేకరించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలనిని సంఘటనపై ఆరా తీశారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదుకు బొమ్మూరు, గాడాల, క్వారీ పరిధులను పర్యవేక్షిస్తున్న పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. కనీసం జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
అమ్మానాన్నకు ఏం చెప్పాలిరా?
గండేపల్లి: స్నేహితులను మించిన అన్నదమ్ముల అనుబంధం వారిది. అప్పటివరకు కలిసే ఉన్న వారి బంధంపై విధికి కన్ను కుట్టిందేమో.. ప్రమాద రూపంలో వెంటాడి విడదీసింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో కళ్లముందే తమ్ముడు మృతిచెందడంతో అన్న పడిన వేదన వర్ణనాతీతం. ఇరవై రెండేళ్లు కలిసే ఉన్నాం కదరా.. నన్నొంటరిని చేసి వెళ్లిపోయావా తమ్ముడు.. అంటూ తోడబుట్టిన తమ్ముడి కోసం అన్న పడుతున్న వేదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. ఈ ప్రమాదంలో మణికట్టు తెగిపడి తానూ తీవ్ర గాయాలపాలైనప్పటికీ.. ఆ నొప్పిని భరిస్తూనే.. ‘నీకోసం అడిగితే.. అమ్మ నాన్నకు ఏం సమాధానం చెప్పాలిరా..’ అంటూ ఆ అన్న భోరున విలపించిన తీరు చూసి అంబులెన్స్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన గండేపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కాగిత గ్రామానికి చెందిన రబ్బా రమణ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రమణకు ఒక కుమార్తె, రబ్బా నవీన్, రబ్బా ప్రసాద్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. అన్నదమ్ములు ఇద్దరూ వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బైక్పై గత ఆరు వారాలుగా ప్రతి శనివారం వచ్చి వెళుతున్నారు. ఏడో వారమైన ఈ శనివారం కూడా వాడపల్లికి వచ్చిన వీరు దర్శనానంతరం స్వగ్రామానికి బయలుదేరారు. సాయంత్రానికి మండలంలోని మురారి గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలోకి వచ్చేసరికి ఇసుక లోడుతో ముందు వెళుతున్న టిప్పర్ లారీని తప్పించే ప్రయత్నంలో బైక్ హ్యాండిల్ లారీకి తగిలి అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయారు. ఈ ఘటనలో ప్రసాద్ నడుము భాగం పైనుంచి లారీ దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్ కుడి చెయ్యి లారీ చక్రాల కింద చిక్కుకుని మణికట్టు వరకు తెగిపడింది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్ రాగంపేట సీహెచ్సీకి తరలించారు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రోడ్డు సేఫ్టీ పోలీస్, హైవే సేఫ్టీ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ యూవీ శివనాగబాబు తెలిపారు. నన్నొంటరిని చేశావా తమ్ముడూ? 22 ఏళ్లు కలిసే ఉన్నాం కదరా! తీవ్రంగా గాయపడినా.. కళ్లముందే తమ్ముడి మృతిని తట్టుకోలేక అన్న ఆక్రోశం బైక్ అదుపుతప్పిన ఘటనలో తమ్ముడు మృతి మణికట్టు వరకు తెగిపడిన అన్న కుడి చెయ్యి దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఘటన -
మతం వేరైనా.. మమకారం ఒక్కటే!
● మానవత్వం చాటిన ముస్లింలు ● కన్నబిడ్డలా సాకిన తల్లికి హైందవ పద్ధతిలో దహన సంస్కారాలు మంచిర్యాలటౌన్/మంచిర్యాల రూరల్ (హాజీపూర్): మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని, రక్త సంబంధం లేకపోయినా ఆప్యాయతలే శాశ్వత బంధాలని మంచిర్యాలలో జరిగిన ఓ ఘటన నిరూపించింది. కన్నకొడుకులా సాకిన ఓ హిందూ వృద్ధురాలికి ముస్లిం యువకుడు కొడుకై తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్నాడు. ఆంధ్రపదేశ్లోని రాజమహేంద్రవరానికి చెందిన కొప్పర్తి అచ్యుతలక్ష్మి (90) సుమారు 50 ఏళ్ల క్రితం భర్తతో కలిసి వచ్చి మంచిర్యాలలో స్థిరపడ్డారు. స్థానిక ఎఫ్సీఏ ఫంక్షన్హాల్ సమీపంలో ఎయిర్ కండీషనర్ సేల్స్, సర్వీస్ వ్యాపారాన్ని నడిపేవారు. సంతానం లేకపోవడంతో షాపులో పనిచేసే ముస్లిం యువకుడు మొహమ్మద్ ముజామ్మిల్ను సొంత బిడ్డలా చేరదీశారు. 20 ఏళ్ల క్రితం ఆమె భర్త మరణించినా, ముజామ్మిల్నే కొడుకుగా భావిస్తూ జీవించారు. అనారోగ్యంతో ఇస్లాంపురలోని నివాసంలో శనివారం అచ్యుతలక్ష్మి కన్నుమూశారు. ఆమె సోదరి హైదరాబాద్ నుంచి వచ్చారు. వ్యాపార సంస్థ వద్ద ఉంచిన ఆమె భౌతికకాయానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గుండా సుధాకర్, బీజేపీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్గౌడ్, కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్, మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి కిషన్, కాంట్రాక్టర్లు షాయక్అలీ, ముజాహిద్, మహ్మద్ సాదిక్, స్థానిక వ్యాపారులు, ఏసీ టెక్నిషియన్లు నివాళులర్పించారు. అనంతరం ముస్లింలు పాడె మోయగా, అమ్మగా భావించిన ముజామ్మిల్ కుండ చేతపట్టి జిల్లా కేంద్రంలోని మహాప్రస్థానంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి, మత సామరస్యాన్ని చాటుకున్నారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
చింతూరు: మండలంలోని చట్టికి చెందిన సోడె రాజకుమార్ (30) స్థానిక శబరినది ఒడ్డున వున్న విద్యుత్ టవర్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న అతడు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు శబరినది పరిసరాల్లో గాలించగా అతను విద్యుత్ టవర్కు వేలాడుతూ కనిపించాడు. విషయం తెలుసుకున్న సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ సంతోష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దింపి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ తెలిపారు. ఎస్సీ కాలనీలో చోరీ 15 గ్రాముల బంగారం, రూ.ఐదు వేల నగదు అపహరణ తొండంగి: స్థానిక ఎస్సీ కాలనీలో శనివారం చోరీ జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ఎస్సీ కాలనీ శివారులో గాతాడి చిన్నా మేసీ్త్ర పని చేస్తుంటాడు. శనివారం ఇంటికి తాళాలు వేసి భార్య శైలుతో కలిసి కూలీ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలపులు తెరిచి బీరువాల్లో సామాన్లు చిందరవందరగా ఉండటంతో పాటు అందులో దాచుకున్న 15 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.ఐదు వేల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆభరణాల విలువ రూ.2.5 లక్షలు ఉంటుందని, బాధితులు పేర్కొన్నారు. ఎస్సై జగన్మోహన్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ ● బంగారు, వెండి వస్తువులతో పాటు నగదు అపహరణ ● కేసుల నమోదు ఉప్పలగుప్తం: మండలంలోని వానపల్లిపాలెంలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ షేక్ జానీబాషా తెలిపిన సమాచారం ప్రకారం వానపల్లిపాలేనికి చెందిన నల్లా రామకృష్ణ ఈ నెల 25న అతని కుటుంబంతో కలసి హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం వారి ఇంటి పక్కన ఓ మహిళ తన నివాసంలో పనులు చేసుకుంటూ రామకృష్ణ ఇంటి పైభాగం వైపు చూడగా ఇంటి తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో ఆమె రామకృష్ణ భార్యకు ఫోన్ చేసి ఊరి నుంచి వచ్చేశారా అని అడగగా ఆమె లేదని సమాధానం చెప్పింది. దీంతో మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయని ఇక్కడి మహిళ చెప్పగా ఆమె ఒకసారి పైకి వెళ్లి చూడమని సూచించింది. దీంతో చుట్టుపక్కల వారి సాయంతో ఆ మహిళ రామకృష్ణ ఇంటిలోకి వెళ్లి చూడగా తాళం పగలగొట్టబడి బీరువాతాళాలు సైతం ధ్వంసం చేసి చోరీ జరిగినట్టు గుర్తించారు. వారి సమాచారం మేరకు ఎస్ఐ ఎస్కే జానీబాషా క్లూస్ టీమ్ను రప్పించి దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు 9 గ్రాముల బంగారం, 12 తులాల వెండి, రూ.25 వేలు నగదు చోరీ అయినట్టు గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెల వ్యాన్ బోల్తా పెరవలి: స్థానిక జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఐషర్ వ్యాన్ ఖండవల్లి వద్ద అదుపు తప్పి వేగ నియంత్రణకు పెట్టిన డ్రమ్ము, అక్కడే ఉన్న గొయ్యి వల్ల బోల్తా పడింది. ఈ ఘటనలో వ్యాన్లో ఉన్న 4 గొర్రెలు మృతి చెందగా, వ్యాన్ డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటన సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. బాలికపై లైంగిక వేధింపులు దేవరపల్లి: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై పోలీసులు శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోని వెళితే.. నల్లజర్ల మండలంలోని ఆ గ్రామంలో 14 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళుతుండగా, కొక్కిరిపాటి కిరణ్ ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివగణేష్ తెలిపారు. -
కలుషితాహారం తిని విద్యార్థులకు అస్వస్థత
● దోసకాయలపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో ఘటన ● 62 మందికి ఆసుపత్రిలో చికిత్స కోరుకొండ: కలుషిత ఆహారం తిని ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన హాస్టల్లో శనివారం 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారంతా వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. ఇందులో ఆరో తరగతి విద్యార్థిని బండి భవానీశంకరి రాజమహేంద్రవరం జీజీహెచ్లో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోరుకొండ మండలం దోసకాయలపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్లో మొత్తం 172 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 12–18 ఏళ్ల వయసు పిల్లల్లో బాలురు 20 మంది, బాలికలు 42 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి నుంచి అస్వస్థతకు గురవుతుండడంతో సంస్థ యాజమాన్యం స్థానిక పీహెచ్సీ వైద్యులను ఆశ్రయించింది. దీంతో దోసకాయలపల్లి పీహెచ్సీ వైద్యులు ఎం.తరణి ఆధ్వర్యంలో వైద్య సేవలందించారు. ముగ్గురు విద్యార్థులకు అక్కడి పీహెచ్సీలో చికిత్స చేశారు. అలాగే స్కూల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, మందులు, ఇంజెక్షన్లు, సిలైన్లు ఎక్కించారు. దీంతో శనివారం మధ్యాహ్నానికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదే కారణమా? హాస్టల్లో విద్యార్థులకు ఇచ్చిన ఆహారం కలుషితం కావడంతో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ నెల 27న తీసుకున్న కోడి మాంసం, 28న ఉదయం మైసూర్ బజ్జీలో ఉపయోగించిన పిండి, నూనె నాణ్యత విషయమై వైద్య, ఆరోగ్యశాఖాధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన పరిస్థితి ఆరో తరగతి విద్యార్థిని బండి భవానీశంకరిని రాజమహేంద్రవరం జీజీహెచ్లో చేర్పించగా వైద్య సేవల అనంతరం పరిస్థితి మెరుగుపడింది. రెండు రోజులుగా విరేచనాలతో ఆమె ఇబ్బంది పడింది. అత్యవసర విభాగంలో వైద్య సేవల అనంతరం ఆమె పరిస్థితి మెరుగుపడింది. ఇదిలా ఉంటే విద్యా సంస్థలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ పితాని కోమల తదితరులు పరిశీలించారు. ఓపీ రిజిస్ట్రేషన్ ప్రకారం 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. దోసకాయలపల్లి పీహెచ్సీ వైద్యులు ఎం.తరణి, సూపర్వైజర్ టీవీ నాగప్రసాద్, వర్మ, తదితర సిబ్బంది వైద్య సేవలు అందించారు. ఆర్ఐఓ శారద, డీఈఓ వాసుదేవరావు, కోరుకొండ తహసీల్దార్ ఎం.సునీత, ఎంపీడీఓ బత్తిన అశోక్కుమార్, ఎంఈఓ కుశలవదొర, కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తదితరులు పరిస్థితిని పర్యవేక్షించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం దోసకాయలపల్లిలోని ప్రైవేట్ విద్యా సంస్థలో విద్యార్థులు అస్వస్థతకు గురికావడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పలు సూచనలు చేశారు. అలాగే విద్యార్థులతో మాట్లాడారు. కలుషిత ఆహారం తీసుకోవడంతో చాలామంది రోగాలకు గురవుతున్నారని, అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కర్రి నాగేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు గొల్లపల్లి ప్రవీణ్కుమార్, వైఎస్సార్ సీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు కడవల శివ, నాయకుడు నీరుకొండ బాబ్జి పాల్గొన్నారు. -
రేపు రేషన్ డీలర్ల ధర్నా
అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బుంగా రాజు దేవరపల్లి: రేషన్ పంపిణీ వ్యవస్థలో ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బుంగా రాజు అన్నారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా రేషన్ డీలర్లు శాంతియుత ధర్నా చేస్తారని, దీనిని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే అంతంత మాత్రం ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్న డీలర్ల బతుకుల గురించి పట్టించుకోని ప్రభుత్వం, నూతన విధానాలతో పనిభారం పెంచుతుందని వాపోతున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రేషన్ డిపోకు సరఫరా చేస్తున్న ప్రతి బియ్యం బస్తాను దిగుమతి సమయంలో డీలర్లు క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసిన అనంతరం దుకాణంలో దించుకోవాల్సి వస్తుందన్నారు. కార్డుదారులకు బియ్యం పంపిణీ సమయంలో బస్తాను కాటాపై ఉంచి మరోసారి స్కానింగ్ చేసి, తూకం నమోదైన తర్వాత కార్డుదారులకు పంపిణీ చేయాలన్నారు. ఈ విధంగా ప్రతి బస్తాను రెండు సార్లు డీలర్ స్కానింగ్ చేయాల్సి వస్తుందన్నారు. ఈ విధానం వల్ల డీలర్లపై పనిభారం పెరగడంతో పాటు, కార్డు దారులకు సకాలంలో బియ్యం అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ విధానాన్ని నిలుపుదల చేయాలని, కిలో బియ్యానికి రూ. 1 నుంచి రూ.3 ఇవ్వాలని, ఇంటింటికి రేషన్ పంపిణీకి రవాణా ఖర్చులు చెల్లించాలని, ఎంఎల్ఎస్ పాయింట్లోనే బియ్యం బస్తాను క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి పంపించాలని, తదితర డిమాండ్లతో ఈ ధర్నా జరుగుతుందని రాజు తెలిపారు.నత్తనడకన పొగాకు విక్రయాలుదేవరపల్లి: వర్జీనియా పొగాకు అమ్మకాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ఏడాది పొగాకు అమ్మకాలు ప్రారంభించి 5 నెలలు కావస్తున్నా నత్తనడకన జరుగుతున్నాయి. గరిష్ఠ ధర కిలో రూ.293 పలుకుతున్నా, కనిష్ఠ ధర రూ.145 వస్తుంది. ఎక్కువ శాతం బేళ్లు కిలో రూ.145 నుంచి రూ.160 మధ్య ధర పలుకుతుండడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. శనివారానికి టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో రూ. 503.88 కోట్ల విలువైన 20.56 మిలియన్ల కిలోల వర్జీనియా పొగాకు విక్రయాలు జరిగినట్టు రిజినల్ మేనేజర్ జె.సురేంద్రకుమార్ తెలిపారు. దేవరపల్లి వేలం కేంద్రంలో 3.16 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 239.84, జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో 4.45 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 245.38, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 4.82 మిలియన్ల కిలోల విక్రయాలు జరగ్గా, కిలో సగటు ధర రూ. 245.67, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 4.24 మిలియన్ల కిలోల విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ 245.67, గోపాలపురం వేలం కేంద్రంలో 3.87 మిలియన్ల కిలోల విక్రయం జరగ్గా, కిలో సగటు ధర రూ. 250.67 రైతులకు లభించినట్టు ఆయన తెలిపారు. శనివారం ఐదు వేలం కేంద్రాలకు 3,979 బేళ్లు అమ్మకానికి రాగా, 2696 బేళ్లు కొనుగోలు చేశారు. 1,283 బేళ్లను తిరస్కరించారు. ఏసీబీ వలలో వీఆర్వో రూ.16,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఆత్రేయపురం : మండలంలోని ర్యాలి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చొల్లంగి నాగేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసిన రైతు లక్ష్మీ ప్రసన్న నుంచి రూ.16,500 లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం పక్కా ప్రణాళికతో దాడిచేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరం ఏసీబీ అడిషనల్ ఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ర్యాలి గ్రామానికి చెందిన బాధిత రైతు చిన్నం లక్ష్మీ ప్రసన్నకు సర్వే నంబర్ 381/6లో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు వీఆర్వో నాగేశ్వరరావు ఆమె నుంచి లంచం డిమాండ్ చేశారు. అందుకు అనుమతించిన లక్ష్మీ ప్రసన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి సూచన మేరకు శనివారం ర్యాలి గ్రామ సచివాలయంలో వీఆర్వోకు రూ.16,500 నగదు అందించారు. ఆ మొత్తాన్ని ఆయన తీసుకొని తన చొక్కా జేబులో పెట్టుకున్నారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భవ్యకిషోర్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులు వి.భాస్కరరావు, గోవిందరాజులు, వాసు కృష్ణ, సతీష్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో నాగేశ్వరరావు స్వస్థలం ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామ శివారు పాటిచెరువు. ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని అపార్ట్మెంట్లో సొంత ఫ్లాట్లో ఉంటున్నారు. ఆయన భార్య రాజమమేంద్రవరంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. -
పుష్కరాల ఏర్పాట్లపై కసరత్తు
రాజమహేంద్రవరం ిసిటీ: గోదావరి పుష్కరాల సందర్భంగా ఘాట్లు, ఆలయాల వద్ద రద్దీ నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్తో కలసి నగరంలో ఆమె పర్యటించారు. పుష్కర ఘాట్లు, ప్రముఖ ఆలయాలు, రవాణా, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడానికి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిశీలించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కోటిలింగాల ఘాట్కు చేరుకునే మార్గాలు, ఘాట్ పరిసరాలు, ఉమా కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం, లూథర్గిరి, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అదే సమయంలో ఆర్ట్స్ కళాశాల వద్ద చేపట్టనున్న ఏర్పాట్లపై చర్చించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు, పార్కింగ్, బస్సుల నిర్వహణ, నడక మార్గాలు, క్యూ, ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోటిలింగాల ఘాట్కు భక్తులు చేరుకునే మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. భక్తులను ఒకేసారి ఘాట్లకు అనుమతించకుండా దశల వారీగా తరలించడం ద్వారా రద్దీని సమర్థవంతంగా నియంత్రించాలని, పోలీస్ శాఖ రూపొందించిన క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రణాళికను మరింత శాసీ్త్రయంగా రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తుల కోసం లూథర్గిరి, ఆర్ట్స్ కళాశాల ప్రాంతాల్లో సెటిల్ బస్సుల కోసం తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులకు సురక్షితమైన పుష్కర అనుభూతి కల్పించేలా చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ వై.మేఘా స్వరూప్, స్పెషల్ ఆఫీసర్ మహేష్, డీఎస్పీ వై.శ్రీకాంత్ ఉన్నారు. -
తెలుగులోనే మాట్లాడదాం
● ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ నరసింహారావు ● ఘనంగా తెలుగు భాషా సంబరాలు అమలాపురం టౌన్: తెలుగు భాష మనది.. తెలుగులోనే మాట్లాడదాం.. రాబోయే తరానికి తెలుగులోని మాధుర్యాన్ని అందిద్దామని రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం జోన్ కమాండెంట్ డాక్టర్ కొండా నరసింహరావు అన్నారు. కోనసీమ రచయితల సంఘం, మహిళా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా స్థానిక పరంజ్యోతి జూనియర్ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన తెలుగు భాషా సంబరాలు, కవి సమ్మేళనానికి డాక్టర్ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మరో ముఖ్య అతిథి శ్రీశ్రీ కళావేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ తెలుగు భాషను వ్యవహారిక భాషగా అభివృద్ధి చేసిన గిడుగు సేవలను కొనియాడారు. నరసింహారావు దంపతులు సభ ఆరంభంలో చేసిన శంఖారావం సభికులను ఆకట్టుకుంది. కోనసీమ రచయితల సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సంబరాల్లో శ్రీశ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి నేతృత్వంలో 50 మందితో కవి సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా కవులను సత్కరించారు. తెలుగు వైభవంపై వారు వినిపించిన కవితా గానాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు నరసింహారావు, డాక్టర్ ప్రతాప్ చేతుల మీదుగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు నల్లా నరసింహమూర్తి, బీవీవీ సత్యనారాయణ, సబ్బెళ్ల మహాలక్ష్మి, మాకే బాలా ర్జున సత్యనారాయణలకు గిడుగు రామమూర్తి పంతులు పేరుతో పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులకు తెలుగు భాషపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లోని విజేతలకు పరంజ్యోతి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నల్లా తమ్మేశ్వరరావు బహుమతులు అందజేశారు. మహిళా రచయితల సంఘం అధ్యక్షురాలు పోలిశెట్టి అనంతలక్ష్మీదేవి, కవి అరిగెల బలరామమూర్తి. సాహితీ అభిమానులు చిక్కాల సతీష్, చిక్కాల అరుణతోపాటు కవులు, అధ్యాపకులు, విద్యార్ధులు పాల్గొన్నారు. -
రుడాకు కొత్త రూపం
● నగరపాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు, 314 పంచాయతీలు ● మొత్తం 2,838 కిలోమీటర్ల విస్తీర్ణం ● పునర్ వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ సౌకర్యాల మెరుగుకు అవకాశం ● తూర్పుగోదావరి జిల్లా మొత్తం రుడా పరిధిలోకి రావడంతో సౌకర్యాలు మెరుగుపడడంతోపాటు ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో సామాన్యులపై పన్నుల భారం పడనుంది. ● పంచాయతీల్లోని రోడ్లు, డ్రైనేజీలను నగర స్థాయి ప్రమాణాలతో నిర్మించే అవకాశం ఉంటుంది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా మెరుగవుతుంది. ● గ్రామంలోని భూములు, ఇళ్ల విలువలు ఒక్కసారిగా పెరుగుతాయి. ● గ్రామాల్లోని ఇళ్లను ఇక నుంచి ప్రణాళికతో నిర్మించాల్సి ఉంటుంది. ● శివారు ప్రాంతాలకు కూడా రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుంది. ● పంచాయతీల్లో లేఅవుట్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెల్లించే రుసుములో నుంచి కొంత భాగాన్ని రుడా మళ్లీ పంచాయతీలకు అందిస్తుంది. ఫలితంగా ఆ నిధులతో అక్కడ అభివృద్ధి పనులకు అవకాశం ఉంటుంది.సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) పరిధిని ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాను రుడా పరిధిలోకి తీసుకొచ్చింది. జిల్లాలోని 22 మండలాల్లోని 314 పంచాయతీలతో పాటు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీ వరకూ విస్తరించింది. ఫలితంగా 2,838 కిలోమీటర్ల మేర రుడా పరిధి మారింది. అదే సమయంలో ఇప్పటి వరకూ రుడా పరిధిలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రాంతాలను మినహాయించింది. విభజించిన జిల్లాల భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది. కలసిన ప్రాంతాలు ఇవే.. గతంలో 17 మండలాల్లోని 207 గ్రామాలు, ఒక నగరపాలక సంస్థ, 3 పట్టణ స్థానిక సంస్థలు కలిసి మొత్తం 1566.442 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రుడా ఉండేది. జిల్లాల విభజనతో తూర్పుగోదావరిలో కలిసిన మండపేట మున్సిపాలిటీని ప్రస్తుతం రుడా పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి వరకూ రుడాలో లేని కడియం మండలంలోని మూడు గ్రామాలు, గోకవరంలోని 15, అనపర్తిలోని ఆరు, బిక్కవోలులోని ఆరు, మండపేటలోని ఆరు, రాయవరంలోని మూడు, కపిలేశ్వరపురంలోని ఒక గ్రామాన్ని కలిపారు. మొత్తంగా ఒక మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాల్లోని 40 గ్రామాలను విలీనం చేశారు. దీంతో జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్తో పాటు మిగిలిన 21 మండలాల్లోని 314 పంచాయతీలు, నాలుగు పట్టణ స్థానిక సంస్థలు రుడా పరిధిలోకి వచ్చేశాయి. మినహాయించినవి ఇవే.. ఇప్పటి వరకూ రుడా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం మున్సిపాలిటీని మినహాయించారు. అలాగే రామచంద్రపురం రూరల్ మండలంలోని 20 గ్రామాలు, కోటిపల్లి, గంగవరంలోని 24, ఆలమూరులోని 15, ఆత్రేయపురంలోని 15, రావులపాలెం మండలంలోని 11 గ్రామాలను రుడా నుంచి మినహాయించారు. గోపాలపురం నియోజకవర్గంలో భాగమైనప్పటికీ ఏలూరు జిల్లాకు చెందిన ద్వారకాతిరుమల మండలంలోని 36 గ్రామాలను కూడా తొలగించారు. మొత్తంగా ఒక మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లోని 121 పంచాయతీలను రుడా పరిధి నుంచి మినహాయించారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.పన్నుల భారం.. అనుమతుల్లో జాప్యం రుడా పరిధిలోకి రావడంతో గ్రామాల్లోని వ్యవసాయ భూముల ధరలు పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ప్లాట్లుగా మార్చే అవకాశం ఉంది. దీంతో పచ్చని పంట పొలాలు కాంక్రీట్ జంగిల్గా మారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకూ పంచాయతీల్లో ఇల్లు కట్టుకోవాలంటే సర్పంచ్ లేదా కార్యదర్శి సంతకం సరిపోయేది. కానీ రుడా పరిధిలోకి వచ్చాక ఆన్లైన్ దరఖాస్తులు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కోసం రాజమహేంద్రవరంలోని కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేకంటే ఉన్న ఇల్లు విస్తరించాలన్నా రుడాకు లేఅవుట్ డెవలప్మెంట్ చార్జీలు, అప్రూవల్ ఫీజుల రూపంలో రూ.వేలు చెల్లించాలి. పంచాయతీ పన్నుల స్థానంలో అర్బన్ అథారిటీ స్థాయి పన్నులు అమలులోకి వస్తాయి. ఫలితంగా గృహ, నీటి పన్నులు గణనీయంగా పెరుగుతాయి. ఇది సామాన్యులకు ఆర్థిక భారం కానుంది. ప్రభుత్వ భూమి విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ భారం పడుతుంది. -
ఆనంద తాండవమెప్పుడో!
● అర్ధంతరంగా నిలచిన వంతెన నిర్మాణం ● మూడేళ్లగా పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● తుపానులు, వరదల వేళ ప్రజలకు తప్పని తిప్పలు ● పూర్తయితే అన్ని విధాలా అభివృద్ధి కోటనందూరు: స్థానిక తాండవనదిపై తలపెట్టిన వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో తుపానులు, వరదల సమయాల్లో ప్రజల రాకపోకలకు అవస్థలు తప్పేలా లేవు. మూడేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముందు నిలిచిపోయిన పనులు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొనసాగుతాయని భావించిన ప్రజలకు ఆశాభంగం తప్పడం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు గడుస్తున్నా పనులు అంగుళం కూడా ముందుకు కదల లేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంజూరైన బ్రిడ్జి కాబట్టే ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాండవనది పరీవాహక ప్రాంతంలో భారీగా వర్షం కురిసినా, తాండవ జలాశయం నుంచి నది ద్వారా సముద్రానికి నీటిని విడిచిపెట్టినా కోటనందూరులో కాజ్వే (బ్రిడ్జి)పై నుంచి నీరు ప్రవహించి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఫలితంగా ఈ బ్రిడ్జి ఆధారంగా ప్రయాణించే 50 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐదు దశాబ్దాల కలగా మారిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వంలో మంత్రి దాడిశెట్టి రాజా రూ.10 కోట్లు మంజూరు చేయించారు. మార్చి 2024 వరకూ శరవేగంగా సాగిన పనులకు ఎన్నికల కోడ్తో అంతరాయం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని పట్టించుకోకపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేనందున అధికార యంత్రాంగం, పాలకులు స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. తుని–నర్సీపట్నం రోడ్డు నుంచి కోటనందూరుకు చేరుకోవాలంటే మధ్యలో ఉన్న తాండవనది దాటాల్సి ఉంది. 1976లో నిర్మించిన ఈ కాజ్వే పైభాగం శిథిలం కావడం, ఇరువైపులా రక్షణ లేకపోవడం, ఎత్తు, వెడల్పు, కింద పిల్లర్ల మధ్య దూరం తక్కువగా ఉండడం వంటి కారణాలతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. వరదల సమయంలో నదిలో నీరు కాజ్వే పైనుంచి ఉధృతంగా ప్రవహించి తుని–నర్సీపట్నం రోడ్డుకు, కోటనందూరు గ్రామానికి పూర్తిగా సంబంధాలు తెగిపోతుంటాయి. ఈ నేపథ్యంలో కాజ్వేను బ్రిడ్జిగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలి తాండవనదిపై శిథిలావస్థకు చేరిన వంతెనతో రాకపోకలకు ఎన్నో అవస్థలు పడుతున్నాం. ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నాం. తాండవ నదిపై వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలతో పాటు ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది. – ఉల్లూరి శ్రీను, కోటనందూరు అన్ని రకాలుగా అభివృద్ధి కోటనందూరులో తాండవ నదిపై వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలతో పాటు ఈ ప్రాంతం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. కోటనందూరులో తుని–నర్సీపట్నం రోడ్డు నుంచి పాతకొట్టాం, కేఈ చిన్నయ్యపాలెం, రౌతులపూడి, శంఖవరం మీదుగా కత్తిపూడి వద్ద 216 నంబరు హైవేకు చేరుకునేందుకు 33 కిలోమీటర్ల పొడవైన రహదారి ఉంది. తాండవ నదిపై సరైన వంతెన లేక ఈ మార్గంలో భారీ వాహనాలు తిరిగే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా ఈ రోడ్డు లూప్లైన్గానే మిగిలిపోయింది. ఇక్కడ ఉన్న కాజ్వే బ్రిడ్జిగా అభివృద్ధి చెందితే సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు రహదారులు, వ్యాపార అవకాశాలు, ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. -
కిక్క్రుమనకుండా..
