breaking news
Bapatla
-
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు శరత్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అర్ధనగ్న మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం ప్రదర్శన చేపట్టారు. శరత్ మాట్లాడుతూ 15రోజులుగా వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం చేపట్టిన చలో విజయవాడకి తరలిరావాలని కోరారు. జూలై 4నుంచి అత్యవసరాలు మంచినీళ్లు, విద్యుత్తు లాంటి విధు లు నిర్వహిస్తున్న కార్మికులు కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అమలుచేయాలి, జీవో నెంబర్ 36 ప్రకారం రూ.24,500 వేతనం అమలుచేయాలని, తక్షణం తల్లికి వందనం ఇవ్వాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గత సంవత్సరం 17రోజుల సమ్మె ఒప్పందాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, బాపట్ల పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూని యన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, సాంబిరెడ్డి, ప్రమీల, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ నాయకులు శరత్ -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై ఇనుప రాడ్లతో దాడి
చీరాల అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావూరి బాలకోటిరెడ్డిపై టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుడు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు కావూరి బాలకోటిరెడ్డి తెలిపిన వివరాల మేరకు... చీరాల మండలం కొత్తపాలేనికి చెందిన కావూరి బాలకోటిరెడ్డి మంగళవారం చీరాల నగర్లో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో దండుబాట వద్ద చెట్టు కింద కూర్చున్నాడు. ఈ సమయంలో బక్కా శివప్రసాద్రెడ్డి అనుచరులు రాజు సుబ్బారెడ్డి, బక్కా పరుశురామిరెడ్డిలు.. బాలకోటిరెడ్డిపై ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. రాజకీయంగా గ్రామంలో కీలకంగా మారుతున్నావని.. ప్రజలకు అన్ని విషయాల్లో తోడుంటున్నావని.. నీవు లేకపోతే తమకు అడ్డు ఉండదంటూ దుర్భాషలాడారు. అన్నింటా అడ్డు తగులుతున్నావని, సర్పంచ్గా పోటీ చేస్తానని చెబుతున్నావంటూ గాయపరిచారు. తలకు బలమైన గాయం కావడంతో బంధువులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు బాధితుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేశారు. దాడి సంఘటన సమాచారం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, పార్టీ నాయకులకు ఏరియా వైద్యశాలకు వెళ్లి బాలకోటిరెడ్డిని పరామర్శించారు. దాడి చేయడం హేయమైన చర్య అని, టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
ఆర్మీజవాన్ పార్థివదేహానికి నివాళులర్పించిన డాక్టర్ గణేష్
నగరం: జమ్మూ కశ్మీర్లోని రాజౌరీలో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి మృతి చెందిన ఆర్మీ జవాన్ ఉప్పాల రవికుమార్ పార్థివదేహం మంగళవారం స్వగ్రామమైన చిరకాలవారిపాలెం చేరింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆర్మీ జవాన్ రవికుమార్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవికుమార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్మీ అధికారులు రవికుమార్ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఇంకోల్లు రామకృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నిజాంపట్నం కోటేశ్వరరావు, యార్లగడ్డ మదన్మోహన్ పాల్గొన్నారు. -
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు
డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి చీరాలటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించి వలసలు నిర్మూలించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సిబ్బంది, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం చీరాల మండల పరిషత్ కార్యాలయంలో 2024 ఏప్రిల్ నుంచి మార్చి 2025 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక తనిఖీ బృందం చీరాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై తనిఖీ చేపట్టారు. మండలంలో చేపట్టిన 1243 పనులు, ఖర్చులు రూ.9 కోట్లు, పంచాయతీరాజ్ నిధులు రూ.1.82 కోట్లు, ఎన్ఆర్ఈజీఎన్ రూ.6.95 కోట్లతో ఉపాధి పనులు చేశారు. పంట కాలువలు, పూడికతీత పనులు, గోకులం షెడ్లు 10 నిర్మాణాలు, ఉపాధి కూలీలకు చెల్లించిన నగదు, వసతులు, మెటీరియల్ సరఫరా, మొక్కల సంరక్షణ తదితర పనులపై సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారిగా చేసిన పనులను వివరించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో చేసిన పనులు, చెల్లింపుల వివరాలను, కూలీలు వివరాలను సిబ్బంది అధికారులకు వివరించారు. సామాజిక తనిఖీకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పీడీ విజయలక్ష్మి వ్యవహరించగా జిల్లా హెచ్ఆర్ మేనేజర్ చంద్రశేఖర్, ఎంపీడీవో శివన్నారాయణ, జిల్లా ఏపీడీ కోటయ్య నాయక్, ఏపీవో దాసు, ఫీల్డు అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఉపాధి పనుల గురించి డ్వామా పీడీ పలు సూచనలు చేశారు. -
ప్రకృతి మాతకు ప్రణామం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శాకంబరీ ఉత్సవాలు అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఘాట్రోడ్డులోని కామథేను అమ్మ వారు, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతా మూర్తులను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించారు. నూతన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఈఓ శీనానాయక్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, ఉపాలయాలను కరివేపాకు, నిమ్మకాయలు, వివిధ రకాల కాయగూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో కూరగాయలతో ఏర్పాటుచేసిన శివలింగాకృతి, పక్కనే స్వామి వారికి నమస్కరిస్తున్న అమ్మవారు, కుమార స్వామి, గణపతి ప్రతిమలు ఆకట్టుకున్నాయి. నీటి కొలనులో సొరకాయలతో తీర్చిదిద్దిన హంసలు, దోసకాయలతో రూపొందించిన బాతులు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కాకరకాయలతో చేసిన మొసలి విశేషంగా ఆకట్టుకుంటోంది. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని శాకంబరీగా అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సారెను స్వీకరించారు. కదంబం కోసం బారులు తీరిన భక్తులు శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో అలంకారం ప్రత్యేకత. ఆ కూరగాయలను ఉపయోగించే తయారు చేసే కదంబ ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. ఏడో అంతస్తులో ఉచిత ప్రసాద వితరణ వద్ద ఉదయం ఆలయ ఈఓ శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రసాద పంపిణీని ప్రారంభించారు. పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తబృందాలు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ ఈవో అన్నప్రసాద తయారీ పోటులో కదంబ ప్రసాద తయారీని పరిశీలించారు. ప్రసాద తయారీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుందరికి ప్రసాదం అందేలా చూడాలని ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి విచ్చే సిన భక్తులు కాయగూరలు, ఆకుకూరలతో తయారు చేసిన దండలను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఘనంగాశాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కూరగాయలు, ఆకుకూరలతో దుర్గమ్మకు అలంకరణ మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిబాపట్ల: వర్షాకాలంలో సీజనల్ అంటు వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దిగువ ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైరల్ ఫీవర్ వచ్చే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్లు నమోదైతే తక్షణమే స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలలో అత్యవసరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా నివారించడమే ముఖ్యోద్దేశం అన్నారు. సాధారణం కంటే జ్వరాల కేసులు ఏ ప్రాంతంలోనైనా అధికమైతే వెంటనే సమాచారం పంపాలన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన ఔషధాలను నిల్వ చేసుకోవాలన్నారు. ఔషధాల కొరత లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కాల్వల పూడికతీత పనులు వేగంగా చేపట్టాలన్నారు. వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలు, గృహాల మధ్య నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. నిర్లిప్తంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. ప్రతి ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. భూమిలో కుళ్లిపోయే స్వభావం ఉన్న వ్యర్థాలను పచ్చ కుండీలు, ప్లాస్టిక్ తదితరమైన వ్యర్థ పదార్థాలను ఎరుపు చెత్తకుండీలో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా, సాగర్ కాల్వల నుంచి నీరు విడుదలవుతున్నందున జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్ చెరువులన్నిటిని నింపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీపీఓ ప్రభాకరరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
–రేషన్ దుకాణం సీజ్ చేసిన ఆర్డీఓ చీరాల టౌన్: ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడే డీలర్లపై చర్యలు తప్పవని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీలోని 38 నంబర్ రేషన్ దుకాణంపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ, ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైకుంఠపురంలోని 38 నెంబర్ రేషన్ దుకాణదారుడు దుడ్డు ప్రభాకర్ ప్రజలకు బియ్యం, పంచదార సక్రమంగా అందించకుండా నగదు చెల్లించడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో దుకాణానికి కేటాయించిన బియ్యం, పంచదారకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. తనిఖీల్లో 300 కిలోల రేషన్ బియ్యం, 57 ప్యాకెట్లు పంచదార అదనంగా ఉండటంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ దుకాణాన్ని, సరుకులను సీజ్ చేశారు. ఆర్డీవో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా ప్రజల నుంచి నగదుకు కొనుగోలు చేసినా, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా పంపిణీ పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంటే కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. రేషన్ డీలర్లు విధిగా నిబంధనల ప్రకారం సరుకులు పంపిణీ చేసి స్టాక్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడినా, బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజ్ చేసిన బియ్యం, పంచదారను ఎన్ఫోర్స్మెంట్ డీటీ గీతాకు అందించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ కె.గోపికృష్ణ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
‘నూటా’ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు
ఏఎన్యూ: నూటా (ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యాపక సంఘం) ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆచార్య కె.సుమంత్ కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నూటా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల అధికారి ఆచార్య ఎస్.మురళీమోహన్కు మంగళవారం వారిరువురూ వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల ప్రక్రియలోని లోపాలపై తాము హైకోర్టును ఆశ్రయించామని తమ పిటీషన్పై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు నూటా ఎన్నికల కోసం ఈనెల 1వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎస్పీ తుషార్ డూడీ ––––––––––––––––––––––– బాపట్లటౌన్: కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్డూడీ హెచ్చరించారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని కళాశాలలు, విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తనిఖీల అనంతరం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తుల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదనే నిబంధన ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులు, పాన్, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై కోట్పా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, ఆ లక్ష్య సాధన కోసం కృషి చేసే సమయంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు, టోల్ ఫ్రీ నంబర్ 1972 కు కాల్ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు
లక్ష్మీపురం: ఈ నెల 2వ తేదీన కొబాల్డ్పేటలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు అదృశ్యం అయిన కేసును పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఛేదించారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టాభిపురం సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కోబాల్డ్పేట 6వ లైనులో నివాసం ఉండే సయ్యద్ సందానీకి, అతని భార్య కరీమూన్కు కొంత కాలంగా చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే భనవంలో పై పోర్షన్లో నివాసం ఉండే షేక్ చిన్న బాజీకి, ఆమె భార్య రజియాకు కూడా మనస్పర్థలు ఉన్నాయి రజియా చెల్లెలు సైదాబీకూడా తన భర్తతో గొడవల కారణంగా వచ్చి వీరి వద్దనే తన కుమార్తెతో ఉంటోంది. కరీమూన్, రజియా, సైదాబీలు ఎక్కడికై నా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ నెల 2వ తేదీన బయలుదేరారు. కరీమూన్ తన ముగ్గురు మగ పిల్లలను, రజియా తన ముగ్గురు పిల్లలను, సైదాబీ తన కుమార్తెను వెంట బెట్టుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం ప్రత్యేక బృందాన్ని కేటాయించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తన సిబ్బందితో ఏఎస్సై ఆంటోని, హెడ్ కానిస్టేబుల్ ప్రసాదరావు, కోటేశ్వరరావు, నరసింహారావు, మాణిక్యరావుల సహాయంతో హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలో వీరు ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. -
జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
గుంటూరు వెస్ట్: జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, బీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులలో కొరవడిన సమన్వయం జిల్లా సమీక్షా సమావేశంలో సమన్వయం లేకుండా పోయింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఎక్కడా సమన్వయం లేకపోవడం గమనార్హం. సమావేశంలో తల్లికి వందనంపై చర్చ జరిగేటప్పుడు పూర్తి వివరాలు డీఈఓ రేణుక వెల్లడించలేకపోయారు. దీంతో శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్లు నిలదీశారు. కొందరికి రూ.13 వేలు, మరికొందరికి రూ.10 వేలు ఎందుకు పడుతున్నాయని శాసన సభ్యులు ప్రశ్నించగా అధికారుల వద్ద సమాధానం కరువైంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వెల్లడించారు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు నగదు జమ చేయలేదని నిలదీశారు. కలెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు సీసీఆర్సీ కార్డులతోపాటు కౌలు రైతులకు రుణాలు లక్ష్యాల మేరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించినప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నామని అధికారులు దాటవేత ధోరణిలో బదులిచ్చారు. ఇక పీ4 విషయానికి వస్తే మరీ దారుణంగా వ్యవహరించారు. జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 17,050, పశ్చిమకు 14,757, మంగళగిరికి 9,968, పొన్నూరుకు 9,632, ప్రత్తిపాడుకు 6,700, తెనాలికి 11,173 మందిని ఆదుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయిస్తే ఒక్కరు కూడా ఎంత మందికి న్యాయం చేవామో చెప్పలేదు. ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించలేదని తెలిసింది. ఈ సమావేశానికి కూడా మంగళగిరి శాసన సభ్యులు, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. ఆయనతోపాటు ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు, తెనాలి శాసన సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్లు రాలేదు. – ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ -
పికిల్ బాల్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
గుంటూరువెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం గుంటూరులోని వీవీవీ హెల్త్క్లబ్లో నిర్వహించారు. ఎన్నికలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి పి.నరసింహా రెడ్డి, ఏపీ పీపుల్ బాల్ సంఘం కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఒలింపిక్ సంఘం నుంచి కె.వేణుగోపాల్తోపాటు న్యాయవాది చిగురుపాటి రవీంద్రనాధ్ హాజరయ్యారు. చీఫ్ ఇన్ ప్యాట్రన్గా టి.అరుణ్ కుమార్, చైర్మన్గా చుక్కపల్లి రాకేష్, గౌరవాధ్యక్షుడిగా టి.హరికిషన్ సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్గా డాక్టర్ ఎం.శివకుమార్, ఉపాధ్యక్షులుగా సి.హెచ్.రవీంద్రబాబు, ఎన్వీ కమలాకాంత్, ఎస్వీ రామకోటేశ్వరరావు, డాక్టర్ పి.వరుణ్, డాక్టర్ టి.హనుమంతరావు, ఎం.భరత్ కుమార్, కార్యదర్శిగా జీవీఎస్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఎం.కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఫణీంద్ర, ఎన్ ఫణిరామ్, ఎస్కే మన్సూర్ వలి, ఎ.సుబ్బారావు, నిర్వహణ కార్యదర్శిగా కె.అరుణ్ కుమార్, కోశాధికారిగా కె.సుస్మితా చౌదరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
రైలు కింద పడి యువకుడు మృతి
రేపల్లె: రైలు కింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి వివరాల మేరకు సికింద్రాబాద్ నుంచి రేపల్లెకి రాత్రి 9 గంటలకు వచ్చే డెల్టా ఎక్స్ప్రెస్ కింద యువకుడు పడి మృతి చెంది ఉండటాన్ని రైల్వే గ్యాంగ్మెన్లు గమనించి మంగళవారం సమాచారం ఇచ్చారన్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు నగరం మండలం ధూళిపూడి గ్రామానికి చెందిన కొండవీటి మణి (25)గా గుర్తించామన్నారు. మోర్లవారిపాలెం రైల్వే గేటుకు సమీపంలో ప్రమాదం జరిగిందన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
రక్షించేందుకు తోటి రైతులు చేసిన ప్రయత్నం విఫలం కొల్లూరు : వరి ఎండిపోకుండా పంటకు నీరు పెట్టే క్రమంలో కౌలు రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యుఒడిలోకి చేరిన సంఘటన కొల్లూరులో జరిగింది. కుటంబ సభ్యులు, స్థానిక రైతుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు గుంటపునుగులు చెట్టు ప్రాంతానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావు (53) వరి చేనుకు విద్యుత్ మోటరు సాయంతో నీరు పెట్టేందుకు మంగళవారం ఉదయం అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉన్న పొలం వద్దకు సహచర రైతులతో కలసి వెళ్లాడు. విద్యుత్ సరఫరా ఆలస్యం కావడంతో తోటి రైతులకు ఫోన్ చేసి సరఫరా సమయంపై ఆరా తీసి అక్కడే వేచి ఉన్నాడు. కొద్ది సేపటికి కరెంట్ రావడంతో మోటరు ఆన్చేసే ప్రయత్నం చేశాడు. స్టార్టర్ బాక్స్కు విద్యుత్ వెలువడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతనిని రక్షించేందుకు కర్రలతో కొట్టడంతో పక్కకి పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని హుటాహుటిన కొల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లగా, వైద్యులు సూచనలతో తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, వివాహమైన కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్ ్స వివరాల సేకరణ సత్తెనపల్లి: క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విజిలెనన్స్ అధికారులు మంగళవారం వివరాలను సేకరించారు. విజిలెనన్స్ రేంజ్ ఇన్స్పెక్టర్ షేక్ సైదులు నేతృత్వంలోని నలుగురు విజిలెన్స్ బృందం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఆర్వో అప్పారావు వద్ద వివరాలు కోరారు. ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా ఇచ్చి దాని ప్రకారం వివరాలు నింపాలని సూచించారు. పట్టణంతోపాటు మండలంలోని గ్రామ/వార్డు సచివాలయాల అడ్మిన్లు అందర్నీ మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి వారి చేత ప్రొఫార్మా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు. మాజీ మంత్రి అంబటికి పోలీసులు నోటీసులు సత్తెనపల్లి:పోలీసుల విచారణకు హాజరు కావాలని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారంటూ పలు సెక్షన్లతో విచారణకు హాజరు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈనెల 11న సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీ గుంటూరు ఎడ్యుకేషన్: పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఏపీ రెసిడెన్షియల్ ఉర్దూ మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో చేరేందుకు అర్హులైన పేద ముస్లిం విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు సంప్రదించాలని ప్రిన్సిపల్ పి. సాంబశివరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బైపీసీలో 20, సీఈసీలో 15 సీట్లలో ప్రవేశానికి బీసీ–ఈ, బీసీ–బీ కేటగిరీ విద్యార్థులు అర్హులని తెలిపారు. నేడు సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ లక్ష్మీపురం: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. పాలకులను హెచ్చరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభం అవుతుందని చెప్పారు. బీఆర్ స్టేడియం వరకు సాగుతుందని వివరించారు. అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, యువత, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా పోలీసుల బదిలీల్లో అవస్థలు
● గుంటూరు అర్బన్ నుంచి సుదూర ప్రాంతాలకు బదిలీలు ● తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన నగరంపాలెం: గ్రామ, వార్డు సచివాలయాల బదిలీల పక్రియ గందరగోళంగా మారిందని మహిళా పోలీసులు వాపోయారు. బదిలీల దరఖాస్తుల్లో ఐదు ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వందల కిలో మీటర్ల దూరం బదిలీలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ నినదించారు. గత నెల 28న గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే మహిళా పోలీసుల బదిలీల పక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని మహిళా పోలీసులు ఆయా డీపీఓల్లో దరఖాస్తులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బదిలీల పక్రియ ముగిసి, పోస్టింగ్లు కల్పించారు. ఒక్కసారిగా మహిళా పోలీసుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు అర్బన్ జిల్లాలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే వారికి పల్నాడు, బాపట్ల జిల్లాలను కేటాయించారని వాపోయారు. కనీసం ఐదు ఆప్షన్లల్లో ఒకట్రెండు వాటికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. ఏడు నెలల బాబు ఉన్నాడని దరఖాస్తులో తెలియజేసినా గుంటూరు అర్బన్ నుంచి మేడికొండూరు మండలం రూరల్కు బదిలీ చేశారని ఓ మహిళా పోలీస్ వాపోయింది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారి అందుబాటులో లేరని చెప్పడంతో డీపీఓ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో చంటి బిడ్డలతో వచ్చిన వారు సైతం వెనుదిరిగి వెళ్లారు. -
నూతన బస్లను ప్రారంభించిన మంత్రులు
అద్దంకి: ఆర్టీసీ నూతన బస్సులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, క్రీడా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్రెడ్డి మంగళవారం ప్రాంరంభించారు. విద్యుత్శాఖ మంత్రి మాట్లాడుతూ అద్దంకికి ఇప్పటి వరకూ 12 కొత్త బస్సులను ఇచ్చినట్లు చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో లోక్ సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ వెంటకమురళి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ విజిలెన్స్ దాడులు వేటపాలెం: వేటపాలెంలో విద్యుత్ విజిలెన్స్ సిబ్బంది మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో విజిలెన్స్ డీఈ ఎం.భాస్కర్ వివరాలు వెల్లడించారు. విద్యుత్ సిబ్బంది 36 బృందాలుగా ఏర్పడి వేటపాలెం టౌన్ ప్రాంతంలో 3232 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేశారు. తనిఖీల్లో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువగా వాడుతున్న 66 మందికి రూ.2.35 లక్షలు అపరాధ రుసుం విధించారు. అనుమతించిన కేటగిరీలో కాకుండా మరొక కేటగిరీలో వాడుతున్న 12 మంది వద్ద రూ.10 వేల అపరాధ రుసుం వసూలు చేశారు. దాడుల్లో జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ గువ్వల ఆంజనేయులు, విజిలెన్స్ ఏడీ విజయ శ్రీనివాస్, చీరాల ఆపరేషన్ డివిజన్ డీఈ జాన్ థామస్, వేటపాలెం ఏడీ పెరుగు శ్రీనివాస్రావు, వేదవ్యాస్, చీరాల డివిజన్ ఏడీలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సెలింగ్గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం ఏఎన్ఎంలకు సాధారణ బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. నాలుగు రోజుల కిందట నిర్వహించిన కౌన్సెలింగ్పై పలు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తిరిగి జూమ్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించారు. సుమారు 900 మందికి పైగా వార్డు సచివాలయ ఏఎన్ఎం గ్రేడ్–3 కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. ఈ పక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. కనుల పండువగా అమ్మవారికి సారె మహోత్సవం బాపట్లటౌన్: పట్టణంలోని శృంగారపురంలో వేంచేసియున్న వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలోని గోవిందమ్మ అమ్మవారికి మంగళవారం పట్టణంలోని మహిళల ఆధ్వర్యంలో ఆషాఢ సారె సమర్పించారు. తొలుత పట్టణంలోని మహిళలు పుసుపు, కుంకుమ, పండ్లు, పూలు, చీరలు, గాజులు, సలిమిడి, వడపప్పుతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువులను పూజించాలి అమరావతి: ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువు లను పూజించాలని భవఘ్నిగురూజీ అన్నారు. మండలంలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలో గురిపూర్ణిమ మహోత్సవాల తొలిరోజు మంగళవారం కార్యక్రమాలను భక్తిప్రపత్తుల తో నిర్వహించారు. భవఘ్ని గురూజీ మాట్లా డుతూ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద భారతదేశం సొంతమన్నారు. ఋషులు, మునులు, గురువులు మన కు అందించిన మహోన్నతమైన జ్ఞాన సంపదను సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో బోధించే గురువులను స్మరించుకోవటం అదృష్టంగా భావించాలన్నారు. తొ లుత మంగళవా రం ఉదయాన్నే వ్యాసభగవానులకు సుప్రభాతసేవ, వ్యాసభగవానుడి ఉ త్సవమూర్తికి రథోత్సవం, ఆదిగురువు వ్యా స భగవానుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. -
వాడవాడలా దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని పురష్కరించుకొని వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్నిచోట్ల క్షీరాభిషేకాలు చేశారు. కేక్లు కట్చేసి స్వీట్లు పంచి పెట్టారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనాథలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేయడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రులలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి జనరంజక పాలనను జనం గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనను దేవుడిలా కొలిచిన పేద, మధ్యతరగతి ప్రజలు మరోమారు స్మరించుకున్నారు. ● వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం అద్దేపల్లిలో సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఆధ్వర్యంలో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ర్తకదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరమణ, పార్టీ మండల అధ్యక్షుడు పడమటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేమూరు, కొల్లూరు, చుండూరు, అమర్తలూరు మండలాలలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ● రేపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఈవూరు గణేష్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత రేపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. బస్టాండ్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత గుళ్లపల్లి వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవూరు గణేష్తోపాటు పార్టీ నేతలు చిత్రాల ఒబెదు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరం, నిజాంపట్నం మండలాల్లో కూడా వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ● అద్దంకిలో సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో కేక్కట్ చేశారు. తరువాత ఎన్టీఆర్ నగర్లోని వైఎస్సార్ విగ్రమానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, జ్యోతి హనుమంతరావు, రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు. ● పర్చూరులో నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఇంకొల్లు స్థూపం సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత చినగంజాంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అనంతరం కారంచేడులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. కేట్కట్ చేశారు. తరువాత పర్చూరు, యద్దనపూడి, మార్టూరు మండలాలలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ● చీరాలలో సమన్వయకర్త కరణం వెంకటేశ్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత గడియారస్తంభం సెంటర్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేకంగా మహిళలతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆస్పతిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మేరీబాబు, అంకాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు పలుచోట్ల అన్నదానం, రక్తదాన శిబిరాలు రోగులకు పండ్లు పంపిణీ, అనాథలకు దుప్పట్ల పంపిణీ ఆయా నియోజకవర్గాలలో పాల్గొన్న సమన్వయకర్తలు -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
బాపట్ల : అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పోలీస్ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి తగాదాలు, స్థల వివాదాలు ఇతర పలు సమస్యలపై వచ్చిన ప్రజల అభ్యర్థనలను ఎస్పీ కూలంకషంగా విని, అర్జీలను పరిశీలించాలని సూచించారు. సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలను త్వరితగతిన చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో మాట్లాడుతూ బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవవహరిస్తూ, వారి సమస్యలను నిర్దేశిత గడువులోనే సంతృప్తికర రీతిలో పరిష్కరించాలన్నారు. పునరావృత అర్జీలు రాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని స్పష్టం చేశారు. అర్జీలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మొయిన్, పీజీఆర్ఎస్ సెల్ ఇనన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ -
మీటర్ల ఏర్పాటుపై కూటమి నాయకులను నిలదీయండి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని నిలిపివేయాలని, ఈ విషయంపై ప్రజలంతా ప్రజాప్రతినిధులను నిలదీయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలిపారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు గత ప్రభుత్వం అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే అదానితో అనేక ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల నెత్తిన విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని మోపుతూ బలవంతంగా ప్రజలకు అంటగడుతున్నారని, దీనివలన ఇప్పటికే ప్రజలకు అర్థం కాకుండా విద్యుత్ చార్జీలు పెంచి నడ్డి విరిచారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్మీటర్లు బిగింపు వలన ప్రజలంతా మరింతగా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ మేరకు పోస్టర్లు ప్రదర్శించారు. పీడీఎం రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, బీసీ సంఘం నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిలుపు ఇచ్చిన ప్రజాసంఘాల నాయకులు మీటర్ల ఏర్పాటుపై ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసన -
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఫీజు రీయింబర్స్తో పేద, మధ్యతరగతి ప్రజల బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఉచిత వైద్యం అధించాడు. లక్షల్లో ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను సైతం రూపాయి ఖర్చులేకుండా చేశారు. జలయజ్ఞంతో సాగునీటి పథకాలు తెచ్చారు. ఉచిత విద్యుత్ అందించి అన్నదాతలకు వ్యవసాయాన్ని మరింత చేరువచేశారు. ఒకటా రెండా వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉరికించారు. జనం గుండెల్లో దేవుడిలా గుడికట్టుకున్నారు. ప్రత్యర్థులు సైతం శభాష్ అనిపించేలా పాలన సాగించారు. ఆయనే దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన పాలనలో బాపట్ల ప్రాంత అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. జయంతి నేపథ్యంలో జిల్లా వాసులు దివంగత నేత పాలనను మరోమారు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రైతులకు ‘ఉచిత’ విద్యుత్ బాపట్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.15 కోట్లతో బాపట్ల సమ్మర్ స్టోరేజి ట్యాంకు పరిధిలో ఫిల్టర్ బెడ్లు, పైపులైన్లు నిర్మించారు. బాపట్లతోపాటు తీరప్రాంతంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో రైతులు ఇసుక నేలల్లో మూడు పంటలు పండించుకుంటున్నారు. హైలెవల్లో చీరాల పరుగులు చీరాల నియోజకవర్గంలో రూ.120 కోట్లతో చీరాల అభివృద్ధి, రూ.6 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించారు. చేనేతల రుణాలు మాఫీచేసి అభయహస్తం అందించారు. వీటితోపాటు చీరాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలలో సంక్షేమ, అభివృద్ధి పనులుచేపట్టారు.న్యూస్రీల్నేడు జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు పేద జనం గుండెల్లో గూడుకట్టుకున్న దేవుడు దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం జిల్లాలో పెద్దఎత్తున నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అన్ని నియోజకవర్గాలలో దివంగత నేత విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. దివంగత వైఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్యం ఫీజు రీయింబర్స్తో పేద, మధ్యతరగతి వారికి ఉన్నత చదువులు తీరప్రాంత రైతులకు ఉచిత విద్యుత్ కో ఆపరేటివ్లోకి జంపని షుగర్ ఫ్యాక్టరీ నిజాంపట్నంలో సునామీ బాధితులకు పక్కా గృహాలు విజయవాడ నుంచి రేపల్లె వరకు కృష్ణా కరకట్ట నిర్మాణం అద్దంకిలో జలయజ్ఞం కింద మూడు సాగునీటి పథకాలు రూ.1100 కోట్లతో మేదరమెట్ల– నార్కెట్పల్లి రహదారి దివంగత నేతను కొనియాడుతున్న జిల్లా వాసులు ఆయన దారిలోనే కుమారుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలన నేడు జిల్లాలో ఘనంగా దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు -
నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ధూళిపాళ్ల నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో.. మన్నవ గ్రామంలో బొనిగల నాగమల్లేశ్వరరావుపై దారుణంగా దాడి చేసి.. గూండాలు, రౌడీషీటర్లని వ్యాఖ్యానించటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు హెచ్చరించారు. 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక దళిత కుటుంబంపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గుంటూరు నగరం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం తాను, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కలిసి ఆస్పత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావును చూసి రావటం జరిగిందన్నారు. దళిత కుటుంబానికి చెందిన నాగమల్లేశ్వరరావుపై టీ స్టాల్ వద్ద టీడీపీ నేతలు దాడి చేయడం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ కుటుంబానికి చెందిన అమరేంద్రపై కూడా దాడి చేశారని, ఆ కుటుంబాన్ని మట్టుబట్టేందుకు ధూళిపాళ్ల, ఇతర టీడీపీ నేతలు సిద్ధమయ్యారన్నారు. గీత దాటిస్తే భూస్థాపితం చేయండని చెప్పటం.. చంపండి అని చెప్పడం ఒకటేనని దుయ్యబట్టారు. కచ్చితంగా ధూళిపాళ్ల శిక్షార్హులని, ఆయనపై 307 ఐపీసీ కేసు నమోదు చేయాలని, ఏ1గా పెట్టాలని డిమాండ్ చేశారు. ధూళిపాళ్ల ఆదేశాలతోనే దాడి – అంబటి మురళీ కృష్ణ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆదేశాలతోనే నాగేమల్లేశ్వరరావుపై దాడికి తెగబడ్డారని అంబటి మురళీకృష్ణ నిప్పులు చెరిగారు. ఆసుపత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్యంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి వాకబు చేశారని తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పొంతన లేని మాటాలు మాట్లాడుతున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు సోదరుడిపై కూడా దాడి చేసినప్పుడు ఆయన ఫిర్యాదు చేస్తే.. తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశారన్నారు. కూటమి నేతలకు పోలీసులు, దాసోహమై వ్యవహరిస్తున్నారన్నారు. పొన్నూరు రూరల్ ఎస్ఐ కిరణ్ ఏకపక్షంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. చేబ్రోలు ఎస్ఐ వెంకటకృష్ణచౌదరి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లను స్టేషన్కు పిలిపించి, గోడ కుర్చీలు వేయించి, ఒక మేడమ్కు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు నాగమల్లేశ్వరరావు సోదరుడు, ప్రస్తుత ఎంపీటీసీ బొనిగల అమరేంద్రప్రసాద్, పార్టీ నేతలు చింతలపూడి మురళీకృష్ణ, షేక్ నాజర్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి -
దళితులపై పెరిగిన దాడులు
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారపు శివనాగేశ్వరరావు సత్తెనపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, పేదల పైన దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు అన్నారు. సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణం, అమానుషమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావును కొట్టి తీవ్రంగా గాయపరిచారని, టీడీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత దళితులపైనా, పేద వర్గాలపైనా దాడులు అధికమయ్యాయన్నారు. మొన్న తెనాలిలో దళిత యువకులపై పోలీసులు నడిబజారులో కొట్టిన సంఘటన మరొక ఉదాహరణ అని, రాష్ట్రంలో దళితులంటే తెలుగుదేశం పార్టీకి చిన్న చూపు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇకనైనా దళితులు, పేదల పై దాడులను మానుకోవాలని లేకుంటే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘నూటా’ ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల అధికారికి లేఖ ఏఎన్యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం(నూటా) ఎన్నికల్లో పారదర్శకత లోపించడం వలన ఈ నెల 9న జరిగే నూటా ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్కు సోమవారం లేఖ అందజేసినట్లు ఆచార్య కె.సుమంత్ కుమార్(అధ్యక్ష పదవికి పోటీ అభ్యర్థి), ఆచార్య ఎం.జగదీష్ నాయక్(ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు పోటీ అభ్యర్థి) తెలిపారు. తమకు పోటీగా నిలబడిన అభ్యర్థులు విశ్వవిద్యాలయం పరిపాలన పరమైన పదవుల్లో కొనసాగటం వలన ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందని, కనుక ఎన్నికల నిర్వహణ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 15 రోజులు పాటు ఎన్నికలను వాయిదా వేయాలని ఈనెల 4, 5 తేదీల్లో ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్కు వినతి పత్రాలు అందించినా నేటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో పాటు తమ లేఖలకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. -
పిచ్చి కుక్క స్వైరవిహారం
ఏడుగురికి తీవ్రగాయలు మార్టూరు: ఈ మధ్య పిచ్చికుక్కలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మండలంలోని కోలలపూడి గ్రామంలో ఓ పిచ్చికుక్క సోమవారం ఉదయం స్వైర విహారం చేసింది. స్థానిక ఎస్సీ కాలనీలో కనిపించిన వారందరినీ కరుస్తూ మొత్తం ఏడుగురు వ్యక్తులను గాయపరిచింది. గాలి ఏసుకు తల, మొహంపై తీవ్ర గాయాలు కాగా గద్దల సత్యం, దాసరి సుబ్బులు, మురికిపూడి మహేష్, మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. బాధితులను మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వ్యాక్సిన్ వేసి చికిత్స అందించారు. తాతా వెంకటరత్నం అనే మహిళ తన ఇంటి ముందు మంచం పై పడుకొని ఉండగా పిచ్చికుక్క ఆమె చెంపలపై నుదుటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుందని తెలిపినట్లు బంధువులు తెలిపారు. రెడ్బుక్ను కూటమి నేతలు తగులబెట్టాలి నరసరావుపేట: రాష్ట్రంలో 13 నెలలుగా కొనసాగుతున్న రెడ్బుక్ రాజ్యాంగపు రౌడీయిజానికి 1161 మంది గురై వారి భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన నేపథ్యంలో, ఎట్టకేలకు హైకోర్టు స్పందించి రిమాండ్ విధించే ముందు మేజిస్ట్రేట్లు నిబంధనలను గట్టిగా పాటించాలని ఆదేశించడం హర్షణీయమని సోషల్ యాక్టివిస్టు ఈదరగోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అరాచక పాలన చేసిన కూటమి నేతలు, పోలీసులకు ఈ ఆదేశాలు చెంపపెట్టు లాంటివని అన్నారు. ఈ ముఖ్యమైన అంశంపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ హరీశ్వరరెడ్డి చొరవ తీసుకుని హైకోర్టులో పిటిషన్ వేయడం అభినందనీయమని అన్నారు. ఇంతటితో ఆగకుండా ఇప్పటికే పెట్టిన 1161 కేసులను సమీక్షించి నిర్దోషులను కేసుల నుంచి తప్పించేందుకు పోలీసు వేధింపులు, హింసకు గురైన వారికి ఊరట కల్పించి, నష్టపరిహారం ఇప్పించేందుకు, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిట్టింగ్ జడ్జితో ఒక ప్రత్యేక విచారణ కమిటీని హైకోర్టు నియమించేలా పోరాటం కొనసాగించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ఇకనైనా బుద్ధి తెచ్చు కుని, పశ్చాత్తాపం చెంది రెడ్బుక్ని నడిరోడ్డులో తగల పెట్టాలని డిమాండ్ చేశారు. మంచి యూనిట్లు ఎంపిక చేసుకొనిఆదాయం పెంచుకోండి నరసరావుపేట: ప్రతిఒక్కరూ మంచి యూనిట్లను ఎంపిక చేసుకొని వాటి ద్వారా కుటుంబానికి ఆదాయం పెంచుకునేలా కృషిచేయాలని అధికారులు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పీఎంఇజీపి, పీఎంఎఫ్ఎంఎఫ్ రుణాలపై బ్యాంకర్లచే లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని డీఆర్డీఎం పీడీ ఝాన్సీరాణి మాట్లాడారు. లబ్ధిదారులకు కావలసిన శిక్షణ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, మార్కెటింగ్ చేసేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లైన అమెజాన్, ప్లిఫ్కార్ట్ వంటి వాటి ద్వారా వీలు కల్పించడం జరుగుతుందని అన్నారు. హార్టీకల్చర్ జిల్లా అధికారి ఐ.వెంకటరావు మాట్లాడుతూ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేసుకొని తర్వాత కొటేషన్, ఆధార్, పాన్కార్డు సిద్ధం చేసి సంబంధిత అధికారికి అందజేసిన తర్వాత లాగిన్లో అప్డేట్చేసి వాటిని అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీతో కూడిన యూనిట్లను ఎంచుకొని వాటిపై లబ్ధిదారులు లబ్ధిపొందేలా చేయడమే కలెక్టర్ అరుణ్బాబు ఆలోచన అన్నారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్, డీపీఎం డేవిడ్, శ్రీనివాస్, యూనియన్ బ్యాంకు, సీజీజీబి అధికారులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
సంతమాగులూరు(అద్దంకి): ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈఘటన సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన నల్లపాటి మల్లికార్జునరావు(41) తన ట్రాక్టరును నడుపుకుంటూ సంతమాగులూరు నుంచి వినుకొండ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెల్లలచెరువు గ్రామ సమీపంలోని పెట్రోలు బంకు సమీపంలోకి రాగానే గోతుల రోడ్డు కావడంతో బ్రేక్ వేయగా అదుపు తప్పి తిరగబడింది. ఈ ఘటనలో మల్లికార్జునరావు పైనుంచి కిందపడగానే ట్రాక్టరు టైరు తలపైకి ఎక్కింది. రక్తగాయం ఆవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. భర్త మృతితో భార్య, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి మామ తేలప్రోలు ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు. -
ఆర్మీ జవాన్ మృతి
నగరం: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి నగరం మండలం చిరకాలవారిపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఉప్పాల రవికుమార్ (24) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. చిరకాలవారిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల ఇమ్మానుయేలు, లక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు రవికుమార్ నాలుగేళ్ల కిందట ఆర్మీలో జవాన్గా చేరాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్ ఇటీవల వివాహం నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల కుమార్తెతో నిశ్చితార్ధం చేసుకుని వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆపరేషన్ సిందూర్ విధుల్లోకి హాజరుకావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు రావటంతో విధుల్లోకి వెళ్లాడు. త్వరలోనే వివాహ ముహుర్తాన్ని ఖరారు చేసుకుని స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకోవాల్సిన కుమారుడు రవికుమార్ గత శనివారం జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో విధులు నిర్వర్తిస్తుండగా ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి అక్కడిక్కడే మృతి చెందాడు. రవికుమార్ భౌతికకాయం మంగళవారం స్వగ్రామమైన చిరకాలవారిపాలెం గ్రామానికి రానుంది. రవికుమార్ అకాల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
నిబంధనల మేరకే పొగాకు కొనుగోలు
జే.పంగులూరు: నిబంధనల మేరకే నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేస్తామని.. ఇప్పటికి రైతులు వద్ద నుంచి 1000 చెక్కుల వరకు కొనుగోలు చేశామని, గ్రేడుల ప్రకారమే ధర నిర్ణయిస్తున్నట్లు మార్క్ఫెడ్ డీఎం కే కరుణశ్రీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ రమేష్ అన్నారు. మండల పరిధిలోని పంగులూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ జిల్లా అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేందుకే పంగులూరులో నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరి వద్ద పొగాకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు సహకరించి గ్రేడ్ చేసి పొగాకు చెక్కులు తీసుకొస్తే మంచి ధర పలుకుతుందని తెలిపారు. రైతులు వద్ద నల్లబర్లీ పొగాకు కొనాలంటే తప్పనిసరిగా బేళ్ల వద్ద ఫొటో దిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. అలా చేస్తేనే పొగాకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో షెడ్యూలు అయిన రైతులు వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పచ్చాకు, బొగులు, నలుపు, డ్యామేజ్ ఉంటే పొగాకు కొనుగోలు చేయమని తెలిపారు. కారణం లేకుండా సీఆర్ చేయడం కుదరదని తెలిపారు. రాబోయే 2, 3 రోజుల్లో తమ్మవరం, మార్టూరు, చినగంజాం గ్రామాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన.. అధికారులు రైతుల వద్ద నుంచి వారి ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే చేలో పండించిన పంట, శుభ్రంగా గ్రేడ్ చేసుకొని, చెక్కులు తొక్కుకొని వస్తే వాటిలో కొన్నింటిని మాత్రమే కొని, మిగతా వాటిని తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేడ్ చేసుకొని వచ్చిన మంచి రకం పొగాకును కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు తెలిపారు. స్పందించిన అధికారులు మాట్లాడుతూ రైతులు తెచ్చిన నల్లబర్లీ చెక్కులు మంచివిగా ఉండి కొనుగోలు చేయకపోతే మా దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు బయ్యర్లను అడగ్గా బాగోలేని చెక్కులు మాత్రమే వెన్కు పంపుతున్నట్లు సమాధానం ఇచ్చారు. మాకు కాదు మీరు చెప్పాల్సిందంటూ రైతులకు అని బయ్యర్లపై మండిపడ్డారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మార్క్ఫెడ్ మేనేజర్ పి సుబ్రమణ్యం, ఏఓ సుబ్బారెడ్డి, బయ్యర్ శ్రీధర్, ఏఎంసీ సెక్రటరీ కె సుర్యప్రకాష్రెడ్డి, అసిస్టెంట్ మార్కెటింగ్ కె రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని రైతుల ఆందోళన సమాధానం చెప్పలేక తడబడిన మార్క్ఫెడ్ అధికారులు -
ఉత్తమ ప్రదర్శనగా ‘ఐ యేట్ ఇండియా’
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో మూడురోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. న్యూస్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ వారు ప్రదర్శించిన ‘ఐ యేట్ ఇండియా’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. మరో నాలుగు బహుమతులను అందుకుంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం (డాక్టర్ ఎం.ఎస్.చౌదరి), ఉత్తమ ఆహార్యం (దినేష్), ఉత్తమ రంగాలంకరణ (దివాకర ఫణీంద్ర), జ్యూరీ బహుమతి (లోహిత్) సహా మొత్తం ఐదు బహుమతులు లభించాయి. ● ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి, విశాఖపట్నం వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటిక ఉత్తమ నటి (శోభారాణి), ఉత్తమ క్యారెక్టర్ నటి (నాగరాణి), బహుమతులను అందుకుంది. తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’ నాటిక దక్కించుకుంది. ఇదే నాటికకు ఉత్తమ రచన (పీటీ మాధవ్), ఈ నాటికలో నటించిన పి.వరప్రసాద్ ఉత్తమ నటుడు బహుమతిని, డి.హేమ ఉత్తమ ప్రతినాయకురాలు బహమతులను గెలుచుకున్నారు. ● ఇతర ప్రదర్శనల్లో ‘అ సత్యం’ నాటికకు ఉత్తమ సంగీతం (పి.లీలామోహన్), ఆ నాటికలో నటించిన పి.రామారావుకు ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతి లభించాయి. ‘వీడేం మగాడండీ బాబూ’ నాటికలో నటించిన జీఎస్ చలపతికి ఉత్తమ హాస్యనటుడు బహుమతి లభించాయి. ‘అనుకున్నదొకటి అయినదొకటి’నాటికలో పిల్ల బిచ్చగాడు పాత్రధారి రుత్విక్కు జ్యూరీ బహుమతి వచ్చింది. న్యాయనిర్ణేతలుగా చెరుకుమల్లి సింగారావు, వి.హైమావతి, గోపరాజు విజయ్ వ్యవహరించారు. పోటీల అనంతరం ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజేతలకు బహుమతులను అందజేశారు. సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, డీఎల్ కాంతారావు పాల్గొన్నారు. తొలుత పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలతో చివరిరోజు కార్యక్రమాలను ఆరంభించారు. తెలుగు కళాసమితి, విశాఖపట్నంవారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత?’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు చలసాని కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. చివరగా చైతన్య కళాభారతి, కరీంనగర్వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటికను ప్రదర్శించారు. పి.వెంకటేశ్వరరావు మూలకథకు పరమాత్ముని శివరాం నాటకీకరించగా, మంచాల రమేష్ దర్శకత్వం వహించారు. నిర్వాహక సంస్థల బాధ్యులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకట నారాయణ, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు -
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0ను పండుగ వాతావరణంలో నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశం పండుగ వాతావరణంలో వేడుకగా జరపాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహణపై సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశాన్ని జయప్రదంగా నిర్వహించడానికి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు ముందుగా సమాచారం పంపాలన్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు గౌరవప్రదంగా వారిని ఆహ్వానించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,818 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 1,59,108 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. విద్యార్థి మిత్ర బహుమానాలను అందుకున్న విద్యార్థులంతా నూతన దుస్తులు ధరించి పాఠశాలకు హాజరు కావాలన్నారు. జూనియర్ కళాశాలలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉంచామని, మంగళవారం నాటికి నర్సరీల నుండి ఆయా మండలాలకు చేరుతాయన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో విద్యార్థుల ప్రగతి నివేదిక, హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. షైనింగ్ స్టార్ అవార్డులు పొందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులను పిలిపించి వేదికపై మాట్లాడించాలన్నారు. ముందస్తుగా విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఈఓ పురుషోత్తం, ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీపీఓ ప్రభాకరరావు, అటవీశాఖ అధికారి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇన్కం టాక్స్ అధికారి మృతి
జే.పంగులూరు: డివైడర్ను ఢీకొని రోడ్డు ప్రమాదంలో ఇన్కం టాక్స్ అధికారి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని జాగర్లమూడివారిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. హైవే పోలీసుల వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన దాసరి కృష్ణచైతన్య (46) గుంటూరులోని ఇన్కం టాక్స్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. సోమవారం ఒంగోలులోని తన మామయ్య ఇంటి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఒంగోలు నుంచి గుంటూరుకు తన స్కూటీపై వెళ్తున్నారు. జాతీయ రహదారిపై జాగర్లమూడివారిపాలెం వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కృష్ణచైతన్య తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. -
మేరు నగధీరుడు వైఎస్సార్
ఒంగోలు సిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలు జీవితకాలం గుర్తుంచుకోదగ్గ మేరు నగధీరుడు అని ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. నేడు వైఎస్సార్ 76వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సోమవారం ఆయన పిలుపునిచ్చారు. బత్తుల మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో పేదవాడి గుండెచప్పుడు పసిగట్టిన దార్శనికుడు వైఎస్సార్ అని అన్నారు. వృత్తిపరంగా వైద్యుడైనా ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యాలను గుర్తించి ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ వైద్యం పేదల దరి చేర్చారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో కార్పొరేట్ విద్య, 108 సేవలు ఆయన వల్లే పురుడు పోసుకున్న విషయాన్ని ఆయన రాజకీయ వైరులు సైతం స్వాగతించారన్నారు. నేడు వీధికి ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నారంటే అది నాడు వైఎస్సార్ దార్శనికత వల్లే సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయాన్ని సంస్కరణల బాట పట్టించి 82 నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించి అపర భగీరథునిగా వైఎస్సార్ నిలిచారన్నారు. ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అందించి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయాన్ని పండగ చేశారని చెప్పారు. విలువలతో కూడిన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. నేడు మహానేత వైఎస్సార్ జయంతిని జయప్రదం చేద్దాం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
పట్టణంలో వైద్యురాలి ఇంట భారీ చోరీ
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని వైద్యురాలి ఇంటిలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీ చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...స్థానిక పురుషోత్తమపట్నంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమ్మడి రాణి సంయుక్త సుమారు రెండేళ్లుగా శారద హైస్కూల్ రోడ్డులో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విధులు ముగించుకుని కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉంటున్న అన్నయ్య వద్దకు వెళ్లింది. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా, దాని పక్కనే మరోవైపు ఉన్న తలుపు తెరిచి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూసింది. గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు గ్రహించింది. బీరువా తెరిచి ఇంట్లో అంతా చిందర వందరంగా వస్తువులు, దుస్తులు పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని సందర్శించి పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాల సేకరించారు. ఇంట్లోని 70 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు, కేజీన్నర వెండి వస్తువులు, పట్టు చీరెలు అపహరణకు గురయ్యాయని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ పి రమేష్ తెలిపారు. సుమారు రూ.13 లక్షలు అపహరణ -
భరద్వాజ రచనలు సందేశాత్మకం
చీరాల: సమాజంలోని ఆకలి, ఆవేదన, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ వంటి కథాంశాలను వస్తువులుగా స్వీకరించి సమకాలిన సామాజిక సందేశాలుగా రావూరి భరద్వాజ రచనలు చేశారని రచయిత బీ రం సుందరరావు అన్నారు. ఆదివారం స్థానిక సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో రావూరి భరద్వాజ సాహితి సమితి ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జయంతిని నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు ఎ.నాగవీరభద్రాచారి అధ్యక్షత వహించారు. భరద్వాజ రచనలు జీవితానికి ఎంతో ఉపయోగపడతాయని, వారు సృష్టించిన పాత్రలు సజీవాలని రిటైర్డు ప్రిన్సిపాల్ బత్తుల బ్రహ్మారెడ్డి అన్నారు. అనంతరం బీరం సుందరరావుకు రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో కడలి జగదీష్కుమార్, గొర్రెపాటి ప్రభాకర్, కట్టా రాజ్ వినయ్కుమార్, గాదె హరిహరరావు, అత్తులూరి రామారావు, వడలి రాధాకృష్ణ, నాగమాంబ, కోట వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి
పెదకూరపాడు: పెదకూరపాడులోని ముస్లిం కాలనీలోని పిచ్చి కుక్క ఆరుగురుపై ఆదివారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్ల పఠాన్ మహ్మద్ అమన్, వృద్ధుడు షేక్ ఖాసిం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న షేక్ హుస్సన్, నిమ్మకాయల వ్యాపారి షేక్ ఖాసింలతో పాటు మరో ఇద్దరిపై దాడిచేసి కరచింది. నాలుగేళ్ల అమన్కు తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 18వ తేదిన మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన చిన్నారులు, వృద్ధులు 16 మందిపై పిచ్చి కుక్క దాడి చేసింది. రోడ్డు పక్కనే మాంసం విక్రయాలు జరుపుతుండంతో గుంపులు కుక్కలు అమరావతి, సత్తెనపల్లి కాలచక్ర రోడ్డుపై తిరుగుతూ వాహనదారులను కరుస్తున్నాయి. -
సెల్ఫోన్ లేని బడి నేడు అవసరం
తెనాలి: నేడు పిల్లల విద్యాభివృద్ధికి సెల్ఫోన్ అత్యంత అవాంతరంగా మారిందని, పాఠశాలలో సెల్ఫోన్తో పని లేని విధానం ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం తెనాలి ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సెల్ఫోన్ ప్రభావంతో పిల్లలు పాడైపోతున్నారని, ఉపాధ్యాయుల భోదనపై కూడా సెల్ ప్రభావం పడుతోందని అన్నారు. రోజువారీ రకరకాల సమాచారం అప్లోడ్, డౌన్లోడ్తో, ఆన్లైన్ శిక్షణలతో బోధన సమయం హరించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా సెల్ ఫోన్ వాడకం నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. బోధన సమయాన్ని పిల్లలకు మా త్రమే కేటాయించాలని, పాఠశాల రోజువారీ పనిని మెరుగుపరచాల్సిన అవసరం ఉపాధ్యాయులపై, అధికారులపై ఉందన్నారు. అవసరమైతే అదనంగా ఒక గంట పాఠశాలలో సమయాన్ని గడిపి విద్యార్థులకు మార్గదర్శనం చేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ పీటీఎంలో విట్నెస్ అధికారిని నియమించాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టీఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్, ఎం.కళాధర్లు మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్లు తర్వాత ఉపాధ్యాయులకు డీడీఓ కోడ్స్, పొజిషన్ ఐడీలో తక్షణం కేటాయించి జీతాలు ఈ నెలలోనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా సహాధ్యక్షులు ఎ.వెంకటేశ్వర్లు, కోశాధికారి దౌలా, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం
బాపట్ల టౌన్: పంచాయతీ కార్యదర్శులపై రోజురోజుకు పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని సీనియర్ పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు అన్నారు. పట్టణంలోని ఎన్జీవో హోంలో ఆదివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా సరిపడా నిధులు లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనుల్లో కీలక పాత్ర పోషించే క్లాప్ మిత్రాలకు ఇచ్చే నెల జీతం రూ.6000 చాలక పోవడంతో పని చేసేందుకు ఎక్కువ మంది ముందుకు రావడంలేదన్నారు. ప్రభుత్వమే నెలకు పదివేల రూపాయలు చొప్పున నేరుగా చెల్లించాలన్నారు. ప్రస్తుతం పాత రిక్షాల స్థానంలో ఆటోలు, ట్రాక్టర్లు మంజూరు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శిని గ్రామ పంచాయతీ విధులకు మాత్రమే పరిమితం చేసి సచివాలయ డీడీవో బాధ్యతలు నుంచి తొలగించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సర్వేలను చేయించే బాధ్యత ఒక పంచాయతీ కార్యదర్శికి మాత్రమే అప్పగించడం వలన పని ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పనితీరు అంచనా వేయడం సమంజసం కాదన్నారు. పారిశుద్ధ్యం లోపించిందనే పేరుతో ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ లాంటి చర్యలు తీసుకోవడం దుర్మార్గం అన్నారు. ఇటీవల వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారని, ఆ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ పంచాయతీ కార్యదర్శులు డి.మురళి బాపూజీ, డి.సుజాత, ఎం.శ్రీనివాసరావు, షేక్ జిలాని పాల్గొన్నారు. సీనియర్ పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు -
కౌలుకోలేని దెబ్బ
గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు నష్టపోతున్నారురాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప వ్యవసాయ రంగంలో వృద్ధి లేనేలేదు. ఉత్పత్తి వ్యయం కన్నా మద్దతు ధరలు 20 శాతం తక్కువ ఉన్నాయి. దీంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రానందున రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కౌలుదారులకు సకాలంలో రుణ అర్హత పత్రాలు ఇచ్చి బ్యాంకర్ల ద్వారా వాస్తవ సాగుదారులకు రుణాలు మంజూరు చేయాలి.– బత్తుల హనుమంతురావు, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడుసరైన గిట్టుబాటు ధరలు లేవునాకు 4 ఎకరాల సొంత భూమి ఉంది. దీనికి తోడు మరో 24 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని మిరప, పొగాకు, శనగ వంటి పంటలు సాగు చేశా. పండించిన పంటకు గిట్టుబాటు ధర అటుంచి కొనే నాథుడే కరువయ్యాడు. గత సంవత్సరం ఒక ఎకరం పొలం 28 నుంచి 32 వేల వరకు కౌలు చెల్లించా. ఈఏడాది అంత కౌలు చెల్లించి సాగుచేసే పరిస్థితి లేదు.– గనిపిశెట్టి రమేష్, చిమటవారిపాలెంయద్దనపూడి: వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడింది. పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం కష్టపడినా గిట్టుబాటు ధర లేకపోవటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీజన్ ప్రారంభమవుతున్నా కూడా అన్నదాత సుఖీభవ ఇస్తామంటూ ఒక్కరూపాయి కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా సొసైటీలు, బ్యాంకుల్లో అప్పు చెల్లించలేదంటూ బంగారం వేలం వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్రాప్ హాలిడే ప్రకటించేందుకు కౌలు రైతులు సమాయత్తమవుతున్నారు.కౌలు రైతులే అధికంజిల్లాలో 3.87 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 1.87 లక్షల మంది రైతులున్నారు. వీరిలో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారు. గత ఏడాది ప్రభుత్వం లక్ష మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు మంజూరు చేయగా 22 వేల మందికి మాత్రమే బ్యాంకుల ద్వారా కౌలు రైతులు రుణ సదుపాయం పొందారు. ఈ ఏడాది లక్ష మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 17,867 మందికి మాత్రమే కౌలు కార్డులు మంజూరు చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో గత ఏడాది 9089 మంది సీసీఆర్ కార్డులు మంజూరు చేయగా ఈ ఏడాది 1156 మందికి మాత్రమే కౌలు కార్డులు మంజూరు చేశారు.సాగు సమయం ఆసన్నమవుతున్నా..వాస్తవానికి ప్రతి ఏడాది రోహిణికార్తె నుంచి కౌలు వ్యవహారాలు సాగుతుంటాయి. ఈ ఏడాది జూలై నెల ప్రారంభమైనప్పటికీ కౌలు లావాదేవీలు అరకొరగానే కొనసాగుతున్నాయి. జిల్లాలో సొంత భూమి సాగు చేసే రైతులకంటే 60 శాతానికి పైగా భూమి కౌలు రైతుల చేతుల్లోనే ఉంటుంది. భూ యజమానులు, కౌలుదారుల మధ్య ఓ మాట ప్రకారం ఆ తంతు సాగిపోతోంది. కానీ ఈ ఏడాది వరుస నష్టాలతో కౌలు సాగుకు కర్షకులు అంతగా అసక్తి చూపటం లేదు. కౌలు ధర తరువాత నిర్ణయించుకుందామని తొలుత సాగు చేయమని భూ యజమానులు కోరుతున్నా కౌలుదారుల నుంచి ఆశించిన స్పందన రావటం లేదు. గత ఏడాది పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, మార్టూరు తదితర మండలాల్లో గత ఏడాది ఎకరా రూ.30 వేల నుంచి రూ.38వేల వరకు పొగాకు, మిర్చి పంటలకు కౌలుకు తీసుకోగా, అదే ఎకరా ఈ ఏడాది రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు పడిపోయింది.మద్దతు ధర లేక.. సాగు సాయం రాక తీవ్ర నష్టాలు ఈ ఖరీఫ్ సాగుకు ముందుకు రాని కౌలు రైతులు గతంలో మహర్దశ .. నేడు దుర్దశ జిల్లాలో కౌలు ధరలు ఢమాల్ ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటున్న రైతన్నలు గిట్టుబాటు ధరలు లేకపోవటమే ప్రధాన కారణం రుణాలు ఇచ్చేవారు కరువు చోద్యం చూస్తున్న ప్రభుత్వం -
అడవి తల్లిపై గొడ్డలి వేటు
బాపట్లటౌన్: పర్యావరణ పరిరక్షణకు అడవులు ఎంతగానో దోహదపడతాయని, వాటిని పరిరక్షించాలంటూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చే నాయకులు, అధికారులు పెంచిన తోటలను కాపాడటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన అటవీ శాఖాధికారులు చుట్టం చూపుగా వచ్చి పోతుండటంతో దొంగల చేతికి తాళం ఇచ్చిన చందంగా మారింది. పగలు.. రాత్రి తేడా లేకుండా దుండగులు యథేచ్ఛగా అడవుల్లోని జామాయిల్, జీడిమామిడి చెట్లను నరికి ఇళ్లకు, మార్కెట్కు తరలిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తంతు జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్నారిలా.. మండలంలోని కప్పలవారిపాలెం, ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్, సూర్యలంక, కర్లపాలెం మండలంలోని పేరలి, తుమ్మలపల్లి, గణపవరం, నర్రావారిపాలెం, మేకలవారిపాలెం తదితర గ్రామాలకు అందుబాటులో ఫారెస్ట్ భూమి ఉంది. అయితే ఆయా గ్రామాల ప్రజలతో వేరే ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకొని రాత్రికి రాత్రే అడవికి వెళ్లి తోటలను నరకటం, వాటిని పడవల సాయంతో కాలువలు దాటించడం.. కాలువ దాటిని కలపను ట్రాక్టర్లు, ఆటోలలో వేరే ప్రాంతానికి తరలించడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా మరికొందరు ఉదయం సమయంలో తోటకు వెళ్లి వాళ్లకు నచ్చిన చెట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని రాత్రి సమయంలో నరకడం జరుగుతుంది. నరికిన సరుకును రాత్రికి రాత్రే అవసరమైన వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు పట్టణంలోని వివిధ అడితీల్లో కలపను ఇక్కడే కొనుగోలు చేసినట్లుగా ఫోర్జరీ బిల్లులు సృష్టించి తనిఖీల కోసం వచ్చిన అధికారులకు చూపించడం ఇక్కడి ప్రజలకు షరా మామూలైంది. పెట్టుబడి ప్రభుత్వానిది.. సొమ్ము స్మగ్లర్లకు.. అటవీ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి జామాయిల్, సరుగుడు, జీడిమామిడి తోటలు వేశారు. అయితే అవి పెరిగిన తర్వాత తోటలకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే కట్చేసి టన్నుల ప్రకారం కలపను విక్రయించాల్సి ఉంటుంది. అయితే తోటలు పెరిగిన తర్వాత కట్ చేయకపోవడం, పలు రకాల తెగుళ్లు సోకి ఎండిపోతున్న చెట్లును అక్కడే వదిలివేయటంతో స్మగర్లు ఎండిన చెట్లను వంట చెరకుగా, పచ్చిచెట్ల బాదులను శ్లాబులకు ఉపయోగించే బాదులుగా, పేపర్ మిల్లులకు విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బీట్లో మొక్కలు నాటేముందు కనీసం 10 వేల మొక్కలకు తగ్గకుండా నాటుతున్నారు. అవి పెరిగిన తర్వాత కనీసం రెండు వేల మొక్కలు కూడా ఉండటం లేదు. ఇంతజరుగుతున్నా ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి స్మగ్లర్ల బారినుంచి తోటలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరిస్తున్న అటవీ విస్తీర్ణం రాత్రికి రాత్రే యథేచ్ఛగా తరలిపోతున్న కలప పచ్చని తోటలకు సైతం నిప్పంటిస్తున్న వైనం చోద్యం చూస్తున్న అధికారులు అడవులు నరికినా అడిగేదెవరు? బాపట్ల మండలం ముత్తాయపాలెం, కర్లపాలెం మండలం పేరలి ప్రాంతాల్లో అటవీ భూమి వేల ఎకరాల్లో ఉంది. వీటిల్లో ముత్తాయపాలెం సెక్షన్ పరిధిలో ఏ, బీ బీట్లు, పేరలి సెక్షన్ పరిధిలో ఏ, బీ బీట్లు ఉన్నాయి. వీటిల్లో జామాయిల్, జీడిమామిడి తోటలు సుమారు 25 వేల హెక్టార్ల మేర ఉంటాయి. అయితే తోటలు పెరిగిన తర్వాత వాటిని కొట్టించి వచ్చిన కలపను విక్రయించి ఆ సొమ్ముతో మిగిలిన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే అధికారులు స్థానికంగా ఉండకపోవడం, తోటలకు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చిపోతుండటంతో రాత్రికి రాత్రే సుమారు వందల సంఖ్యలో జామాయిల్ బాదులు మార్కెట్కు తరలివెళ్తున్నాయి. -
చినపులివర్రులో టీడీపీ నాయకుడి ఆగడాలు
కొల్లూరు: అధికార దాహంతో టీడీపీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. చినపులివర్రుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు గ్రామం ప్రారంభంలో ఉన్న డ్రెయిన్లో పూడిక తీసి ఆ మట్టిని తన పొలానికి వెళ్లే దారి కోసం కాలువకు అడ్డుగా మెరక పోసుకున్నాడు. టీడీపీ నాయకుని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలంలో పంటలు ముంపునకు గురికాకుండా వర్షపు నీరు పారుదలకు వినియోగపడాల్చిన డ్రెయిన్ను మెరుగు పరచడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు, డ్రెయినేజీ కట్టలను బలపర్చడానికి వినియోగించాల్చిన పూడికతీత మట్టిని సొంత అవసరాలకు పచ్చ నాయకులు తరలించుకోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. మట్టిని తరలించుకుపోవడానికి తోడు భారీ యంత్రాన్ని మట్టి తవ్వకానికి వినియోగించడం కారణంగా ఆర్అండ్బీకి చెందిన బీటీ రోడ్డు ధ్వంసం కావడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్లో పూడికతీసిన మట్టి పొలం దారికి తరలింపు రహదారి ధ్వంసం స్థానికుల ఆగ్రహం -
ప్రజలను వంచించిన చంద్రబాబు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి మార్టూరు(చినగంజాం): రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తన మోసపూరిత మాటలతో వంచన చేస్తున్నారని.. ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్న మైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు ఇన్చార్జ్ గాదె మదుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ( రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో) అనే కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మార్టూరులోని ఇంటూరి ఫంక్షన్ హాలులో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జంపని వీరయ్య చౌదరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గాదె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత బాబు జగ్జీవనన్రాం, మహానేత వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ను ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, రాష్ట్ర యూత్ వింగ్ సంయుక్త కార్యదర్శి ఉప్పలపాటి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, మాజీ డెయిరీ చైర్మన్ ఉప్పలపాటి చెంగలయ్య, తాటి వెంకటరావు, ద్రోణాదుల మాజీ సర్పంచ్ పెంటేల సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు అడక గంగయ్య, ఐటీ వింగ్ అధ్యక్షుడు జి. రవిచంద్, ఎస్టీ సెల్ చిన్ననాయక్, మండల వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ బాష, బండి రామయ్య, మైలా నాగేశ్వరరావు, గడ్డం మస్తాన్వలి, బాబు నాయక్, మండల పార్టీ కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగం అధ్యక్షులు, వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు భారీగా పాల్గొన్నారు. -
కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి
బాపట్ల టౌన్ : ఆర్టీసీ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంఎస్ఆర్ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి వై. శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీలో రిటైరైన ఉద్యోగులకు, మరణింంచిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ఎన్ క్యాష్మెంట్ సెటిల్మెంట్ చెల్లింపులు సంవత్సరాలు గడుస్తున్నాసరే జరగడం లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వీరికి చెల్లించాల్సిన బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. 11వ పీఆర్సీ చెందిన 24 నెలలు బకాయిలు, డీఏ మంజూరు, డీఏ అరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగులు ఉద్యమాల బాట పట్టకుండా చూడాలన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఇవ్వాలనుకున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయకముందే మూడు వేల ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయాలని, తక్షణమే వివిధ కేటగిరుల్లో 10 వేల మంది సిబ్బందిని నియమించుకొనేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, బాపట్ల జిల్లా ఏపీజెఏసీ అమరావతి చైర్మన్ సురేష్ , ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రకోశాధికారి యం.డీఏ.సిద్ధిక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మందపాటి శంకరరావు, రాష్ట్రకార్యదర్శి యన్.వి.కృష్టారావు, రాష్ట్ర సహాయకార్యదర్శి బి.టి.వలి, నెల్లూరు జోన్ జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు వాకా రమేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు పసుపులేటి చిరంజీవి, గుంటూరు జిల్లా కార్యదర్శి ఇ.విజయ్కుమార్, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్యదర్శి జి.తిరుపతిరావు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఓబేదు నియామకం
రేపల్లె: వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రేపల్లె పట్టణానికి చెందిన చిత్రాల ఓబేదును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఓబేదు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. జగన్ యువసేన నియోజకవర్గ అధ్యక్షుడుగా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడుగా, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్ష పదవులతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాష్ట్ర హస్త కళలశాఖ డైరెక్టర్గా పనిచేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా జగనన్న వెంటే ఉంటానను. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఓబేదు మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, రేపల్లె నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ ఈవూరు గణేష్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓబేదుకు పట్టణానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు అభినందనలు తెలిపారు. -
కొనసాగుతున్న నాటికల పోటీలు
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ – తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు రెండవ రోజైన ఆదివారం కొనసాగాయి. ప్రదర్శనలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేశారు. సినీ మాటల రచయిత, కళల కాణాచి, తెనాలి అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, పోస్టల్ ఎంప్లాయీస్ కళాపరిషత్ అధ్యక్షుడు డీఎల్ కాంతారావు, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి వెంకట నారాయణ పాల్గొన్నారు. తొలిగా చైతన్య కళాస్రవతి–ఉక్కునగరం, విశాఖ వారి ‘అ సత్యం’ నాటికను ప్రదర్శించారు. సుధ మోదుగు మూలకథకు పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరించగా పి.బాలాజీనాయక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. తదుపరి న్యూస్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ వారి ‘ఐ యేట్ ఇండియా’ నాటికను ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఎం.ఎస్.చౌదరి. చివరిగా యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘అనుకున్నదొకటి అయినదొక్కటి’ హాస్యనాటికను ప్రదర్శించారు. గోపి వల్లభ రచనకు ఆర్.వాసుదేవరావు దర్శకత్వం వహించారు. -