● గంజాయి తరలింపులో కొత్త ఎత్తుగడ ● హ్యాస్ ఆయిల్గా మార్చి అక్రమ రవాణా ● పోలీసుల కళ్లుగప్పి ఇతర రాష్ట్రాలకు చేరవేత ● జిల్లాలోనూ చిన్న ప్యాక్లుగా విక్రయాలు ● పోలీసుల నిఘా పెరిగితేనే అడ్డుకట్ట సాక్షి, రాజమహేంద్రవరం: గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త మార్గాలను సృష్టిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. గంజాయిని సహజ రూపంలో భారీగా తరలించే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఈ మత్తు పదార్థాన్ని ద్రవ రూపంలోకి హ్యాస్ ఆయిల్గా మార్చేస్తున్నారు. ఫలితంగా భారీ మొత్తం సరకు తేలిగ్గా సరిహద్దులు దాటించేసి, ఇతర రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. ఇదే సమయంలో రాజమహేంద్రవరం నగరంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ హ్యాస్ ఆయిల్ లభించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ కొత్త ఉపద్రవం పోలీసులకు సవాల్గా మారడంతో పాటు యువతరం ఉజ్వల భవిష్యత్ను అంధకారమయం చేసే ప్రమాదం ఉంది. తాజాగా బుధవారం గోకవరంలో ఆరు లీటర్ల లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే దొరికేది కొంతయితే, దొరకకుండా వేల లీటర్లు పోలీసుల కళ్లుగప్పి తరలిపోతోంది. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు... ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయిని విశాఖపట్నం, రాజమహేంద్రవరం మీదుగా ఇతర ప్రాంతాలకు భారీగా తరలిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. కిలో, రెండు కిలోల చొప్పున ప్యాకెట్లుగా మార్చి కార్లు, లారీల్లో రోడ్డు మార్గం ద్వారా, కొన్నిసార్లు రైళ్లలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ముంబయి, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలకు నిత్యం రవాణా చేస్తున్నారు. అయితే ఇలా చేసే సమయంలో పోలీసుల తనిఖీలకు సులువుగా దొరికిపోతున్నారు. ఎక్కువ మొత్తంలో సరకు ఒక్కసారిగా తరలించడం సాధ్యం కావడం లేదు. అందుకని గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి సరఫరా చేయడంపై దృష్టి సారించారు. యువత భవిత అంధకారమే సహజంగానే గంజాయి తీసుకున్న వారు ఉన్మాదంతో ప్రవర్తిస్తుంటారు. విచక్షణ కోల్పోయి భౌతిక దాడులకు పాల్పడడంతో పాటు లైంగిక దాడులకూ పాల్పడుతున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అంతకు పదింతలు మత్తునిచ్చే లిక్విడ్ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుండడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. కొంత మంది స్మగ్లర్లు మరింత కిక్కు కోసం ద్రవ గంజాయిలో ఐసో ప్రోఫైల్ అనే ఆల్కాహాల్ను కలుపుతున్నారని తెలుస్తోంది. ఇటువంటి ద్రవ గంజాయిని స్వీకరించిన వారు సైకో మనస్తత్వంతో ప్రవర్తించడంతో పాటు త్వరగా అనారోగ్యానికి గురవుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన జిల్లాలోని చాలా ప్రాంతాల్లోనూ గంజాయితో పాటు ద్రవపు గంజాయి కూడా లభిస్తోంది. ముఖ్యంగా రాజమహేంద్రవరంలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లు రూపంలో గంజాయి లభిస్తుండడంతో చారిత్రక నగరంలో నిత్యం అలజడి రేగుతోంది. యువతరం ఉజ్వల భవిష్యత్ నాశనం అవుతుండడంతో పాటు నగర వాసులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి నెలకొంది. చారిత్రక ఆధ్యాతిక నగరంలో ప్రశాంతంగా బతకలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో గంజాయి అక్రమ రవాణాకు కూలీలను స్మగ్లర్లు నియమించుకునేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. యువకులు, విద్యావంతులు, చిరుద్యోగులు, మహిళలు డబ్బుకు ఆశపడి గంజాయి స్మగ్లింగ్లో భాగస్వాములవుతున్నారు. పోలీసులకు చిక్కి జైలుపాలై భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. పోలీసుల నిఘా మరింత పెరిగితేనే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని పలువురు అంటున్నారు.25 కిలోలతో లీటరు ద్రవ గంజాయి ఏజెన్సీ నుంచి సేకరించిన గంజాయి ఆకులను స్మగ్లర్లు ప్రత్యేకంగా తయారు చేసుకున్న గానుగలో వేసి పిప్పు చేస్తున్నారు. కొద్దిసేపటికి అది ద్రవంగా మారితే క్యాన్లు, బాటిళ్లలో నింపుతున్నారు. నాణ్యతను బట్టి సుమారు 20 నుంచి 25 కిలోల గంజాయిని గానుగ ఆడితే ఒక లీటర్ హ్యాస్ ఆయిల్ తయారవుతుంది. అంటే ఒక లీటర్ను ఇతర రాష్ట్రాలకు తరలించారంటే, సుమారు 25 కిలోల గంజాయి తరలించినట్టే. ఇలా చేయడం వల్ల రవాణా సులువవుతోంది. అందుకనే స్మగ్లర్లు కొన్నాళ్లుగా ఈ పద్ధతిని ఎంచుకుని ఒడిశా సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలా మార్చేశారు. పోలీసుల కన్నుపడని చోట గానుగలు ఏర్పాటు చేసి ద్రవ గంజాయిని తయారు చేసి అక్రమంగా తరలిస్తున్నారు. -
బాల్య వివాహం నిలిపివేత
రంగంపేట: మండలంలోని ఈలకొలను గ్రామంలో 17 బాలికకు వివాహం చేసేందుకు జరుగుతున్న ఏర్పాట్లను ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈలకొలను గ్రామానికి చెందిన అంచూరి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల 17 ఏళ్ల కుమార్తెకు అదే గ్రామానికి చెందిన కురుకూరి గవర్రాజు, మంగ దంపతుల కుమారుడు దుర్గాప్రసాద్తో శుక్రవారం రాత్రి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ స మయానికి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఎం. నరేష్ బాబు, వీఆర్వో భాస్కరరావు తదితరులు వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం శనివారం ఉదయం ఐసీడీఎస్ రంగంపేట ప్రాజెక్టు అధికారి కె. కష్ణవేణి ఆధ్వర్యంలో సెక్టర్ సూపర్వైజర్ ఆర్.నందీశ్వరి, వీఆర్వో పి.భాస్కరరావు, కార్యదర్శి ఎంఎస్కే శ్రీలక్ష్మి, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామానికి చేరుకుని బాలిక, బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు 18 దాటకుండా వివాహం చేస్తే ఎదురయ్యే శారీరక, సామాజిక సమస్యలను వివరించి నిర్ణీత వయసులోపు వివాహం చేయబోమని అంగీకార పత్రం తీసుకున్నారు. బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందించాలని, బాలల భద్రత విషయంలో ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పుష్కర కాలువలో పడి వ్యక్తి మృతి గోకవరం: మండలంలోని తంటికొండ శివారున పుష్కరకాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు గాదెలపాలేనికి చెందిన గళ్లా కాశీవిశ్వనాథం (48), వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో శనివారం తంటికొండ శివారున పుష్కరకాలువలో అతని మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని భోరున విలపించారు. సమాచారం అందుకున్న గోకవరం ఎస్సై పవన్కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. ● బాలిక తల్లిదండ్రులకు ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ అధికారుల కౌన్సెలింగ్ ● నిర్ణీత వయసు లోపు వివాహం చేయబోమని అంగీకారపత్రం స్వీకరణ -
సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
కాకినాడ క్రైం: పంచాయతీరాజ్ శాఖ పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ)కు సంబంధించి రూ.2 కోట్ల ఓడీ పరిమితి ఉన్న ఖాతా సాధిక్ ఖాన్ చేతికి చిక్కిందనే కీలక విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేవీబీ భానుగుడి బ్రాంచికి శుక్రవారం వెళ్లి మేనేజర్ను ఆ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. తనకు, జగదీశ్వరరెడ్డికి చెందిన ఖాతాల్లో తన ఫోన్ నంబర్ మార్చి, వాటి ఆర్థిక లావాదేవీలను సాధిక్ ఖాన్ తన చేతుల్లో పెట్టుకున్నాడన్న నూకరాజు కుమార్తె సౌజన్య ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మరింత స్పష్టత కోసం బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, సాధిక్ సోదరి, తల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకు ఖాతాలపై పరిశీలన మొదలు పెట్టారు. సౌజన్య దగ్గర నుంచి సాధిక్ తీసుకున్న సొత్తును వారికి బదలాయించాడన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులున్నారు. ఇదిలా ఉండగా సాధిక్ను కోర్టు సోమవారం తమ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రశ్నల వర్షం కురిపించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అంతకు ముందే పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.సాధిక్ ఖాన్ కస్టడీ పిటిషన్పైవిచారణ వాయిదా కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్ను పలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. చదవండి: నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం! -
నగరపాలక పంచాయితీ
ఒకరు ఔనంటారు.. మరొకరు కాదంటారు.. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికలపై గజిబిజి సృష్టిస్తున్నారు.. ఒక ఎమ్మెల్యే పంచాయతీల విలీనంతో ఎన్నికలకు వెళ్తామని చెబుతుంటే, మరొకరు పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అనడం గందరగోళానికి దారితీస్తోంది.. చివరికి ఎటెళ్తుందో తెలియక జనం తికమక పడుతున్నారు.. ఆ కథేంటో తెలుసుకుందాం రండి. సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణపై మాత్రం తీవ్ర గందరగోళం నెలకొంది. విలీన గ్రామాల వివాదాలు, న్యాయస్థానాల్లో పిటీషన్ల కారణంగా గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నా, రాజమహేంద్రవరం విషయంలో మాత్రం స్పష్టత రావడం లేదు. ఇప్పటికే చాలా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. ఇక్కడ మాత్రం ఆ ప్రక్రియ ప్రారంభమే కాలేదు సరికదా ప్రజాప్రతినిధుల భిన్న ప్రకటనలతో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. ‘రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని పంచాయతీల్లో చాలా ఏళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. అందుకే వాటన్నింటితో గ్రేటర్ రాజమహేంద్రవరం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తాం. పంచాయతీల విలీనం విషయంపై కోర్టుకు వెళ్లిన వారిని విత్డ్రా చేసుకోమని కోరుతున్నాం. విలీన ప్రక్రియ పూర్తయితే డివిజన్ల సంఖ్య కూడా పెరుగుతుంది’ అని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటున్నారు. మరోవైపు ‘గతంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలో విలీనం చేయడంతో కొన్నేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగడం లేదు. విలీన ప్రక్రియ నుంచి మినహాయించడంతో త్వరలో రాజానగరం నియోజకవర్గంలోని పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తాం. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల్లో పోటీకి ఆశావహులంతా సిద్ధంగా ఉండాలి’ అని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించారు. కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధుల ప్రకటనలతో నగరపాలక సంస్థ ఎన్నికలపై మరింత గందరగోళం పెరిగింది. విలీనం.. గందరగోళం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధి పెంచాలనే ఉద్దేశంతో గతంలో రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని బొమ్మూరు, రాజవోలు, ధవళేశ్వరం, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, కోలమూరు, కాతేరు, వెంకటనగరం, తొర్రేడు, కడియం మండలం వేమగిరి పంచాయతీలను విలీనం చేసేందుకు రెడీ అయ్యారు. అలానే రాజానగరం మండలం నామవరం, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్చెరువు (శ్రీరామపురం, రఘునాథపురం), పాలచర్ల, వెలుగుబంద, చక్రద్వారబంధం, కోరుకొండ మండలం మధురపూడి, బూరుగుపూడి, గాడాల, నిడిగట్ల పంచాయతీల విలీనానికి ప్రతిపాదించారు. ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అప్పటి నుంచి ఆ వివాదం తేలకపోవడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారింది. అందుకే ఎత్తుగడా? గోదావరి పుష్కరాల వేళ ఎదురు లేకుండా చేసుకునేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ ఎన్నికలకు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. మేయర్తో పాటు కార్పొరేటర్లు ఉంటే తమ ప్రభావం తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రూ.వేల కోట్లతో పుష్కర పనులు చేపడతామని గొప్పలు చెబుతుండగా, ఆ పనుల్లో తమ మాటే చెల్లాలి.. తమ వారికే పనులు కట్టబెట్టుకోవాలి.. నాలుగు డబ్బులు వెనకేసుకోవాలంటే నగర కార్పొరేషన్కు పాలకవర్గం లేకుండా ఉండాలని భావిస్తున్నారు. అప్పుడే తమకు నచ్చిన అధికారులను నియమించుకుని ఇష్టారీతిన పుష్కరాల పనులు చేపట్టుకోవచ్చని, ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే భిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పుష్కరాల లోపు కార్పొరేషన్ ఎన్నికలు జరగనివ్వరని భావిస్తున్నారు. ఫ గ్రామాల విలీనంపై గందరగోళం ఫ గ్రేటర్ రాజమహేంద్రవరం అంటున్న గోరంట్ల ఫ పంచాయతీల్లోనే ఎన్నికలు జరుగుతాయంటున్న బత్తుల ఫ కూటమి ప్రజాప్రతినిధుల మధ్య భిన్న ప్రకటనలు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 24,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
వేటగాళ్ల ఉచ్చులో విదేశీ కొంగలు
మామిడికుదురు: బి.దొడ్డవరం మధ్యలంకలో విడిది చేసిన విదేశీ వలస పక్షులు ‘ఏషియన్ ఓపెన్ బిల్ స్కార్ట్స్’పై వేటగాళ్లు పంజా విసురుతున్నారు. మధ్యలంకలో తుమ్మచెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకున్న వీటిని వారు వేటాడి సొమ్ము చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. వాటిని పట్టుకుని ఇతర గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాల వద్ద బహిరంగంగా విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఒకొక్క కొంగను రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారని పక్షి ప్రేమికులు వాపోతున్నారు. అరుదైన పక్షుల రక్షణకు చర్యలు తీసుకుని, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి
కపిలేశ్వరపురం (మండపేట): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మండపేట పట్టణంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి పెద్ద కాలువ వంతెన నుంచి ప్రధాన రహదారిలో రాజారత్న సెంటర్, బస్టాండ్, కలువపువ్వు సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. మండపేట పట్టణం, రూరల్, రాయవరం, అనపర్తి, బిక్కవోలు, కపిలేశ్వరపురం మండలాల ఉపాద్యాయులు పాల్గొన్నారు. యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పి.సురేంద్ర మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలన్న నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సాధ్యం కాని పరిస్థితుల్లో అర్హత మార్కులను తగ్గించాలని, పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిక్కిరిసిపోయింది. శ్రావణ శుక్రవారం, పౌర్ణమి పర్వదినాలు కలసి రావడం, దీనికి తోడు రత్నగిరి పైన, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో ఇతర భక్తులు సత్యదేవుని సన్నిధికి తరలి రావడంతో రద్దీ ఏర్పడింది. స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు కిక్కిరిశాయి. భక్తులు వచ్చిన వాహనాలతో పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోయాయి. సత్యదేవుడిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2,300 జరిగాయి. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటలు, రూ.200 టికెట్టుతో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సాధిక్ ఖాన్ కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. -
ఎన్నడూ లేనంతగా..
గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోయాయి. పంచదార, బెల్లం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో ఎప్పుడూ రూ.40 నుంచి రూ.45 మధ్యే ఉండేది. ప్రస్తుతం రూ.70 దాటిపోవడంతో శ్రావణ మాసంలో తీపి పదార్థాలు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాం. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. వాటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – డొక్కా నాగమణి, మిర్తిపాడు, సీతానగరం మండలం ఏమీ తినలేం.. కొనలేం ధరలు మరీ దారుణంగా పెరిగిపోతున్నాయి. ఏమీ కొనలేం, తినలేం అన్నట్లు ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తినడానికి భయపడే పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది. నూనె ధరలు పెరగడంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. పంచదార, బెల్లం ధరల పెరుగుదలతో టీ, కాఫీ కూడా తాగడానికి ఆలోచిస్తున్నాం. – మాణిక్యాంబ, అంగన్వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు సామాన్యులు బతకడం కష్టమే చంద్రబాబు ప్రభుత్వంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా షాక్ తగులుతోంది. బియ్యం, నూనె, పంచదార, బెల్లం, కూరగాయలు... ఇలా సామాన్యులకు అవసరమైన వస్తువులన్నీ పెరిగిపోయాయి. ఏమీ కొనే పరిస్థితి లేదు. మాలాంటి సామాన్యులు బతకడం కష్టంగా మారింది. ప్రభుత్వం స్పందించి ధరలు నియంత్రించాలి. –మేడిశెట్టి వెంకటలక్ష్మి, అంగర, కపిలేశ్వరపురం మండలం -
సాగునీరు సక్రమంగా అందించాలి
గౌరవ వేతనాలు ఎప్పుడు? తమకు రెండేళ్లుగా గౌరవ వేతనం చెల్లించడం లేదని, దీనిని వెంటనే మంజూరు చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. దీనిపై జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు స్పందిస్తూ, సభ్యులకు త్వరలోనే చెల్లించాల్సిన గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీల గౌరవ వేతనాన్ని ఆయా మండల పరిషత్ల నుంచి తీసుకోవాలని సూచించారు. అయితే, మండల పరిషత్ నిధుల నుంచి గౌరవ వేతనాలు ఇవ్వడానికి అనుమతులు లేవంటూ ఎంపీడీఓలు చెబుతున్నారని సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు పదవీ కాలంలో తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత ఖరీఫ్లో సాగునీరు సరిగ్గా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు అన్నారు. పంటలకు సాగునీరు సక్రమంగా అందించి అన్నదాతల కష్టాలు గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశం స్థానిక జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి కోసం రైతులు పడుతున్న అగచాట్లను ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నినో ప్రభావంతో పంటలు పండించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పంట కాలువలపై అక్రమ నిర్మాణాలా? ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, పలు పంట కాలువలను ఆక్రమించి ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, దీనివల సాగునీరు సక్రమంగా అందక ఇబ్బంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి అనుమతి ఎవరిచ్చారని అధికారులను నిలదీశారు. పంట కాలువలపై ఎటువంటి నిర్మాణాలకూ తాము అనుమతి ఇవ్వలేదని, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. రంపచోడవరం జెడ్పీటీసీ సభ్యురాలు పండ్ర వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ప్రస్తుతం అసలు పంటలు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతులు తినేందుకు కూడా పంటలు పండించుకునే పరిస్థితి లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీలంక అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని క్రమంగా రసాయనిక ఎరువులను తగ్గించి, ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రైతులకు సాగునీరు ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమావేశాన్ని ఓ చర్చిలో నిర్వహించడంపై ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అధికారులను నిలదీశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ చెప్పారు. అసంపూర్తిగా జల్జీవన్ పనులు జల్జీవన్ మిషన్ పథకంలో ఇంటింటికీ కుళాయిలు వేసేందుకు చేపట్టిన పైపులైన్ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆ పనులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారో చెప్పాలని పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మతిన్ స్పందిస్తూ, కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని పనులను మధ్యలోనే నిలిపివేశాని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే వారికి బిల్లులు మంజూరు చేసి, పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీరేదీ? తొండంగి మండలంలోని పలు గ్రామాలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని జెడ్పీటీసీ సభ్యురాలు మెరుగు పద్మలత అన్నారు. అనేక గ్రామాల్లో మూడు నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోందని వాపోయారు. పలు పీహెచ్సీల్లో ప్రజలకు సరైన వైద్యం అందించడం లేదని, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, పూర్తి స్థాయిలో మందులు కూడా లేకపోవడంతో ప్రజలు కాకినాడ, రాజమహేంద్రవరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం చేపట్టినా ప్రస్తుతం ప్రారంభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసివేస్తోందని, దీనివలన ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లల్ని చేర్చాలంటే నిరుపేదలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేసేవారమని, రెండేళ్లుగా ఈ ప్రభుత్వం స్టడీ మెటీరియల్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గత ఐదు సంవత్సరాలుగా పని చేశాం. 2021 నుంచి ఇప్పటి వరకూ 21 సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. జిల్లా అధికారులు, సభ్యుల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. మా పదవీ కాలం సెప్టెంబర్ 24 వరకూ ఉంది. త్వరలోనే సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ గౌరవ వేతనాలు, చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న జెడ్పీటీసీ సభ్యులుసమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావుఫ రైతుల కష్టాలు గట్టెక్కించాలి ఫ ఉమ్మడి ‘తూర్పు’ జెడ్పీ చివరి సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుల డిమాండ్ -
శ్రీపాదుడే రక్షగా!
● ఘనంగా రాఖీ పౌర్ణమి ఉత్సవాలు ● దత్తాత్రేయుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు దత్తాత్రేయుడికి రాఖీలు కడుతున్న భక్తులు శ్రీపాద శ్రీవల్లభ స్వామికి రాఖీలు కట్టేందుకు తరలివస్తున్న మరాఠీ భక్తులు పిఠాపురం: శ్రీపాద శ్రీవల్లభుడు, దత్తాత్రేయుని జన్మస్థలం పిఠాపురంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది భక్తుల రాకతో దత్తాత్రేయుని ఆలయాలు కిటకిటలాడాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో పాటు సుమారు 50 వేల మంది మహారాష్ట్ర భక్తులు శుక్రవారం దత్తాత్రేయునికి రాఖీలు కట్టారు. దీంతో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం భక్తులతో కిక్కిరిసింది. శ్రీపాదునికి రాఖీ పంపిన వాసవి అమ్మవారు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభునికి స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి గ్రామోత్సవంగా సంస్థానానికి వెళ్లి అమ్మవారి రాఖీ సమర్పించారు. ఆయనకు సోదరిగా కన్యకా పరమేశ్వరి రాఖీ కట్టడం ఇక్కడ ఆనవాయితీ. అనంతరం ఈఓ ఆర్.సౌజన్య ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి శ్రీపాదుని తరఫున సారె సమర్పించారు. లక్ష మల్లెలతో అర్చన ఈ సందర్భంగా పాదగయ క్షేత్రంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు ‘లక్ష మల్లెల అర్చన’ నిర్వహించారు. -
రియాన్ష్కు సంపూర్ణ రక్షణ కల్పిస్తాం
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి రావులపాలెం: కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ విషాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన మైనర్ రియాన్ష్ కార్తికేయరెడ్డికి పూర్తి రక్షణ కల్పించి, అతని భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. స్థానిక బాలుడి తాతయ్య కొవ్వూరి భాస్కరరెడ్డి ఇంటికి శుక్రవారం ఆయనతో పాటు కమిషన్ సభ్యులు వచ్చి రియాన్ష్ను పరామర్శించి మాట్టాడారు. విషాద ఘటన పూర్వాపరాలను తెలుసుకుని అతని రక్షణ, విద్య, భవిష్యత్తుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడిని, ఆమె తల్లిని సాధిక్ ఖాన్ ఏ విధంగా వేధించినదీ తెలుసుకున్నామని తెలిపారు. కలెక్టరేట్లో ఈ మేరకు సమీక్షించి తదుపరి చర్యలకు ప్రభుత్వానికి, డీజీపీకి అవసరమైన సిఫార్సులు, ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కమిషన్ సభ్యురాలు డాక్టర్ పి.నాగ మానస మాట్లాడుతూ అతని భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
టోల్గేట్లోనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలి!
● రత్నగిరిపైకి వాహనాల అనుమతిపై అధికారులకు ఎస్పీ ఆదేశం ● మద్యం సీసాలున్నా.. మద్యం తాగిన వారు ఉన్నా పంపవద్దు అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని టోల్ గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కొండ మీదకు అనుమతించాలని ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం ఆదేశించారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇదేం పద్ధతి స్వామీ’ కథనంపై ఎస్పీ స్పందిస్తూ ఈ మేరకు ప్రత్తిపాడు సీఐ వి.సూర్య అప్పారావుకు ఆదేశాలు ఇచ్చారు. గత బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం తాగి పెళ్లి బృందాలపై దాడి చేయడం, రత్నగిరి అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో, వివాహాలు జరిగే సత్యగిరి తొండంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఉండడం వల్ల వారి మధ్య సమన్వయం లేక ఏవైనా ఘటనలు జరిగినపుడు వారి స్పందనలో జాప్యం ఏర్పడుతోందన్న అంశాలపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం సీఐ అప్పారావు దేవస్థానానికి వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో సమావేశమయ్యారు. ఆలయానికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిషేధిత వస్తువులు లేవని తేలిన తరువాతే కొండ పైకి పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఏవైనా దుస్సంఘటనలు జరిగితే సత్వరం తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, సీసీ కెమేరాల నిఘా పెంచి గొడవలు సృష్టించే వారిని, అనుమానితులను గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం డ్రోన్ కెమేరా ద్వారా దేవస్థానం టోల్గేట్, ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. సమావేశంలో స్థానిక ఎస్ఐ హరిబాబు, దేవస్థానం సెక్యూరిటీ అధికారి ఆకుల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
రామచంద్రపురం రూరల్: 2011 సంవత్సరానికి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయింపునివ్వాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రామచంద్రపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్పెషల్ టెట్ అని ప్రభుత్వం చెబుతున్నా అందులో స్పెషల్ ఏమీ లేదని విమర్శించారు. టెట్లో అందరికీ ఉత్తీర్ణత 40 శాతం మార్కులకు కుదించాలని, ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలని, బోధించే సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ పైనే పరీక్షలు ఉండాలని సూచించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి -
సీ్త్ర సహనానికి పరీక్ష!
● పరిమిత బస్సుల్లో అపరిమిత ప్రయాణాలు ● మౌలిక వసతులు పెంచని ప్రభుత్వం ● అవస్థలు పడుతున్న సాధారణ ప్రజలు కపిలేశ్వరపురం: గత ఏడాది ఆగస్టు 15న సీ్త్రశక్తి పేరుతో ఆర్భాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకం నేడు అస్తవ్యస్తంగా మారింది. ఆడపడుచుల సంక్షేమమే మా ప్రాధాన్యం అని ఘనంగా చెప్పుకొని ప్రారంభించిన ఈ పథకంలో అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి అనేక సర్వీసులను మినహాయించి కేవలం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రం అనుమతించి వారిని అనేక ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రపురంలో కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. తీరా చూస్తే నలభై మంది పట్టే బస్సులో 70 మంది దాకా కుక్కేసి నడిపేస్తున్నారు. మౌలిక వసతులు ఏ మాత్రం పెంచకుండా ప్రారంభించిన ఈ పథకాన్ని ఆయా బస్సుల డ్రైవర్లు సైతం పట్టించుకోవడం లేదు. పలు స్టాప్లలో ప్రయాణికులు ఉన్నా ఆపకుండా వెళ్లిపోతుండడం శోచనీయం. దివ్యాంగులకు దిక్కెవరు.. సీ్త్రశక్తి పథకం అమలయ్యాక దివ్యాంగులకు రిజర్వు చేసిన సీట్లు సైతం వారికి దొరకడం లేదు. దీంతో వారు బస్సు ఎక్కడానికి, ఎక్కాక సీటు సంపాదించడానికి చాలా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఫుట్బోర్డు ప్రయాణాలే.. రావులపాలెం డిపో పరిధిలో శనివారం వచ్చిందంటే ఉమ్మడి జిల్లాలోని చాలా మంది భక్తులు వాడపల్లికి వెళ్లేందుకు ఇక్కడికే వస్తారు. వారి డిమాండ్కు తగ్గ బస్సులు లేకపోవడంతో చాలా మంది భక్తులతో పాటు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఫుట్బోర్డుపై ఒక్క కాలు పెట్టడానికి చోటున్నా సరిపోతుందన్నట్టు వేలాడుతూ వెళ్తున్నారు. అత్త మీద కోపం దుత్తమీద.. ప్రయాణ అవస్థలను ఓర్చుకోలేని ప్రయాణికులు ప్రభుత్వం చూపాల్సిన కోపాన్ని ఎదురుగా కనపడుతున్న కండక్టర్, లేదా డ్రైవర్పై చూపుతున్నారు. 2025 సెప్టెంబర్ 16న గోకవరం బస్స్టాండ్లో టిక్కెట్ తీసుకునే క్రమంలో జరిగిన వాగ్వాదంలో కండక్టరు చేతి వేలు విరిగిపోయింది. కోరుమిల్లిలో జరిగిన వాగ్వాదంలో కండక్టర్ కాలు విరగ్గొట్టేశారు. వెలుగు చూడని ఇటువంటి ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. వ్యాపారాలపై ప్రభావం.. సీ్త్ర శక్తి పథకంతో మహిళల రాకపోకలు పెరిగి, కొనుగోళ్లు పెరిగి, వ్యాపారాలు లాభిస్తాయని చాలా మంది భావించారు. తీరా చూస్తే ఓ మోస్తరు సరుకులను కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర దూరపు ప్రాంతాలకు వెళ్లి కొంటున్నారు. అసలు ఎగ్గొట్టి కొసరు కల్పించి.. ఉచిత ప్రయాణాలతో మహిళలకు బస్సు చార్జీలు మిగులుతున్నాయి తప్ప వారి కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని పలువురు అంటున్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లించలేదు. డ్వాక్రా రుణాలు, రాయితీలు ఇతర ప్రయోజనాల ఊసే లేదు. వీటిని ప్రశ్నించకుండా ఉండేందుకు సీ్త్రశక్తి పథకాన్ని కొనసాగిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. -
రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ముగ్గురి అరెస్టు కోరుకొండ: ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి నుంచి ఢిల్లీకి తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో నార్త్ జోన్ డీఎస్పీ సీహెచ్ జీవన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణాపై అందిన సమాచారం మేరకు బూరుగుపూడి జంక్షన్లోని పెట్రోల్ బంకు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు డిక్కీలో 3 బస్తాల్లో నింపిన 61 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. సరకుతో పాటు కారులోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తాండ, బాగవత్ ప్రాంతానికి చెందిన సదకత్, బార్కండి శామ్లి జిల్లాకు చెందిన సదాబ్, సల్మాన్లను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.30 లక్షలు ఉంటుందని, నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ.10,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జీవన తెలిపారు. ఈగల్ టీమ్ సహకారంతోనే గంజాయి రవాణాను అడ్డుకోగలిగామని ఆమె తెలిపారు. ఈ కేసులో కృషి చేసిన కానిస్టేబుల్స్ రవికిరణ్, ప్రకాష్ రెడ్డి, రామచంద్రరావు, సుబ్రహ్మణ్యంలకు ఆమె రివార్డులు అందజే శారు. సమావేశంలో సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఎస్సై సీహెచ్వీ రమేష్ పాల్గొన్నారు. చోరీ సొత్తు స్వాధీనం కొత్తపేట: స్థానిక ఆర్ఎస్ నగర్లో నివసిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఇంటిలో చోరీకి గురైన సుమారు రూ 25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు నిందితుడిని అరెస్టు చేసినట్టు ఎస్సై జి.సురేంద్ర శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చెల్లిబోయిన రాంబాబు ఈ నెల 18వ తేదీ రాత్రి తన భార్యతో కలిసి హాస్పిటల్ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి 20వ తేదీ ఉదయం 8 గంటలకు వచ్చారు. వారు వచ్చే సరికి ఇంటి తలుపు తాళం, లోపలి బీరువా పగలగొట్టబడి అందులోని సుమారు 23 కాసుల బంగారు, సుమారు 880 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. రాంబాబు ఫిర్యాదు మేరకు డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో అమలాపురం సీసీఎస్ సీఐ ఎన్ కొండయ్య, సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ దర్యాప్తు చేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు పలివెల వంతెన వద్ద చోరీ కేసులో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన నగరపు ఈశ్వరరావు అలియాస్ సింగనపూడి ఈశ్వరరావును సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి, అతని నుంచి చోరీ సొత్తు (సుమారు రూ.25 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు అతడు ఉపయోగించిన మోటార్ సైకిలు, రెండు ఇనుప రాడ్లను సైతం స్వాధీనం చేసుకుని అతడిని కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ అతడికి 15 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని మహిళ మృతదేహం సఖినేటిపల్లి: స్థానిక క్షత్రియ కల్యాణ మండపం సమీపంలో గోదావరి ఒడ్డున శుక్రవారం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం ఆచూకీ తెలిసిన వారు పోలీసుల తెలియజేయాలని, సోషల్ మీడియా వేదికగా కూడా నెట్జన్లు కోరారు. మృతురాలి ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. -
బ్యాట్ పడితే బాదుడే..
● ఇటు సెంచరీలు, అటు వికెట్లతో రాణింపు ● రాయలసీమ జెన్ స్టార్స్ జట్టుకు ఎంపికై న బొమ్మూరు యువతి లిఖిత రాజమహేంద్రవరం రూరల్: నాలుగేళ్ల క్రితం సాధన మొదలుపెట్టి అనతి కాలంలోనే విమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్కు ఎంపికై ంది బొమ్మూరుకు చెందిన గారపాటి లిఖిత. 19 ఏళ్ల ఈమెను రాయలసీమ జెన్స్టార్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. గారపాటి సర్వేశ్వరరావు, సౌజన్య దంపతుల చిన్నకుమార్తె లిఖిత. సర్వేశ్వరరావు వ్యాపారస్తుడు కాగా, సౌజన్య ప్రైవేటు ఇండస్ట్రీలో అకౌంటెంట్గా, ఆమె అక్క ఆశ్రిత సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. సర్వేశ్వరరావు కూడా క్రికెట్ ప్లేయర్. ఆయన ఆంధ్రా యూనివర్శిటీ స్థాయి వరకు క్రికెట్ ఆడి ఆ తరువాత వదిలేశారు. లిఖితకు ముందుగా రాజమహేంద్రవరంలో అఖిమ్ బాషా వద్ద క్రికెట్ శిక్షణ ఇప్పించారు. మూడేళ్లుగా సెంచూరియన్స్ క్రికెట్ అకాడమిలో కోచ్ సుమంత్ వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. లిఖిత టాప్ ఆర్డర్ బ్యాటింగ్తో పాటు, రైట్హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్గా ప్రతిభ కనబరుస్తోంది. బ్యాట్ పడితే సెంచరీయే.. గారపాటి లిఖిత విమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్–2026 పోటీలలో విజయనగరం గ్రౌండ్లో తూర్పు గోదావరి జిల్లా తరఫునన శ్రీకాకుళం జిల్లాతో జరిగిన మ్యాచ్లో 112 నాటౌట్గా నిలిచింది. జేఎన్టీయూ తరఫున మైసూరులో టీ20 మ్యాచ్లో 124 నాటౌట్ నిలిచింది. 2025–26లో అండర్ 23 స్టేట్ తరఫున ఆడి వన్డే మ్యాచ్లలో వ్యక్తిగత స్కోరులో 169 నాటౌట్గా నిలిచి, ఆఫ్ స్పిన్నర్గా 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అబ్బురపరిచింది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 7 సెంచరీలు, 20కి పైగా ఆఫ్ సెంచరీలు, 120కి పైగా వికెట్లు సాధించింది. వచ్చేనెల 18వ నుంచి మంగళగిరిలో జరిగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో ఆమె పాల్గొననుంది. భారత్ మహిళా జట్టులో చోటు సాధించాలి నాలుగేళ్ల నుంచి క్రికెట్ సాధన మొదలు పెట్టాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విమెన్స్ ఆంధ్రా ప్రీమియర్లీగ్, అండర్–23 రాష్ట్ర జట్టు లోను, ఇతర పోటీలలో బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తున్నా. భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు సాధించడమే నా ధ్యేయం. వివ్ రిచర్డ్స్, అలెక్స్ ఫెర్రీ తన రోల్ మోడల్స్. – లిఖిత గారపాటి -
ఓడలరేవు మత్స్యకారులకు సర్పవరంలో స్వాగతం
కాకినాడ రూరల్: చేపల వేటకు వెళ్లి గల్లంతై తిరిగి వచ్చిన ఓడలరేవు మత్స్యకారులు శుక్రవారం ఉదయం కాకినాడ చేరుకున్నారు. వారికి రమణయ్యపేటలో సర్పవరం జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో వారు స్నానాలు చేసి అల్పాహారం తీసుకున్న తరువాత కోనసీమ జిల్లాకు పయనమయ్యారు. వారికి ఆశ్రయం ఇచ్చి, వారితో పాటు వచ్చిన పశ్చిమ బెంగాల్కు చెందిన మత్స్యకారులు ఇద్దరినీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు కొపనాతి రామకృష్ణ, సంగాడి తాతారావు, కర్రి రాముడు, కొల్లాడి ఏసుదాసు, శ్రీనుబాబు, కాటాడి సతీష్, పాలెపు శాంతారావు మాట్లాడుతూ దేవుడి దయవల్ల తాము ప్రాణాలతో బయటపడ్డామన్నారు. సుముద్రంలో బోటు ఇంజిన్ చెడిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని, తీసుకువెళ్లిన రేషన్ను పొదుపుగా వాడుకుని, మాలోని ఇద్దరికి అన్నం పెట్టి గంజి తాగేవాళ్లమని తెలియజేశారు. పశ్చిమ బెంగాల్లోని శంకర జెట్టీ వద్ద లభ్యమైన తమను అధికారులు కాకినాడ తీసుకువచ్చారని తెలియజేశారు. -
పేదల ఇళ్లు కూల్చివేతపై తోట త్రిమూర్తులు ఫైర్
మండపేట(తూ.గో. జిల్లా): మండపేటలో పేదల ఇళ్లు కూల్చివేతపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. పుష్కరాల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమన్నారు. పొలాలను లే అవుట్లుగా మార్చే ఉద్దశంతోనే పేదల ఇళ్లను రాత్రికి రాత్రే తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఇళ్లను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సహకారంతో కూల్చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు.పుష్కరాల పేరుతో పేదలకు నిలువు నీడ లేకుండా చేశారు. మూడు పుష్కరాల నుంచి ఉంటున్న వారిని అక్కడ నుండి తొలగించాల్సిన అవసరం ఏమి వచ్చిందో చెప్పాలి?, అది కూడా 200 మంది పోలీసులతో అర్ధరాత్రి రెండు, మూడు గంటలకు వచ్చి తొలగించాల్సిన అవసరం ఏముంది. అదే పని పట్టపగలు ఎందుకు చేయలేదు.మండపేటలో నేనేదో అరాచకాలు చేస్తున్నట్లు చెప్పడం సిగ్గుచేటు. అభివృద్ధిని నేను అడ్డుకుంటున్నానని చెప్పడం హాస్యాస్పదం. గతంలోఆస్తులు గురించి సవాల్ విసిరారు. ఇప్పటికీ నేను కట్టుబడి ఉన్నాను... ఎక్కడైనా చర్చకు సిద్ధం’ అని సవాల్ విసిరారు.‘కొండపల్లి మున్సిపాలిటీపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయాలి’ -
జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, కాకినాడ జిల్లా: జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి హత్యలో ఎమ్మెల్యే అనుచరుడి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హత్యలో ఎమ్మెల్యే అనుచరుడు కటౌట్ శ్రీను హస్తం ఉందని సతీష్రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు. కటౌట్ శ్రీను టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు. కేసు నుంచి శ్రీనును తప్పించాలని చూస్తున్నారని.. కటౌట్ శ్రీను నుంచి నాకు ప్రాణహాని ఉందని సతీష్రెడ్డి భార్య జయశ్రీ అన్నారు. ఏడాది క్రిందట జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి తో జయశ్రీకి ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం జయశ్రీ ఐదు నెలల గర్భవతి.జయశ్రీ మాట్లాడుతూ.. ’’కొద్ది నెలల క్రితం కటౌట్ శ్రీను నుంచి అతని భార్య విడాకులు తీసుకుంది. అయితే భార్య విడాకులు ఇవ్వడానికి సతీష్ రెడ్డే కారణమని కటౌట్ శ్రీను భావించాడు. నేను నా పుట్టింట్లో ఉండగా సాయికిరణ్ను వెంట బెట్టుకుని కటౌట్ శ్రీను వచ్చి సతీష్ను చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకుని సాయికిరణ్ను సతీష్ రెడ్డి కొట్టాడు. దీంతో ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్న సాయికిరణ్, సతీష్రెడ్డి కి మధ్య వివాదం నడుస్తుంది...మా ఇంట్లో అన్నం తిన్న సాయి కిరణే తన అనుచరులతో నా భర్తను కిరాతకంగా చంపాడు. అయితే ఈ హత్య చేయించింది మాత్రం కటౌట్ శ్రీనే. ఇదే విషయాన్ని పోలీసులకు చెబితే.. శ్రీను పేరు బయటకు చెప్పవద్దంటూ అతనిని తప్పిస్తున్నారు’’ అని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు.ఇదీ చదవండి: సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు? -
పెళ్లి బృందం కారు బోల్తా
ఫ నలుగురికి గాయాలు ఫ డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం ఫ అన్నవరం నుంచి పామర్రు వెళుతుండగా ఘటన దేవరపల్లి: మండలంలోని కృష్ణంపాలెం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై పెళ్లి బృందం కారు బోల్తా పడింది. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఓ కుటుంబం బుధవారం రాత్రి ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి వారి సన్నిధిలో జరిగిన వివాహానికి హాజరయ్యారు. అనంతరం, నూతన దంపతులతో కలసి రెండు కార్లలో అన్నవరం సత్యన్నారాయణస్వామి వారి సన్నిధికి వెళ్లారు. స్వామి వారి దర్శనానంతరం వధూవరులు ఓ కారులోను, వరుడి తల్లిదండ్రులు, అక్క, బావ మరో కారులోను పామర్రు బయలుదేరారు. ఈ క్రమంలో వరుడి తల్లిదండ్రులు ప్రయాణిస్తున్న కారు కృష్ణంపాలెం వద్ద అదుపు తప్పి, డివైడర్ను, సోలార్ లైటు స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హైవే అంబులెన్స్లో గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చినవెంకన్నకు స్వర్ణ, వెండి కవచాలంకరణ
ద్వారకా తిరుమల: చినవెంకన్నకు ఓ భక్తుడి కుటుంబం సమర్పించిన రూ.92 లక్షల విలువైన స్వర్ణ, వెండి కవచాలకు గురువారం శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించి, స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన వేగుంట సాంబశివరావు, సౌందర్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు ఈ కవచాలను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్లకు బుధవారం అందించిన విషయం తెలిసిందే. కవచాలున్న పళ్లేన్ని దాత సాంబశివరావు శిరస్సుపై పెట్టుకుని గురువారం ఉదయం ఆలయంలో అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ ప్రదక్షిణలు చేశారు. అనంతరం, ఆ కవచాలకు అర్చకులు పుణ్యాహవాచనం, సంప్రోక్షణ తదితర కార్యక్రమాలను ఆగమ శాస్త్రానుసారం నిర్వహించి, స్వామివారికి అలంకరించారు. దాత దంపతులకు ఆలయ డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావులు స్వామి, అమ్మవార్ల చిత్రపటం అందించారు. -
స్పెషల్ టెట్లో అసంబద్ధతలు సరి చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్పెషల్ టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్(టెట్)లో అసంబద్ధతలను వెంటనే సరి చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు గురువారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి, కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకుడు కేవీ శేఖర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల వయస్సు, కంప్యూటర్ వినియోగంలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని టెట్ పరీక్షను ఆఫ్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడు బోధిస్తున్న సబ్జెక్టు పైనే పరీక్ష నిర్వహించాలన్నారు. సంబంధం లేని అంశాలతో పరీక్షలు నిర్వహించడం అశాసీ్త్రయమన్నారు. పరీక్షలో కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ ఒకేవిధంగా న్యాయబద్ధమైన పాస్ మార్కులు నిర్ణయించాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలోనే మన రాష్ట్ర శాసనసభలో కూడా టెట్పై ప్రత్యేక తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లక్ష్మణరావు, దానియేలుబాబు, ఆర్థిక కార్యదర్శి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
జీతం లేని కాపలా
● నైట్ వాచ్మన్లకు 7 నెలలుగా అందని గౌరవ వేతనం ● ఇచ్చేదే అంతంత మాత్రం ● అందులోనూ తీరని జాప్యం ● రూ.2.86 కోట్ల మేర బకాయి ● శానిటరీ వర్కర్లకూ 3 నెలల వేతనాల పెండింగ్ ● ఆకలి కేకలు పెడుతున్న చిరుద్యోగులు సాక్షి, టాస్క్ఫోర్స్: ఆకతాయిలు, దొంగల నుంచి ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు నియమించిన నైట్ వాచ్మన్లు జీతం లేని కాపలా కాస్తున్నారు. ఇచ్చేదే అంతంత మాత్రం వేతనం కాగా, దానిని కూడా చంద్రబాబు ప్రభుత్వం 7 నెలలుగా చెల్లించడం లేదు. మరోవైపు కళ్లెం లేని గుర్రంలా నిత్యావసరాల ధరలు దౌడు తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పూట గడిచే దారి లేక ఆ కుటుంబాలు ఆకలి కేకలు పెడుతున్నాయి. 2023లో నియామకం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మన బడి నాడు–నేడు పథకం కింద కోట్లాది రూపాయలతో వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. మునుపెన్నడూ లేని రీతిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు భద్రత కల్పించడం అవసరమని భావించి, రాష్ట్రవ్యాప్తంగా 2023 ఏప్రిల్ 25న 5,378 నైట్ వాచ్మెన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. అదే ఏడాది మే 1న వీరందరూ విధుల్లో చేరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా దాదాపు 680 మంది నైట్ వాచ్మన్లు వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం నైట్ వాచ్మన్లకు 2023 మే నుంచి 2025 డిసెంబర్ వరకూ మొత్తం 32 నెలలకు వేతనాలు చెల్లించారు. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోంది. అప్పటి నుంచి జూలై నెల వరకూ నయాపైసా కూడా వీరికి చెల్లించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల చొప్పున 680 మందికి రూ.40.08 లక్షల మేర బకాయి పెట్టింది. ఈవిధంగా ఏడు నెలలకు సుమారు రూ.2.86 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. మరో నాలుగు రోజుల్లో ఆగస్టు నెల కూడా పూర్తి కానుంది. దీంతో, మొత్తం 8 నెలల వేతనాలు సుమారు రూ.3.26 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పెట్టినట్లవుతుంది. సాధారణంగా ఒక నెల వేతనం రాకపోతేనే ఉద్యోగులు ఇబ్బంది పడుతూంటారు. అటువంటిది ఇచ్చే అరకొర వేతనం కూడా ఏడు నెలలుగా ఇవ్వకపోతే తాము కుటుంబాలను ఏవిధంగా పోషించుకోవాలని నైట్ వాచ్మన్లు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలకు వస్తున్న అధికారులను తమ వేతనాలు ఎప్పుడు విడుదలవుతాయంటూ ప్రశ్నిస్తున్నారు. నెలంతా పాఠశాలను కంటికి రెప్పలా కాపాడుతున్న తమకు ఇవ్వాల్సిన రూ.6 వేలు సైతం నెలనెలా ఇవ్వకుంటే తమ పరిస్థితేం కావాలని అంటున్నారు. ఎన్నికలకు ముందు తమ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు.. ఇప్పుడు ఆ హామీ నిలబెట్టుకోకపోగా, ఇవ్వాల్సిన వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని వాపోతున్నారు. నెలల తరబడి పెండింగ్ పెడితే తాము ఏం తిని బతకాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వేతనాల కోసం ఇటీవల సీఐటీయూ ఆధ్వర్యాన నైట్ వాచ్మెన్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అలాగే రాష్ట్ర ఉన్నతాధికారులకు నైట్ వాచ్మెన్ యూనియన్ తరఫున వినతులు ఇచ్చినా వేతనాలు మాత్రం విడుదల చేయలేదు. దీంతో, అప్పులు చేసి, కుటుంబాలను పోషించుకోవలసి వస్తోందని నైట్ వాచ్మన్లో వాపోతున్నారు. పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం ఇచ్చే అరకొర వేతనాన్ని కూడా ప్రతి నెలా విడుదల చేయడం లేదు. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయి? ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిరుద్యోగులపై ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడం దుర్మార్గం. వెంటనే వారి గౌరవ వేతనాలు విడుదల చేయాలి. ఇప్పటికే పీజీఆర్ఎస్లో ఐదారుసార్లు ఫిర్యాదు చేశాం. దున్నపోతుపై వర్షం పడినట్లుగా ఉంది ప్రభుత్వం తీరు. – నూకల బలరామ్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా -
ఆటముత్యాలు
కపిలేశ్వరపురం: రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా యవనికపై గోదారమ్మ బిడ్డలు విజయకేతనం ఎగురవేస్తున్నారు. తద్వారా ఈ గడ్డ కీర్తిప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. దేశవిదేశాల్లో జరుగుతున్న వివిధ క్రీడా పోటీల్లో విజయ పరంపర కొనసాగిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకుంటున్నారు. అంతేకాదు.. తమ ప్రతిభాసంపత్తితో వివిధ క్రీడా సంఘాలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా.. కీలక పోటీలకు న్యాయనిర్ణేతలుగా కూడా వ్యవహరిస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రీడా పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. ఒలింపిక్స్ హాకీలో భారత్కు మూడు బంగారు పతకాలు సాధించిన విఖ్యాత క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతి– ఆగస్టు 29ని ఏటా జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారుల ప్రతిభను గుర్తు చేసుకుందాం పదండి.. అంతర్జాతీయ కీర్తికిరీటం అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తన సహచర క్రీడాకారుడు చిరాగ్ శెట్టితో కలిసి అంతర్జాతీయ స్థాయి పురుషుల డబుల్స్లో అనేక విజయాలు సాధించాడు. ఈ ఏడాది మే 31న సింగపూర్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో డబుల్స్ విజేతలుగా నిలిచారు. డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్–1 ర్యాంక్ సాధించిన తొలి భారతీయ జోడీగా వీరు రికార్డు సృష్టించారు. 2022 కామన్వెల్త్, 2023 ఆసియా క్రీడలు, 2023 ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లలో సాత్విక్ స్వర్ణ పతకాలు సాధించాడు. థామస్ కప్–2022 విజేత జట్టులో సభ్యుడు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు, మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాలను అందుకున్నాడు. అంతే కాదు.. అత్యంత వేగంగా బ్యాడ్మింటన్ స్మాష్ (గంటకు 565 కిలోమీటర్లు) కొట్టిన రికార్డు సాత్విక్ పేరిట ఉండటం విశేషం. ఫ సామర్లకోటకు చెందిన ప్రముఖ మారథాన్ స్విమ్మర్ గోలి శ్యామల బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి కాకినాడ తీరం వరకూ 150 కిలోమీటర్ల దూరాన్ని ఈది సరికొత్త రికార్డు సృష్టించారు. ఈమె గతంలో పాక్ స్ట్రెయిట్ను కూడా ఈదారు. వైకల్యం ఓడింది ఉమ్మడి జిల్లాలో దివ్యాంగ క్రీడాకారులు వీల్చైర్ క్రికెట్లో రాణిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 23 వరకూ ఒడిశాలో జరిగిన పోటీల్లో ఏపీ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఆ జట్టులో 8 మంది క్రీడాకారులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే కావడం మరో విశేషం. సత్తా చాటుతున్న అతివలు వివిధ క్రీడల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన అతివలు సత్తా చాటుతున్నారు. ఫ గత జూన్ 30న హైదరాబాద్లో జరిగిన 26వ రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీల్లో కాకినాడకు చెందిన తల్లీకూతుళ్లు కల్పన, తన్మయిలు పతకాలు సాధించారు. ఫ మే 16, 17 తేదీల్లో పుదుచ్చేరిలో జరిగిన సౌతిండియా జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో వర రామచంద్రపురం మండలం సోములగూడెం గిరిజన బాలికల ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు మడకం సురేఖ కాంస్య, బంధం సరిత రజత పతకాలు సాధించారు. వారిద్దరూ గత ఫిబ్రవరిలో చిత్తూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో బంగారు పతకాలు సైతం సాధించడం విశేషం. ఫ 2025 నవంబర్లో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) నిర్వహించిన 69వ జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల చరిష్మా సాయిరుత్వి ఎంపికై ంది. మరెందరో.. ఫ ఈ నెల 21 నుంచి 23 వరకూ శ్రీకాకుళంలో జరిగిన అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో కాకినాడ జిల్లా జట్టు ఓవరాల్ చాంపియన్షిప్ సాధించింది. ఫ ఏప్రిల్ 22, 23 తేదీల్లో దేవరపల్లి మండలం రామన్నపాలెంలో జరిగిన అమరావతి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ ఇన్విటేషన్ కప్ టోర్నమెంట్లో రామచంద్రపురం జట్టు విజేతగా నిలిచింది. ఫ గత ఏడాది డిసెంబర్ 28న రావులపాలెం సమీపంలో వెదిరేశ్వరంలో జరిగిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ పోటీల పురుషుల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్టు విజయబావుటా ఎగురవేసింది. ఫ 2025 సెప్టెంబర్ 27, 28 తేదీల్లో ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీల్లో తూర్పు గోదావరి జట్టు ప్రథమ స్థానలో నిలిచి, ఐదు బంగారు పతకాలు సాధించింది. ఫ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 15 వరకూ పాట్నాలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీసెస్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు ఎటపాక మండలానికి చెందిన పీఈటీలు సోడె నాగిరెడ్డి, పెనుబల్లి లక్ష్మణరావు ఎంపికయ్యారు. రేపు జాతీయ క్రీడా దినోత్సవం న్యాయ నిర్ణేతలుగా.. ఫ గత జూన్లో కోనసీమ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆలమూరు మండలం కలవచర్లకు చెందిన మార్షల్ ఆర్ట్స్ గ్రాండ్ మాస్టర్ టి.అబ్బులు ఎంపికయ్యారు. ఫ గత జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకూ ఆగ్రాలో జరిగిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలకు ఈదరపల్లికి చెందిన అడపా శ్రీనివాస్ న్యాయనిర్ణేతగా నియమితులయ్యారు. ఫ గత ఏడాది ఆగస్టు 26 నుంచి 31 వరకూ పుణేలో జరిగిన ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు అమలాపురానికి చెందిన పీడీ పాయసం శ్రీనివాసరావు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఫ గత ఏడాది సెప్టెంబర్లో రంజీ క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా అంబాజీపేటకు చెందిన నిమ్మకాయల ఎస్ఎస్ఎస్ శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఫ గోదారి నేలపై రాణిస్తున్న క్రీడాకారులు ఫ అంతర్జాతీయ వేదికపై దుమ్ము రేపుతున్న సాత్విక్ ఫ మరెందరో ఆటగాళ్లకు ఉమ్మడి ‘తూర్పు’ వేదిక -
శుక్రవారం శ్రీ 28 శ్రీ ఆగస్టు శ్రీ 2026
అనుమతి లేకుండా... తాళ్లపూడి మండలం గజ్జరంలో ఎటువంటి అనుమతులూ తీసుకోకుండా 2.5 ఎకరాల వ్యవసాయ భూమిలో సిద్ధం చేస్తున్న లే అవుట్ ఇది. రుడా అనుమతులు లేని ఈ లే అవుట్ను ఎత్తు చేసేందుకు రాత్రి వేళల్లో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓ లే అవుట్ వేసి, ప్లాట్లు విక్రయించేశారు. వాటిని కొనుగోలు చేసిన వారికి అనుమతులు లభించక నేటికీ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు. తాళ్లపూడిలోనూ వ్యవసాయ భూములను లే అవుట్లుగా మార్చేసి సొమ్ము చేసుకుంటున్నారు. జరిమానా విధించినా.. కోరుకొండ మండలం జంబూపట్నంలో 516ఈ జాతీయ రహదారిని ఆనుకుని సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో వేసిన ఈ లే అవుట్కు అనుమతులు లేవు. అక్రమంగా మట్టి తరలించి ఎత్తు చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో రెండు నెలల క్రితం మైనింగ్ అధికారులు ఆ భూమి యజమానికి జరిమానా విధించారు. అనంతరం అధికారులను ప్రసన్నం చేసుకుని అనుమతులు తెచ్చుకున్నారని తెలుస్తోంది. ఈ మండలంలోని జంబూపట్నం, పశ్చిమ గానుగూడెంలో 516ఈ హైవేని ఆనుకుని అధికారం అండతో అక్రమ లే అవుట్లు వేస్తున్నారు. 8 -
నిధుల దుర్వినియోగంపై విచారణ
దేవరపల్లి: స్థానిక పంచాయతీ కార్యాలయంలో గతంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై కొవ్వూరు డివిజినల్ పంచాయతీ అధికారి (డీఎల్పీఓ) ఐవీ రాఘవులు గురువారం విచారణ నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఉత్తర్వులతో ఆయన ఈ విచారణ జరిపారు. 2013–18 మధ్య పంచాయతీ నిధులు దుర్వినియోగమైనట్లు ఏలూరుకు చెందిన గోరెల్ల నారాయణరాజు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించి, సంబంధిత వ్యక్తులను విచారించి, అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ డీపీఓను ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాఘవులు ఈ విచారణ నిర్వహించారు. విచారణకు హాజరు కావాలంటూ ఎనిమిది మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ, 2013–18 మధ్య రూ.7 కోట్ల పంచాయతీ నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనికి సంబంధించిన రికార్డులు సక్రమంగా లేనందున సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని నారాయణరాజు హైకోర్టులో ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ నేపథ్యంలో చేపట్టిన ఈ విచారణకు హాజరైన వారి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకుని, కలెక్టర్, డీపీఓలకు నివేదిక అందజేస్తానని చెప్పారు. పుష్కరాల పనులు వేగవంతం చేయాలి రాజమహేంద్రవరం సిటీ: వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు సుమారు 10 నెలలు మాత్రమే సమయమున్నందున సంబంధిత పనులు వేగవంతం చేయాలని రాజమండ్రి ఎంపీ, దిశ కమిటీ చైర్పర్సన్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పుష్కరాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో కనెక్టివిటీ రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను పుష్కరాల నాటికి పూర్తి చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుపై సమీక్షించేందుకు దిశ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తుల సీఈఓలు వీవీవీఎస్ లక్ష్మణరావు, పి.జగదంబ, ఆయా జిల్లాల అధికారులు పాల్గొన్నారు. శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధికి భక్తుల తాకిడి పిఠాపురం: దత్తాత్రేయుని అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభస్వామి జన్మస్థలం కావడంతో పిఠాపురంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడికొచ్చి దత్తాత్రేయునికి రాఖీలు కట్టడం ఆనవాయితీగా ఉంది. శుక్రవారం రాఖీ పౌర్ణమి అయినప్పటికీ గురువారం నుంచే ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిగా భక్తులు తరలిరావడంతో దత్తాత్రేయుని ఆలయాలు కిటకిటలాడాయి. ఈ ఏడాది సుమారు 30 వేల మంది మహారాష్ట్రీయులు తరలిరావడం విశేషం. పిఠాపురంలో పేరొందిన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శుక్రవారం నిర్వహించే రాఖీ పౌర్ణమి వేడుకలకు భారీ ఏర్పాట్లు చేసినట్టు ఆలయ ఈఓ ఆర్.సౌజన్య తెలిపారు. గోపూజలు, దత్త హోమాలు, పల్లకీ సేవలు వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం నాటికి మరింత మంది వచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. పాదగయ క్షేత్రంలో వెలసిన దత్తాత్రేయ స్వామి వారికి కూడా గురువారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. -
మమతానురాగాల వెన్నెల కురవాలని..