దొంగల బీభత్సం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉండవల్లి అమరావతి రోడ్డులో సాయిబాబా గుడి వద్ద శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చోరులు బీభత్సం సృష్టించారు. ఉండవల్లి రోడ్డులో తిరుగుతూ పలుచోట్ల సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేశారు. ఎలక్రిక్టల్ షాపులో చోరీ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్ షాపు యజమాని శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం 12.10 నిమిషాలకు ముగ్గురు వ్యక్తులు మాస్క్లు ధరించి హార్డ్వేర్ షాపు చుట్టుపక్కల సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. 1.45 గంటలకు షాపు రేకులపై నుంచి వెనుకవైపు ఉన్న చిన్న సందులోకి దిగారు. పలుగుతో వెనుక తలుపు పగలుగొట్టి లోపలకు దూరారు. 2.45 గంటల వరకు షాపులో ఉండి వస్తువులను మూటలు కట్టుకుని గోడ అవతల విసిరివేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మాస్క్లు ధరించడంతో గుర్తించడం కష్టంగా మారింది. షాపు యజమాని తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి పరిశీలించారు. షాపులో సుమారు రూ.3 లక్షల విలువైన సరుకు, రూ.50 వేలు చోరీ అయినట్లు యజమాని తెలిపారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ధ్వంసం రూ.3 లక్షల సామగ్రి దొంగతనం -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
రేపల్లె: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైఎస్సార్ ఎప్పుడూ ప్రజాసంక్షేమాన్ని కోరుకుందని, ఆ దిశగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు పడ్డాయని గుర్తుచేశారు. కూటమి కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బలంగా పోరాడుతుందని, ఎక్కడా తగ్గేదిలేదన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నియోజకర్గంలో ప్రజలకు నిరంతరం తోడుగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికై పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రేపల్లె పట్టణ, మండలాల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, డుండి వెంకట రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నిజాంపట్నం కోటేశ్వరరావు, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు వీసం నాగలక్ష్మి, నాయకులు యార్లగడ్డ మదన్మోహన్, చిమటా బాలాజీ, అబ్దుల్ ఖుద్దూష్, గౌస్, నీలా నాంచారయ్య, పట్టెం శ్రీనివాసరావు, కొలుసు బాలకృష్ణ, సజ్జా పద్మావతి, కాటూరి శారద, లియాఖత్ భాషా, ఆలా రాజ్పాల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.భారీగా రేషన్ బియ్యం స్వాధీనంప్రత్తిపాడు: రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపిన ప్రకారం... వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన ఓ రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేశారన్న సమాచారం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు అందింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ జి. భానూదయ, సీఐ రమానాయక్, సిబ్బందితో కలిసి మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారాన్ని రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులకు తెలియజేశారు. వట్టిచెరుకూరు తహసీల్దార్ క్షమారాణి, సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్లు మిల్లు వద్దకు చేరుకున్నారు. బస్తాల్లో నిల్వ చేసిన సుమారు 60 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.తొలి ఏకాదశి పూజలుమంగళగిరి: మంగళగిరి తాడేపల్లి సంస్థ పరిధిలోని ఆరవ బెటాలియన్లో ఆదివారం ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి సారె చీరెలు సమర్పించడం ఆనవాయితీ అని, అమ్మవారి దయతో కుటుంబాలు సంతోషంగా ఉంటాయని నమ్మకం అని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాడెంట్ ఆశ్వీరాదం, అధికారులు, స్థానిక మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శివాలయం వీధికి చెందిన మహిళలు ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించారు. శ్రీ సోమేశ్వరస్వామి వారి దేవాలయంలోని పార్వతీ దేవికి తొలుత సారె సమర్పించి, మేళతాళాలతో కాలినడకన విజయవాడ దుర్గమ్మ వారికి సారె తీసుకెళ్లారు. స్థానిక మహిళలు అమ్మాజి, అనూష, సరళ, స్రవంతి, కౌసల్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025లోక్ అదాలత్లో 5,300 పైగా కేసులు పరిష్కారం ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని కోర్టుల్లో 5300కు పైగా కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. భారతి పేర్కొన్నారు. జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 27 బెంచీల ద్వారా పరిష్కారమైన కేసుల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. 5200కు పైగా క్రిమినల్ కేసులు, 155 సివిల్ దావాలతో పాటు 17 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. మోటార్ వాహన ప్రమాద బీమా తదితర కేసుల్లో రూ.8 కోట్లకు పైగా కక్షిదారులకు పరిష్కార చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి బెంచీలో న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం సహకరించిన న్యాయవాదులకు, పోలీసులకు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులకు, బ్యాంకు అధికారులకు, బీమా సంస్థల ప్రతినిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ తదితరులు నిరంతరం పర్యవేక్షించారు. ఎయిమ్స్లో 13 మంది విద్యార్థుల సస్పెన్షన్ మంగళగిరి: ఎయిమ్స్లో మెడికల్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామని పేర్కొన్నారు. ఏడాదిన్నరపాటు 13 మంది విద్యార్థులపై ఈ సస్పెన్షన్ విధించామని వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.సాక్షి ప్రతినిధి,బాపట్ల: డ్వామాలో అక్రమ వసూళ్ల బాగోతం ఇప్పడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నిత్యం కోట్లాది రూపాయల పనులు జరుగుతున్న డ్వామాలో వసూళ్ల పర్వం పతాక స్థాయికి చేరింది. ఆ విభాగం ఉన్నతాధికారి కిందిస్థాయి ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రతి మండలం నుంచి రూ.25 వేలకు తగ్గకుండా ముడుపులు ఇవ్వాలని షరతు విధించారు. ఇది కాకుండా ప్రతి సోషల్ ఆడిట్కు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 20 సోషల్ ఆడిట్లు జరగ్గా రూ.20 లక్షలు వసూలు చేసినట్లు కిందిస్థాయి అధికార వర్గాల సమాచారం. తాజాగా ఈ నెల 8వ తేదీన చీరాల సోషల్ ఆడిట్ ఉండగా రూ.లక్ష సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారిని ఆదేశించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్షలో రూ.50 వేలు జిల్లా ఉన్నతాధికారి పేరు చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జరిగిన పనులను షాట్ డైరెక్టర్ కార్యాలయం సోషల్ ఆడిట్ చేస్తుంది. అక్కడి నుంచి నలుగురు డీఆర్పీలతోపాటు ఒక ఎస్ఆర్పీ సోషల్ ఆడిట్లో పాల్గొంటారు. డీఆర్పీలు గ్రామాల్లో జరిగిన పనులను పూర్తిగా తనిఖీ చేసి ఆ తర్వాత డ్వామా పీడీతో కలిసి తనిఖీలు చేస్తారు. తనిఖీ అధికారులు అక్రమాలు ఎత్తి చూపితే మీరు కక్షతో కంప్లెయింట్ రాశారని చెప్పి డ్వామా అధికారి తన వద్ద పనిచేసే ఏపీడీని విచారణకు ఆదేశిస్తారు. దీంతో జరిగిన అక్రమాలు కనుమరుగవుతాయి. ఇందుకోసం డ్వామా అధికారి ప్రతి సోషల్ ఆడిట్కు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఏపీవోలు జిల్లా అధికారి అడిగిన మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అయితే పనుల్లో అక్రమాలకు పాల్పడినవారే కాక అక్రమాలు చేయని అధికారులు సైతం కామన్గా డ్వామా అధికారికి డబ్బులు చెల్లించాల్సి రావడం ఇబ్బందిగా మారింది. ఉన్నతాధికారి పేరు చెప్పి వసూళ్లు ఇదికాకుండా జిల్లా ఉన్నతాధికారి పేరుచెప్పి ప్రతి మండలం నుంచి రూ.20 వేలు ఇవ్వాలని ఇటీవల డ్వామా అధికారి హుకుం జారీ చేశారు. ఇక ఆ అధికారి బయట అడుగు పెడితే చాలు ఏ మండలానికి వెళ్లినా వాహనం డీజల్, ఇతర ఖర్చుల పేరున ఏపీవోలు రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. ఏ అధికారైనా రూ.10 వేల చెల్లించకపోతే గూగుల్ మీట్లో సదరు అధికారికి తిట్ల దండకం తప్పదని పలువురు ఏపీవోలు సాక్షికి తెలిపారు. వసూళ్లు ఇలా... ● సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని సోషల్ ఆడిట్లో తేలడంతో నగరం మండలంలో కొందరు అధికారులను జిల్లా అధికారి సస్పెండ్ చేశారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ● కొల్లూరు మడంలంలో ఆయిల్ఫాం సాగుకు సంబంధించి ఉపాధి కూలీల మంజూరు విషయంలో ఫైల్ శాంక్షన్ కోసం అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ● యద్దనపూడి మండలంలో రూ.13 లక్షల విలువచేసే రోడ్డు నిర్మాణం కోసం స్థానిక నేత నుంచి రూ. 2.50 లక్షలు వసూలు చేయగా సదరు రోడ్డు నిర్మాణానికి పర్చూరు ఎమ్మెల్యే ఆమోదం లేదంటూ జిల్లా కలెక్టర్ సదరు పనిని నిలిపి వేయడంతో చివరకు డ్వామా అధికారి తీసుకున్న డబ్బులు వెనక్కి తిరిగి చెల్లించినట్లు తెలుస్తోంది. ● బాపట్లకు ప్రాంతానికి చెందిన ఒక టెక్నికల్ అసిస్టెంట్ యద్దనపూడి బదిలీ కోసం విన్నవించుకోగా జిల్లా అధికారి డబ్బుల కోసం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆ వ్యక్తి 50 కిలోల అలసందలు తీసుకువచ్చి ఇవ్వగా వాటితోపాటు మరో రూ.50 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో టెక్నికల్ అసిస్టెంట్ అంత ఇచ్చుకోలేనని చెప్పినా అధికారి ససేమిరా అనడంతో చివరకు రూ.40 వేలు చెల్లించినట్లు సమాచారం. 7న్యూస్రీల్ జిల్లా అధికారి బరితెగింపు సోషల్ ఆడిట్ కోసం రూ.లక్ష ఇప్పటి వరకూ 20 సోషల్ ఆడిట్లు పనుల మంజూరుకు లక్షల్లో డబ్బులు బదిలీలకు భారీగా ముడుపులు అధికారుల రీ పోస్టింగులకూ పెద్ద మొత్తంలో డిమాండ్ స్పందించకపోతే డిప్యూటీ సీఎం తాలూకా అంటూ బెదిరింపులు జిల్లా ఉన్నతాధికారి పేరుచెప్పి ప్రత్యేక వసూళ్లు ఆందోళన బాటలో కిందిస్థాయి అధికారులు, సిబ్బందిస్పందించకుంటే బెదిరింపులు ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయల పనులు జరుగుతుండడంతో అంతే స్థాయిలో డ్వామా అధికారి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు డబ్బులు చెల్లించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా సరిగ్గా స్పందించక పోయినా తాను డిప్యూటీ సీఎం తాలూకా అని, ఆయన ఓఎస్డీ తన బ్యాచ్మేట్ అంటూ డ్వామా అధికారి బెదిరింపులకు దిగుతున్నట్లు అధికారులు. సిబ్బంధి వాపోతున్నారు. సదరు అధికారి వేదింపులు భరించలేక కిందిస్థాయి అధికారులు, సిబ్బంది త్వరలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. -
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి బాపట్ల: ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు అందిపుచ్చుకొని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు యంత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ప్రజల జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో ఇద్దరు లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటోలను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు అందజేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 646 మంది సభ్యులకు బ్యాంకు లింకేజీ పథకం ద్వారా, 3686 మందికి శ్రీనిధి పథకం ద్వారా, 384 మందికి లక్ పతి దిది ద్వారా, 14 మంది సభ్యులకు ఉన్నతి పథకం ద్వారా 53 కోట్ల 42 లక్షల రూపాయల చెక్కును, మెప్మా శాఖ ద్వారా 340 మంది స్వయం సహాయక గ్రూపు సభ్యులకు వివిధ బ్యాంకుల ద్వారా సూక్ష్మ చిన్న, మధ్య తరహా రుణం క్రింద రూ.5 కోట్ల 20 లక్షల చెక్కులను అందజేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ దేబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఎం జ్యోత్స్న పాల్గొన్నారు. ప్రతి ఏటా జీడీపీలో 15శాతం వృద్ధి రేటు పెరిగేలా చూడాలి బాపట్ల జిల్లా జీడీపీలో ప్రతిఏటా 15 శాతం వృద్ధి రేటు పెరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్పై శనివారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అన్ని రంగాలలో వృద్ధి సాధించాలంటే అందుబాటులో ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అధికారులంతా సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు రైతుల పరిస్థితి పునరావృతం గాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలన్నారు. ఆక్వా రంగంలోనూ లాభసాటి సాగు జరిగేలా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. ప్రజల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. -
బాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకెళ్దాం అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. పర్చూరు నియోజకవర్గ స్థాయి ‘బాబు షూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా క్యాడర్ సమాయత్త సభ ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి అధ్యక్షత వహించారు. నాగార్జున మాట్లాడుతూ వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను ఏడాదిన్నర కావస్తున్నా అమలు చేయకపోగా ప్రజలను మోసం చేసే విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం విషయంలో ఆయన గొప్ప ఆవిష్కరణలు చేపట్టి, కులం, మతం, పార్టీ అని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహనరెడ్డి అని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏవిధంగా ప్రజలను మోసం చేసిందో అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ వైఎస్ కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని అన్నారు. పొగాకు కంపెనీలకు, పార్టీ నాయకులకు మేలు చేసేందుకే బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కూటమి ప్రభుత్వ తీరు కన్పిస్తుందని విమర్శించారు. పొగాకు, మిర్చి, కంది, శనగ, మినుములు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ పర్చూరు ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోలో చూపించిన కార్యక్రమాలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, క్యూఆర్ కోడ్ను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, పర్చూరు పంచాయతీరాజ్ అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషా వలి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్, పార్టీ మండల కన్వీనర్లు జంపని వీరయ్యచౌదరి, కఠారి అప్పారావు, మున్నం నాగేశ్వరరెడ్డి, చిన్ని పూర్ణారావు, ఉప్పలపాటి చెంగలయ్య, పావులూరు సర్పంచ్ బొల్లెద్దు లుధియమ్మ, సీనియర్ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి, కొల్లా వెంకటరావు, గడ్డం మస్తాన్వలి, బిల్లాలి డేవిడ్, దాసరి వెంకట్రావు, యూ అనిల్, కుమ్మరి చందు, కాటి లక్ష్మణ్, పాలేరు వీరయ్య, ఎంపీపీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
చీరాల అర్బన్: ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలను గుప్పించి అధికారం చేపట్టిన తర్వాత హామీలను విస్మరించి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు బహుముఖ ప్రజ్ఞాశాలి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. శనివారం సాయంత్రం చీరాల మండలంలోని రామకృష్ణాపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంశంపై నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక కట్ చేస్తామని చంద్రబాబు అనడం ఆయన అహంకారానికి నిదర్శమన్నారు. తల్లికి వందనం పేరుతో రూ.15వేలు ఇస్తానని చెప్పి రూ.2 వేలు తగ్గించి జమ చేశారన్నారు. సాకుల పేరుతో చాలా మందికి డబ్బులు జమ కాలేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను మూలన పెట్టేశారన్నారు. సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులపై ఎవరూ భయపడవద్దని, పార్టీ అందరికి అండగా ఉంటుందన్నారు. పథకాల్లో ఎన్నో కోతలు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేసి నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూఆర్ కోడ్ కలిగిన పత్రాలను ఆవిష్కరించారు. దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏవిధంగా ప్రజలకు వివరించాలనేది పవర్ పాయింట్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకట ప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, బీసీ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బత్తుల అనిల్, చీరాల మండల అధ్యక్షుడు ఆసాది అద్దంకిరెడ్డి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ కబీర్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ చీరాల అధ్యక్షుడు రాజు శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బిట్రా శ్రీనివాసరావు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఆసాది అంకాలరెడ్డి, వేటపాలెం పార్టీ మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోసం చేయడంలో బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున చీరాలలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమం -
నీటి మోటార్ల దొంగలు అరెస్ట్
నాలుగు మోటార్లు స్వాధీనం వేటపాలెం: పొలాల్లో సాగు నీటికి ఉపయోగించే మోటార్లు దొంగిలించే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి.జనార్దన్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలను వెల్లడించారు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొత్తపాలేనికి చెందిన రైతు మర్రి నాగార్జున తమ పంట పొలాలకు ఉపమోగించి నీటి మోటార్లు దొంగతనాకి గురైట్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కొణిజేటి చేనేత కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నాసిర్ వాలి, వేటపాలెం మార్కెట్ సెంటర్లో నివాసం ఉంటున్న షేక్ సుభాని.. ఇద్దరు చెడు వెసనాలకు అలవాటు పడి పొలాల్లో ఉండే మోటార్ల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 5 హెచ్పీ మోటార్లు మూడు, 2 హెచ్పీ మోటార్లు రెండు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.1.10 లక్షలు ఉంటుందన్నారు. నిందితులిద్దరినీ చీరాల కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. 15న జిల్లా అథ్లెటిక్ జట్టు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ) : అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సింథటిక్ ట్రాక్లో ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్తోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టును ఆగస్ట్లో బాపట్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. నేడు అండర్–14 పికిల్ బాల్ పోటీలు వివివి హెల్త్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని క్లబ్లో అండర్– 14 బాల బాలికల ఓపెన్ పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామని క్లబ్ డైరెక్టర్ టి.అరుణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కిరాణా షాపులో మద్యం బెల్టు షాపు
బలిజేపల్లి(వేమూరు): కిరాణా షాపులో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరు మండలం బలిజేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు బంధువులు మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎకై ్సజ్ అధికారులు బెల్టు షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. బలిజేపల్లి గ్రామంలో మద్యం బెల్టు షాపులతోపాటు గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వ్యక్తం చేశారు. అధికారులు గ్రామంలో మద్యం బెల్టు షాపు, గంజాయి అమ్మకాలు నిర్మూలన చేయాలని కోరారు. -
కల్తీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
రేపల్లె: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేపల్లె మండలం మోళ్లగుంట గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. గ్రామంలోని మోపిదేవి సతీష్ గృహాన్ని పరిశీలించారు. గృహంలో కల్తీ మద్యం తయారు చేసే ముడి సరుకుతోపాటు మద్యం నిల్వ ఉంచే టిన్లు, క్వార్టర్ సీసాలు కనిపించాయి. మోళ్లగుంటకు చెందిన మోపిదేవి సతీష్, కన్నా రాములతోపాటు కృష్ణాజిల్లా గుల్లలమోద గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి సూర్యలను అదుపులోకి తీసుకున్నారు. మోపిదేవి సతీష్, సూర్య, రాములతోపాటు మరో ముగ్గురు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఇథనాల్ ఆల్కహాల్ 10 లీటర్లు, 21 ఖాళీ క్యాన్లు, 510 ఖాళీ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన సూత్రధారి అయిన యానం శ్రీను అలియాస్ నులికుర్తి శ్రీనివాస్ హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి ఇథనాల్ ఆల్కహాల్ను సతీష్కు పంపుతాడు. ఆల్కహాల్లో రంగు నీరు కలిసి సతీష్, సూర్య, రాములు 180 మిల్లీలీటర్ల సీసాలలో నింపి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో విక్రయిస్తూ అక్రమంగా నగదు సంపాదిస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన యానం శ్రీను, రూతుల శ్రీనివాస్ (హైదరాబాద్), చరణ్జిత్ (హైదరాబాద్)లను త్వరలో అరెస్ట్ చేస్తామని ఎకై ్సజ్ అధికారి తెలిపారు. వీరిరువురికి హైదరాబాద్లో ఉన్న నకిలీ మద్యం తయారీ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ జనార్థన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మధుబాబు, ఎకై ్సజ్ సీఐ దివాకర్, ఎస్ఐలు రాజ్యలక్ష్మి, రామారావు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు దళితులపై అక్కసు ఎందుకు?
చీరాల టౌన్: ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబునాయుడు దళితులను కుక్కలతో పోల్చి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. దళితులంటే సీఎంకు ఎందుకు అంత చిన్నచూపు? దళితుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’ అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు డిమాండ్ చేశారు. శనివారం చీరాల ఒన్టౌన్ సీఐ సుబ్బారావును వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్, వైఎస్సార్సీపీ నాయకులు కలిసి చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వాసిమళ్ల వాసు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, పట్టణాధ్యక్షుడు యాతం మేరిబాబులు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడుకు దళితులంటే ఎప్పుడూ చులకన భావమేనని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సింగయ్యను కుక్కతో పోల్చడం దుర్మార్గమన్నారు. దళితుల ఓట్లు కావాలని.. కానీ వారు కుక్కలంటూ అగ్రవర్ణ భావజాలంతో, పదవీ అహంకారంతో మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ పాలనలో ప్రజలు, పార్టీల నాయకులును వేధిస్తూ దుర్మార్గ పాలన చేస్తున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్న హయాంలో గోదావరి పుష్కరాల సమయంలో చాలామంది చనిపోయారని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా కందుకూరు, ఇతర ప్రాంతాల్లో ప్రజలు చనిపోయినా కనీసం స్పందించకుండా దుర అహంకారాన్ని ప్రదర్శించారన్నారు. వైఎస్సార్ సీపీలో దళితులకు సముచిత స్థానం ఇచ్చి ఉన్నత పదవులు కట్టబెటితే.. చంద్రబాబు మాత్రం దళితులను కుక్కలతో పోల్చడం హేయమన్నారు. ఇదే పంథా కొనసాగిస్తే చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిలర్లు కంపా అరుణ్, బత్తుల అనీల్, పార్టీ నాయకులు గవిని శ్రీనివాసరావు, కోడూరి ప్రసాద్రెడ్డి, రాఘవ, వాసిమళ్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు. సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు -
ఆధునికీకరించని లాకులు...అన్నదాతకు కష్టాలు
బాపట్ల: నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు కొమ్మమూరు కాలువపై నరసాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన లాకులు..షెట్టర్లు శిథిలావస్థకు చేరాయి. బ్రిటిష్కాలం నాటి 15 షెట్టర్లకు తోడు మరో 10 షెట్టర్లు నిర్మించారు. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. కనీసం వచ్చే నీటికి అడ్డుకట్ట వేయలేకపోవటంతో ఎగువ ప్రాంతాలకు నీరు సక్రమంగా పారుదల లేకపోవటంతో రైతులు అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి తాత్కాలికంగా తన సొంత ఖర్చులతో లాకులకు మరమ్మతులు చేయించారు. రైతులకు కొంత ఉపశమనం కలిగించాయి. ఈ ఏడాది మరమ్మతులకు అవకాశం లేకపోవటంతో రైతులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. నల్లమడ లాకుల ఏర్పాటు ఇలా... కృష్ణాపశ్చిమ డెల్టా నుంచి 69.545 కిలో మీటర్లు మేరకు కొమ్మమూరు కాలువ నరసాయపాలెం వద్ద ఉన్న నల్లమడ లాకుల వద్దకు చేరుకుంటుంది. కొమ్మమూరు కాలువ మొత్తం ఆయకట్టు 2.15 లక్షల ఎకరాలు కాగా అనధికారిక సాగు మరో 50 వేల ఎకరాలు ఉంటుంది. ఈ మేరకు దుగ్గిరాల వద్ద 3600 క్యూసెక్కులు వదిలినప్పటికి బాపట్ల చానల్, పీటీ చానల్లకు పోగా నల్లమడ లాకుల వద్దకు 1100 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ నుంచి 70,599 ఎకరాల ఆయకట్టు ఉండగా ఎగువ కాలువ మట్టం(లోతు)11.92 అడుగులు ఉండగా దిగువ ఆయకట్టు 8.92 అడుగులు ఉంటుంది. వెడల్పు ఎగువ ప్రాంతంలో 64.0 అడుగులు ఉండగా దిగువ ప్రాంతంలో 48.0 అడుగులు ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి నరసాయపాలెం, వెదుళ్లపల్లి, చెరుకుపల్లి ట్యాంకు కాలువ, పెద్దగంజాం వరకు ఈ లాకుల నుంచే నీరు వెళుతుంది. ఈ లాకుల వద్ద కనీసం ఆరు అడుగులు లోతులో నీటి నిల్వ ఉంటే గానీ బాపట్ల, పీటీ చానల్కు నీటి పారుదల ఉండే అవకాశం లేదు. శిథిలావస్థలో లాకులు...షెట్టర్లు బ్రిటిష్కాలంలో ఏర్పాటు చేసిన లాకులు, షెట్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. నల్లమడ వద్ద లాకులు, ఉప్పరపాలెం వద్ద ఉన్న షెట్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఉప్పరపాలెం వద్ద ఉన్న 15 షెట్టర్లు బ్రిటిష్ కాలం నాటివి కాగా 10 షెట్టర్లు 15 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. కాలువ మరమ్మతులు చేయకుండా షెట్టర్లు ఏర్పాటు చేయటం వలన ఆవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఆ కాలంగా కురిసే వర్షపు నీటికి తోడు పంట కాలువలో ఉండే నీటితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాకులు, షెట్టర్లు దెబ్బతిని పోవటంతో కీలకమైన సమయంలో నీటి నిల్వలకు ఇబ్బందికరంగా మారిపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం ఆధునికీకరణ నిధులు వస్తే పూర్తిస్థాయిలో లాకులు, షట్టర్లు మరమ్మతులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. శిథిలావస్థలో నల్లమడ షట్టర్లు ప్రతి ఏడాదీ మరమ్మతుల కోసం ఎదురుచూపులు పట్టించుకోని అధికారగణం ఆందోళనలో దిగువ ప్రాంత రైతులు -
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
చీరాల అర్బన్: మహిళలందరికీ ఆగస్టు 15న మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సన్నద్ధం చేస్తున్నట్లు నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం చీరాల ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ జంజనం శ్యామల, బీజేపీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. బస్సులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడిపోయి ప్రమాదభరితంగా ఉండటాన్ని గుర్తించి వాకబు చేశారు. మరమ్మతులు చేయించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు తాగునీటి వసతి లేకపోవడాన్ని గుర్తించారు. మరుగుదొడ్లలో అధికంగా వసూలు చేయవద్దని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత ఆర్టీసీ పథకానికంటే భిన్నంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్టీసీ యూనియన్ల ప్రతినిధులు, రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు జోనల్ చైర్మన్ను సత్కరించారు. ఏఎంసీ చైర్మన్ కౌత్రపు జనార్దన్, బీజేపీ సీనియర్ నాయకులు మువ్వల వెంకటరమణారావు పాల్గొన్నారు. నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి -
బాపట్ల జిల్లా ప్రథమం
పీ–4 అమలులో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళికి సీఎం అభినందనలు బాపట్ల: పీ–4 అమలులో బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రణాళిక, అధికారుల సమష్టి పనితీరు చాలా బాగుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. పీ–4 అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం రాజధాని అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలో 62,388 బంగారు కుటుంబాలు ఉంటే 44,920 కుటుంబాలను 3,528 మంది మార్గదర్శిలకు దత్తత ఇవ్వడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసించారు. బంగారు కుటుంబాలను 72శాతం అనుసంధానించడం అభినందనీయమన్నారు. మిగిలిన 17వేల కుటుంబాలను మార్గదర్శిలకు దత్తత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు బాపట్లను స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం సూచించారు. పీ–4 విధానంలో బంగారు కుటుంబాలకు చేయూతనందిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి సీపీఓ షాలేమ్ రాజు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ గ్లోరియా, తదితరులు హాజరయ్యారు. నేడు నృసింహుని హుండీ కానుకల లెక్కింపు మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శనివారం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎగువ, దిగువ సన్నిధిలోను, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలను ఉదయం 9 గంటలకు లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు పాల్గొనవచ్చని ఆయన తెలియజేశారు. -
ఇంటింటికి చంద్రబాబు మోసాలు
రేపల్లె: అధికారం కోసం మోసపూరిత హామీలివ్వటం, ప్రజలను మోసగించటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంశంపై జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం తప్ప ప్రజలను, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరన్నారు. మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్రెడ్డి పవిత్ర గ్రంథంలా భావిస్తే చంద్రబాబు చిత్తు పేపరులా చెత్తకుండీలో పడవేశారన్నారు. హామీలు అమలు చేయకుండానే అమలు చేసేశాం, సూపర్ సిక్స్పై ప్రశ్నించే వారి నాలుక కట్ చేస్తామని చంద్రబాబు అనటం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఏ హామీలు అమలు చేశారో బహిరంగంగా ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు వైఎస్సార్ సీపీ ఇంటింటికి చంద్రబాబు మోసాలను తీసుకెళుతుందన్నారు. ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత : డాక్టర్ ఈవూరు గణేష్ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ మాట్లాడుతూ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు, ప్రజలపై అక్రమ కేసులు తప్ప సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిందేమీలేదన్నారు. దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ శిరసా వహించాలన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు గుర్తు చేస్తూ ఇంటింటికి అందించాలన్నారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, మండల సమన్వయకర్తలు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, నాయకులు యార్లగడ్డ మదన్మోహన్, కాటూరి శివనాగబాబు, చదలవాడ శ్రీనివాసరావు, కర్రి వెంకట కృష్ణారెడ్డి, వీసం నాగలక్ష్మి, బొర్రా శ్రీనివాసరావు, చిమటా బాలాజీ, దొంతిబోయిన కొండలురెడ్డి, లుక్కా బాపనయ్య, తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ అడిగితే నాలుక కోస్తాననటం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున గుళ్లపల్లిలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ పాల్గొన్న సమన్వయకర్తలు డాక్టర్ గణేష్, వరికూటి అశోక్బాబు -
పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు
అద్దంకి: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చే కార్యక్రమాన్ని అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ పరిశీలకులు తూమాటి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు గిట్టుబాటు ధర అన్నారని.. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేదన్నారు. మిర్చి రైతు నట్టేట మునిగాడన్నారు. పొగాకు రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. వరి రైతు ఉరివేసుకునే పరిస్థితి ఉందన్నారు. అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూ ఆర్ కోడ్ కలిగిన ప్రచార పత్రాన్ని ఆవిష్కరించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర ప్రచార విభాగం నాయకుడు పులికం కోటిరెడ్డి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, పాలపర్తి శ్రీధర్, కె.శ్రీవిద్య, సంతమాగులూరు జెడ్పీటీసీ అడవి శ్రీను, కొల్లా భువనేశ్వరి, మాకినేని శ్రీనివాసరావు, బాజీవలి, మురహరి యాదవ్, రఘురామగుప్తా, ఓబుల్ రెడ్డి తదితర నాయకులు మాట్లాడారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, సంతమాగులూరు మండల కన్వీనర్ వూట్ల నాగేశ్వరరావు, ఓబులరెడ్డి, కాశీదేవి, రాష్ట్ర ప్రచార కమిటీ నాయకుడు కోయి అంకారావు, ముత్తవరపు రమణయ్య, బాబూ, ఊడత్తు సురేశ్, బి.మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుట్రలతోనే కూటమి అధికారం : ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఒంటిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోతామని గ్రహించిన చంద్రబాబు అండ్ కో కూటమి కట్టి కుట్ర లతో గెలిచారని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. కూటమి నేతలు అక్రమార్జనకే సమయం సరిపోతుందని, ప్రజల గురించి వారికి పట్టదన్నారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబు : పానెం చిన హనిమిరెడ్డి పార్టీలో అక్కడా.. ఇక్కడా నాటకాలాడే నాయకులను తాను నమ్మనని నియోజవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. హామీల అమలుపై ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి భయకంపితులను చేస్తున్నారని, వాటికి ఎవరూ భయపడవద్దన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. కూటమి సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళదాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున అద్దంకిలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ నియోజకవర్గ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవరావు, నియోజకవర్గ సమన్వయకర్త చిన హనిమిరెడ్డి -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడమటి బిక్షాలు కోరారు. టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు, పార్క్ కూలీలకు, ఆఫీసు సిబ్బందికి, టౌన్ప్లానింగ్ సిబ్బందికి కేటగిరిల వారీగా జీఓ 36 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని విన్నవించారు. రిటైర్ అయిన కార్మికుల స్థానంలో, మృతి చెందిన వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. సమస్యను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శివప్రసాద్ హామీ ఇచ్చారు. సింగం వాణిశ్రీ పాల్గొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం వద్దు బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాచవరపు రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ ఈ మేరకు ఈనెల 7వ తేదీన విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బాపట్ల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు యల్లావుల సోహిత్ యాదవ్, పర్చూరు నియోజకవర్గ అధ్యక్షులు కాటి లక్ష్మణ్, రాష్ట్ర విద్యార్థి విభాగం కమిటీ జాయింట్ సెక్రటరీ షేక్ పర్వే జ్, రేపల్లె అధ్యక్షులు వసీం మొహమ్మద్, చీరాల అధ్యక్షులు గోనబోయిన వెంకటేష్, జిల్లా విద్యార్థి యువ నాయకులు చోప్రా రాజశేఖర్ ఉన్నారు. -
కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వాలి
పర్చూరు(చినగంజాం): యజమానితో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ కౌలు కార్డులివ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. పర్చూరులో రామానాయుడు ప్రెస్ వెల్ఫేర్ అసోసియేషన్ హాలులో శుక్రవారం నిర్వహించిన కౌలు రైతు సంఘం జిల్లా విస్తృత సమావేశంలో ప్రసంగించారు. కౌలు రైతులందరికీ గ్రామ సభలు జరిపి కౌలు కార్డులు ఇవ్వాలని.. కనీసం ఫసలీ రాయించి ఆ ప్రకారమైనా కార్డులివ్వాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. పొగాకు కొనుగోలు మందకొడిగా సాగుతోందని తెలిపారు. మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారని, మిర్చి పంటదీ అదే పరిస్థితి అన్నారు. కౌలు రైతులకు కార్డులివ్వడం , బ్యాంకు ద్వారా రుణాలివ్వడం, తిరిగి పంట వేసుకునేందుకు ప్రోత్సహించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కౌలు రేట్లు చాలా భారంగా ఉన్నాయని కౌలు రైతులంతా ఉమ్మడిగా కౌలు రేట్లు తగ్గించుకోవాలని కోరారు. దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా నాయకుడు కొండయ్య మాట్లాడుతూ వెంటనే సభ్యత్వాలు పూర్తి చేయాలని మండల మహాసభలు జరపాలని జూలై 26న స్వర్ణ గ్రామంలో నిర్వహించే జిల్లా మహాసభలకు అన్ని మండలాల నుంచి రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి టి. యషయ్య అధ్యక్షత వహించారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు బండి శంకరయ్య, భాను, ఏడుకొండలు, గోవింద్, వెంకటరావు, రహీం, కొమ్మినేని శ్రీను, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ లారీ ఎదురైతే హడలే..
బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు, అద్దంకి మండలాల్లో రహదార్లపై టూవీలర్, కార్లపై ప్రయాణించాలంటే భయంగా ఉంది. 4 నుంచి 7 గ్రానైట్ బండలు, లారీ ట్రాలీలపై ఎగుమతితో ఎక్కడ ఒరుగుతాయోనని భయపడుతున్నాం. – ధర్మవరపు రవికుమార్ ఆదాయం సమకూరుతున్నా అభివృద్ధి లేదు.. బల్లికురవ, ఈర్లకొండ చుట్టూ 25 పైచిలుకు గ్రానైట్ క్వారీలు మండలంలో 600 పైచిలుకు పరిశ్రమలు ఉన్నాయి. ఎగుమతులకు రాయల్టీ చెల్లింపు ద్వారా ఆదాయం సమకూరుతున్నా రహదార్లు అభివృద్ధి చెందడం లేదు. ఇక్కడ నుంచి ప్రభుత్వానికి చెల్లించే ఆదాయంతో పూర్తిస్థాయిలో అన్ని రహదార్లను అభివృద్ధి పరచవచ్చు. – తంగిరాల వెంకేటేశ్వర్లు, సీపీఎం నాయకుడు ● -
అల.. ఆక్రమణల తీరం
మడ అడవుల నుంచి అలల వరకు ఆక్రమణలే.. సాక్షి ప్రతినిధి,బాపట్ల: వేటపాలెం మండలాల పరిధిలోని విజయలక్ష్మీపురం, ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రం తీరం(బీచ్)లో ఉన్న ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములను ఈ ప్రాంతానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలు, రిసార్ట్స్ యజమానులకు కట్టబెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. ప్రైవేటు భూముల ధరతో పోలిస్తే కాస్త తక్కువ ధరకు ప్రభుత్వ, అటవీ భూములు లభిస్తుండడంతో రిసార్ట్స్ వ్యాపారులు రెవెన్యూ అధికారులకు అడిగినంత ముట్టజెప్పి భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారు. కబ్జా భూములను తమ రిసార్ట్లలో కలిపేసుకొని వాటిని మరింతగా విస్తరిస్తున్నారు. ఇదే అదనుగా చీరాల టీడీపీ ముఖ్య నేత కొందరు రెవెన్యూ అధికారితో కలిసి ఇక్కడున్న ప్రభుత్వ, అటవీ భూములను కొట్టేసి వాటిని తిరిగి రిసార్ట్ వ్యాపారులతోపాటు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వేటపాలెం మండలంలో ఇప్పటికే వేలాది ఎకరాలుగావున్న అటవీ, ప్రభుత్వ భూములను టీడీపీ నేతలతో కలిసి రెవెన్యూ అధికారులు అమ్మకానికి పెట్టి రూ.కోట్లు గడించినట్లు రెవెన్యూ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఆక్రమించి.. విస్తరించి రెవెన్యూ అధికారులకు డబ్బులు గుమ్మరించి కొంత, కబ్జాచేసి మరికొంత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్న వ్యాపారులు, పచ్చనేతలు తీరంలో రిసార్ట్లు, అధునాతన విడిది గృహాలు నిర్మించుకుంటున్నారు. వేటపాలెం మండలంలో విజయలక్ష్మీపురం మొదలు కొని ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తీరంవరకూ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. ఊపందుకున్న రిసార్ట్స్ నిర్మాణాలు చీరాల, వేటపాలెం సముద్రతీర ప్రాంతానికి రోజురోజుకూ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వీకెండ్స్లోనే ఏపీ నలుమూలలనుంచే కాక అటు తెలంగాణ నుంచి లక్షలాదిమంది తరలివస్తుండగా మిగిలిన రోజుల్లోనూ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తీరంలో వ్యాపారం పెరగడంతో ఇక్కడ రిసార్ట్స్ నిర్మించేందుకు ఏపీతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సినీ పరిశ్రమకు చెందిన వారితోపాటు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అన్నివర్గాలకు చెందిన స్థితి మంతులు భూములు కొంటున్నారు. దీంతో ఒకప్పుడు ఎకరం రూ. 25 లక్షలలోపు వున్న భూముల ధరలు నేడు ఎకరం రూ. 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ధర పలుకుతోంది. వేటపాలెం పరిధిలోని ఓడరేవు మొదలు పొట్టిసుబ్బయ్యపాలెం వరకూ ఎకరం ధర సగటున రూ. 5 కోట్లుగా వుంది. అధికారులకు కాసుల పంట వేటపాలెం ప్రాంతంలో ప్రైవేటు భూములకు మించి ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములు ఉండడంతో ఇదే అవకాశంగా కొందరు రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని ఆ భూములను రిసార్ట్ యజమానులు, పచ్చనేతలకు అప్పగిస్తున్నారు. ఇక్కడి పచ్చనేత తనకు అనుకూలురైన ఒకరిద్దరు రెవెన్యూ అధికారులను వేటపాలెంలో నియమించుకొని భూముల విక్రయాలతో రూ.కోట్లు దండుకుంటునట్లు ఆరోపణలున్నాయి. – అక్రమాలు సృతిమించడంతో వేటపాలెం తహసీల్దారును ఇటీవల జిల్లా కలెక్టర్ వెంకట మురళి సరెండర్ చేశారు. తీరంలో భూ ఆక్రమణలపై చీరాల ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఇది సజావుగా సాగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశముంది. టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి దందా రిసార్ట్స్ యజమానులకు తీరం భూముల అప్పగింత ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల అమ్మకం కొన్న భూముల్లో ప్రభుత్వ భూములను కలిపేసుకుంటున్న వైనం తీరంలో ఎకరా రూ. 3 కోట్ల నుంచి 6 కోట్లు అమాంతం పెరిగిన భూముల ధరలు ఇదే అవకాశంగా ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న రెవెన్యూ అధికారులు సీఆర్జెడ్ నిబంధనలకు తిలోదకాలు మడ, సర్వి చెట్లు కొట్టేసి సీ వ్యూకు రిసార్ట్లు ఆక్రమణలు ‘అల’.. పట్టించుకోరేలా? తీరంలో రిసార్ట్లు నిర్మించిన వ్యాపారులు తీరం అలల వరకూ ఆక్రమించి ఆ ప్రాంతంలో గ్రావెల్, చిప్స్ వేసి చదును చేసి తమ రిసార్ట్లకు వచ్చే పర్యాటకులకు విడిదిగా మారుస్తున్నారు. సాయంత్రం పూట పర్యాటకులు ఆ ప్రాంతాల్లో కూర్చొని సముద్రాన్ని చూసేలా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తీరాన్ని సముద్రం నీటివరకూ ఆక్రమిస్తున్నా చర్యలు శూన్యమనే చెప్పాలి. నిబంధనలకు ఆ‘మడ’ దూరం రిసార్ట్ల పరిధిలో సీ వ్యూ కనిపించేందకు అడ్డుగావున్న మడ, సర్వి చెట్లను అడ్డంగా నరికివేస్తున్నారు. తీరంలోని మడ, సర్వి చెట్లను నరికి వేయడం నేరం. కానీ అధికారులను లోబరుచుకొన్న రిసార్ట్ల యజమానులు ఏమాత్రం ఖాతరు చేయక చెట్లను నరికి వేస్తున్నారు. సముద్ర తీరంలో అలల తాకిడి, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీరం కోతకు గురికాకుండా ఉండేందుకు మడ చెట్లను పెంచుతారు. ఉదాహరణకు 2005లో వచ్చిన సునామీ దెబ్బకు ఇదే ప్రాంతంలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో 9 మంది మరణించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సర్వి మొదలు ఇతర సామాజిక వనాలను అటవీశాఖ పెంచుతుంది. -
ఛిద్రమవుతున్న రోడ్లు
బల్లికురవ: గ్రామీణ రహదార్లు గ్రానైట్ భారీ వాహనాల రాకపోకలతో ఛిద్రమౌతున్నాయి. అడుగుకో గోయ్యితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ నుంచి తీసే స్టీల్గ్రే మీటరు, ముడిరాళ్లు మార్టూరు, గణపవరం, జొన్నతాళి, వేమవరం, మే దరమెట్ల, సంతమాగులూరు, ఒంగోలు, మురికి పూడి, తాతపూడిలోని పరిశ్రమలతోపాటు బెంగళూరు, తాడిపత్రి, చెన్నె, హైదరాబాద్ పట్టణాలకు నిత్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఒక్కో లారీపై ప్రమాదకరంగా 4 నుంచి 7 బ్లాక్లను ఎక్కిస్తూ 70 నుంచి 90 టన్నుల వరకు తరలిస్తున్నారు. గోతుల కారణంగా అంటూ ఎక్కడ రాయి దొర్లి కింద పడుతుందోనని ప్రజలు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ప్రతిపాదనలకే పరిమితం.. భారీ వాహనాల రాకపోకలతో బల్లికురవ–నాగరాజుపల్లి–మార్టూరు, చెన్నుపల్లి–వేమవరం జంక్షన్–తాతపూడి –అనంతవరం, కొణిదెన–వేమవరం జంక్షన్–ఉప్పుమాగులూరు, నక్కబొక్కలపాడు–కొదదెన–మార్టూరు, బల్లికురవ–సంతమాగులూరులో రోడ్లు మోకాటిలోతు గోతులతో 10 కిలో మీటర్లు ప్రయాణానికి సైతం 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతోంది. గోతుల్లో గ్రానైట్ లారీలు కూరుకుని ట్రాఫిక్జామ్లతో బస్సులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులకు గమ్యం చేరతామన్న గ్యారంటీ లేదు. గ్రానైట్దారుల ఆధీనంలో.. చెన్నుపల్లి–అనంతవరం రోడ్లులో కొండాయపాలెం గ్రామాల మధ్య క్వారీ నిర్వాహకులు ఆర్అండ్బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రహదారిపైనే యంత్రాలు, లారీలు నిలపడం, లోడింగ్ చేపట్టడం వల్ల తారురోడ్లు సైతం జారుడు బల్లను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో ఈరోడ్డులో ప్రయాణించాలంటే సాహసం చేయక తప్పదు. దెబ్బతిన్న రోడ్లకు ప్రతిపాదనలు తయారు చేసి పంపుతున్నారు. నిధులు మంజూరుతో టెండర్కు కాంట్రాక్టర్లను ఆహ్వానించినా భారీ వాహనాల రాకపోకలకు మెయింటెనెన్స్ ఇవ్వలేక రోడ్ల అభివృద్ధికి కాంట్రాక్టర్లు మందుకు రావడం లేదు. -
ఒరిగిన అమరేశ్వరాలయ రాజగోపురం తలుపు
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానం దక్షిణరాజగోపురానికి అమర్చిన రెండు తలుపుల్లో ఒక తలుపు పక్కకు ఒరిగిపోయింది. బుధవారం రాత్రి దేవాలయ భద్రతా సిబ్బంది తలుపులు మూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ మాట్లాడుతూ రాజగోపుర తలుపు మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో వేగంగా వచ్చిన ఓ కారు తలుపును ఢీ కొట్టటం వల్ల ఇసుపరాడ్ వంకర వచ్చిందన్నారు. ఈతరహా తలుపులు మరమ్మతులు చేసే వడ్రంగ నిపుణులను పిలిపించటానికి ఏర్పాట్లు చేశామని రెండుమూడు రోజులలో మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అప్పటివరకు గాలిగోపురం వద్ద సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు. అలాగే పోలీసుల సహకారంతో మరమ్మతులు పూర్తయ్యే వరకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. నేడు భూ సమీకరణ గ్రామ సభలు తాడికొండ: తాడికొండ మండలం దామరపల్లి, ఫణిదరం, బండారుపల్లి గ్రామాల్లో భూ సమీకరణ కోసం ఎమ్మెల్యే అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తాడికొండ తహసీల్దార్ మెహర్ కుమార్ గురువారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఫణిదరం, 11 గంటలకు దామరపల్లి, 12 గంటలకు బండారుపల్లి గ్రామాల్లో గ్రామ సభ జరగనుంది. రైతులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన సూచించారు. సీఎస్ సమీక్షకు హాజరైన కలెక్టర్ నరసరావుపేట: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియా సమావేశానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జేసీ సూరజ్ గనోరే కలెక్టరేట్ నుంచి వర్ుచ్యవల్గా హాజరయ్యారు. పీ–4, పాజిటివ్ పబ్లిక్ పెర్సప్సన్, మహిళా స్వయం శక్తి సంఘాలకు వార్షిక క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్, మైక్రో క్రెడిట్ ప్లాన్, పోషణ్ ట్రాకర్, బాల సంజీవని లబ్ధిదారుల ఫేషియల్ అథంటికేషన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, రుతుపవన సన్నాహక చర్యలు, అంశాలపై సమీక్ష చేశారు. దీనిలో కలెక్టర్తో పాటు డీఆర్ఓ ఏకా మురళి, సీపీఓ శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. రేవుల్లో పడవలు తిప్పుకొనేందుకు వేలం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణానది రేవుల్లో పడవలు, బల్లకట్టు తిప్పుకొనేందుకు గురువారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ అధ్యక్షతన సీల్డ్ టెండరు, బహిరంగ వేలం నిర్వహించారు. ఆరు రేవులకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు పడవలు, బల్లకట్టు తిప్పుకొనేందుకు హక్కుల కల్పిస్తూ సీల్డ్ టెండరు, బహిరంగ వేలంలో అచ్చంపేట, అమరావతి మండలాల్లోని నాలుగు రేవులను పాటదారులు దక్కించుకున్నారు. మాచవరం, కొల్లిపర మండలాల్లోని రేవులకు జరిగిన వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో వాటిని వాయిదా వేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్పై శిక్షణ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని వివిధ రాష్ట్రాల అధికారులు గురువారం సందర్శించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్క్యాంపస్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్పై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాల నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్లు, ఆయా రాష్ట్రాల రెవెన్యూ అధికారులు విచ్చేశారని తెలిపారు. రేపీ ఎస్టీఎంఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ తిరుమల కుమార్, కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ తనూజ, జీఐఎస్ ఎక్స్పర్ట్ హరీష్, ప్రాజెక్ట్ మేనేజర్లు బస్వంత్, కిషోర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
భవనాశికి గ్రహణం
భవనాశి మినీ రిజర్వాయర్కు గ్రహణం పట్టింది. ఎన్నికలకు ముందు అద్దంకిలో పర్యటించిన ప్రస్తుత మంత్రి నారా లోకేష్, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు అధికారంలోకి వస్తే పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు.అద్దంకి: కూటమి ప్రభుత్వం తీరుతో 5 వేల ఎకరాల మెట్ట రైతులు సాగునీటి ఆశలు ఆవిరౌతున్నాయి. దానికి తోడు బడ్జెట్లో రిజర్వాయరు కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించకపోవడంతో ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం లేదనేది తేటతెల్లం అయింది. బాపట్ల జిల్లాలోని శింగరకొండలో బ్రిటిష్ కాలంలో 250 ఎకరాల్లో భవనాశి చెరువు నిర్మాణం జరిగింది. ఈ చెరువు కింద ఇప్పటికీ హైలెల్, లో లెవెల్, ప్లగ్హోల్ కాలువల ద్వారా అద్దంకిలోని నర్రావారిపాలెం, వేలమూరిపాడు, మణికేశ్వరం, గోపాలపురం, చక్రాయపాలెం గ్రామాల్లోని 1197 ఎకరాల్లో మాగాణి సాగువుతోంది. గతంలో ఈ చెరువు పల్లంలో ఉండటంతో పరిసర గ్రామాల కొండలపై నుంచి వచ్చిన వర్షపు నీటితో కలకళలాడేది. పూడిక చేరడంతో నిల్వ సామర్థ్యం తగ్గడంతో సాగు అంతంతమాత్రంగా మారింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా భవనాశి చెరువుకు బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం దగ్గర గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యామ్ నిర్మించి, ఆ నీటిని ఫీడర్ చానల్ ద్వారా చెరువుకు తరలించి మినీ రిజర్వాయరుగా మార్చాలని భావించారు. రూ.27 కోట్లు కేటాయించడంతో 2013లో పనులు మొదలయ్యాయి. తరువాత టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. పెరిగిన వ్యయం దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.45 కోట్లకు పెంచారు. వెలమారిపాలెం వద్ద చెక్డ్యామ్, భవనాశి కట్ట ఎత్తు పెంచడం, భవనాశి చెరువుకు నీరు చేరే విధంగా నది నుంచి ఫీడర్ చానల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం చెక్డ్యామ్, చెరువు కట్ట ఎత్తు పెంచే పనులు పూర్తి కాగా.. 12.6 కిలోమీటర్ల మేర తవ్వాల్సిన ఫీడర్ చానల్ పనులు మూడొంతులు మాత్రమే పూర్తయ్యాయి. అలాగే చెరువు విస్తరణ పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ప్రస్తుతం కాంట్రాక్టర్ క్లోజింగ్ ఇవ్వాలని వేడుకోలుతోపాటు, ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, అవసరమైన భూమ సేకరణ కోసం మరో రూ. 40 కోట్లు అవసరం అవుతాయని ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో రూ.27 కోట్ల అంచనా పనులు ప్రస్తుతం వందకోట్లకు మించినా ఇది కలగానే మారిందని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం సాగువుతున్న 1197 ఎకరాలతోపాటు, తారకరామ ఎత్తిపోతల పథకానికి నీరు అంది, మొత్తం 5 వేల ఎకరాల మెట్ట భూములు మాగాణిగా మారతాయి. నెరవేరని మంత్రుల హామీలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తయితే ఐదు వేల ఎకరాలకు సాగు నీరు మినీ రిజర్వాయర్ నిర్మాణం జరిగేనా? -
వైఎస్సార్సీపీ నేతలపై దాడులను సహించం
చుండూరు(వేమూరు): వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేసినా, వారి గురించి అసభ్యకరంగా మాట్లాడినా సహించబోమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు హెచ్చరించారు. చుండూరు మండలంలోని మోదుకూరు గ్రామంలో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు అనపు రెడ్డి రఘురామి రెడ్డి ఇంటిపై రాళ్లు విసిరి విచక్షణరహితంగా కొందరు ప్రవర్తించారన్నారు. రఘురామి రెడ్డి ఇంటికి గురువారం ఆయన వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదుకూరు గ్రామంలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. గంజాయి తాగి వైఎస్సార్సీపీ నాయకులపై కొందరు దాడులు చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై రాళ్లు వేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచనలను వీడి, అందరూ కలిసి ఉండాలని కోరారు. తప్పు ఎవరు చేసినా అది తప్పేనని తెలిపారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కులం అనే ముసుగు వేయకూడదని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాని కోరారు. రఘురామి రెడ్డి ఇంటిపై రెండు సార్లు దాడులు చేయడాన్ని ఖండించారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేస్తే ఊరుకోబోమని చెప్పారు. నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు మండల పార్టీ అధ్యక్షుడి ఇంటిపై రాళ్లు విసిరిన దుండగులు సంఘటన స్థలం పరిశీలన అనంతరం బాధితుడికి అశోక్బాబు పరామర్శ -
ప్రజలను వంచించిన చంద్రబాబు
భట్టిప్రోలు (కొల్లూరు): ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మాత్రమే అతిపెద్ద మోసగాడని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం మండలంలోని అద్దేపల్లిలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం వేమూరు నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజలను నిట్టనిలువునా మోసం చేస్తూ పథకాలను అమలు చేయకుండానే మభ్యపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకుండానే ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు అబద్ధాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్చిన తరుణం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నేడు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనలో వరి రైతులకు ఉరి వేసకుని.. మిర్చి రైతులకు రైలు కింద పడి.. పొగాకు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమైన విషయమన్నారు. పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా, ఇస్తానన్న పెట్టుబడి సాయం, ఇతర పథకాలు అందించకుండా సీఎం చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మేలు ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాల అమలును నేడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తెలియజేయడంతోపాటు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి చేకూరిన లబ్ధి గురించి జగనన్న సైనికులందరూ ప్రతి గ్రామంలో వివరించాలని కోరారు. తద్వారా చంద్రబాబుపై యుద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు బాకీ పడుతున్న చంద్రబాబు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీర్చలేని బాకీ పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి ఇంటికీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ది చేకూరిస్తే, నేడు చంద్రబాబు ప్రజలను అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అబద్ధపు హామీలను మండలస్థాయి, గ్రామ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ నాయకులు కేసులు పెడతార్న భయాలు, అపోహలు వద్దని సూచించారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తప్పుడు కేసులు పెడితే చివరకు పోలీసులపైనే ప్రయివేటు కేసులు పెట్టేందుకూ వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ఈ సందర్భంగా ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’పై ఆయన కార్యకర్తలు, నాయకులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దావూరి లలితకుమారి, వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి నాయకులు కోగంటి లవకుమార్, హుసేన్, వైఎస్సార్ సీపీ భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, చుండూరు, అమృతలూరు మండల కన్వీనర్లు పడమట శ్రీనివాసరావు, దాది సుబ్బారావు, సుగ్గున మల్లేశ్వరరావు, అన్నపరెడ్డి రఘురామరెడ్డి, హేమచంద్ర శ్రీనివాసరావు, వేమూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మన బాధ్యత వైఎస్సార్ సీపీ కుటుంబం మొత్తం కలిసికట్టుగా పోరాటం చేయాలి బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీపై గ్రామ గ్రామాన ప్రచారం తక్షణ అవసరం కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి ఇది తొలిమెట్టు వేమూరులో కార్యక్రమం ప్రారంభోత్సవంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పిలుపుప్రతిపక్ష నేతలపై వేధింపులతో సరి బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమటి మాధవరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం అనే సంతృప్తి మినహా ఏడాది పాలనలో చేసిందేమీ లేదన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలతో చివరకు ఆ పార్టీ కార్యకర్తలే విసిగి వేసారే పరిస్థితి వచ్చిందన్న విషయం పచ్చి నిజమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాల వల్ల నేడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆయనను తలచుకుంటున్నారని పేర్కొన్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని పొడిచే దున్నపోతును తెచ్చుకున్నామన్న ఆలోచన ప్రజలతోపాటు టీడీపీ కార్యకర్తలలోనే ఉందని చెప్పారు. -
గృహ నిర్మాణంలో లక్ష్యాలను సాధించాలి
బాపట్ల: పక్కా గృహాల నిర్మాణాలలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో గురువారం ఆయన కలెక్టర్ చాంబర్లో దీనిపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణాలలో పురోగతి లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు 8,299 పక్కా గృహాలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు 3,687 గృహాలే పూర్తి కావడంతో మండల స్థాయి అధికారులను కలెక్టర్ నిలదీశారు. దీనికి కారణాలపై ఆరా తీశారు. చార్జి మెమోలు ఇచ్చినా పనితీరులో మార్పు లేదని అసహనం వ్యక్తపరిచారు. గృహ నిర్మాణ శాఖలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో 17వ స్థానంలో ఉన్న జిల్లాను 23వ స్థానానికి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. లక్ష్యాలను సాధించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మండల ఈఈలు, డీఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
ఏకపక్ష వైఖరికి కత్తెర పడేనా?
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీలు, అధికారులకు జెడ్పీ నుంచి ముందస్తుగా సమాచారాన్ని పంపారు. గత మార్చి 15న కోరం లేకపోవడంతో వాయిదా పడిన సమావేశం మరలా ఇప్పటి వరకూ జరగలేదు. చైర్పర్సన్ ఏకపక్ష ధోరణిపై వ్యతిరేకత ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడంతోపాటు ముందస్తు అనుమతుల పేరుతోనూ జెడ్పీ చైర్పర్సన్ నేరుగా సంతకాలు చేసి పనులు చేస్తున్న ధోరణికి వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు మార్చి 15న ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో రూ.కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇస్తున్న తీరును ఖండించారు. వాటిలో కమీషన్లు, పర్సంటేజీ తీసుకుని అవినీతి, అక్రమాలతో జెడ్పీని నడుపుతున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. మార్చిలో ఏర్పాటు చేసిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక సంవత్సర బడ్జెట్న ఆమోదించాల్సి ఉండటంతోపాటు రూ.12 కోట్ల విలువైన పనులకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తు అనుమతులను ఇచ్చేయడంతో సమావేశానికి హాజరైన పక్షంలో సభ్యులు అంగీకారం తెలిపినట్లవుతుందనే కోణంలో గైర్హాజరయ్యారు. తద్వారా జెడ్పీటీసీలు తమ హక్కులను పరిరక్షించుకోవడంలో సఫలీకృతమయ్యారు. అజెండాలో ‘రూ.22 కోట్ల విలువైన పనులు’ చైర్పర్సన్ వైఖరితో జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. తాము గెలిచీ ప్రయోజనమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. చైర్పర్సన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్చి 15న బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో, అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపి ఆమోదింపజేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జెడ్పీటీసీలకు తెలియకుండా ముందస్తు అనుమతుల పేరుతో రూ.12 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చేశారు. తాజా సమావేశంలో మరో రూ.10 కోట్ల మేరకు ముందస్తు అనుమతులు ఇచ్చారు. మొత్తం రూ.22 కోట్ల పనులను ఆమోదం కోసం శుక్రవారం జరగనున్న సర్వసభ్య సమావేశపు అజెండాలో పొందుపర్చారు. చైర్పర్సన్ ‘నిధుల మంజూరు’ ధోరణిపై వైఎస్సార్ సీపీ సభ్యుల తీవ్ర అసంతృప్తి ఆమోదం కోసం నేటి సర్వసభ్య సమావేశం అజెండాలో పొందుపరిచిన అధికారులు -
ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు
భట్టిప్రోలు(కొల్లూరు): ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే ఎటువంటి విచారణ లేకుండానే నేరుగా కోర్టుకు హాజరుపరుస్తామని మైనింగ్ శాఖ ఏజీఎం పి.ఫణిరాజ్ కుమార్ సింహ హెచ్చరించారు. గురువారం మండలంలోని ఓలేరులో కొన్ని నెలల క్రితం అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఆదేశాలతో మైనింగ్, రెవెన్యు శాఖాధికారులు విచారణ చేపట్టారు. ఇసుక తవ్వకాలు చేపట్టిన ఓలేరు ఉచిత ఇసుక క్వారీని మైనింగ్ శాఖ ఏజీఎం పరిశీలించి గ్రామస్తులను విచారించి వారి నుంచి వివరాలు సేకరించారు. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా వాటిల్లుతున్న ముప్పును గ్రామస్తులు వివరించడంతో ఆయా అంశాలను నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ, తమ పరిశీలనలో వెలుగుచూసిన అంశాలను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిపారు. మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ కె.స్నేహ, తహసీల్దార్ మేక శ్రీనివాసరావు, ఎస్ఐ ఎం.శివయ్య ఉన్నారు. విచారణ లేకుండానే నేరుగా కోర్టుకు హాజరుపరుస్తాం మైనింగ్ శాఖ ఏజీఎం ఫణిరాజ్ కుమార్ సింహ -
‘నల్లబర్లీ’ పూర్తిగా కొనాల్సిందే..!
జె.పంగులూరు: ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్బాబు డిమాండ్ చేశారు. పంగులూరులోని మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసిన నల్లబర్లీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు పరిశీలించారు. అక్కడ ఉన్న రైతుల వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామారావు, వినోద్బాబులు మాట్లాడుతూ నిబంధనల పేరుతో పొగాకు చెక్కులను వెనక్కి పంపటం మానుకోవాలని, రైతులు తెచ్చిన పొగాకు చెక్కులు మొత్తం ఆలస్యం చేయకుండా కొనాలని కోరారు. రైతులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి పొగాకు చెక్కులు కొనుగోలు కేంద్రానికి తీసుకొని వస్తే, ఇక్కడ నిబంధనల పేరుతో చెక్కులు వెనక్కి పంపుతున్నారని మండి పడ్డారు. మంచి గ్రేడ్ ఉన్న పొగాకు కూడా తక్కువ ధర వేస్తున్నారన్నారు. వెనక్కి పంపితే మరింత భారం.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న పొగాకు చివరి ఆకు కూడా కొంటామని చెబుతోందని, కానీ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న నిబంధనలు రైతులకు మేలు చేసేవిగా లేవన్నారు. రైతులు గత నాలుగు నెలలు నుంచి తమ పంటను అమ్ముకోవాలని చూశారన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చి తమ పేరు రాగానే చెక్కులు తీసుకొని మార్కెట్ యార్డు వద్దకు రాగా వివిధ కారణాలతో సగానికి సగం చెక్కులు వెనక్కి పంపుతున్నారని ఆరోపించారు. గ్రేడ్ చేసుకొన్ని చెక్కులు తీసుకొని వస్తే, మళ్లీ వాటిని వెనక్కి పంపుతున్నారని, తిరిగి వాటిని గ్రేడ్ చేసి చెక్కులు తొక్కితే రైతులకు మరింత భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నష్టపోకుండా మేలు చేసేవిధంగా చూడాలన్నారు. పొగాకు నాణ్యతను బట్టి మూడు గ్రేడ్లు చేసిన, ధరలు మాత్రం అతి తక్కువగా వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ సింగారావు దృష్టికి వియాన్ని తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో రైతులు గుడిపాటి మల్లారెడ్డి, తానికొండ సుధాకర్, తలపనేని స్వామి, రావెళ్ల ఉమామహేశ్వరరావు, చుక్కా కాంతయ్య, మదాల సాంబశివరావు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నిబంధనల పేరుతో పొగాకు చెక్కులను వెనక్కి పంపితే సహించం ప్రభుత్వం వ్యాపార పరంగా కాకుండా, రైతులకు మేలు జరిగేలా కొనాలి రైతు సంఘం నాయకుల డిమాండ్ -
నేడు ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’పై సమావేశం
రేపల్లె: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టినట్లు వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ తెలిపారు. గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను దగా చేసిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేసేందుకు ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హాజరవుతారన్నారు. సమావేశానికి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు. రేపు చీరాలలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ చీరాల: రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడంపై పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు గురువారం తెలిపారు. చీరాల మండలం రామకృష్ణాపురంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్సీ, జిల్లా పరిశీలకులు తూమాటి మాధవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున హాజరవుతారన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, చీరాల, వేటపాలెం మండలాల, పట్టణ అధ్యక్షులు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ మెంబర్లు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. రేపు ఇంకొల్లులో నియోజకవర్గ స్థాయి సమావేశం పర్చూరు(చినగంజాం): బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని ఇన్చార్జ్ గాదె మధుసూదనరెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు పర్చూరు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పాల్గొనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మండల కన్వీనర్లు మాజీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అనుబంధ విభాగం అధ్యక్షుడు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. -
భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్
బాపట్ల: భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులుగా జి.సురేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్.జె.వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఇప్పటివరకు ఇక్కడ సహాయ సంచాలకులుగా పనిచేసిన కె.రామబాలాజీ పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా నుంచి పదోన్నతితో బదిలీపై వచ్చిన సురేష్కు అధికారులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా పనిచేయాలి చీరాల: నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సహజ వనరులపై దృష్టి, స్వర్ణాంధ్ర –2047 ఉద్దేశమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో విజన్ ప్లాన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, సేవారంగం విస్తరిస్తేనే ఆదాయం ఎక్కువగా వస్తుందన్నారు. భవిష్యత్తులో అదే కీలకమన్నారు. విజన్ ప్లాన్పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ఆర్డీఓ టి.చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీడీఓ శివసుబ్రహ్మణ్యం, అధికారులు పాల్గొన్నారు. బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి వేమూరు: మద్యం బెల్టు షాపుల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.హేమంత్ నాగరాజు అన్నారు. మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయం గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్య షాపుల నిర్వాహకులు సమయ పాలన పాటించాలన్నారు. మద్యం ప్రభుత్వం ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని కోరారు. సీఐ రవి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్తుల కోసం శవ పంచాయితీ
జె. పంగులూరు: మానవత్వం మంటగలిసింది. ఆస్తి పాస్తులకు ఉన్న విలువ మనిషికి లేదని మరోసారి నిరూపితమైంది. ఆస్తుల కోసం మృత దేహాన్ని ఇంటి ముందు పెట్టి, ఆస్తి పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన సంఘటన కలచి వేసింది. వివరాలు.. మండలంలోని రామకూరు గ్రామానికి చెందిన ఎర్రిబోయిన సురేష్ వారం రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంఘటన పాఠకులకు తెలిసిందే.. కాగా మృత దేహానికి పోస్ట్మార్టం చేయించి మంగళవారం అప్పగించారు. అయితే అతని అంత్యక్రియలను భార్యతో పాటు, భార్య బంధువులు అడ్డుకున్నారు. సురేష్ తండ్రి అంజియ్య ఆస్తి పంపకాలు జరపలేదని, ఆస్తి పంచి.. సురేష్ భార్య తిరపతమ్మకు, ఆమె పిల్లలకు రాసి ఇచ్చేవరకు మృతదేహాన్ని కదిలించడానికి వీలు లేదని తెగేసి చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. మృతుడు సురేష్ తండ్రి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. మనుమలు, మనువరాళ్లు కూడా పెద్దవారయ్యారు. అయితే వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ అంజయ్య ఆస్తిని కుమారులకు పంచేందుకు అంగీకరించలేదు. దీంతో మంగళవారం నుంచి గురువారం వరకు రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులకు, బంధువులకు వాగ్వాదం, గొడవలు జరిగాయి. చివరికి గురువారం మధ్యాహ్నం రేణింగవరం పోలీస్ స్టేషన్కు పంచాయితీ చేరింది. అక్కడ ఎస్ఐ వినోద్బాబు ఇరువర్గాలతో మాట్లాడి రాజీ కుదర్చేందుకు సాయంత్రం 4 గంటలు అయింది. పోలీస్ స్టేషన్ వద్దే పత్రాలు రాసుకుని బంధువులు, కుటుంబ సభ్యులు రామకూరు చేరి.. అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్తులు పంచకుండా తమ దగ్గరే ఉంచుకొని, వృద్ధాప్యంలో కూడా తన పెత్తనమే చెల్లాలని ఒక వ్యక్తి చేసిన ప్రయత్నానికి ఓ కుటుంబలోని నాలుగు ప్రాణాలు బలైపోయిన ఘటన కూడా రామకూరు గ్రామంలోనే జరిగింది. ఇప్పుడు ఆస్తి కోసం అంత్యక్రియలు కూడా అడ్డుకున్న ఘటన కూడా ఇదే గ్రామంలో జరగడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియలు అడ్డుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు -
జాతీయ సమ్మెను జయప్రదం చేయండి
అద్దంకి: దేశవ్యాప్తంగా వాపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 9న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకుడు తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్ ఆవరణలో బుధవారం జాతీయ సమ్మె పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. సమావేశం కేఎల్డీ ప్రసాద్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ సమ్మెలో అన్ని ట్రేడ్ యూనియన్లు, ఎల్ఐసీ, కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు కలిసి సమ్మె చేస్తున్నట్లు వెల్లడించారు. కె.రఘుచంద్ మాట్లాడుతూ సమ్మెలో అందరూ పాలు పంచుకుని జయప్రదం చేయాలని కోరారు. ఉరి వేసుకుని మహిళ మృతి అద్దంకి రూరల్: కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల వద్ద చోటు చేసుకుంది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. నూజిళ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన మరియకుమారి (35) అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల్లో పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ కలహాలా.. లేదా ఇతర కారణాలనే అనే విషయం తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పునీత థామస్వారి అడుగుజాడల్లో నడవాలి
తుమృకోట(రెంటచింతల): క్రీస్తు సూక్తులను నిత్యం ఆచరిస్తూ పునీత థామస్వారు క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచారని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలలో నడిచి సమాజంలో నిజమైన క్రైస్తవులుగా జీవించాలని రెవ.ఫాదర్ ఎం.రాజరత్నం అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలో నున్న పునీత థామస్వారి చర్చి 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విచారణ గురువులు మాలై పవిత్రన్ ఆధ్వర్యంలో రెవ.ఫాదర్ కొణతం ఎలీషారాజుతో కలిసి సమష్టి దివ్యపూజాబలి సమర్పించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలోనే తుమృకోట చర్చి అతి పురాతనమైందన్నారు. అపోస్తులు 12 మందిలో ఒకరైన థామస్ వారు భారతదేశంలో మొట్టమొదటిసారి క్రీస్తు సువార్తను ప్రచారం చేశారని గుర్తుచేశారు. భక్తులకు పులిహార పంపిణీ చేశారు. పెద్దలు అశోక్, మల్లి, దుగ్గింపూడి శౌరి రాయపురెడ్డి, రెంటచింతల కానుకమాత చర్చి దళ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రెవ.ఫాదర్ రాజరత్నం వైభవంగా పునీత థామస్వారి చర్చి 125వ వార్షికోత్సవం -
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మణిలాల్ మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని గత 15 రోజుల నుంచి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. 4వ తేదీ నుంచి సమ్మెలో భాగంగా అత్యవసర సేవలైన నీటి, విద్యుత్ సరఫరా విధులలో కార్మికులు సైతం తమ సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రేపల్లె అధ్యక్షుడు ప్రభాకరరావు, కార్యదర్శి రవిబాబు, కోశాధికారి రాఘవేంద్రరావు, సభ్యులు యువరాజు, రవి, ప్రభాకర్, అనూష, గీత తదితరులు పాల్గొన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి మణిలాల్ -
శింగరకొండ విచ్చేసిన పీఠాధిపతులు
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ దేవస్థానానికి గురువారం అయోధ్య జానకి ఘాట్ జయ శరణ్ జీ మహరాజ్, అయోధ్య విశ్వకుటుంబ ఆకార పీఠం ట్రస్ట్ చీఫ్ సూర్యప్రకాష్ సరస్వతి రుద్రదిండి, చినమస్తాన్దేవి పీఠాధిపతులు, మహా మండేశ్వరీ పద్మావతి, నారాయణ ప్రత్యంగి మహాదేవి విచ్చేశారు. దేవస్థాన అర్చకులు పీఠాధిపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శింగరకొండలో గల హరహర గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పీరాధిపతులు మాట్లాడుతూ హిందువులందరూ గోమాతను పూజించాలన్నారు. గోశాల సుబ్బారావు బృందం పీఠాధిపతులను సన్మానించారు. తదుపరి అద్దంకి పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, పోలేరమ్మ దేవాలయం, కాళికా కమఠేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట విశ్వ కుటుంబ ధర్మ పరిరక్షణ అఖారా ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ వాకా వెంకట బాలగంగాధర్, చావా రామకృష్ణ, యామర్తి వెంకటేశ్వర్లు, అంకం నాగరాజు, గోశాల సుబ్బారావు, చెన్నుపల్లి శ్రీనివాసాచారి, పాపారావు, బ్రహ్మనందం, తదితరులున్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
తాడికొండ: పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బీఎస్వీ హిమబిందు విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5న నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.... జూలైలో పరిష్కరించదగ్గ కేసులను గుర్తించి, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు, న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించనున్నట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా లేదా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు ఇరువురూ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. రాజీపడ దగ్గ కేసులు రాష్ట్రంలో మొత్తం 1,15,071 ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్ అమర రంగేశ్వర రావు మాట్లాడుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవీనాథ్ తిలహరి సూచనల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ కార్యదర్శి ఎన్జే రావు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బీఎస్వీ హిమబిందు -
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన పోలీస్ జాగిలం తెనాలి రూరల్: తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో సోదాలు చేశారు. గుంటూరు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ డి. శ్రీనివాస్ రెడ్డి, తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు, ఎస్ఐలు డి. రామకృష్ణ, ఎం. లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్. ప్రకాశరావు, ఈగల్ టీమ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డాగ్ స్క్వాడ్(మార్షల్)తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును పోలీసు జాగిలం గుర్తించగా, తనిఖీ చేయడంతో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు లభించాయి. బ్యాగును స్వాధీనం చేసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు రన్నింగ్ రైళ్లలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు. -
బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్: కుంచనపల్లి జాతీయ రహదారిపై గల బకింగ్ హామ్ కెనాల్ బ్రిడ్జి పైనుంచి బాలికను నీటిలోకి విసిరేసి హత్య చేసిన సంఘటనలో 24 గంటలు గడవకముందే బుధవారం తాడేపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఓ మహిళ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పోలీసులు మూడు గంటలు కష్టపడి బాలిక మృతదేహాన్ని బయటకు తీయించి, పోస్ట్మార్టం నిమిత్తం ఎయిమ్స్ హాస్పిటల్కు తరలించారు. వెంటన్ నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి, మంగళగిరి పట్టణ, రూరల్, పెదకాకాని సీఐ, ఎస్ఐలతో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కుంచనపల్లి బ్రిడ్జి వద్ద, జాతీయ రహదారిపై ఉన్న కెమెరాలను పరిశీలించారు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో బాలికను గుర్తు తెలియని వ్యక్తి నడిపించుకుంటూ బ్రిడ్జి ఎక్కినట్లు నమోదైంది. మృతి చెందిన బాలిక, సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న బాలిక ఒకరే కావడంతో ఫొటోలను కృష్ణా, గుంటూరు జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లకు పంపారు. వివరాలు సేకరించాలంటూ కోరారు. తాడికొండ మండలం బడేపురానికి చెందిన పాపగా గుర్తించడంతో అక్కడకు వెళ్లి వివరాలు సేకరించా రు. పేరు కూరపాటి హేమ అని, మతిస్థిమితం లేదని స్థానికులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. పాపను పెంచలేక తాతయ్య ఈ పని చేసి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలువలోకి తోసిన వ్యక్తి సరిగ్గా కనిపించకపోవడంతో పాటు లుంగీ ధరించి ఉన్నాడు. తాడేపల్లి సీఐ వీరేంద్ర హత్య చేసింది తాతయ్యా లేక ఎవరన్నా ఉన్నారనే విషయాలను లోతుగా దర్యాప్తు చేశారు. చివరికి తాత కూరపాటి మాధవరావే కాల్వలోకి తోసేశాడని పోలీసులు నిర్ధారించారు. ప్రత్యేక దృష్టి సారించిన డీఎస్పీ ఆరు బృందాలు దర్యాప్తు ఏర్పాటు 24 గంటల్లోపు వివరాల సేకరణ -
ఖరీఫ్లో ముంపు ముప్పు
రేపల్లె: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా అటు పాలకులు, ఇటు అధికారులు పూడికతీతపై నోరు మెదపడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్కు ముందే అవసరమైన డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపు డెక్క, పిచ్చిమొక్కలను తొలగించేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రేపల్లె సబ్ డివిజన్లో ఇలా... రేపల్లె సబ్ డివిజన్లో ప్రధానంగా ఆర్ఎం డ్రెయిన్, బీఎం డ్రెయిన్, జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడ మురుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్ కోర్స్లలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. రేపల్లె నియో జకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 34,060 హెక్టారులలో ఖరీఫ్లో వరి సాగు అవుతుంది. ఇక్కడి వృథా నీరు, అధిక వర్షాలు కురిసిన సమయంలో వరద ఈ కాల్వల ద్వారానే ముందుకు పో వాల్సి ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కనిపించడం లే దు. పంట చివరి దశ నవంబర్, డిసెంబరు మా సాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షం పడుతుంది. దీంతో రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే.. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూడికతీత చేపట్టకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలతో రైతులు కొంతమేర నష్టపోయారు. ఇప్పటికై నా యుద్ధప్రాతిపదికన పూడిక తీత ప్రారంభిస్తేనే ప్రయోజనం ఉంటుంది. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఖరీఫ్లో వరి పంటకు ముంపు ముప్పు తప్పేలా లేదు. రేపల్లె నియోజకవర్గంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. ప్రధాన మురుగు కాలువలతోపాటు మైనర్, రోడ్డు పక్కన ఉన్నవి కూడా గుర్రపు డెక్క, తూటికాడ, గడ్డి వంటి చెత్తతో పూడిపోయాయి. వర్షాలు ఊపందుకుంటే నీరు ముందుకు సాగని స్థితిలో కాలువలు ఉన్నాయి. పక్కనే ఉండే పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. గుర్రపు డెక్క, తూటి కాడతో పూడుకుపోయిన డ్రెయిన్లు పూడిక తీసేందుకు కనీస చర్యలు చేపట్టని కూటమి సర్కార్ ఈ ఏడాది పంటకు ముంపు తప్పదని ఆందోళనలో అన్నదాతలు నాడు ఖరీఫ్కు ముందే పనులు పూర్తి చేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం -
అడుగడుగునా నకిలీ పురుగులు!