రాజమహేంద్రవరం రూరల్/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/తాళ్లపూడి: అనుబంధాలు, ఆప్యాయతల మేళవింపుగా.. మమతానురాగాలకు నెలవుగా.. ఏటా శ్రావణ పౌర్ణమి నాడు నిర్వహించుకునే సోదరీసోదరుల ఆత్మీయ పండగ రక్షాబంధన్. కష్టసుఖాల్లో తమకు అనుక్షణం తోడుగా ఉండాలని కోరుకుంటూ సోదరులకు అక్కచెల్లెళ్లు ఈ సందర్భంగా రాఖీలు (రక్షాబంధన్) కట్టి స్వీట్లు తినిపిస్తారు. అందుకే దీనిని రాఖీ పౌర్ణమిగా కూడా దీనికి పిలుస్తారు. ఈ అన్నాచెల్లెళ్ల వేడుకను శుక్రవారం కోలాహలంగా నిర్వహించుకునేందుకు అక్కచెల్లెళ్లు ఏర్పాట్లు చేసుకున్నారు. బాలికలు, యువతులు, మహిళలు అందరూ నాలుగు రోజుల ముందు నుంచే రాఖీల కొనుగోలు మొదలు పెట్టారు. ఇందుకు అనుగుణంగానే రాజమహేంద్రవరం దేవీచౌక్, కంబాల చెరువు, గోకవరం బస్టాండ్ వంటి సెంటర్లతో పాటు జిల్లాలోని కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, చాగల్లు మార్కెట్లలో వ్యాపారులు జోరుగా రాఖీలు విక్రయిస్తున్నారు. దీంతో, మార్కెట్లలో సందడి నెలకొంది. ఆకట్టుకునే డిజైన్లలో.. చూడగానే కట్టిపడేసేలా మార్కెట్లో వివిధ డిజైన్లలో రాఖీలు లభిస్తున్నాయి. చెమ్కీలతో చేసినవి, పువ్వులతో తీర్చిదిద్దినవి, ఫొటోలు, కార్టూన్ బొమ్మలు ముద్రించినవి, ముత్యాలు, రుద్రాక్షలు, చందనం, రంగురంగుల పూసల వంటి వాటితో తయారు చేసినవి.. ఇలా విభిన్నమైన రాఖీలను వ్యాపారులు విక్రయిస్తున్నారు. అంతేకాదు.. బ్రాస్లెట్ ఆకారంలో ఉన్న రోల్డ్గోల్డ్ రాఖీలు, సిల్వర్ రాఖీలు, ట్రెండింగ్ రాఖీల వంటివి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా ఫొటో రాఖీలు, మగ్గులపై ముద్రించిన రాఖీలు ఈ ఏడాది సందడి చేస్తున్నాయి. ఫొటో రాఖీలైతే ఆఫర్ పెట్టి రూ.499, నుంచి రూ.600 వరకూ విక్రయిస్తున్నారు. మగ్గులైతే రూ.500కు విక్రయిస్తున్నారు. ఫ నేడు రాఖీ పౌర్ణమి ఫ వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్న రాఖీలు ఆన్లైన్లో రాఖీలు గతంలో అక్కచెల్లెళ్లు సుదూర ప్రాంతాల్లో ఉన్న అన్నదమ్ములకు కొరియర్, పోస్టల్ ద్వారా వారం రోజుల ముందు నుంచే రాఖీలు పంపించేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అమెజాన్, జొమేటో, బ్లింకిట్ తదితర యాప్ల ద్వారా ఆర్డర్ చేస్తే అరగంటలోపే ఆ రాఖీలు సోదరుల ఇళ్లకు చేరుతున్నాయి. అంతేకాగు.. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో సైతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భగవంతుడు ఏర్పరచిన మార్గం మనిషిని ప్రశాంతంగా ఉంచేందుకు ఈశ్వరుడు ఎన్నో మార్గాలను చూపెట్టారు. అందులో ఎంతో ప్రాముఖ్యత ఉన్న రక్షాబంధన్ మహోత్సవం కూడా ఒకటి. కేవలం తోడబుట్టిన వారికి మాత్రమే కాకుండా సృష్టిలోని ప్రతి వ్యక్తినీ సోదర భావంతో చూస్తూ, అందరికీ రాఖీ కట్టడం ద్వారా కొత్త బంధాలను బ్రహ్మకుమారీలు ఏర్పరచుకుంటున్నారు. – సిస్టర్ పార్వతి, బ్రహ్మకుమారీ సంస్థ, ఆర్యాపురం, రాజమహేంద్రవరం -
4 పరిషత్లుగా ఉమ్మడి తూర్పు!
ఉమ్మడి జెడ్పీ ఆఖరి ‘భేటీ’ నేడేకాకినాడలోని జెడ్పీ కార్యాలయం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఆఖరి సమావేశం చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన అనంతరం నాలుగేళ్లుగా జెడ్పీ ఉమ్మడిగానే కొనసాగింది. ప్రస్తుత పాలక మండలి గడువు సెప్టెంబర్ 10తో ముగుస్తుంది. అక్టోబర్లో జెడ్పీ ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ ప్రతిపాదించడం, అంతకు ముందే రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా ఉండటంతో ఈ జెడ్పీని నాలుగు భాగాలుగా విభజించనున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, రంపచోడవరం ప్రధాన కేంద్రాలుగా ఈ జిల్లా పరిషత్ విడిపోనుంది. చరిత్రలో విశిష్ట స్థానం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్కు చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. అప్పట్లో జిల్లా బోర్డు చైర్మన్గా మల్లిపూడి పళ్లంరాజు సుదీర్ఘ కాలం పని చేశారు. మరోవైపు స్వాతంత్య్ర సమరంలోనూ పాల్గొన్నారు. ఈ జెడ్పీ చైర్మన్గా పని చేసిన ఎస్బీవీకే సత్యనారాయణరావు కేంద్ర మంత్రి అయ్యారు. జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్గా ఎదిగారు. వంగా గీత జెడ్పీ కూడా చైర్పర్సన్గా పనిచేసి రాజ్యసభలో ప్రవేశించారు. బొడ్డు భాస్కర రామారావు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పని చేశారు. రాష్ట్ర స్థాయి పదవులు సైతం అలంకరించారు. చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ జెడ్పీ చైర్మన్గా పని చేసి, అనంతరం వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్ర మంత్రిగా పని చేశారు. జిల్లా బోర్డు నుంచి జెడ్పీగా మార్పు స్వాతంత్య్రం తరువాత దేశంలో స్థానిక స్వపరిపాలనకు కొత్త రూపం ఇవ్వాలనే ఆలోచన బలపడింది. 1959లో జిల్లా పరిషత్ చట్టం రావడంతో దాని ఆధారంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాకూ జెడ్పీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 1959 డిసెంబరు ఒకటో తేదీ నుంచి జిల్లా పరిషత్తులు ఏర్పాటయ్యాయి. దీంతో పాత జిల్లా బోర్డు వ్యవస్థకు బదులు మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు పునాది పడింది. గ్రామ, సమితి, జిల్లా పరిషత్ స్థాయిలుగా ఏర్పడిన ఈ వ్యవస్థ అనంతర కాలంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లుగా రూపాంతరం చెందింది. తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఆవిర్భావం 1959లోనే జరిగింది. 2022 ఏప్రిల్ 4న కొత్త జిల్లాలు అమలులోకి వచ్చాయి. అంతకు ఆరు నెలల ముందే జెడ్పీ ఎన్నికలు జరగడంతో పదవీ కాలం ముగిసేంత వరకూ విభజనకు ఆగాల్సి వచ్చింది. -
కై లాసగిరి.. ఇదేం కిరికిరి!
అంబాజీపేట కొబ్బరి మార్కెట్ కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 24,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 సీతానగరం: స్థానిక కై లాసగిరి ర్యాంపు వద్ద అడ్డూ అదుపూ లేకుండా ఇసుక అక్రమ దందా సాగుతోంది. నిబంధనలను, పర్యావరణ చట్టాలను గోదాట్లో తొక్కి మరీ అక్రమార్కులు యథేచ్ఛగా అనధికారిక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. కళ్లెదుటే టన్నుల కొద్దీ ఇసుకను కై లాసగిరి దగ్గర నిల్వ చేసి, ట్రాక్టర్లపై విచ్చలవిడిగా తరలించుకుపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం గుర్తించిన అధికారిక ర్యాంపుల నుంచే మాత్రమే ట్రాక్టర్లపై ఇసుక రవాణా జరగాలి. కానీ, కై లాసగిరి ర్యాంపులో అనధికారికంగా భారీ స్థాయిలో ఇసుక నిల్వలు ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లలో తరలించి, అధిక ధరలకు విక్రయిస్తూ లక్షలాది రూపాయలు దిగమింగుతున్నారు. మితిమీరిన లోడుతో దుమ్ము రేపుతూ, వేగంగా రాకపోకలు సాగిస్తున్న ఈ ట్రాక్టర్ల ధాటికి గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. వీటివలన ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. సీతానగరం కై లాసగిరి ర్యాంపు నుంచి బహిరంగంగానే ఇసుక అక్రమ దందా భారీ స్థాయిలో సాగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీని వెనుక ఉన్న గుట్టు ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, కై లాసగిరి అనధికారిక ర్యాంపుపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాహనాలను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ దర్జాగా ఇసుక అక్రమ దందా ఫ రేయింబవళ్లు విచ్చలవిడిగా రవాణా ఫ పట్టించుకోని అధికారులు ప్రజలు తిరగబడతారు జాగ్రత్త కై లాసగిరి ర్యాంపు నుంచి ట్రాక్టర్లపై విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. రేయింబవళ్లు ట్రాక్టర్లపై ఇసుక, బొండు మట్టిని పలు గ్రామాలకు తరలిస్తున్నారు. తమ ఎదుటే ఈ ట్రాక్టర్లు వెళ్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత విచ్చలవిడిగా దందా నడుపుతున్నారు. అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్రజలు తిరగపడతారు జాగ్రత్త. – పెదపాటి రమేష్బాబు (డాక్టర్ బాబు), వైఎస్సార్ సీపీ వలంటీర్ల విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, సీతానగరం 0000719672-000001-CANARA BANK 18.00x12.00 CANARA BANK -
ఫ లక్షణంగా గాజులతో అలంకరణ
గౌతమీ గోదావరి తీరాన కడియపులంకలో ఉన్న శ్రీ హరిహర మహా క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ అపర్ణాదేవి అమ్మవారిని.. శ్రావణ పౌర్ణమి సందర్భంగా లక్ష గాజులతో గురువారం ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ, ప్రధానార్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యాన ఈ అలంకరణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యాన భక్తులకు క్షీరాన్న ప్రసాదం వితరణ చేశారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. క్షేత్రంలో కొలువైయున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద కూడా ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యాన మహా అన్నదానం నిర్వహించారు. – కడియం -
తగ్గుతున్న గోదా‘వడి’
ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి క్రమేపీ తగ్గుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరిలో బుధవారం వరద ఉరవడి పెరిగిన విషయం తెలిసిందే. ఇది క్రమంగా గురువారం సాయంత్రానికి తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం కాటన్ బ్యారేజీ నుంచి 5.17 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. సాయంత్రానికి వరద తగ్గడంతో మిగులు జలాల విడుదలను 4,72,218 క్యూసెక్కులకు తగ్గించారు. ఎగువన భద్రాచలం వద్ద 27.40 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులుగా గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి. ఓటర్ల జాబితా త్వరగా సిద్ధం చేయాలి నిడదవోలు: త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయాలని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహారావు ఆదేశించారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియను గురువారం ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వచ్చే నెల మూడో తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురించాలని, అలసత్వం లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి, టౌన్ ప్లానింగ్ అధికారి ఎస్.సుప్రియ, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. -
అలా జరగకపోయి ఉంటే.. సాధిక్ నెక్ట్స్ టార్గెట్ ఎవరంటే?
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: తన వియ్యంకుడు ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై భాస్కర్రెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు జగదీశ్వర్రెడ్డి హత్యతో సాధిక్ ఖాన్ పాత్రతో పాటు తన కోడలు ప్రమేయం కూడా ఉందని భాస్కర్రెడ్డి ఆరోపించారు.నూకరాజు కుటుంబం ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన జరగకపోయి ఉంటే సాధిక్ ఖాన్ తర్వాత టార్గెట్ తామేనన్న భాస్కర్రెడ్డి.. ఇప్పటివరకు ప్రభుత్వం తన మనవడికి ఎటువంటి సెక్యూరిటీ కల్పించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుణ్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశామన్న భాస్కర్రెడ్డి.. తన కొడుకును తన నుంచి కోడలు దూరం చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు.తన కుమారుడికి అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆయనతో పాటు రూమ్లో ఉంటానంటే కోడలే వద్దని వారించిందన్నారు. సాధిక్ ఖాన్ ఒక సైకో.. అతడి నుంచి మా కుటుంబానికి రక్షణ కావాలి. నా కొడుకుని పొట్టన పెట్టుకుని మా కుటుంబాన్ని నాశనం చేసిన సాధిక్ ఖాన్ను ఉరితీయాలి. మా మనవడికి న్యాయం జరగాలి’’ అని భాస్కర్రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: సాధిక్కు ఆ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది? -
శ్రీపాదుడే రక్షగా..!
పిఠాపురం: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయుని జన్మస్థలం పిఠాపురంలో భక్తులు పోటెత్తుతున్నారు. స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పాదగయ క్షేత్రం, అనఘాదత్త క్షేత్రం, గోపాల్బాబా ఆశ్రమాలకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా తదితర ప్రాంతాల నుంచి ఏటా రెండు లక్షలకు పైగా భక్తులు రాఖీ పౌర్ణమికి వస్తుంటారు. గురు, శుక్ర వారాల్లో పౌర్ణమి ఉండడంతో ఇప్పటికే మరాఠీ భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. మరాఠీలదే ముఖ్యపాత్ర మహారాష్ట్ర అంటే ఆధ్యాత్మికంగా మనకు గుర్తుకు వచ్చేది షిర్డీ సాయి ఆలయం. దేశం నలుమూలల నుంచి భక్తులు అక్కడకు వెళ్తుంటే ఆ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తమ ఇలవేల్పు శ్రీపాద శ్రీ వల్లభుని దర్శనానికి పిఠాపురం సంస్థానానికి వస్తుంటారు. అత్రి అనసూయల వర ప్రసాదుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారంగా దత్తాత్రేయుడు జన్మించినట్టు చరిత్ర చెబుతోంది. సర్వ వ్యాపితుడై దిక్కులే అంబరములుగా ఉన్న స్వామి వారిని దిగంబరుడిగా సంబోధిస్తారని భక్తులు చెప్తుంటారు. దత్తాత్రేయుడి ప్రధమావతారం శ్రీపాద శ్రీవల్లభుడిగా నడయాడిన ప్రాంతం కాబట్టి ఈ ఆలయానికి శ్రీపాద శ్రీవల్లభ సంస్థానమని పేరు వచ్చినట్టు పూర్వికులు చెప్తారు. దీంతో మరాఠీ భక్తులు దత్తాత్రేయుడిని తమ సోదరుడిగా భావించి ఆనవాయితీగా రాఖీలు కడుతుంటారు. రాఖీ పౌర్ణమికి విస్తృత ఏర్పాట్లు దత్తునికి రక్షా బంధనం చేయడానికి వస్తున్న మహారాష్ట్ర భక్తులు పిఠాపురంలో నేటి నుంచి రాఖీ పౌర్ణమి ఉత్సవాలు -
రేపు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
సామర్లకోట: పంచారామ క్షేత్రంలో కొన్నేళ్లుగా శ్రావణ శుక్రవారాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం, సెప్టెంబరు 4వ తేదీలలో సామూహిక వ్రతాలకు ఏర్పాట్లు చేసినట్టు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఈ వ్రతాల్లో పాల్గొనే భక్తులు శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆలయానికి చేరుకోవాలని కోరారు. ఆలయంలోని నంది మండపం వద్ద సామూహిక వ్రతాలలో పాల్గొనే వారికి దాతలు, దేవస్థానం తరఫున ప్లేట్లు, కొబ్బరి కాయ, అరటి పండ్లు, పువ్వులు, ఆకులు, చెక్కలు, అమ్మవారి ఫొటో అందజేయనున్నట్టు తెలిపారు. వాటిని తీసుకుని భక్తులు మొదటి అంతస్తులో కూర్చోవలసి ఉంటుందన్నారు. మొదటి అంతస్తు నిండితే దిగువ ప్రాకారంలో భక్తులకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. పూజ ప్రారంభమయ్యే ముందు నూనె, ప్రసాదం, గాజులు, వరలక్ష్మీ రూపులు ఇవ్వనున్నట్టు తెలిపారు. పూజా కార్యక్రమం ప్రారంభమైన తరువాత పూజా సామగ్రి అందే అవకాశం ఉండదని, దీనిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ఆలయానికి చేరుకోవాలని సూచించారు. ఆలయ మొదటి అంతస్తుతో పాటు దిగువ భాగంలో ఉన్న భక్తులకు అర్చకులు తెలియజేసే పూజా విధానం అందరికీ వినిపించేలా మైక్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వ్రతాల్లో పాల్గొనే భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రొయ్యల మేత లారీ బోల్తాసామర్లకోట: స్థానిక కాకినాడ రోడ్డులో వీకే రాయపురం సమీపంలో బుధవారం రొయ్యల మేత లోడు లారీ బోల్తా పడింది. పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని రైస్మిల్లు నుంచి రాజోలు వెళ్తున్న లారీ తెల్లవారు జామున కురిసిన వర్షానికి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో వ్యాన్ డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో సామర్లకోట–కాకినాడ రోడ్డు సింగిల్ రోడ్డు కావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు ఆధ్వర్యంలో లారీని క్రేన్ సాయంతో తొలగించి లోడును రోడ్డు మార్జిన్లోకి చేర్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. విద్యుదాఘాతంతో లైన్మన్ మృతి కాకినాడ క్రైం: విధి నిర్వహణలో విద్యుదాఘాతానికి గురై ఓ లైన్మన్ మృతి చెందాడు. కాజులూరు మండలం చాకిరేవుమెరకకు చెందిన కొప్పిశెట్టి ప్రసాద్ (32) రామారావుపేటలో ఉన్న సెక్షన్ డి–1లో జూనియర్ లైన్మన్గా పనిచేస్తున్నాడు. బుధవారం స్థానిక ల్యాండ్ మార్క్ షోరూం నుంచి కార్యాలయానికి విద్యుత్ అంతరాయంపై ఓ ఫిర్యాదు అందింది. దీంతో ప్రసాద్ వెళ్లాడు. మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. తీగలు పరిశీలిస్తుండగా, విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరణానికి కారణాలను పరిశీలిస్తున్నామని, విద్యుత్ సరఫరా నిలిపిన తర్వాతే స్తంభం ఎక్కినా ప్రమాదం వాటిల్లిందని శాఖ అధికారులు అంటున్నారు. శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చామన్నారు. ల్యాండ్మార్క్ వ్యాపార సంస్థ ట్రాన్స్ఫార్మర్ను సిమెంట్ దిమ్మపై పెట్టకుండా నేలపై ఏర్పాటు చేయడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబసభ్యులు వాపోయారు. ప్రసాద్కు వివాహం కాగా ఆరేళ్ల కుమార్తె ఉంది. ఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
పడక కష్టాలకు చెక్
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు రాత్రి సమయంలో విధులు నిర్వహించిన తరువాత నిద్రించేందుకు ఏర్పాటు చేసిన రెస్ట్ రూమ్లో పడుతున్న ఇబ్బందులపై జిల్లా ప్రజారవాణా అధికారి సత్యనారాయణ మూర్తి దృష్టి సారించారు. బుధవారం ‘సాక్షి’లో వచ్చిన ‘పడక కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన కష్టాలపై సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. రావులపాలెం డిపోకు రెండు బెడ్లు కేటాయించాలని ఆదేశాలిచ్చారు. ఈ సందర్బంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం, రాజోలు, రామచంద్రపురం, రావులపాలెం, గోకవరం, రాజమహేంద్రవరం డిపోల నైట్ హాల్ట్ బస్సులు ఆధారంగా బెడ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతూ డిపో మేనేజర్ కె.మాధవ్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ రెస్ట్ రూమ్ పరిశీలనకు సూపర్వైజర్ను ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ఉన్న 30 బెడ్లను అవసరాలను గుర్తించి డ్రైవర్, కండక్టర్లకు కేటాయించినట్టు తెలిపారు. రాజమహేంద్రవరం డిపోకు సంబంధించి, ఆలస్యంగా వచ్చిన వారు, తెల్లవారు జామున విధులకు వెళ్లే వారికి 6 బెడ్లు కేటాయించామన్నారు. అలాగే పాత డిస్పెన్సరీ భవనాన్ని మరో 30 పడకలతో విశ్రాంత భవనంగా సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే నెలాఖరుకు వీటిని సిద్ధం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.డిపోల వారీగా కేటాయింపులు ఇలా.. డిపో బెడ్లు అమలాపురం 6 రాజోలు 6 రామచంద్రపురం 6 రావులపాలెం 2 గోకవరం 4 రాజమహేంద్రవరం 6 మొత్తం 30 ఆర్టీసీ రెస్ట్ రూమ్లను పరిశీలించిన డీపీటీఓ మూర్తి రావులపాలెం డిపోకు రెండు బెడ్ల కేటాయింపు త్వరలో మరో 30 పడకలతో విశ్రాంతి గదులు -
అనుబంధాల రాఖీ
● తోబుట్టువుల అనురాగాలకు సూచిక ● కిటకిటలాడుతున్న రాఖీ, స్వీట్ దుకాణాలు ● రేపు రాఖీ పండుగ రాయవరం: రాఖీ పౌర్ణమి ఉత్సవానికి ఇటు తోబుట్టువులు.. వరసైన అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు సిద్ధమయ్యారు. శుక్రవారం రాఖీ పండగకు అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ముల అభిరుచికి తగ్గట్టుగా రాఖీల ఎంపికలో తలమునకలైతే.. వెల కట్టలేని తమ అనురాగాన్ని ఏమిచ్చి తూచగలమన్న భావనతో తమ అక్కాచెల్లెళ్లకు ఏమిచ్చి వారి ముఖారవిందాల్లో చిరునవ్వులు.. ఆనంద బాష్పాలు చూడాలా అని అన్నదమ్ములు ఆతృత పడుతున్నారు. మహాలక్ష్మీ స్వరూపంగా.. ఇంటి ఆడ పడుచును మహాలక్ష్మీ స్వరూపంగా భావించే భారత సంస్కృతిలో సుఖ సంతోషాల్లోనే కాకుండా కష్ట నష్టాల్లోనూ నేనున్నానని తోడుండే అన్నదమ్ములు రక్షణగా నిలిచే బంధమే రక్షా బంధన్. జంధ్యాల పౌర్ణమిగా శ్రావణమాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పర్వదినాన్ని జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తుంటారు. తమిళనాడులో పూనూల్పర్వగా, కేరళలో ఆవని ఆవిట్టంగా పిలుస్తుంటారు. ఉత్తరాదిలో రక్షాబంధన్గా ఈ రోజును పిలవడం పరిపాటి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం (ఓం శాంతి) ప్రతినిధులు రాఖీ పండుగను ఆధ్యాత్మిక విశిష్టత గలదిగా భావిస్తారు. తమ కార్యాలయాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులకు కూడా పండుగ రోజు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. మార్కెట్కు రాఖీల కళ మార్కెట్లలో వివిధ వర్ణాల.. డిజైన్లలో రాఖీలు సందడి చేస్తున్నాయి. సాధారణ రంగురంగుల దారాలకు ఏదో చిన్న పెండెంట్ వంటిది ముడి వేసినది మొదలు బంగారంతో తయారు చేసిన రాఖీల వరకు విక్రయానికి సిద్ధమయ్యాయి. ఫ్యాన్సీ దుకాణాలు మొదలుకొని బంగారం దుకాణాల వరకు వీటి విక్రయాలకు సమాయత్తమయ్యాయి. బ్రాస్లెట్లను తలపించేవి కొన్ని.. వెండి లాకెట్లతో, రుద్రాక్షలతో, ప్లాస్టిక్ పూలతో విక్రయిస్తున్నారు. అదే సమయంలో స్వీట్ దుకాణాలు, అనుబంధ మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.●కష్ట సుఖాల్లో తోడుండే సోదరుడు నాకు అన్నదమ్ములు లేరు. ఏటా మా కజిన్స్కు రాఖీ కడతాను. కష్టసుఖాల్లో తోడు నిలిచి, మన శ్రేయస్సు కోరుకునే వారే సోదరులు. రాఖీ పండుగ వస్తోందంటే వారే నాకు రాఖీ కట్టడానికి ఆతృతపడుతుంటారు. ఎంత దూరాన ఉన్నా ఇంటికి వచ్చి రాఖీ కట్టి ఆశీర్వదించి వెళ్తారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటాను. – పందిరి శ్రావ్య, ఇంజినీరింగ్ విద్యార్థి, పెద్దాడ, పెదపూడి మండలం అన్నంటే ప్రాణం ఏటా మా అన్నకు రాఖీ కడతాను. ఎంత దూరాన ఉన్నా నా దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్తాడు. అన్ని పండగల్లో అన్నాచెల్లెల గురించి తెలియజేసే పండుగ ఇదే. ఎంత వయసు వచ్చినా అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ఏదీ సాటిరాదు. – పంపన నాగ మల్లీశ్వరి, ఏడిద సావరం, మండపేట మండలం ఆన్లైన్ రక్షాబంధన్ కాలం మారడంతో పాటు రక్షా బంధన్ తీరు కూడా మారింది. విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే వాటిని కట్టుకుని తోబుట్టువులకు కానుకలు పంపే సంప్రదాయం చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకునే వెసులుబాటూ నేడు అందుబాటులో ఉంది. ప్రేమాప్యాయతలు పంచుకునే తీరు మారినా సంప్రదాయం మాత్ర చెక్కు చెదరకుండా కలకాలం సాగుతోంది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 24,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
తొలి రాఖీ కట్టేది కన్యకా పరమేశ్వరి..
కన్యాకా పరమేశ్వరికి సోదరుడైన శ్రీపాదుడికి అమ్మవారు పౌర్ణమి నాడు స్వయంగా వచ్చి రాఖీ కట్టినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే ఈ రోజున అమ్మవారి తరఫున ఆలయ అర్చకులు, ముత్తైదువలు రాఖీ తెచ్చి సమర్పిస్తారు. అనంతరం భక్తులు రాఖీలు కట్టడం ప్రారంభిస్తారు. స్వామి వారి విగ్రహాలతో పాటు ఔదంబర వృక్షానికి సైతం వారు రాఖీలు కడుతుంటారు. ఆలయానికి వచ్చే పురుషులకు సైతం మరాఠీ మహిళలు స్వయంగా రాఖీలు కట్టి తమ సోదరభావాన్ని వ్యక్తం చేస్తుంటారు. – ద్విభాష్యం సుబ్రహ్మణ్యశర్మ, ఆలయ అర్చకుడు, శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పిఠాపురం తోబుట్టువుకు బహుమతిగా సారె రాఖీ పౌర్ణమి రోజున కన్యాకాపరమేశ్వరి అమ్మవారు శ్రీపాదుడికి రాఖీ కట్టి ఆశీర్వచనాలు అందజేసిన సందర్భంగా శ్రీపాదుడి తరఫున సంస్థానం నుంచి ఏటా అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీగా వస్తోంది. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల భక్తుల కంటే 90 శాతం మంది మరాఠీ భక్తులే ఇక్కడికి వచ్చి అన్ని సేవల్లోను పాల్గొంటారు. శ్రీపాదుడు 1320లో ఇక్కడ జన్మించినట్లు గురు చరిత్రలో చెప్పబడింది. – ఆర్ సౌజన్య, ఈఓ, శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, పిఠాపురం ● -
రేయాన్ష్ను ప్రభుత్వం ఆదుకోవాలి
బోటక్లబ్: సాధిక్ ఖాన్ అకృత్యాల వల్ల ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబంలో బతికి బయటపడిన ఆయన మనవడు రేయాన్ష్ కార్తికేయరెడ్డిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఆ దుర్ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన చిన్నారికి ప్రభుత్వ తగిన రక్షణ కల్పించాలన్నారు. పదేళ్ల వయసులో ఆ చిన్నారికి తల్లిదండ్రులు దూరమైన నేపథ్యంలో వారి కుటుంబ ఆస్తులు అక్రమార్కుల చేతికి చిక్కకుండా కాపాడాలని ఆయన కోరారు. అతడి మేనమామ యాక్సిడెంట్లో మరణించటం, తండ్రి తరఫు తాతా నానమ్మలు వృద్ధులు కావడంతో అతడికి ప్రభుత్వం గార్డియన్గా వ్యవహరించాలని కోరారు. సాధిక్ ఖాన్ వెనుక ఒక ముఠా కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల పరిసరాల్లో ఉన్నట్లు కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలపైనా లోతైన విచారణ చేయాలని కోరారు. సాధిక్ ఖాన్ కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు చోడిశెట్టి రమేష్బాబు, దువ్వూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
రీజినల్ గేమ్స్లో లేహ్యశ్రీ రికార్డు
రాజానగరం: మండలం దివాన్చెరువుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని లాలం లేహ్యశ్రీ కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐఎస్సీఈ) ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్, రావులపాలెంలో నిర్వహించిన రీజినల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 2026లో 9 పతకాలను అందుకుని రికార్డు నెలకొల్పింది. అండర్–14 విభాగంలో జరిగిన ఈ పోటీలలో రోలర్ స్కేటింగ్లో రెండు స్వర్ణం, రెండు రజతం, అథ్లెటిక్స్లో మూడు రజతం, రెండు కాంస్య పతకాలను కై వసం చేసుకుంది. గత ఏడాది ఇదే విభాగంలో స్కేటింగ్లో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఆ విద్యార్థిని ఈ ఏడాది రెండు విభిన్న క్రీడలలో అత్యుత్తమ ప్రతిభను కనబరచి ఏకంగా 9 పతకాలను అందుకుంది. జాతీయ స్థాయిలో అక్టోబర్ 7 నుంచి 9 వరకు ముంబైలో జరిగే రోలర్ స్కేటింగ్ నేషనల్స్, 13 నుంచి 15 వరకు హైదరాబాద్లో జరిగే అథ్లెటిక్స్ నేషనల్స్కు సిద్ధమవుతున్న ఆమె తన లక్ష్యం ఒలింపిక్స్ స్వర్ణమని అంటోంది. బాల్యం నుంచి క్రీడలపై ఆసక్తి లేహ్యశ్రీకి బాల్యం నుంచి క్రీడలంటే ఎంతో అసక్తి. స్కేటింగ్ అంటే ఎంతో మక్కువ. ఈ క్రమంలో గత ఏడాది ముంబైలో జరిగిన స్కేటింగ్ నేషనల్స్లోనూ, ఆగ్రాలో జరిగిన రోల్ బాల్ నేషనల్స్లోనూ పాల్గొని జాతీయ స్థాయిలో ప్రతిభను చాటింది. స్కేటింగ్ విభాగంలో రీజినల్, జోనల్ స్థాయిలో రెండు రజత పతకాలను సాధించింది. రోల్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో కాంస్య పతకాన్ని అందుకుంది. క్రీడలతో పాటు సామాజిక సృహను చాటుతూ ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా మే 8 న నిర్వహించిన 5 కె రన్ పాల్గొని ప్రధమ స్థానంలో నిలిచింది. 9 పతకాలతో సత్తా చాటిన వైనం -
ముస్లింల శాంతి ర్యాలీ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సర్వ మానవ మహోపకారి, దైవం పంపిన చివరి ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం నగరంలో వేలాదిగా ముస్లింలు బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అన్ని సున్నీ మసీదుల ఇమామ్లు, కమిటీ సభ్యులు, ముస్లిం ప్రముఖుల ఆధ్వర్యాన ఆజాద్ చౌక్ సెంటర్ నుంచి అప్సర థియేటర్, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్డు, పుష్కర ఘాట్, దేవీచౌక్, కంబాల చెరువు, మల్లయ్యపేట, క్వారీ సెంటర్, రామాలయం జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా దానవాయిపేట మసీదు వరకూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన విందులో సుమారు 3 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. దారి పొడవునా మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలను వినిపిస్తూ, ధార్మిక నినాదాలు చేస్తూ ఆద్యంతం ఆహ్లాదకరంగా ముందుకు నడిచారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మొహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ, గత 40 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సంవత్సరం మహమ్మద్ ప్రవక్త జన్మించి 1,500 సంవత్సరాలు దాటిందన్నారు. ఆయన చెప్పిన ప్రవచనాలు, చూపిన ఆచరణలు ఇప్పుడున్న వారికే కాక భవిష్యత్తు మానవాళికి మార్గదర్శకమని అన్నారు. కార్యక్రమంలో రాయల్ మసీద్ ఇమామ్ అబ్దుల్ హఫీజ్ ఖాన్, లాల్ ఖాన్, డిల్లు, మల్లయ్యపేట మసీద్ అధ్యక్షులు బషీర్ భాయ్, రబ్బాని, మొహమ్మద్ షబ్బీర్, మొహమ్మద్ బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ వరద గోదారి
సముద్రంలోకి 4.63 లక్షల క్యూసెక్కుల విడుదల ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి బుధవారం క్రమేపీ పెరుగుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద మిగులు జలాల విడుదలను పెంచారు. బుధవారం రాత్రి బ్యారేజీ నుంచి 4,63,583 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉపనదులైన ఇంద్రావతి, శబరి నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అలాగే, తాలిపేరు నుంచి వరద నీరు దిగువకు రావడంతో బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి నీటి ఉధృతి పెరిగింది. గురువారం సాయంత్రం వరకూ నీటి ఉధృతి పెరిగి అనంతరం, తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 33.80 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నమోదైంది. ప్రియాంక కేసులో ఫోరెన్సిక్ బృందం పరిశీలన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. దీనిలో భాగంగా విజయవాడ నుంచి ముగ్గురితో కూడిన ఫోరెన్సిక్ బృందం రాజమహేంద్రవరం వచ్చింది. ప్రియాంక మృతి ఘటనకు సంబంధించి పోలీసులు సేకరించిన ఆధారాలన్నింటినీ పరిశీలించింది. సీసీ కెమెరా ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఘటన జరిగిన ప్రసాదిత్య మాల్ వద్దకు వెళ్లి, కేసులో సూచించిన ప్రాంతం, జరిగిన సంఘటనకు సంబంధించి ఆనవాళ్లను పరిశీలించారు. నిందితులు ఉపయోగించిన కారును కూడా పరిశీలించారు. ఈ కేసులో పొందుపర్చిన ప్రాంతాలను ఫోరెన్సిక్ బృందం మంగళ, బుధవారాల్లో పరిశీలించి, వెళ్లింది. దీనిపై నివేదికను పోలీసు శాఖ ఉన్నతాధికారులకు అందజేయనుంది. సమన్వయంతోనే సాధిక్ అరెస్టు కాకినాడ క్రైం: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసులో ముప్పుతిప్పలు పెట్టిన నిందితుడు షేక్ సాధిక్ ఖాన్ను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. పోలీసుల చేజింగ్ తీరు థ్రిల్లర్ చిత్రాన్ని తలపించింది. ఇందులో పోలీసుల నెట్వర్కింగ్తో సహా వారి సమన్వయం ఔరా అనిపించింది. నిందితుడి కోసం సుమారు 70 మంది పోలీసులు ఐదు రాష్ట్రాల్లో జల్లెడ పడుతుంటే చివరకు మహారాష్ట్రలో గుర్తించారు. సరిగ్గా అక్కడ గస్తీ కాస్తున్న జిల్లా, స్థానిక పోలీసులు సమీపించేసరికి ఒకేచోట ఉండడం సేఫ్ కాదని భావించిన సాధిక్ అక్కడి నుంచి మీరట్కు పయనమయ్యాడు. అక్కడి నుంచి అతడు కేరళ పారిపోయే యోచనలో ఉన్నాడని ఎస్పీ బిందుమాధవ్కు అధికారులు వివరించారు. దీంతో, సాధిక్ను అరెస్టు చేసి తీసుకు రావాలంటూ తుని రూరల్ సీఐ గీతా రామకృష్ణ, ఇంద్రపాలెం ఎస్సై ఎం.వీరబాబు, కానిస్టేబుల్ మొయిన్లను ఎస్పీ ఆదేశించి విమానంలో పంపించారు. వారు సాధిక్ స్నేహితుడు అబ్బాస్ ఇంటి వద్దకు వెళ్లి కాపు కాయగా అక్కడ నిందితుడు పట్టుబడ్డాడు. విమానంలో వెళ్లకపోయి ఉంటే సాధిక్ కేరళ పరారయ్యేవాడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘గొడవ రెండు కుటుంబాలది, రెండు మతాలది కాదు’ సీనియర్ న్యాయవాది జవహర్ అలీ కాకినాడ క్రైం: సాధిక్ ఘటన రెండు కుటుంబాలకు చెందినదే తప్ప రెండు మతాలది కాదని కాకినాడకు చెందిన సీనియర్ న్యాయవాది జవహర్ అలీ అన్నారు. కుటుంబ సభ్యులు కేసు చేయమని కోరారని, తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ములాఖత్తో సాధిక్ను కలిసింది తానేనని, కేసు నేనే చేస్తున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని, తానింకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. సౌజన్యతో కలిసి ఆమె భర్తను హతమార్చడంలో భాగస్వామి కావడం, నలుగురు కుటుంబసభ్యుల్ని ఆత్మహత్యలకు పురిగొల్పడం అనే అభియోగాలు సాధిక్పై ఉన్నాయన్నారు. న్యాయవాదులు ఎవరూ సాధిక్ తరఫున వాదించొద్దన్న ఎంపి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అలీ తెలిపారు. ఓ కేసు చేయాలా వద్దా అన్నది న్యాయవాది ఇష్టమని జవహర్ అలీ స్పష్టం చేశారు. -
ఎన్నాళ్లీ కుట్టుకథలు!
● జిల్లాలో కుట్టు, అల్లికల శిక్షణకు 12 వేల మంది దరఖాస్తు ● వారిలో సుమారు 3 వేల మందికి శిక్షణ పూర్తి ● ఏడాదవుతున్నా కుట్టు మెషీన్లు ఇవ్వని సర్కారు ● 3,593 యూనిట్లకు రూ.7.58 కోట్ల కేటాయింపు ● స్వయం ఉపాధి కోసం ఆశగా మహిళల నిరీక్షణ సాక్షి, రాజమహేంద్రవరం: సొంత కాళ్లపై నిలబడాలనే ఆశతో.. స్వయం ఉపాధి పొంది కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపనతో ముందడుగు వేసిన మహిళలకు నిరాశే ఎదురవుతోంది. కుట్టు, అల్లికల్లో ఉచితంగా శిక్షణ, అనంతరం ఉచితంగా కుట్టు మెషీన్లు ఇస్తామని గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ, జిల్లాలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఏడాదవుతున్నా ఇస్తామన్న కుట్టు మెషీన్లు, సర్టిఫికెట్లను ప్రభుత్వం ఇప్పటి వరకూ ఇవ్వడం లేదు. దీంతో, స్వయం ఉపాధి దూరమై ఆ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేటాయింపులు కాగితాలకే పరిమితమా? జిల్లాలోని బీసీ, కాపు, ఆర్థికంగా వెనుకబడిన (ఈడబ్ల్యూఎస్) వర్గాల మహిళల స్వయం ఉపాధి కోసం ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమానికి ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్లో శ్రీకారం చుట్టింది. జిల్లాకు 3,593 యూనిట్లు కేటాయించింది. దీనికి అవసరమైన నిధులు రూ.7.58 కోట్లు కూడా కేటాయించింది. ఈ నిధులను ఒక్కొక్కరికి రూ.21,798 వంతున ఖర్చు చేయాలని భావించారు. ఆ మొత్తంలో శిక్షణకు రూ.15,559, మిగిలిన రూ.6,199తో కుట్టు మెషీన్లు అందించాలని నిర్ణయించారు. శిక్షణలో 75 శాతం హాజరు ఉన్నవారికి ఉచితంగా కుట్టు మెషీన్లు ఇస్తామని ప్రకటించింది. జిల్లా వ్యాప్తంగా ఈ శిక్షణకు 12,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి మొత్తం 25 కేంద్రాల్లో శిక్షణ ఇచ్చారు. వీరిలో 2,904 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం, అవసరమైన పరీక్ష కూడా రాశారు. అంతే.. అక్కడితో తమకు సంబంధం లేనట్లు ప్రభుత్వం, బీసీ కార్పొరేషన్ అధికారులు మిన్నకుండిపోయారు. తమకు ఇస్తామన్న సర్టిఫికెట్లు, ఉచిత కుట్టు మెషీన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఆ మహిళలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ప్రభుత్వం గొప్పగా చేసిన కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని వాపోతున్నారు. అసలు నిధులు పూర్తిగా మంజూరయ్యాయా.. మంజూరైతే మెషీన్లు ఎందుకు పంపిణీ చేయడం లేదో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇదే విషయం అధికారుల వద్ద ప్రస్తావిస్తే సమాధానం దాటవేస్తున్నారు. సర్టిఫికెట్లు లేక.. రుణాలు అందక.. ఇటు మెషీన్లు రాకపోగా, అటు సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవడం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలను మరింత నిరాశకు గురిచేస్తోంది. శిక్షణ పొందినట్లు ధ్రువీకరణ పత్రం ఉంటే ఇతరత్రా అవకాశాలను కూడా వినియోగించుకునే వారమని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం ఇప్పిస్తామంటూ అధికారులు చెప్పిన మాట కూడా ఇప్పటి వరకూ నెరవేరలేదు. పోనీ, సొంతంగా రుణాలకు దరఖాస్తు చేసుకుందామన్నా సర్టిఫికెట్లు కూడా అందక ఇబ్బందిగా ఉందని ఆ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్దే ఉపాధి పొందవచ్చనే ఉద్దేశంతో కుట్టు, అల్లికల శిక్షణ పూర్తి చేసుకున్నామని.. సొంతంగా కుట్టు మెషీన్ కొనుగోలు చేసే స్తోమత లేక ఖాళీగా ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. వెంటనే అందరికీ సర్టిఫికెట్లతో పాటు కుట్టు మెషీన్లు కూడా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో కుట్టు శిక్షణ తీరిదీ... మహిళల మంజూరైన వచ్చిన శిక్షణ పూర్తి కేటగిరీ యూనిట్లు దరఖాస్తులు చేసుకున్న వారు బీసీ 1,456 7,392 1,615 కాపు 802 3,839 951ఈడబ్ల్యూఎస్ 1,335 887 338 మొత్తం 3,593 12,118 2,904 -
తూలుతూ..తోలుతూ..
సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ఏటా ప్రమాదాలు పెరుగుతున్నా కొంత మంది వాహనదారుల తీరు మాత్రం మారడం లేదు. జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలతో పాటు జాతీయ రహదారిని ఆనుకుని మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సాయంత్రం మొదలుకొని రాత్రి వేళల్లో మద్యం దుకాణాలు, బార్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. పూటుగా మద్యం తాగి, వాహనాలు నడుపుతున్న కొందరు తమతో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మద్యం మత్తులో వాహనాన్ని అదుపులో ఉంచలేకపోవడం, అతి వేగంగా నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఈ ప్రమాదాలకు అతి వేగం ప్రధాన కారణమైతే... దాని వెనుక మద్యం మత్తు కూడా ఉండటం అత్యంత ఆందోళన కలిగించే అంశం. ఇటీవల రాజమహేంద్రవరం ప్రసాదిత్య మాల్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొని వైద్య విద్యార్థిని ప్రియాంక మరణానికి కారకులయ్యారు. వారు సైతం ఆ సమయంలో మద్యం మత్తులో ఉండటం గమనార్హం. జిల్లావ్యాప్తంగా మద్యం తాగి రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనిఖీలు పెంచాల్సిందే.. మద్యం మత్తులో వాహనాలు నడపడాన్ని అరికట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే కీలక ప్రాంతాలు, ప్రధాన రహదారులు, రాజమహేంద్రవరం నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తనిఖీలు క్రమం తప్పకుండా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల తనిఖీలు నిర్వహించినా అవి తూతూమంత్రంగానే సాగుతున్నాయనే విమర్శలున్నాయి. ప్రధానంగా రాత్రి వేళల్లో మద్యం దుకాణాలు, బార్లు ఉన్న ప్రాంతాలతో పాటు నగర శివారు రహదారులు, జాతీయ రహదారులకు అనుసంధానమయ్యే మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా మీదుగా సాగే జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మన జిల్లాలోని రాజానగరం నుంచి దేవరపల్లి మధ్య జాతీయ రహదారిపై అత్యధికంగా 46 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. ఈ నేపథ్యంలో హైవేకి ఇరువైపులా, దీనికి అనుసంధానమయ్యే రోడ్ల వద్ద మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు, నిబంధనల ప్రకారం పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్కు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ‘మద్యం సేవించి వాహనం నడపొద్దు’ అనే నినాదం కేవలం పోలీసులు నిర్వహించే తనిఖీల వరకే పరిమితం కాకుండా.. ప్రతి వాహనదారుడి బాధ్యతగా మారాలి. లేదంటే తూలుతూ.. తోలుతూ.. సాగుతున్న ఈ ప్రయాణాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. తనిఖీలు ముమ్మరం చేస్తాం జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తాం. తనిఖీల్లో పట్టుబడిన ఎవ్వరినీ వదలడం లేదు. తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే జరిమానాతో పాటు జైలుశిక్షలు పడేలా కేసులు నమోదు చేస్తున్నాం. ఈ ఏడాది ఇప్పటి వరకూ 43 మందిని జైలుకు పంపాం. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే నష్టాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీకాంత్, ట్రాఫిక్ డీఎస్పీ, రాజమహేంద్రవరం జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులిలా.. సంవత్సరం కేసులు జరిమానా 2024 494 రూ.27.5 లక్షలు 2025 1,596 రూ.1.09 కోట్లు 2026 569 రూ.44.1 లక్షలు బహిరంగ మద్యపానంపై కేసుల వివరాలు సంవత్సరం కేసులు 2024 8,235 2025 13,136 2026 8,107 మద్యం మత్తులోనే రోడ్ల పైకి వాహనదారులు ఏటా ప్రమాదాలు పెరుగుతున్నా మారని తీరు జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు -
చినవెంకన్నకు రూ.92 లక్షల ఆభరణాల సమర్పణ
ద్వారకా తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడేనికి చెందిన వేగుంట సాంబశివరావు, సౌందర్యలక్ష్మి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.92 లక్షల విలువైన బంగారు, వెండి కవచాలను బుధవారం సమర్పించారు. మొత్తం 584 గ్రాముల బంగారం, 507 గ్రాముల వెండితో తయారు చేయించిన కవచాలను ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఈఓ వేండ్ర త్రినాథరావులకు అందజేశారు. హస్తాలతో వక్షస్థల భాగాన్ని ఈ కవచాలపై రూపొందించారు. కార్యక్రమంలో ఈఈ డీవీ భాస్కర్, దాత కుటుంబ సభ్యులు చేవూరి లక్ష్మీనారాయణ, చేవూరి ఈశ్వర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రత లేని బతుకులు
● దశాబ్దాల సేవకు గుర్తింపు కరవు ● కనీస వేతనానికి నోచని వీబీ జీ రామ్ జీ సిబ్బంది ● ఇతర సమస్యలూ పరిష్కరించాలని డిమాండ్ రాయవరం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా తమ పరిస్థితి ఉందని వీబీ జీ రామ్ జీ (ఉపాధి హామీ పథకం) ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ఈ పథకం అమలైంది. దీని పేరును కేంద్రం ఇటీవల వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ్)గా మార్చింది. పేరైతే మార్చింది కానీ, ఈ పథకం అమలులో కీలకమైన ఫీల్డ్ అసిస్టెంట్లు మాత్రం చాలీచాలని జీతాలు, భద్రత లేని విధులతో నలిగిపోతూనే ఉన్నారు. రెండు దశాబ్దాలుగా లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తున్నా తమను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల కోసం నిరీక్షణే.. ప్రతి నెలా మొదటి రోజున వేతనాలు చెల్లించాలనే నిబంధన వీరి విషయంలో అమలు కావడం లేదు. ఒక్కోసారి ఐదారు నెలల వరకూ ఎదురు చూపులు తప్పడం లేదు. జూన్ నెల వేతనం కోసం కాంట్రాక్టు, ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. తమపై సవతి తల్లి ప్రేమ చూపడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,300 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, జూనియర్ ఇంజినీర్లు వీబీ జీ రామ్ జీ పథకంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కాకుండా క్షేత్ర స్థాయిలో 13 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 50 మంది వరకూ ఏపీఓలు, అలాగే ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు, జేఈలు, 150 మంది వరకూ కంప్యూటర్ ఆపరేటర్లు, సుమారు 200 మంది టెక్నికల్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరితో పాటు ఉమ్మడి జిల్లాలో సుమారు 1,200 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. గ్రేడ్ ఫిక్సేషన్లో అన్యాయం ఏపీఓలకు రెండేళ్ల క్రితం గ్రేడ్ ఫిక్సేషన్ చేయగా, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు పదేళ్ల క్రితమే ఈ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జూనియర్ ఇంజినీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో పాటు చిన్న క్యాడర్ ఉద్యోగులకు ఇప్పటి వరకూ గ్రేడ్ ఫిక్సేషన్ చేయలేదు. దీంతో, సంబంధిత ఉద్యోగులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరి పరిస్థితి మరీ దారుణం ఇక ఫీల్డ్ అసిస్టెంట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు నిర్వహిస్తూ, ఉపాధి కూలీలతో పనులు చేయించడంలో వీరిది కీలక పాత్ర. అటువంటి వీరు నెలకు రూ.10 వేలు ఫిక్స్డ్ వేతనంతో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నారు. వీరి వేతనం రూ.1,200తో ప్రారంభమై, ప్రస్తుతం రూ.10 వేలకు చేరింది. అయితే, బేసిక్ వేతనం రూ.5,740 మాత్రమే లభిస్తోంది. మిగిలిన మొత్తం ఇతర అలవెన్సులుగా చెల్లిస్తున్నారు. వేతన శ్రామికులకు 7,500కు పైగా పని దినాలు కల్పించిన ఫీల్డ్ అసిస్టెంట్లకు బేసిక్ వేతనంతో కలిపి రూ.9,300 వస్తుంది. 15 వేల పనిదినాలు కల్పిస్తే గౌరవ వేతనంతో కలిపి రూ.12 వేలు వస్తుంది. ప్రస్తుతం ఉన్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా తమ వేతనాలు మాత్రం పెరగడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు. వేతనాలు పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇవీ ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్లు చట్ట ప్రకారం రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలి. అక్రమ తొలగింపులు, బెదిరింపులు ఆపాలి. ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించకుండా పై అధికారులకు మాదిరిగానే ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీ(ఎఫ్టీఈ )గా గుర్తించాలి. ఉద్యోగ భద్రత కల్పించి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. వేతన శ్రమ జీవులకు పనిదినాలు కల్పించే టార్గెట్ బేస్డ్ విధానం వలన అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అభద్రతా భావానికి గురి చేస్తున్న ఈ విధానాన్ని రద్దు చేయాలి. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్ఎంఎంఎస్)లో సాంకేతిక లోపాలను సరి చేయాలి. కనీస వేతనం చెల్లించాలి వీబీ జీ రామ్ జీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల పైనే క్షేత్ర స్థాయిలో బాధ్యత అధికంగా ఉంటుంది. 2007 నుంచి నేటి వరకూ వీరికి కనీస వేతన చట్టాన్ని వర్తింపజేయకపోవడం దారుణం. ఉద్యోగ భద్రత లేని విధుల్లో ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. – మేడిది పరంధామయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ (సీఐటీయూ), అమలాపురం హామీ నిలుపుకోవాలి ప్రస్తుత ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనాన్ని అమలు చేయాలి. లేకుంటే భవిష్యత్తులో సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల కోడ్ రాక ముందే ప్రభుత్వం మా డిమాండ్లను నెరవేర్చాలి. లేకుంటే అన్ని సంఘాలనూ కలుపుకొని సమ్మె చేసేందుకు సిద్ధమవుతాం. – కోడెల ప్రకాష్, ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ (సీఐటీయూ) తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు -
రామచంద్రపురంలో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: రామచంద్రపురంలో దారుణం జరిగింది. భర్తను భార్య పొత్రం రాయితో కొట్టి హత్య చేసింది. భార్య తంగేటి ఉమాదేవి చేతిలో భర్త తంగేటి ఎల్లారావు హత్యకు గురయ్యాడు. భార్యపై భర్త అనుమానం పెంచుకోవడంతో భార్యభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు.నిందితురాలు ఉమాదేవిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదటి భార్య మృతి చెందడంతో ఉమాదేవిని ఎల్లారావు రెండో వివాహం చేసుకున్నాడు. వృత్తి రీత్యా వంట పనులు చేసుకుని జీవించే ఎల్లారావుకు భార్యపై అనుమానం కలగడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నెల 25న మద్యం సేవించి వచ్చి భార్యతో ఎల్లారావు ఘర్షణకు దిగాడు.దీంతో భార్య పొత్రం రాయితో కొట్టడంతో భర్త మృతి చెందాడు. హతుడు సోదరుడు ఇచ్చిన పిర్యాదు మేరకు ఉమాదేవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లారావు హత్యలో ఇతరుల ప్రమేయం ఉందా? అనే దానిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఏఈ నూకరాజు కుటుంబం కేసులో మరో మలుపు
సాక్షి, కాకినాడ జిల్లా: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు సాధిక్ వేధింపులు కారణం కాదని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డిని సాధిక్ చంపలేదన్నారు. ‘‘సౌజన్య రెండు సార్లు మా ఇంటికొచ్చింది. సాధిక్ను పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. ఈ ప్రతిపాదనకు మా కుటుంబం ఒప్పుకోలేదు. జగదీశ్వరరెడ్డి మరణించాక తనను పెళ్లి చేసుకోవాలని సౌజన్య.. సాధిక్ను ఒత్తిడి చేసింది’’ అంటూ సాధిక్ ఖాన్ తల్లి చెప్పుకొచ్చారు.‘‘ఈ ఏడాది ఫిబ్రవరి 14న సౌజన్య ఇంటికి రమ్మని సాధిక్ను పిలిచింది. అక్కడ సాధిక్పై జగదీశ్వర్రెడ్డి అతని మనుషులు దాడి చేసి బంధించారు. దీంతో వంటగదిలో కత్తితో బెదిరించి సాధిక్ అక్కడ నుండి పారిపోయాడు. జగదీశ్వరరెడ్డితో పెళ్లి కాకపొతే సౌజన్యను సాధిక్ ఇచ్చి వివాహం చేసేవాడినని నూకరాజు మా ఇంటికి వచ్చి చెప్పాడు. ఈ రిలేషనల్ మంచిది కాదని సాధిక్ను మందలించాను. తన భర్త పట్టించుకోవడం లేదని సాధిక్తో సౌజన్య రిలేషన్ నడిపింది. సౌజన్య కొడుకు సాధిక్ను అబ్బు అని.. తన తండ్రిని ఇడియట్ అని పిలిచేవాడు. రోజు ఫోన్లో మా అబ్బాయి చెప్పే కథలు విని సౌజన్య కొడుకు పడుకునేవాడు.‘‘మా ఇంటికి వచ్చి తెలుగు ఖురాన్, బుర్కా కావాలని సౌజన్య అడిగింది. చనిపోయిన రోజు సాయంత్రం 5:30కి సాధిక్కు సౌజన్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. తన స్టూడెంట్స్ కేరళలో ఈవెంట్స్ వెళ్లాలని.. రావడం కుదరదని చెప్పి సాధిక్ అకాడమీకి వెళ్ళిపోయాడు. నూకరాజు, జగదీశ్వర రెడ్డి ఆస్తులు, బంగారం మా వద్ద లేదు. మా కుటుంబం బ్యాంక్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పోలీసులకు ఇచ్చేశాము.’’ అని సాధిక్ ఖాన్ తల్లి నూర్జహాన్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: 6 ఏళ్లకే ఈ బాలుడు ‘అభిజీత్ దీప్కే’లా అయిపోయాడు.. -
ఇంటి చోరీ కేసులో నిందితుడి అరెస్టు
రావులపాలెం: దొంగతనాల నియంత్రణకు చేపట్టిన దర్యాప్తులో భాగంగా ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు పోలీసులు అరెస్టు చేశారు. రావులపాలెం టౌన్ సీఐ జి.రమేష్బాబు కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం మెర్లపాలేనికి చెందిన మిద్దే పార్వతి ఇంట్లో గత నెల 24న దొంగతనం జరిగింది. పార్వతి తన చిన్న కుమారుడి ఇంటికి బొబ్బిలి వెళ్లారు. అదే సమయంలో ఆమె ఇంట్లోని 60 కాసులు బంగారు, 500 గ్రాముల వెండి వస్తువులతో పాటు రూ.3 లక్షల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆత్రేయపురం ఎస్సై కె.రాము కేసు నమోదు చేయగా.. సీఐ రమేష్బాబు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వచ్చిన సమాచారం మేరకు ర్యాలి గ్రామంలోని రామాలయం వద్ద ఆలమూరు మండలం జొన్నాడకు చెందిన దాసరి మహేష్ అనే యువకుడిని మంగళవారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 451.476 గ్రాముల బంగారు, 493.10 గ్రాముల వెండి వస్తువులతో పాటు రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రావులపాలెం కొత్త కాలనీ సమీపంలోని చిన్నవారిపాలెం వద్ద తాత్కాలికంగా నివా సం ఉంటున్నట్లు పోలీ సులు గుర్తించారు. -
పడక కష్టాలు
పగలు, రాత్రి అనే తేడా లేకుండా వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు రాత్రి వేళ కాసింత విశ్రాంతి కరువవుతోంది. డ్యూటీ ముగిసిన తర్వాత కంటి నిండా నిద్రపోవడానికి విశ్రాంతి గదికి వెళ్తే.. అధికారులు కనీసం పడకలు కూడా కేటాయించకపోవడంతో నానా ఇబ్బందులూ పడుతున్నారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈ దుస్థితి నెలకొంది. రాజమహేంద్రవరం సిటీ: జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్లో రాత్రి వేళ డ్యూటీలు దిగిన డ్రైవర్లు, కండక్టర్లకు ఏర్పాటు చేసిన రెస్ట్ రూము నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. దీంతో, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా వివిధ డిపోల నుంచి నైట్ హాల్ట్ బస్సులకు వస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని రామచంద్రపురం, అమలాపురం, రాజోలు, గోకవరం, రావులపాలెం డిపోల నుంచి రాజమహేంద్రవరానికి నైట్ హాల్ట్ బస్సులు వస్తూంటాయి. వీటి సిబ్బంది రాత్రి వేళ నిద్రించేందుకు ఇక్కడ 30 పడకలతో షెల్టర్ (క్రూ రెస్ట్ రూము) ఏర్పాటు చేశారు. అయితే, ఆయా డిపోల వారీగా పడకల కేటాయింపుతో పాటు దీని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వస్తున్న నైట్ హాల్ట్ బస్సుల సిబ్బంది నానా అగచాట్లూ పడుతున్నారు. ఇష్టానుసారం కేటాయింపు ఈ నైట్ హాల్ట్ షెల్టర్లో పడకలను ఇష్టానుసారం కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోని తుని, కాకినాడ, ఏలేశ్వరం డిపోలకు సంబంధించి నైట్ హాల్ట్ బస్సులు లేకపోవడంతో వాటికి పడకలు కేటాయించలేదు. ఫ రాజమహేంద్రవరం డిపో సిబ్బందికి ఈ షెల్టర్లో ఏకంగా 9 పడకలు కేటాయించడం విచిత్రం. వాస్తవానికి ఈ డిపో సిబ్బంది స్థానికంగా నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నైట్ హాల్ట్ షెల్టర్ ఎంతమాత్రం అవసరం లేదు. కానీ, ఆ విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. ఫ అమలాపురం, రాజోలు డిపోల నుంచి చెరో రెండు నైట్ హాల్ట్ బస్సులు రాజమహేంద్రవరం వస్తున్నాయి. దీని ప్రకారం ఈ డిపోలకు నాలుగేసి చొప్పున పడకలు కేటాయిస్తే చాలు. కానీ, ఒక్కో డిపోకు ఆరేసి కేటాయించారు. ఫ గోకవరం డిపో నుంచి రెండు నైట్ హాల్ట్ బస్సులు వస్తూండగా.. వీటి సిబ్బందికి 4 పడకలు చాలు. కానీ, 5 కేటాయించారు. ఫ రావులపాలెం డిపో నుంచి కూడా రెండు నైట్ హాల్ట్ బస్సులు రాజమహేంద్రవరం వస్తున్నాయి. ఈ బస్సులలోని సిబ్బందికి కూడా 4 పడకలు కేటాయించాలి. కానీ, ఒక్క బెడ్ కూడా ఇవ్వకపోవడం విచిత్రం. దీనిపై ఆ డిపో డ్రైవరు, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైట్ హాల్ట్ బస్సులు ఎన్ని వస్తున్నాయి, ఎంత మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉంటున్నారనే అంశాన్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా బెడ్లు కేటాయించారని విమర్శిస్తున్నారు. కనీస సౌకర్యాలు మృగ్యం నైట్ హాల్ట్ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లకు ఈ షెల్టర్లో కనీస సౌకర్యాలు కూడా కరువవుతున్నాయి. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. అలాగే, బెడ్లపై దుప్పట్లు, తలగడలు కూడా లేవు. నైట్ షెల్టర్లో ఎవరు ఏవిధంగా వ్యవహరిస్తున్నారనే విషయాన్ని పట్టించుకున్నవారే లేరు. అవసరం లేకపోయినా ఈ షెల్టర్లో ఫ్యాన్లు నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటున్నాయి. బెడ్లపై డ్రైవర్లు, కండక్టర్లు లేనప్పటికీ ఏ ఒక్కరూ ఫ్యాన్లు ఆఫ్ చేయడం లేదు. మరోవైపు స్థానిక సిబ్బంది కొందరు మధ్యాహ్న సమయంలో మద్యపాన సేవనానికి నైట్ షెల్టర్ను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేనందువల్లనే ఈ పరిస్థితి నెలకొందని డ్రైవర్, కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి, పరిస్థితిని చక్కదిద్దాలని, డిపోల వారీగా అవసరం మేరకు బెడ్లు కేటాయించాలని డ్రైవర్లు, కండక్టర్లు కోరుతున్నారు. మా డిపోకు బెడ్లు కేటాయించండి సార్ రావులపాలెం డిపో నుంచి రెండు బస్సులు రాజమహేంద్రవరంలో నైట్ హాల్ట్ చేస్తున్నాయి. వాటి సిబ్బంది అవసరమైన 4 బెడ్లు కేటాయించకపోవడంతో రాత్రి వేళ ఇబ్బందులు పడాల్సి వస్తోంది. డ్యూటీ దిగిన తర్వాత విశ్రాంతి తీసుకుందామని ఖాళీగా ఉన్న బెడ్లపై పడుకుంటే, రాత్రి వేళ ఎవరో ఒకరు వచ్చి మమ్మల్ని నిద్ర లేపి బయటకు పొమ్మంటున్నారు. ఆపరేషన్లు జరిగాయని, కింద పడుకోవడానికి ఇబ్బందిగా ఉందని, బెడ్లు కేటాయించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా రావులపాలెం డిపో డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి రోజూ రెండు బెడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. – నాగరాజు, డ్రైవర్, రావులపాలెం డిపో డిపోల వారీగా పడకలు ఇష్టానుసారం కేటాయించారిలా.. డిపో నైట్ హాల్ట్ బస్సులు బెడ్స్ రాజమహేంద్రవరం 0 9 రామచంద్రపురం 4 4 అమలాపురం 2 6రాజోలు 2 6 గోకవరం 2 5రావులపాలెం 2 0 ఫ ఆర్టీసీ రెస్ట్ రూములో ఇష్టారాజ్యంగా పడకల కేటాయింపు ఫ స్థానిక సిబ్బందికి అధిక సంఖ్యలో బెడ్లు ఫ రావులపాలెం డిపో సిబ్బందికి 4 అవసరం ఫ ఒక్కటీ కేటాయించని అధికారులు ఫ రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్లో నైట్ హాల్ట్ డ్రైవర్లు, కండక్టర్లకు ఇబ్బందులు -
టెట్లో నిబంధనలు సడలించాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో నిబంధనలు సడలించాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు అర్హత మార్కులు తగ్గించాలని ఏపీ యూటీఎఫ్ జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) కె.వాసుదేవరావుకు ఆయన కార్యాలయంలో ఆ సంఘ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం సెక్షన్23(1)ను సవరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఆఫ్లైన్లో టెట్ నిర్వహించాలన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బుధవారం నుంచి 30వ తేదీ వరకూ బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, సెప్టెంబర్ 3న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈవీవీఎస్ఎస్ఆర్ ప్రసాద్, కార్యదర్శి ఎ.షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
బరితెగించిన ఇసుక మాఫియా
సీతానగరం: ఇసుక మాఫియా బరితెగించింది. సీతానగరంలోని అనధికార కై లాసగిరి ర్యాపు నుంచి ఇసుక, బొండుమట్టిని ట్రాక్టర్లపై అక్రమంగా తరలించుకుపోతోంది. ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ పొందకుండా.. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కై లాసగిరి రోడ్డు నుంచి అక్రమ రవాణాకు ఇసుకాసురులు తెగబడుతున్నారు. మట్టి కలిసిన నిషిద్ధ బొండు ఇసుకను ట్రాక్టర్లలో బహిరంగంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖల పర్యవేక్షణ కొరవడటంతో అక్రమార్కులకు కాసుల వర్షం కురుస్తోంది. పరిమితికి మించిన ఇసుక లోడుతో గ్రామాల్లో వేగంగా దూసుకుపోతున్న ట్రాక్టర్ల ధాటికి రోడ్డు తీవ్రంగా దెబ్బ తింటోంది. పాదచారులు, వాహనచోదకులు ప్రాణాలు గుప్పెట్లో పట్టుకుని ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అనధికార ర్యాంపును సీజ్ చేసి, ఇసుక, బొండు మట్టి అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
● అక్కడికీ.. ఇక్కడికీ తేడా లేదు
కేరళకు, కోనసీమకు పెద్ద తేడా లేదు. అక్కడి పచ్చదనం ఇలానే ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చి 20 ఏళ్లు పైబడింది. ఇక్కడే స్థిరపడ్డాను. కోనసీమలోనే ఓణం జరుపుకొంటున్నా. మా సొంత ప్రాంతంలోనే ఈ పండగ చేసుకుంటున్నామనే అనుభూతి ఉంది. – కేకే బీజూ కుమార్, కొల్లాం ●● ఇక్కడ సంక్రాంతిలా.. మాకు ఓణం గోదావరి జిల్లావాసులకు సంక్రాంతి ఎలాంటిదో.. మా కేరళ వాసులకు ఓణం అలాంటిది. ఇది ఈ పండగ మా మలయాళ సంస్కృతికి అద్దం పడుతుంది. పండగ రాకతో మా కేరళలో ప్రతి ఇల్లూ ఆనందంతో నిండిపోతుంది. – విపిన్ థామస్, వయనాడ్ ●● సద్య మాకు ఆనవాయితీ ఓణం అంటేనే పూక్కళం, ఓనసద్య. రంగురంగుల పూలతో ముగ్గులు వేయడం, అరటి ఆకులో 20కి పైగా వంటకాలతో సద్య తయారు చేసి, కుటుంబమంతా కలిసి భోజనం చేయడం ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. – రాణిచంద్ర● -
ఒక్కరే గురువు.. రాకుంటే సెలవు!