జె.పంగులూరు: ఖరీఫ్ సీజన్ వచ్చింది. రైతులను ఆకర్షించేలా కొత్త పురుగుల మందులు, విత్తనాల కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ సీజన్లో వివిధ పంటలు సాగు చేసే రైతులు ముందుగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి సమయంలో అనుమతులు లేని కంపెనీలవి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం మిర్చి, పత్తి, కురగాయల విత్తనాలను మార్టూరు, చిలకలూరిపేట, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేస్తారు. జె.పంగులూరు మండల పరిధిలోని ముప్పవరంలో విత్తనాలు, పురుగుమందు అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి ఆనుకొని ఈ విక్రయాలు సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 30 ఎకరాల్లో నష్టపోయిన రైతులు ఏటా ముప్పవరం గ్రామంలో కొన్న రైతులు పలువురు నష్టపోతున్నారు. మూడేళ్ల క్రితం ముప్పవరం గ్రామ శివారులో పెద్ద ఎత్తున నకిలీ పురుగుల మందులు, ఎరువులను సీజ్ చేశారు. అధికారుల అండదండలతో నకిలీ దందా నడుస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. పురుగుల మందుల దుకాణదారులు బిల్లులు ఇవ్వకుండా తెల్లకాగితంపై రాసిస్తున్నారు. అయినా అధికారులు ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది మండల పరిసర ప్రాంతాల్లోని ముప్పవరం, కొండమూరు, బైటమంజులూరు, జాగర్లమూడివారిపాలెం మొక్కజొన్న రైతులను అగస్త్య కంపెనీ నిలువునా ముంచింది. మండలంలో నాలుగు గ్రామాల్లో మొక్కజొన్న చేలల్లో కలుపు రావడంతో తొలగించుకునేందుకు ముప్పవరంలో హనుమాన్ ట్రేడర్స్ షాపు వద్ద అటరాజిన్ మందును తీసుకెళ్లారు. మందు వేసిన 15 రోజుల తర్వాత దాదాపు 30 ఎకరాల్లో పైరు ఎండుముఖం పట్టింది. ఆకులు ఎండిపోతూ, మచ్చలు పడి, ఎర్రగా మారిపోయింది. కొంతమంది రైతులు పైరును దున్ని మళ్లీ సాగు చేసినా ఆ పైరు కూడా ఇదే విధంగా వస్తోందని వాపోయారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● లైసెన్స్ లేని వ్యక్తులు, దుకాణాలు, దళారుల నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయకూడదు. సరుకు ల్యాబ్ నంబర్, తయారీ తేదీ, కాలపరిమితి గడువు, రకం, ఇలా అన్ని వివరాలు ఉండాలి. సంతకం చేసిన బిల్లును విక్రయదారుల నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి. ● సంచులు సీలు విప్పినట్లు లేదా విప్పి తిరిగి కుట్టినట్లు కనిపిస్తే వాటిని కొనరాదు. విత్తన బస్తాతో లభించే ట్యాగ్ను ఏడాదిపాటు భద్రంగా ఉంచుకోవాలి. ● వ్యవసాయ శాఖ అనుమతి పొందిన డీలర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, సహకారం సంఘాల నుంచి మాత్రమే ఎరువులు కొనుగోలు చేయాలి. మార్కెట్లోకి ‘నకిలీ’ పురుగులు వచ్చేస్తున్నాయ్.. రైతన్న కష్టాన్ని దోచుకునేందుకు వేచి చూస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విషయంలో కాస్త ఏమరుపాటుగా ఉండి నకిలీవి కొనుగోలు చేస్తే నట్టేట మునగక తప్పదు. డబ్బు, సమయం మట్టిపాలు కావడం ఖాయం. అప్రమత్తతే అన్నదాతకు రక్షణ గా నిలవనుంది. అన్నదాతలను ముంచేస్తున్న డొల్ల కంపెనీలు మార్కెట్లో నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు నమ్మకంతో కొనుగోలు చేసి నష్టాలపాలవుతున్న రైతులు కొనే సమయంలోనే అన్నివిధాలా అప్రమత్తత అవసరం అనుమతి ఉన్న దుకాణాల నుంచి తీసుకుంటేనే మేలు -
కార్మికుల వినూత్న నిరసన
మంగళగిరి టౌన్: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీఐటీయూ నాయకులు విమర్శించారు. మంగళగిరి నగర పరిధిలోని ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వేతనాలు పెంచడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వై. కమలాకర్, ఎం. బాలాజీ, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, కేదారనాథ్, దుర్గారావు, ప్రకాష్, రాము పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట టోకరా ●ఢిల్లీలోని విద్యాంజలి సంస్థ పేరుతో నియామక ఉత్తర్వులు ●నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న మోసగాళ్లు ●ఉద్యోగాల పేరుతో మోసపోవద్దని సమగ్ర శిక్ష ఎస్పీడీ సూచన గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాల పేరుతో మోసగాళ్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్నామంటూ మోసం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులను పోలిన నియామక పత్రాలను సృష్టించి, బురిడీ కొట్టిస్తున్నారు. విద్యాంజలి సంస్థ పేరుతో కొంత మంది వ్యక్తులు జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, రికార్డ్ అసిస్టెంట్లు, యోగా టీచర్లు, అటెండర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు తప్పుడు నియామక ఉత్తర్వులను సృష్టించి, రూ.లక్షల్లో వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. తాజాగా విద్యాంజలి సంస్థ పేరుతో గుంటూరు జిల్లా తుళ్లూరులోని జెడ్పీ హైస్కూల్లో ఒకేషనల్ ట్రైనర్ను నియమిస్తున్నట్లుగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం పంపుతున్నట్లుగా సిద్ధం చేసిన నియామక ఉత్తర్వుల కాపీ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. జెడ్పీ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ నియామక విషయమై సమగ్రశిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇదంతా బోగస్ అని, ఎవ్వరూ నమ్మవద్దని కొట్టిపారేశారు. క్షేత్రస్థాయిలో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకుని నిరుద్యోగ యువత మోసపోకుండా చూడాలని సమాచారం పంపారు. ప్రధానోపాధ్యాయులు కూడా తప్పుడు నియామక ఉత్తర్వులపై అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. -
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే !
ప్రత్తిపాడు:రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రత్తిపాడు వైఎస్సార్ కాలనీలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చల్లగిరి నాగరాజు కుటుంబాన్ని బుధవారం సాయంత్రం రైతు సంఘం నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ కౌలు రైతు నాగరాజు పంటలు పండకపోవడం, గిట్టుబాటు ధరలు, కౌలు రైతు కార్డు లేకపోవడం, బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. ప్రైవేటు సంస్థల నుంచి వందకు మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి, అవి తిరిగి చెల్లించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు. ఎక్స్గ్రేషియా చెల్లించాలి ప్రభుత్వం వెంటనే స్పందించి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎకరం ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి, తిరిగి నూతనంగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి, పొగాకు సాగు చేసిన 10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు నివారిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. పరామర్శించిన వారిలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకట శివరావు, నాయకులు కె. ఆదినారాయణ, నల్లమోతు రాజేంద్ర ఉన్నారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) కేసు నమోదు చేశారు. బుధవారం ఉదయం కృష్ణా కెనల్ రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన సిబ్బంది జీఆర్పీ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతుడి వయస్సు సుమారు 55–60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిపే ఆధారాలు ఏవీ లభ్యం కాలేదని తెలిపారు. వంటిపై గాయాలను బట్టి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు విజయవాడ జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాల్సిందిగా కోరారు. -
భూముల సమీకరణ ఉపసంహరించుకోవాలి
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : ప్రభుత్వం రాజధాని కోసం మరో దఫా 44వేల ఎకరాలు భూమిని సమీకరిస్తున్నట్లు ఇచ్చిన నోటిఫికేషన్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాబూరావు మాట్లాడారు. 11 సంవత్సరాల కిందట తీసుకున్న 34వేల ఎకరాలతో పాటు ప్రభుత్వ భూములతో కలిపి 54వేల ఎకరాలు అందుబాటులో ఉందని తెలిపారు. మరో 44 వేల ఎకరాలు తీసుకోవడం అంటే అది అమరావతి రైతుల ప్రయోజనాలకు విఘాతమని విమర్శించారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నోచుకోలేదని పేర్కొన్నారు. సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉండగా అంతర్జాతీయ విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు తీసుకున్నారని, అది ఇప్పటికీ కొలిక్కి రాలేదని తెలిపారు. రాజధాని కొలిక్కి రాకుండా అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇప్పుడు వేల ఎకరాల భూములు సమీకరించడం సబబు కాదని ఖండించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎ.న్భావన్నారాయణ, ఈమని అప్పారావు, కె.నళీనికాంత్, బి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబూరావు -
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేపడతాం
మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు శరత్ బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మె చేపడతామని మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డికి మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలియజేశారు. నాయకులు కె.శరత్ మాట్లాడుతూ ఇంజినీరింగ్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు చేస్తున్న ఆందోళన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి తల్లికి వందనం పథకం వర్తింపచేయాలని, సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులందరికీ వర్తింప చేయాలని, గత ప్రభుత్వ కాలంలో చేసినటువంటి 17 రోజుల సమ్మెకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, జీవో నెంబర్ 36 ప్రకారం రూ.24,500 వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ అమలు చేయాలని కోరారు. బాపట్ల మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు హరిబాబు, అంకారావు, రత్నం, నాని, నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ లారీలు పట్టివేత
● బిల్లులు లేకుండా తరలింపు ● స్పెషల్ డ్రైవ్లో పట్టుబడ్డ గ్రానైట్ లారీలు ● కమర్షియల్ టాక్స్ అధికారుల మెరుపు దాడులు ● అదుపులోకి తీసుకున్న గ్రానైట్ లారీలు నడికుడి మార్కెట్ యార్డ్లో ● విలువను బట్టి పన్ను, జరిమానా వేస్తామన్న అధికారులు పిడుగురాళ్ల: బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నాలుగు గ్రానైట్ లారీలను జీఎస్టీ, కమర్షియల్ టాక్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి లారీలను తనిఖీ చేసే కార్యక్రమం పట్టణంలోని బైపాస్ రోడ్డుపై నిర్వహించారు. ఈ తనిఖీల్లో కొండమోడు నుంచి దాచేపల్లి వైపు వెళుతున్న నాలుగు గ్రానైట్ లోడ్ లారీలను గుర్తించి పట్టుకున్నారు. ఈ గ్రానైట్ లారీలకు సంబంధించి ఎటువంటి బిల్లు లేకపోవడం, సామర్థ్యాన్ని మించి లోడుతో రవాణా చేయటం నిర్వహించడంతో ఈ నాలుగు లారీలను అదుపులో తీసుకున్నారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ వి.భార్గవ్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు చేపట్టామని అందులో నాలుగు గ్రానైట్ లారీలు బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నాయని వాటిని గుర్తించామన్నారు. వీటిని అదుపులో తీసుకొని నడికుడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉంచినట్లు తెలిపారు. గ్రానైట్ లోడును బట్టి, గ్రానైట్ విలువను అంచనా వేసి ఆ తరువాత పన్నుతోపాటు అపరాధ రుసుం కూడా విధిస్తామని చెప్పారు. అలాగే లెక్కలు చూసి టాక్స్, ఫైన్ వేయాల్సి ఉంటుందని దానికి కొంత సమయం పడుతుందని వివరించారు. బిల్లులు లేకుండా ఓవర్ లోడ్ తో గ్రానైట్ లారీలు వెళితే అటువంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. అక్రమంగా బిల్లులు లేకుండా గ్రానైట్ లారీలు తరలిస్తే వాటిని అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ దాడుల్లో జీఎస్టి డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఎం రవికుమార్, జీఎస్టీవో టి పీటర్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
18 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
తాడికొండ: అక్రమంగా నిల్వ చేసిన 18 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్న ఘటన మండల కేంద్రమైన తాడికొండలో జరిగింది. వివరాల ప్రకారం తాడికొండ చెరువు కట్టపై రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు సీఎస్ డీటీ దేవరాజు, ఆర్ఐ హనుమంతరావుల ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించగా 35 కిలోల తూకం కలిగిన 18 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. దీనిపై విచారించగా తాడికొండకు చెందిన గుర్రపుశాల ఆనంద్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నిల్వ చేసినట్లు స్థానికులు తెలపగా అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులలో వీఆర్వో మాల్యాద్రి కూడా పాల్గొన్నారు. -
ప్రకృతి సాగుతో గొప్ప ప్రయోజనాలు
● పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ ● ప్రకృతి సాగు పంటల పరిశీలన ● సాగు పద్ధతి ప్రయోజనాలపై అవగాహన యడ్లపాడు:ప్రకృతి సాగు విధానంతో గొప్ప ప్రయోజ నాలు ఉన్నాయని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ.బి తెలిపారు. ప్రకృతి విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమలకుమారితో కలిసి కొత్తపాలెం గ్రామంలో మంగళవారం పర్యటించారు. రసాయనాలు లేని, సహజసిద్ధ వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం రైతులు మానం శ్రీనివాసరావు, ఐనం హరిబాబు, మానం మణింద్ర, నిక్కీ తిరుపతిరావు, దమ్ము నాగ జ్యోతి పంట పొలాలను పరిశీలించారు. వారు సాగు చేసి న బహుళ రకాల పంటలు, అంతర పంటలను చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మునగ తోటలో దొండ, కాకర, సొర, కనకాంబరం, అరటితోటలో తీగజాతి దోస, నిమ్మతోటలో కరివేపాకును అంతర పంటగా వేయడాన్ని గమనించారు. వినూత్న పద్ధతిలో సాగు చేసిన తీరు, ఎక్కువ దిగుబడుల్ని సాధిస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తున్నామని తెలపడంతో రైతుల్ని ఆమె అభినందించారు. పురుగు మందుల ఖర్చు తక్కువ.. ప్రకృతి వ్యవసాయ విధానంతో కౌలు రైతుకు మంచి దిగుబడి, రసాయన ఎరువులు, పురుగు మందుల ఖర్చు తగ్గుతుందన్నారు. సహజ సిద్ధంగా పండించే ఉత్పత్తుల ద్వారా కౌలురైతులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. అయితే వారికి కౌలుకు ఇచ్చిన భూ యజమానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ సాగు విధానం చేయడం వలన నేల సారం వృద్ధి చెందుతుందన్నారు. రైతులు తమ భూముల్ని కౌలుకు ఇచ్చే సమయంలో ప్రకృతి సేద్యం చేసేవారికి మాత్రమే ఇచ్చే ఒప్పందం చేసుకుంటే మంచి దని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ప్రకృతి సాగు సిబ్బంది సౌజన్య, అప్పలరాజు, నందకుమార్, స్వాతి, బేబీ రాణి, వెంకటేశ్వరరావు ఉన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం
అద్దంకి రూరల్: కూటమి ప్రభుత్వం ఏడాది దాటినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా ప్రజలను మోసగిస్తోందని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు, సంచార జాతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా రామయ్య విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామని హమీ ఇచ్చి రూ. 13 వేలే తల్లుల ఖాతాల్లో వేయంటం విడ్డూరంగా ఉందన్నారు. ఇంకా కొంత మంది తల్లులకు అర్హత ఉన్నా పథకం వర్తించకపోవటంతో సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇంటి వద్దకు వచ్చే రేషన్ను తొలగించి దివ్యాంగులకు, వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. చంద్రబాబు రాజధాని ముసుగులో ప్రజలను మరోసారి మోసగిస్తున్నారన్నారు. పాలనపై ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు చల్లా రామయ్య -
దుకాణాల కూల్చివేతపై ఉద్రిక్తత
● వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణం కూల్చివేత ● ప్రశ్నించిన నాయకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు భట్టిప్రోలు(కొల్లూరు): ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దుకాణాలు, ఇతర నిర్మాణాలు కూల్చివేతపై ఉద్రిక్తత నెలకొంది. భట్టిప్రోలు బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ భూమిలో ఉన్న చికెన్ దుకాణంతోపాటు, మరికొన్ని నిర్మాణాల తొలగింపునకు ప్రభుత్వ యంత్రాంగం మంగళవారం పూనుకుంది. ఈక్రమంలో తమకు ముందస్తు నోటీసులు అందజేయకుండా ఉన్న పళంగా కూల్చివేతలు చేపట్టడంపై చికెన్ దుకాణం నిర్వాహకుడు, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం మాజీ కార్యదర్శి అరుణశాస్త్రి అధికారుల వద్ద అభ్యంతరం వ్యక్తం చేశాడు. పంచాయతీలో కొన్నేళ్ల కిందట దుకాణం నిర్వహించుకునేందుకు తీర్మానం చేసినట్లు అధికారులకు తెలియజేయడంతోపాటు, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడ్డం తగదని అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. ఈ క్రమంలో దుకాణం తొలగింపు చర్యలు కొనసాగిస్తుండటంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన అరుణశాస్త్రిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అరుణశాస్త్రి కుటుంబ సభ్యులు కనీసం దుకాణం రేకులు, ఇతర సామాగ్రిని జాగ్రత్త పరుచుకునేందుకు సమయం కోరినా అధికారులు అవకాశం ఇవ్వకుండా అక్రమంగా తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నాయకుల ఆదేశాల మేరకే అధికారులు తన ఆస్తులకు నష్టం కలిగించారని విమర్శించాడు. -
పీఏసీఎస్లలో అంతర్జాతీయ సహకార కార్యక్రమాలు
నరసరావుపేటరూరల్: జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘ కార్యాలయాల్లో అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమాలు సందర్భంగా మోడల్ ఆడిటింగ్, స్వచ్ఛత, మెంబర్షిప్ డ్రైవ్, పాఠశాలలలో సహకార సంఘాలపై అవగాహన సదస్సులు, సహకార సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన లాంటి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సహకార శాఖ అధికారి ఎం.నాగరాజు పేర్కొన్నారు. మంగళవారం ఇక్కుర్రు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆవరణలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 2025వ ఏడాదిని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించి ఉన్నందున ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు సహకార ఉద్యమ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సబ్ డివిజనల్ సహకార అధికారి స్వర్ణ చినరామిరెడ్డి, సంఘ సీఈఓ కంటు శ్రీనివాసరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ జోన్కు అర్హత సాధించిన శివకోటేశ్వరమ్మ రెంటచింతల: కేరళలో జరగనున్న సౌత్జోన్ రైఫిల్ షూటింగ్ పోటీలకు రెంటచింతల–2 సచివాలయం మహిళా పోలీస్ చిన్నపురెడ్డి శివకోటేశ్వరమ్మ అర్హత సాధించింది. జూన్ 21 నుంచి 30 వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహించిన 25 ఏపీ రైఫిల్ షూటింగ్ చాంపియన్ 2025 పోటీలలో 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో విశేష ప్రతిభను ప్రదర్శించి శివకోటేశ్వరమ్మ సౌత్జోన్ పోటీలకు ఎంపికై ంది. ఇంటర్ డిస్ట్రిక్ స్థాయిలో కూడా 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గోల్డ్మెడల్ సాధించిన శివకోటేశ్వరమ్మ తన ప్రతిభను రోజురోజుకు మెరుగుపరుచుకుంటూ సౌత్జోన్ స్థాయి పోటీలకు అర్హత సాధించడం ఆమె కృషి, పట్టుదలకు నిదర్శనం. శివకోటేశ్వరమ్మ మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రోత్సహంతోనే ఈ విజయం సాధించినట్లు తెలిపారు. -
ఉప్పు సాగుకు ప్రకృతి విఘాతం
చినగంజాం: ఉప్పు సాగుకు ఇటీవల కాలంలో ప్రకృతి తీవ్ర విఘాతం కలుగజేస్తోంది. అయినా ఉప్పు రైతు వాటిని తట్టుకొని నెగ్గుకు రాగలుగుతున్నాడు. వేసవి ఉష్టోగ్రతలు పంట దిగుబడిని, నాణ్యతను పెంచుతాయి. ఉప్పు సాగు ముమ్మరంగా సాగే అనుకూల సీజన్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఉప్పు రైతు కోలుకోవడం కష్టమే. గత నాలుగు సీజన్లుగా ఇదే పరిణామాలు ఉప్పు సాగు విషయంలో చోటు చేసుకుంటున్నాయి. సీజన్లో భారీగా పడిపోయిన ఉప్పు ఉత్పత్తి రాష్ట్రంలో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సీజన్లో ఉప్పు ఉత్పత్తి భారీగా పడిపోయింది. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న ఉప్పు పరిశ్రమల్లో మొత్తం 22 వేల ఎకరాల్లో ఉప్పు ఉత్పత్తి కొనసాగుతుంది. తుఫాన్లు, భారీ వర్షాల కారణంగా ఉప్పు రైతు నష్టపోక తప్పడం లేదు. ఉప్పు సాగు ప్రతి ఏడాది నవంబరు నెల నుంచి తరువాత ఏడాది జూన్ వరకు దాదాపు 8 నెలలపాటు కొనసాగుతుంది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఉప్పు సాగును ప్రారంభించి తొలి తీత సంక్రాంతి పండుగ నాటికి తీయాల్సి ఉంది. 2024–25 సీజన్లో నవంబరు, డిసెంబరు నెలలో ప్రకృతి అనుకూలించక ఆలస్యంగా రైతులు సాగును ప్రారంభించాల్సి వచ్చింది. ఉప్పు కొఠారుల్లో భారీగా వర్షపు నీరు నిలిచి సాగుకు భూములు అనుకూలత లేక జనవరి నెలలో సాగుకు భూములను సిద్ధం చేసుకునే పనిలో ఉండి ఫిబ్రవరి నెలాఖరు వరకు కొనసాగించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో సుమారు 30 శాతం మాత్రమే ఉప్పును రైతులు తీయగలిగారు. వేసవి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండి ఉప్పు దిగుబడికి అనుకూలంగా ఉండే మే, జూన్ నెలల్లో తుఫాన్లు, అకాల వర్షాలతో సాగు పూర్తిగా నిలిచిపోయింది. ఉప్పు రైతుకు ఎన్నడూ లేని విధంగా తీవ్ర విఘాతం కలిగింది. సొంత భూములున్న రైతులు, లైసెన్స్దారులు పరిస్థితి ఎలా ఉన్నా ముఖ్యంగా కౌలుదారులకు మాత్రం తీవ్ర ఇబ్బంది కలిగింది. ఉమ్మడి ప్రకాశంలోఉపాధి కోల్పోయిన వేల కుటుంబాలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఊళ్లపాలెం, కనపర్తి, కొత్తపట్నం, చినగంజాం మండలాల్లో ఉప్పు సాగు కొనసాగుతోంది. బాపట్ల జిల్లాలో చినగంజాం మండలంలో చినగంజాం, పెదగంజాం గ్రామాల్లో రైతులు ఉప్పు సాగు చేస్తున్నారు. మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు మొత్తం 3,600 ఎకరాల్లో ఉప్పు సాగు చేసే భూములున్నాయి. వాటిలో ప్రభుత్వ భూములు 2,400 ఎకరాలు కాగా, 500 ఎకరాలు స్నోవైట్ సాల్ట్ భూముల్లో సాగు సాగడం లేదు. ప్రభుత్వ భూమిలో 620 ఎకరాలు చిన్న, సన్నకారు రైతులు సాగు చేసుకుంటున్నారు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి మరో 1200 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. చినగంజాం మండల పరిధిలో చిన్న, పెద్ద రైతులు సుమారు 1050 కుటుంబాలు ఉండగా వారితో పాటు ఉప్పు కొఠారుల్లో పనులు నిర్వహిస్తూ కూలీలుగా సుమారు 8 వేల మంది పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చినగంజాం సాల్ట్ వర్కర్స్ కో ఆపరేటివ్ ప్రొడక్షన్స్ సేల్స్ సొసైటీ (ఎల్ నంబర్ 73 అండ్ 86)లో 400 ఎకరాలు సుమారు 700 కుటుంబాలు, రాజుబంగారుపాలెం సాల్ట్ సొసైటీలో 120 ఎకరాలు 350 కుటుంబాలు మొత్తం 1050 కుటుంబాలు ఉప్పు సాగు మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఊళ్లపాలెం గ్రామ పరిధిలో ఎస్సీ సాల్ట్ వర్కర్స్ సొసైటీ కింద 500 ఎకరాలు, ఓసీ సాల్ట్ వర్కర్స్ సొసైటీ కింద మరో 350 ఎకరాలు ఉప్పు సాగు చేస్తుండగా, కొత్తపట్నం మండలంలోని సాల్ట్ సొసైటీ కింద 275 ఎకరాల్లో ఉప్పు సాగు చేస్తున్నారు. వీటితో పాటు సుమారు మరో వెయ్యి ఎకరాలు ప్రైవేట్ భూముల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఉప్పు సాగుకు అవాంతరం కలగడంతో వేల కుటుంబాలు ఈ సీజన్లో తమ ఉపాధిని కోల్పోయారు. సీజన్లో భారీగా పడిపోయిన ఉత్పత్తి గతంలో ఎన్నడూ లేని విధంగా దెబ్బతిన్న రైతు రైతుల ఆశలపై నీరు చల్లిన అకాల వర్షం ఉమ్మడి ప్రకాశంలో రైతులకు కోలుకోలేని దెబ్బ రైతుల కష్టం పట్టించుకోనికూటమి ప్రభుత్వం పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రకృతి వైపరీత్యాల నడుమ కొట్టు మిట్టాడుతున్న ఉప్పు రైతుల గోడును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఉప్పు రైతులకు సబ్సిడీ కల్పించే విషయంలోను, గిట్టుబాటు ధర కల్పించడంలోను, ఉత్పత్తి చేసిన ఉప్పును భద్రపరచుకునేందుకు షెడ్డుల నిర్మాణాలు, కొఠారుల్లో రోడ్ల వసతి, తాగునీరు, విశ్రాంతి గదుల వంటివి లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఇంటింటికా..మేము రాలేం..
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలనలో తొలి అడుగు– ఇంటింటికి తేదేపా’ పేరుతో బుధవారం నుంచి కూటమి ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఇంటింటికి వెళ్లడంలో ఇబ్బందులు తప్పవని పచ్చపార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. హామీలకు మంగళం ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ మాటున ఇచ్చిన వందలాది హామీలలో ఒకటి రెండు మినహా చంద్రబాబు సర్కార్ నెరవేర్చలేదు. అవి కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఎన్నికల్లో ఓట్లేయించుకొని గద్దెనెక్కాక వంచిచడంపై జనం మండిపడుతున్నారు. రెండో ఏడాది ఖరీఫ్ నడికొంటున్నా అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. మహిళలకు ఉచిత బస్సు హామీ ఊసేలేదు. 20 లక్షల ఉద్యోగాలన్నా ఒక్క ఉద్యోగం రాలేదు. నిరుద్యోగ భృతి నీటిమూటగా మారింది. మహిళలకు ప్రతినెలా రూ.1500 ఇస్తామన్న హామీని అటకెక్కించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కూటమి ఇప్పుడు హామీలను అటకెక్కించడంపై పేద, మధ్యతరగతి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పతాక స్థాయిలో అవినీతి మరోవైపు చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు పతాక స్థాయికి చేరాయి. ఇసుక, బుసక, గ్రానైట్, గ్రావెల్ను ట్రిప్పుల లెక్కన విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. పేదల కడుపుకొట్టి చౌక బియ్యాన్ని ఒక్కొక్క ప్రజాప్రతినిధి నెలకు రూ.25 లక్షలకు అమ్ముకుంటున్నారు. రెడ్బుక్ పాలనను తెరపైకి తెచ్చి హత్యలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు. మొత్తంగా కూటమి ఏడాది పాలన ప్రజాకంఠకంగా మారడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్లేయించుకొని వంచించారని మండిపడుతున్నారు. పార్టీ శ్రేణుల్లో అంతర్మథనం ఎన్నికల్లో మాటలు చెప్పి ఓట్లేయించుకొని హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్న విషయం పచ్చ ప్రజాప్రతినిధులు, నేతలకు తెలుసు. ఈ సమయంలో ప్రచార ఆర్భాటంగా ఇంటింటికి వెళితే ప్రజల నుంచి చీవాట్లు ఖాయమని చాలామంది పచ్చనేతలు భయపడుతున్నారు. ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి. దీంతో జనంలోకి వెళ్లి ఇరుకున పడతామని, హామీలు కొన్నైనా నెరవేర్చాక వెళితే బాగుంటుందని చాలా మంది పచ్చనేతలు పేర్కొంటుండటం గమనార్హం. తల్లికి వందనం ఒక్కటే ఇప్పటివరకూ ఇచ్చిన పథకమని అది కూడా చాలామందికి ఇంకా డబ్బులు పడలేదని ఈ పరిస్థితిలో జనంలో కోపం ఉందని ఒక టీడీపీ నేత చెప్పారు. ఇప్పటికీ తల్లికి వందనాన్ని అమ్మ ఒడిగానే ప్రజలు పిలుస్తున్నారని మరో పచ్చనేత చెప్పారు. కొన్ని పథకాలైనా నెరవేర్చాక జనంలోకి వెళ్లాలని, ఇప్పుడు వెళ్లడం వల్ల ఇబ్బందులు తప్పవని మరో టీడీపీ నేత పేర్కొన్నారు. మొత్తంగా హామీలు నెరవేర్చకుండా ఏడాదిలోనే జనంలోకి వెళ్లడం సరికాదని ఎక్కువమంది పచ్చనేతలు అభిప్రాయపడుతున్నారు. నేటి నుంచి సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో కూటమి ప్రచారం ఏడాదిలో ఏమీ చేయకుండానే చేసినట్లు ఆర్భాటం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలు గాలికి జనంలోకి వెళ్లెందుకు జంకుతున్నపచ్చనేతలు సూపర్సిక్స్ పేరుతో వంచనఅడ్డుఅదుపూ లేని పచ్చదోపిడీ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పేదల కడుపుకొట్టి రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. గ్రానైట్, గ్రావెల్ను ఎక్కడికక్కడ అమ్ముకుంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ, అటవీ భూములను కబ్జా చేస్తున్నారు. వీధివీధినా బెల్టు షాపులు పెట్టి ప్రజలను తాగుడుకు బాసిసలను చేస్తున్నారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు. రెండో ఖరీఫ్ సీజన్ వచ్చినా జిల్లాలోని 1,92,037 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ.384,06 కోట్లలో పైసా ఇవ్వలేదు. తల్లికి వందన పేరుతో ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్నారు. జిల్లాలోని 2,35,654 మందికి రూ.353.48 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కొందరికే ఇచ్చి చాలామందికి ఎగనామం పెట్టారు. నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి అన్నారు. జిల్లాలో 4,77,557 కుటుంబాల పరిదిలో ఇంటికొక్కరు అనుకున్నా వారందరికి చెల్లించాల్సిన రూ.143. 26 కోట్లలో పైసా ఇవ్వలేదు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమన్నారు. జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్సుల ప్రకారం రోజూ 90 వేలమంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్సిక్స్ పేరుతో ఇచ్చిన వందకు పైగా హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు. జిల్లాలో అభివృద్ధిని పట్టించుకోలేదు. మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్నారు. జిల్లాలో 19 నుంచి 59 ఏళ్లవయస్సు వారు 6,61,841 మంది ఉండగా వీరందకి ఏడాదికి రూ.11,913 కోట్లు ఇవ్వాల్సిఉన్నా దాని ఊసే మరిచారు. ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అనిచెప్పి జిల్లాలో మొత్తం 4,60,836 గ్యాస్ కనెక్షన్లు ఉండగా మూడు ఉచిత సిలిండర్లకు ఒక్కొక్కరికి రూ.2,700 చొప్పున ఇవ్వాల్సి వుంది. కానీ ప్రభుత్వం 3 లక్షల మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేసి చేతులు దులుపుకుంది. -
జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. పట్టణంలోని 18వవార్డు సమీపంలోని జగనన్న కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో చినుకు పడితే అక్కడ నడిచే పరిస్థితులు లేదన్నారు. దోమల బెడద అధికంగా ఉంటోందన్నారు. వర్షపు నీరు పోయే మార్గం లేదన్నారు. తాగునీరు రాకపోవటంతో దూరప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. పారిశుద్ధ్య లోపం ఉందని చెప్పారు. కొన్ని నెలల నుంచి ఈ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా ఫలితం లేదన్నారు. ఇక స్పందించకుంటే కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేసేందుకు సైతం వెనకాడేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వి.ధనమ్మ, సభ్యులు కె.రవికుమార్, శ్రీనివాసరావు, వీరాంజనేయులు, ఫర్జానా, కనకదుర్గ, సీపీఎం నాయకులు ఆశీర్వాదం, అగస్టీన్, రమేష్, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
బాపట్ల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 49 మంది అర్జీదారులు వచ్చారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఎస్పీ వారికి భరోసా కల్పించారు. జిల్లాలోని పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. చట్ట పరిధిలో విచారించి గడువులోగా పరిష్కరించాలన్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు వంటి సమస్యలే అధికంగా వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, పి.జి.ఆర్.ఎస్. ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై 10 అర్జీలు రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 10 అర్జీలు అందినట్లు ఆర్డీవో నేలపు రామలక్ష్మి చెప్పారు. స్థానిక కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాక మాట్లాడారు. పట్టణంలోని 22, 23 వార్డులలో పందులు సంచరించడంతో సమస్యగా ఉందని ప్రజలు కోరారని పేర్కొన్నారు. ఓల్డ్టౌన్ అంకమ్మ చెట్టు సెంటరులో ట్రాఫిక్ సమస్యపై పట్టణాభివృద్ధి సంఘం కార్యదర్శి సీవీ మోహనరావు అర్జీ అందించారన్నారు. నేషనల్ హైవే నిర్మాణంతో స్థలం కోల్పోయిన తనకు నష్టపరిహారం అందించాలని పెనుమూడి గ్రామానికి చెందిన కృష్ణ కోరారని చెప్పారు. జగనన్న కాలనీలోని చర్చితో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు అర్జీ ఇచ్చారన్నారు. ప్రజ్ఞం గ్రామంలో సాగునీరు అందించకుండా పలువురు అడ్డుపడుతున్నారని వెంకటేశ్వరరావు అర్జీ చేశారని చెప్పారు. భట్టిప్రోలు మండలం పెదలంకలో ఉన్న జగనన్న కాలనీలోని స్థలాల ఆక్రమణలను తొలగించాలని పెదలంక గ్రామానికి చెందిన నన్నెపాముల నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారని వివరించారు. సిరిపూడిలోని తన పొలం హద్దులు చూపించాలని గొర్రెమూర్తి చిన్నారావు అర్జీ అందించాడన్నారు. జువ్వలపాలెంలో డ్రైనేజీ సమస్యపై ఆలూరి రామ్మోహనరావు అర్జీ అందించారన్నారు. కొల్లూరు పరిసర ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని జి.ప్రసాద్ ఫిర్యాదు చేశాడన్నారు. చోడాయపాలెంలోని తన భూమిని ఆన్లైన్ చేయాలని రేపల్లెకు చెందిన గాదె వెంకట నరసమ్మ అర్జీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరిశీలించి ఆయా శాఖల అధికారుల ద్వారా పరిష్కరిస్తామని ఆర్డీవో తెలిపారు.ఎస్పీ తుషార్డూడీ -
తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ ఆందోళన
బాపట్ల: మత్స్యకార ఉద్యమాలపై తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు, మత్స్య కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. 15 రోజులుగా మత్స్యకారులు తమ వృత్తికి అనుగుణంగా సహజసిద్ధంగా ఉన్న సముద్రం ముఖద్వారాన్ని పునరుద్ధరించాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించి కలెక్టర్ను కలిశారు. స్పందించిన కలెక్టర్ విచారణ కమిటీని నియమించారు. న్యూస్ చానల్స్, పత్రికా ప్రతినిధులు ఆక్రమణదారులకు అనుకూలంగా మత్స్యకార ఉద్యమానికి రాజకీయ రంగు పులుముతూ సమస్యను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అండగా ఉండి ఉద్యమాన్ని నడుపుతుందనే ప్రచారాన్ని మత్స్యకారులు ఖండించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ మత్స్యకార ఉద్యమం ప్రజా సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు. సమస్యను పక్కదారి పట్టించడం కోసం కొన్ని చానల్స్ కొంతమంది పాత్రికేయులు తప్పుడు ప్రచారం చేస్తున్నారనన్నారు. కార్యక్రమంలో వాడరేవు సర్పంచ్ ఎరిపల్లి రమణ, మత్స్యకార జేఏసీ నాయకులు సైకం రాజశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, సీపీఐ (ఎంఎల్ న్యూ డెమోక్రసీ) నాయకులు మేకల ప్రసాద్, మత్స్యకార సంఘాల నాయకులు పిక్కి శామ్యూల్ పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
రేపల్లె: తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. యూనియన్ అధ్యక్షుడు డి.ప్రభాకరరావు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం జీవో 36 ప్రకారం రూ.24,500 వేతనం అందించాలని, పీఆర్పీ అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గతంలో సమస్యల సాధనకై నిర్వహించిన 17 రోజుల సమ్మె కాలానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు జీవోలు విడుదల చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్, యూనియన్ నాయకులు రవి, రాఘవేంద్రరావు, శివ, యువరాజు, తదితరులు పాల్గొన్నారు. వైభవంగా కావడి సేవబాపట్ల: అత్యంత వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కావడి సేవా మహోత్సవం సోమవారం చేపట్టారు. బాపట్ల కోన కళాక్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యంలో ఉదయం కావడి సేవా మహోత్సవం, అభిషేకం, పుష్పయాగం, సర్పసూక్త హోమం నిర్వహించారు. నెమలికంటి హనుమంతరావు సారథ్యంలో ముత్తేవి శ్రీనివాస శశికాంత్ ఆధ్వర్యంలో ఉత్సవం చేపట్టారు. మేడూరి వెంకట అప్పలాచార్యులు, రొంపిచర్ల కేశవాచార్యులు, రొంపిచర్ల గోపాలచార్యులు, కొల్లిపర వెంకట శివ వర ప్రసాద్, శ్రీనివాసుల విఖనస మూర్తి, గూడా సాయి వెంకట్, భీమవరపు సురేష్ శర్మ సహకారంతో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేకం చేపట్టారు. -
లింగ నిర్ధారణ సెంటర్లపై ప్రత్యేక నిఘా
చీరాల టౌన్: ఆడ, మగ తేడాల లేకుండా సమానంగా చూసుకుకోవాలని.. లింగనిర్ధారణ చేయకుండా స్కాన్ సెంటర్లపై నిఘా ఉంచాలని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర్నాయుడు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సబ్ డిస్ట్రిక్ట్ పూర్వ గర్భ, ప్రసవ పూర్వ నియంత్రణ చట్టంపై సబ్ డిస్ట్రిక్ట్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆర్డీవోతోపాటుగా పోలీసు, రెవెన్యూ, వైద్యులు, ఎన్జీవోలు, ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్డీవో మాట్లాడుతూ లింగ నిర్ధారణ చేయడం, వెల్లడించడం చట్టరీత్యా నేరమన్నారు. సామాజిక సమతుల్యత, బాలికల జనన నిష్పత్తిని మెరుగుపరచాలన్నారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆడపిల్లల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, ఆడ, మగ లింగ భేదం లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలన్నారు. సమాజంలో జరుగతున్న ప్రతి అంశాలను పిల్లలకు తెలియజేసి చైతన్య వంతులుగా చేయాలన్నారు. అబార్షన్లు లేకుండా చూడటం, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్, స్కాన్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా కమిటీ సభ్యులు చూడాలన్నారు. అలానే భ్రూణ హత్యలు జరగకుండా, బాల్య వివాహాలు జరగకుండా చూడాలన్నారు. చట్టాల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆర్డీవో కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డాక్టర్ రత్నమన్మోహన్, గైనకాలసిజ్ట్ డాక్టర్ షణ్ముఖశ్రీ, డాక్టర్ యాకోబు, డాక్టర్ బ్రహ్మం, ఎన్జీవోలు, వైద్యులు డాక్టర్ సుభాషిణి, డాక్టర్ విజయ్కుమార్, రాజా సాల్మన్, మరియమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఆర్డీవో చంద్రశేఖర్నాయుడు -
వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి
చీరాల అర్బన్: వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి అన్నారు. స్థానిక మహిళా మండలిలో నాలుగు రోజులుగా వృద్ధాప్య కేంద్రాల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి హాజరై, ఆమె మాట్లాడారు. వృద్ధుల సేవలో మమేకం అయినప్పుడే మనం చేసే సేవ సార్థకం అవుతుందన్నారు. తన సుదీర్ఘ సేవా ప్రయాణం అత్యంత తృప్తి ఇచ్చిందన్నారు. శిక్షణ కార్యక్రమంలో హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున ప్రాజెక్టు హెడ్ టి.రవి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను సమాజసేవకు కూడా ఉపయోగించాలన్నారు. శిక్షణ పొందిన వారిచే ప్రతిజ్ఞ చేయించి, సర్టిఫికెట్లు అందించారు. 18 సంస్థల బాధ్యులు, వారి సిబ్బంది తమకు స్ఫూర్తిగా నిలిచిన లక్ష్మీపద్మావతిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మహిళా మండలి మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఎన్జీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. మాజీ మంత్రి జాగర్లమూడి లక్ష్మీపద్మావతి -
పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రులు
గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తాం.. జే.పంగులూరు: కూటమి ప్రభుత్వం పొగాకు రైతులకు అండగా, వారికి గిట్టుబాటు ధరను కల్పిస్తూ మార్కెఫెడ్ ద్వారా పొగాకు కొను గో లు చేస్తుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గృహనిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, కలెక్టర్ వెంకటమురళి అన్నారు. మండల పరిధిలోని మార్కెట్ యార్డులో నల్ల బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో మొత్తం 18 పొగాకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామ ని చెప్పారు. సోమవారం పంగులూరు, పర్చూ రు, ఇంకొల్లు మూడు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. రైతులు అధైర్యపడొద్దని, రైతు లు పండించిన పొగాకును పూర్తిగా కొనుగోలు చేస్తామన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రైతులు పండించిన పంటను అమ్ముకోలేని దీనస్థితిలో ఉన్నారన్నారు. పొగాకు కొనుగోలుకు ప్రభు త్వం రూ.270 కోట్లు కేటాయించిందన్నారు. అనంతరం మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తామన్నారు. రైతు ల వద్ద ఉన్న చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామన్నారు. పొగాకు సరుకును బట్టి రూ.6 వేలు నుంచి రూ.12 వేల వరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఇంకొల్లు, పర్చూరుల్లో... పర్చూరు(చినగంజాం): పర్చూరు నియోజకవర్గ పరిధిలోని ఇంకొల్లు, పర్చూరు మండలాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలను మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్లు సోమవారం ప్రారంభిచారు. -
కష్టాలే!