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వ నిర్వాకంతో నాణ్యత లేని బ్యాగులు, చాలీచాలని బూట్లు, స్కూళ్లలో వసతులు లేక ఇప్పటికే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విద్యార్థి దశలో కీలకమైన ప్రాథమిక పాఠశాలల్లో మెజార్టీ శాతం ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుపుతున్నారు. ఆ ఒక్కరే బోధనేతర పనులు కూడా చక్కబెట్టుకోవాల్సి రావడంతో బోధన ముందుకు సాగడం లేదు. ఏ కారణం చేతనైనా ఆ ఉపాధ్యాయుడు విధులకు రాకపోతే పాఠశాలకు ఆ రోజు సెలవే. జిల్లాలోని వందలాది పాఠశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ పాఠశాలలను గొప్పగా మార్చేశామని చెబుతున్న విద్యా శాఖ మంత్రి లోకేశ్ చెబుతూండగా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోధనేతర విధులతోనే సరి ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధనేతర విధులు మరింత ఇబ్బందికరంగా మారాయి. పాఠశాలకు వెళ్లగానే విద్యార్థులకు హాజరు వేయడం.. ఆ తర్వాత మధ్యాహ్న భోజనం సమయంలో ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయడం.. కోడిగుడ్లు, చిక్కీలు, బియ్యం వస్తున్నాయో లేదో చూసుకోవడం వంటి పనుల్లో ఉపాధ్యాయుడు తలమునకలైనప్పుడు విద్యార్థులు ఖాళీగానే ఉండాల్సి వస్తోంది. కొన్నిచోట్ల రెండు, కొన్నిచోట్ల ఐదు తరగతుల్లో వివిధ సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సి వస్తోంది. దీంతో, బోధన సవ్యంగా సాగక, సిలబస్ సక్రమంగా పూర్తి కావడం లేదు. అలాగే, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ విద్యార్థులు 3, 6 తరగతుల్లోకి చేరినప్పుడు చదువులో వెనుకబడిపోతున్నారు. 40 శాతం పాఠశాలల్లో ఒక్కరే.. జిల్లాలో 843 ప్రాథమిక పాఠశాలలుండగా వీటిల్లో 329 చోట్ల ఏకోపాధ్యాయ బోధనే సాగుతోంది. అంటే జిల్లాలోని మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో 40 శాతం వాటిలో ఒక్క ఉపాధ్యాయుడే బోధన సాగించాల్సి వస్తోంది. ఫలితంగా బోధన సరిగ్గా జరగక ఈ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. ఈ విషయాన్ని విద్యా శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా ఒక్కరే ఉపాధ్యాయులున్న చోట వారు సెలవు తీసుకుంటే సీఆర్పీలను పంపిస్తున్నామని, పాఠశాల మూత పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. జిల్లాలోని 329 పాఠశాలల్లో ఇదే దుస్థితి ఇతర పనుల భారంతో కుంటుపడుతున్న బోధన వెనుకబడిన విద్యార్థులపై కొరవడిన శ్రద్ధ ప్రాథమిక స్థాయిలో తూతూమంత్రంగా విద్యాభ్యాసం -
ఖతర్నాక్ ఖాన్
● సాధిక్ ఖాన్ కేసులో ఎన్ని ట్విస్టులో ● ట్రాప్ నుంచి పరారీ వరకు అంతా పకడ్బందీగా ● మరికొందరు మహిళలతోనూ ఇదే తరహా ప్రవర్తనకాకినాడ క్రైం: సౌజన్యను ట్రాప్ చేసి, ఓ క్రైం థ్రిల్లర్ని తలపించేలా సాధిక్ ఖాన్ తన కుట్రల్ని గుట్టు చప్పుడు కాకుండా కొనసాగించాడు. తన దారిలోకి తెచ్చుకోవడం, ఆమైపె ఇష్టాన్ని వ్యక్తం చేయడం, అక్రమ బంధాన్ని కొనసాగించడం, ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు కుయుక్తులు పన్నడం, ఆస్తి కాజేసేందుకు చేసిన కుట్ర, అంతకుముందు ఆమెను కొట్టడం, భర్తపై దాడి, బాధితురాలి కుటుంబ సభ్యుల పైనా విరుచుకుపడడం, వారిని బ్లాక్మెయిల్ చేయడం ఇవేవీ థ్రిల్లర్కు తీసిపోని రీతిలో ఉన్నాయి. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటన తర్వాత తప్పించుకోవడానికి చేసిన విఫలయత్నాలు పోలీసులకే మతి పోగొట్టాయి. సౌజన్య లాంటి మరికొందరు సాధిక్ వలలో చిక్కి ఉండవచ్చనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పిల్లల్ని అడ్డుపెట్టుకొని తల్లులకు వల వేసేవాడని వారి ప్రాఽథమిక విచారణలో తేలింది. ఆ ఒక్క క్లూతోనే.. కేవలం ఒక్క క్లూతోనే సాధిక్ జాడ బట్టబయలైందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యలు జరగడం, వాటికి తానే కారణం కావడంతో ఎవరూ అతడిపై ఆరోపణలు చేయకుండానే జాగ్రత్త పడి పరారయ్యాడు. అప్పటికి లేఖ దొరకలేదు, సాధిక్ ఖాన్ పేరు కూడా ఎవరికీ తెలియదు. ఆ సమయంలో తాను వినియోగిస్తున్న ఒక్కొక్కటి రూ.1.5 లక్షలు విలువ చేసే రెండు ఫోన్లను వదిలేసి పరారయ్యాడు. వెళ్తూవెళ్తూ రైఫిల్ అసోసియేషన్లోని ఓ ఆప్తమిత్రుడికి ఫోన్ చేసి, ఆ నంబర్ డిలీట్ చేసేశాడు. కొందరి ఫోన్ నంబర్లు పాకెట్ బుక్లో రాసుకొని బయల్దేరాడు. కాల్ డేటాలో ఆ వివరాలు లభ్యమయ్యాయి. ఇంటి నుంచి నేరుగా ద్విచక్రవాహనంపై సామర్లకోటకు వెళ్లిన సాధిక్ తన బైక్ను పార్కింగ్లో ఉంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. పలువురు ప్రయాణికుల ఫోన్లతో తనకు కావలసిన వారికి ఫోన్లు చేశాడు. చివరకు మహారాష్ట్ర వెళ్లి, తన స్నేహితుడిని కలిశాడు. అక్కడ ఒక రోజు ఉన్నాడు. తర్వాత రోజు మీరట్కి బయల్దేరాడు. సరిగ్గా ఆ సమయానికి కాకినాడ పోలీసులు ఆ మిత్రుడి వద్దకు చేరుకున్నారు. కొద్దిసేపటి ముందు అబ్బాస్ అనే మరో రైఫిల్ ట్రైనర్ను కలిసేందుకు సాధిక్ మీరట్ వెళ్లాడనే సమాచారాన్ని అతడు ఇచ్చాడు. సాధిక్ కంటే ముందే అబ్బాస్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆ ఇంటిని సమీపిస్తుండగా సాధిక్ను పట్టుకున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లాలనుకున్నాడని పోలీసులు తెలిపారు. కోడలిపై అనుమానం.. ఇదిలా ఉండగా నూకరాజు కుమార్తె సౌజన్య భర్త జగదీశ్వర్రెడ్డిని సాధిక్ ఖాన్ హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఏ కారణం లేకుండానే జగదీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని వారు వాపోయారు. ఏడాది పాటు వాంతులయ్యాయని, కారణం తెలిసేది కాదని చెప్పారు. మాట నెమ్మదించి, కాలు కూడా చచ్చుబడిందని అన్నారు. జీర్ణకోశ సమస్యతో బాధపడుతూ కాకినాడ సర్పవరంలోని ఓ ఆసుపత్రిలో ఐదు రోజులు చికిత్స అనంతరం జగదీష్ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీకి వెళ్లి చికిత్స పొందినట్టు చెప్పారు. అక్కడ కాస్త కోలుకోగా, హైటెక్ సిటీలోని ఓ ఫిజియోథెరపీ సెంటర్కు సౌజన్యతో పాటు ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు తీసుకువెళ్లారు. కేవలం ఫిజియోథెరపీ చేస్తే కోలుకోవలసిన దశలో జగదీశ్వర్రెడ్డి హఠాత్తుగా మరణించాడు. ఆసుపత్రిలో తాము లేని సమయంలో సాధిక్ ఖాన్ వచ్చి సౌజన్యతో కలసి జగదీష్ తాగే ప్రొటీన్ షేక్లో అంతకు ముందు పట్టించిన స్లో పాయిజన్ గుణాలున్న రసాయనాన్ని మరోమారు కలిపి ఉంటాడని అతడి కుటుంబీకులు చెప్పారు.పిల్లలు ఎర.. తల్లులు సొర ఖతర్నాక్ ఖాన్ వ్యవహార శైలిని తమ పిల్లల్ని రైఫిల్ షూటింగ్ శిక్షణలో చేర్చిన పలువురు తల్లులు పూసగుచ్చినట్టు తమను సంప్రదించిన మీడియాకు తెలిపారు. పిల్లల్ని అడ్డు పెట్టుకొని తమతో మాట కలిపేందుకు, తమ స్టేటస్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం పేజీలు ఫాలో అవుతూ లైక్స్ కొడుతూ ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించేవాడని వివరించారు. ఈ కారణంతోనే తమ పిల్లల్ని అతడి అకాడమీలో మానిపించేశామని కొందరు చెప్పారు. క్లాస్ ఇన్ఫర్మేషన్ కోసం అంటూ కాల్స్ చేసి అక్కర్లేని విషయాలతో మాటలు మాట్లాడేవాడని తెలిపారు. -
హరితసీమలో.. కేరళం శోభ
సాక్షి, అమలాపురం: ఆకుపచ్చని ప్రకృతి అందాలు.. కాలువల నడుమ కొబ్బరి తోటలు.. వరి చేల మధ్య పాయలు పాయలుగా జలవాహిని గలగలలు.. అరటి, వక్క, తమలపాకు, మిరియాల వంటి ఉద్యాన పంటలు.. చూడగానే ఇది కేరళా! కోనసీమా!! అనే సందేహం కలగక మానదు. ప్రకృతి సోయగాల్లో కేరళకు ఏమాత్రం తీసిపోదు మన కోనసీమ. అందుకేనేమో నాలుగు దశాబ్దాల క్రితమే ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన ఎంతో మంది మలయాళీలకు ఈ సీమ సొంతగడ్డగా మారిపోయింది. ఇప్పుడు ఆ సొంతగడ్డ పైనే వారు ఓణం సంబరాన్ని అంబరాన్నంటేలా జరుపుకోనున్నారు. నేడు తిరు ఓణం సందర్భంగా కోనసీమ అంతటా కేరళీయుల ఇళ్లలో పూల సోయగాలు విరబూయనున్నాయి. ఇంటింటా సందడి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న మలయాళీలు కేరళ సంస్కృతిని ప్రతిబింబించేలా ఓణం పండగను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంటి ముందు ‘పూక్కళం’ (పూలతో వేసే అందమైన ముగ్గు) వేస్తున్నారు. అత్తపూవు నుంచి మొదలుపెట్టి రోజురోజుకూ పూలను జోడిస్తూ తిరు ఓణం నాడు భారీ పూక్కళంగా తీర్చిదిద్దుతారు. మరో ప్రధాన ఆకర్షణ ఓన సద్య. అంటే.. అరటి ఆకులో 26 రకాలకు పైగా శాకాహార వంటకాలతో విందు భోజనం చేస్తారు. ఇది వారికి సంప్రదాయంగా వస్తోంది. సొంత గడ్డకు దూరంగా ఉన్నప్పటికీ ఇక్కడి మలయాళీలు పండగ సంతోషాన్ని ఏమాత్రం దూరం చేసుకోవడం లేదు. అమలాపురంలోని ఓ వైద్య కళాశాలలో తకజం పేరిట విద్యార్థులు ఓణం పండగ నిర్వహించారు. వివిధ ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న మలయాళీ ఉపాధ్యాయులందరూ ఈ నెల 31న తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో ఓణం సంబరాలు నిర్వహించనున్నారు. అలాగే, సెప్టెంబర్ 13న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని రంగాలకు చెందిన మలయాళీలు రాజమహేంద్రవరంలో భారీగా సమావేశమై, ఓణం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఫ నేడే తిరు ఓణం ఫ పండగ సంబరంలో కేరళీయులు ఫ కోనసీమను సొంతగడ్డగా మార్చుకున్న వలస జీవులు ఫ నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో మమేకం మలయాళీలకు విశిష్ట పండగ ఓణం కేరళ రాష్ట్ర పండగ. ఇది మలయాళీలకు కేవలం పండగ మాత్రమే కాదు.. భావోద్వేగాలతో ముడిపడిన విశ్వాసం. పురాణాల ప్రకారం రాక్షస రాజు మహాబలి ఏటా తన ప్రజలను చూడటానికి భూలోకానికి వస్తాడన్నది కేరళీయుల నమ్మకం. ఆయనకు స్వాగతం పలికేందుకే ఓణం జరుపుకొంటారు. పది రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. చివరి రోజున జరిగే తిరు ఓణం అత్యంత ముఖ్యమైనది. దీనిని బుధవారం నిర్వహించుకుంటున్నారు. మినీ కేరళం కోనసీమను ‘మినీ కేరళం’ అని కూడా పిలుస్తారు. గోదావరి జిల్లాలకు మలయాళీల వలస నాలుగు దశాబ్దాల క్రితమే మొదలైంది. ఇంగ్లిష్ పాండిత్యంతో ఎంతో మంది మలయాళీ యువత ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతేకాదు.. కొబ్బరి ఆధారిత పరిశ్రమలు, బంగారం, వస్త్ర వ్యాపారాల్లోనూ వారి ప్రభావం అధికం. కొందరు మూడు నాలుగు దశాబ్దాలుగా ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని, కోనసీమ బిడ్డలుగా మారిపోయారు. -
ఎట్టెట్టా!