చదువుకొనాలంటే ● విద్యా సామగ్రి పేరిట అదనపు వసూళ్లు ● ఫీజుల నియంత్రణపై దృష్టి కరవు ● విద్యాహక్కు చట్టం అమలుపై దృష్టి సారించని విద్యాశాఖ చీరాల: తాము పడిన కష్టం పిల్లలు పడకూడదని, మంచి స్థాయికి రావాలని తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. కన్నబిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు ఆరాటపడుతుంటారు. కొంతమంది తమ స్థాయికి మించి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆరాటాన్ని ఆసరా చేసుకుని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో, విద్యాసామగ్రి పేరిట అందినకాడికి దోచుకుంటున్నారు. ఫీజుల కంటే ఇతర విద్యా సామగ్రి కొనుగోలు చేయాలంటే తలకు మించిన భారమవుతుంది. చదువుకునే రోజుల నుంచి చదువుకొనే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇష్టానుసారంగా యాజమాన్యాలు జిల్లాలో 300కి పైగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యకు ఎంతో ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దారు. అవి నేడు కానరాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల బాటపడుతున్నారు. ఫలితాలు, ర్యాంకులను బేరీజు వేసుకుంటూ సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ పాఠశాలకు అత్యధిక మార్కులు వచ్చాయి, మా స్కూల్లో చేర్పిస్తే మీ పిల్లల భవిష్యత్ బాగుంటుందంటూ క్యాంపెయిన్ చేసి తల్లిదండ్రులను తమ వైపు తిప్పుకుంటున్నారు. కనీసం ఆట స్థలం కూడా లేకుండా ఇరుకు గదుల్లో, బహుళ భవనాల్లో పాఠశాలలను నిర్వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రుల కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయి. వారు నిర్ణయించిన ఫీజులే చెల్లించాలని, వేరే వారి కంటే తామే తక్కువ తీసుకుంటున్నామని బురిడీ కొట్టిస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలయ్యేనా? విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో 25 శాతం ఉచిత విద్యనందించాలి. ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకు వెసులుబాటు ఉంటుంది. ఒకటో తరగతిలో అడ్మిషన్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఆన్లైన్లో లాటరీ విధానంలో విద్యార్థులకు పలు పాఠశాలల్లో ప్రవేశాలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ విధానం రెండు ఫేజ్లలో జరిగింది. జిల్లాలో మొదటి ఫేజ్లో 243 మంది దరఖాస్తు చేసుకోగా 169 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. రెండో ఫేజ్లో 68 మందికిగాను 58 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం కొంత మేరకు మాత్రమే ఫీజు చెల్లిస్తుంది. పూర్తిగా చెల్లించకపోవడంతో మిగిలిన డబ్బులు తల్లిదండ్రులు చెల్లించాల్సి ఉంది. అలానే బస్సు, ఫుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, అదనపు తరగతులకు ప్రత్యేక ఫీజులంటూ బాదుడు షరా మామూలే. పలుకుబడి గట్టిగా ఉండి సిఫార్సులు ఉంటే అడ్మిషన్లు అవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నా యి. ఆర్టీఈ ప్రకారం అడ్మిషన్లు అనగానే యాజమాన్యాలు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీఈ ద్వారా కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నా వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతుంది. అడ్మిషన్ల సమయంలో హడావిడి చేసే విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏయే పాఠశాలలో ఎన్ని ప్రవేశాలు కల్పించారనే వివరాలను మాత్రం వెల్లడించడంలేదు. విద్యాశాఖ అధికారులు కూడా ఆర్టీఈ సక్రమంగా అమలవుతుందా అనేది పరిశీలన చేయడం అవసరం. పిల్లల చదువులపై ఫీజుల పంజా విద్యాసామగ్రి పేరిట మరో దోపిడీ ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులే ఎక్కువగా వసూలు చేస్తున్నారనుకుంటే విద్యాసామగ్రి పేరిట కూడా మరో దోపిడీ జరుగుతుంది. నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు సైతం తమ వద్దనే తీసుకోవాలని సూచిస్తున్నారు. పుస్తకాలు, ఇతర సామగ్రి విక్రయించవద్దని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్న అవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, యూనిఫాం, బెల్టు, టై, చివరకు పుస్తకాలు వేసే అట్టలు వంటి స్టేషనరీలను విద్యార్థుల తరగతిని బట్టి రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకటో తరగతికి అవసరమయ్యే విద్యాసామగ్రి రూ.5 వేల వరకు అవుతుంది. మేము ఇచ్చే సామగ్రి బయట దొరకదని, మా వద్దనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. బయట కొనుగోలు చేస్తానంటే ఒప్పుకోని పరిస్థితి. దీంతో తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది.అధిక ఫీజులపై ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకుంటాం.. ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాం, పుస్తకాలు విక్రయించరాదు. అధిక ఫీజులు వసూలు చేసి, పుస్తకాలు, యూనిఫాం స్కూల్లోనే కొనాలని స్కూల్ యాజమాన్యం ఇబ్బంది పెడితే తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే వారిపై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. – డీ గంగాధరరావు, డిప్యూటీ డీఈఓ -
పంచాయతీల్లో సమస్యలు పరిష్కరించాలి
● జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్ ● కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించిన నాయకులు బాపట్ల/పర్చూరు(చినగంజాం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రం బాపట్లలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్రం విడుదల చేస్తున్న నిధులను సైతం దారి మళ్లిస్తోందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను అగౌరవపరుస్తూ చట్టాలను తుంగలో తొక్కుతున్నది వారు ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ నేతలు కడుపు నింపుకునే జేబు సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీలో పెద్దఎత్తున అవినీతి.. రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలన్నారు. చట్టం మేరకు ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, సర్పంచ్లకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన నిధులు రూ.1150 కోట్లు స్థానిక సంస్థలకు వెంటనే జత చేయాలన్నారు. బిల్లుల చెల్లింపులలో రాజకీయ జోక్యం నివారించాలని, 1320 మంది పంచాయతీ సెక్రటరీలను తక్షణమే పోస్టింగులు ఇచ్చి పెండింగ్లో ఉన్న 9 నెలలు జీతాలు విడుదల చేయాలన్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనాలు వెంటనే పెంచాలని, ప్రస్తుతం అమలులో ఉన్న గౌరవ వేతనాలను సకాలంలో చెల్లించాలని వారు డిమాండ్లను చేస్తూ వినతి పత్రాన్ని సమర్పించారు. కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ పంచాయతీరాజ్ అధ్యక్షులు ఆసోది బ్రహ్మానందరెడ్డి, బాపట్ల నియోజకవర్గ అధ్యక్షుడు పీ ప్రసాద్, ఎం.ఏడుకొండలురెడ్డి, నాలుగు నియోజకవర్గాల పంచాయతీరాజ్ అధ్యక్షుడు, మాజీ ఏఎంసీ చైర్మన్ జీ కృష్ణమూర్తి, ఉప్పుటూరు సర్పంచ్ యర్రాకులు తిరుమలేశ్వరరావు, ఎం హేమంత్కుమార్రెడ్డి, వీ గోపి తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన దేవదాయ శాఖాధికారి
రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు కొల్లూరు: లంచాల కోసం వ్యాపారులను వేధిస్తున్న దేవదాయ శాఖ ఉద్యోగి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ మత్తే మహేంద్ర కథనం మేరకు... బాపట్ల జిల్లా కొల్లూరు దేవాలయాల సమూహ ఈఓగా పనిచేస్తున్న నాగిశెట్టి శ్రీనివాసరావు కొద్ది రోజులుగా ఆలయ దుకాణాదారులను లంచాలు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తున్నాడు. కొల్లూరుకు చెందిన వంకాయల సాయి తన తండ్రి లక్ష్మినారాయణ మరణించడంతో శ్రీ అనంతభోగేశ్వరాలయం పరిధిలో ఉన్న 6వ నంబర్ దుకాణాన్ని తన సోదరుడు రమేష్ పేరుమీదకు మార్చాలని శ్రీనివాసరావును పది రోజుల క్రితం కోరాడు. దుకాణం పేరు మార్పుకు రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయడంతో, అంతమొత్తం ఇచ్చుకోలేనని తెలపడంతో రూ.70 వేలు చెల్లించాలని లేని పక్షంలో దుకాణం స్వాధీనం చేసుకుంటామని ఆలయ అధికారి హెచ్చరికలు చేశాడు. ఆలయ అధికారి అర్ధరాత్రి సమయాలలో సైతం ఫోన్లు చేసి లంచం నగదు కోసం వేధిస్తుండటంతో ఆయన అడిగిన మొత్తం సోమవారం ఇస్తానని సాయి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కొల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయంలోని ఈఓ కార్యాలయంలో దుకాణదారుడు సాయి ఏసీబీ అధికారుల సూచనల మేరకు ఈఓకు రూ.60 వేలు నగదు చెల్లింపులు జరుపుతుండగా, అకస్మాత్తుగా దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దుకాణదారుడి నుంచి లంచంగా తీసుకున్న రూ. 60 వేలు నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ఈఓ కార్యాలయంలోనే రసాయనాలతో పలు పరీక్షలు నిర్వహించి లంచం తీసుకున్నట్లు నిర్ధారించి దేవాదాయ శాఖాధికారి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈఓ శ్రీనివాసరావును మంగళవారం విజయవాడలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు మహేంద్ర వెల్లడించారు. దాడులలో ఏసీబీ సీఐలు నాగరాజు, మన్మదరావు, సురేష్, సుబ్బారావు, ఎస్ఐలు చిచ్చా ఉరుకొండ, సుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
జీఆర్ఎఫ్ డీఎస్పీ అక్కేశ్వరరావు
అవసరమైతే కాల్పులు పిడుగురాళ్ల: రైళ్లలో నేరాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని గుంటూరు డివిజన్ జీఆర్ఎఫ్ డీఎస్పీ పి. అక్కేశ్వరరావు హెచ్చరించారు. రైల్వే పోలీస్ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైళ్లలో నేరాలను అరికట్టేందుకు గుంటూరు డివిజన్లో ఆర్పీఎఫ్, జీఆర్ఎఫ్ సంయుక్తంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్పెషల్ ట్రైన్లలో కొద్ది రోజులుగా ఏసీపీ(అలారం చైన్ పుల్లింగ్), సిగ్నల్ వ్యవస్థ ట్యాంపరింగ్ ద్వారా వేగంగా వెళ్లే ట్రైన్లను నేరగాళ్లు ఆపే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుచేశారు. అయితే ఏ బోగీ నుంచి ఈ ట్యాంపరింగ్ జరిగిందనేది తమకు వెంటనే కచ్చితమైన సమాచారం వస్తుందని తెలిపారు. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్కు వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే వేగంగా వెళ్తున్న ట్రైన్ ఒక్కసారిగా నెమ్మదించడంతో విధుల్లో ఉన్న గుంటూరు డివిజన్లోని తెనాలి ఎస్సై వెంకటాద్రి, కానిస్టేబుల్ శేషయ్య, తదితరులు అప్రమత్తం అయ్యారన్నారు. దొంగలు రాళ్లు విసరడంతో ఎస్సై, కానిస్టేబుల్ కాల్పులు జరిపారని తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని తనతోపాటు గుంటూరు డివిజన్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శైలేష్ కుమార్ పరిశీలించారని తెలిపారు. డీఐజీ ఉత్తర్వుల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, నెల్లూరు తదితర ప్రాంతాలకు పంపినట్లు పేర్కొన్నారు. దుండగులను పట్టుకొని చట్టపరంగా తగిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. దోపిడీలు, దొంగతనాలకు పాల్పడితే కాల్పులు జరిపైనా ప్రయాణికులకు రక్షణ కల్పిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రయాణికులకు, రైల్వే ఆస్తులకు ఎటువంటి నష్టం కలగకుండా కాపాడటమే తమ విధి అన్నారు. కార్యక్రమంలో గుంటూరు అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ బి.శైలేష్ కుమార్, జీఆర్పీ సీఐ పి.కరుణాకర్ రావు, ఎస్ఐలు హుస్సేన్, మోహన్, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు. -
బోనభాగ్యం
జగన్మాతకు తెలంగాణ బంగారు బోనంబంగారు బోనంతో జోగిని శ్యామలాదేవి ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): తెలంగాణ హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. భక్తుల బారులు.. జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు అనుసరించారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్పను సమర్పించిన పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. సాదర స్వాగతం.. కళాకారులు, కమిటీ ప్రతినిధులు, భక్తులతో ఘాట్రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో శీనానాయక్, ఆలయ అర్చకులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం బంగారు, వెండి బోనంతో పాటు పూజా సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో ఎన్. రమేష్బాబు, వెంకటరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రికి తరలివచ్చిన భాగ్యనగర్ బోనం 500 మందితో భారీ ఊరేగింపు ఆకట్టుకున్న కళాకారుల విన్యాసాలు -
ఎట్టకేలకు సీనియార్టీ లిస్టులు
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని యూఎల్బీ పరిధిలో పనిచేస్తున్న వార్డు ఎనిమిటీ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ఆదివారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. శనివారం వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు కౌన్సెలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే శనివారం జరిగిన కౌన్సెలింగ్లో ఎటువంటి సీనియార్టీ లిస్ట్ పెట్టకుండానే నచ్చిన సచివాలయాలను మూడు ఆప్షన్లుగా ఎంచుకుని ఆప్షన్ ఫాం ఇచ్చి వెళ్లిపోండి ఈనెల 30న మీకు సచివాలయం కేటాయిస్తామని అధికారులు చెప్పిన విషయం విధితమే.. దీనిపై ‘సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అధికారులు రెండో రోజు జరగాల్సిన వార్డు ఎమినిటీ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరీలకు కౌన్సెలింగ్కు సంబంధించిన సీనియార్టీ లిస్ట్ను ప్రచురించారు. వార్డు అడ్మిన్లు వర్సెస్ బిల్ కలెక్టర్లు 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వార్డు/గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సచివాలయాలకు వార్డు అడ్మిన్ సెక్రటరీలతో పాటు గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న బిల్ కలెక్టర్లను కూడా వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా అవకాశం కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. 2019లో బిల్ కలెక్టర్లకు వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా ముందు ప్రాధాన్యత కల్పించి పోస్ట్ కేటాయించారు. అయితే ప్రస్తుతం బదిలీల కౌన్సెలింగ్ జరగుతున్న నేపథ్యంలో బిల్ కలెక్టర్లు వారు ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయాల్లోనే ఉండేవిధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని హోల్డ్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వార్డు అడ్మిన్ సెక్రటరీలు అలా హోల్డ్ చేసుకోవడం కుదరదంటూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 23 మంది బిల్ కలెక్టర్లు వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. వీరంతా తాము ఐదేళ్ల నుంచి వార్డు అడ్మిన్ సెక్రటరీలుగా పనిచేస్తున్నామని, తమకు ప్రాధాన్యత ఇచ్చి నచ్చిన సచివాలయం కేటాయించాలని కోరుతుండగా.. అధికారులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. ఈ బదిలీల కౌన్సెలింగ్ ఒక కొలిక్కి రావాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందేనని జీఎంసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
విద్యారంగ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండి
చీరాల అర్బన్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చీరాలలో పట్టణశాఖ 20వ వార్షికోత్సవ వేడుకలను స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో నిర్వహించారు. కార్యక్రమానికి డీఈఓ ఎస్.పురుషోత్తం, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీఈఓ ఎస్.పురుషోత్తం మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థల బలోపేతం చేయడానికి ఎన్రోల్మెంట్ పెరుగుదలకు ఇతోధికంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల మనుగుడ ఉపాధ్యాయుల కృషిపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలకు ఊతమిచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేసి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. అనంతరం పేరాల్లోని ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్లో 35 సంవత్సరాలు పనిచేసి పదవీవిరమణ చేసిన నాగళ్ల రమణారావు దంపతులను సత్కరించారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి గాజుల నాగేశ్వరరావు, ఎస్టీయూ జిల్లా బాధ్యులు గడివాడ అమర్నాథ్, బడుగు శ్రీనివాస్, కె.ఎర్రయ్య, వి.ప్రఽభాకరరావు, ఎం.ఏసురత్నం, టి.వెంకటేశ్వర్లు, శ్రీదేవి, పార్వతి, అపర్ణ, రమేష్, సుబ్బారెడ్డి, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిద్దాం
బాపట్ల: ప్రభుత్వ పాఠశాలలో బడి ఈడు కలిగిన పిల్లలు అందర్నీ చేర్పించే బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం బాపట్ల జిల్లా ప్రజా సంఘాల కార్యాలయంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో నైతిక, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలని కోరారు. దీనికి ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రత్యేక కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటులో విద్యార్థుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడిపై సమాజానికి, తల్లిదండ్రులకి నమ్మకం కలిగించే విధంగా ఉపాధ్యాయులు పని విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులంతా జూలై మొదటి వారంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు జడ వినయ్ కుమార్ మాట్లాడుతూ బదిలీల చట్టం ద్వారా జరిగిన బదిలీల, ప్రమోషన్లలో అసంబద్ధాలను సరిజేయడానికి యూటీఎఫ్ అన్ని సంఘాల్ని కలుపుకొని పెద్దఎత్తున పోరాటం చేసిందని, తద్వారా మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేశామని తెలిపారు. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యారంగ వికాసం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం పనిచేసే సంఘం యూటీఎఫ్ మాత్రమేనని తెలిపారు. ఉపాధ్యాయులంతా సభ్యులుగా చేరాలని కోరారు. బదిలీలు, ప్రమోషన్లలో ఉపాధ్యాయులకు ఎదురైన ప్రతి సమస్యను చిత్తశుద్ధితో కృషిచేసి పరిష్కరించామని చెప్పారు. అనంతరం ఊరి బడిలో పిల్లల్ని చేరుద్దామనే వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. సమావేశంలో గౌరవాధ్యక్షులు పాపారావు, సహాధ్యక్షులు బిక్షాల బాబు, కోశాధికారి హరిప్రియ, జిల్లా కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్స్, ఆడిట్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు -
వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం పాత్ర కీలకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి లీగల్ విభాగం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన అంబటిని ఆదివారం సత్కరించారు. అరండల్పేటలోని లీగల్ విభాగం కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హాజరయ్యారు. ముందుగా న్యాయవాదులు, లీగల్ విభాగం నేతలు అంబటిని సత్కరించి, అభినందనలు తెలిపారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన నేపథ్యంలో లీగల్ విభాగం సన్మానించటం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. గతంలో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు లీగల్ విభాగం కృషి ఎనలేనదన్నారు. 2024 ఎనికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీ శ్రేణులపై, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, కూటమి పెట్టే ప్రతి అక్రమ కేసుపై లీగల్ విభాగం ద్వారా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో సైతం న్యాయవాదుల కృషి ఎంతగానో ఉండబోతోందన్నారు. మహత్తర శక్తిగా లీగల్ విభాగం ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కూటమి కుట్రలను ఛేదిస్తూ వైఎస్సార్ సీపీ నేతల నుంచి కార్యకర్తల వరకు తామున్నామనే ధైర్యాన్ని కలిస్తున్న న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలో వచ్చిన తరువాత జరుగుతున్న దారుణాలను ఎదుర్కొనేందుకు ఒక మహత్తర శక్తిగా లీగల్ విభాగం పనిచేస్తోందన్నారు. కచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయవాదులకు మంచి చేసేలా వైఎస్ జగన్ అనేక గొప్ప నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పోలూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో లీగల్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. గుంటూరు పశ్చిమలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురువేసేందుకు న్యాయవాదుల ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. కూటమి పాలనలో అనేక అక్రమ కేసులు చూస్తున్నామని, వాటిపై న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, కొమ్మారెడ్డి కృష్ణారెడ్డి, సయ్యద్ బాబు, సోమసాని ఝాన్సీ, మంజుల, పోకల వెంకటేశ్వర్లు, హబీబుల్లా, వాసం సూరిబాబు, లలిత, వరదాయని, శ్యామల, ఇందిరా, శ్రీనివాసరెడ్డి, కళ్లం రమణారెడ్డి, సింగ్, బొమ్మనబోయిన శ్రీను, వజ్రాల రాజశేఖరరెడ్డి, బ్రహ్మారెడ్డి, కాసు వెంకటరెడ్డి, క్రాంతి, వేముల ప్రసాద్, స్వదీప్తి, తార, అబ్రహాం లింకన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు లీగల్సెల్ ఆధ్వర్యంలో అంబటికి సత్కారం -
ఉద్యోగ భద్రత కల్పించకపోతే పోరాటాలు
బాపట్ల టౌన్: ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని శ్రీనివాసనగర్లో ఆదివారంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్బాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు 12 నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారని తెలిపారు. తక్షణమే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు చొరవ తీసుకొని వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. భవిష్యత్తులో వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేంత వరకు ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని తెలిపారు. అనంతరం ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సలహాదారులుగా శ్యామ్యూల్, శ్రీనివాసరెడ్డి, గౌరవాధ్యక్షులుగా రహేల్ రావ్, అధ్యక్షులుగా సిమన్, వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా సుధారాణి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఏడుకొండలు, కోశాధికారిగా భారతి, ఆఫీస్ బేరర్స్గా సంధ్యారాణి, వెంకటరెడ్డి, నాగేశ్వరమ్మ, విజయ్ కుమార్, శిరీష, సౌజన్యతో పాటు 15మందిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సింగర్ కొండా, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శ్యామ్యూల్, రాష్ట్ర నాయకులు సునీల్, నాగేశ్వరెడ్డి పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్బాబు -
వ్యాపారవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేయూత
గుంటూరు మెడికల్: వ్యాపార వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తుందని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరు భాస్కరరావు అన్నారు. ఇటీవల నవ్యాంధ్ర ప్రదేశ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై న గుడివాడ జయకుమార్, కార్యదర్శి ఎం.కోటేశ్వరరావు, కోశాధికారి వై.బి.శివారెడ్డిల ప్రమాణ స్వీకారం ఆదివారం పలకలూరు రోడ్డులోని గుంటూరు క్లబ్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పొట్లూరు భాస్కరరావు నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. అసోసియేషన్ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడివాడ జయకుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. భవిష్యత్తులో అసోసియేషన్ తరఫున నూతన భవంతిని నిర్మించి నిరుద్యోగ యువతకు ప్లాస్టిక్ టెక్నాలజీలో మెలకువలను నేర్పించడంతోపాటు, ఉచిత శిక్షణ తరగతులు ఇప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు నూతన కార్యవర్గానికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. -
సిఫార్సు బదిలీలు!