రాయవరం: ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఇన్ సర్వీస్ టీచర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. సాధారణ టెట్కు ప్రత్యేక టెట్కు మధ్య ఎటువంటి మినహాయింపులూ లేకపోవడంతో వారితో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పోరాటానికి ఉద్యమ బాట పడుతున్నాయి. ఒకవైపు డీఏల పెండింగ్, మరోవైపు పీఆర్సీపై ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో ఇప్పటికే మండిపడుతున్న ఉపాధ్యాయులు.. ప్రత్యేక టెట్లోనూ ఎటువంటి మినహాయింపులూ ఇవ్వకపోవడంతో ఆగ్రహోదగ్రులవుతున్నారు. అడిగినదొకటి.. అయ్యిందొక్కటి సాధారణ డిగ్రీలతో వృత్తిపరమైన డీఎడ్, బీఎడ్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది. ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసేవారికి మాత్రం మినహాయింపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం దేశంలో టెట్ విధానం తెర పైకి వచ్చింది. రాష్ట్రంలో 2011 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. 2011కి ముందు ఉన్న ఉపాధ్యాయులు సైతం ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు ఒకటో తేదీ లోపు టెట్ ఉత్తీర్ణత కావాల్సి ఉంది. దీంతో, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. ఇవీ డిమాండ్లు ● విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్ 23(1)ను సవరించేలా కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. తమకు టెట్ లేకుండా చేయాలి. ● సాధ్యం కాని పరిస్థితుల్లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్లో సామాజిక వర్గం, కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 40 శాతం పాస్ మార్కులు ప్రకటించాలి. ● సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం లేనందున ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలి. ● ఏ సబ్జెక్టు టీచర్కు అదే సబ్జెక్టులో మాత్రమే పరీక్ష నిర్వహించాలి. ఇదెక్కడి చోద్యం! ఉపాధ్యాయుల డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహిస్తామంటూ చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకూ సాధారణ టెట్ నిర్వహించారు. ఈ ఫలితాలు సెప్టెంబర్ 15న ప్రకటించాల్సి ఉంది. కానీ, ఆ పని పూర్తి కాకుండానే స్పెషల్ టెట్ పేరుతో ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, ఉపాధ్యాయుల్లో సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టెట్ రాసిన ఇన్ సర్వీస్ టీచర్లు మళ్లీ టెట్కు దరఖాస్తు చేయాలా, మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాలా, టెట్ ఫలితం వచ్చే వరకూ వేచి ఉండాలా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పైగా సాధారణ టెట్ మాదిరిగానే అర్హత మార్కులున్నాయి. టెట్ వెయిటేజీ, పరీక్ష విధానంలో కూడా ఎటువంటి మార్పులూ లేవు. మరోవైపు స్పెషల్ నెట్ నోటిఫికేషన్లో సైతం సాధారణ టెట్లో ఉన్న అంశాలే ఉండటంతో వారు అవాక్కవుతున్నారు. ఆన్లైన్లోనే టెస్ట్కు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొనగా.. ఆఫ్లైన్లోనే నిర్వహించాలని, పరీక్ష విధానంలో మార్పులు తేవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలి తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ లేకుండా అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. స్పెషల్ టెట్ పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసగించింది. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ కాకినాడ జిల్లా అధ్యక్షుడు స్పెషల్ టెట్ నోటిఫికేషన్పై ఇన్ సర్వీస్ టీచర్ల ఆగ్రహం పోరాటానికి ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ ఉమ్మడి జిల్లాలో 18 వేల మంది ఉపాధ్యాయులు -
ప్రభుత్వం మాట తప్పింది
30 సంవత్సరాలు సర్వీసు చేసిన సీనియర్ ఉపాధ్యాయులు ఆన్లైన్ విధానంలో టెట్కు అటెండ్ కాలేరనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఆఫ్లైన్లోనే అని చెప్పి, ఆన్లైన్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మాట తప్పింది. స్పెషల్ టెట్పై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నాం. – పోతంశెట్టి దొరబాబు, ఎస్టీయూ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆఫ్లైన్ విధానంలో నిర్వహించాలి ఇతర రాష్ట్రాల మాదిరిగానే స్పెషల్ టెట్ ఆఫ్లైన్లోనే నిర్వహించాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనిపై ఉద్యమబాట పడుతున్నాం. – ఈవీవీఎస్ఎస్ ప్రసాద్, యూటీఎఫ్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మినహాయింపు ఇవ్వాల్సిందే ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇదేనా? తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాల్సిందే. – ఎస్ఎన్ మునేశ్వరరావు, ఏపీటీఎఫ్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు -
రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ జట్టు ఎంపికలు ప్రారంభం
అమలాపురం టౌన్: ఏపీ సబ్ జూనియర్ అండర్–13 బాలుర బాస్కెట్బాల్ జట్టు ఎంపికలు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ వరకూ జరిగే ఈ ఎంపిక పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి జట్లు వచ్చాయని కోచ్, ఏపీ బాస్కెట్బాల్ క్రీడా సలహాదారు నడింపల్లి అప్పలరాజు తెలిపారు. ఈ జట్లకు ప్రతి రోజూ బాస్కెట్బాల్లో శిక్షణ ఇస్తామని, చివరిగా రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తామని చెప్పారు. విజయవాడలో సెప్టెంబర్ 26న జరగనున్న జాతీయ స్థాయి అండర్–13 బాలుర బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఇక్కడ ఎంపిక చేసే రాష్ట్ర జట్టు తలపడుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సంసాని గంగాధరరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు ఈఆర్ సుబ్రహ్మణ్యం, వైఎఎస్సార్ సీపీ అమలాపురం పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, వ్యాయామోపాధ్యాయులు కుడుపూడి బుజ్జి, యనమదల బుజ్జి పాల్గొన్నారు. -
జాతీయ తైక్వాండో పోటీలకు ఎంపిక
అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు అంబాజీపేట విద్యార్థినులు పలువురు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకూ శ్రీకాకుళం వైఎస్సార్ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 42వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ఈ విద్యార్థులు ప్రతిభ చూపి 4 గోల్డ్, 3 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సబ్ జూనియర్స్ విభాగంలో జి.జెస్సీ లేఖన, జి.లాహిత తేజ, జూనియర్స్ విభాగంలో పి.ఆదిత్య, కె.వైష్ణవి స్వర్ణ పతకాలు కై వసం చేసుకున్నారు. ఎంఎస్ శివానంది, కేకేఎస్ హరిప్రియ, క్యాడిట్ విభాగంలో ఎం.మౌనిక సిల్వర్ మెడల్స్ సాధించారు. వైఈఎన్ శ్రీనిజ, ఎస్.శౌర్య, జూనియర్స్ విభాగంలో పీఎల్ శరణ్య, పి.చరణ్యశ్రీ, ఆర్డీఎస్ లక్ష్మి, ఆర్హెచ్వీ మూర్తి, జి.పూజిత కాంస్య పతకాలు దక్కించుకున్నారు. గోల్డ్ మెడల్స్ సాధించిన జెస్సీ లేఖన, జి.లాహిత తేజ, ఆదిత్య, వైష్ణవి త్వరలో మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని సీనియర్ కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. మెడల్స్ సాధించిన విద్యార్థినులను, వారికి తర్ఫీదునిచ్చిన పి.భార్గవి శ్రీకళ, టి.రాజశేఖర్, డి.రాఘవేంద్రలను అంబాజీపేట క్రీడా ప్రాంగణంలో మంగళవారం పలువురు అభినందించారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష రాజానగరం: ఓ బాలికపై అ ఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి 20 సంవత్సరాల కఠి న కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ కాకినాడ లోని ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. రాజానగరం సీఐ వీరయ్యగౌడ్ కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరుకు చెందిన 16 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన చిర్రా ఆనంద్కుమార్ మాయమాటలతో నమ్మించి, 2020 ఆగస్టు 25న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి ఎస్సై యు.నాగబాబు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో నేరారోపణ రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకుంటే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సిందిగా చెప్పారని సీఐ తెలిపారు. ఈ కేసులో శ్రీదేవి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. -
సమగ్ర ప్రణాళికతో పుష్కర ఏర్పాట్లు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకూ జరిగే గోదావరి పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో తన క్యాంపు కార్యాలయం నుంచి ఆమె, ఎస్పీ డి.నరసింహ కిశోర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులకు రవాణా, వసతి, పారిశుద్ధ్యం, భద్రత, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలు, స్థానిక మాహత్మ్యాలను సమగ్రంగా నమోదు చేయాలని దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు పుష్కరాలకు వచ్చే అవకాశమున్నందున అఖండ గోదావరి బ్రాండింగ్తో ప్రత్యేక వీఐపీ ఘాట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. జిల్లాలో 1,869, కోనసీమలో 1,501, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 చొప్పున పనులను రూ.4,026 కోట్లతో చేపడుతున్నామని ముఖ్యమంత్రి సమీక్షలో అధికారులు వివరించారు. పొగాకు పంట నియంత్రణ పాటించాలిదేవరపల్లి: అధిక ఉత్పత్తి కారణంగా పండించిన పొగాకును మంచి ధరకు అమ్ముకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని టొబాకో బోర్డు దేవరపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత అన్నారు. పొగాకు నారుమడి పెంపకం, తెగుళ్లు, పురుగు మందుల వాడకం, నారుమడి నియంత్రణ, యాజమాన్య పద్ధతులపై కృష్ణంపాలెంలో మంగళవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది రైతులు విధిగా పంట నియంత్రణ పాటించి, నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. తమకు కేటాయించిన పరిమాణానికి లోబడి మాత్రమే సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. నారు అమ్మే నిబంధనల గురించి వివరించారు. రిజిస్ట్రేషన్ పొందిన రైతులకు మాత్రమే నారు విక్రయించాలని స్పష్టం చేశారు. నారుమడి వేసిన రైతులు తప్పనిసరిగా బోర్డు అధికారులకు తెలియజేయాలని హేమస్మిత అన్నారు. రేపు నిధి ఆప్ కే నికత్ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలో గురువారం ఉదయం 9 గంటలకు నిధి ఆప్ కే నికత్ డిస్ట్రిక్ట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ ఎంకే వెంకటరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధికి సంబంధించి పెద్దాపురం ఏడీబీ రోడ్డులోని పతంజలి ఫుడ్స్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి యానాంలోని నల్లం ఎడ్యుకేషనల్ సొసైటీలోను, కాకినాడ జిల్లాకు తుని మార్కండ్రాజుపేట అర్కా ఎడ్యుకేషనల్ సొసైటీలోను, పశ్చిమ గోదావరి జిల్లాకు కాళ్ల మండలం సీసలి జయలక్ష్మి సీఫుడ్స్లోను, ఏలూరు జిల్లాకు వట్లూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లోను ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. కొత్త ఈపీఎస్, ఈడీఎల్ఐ, ఆమ్నెస్టీ, ఈఈసీ, కొత్త సీఐటీఈఎస్ పథకాల అమలు నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఆయా సంస్థలు దీనిని ఉపయోగించుకోవాలన్నారు. నిధి ఆప్ కే నికత్ అని పేర్కొంటూ ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వవచ్చని వెంకటరావు తెలిపారు. ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు నిడదవోలులో హాల్ట్రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల డిమాండ్ మేరకు విశాఖపట్నం – లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ రైలుకు నిడదవోలు స్టేషన్లో ప్రయోగాత్మకంగా ఒక నిమిషం హాల్ట్ ఇవ్వాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సెప్టెంబర్ 5వ నుంచి విశాఖప్నటం–ఎల్టీటీ (18519) రైలు ప్రతి రోజూ తెల్లవారుజామున 2.54 గంటలకు నిడదవోలు చేరుకుని 2.55కు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (18520) ఉదయం 6.09 గంటలకు నిడదవోలు చేరుకుని, 6.10కి బయలుదేరుతుంది. -
రాజమండ్రి: బీరు సీసాలతో యువకులపై మహిళల దాడి
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో యువకులపై మహిళల దాడి చేశారు. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై బీరు సీసాలతో దాడి చేయడంతో ఒకసారిగా కలకలం రేగింది.సోమాలమ్మగుడి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్థరాత్రి చనిపోతే యువకులు విజయ్, దుర్గాప్రసాద్ చూసేందుకు వెళ్లారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో యువకులు ఆలయం వద్దకు చేరుకున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న తుమ్మలోవకు చెందిన ముగ్గురు మహిళలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: ఖైదీతో మహిళా ఎస్ఐ అర్దనగ్నంగా వీడియో కాల్..! -
గర్భదారుణం
స్నేహితులతో కలిసి తరగతి గదిలో కూర్చుని పాఠాలు నేర్చుకోవాల్సిన వయసు వారిది. సాయంత్రం వేళ గాలి పటాలను ఎగురవేస్తూ గంతులు వేయాల్సిన సమయమిది. కానీ అమ్మతనం తెలియని వయసులోనే గర్భం దాల్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పసి వయసులోనే పడిన మూడు ముళ్లకు తలవంచి ప్రసవ వేదన అనుభవిస్తున్నారు. పాఠశాల నుంచే పెళ్లి పీటలెక్కిన కొందరు బాలికల అవస్థలు ఇవి. టీనేజీలోనే గర్భం దాల్చడంతో శారీరకంగా, మానసికంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు. జిల్లా పెరుగుతున్న ఈ టీనేజీ ప్రెగ్నెన్సీలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం: అమ్మతనం ప్రతి మహిళకు మధుర భావనే. నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడాన్ని ఆమె ఎంతో గర్వంగా భావిస్తుంది. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం బంగారు కలలు కంటూ మురిసిపోతుంది. అయితే దురదృష్టవశాత్తూ జిల్లాలో అమ్మతనం బాధల వలయంగా మారుతోంది. 18 ఏళ్లు నిండక ముందే గర్భం దాల్చడంతో శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారు. పేదరికం, ఇతర సామాజిక కారణాలతో కొందరు తల్లిదండ్రులు నేటికీ బాల్య వివాహాలు చేస్తున్నారు. బంధువులు, తెలిసిన వారితో బంధుత్వం కలుపుకొనేందుకు కూడా ఇవి జరుగుతున్నాయి. ఫలితంగా జిల్లాలో టీనేజీ ప్రెగ్నెన్సీ ఆందోళన కలిగిస్తోంది. ఇది తల్లీ బిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతంత మాత్రంగానే.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. అందువల్లే ఈ ఆధునిక కాలంలోనూ టీనేజీ ప్రెగ్నెన్సీ శాతం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్కు క్షేత్ర స్థాయి వరకూ సిబ్బంది ఉన్నారు. వారంతా అప్రమత్తంగా ఉంటే బాల్య వివాహాల కట్టడి సాధ్యమే. ముఖ్యంగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తే కొంత వరకూ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఆ దిశగా అధికారులు, సిబ్బంది దృష్టి సారించడం లేదన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి నెల మొత్తం టీనేజీ శాతం గర్భిణులు గర్భిణులు మే 8,233 335 4.07 జూన్ 8,367 327 3.91 జూలై 8,382 334 3.98అవగాహన కల్పిస్తున్నాం బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే నష్టాలపై ఐసీడీఎస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సహకారంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. తెలిసీ తెలియని వయసులో గర్భం దాల్చడంతో మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాల్సిన అవసరం వుంది. అప్పుడే బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీకి అడ్డుకట్ట పడుతుంది. – కోమల, డీఎమ్హెచ్వో భారం తగ్గుతుందని... చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లి చేస్తే భారం తగ్గుతుందనే ఆలోచనలో ఉంటున్నారు. అందువల్లే తక్కువ వయసులోనే వివాహం చేసేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ మానేసిన పిల్లలు ఇంటి వద్దే ఉండడంతో పాటు తెలిసిన వారితో బంధుత్వాల కోసం తక్కువ వయసులోనే పెళ్లి జరిపిస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో ప్రేమ వివాహాలు కూడా జరుగుతుండడంతో టీనేజీ ప్రెగ్నెన్సీ శాతం పెరుగుతోంది. – శ్రీదేవి, పీడీ, ఐసీడీఎస్ జిల్లాలో ఆందోళనకరంగా టీనేజ్ ప్రెగ్నెన్సీ బాల్య వివాహాల కట్టడిలో అధికారుల విఫలం తక్కువ వయసులోనే గర్భంతో అనారోగ్యం బాధల వలయంగా మారుతున్న అమ్మతనం బాల్యానికి మూడు‘ముళ్లు’ -
లోఓల్టేజ్ సమస్య పరిష్కారం
నిడదవోలు: సమిశ్రగూడెం ఎస్సీ ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు, స్తంభానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో లో వోల్టేజ్ సమస్యలు తీరాయి. 100 కేవీ సామర్ధ్యం గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో అలంకార ప్రాయంగా మారింది. దీనిపై ఈ నెల 23న సాక్షిలో ప్రచురించిన కథనానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశాలపై సోమవారం ట్రాన్స్ఫార్మర్కు, స్తంభానికి కనెక్షన్ ఇచ్చి విద్యుత్ సరఫరా చేశారు. ముగిసిన పవిత్రోత్సవాలుఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు మూడో రోజు మహా పూర్ణాహుతితో అత్యంత వైభవంగా ముగించారు. టీటీడీ వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యులు పర్యవేక్షణలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, హోమాలు, సేవలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు దంపతులు, కమిటీ సభ్యులు, సిబ్బంది, అర్చకులు, వేద పండితులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం చేయాలి
సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయడంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో భాగంగా చేపట్టిన విచారణలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ అనంతరం మున్సిపల్, పంచాయతీ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఏఈఆర్ఓలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులతో ఎన్నికల అంశాలపై సమీక్ష నిర్వహించారు. సర్లో భాగంగా ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు మ పరిధిలోని అన్ని విచారణలను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలన్నారు. అవసరమైనచోట వర్చువల్ విచారణలను వినియోగించుకోవాలని, అధికారులకు అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందించాలన్నారు. భూ రికార్డుల్లో తప్పులు సరి చేయాలి భూ రికార్డుల్లో గతంలో నమోదైన తప్పులను నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత ఉన్న కేసుల్లో సత్వరమే సవరణలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. భూ రికార్డు సరిచేసిన ధ్రువీకరణ పత్రాల పంపిణీ, స్వచ్ఛత కార్యక్రమాలపై సోమవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ చాగల్లు గ్రామంలోని సర్వే నంబర్ 464–2 నుంచి 621–5 వరకు ఉన్న 96 మంది భూముల స్వభావాన్ని సరిచేయాలని ప్రతిపాదనలు అందాయన్నారు. సంబంధిత రెవెన్యూ, సర్వే రికార్డులను పరిశీలించగా, గతంలో భూమి స్వభావం పొరపాటుగా నమోదైనట్లు గుర్తించినట్లు చెప్పారు. పరిశీలన అనంతరం నిబంధనల మేరకు అవసరమైన సవరణలకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పీజీఆర్ఎస్కు 203 అర్జీలు కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 203 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ కీర్తి తెలిపారు. రెవెన్యూ క్లినిక్కు వంద అర్జీలు రాగా మిగిలినవి పీజీఆర్ఎస్లో అందాయన్నారు. కార్యక్రమంలో జేసీ మేఘస్వరూప్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ స్పందనకు 35 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 35 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి, సమస్యలపై ఫిర్యాదు చేసిన అర్జీదారులతో ఎస్పీ డి.నరసింహ కిశోర్ నేరుగా మాట్లాడారు. అనంతరం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, ఫిర్యాదులను నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. -
డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలకు నివారణకు తనిఖీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): డ్రంకెన్ డ్రైవ్ కారణంగా జరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు బ్రీత్ ఎనలైజర్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను కలెక్టర్ కోరారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ సమకూర్చిన రెండు బ్రీత్ ఎనలైజర్లను కలెక్టర్ కీర్తి, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ సమక్షంలో సోమవారం జిల్లా పోలీసు యంత్రాంగానికి అందజేశారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాలు, జాతీయ రహదారులపై రాత్రి వేళల్లో, ముఖ్యంగా వారాంతాల్లో బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారికి మోటారు వాహనాల చట్టం ప్రకారం భారీ జరిమానాలు విధించడంతో పాటు, జైలు శిక్ష పడేలా కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ గతంలో గామన సంస్థ సమకూర్చిన నాలుగు బ్రీత్ ఎనలైజర్లు, మున్సిపల్ కార్పొరేషన్న్ అందించిన రెండు ఎనలైజర్ల సహాయంతో జిల్లాలో ప్రత్యేక తనిఖీలు చేపడతామని తెలిపారు. పుష్కర యాత్రికులకు అన్ని వసతులు కల్పించాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి పుష్కరాలకు భారీగా తరలి వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వే, ఆర్టీసీల సమన్వయంతో సమగ్ర రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ కీర్తి కోరారు. ఆమె సోమవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా, జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి రైల్వే, ఆర్టీసీ, ట్రాన్స్పోర్ట్, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పుష్కర యాత్రికులకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో ప్రధానంగా రైళ్ల ద్వారా రాజమహేంద్రవరం తరలివస్తారన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైల్వే, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలుపెరవలి: పుష్కరాల నేపథ్యంలో కొవ్వూరు రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ డివిజన్ డీఆర్ఎం మోహిత్ సోనాకియా అన్నారు. ఆయన సోమవారం ఆ పనులను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాల కల్పన కోసం ఇంకా ఏమైనా చేయాలా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రయాణికుల హక్కుల పోరాట సమితి కన్వీనర్ నంబూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ప్రజలు ఆయనకు పలు డిమాండ్లపై వినతిపత్రం అందించారు. కరోనాకు ముందు మాదిరిగా ఈ స్టేషన్లలో రైళ్లను నిలుపదల చేయాలని కోరారు. దళితవాడల్లో సమస్యలు పరిష్కరించాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని దళిత వాడల్లో సమస్యలు పరిష్కరించాలని, అక్కడ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కమ్యూనిటీ హాళ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్), ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశాయి. కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు రామరాజు మాట్లాడుతూ కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, రాజమహేంద్రవరం అర్బన్, రాజానగరం నియోజకవర్గాల్లోని సుమారు 40 గ్రామాలు, 20 వార్డులను సందర్శించామన్నారు. అక్కడి సమస్యలను అధ్యయనం చేసి, సర్వే నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. -
మత్స్యకారులను ఆదుకోవాలి : ఎమ్మెల్సీ
అమలాపురం టౌన్: జిల్లాలో ఉన్న సముద్ర జలాలు చమురు సంస్థల డ్రిల్లింగ్ ఆపరేషన్ల వల్ల కలుషితం అవుతున్నాయని, ఫలితంగా లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్కుమార్కు సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోనసీమ మత్స్యకారులకు 14 మీటర్లతో ఉండే సోనా బోట్స్ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, సముద్ర లోతు జలాల్లో ఉండే టూనా చేపలను వేటాడాలంటే 22 మీటర్లతో హైడ్రాలిక్ లిఫ్ట్ కలిగినవి ఉండాలని చెప్పారు. 100 శాతం సబ్సిడీతో వాటిని చమురు సంస్థలు సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద అందించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లో మత్స్యకారుల సేవలకు గాను అమలులో ఉన్న డీహెచ్ఎఫ్ హై ఫ్రీకెన్సీ వాట్యాప్, హ్యామ్ రేడియోలను మన రాష్ట్రంలోనూ పునరుద్ధరించాలని కోరారు. -
శ్రావణంలో సర్రుమంటూ..
సాక్షి, రాజమహేంద్రవరం: శుభకార్యాలు జరుపుకొనే శ్రావణ మాసంలో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఊహించని పెరుగుదలతో సామాన్యుల ఇంటి బడ్జెట్ తల్లక్రిందులు చేస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనం భారంగా మారింది. సంక్షేమ పథకాలు అందక, ధరల నియంత్రణకు చర్యలు చేపట్టకపోవడంతో పేద, బలహీన వర్గాల ప్రజల ఇళ్లు గడవడం కష్టంగా మారింది. చంద్రబాబు అసమర్థ పాలనకు కొనసాగింపుగా ప్రస్తుతం ధరలు బెదరగొడుతున్నాయి. మరో వైపు ఉద్దేశపూర్వకంగానే వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులు వెనుకడుగు వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. భారమైన సన్న బియ్యం రెండు, మూడు నెలల కిందటి వరకూ మేలు రకం సన్న బియ్యం కిలో రూ.50 నుంచి రూ.55 మధ్య లభించేవి. ప్రస్తుతం కిలో రూ.65 నుంచి రూ.70 వరకూ పెరిగిపోయాయి. దీంతో మధ్య తరగతి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పంచదారకు రెక్కలు శ్రావణ మాసంలో నోరు తీపి చేసుకుందామంటే బెల్లం, చక్కెర చేదెక్కాయి. రెండు నెలల క్రితం వరకూ కిలో రూ.40 నుంచి రూ.45 మధ్య ఉన్న పంచదార ధర ప్రస్తుతం రూ.60 దాటిపోయింది. రాజమహేంద్రవరంలో దిగుమతి చేసుకుంటున్న సరకును బ్లాక్ మార్కెట్కు తరలించడం వల్లే గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి పంచదార ధర పెరిగిపోయిందని స్వీట్ షాపుల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు బెల్లం కొద్ది రోజుల కిందట వరకూ కిలో రూ.55 నుంచి రూ.60 మధ్య దొరికేది. ప్రస్తుతం అది కూడా ఒక్కసారిగా రూ.70 నుంచి రూ.75కి పెరిగిపోయింది. ఇక ప్యాకింగ్ చేసిన బెల్లం దిమ్మలు కిలో రూ.90 దాటేశాయి. దూసుకెళ్తున్న వెల్లుల్లి, ఉల్లి జూన్ మొదటి వారంతో పోలిస్తే వెల్లుల్లి ధర సుమారు వంద శాతం మేర పెరిగింది. అప్పట్లో కిలో రూ.130 వరకూ వెల్లుల్లి ఉన్న ధర ప్రస్తుతం రూ.250 దాటేసింది. కొన్ని దుకాణాల్లో నాణ్యత, గ్రేడింగ్ పేరిట కిలో రూ.300కి పైనే విక్రయిస్తున్నారు. ● జూలైలో కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.25 మధ్య లభిస్తే ప్రస్తుతం రైతుబజార్లో రూ.40కి చేరింది. ఇక బహిరంగ మార్కెట్లో ప్రాంతాన్ని బట్టి రూ.50 నుంచి విక్రయిస్తున్నారు. ఎండు మిర్చి కిలో రూ.240 నుంచి రూ.300కి పెరిగింది. ● మరోవైపు శ్రావణ మాస పూజల్లో ఎంతో కీలకమైన పువ్వుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. చామంతి కిలో రూ.350 నుంచి రూ.400 పలుకుతుండగా, విడిగా కావాలంటే రూ.50కి వంద గ్రాములు కూడా దొరకడం లేదు. వంట నూనెల ధరలు కూడా కిలోకి రూ.5 మేర పెరిగిపోయాయి. కూరగాయల ధరలు కూడా గతంతో పోల్చితే పెరిగిపోయాయి. ఇబ్బంది పడుతున్నాం గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు పెరిగిపోయాయి. పంచదార, బెల్లం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. శ్రావణమాసంలో తీపి పదార్థాలు చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాం. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. వాటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – గాదె అనురాధ, శాటిలైట్ సిటీ సామాన్యులు బతకడం కష్టమే చంద్రబాబు ప్రభుత్వంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బియ్యం, నూనె, పంచదార, బెల్లం, కూరగాయలు... ఇలా సామాన్యులకు అవసరమైన వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయి. వేటినీ కొనే పరిస్థితి లేదు. సామాన్యులు బతకడం కష్టంగా మారింది. – ఈమని మల్లిక, ప్రగతిశీల మహిళా సంఘం, నిడదవోలు భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు శుభకార్యాలతో విపరీతమైన డిమాండ్ బెంబేలెత్తుతున్న సామాన్యులు కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులపై చర్యలు శూన్యం చంద్రబాబు ప్రభుత్వంలో ఆర్థిక భారం -
శాకంబరిగా దుర్గమ్మ తల్లి
ఆలమూరు: మండలంలోని గుమ్మిలేరులో కొలువైన దుర్గామాతను భక్తులు శాకంబరిగా అలంకరించారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా మానసిక ప్రశాంతతను ఇచ్చే ఇలవేల్పుగా స్థానిక మెయిన్రోడ్డులో పంట కాలువ పక్కన రావిచెట్టు కింద ఉన్న అమ్మవారికి శ్రావణ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గ్రామ ఆడపడుచులు పిండివంటలు, పండ్లు, నూతన వస్త్రాలతో సారెను సమర్పించారు. స్థానిక దుర్గాదేవి అమ్మవారికి మూడు దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఈ సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. -
తలారికి వైవీ సుబ్బారెడ్డి పరామర్శ
దేవరపల్లి: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది దేవరపల్లిలోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావును ఆదివారం వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పరామర్శించారు. తలారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు మేకా శేషుబాబు, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఎంపీపీ కేవీకే దుర్గారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గన్నమని జనార్దనరావు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, జిల్లా యువజన విభాగం కార్యదర్శి పచ్చా రాంగోపాల్, కారుమంచి రమేష్ తదితరులు సుబ్బారెడ్డి వెంట ఉన్నారు. కిటకిటలాడిన చినవెంకన్న క్షేత్రం ద్వారకాతిరుమల: స్థానిక చిన వెంకన్న సన్నిధి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో పాటు శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు, పెళ్లి బృందాలు క్షేత్రానికి తరలివచ్చాయి. దర్శనం క్యూ లైన్లు, అనివెట్టి మండపాలు, కల్యాణకట్ట, నిత్యాన్నదాన భవనం తదితర విభాగాలు భక్తులతో కిక్కిరిశాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. మరోవైపు శ్రీవారి సన్నిధిలో ఆదివారం ఉదయం కూడా పెద్ద ఎత్తున వివాహాలు జరిగాయి. నూతన వధూవరులు, వారి బంధుమిత్రులతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి. ఆలయ అనివెట్టి మండపంలో పలు భజన మండళ్ల సభ్యులు నిర్వహించిన కోలాట నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమస్యను పరిష్కరించండి రాజమహేంద్రవరం రూరల్: టెట్పై రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని, ఈ సమస్యను రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ పరిష్కరించాలని ఏపీ ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎండీ సత్యనారాయణరెడ్డి, అన్ను వెంకటరావు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. టెట్ అర్హత మార్కులను తగ్గించడంతో పాటు, ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టులో మాత్రమే పరీక్ష రాసే విధంగా సిలబస్ను మార్చాలన్నారు. ఆఫ్ లైన్ విధానంలో పరీక్ష జరపాలన్నారు. 50 ఏళ్ల నుంచి వయసు పైబడిన ఉపాధ్యాయులకు టెట్ పాస్ కావడానికి గ్రేస్ మార్కులు కేటాయించాలన్నారు. ఉద్యోగ విరమణ చెందిన ఉపాధ్యాయులకు రావాల్సిన జెడ్పీపీఎఫ్, గ్రాట్యుటీ, ఈఎల్ నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. పెండింగ్ డీఏ బకాయిలను చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ వేసి, ఐఆర్ ప్రకటించాలన్నారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లు, నేరచరిత్ర ఉన్నవారికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు వారికి పలు సూచనలు చేశారు. నేరాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తనతో జీవించాలని, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, రవాణా చేస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని, చెడు వ్యసనాలను మాని, మంచి నడవడికను అలవర్చుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, క్రైమ్ సస్పెక్ట్ల కదలికలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని అన్నారు. ఎటువంటి గొడవలు, నేరాలలో పాల్గొన్నా వెంటనే చట్టపర చర్యలు తీసుకుంటామన్నారు. -
ఐక్యతే సామాజిక బలం
కోరుకొండ: ఐక్యతే గవర సామాజిక వర్గానికి బలమని వైఎస్సార్ సీపీ అనకాపల్లి మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీరంగపట్నంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల గౌరి (గవర) సేవా సంఘం కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గాలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు. తనకు గతంలో ఎంపీ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘ నూతన అధ్యక్షుడు తనకాల వెంకటరమణ, ఆయన సతీమణి నాగమణిలను ఆమె శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎంపీ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా తనకాల వెంకటరమణ మాట్లాడుతూ తనకు అధ్యక్షుడిగా మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ ఉపాధ్యక్షుడు కొయిడాల వెంకటగణపతి, ఏఎంసీ చైర్మన్ తనకాల వెంకటరమణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు తనకాల నూకరాజు, సంఘ నాయకులు తనకాల నాగేశ్వరరావు, మద్దాల రమణ, కొయిడాల నానాజీ, బుద్దా శ్రీను, కామరాజు, సూరిశెట్టి భాస్కర్, తనకాల నూకరాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యం కావాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వేణును పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఆయనను పలువురు కలిసి అభినందనలు తెలిపారు. చెల్లుబోయిన వేణును శాటిలైట్సిటీ వైఎస్సార్ సీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. అలాగే పార్టీ రాష్ట్ర మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ, మహిళా నేతలు కళ్యాణిరెడ్డి, సింహాద్రి రామలక్ష్మి, పట్టపగలు వెంకటలక్ష్మిలు ఆయనను అభినందించారు. పిడింగొయ్యి మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు నరవ గోపాలకృష్ణ సత్కరించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ రెండేళ్లలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అంతా కృషి చేద్దామని అన్నారు. -
చిచ్చర పిడుగా.. బిత్తర చూపేలరా!
● చదువుకు ఒక్కడు.. ● బోధనకు ఒక్కరు.. ● వంటకు మరొకరు.. మామిడికుదురు: ఒక్క బిడ్డ బిడ్డా కాదు.. ఓ కన్ను కన్నూ కాదు అంటారు పెద్దలు. సరి ఈడు.. సరిజోడు.. సహాధ్యాయుల సావాసం ఓ వ్యక్తి ఉన్నతికి జిజ్ఞాసకు తోడ్పడుతుంది. పాఠశాల వ్యవస్థ ఏర్పాటుకు ఈ లక్ష్యమే ప్రాణం. ఆ లక్ష్యానికి భిన్నంగా మాట్లాడడానికి, భావ వ్యక్తీకరణకు మరొక జోడు లేకుండా రోజుల తరబడి సాగుతున్న ఆ చిన్నారి ప్రయాణం ఇంకెన్నాళ్లు సాగాలో.. గోగన్నమఠం ప్రాథమిక పాఠశాల నేటి ప్రభుత్వ విద్యా వ్యవస్థ దుస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఒకప్పుడు పదుల సంఖ్యలో విద్యార్థులు ఆటపాటలతో సందడిగా ఉండే పాఠశాలో నేడు ఒకే ఒక్క విద్యార్థి జి.సుధీర్ మిగిలాడు. ఆ చిన్నారికి చదువు చెప్పడానికి ఓ హెచ్ఎం.. వండి పెట్టడానికి ఓ ఆయా. ఇదీ ఆ పాఠశాల సంక్షిప్త స్వరూపం. ఇటీవలి వరకూ మరో విద్యార్థి కూడా ఉండేవాడు. అతడు కొన్నాళ్ల కిందట మరో పాఠశాలకు వెళ్లిపోవడంతో సుధీర్ ఒక్కడే మిగిలిపోయాడు. పాఠశాల బెంచ్పై ఒక్కడే కూర్చుండగా హెచ్ఎం తనకు తోచిన నాలుగు ముక్కలు వల్లె వేస్తూ రోజును గడిపేస్తున్నారు. -
వేడుక వేళ తీయని తిప్పలు!
● శ్రావణంలో బెల్లం, పంచదారకు రెక్కలు ● సామాన్యులకు తప్పని ధరాఘాతాలుద్వారకాతిరుమల: శ్రావణం అంటేనే శుభకార్యాల కాలం. శుభకార్యమంటే షడ్రసోపేతమైన వంటకాలు.. వాటిలో మధుర పదార్థాలు తప్పనిసరి. చక్కెరపొంగలి, పాయసం, బూరెలు వగైరా వంటకాలకు పంచదార, బెల్లం వినియోగం తప్పనిసరి. వీటి ధరలు సగటు జీవి తట్టుకోలేనంగా ఉండడంతో ఇంటిల్లిపాదికీ పండగ మాధుర్యాన్ని పంచడానికి సతమతమవుతున్నాడు. జులై నెలాఖరు నాటికి కిలో పంచదార సుమారు రూ.45 ఉండగా, ప్రస్తుతం రూ.75కు చేరింది. ఆగస్టు ప్రారంభం నుంచే పంచదార ధరలు పెరిగాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి క్రమంగా పెరుగుతూ 22 రోజుల్లో కిలో రూ.30కి చేరింది. మరోవైపు బెల్లం సైతం అదే స్థాయిలో పంచదారకు సమానంగా చేరడంతో సామాన్యులకు ఇబ్బంది తప్పడం లేదు. పంచదారతో పోటీగా బెల్లం.. మార్కెట్లో బెల్లం సైతం పంచదారతో పోటీ పడుతూ రూ.70 నుంచి రూ.75 వరకు చేరింది. ఆర్గానిక్, ప్యూర్ చెరకు, ప్రముఖ బ్రాండ్ల బెల్లం ధరలు రూ.100 పైమాటే ఉంది. వ్యాపారులు లబోదిబో.. సామాన్యుల మాట పక్కన పెడితే టీ స్టాల్స్ మొదలుకొని హొటళ్లు, బ్యాకరీలు, స్వీట్ స్టాల్స్, క్యాటరింగ్ వ్యాపారులు, శీతల పానీయాల వ్యాపారులు ధరల దాడిని తట్టుకోలేకపోతున్నారు. ఒకవైపు పంచదార, బెల్లం ధరలు భగ్గుమనడం, మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడంతో స్వీట్ల తయారీ వ్యయం అమాంతం పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో డిమాండ్ తగ్గి వ్యాపారులు నష్టపోతున్నారు. దడపుట్టిస్తున్న ధరలు.. మూడు నెలల వ్యవధిలో రిటైల్ మార్కెట్లో ధనియాలు కిలో రూ.90 నుంచి రూ.210కి చేరింది. రెండు నెలల క్రితం కిలో రూ.160 ఉన్న రిఫైన్డ్ ఆయిల్ ధర ప్రస్తుతం రూ.190కి పెరిగింది. నెల రోజుల వ్యవధిలో సోనామసూరీ బియ్యం కిలో రూ.50 నుంచి రూ.75కి, పీఎల్ రకం బియ్యం రూ.35 నుంచి రూ.55కి పెరిగింది. వారం క్రితం వరకు కిలో రూ.30 పలికిన ఉల్లిపాయలు నేడు రూ.60కి చేరుకున్నాయి.ఆగస్టులో పంచదార ధర పెరుగుదల.. తేదీ హోల్సేల్ రిటైల్ (రూపాయలలో) 01 45 50 04 50 55 10 56 60 17 60 65 19 63 68 22 70 75ధర పెంచలేం.. నష్టాలు భరించలేం! పండుగ సీజన్ ప్రారంభంతోనే పంచదార ధరలు అమాంతం పెరిగిపోయాయి. ముడి సరుకుల ధరలు సైతం పెరిగి స్వీట్ల తయారీ వ్యయం పెరిగిపోయింది. ధరలు పెంచలేము.. నష్టానికి అమ్మలేము. కొత్తపల్లి దొరబాబు, స్వీట్ షాపు నిర్వహకుడు, ద్వారకాతిరుమల -
షెడ్యూల్ ప్రకారమే నర్సరీ అసోసియేషన్ ఎన్నికలు
అపోహలు నమ్మవద్దని కమిటీ వెల్లడి కడియం: నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి సర్ ఆర్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల నిర్వహణ, పెద్దల కమిటీ వెల్లడించింది. ఆదివారం కడియపులంకలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులు వివరాలను తెలిపారు. సోషల్ మీడియా ప్రచారాలను నమ్మవద్దని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం రత్నం అయ్యప్ప, బొర్సు సుబ్బారాయుడులు అధ్యక్షులుగా, 3వ వార్డు నుంచి ఆకుల కిశోర్, దూలం సత్యనారాయణ, 7వ వార్డు నుంచి పుల్లా శ్రీను, మండెల కృష్ణలు పోటీలో ఉన్నారన్నారు. ఈ మేరకు వారికి గుర్తులు కేటాయించి, ధ్రువీకరణ పత్రాలను అందజేశామన్నారు. 30న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కడియపులంకలోని అసోసియేషన్ కార్యాలయ ఆవరణలోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. ఈ మేరకు మండలంలో ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సేవలను కూడా కోరామని కమిటీ తెలిపింది. సంఘంలోని ప్రతి సభ్యుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు ప్రచారం చేయాలన్నారు. ఇదిలా ఉండగా రాజకీయాలకు అతీతంగా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించినప్పటికీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ముందు పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య రాజీ ప్రయత్నాలు జరగడాన్ని పలువురు విలేకరులు కమిటీ ముందుకు తీసుకువచ్చారు. ఎన్నికల కమిటీలోనే కొందరు ఇందుకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై కమిటీ తీసుకునే క్రమశిక్షణ చర్యలు ఏంటని ప్రశ్నించారు. దీనిపై కమిటీ సభ్యులు సమాధానం చెబుతూ చిన్న లోటుపాట్లు ఉన్నమాట వాస్తమేనని, అయితే అసోసియేషన్లోని సభ్యుల ఐకమత్యం కాపాడడం, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం తమ విధులని, మీడియా తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యయుతంగా జరగడం లేదని, వీటిని రద్దు చేసి మరోసారి జాగ్రత్తలతో నిర్వహించాలని పలువురు రైతులు లిఖిత పూర్వకంగా విజ్ఞాపనాపత్రాన్ని కమిటీకి అందజేశారు. -
మద్యం దుకాణం ఎక్సైజ్ దాడి
● 58 యానాం మద్యం సీసాల స్వాధీనం ● ముగ్గురు నిందితుల అరెస్టు అయినవిల్లి: అయినవిల్లి మండలంలోని మాగం శ్రీరత్న వైన్స్ షాపును ఎక్సెజ్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. మండలం మాగంలోని ఈ దుకాణంలో యానాం మద్యాన్ని భారీ స్థాయిలో తెచ్చి విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. వారు తెచ్చిన మద్యాన్ని బ్రాండెడ్ సీసాలలో నింపి విక్రయిస్తున్నట్టు తెలిసిందని సీఐ రవితేజా తెలిపారు. ఈ మేరకు 58 యానాం మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య అన్నవరం: స్థానిక రైల్వేస్టేషన్లో ఆదివారం మధ్యాహ్నం రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎన్.శ్యామ్ త్రినాథ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఒకటో నంబరు ఫ్లాట్ఫాం నిరీక్షిస్తున్ వ్యక్తి విశాఖ నుంచి వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ను గమనిస్తూ రైలు దగ్గరకు రాగానే ఇంజిన్ ముందుకు దూకాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి 40 ఏళ్లు ఉంటాయని, తెలుపు రంగు గడుల చొక్కా, పింక్ రంగు ప్యాంటు ధరించాడని తెలిపారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ లో భద్రపరచినట్టు తెలిపారు. వ్యక్తి వివరాలు తెలిసిన వారు 92475 86731 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన కోరారు. కౌన్సెలింగ్తో బాల్య వివాహం రద్దు కె.గంగవరం: మండలంలోని బాలాంతరం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు జరుగనున్న వివాహాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు, చైల్డ్ హెల్ప్లైన్ 1098 సిబ్బంది ఆదివారం అడ్డుకున్నారు. ఆమెకు కాజులూరు మండలం ఐతపూడికి చెందిన వరుసకు మేనమామ అయ్యే 36 ఏళ్ల వ్యక్తితో ద్రాక్షారామలో ఈ నెల 26న వివాహం జరగనున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు బాలిక ఇంటికి చేరుకుని ఆమె తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీనితో వారు ఆ వివాహాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు డాక్టర్ మానస, జి.సూర్యనారాయణమూర్తి, చైల్డ్ హెల్ప్లైన్ 1098 జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.పార్వతి పాల్గొన్నారు. కారు డ్రైవర్పై కేసు నమోదుఆత్రేయపురం: కారును అతివేగంగా నడిపి మరో కారును ఢీ కొట్టిన డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎస్.రాము తెలిపారు. వివరాల్లోకి వెళితే వాడపల్లి వేంకటేశ్వరుని దర్శించుకుని టాటా జస్ట్ కారుపై తిరిగి వెళ్తున్న బైన గూడేనికి చెందిన కారంగి శ్రీనివాసరావు కారును లొల్ల లాకుల సమీపంలో ఎర్టిగా కారు ఢీకొంది. దీంతో కారంగి శ్రీనివాసరావు, సునీత దంపతులు, వారి ఇద్దరు కుమారులు సాయిరాంకు మెడపై తీవ్ర గాయం, చందుకు గాయాలయ్యాయి. వీరు 108 వాహనంపై రాజమహేంద్రవరం రాజు న్యూరో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. బాధితుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్.రాము తెలిపారు. గాయపడిన వ్యక్తి మృతిగండేపల్లి: ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్కానింగ్కు తీసుకువెళుతుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు మండలంలోని మురారికి చెందిన శీలం భద్రరావు (75) మోటార్ సైకిల్పై వస్తుండగా విశాఖ వైపు నుంచి వస్తున్న మరో మోటార్ సైకిల్ డీకొంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు స్కానింగ్కు తీసుకువెళుతుండగానే అతడు మృతి చెందినట్టు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలి
కాకినాడ లీగల్: కోర్టుల్లో న్యాయవాదులు, కక్షిదారుల సమయాన్ని ఆదా చేసేలా ఆధునిక సాంకేతికతను మరింతగా వినియోగించాలని, న్యాయస్థానాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. ఈ మేరకు ఆదివారం కాకినాడలోని ఓ ఫంక్షన్ హాల్లో బార్ అసోసియేషన్ల సమైక్య సదస్సు నిర్వహించారు. కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పెన్మెత్స రామచంద్రరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో న్యాయవాదుల సంఘాల నాయకులు, సీనియర్ న్యాయవాదులు పలు అంశాలపై చర్చించారు. కోర్టు భవనాల్లో మౌలిక సదుపాయాలు, న్యాయవాదులు, కక్షిదారులకు అనుకూలమైన వసతులను మెరుగుపరచాలని సమావేశంలో కోరారు. న్యాయవాదుల సమస్యలను ఉమ్మడి జిల్లా న్యాయవాదుల సంఘాల రాజమహేంద్రవరం ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించారు.ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ల తీర్మానం -
సంతపేటలో అగ్నిప్రమాదం
● టెంట్హౌస్, రెండు తాటాకిళ్లు దగ్ధం ● రూ.6 లక్షల ఆస్తి నష్టంతాళ్లరేవు: స్థానిక సంతపేట సెంటర్లోని నందిరేవు వద్ద శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించి రెండు తాటాకిళ్లు, ఒక టెంట్హౌస్ అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల మేరకు అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బొత్స లక్ష్మి ఇంటి నుంచి మంటలు చెలరేగి పక్కనున్న ఇంటితో పాటు దుకాణాలకు వ్యాపించి వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. బైక్, టెంట్హౌస్లోని వస్తువులన్నీ కాలిపోయి సుమారు రూ.6 లక్షల నష్టం వాటిల్లింది. దీంతో లక్ష్మితో పాటు పి.కనకరత్నం, వి.సత్యన్నారాయణ నిరాశ్రయులయ్యారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, జెడ్పీటీసీ సభ్యుడు దొమ్మేటి శామ్యూల్ సాగర్ స్థానిక నాయకులు పరిశీలించి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా బియ్యంతో పాటు, వంట సామగ్రిని అందజేశారు. -
గోల్డెన్ అవర్ దాటిపోతే గండమే!
● సీహెచ్సీకి వెళ్లాలంటే ఎన్నో తిప్పలు ● డివైడర్ దాటడానికి రోగుల ప్రయాసగండేపల్లి: నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటని సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)ను ఇటీవల జెడ్ రాగంపేటని నూతన భవనానికి మార్చారు. అక్కడి వసతులు పెంచడంతో కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి ప్రాంతాల రోగులు అక్కడికే క్యూ కడుతున్నారు. అయితే ఆస్పత్రి సమీపంలో డివైడర్ కటింగ్ లేకపోవడంతో రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో గ్రిల్ దాటి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీంతో పలు సందర్భాలలో రోగులు వాహన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే వాహనాలపై వచ్చే వారైతే నీలాద్రిరావు పేట వద్ద ఉన్న ఆదిత్య ఆస్పత్రి వరకూ వెళ్లి యూ టర్న్ తీసుకు రావలసి వస్తోంది. ఈ పరిస్థితి అత్యవసర వైద్యం అందాల్సిన రోగులకు ప్రాణ సంకటంగా మారుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించి ఆస్పత్రి ఎదుట డివైడర్ వద్ద యూ టర్న్ ఏర్పాటు చేస్తే రోగులతో పాటు, అంబులెన్స్ల రాకపోకలకు అనువుగా ఉంటుందని స్థానికులు కోరుతున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 24,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
తిరుపతికి క్రీడాకారులపయనం
అమలాపురం రూరల్: జిల్లా స్థాయిలో నిర్వహించిన అమరావతి చాంపియన్ షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న 320 క్రీడాకారులు ఆదివారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధ్వర్యంలో తిరుపతికి వెళ్లారు. డీఎస్ఓ వైవీ రుద్ర అధ్వర్యంలో కోచ్లు, మేనేజర్లతో కలసి వారు బస్సుల్లో తరలి వెళ్లారు. వారు వెళ్తున్న బస్సును ఎస్జీఎఫ్ సెక్రటరీ ఒ.ఈశ్వరరావు, బాస్కెట్ బాల్ కోచ్ ఎ.సూర్యకుమారి, తైక్వాండో కోచ్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీఈటీలు కె.గణేష్, రామారావు పాల్గొన్నారు. -
చీకట్లో గూడుపుఠాణి
● పేదల పాకలు పీకేసిన వైనం ● ‘కూటమి’ దుశ్చర్యేనని వైఎస్సార్ సీపీ ఆరోపణ ● పేదలకు అండగా నిలిచిన ఎమ్మెల్సీ త్రిమూర్తులు అరెస్ట్ ● మండపేటలో పెద్ద కాలువ గట్టు వద్ద అలజడి కపిలేశ్వరపురం (మండపేట): గాఢ చీకటి.. చడీచప్పుడు లేని వేళ.. అంతా నిద్రలోకి జారుకున్న సమయంలో.. ఒక్కసారిగా బూట్ల శబ్దాలతో పోలీసుల అలజడి.. ఆదివారం తెల్లవారు జామున సరిగ్గా మూడు గంటలకు మండపేట పెద్ద కాలువ గట్టు వద్ద నిరుపేద కూలీల నివాస ప్రాంతాల వద్ద హడావుడి ఇది. పగలంతా కూలి పనులు చేసుకుని గాఢ నిద్రలో ఉన్న కూలీలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి బిత్తరపోయారు. మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు ఆదేశాలపై తరలివచ్చిన పెద్ద సంఖ్యలో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఒక్కసారిగా పేదల పాకలు పీకేందుకు సన్నద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పట్టణంలోని వైఎస్సార్ సీపీ నాయకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పేదలకు అండగా నిలిచారు. సుమారు రెండు గంటల పాటు వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రోద్భలంతోనే మున్సిపల్, పోలీస్ అధికారులు ఎమ్మెల్సీ తోటపై దౌర్జన్యం చేస్తున్నారంటూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ఆరోపించారు. పేదల తరఫున ఎమ్మెల్సీ త్రిమూర్తులు మాట్లాడుతుండగా డీఎస్పీ దేవకుమార్, పట్టణ సీఐ డి.సురేష్, సిబ్బంది బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వ్యాన్లో ఎక్కించారు. అదే వ్యాన్లో స్వగ్రామం వెంకటాయపాలెం తరలించి, గృహ నిర్బంధం చేశారు. ఒకపక్క పేదల నివాసాలు తొలగింపు, మరోపక్క వారికి అండగా నిలిచినవారి అక్రమ నిర్భంధంతో మండపేట పెద్దకాలువ గట్టు ప్రాంతం అట్టుడికింది. చివరికి అక్కడి 16 ఇళ్లు తొలగించారు. 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇందులో మొత్తం160 మంది కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పెద్దలకు దాసోహం.. పేదలపై ప్రతాపం మండపేట పట్టణంలో విలువైన మున్సిపల్ స్థలాలు అధికార పార్టీ నేతలు, వారి అనుచరుల ఆక్రమణలో ఉన్నాయి. వాటి వివరాలతో సహా కమిషనర్కు ఎమ్మెల్సీ త్రిమూర్తులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. ఆక్రమణలో ఉన్న మున్సిపల్ స్థలాన్ని ఎమ్మెల్సీ తోట సర్వే చేయించి మున్సిపాలిటీకి అప్పగించేందుకు కృషి చేశారు. అదే స్థలాన్ని మరోసారి ఆక్రమించుకున్నారు. దానిపై కమిషనర్ వైఖరిని కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ త్రిమూర్తులు ఎండగట్టారు. ప్రభుత్వం కూలిపోక తప్పదు పేదల ఇళ్లు కూల్చివేత ఘటనపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆయన స్వగృహం వెంకటాయపాలెంలో స్పందించారు. ఇళ్ల కూల్చివేత వెనుక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రోద్భలం ఉందన్నారు. పేదల బతుకులను రోడ్డున పడ్డేసిన కూటమి ప్రభుత్వం కూలిపోక తప్పదని అన్నారు. సుమారు 60 ఏళ్లకు పైబడి నివాసముంటున్న నిరు పేదలను ఖాళీ చేయించడం న్యాయమా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లకు సమీపంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రమేయం ఉన్న పదెకరాల భూమి ఉందని, ఆ భూమి విలువను పెంచుకునే కుట్రలో భాగంగానే ఇళ్లు తొలగించారని ఆరోపించారు. వృద్ధులు, మహిళలు అని కూడా చూడకుండా రోడ్డున పడేశారన్నారు. హిందూ శ్మశాన వాటిక స్ధలాన్ని ఆక్రమించినా, చర్యలు లేవన్నారు. కమ్మ మహాజన సంఘం ఎదురుగా మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయించడం లేదన్నారు. ఇరిగేషన్, మున్సిపల్ స్థలాలను ఆక్రమించి ఎమ్మెల్యే వేగుళ్ల తన లేఅవుట్లలో కలిపేసుకున్నారన్నారు. బురుగుంట చెరువు వద్ద ప్రెస్క్లబ్కు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందన్నారు. పట్టణంలో బడాబాబులు చేసిన ఆక్రమణలను కాదని నిరుపేదల ఇళ్లను తొలగించడాన్ని ఎమ్మెల్సీ ఖండించారు. రానున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో తమ ప్రభుత్వం వచ్చినప్పుడు పేదలకు న్యాయం చేస్తామని, దుశ్చర్యపై కచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పుష్కరాల పేరు చెప్పి..! మండపేట పెద్ద కాలువ గట్టు వద్ద సుమారు 60 ఏళ్లకు పైగా నిరుపేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. వీరంతా పట్టణంలోని హోటళ్లు, ఇతర వ్యాపార దుకాణాల్లో పనులు చేసుకుంటున్నారు. వారి ఇళ్లు ఖాళీ చేయించేందుకు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రోద్భలంతో పలుమార్లు ప్రయత్నాలు చేశారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా ఖాళీ చేయించే ప్రయత్నం బెడిసికొట్టడంతో, తర్వాత మున్సిపల్ అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయిస్తే ప్రతిఘటిస్తామంటూ ఎమ్మెల్సీ త్రిమూర్తులు అండగా నిలిచారు. చివరకు పుష్కర నిధులతో కాలువ రేవు వెంబడి అభివృద్ధి చేసేందుకు అంటూ అధికారులు ఖాళీ చేయించారు. పుష్కరాల్లో గోదావరి నదీ స్నానానికి ప్రాధాన్యం ఇస్తారని, పేదలను కష్టపెట్టొద్దన్న ఎమ్మెల్సీ విజ్ఞప్తిని విస్మరించారు. కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా.. కూలి పనులు చేసుకుని జీవించే తమను రోడ్డున పడేయవద్దంటూ బాధితులు కమిషనర్ రంగారావు కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. అయినా పాకల తొలగింపులు కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ తోట ఘటనా స్థలానికి రాగానే, పేదలు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. రాత్రివేళ పేదలకు అన్యాయం చేయడం సరికాదంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే, ఆయన్ని పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారు. అడ్డుకున్న పార్టీ కార్యకర్తలను పోలీసు వ్యాన్ ఎక్కించారు. పగలు కాకుండా రాత్రిపూట పేదల ఇళ్లు తొలగించడాన్ని న్యాయమనుకుంటున్నారా అంటూ పట్టణ ప్రజలు అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. పేదల ఇళ్లను తొలగించడాన్ని కూటమి నేతలు విజయంగా భావిస్తున్నారని, వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రతి చర్య వెనుకా కూటమి నేతల ప్రోద్భలం ఉన్నట్టు తెలుస్తుందన్నారు. -
పోస్టుమార్ట్మ్లో నిగ్గుతేలుతున్న నిజాలెన్నో!
● మార్ట్ నిర్వహణపై డ్వాక్రా సీసీ ఫిర్యాదు ● మహిళా నేత ఖాతాకు సమాఖ్య నిధులు ● సభ్యుల వివరణ తీసుకున్న మంత్రి దుర్గేష్ ● కలకలం రేపుతున్న ‘సాక్షి’ ప్రత్యేక కథనం..నిడదవోలు రూరల్: నిడదవోలు వెలుగు మాహిళా మార్ట్ వేదికగా సాగిన అక్రమాలలో తవ్వేకొద్ది విస్తుపోయే నిజాలను తెలుస్తున్నాయి. మార్ట్ మూత, కూటమి మహిళా నేత పెత్తనం, నిబంధనల ఉల్లంఘనలపై ‘సాక్షి’లో ఈనెల 19న ‘ప్రగతి వెలుగుకు పోస్టు మార్ట్మ్’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. డీఆర్డీఏ ఉన్నతాధికారుల విచారణ మేరకు నిర్వహిస్తున్న ప్రాథమిక తనిఖీల్లో ఎన్నో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. నిధులకు రెక్కలు.. పట్టణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మండల సమాఖ్య పరిధిలో 2022 నవంబర్ 10న‘చేయూత మహిళా మార్ట్’ ప్రారంభించారు. 1700 గ్రూపుల పరిధిలోని ఒక్కొక్క సభ్యురాలి నుంచి రూ.220 చొప్పున రూ.38.35 లక్షల పెట్టుబతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో దీనిని ఏర్పాటుచేశారు. జిల్లాలో ఐసీడీఎస్ చేపట్టి ‘బంగారు కొండ’ కార్యక్రమానికి అవసరమైన సరకుల సరఫరా బాధ్యతను 2023లో అప్పటి కలెక్టర్ ఈ మార్ట్కు అప్పగించారు. వారు సరఫరా చేసిన కిట్లు విక్రయించగా వచ్చిన రూ.13,86,775కు 2025 ఏప్రిల్ 22న కలెక్టర్ చెక్కు అందజేశారు. ఈ నిధులను ఏ రసీదులతో విత్డ్రా చేశారో తెలియకుండా రికార్డులు మాయం చేసినట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇదే తరహా దోపిడీ సదరు మహిళా నేత 2017లోనూ మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పనిచేసి అప్పటి టీడీపీ నేతల సహకారంతో అవినీతికి పాల్పడినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఆమె పర్యవేక్షణలో అన్నా సంజీవని జనరిక్ మందుల దుకాణంతో పాటు తిమ్మరాజుపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. రైస్ మిల్లర్లతో కలిసి అధికారులతో సిండికేట్గా ఏర్పడి రైతుల ధాన్యం విక్రయాల్లో పలు మోసాలకు పాల్పడ్డారు. 2018లో తిమ్మరాజుపాలెం ఆదర్శ గ్రామ సంఘం నుంచి ఆ మహిళా నేత సమక్షంలో కొందరు సభ్యులు రూ.3.8 లక్షల రుణం తీసుకోవడంతో దానికి వడ్డీ, మిగిలిన అడ్వాన్సులు కలిపి 2022లో రూ.5,61,742 చెల్లించాలని అప్పటి అధికారులు ఆమెను ప్రశ్నించారు. దీంతో త్వరలోనే చెల్లిస్తానని ఖాళీ చెక్కులతో పాటు ఆ మహిళా నేత రూ.2 లక్షలకు సంబంధించిన ప్రామిసరీ నోటును అప్పటి అధికారులకు అందజేసింది. ఈలోగా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ నిధుల రికవరీని అధికారులు విస్మరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూ.3 కోట్ల టర్నోవర్తో లాభాల్లో నడిచిన మార్ట్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దోచుకున్నారని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సాక్షి’ పత్రిక ద్వారానే ఈ బాగోతం బయటపడిందని, వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు మళ్లించిన బాధ్యురాలిపైనా, సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, దారి మళ్లిన ప్రతి పైసా రికవరీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మండల సమాఖ్య అధ్యక్షురాలితో పాటు సభ్యులను శనివారం తన కార్యాలయానికి పిలిచి వివరణ తీసుకున్నారు.కూటమి మహిళా నేత ఖాతాలోకి నిధులు!కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్లో సదరు మహిళా నేత మండల సమాఖ్య అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి మార్ట్ వ్యవహరాల్లోకి ప్రవేశించింది. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రూ.7,76,830 మార్ట్ లావాదేవీల సొమ్మును అధికారిక ఖాతాలో కాకుండా తన వ్యక్తిగత ఖాతాలకు చేసినట్టు కమ్యూనిటీ కోఆర్డినేటర్ (సీసీ) ఏడాది జూన్ 2వ తేదీన డీఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మార్ట్ నిర్వహణ సక్రమంగానే జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ అవకతవకలు చోటు చేసుకున్నట్టు డీఆర్డీఏ ఉన్నతాధికారులకు సీసీ ఆరు పేజీల లేఖలో ఫిర్యాదు చేసి విచారణ కోరారు. -
వీఐపీ పాస్ విక్రయించిన హోంగార్డు!
ఘటనపై విచారణకు ఈఓ ఆదేశం ద్వారకాతిరుమల: భక్తుల రద్దీ నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేసిన సమయంలో ఓ హోంగార్డు ఫ్రీ ఎంట్రీపాస్ (వీఐపీ పాస్)ను ఒక భక్తుడికి రూ. 500కు విక్రయించిన ఘటన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళితే.. భక్తుల రద్దీని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10.45 గంటలకే చినవెంకన్న అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. సర్వదర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలకు మాత్రమే భక్తులను అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఏలూరుకు చెందిన ఇద్దరు భక్తులు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఉత్తర రాజగోపురం వద్దకు చేరుకుని రూ.500 అంతరాలయ దర్శనం టిక్కెట్లు కావాలని సిబ్బందిని కోరారు. అంతరాలయ దర్శనం నిలిపివేశామని సిబ్బంది వారికి తెలిపారు. దీంతో రూ.200 అతిశీఘ్ర దర్శనం టిక్కెట్లు ఇవ్వాలని భక్తులు కోరగా, అక్కడే ఉన్న ఓ హోంగార్డు తన వద్ద ఒక అంతరాలయ దర్శనం టిక్కెట్ ఉందని చెప్పి రూ.500 తీసుకుని, టిక్కెట్ ఇచ్చాడు. దీంతో ఇద్దరు భక్తుల్లో ఒకరు ఆ టిక్కెట్తో అంతరాలయ దర్శనానికి, మరొకరు రూ.200 టిక్కెట్తో అతిశీఘ్ర దర్శనానికి వెళ్లారు. విషయం బయటపడింది ఇలా.. అంతరాలయ దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చిన భక్తుడు తన టిక్కెట్ తనకు ఇస్తే, దానికి వచ్చే రెండు లడ్డూలు తీసుకుంటానని సిబ్బందిని అడిగాడు. ఆ సమయంలో అక్కడున్న టెంపుల్ ఇన్స్పెక్టర్ టిక్కెట్ను పరిశీలించడంతో విషయం బయటపడింది. ఆ టిక్కెట్ను ఉదయం 8.16 గంటలకు ఉంగుటూరు ఎమ్మెల్యే రిఫరెన్స్తో ప్రొటోకాల్ కార్యాలయంలో జారీ చేసిన ఫ్రీ ఎంట్రీ పాస్గా గుర్తించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు సదరు భక్తుడిని విచారించగా, హోంగార్డు నుంచి రూ. 500కు టిక్కెట్ తీసుకున్న విషయాన్ని వివరించాడు. అనంతరం సదరు హోంగార్డును సూపరింటెండెంట్ ప్రశ్నించగా.. తొలుత తన కుటుంబ సభ్యులు వచ్చారని, మరోసారి దేవస్థానం సీఎస్ఓ తీసుకొచ్చి ఇచ్చారని పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో భక్తుడి నుంచి సూపరింటెండెంట్ రామారావు లిఖితపూర్వక ఫిర్యాదును స్వీకరించారు. జరిగిన విషయాన్ని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సమగ్ర విచారణకు ఆదేశించారు. -
అయినవిల్లిలో భక్తుల సందడి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. అనంతరం స్వామిని ప్రత్యేకంగా అలంకరించి నివేదన చేశారు. స్వామికి 38 జంటలు లఘున్యాస అభిషేకాలు జరిపారు. ఏడు జంటలు గరిక పూజ జరిపారు. 27 మంది భక్త దంపతులు లక్ష్మీగణపతి హోమం చేయించుకున్నారు. ఆరుగురికి అన్నప్రాశన చేశారు. ఏడుగురికి తులాభారం సమర్పించారు. 22 మందికి అక్షరాభ్యాసం చేశారు. 69 మంది నూతన వాహన పూజలు చేయించుకున్నారు. 2415 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు రూ.3,23,462 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
యానాంలో దారుణం.. భార్య పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందని..
సాక్షి, కాకినాడ జిల్లా: కేంద్రపాలిత యానాం కనకాల పేటలో దారుణం ఘటన చోటుచేసుకుంది. పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తుందన్న అనుమానంతో భర్త.. భార్యను హత్య చేసి గోదావరి నది పాయలో పడేశాడు. ఆరేళ్ల కిందట చెక్కా అప్పారావు, పువ్వల రేఖ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు రోజుల క్రితం రేఖ ఫోన్లో మరోకరితో చాటింగ్ చేస్తుండగా చూసిన భర్త... గొడవకు దిగాడు.. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో భార్యను భర్త పిడిగుద్దులు గుద్ది.. గొంతు నులిమి చంపేశాడు.అనంతరం భార్య మృతదేహన్ని గోదావరి నది పాయలో పడేసి.. తన భార్య కనిపించడం లేదంటూ భర్త అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అప్పారావును విచారించారు. విచారణలో అప్పారావు నేరం ఒప్పుకున్నాడు. నదిలో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. రేఖ మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఆటే పంచప్రాణాలు
● అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బ్యాడ్మింటర్ రిఫరీలు ● ఐదుగురి పేరూ శ్రీనివాస్ కావడం గమనార్హం ● నలుగురు ఉపాధ్యాయులు, ఒకటికి త్రుటిలో తప్పిన అవకాశం సాక్షి, అమలాపురం: కోనసీమ అంటే పచ్చని కొబ్బరి తోటల అందం, గోదావరి పాయల పరవశం మాత్రమే కాదు. ఇప్పుడు షటిల్ బ్యాడ్మింటన్కు కూడా చిరునామాగా మారింది. అంతర్జాతీయ డబుల్స్ సంచలనం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, ఆకుల సునీల్, కృష్ణంరాజు, డి.సునీల్ కుమార్ వంటి స్టార్ షట్లర్లను ఈ నేల అందించింది. ప్రస్తుతం కోర్టుకు న్యాయం చేసే న్యాయ నిర్ణేతలకు సైతం పుట్టినిల్లుగా మారింది. ఆశ్చర్యం ఏమిటంటే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఐదుగురు టెక్నికల్ అఫీషియల్స్ పేర్లు శ్రీనివాసే కావడం విషయం. పాయసం, గొల్లకోటి, దొడ్డా, ఏవీ, అడపా.. వీరే కోనసీమ షటిల్ పంచ పాండవులు. టీచర్ ఉద్యోగం చేస్తూనే (ఒకరికి త్రుటిలో తప్పింది), షటిల్పై మక్కువతో 18 ఏళ్లుగా కోర్టులో సైడ్లైన్కు, సర్వీస్ ఫాల్ట్లకు కాపలా కాస్తున్న ఈ పంచ పాండవుల ప్రస్థానంపై కథనం.