నెహ్రూనగర్: ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటేనే మొదటి ప్రాధాన్యతగా బదిలీలు ఉంటాయని జీఎస్డబ్ల్యూఎస్, పోలీసు అధికారులు తెగేసి చెబుతున్నారు. ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళ పోలీసులకు ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో బదిలీల కౌన్సిలింగ్ జరిగింది. అయితే ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా కేవలం సిఫార్సు లేఖలకే ప్రాధాన్యం ఇస్తూ జరుగుతున్నాయని పలువురు మహిళా పోలీసులు ఆరోపిస్తున్నారు. సిఫార్సు ఉన్నవారికే ప్రథమ ప్రాధాన్యం 2019లో సచివాలయ మహిళా పోలీసులకు వచ్చిన ర్యాంకు, వారి అర్హత, టెక్నికల్ క్వాలిఫికేషన్ బట్టి వారికి ఆయా సచివాలయాల్లో పోస్టింగ్ కల్పించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో కేవలం వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే బదిలీలు నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆ విధంగా కాకుండా ఉమ్మడి జిల్లాలో ఏ ప్రాంతానికై నా బదిలీ చేస్తామని అధికారులు తెగేసి చెబుతున్నారు. ఒక వేళ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఖరాకండిగా చెబుతుండంతో సిఫార్సు లేఖలు తెచ్చుకోలేని మహిళా పోలీసులు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఒక్కో లేఖకు రూ.50వేల దాకా వసూలు ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా 1100 మంది దాకా మహిళా పోలీసులు ఉన్నారు. వీరందరికీ ఆదివారం కౌన్సెలింగ్ జరిగింది. అయితే ఇందులో రూరల్ ప్రాంతంలో పనిచేసే మహిళ పోలీసులు అర్బన్ ప్రాంతానికి వచ్చేందుకు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒక్కో సిఫార్సు లేఖకు రూ.40వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేసి ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల దగ్గర నుంచి గుంటూరు నగరంలో పోస్టింగ్ కోసం ఒక్కో మహిళా పోలీసు 5 నుంచి 10 దాకా వారి వారి పలుకుబడిని బట్టి తెచ్చుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనారోగ్యం, సీనియార్టీ, ర్యాంక్తో పనిలేదు? ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో మొదటి ప్రాధాన్యతగా దివ్యాంగులకు, విజువల్లీ ఛాలెంజడ్, కిడ్నీ మార్పిడి, క్యాన్సర్ వంటి రోగులతో పాటు, స్పౌజ్ కేటగిరి వారికి ప్రాధ్యానం ఇవ్వాలి. కేవలం ఎమ్మెల్యే సిఫార్సు లేఖలే పనిచేస్తుండడంతో చాలా మంది అర్బన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు రూరల్కు బదిలీ అవుతామేమోననే భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీసుల బదిలీల కౌన్సెలింగ్ అనారోగ్యం, సీనియార్టీ, ర్యాంక్తో పనిలేకుండా ఎమ్మెల్యేల సిఫార్సు లేఖ ఉన్నవారికే ప్రాధాన్యం! గుంటూరు సిటీకి వచ్చేందుకు ఒక్కో లేఖకు రూ.50వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఆందోళనలో మహిళా పోలీసులు -
జగన్ పర్యటనలు అడ్డుకునేందుకు బాబు కుట్ర
చుండూరు(వేమూరు) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక కుట్రలు చేస్తున్నాడని గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. చుండూరు మండలంలోని కారుమూరివారి పాలెంలో పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డికి అభినందన సభ ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ కారుమూరు పాలెం గ్రామానికి చెందిన కారుమూరు వెంకటరెడ్డిని పార్టీ అధికార ప్రతినిధిగా వైఎస్. జగన్మోహన్రెడ్డి నియామకం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పోలీసులకు తనకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని, తన ఆస్తి వైఎస్సార్ సీపీ కార్యకర్తలేనని చెప్పారు. వారికి ఏ సమస్య వచ్చినా ఎదురు నిలబడి పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ పార్టీ కోసం కష్టకాలంలో పని చేసిన కార్యకర్తలకు ఎప్పడూ గౌరవం ఉంటుందని తెలిపారు. రేపల్లె నియోజకవర్గం సమన్వయకర్త ఈపూరు గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా సూపర్ సిక్స్లు అమలు చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే పథకాలు అమలు చేసిన ఘనత దిక్కిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పక్కన పెట్టి కక్ష సాధించే పరిపాలన చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర కళాకారుల సంఘః ప్రధాన కార్యదర్శి చలంచర్ల సుధారాణి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హిజ్రాలకు గుర్తింపు ఇచ్చిందన్నారు. వైయస్. జగన్మోహన్రెడ్డి గెలుపు కోసం హిజ్రాలంతా కృషి చేస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైయస్. జగన్మోహన్రెడ్డి పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పాలన సాగిందని వివరించారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షులు ఉయ్యూరి అప్పిరెడ్డి, మండల అధ్యక్షులు అన్నపురెడ్డి రఘురామిరెడ్డి, వేమూరు, అమర్తలూరు మండలాల పార్టీ అధ్యక్షులు దాది సుబ్బారావు, హిమ చంద్ర శ్రీనివాసరావు, ఎంపీపీ జాలాది రూబేను, రాపర్ల నరేంద్ర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగంటి లవకుమార్, జెడ్పీటీసీ సభ్యులు దాట్ల సౌజన్య మోహన్రెడ్డి, బి. నాంచారమ్మ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు -
అభినవ వ్యాసుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి
అమరావతి: ప్రపంచానికి పురాణాలను అందించింది వేదవ్యాస భగవానుడైతే ఆ పురాణాలను సామాన్యుడికి సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచించిన అభినవ వ్యాసుడు పురాణ ప్రవచన సార్వభౌముడు, కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి అని ప్రముఖ ప్రవచన కర్త నోరి నారాయణమూర్తి అన్నారు. శనివారం రాత్రి స్థానిక యోగాశ్రమంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి శతజయంతి వర్ష సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసభకు మల్లాది రామనాధశర్మ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా నోరి నారాయణమూర్తి మాట్లాడుతూ దేశ, విదేశాలలో పురాణప్రవచనం అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అభినవ వ్యాస బిరుదాంకితులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి మాత్రమేనన్నారు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టువల్ల పురాణ ప్రవచన ప్రముఖుల్లో ప్రథములుగా గుర్తించబడ్డారన్నారు. నాటి కిరోసిన్ దీపాల వెలుగులో పురాణం చెప్పేరోజులనుంచి నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమైన ఆడిటోరియంలో చెప్పే వరకు సమారు 70 సంవత్సరాల మల్లాదివారి సుదీర్ఘ ప్రవచన ప్రయాణం సాగిందన్నారు. ● శనగవరసు రామ్మోహన శర్మ మాట్లాడుతూ ప్రపంచ ప్రఖాతి గాంచిన శైవక్షేత్రమైన అమరారామంలో జన్మించిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి అమరావతి ఆణిముత్యమన్నారు. ● మాచిరాజు వేణుగోపాల్ మాట్లాడుతూ అమరావతిలోనే చంద్రశేఖరశాస్త్రి బాల్య విద్యాభ్యాసం గడవడంతోపాటు, తొలిరోజుల పురాణ ప్రవచనం ఇక్కడే చేసి, ప్రపంచ వ్యాప్తంగా అమరావతికి మరోసారి వన్నె తెచ్చారన్నారు. ● ప్రముఖప్రవచనకర్త పుల్లాభట్ల వేంకటేశ్వర్లు మాట్లాడుతూ భగవంతుని అనుగ్రహంతో శృంగేరి శారదాపీఠం, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితుడిగా పురాణాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో భక్తిభావతత్పరతను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహానీయుడు చంద్రశేఖరశాస్త్రి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రా లలో ప్రవచనం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రశేఖరశాస్త్రి అనటంలో అతిశయోక్తి లేదన్నారు. విశ్రాంత న్యాయమూర్తి మందాడి చలపతిరావు, మల్లాది రామచంద్రశర్మ, అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కౌశిక ప్రసాద్లు మాట్లాడారు. ఈసభకు అమరావతి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రవచన కర్త నోరి నారాయణ మూర్తి -
బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతా లోపాలు
పర్చూరు(చినగంజాం): జాతీయ రహదారి 167 ఏ అనుసంధానంగా పర్చూరు వై. జంక్షన్ వద్ద నిర్మిస్తున్న హైవే బ్రిడ్జి పనులు నాసిరకంగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి బ్రిడ్జికి మధ్యలో ఇరువైపులా ఉన్న ఖాళీని బలమైన ఇనుము, కాంక్రీట్తో నింపాలి. అయితే బ్రిడ్జికి ఎడమవైపు ఒక చోట శ్లాబ్ కుంగిపోయింది. శ్లాబ్ కింద సపోర్టుగా పెట్టిన ఇనుప కమ్మీల నిర్మాణాలు కిందకి దిగి పోవడంతో శ్లాబ్ కుంగిపోయింది. ఇది గమనించిన ఇంజినీర్లు కుంగిన దాఖలాలు లోపాన్ని బహిర్గతం కాకుండా ఉండేందుకు తాత్కాలికంగా సరిచేసే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ బ్రిడ్జి బలహీనంగా ఉంటుందని కుంగిపోయిన స్థానంలో కాంక్రీట్ పూర్తిగా తొలగించి తిరిగి నిర్మాణం చేపట్టాలని స్థానికులు పట్టుబడుతున్నారు. జాతీయ రహదారిపై అతి భారీ వాహనాలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని బ్రిడ్జి నిర్మాణం నాణ్యత సక్రమంగా ఉండేలా చూడాలని వారు కోరుతున్నారు. ఉద్యోగుల సస్పెన్షన్పై విచారణ నాదెండ్ల: గణపవరం గ్రామీణ పశువైద్యశాల వైద్యాధికారి సాంబశివారెడ్డి, వెటర్నటీ లైవ్స్టాక్ సిబ్బంది పవన్కుమార్ ఇటీవల సస్పెండ్కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయమై పశు సంవర్థక శాఖ డైరెక్టర్ దామోదర్నాయుడు శనివారం విచారణ చేపట్టారు. ఈ నెల 19న 3.30 గంటల సమయంలో రాష్ట్ర పశుసంవర్థకశాఖ, పాడి పరిశ్రమల స్పెషల్ చీఫ్ సెక్రటరీ సి రాజశేఖర్ గణపవరం పశువైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సమయంలో వైద్యాధికారి సాంబశివారెడ్డి, సిబ్బంది పవన్కుమార్ లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు. ఈ విషయమై శనివారం డైరెక్టర్ దామోదర్నాయుడు రికార్డులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. స్థానిక పశుపోషకులను విచారించారు. వైద్యాధికారి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా స్థానికంగా ఇళ్లకు వచ్చి వైద్యసేవలు అందిస్తున్నారని వివరించారు. ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేటరూరల్: ఇస్సపాలెంలోని మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు మేదరమెట్ల అంజమ్మ, మస్తాన్రావు విద్యాసంస్థల చైర్మన్ ఎంవీ శేషగిరిరావు, అనంతలక్ష్మీ దంపతులు విరాళంగా రూ.3 లక్షలు అందజేశారు. ఆలయ కార్యాయంలో ఈవో నలబోతు మాధవిదేవిని కలిసి విరాళం చెక్ను దాతలు అందించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు నండూరి కాళీకృష్ణ పాల్గొన్నారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో షబీనా ప్రతిభ మంగళగిరి టౌన్ : జాతీయ స్థాయిలో ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం దావన్గిరిలో జరుగుతున్న జూనియర్ నేషనల్ ఎక్యూప్ట్ ఉమెన్ పవర్లిఫ్టింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి ప్రతిభ చాటినట్లు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు విజయభాస్కరరావు, షేక్ సందాని శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తరఫున గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్ షబీనా 84 కిలోల విభాగంలో పాల్గొని కాంస్య పతకం సాధించినట్లు తెలిపారు. స్క్వాట్ 202.5 కిలోలు, బెంచ్ ప్రెస్ 97.5 కిలోలు, డెడ్ లిఫ్ట్ 182.5 కిలోలు, ఓవరాల్ 482.5 కిలోల విభాగాల్లో కాంస్య పతకాలు సాధించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. భారీగా ఉద్యాన సహాయకుల బదిలీలు నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఐదేళ్ల నుంచి పని చేస్తున్న గ్రామ ఉద్యాన సహాయకులకు శనివారం పట్టణంలోని మున్సిపల్ అతిథి గృహంలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. గుంటూరు ఉద్యానశాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.రవీంద్రబాబు, పల్నాడు, బాపట్ల జిల్లాల ఉద్యానశాఖ అధికార్లు ఐ.వెంకటరావు, ఎస్ఎంఏ కరీం ఆధ్వర్యంలో 162మందిని బదిలీ చేశారు. కార్యక్రమంలో మూడు జిల్లాల ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. -
భూములు ఇచ్చే ప్రసక్తే లేదు
బల్లికురవ: తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పశువులను పోషించుకుంటున్నామని.. అందుకే సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు తమ భూములు ఇచ్చేది లేదని మండలంలోని ఎస్ఎల్ గుడిపాడు గ్రామ రైతులు తేల్చి చెప్పారు. శనివారం గ్రామ సచివాలయం వద్ద చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. గ్రామానికి పడమర వైపు సుమారు 80 ఎకరాలు ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమని, రెండు నెలలుగా ఇప్పటికే మూడు పర్యాయాలు గ్రామ సభ నిర్వహించారు. ఎకరాకు రూ. 16 లక్షల వరకు చెల్లిస్తామని, గ్రామంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, గ్రామాభివృద్ధికి పాటు పడతామని ఆర్డీవో ప్రకటించారు. అయితే రైతులు ఆలకుంట రవిదేవరాజు, శ్రీనివాసరావు, యర్రా బోడెయ్య, రవి, భాస్కరరావు, గుంజి వెంకటేశ్వర్లు, పోతురాజు, అంకమ్మ తదితరులు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్కు గ్రీవెన్స్లో కూడా విన్నవించామని చెప్పారు. తాము ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. స్వయంగా మంత్రే తమ గ్రామ సమీపంలోనే ఎకరా రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేశారని తెలిపారు. తమ భూముల జోలికి రావద్దని గ్రామ సభ నుంచి రైతులు వెనుదిరిగి వెళ్లారు. తహసీల్దార్ రవినాయక్, ఆర్ఐ పోతురాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సోలార్ ప్రాజెక్టు ఏర్పాటుకు గ్రామసభలో రైతులు విముఖత -
ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు తల్లికి వందనం కూడా వర్తింపజేయాలని మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ రేపల్లె కమిటీ అధ్యక్షుడు డి.ప్రభాకరరావు డిమాండ్ చేశారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా శనివారం నెహ్రూ బొమ్మ సెంటరులో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించటంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. చాలీచాలని వేతనాలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అరకొర జీతాలను అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ కార్మికులను పథకాలకు దూరం చేస్తు న్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, 12వ పీఆర్సీ అమలుకు అనుగుణంగా కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం అవుతామని వెల్లడించారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్, యూనియన్ నాయకులు రవి, రాఘవేంద్రరావు, శివ, యువరాజు, తదితరులు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొట్టిన మినీ లారీ
బల్లికురవ: మామిడి పండ్లతో తెలంగాణకి వెళుతున్న మినీ లారీ ప్రమాదానికి గురైంది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవటంతో చెట్టును ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన శనివారం ఉదయం మేదరమెట్ల– నార్కెట్పల్లి నామ్ రహదారిలోని మండలంలోని ఎస్ఎల్ గుడిపాడు గ్రామ సమీపంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన మినీ లారీ మామిడి పండ్లతో వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ జి.అంజిబాబు, క్లీనర్ ఎం. నవీన్ గాయాలపాలయ్యారు. స్థానికులు హైవే అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. పారా మెడికల్ రాజు, విద్యాసాగర్ క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్సకు సంతమాగులూరు పీహెచ్సీకి తరలించారు. లారీ అదుపుతప్పటంతో మామిడి పండ్లు రోడ్డుపాలయ్యాయి. డ్రైవర్, క్లీనర్లకు గాయాలు -
సచివాలయ ఉద్యోగుల్లో ట్రాన్స్‘ఫియర్’
నెహ్రూనగర్: సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్లో అధికారులు పారదర్శకతకు పాతర వేశారు. అసలు ఖాళీలు చూపించకుండానే నిర్వహించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని యూఎల్ బీస్(అర్బన్ లోకల్ బాడీస్) అయిన గుంటూరు నగరపాలక సంస్థ, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లె, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీల్లో పరిధిలోని వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్ గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం జరిగింది. ఇందులో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు ఉన్నారు. పారదర్శకతకు పాతర మామూలుగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఖాళీలను బట్టి నడుస్తుంది. ముందుగా దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజెడ్, క్యాన్సర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి ఆపరేషన్లు చేసుకున్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత సీనియార్టీ, ర్యాంక్ని బట్టి ఉంటుంది. అయితే, అధికారులు ఇవేమి పాటించలేదు. సచివాలయ వివరాలను మూడు ఆప్షన్స్గా చూపించి, ఫారం ఫిల్ చేసి ఇచ్చేసి వెళ్లిపోండంటూ చెప్పడంతో ఉద్యోగులు విస్తుపోయారు. ఈ నెల 30వ తేదీలోగా అలాట్ అయిన సచివాలయానికి సంబంధించిన పోస్టింగ్ కేటాయిస్తామని చెప్పడంతో ఖంగుతిన్నారు. అసలు తాము ఇచ్చిన ఆప్షన్స్ ఫాం అయిన ఉంటుందా ? లేక చెత్త బుట్టలో వేస్తారో ! అని ఒకింత అనుమానం వ్యక్తం చేశారు. వార్డు టూ వార్డు ట్రాన్స్ఫర్లపై మండిపాటు వార్డు టూ వార్డు సచివాలయానికి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా యూఎల్బీ టూ యూఎల్బీ(అర్బన్ లోకల్ బాడీ)కు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని కొంత మంది మహిళా సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. వార్డు టూ వార్డు పెట్టుకోవడం ద్వారా ఇంకా దాన్ని ట్రాన్స్ఫర్లు అనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఖాళీలు చూపించకుండా బదిలీలు ప్రక్రియ చేపట్టిన అధికారులు ఆప్షన్ ఫాం ఇచ్చి వెళ్లిపోవాలని సూచన 30న సచివాలయం ఎలాట్మెంటు అధికారుల తీరుపై సచివాలయ ఉద్యోగుల మండిపాటు ఎమ్మెల్యేల లెటర్లకే ప్రాధాన్యం ? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ గత ప్రభుత్వ హయాంలో రెండు సార్లు జరిగింది. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాకు 11,082(అర్బన్, రూరల్లకు కలిపి) మంది సెక్రటరీలు ఎంపికయ్యారు. వీరిలో మొదటి బ్యాచ్కు పోస్టింగ్స్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే, పలువురు ఒకే సచివాలయానికి ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర నుంచి సిఫార్సుల లెటర్లు తీసుకు రావడంతో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లే ఆధారంగా బదిలీలు జరిగే అవకాశం ఉందంటూ కొంత మంది సీనియర్ సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించి బదిలీల ప్రక్రియ నిర్వహిస్తారో ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందేనని సచివాలయ ఉద్యోగులు మిన్నకుండిపోయారు. -
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు అవసరం
నరసరావుపేట: నీళ్లు, దోమల ద్వారా వచ్చే వ్యాధుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటూ అవి ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. శనివారం తన కార్యాలయంలో జిల్లా మలేరియా అధికారి కె.రవీంద్ర రత్నాకర్ అధ్యక్షతన జిల్లాలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సబ్ యూనిట్లలో నూతనంగా చేరిన 65మంది ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారికి కేటాయించిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వ్యాధులు సంభవిస్తే తక్షణమే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఎంఎల్హెచ్పీలకు సహాయ సహకారాలు అందజేస్తూ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించాలని కోరారు. రవీంద్ర రత్నాకర్ మాట్లాడుతూ నవంబరు వరకు మలేరియా, డెంగీ, చికున్గున్యా, పైలేరియా, మెదడువాపు వ్యాధులు లాంటి సీజనల్ వ్యాధులు విషయంలో ఫ్రైడే డ్రైడేను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. దోమల నిర్మూలనతో పాటు అవి పుట్టకుండా, కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డాక్టర్ నజీరు, ఏఎంఓ చుక్కా వెంకటేశ్వర్లు, కుంచాల శ్రీనివాసరావు, సబ్యూనిట్ అధికారులు పాల్గొన్నారు. పల్నాడు డీఎంహెచ్ఓ డాక్టర్ రవి -
లోక్అదాలత్లో సత్వర న్యాయం పొందాలి
సీనియర్ సివిల్ జడ్జి వెన్నెలరేపల్లె: రాజీమార్గమే రాజమార్గమని, పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి కక్షిదారులకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జులై 5న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి వెన్నెల చెప్పారు. స్థానిక సబ్కోర్టు హాలులో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెగా లోక్అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించేలా అధికారులు పనిచేయాలని, ఇప్పటికే న్యాయవాదులు, పోలీసులు, ఎకై ్సజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలు జారీ చేశామన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించటమే మెగా లోక్అదాలత్ లక్ష్యమన్నారు. మెగాలోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్ కేసులతోపాటు ప్రీలిటిగేషన్ కేసులు, బ్యాంక్ లావాదేవీలు, భార్యా భర్తల వివాదాల తదితర కేసులను పరిష్కరించుకుని న్యాయం పొందవచ్చన్నారు. వేదికను వినియోగించుకుని కేసులు పరిష్కరించుకోవాలని కోరారు. సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవి సాయిశ్రావణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గీతా భార్గవి తదితరులు పాల్గొన్నారు. క్షణికావేశాలతో జీవితాలు నాశనం క్షణికావేశంలో చేసే తప్పులకు జీవితం నాశనం అవుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి.వెన్నెల అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని సబ్జైలులో ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ రాగద్వేషాలను వీడి ప్రేమతో జీవించాలని సూచించారు. కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రైవేటుగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేనివారి కోసం ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుబాటులో ఉంటారన్నారు. ప్రభుత్వ న్యాయవాది ద్వారా ఉచిత న్యాయ సేవలు పొందవచ్చని తెలియజేశారు. ఖైదీలకు సబ్జైలులో అందుతున్న సేవలపై ఆరా తీశారు. సబ్జైలు పరిసరాలను పరిశీలించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి దివ్య సాయి శ్రావణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గీతా భార్గవి, జైల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
నీటి గుంతలో జారి పడి వ్యక్తి మృతి
ఇంకొల్లు(చినగంజాం): ప్రమాదవశాత్తు కాలు జారి నీటి గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పావులూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన గుంజి చిన వెంకటరావు(47) శనివారం ఉదయం బహిర్భూమికి వెళ్లి చాలాసేపటి వరకు తిరిగి రాలేదు. ఇంట్లోని వారికి అనుమానం వచ్చి వెతికారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. సమీపంలోని నీటి గుంతలో పడి వెంటకరావు చనిపోయాడని తెలిసింది. ఎస్ఐ జి.సురేష్ ఆధ్వర్యంలో వెంకటరావు మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. వెంకటరావు భార్య శివపార్వతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మార్కెట్ యార్డు చైర్మన్ వెంకటరావు కోరారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025ఎత్తిపోతల పథకాలను పట్టించుకోని ప్రభుత్వం వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి చీరాల టౌన్: అందరికీ అన్నంపెట్టే అన్నదాతల సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం తీరుతో సాగునీరు అందుతుందా..లేదా.. అనే భావనలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి అన్నారు. పంటల సాగుకు ముఖ్యమైన సాగునీరు అందించడంలో కూడా కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. శనివారం చీరాల మండలంలోని తోటవారిపాలెం పంపింగ్ స్కీం పథకాన్ని రైతులతో కలిసి పరిశీలించారు. ఈ పథకంలో మోటార్లు మరమ్మతులకు గురైనా పట్టించుకోకపోవడం, నీరు సరఫరా అయ్యే కాలువ అధ్వానంగా మారి నీటి సరఫరాకు అవాంతరాలు ఉన్నప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. నియోజకవర్గంలో వేల ఎకరాలు పంట పొలాలు ఎత్తిపోతల పథకాల ద్వారానే పంటల సాగు చేస్తారని వివరించారు. ఏళ్ల కిందట నిర్మించిన ఈ పథకాల్లో చాలాచోట్ల మోటార్లు పనిచేయకపోవడం, పైపులైన్లు మరమ్మతులకు గురౌతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. అన్నదాతలను నట్టేట ముంచేలా పరిపాలన చేస్తున్న కూటమి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల ఎకరాల పొలాలకు ముఖ్యమైన ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చేయించి పంట కాలువల పూడికతీత, పైపులైన్లు త్వరగా ఏర్పాటు చేసి సాగు నీరుకు ఇబ్బందులు లేకుండా చూడాలని లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. జి.వెంకటకరావు, ఆయా గ్రామాల్లోని రైతులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, బాపట్ల: సముద్రతీరంలో ఆక్రమణలు తేల్చేందుకు జిల్లా కలెక్టర్ వేసిన విచారణ కమిటీపై పచ్చ నేతల ప్రభావం ఉందన్న విమర్శలున్నాయి. తీరం కబ్జాదారులు బాపట్ల, చీరాల ప్రాంతాల్లో కీలకమైన పచ్చనేతలు కావడంతో విచారణ సజావుగా జరగకుండా వారు అధికారులను అడ్డుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే తీరంలో ఆక్రమణల వ్యవహారం పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం కనిపించడంలేదు. బాపట్ల మండలం పాండురంగాపురం, చీరాల, వేటపాలెం మండలాల పరిధిలోని ఓడరేవు, రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం వరకూ సముద్రతీర ప్రాంతంలోని ప్రభుత్వ, అసైన్డ్, అటవీ భూములను పచ్చనేతలు కబ్జా చేసి ఏకంగా కొంత భూమికి పట్టాలు పుట్టించారు. అంతటితో వదలక ఆన్లైన్ కూడా చేశారు. వాటిని రియల్టర్లు, రిసార్ట్స్ యజమానులకు కట్టబెట్టారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కొందరు రెవెన్యూ అధికారులు అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితిలో వేటపాలెం తహసీల్దార్ను కలెక్టర్ సరెండర్ చేశారు. అక్కడి భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించారు. ప్రధానంగా వేటపాలెం, చీరాల మండలాల్లో ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరుగుతోంది. మరోవైపు బాపట్ల మండలం పాండురంగాపురం సముద్ర తీర ప్రాంతంలో చీరాలకు చెందిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ప్రభుత్వ, అసైన్డ్ భూములను కబ్జాచేసి వాటిని గుంటూరుకు చెందిన మరో పచ్చ ప్రజాప్రతినిధికి చెందిన భ్రమర ఇన్ఫ్రా కంపెనీకి దారాదత్తం చేసి కోట్లు ఆర్జించినట్లు ఆరోపణలు వచ్చాయి. కబ్జా భూముల్లో రియల్ వెంచర్లు వేసి భూములను అమ్మకానికి పెట్టగా మరికొంత భూముల్లో ఏకంగా రిసార్ట్లు నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తీరంలో పచ్చనేతల భూ ఆక్రమణలు గుర్తించిన మత్స్యకారులు ఇదేందుర్మార్గమని గొంతెత్తి అరచి రోడ్డెక్కారు. తీరం మాహక్కు అని, ఎవరు వచ్చి కబ్జా చేసినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అంతటితో వదలక ఆందోళనకు దిగారు. కలెక్టర్ హామీతో వేటకు మత్స్యకారులు స్పందించిన కలెక్టర్ వెంకట మురళి మత్స్యకారులకు నచ్చజెప్పి తీరం భూములను కబ్జా కోరల నుంచి విముక్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముందస్తుగా మత్స్యకారుల వేటకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. విచారణ కమిటీ నియమించి ఆక్రమణల వ్యవహారం తేలుస్తామని చెప్పారు. దీంతో మత్స్యకారులు తాత్కాలికంగా ఆందోళన విరమించి వేట బాట పట్టారు. 7న్యూస్రీల్కమిటీపై ‘పచ్చ’ ప్రభావం విచారణ కమిటీపై విమర్శలు అయితే విచారణ కమిటీపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే పచ్చపార్టీ నేతలు విచారణ కమిటీపై ఒత్తిళ్లు పెంచినట్లు ప్రచారం వుంది. పచ్చనేతలకు భూములు కట్టబెట్టేందుకు కొందరు రెవెన్యూ అధికారులే సహకరించారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ భూములకు డీకేటీలు ఇచ్చిన విషయంలో బాపట్ల అధికారుల పాత్ర ఉందన్న విమర్శలున్నాయి. మత్స్యకారులతోపాటు ప్రజాసంఘాలు ఇదే ఆరోపణ చేస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు విచారణ కమిటీలో ఉండకూడదని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కబ్జాల్లో పచ్చ నేతలే సూత్రదారులు, పాత్రదారులు వందల ఎకరాల అసైన్డ్ భూముల ఆక్రమణ కడలి పుత్రుల ఆందోళనతో బయటపడ్డ కబ్జా పర్వం కొందరు స్థానిక రెవెన్యూ అధికారులే కబ్జాకు సహకరించారన్న ఆరోపణలు ప్రభుత్వ భూములకు డీకేటీలు ఇచ్చారని విమర్శలుతెర వెనుక రెవెన్యూ, సీఆర్జెడ్ అధికారుల పాత్ర తీరంలో పచ్చనేతల కబ్జాలకు కొందరు రెవెన్యూ అధికారులతోపాటు ఇరిగేషన్, సీఆర్జెడ్ అధికారుల సహకారముందన్నది మత్స్యకార సంఘాల ఆరోపణ. వాస్తవానికి సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీరానికి ఎంత దూరంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములున్నాయో వారు తేల్చరు. రెవెన్యూ వారు ఆ భూముల వివరాలు బయటకు చెప్పరు. తీరం అలల దాకా పచ్చనేతలు భూములు ఆక్రమించినా సీఆర్జెడ్ అధికారులు అందిన కాడికి దండుకొని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అసలు సీఆర్జెడ్ తీరం నుంచి ఎంతదూరం వుందో కూడా ఆ శాఖ అధికారులు ఇప్పటికీ స్పష్టత నివ్వడంలేదు. తీరంలో ఒక్కో దగ్గర ఒక్కోలా నిబంధనలు ఉంటాయని మాత్రమే చెప్పి తప్పించుకుంటున్నారు. బాపట్ల జిల్లాలో తీరం మొత్తాన్ని కబ్జాల మయంగా మార్చడం వెనుక సీఆర్జెడ్ అధికారుల పాత్ర వుందన్న విమర్శలున్నాయి. మొత్తంగా తీరాన్ని పచ్చనేతలకు అప్పగించి కొందరు రెవెన్యూ అధికారులతోపాటు సీఆర్జెడ్ అధికారులు కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. పచ్చనేతల ప్రభావంతో తీరం ఆక్రమణలపై విచారణ సజావుగా జరుగుతుందా అనేది ప్రశ్నార్థకమే? -
డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అరెస్ట్
చిలకలూరిపేట టౌన్: డ్రగ్స్ అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరానికి చెందిన చల్లా గోపి, షేక్ షారూక్ 25 గ్రాముల డ్రగ్స్తో శుక్రవారం మండల పరిధిలో ఓ రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్నారన్న సమాచారంతో అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు ఇరువురిని తనిఖీ చేసి రూరల్ పోలీసులకు అప్పగించారు. శనివారం రూరల్ సీఐ సుబ్బనాయుడు ఇరువురిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు తాడేపల్లి రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు అన్నారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ముత్యాలనగర్లో శనివారం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కార్మికులకు జీతాలు పెరగక, పెరిగిన ధరలతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం 18,500 రూపాయలు జీతం ఇవ్వాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. జూలై 1న అన్ని పట్టణాలలో మున్సిపల్ కార్మికులతో కళ్లకు గంతలు కట్టి నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జూలై 4న ధర్నా చౌక్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులతో పెద్దఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తాడేపల్లి పట్టణ నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వర్కర్లు పాల్గొన్నారు. -
కుట్రదారుల పాలిట సింహస్వప్నం వైఎస్ జగన్
నరసరావుపేట: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి భూతమని ఒక కొత్త పేరు పెట్టి, ఆ భూతాన్ని భూస్థాపితం చేసేపనిలో ఉన్నామని నాలుగోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబునాయుడు నేరపూరితంగా, సంస్కారహీనంగా మాట్లాడటం.. దానికి తానా తందానా అంటూ అనుకూల మీడియా వంతపాడడం, భూస్థాపితం ఎప్పుడు చేస్తారు, ఈ ఐదేళ్లలోనేనా అని పాత్రికేయతకే మచ్చతెచ్చేలాగా ఆ మీడియా ప్రశ్నించడం చాలా అభ్యంతరకరం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి కళంకమని సోషల్ యాక్టివిస్టు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉండగా తాను ప్రజలకిచ్చిన ఎన్నికల వాగ్దానం ప్రకారం నవరత్న సంక్షేమ పథకాలను ఠంఛనుగా ఐదేళ్లూ అందించడమే కాక, చరిత్రలో నిలిచిపోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. గత ఐదేళ్లుగా ఆయన్ను విధ్వంసకారుడు అని తమ అనుకూల మీడియా ద్వారా కూటమి నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి పేరిట అనైతిక పొత్తులు పెట్టుకుని, ఈవీఎంలతో సహా వ్యవస్థలను మేనేజ్ చేసి, గెలిచిన గెలుపూ ఒక గెలుపేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈదర గోపీచంద్ -
శాంతియుత వాతావరణం కోసమే పల్లె నిద్ర
డీఎస్పీ శ్రీనివాసరావు రేపల్లె: శాంతియుత వాతావరణం నెలకొల్పి ప్రజలతో మమేకం అయ్యేందుకు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు చెప్పారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి పట్టణంలోని 16వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వార్డులో సమస్యలు తలెత్తితే శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. వివాదాస్పదమైన అంశాలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు తెలపాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పోక్సో కేసుల వివరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, బాల్య వివాహాల నివారణ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
అయితానగర్ను భయపెట్టేందుకే దాడి
తెనాలి: పాలకులు పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట పెట్టుకుని ఎప్పుడు.. ఎవరిని వేధించాలని చూస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ దృక్పథాన్ని, సంస్కృతిని తీసుకురావాలని, ప్రశ్నించే తత్వానికి ఈ సదస్సు వేదిక కావాలని శనివారం రాత్రి తెనాలిలో జరిగిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దళిత చైతన్యానికి, ఉద్యమాలకు గుండెకాయ వంటి అయితానగర్ను భయభ్రాంతులను చేసేందుకు యువకులపై బహిరంగ దాడి చేశారని ఆరోపించారు. పోలీసుల తీరునూ, వారిని సమర్థిస్తున్న పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందేనని స్పష్టం చేశారు. తెనాలిలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల అరాచకాన్ని, మానవ హక్కుల ఉల్లంఘనను నిలదీస్తూ తెనాలి అయితానగర్లోని కమ్యూనిటీ హాలులో జరిగిన సదస్సుకు సమన్వయకర్త పిల్లి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. రాజకీయ పార్టీలు, వివిధ దళిత, ప్రజాసంఘాలు మొత్తం 24 పైగా నిర్వాహక కమిటీగా జరిపిన సదస్సులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసులే కేసు పెట్టి, తీర్పులిచ్చి, శిక్షలు వేసేస్తుండటం దారుణమని పేర్కొన్నారు. తెనాలి పోలీసుల మానవ హక్కుల ఉల్లంఘనను సీపీఎం ఖండిస్తోందని తెలిపారు. మానవ హక్కులను కాపాడుకోవడమే మనముందు న్న సమస్యగా స్పష్టం చేశారు. ● సీపీఐ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ తెనాలి పోలీసుల దారుణంపై ప్రజాప్రతినిధులు, చివరికి హోం మంత్రి సహా సిగ్గుపడకపోగా సమర్థిస్తారా? అంటూ నిలదీశారు. ● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బహిరంగంగా శిక్షించమని ఏ చట్టం చెబుతోందని అన్నారు. ● ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎం.విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు, వాస్తవంగా పెట్టీ కేసు మాత్రమేనని తెలిపారు. దీనిపై పలు సెక్షన్లతో కేసులు పెట్టటం ఏమిటని ప్రశ్నించారు. ● రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు మాట్లాడుతూ అయితానగర్ లో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుతోనే కుట్ర మొ దలైందని చెబుతూ అందుకే సుప్రీంకోర్టులో దాఖ లు చేసిన పిటిషన్లో స్థానిక ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు చేర్చినట్టు తెలిపారు. ● ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దళితులు ఐక్యంగా పోరాటం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ● విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దయాసాగర్ మాట్లాడుతూ తెనాలి పోలీసుల చర్య కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనేనని చెప్పారు. ● వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే సాగర్ మాట్లాడుతూ పోలీసుల దాడివెనుక పోరాట స్ఫూర్తి కలిగిన అయితానగర్ను భయభ్రాంతులను చేయాల నే పాలకుల కుట్ర ఉందని తెలిపారు. ● మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవరపు కిశోర్ మాట్లాడుతూ ఇంత ఆందోళన జరిగినా కనీసం పోలీసులపై చర్య తీసుకోలేదంటే దళితులపై ప్రభుత్వ చులకనభావమేనని పేర్కొన్నారు. ● సభాధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ అతి త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను బహిర్గతం చేస్తామని వెల్లడించారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ నేత జి.శాంతకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఉమామహేశ్వరరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వై.నేతాజీ, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, మహిళా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకురాలు సుంకర పద్మశ్రీ, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, మాల ఉద్యోగుల సంఘం నేత కిశోర్బాబు, కుల నిర్మూలన సమితి రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ, ఇండియన్ లీగల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ నేత మణి, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకా చంద్రశేఖర్, భగత్సింగ్, వేముల మురళి, నీలాంబరం, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రం, ఆర్పీఐ అంబేడ్కరైట్ రాష్ట్ర అధ్యక్షుడు పి.రవిప్రసాద్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడారు. దళిత బహుజన ఫ్రంట్ కొరివి వినయ్కుమార్ స్వాగతం పలికారు. మానవ హక్కుల పరిరక్షణ సదస్సులో వక్తలు పోలీసుల తీరు, సమర్థిస్తున్న పాలకుల వైఖరిపై ఆగ్రహం తీవ్రంగా ఖండించిన రాజకీయ పార్టీలు, దళిత, ప్రజా సంఘాల రాష్ట్ర నేతలు -
సమస్యలు పరిష్కరించకపోతే విధుల బహిష్కరణ
తాడేపల్లి రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో విధులు బహిష్కరిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో గల సీడీఎంఏ కార్యాలయాన్ని శుక్రవారం ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో గత 52 రోజుల నుంచి నిరసనలు తెలుపుతున్నా కూటమి ప్రభుత్వంలో స్పందన లేదని తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కార్మిక సంఘాలను ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, జీతం పెంచే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వని కారణంగా ఈనెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించారు. 30వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు జోన్ల చైర్మన్లు బాబా ఫకృద్దీన్, మధుబాబు, సత్యం, శ్రీనివాసులు, రాజేష్బాబు, ఏసుబాబు, జిల్లా కన్వీనర్లు సతీష్కుమార్, మురళీకృష్ణ, ముకుందం, సురేష్, ప్రసాద్, రామ్మూర్తి, సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన కార్మిక జేఏసీ నాయకులు సీడీఎంఏ కార్యాలయం ముట్టడి -
రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు
వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గణేష్ రేపల్లె: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో కుటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ విమర్శించారు. గుళ్లపల్లిలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను పక్కదోవ పట్టిస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి అణగద్రొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తుందన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అదరరు బెదరరు అన్నారు. పార్టీ అధినేత పిలుపు మేరకు ప్రజా సమస్యలపై ప్రజలతో నిత్యం పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. జగన్పై కేసులు రాజకీయ కుట్రపూరితమే రాజకీయ కక్ష సాధింపు, కుట్రలలో భాగంగానే వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. పల్నాడు పర్యటనలో భాగంగా గుంటూరు సమీపంలో ప్రమాదవశాత్తూ సింగయ్య మృతి చెందితే కూటమి ప్రభుత్వం తమ రాజకీయ కక్షకు వాడుకుంటోందన్నారు. ప్రమాదం జరిగిన రోజు సాక్షాత్తూ ఆ జిల్లా ఎస్పీనే ప్రమాదానికి మాజీ సీఎం జగన్ కాన్వాయ్కు సంబంధం లేదని, ప్రైవేటు వాహనం ఢీకొనటంతో సింగయ్య మృతి చెందినట్లు తాము గుర్తించామని బహిరంగంగా ప్రకటించారన్నారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తేవటంతో ఎస్పీ మాట మార్చి జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కుట్రలో భాగంగా జగన్మోహన్రెడ్డికి చెందిన బులెట్ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేయటం తగదన్నారు. ఇప్పటికై నా కూటమి పాలకులు రాజకీయ కక్ష సాధింపులు వీడి ప్రజాసంక్షేమంపై దృష్టి సారించాలని హితవు పలికారు. లేనిపక్షంలో భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
వేటపాలెం: బైపాస్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని వేగంగా వచ్చి ఆటో ఢీ కొట్టిన సంఘటనలో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల దగ్గరలో సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. చీరాల వైపు నుంచి మామిడి కాయల లోడుతో ఆటో ఒంగోలు వైపు వేగంగా వెళుతోంది. సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల వద్ద రోడ్డు దాటుతున్న కొమరగిరి బాబూరావుని ఆటో ఢీ కొట్టింది. బాబూరావు ఎగిరి పక్కన పడ్డాడు. అతనికి కాలుకి తీవ్రగాయాలయ్యాయి. 108కి సమాచారం ఇవ్వగా క్షతగాత్రుని చీరాల ఏరియా వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఆటో ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. -
అమ్మో.. కిలేడీ కిల్లర్స్!
తెనాలి: గతేడాది జూన్లో స్థానిక యడ్ల లింగయ్య కాలనీకి చెందిన రజిని, తనకు పరిచయస్తురాలైన నాగూర్బీని ఆటోలో ఎక్కించుకుని తెనాలి–నారాకోడూరు రోడ్డులోని వడ్లమూడి వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. మార్గమధ్యంలో ఆటో డ్రైవర్తో రజిని బ్రీజర్ కొనిపించింది. అదే కాలనీవాసి వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి బైకుపై వీరిని వెన్నంటి వచ్చింది. ముగ్గురూ నిర్మాన్యుష ప్రదేశానికి వెళ్లారు. అక్కడ బ్రీజర్లో సైనేడ్ కలిపి నాగూర్బీకి ఇచ్చారు. ఆ వెంటనే ఆమె చనిపోయింది. ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకుని రజిని, వెంకటేశ్వరి తాపీగా ఇంటికి వచ్చారు. నాగూర్బీ మృతదేహం వెలుగులోకి రావడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో డ్రైవర్ను గుర్తించి ప్రశ్నించడంతో రజని గురించి చెప్పాడు. ఆమెను తీసుకొచ్చి విచారించాక మరిన్ని సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి. నాగూర్బీ హత్యనే కాదు..రజని, వెంకటేశ్వరితోపాటు ఆమె తల్లి రమణమ్మ కలిసి 2022 నుంచి మరో ముగ్గురిని సైనేడ్తో హత్య చేశారని, వీరి అరెస్టు చూపుతూ జిల్లా ఎస్పీ సతీష్కుమార్ చెప్పారు. అప్పు ఎగ్గొట్టేందుకు హత్య మార్కాపురానికి చెందిన సుబ్బలక్ష్మిని ఆమె ఆస్తి, డబ్బులు, బంగారు ఆభరణాలు కోసం ఇదే తరహాలో మద్యంలో సైనేడ్ కలిపి ఇచ్చి చంపారు. వెంకటేశ్వరికి సుబ్బలక్ష్మి స్వయాన అత్త అవుతుంది. ఆ తర్వాత 2023లో నాగమ్మ అనే మహిళను థమ్సప్లో సైనేడ్ కలిపి హతమార్చారు. ఆమె వద్ద తీసుకున్న రూ.20 వేల అప్పు ఎగ్గొట్టేందుకు చంపేశారు. భార్యతో చేతులు కలిపి హత్యకు పథకం తెనాలికి చెందిన పీసు అలియాస్ మోషే తరుచూ భార్యను వేధిస్తున్నాడు. అతన్ని చంపేందుకు భార్యతో చేతులు కలిపి 2024లో మద్యంలో సైనేడ్ కలిపారు. అతను చనిపోయిన తర్వాత వచ్చే పెన్షన్, ఇన్స్యూరెన్స్ డబ్బులు పంచుకునేందుకు ఆమెతో అగ్రిమెంట్ కుదర్చుకున్నారు. ఈ నాలుగు హత్యలే కాకుండా మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు. చివరిసారి పథకం పారలేదు. అప్పులు ఎగ్గొట్టడం, వారి వద్ద నున్న బంగారు ఆభరణాలు దోచుకోవాలన్న ఉద్దేశంతోనే సైనేడ్ కలిపి హత్యలు చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ వెల్లడించారు. వీరికి సైనేడ్ విక్రయించిన నేరంపై మరొకరిని అరెస్టు చేశారు. ఆడతనానికి మాయని మచ్చ ! ఆభరణాల కోసం హత్యలు చేస్తున్న మహిళలు నాడు సైనేడ్తో నలుగురి హత్య నేడు దాడిచేసి ముగ్గురి హత్య అన్నీ పట్టపగలు.. బెరుకులేని దారుణాలు పోలీసుల అప్రమత్తతతో జైలుపాలు -
సీ మౌత్ను ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి
బాపట్లటౌన్: ఈపురుపాలెం స్ట్రైట్కట్ సీ మౌత్ కాలువను ఆక్రమించిన భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ చేశారు. తీరప్రాంతం ఆక్రమణకు గురైన సీమౌత్ను శుక్రవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శ్రీ భ్రమరా డెవలపర్స్ సారథ్యంలోని ఆలోహ రిసార్ట్స్ కోసం ఇక్కడ సహజ సిద్ధంగా ఎల్ ఆకారంలో ఉన్న సీ మౌత్ ప్రాంతాన్ని సుమారు 15.35 ఎకరాలు పీడబ్ల్యూడీ కాలువ భూమిని మాయం చేశారని ఆరోపించారు. కాలువకు, సముద్రానికి మధ్య హై టైడ్ లైన్ పరిధిలో ఉన్న సహజ సిద్ధమైన ఇసుక దిబ్బలు కూడా పూర్తిగా తొలగించి పెద్దమొత్తంలో ఇసుకను తరలించి సమీపంలోని రొయ్యల చెరువులను పూడ్చారని చెప్పారు. దీంతో మత్స్యకారుల వృత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాదారులతో కుమ్మక్కయ్యారని ఎద్దేవా చేశారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా భూ కబ్జాదారులకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. మండుటెండలో మత్స్యకారులు ఆందోళన చేస్తుంటే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే కనీసం మత్స్యకారులతో మాట్లాడకుండా ఆక్రమణదారులతో మాట్లాడి తిరిగి వెళ్లడంపై మండిపడ్డారు. ఏకంగా సముద్రాన్నే కబ్జా చేస్తుంటే రాష్ట్రంలోని మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరుకు చెందిన ఎమ్మెల్యేకు చెందిన భ్రమరా కంపెనీ ఈ విధమైన ఆక్రమణకు పాల్పడుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దేనికి సంకేతమన్నారు. మత్స్యకారులు ఆందోళనతో ఎంతో కొంత కదిలిన జిల్లా అధికార యంత్రాంగం కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరైనది కాదని హితవు పలికారు. తక్షణమే ఆక్రమణకు గురైనా ఎల్ ఆకారంలో ఉన్న సీ మౌత్ను పూర్తిగా పునరుద్ధరించాలని కోరారు. కాలువను ఆక్రమించిన వారిపై, ఇసుక దిబ్బలు చదును చేసిన వారిపై, వారికి దొంగ పట్టాలు ఇచ్చి సహకరించిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మత్స్యకారులకు అండగా సీపీఎం ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్రా మాలాద్రి, జిల్లా కార్యదర్శి జి.గంగయ్య, నాయకులు ఎన్.బాబూరావు, పి.కొండయ్య, జి.ఏసుబాబు, వాడరేవు మాజీ సర్పంచి ఏరిపిల్లి రమణ, చొక్కా రాంబాబు, పీక్కి డేవిడ్, దోనీ కనకరాజు పాల్గొన్నారు. సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ ఆక్రమణకు గురైన సీమౌత్ను పరిశీలించిన రమాదేవి -
ఆటో ఢీకొని ఒకరికి గాయాలు
కొల్లూరు: ఆటో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనదారుడు తీవ్ర గాయాలబారిన పడిన ఘటన మండలంలోని పెదలంక వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, క్షతగాత్రుడి బంధువుల కథనం మేరకు.. చుండూరుకు చెందిన పడాల సప్తగిరి మండలంలోని సుగ్గునలంకకు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న సప్తగిరి అత్తగారి ఇంట్లో ఉన్న భార్య వద్దకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. మండలంలోని పెదలంక వద్ద ఎదురుగా కనిగిరిలంక వైపు నుంచి వస్తున్న ఆటో సప్తగిరి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోకు సంబంధించిన ఇనుప బద్దె ద్విచక్ర వాహనదారుడి తొడలో నుంచి వెనుక తుంటిపై భాగం నుంచి బయటకు చొచ్చుకువచ్చింది. స్థానికులు వ్యక్తి తొడలోంచి చొచ్చుకు వెళ్లిన ఇనుప బద్దెను తమ వద్ద అందుబాటులో ఉన్న పరికరాలతో కట్ చేసి 108లో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు క్షతగాత్రుడి తొడ ప్రాంతం నుంచి చొచ్చుకొని వెళ్లిన ఇనుప బద్దెను తొలగించారు. శరీరం అంతర్భాగంలో ఉన్న కొని అవయవాలు దెబ్బతిన్నట్లు వైద్యులు సూచించడంతో క్షతగాత్రుని బంధువులు మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగానే ఉన్నట్లు బంధువులు చెప్పారు. తొడలో దిగిన ఇనుప బద్దె తొలగించిన వైద్యులు -
పవర్ లిఫ్టింగ్ ఓవరాల్ చాంపియన్ లక్ష్మి
చీరాల రూరల్: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో సమరోతు లక్ష్మి, ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన లక్ష్మి, గుంటూరు జిల్లా తాడికొండలో డిగ్రీ చదువుతోంది. రాష్ట్ర జట్టు తరఫున కర్ణాటక రాష్ట్రంలో ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొంది. అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 69 కేజీల జూనియర్ బాలికల విభాగంలో ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించింది. స్క్వాడ్లో 177 కేజీలు ఎత్తి ద్వితీయస్థానంలో నిలిచింది. బెంచ్ప్రెస్లో 77.5 కేజీలు, డెడ్లిఫ్ట్లో 155 కేజీలు కలిపి మొత్తం 410 బరువులు అలవోకగా ఎత్తి ఓవరాల్గా మూడో స్థానంలో చాంపియన్గా నిలిచి పతకాలతో పాటు సర్టిఫికెట్లను అందుకుంది. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ అన్నదాత ప్రసాద్, సంఘ అధ్యక్షులతో పాటు సహచరులు ఆమెను అభినందించారు. -
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తప్పనిసరి
జిల్లా ట్రాన్స్ఫోర్ట్ అధికారి కె. పరంధామరెడ్డి బాపట్లటౌన్: పాఠశాలలు, కళాశాలల స్కూల్ బస్సులకు తప్పని సరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని జిల్లా ట్రాన్స్ఫోర్ట్ ఆఫీసర్ కె. పరంధామరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. స్కూల్ పిల్లల విషయంలో అశ్రద్ధ తగదని, ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేయించుకోవాలన్నారు. వాహనాలు రిపేరుకు గురైతే తక్షణమే రిపేర్లు కంప్లీట్ చేయించుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిని డ్రైవర్లుగా నియమించవద్దని సూచించారు. డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అర్హులైన డ్రైవర్లను మాత్రమే బస్సులను నడిపేందుకు అనుమతించాలన్నారు. మద్యం తాగి, సెల్ ఫోన్ నడుపుతూ వాహనాలను నడపవద్దని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడువుతూ తమ తనిఖీలలో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్ర ఆరోగ్య పథకం ఎల్ఏసీ మెంబర్గా గుమ్మడి లక్ష్మీపురం: సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లోకల్ అడ్వైజరీ కమిటీ(ఎల్ఏసీ) సభ్యునిగా గుంటూరుకు చెందిన విశ్రాంత సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్యని నియమిస్తూ సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తరఫున నియమితులైన సీతారామయ్యని శుక్రవారం సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సుజిత్ మల్లిక్ కన్నవారితోటలోని కార్యాలయంలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లిక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సీతారామయ్య కృషి చేయాలని సూచించారు. సీజీహెచ్ఎస్ పరిధిలోకి మరిన్ని ఎంప్యానల్డ్ ఆసుపత్రులను తీసుకురావాలని కోరారు. డిపార్ట్మెంట్కు చేసిన సేవలు అందించిన సీతారామయ్యకు ఈ హోదా దక్కడం శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.విశ్రాంత జీవితంలో సేవ చేసే బాధ్యత ఇచ్చిన సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రోహిణికి సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు. -
పారదర్శకంగా జరపాలి
నెహ్రూనగర్: ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 అర్బన్ లోకల్ బాడీస్లో పనిచేసే సచివాలయ సెక్రటరీలకు బదిలీల కౌన్సెలింగ్ శనివారం, ఆదివారం గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రెండు రోజుల పాటు జరగనుంది. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, రేపల్లే, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, దాచేపల్లి, చిలకలూరిపేట, గురజాల మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీలు, వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్వెంట్ సెక్రటరీలు, వార్డ్ ఎమినిటీ సెక్రటరీలు, వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలు హాజరుకావాలి. ఈ మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఉత్తర్వులు జారీ చేశారు. రూరల్ ప్రాంతంలో కూడా ఈ నెలఖారులోపు నిర్వహించేందుకు అధికారులు కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. వీరికి ప్రాధాన్యత వార్డు సచివాలయ సెక్రటరీల బదిలీల్లో దివ్యాంగులకు, విజువల్లీ చాలెంజ్డ్ సిబ్బందికి, మెడికల్ గ్రౌండ్స్ కింద క్యాన్సర్, హార్ట్ సర్జరీ, కిడ్నీ మార్పిడీ, మానసిక వ్యాధుల కలిగిన పిల్లల తల్లిదండ్రులకు, స్పౌజ్ కేటగిరి వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఐదేళ్లు దాటితే తప్పనిసరిగా బదిలీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్లులోపు సర్వీస్ ఉన్నవారికి రిక్వస్ట్ మీద బదిలీలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. మిగులు సిబ్బందిని ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు వారికి కేటాయించిన సచివాలయంలో పరిధిలోనే విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నారు. అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్బీ)అయితే సొంత వార్డులో పోస్టింగ్ రాదు. రూరల్ ప్రాంతాల్లో అయితే సొంత మండలంలో పోస్టింగ్ కేటాయించకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11082 మంది సెక్రటరీలు గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అర్బన్, రూరల్ కలుపుకుని 1344 సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 11082 మంది సెక్రటరీలు పని చేస్తున్నారు. వీరిలో కొంత మంది సెక్రటరీలు డెప్యూటేషన్పై వెళ్లిన వారు ఉన్నారు. వీరు కూడా కౌన్సెలింగ్కు హాజరై మిగుల ఉద్యోగుల కింద ఉండనున్నారు. వీలైతే డెప్యూటేషన్పై పనిచేసే సెక్రటరీలకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. కార్పొరేటర్ల దందా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న సెక్రటరీలు వేరే సచివాలయానికి బదిలీ కావడానికి ఆయా ప్రాంత కార్పొరేటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల నుంచి సిఫార్సులు లేఖలు ఇప్పిస్తున్నట్లు సమాచారం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో గళ్లా మాధవి, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలో బూర్ల రామాంజనేయులు దగ్గర నుంచి తమకు అనుకూలంగా ఉండే సచివాలయ ఉద్యోగులను పోస్టింగ్ ఇప్పించుకునేందుకు లెటర్లు ఇప్పిస్తున్నారు. దీనికి గానూ ఒక్కో సెక్రటరీ నుంచి రూ.20 నుంచి 25 వేలు దాకా కార్పొరేటర్లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేటి నుంచి సెక్రటరీల బదిలీలకు కౌన్సెలింగ్ నచ్చిన సచివాలయంలో పోస్టింగ్ కోసం ఎమ్మెల్యేల నుంచి సిఫార్సుల లేఖలు లెటర్లు ఇప్పిస్తామంటూ కార్పొరేటర్లు నగదు వసూలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్న సెక్రటరీలు గ్రామ/ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. ఉద్యోగుల సీనియారిటీ/ర్యాంక్ ఆధారంగా కౌన్సెలింగ్ చేపట్టాలి. ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఉన్న ప్రతి ఉద్యోగి పోస్ట్ను ఖాళీగా చూపించాలి. కౌన్సెలింగ్ సమయంలో ఏ ఒక్క ఖాళీ కూడా బ్లాక్ చేయకుండా చూడాలి. బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం. 5, 6లో విధివిధానాలను కచ్చితంగా పాటించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు ఇచ్చే సిపార్సు లేఖల వల్ల ఏ ఒక్క ఉద్యోగి నష్టపోకుండా చూడాలి. – షేక్ అబ్దుల్ రజాక్, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం -
ప్రణమిల్లిన భక్త జనం
అమ్మవారి సారె సమర్పణకు తరలివస్తున్న భక్త బృందాలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మకు భక్తజనం ప్రణమిల్లారు. ఆషాఢ మాసోత్సవాలు, శుక్రవారం నేపఽథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఈవో వి. సుబ్బారావు దంపతులు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి పట్టుచీర, సారెను సమ ర్పించారు. అనంతరం మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ● ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు బృందాలుగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. దీంతో మహా మండపం ఆరో అంతస్తులో పండుగ వాతావరణం నెలకుంది. కిటకిటలాడిన క్యూలైన్లు ఉదయం నుంచే భక్తుల రద్దీ కనిపించింది. మహా మండపం, లిప్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్ రోడ్డులో కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో సర్వ దర్శనం క్యూలైన్తో పాటు రూ. 100, రూ. 300 టికెటు క్యూలైన్లు కిటకిటలాడాయి. సాయంత్రం 4 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించగా, సేవలో పాల్గొనే టికెట్లకు డిమాండ్ కనిపించింది. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివచ్చారు. మౌలిక వసతుల పరిశీలన ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల నేపఽథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను నోడల్ అధికారి టి.చంద్రకుమార్ పరిశీలించారు. ఆయన వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఆలయ అధికారులు ఉన్నారు. -
గంగమ్మ తల్లికి వెండి కవచం బహూకరణ
కారంచేడు: గ్రామ దేవతగా విరాజిల్లుతున్న గంగమ్మ తల్లికి భక్తులు 9 కేజీల వెండి కవచం బహూకరించారు. శుక్రవారం మండల కేంద్రమైన కారంచేడు పుట్టాయిపాలెంలో కొలువైన గంగమ్మకి గ్రామానికి చెందిన ఒక భక్తుని కుటుంబం మొత్తం 9 కేజీల వెండితో తయారు చేసిన కవచాన్ని కమిటీ సభ్యులకు అందించింది. వెండి కవచం, కిరీటాన్ని అమ్మవారికి ఆలయ అర్చకులు ఆవుల రాజేష్ ధరింపజేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సీ మౌత్ అభివృద్ధికి రూ. 2 కోట్లు బాపట్ల టౌన్: అడవి పంచాయతీ ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు రూ. 2 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి చెప్పారు. శుక్రవారం కాలువను ఆయన పరిశీలించి, మాట్లాడుతూ వివాదానికి కారణమైన భూమిపై కమిటీ ఏర్పాటు చేశామన్నారు. సీ మౌత్ కాలువ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా పూడిక వెలికి తీసే పనులు త్వరలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సీ మౌత్ తీర ప్రాంతంలో జెట్టి నిర్మాణం చేపడతామని తెలిపారు. దీంతో మత్స్యకారులు పడవలు నిలపడానికి సులువుగా ఉంటుందన్నారు. ఆరు నెలల్లో అభివృద్ది పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, తహసీల్దార్ సలీమా పాల్గొన్నారు. బాపట్లలో ఆక్రమణల తొలగింపు బాపట్ల టౌన్: తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న తమ షాపులను ఎందుకు కూల్చుతున్నారంటూ మున్సిపల్ అధికారులను దుకాణ యజమానులు నిలదీశారు. రోడ్డుపైకి షాపులు కట్టి... డ్రైనేజీలను ఆక్రమించిన వారి నిర్మాణాలను వదిలిపెట్టి తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. శుక్రవారం పట్ణణంలోని త్రవ్వకాలువ నుంచి చీలురోడ్డు వరకు షాపులను జేసీబీలతో మున్సిపల్ అధికారులు తొలగించే కార్యక్రమం చేపట్టారు. ముందు మున్సిపల్ కాంప్లెక్స్లోని ఆక్రమణలు తొలగించిన తర్వాతే తమ దగ్గరకు రావాలని దుకాణ యజమానులు ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపల్ అధికారులు తాత్కాలికంగా తొలగింపు పనులు నిలుపుదల చేశారు. సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెండి నాగపడగ మోపిదేవి: శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యే శ్వర స్వామికి దర్శికి చెందిన యారాశి శ్రీకాంత్ రెడ్డి, చంద్రిక కుటుంబ సభ్యులు వెండి నాగపడగను శుక్రవారం సమర్పించారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారు.. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణకు 550 గ్రాముల బరువున్న సుమారు రూ. 60 వేలతో చేయించిన నాగపడగను స్వామివారి కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. నేడు పానకాల స్వామి గుడిలో సహస్ర దీపాలంకరణ మగళగిరి: మంగళాద్రిలోని శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం(పానకాల స్వామి)లో శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈవో సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకోవాలన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. -
టెండర్లలో తిరకాసు
బాపట్లసాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 514.30 అడుగుల వద్ద ఉంది. ఇది 139.0872 టీఎంసీలకు సమానం. అమ్మవారికి బోనాలు పిడుగురాళ్ల: ఆషాఢ మాసం నేపథ్యంలో పట్టణ భవానీనగర్లోని శ్రీ కనకదుర్గ దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి మహిళా భక్తులు బోనాలు సమర్పించారు. రాజధాని రైతులపై ‘పూలింగ్’ పిడుగు సి‘ఫార్సు’ల బది‘లీలలు’ ముగిసిన సదరం క్యాంప్ తెనాలి అర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ శుక్రవారంతో ముగిసింది. శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు: రూసా 2.0 కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రూ. 10కోట్లతో హబ్ సెంటర్, రూ. 4 కోట్లతో ఎకామిడేషన్ బ్లాక్ ఫర్ ఎంప్లాయిబిలిటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ భవనం నిర్మాణాలకు టెండర్లు ఆహ్వానిస్తూ ఈ ఏడాది మే 2న విజయవాడకు చెందిన ఏపీఈడబ్ల్యూఐడీసీ (ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) వేర్వేరుగా ప్రకటనలు జారీ చేసింది. నిర్మాణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలు, ఆసక్తి ఉన్న సంస్థలు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేశాయి. రూ. 10కోట్లతో భవన నిర్మాణానికి ఏడు, రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. గడువు కూడా మే 30తో ముగిసింది. ఒకే సంస్థ టెండర్ ఆమోదం టెండర్లను వెంటనే తెరవాల్సి ఉన్నా 20 రోజుల వరకు ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు తాత్సారం చేశారు. తెరిచిన తర్వాత రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించే భవనానికి దాఖలు చేసిన ఆరు సంస్థల బిడ్లను తిరస్కరించారు. ఒక సంస్థకు మాత్రమే అర్హత ఉన్నట్లుగా పేర్కొన్నారు. రూ. 4 కోట్లతో నిర్మించే భవనానికి దాఖలైన నాలుగు బిడ్లలో మూడింటిని తిరస్కరించారు. ఒక బిడ్కు అర్హత ఉన్నట్లు తేల్చారు. విచిత్రమేమంటే రెండు భవనాల నిర్మాణానికి ఒకే సంస్థ దాఖలు చేసిన బిడ్కు అర్హత ఉన్నట్లుగా పొందు పరిచారు. మిగితా వారందరికీ అర్హత ఉన్నా ఎందుకు తిరస్కరించారనేది అం తుచిక్కని విషయం. ఈ అంశాన్ని బయటకు కూడా వెల్లడించడం లేదు. ఏపీఈడబ్ల్యూఐడీసీ చీఫ్ ఇంజనీర్ కూడా ఫోన్లు ఎత్తడం లేదని, ఒకవేళ ఎత్తినా విషయం అడగగానే కట్ చేస్తున్నట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహించే శాఖలో, ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న పనుల టెండర్లలో అక్రమాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. విస్తుపోతున్న కాంట్రాక్టర్లు రూ.10కోట్లతో నిర్మించే భవనాల కోసం జరిగే టెండర్ల ప్రక్రియలో సాధారణంగా అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్న సంస్థలే బిడ్లు దాఖలు చేస్తాయి. ఒక వేళ పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రమాణాలు లేకపోతే ఒకటి, రెండు సంస్థలు తిరస్కారానికి గురవుతాయి. కానీ ఏడు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే ఆరు తిరస్కారానికి గురవ్వడంపై కాంట్రాక్టర్లు విస్తుపోతున్నారు. మరో భవన నిర్మాణానికి నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేస్తే, మూడు తిరస్కారానికి గురవ్వడం నిర్మాణ రంగంలో నైపుణ్యం ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 7న్యూస్రీల్నచ్చిన వారికి కట్టబెట్టేందుకే.. తమకు నచ్చిన వారికి కట్టబెట్టేందుకే ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమతో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులకు చెందిన సంస్థలకే నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. పేరుకు నిబంధనల, ప్రక్రియ ప్రకారం అంతా చేపట్టామని చెప్పుకునేందుకు టెండర్లు ఆహ్వానించారని విమర్శిస్తున్నారు. నిర్మాణ పనులకు టెండర్లు ఆహ్వానించిన ఏపీఈడబ్ల్యూఐడీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వంగానీ, నిధులు వెచ్చిస్తున్న యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విభాగం, ఉన్నతాధికారులు చోద్యం చూడటం తగదని పేర్కొంటున్నారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. విద్యలకు నిలయమైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇటీవల పిలిచిన టెండర్ల వ్యహారంలో పెద్దఎత్తున గోల్మాల్ జరిగింది. సొమ్మొకరిది.. పెత్తనమొకరిది అన్నట్లుగా టెండర్లను పర్యవేక్షిస్తున్న ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు వ్యవహరించారు. అస్మదీయులుకు కోట్ల రూపాయల పనులను కట్టబెట్టేందుకు నిబంధనలను కాలరాశారు. నిర్మా ణ రంగంలో అపార అనుభవం, అన్ని అర్హతలున్న కాంట్రాక్టర్లను పక్కన బెట్టారు. యూనివర్సిటీ, ప్రభుత్వ నిధులతో చేపడుతున్న పనులపై ఏపీఈడబ్ల్యూఐడీసీ పెత్తనంపై కాంట్రాక్టర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక పెద్దఎత్తున చేతులు తడిపినట్లు ఆరోపిస్తున్నారు. ఏఎన్యూలో నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు అన్ని అర్హతలూ ఉన్న కాంట్రాక్టర్ల దరఖాస్తులు తిరస్కారం నచ్చినవారికి కట్టబెట్టేందుకే నాటకం కాంట్రాక్టర్ల మండిపాటు చిన్నబాబు ఇలాకాలో ఇష్టారాజ్యం ఏపీఈడబ్ల్యూఐడీసీ తీరుపై తీవ్ర విమర్శలు -
హత్యాయత్నం కేసులో ఆరుగురికి జైలు శిక్ష
అద్దంకి: ఇద్దరు వ్యక్తులపై ఆరుగురు హత్యాయత్నం చేసిన కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో జడ్జి ఒక్కొక్కరికి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.17 వేల చొప్పున జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించినట్లు సంతమాగులూరు ఎస్సై పట్టాభి తెలిపారు. కేసు వివరాలు.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రు గ్రామానికి చెందిన బొమ్మినేని కృష్ణయ్యతో నిందితులు జడ వెంకటేశ్వర్లు, జడ వీరాంజనేయులు, జడ వెంకట్రావు, జడ శ్రీనివాసరావు, జడ గోపి, కొనికి యోగయ్యలకు పాత గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో 2020 నవంబర్ 11న కృష్ణయ్య, ఆయన బాబాయి వీరాస్వామి కొమ్మాలపాడు వెళ్లి పని అయిన తర్వాత తిరిగి కుందుర్తికి బయలుదేరారు. కొమ్మాలపాడు ఎన్ఎస్పీ కెనాల్ వద్ద నిందితులు కాపు కాచి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. కృష్ణయ్య కాలు, వీరాస్వామికి చెయ్యి విరిగాయి. తీవ్ర గాయాలైన వారిని 108 అంబులెన్స్లో హాస్పిటల్కు తరిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అప్పట్లో ఈ ఘటనపై సంతమాగులూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి.శివన్నారాయణ హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులకు 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.17 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం అద్దంకి కోర్టు న్యాయమూర్తి డి. నాగ వెంకటలక్ష్మి తీర్పు వెలువరించారు. -
రైతుల్లో వ్యతిరేకత
సాక్షి ప్రతినిధి, గుంటూరు / తాడికొండ: రాజధాని పరిసర ప్రాంత అన్నదాతల నెత్తిన మళ్లి భూ సమీకరణ పిడుగు పడనుంది. రెండు రోజుల కిందట కేబినెట్ భేటీలో మరో 43వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి అవసరమంటూ సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెదవి విరుస్తున్న రైతులు ప్రస్తుతం సమీకరించిన 33 వేల ఎకరాల భూమి గడచిన 12 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి చెందలేదని, వారికే న్యాయం జరగనప్పుడు తాము భూ ములు ఇస్తే ఏం చేస్తారంటూ రైతులు పెదవి విరిస్తున్నారు. రాజధానిలో గతంలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఇంత వరకు పూర్తి కాలేదు. మళ్లీ భూసమీకరణ అంటే ఎలా ? అని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సమీకరణ సమయంలో ఇచ్చిన ఒప్పందాలు కూడా ప్రభుత్వం అమలు చేయలేదు. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల ప్రక్రియలో భాగంగా అభివృద్ధి చేసిన లే–అవుట్లను అందజేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాని ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు.. దానికి రోడ్లు, ఇళ్ల స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. త్యాగం చేసిన రైతులకు నష్టం ప్రైవేటు సంస్థలకు భూములు కట్టబెట్టడం మినహా భూములిచ్చి త్యాగం చేసిన రైతులకు గత 12 ఏళ్లల్లో ఒరిగిందేమీ లేదు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో రానున్న నాలుగేళ్లలో సమీకరణ ప్రక్రియ పూర్తి కాదని, ఒకవేళ భూములిస్తే తరువాత తమ సంగతేంటనేది ఆ ప్రాంత రైతుల నుంచి వస్తున్న ప్రశ్న. రైతుల్లో పలు సందేహాలు ఇటీవల తాడికొండ మండలంలో నిర్వహించిన గ్రామసభల్లో స్థానిక రైతులు పలు సందేహాలు లేవనెత్తారు. ఒక వేళ పూలింగ్కు తీసుకుంటే కౌలు రూ. 40 నుంచి రూ.50వేలు ఇవ్వాలని కొంత మంది కోరారు. మరికొంత మంది అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో భూ సమీకరణ జరుగుతున్నప్పుడు చిన్న గ్రామాలు తొలగిస్తే తమ సంగతేంటని ప్రశ్నించారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి గ్రామాలు తొలగించమని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ రైతులు నమ్మడం లేదు. తమ గ్రామాలు తొలగించేందుకు కుట్ర జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇవ్వమని కరాఖండిగా చెబుతున్న రైతులు ముందు 33వేల ఎకరాల్లో అభివృద్ధి చేసి చూపించిన తరువాత తాము పూలింగ్కు సహకరిస్తామని, ఇప్పుడికిప్పుడు తమ భూములు వదులుకోబోమని కరాఖండిగా రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే వ్యతిరేకించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా వర్గాలకు చెందిన వారి భూములు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్న నేపథ్యంలో పూలింగ్ ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వారే ప్రస్తావిస్తుండటం గమనార్హం. పరిధి విస్తరణ పేరుతో 43వేల ఎకరాల సమీకరణ భూముల రేట్లు అధికంగా ఉండటంతో ఇచ్చేందుకు రైతుల విముఖత అవసరాల మేరకే తీసుకోవాలంటూ సీఎంని కోరిన అధికార పార్టీ నేతలు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో తమ భూములకు గండికొట్ట వద్దంటున్న రైతులు రెండు గ్రామాలు కాలగర్భంలో కలిసిపోతాయని భయపడుతున్న గ్రామస్తులు తాడికొండ మండలానికి చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు ఇటీవల పొన్నెకల్లు గ్రామంలో జరిగిన పీ –4 సదస్సుకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. అందులో రైల్వే లైనులు, అంతర్గత రహదారుల వరకు భూ సమీకరణ చేస్తే తమకు అభ్యంతరం లేదని, అన్ని పొలాలు పూలింగ్కు ఇవ్వాలంటే సుముఖంగా లేమంటూ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అనుకున్నదే తడవుగా భూ సమీకరణ పేరుతో నిర్ణయం తీసుకుని మంత్రివర్గ భేటీలో ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు తీకున్న నిర్ణయంపై రైతులు బహిరంగంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రస్తుతం పూలింగ్కు తీసుకున్న భూములకు ధరలు తగ్గి, తీవ్రంగా నష్టపోతామంటూ గతంలో పూలింగ్కు ఇచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిన చందాన తమ పరిస్థితి మారిందని వాపోతున్నారు. తరతరాలుగా ఉన్న పంట భూములను ప్రభుత్వం తీసుకునేందుకు చేస్తున్న కుట్రలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని నిర్మాణానికి 33వేల ఎకరాలు చాలని గతంలో ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు అంతర్జాతీయ వినామాశ్రయం పేరుతో తమ పొట్ట గొడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని ప్రాంతంలోనే ఎక్కువ
మంగళగిరి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. ఒక్క ఈ స్టేషన్ పరిధిలోనే గత సంవత్సరం ఆగస్టులో 231.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడంతోపాటు ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 234.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 38 మందిని అరెస్ట్ చేశారు. దీంతోపాటు మెత్, ఎండీఎంఏ 23 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మూడు కేసులు నమోదు చేయడంతోపాటు 17 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సుమారు వంద కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 20 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరో వైపు అధిక ధర పెట్టి మద్యం కొనుగోలు చేయలేక చాలా మంది పేదలు, రోజువారీ కూలీలు తక్కువ ధరకు లభించే శానిటైజర్ను మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసి మత్తులో తేలుతున్నారు. ఆయా షాపుల్లో ఇలాంటివి విక్రయించడంపై నిబంధనలు కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది. -
మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనలో భాగస్వాములు కావాలి
రేపల్లె: మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని ఆర్డీవో నేలపు రామలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలను సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మాదక ద్రవ్యాలతో కుటుంబాలు నాశనమవ్వటంతోపాటు సమాజం పెడద్రోవ పడుతోందన్నారు. మాదక ద్రవ్యాలతో కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు మాదక ద్రవ్యాలపై అవగాహన ఉండి వీటికి దూరంగా ఉండాలన్నారు. సమాజంలో తోటి వారికి వీటిపై అవగాహన కల్పించాలని కోరారు. ఏబీఆర్ డిగ్రీ కళాశాల నుంచి రింగు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, సీఐలు సురేష్బాబు, మల్లికార్జునరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, ఇన్చార్జి ఎంపీడీవో ప్రసాద్, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, వివిధ కళాశాలల, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీవో రామలక్ష్మి -
బతుకే చిత్తు
ముంచెత్తే మత్తు.. కూటమి పాలనలో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు విద్యార్థులే లక్ష్యంగా... ● కళాశాలల యువతే లక్ష్యంగా అమ్మకాలు ● శివారు ప్రాంతాలలో జోరుగా సాగుతున్న దందా ● ఏడాదిలోనే 300 కేజీల గంజాయి స్వాధీనం ● కట్టడిలో పూర్తిగా విఫలమైన కూటమి సర్కార్ శివారు ప్రాంతాలలో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి నుంచి నగరంలోకి సిగరెట్స్, చాకెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో తీసుకొస్తున్నారు. కళాశాలలు, పాఠశాలల వద్ద విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. కేజీ గంజాయి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. అదే విధంగా గ్రాము చొప్పున క్రిస్టల్ను రూ.8 వేలు నుంచి రూ.10 వేలు, మెత్ను రూ.5 వేలు నుంచి రూ.6 వేలు, ఎండీఎంఏను రూ.3 వేలు నుంచి రూ. 5 వేల వరకు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు మాదకద్రవ్యాలు చేరుతున్నాయి. నెహ్రూనగర్ : రాజధాని ప్రాంతమైన గుంటూరు జిల్లాలో గంజాయి, కొకై న్, మెత్, ఎండీఎం వంటి మాదకద్రవ్యాల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. విశాఖపట్నం, పాడేరు, అరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జిల్లాకు గంజాయి భారీగా సరఫరా అవుతోంది. ముఖ్యంగా యువతే లక్ష్యంగా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. -
వైద్యులకు క్రీడలతో ఉపశమనం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): వృత్తిపరంగా పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు వైద్యులు నిత్యం క్రీడా సాధన చేయాలని డాక్టర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (డీఎస్సీవో) కార్యదర్శి డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. గురువారం స్థానిక గుంటూరు మెడికల్ అసోసియేషన్ భవన సముదాయంలో నిర్వహించిన క్యారమ్స్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పని ఒత్తిడిని అధిగమించడంతోపాటు ఆటవిడుపు కోసం ప్రతి ఏడాది వైద్యుల కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు భాగంగా క్యారమ్స్తోపాటు క్రికెట్, చెస్, కల్చరల్ విభాగాల్లో పోటీలు కొనసాగుతాయని చెప్పారు. సుమారు 50 మంది పేరొందిన వైద్యులు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో డీఎస్సీవో అధ్యక్షుడు డాక్టర్ టి.సి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్యారమ్స్ పోటీలకు ఏపీ క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ రిఫరీగా వ్యవహరించారు. -
‘దారి తప్పుతున్న కూటమి ఏడాది పాలన’ పుస్తకావిష్కరణ
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్లో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన ‘దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన’ అనే పుస్తకాన్ని గురువారం ఆయన ఆవిష్కరించారు. విజయ్కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత గ్యాస్ నగదు పడక ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. తల్లికి వందనం మొదటి సంవత్సరం డబ్బులు వేయకుండా రెండవ సంవత్సరం వేశారని, అయినా కరెంటు బిల్లులు, కార్లు అని అనేక మందికి నగదు వేయలేదన్నారు. అంగన్వాడీలు, స్కీం వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులనే పేరుతో వారికి కూడా నగదు వేయకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వంలో స్మార్ట్మీటర్లు పెడితే పగలగొట్టమని నారా లోకేష్ పిలుపునిచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇళ్లకు కూడా స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చి మోడల్ స్కూల్ పేరుతో 3,4,5 తరగతులను విడదీసి దూరంగా ఉన్న హైస్కూళ్లకు విలీనం చేయడంతో ఉన్న స్కూల్లో పిల్లల సంఖ్య తగ్గిపోయిందని, ఆ స్కూల్ను కూడా మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అనుముల లక్ష్మీశ్వర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ధరణికోట విమల, పెండ్యాల మహేష్, గుంటూరు మల్లేశ్వరి, గుంటుపల్లి బాలకృష్ణ, నాయకులు ఎం.హరిపోతురాజు, గుంటుపల్లి రజని, స్పందన, జడ రాజకుమార్, షేక్ మస్తాన్ వలి, తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ
మార్టూరు: దేశంలో ఐదు దశాబ్దాల క్రిందటి ఎమర్జెన్సీలో ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, మేధావులు తదితర అన్ని రంగాలకు చెందిన వారు సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు మోదీ పాలనలో అంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో గంగయ్య మాట్లాడారు. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి మేధావులు, ఉద్యోగులు, ప్రజల హక్కులు కాలరాశారన్నారు. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించి.. అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం, సీబీఐ, ఈడీ, తదితర రాజ్యాంగ వ్యవస్థలను నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తన గుప్పెట్లో పెట్టుకున్నారని తెలిపారు. దీనివలన రైతులు, కార్మికులు, ప్రజల హక్కులకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉండగా సంస్కరణల బాట పట్టించాల్సింది పోయి వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు పాదాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మతం ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న విధానాలను పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఏకతాటిపై నిలిచి ఎదురుకోవాలని లేకుంటే గత ఎమర్జెన్సీ పాలన మించిన గడ్డు పరిస్థితులను ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు బత్తుల హనుమంతరావు, విశ్రాంత ఉద్యోగులు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అప్రకటిత ఎమర్జెన్సీ కోరల్లో ప్రజాస్వామ్యం
మచిలీపట్నంటౌన్: దేశంలో 50 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ పోకడల కారణంగా ఎమర్జెన్సీ విధిస్తే నేడు దేశంలో ప్రధాని మోదీ నియంతృత్వ పోకడలతో అప్రకటిత ఎమ ర్జెన్సీ రూపంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు ఆందో ళన వ్యక్తం చేశారు. బుట్టాయిపేటలోని మహాత్మ జ్యోతిబాపూలే విజ్ఞానకేంద్రంలో గురువారం ‘ఎమర్జెన్సీ నాడు–నేడు’పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్మణరావు మాట్లాడుతూ.. నాడు ఇందిరాగాంధీ తనకు ఎదురులేదని నిరూపించుకోవడానికి ఎమర్జెన్సీ విధిస్తే, నేడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల్లో హిందువులు, ముస్లింలు పాతిపదికన విభజన తీసుకురావడానికి నిరంకుశ విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజలను చైతన్య పరుస్తున్న గౌరీ లంకేష్, నరేంద్ర దంబుల్కర్ గోవింద పనసరే తదితరులను ఆర్ఎస్ఎస్ ముష్కరులు చంపేశారని ఆందో ళన వ్యక్తంచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రొఫెసర్ సాయిబాబాకు కోర్టు లో బెయిల్ ఇచ్చినా కేంద్ర రక్షణ శాఖ మంత్రి అమిత్షా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అత్యవసరంగా సమావేశ పరిచి బెయిల్ రద్దు చేయించి ఆయన జైలులో మగ్గిపోయేలా చేశారన్నారు. కార్పొరేట్ ప్రయోజనాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలకు పాల్పడుతోందన్నారు.మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు