Bapatla
-
జాతీయ క్రికెట్ జట్టుకు నాగండ్ల యువకుడు
ఇంకొల్లు(చినగంజాం): అంతర్జాతీయ స్థాయిలో నేపాల్లో నిర్వహించనున్న క్రికెట్ పోటీలకు బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన గాలి సంతోష్ ఎంపికయ్యాడు. ఇంటర్నేషనల్ ఇండో నేపాల్ టీ 20 చాంపియన్ షిప్ అండర్ 19 విభాగంలో ఎంపిక చేసినట్లు ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్ డవలప్మెంట్ ట్రస్ట్ అసోసియేషన్ ధ్రువీకరణ పత్రాన్ని అధికారికంగా పంపించినట్లు సంతోష్ తెలిపారు. మే 26 నుండి 31 వ తేదీ వరకు ఇండియా జట్టు తరపున పోటీలలో బాట్స్మన్, ఆల్రౌండర్ అయిన సంతోష్ పాల్గొనున్నట్లు తెలిపారు. సంతోష్ ఇంకొల్లు డీసీఎంఆర్ కాలేజీ విద్యనభ్యసిస్తుండగా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో పాటు నాగండ్ల గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు. నీరసించిపోతున్న నిమ్మ రైతులు ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి తెనాలి: ప్రకృతితో పాటు మార్కెట్ మాయాజాలంతో నిమ్మ రైతులు నీరసించిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసాంబిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్లో శనివారం నిమ్మతోటలు సాగుచేస్తున్న రైతులు, కౌలు రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత నవంబరు, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మంచు కారణంగా చెట్లకు పూత, కాయ రాలిపోయి దిగుబడి తగ్గిందని పలువురు రైతులు వెల్లడించారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.20 లక్షలతో కౌలుకు తీసుకున్నామని రైతులు చెప్పారు. మార్కెట్లో రెండు రోజులు ధర బాగుంటే అయిదురోజులు ధరలు తగ్గిపోతున్నాయని మరికొందరు తెలిపారు. నిమ్మకాయల యార్డులో 10 శాతం కమీషన్, ధర్మం వగైరాలను అరికట్టాల్సిన ఆవశ్యకతను తమ దృష్టికి తీసుకొచ్చినట్టు సాంబిరెడ్డి తెలిపారు. నిమ్మ రైతులు నీరసించిపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
సారా జోలికి వస్తే జిల్లా బహిష్కరణ
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ బాపట్లటౌన్: నాటుసారా తయారుచేసినా..విక్రయించినా అలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదుచేసి వారిని జిల్లా బహిష్కరణ చేస్తామని ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయ హెచ్చరించారు. శనివారం మండలంలోని వెదుళ్లపల్లి, బేతపూడి గ్రామాల్లో నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహించారు. కె.విజయ మాట్లాడుతూ పదేపదే నాటుసారా తయారుచేస్తూ పట్టుబడిన వారిని ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా బహిష్కరణ చేసేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. నాటుసారా తయారీకి ముడి సరుకు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ప్రకాశం ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎ.జనార్ధనరావు, బాపట్ల ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, బాపట్ల ఎకై ్సజ్ సీఐ పి.గీతిక, ఎస్ఐలు ప్రభుదాస్, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
మామూళ్ల మత్తులో రెవెన్యూ
పర్చూరు(చినగంజాం): పర్చూరు మండలంలో రెవెన్యూ శాఖ అధికారుల అవినీతి లీలలు తారాస్థాయికి చేరాయి. ప్రజల నుంచి లంచాలు ముక్కు పిండి వసూలు చేయటంలోను, రేషన్ డీలర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేయడంలోనూ రెవెన్యూ శాఖ ముందు వరుసలో ఉందనే విమర్శలు వినవస్తున్నాయి. మామూళ్ల దెబ్బకు డీలర్లు విలవిల పర్చూరు మండలంలో రేషన్ డీలర్ల నుంచి రెవెన్యూ అధికారులు నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. మామూళ్ల పర్వం స్టాక్ గోడౌన్ నుంచి మొదలై డీలర్ వద్ద వసూలుతో ముగుస్తుందని ఆరోపణలున్నాయి. మామూలుగా అయితే డీలర్కు అందాల్సిన బియ్యం బస్తా బరువు 50.6 కిలోలు ఉండాల్సి ఉంది. కానీ గోడౌన్లో మూడు కిలోల కోత పెట్టి 47.6 కిలోలు మాత్రమే డీలర్కు చేరుస్తున్నారు. పర్చూరు మండలంలో మొత్తం 50 రేషన్ షాపులు ఉన్నాయి. ఒక్కో రేషన్ షాపునకు సరాసరి 40 క్వింటాళ్ల బియ్యం అవసరం ఉంటుంది. అంటే ఒక్కొక్క రేషన్ షాపునకు 240 కిలోల చొప్పున 50 రేషన్ షాపులకు వెరసి 12 క్విటాళ్లు బియ్యం గోడౌన్లోనే ఉండి పోతుంది. వాటిని కిలో రూ.15 చొప్పున విక్రయించగా వచ్చే రూ.1.80 లక్షలను అధికారులే పంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇది కాకుండా ఆర్ఐ నుంచి తహసీల్దార్ వరకు ఫుడ్ ఇనన్స్పెక్టర్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డీటీ వరకు క్వింటాలుకు రూ.15 చొప్పున అదనంగా చెల్లించాల్సిన పని ఉంది. దీని ప్రకారం చూస్తే రేషన్ దుకాణాల ద్వారా రెవెన్యూ అధికారులకు ప్రతి నెలా రూ.2 లక్షలు పైనే మామూళ్లు రూపంలో అందుతున్నట్లు సమాచారం. ఇవి కాక మధ్యమధ్యలో ఆర్డీఓ, ఇతర అధికారులు వచ్చిపోయే ఖర్చులను కూడా డీలర్లే భరాయించాలి. ఇది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ డీటీ అప్పుడప్పుడు తనిఖీలకు వెళ్లి అధిలేదు, ఇది లేదు అని చిందులు వేసినప్పుడల్లా అతనికి రెండు, మూడు వేలు సమర్పించుకోవాల్సి వస్తుంది. లేదంటే కేసు నమోదు చేస్తారు. మామూళ్లు వసూలు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడా తాము పట్టుబడకుండా రెవెన్యూ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పనులంటేనే ప్రజలు జంకుతున్నారు. ఒక్కొక్క పనికి ఒక్కొక్క రేటు పెట్టి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మామూళ్లు ఇస్తే సరేసరి లేదంటే సదరు వ్యక్తులు కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి, మ్యుటేషన్కు ఒక రేటు, పాసుపుస్తకాలకు ఒక రేటు, పట్టా ఇస్తే ఒక రేటు, స్థలం చూపిస్తే ఒక రేటు, స్థలాన్ని సర్వే చేస్తే మరో రేటు, అసలు స్థలం దగ్గరకు వస్తే మరో రేటు ఇలా రేట్లు పెట్టుకొని తమ ఉద్యోగాలను వెలగబెడుతున్నారు. మరలా ఎండలో వస్తే వాహనం ఏర్పాటు చేయాలి, కూల్డ్రింక్లను అందించాలి, కొత్త అల్లుడిని చూసుకున్న విధంగా చూసుకోవాలి లేదంటే నీ పనిలో కోత పడినట్లే. రేషన్ డీలర్ల నుంచి నెలవారీ మామూళ్లు నెలకు రూ.2 లక్షలు పైగా వసూలు పాస్ పుస్తకాలు, మ్యుటేషన్ పనులకు ఒక్కొక్క ధర కార్యాలయానికి వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు పర్చూరు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది లీలలు సమగ్ర విచారణకు డిమాండ్ రెవెన్యూ శాఖలో జరుగుతున్న ఈ అవినీతి ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టాలని లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మామూళ్ల కోసం, లంచాల కోసం చేయి చాచి ప్రజలను ఇబ్బంది పెడుతున్న అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా సత్వరం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయంలో పనులంటేనే జంకుతున్న ప్రజలు -
రేషన్ బియ్యం కొనుగోలును ప్రశ్నించిన డీలర్పై దాడి
నిందితులపై కేసు నమోదు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ కొల్లూరు: రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోళ్లు చేపడుతుండటాన్ని నిలదీసి ప్రశ్నించిన రేషన్ డీలర్, సీపీఎం నాయకుడుపై దాడి చేసిన సంఘటన మండలంలోని చింతర్లంకలో చోటుచేసుకుంది. బాధితుడు, సీపీఎం నాయకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని చింతర్లంకలో రేషన్ డీలర్గా పనిచేస్తున్న తోడేటి సురేష్ శుక్రవారం ఉప్పు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అదే గ్రామంలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తుండటంపై ప్రశ్నించడంతో ఇరువురు నడుమ వాగ్వివాదం చోటుచేసుకంది. ఘర్షణ తీవ్రతరం అవడంతో సురేష్పై బియ్యం కొనుగోలు చేస్తున్న ఉప్పు వెంకటేశ్వర్లు అతని కుమారులు దాడికి పాల్పడ్డారు. దాడిలో గాయపడిన సురేష్ను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న సురేష్ను శనివారం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, మండల కార్యదర్శి వేములపల్లి వెంకటరామయ్యలు పరామర్శించారు. దాడి జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యం కొనుగోళ్లపై ప్రశ్నించినందుకు దాడి చేయడం దారుణమైన విషయమన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై తక్షణం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మండలంలో అనేక గ్రామాలలో రేషన్ బియ్యాన్ని కొనుగోళ్లు చేస్తున్న వారిపై మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
బాపట్ల విద్యార్థుల హవా
బాపట్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో బాపట్ల జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. జిల్లాలో మొదటి సంవత్సరంలో మొత్తం 9146 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారిలో 5907 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో జిల్లా 65 శాతం సాధించింది. సీనియర్ ఇంటర్లో జిల్లాలో మొత్తం 7420 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 5837 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణతలో జిల్లా 79 శాతం సాధించింది. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ ఫలితాలు జిల్లాలో మొత్తం 17 ప్రభుత్వ కళాశాలలు ఉండగా ఫలితాల్లో ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాపట్ల డెప్ అండ్ డెమ్ జూనియర్ కళాశాల, నూతలపాడు జూనియర్ కళాశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచాయి. 73.33 శాతం సాధించి బల్లికురవ ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. ● సీనియర్ ఇంటర్లో బాపట్ల డెఫ్ అండ్ డెమ్ జూనియర్ కళాశాల, బల్లికురవ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచాయి. చందోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల 79.71 శాతం సాధించి ద్వితీయస్థానంలో నిలిచింది. బాలికలదేపై చేయి ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించే వారిలో విద్యార్థినులే పైచేయి సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల పర్చూరుకు చెందిన షేక్ సమీరా 1000 మార్కులకుగానూ 975 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. ● బైపీసీలో చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన కె.ధాత్రిశ్రీ 1000 మార్కులకుగానూ 975 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. సీనియర్ ఇంటర్లో 79 శాతం ఉత్తీర్ణత జూనియర్ ఇంటర్లో 65 శాతం ఉత్తీర్ణత సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 975 మార్కులతో ప్రథమస్థానం సీనియర్ ఇంటర్ బైపీసీలో 975 మార్కులతో ప్రధమస్థానం -
విజయకీలాద్రిపై శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం
తాడేపల్లిరూరల్: సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో ఉదయం 9 గంటలకు సకల విద్యాప్రాప్తికై హయగ్రీవ హోమం, అర్చన, ఆశీర్వచనం కార్యక్రమాలు నిర్వహించామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. -
కృష్ణా జిల్లా ఎడ్లు ముందంజ
పర్చూరు(చినగంజాం): బాపట్ల జిల్లా ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జోరుగా సాగుతున్నాయి. గ్రామంలోని వెంకటేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి వార్ల తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థాయి పోలురాధ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. క్వింటాన్నర ఇసుక బస్తాలతో కూడిన చక్రాలు తిరగని ఎజ్ల బండిని పది నిమిషాల్లో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. పందాల్లో గెలిచిన ఎడ్ల జతలకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు బహుమతులుంటాయని వివరించారు. పోటీలలో రెండవ రోజు జూనియర్స్ విభాగంలో 18 ఎడ్ల జతలు పోటీలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. -
జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
తహసీల్దార్కు వినతిపత్రాన్ని అందించిన జర్నలిస్టులు చీరాలటౌన్: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం....ప్రజలకు అండగా నిలుస్తున్న నాలుగో స్తంభమైన మీడియాపై, పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెట్టడం దుర్మార్గం...పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లిస్తున్న కారకులను కఠినంగా శిక్షించాలి....జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనుంజయ్రెడ్డి, పల్నాడుకు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తు చీరాల ప్రాంత జర్నలిస్టులు, మీడియా సోదరులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కె.గోపీకృష్ణకు వినతిపత్రాన్ని అందించారు. జర్నలిస్టు ప్రతినిధులు మాట్లాడుతూ సమాజంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా రంగంపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడంతోపాటుగా వార్తలు రాసిన, ప్రచురించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. కీలకమైన మీడియా రంగంపై ఆంక్షలు విధించడంతో పాటుగా అక్రమంగా కేసులు నమోదు చేసి భయబ్రాంతులకు గురయ్యేలా చేయడం దారుణమన్నారు. పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనను ప్రజలకు తెలియజేసిన జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ వ్యవహార శైలికి నిదర్శమన్నారు. జర్నలిస్టులపై అక్రమంగా కేసులను ఎత్తివేయడంతో పాటుగా పాత్రికేయులను ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమాలు, ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్ మాట్లాడుతూ చీరాల జర్నలిస్టులు అదించిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారులకు అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో చీరాల ప్రాంతంలోని జర్నలిస్టులు కె.మురళి, కె.వాసుబాబు, బి.గురునాధం, ఎస్వీ కృష్ణారెడ్డి, ఎన్.రమేష్, కె.వాసు, ఎస్.స్వామినాఽథ్, జి.గోపి, రాజేష్, రత్నం తదితరులు ఉన్నారు. అద్దంకిలో... అద్దంకి: పల్నాడు జిల్లాలో సాక్షిలో ప్రచురితమైన వార్తకు సంబంధించి సాక్షి ఎడిటర్ ధనుజయ్రెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్ట్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే బాపట్ల జిల్లా అధ్యక్షుడు చెన్నుపాటి రాంబాబు డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రింట్,అ ండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్లు స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ సుబ్బరాజుకు వినితి పత్రం అందజేశారు. రాంబాబు మాట్లాడుతూ వార్తలు ప్రచురించిన సందర్భంగా కేసులు పెట్టడం అన్యామన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వైవీ రామిరెడ్డి, ఏ సోమ శ్రీనివాసరావు, రావుట్ల శ్రీనివాసరావు, నాగూర్వలి, కొండలరావు, సర్దార్ ఖాన్, నరిశెట్టి నాగేశ్వరరావు, అనీల్, శివప్రసాద్, వలేటి శ్రీనివాసరావు, సింగయ్య, దుర్గారావు, శ్యామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కోన
బాపట్ల : వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోన్రెడ్డి ఆదేశాల మేరకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి అవకాశం దక్కింది. రాష్ట్రవ్యాప్తంగా 33 మందిని పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో అవకాశం కల్పించగా బాపట్ల జిల్లా నుంచి కోన రఘుపతికి అవకాశం లభించింది. ఈమేరకు కోన రఘుపతికి పలువురు అభినందనలు తెలిపారు. శింగరకొండపై శంఖు చక్ర నామాలు ఏర్పాటు అద్దంకి: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండపైనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆవరణలో నూతనంగా శంఖు, చక్ర, నామాలు, ఆంజనేయస్వామి విగ్రహాలను సిమెంట్తోఏర్పాటుచేశారు. వీటిని పట్టణానికి చెందిన నాగసూరి రామారావు తన సొంత నిధులతో ఏర్పాటు చేయించారు. శనివారం ఆ విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాలతోపాటు, సుదర్శన యాగం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది దాతలు పాల్గొన్నారు. నృసింహుని ఆలయానికి పోటెత్తిన భక్తులు మంగళగిరిటౌన్ : మంగళగిరిలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శనివారం భక్తులు పోటెత్తారు. చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామిని దర్శించేందుకు క్యూలో బారులుదీరారు. నృసింహుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. తొలుత ఆలయ ధ్వజ స్తంభం వద్ద దీపాలు వెలిగించి, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
వైఎస్సార్ నాటక కళా పరిషత్ పోటీలు ప్రారంభం
తెనాలి: పట్టణానికి చెందిన డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీలు శనివారం రాత్రి ఘనంగా ఆరంభమయ్యాయి. స్థానిక రామలింగేశ్వరపేట లోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రారంభ సభకు పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షత వహించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ తన తండ్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)తో సన్నిహితంగా ఉంటూ, తాను పార్టీలో చేరిన దగ్గర నుంచి అండగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే శివకుమార్ నేతృత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ జాతీయస్థాయి నాటికల పోటీల నిర్వహణను అభినందించారు. తెనాలి వెలుపల మహనీయుల విగ్రహాలను చూశానని తెలిపారు. కళా, సాహిత్య, సాంస్కృతికరంగాల్లో తెనాలి వైభవాన్ని స్ఫురణకు తెచ్చేలా నాటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. సోష ల్ మీడియా, ఓటీటీల ట్రెండింగ్లో కళలకు ప్రాధాన్యత తగ్గిందన్నారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో వివిధ రంగాల ప్రముఖులకు డాక్టర్ వైఎస్ పేరిట అవార్డులు ఇచ్చి గౌరవించినట్టు గుర్తుచేశారు. సభాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడు తూ కళల తెనాలి వారసుడిగా తాను నాటక కళను ప్రోత్సహిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ ప్రదాత డాక్టర్ రాజశేఖరరెడ్డి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ను రాజకీయపార్టీల దృష్టితో చూడటం సమంజసం కాదని, వారి పేరుతో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ఆదరించాలని సూచించారు. పట్టణ రజక సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ యువనేత పెసర్లంక రమణను ఇదే వేదికపై డాక్టర్ వైఎస్ స్మారక పురస్కారంతో సత్కరించారు. కొల్లిపర శ్రీ కళా నిలయం కార్యదర్శి బొమ్మారెడ్డి ప్రభాకరరెడ్డి, వంగా లక్ష్మారెడ్డి, కఠారి హరీష్, అక్కిదాసు కిరణ్, సిరికృష్ణ మాట్లాడారు. ప్రత్యేక అతిథిగా అన్నాబత్తుని సత్యనారాయణ హాజరయ్యారు. తొలుత నృత్య గురువు వసంతదుర్గ శిష్య బృందం కూచిపూడి, జానపద నృత్యాలను ప్రదర్శించారు. తెనాలి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని నిర్వాహకులు ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు. జాతీయస్థాయి చతుర్థ ఆహ్వాన నాటికల పోటీలు జ్యోతి ప్రజ్వలన చేసిన వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి.అవినాష్ పెసర్లంక రమణకు వైఎస్సార్ స్మారక పురస్కారం ప్రదానం -
పెళ్లీడుకొచ్చిన పిల్లలను వదిలేసి.. ఇదేం పాడు పని నారాయణ
బాపట్ల టౌన్ : అతడికి 64 ఏళ్లు. ఆమెకు 54. ఇద్దరికీ వేర్వేరు కుటుంబాలున్నాయి. పెళ్లీడుకొచ్చిన సంతానం ఉన్నారు. ఆర్థికంగా స్థిరపడినవారే. పిల్లలు ఉన్నత విద్యావంతులు. అయినా వారి వల్లమాలిన వివాహేతర సంబంధం ప్రాణాల మీదకు తెచ్చింది. ఆ పెద్దాయన తన మాట వినలేదనే ఆవేశంలో ఆమె అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ ఘటన బాపట్లలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు...రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తులాబందుల లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వేస్టేషన్ ఎదుట ఐఆర్సీటీసీ సెంటర్ నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన నల్లమోతు మాధవితో కొన్నేళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఇదిలాఉండగా లక్ష్మీనారాయణ భార్య అరుణాదేవి కళ్ళకు ఆపరేషన్ చేయించే నిమిత్తం హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను వెళ్ళటానికి వీల్లేదంటూ అడ్డగించింది. కుటుంబ సభ్యులతో కలిసి అరుణాదేవిని పంపించాలంటూ హెచ్చరించింది. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో శుక్రవారం ఉదయం తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ముందు తనపై పోసుకొని ఆ తర్వాత లక్ష్మీనారాయణపై పోసి నిప్పంటించింది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఐఆర్సీటీసీ బుకింగ్ కౌంటర్ నుంచి పొగలు రావడంతో స్థానికులు మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. అప్పటికే మాధవి 80 శాతం, లక్ష్మీనారాయణ 60 శాతం కాలిపోయారు. వెంటనే స్థానికులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బాపట్ల సీనియర్ సివిల్జడ్జి పరామర్శించి వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇరువురినీ గుంటూరు తరలించారు. ఘటనపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. pic.twitter.com/cwB2QDewFD— Kumaruuu💙 (@CalmnessSoull) April 11, 2025 -
హైలెస్సా..హైలెస్సాకు విరామం
చీరాల: సముద్ర తీర ప్రాంతాల్లో నిత్యం వినిపించే హైలెస్సా... హైలెస్సా... అనే మాటలు... మత్స్యకారుల సందడి... సముద్రంలో బోట్లు ఇకపై కనిపించవు. సముద్రం బోసిగా దర్శనమివ్వబోతోంది. ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెలల పాటు వేటపై నిషేధాజ్ఞలు జారీ చేయడమే అందుకు కారణం. వేట తప్ప మరో పని తెలియని మత్స్యకారులకు ఈ రెండు నెలలు కష్ట కాలమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేట నిషేధ కాలంలో ఒక్కొక్క మత్స్యకారునికి నెలకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకుంది. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత వేట నిషేధ సాయం నిలిపివేసింది. గతేడాది ఇవ్వాల్సిన మత్య్సకార వేట నిషేధ సాయం నేటికీ అందించలేదు. గంగపుత్రులపై చంద్రబాబు కపటప్రేమ ఒలకబోస్తున్నారని మత్య్సకారులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే తీరంలో వారంరోజుల పాటు వేట చేసినా మత్య్ససంపద సరిగ్గా దొరక్కపోవడంతో నానా కష్టాలు అనునభవిస్తున్నారు. మత్య్సకారులకు ఈ వేట నిషేధం పెద్ద సమస్యను తలపిస్తుంది. జిల్లాలోని చీరాల, పర్చూరు, బాపట్ల, రేపల్లె, అద్దంకి, వేమూరు నియోజకవర్గాల్లో మత్స్యకార జనాభా 53,000 మంది ఉన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే వారు 16,500 మంది. అధికారులు ఇప్పటివరకు సర్వే చేసిన సమాచారం మేరకు ఈ ఏడాది 12,350 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వేట నిషేధ సమయంలో 18 వేలకు పైగానే మత్స్యకారులు ఇంటి వద్ద ఉంటూ వలలకు మరమ్మతులు చేసుకుంటుంటారు. 15 నుంచి అమలు ఈనెల 15 నుంచి జూన్ 15 తేదీ వరకు సముద్రంలో చేపల వేట నిలుపుదల చేస్తున్నట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ప్రతి ఏటా ఈ సమయంలో సముద్రంలో చేపలు పునరుత్పత్తి జరుగుతుంది. దీంతో సముద్రంలో పూర్తిగా వేటను నిలుపుదల చేస్తుంటారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 2019 నుంచి 2023 జూన్ వరకు వేట నిషేధ సాయం ఒక్కొక్క మత్య్సకారుడికి రూ.10వేలు సాయం అందించారు. 2024 జూన్లో ఇవ్వాల్సిన నిషేధ సాయం నేటికి ఇవ్వకపోవడంతో మత్య్సకారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత వేట నిషేధంలో చంద్రబాబు సర్కారు కనికరించిద్దో....లేదో వేచి చూడాలి మరీ. ఒక్కొక్క మత్య్సకారుడికి రూ.20,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మళ్లీ రీసర్వే అంటూ మెలిక పెట్టింది. మత్స్యకారులు వేటకు వెళ్లని సమయాల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వేట నిషేధంలో మత్య్సకారులకు వేట నిషేధం సాయం ఇవ్వలేదు. వేట తప్ప మరే ఇతర పనులు తెలియని మత్య్సకారులు ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ఇచ్చే నిషేద సాయం జీవనభృతి త్వరగా అందించాలని మత్య్సకారులు వేడుకుంటున్నారు. రెండున్నర నెలల పాటు సముద్రంలో వేట నిషేధం నెలకు రూ.10వేలు ఇచ్చి ఆదుకున్న జగన్ సాయంపై నోరు మెదపని చంద్రబాబు ఆందోళనలో మత్స్యకారులు జీవనభృతిని త్వరగా అందించాలి మత్య్సకారులకు గతసంవత్సరం వేట నిషేధంలో అందించని జీవన భృతి ఏడాదికి రూ.20,000 పాలకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి రెండేళ్లకు కలిపి ఒక్కో మత్య్సకారుడికి రూ.40 వేలు ఇస్తేనే మేము బతకగలం. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబునాయుడు మత్య్సకార సాయం త్వరగా అందించి మత్య్సకారులను ఆదుకోవాలి. అలానే మత్య్సకారులకు రావాల్సిన ఇతర పధకాలకు నిధులు మంజూరు చేయాలి. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలి. –ఎస్.నూకాలు, వాడరేవు కుటుంబ పోషణ కష్టంగా సాధారణంగా వాడరేవు మత్స్యకారులు కృష్ణా జిల్లా మచిలీపట్నం, నెల్లూరు జిల్లా రామయ్యపట్నం వరకు వేటకు వెళ్లి గురకా, పాములు, బొంత, కూనాము, వంజరం, పండుగప్పలు లాంటి చేపలను పట్టుకొస్తుంటారు. కానీ నేడు సముద్రంలో వేట ప్రస్తుతం ఆశాజనకంగా లేకపోవడం వలన మత్స్యకారులు తమ బోట్లను చిన్న జెట్టీ వద్ద, వలలను తీరం ఒడ్డున నిలుపుదల చేస్తున్నారు. వేటలేక నిషేద సమయం ఆసన్నమవ్వడంతో మత్య్సకారులు కుటుంబ పోషణ కోసం అవస్ధలు పడుతున్నారు. మత్య్సకారుల అభివృద్దికి ప్రభుత్వం చేయాతనందిస్తున్నామని పాలకులు మాటల్లో చెబుతున్నారే తప్ప చేతల్లో చూపించడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నివేశన స్థలం కబ్జాకు కూటమి నేత పథకం
రెవెన్యూ, పోలీస్ అధికారుల ఓవరాక్షన్ బల్లికురవ: మండలంలోని రామాంజనేయ పురం గ్రామంలో దళితులకు సంబంధించిన నివేశన స్తలాన్ని గ్రామ కూటమి నేత కబ్జా చేసేందుకు పథకం వేసుకున్నాడు. ఈ పథకానికి రెవెన్యూ, పోలీస్ అధికారులు సహకారం అందించటంతో శుక్రవారం రాత్రి రాళ్లు వేసేందుకు ప్రయత్నించాడు. స్థల యజమాని బైటు చిన్నామ్మాయి ఈ స్థలం అనాధ పిల్లలకు సంబంధించిందని, అనాధలకు అన్యాయం చేస్తారా అని అధికారుల ముందు వాపోయింది. ఈ స్థలం విషయమై అనాధ పిల్లలకే చెందాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులకు విన్నవించినా కూటమి నేతలకే మద్దతు ఇస్తున్నారని వాపోయింది. దళితులమైన తాము వైఎస్సార్సీపీకి ఓటు వేశామన్న అక్కసుతోనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితురాలు వాపోయింది. జెడ్పీ పీఎఫ్ ఖాతాలను అప్డేట్ చేయాలి గుంటూరుఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల వేతనా ల్లో నుంచి మినహాయిస్తున్న నిధులు సకాలంలో జెడ్పీ పీఎఫ్ ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసుకు ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలోని సీఈవో చాంబర్లో జ్యోతిబసును కలిసి ఎస్టీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. సీఈవోను కలసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్లు కమతం ఉన్నారు. -
వైఎస్సార్ సీపీ జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడుగా జాష్ రత్నాకర్ నియామకం
రేపల్లె రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా ఇంటెలెక్చువల్ ఫోరం జిల్లా అధ్యక్షుడుగా రేపల్లెకు చెందిన కర్రా జాష్ రత్నాకర్ నియమితులయ్యారు. రత్నాకర్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. రత్నాకర్కు నియోజకవర్గంలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. రత్నాకర్ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎన్ఓ ఉన్నత పాఠశాలకు వాచ్మన్ నియామకం కారంచేడు: కారంచేడు గ్రామంలో 1956వ సంవత్సరం నుంచి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించిన యార్లగడ్డ నాయుడమ్మ ఓరిఎంటల్ (కం) ఉన్నత పాఠశాల పునః ప్రారంభానికి సిద్ధమయ్యింది. దీనిలో భాగంగా పాఠశాలకు వాచ్మన్ నియామక ఉత్తర్వులను ఒంగోలు డీఈఓ ఏ కిరణ్కుమార్ విడుదల చేశారు. గతంలో ఇదే పాఠశాలలో విధులు నిర్వహించిన టీ ఏడుకొండలును పాఠశాల మూతపడటంతో ప్రకాశం జిల్లా మైనంపాడు ఉన్నత పాఠశాలకు బదిలీ చేశారు. ఇప్పుడు మరలా పాఠశాల పునఃప్రారంభానికి సిద్ధమవ్వడంతో మొదటగా వాచ్మన్ నియామం చేపట్టడంతో గ్రామస్తుల్లో పాఠశాల పునః ప్రారంభంపై నమ్మకం ఏర్పడింది. ఇక నుండి పాఠశాలలో విద్యార్థులు చేరడానికి అడ్మిషన్లు ప్రారంభిస్తారు. ఆపై అవసరమైన ఉపాధ్యాయుల నియామకాలు కూడా చేపడతారు.కారంచేడు గ్రామంలో ఉన్నత పాఠశాల పునః ప్రారంభం కానుండటంతో మంచి రోజులు వస్తున్నాయని గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. భూమిలో పోషకాలు పెంపొందించుకోవాలి భట్టిప్రోలు (కొల్లూరు): భూమిలో సారం పెంచుకొని పోషక విలువలు పెంపొందిచుకోవడంపై రైతులు దృష్టి సారించాలని ప్రకృతి వ్యవసాయ విభాగం డీపీఎంయు వాణిశ్రీ అన్నారు. శుక్రవారం మండలంలోని ఐలవరంలో ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ 27 రకాల విత్తనాలను కలుపుకొని భూమిలో చల్లుకోవడం ద్వారా భూమికి బలాన్ని అందించే పోషకాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో భాగంగా పీఎండీఎస్ విత్తనాలను కిట్లను సిద్ధం చేసి రైతులకు అందజేశారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ నీలం ప్రకాష్కుమార్, అడిషనల్ డీపీ మోహన్, ఎన్ఎఫ్ఏ వర్ధనమ్మ, యూనిట్ ఇన్చార్జి ఐసీఆర్. పీస్ పాల్గొన్నారు. -
ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు
పర్చూరు(చినగంజాం): ఉప్పుటూరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. తిరునాళ్లను పురస్కరించుకొని గ్రామంలో రాష్ట్ర స్థాయి పోలురాదా ఎడ్ల బలప్రదర్శన నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇసుక బస్తాలతో ఉన్న చక్రాలు తిరగని ఎడ్ల బండిని నిర్ణీత సమయంలో ఎక్కువ దూరం లాగిన ఎడ్ల జతను విజేతగా ప్రకటిస్తారు. విజయం సాధించిన ఎడ్ల జతలకు వరుసగా రూ 50 వేలు, రూ 40 వేలు, రూ 30 వేలు, రూ 20 వేలు బహుమతులుంటాయని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామని తెలిపారు. మొదటి రోజు సీనియర్స్ విభాగంలో తొమ్మిది ఎడ్ల జతలు పోటీ పడుతున్నాయని తెలిపారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలకు ఎటువంటి ఆటంకాలు కలుగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
కలంపై కక్షకు నిరసన
సాక్షి ప్రతినిధి,బాపట్ల: కలంపై కూటమి సర్కార్ కక్షగట్టి అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు, ప్రజాసంఘాలు కార్యక్రమాలు నిర్వహించాయియి. ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. పాత్రికేయులపై కేసులు పెట్టి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తను టీడీపీ వారు హత్యచేసిన విషయాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డితోపాటు ఆరుగురు పాత్రికేయులపై ప్రభుత్వం కేసులు పెట్టించడాన్ని నిరసిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పాత్రికేయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్లలో పాత్రికేయులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తక్షణం సాక్షి పాత్రికేయులపై పెట్టిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెంకట మురళికి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోనూ పాత్రికేయులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాత్రికేయులు బి.రమణారెడ్డి, ఆర్.ధనరాజ్, కె.ఉమా మహేశ్వరరావు, యు. శ్రీనివాసరావు, ఎ.కోటేశ్వరరావు, బొట్టు కృష్ణ, సాల్మన్రాజు, నారాయణ, కాశిం తదితరులు పాల్గొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి, మరికొందరు పాత్రికేయులపై అక్రమ కేసులు నిరసనగా ఆందోళనకు దిగిన పాత్రికేయులు బాపట్లతోపాటు జిల్లా వ్యాప్తంగా నిరసనలు తక్షణం కేసు ఉపసంహరించుకోవాలని డిమాండ్ అధికారులకు వినతులు సర్కార్ తీరుపై మండిపడుతున్న ప్రజాస్వామ్య వాదులు -
బల్లికురవ ఎస్ఐని సస్పెండ్ చేయాలి
అద్దంకి రూరల్: పక్షపాత ధోరణితో టీడీపీకి కొమ్ముకాస్తున్న బల్లికురవ ఎస్సై నాగరాజును సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చినహనిమిరెడ్డి శుక్రవారం డిమాండ్ చేశారు. బల్లికురవ మండలంలోని ప్రజలంతా ఐకమత్యంగా, కులమతాలకు, పార్టీలకతీతంగా నిర్వహించుకునే ఈర్ల గంగమ్మ తిరునాళ్లలో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ వారికి ప్రభలు కట్టుకునేందుకు అనుమతి ఇవ్వకపోవటం ఎస్సై పక్షపాత ధోరణికి నిదర్శనమన్నారు. తిరునాళ్లకు కాని, దేవాలయం వైపు కాని వైఎస్సార్ సీపీ నాయకులు రాకుండా చేస్తానని చెప్పటం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా టీడీపీ వారికి తిరునాళ్లలో ప్రభలు కట్టేందుకు అనుమతులు ఇచ్చారన్నారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న కూటమి నాయకులు ప్రజల్లోని వెళ్లే ధైర్యం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కుటుంబంపై సోషల్ మీడియాలో నీచంగా మాట్లాడించటం చంద్రబాబునాయుడు నైతికంగా దిగజారడన్నారు. ప్రశాంతంగా ఉండే బల్లికురవ మండలంలో గత వారం ప్రభలు కట్టేందుకు అప్పటి ఎస్సై జీవీ చౌదరి అనుమతులు ఇస్తే కొత్తగా వచ్చిన ఎస్సై అనుమతులు వైఎస్సార్సీపీ ఇవ్వకపోవటం ఏమిటన్నారు. ప్రశాంతంగా ఉండే అద్దంకి నియోజకవర్గంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న నాగరాజు లాంటి ఎస్సైని ఉన్నతాధికారులు కల్పించుకుని సస్పెండ్ చేయాలన్నారు. వైఎస్సార్సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి పానెం చినహనిమిరెడ్డి -
బొబ్బర్లంక ఎస్టీ కాలనీ కుటుంబాలను ఆదుకోవాలి
రేపల్లె రూరల్: వెట్టిచాకిరికి గురైన బొబ్బర్లంక ఎస్టీ కాలనీ కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, కూలీలను క్రయవిక్రయాలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం, కేవీపీఎస్, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు, ఎస్టీ కాలనీవాసులు శుక్రవారం ఆర్డీఓ నేలపు రామలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సంఘాల నాయకులు మాట్లాడుతూ అమ్మకాలు, కొనుగోలు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మణిలాల్, అగస్టీన్, నాంచారమ్మ, ఆశీర్వాదం, డానియేలు తదితరులు పాల్గొన్నారు. -
బాలికావిద్యకు ప్రోత్సాహం
బల్లికురవ: ప్రభుత్వం బాలికావిద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ప్రతి ఒక్కరూ చదువుకుని విద్యావంతులు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం బల్లికురవలోని కెజీబీవి సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు కేజీబీవికి రూ.3.23 కోట్లతో 12 వసతి గదులు మంజూరుకాగా భూమిపూజతో శిలాఫలకాలు ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెజీబీవీలో వసతి గదుల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు ప్రభుత్వం కేటాయించిందని 6 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బల్లికురవలో జరిగిన ప్రజాఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు. వ్యవసాయశాఖ ద్వారా సబ్సిడీపై యంత్ర పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం నిజాంపట్నం: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులపాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధించినట్లు మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సాయిసందీప్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సముద్రంలో వివిధ చేపలు, రొయ్యల జాతుల సంతాన ఉత్పత్తి జరుగుతున్న సమయంలో ప్రభుత్వం ప్రతి ఏటా 61 రోజులపాటు వేట నిషేధం అమల్లోకి తెస్తుందన్నారు. ఈ సమయంలో రొయ్య, చేప జాతులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తికి దోహదపడే సమయమన్నారు. వేట నిషేధ సమయంలో మండలంలోని మత్స్యకారులు సముద్రంపై వేటకు వెళ్లరాదని తెలియజేశారు. నిషేధాన్ని ఉల్లంఘించి వేటకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం ఆర్టీసీ ఈడీ చెంగల్రెడ్డి అద్దంకి రూరల్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని ఆర్టీసీ ఈడీ చెంగల్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ డిపోను సందర్శించారు. డిపో ఆవరణను పరిశీలించారు. గ్యారేజ్లోని కార్మికులతో మాట్లాడారు. బస్సులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కండక్టర్లు, డ్రైవర్లు విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎం, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఈనెల 13, 14 తేదీల్లో విజయవాడలో జరగనున్న ఏపీ స్టేట్ సాఫ్ట్ టెన్నిస్ పోటీలకు ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులు వీఎస్ఎస్ లలిత్, ఎస్.చరణ్ కుమార్, వి.హర్షిణి ఎంపికయ్యారని టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ ఆధారంగా వీరిని ఎంపిక చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర పోటీల్లోనూ పతకాలు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మిర్చి యార్డుకు వరుస సెలవులు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు శనివారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. శని, ఆదివారాలు యార్డుకు సాధారణ సెలవులు, సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంత్యుత్సవం పురస్కరించుకుని మిర్చి యార్డుకు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్టు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెలవు రోజుల్లో రైతులు తమ సరుకును యార్డుకు తీసుకురావద్దని కోరారు. సోమవారం అర్ధరాత్రి నుంచి రైతుల సరుకును యార్డులోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. మంగళవారం యథావిధిగా యార్డులో క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఆమె వివరించారు. -
రుణాల రికవరీలో చినగంజాం ప్రథమ స్థానం
చినగంజాం: 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేసి నూరు శాతం రికవరీ చేపట్టిన డీఆర్డీఏ చినగంజాం శాఖకు జిల్లాలో ప్రథమ స్థానం దక్కినట్లు ఏపీఎం జీ పెద సుబ్బారావు తెలిపారు. శుక్రవారం బాపట్లలో డీఆర్డీఏ పీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో చినగంజాం శాఖకు ప్రశంసా పత్రాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఆర్థిక సంవత్సరంలో రూ.7 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.9.56 కోట్లు లక్ష్యాన్ని పూర్తిచేసి నూరు శాతం రికవరీలు సాధించినందుకు తమకు జిల్లాలో ప్రథమంగా గుర్తించి ప్రశంసాపత్రం అందజేసినట్లు ఆయన వివరించారు. జిల్లా ప్రథమంగా చినగంజాం శాఖ గుర్తింపు పొందడం పట్ల ఏరియా కో ఆర్డినేటర్ లక్ష్మణాచారి, శ్రీనిధి మేనేజర్ కరుణాకర్లు చినగంజాం టీంని అభినందించినట్లు తెలిపారు. -
బోటింగ్ షికార్తో మినీ గోవాగా మారే అవకాశం
బాపట్ల జిల్లాలోని రామాపురం, సూర్యలంక తీరాల్లో బోటింగ్ జూలై నుంచి బోటింగ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బోట్ షికారు అమల్లోకి వస్తే చీరాల, బాపట్ల తీరాలకు పర్యాటకులు పోటెత్తుతారు. జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం సముద్ర తీరప్రాంతాలకు ఏపీలో చాలా జిల్లాలతోపాటుగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధికంగా వస్తారు. కార్తీక మాసంలో అధికంగా పర్యాటకులు వస్తుంటారు. అంతేగాక సినిమా షూటింగ్లకు చీరాల తీరం బాగా అనుకూలం, సినీ తారలకు నచ్చేలా రిసార్టులు, ప్రొడ్యూసర్లకు ఖర్చు తక్కువలో సినిమా చిత్రీకరణ చేసేలా మంచి లోకేషన్లు కూడా ఉన్నాయి. బోటింగ్ కూడా అందుబాటులోకి వస్తే మినీ గోవాగా రూపాంతరం చెందుతుంది. -
పూలే జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి
బాపట్లటౌన్: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేసిన జ్యోతిరావుపూలే జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని బాపట్ల ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని కాపు కల్యాణ మండపంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత చీలురోడ్డు సెంటర్లోని జ్యోతిరావుపూలే విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే వివక్ష, అంటరానితనంపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. విజయవాడ నుంచి గూడూరు వరకు రూ.రెండు వేల కోట్లతో నాలుగో వరుస రైల్వేలైన్, రేపల్లె–తెనాలి మధ్య రెండో రైల్వే లైన్ మంజూరు అయ్యిందన్నారు. గుంటూరు నుంచి నిజాంపట్నం వరకు రూ.1200 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే మంజూరైందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి రూ.97.52 కోట్లు నిధులు వచ్చాయన్నారు. రూ.29 కోట్లతో బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్వో జి గంగాధర్ గౌడ్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన్రెడ్డి, బీసీ నాయకులు శంకరరావు, జయప్రకాష్ నారాయణ, వీరరాఘవయ్య, జి శ్రీనివాసరావు, కె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ -
శనివారం శ్రీ 12 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
చీరాల: బాపట్ల జిల్లాలో తీరం మణిహారంగా మారనుంది. జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాలలోని రామాపురం బీచ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. జూలై చివరకల్లా ఈ రెండు బీచ్ల్లో బోటింగ్ షికారుకు ప్రైవేటు భాగస్వామ్యంతో క్లబ్లు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకట మురళి వెల్లడించారు. దీంతో ఈ రెండు బీచ్లు అబ్ధివృద్ధి చెందితే మినీ గోవాగా మారనున్నాయి. ఇప్పటికే వాడరేవు నుంచి కఠారిపాలెం వరకు ఉన్న తీరప్రాంత రోడ్డు డబుల్ రోడ్డుగా విస్తరిస్తున్నారు. ఈ రెండు బీచ్ల్లో సుమారు 50కి పైగా రిసార్ట్లు ఉన్నాయి. సీఆర్జడ్ నిబంధనలను పరిగణలోకి తీసుకుని తీరప్రాంతాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో పర్యావరణానికి ఎలాంటి హానీ, కాలుష్యం లేని ప్రాంతంగా ఈ రెండు బీచ్లను ప్రాథమికంగా గుర్తించారు. ఇప్పటికే ఇరవై మంది శాస్త్రవేత్తలు ఈ రెండు బీచ్ల్లో పర్యటించి అధ్యయనం చేశారు. పరిశుభ్రమైన ప్రాంతంగా జిల్లాలో ఈ రెండు బీచ్లే ఉన్నాయన్నారు. రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. చీరాల కేంద్రంగా జీడిపప్పు ఉత్పత్తి అధికంగా ఉన్నందున విక్రయాలు, ఉత్పత్తులను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాటిచెట్లు ఆధారంగా ఉత్పత్తులు పెంచేలా కల్లుగీత కార్మికులకు, బోటింగ్ షికారు జరిగేలా మత్య్సకారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. చీరాలలో అధికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తుల పెంపు, ప్రదర్శన, అమ్మకాల కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. వాడరేవు వద్ద రెవెన్యూ అసోసియేషన్కు చెందిన ఒక ఎకరం భూమిని ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి ఈ భూమిని లీజుకు ఇవ్వడానికి పరిశీలన జరుగుతున్నాయన్నారు. పేరలి కెనాల్ బోటింగ్కు అనుకూల ప్రాంతంగా గుర్తించారు. అత్యవసరమైన అభివృద్ధి పనులకు గాను రూ.1.13 కోట్లు నిధులు కేటాయించారు. న్యూస్రీల్ సూర్యలంక, రామాపురం బీచ్ల్లో బోటింగ్ క్లబ్లు ఏర్పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధికి ప్రణాళికలు రెండు బీచ్లపై అధ్యయనాలు పూర్తి -
వాడరేవు–పిడుగురాళ్ల రోడ్డుతో పెరగనున్న పర్యాటకులు
వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి ఏర్పాటుకు ఆమోదం తెలపడంతోపాటుగా రూ.667 కోట్ల నిధులను కూడా విడుదల చేయించారు. ఈ రోడ్డు వాడరేవు నుంచి పర్చూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మీదుగా నకరికల్లు అడ్డరోడ్డు వరకు 81.5 కిమీ మేర వెడల్పు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వాడరేవు–పిడుగురాళ్ల వరకు 47 కిలోమీటర్లు వరకు నాలుగులైన్ల జాతీయ రహదారిగా నిర్మాణాన్ని చేస్తున్నారు. 2025 డిసెంబర్ నాటికి ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చేలా అధికారులు, ప్రభుత్వం పనులను ముమ్మరంగా చేయిస్తుంది. ఈ రఽహదారి నిర్మాణంలో 37 కిలోమీటర్లు రోడ్డు బాపట్ల జిల్లా పరిధిలోనే ఉండటంతో జిల్లాకే తలమానికంగా మారనుంది. హైవే నిర్మాణం పూర్తయి వినియోగంలోకి వస్తే జిల్లాకే మణిహారంలాగా ఉంటుందన్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం హైద్రాబాద్కు తక్కువ సమయంలో చేరుకోవడంతో పాటుగా తీరప్రాంతాలకు పర్యాటకులు అధికంగా వస్తారు. -
వక్ఫ్ సవరణపై భగ్గుమన్న ముస్లింలు
బాపట్లటౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని అంజుమన్ కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రహీం జానీ తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం బాపట్ల అంజుమన్ ఏ ఇస్లామియా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది ముస్లిం సోదరులు నల్లబ్యాడ్జీలు ధరించి పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు ఫ్లకార్డులు చేబూని నినాదాలు చేశారు. నినాదాలతో బాపట్ల హోరెత్తింది. ముస్లిం సోదరులుకు సంఘీభావంగా బాపట్లలోని వివిధ రాజకీయపార్టీల నాయకులు, లౌకికవాదులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు. తొలుత పాత బస్టాండ్ వద్ద గల అంజుమన్ ఇస్లామియా మసీదు నుండి బయలుదేరిన ర్యాలీ చీలు రోడ్డు, పాత బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం కార్యాలయానికి చేరుకుంది. అంబేడ్కర్ సర్కిల్లో ముస్లిం సోదరులు మానవహారంగా ఏర్పడ్డారు. అబ్దుల్ రహీం జానీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ముస్లింల హక్కులను కాలరాసేందుకు అనేక నల్ల చట్టాలు చేస్తుందన్నారు. దేశంలో అనేక సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ముస్లింలపై కక్ష కట్టి నిరంకుశ పాలన కొనసాగిస్తుందన్నారు. అంజుమన్ కమిటీ కార్యదర్శి అబ్దుల్ కరీం మాట్లాడుతూ వక్ఫ్ అంటే ముస్లిం సోదరులు తమకు ఉన్న సంపదలో అల్లా పేరిట దానం చేసే ఆస్తి అన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ముస్లిం సోదరులకు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయన్నారు. వక్ఫ్ బోర్డులో అన్యమతస్తులను భాగస్వామ్యాన్ని కల్పించడం సమంజసం కాదన్నారు. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముస్లింలు, క్రైస్తవుల హక్కులకు భంగం కలిగిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దురాగతాలపై సమిష్టిగా పోరాడి వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ గంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ చట్టానికి తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. సమాజ్వాద్ పార్టీ జిల్లా ఇన్చార్జి గొర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఖాలీలుల్లా ఖాన్, జబీబుల్లా, సీపీఎం పట్టణ నాయకుడు కే శరత్, సీపీఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ, బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి రాజారావు, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా దివ్యాంగుల అధ్యక్షులు చల్లా రామయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్ పాల్గొన్నారు. బాపట్లలో భారీ నిరసన ర్యాలీ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ముస్లిం సోదరులు అంబేడ్కర్ సెంటర్లో మానవహారం తహసీల్దార్కు వినతిపత్రం అందజేత -
ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలు
తెనాలి రూరల్: కుక్కలను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా 10 మంది గాయాలపాలయ్యారు. తెనాలి వైకుంఠపురం సమీపంలో గురువారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన ధర్మ, యాకోబు, బెంజమిన్, మరియమ్మ, శ్యామల, వెంకటరత్నం, అమ్మారావు, సుశీల, సైమాన్ రాయి పని కోసం తెనాలి మండలం కొలకలూరుకు కొద్ది రోజులుగా వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మూల్పూరుకే చెందిన ఆటో డ్రైవర్ మూల్పూరి నరేష్ ఆటోలో వీరు వస్తున్నారు. తెనాలి వైకుంఠపురం సమీపంలో రహదారిపై మూడు కుక్కలు అడ్డు వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా కొట్టడంతో అందులోని 10 మంది గాయపడ్డారు. 108లో వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో యాకోబు పరిస్థితి విషమంగా ఉండంతో గుంటూరు పంపారు. ఘటనపై త్రీ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. -
మూడో శనివారం స్వచ్ఛ దివస్ పాటించాలి
కర్లపాలెం: ప్రతినెల మూడవ శనివారం గ్రామంలో స్వచ్ఛ దివస్ పాటించాలని స్వచ్ఛాంధ్ర ఫైనాన్స్ మేనేజర్ పి.విజయశేఖర్ తెలిపారు. విజయ్శేఖర్ గురువారం దమ్మనవారిపాలెం గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. గ్రామ పంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాల వివరాలను సర్పంచ్ వెంకటేశ్వరమ్మను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యమ్రాలు నిర్వహించేందుకు కావల్సిన సామగ్రిని పంపిణీ చేస్తామని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. డీఎల్పీఓ కుమారస్వామి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామ సర్పంచ్ గురపుసాల వెంకటేశ్వరమ్మ, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఈఓపీఆర్డి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ బాషా, పంచాయతీ కార్యదర్శి వీరాస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బొబ్బర్లంక ఎస్టీ కుటుంబాలకు న్యాయం చేయాలి
రేపల్లె రూరల్: పశువుల మాదిరిగా ఎస్టీ కుటుంబాలకు చెందిన మనుషులను క్రయవిక్రయాలు జరిపి వారిచే వెట్టిచాకిరి చేయించుకన్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మణిలాల్ డిమాండ్ చేశారు. బొబ్బర్లంక ఎస్టీ కాలనీలో నిరాధరణకు గురై కట్టుబానిసలుగా పనిచేస్తున్న గిరిజనులను సీపీఎం, కేవీపీఎస్, ఐద్వా తదితర ప్రజాసంఘాల సభ్యులు గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మణిలాల్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎస్టీలను కట్టుబానిసలుగా చేసుకుని హింసలకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్ని చట్టాలు చేసినా ఇంకా బానిసత్వం ఉండటం శోచనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీలు సమాజంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కులవివక్షకు, దోపిడీకి, అన్యాయానికి గురవుతున్నారన్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శ్రమను దోచుకుని బానిసలుగా మార్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు దోపిడీకి గురైన కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమార్కుల చెరలో బందీలుగా ఉన్న కుటుంబాలను విడిపించి ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల పరిహారం అందించాలన్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు ప్రభుత్వం కల్పించిన హక్కులను వివరించారు. సీపీఎం, కేవీపీఎస్, ఐద్వా నాయకులు కేవీ లక్ష్మణరావు, కె.ఆశీర్వాదం, డి.ఆగస్టిన్, కె.నాంచారమ్మ, జి.దానియేలు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీల క్రయవిక్రయాలకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి సీపీఎం బాపట్ల జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మణిలాల్ -
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో పర్చూరు నేతలకు స్థానం
పర్చూరు(చినగంజాం): పర్చూరు నియోజక వర్గంలోని పలువురు వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు జిల్లా కమిటీలో స్థానం దక్కించుకున్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నుంచి ఆదేశాలు అందాయి. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పఠాన్ కాలేషావలి, ప్రధాన కార్యదర్శిగా కొండూరు గోవింద్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా దండా చౌదరి, కోట శ్రీనివాసరావు, కార్యదర్శులుగా పి.రామకృష్ణారెడ్డి, పాలేరు వీరయ్యలు నియామకం కాగా జిల్లా అధికార ప్రతినిధిగా బండారు ప్రభాకరరావు నియమితులయ్యారు. 14న టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామంలో ఏప్రిల్ 14వ తేదీ జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలో పాల్గొనదలచిన అభ్యర్థులు రూ.999 ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని వారు తెలిపారు. పోటీలో పాల్గొనే టీం సభ్యులు ఎవరు కిట్టు వారే తెచ్చుకోవాలని, బాల్ కమిటీ వారి వద్దే కొనుగోలు చేయాలని, ప్రతి మ్యాచ్లో 12 ఓవర్లు ఉంటాయని, ఒక జట్టులో ఆడిన సభ్యుడు మరొక జట్టులో ఆడరాదని వారు తెలిపారు. పోటీలో విజేతలైన మూడు టీం లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.30,116 రూ.20,116, రూ.10,116లు నగదు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 6303974120 నెంబర్లో సంప్రదించాల్సిందిగా తెలిపారు. అద్దంకి కమిషనర్కు బెస్ట్ కలెక్షన్ అవార్డు అద్దంకి రూరల్: అద్దంకి మున్సిపాలిటీ జిల్లాలో అత్యధికంగా పన్ను వసూళ్లులో విశేషంగా కృషి చేసిన కమిషనర్ రవీంద్ర గురువారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో అడ్మినిస్టేటివ్ సెక్రటరీ చేతుల మీదుగా బెస్ట్ కలెక్షన్ అవార్డుతోపాటు మెమెంటో, ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. జాతీయ అవార్డుకు విద్యాశాఖాధికారి ఎంపిక పెదకూరపాడు: పెదకూరపాడు అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాల విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న ఏకుల ప్రసాదరావు ‘డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జాతీయ ప్రతిభా అవార్డు’కు ఎంపికై నట్లు సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్స్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.నాగయ్య గురువారం తెలిపారు. విద్యాభివృద్ధికి ప్రసాదరావు ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తుచేశారు. ఈ నెల 13వ తేదీన గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసాదరావును పలువురు ఉపాధ్యాయులు, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు అభినందించారు. -
వసూళ్ల పేరిట వేధింపులకు గురిచేస్తే చర్యలు
బాపట్లటౌన్: ఫైనాన్స్ సొమ్ము వసూళ్ల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని పట్టణ సీఐ రాంబాబు హెచ్చరించారు. బాపట్ల పట్టణం, రూరల్ పరిధిలోని మైక్రో ఫైనాన్స్, ప్రైవేటు బ్యాంకులు, ఫైనాన్స్ వ్యాపారాల నిర్వాహుకులు, రికవరీ ఏజెంట్లతో పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. సీఐ రాంబాబు మాట్లాడుతూ ఫైనాన్స్ వసూళ్ల పేరుతో లోన్లు తీసుకున్న వాళ్లను వేధింపులకు గురి చేకూడదన్నారు. రుణగ్రహీతలు తీసుకున్న లోన్లు సకాలంలో చెల్లించకపోతే నిబంధనల మేరకే వ్యవహరించాలన్నారు. ఇటీవల పలు ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లపై పలు ఆరోపణలు వస్తున్నందున, ఆయా కంపెనీల ఉద్యోగులు తప్పకుండా చట్టబద్ధంగా నిబంధనలను పాటించాలన్నారు. రుణగ్రహీతలను ఎలాంటి వేధింపులకు గురి చేయరాదన్నారు. కంపెనీ ద్వారా లీగల్గా నోటీసుల అందజేసి కోర్టు జారీచేసే ఆదేశాల మేరకు నడుచుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించి రుణగ్రహీతలను ఇబ్బందులకు గురిచేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రూరల్ సీఐ శ్రీనివాసరావు, సర్కిల్ సీఐ హరికృష్ణ పాల్గొన్నారు. బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ప్రైవేటు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థల ఏజెంట్లతో సమావేశం -
‘హ్యాకింగ్’ చిత్రం పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: జిల్లా ప్రజలకు సైబర్ మోసాలపై విసృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో గురువారం హ్యాకింగ్ సినిమా పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. హ్యాకర్ల సైబర్ నేరాలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకులు నరేష్ దోనె, మణివరన్ తెలిపారు. ఇటీవల వచ్చిన ఏఐ ద్వారా ఫొటో ద్వారా కూడా సరికొత్త సైబర్ నేరాలను హ్యాకర్లు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు వీటి బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలను చిత్రం ద్వారా తెలియజేయనున్నట్లు తెలిపారు. అంజలి సమర్పణలో అనుపమ ఆర్ట్స్ పతాకంపై రావూరి సురేష్బాబు చిత్రం నిర్మిస్తున్నారని చెప్పారు. కొన్ని సన్నివేశాలను కొండవీడులో చిత్రీకరించామని, నటిగా ముంబైకు చెందిన కావ్య దేశాయ్ నటిస్తున్నట్లు వారు తెలిపారు. -
కిరణ్ ఒక్కడే కాదు.. ఎందరో ఉన్నారు !
తాడేపల్లి రూరల్: రాష్ట్రంలో కిరణ్లాంటి వాళ్లు ఎంతో మంది వైఎస్సార్ సీపీ మహిళా ప్రజా ప్రతినిధులు, మంత్రులు, మహిళల గురించి అసభ్యంగా మాట్లాడుతూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారందరినీ కూడా ప్రభుత్వం శిక్షించాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు అంకిరెడ్డి నాగ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. తాడేపల్లి పోలీస్స్టేషన్లో గురువారం చేబ్రోలు కిరణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి ,ఆయన సతీమణి భారతిపై కిరణ్ చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. పోలీసులు ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా కొంతకాలం నుంచి వైఎస్సార్ సీపీ మహిళలపై, నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులపై అసభ్యకరంగా మార్ఫింగ్లు చేసి పోస్టులు పెడుతున్నారని తెలిపారు. కిరణ్పైనే కాకుండా మిగిలిన వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహిళలను కించపరిస్తే సహించమని తెలిపారు. , కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షుడు దొడ్డ అంజిరెడ్డి, రాష్ట్ర బూత్ కమిటీల అధ్యక్షులు కొండమడుగుల సుధాకర్రెడ్డి, కొలుసు మోహన్ యాదవ్, కొండకాయల వంశీ, కృష్ణ, సత్తిరెడ్డి, నరేందర్రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరినీ శిక్షించాలి వైఎస్సార్ సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకిరెడ్డి నాగ నారాయణమూర్తి -
పంట కాలువలోకి జారిపోయిన టిప్పర్
కారంచేడు: కారంచేడు – ఆదిపూడి రోడ్డులోకి రివర్స్ చేసుకోవడానికి తిరిగిన టిప్పర్ లారీ అదుపుతప్పి పంట కాలువలోకి జారిపోయింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోయినప్పటికీ విద్యుత్ స్తంభాలు, వైర్లకు నష్టం కలిగినట్లు విద్యుత్శాఖ సిబ్బంది తెలిపారు. వాడరేవు – పిడుగురాళ్ల ప్రధాన రహదారి (167ఏ బైపాస్ రోడ్డు) పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులకు ఉపయోగించే టిప్పర్ లారీని డ్రైవరు ఈ రోడ్డులోకి తిప్పాడు. అదుపుతప్పడంతో అది రైతులు ఏర్పాటు చేసుకున్న పంపింగ్ స్కీమ్ వద్ద పంట కాలువలోకి జారిపోయింది. ఇదే సమయంలో అక్కడ ఉన్న 11కేవీ విద్యుత్ లైన్తో పాటు, విద్యుత్ స్తంభం కూడా విరిగిపోయింది. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాల్య వివాహం నిలిపివేత నాదెండ్ల: బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకుని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చిన సంఘటన ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల మేరకు... మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఈ ఏడాది ఇంటర్ రెండో సంవత్సరం పూర్తి చేసింది. చిలకలూరిపేట మండలం చినరాజాపేట గ్రామానికి చెందిన 22 ఏళ్ల నరేంద్రతో ఈ నెల 13న బాలిక వివాహాన్ని పెద్దలు నిర్ణయించారు. బాలిక తండ్రి చనిపోగా, తల్లి కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది. బాలిక వివాహ సమాచారం తెలుసుకున్న ఎంపీడీవో స్వరూపారాణి, డీసీటీవో ప్రశాంత్, అంగన్వాడీ సూపర్వైజర్ పద్మ, సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. -
జెడ్పీ పాఠశాలలో భోజనశాల ప్రారంభం
జె.పంగులూరు: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం భోజనశాల ప్రాంభించారు. సింహపురి ఎక్స్ప్రెస్ హైవే ఇంటరైజ్ వారు సంయుక్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా రూ.15 లక్షలతో భోజనశాలను నిర్మించారు. బాల బాలికలు కూర్చోని భోజనం చేసేందుకు వీలుగా స్టీల్ బెంచీలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిలుగా సింహపురి ఎక్స్ప్రెస్ హైవే, ప్రాజెక్ట్ హెడ్ శివకుమార్, ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ ఆనంద్, రౌండ్ టెబుల్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి వెంకటేష్లు హాజరై భోజనశాలను ప్రారంభించారు. హెచ్ఎం ఇమ్మిడిశెట్టి అనిత మాట్లాడుతూ భోజనశాలలో 450 మంది విద్యార్థులు సౌకర్య వంతంగా భోజనం చేయవచ్చన్నారు. గ్రామ పెద్ద చింతల సహదేవుడు, పాఠశాల కమిటీ చైర్పర్సన్ గోలి సంధ్యారాణి, గ్రామ సొసైటీ అధ్యక్షుడు బత్తుల వెంకట్రావు పాల్గొన్నారు. -
మెరుగ్గా ‘చెత్త నుంచి సంపద సృష్టి’
సత్తెనపల్లి: స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు పూర్తి స్థాయిలో పని చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.అర్జునరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామలోని ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అర్జునరావు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే అధికారులు, క్లాప్ మిత్రాలు పారిశుద్ధ్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కూడా ఇంటి వద్దనే తడి, పొడి చెత్తలను వేరు చేసి అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత కలిగి ఉండాలని కోరారు. అనంతరం నందిగామ క్లాప్ మిత్రాలతో సమావేశమై, పలు సూచనలు చేశారు. గ్రామంలోని ఏడు అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం సత్తెనపల్లి, రాజుపాలెం, నకరికల్లు, అచ్చంపేట, అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలాలకు చెందిన స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్లతో ఈడీ భేటీ అయ్యారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ల నిర్మాణం, నిర్వహణ అంశాలపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో బండి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల విస్తరణాధికారి ఆర్.శ్రీనివాసరెడ్డి, నందిగామ సర్పంచ్ బలిజేపల్లి రమాదేవి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఆళ్ళ సాంబయ్య, ఐటీసీ రీసోర్స్పర్సన్ చెంబేటి బొల్లయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భావన, ఏపీఎం సమాధానం, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
సమాజ హితమే సాహిత్యం పరమావధి
తాడేపల్లి రూరల్: మాతృ భాషలు మృత భాషలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. ఏ ప్రాంత సంస్కృతి పరిరక్షించబడాలన్నా ఆ ప్రాంత భాష ముందుగా రక్షింపబడాలని తెలిపారు. వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో బీఏ (ఐఎఎస్) విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘‘ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు, వాదాలు – సమాలోచన’’ అనే అంశంపై ప్రారంభమైన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ హితమే సాహిత్యం పరమావధి అని పేర్కొన్నారు. రాష్ట్ర రహదారుల భద్రతా విభాగం డీఐజీ సీహెచ్. విజయారావు మాట్లాడుతూ మాతృభాషలో సివిల్ సర్వీసెస్ రాసి లక్ష్యాన్ని సాధించడం సులువని తెలిపారు. అనంతరం యూనివర్సిటీ ప్రచురించిన 11 సంవత్సరాల యూపీఎస్సీ పాత ప్రశ్నపత్రాలు – సమాధానాలు, విశ్లేషణతో కూడిన గ్రంథాన్ని ఆవిష్కరించి, ఉచితంగా విద్యార్థులకు అందజేశారు. వాణిజ్య పన్నుల విభాగం అసిస్టెంట్ కమిషనర్ డి. రాంబాబు మాట్లాడుతూ తెలుగు ప్రధాన అంశంగా తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత మార్గ నిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్ర లయోలా విశ్రాంత వైస్ ప్రిన్సిపాల్ గుమ్మా సాంబశివరావు, రచయిత్రి నైనాల వాణిశ్రీ , బీఏ విభాగాధిపతి బి. శివనాగయ్య, సహాయ ఆచార్యులు అద్దంకి ప్రజాపతి, వర్సిటీ వీసీ జి. పార్థసారథివర్మ, ప్రో వీసీలు ఏవీఎస్ ప్రసాద్, కె. రాజశేఖరరావు, ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ కె. సుబ్బారావు, బీఏ ఉప విభాగాధిపతి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్
అభివృద్ధి పనులు సత్వరం పూర్తిచేయాలి బాపట్లటౌన్: కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో దిశ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో–ఆర్డినేషన్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ టి.కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన పనులు సత్వరం పూర్తి చేయాలన్నారు. జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాబోయే సంవత్సరంలో 76 లక్షల పని దినాలను కూలీలకు కల్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో రహదారుల మరమ్మతులను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలో అమృత ధార మెగా ప్రాజెక్ట్ కోసం రూ.3500 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. కలెక్టర్ జె. వెంకటమురళి మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరు చేసిన అభివృద్ధి పనులు పారదర్శకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. తాగునీటి పథకాల మరమ్మతుల కోసం జలజీవన్ మిషన్ కింద 400 పనులు రూ.149 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, ప్రకాశం జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, గుంటూరు జిల్లా పరిషత్ సీఈఓ బోసు, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, డీపీఓ ప్రభాకర్, హౌసింగ్ పీడీ వై.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
సమస్యలను చట్టప్రకారం పరిష్కరించుకోండి
చీరాల టౌన్: గ్రామాలన్నీ ప్రశాంతంగా ఉండాలి.. సమస్యలు ఏవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి..గొడవలు, హత్యాయత్నాలకు తావివ్వకుండా పెద్దలు హుందాగా వ్యవహరించాలని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు సూచించారు. గురువారం రాత్రి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఇటీవల గవినివారిపాలెంలో జరిగిన గొడవలు, హత్యాయత్నం ఘటనల నేపద్యంలో పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామస్తులతో కలిసి పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గవినివారిపాలెంలో జరిగిన ఘర్షణలకు గల కారణాలను గ్రామస్తుల నుంచి, ఫిర్యాదుదారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతు...ప్రశాంత వాతావరణానికి గ్రామాలు కీలకంగా ఉండాలే కానీ గొడవలు, హత్యాయత్నాలు, ఘర్షణలకు తావివ్వకూడదన్నారు. గ్రామంలోని ప్రజల మధ్య ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ప్రభుత్వ అధికారులైన పోలీస్, రెవెన్యూ, అధికారుల దృష్టికి తీసుకురావాలే కానీ వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు పాల్పడటం చట్ట వ్యతిరేకమన్నారు. అధికారులు అందరు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారని సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేస్తారని గుర్తుంచుకోవాలన్నారు. గొడవలకు పాల్పడినా, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండేలా పీస్ కమిటీ పనిచేయాలన్నారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ డీఎస్పీ అభిషేక్, తహసీల్దార్లు కె.గోపికృష్ణ, జె.ప్రభాకరరావు, రూరల్ సీఐ శేషగిరిరావు, రూరల్ ఎస్ఐ అంబటి చంద్రశేఖర్, గవినివారిపాలెం గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఘర్షణలకు చోటివ్వవద్దు సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలి గవినివారిపాలెం గ్రామస్తులతో ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు -
చీరాలలో ఇసుక తోడేళ్లు!
● ఇష్టారాజ్యంగా ఇసుక దోపీడీ ● నియోజకవర్గ ముఖ్యనేతకు నెలకు రూ. 30 లక్షలు కప్పం! ● అసైన్డ్ భూముల్లో భారీగా తవ్వకాలు ● రోజుకు 100 ట్రాక్టర్లు, 50 టిప్పర్లతో పగలు, రాత్రి రవాణా ● మామూళ్ల మత్తులో రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు సాక్షి, టాస్క్ఫోర్స్: అధికార పార్టీ నాయకుడు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నాడు. చీరాల నియోజవర్గంలో ఇసుక అక్రమ తరలింపు కోసం కర్లపాలెం మండలం యాజిలికి చెందిన ఓ పచ్చ నాయకుడు రూ. 30 లక్షలకు పాట పాడుకున్నాడు. ప్రతి నెల చీరాల నియోజకవర్గం నుంచి అక్రమంగా ఇసుక తరలించు కోవడానికి టీడీపీ నియోజకవర్గ ముఖ్య నేతకు ఈ కప్పం కడుతున్నాడు. ఉచితం మాటున యంత్రాలతో తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ అక్రమ తరలింపు వ్యవహారం తెలిసినా డ్రైనేజీ, రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులకు నెలనెలా మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. నిత్యం వందల సంఖ్యలో తరలింపు.. చీరాల నియోజవర్గం పరిధిలో ప్రధానంగా వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి, రామన్నపేట, సముద్రతీర గ్రామాల పరిధిలో అసైన్డ్ భూముల నుంచి పొక్లెయిన్లతో ఇసుక తవ్వి ట్రాక్టర్లు, లారీ టిప్పర్లతో నూతనంగా నిర్మిసున్న వాడరేవు – పర్చూరు జాతీయ రహదారి మీదుగా నూతనంగా వేసే లేఅవుట్లకు నిత్యం వంద సంఖ్యలో ఇసుక లోడులు తరలిస్తున్నారు. ప్రతిరోజూ 100 నుంచి 150 లోడ్లు వరకు డంప్ అవుతున్నాయి. ట్రాక్టర్ ఇసుక రూ.4వేల నుంచి రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. టిప్పర్ ఇసుక క్వాలిటీని బట్టి రూ. 25వేల నుంచి రూ. 40 వేల వరకు విక్రయిస్తున్నారు. వీళ్లే కీలకం... పందిళ్లపల్లికి చెందిన టీడీపీ చెందిన మరో ముగ్గురు ఇసుక మాఫియా సిబ్బందిని యాజిలికి చెందిన పచ్చనాయకుడు ఏర్పాటు చేసుకున్నాడు. వీరు ముగ్గురు ఈ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుక తరలించి డబ్బులు వసూలు చేసి ఆ నేతకు చెల్లిస్తుంటారు. చీరాల ప్రాంతంలో తాను మినహా వేరెవరూ ఇసుకను విక్రయించేందుకు వీలులేదని సదరు పచ్చనేత హుకుం జారీ చేయడంతో చీరాల ప్రాంతంలో ఇతని ఇసుక వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. మిగిలిన వారికి ఇసుక దిబ్బలు ఉన్నా అమ్ముకోవడానికి వీలులేదు. కాదూ కూడదని తరలించే ప్రయత్నం చేస్తే వెంటనే తహసీల్దార్, పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేయిస్తారు. ఇసుక మాఫియా నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసినా.. పందిళ్లపల్లి శివారు నుంచి అక్రమంగా ఇసుక తలిస్తున్నారని యానాది కాలనీకి చెందిన ఎస్టీ వర్గీయులు జాతీయ ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్టీ కమిషనర్ కోర్టులో విచారణ జరుగుతుంది. అయినప్పుటికీ పట్టించుకోని ఇసుక మాఫియా భారీస్థాయిలో గుంటలు తవ్వి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. మాఫియాకి కొమ్ముకాస్తున్న ఖాకీలు!గత నెలలో పందిళ్లపల్లికి చెందిన ఒక ప్రైవేట్ వ్యక్తి తన సొంత పొలం నుంచి తన ట్రాక్టర్ లో ఇసుక తరలించుకుంటుండగా గమనించిన ఇసుక మాఫియా నాయకులు బైపాస్ రోడ్డులో ట్రాక్టర్ని అడ్డుకున్నారు. దీని పై ట్రాక్టర్ యజమాని మీరెవరు నా ట్రాక్టర్ని ఆపడానికి ప్రభుత్వ ఉద్యోగులా లేకా పోలీసులా అని నిలదీయడంతో చేసేది లేక మాఫియా నాయకులు వేటపాలెం ఎస్ఐకి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన ఆ ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ విషయానికి సంబంధించి ట్రాక్టర్ యజమాని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్పీ ట్రాక్టర్ని పోలీస్స్టేషన్కు తరలించిన కానిస్టేబుల్ కోటేశ్వరరావుని విధుల నుంచి తప్పించి వీఆర్కి పంపించారు. ఈ విషయంలో ఎస్ఐ చాకచక్యంగా తప్పుకోవడం గమనార్హం. -
నేడు గవర్నర్ అబ్దుల్ నజీర్ చీరాల రాక
చీరాల టౌన్: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం చీరాల వస్తున్నారని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు గురువారం తెలిపారు. గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనకు వస్తున్నారని రాజ్ భవన్ నుంచి సమాచారం అందడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకు గవర్నర్ వాడరేవులోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకుని బస చేస్తారని, శనివారం విజయవాడ రాజ్భవన్కు ప్రయాణమవుతారని సమాచారం అందించారు. ఈ మేరకు ఆర్డీఓ చంద్రశేఖరనాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గవర్నర్ వ్యక్తిగత పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.ఎయిమ్స్లో కార్డియాక్ ఐసీయూ విభాగం ప్రారంభం గుండె జబ్బు రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు మంగళగిరి: నగర పరిధిలోని ఎయిమ్స్లో గురువారం నూతనంగా కార్డియాక్ ఐసీయూ విభాగాన్ని ప్రారంభించారు. ఇప్పటికే కార్డియాక్ విభాగంలో యాంజియోప్లాస్టీతో పాటు అన్ని రకాల సేవలందుతున్నాయి. అయితే, ఐసీయూ విభాగం లేకపోవడంతో గుండె సంబంధిత రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లకతప్పడం లేదు. గుండె సంబంధిత రోగులకు అన్ని రకాల వైద్య సేవలతో ఐసీయూ విభాగం అందుబాటులోకి రావడంతో రోగులకు ఎంతో మేలు జరుగుతుందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కుడికాలువకు నీటి విడుదల నిలుపుదల విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు గురువారం నీటిని నిలుపుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు నీటిని అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 515.30 అడుగుల వద్ద ఉంది. ఇది 140.8451 టీఎంసీలకు సమానంగా ఉంది. ఇక్కడ నుంచి ఎస్ఎల్బీసీకి 841 క్యూసెక్కులు విడుదలవుతుంది. దుర్గమ్మ సన్నిధిలో ఎన్నికల కమిషనర్లు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఏపీ, తెలంగాణ ఎన్నికల కమిషనర్లు గురువారం దర్శించుకున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ఏపీ ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ ఇంద్రకీలాద్రికి విచ్చేయగా ఆలయ అధికారులు వారిని సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్డీ ప్రసాద్, ఏఈవో చంద్రశేఖర్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలతో వారిని సత్కరించారు. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన డి. మాల్యాద్రి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,11,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ అధికారి లక్ష్మణ్ దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 11 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025అనుమతులు ఉన్నా.. 7సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 515.30 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది. వైద్యశాలలో అన్నదానం మాచర్లరూరల్: సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం అన్నదానం నిర్వహించారు. కన్వీనర్ జక్కా శ్రీనివాసరావు పాల్గొన్నారు. శిలువ పాదయాత్ర నాదెండ్ల: కనపర్రు గ్రామంలో తపస్సు కాలం సందర్భంగా గురువారం మరియ, యేసోబు దేవాలయం నుంచి బాలయేసు పుణ్యక్షేత్రం వరకు విశ్వాసులు శిలువ పాదయాత్ర నిర్వహించారు. సాక్షి ప్రతినిధి,బాపట్ల: కూటమి పాలనలో కొందరు పోలీసు అధికారులు మరింతగా రెచ్చిపోతున్నారు. అధికారపార్టీ నేతల అండచూసుకొని పెట్రేగిపోతునారు. ఖాకీ చొక్కాలపై పచ్చకండువాలు కప్పుకొని విర్రవీగుతున్నారు. నిన్న అనంతపురం జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ ఏకంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే నోరుపారేసుకుంటే తాజాగా బాపట్ల జిల్లా బల్లికురవ ఎస్ఐగా సోమవారం విధుల్లో చేరిన నాగరాజు వైఎస్సార్ సీపీ నేతలు పోలీసు స్టేషన్ ఆవరణలోకి కూడా రావద్దంటూ హుకుం జారీ చేశారు. పబ్లిక్ సర్వెంట్గా వున్న ఎస్ఐ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండగా విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా వారు స్పందించడంలేదు. ఎస్ఐ తీరుతో బల్లికురవ ప్రాంతంలో మళ్లీ ఫ్యాక్షన్ గొడవలు తలెత్తే ప్రమాదముందని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేమవరం హత్యకేసు రాజీ కోసమే.. ఇదే మండలం వేమవరంలో 2017లో మేనెల 18న కరణం బలరామకృష్ణమూర్తి అనుచరులు గోరంట్ల అంజయ్య, వేగినేని రామకోటేశ్వరరావులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అనుచరులు 13 మంది కలిసి పథకం ప్రకారం హత్యచేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఈ దాడిలో గోరంట్ల వెంకటేశ్వర్లు, వేగినేని వీరరాఘవయ్య తీవ్ర కత్తిపోట్లకు గురై కొన ప్రాణంతో బయటపడ్డారు. ఆరోజు నుంచి ఈ రోజువరకూ వేమవరంలో పోలీసు పికెట్ కొనసాగుతోంది. ప్రస్తుతం కేసు చివరిదశకు చేరుకుంది. బాధితులు హత్యచేసిన వారికి శిక్ష పడాల్సిందేనని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మంత్రి గొట్టిపాటి అనుచరులకు శిక్షపడే అవకాశం లేకపోలేదు. దీంతో ఈ కేసులో బాధితులను బెదిరించైనా సరే బయట పడేందుకు మంత్రి అనుచరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే 2017 ప్రాంతంలో బల్లికురవ ఎస్ఐగా పనిచేసిన నాగరాజును తిరిగి ముండ్లమూరు నుంచి హుటాహుటిన బల్లికురవ స్టేషన్కు పిలిపించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నక్కబొక్కలపాడు వద్ద పచ్చపార్టీ జెండాలతో ప్రభల ఏర్పాటు న్యూస్రీల్ఆది నుంచి వివాదాస్పదమే.. బల్లికురవ ఎస్ఐ నాగరాజు పనితీరు మొదటి నుంచీ వివాదాస్పదమే. సోమవారం ఆయన మరోమారు బల్లికురవ ఎస్ఐగా విధుల్లో చేరీచేరడంతోనే వైఎస్సార్ సీపీ శ్రేణులే టార్గెట్గా వ్యవహరిస్తున్నారు. మండలంలోని నక్కబొక్కలపాడులో ఈర్ల గంగమ్మ జాతర సందర్భంగా ప్రభల అనుమతుల విషయంలోనూ ఏకపక్షంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 12న జాతర వున్నా గురువారం నుంచే ఈ ప్రాంతంలోని నక్కబొక్కలపాడుతోపాటు కొనిదెన, మల్లాయిపాలెం తదితర గ్రామాల్లో తిరునాళ్లు మొదలయ్యాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రభలు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఈ సంవత్సరం ప్రభలు కట్టుకునేందుకు ఇరుపార్టీ మద్దతు దారులు అనుమతికోసం పోలీసులకు దరఖాస్తుచేయగా పచ్చపార్టీ వారికి 6 ప్రభల ఏర్పాటుకు అనుమతులిచ్చిన ఎస్ఐ నాగరాజు వైఎస్సార్ సీపీ వారికి అనుమతి నిరాకరించారు. ఇక నుంచి స్టేషన్లోకి రావద్దని వైఎస్సార్ సీపీ వారికి హుకుం జారీ చేశారు. మీరు ఎవరికి చెప్పుకున్నా అనుమతి ఇచ్చేదిలేదన్నారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకుడు కృష్ణ తదితరులు బాపట్ల డీఎస్పీని కలిసి విషయం చెప్పారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై వివక్ష బల్లికురవ మండలంలో ఈర్లగంగమ్మ తిరునాళ్ల ప్రభలు పెట్టుకునేందుకు అనుమతి కోరిన ఇరుపార్టీల నేతలు పచ్చపార్టీ వారికే అనుమతులిచ్చిన ఎస్ఐ నాగరాజు ఎస్ఐ మాటే మా మాట అంటున్న ఉన్నతాధికారులు నాలుగు రోజులముందు అనుమతి ఇచ్చి బదిలీపై వెళ్లిన ఎస్ఐ నాగరాజు విధుల్లో చేరగానే అనుమతి రద్దు ఎస్ఐ నాగరాజును హుటాహుటిన బల్లికురవకు తెచ్చిన మంత్రి అనుచరులు వేమవరం జంటహత్యల కేసు రాజీ కోసమేనన్న ప్రచారం గతంలో బల్లికురవ ఎస్ఐగా పనిచేసిన నాగరాజు వాస్తవానికి వైఎస్సార్ సీపీ నేతలు వారం క్రితం బల్లికురవ ఎస్ఐ జీవీ చౌదరికి దరఖాస్తు చేసుకోగా ఆయన సంతమాగులూరు సీఐ కలిసి ప్రభలకోసం అనుమతి ఇచ్చారు. ఈ విషయం డీఎస్పీకి సైతం తెలుసు. ఇదే విషయాన్ని వైఎస్సార్ సీపీ నేతలు డీఎస్పీ దృష్టికి తీసుకరాగా అనుమతి తాను పంపిస్తానని ఎస్ఐని కలువాలని చెప్పడంతో వారు తిరిగి బల్లికురవ ఎస్ఐని కలువగా ఎవరు చెప్పినా అనుమతి ఇవ్వనని తేల్చి చెప్పారు. మంత్రి అనుచరుల అండతో ఎస్ఐ డీఎస్పీ మాటలను సైతం ఖాతరు చేయలేదని తెలుస్తోంది. దీంతో గురువారం సైతం వైఎస్సార్ సీపీ నేతలు మరోమారు డీఎస్పీని కలువగా తాను ఎస్ఐ చెప్పిన ప్రకారమే నడుచుకుంటామని చెప్పడం అందరినీ నివ్వెరపరిచింది. అదే సమయంలో పార్టీలు, జెండాలకతీతంగా తిరునాళ్లు నిర్వహించుకోవాలని, పార్టీ ఫ్లెక్సీలు, జెండాలు కడితే కేసులు పెడతామని చెప్పినా పచ్చపార్టీవారు మాత్రం ప్రభల ప్రాంతంలో ఏకంగా టీడీపీ జెండాలు, నేతల ఫొటోలు ఏర్పాటు చేశారు. పచ్చపార్టీ వారికి మాత్రమే ఎస్ఐ అనుమతులివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఫైనాన్స్ దా‘రుణం’.. ఇల్లాలు బలవన్మరణం
భట్టిప్రోలు (కొల్లూరు): ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ ఆగడాలు మితిమీరి ఇంటిపైకి వచ్చి దౌర్జన్యానికి పాల్పడటంతో అవమాన భారం భరించలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో బాణావత్ గోవింద్నాయక్ భార్య పార్వతిబాయ్ (44)తో కలసి నివసిస్తున్నాడు. వీరు అమాయకులు. పెద్దగా చదువు రాదు. గతేడాది వీరు 5 స్టార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలో ఇంటి పత్రాలు తనఖా పెట్టి రూ.4 లక్షలు రుణం తీసుకున్నారు. రుణం మంజూరు చేసే సమయంలో రూ.లక్ష చార్జీలంటూ వసూలు చేసి, రూ.3 లక్షలు అందజేశారు. అప్పట్నుంచి లోన్ నగదు చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే కొంత కాలం తర్వాత తమ ఇంటిని ఫైనాన్స్ సంస్థ వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలియడంతో నెలవారీ కిస్తీలు కట్టడం ఆపేసి.. ఆ విషయం తేల్చాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట సంస్థ ప్రతినిధులు పార్వతీబాయ్ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యం చేయడంతోపాటు, దుర్భాషలాడారు. దీంతో వారు భట్టిప్రోలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం ప్రైవేటు పైనాన్స్ సంస్థకు చెందిన వ్యక్తులు పార్వతిబాయ్ ఇంటికి వెళ్లి ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. సామగ్రి బయటకు విసిరేశారు. వంట పాత్రలతో ఆమెపై దాడికి తెగబడ్డారు. కేసు వాపసు తీసుకోవాలంటూ తీవ్రంగా హెచ్చరించి వెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన పార్వతీబాయ్ ఫ్యాన్కు ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు తలుపులు తీసి.. ఆమెను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
పేదల నెత్తిన గ్యాస్ బండ
బాపట్లగురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సదరం క్యాంప్ పునఃప్రారంభం తెనాలిఅర్బన్: వికలాంగుల ధ్రువపత్రాల పునఃపరిశీలనలో భాగంగా తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం ప్రత్యేక సదరం క్యాంప్ను నిర్వహించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 515.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.ఆలయ నిర్మాణానికి విరాళం నరసరావుపేట రూరల్: ఇస్సప్పాలెం మహంకాళి ఆలయ పునర్నిర్మాణానికి కె.వెంకటమాధవ్, లక్ష్మీప్రియ దంపతులు బుధవారం రూ.1,00,116 విరాళమిచ్చారు.వేటపాలెం: ముందు రోజు గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న వారు కూడా డెలివరీ సమయంలో పెరిగిన మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే నిత్యావసర ధరలు, బియ్యం, కందిప్పు వంటి వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ధరలతో అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నిర్ణయం పెనుభారంగా పరిణమించింది. సామాన్యుడు ఏది కొనాలన్నా ఒకటికి పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులో అదనపు భారం మోపడంపై ప్రజలు మండిపడుతున్నారు. గృహ వినియోగానికి సంబంధించిన 14.2 కేజీల సిలిండర్ జిల్లాలో రూ. 844.50 ఉండగా, గ్యాస్ ఏజెన్సీలు అదనంగా రూ. 50 వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. సిలిండర్ ధర రూ. 50 పెంచడంతో రూ. 894.50 సమర్పించాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,58,520 మంది గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారు. వీరిలో 3,56,333 మందికి దీపం కనెక్షన్లు ఉన్నాయి. వీరు సిలిండర్ రూ. 844.50 చొప్పున కొనుగోలు చేసేందుకు రూ. 38,72,20,140 చెల్లించాల్సి వచ్చేది. ధర పెరిగిన నేపథ్యంలో కొనుగోలు చేస్తే రూ.41,01,46,140 చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారులపై నెలకు సగటున రూ.2,29,26,000 అదనపు భారం పడుతోంది. పేదలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోమారు భారం మోపాయి. వంట గ్యాస్ (ఎల్పీజీ) ధరను సిలిండర్కు రూ. 50 చొప్పున చమురు కంపెనీలు పెంచాయంటూ ప్రకటించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు పెద్ద షాక్ ఇచ్చింది. పెరిగిన ధర మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వాల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పేదలపై మోయలేని భారం ఇప్పటికే అన్ని వస్తువుల ధరలను కూటమి ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు వంట గ్యాస్ ధరలను సైతం కేంద్రం పెంచడం చాలా అన్యాయం. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి. పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలి.. ఇప్పటికే దినదినగండం అన్నట్లుగా బతుకుతున్న సామాన్య ప్రజలకు కనీస ఊరట కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వారిపై అదనపు భారం తగ్గేలా వెంటనే చర్యలు చేపట్టాలి. – వసుంధరాదేవి, వేటపాలెం ధర వెంటనే తగ్గించాలి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కరెంటు చార్జీలతోపాటు అనేక వస్తువుల రేట్లు పెరిగేలా వ్యవహరిస్తోంది. డీజీల్, పెట్రోల్ ధరలు కూడా పెరగడంతో ఆ ప్రభావం అన్ని నిత్యావసర వస్తువులపై పడుతోంది. ఈ పరిస్థితుల్లో పేద, మధ్య తరగతి వారు బతకడమే కష్టంగా ఉంది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా ధరలు పెంచడం సమంజసం కాదు. పెంచిన వంట గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి. – జి.సుశీల, పందిళ్లపల్లి 7న్యూస్రీల్ సిలిండర్పై అదనంగా రూ.50 భారం బాపట్ల జిల్లాలో మొత్తం కనెక్షన్లు 4.28 లక్షలు పెంపు వల్ల అదనపు భారం నెలకు రూ. 2.29 కోట్లు -
బీచ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
బాపట్ల: సూర్యలంక, రామాపురం బీచ్లను జులై నెలలోగా మెరుగైన పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. పర్యాటక శాఖ అధికారులు, కన్సల్టెంట్లతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా పర్యాటకంగా మరింత కీలక ప్రాంతం కానుందని చెప్పారు. జులై నెల నాటికి బోటింగ్ షికార్ అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. పర్యావరణ కాలుష్యం లేని ప్రాంతంగా ఈ రెండు బీచ్లను ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే 20 మంది శాస్త్రవేత్తలు ఆ రెండు బీచ్లలో అధ్యయనం చేశారని వివరించారు. రాజస్థాన్, గుజరాత్ తరహాలో తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నామన్నారు. జిల్లాలో జీడిపప్పు ఉత్పత్తి అధికంగా ఉన్నందున విక్రయాలు, ప్రదర్శనలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాటిచెట్ల ఆధారంగా ఉత్పత్తులు పెంచేలా కల్లు గీత కార్మికులకు, బోటింగ్ షికారు జరిగేలా మత్స్యకారులకు కల్గరి శిక్షణ ఇవ్వాలన్నారు. చేనేత ఉత్పత్తుల పెంపు, ప్రదర్శనలకు చర్యలు తీసుకుంటామన్నారు. వాడరేవు వద్ద రెవెన్యూ అసోసియేషన్కు సంబంధించిన ఎకరా భూమిని ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తామన్నారు. లేదంటే ఏజెన్సీలకు ఆ భూమిని లీజ్కు ఇవ్వడానికి పరిశీలిస్తామన్నారు. పేరళి కెనాల్ బోటింగ్కు అనువైన ప్రాంతం కాగా, పర్యాటకుల కోసం సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. బీచ్ల వద్ద రిసార్ట్స్ నిర్వహణపై రూపొందించిన నివేదికలపై ఆయన చర్చించారు. అత్యవసర అభివృద్ధి పనులకు రూ.1.13 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, పర్యాటక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ నాయుడు, కన్సల్టెంట్ సాహితీ దివి, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమానికి పథకాలు బాపట్ల: మహిళా శిశు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. బుధవారం స్థానిక సాయిరామ్ గార్డెన్ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి పోషణ్ పక్వాడ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గర్భిణులకు అవగాహన కల్పించారు. అనాథ శిశువుల కోసం రైల్వే స్టేషన్లో, బస్టాండ్లో ఊయలలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో సఖి వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. బాపట్ల శాసనసభ్యు వేగేశన నరేంద్ర వర్మ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. 20 మంది గర్భిణులకు వేగేశన ఫౌండేషన్ ద్వారా రూ.5 వేల వంతున ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ను జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధా మాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంతరాజు, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
రంగస్థలంపై సీ్త్ర కాంతులు
● చింతామణిలో శ్రీహరి పాత్రతో మన్ననలు ● తాత స్ఫూర్తితో చిన్ననాటి నుంచే ప్రతిభ ● ఇప్పటివరకు 4,500కుపైగా ప్రదర్శనలు ● రెండు లఘుచిత్రాలతో మరింత గుర్తింపు ● నటనలో యువకుడు శ్రీకాంత్ సత్తా పట్టణంలోని నంబూరిపాలెంకు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు, జెమినీ సంస్థలో పనిచేసిన అద్దంకి మాణిక్యాలరావు మనవడు శ్రీకాంత్. ఆయన తండ్రి పేరు హనుమంతరావు. ఈయన కూడా నటుడే. తల్లి మేరి భారతి. శ్రీకాంత్ తన నాలుగో ఏటే సత్యహరిశ్చంద్ర నాటకంలో లోహతాసుడు వేషం ధరించారు. చింతామణి నాటకంలోని శ్రీహరిగా, సత్యహరిశ్చంద్రలో హరిశ్చంద్రుడు, విశ్వామిత్రుడు, కాలకౌశకుడు, వీరబాహు, లక్ష్మి తిరుపతమ్మ నాటకంలో భృగుమహర్షి, తిప్పడు, బ్రాహ్మణుడు, మలయ్య, వెంగమాంబ తదితర పాత్రలు పోషించారు. పౌరాణిక, జానపద నాటకాలే కాకుండా శిలువధారి, శాంసన్ డెలీల, బ్రహ్మం గారి నాటకాలలోనూ ప్రతిభ చూపారు. ప్రదర్శనలు.. ఇప్పటివరకు 4,500కుపైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. రెండు లఘు చిత్రాలలో నటించి మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యమైన ఆంధ్రా యూనివర్సిటీ – విశాఖపట్నం, కాలికట్ యూనివర్సిటీ – కేరళ, బళ్లారి రాఘవ కళాక్షేత్రం – కర్నాటక, రవీంద్రభారతి – హైదారబాద్, విజయవాడలోని తుమ్మపల్లి కళాక్షేత్రం వంటి వేదికలపై తన ప్రదర్శనలతో పేరొందారు. ప్రముఖ రంగస్థల నటుడు చీమకుర్తి నాగేశ్వరరావు, విజయ్రాజు, తన తల్లి మేరీ భారతితో కలిసి నటించారు. అద్దంకిలో కళాకారులకు కొదువలేదు. బండారు రామారావు, అద్దంకి మాణిక్యాలరావు నాడు రంగస్థలంపై తమ నటనతో అలరించారు. నేటి తరం నటులు ఎందరో ఉన్నారు. ఆ కోవలో తన తాత అద్దంకి మాణిక్యాలరావును స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు శ్రీకాంత్. చింతామణిలో సీ్త్ర పాత్రయిన శ్రీహరిగా ప్రతిభ చాటుతున్నారు. – అద్దంకి ఎన్నో సత్కారాలు శ్రీకాంత్ ఇప్పటివరకు దాదాపు 500కుపైగా సన్మానాలు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అప్పటి మంత్రి పార్థసారథిచే ప్రముఖ రంగస్థల నుడు రేబాల రమణ పురస్కారం, నాటక కిశోర బిరుదు, తమిళనాడులోని తిరువణ్ణామలైలో అక్కడి కలెక్టర్ నుంచి సన్మానం పొందారు. సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణితో హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ప్రశంసలు అందుకున్నారు. గానగంధర్వ, అభినవ శ్రీహరి, రంగస్థల సకల పాత్ర వల్లభుడు అనే బిరుదులు పొందారు. -
టీడీపీ ప్రజా దర్బార్లో రభస
గుంటూరు మెడికల్: గుంటూరు తూర్పు నియోజకవర్గం 15వ డివిజన్ సంగడిగుంట లాంచస్టర్ రోడ్డులో బుధవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజలను అధిక సంఖ్యలో తరలించే యత్నంలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు కావాల్సిన వారు కార్యక్రమానికి వస్తే ఇస్తామంటూ ఆటోల్లో ప్రచారం చేశారు. దీంతో స్థానిక ప్రజలు అధిక మొత్తంలో ప్రజా దర్బార్కు హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని, రేషన్ కార్డులు కావాలని, పెన్షన్లు ఇప్పించాలంటూ పలువురు ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. రేషన్ కార్డులు మంజూరుకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని, అనుమతి రాగానే అందరికీ పథకాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో సమస్య సద్దు మణిగింది. అధిక మొత్తంలో ప్రజలు పథకాల కోసం హాజరవడంతో జనాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగి రభస చోటు చేసుకుంది. -
వీధి కుక్కల నియంత్రణకు సహకరించాలి
నెహ్రూనగర్: నగరంలో వీధికుక్కలకు కుటుంబ నియంత్రణ, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ అవసరమని, అందుకు జంతు ప్రేమికులూ సహకరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అభ్యర్థించారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో జంతు ప్రేమికులు, పశుసంవర్ధక శాఖ, నగరపాలక సంస్థ ప్రజారోగ్య శాఖ అధికారులతో ఏబీసీ నిర్వహణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ వీధి కుక్కల కుటుంబ నియంత్రణ, సంక్షేమానికి సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు. నగరంలో వీధి కుక్కల సమస్యలపై ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, ఇటీవల ఇద్వా నగర్లో కుక్క దాడిలో ఐజాక్ అనే బాలుడు మృతి చెందడం భాదకరమన్నారు. ప్రస్తుతం నగరంలో పశుసంవర్ధక శాఖ లెక్కల మేరకు 35 వేలకు పైగా వీధి కుక్కలు ఉన్నాయని, వీటికి నగరపాలక సంస్థ ఏటుకూరు రోడ్ లోని ఏబీసీ చేస్తుండగా కొందరు జంతు ప్రేమికుల పేరుతో లేవనెత్తిన ఫిర్యాదుల మేరకు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందన్నారు. కేంద్ర బృందం పరిశీలన అనంతరం వారి సూచనల ప్రకారం తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏబీసీ ఆపరేషన్లు వెంటనే పునఃప్రారంభం చేయడానికి పశుసంవర్ధక శాఖ నుంచి 5 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లను నియమించిందన్నారు. స్టేరిలైజేషన్ చేసిన కుక్కలను అదే ప్రాంతంలో వదిలేలా, చేసిన వాటికీ ప్రత్యేక ట్యాగ్లు ఏర్పాటు చేస్తామన్నారు. సదరు కార్యకలాపాలను జంతు ప్రేమికులు కూడా నేరుగా పరిశీలించవచ్చన్నారు. అనంతరం జంతు ప్రేమికులు చెప్పిన అంశాలను, ఫిర్యాదులపై కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్య పరిష్కారం చేసుకుంటూ, ఏబీసీ నిర్వహణ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సీఎంఓహెచ్ డాక్టర్ అమృతం, పశుసంవర్ధక శాఖ నుండి డాక్టర్ చక్రవర్తి, ఈశ్వరరెడ్డి, జీఎంసీ విఏఎస్ డాక్టర్ వెంకటేస్వర్లు, జంతు ప్రేమికులు ప్రదీప్ జైన్, తేజోవంత్, రాజ్యలక్ష్మీ, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు -
యార్డులో 1,35,382 బస్తాలు మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 1,31,198 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,35,382 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.13,800 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,400 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,500 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 62,733 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. తాడేపల్లి ముగ్గురోడ్డుకు చెందిన బూదాల దాస్ (43) మంగళగిరి విజయవాడ పాత జాతీయ రహదారిపై ద్విచక్రవాహనంపై వస్తుండగా ప్రకాష్నగర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో దాస్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దాస్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీ్త్రనిధి రుణలక్ష్యం రూ.150కోట్లు
నరసరావుపేట రూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు రుణాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరక్టర్ పి.ఝాన్సీరాణి తెలిపారు. కోటప్పకొండలోని డీఆర్డీఏ కార్యాలయంలో బుధవారం సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఝాన్సీరాణి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో సీ్త్రనిధి రుణాల లక్ష్యం రూ.120కోట్లు కాగా రూ.47కోట్లు రుణాలు మాత్రమే అందించినట్టు తెలిపారు. సీ్త్రనిధి రుణాలు అందించడంలో బెల్లంకొండ, శావల్యాపురం, చిలకలూరిపేట, నకరికల్లు, రొంపిచర్ల, నాదెండ్ల, ముప్పాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి, నూజెండ్ల మండలాలు మందు వరుసలో ఉన్నాయన్నారు. మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించేందుకు అవసరమైన జీవనోపాధి రుణాలను స్వల్పకాలిక, మైక్రో, ట్రైనీగా వర్గీకరణ చేసి అందిస్తున్నట్టు తెలిపారు. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి -
మొక్కజొన్నకు వాన దెబ్బ
చుండూరు(వేమూరు): గాలులతో కూడిన వర్షం వల్ల మొక్కజొన్న పంట పూర్తిగా నేలవాలింది. పంట ఓదెలు నీటిలో తడిసి పోవడం వల్ల విత్తనాలు బూజుపట్టాయి. వేమూరు నియోజక వర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. రైతులు మొక్కజొన్న కండెలు విరగదీసే పనుల్లో నిమగ్నమయ్యారు. జొన్న పంట కోసి ఓదెలు వేశారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాల వల్ల జొన్న పంట దెబ్బతిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కల్లాల్లో ఎండబెట్టిన మొక్కజొన్న తడిసి పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. తిరిగి ఆరబెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు అతివృష్టి, అనావృష్టి వల్ల నష్టం వాటిల్లుతుండటంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల తడిసిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈదురు గాలుల ప్రభావం కొల్లూరు : రబీ పంట చేతికందే సమయంలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. పంట కోతకొచ్చిన సమయంలో ఇలా నేలవాలడంతో మొక్కజొన్న కండెలు ఇరగదీయడానికి కూలీలకు అదనపు ఖర్చు కానుంది. కండెలు పూర్తి స్థాయిలో విరిచేందుకు ఆస్కారం ఉండదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలుల కారణంగా కృష్ణా పరివాహక లంక గ్రామాలలో సాగులో ఉన్న అరటి, తమలపాకు, బొప్పాయి, దొండ వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. -
రేషన్ బియ్యం పట్టివేత
చినగంజాం: మండలంలోని సంతరావూరు గ్రామం నుంచి అద్దంకికి తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఇంకొల్లు పోలీసులు పట్టుకున్నారు. ఇంకొల్లు ఎస్ఐ జి. సురేష్ కథనం ప్రకారం చినగంజాం మండలంలోని సంతరావూరు గ్రామం నుంచి అద్దంకికి మినీ లారీలో బుధవారం వేకువ జామున అక్రమంగా తరలిస్తున్న 28 బస్తాల రేషన్ బియ్యాన్ని ముందస్తు సమాచారంతో పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అభయాంజనేయ స్వామి ఆలయానికి విరాళం పర్చూరు(చినగంజాం): పర్చూరులో వేంచేసియున్న అభయాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో గది నిర్మాణం కోసం దాతలు రూ. 5,25,116 విరాళంగా అందజేశారు. దేవరపల్లి గ్రామానికి చెందిన రావి రంగనాథ బాబు, నాగవర్ధని దంపతులు తమ కుమారుడు రావి శ్రీధర్ జ్ఞాపకార్థం బుధవారం కమిటీ సభ్యులకు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోట హరిబాబు, కటారి సురేంద్రబాబు, రంగిశెట్టి ఆంజనేయులు, తులసి శివనాగేశ్వరరావు, కృష్ణంశెట్టి శ్రీనివాసరావు, నర్రా రామయ్య, రంగిశెట్టి రామాంజనేయులు, మంగళగిరి కోటేశ్వరరావు, ఒగ్గిశెట్టి నరసింహారావు, దాసరి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగోన్నతుల జాబితాలో ఎస్జీటీలను చేర్చాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగోన్నతుల ద్వారా భర్తీ చేయనున్న స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్టు సీనియారిటీ జాబితాలో అర్హత కలిగిన ఎస్జీటీలను చేర్చాలని ఏపీటీఎఫ్(1938) జిల్లా ప్రధాన కార్యదర్శి కె. నరసింహారావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం నగరపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో డీఈవో సీవీ రేణుకను కలసిన ఏపీటీఎఫ్ ప్రతినిధులు వినతి పత్రం సమర్పించారు. డిగ్రీలో స్పెషల్ తెలుగు, బీఈడీలో తెలుగు మెధడాలజీ కలిగిన వారిని సైతం సీనియార్టీ జాబితాలో చేర్చాలని కోరారు. డీఈవోను కలసిన వారిలో ఉపాధ్యాయులు ఉన్నారు. రూ.5కోట్ల వసూలే లక్ష్యం! ● ఈ ఏడాది ముందస్తు ఆస్తి పన్నుపై అధికారుల కన్ను ● పురపాలక సంఘంలో మూడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు నరసరావుపేట: పురపాలకసంఘ పరిధిలో నివాసం ఉంటున్న గృహ, వాణిజ్య సముదాయాల యజమానుల నుంచి రూ.5కోట్ల అడ్వాన్స్డ్ ఆస్తిపన్ను వసూలును పురపాలక అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది రూ.3.5కోట్లు మాత్రమే వసూలయింది. ఈ మేరకు పన్నుల సేకరణకు పురపాలక కార్యాలయంలో మూడు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. రెండు వాహనాల ద్వారా పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెలాఖరులోపు వచ్చే ఏడాదికి ఆస్తిపన్ను ముందస్తుగా చెల్లించిన వారికి ఐదుశాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటు ఈ ఏడాది కూడా యజమానులు 15 శాతం అధికంగా ఆస్తిపన్ను పెంచి చెల్లించాల్సి ఉంటుందని పురపాలక రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాగా గత మార్చి 31నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.12కోట్ల పన్నులు వసూలు కావాల్సివుండగా అందులో 85శాతం రూ.10.2కోట్లు వసూలైనట్లు పేర్కొన్నారు. మరో రూ.7కోట్లు పెండింగ్ పన్నులు ఉండగా, వాటిలో రూ.1.5కోట్లవరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. -
యువ శాస్త్రవేత్తలుగా ఎంపికై న విద్యార్థులకు అభినందన
గుంటూరు ఎడ్యుకేషన్: ఇస్రో యువికా యువ శాస్త్రవేత్త కార్యక్రమానికి గుంటూరు జిల్లా నుంచి ఎంపికై న విద్యార్థులను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ.భార్గవ్తేజ అభినందించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో భార్గవ్తేజ మాట్లాడుతూ ఇస్రో యువికా యువ శాస్త్రవేత్త కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా 3.50 లక్షల మంది పోటీ పడగా, అందులో కేవలం 350 మంది ఎంపికయ్యారని అన్నారు. వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికై న 10 మంది విద్యార్థుల్లో గుంటూరు జిల్లాకు చెందిన ముట్లూరు జెడ్పీ హైస్కూల్ 9వ తరగతి విద్యార్థి సందు పవన్దుర్గ, డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థి వక్కపట్ల సోమశేఖర్ ఉండడం జిల్లాకు గర్వకారణమన్నారు. మే 18 నుంచి 31 వరకు శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రంలో జరగనున్న యువికా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక, ముట్లూరు జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం జోస్ మేరీ పాల్గొన్నారు. -
డ్రగ్స్తో జీవితాలు బలి చేసుకోవద్దు
ఏఎన్యూ(గుంటూరు): డ్రగ్స్తో జీవితాలు బలి చేసుకోవద్దని యువతకు పోలీస్ విభాగ ఈగల్ టీమ్ ఎస్సీ కె.నగేష్ సూచించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహిస్తున్న ఏఎన్యూ మహోత్సవ్ 2కే25 కార్యక్రమంలో భాగంగా బుధవారం యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ‘ఎరాడికేషన్ ఆన్ డ్రగ్స్’ అనే అంశంపై విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగేష్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామాలను వివరించారు. విశ్వవిద్యాలయాల్లో డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. వీసీ ఆచార్య కె.గంగాధరరావు మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ జోలికి పోరాదని సూచించారు. ఈగల్ ఎస్పీతో కలిసి వర్సిటీ అధికారులు, విద్యార్థులు అధ్యాపకులు డ్రగ్స్ ఎరాడికేషన్పై ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వల్ల తలెత్తే దుష్పరిణామలపై స్కిట్ ప్రదర్శించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, రెక్టార్ ఆచార్య రత్నషీలామణి, ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎం.గోపికృష్ణ, డి. చంద్రమౌళి, కన్వీనర్ డాక్టర్ సిహెచ్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈగల్ టీమ్ ఎస్పీ నగేష్ -
అటల్ టింకరింగ్ ల్యాబ్ పరిశీలన
పెదకూరపాడు: 75త్యాళ్ళూరు జిల్లా పరిషత్ హైస్కూల్లోని అటల్ టింకరింగ్ ల్యాబ్ను రాష్ట్ర బృందం సభ్యులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి, విద్యార్థులతో సంభాషించి, వారు చేస్తున్న ప్రాజెక్టులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ స్టేట్ ఆఫీసర్, యునిసెఫ్ కన్సల్టెంట్ సుదర్శన్ మాట్లాడుతూ రానున్న కాలం అంతా రోబోటిక్, డిజిటల్ టెక్నాలజీదేనని, విద్యార్థులు నూతన టెక్నాలజీని ఉపయోగించి తాము తయారుచేసిన నమూనాలకు స్టార్టప్ ప్రోగ్రాం కింద ప్రోత్సాహక నగదు, పేటెంట్ పొందవచ్చన్నారు. ఇన్నోవేటివ్ స్పిరిట్తో విద్యార్థులు ముందడుగు వేయాలని అన్నారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో విన్నూతనమైన ప్రాజెక్టులను తయారు చేయడానికి విద్యార్థులు సృజనాత్మకతతో ఆలోచించాలన్నారు. హెచ్ఎం ఎ.శ్రీనివాస రెడ్డి, అటల్ ల్యాబ్ ఇన్చార్జి కె.వి.సుబ్బారావు, ఈఆర్డీసీకి చెందిన అమర్, మెంటర్ సుస్మిత, సీఆర్పీ శివ, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గం
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన వంట గ్యాస్ రూ.50, పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.ఆంజనేయులునాయక్ డిమాండ్ చేశారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్టేషన్ రోడ్డులోని గాంధీ పార్క్ వద్ద గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఆంజనేయనాయక్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు సిలిండర్పై రూ.200, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఓట్లు వేయించుకొని మూడవసారి అధికారం చేపట్టి, అనంతరం ఇచ్చిన మాట తప్పారన్నారు. దశల వారీగా గ్యాస్ ధరలు పెంచుతూ రాయితీలు ఎత్తివేశారని విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్న నరేంద్రమోదీ గ్యాస్ సిలిండర్పై రూ.50 పెంచడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచిత గ్యాస్ అంటూ ఊదరగొట్టినా అనేక షరతులు విధిస్తోందన్నారు. దీంతో ఉచిత గ్యాస్ అందకుండా పోతుందన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి.శివకుమారి, టి.పెద్దిరాజు, నాయకులు కామినేని రామారావు, సయ్యద్ రబ్బాని, షేక్ మస్తాన్వలీ, డి.సుభాష్చంద్రబోస్, షేక్ ఖాసీం, మిరపకాయల రాంబాబు పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేసిన సీపీఎం నాయకులు -
ఉన్నత పాఠశాల పునః ప్రారంభానికి చర్యలు
కారంచేడు: యార్లగడ్డ నాయుడమ్మ ఓరియంటల్ (కం) ఉన్నత పాఠశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి పునః ప్రారంభిస్తున్నామని గుంటూరు ఆర్జేడీ బీ లింగేశ్వరరెడ్డి అన్నారు. కారంచేడు గ్రామంలో విద్యాదాతలు యార్లగడ్డ వెంకన్న చౌదరి, యార్లగడ్డ రంగనాయకులు చౌదరిలచే 1956లో చల్లపల్లి రాజా చేతుల మీదగా దీనిని ప్రారంభించారు. బుధవారం బాపట్ల డీఈఓ ఎస్ పురషోత్తంతో కలిసి ఆర్జేడీ పాఠశాల స్థితిగతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన పాఠశాల కరస్పాండెంట్ యార్లగడ్డ రఘుబాబు దీనిపై రాష్ట్ర పాఠశాలల విద్యా కమిషనర్ విజయరామరాజును కలిసి విన్నవించారన్నారు. ఉన్నత పాఠశాలను పునఃప్రారంభించాలని కోరారన్నారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 2025–26 సంవత్సరాలకు సంబంధించి జూన్ 12వ తేదీ నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిషు మీడియంలో విద్యా బోధన ఉంటుందని చెప్పారు. మాజీ ఎంపీపీ యార్లగడ్డ రాఘవయ్య మాట్లాడుతూ అవసరమైన సహకారం అందిస్తామన్నారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను కూడా ఆర్జేడీ పరిశీలించారు. ఈ పాఠశాలను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేస్తామని బాపట్ల డీఈఓ ఎస్ పురుషోత్తం తెలిపారు. అందుకు అవసరమైన అదనపు తరగతి గదులను పాఠశాలకు అప్పగించాలని ఆయన గ్రామ సర్పంచ్ బాలిగ శివపార్వతిని కోరారు. కార్యక్రమంలో చీరాల డిప్యూటీ ఈఓ జి. గంగాధర్, ఎంఈఓలు ఎం.వి. సత్యన్నారాయణ, మొలబంటి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మోడల్స్ స్కూళ్లుగా పాఠశాలలు కారంచేడు: రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలను మోడల్ స్కూల్స్గా విస్తరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, అందుకు తగిన పాఠశాలల ఎంపికను పటిష్టంగా జరపాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు సూచించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో గుంటూరు రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) బి. లింగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. బుధవారం ఆయన కారంచేడు గ్రామంలోని వైఎన్ఓ ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు వచ్చిన అనంతరం ఎమ్మార్సీలో వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. గుంటూరు ఆర్జేడీ కార్యాలయ పరిధిలోని గ్రామాల్లో ఎంపిక చేయబోతున్న పాఠశాలలను పరిశీలించాలని సూచించారు. విద్యాశాఖ కమిషనర్ సూచనలు, సలహాలను ఆర్జేడీ నమోదు చేసుకున్నారు. ఆయన వెంట బాపట్ల డీఈఓ ఎస్ పురుషోత్తం ఉన్నారు. -
తలసేమియా ట్రాన్స్ప్యూజన్ సెంటర్కు స్థలం కేటాయించండి
కలెక్టర్ను కోరిన రెడ్క్రాస్ కార్యవర్గ సభ్యులు నరసరావుపేట: రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ‘మీ డాక్టర్ మీ ఇంటికి’ అనే ప్రాజెక్టు దేశం మొత్తంలో 33 జిల్లాలకు మంజూరు కాగా అందులో పల్నాడు జిల్లా ఒకటని రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కంజుల జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ పి.అరుణ్బాబును కలిసి రెడ్క్రాస్ జిల్లా కార్యకలాపాలను గురించి వివరించారు. ఈ ప్రాజెక్టును త్వరలో ప్రారంభించి జిల్లాలో ఉన్న గిరిజన తండాలు, మత్స్యకారులకు వారి ఇంటి వద్దకే వెళ్లి వైద్యాన్ని అందజేస్తామని తెలియజేశారు. అలాగే జిల్లాకు రెడ్ క్రాస్ ద్వారా తలసేమియా ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ మంజూరైందని, సుమారు రూ.6లక్షల విలువ చేసే సామగ్రి కూడా మంజూరు చేశారని, ఈ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 10 పడకల స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్ కోరారు. ఆర్డీఓ కాంపౌండ్లో ఉన్న 15 సెంట్ల రెడ్క్రాస్ స్థలాన్ని సర్వే చేయించి రెడ్క్రాస్కు కేటాయిస్తే అందులో నూతన భవన నిర్మాణం చేసి ఓల్డ్ ఏజ్ హోమ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, ఉచిత వైద్యశాల, అనాథ శరణాలయం, జనరిక్ మెడికల్ షాప్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి జిల్లా కలెక్టర్ సుముఖత వ్యక్తం చేసినట్లు డాక్టర్ కంజుల తెలిపారు. రెడ్క్రాస్ జిల్లా ఉపాధ్యక్షులు, మేనేజింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఫిజియోథెరపి కౌన్సిల్ ఏర్పాటు చేయండి
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్లో ఫిజియోథెరఫిస్ట్స్ ప్రొఫెషన్ కౌన్సిల్ సభ్యులను తక్షణమే నియమించాలని ఆంధ్రప్రదేశ్ ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాపట్ల వేంకటహరికృష్ణ కోరారు. ఈమేరకు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ వై.వెంకటేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ సుమైలను కలిసి వినతి పత్రం అందజేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫిజియోథెరఫిస్ట్స్ ప్రొఫెషన్ కౌన్సిల్ ప్రత్యేక సభ్యులను నియమించేందుకు గజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. నాటి గజిట్ ఆధారంగా కౌన్సిల్ ఏర్పాటు చేస్తే తమ సమస్యలు పరిష్కరించేందుకు తమకు అవకాశం కలుగుతోందన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ షేక్ సుభాని, రాష్ట్ర కమిటి సభ్యులు డాక్టర్ చెవుల ఏడుకొండలు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ గ్రేస్, డాక్టర్ ఇమ్రాన్ఖాన్, డాక్టర్ రాజేష్ రోషన్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ దయాకర్ తదితరులు ఉన్నారు. తొలుత నూతనంగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వెంకటేశ్వరరావును ఫిజియోథెరఫిస్ట్స్ అసోసియేషన్ నేతలు బొకే అందజేసి సత్కరించారు. -
మనోళ్లే ఆర్పీగా పెట్టుకోండి
● ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ● నియమించిన మెప్మా సిబ్బంది నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ‘మనోళ్లే.. నేను చెప్తున్న కదా.. ఆ అమ్మాయిని రిసోర్స్ పర్సన్(ఆర్పీ)గా పెట్టుకోవాలి’ అంటూ తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ హుకుం జారీ చేశారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఇవ్వడంతో మెప్మా సీఎంఎం పావని, సీఓ సరోజిని కొత్తగా ఓ ఆర్పీని నియమించారు. అంతేగాక ఆమెకు వేరే ఆర్పీ వద్ద నుంచి 22 గ్రూపులను తీసుకుని కేటాయించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సీఎంఎంలు(సిటీ మిషన్ మేనేజర్), సీఓలు(కమ్యూనిటీ ఆర్గనైజర్)ల కంటే ఆర్పీలు ఎక్కువగా ఉన్నారని.. వీరికి జీతాలు చెల్లించేందుకు కూడా అవస్థలు పడాల్సిన దుస్థితి ఉందని, కొత్తవారిని తీసుకోవద్దని మెప్మా ఎండీ స్పష్టంగా ఆదేశించినా సిబ్బంది పెడచెవిన పెట్టారు. ఎమ్మెల్యే లేటర్ ఇచ్చారని కొత్త ఆర్పీని నియమించారు. బుధవారం రామిరెడ్డితోటలోని బంగ్లా మున్సిపల్ స్కూల్లో సమావేశమై కొత్త ఆర్పీని గ్రూపు సభ్యులకు పరిచయం చేశారు. లాగిన్ ఇవ్వడం లేదు కొత్త ఆర్పీ కోసం సమైక్యలో గ్రూపు సభ్యులంతా కలిసి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం మేరకే కొత్త ఆర్పీని నియమించాం. కానీ లాగిన్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం వేరే ఆర్పీల వద్ద ఉన్న గ్రూపుల నుంచి 22 గ్రూపులను కొత్త ఆర్పీకి కేటాయించాం. – పావని, సీఎంఎం -
మహిళలకు అండగా శక్తి యాప్
బాపట్ల టౌన్: శక్తి యాప్ వినియోగంపై మహిళలు, విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. బుధవారం జిల్లాలోని పలు చోట్ల యాప్పై పోలీసులు అవగాహన కల్పించారు. మహిళలు, విద్యార్థినులు ఒంటరిగా ప్రయాణించే సందర్భంలో సేఫ్ ట్రావెల్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. మిర్చివ్యాపారి అదృశ్యంపై కేసు సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడుకు చెందిన ఓ మిర్చి వ్యాపారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్ల పాడు, అబ్బూరు, ఫిరంగిపురం మండలం 113త్యాళ్లూరు, యర్రగుంట్లపాడు తదితర గ్రామాల్లో రైతుల అంగీకారంతో మిర్చి వ్యాపారి తిరుములరావు ఏటా మిర్చి తూకాలు వేసి, వాహనాల్లో లోడు చేసుకుని తరలించేవాడు. గుంటూరులో బడా వ్యాపారులకు విక్రయించి రైతులకు నగదు చెల్లించేవారు. ప్రస్తుత సీజనులో సుమారు 50 మంది రైతుల నుంచి సుమారు రూ. 2 కోట్ల విలువైన మిర్చి సేకరించి గుంటూరులోని ఓ గోదాములో నిల్వ చేశారని, సోదరుడి సహాయంతో కొన్ని దుకాణాలకు నమూనాలు పంపి విక్రయించారని రైతులు ఆరోపిస్తున్నారు. నగదు కోసం రైతులు వ్యాపారి ఇంటికి వెళితే సుమారు పది రోజులుగా కనిపించడం లేదని చెబుతున్నారన్నారు. ఈ క్రమంలో లక్కరాజుగార్లపాడుకు చెందిన కొందరు రైతులు సత్తెనపల్లి రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పది క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం తాళ్ళయపాలెం(తాడికొండ): అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన ఘటన తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం తాళ్ళాయపాలెం గ్రామంలో నల్లబజారుకు తరలించేందుకు 20 సంచుల్లో సిద్ధంగా ఉంచిన 10 కిలోల రేషన్ బియ్యాన్ని మంగళవారం అర్ధరాత్రి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఎస్ఐ బాబురావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడులలో రేషన్ బియ్యంతో పాటు వాటిని తరలిస్తున్న ఉగ్గం అజయ్ కుమార్, మొగిలి వెంకట్రావులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తుళ్ళూరు ఎస్ఐ బాబురావు తెలిపారు. -
స్ఫూర్తిదాయకం .. కేఎస్ సామాజిక దృక్పథం
పట్నంబజారు: సామాజిక స్ఫూర్తితో మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ప్రజా సంఘాలు, పలువురు మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల నేతలు కలిసి బుధవారం బృందావన్ గార్డెన్స్లోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు సత్కార సభ నిర్వహించారు. అప్పిరెడ్డి మాట్లాడుతూ అధ్యాపకుడిగా వేలాది మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యావేత్త.. అనేక కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఉజ్వల భవిష్యత్తు అందించిన మేధావిగా కొనియాడారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసిన సామాజిక ఉద్యమకారుడు అని చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ మాట్లాడుతూ నిరాడంబరత, సమయపాలనకు ఆయన పెట్టింది పేరని, సామాజిక ఉద్యమకారుడిగా ఆయన చేసిన కృషిని వీడియోల రూపంలో భద్రపరిస్తే భావితరాలకు అది ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు వి.లక్ష్మణరెడ్డి, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి ఆయన సేవలను కొనియాడారు. స్పందించిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ముందుకు సాగుతూ సమస్యలపై పోరాడేందుకు ముందు నిలబడడం తనకు అలవాటుగా మారిందని వివరించారు. ఈ క్రమంలోనే గుంటూరులో జరిగిన అన్ని ప్రజోపయోగ పోరాటాల్లో తన వంతు పాత్ర పోషించినట్లు తెలిపారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి, స్ఫూర్తి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి బందా రవీంద్రనాథ్, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధి గోరంట్ల వెంకట్రావు, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ధనుంజయరెడ్డి, సీపీఎం నేత భారవి, విశ్రాంత ప్రధాన అధ్యాపకులు డీఏఆర్ సుబ్రహ్మణ్యం, ముత్యం పాల్గొన్నారు. -
పీహెచ్సీలలో డీఎంహెచ్ఓ తనిఖీలు
అచ్చంపేట(క్రోసూరు): పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. మాదిపాడు పీహెచ్సీ పరిధిలోని చింతపల్లి, మాదిపాడు సబ్ సెంటర్స్లో జరిగే సాధారణ ఇమ్యూనైజేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి డీఎంహెచ్ఓ పలు సూచనలు చేశారు. చిన్న పిల్లల వాక్సినేషన్ను వేసవి దృష్ట్యా ఉదయం 11 గంటల లోపు ముగించాలని తెలిపారు. అనంతరం పీహెచ్సీ కార్యకలాపాలపై వైద్యాధికారి డాక్టర్ ఎం.ఇన్నారావును అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో జిల్లా ప్రోగ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ డి.హనుమకుమార్ పాల్గొన్నారు. అచ్చంపేట పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సీహెచ్ స్రవంతి, మాదిపాడు సీహెచ్ఓ హర్ష వర్ధన్, శివ నాగేశ్వరి, ఆరోగ్య విస్తరణ అధికారి పి.వెంకటరావు, హెల్త్ ఎడ్యుకేటర్ పార్వతి, సూపర్వైజర్ పి.రాధాకృష్ణ, సిబ్బంది ఉన్నారు. జిల్లా వైద్యశాలలో పర్యటించిన కాయకల్ప బృందం తెనాలిఅర్భన్: తెనాలి జిల్లా వైద్యశాలలో బుధవారం కాయకల్ప బృందం పర్యటించింది. మంగళగిరిలోని నేషనల్ హెల్త్ మిషన్ అధికారులు డాక్టర్ నిర్మలగ్లోరి, డాక్టర్ స్టెఫిగ్రేస్లు తల్లీపిల్లల వైద్యశాలలోని పలు వార్డులు, ఆపరేషన్ ఽథియేటర్, జిల్లా వైద్యశాలలోని పలు వార్డులు, ల్యాబ్లను పరిశీలించి అక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించారు. డాక్టర్ నిర్మల గ్లోరి మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా తెనాలి రావటం జరిగిందన్నారు. ఆస్పత్రిలో నిబంధనలకు అనుగుణంగా రోగులకు సేవలు అందింస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రిలో శానిటేషన్ బాగోకపోతే ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉంటుందన్నారు. దానిపై ప్రత్యేక పరిశీలన జరుపుతున్నట్లు వివరించారు. జిల్లా వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. వారి వెంట వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, నర్సింగ్ సూపరింటెండెంట్ రాజేశ్వరి ఉన్నారు. -
మూల విరాట్ను తాకిన సూర్యకిరణాలు
జంపని(వేమూరు): ఏకాదశి పర్వదినం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్ చెన్నకేశవున్ని సూర్య కిరణాలు తాకాయని దేవస్థానం అర్చకులు మేడూరు శ్రీనివాసమూర్తి తెలిపారు. మండలంలోని జంపని గ్రామంలో చెన్న కేశవాలయంలో మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు మూలవిరాట్ స్వరూపం చెన్నకేశవున్ని సూర్యకిరణాలు తాకాయి పాదాల నుంచి కిరీటం వరకు స్వామి వారి ప్రతి అంగాన్ని తాకుతూ 40 నిమిషాలకు పైగా సూర్య భగవాసుడు కేశవున్ని స్పృశించాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచుగా స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు తెలిపారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శృంగేరి ప్రతినిధులు అద్దంకి రూరల్: పుణ్యక్షేత్రమైన శింగరకొండపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం శృంగేరి ప్రతినిధులు సందర్శించారు. మేనెల 19వ తేదీన నిర్వహించనున్న మహా కుంభాభిషేకం సందర్భంగా పీఠాధిపతులు విచ్చేయుచున్నందున ముందుగా వారి ప్రతినిధులు లక్ష్మీ నరసింహాస్వామిని సందర్శించారు. వారిని కార్యనిర్వహణాధికారి, అర్చకులు ఆలయ సంప్రదాయాలు ప్రకారం ఆహ్వానించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెంటేల శరత్కు యువ ఔత్సాహిక రైతు పురస్కారం మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం బబ్బెపల్లి గ్రామానికి చెందిన పెంటేల శరత్బాబు యంగ్ ఇన్నోవేటివ్ ఫార్మర్ పురస్కారం అందుకున్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన రైతు సదస్సులో శరత్ ఈ పురస్కారం అందుకున్నారు. ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ ( నిర్కా)సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి శాసీ్త్రయ సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ నూతన పోకడలను అవలంభిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న 17 మంది యువ ఔ త్సాహిక రైతులను ఎంపిక చేశారు. వారిలో పెంటేల శరత్ ఒకరు. ఫార్మర్స్ సొసైటీని స్థాపించి ఉమ్మడి వ్యవసాయ విధానంతో రైతు సంక్షేమం సాధ్యమే అంటున్న శరత్ను యంగ్ ఎంటర్ర్పైడర్గా గుర్తించి నిర్కా సంస్థ చైర్మన్ శేషు మాధవ్ షీల్డును, ప్రశంసాపత్రాన్ని అందించి శరత్ను సత్కరించి సన్మానించారు. కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జి.వెంకట్, రాధ దంపతులు రూ.1,00,116 విరాళం సమర్పించారు. మంగళవారం ఉదయం వారు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ కమిషనర్కు చిన్నారులు లావణ్య, ప్రవీణ్ చౌదరి పేరున విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెదగార్లపాడులో వైభవంగా రథోత్సవం దాచేపల్లి : పెదగార్లపాడులో రథోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. శ్రీరామనవమి పండుగ ముగిసిన తరువాత మూడవ రోజున గ్రామంలో రథోత్సవం జరుపుతారు. రామాలయంలో ఉన్న రథాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించి, అర్చకులు పూజలు చేసిన అనంతరం రథోత్సవ కార్యక్రమం చేపట్టారు. -
కుక్కకాటు..ప్రాణాలకు చేటు
గుంటూరు మెడికల్: జిల్లాలోని కాకుమానులో ఆరేళ్ల చిన్నారి కౌసర్ 2016లో కుక్కలదాడిలో మృతిచెందగా, 2017 సెప్టెంబర్ 21న గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడులో నాలుగేళ్ల ధూపాటి ప్రేమ్కుమార్ కుక్కలు కరిచి మృతిచెందాడు. తాజాగా స్వర్ణభారతినగర్కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఐజాక్ ఈనెల 6వ తేదీన కుక్కల దాడిలో చనిపోయాడు. కేవలం పిల్లలే కాకుండా పెద్దవారు సైతం కుక్కకాటు బారిన పడి మరణిస్తున్నారు. ప్రతి ఏడాది జిల్లాల్లో కుక్కకాటు ద్వారా 10 మందికి పైగా మరణిస్తున్నారు. కుక్కకాటు ద్వారా సంభవించే రేబిస్ వ్యాధి 2011లో ఉభయ తెలుగు రాష్ట్రాలను వణికించివేసింది. ప్రతి కుక్కలోనూ రేబిస్ వైరస్ ఉండదు. కానీ వైరస్ ఉన్న కుక్క ఏదో తెలియదు. కాబట్టి ప్రతి కుక్కకాటును సీరియస్గానే పరిగణించాలి. పిచ్చికుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మనుషులు రేబిస్కు గురైతే.. మనుషులు రేబిస్ వ్యాధికి గురైనప్పుడు దవడ, గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి ఎంత దాహం వేసినా నీటిని తాగలేరు. ఎక్కువ సందర్భాల్లో రోగి నీటిని చూసినా, నీటి శబ్ధం విన్నా భయకంపితులవుతారు. ఈ లక్షణాన్ని హైడ్రో ఫోబియా అని పిలుస్తారు. ఇలాంటి స్థితిలో మతిస్థిమితం కోల్పోయి ఊపిరి పీల్చుకోలేక మనుషులు కూడా మరణిస్తారు. కుక్కకాటు బాధితులు.... గుంటూరు జీజీహెచ్లో 2023లో 34,931 మంది కుక్కకాటు బాధితులు ఇంజక్షన్లు చేయించుకున్నారు. 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు 40,262 మంది కుక్కకాటు బాధితులు ఇంజక్షన్లు చేయించుకున్నారు. 2025 జనవరిలో 3157 మంది, ఫిబ్రవరి 2877 మంది, మార్చిలో 2728 మంది ఇంజక్షన్లు చేయించుకున్నారు. ఏప్రిల్ 1న 66 మంది, ఏప్రిల్ 2న 95 మంది, ఏప్రిల్ 3న 117, ఏప్రిల్ 4న 87 మంది, ఏప్రిల్ 5న 93, ఏప్రిల్ 7న 137 మంది కుక్కకాటు ఇంజక్షన్లు చేయించుకున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలి పిచ్చికుక్క కరిచిన వెంటనే గాయాన్ని చల్లటి నీటితో, సబ్బుతో కడగాలి. గాయంపై నీరు ధారగా పడే విధంగా చేయాలి. గాయంపై టింక్చర్ అయోడిన్ వేయాలి. గాయానికి కుట్లు వేయటం, ఆయింట్మెంట్ పూయటం, గాయాన్ని నిప్పుపెట్టి కాల్చటం, కోయటం వంటివి చేయకూడదు. కుక్క కరిచిన వెంటనే సాధ్యమైనంత మేరకు త్వరగా వైద్యులను సంప్రదించి టీకాలు వేయించకోవటం ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలి. – డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరుప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్లు... గుంటూరు జీజీహెచ్లోనూ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కుక్కకాటు బాధితులకు ర్యాబీపూర్ వ్యాక్సిన్లు చేస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రతి రోజూ సుమారు 70 నుంచి 80 మంది కుక్కకాటు వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. అవుట్ పేషేంట్ విభాగంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉచితంగా ర్యాబీపూర్ వ్యాక్సిన్ను చేస్తున్నారు. అత్యవసర విభాగంలో అన్ని వేళలా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. – డాక్టర్ యశశ్వి రమణ, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్● రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు జిల్లాలో ప్రతి ఏడాది 10 మందికిపైగా మృత్యువాత ఇటీవల కుక్కలదాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులో ర్యాబీపూర్ వ్యాక్సిన్లు కుక్కకాటు మరణాలుకుక్కకాటుకు సకాలంలో ఇంజెక్షన్లు చేయించకపోవటంతో గుంటూరు గోరంట్లలోని ప్రభుత్వ ఛాతీ, సాంక్రమిత వ్యాధుల ఆస్పత్రి (జ్వరాల ఆస్పత్రి)లో చికిత్స పొందుతూ 2020లో ఏడుగురు, 2021లో 13 మంది మరణించారు. 2022లో తొమ్మిది మంది, 2023లో 13 మంది, 2024 తొమ్మిది మంది చనిపోయారు. -
మహిళల హక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ జె వెంకటమురళిబాపట్లటౌన్: మహిళల హక్కులకు భంగం వాటిల్లితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి హెచ్చరించారు. బాపట్ల పట్టణంలోని సఖి వన్ స్టాప్ సెంటర్ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గృహ హింస నుంచి రక్షణ కోరి వచ్చే బాధిత మహిళలకు సఖి వన్ స్టాప్ సెంటర్ రక్షణ కవచంలా ఉండాలన్నారు. జిల్లాలో ఏర్పాటైన సఖి వన్ స్టాప్ సెంటర్ మహిళలకు ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు. సమాజంలోని మహిళలు వివిధ రూపాలలో గృహహింసకు గురవుతున్నారన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకే సఖి వన్ స్టాప్ సెంటర్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయన్నారు. జిల్లాలో ఎక్కడ నుండైనా, ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనైనా మహిళలు ఉన్నట్లు సమాచారం వస్తే తక్షణమే సఖి వన్ స్టాప్ సెంటర్ తమ కార్యకలాపాలను ప్రారంభించాలన్నారు. రాజకీయ ఒత్తిడిలు, ప్రలోభాలకు ఎట్టి పరిస్థితులలో గురికారాదన్నారు. అత్యవసరంగా బాధిత మహిళలు ఈ కేంద్రానికి వస్తే ఐదు రోజులపాటు ఆశ్రయం కల్పించే అంశాలపై ఆయన ఆరా తీశారు. ప్రస్తుతం కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాధిత మహిళతో కలెక్టర్ మాట్లాడారు. న్యాయ సలహాలు, సేవలు, వసతి సౌకర్యాలు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. ఇక్కడ 14 పోస్టుల్లో 11 మాత్రమే భర్తీ కాగా, ఒక్కొక్కరిని పిలిచి, వారి విధుల నిర్వహణ గురించి తెలుసుకున్నారు. ఇద్దరు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలన్నారు. ఈ కేంద్రానికి పురుషులను ఎట్టి పరిస్థితులలో అనుమతించరాదన్నారు. ఎవరూ ఇక్కడకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేస్తే బాధిత మహిళలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ డి.రాధామాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ పాల్గొన్నారు. అనాధ పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు అనాధ పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి హెచ్చరించారు. పట్టణంలోని శిశు గృహం, బాలసదన్ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులో 9 మంది అనాధ పిల్లలు ఉన్నట్లు రాశారు. వాస్తవంగా నలుగురు మాత్రమే ఉండడంపై నిర్వాహకులను ప్రశ్నించారు. ఏడాదిలోపు వయసు ఉన్న నలుగురు శిశువులనే ఇక్కడే ఉంచామని, మిగిలిన చిన్నారులు అంగన్వాడీ కేంద్రంలో ఉన్నారని సంబంధిత అధికారులు కలెక్టర్కు వివరించారు. అనాధ శిశువులకు అందిస్తున్న పోషణ, వారి సంరక్షణ చర్యలు, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సంబంధిత రికార్డులను ఆయన పరిశీలించారు. శిశు గహ మేనేజర్, మరొక సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడంపై చార్జిమెమో జారీ చేయాలని ఆదేశించారు. ఏడాది బాలిక బలహీనంగా ఉండడంపై ఆరా తీసి చిన్నారికి మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి ఆదేశించారు. శిశు గృహంలో సీసీ కెమెరాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనాధ పిల్లలను కొడుతున్నట్లు సమాచారం వచ్చిందని, అలా చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం బాలసదన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న అనాధ బాలికలు, పాక్షిక అనాధ బాలికల వివరాలపై ఆరా తీశారు. వసతులు, సౌకర్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ డి.రాధా మాధవి, డీసీపీఓ పురుషోత్తం తదితరులు ఉన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2025–2026 ఆర్థిక సంవత్సరంలో 10వేల కుటుంబాలకు పాడి పశువులను అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారన్నారు. లబ్ధిదారుల ఎంపిక చేయాలని పశు వైద్య శాఖ అధికారిని ఆదేశించామన్నారు. పశువుల నీటితొట్టెల నిర్మాణ లక్ష్యాలను ఈ నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులు, హెల్త్ పెన్షన్ల విషయమై డీఆర్డీఏ పీడీతో చర్చించారు. ప్రతి జిల్లాలో 10వేల ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇందుకోసం జిల్లాలో ఒక్కొక్క పంచాయతీలో 50 ఎకరాల చొప్పున స్థల సేకరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణపై మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. అన్న క్యాంటీన్కి వచ్చే వారి వివరాలను నమోదు చేయాలన్నారు. వారి నుండి ప్రజాభిప్రాయం సేకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, బాపట్ల, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025దరఖాస్తు ఇలా.. ఓటరు క్లెయిమ్ల విచారణ వేగవంతం చేయండి ఆర్డీవో టి.చంద్రశేఖర నాయుడు చీరాలటౌన్: చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో బూత్లెవల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న (బీఎల్వోలు) విధులను సమర్థంగా నిర్వహించి ఓటరు క్లైమ్ల విచారణ వేగవంతంగా చేయాలని ఈఆర్వో, ఆర్డీవో టి.చంద్రశేఖరనాయుడు సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో చీరాల నియోజకవర్గంలోని బీఎల్వోలతో ఆర్డీవో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ 106 చీరాల నియోజకవర్గంలో ఓటరు క్లెయిమ్ అర్జీలు పెండింగ్లో లేకుండా బీఎల్వోలు సమర్దవంతంగా పనిచేయాలన్నారు. ఓటరు క్లెయిమ్ అర్జీని నిశితంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అవాంతరాలు లే కుండా విచారణ చేయాలన్నారు. అభ్యంతరాల వివరాలను తెలియజేయాలన్నారు. ఇటీవల మృతిచెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. ప్రతీ బీఎల్వో వారికి కేటాయించిన పోలింగ్ బూత్లోని ఓటర్ల పూర్తి వివరాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. క్లెయిమ్ల విచారణలో ఈసీ నిబందనల ప్రకారం చేయాలని ఇష్టానుసారంగా విధులు నిర్వహించవద్దన్నారు. బీఎల్వోలకు ఉన్న ప్రతీ సమస్యలను తనకు గానీ, ఏఈఆర్వోలకు గాని తెలియజేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ కె.గోపికృష్ణ, ఎన్నికల డీటీ సుశీల, మున్సిపల్, వేటపాలెం మండలాల్లోని బీఎల్వోలు పాల్గొన్నారు. అలానే చీరాల ఆర్డీవో కార్యాలయంలో అన్నీ రాజకీయపార్టీల నాయకులతో ఆర్డీవో సమావేశాన్ని నిర్వహించి ఓటరు క్లెయిమ్ల విచారణలకు సంబందించిన అన్నీ వివరాలను పార్టీల నాయకులకు వివరించారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 516.00 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 2,053 క్యూసెక్కులు విడుదలవుతోంది.గుంటూరు ఎడ్యుకేషన్: ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్ – 2025 ఆన్లైన్ దరఖాస్తు గడువు మరో 15 రోజుల్లో ముగియనుంది. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2025కు ఈనెల 24వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. ఏపీ ఈఏపీసెట్లో అర్హత సాధించిన విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. సీనియర్ ఇంటర్ పరీక్షలు రాసిన ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు cets. apsche.ap.gov.in వెబ్సైట్కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2025ను ఎంపిక చేసుకోవాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. ధ్రువపత్రాల వివరాలు తప్పనిసరి ● ఏపీ ఈఏపీ సెట్కు దరఖాస్తు చేసే సమయంలో వివిధ కేటగిరీల పరిధిలోకి వచ్చే విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలు తప్పనిసరిగా సిద్ధం చేసుకోవాలి. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్ కేటగిరీల వారీగా తమ సామాజిక వర్గాన్ని ఎంపిక చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్లో క్లిక్ చేయాలి. అదేవిధంగా సంబంధిత ధ్రువపత్రానికి సంబంధించిన నంబరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్, ఆదాయ ధ్రువపత్రాల నంబరును సైతం విధిగా నమోదు చేయాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ ఒకటో తేదీ తరువాత తీసుకున్న ధ్రువపత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. ● విద్యార్థుల స్థానికత నిర్ధారణకు 6వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు ఏ విద్యాసంస్థల్లో, ఏ ఊరిలో చదివారనే వివరాలను ఆయా విద్యాసంవత్సరాల వారీగా నమోదు చేయాలి. చివర్లో ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఏ జిల్లాలో రాస్తారనే సమాచారంతో కూడిన ట్యాబ్లను ప్రాధాన్యత క్రమంలో క్లిక్ చేయాలి. ఈ విధంగా ఐదు ప్రాధాన్యతలను క్లిక్ చేయాలి. ఉదాహరణకు గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి తన సొంత జిల్లాలో పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఎంపిక చేసుకున్నప్పటికీ, అక్కడి పరీక్షా కేంద్రంలో పరిమితి మించిపోవడం, ఇతరత్రా కారణాలతో పరీక్షా కేంద్రం అందుబాటులో లేని పక్షంలో తరువాత వరుస క్రమంలో ఇచ్చిన ప్రాధాన్యతల వారీగా ఆయా జిల్లాల్లో పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తారు. ● ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేసిన తరువాత ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష జరిగే రోజున ఏపీ ఈఏపీ సెట్ హాల్ టిక్కెట్తో పాటు ఆన్లైన్ ప్రింటవుట్ కాపీపై ఫొటో అంటించి పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్కు అందజేయాలి. 7న్యూస్రీల్ దరఖాస్తు చేసేందుకు ఈనెల 24 చివరి తేదీ ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు పరీక్ష మే 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27వరకు ఇంజినీరింగ్కు సంబంధించి టెస్ట్ దరఖాస్తు సమయంలో జాగ్రత్తలతో కౌన్సెలింగ్లో తొలగనున్న ఇబ్బందులుఏపీఈఏపీసెట్–2025 సైట్కు లాగిన్ అయిన తరువాత ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఐదు దశల్లోని ప్రక్రియను పూర్తి చేయాలి. స్టెప్–1 మొదలు స్టెప్–5 వరకు ఐదు దశల్లో కనిపించే ట్యాబ్లను వరుస క్రమంలో క్లిక్ చేస్తూ, పొందుపర్చిన వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. స్టెప్1: ‘ఎలిజిబులిటీ క్రైటీరియా అండ్ ఫీజు పేమెంట్’కు లాగిన్ అయ్యి సీనియర్ ఇంటర్ హాల్టికెట్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, మొబైల్ నంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నంబరు, ఈ–మెయిల్ ఐడీ నమోదు చేయాలి. దీంతో పాటు ఇంజినీరింగ్–ఫార్మసీ, అగ్రికల్చర్–ఫార్మసీ, బోత్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీల వారీగా తాము రాయబోయే ప్రవేశ పరీక్ష, చేరనున్న కోర్సుల వారీగా మూడు ఆప్షన్లలో ఒక దానిని ఎంపిక చేసుకుని, క్లిక్ చేయాలి. తరువాత సామాజిక వర్గాల వారీగా కేటగిరీపై క్లిక్ చేసి, ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలి. క్రెడిట్, డెబిట్కార్డు, నెట్ బ్యాంకింగ్ మార్గాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంది. స్టెప్–2: నో యువర్ పేమెంట్ స్టేట్స్పై క్లిక్ చేసి, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, మొబైల్ నంబరు, పుట్టిన తేదీ వివరాలు పూర్తి చేయాలి. తదుపరి చేరనున్న కోర్సుల వారీగా ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్లలో ఏదైనా ఒక దానిని ఎంపిక చేసుకుని క్లిక్ చేయడంతో స్టెప్–2 దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. స్టెప్–3: ఫిల్ అప్లికేషన్లో పేమెంట్ చేసిన ఐడీతో పాటు సీనియర్ ఇంటర్ హాల్ టికెట్ నంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి. అనంతరం ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్పై క్లిక్ చేయాలి. స్టెప్–4: ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్పై క్లిక్ చేసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారాన్ని సందర్శించవచ్చు. స్టెప్–5: ఇక్కడ క్లిక్ చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి. ఫీజు చెల్లించే సమయంలో ఇచ్చిన రిఫరెన్స్ ఐడీ, విద్యార్థి పేరు, సీనియర్ ఇంటర్ హాల్ టికెట్, పుట్టినతేదీ వివరాలతో భవిష్యత్తులో ఈఏపీ సెట్ హాల్ టిక్కెట్, పరీక్షకు హాజరయ్యే సమయంలో సంబంధిత వివరాలు కీలకంగా మారుతాయి. -
వధూవరులుగా దుర్గామల్లేశ్వరులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం నుంచి చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీగంగా పార్వతి(దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు మల్లేశ్వర ప్రాంగణంలో పంచామృత అభిషేకాలు, మంగళస్నానాలు నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించి, పెళ్లికుమారుడు, పెళ్లి కుమార్తెగా అలంకరించారు. సాయంత్రం 4 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అంకురార్పణ, అఖండ దీప స్థాపన, కలశారాధన, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం వంటి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు జరిపించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి వార్ల ఉత్సవమూర్తులను వెండి పల్లకీపై ఉంచి నగరోత్సవ సేవ నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహా మండపం నుంచి వెండి పల్లకీ సేవ ప్రారంభం కాగా, మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాలు, భజన బృంద సభ్యులతో ఊరేగింపు కనుల పండువగా సాగింది. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణ వీధి, కొత్తపేట, సామారంగం చౌక్ మీదగా తిరిగి ఆలయానికి చేరుకుంది. పూజా కార్యక్రమాలు, నగరోత్సవ సేవలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉపప్రధాన అర్చకులు కోట ప్రసాద్ పాల్గొన్నారు. వేడుకగా మంగళ స్నానాలు వెండి పల్లకీపై ఊరేగిన ఆదిదంపతులు -
జీవ నియంత్రణ పద్ధతులు సమష్టిగా చేపట్టాలి
గుంటూరు రూరల్: రైతులు విచక్షణ రహితంగా వినియోగిస్తున్న ఎరువులు, పురుగు మందుల వల్ల సాగు ఖర్చు పెరుగుతుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి అన్నారు. రైతులు సుస్థిర వ్యవసాయ విధానాలు, జీవనియంత్రణ పద్ధతులు సమష్టిగా చేపట్టాలని తెలిపారు. నగర శివారులోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతు రక్షణ వేదిక ఆధ్వర్యాన మంగళవారం ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎందుకు? ఎలా అనే అంశంపై చర్చా గోష్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ అధిక రేటు, అధిక ఆదాయం ఇచ్చే పంటలను పండించాలని సూచించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి జరగాలని, విత్తన సాధికారత సాధించాలని, కౌలురైతులకు ప్రోత్సాహాలను కల్పించాలని, బయో డైవర్సిటీ, కమ్యూనిటీ సీడ్ డెవలప్మెంట్, పాతతరం విత్తనాలను సంరక్షించుకోవాలని, సుస్థిర వినియోగం, సాంప్రదాయ వ్యవసాయ విధానలు చేపట్టాలని సూచించారు. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్లు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు రైతులకు వెన్నంటి ఉండి సుస్థిర దిగుబడులకు దోహదం చేయాలని కోరారు. రైతులను సంఘటితం చేయాలని, యువతను వ్యవసాయంవైపు ఆకర్షించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అనంతరం ప్రత్యామ్నాయ వ్యవసాయం ఎలా? ఎందుకు అనే అశంపై డాక్టర్ వేణుగోపాలరెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. రైతు రక్షణ వేదిక ప్రతినిధి డాక్టర్ కె రాజమోహన్రావు, హైదరాబాద్కు చెందిన నేషనల్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ ప్రొపెసర్ డాక్టర్ డి నరసింహారెడ్డి, సెంటర్ ఫర్ స్టెయినబుల్ అగ్రికల్చర్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు, ఎస్బీపీజీఆర్ ప్రతినిధి డాక్టర్ బి శరత్బాబు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్ శారదజయలక్ష్మిదేవి -
ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా బోయిన రమేష్బాబు
చీరాల రూరల్: చీరాల కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న బోయిన రమేష్బాబు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా (ఏజీపీ)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుండి తనకు ఉత్తర్వులు అందినట్లు రమేష్బాబు తెలిపారు. విశాఖపట్టణంలోని ఆంధ్రా యూనివర్సిటీలో న్యాయవాద శాస్త్రం అభ్యసించిన ఈయన 2003 నుండి చీరాల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. చీరాలతో పాటు పర్చూరు, ఒంగోలు, గుంటూరు, బాపట్ల, ఏలూరు, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, విశాఖ వంటి కోర్టులలో కూడా విధులు నిర్వర్తించి మంచి పేరు సంపాదించారు. ఇప్పటి నుండి మూడేళ్లపాటు రమేష్బాబు ఏజిపి ఈ పదవిలో కొనసాగనున్నారు. గత కొన్నేళ్లుగా చీరాలలో ఏజిపి పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం ఈ పదవిలో ఎవరిని నియమించలేదు. రెండు నెలల కిందట బాపట్ల కోర్టులో ఏజీపీగా విధులు నిర్వర్తిస్తున్న శ్యామలాదేవిని ప్రభుత్వం ఇన్చార్జ్ ఏజీపీగా చీరాల కోర్టులో నియమించింది. అప్పటి నుండి శ్యామలాదేవి ఈ వదవిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఆస్థులు అన్యాక్రాంతం కాకుండా తనవంతుగా కృషి చేస్తానని రమేష్బాబు తెలిపారు. తనకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్య, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చీరాల కోర్టులో ఏజీపీ పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్బాబును స్థానిక న్యాయవాదులు అభినందించి హర్షాతి రేఖాలు వ్యక్తం చేశారు. -
జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో కానిస్టేబుల్ ప్రతిభ
బాపట్లటౌన్: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బాపట్ల జిల్లా ఖ్యాతి ఇనుమడింపచేయటం హర్షనీయమని జిల్లా ఎస్పీ తుషార్డూడీ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా, చందోలు పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న నాగ బ్రహ్మారెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించి స్విమ్మింగ్లో సాధించిన మెడల్స్తో సత్కరించి, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ నాగ బ్రహ్మారెడ్డి 2025 ఫిబ్రవరి 2న విజయవాడలో జరిగిన 25వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తా చాటారన్నారు. దుర్గా ఘాట్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాలలో ఈది పూర్తిచేసి విజేతగా నిలిచాడు. 2025 మార్చి 24 నుండి 28వ తేదీలలో గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్లో జరిగిన 72వ ఆల్ ఇండియా పోలీస్ ఆక్వాటిక్స్ క్లస్టర్ చాంపియన్ షిప్ 2024–2025 పోటీలలో పాల్గొని సత్తా చాటారన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుజరాత్ లోని గాంధీనగర్లో జరిగిన స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని విజేతగా నిలవడంతోపాటు గతంలో జాతీయ స్థాయిలో మరో 4 అవార్డులు అందుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరెన్నో క్రీడా పోటీలలో పాల్గొని సత్తా చాటాలన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బంది బ్రహ్మారెడ్డి స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరచాలన్నారు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచే పోలీస్ అధికారులను సిబ్బందిని ప్రోత్సహిస్తామన్నారు. అభినందించిన జిల్లా ఎస్పీ తుషార్డూడీ -
ఈ బైక్ డిజైన్ పోటీల్లో ఆర్వీఆర్జేసీ ప్రతిభ
గుంటూరు రూరల్: తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రికల్ బైక్కు జాతీయస్థాయిలో అవార్డులతోపాటు, నగదు బహుమతులను సాధించటం సంతోషకరమని ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, డాక్టర్ జగదీష్ మద్దినేనిలు తెలిపారు. మంగళవారం చౌడవరం గ్రామంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ ఇటీవల గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ యూనివర్సిటీలో ఐఎస్ఐఈ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఈపి ఈబైక్ డిజైన్ ఛాలెంజ్ (సీజన్ 5.0) జాతీయ స్థాయి పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఈ బైక్ ద్వితీయ స్థానంలో నిలిచి రన్నరప్ అవార్డు (రూ.30,000 నగదు బహుమతి), ఫ్యూచర్ అవార్డు (రూ.5,000 నగదు బహుమతి)లను గెలుచుకున్నారన్నారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఆర్ గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె కృష్ణప్రసాద్లు మాట్లాడుతూ ఇంధన కాలుష్యం నివారించేందుకు, ఐఎస్ఐఈ నిర్వహించిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, తమ కళాశాల విద్యార్ధులకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం గర్వకారణమన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాల అధ్యాపక నిపుణుల నేతత్వంలో ఈ–బైక్ వాహన తయారీలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం నుండి 25 మంది విద్యార్థులతో కూడిన జట్టు పాల్గొన్నారన్నారు. ఈ–బైక్ ద్విచక్ర వాహన తయారీలో 60వి, 40 ఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని, 60వి, 2కెడబ్ల్యూ బీఎల్డీసీ మోటార్ను, 4 కెడబ్ల్యూ కంట్రోలర్ను అమర్చడం జరిగిందన్నారు. ఒకసారి ఛార్జ్ చేసిన అనంతరం ఇది 80 కిలోమీటర్ల గరిష్ట వేగంతో సుమారు 90 నుండి 100 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల పరిశోధనలకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక,ఆర్థిక సహాయాలను అందించడానికి కళాశాల యాజమాన్యం కట్టుబడి ఉందన్నారు. అవార్డులను పొందిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ కె రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, డాక్టర్ కె చంద్రశేఖర్, డాక్టర్ డివివి కృష్ణప్రసాద్, పీ వెంకటప్రసాద్, పీ వెంకటమహేష్, ఆర్ మారుతీవరప్రసాద్, తదితరులు అభినందించారు. -
కానిస్టేబుల్కు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
వేటపాలెం: దేశాయిపేట పంచాయతీ ప్రసాద్నగర్లో వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ బిల్లా రమేష్ భౌతికకాయానికి పోలీస్ లాంఛనాలతో రూరల్ ఐఈ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు సారథ్యంలో స్థానిక శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా రూరల్ సీఐ, ఎస్సై కానిస్టేబుల్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. రూరల్ సీఐ మాట్లాడుతూ 2009 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ బిల్లా రమేష్ మృతి పట్ల ఎస్పీ తుషార్ డూడీ తన సంతాపం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారన్నారు. మట్టి ఖర్చుల నిమిత్తం కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు రూ.25 వేలు నగదు పోలీసు అధికారులు అందజేశారు. తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
ఎయిడెడ్ ఉపాధ్యాయుల జీతాలు వెంటనే చెల్లించాలి
డీఈవోకు వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు బాపట్లటౌన్ పర్చూరు మండలం, చెరుకూరు ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మాకు గడిచిన 15 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఉపాధ్యాయులు మంగళవారం డీఈవో పురుషోత్తమ్కు వినతిపత్రం అందజేశారు. చెరుకూరు ఆంధ్ర కేసరి మెమోరియల్ రెసిడెన్సి ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, తెలుగు పండిట్ కె పద్మావతమ్మలకు పాఠశాల యాజమాన్యం వలంటరీ రిటైర్మెంట్ ఇవ్వలేదని 2024 ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్ 2025 వరకు వారి జీతాల బిల్లులు యాజమాన్యం మండల విద్యాశాఖ అధికారికి పంపలేదన్నారు. ఈ విషయంపై డీఈవో ప్రత్యేక అధికారాలను ఉపయోగించి మాకు రావలసిన 15 నెలల జీతాలు చెల్లించాలన్నారు. దీనిపై స్పందించిన డీఈవో విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించండి
ఏపీఈజీఏ జిల్లా అధ్యక్షుడు చాంద్ బాషా గుంటూరు వెస్ట్: ప్రభుత్వ, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ చాంద్బాషా మంగళవారం జిల్లా ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.చంద్రశేఖరరెడ్డిని కోరారు. చాంద్ బాషా మాట్లాడుతూ 2025 మార్చి నుంచి కన్వేయెన్స్ అలవెన్సులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపజేయాలన్నారు. ఎస్టిఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన కంప్యూటర్లు చాలా కాలం నుంచి పనిచేయక ఇబ్బంది పడుతున్నారన్నారు. అనంతరం చాంద్ బాషా ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి డీటీఓకు పుష్పగుచ్ఛం అందజేశారు. అభినందనలు తెలిపిన రిటైర్డ్ ఉద్యోగులు జిల్లా ఖజానా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎం.చంద్రశేఖరరెడ్డిని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ట్రెజరీ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయని జిల్లా అధ్యక్షులు సిహెచ్ వెంకటేశ్వర్లు, నాగరాజు పేర్కొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
తాడికొండ: ఈ నెల 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని తాడికొండలో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్తేజ, ఆర్డీఓ శ్రీనివాసులు పరిశీలించారు. జయభారత్ కాలనీ, పొన్నెకల్లు ఎస్సీ కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను సందర్శించారు. పొన్నెకల్లులో కార్యక్రమ నిర్వహణకు అనువుగా ఉందని నిర్థారించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న ఎస్సీ కుటుంబాలను పీ4 విధానంలో భాగంగా ఉన్న త కుటుంబాలకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎస్సీ కాలనీలో పలువురితో ముచ్చటించి, పొన్నెకల్లు బైపాస్లో ఏర్పాటు చేసిన సభా వేదికకు సీఎం చేరుకుని ప్రసంగిస్తారు. కార్యక్రమంలో తహసీల్దారు మెహర్బాబు, ఎంపీడీవో సమతావాణి ఉన్నారు. ‘శిశిరం’ మరింత గుర్తింపునిస్తుంది చైల్డ్ సూపర్ స్టార్ లిటిల్ భాను తెనాలి: శ్రీకృష్ణ ఆర్ట్స్ పతాకంపై తెనాలి, పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకొంటున్న బాలల సినిమా ‘శిశిరం’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న తనకు, ఈ చిత్రంలో మరింత గుర్తింపు లభిస్తుందని బాల నటుడు, తండేల్ ఫేమ్ భానుప్రకాష్ అన్నాడు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రిన్సెస్ హోటల్లో శిశిరం చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాను మాట్లాడారు. కళల కాణాచి తెనాలిలో షూటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుంచి 11 వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందన్నారు. తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో భాను అద్భుత నటనకు గాను తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఏంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, వన్టౌన్ సీఐ మల్లికార్జున రావు, కొరియా గ్రాఫర్ ‘అమ్మ’ సుధీర్ అభినందించారు. సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం.శ్రీకాంత్, పీఆర్ఓ అంబటి శ్యామ్సాగర్, బాలనటులు పాల్గొన్నారు. రేపు గుంటూరులో జాబ్ మేళా గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్ల సర్కిల్లోని గుంటూరుజిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గాబాయి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి ఆంధ్ర కో–ఆపరేటివ్ బ్యాంక్, సీఐఐ–ఎంసీసీ, పేటీఎం, అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫెయిర్ డీల్ క్యాపిటల్, క్యాప్స్టన్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకై ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫొటోతో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 98668 22697 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. వృద్ధుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు గుంటూరు రూరల్: ఆరేళ్ల చిన్నారిపై యాభై ఏళ్ల వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటనపై నల్లపాడు పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వంశీధర్ తెలిపిన వివరాలు.. చౌడవరం గ్రామం దాసరిపాలెంకు చెందిన శ్రీనివాసరెడ్డి స్థానికంగా నివసించే ఆరేళ్ల బాలికపై తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక అరవటంతో అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
సాగర్డ్యాంపై తెలంగాణ వైపు సీఆర్పీఎఫ్ పహారా ఉపసంహరణ
విశాఖపట్నం 234 బెటాలియన్కు చార్జ్ అప్పగింత విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ వైపు విధులు నిర్వహిస్తున్న ములుగు 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ దళాలు సోమవారం మధ్యాహ్నం 1.45 గంటలకు పహారా విధులు ఉపసంహరించుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆంధ్రవైపు పహారా కాస్తున్న విశాఖపట్నం 234 బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావుకు 39 ములుగు బెటాలియన్ కమాండెంట్ రాఘవ చార్జ్ అప్పగించారు. ఆంధ్రా వైపు నుంచి సీఆర్పీఎఫ్ దళాలు తెలంగాణ వైపు గల డ్యాంమీదకు వెళ్లారు. వీరు జూన్ 23వ తేదీ వరకు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. గత 16 నెలలుగా తెలంగాణ వైపు తెలంగాణ దళాలు, మన రాష్ట్రం నుంచి ఆంధ్ర బెటాలియన్ పహారాలో సాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రస్తుతం పూర్తిస్థాయి ప్రాజెక్టు భద్రత విశాఖపట్నం బెటాలియన్ పహారాలోకి వెళ్లింది. -
● పరిశీలనలో పాల్గొన్న రాష్ట్ర అధికారి వనజ ● జిల్లాలో 6 పాయింట్ల గుర్తింపు
‘విద్యామిత్ర’ స్టాక్ పాయింట్ల పరిశీలన నరసరావుపేట ఈస్ట్: పల్నాడుజిల్లా పరిధిలోని 1,46,044 మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా అందించనున్న వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలని పథకం రాష్ట్ర పరిశీలనాధికారి వనజ తెలిపారు. విద్యా మిత్ర ద్వారా అందించే వస్తువులను భద్రపరిచే స్టాక్ పాయింట్లను మంగళవారం జిల్లా సీఎంఓ పద్మారావు, ఇతర అధికారులతో కలసి పరిశీలించారు. జిల్లాలో శంకర భారతీపురం జెడ్పీ హైస్కూల్ (నరసరావుపేట), జెడ్పీ హైస్కూల్ (రొంపిచర్ల), జెడ్పీ హైస్కూల్ (నకరికల్లు), జెడ్పీ హైస్కూల్ (నాదెండ్ల), సెయింటాన్స్ స్కూల్ (యడ్లపాడు), శారదా హైస్కూల్ (చిలకలూరిపేట) స్టాక్ పాయింట్లుగా గుర్తించారు. రాష్ట్ర పరిశీలకులు వనజ మాట్లాడుతూ, విద్యామిత్ర ద్వారా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, షూస్, బెల్ట్, డిక్షనరీలను అందిస్తున్నట్టు వివరించారు. వాటి భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షానికి తడవకుండా, చెదలు పట్టకుండా చూడాలన్నారు. విద్యా మిత్ర మెటీరియల్ సరఫరాకు రహదారి పరంగా ఇబ్బందులు లేకుండా స్టాక్ పాయింట్లను గుర్తించటంపై విద్యాశాఖాధికారులను అభినందించారు. విద్యుత్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి బెల్లంకొండ: నూతన వీధిలైట్లు అమర్చేందుకు విద్యుత్ స్తంభంపై ఎక్కగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టడంతో జూనియర్ లైన్మెన్ మృతి చెందిన ఘటన మండలంలోని నందిరాజుపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పాపాయపాలెం గ్రామానికి చెందిన మర్రి నరసింహారెడ్డి (35) మండలంలోని మాచయపాలెం గ్రామంలో గ్రేడ్–2 జూనియర్ లైన్మెన్గా గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు. కాగా నందిరాజుపాలెం గ్రామంలో నూతన వీధిలైట్లు వేసేందుకు తోటి సిబ్బంది రమ్మని కోరడంతో వారితో కలిసి వెళ్లాడు. కాగా విద్యుత్ లైట్లు అమర్చేక్రమంలో చేతిలో ఉన్న ఇనుప రాడ్డు విద్యుత్ స్తంభంపై 11కేవీ విద్యుత్ వైర్కు తగలడంతో షాక్ కొట్టింది. విద్యుత్ షాక్తో తీవ్ర గాయాలుకాగా, విద్యుత్ స్తంభంపై నుంచి నరసింహారెడ్డి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నరసింహారెడ్డి మృతితో పాపాయిపాలెం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
తీరప్రాంత పరిరక్షణే సాగర్ కవచ్ ధ్యేయం
బాపట్లటౌన్: తీర ప్రాంత పరిరక్షణే సాగర్ కవచ్ ధ్యేయమని బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. మంగళవారం సూర్యలంక తీరంలోని మైరెన్ పోలీస్స్టేషన్లో సాగర్ కవచ్పై సిబ్బందికి మాక్డ్రిల్ నిర్వహించారు. కవచ్ నోడల్ ఆఫీసర్, బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు మాట్లాడుతూ తీరప్రాంత పరిరక్షణలో భాగంగా ఈనెల 9,10 తేదీల్లో సముద్ర తీరప్రాంతాల్లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏడాదిలో రెండుసార్లు సాగర్ కవచ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా సముద్రమార్గం గుండా ఎవరైనా చొరబాటుదారులు మన ప్రాంతానికి చేరుకుంటే వారిని ముందస్తుగా గుర్తించి వారిని సముద్రంలోనే ఏ విధంగా అడ్డుకోవాలనే అంశాలపై ఇండియన్ నేవీ, కోస్ట్గార్డ్, మైరెన్ పోలీసులతోపాటు తీరప్రాంతానికి చేరుకొని జనసంచారంలో అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వారిని ఏ విధంగా గుర్తించాలనే అంశాలపై సివిల్ పోలీసులకు పలు సూచనలు చేశారు. మారువేషాల్లో వచ్చే సిబ్బందిని ముందస్తుగా పసిగట్టి వారిని అదుపులోకి తీసుకోవాలన్నారు. అప్రమత్తంగా లేని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మాక్డ్రిల్లో మైరెన్, కోస్ట్గార్డు, సివిల్ పోలీసులు 90 మంది పాల్గొన్నారు. కార్యక్రమంలో బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, మైరెన్ సీఐ పి.లక్ష్మారెడ్డి, మైరెన్ ఎస్ఐలు పి.నాగశివారెడ్డి, ఎ.శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. మాక్డ్రిల్లో సిబ్బందికి సూచనలిచ్చిన డీఎస్పీ -
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారుల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకొని ప్రభుత్వానికి పంపాలని ఆయన చెప్పారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి ఆడియో తీసుకొని వారితో సెల్ఫీ దిగి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. జిల్లాలో జరిగిన డి.ఆర్.సి. సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యల రిపోర్టులను తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఎల్. భీమయ్య, జిల్లా గ్రామీణనీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంత రాజు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సర్వే వేగవంతం చేయండి బాపట్ల: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా చేపట్టిన సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యదర్శి, ఆర్టీజీఎస్ సీఈవో కె భాస్కర్ ఈ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం అమరావతి నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇక్కడి అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వర్క్ ఫర్ హోం చేయడానికి ఎంతమంది యువత ఆసక్తిగా ఉన్నారనే అంశంపై దృష్టి సారించాలన్నారు. ఇంటింటా సర్వే చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలన్నారు. ఆరేళ్లలోపు చిన్నారులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో సిబ్బందిని జనరల్ పర్పస్ సచివాలయాల గ్రూప్గా ఏర్పాటు చేయాలని సూచన చేశారు. మన మిత్ర సర్వే అవగాహన కార్యక్రమాలపై ఈ నెల 15 నుంచి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా నుంచి జీఎస్డబ్ల్యూఎస్ ఇన్చార్జి పద్మ, డీఎల్డీఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. బాల్యవివాహాలను అరికట్టాలి బాపట్ల: బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రజలకు సూచించారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక పురపాలక సంఘ ఉన్నత పాఠశాల నుంచి పాత ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ సాగింది. అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు, చీరాల మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. తల్లీబిడ్డల మరణాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని తెలిపారు. ప్రభుత్వం అందించే వైద్య సేవలను క్రమం తప్పకుండా ఉపయోగించుకోవాలని అన్నారు. ఇంటి వద్ద ప్రసవాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ శలగల రాజశేఖర్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్పై కలెక్టర్కు ఫిర్యాదు చీరాల: చీరాలలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతిని మున్సిపల్ కార్యాలయంలో జరుపుకోనీయకుండా కార్యాలయానికి తాళాలు వేసి తమను అగౌరవ పరిచేలా వ్యహరించిన మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ జె.వెంకట మురళికి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశించినా స్థానిక మున్సిపల్ అధికారులు పెడచెవిన పెట్టి మున్సిపల్ చైర్మన్ను అవమానించారన్నారు. మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఆయన తగు చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. -
పచ్చ మద ్దత్తు!
ప్రజలను మత్తులో ముంచెత్తి అందినకాడికి దండుకోవడమే పనిగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మరోవైపు ఇప్పటికే దాదాపుగా అన్ని మద్యం దుకాణాలు దక్కించుకున్న పచ్చనేతలు ఇప్పుడు బెల్టుషాపుల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి వత్తాసు పలుకుతూ విధుల్లో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ఎకై ్సజ్ సూపరింటెండెంట్ దేవదత్తును కలెక్టర్ సరెండర్ చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎటూ తేల్చకపోవడంజిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మామూళ్ల మత్తు.. ● పచ్చ నేతల ఆదేశాలతో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ● వసూళ్ల పర్వంలో కుమ్ములాటలు ● వర్గాలుగా విడిపోయిన అధికారులు ● రచ్చ రోడ్డెక్కడంతో సూపరింటెండెంట్ దేవదత్తును సరెండర్ చేసిన కలెక్టర్ ● సరెండర్ నిర్ధారించని కమిషనరేట్ ● త్రిశంకు స్వర్గంలో దేవదత్తు.. కొనసాగుతున్న సస్పెన్స్ ● ఇన్చార్జి సూపరింటెండెంట్గా వెంకటేశ్వర్లు ● పచ్చనేతల అండతో తిరిగి బాపట్ల వచ్చేందుకు దేవదత్తు యత్నం మామూళ్ల వ్యవహారంలోనే .. జిల్లాలో 117 సాధారణ, 10 కల్లుగీత కార్మికుల దుకాణాలతో కలిపి మొత్తం 127 మద్యం దుకాణాలు ఉన్నాయి. దాదాపు అన్ని దుకాణాలు పచ్చనేతల స్వాధీనంలోనే ఉన్నాయి. వీరు జిల్లావ్యాప్తంగా రెండు వేలకు పైగా బెల్టు దుకాణాలు నెలకొల్పారు. మద్యం దుకాణాల్లో క్వార్టర్ బాటిల్పై రూ.10 నుంచి రూ.20 అదనంగా, బెల్టుషాపుల్లో రూ.50 నుంచి రూ.80 అధికంగా విక్రయిస్తున్నారు. మద్యం దుకాణాల్లో డిమాండ్ ఉన్న బ్రాండ్లను బయటకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. బెల్టు షాపులపై మొక్కుబడిగా దాడులు చేసి ఒక్కో దాడికి రూ. 50 నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్దంగా షాపులను ఎక్కువ సమయం వ్యాపారం చేసుకునేలా అనుమతిస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా జిల్లాలోని ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.15 వేల చొప్పున 127 షాపుల నుంచి నెలకు రూ.20 లక్షలు వసూలు చేస్తున్నారు. అంతటితో వదలక ప్రతి ఎకై ్సజ్ పోలీసుస్టేషన్కు నిత్యం టీ, కాఫీలు మొదలు భోజనాలు, చికెన్, మటన్, ఫిష్ సైతం మద్యం షాపుల సిండికేట్ నుంచే తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు ప్రాంతాల్లో నాటుసారా తయారీ దారుల నుంచి నెల మామూళ్లు పుచ్చుకొని నియంత్రణను గాలికొదిలారు. అన్నిరకాల వసూళ్లతో కలుపుకొంటే జిల్లా వ్యాప్తంగా ఎకై ్సజ్ శాఖ నెలకు రూ.35 లక్షల నుంచి రూ.40 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మరోవైపు నెల మామూళ్ల పంపకాల్లోనూ దేవదత్తు, మిగిలిన అధికారులకు మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నింటినీ దేవదత్తుకు వ్యతిరేకంగా ఉన్న కొందరు ఎకై ్సజ్ అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరవేసినట్లు ప్రచారం ఉంది. మద్యం ధరలు, బెల్టు షాపులు, నాటుసారా వ్యవహారాలపై ప్రజలు లేదా ప్రజాసంఘాలు ఫిర్యాదు చేసినా ఎకై ్సజ్ విభాగం ఏ మాత్రం స్పందించడం లేదు. సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లాలో విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు కావడం, నాటు సారా ఏరులై పారడం, మద్యం షాపులు నిబంధనలకు తూట్లు పొడిచి అక్రమ వ్యాపారాలు సాగించడానికి ఎకై ్సజ్ సూపరింటెండెంట్ దేవదత్తే కారణమని, ఈ విషయమై తాను పదేపదే చెప్పినా విధుల్లో అలసత్వంగా ఉన్నారంటూ జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆయనను ఎకై ్సజ్ కమిషన్రేట్కు సరెండర్ చేశారు. ఈ మేరకు గత నెల 24న లేఖ రాశారు. అదే సమయంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా ఉన్న వెంకటేశ్వర్లుకు ఇన్చార్జిగా ఆ బాధ్యతలు అప్పగించారు. లేఖ రాసి దాదాపు రెండు వారాలు అవుతున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అండగా కీలక నాయకులు వాస్తవానికి దేవదత్తు జిల్లా అధికారి కావడంతో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఎకై ్సజ్ మంత్రికి తెలియకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం లేదు. ఇదే అదునుగా దేవదత్తు ఇప్పటికే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుతో ఎకై ్సజ్ మంత్రిని కలిసినట్లు సమాచారం. జిల్లాలో బెల్టుషాపులు అధికంగా పెట్టించానన్న కారణంతోనే కలెక్టర్ తనను సరెండర్ చేశారని, పచ్చ పార్టీ నేతల కోసమే తాను ఆ నిర్ణయం తీసుకున్నానంటూ దేవదత్తు మంత్రి వద్ద మొర పెట్టుకున్నట్లు సమాచారం. పైగా జిల్లా మంత్రులు గొట్టిపాటి, అనగానిలతోపాటు మిగిలిన ఎమ్మెల్యేలతోనూ దేవదత్తు ఎకై ్సజ్ మంత్రికి సిఫార్సు చేయించినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలపై దేవదత్తుకు వ్యతిరేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇదే సమయంలో కలెక్టర్ సరెండర్ ఆర్డర్ను క్యాన్సిల్ చేయించుకొని తిరిగి బాపట్లకు సూపరింటెండెంట్గా వచ్చేందుకు దేవదత్తు పావులు కదుపుతున్నారు. ఇందుకు జిల్లాకు చెందిన ఒక మంత్రితోపాటు మద్యం షాపులు అధికంగా దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దేవదత్తు కొనసాగితే బెల్టు షాపులు ఏర్పాటు, నిబంధనల్లో సడలింపు ఉంటుందని, అధిక ధరలకు మద్యం విక్రయించుకోవచ్చని వారు కలెక్టర్కు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో కలెక్టర్ ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. -
చిన్నారికి వైఎస్సార్ సీపీ నేతల నివాళి
గుంటూరురూరల్: కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, నియోజకవర్గ ఇంచార్జ్ బలసాని కిరణ్కుమార్ తదితరులు సోమవారం సందర్శించి నివాళులర్పించారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నారి ఇంటికి వెళ్లి ఆమె మృతదేహాన్ని సందర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ నగరంలో ప్రజా ప్రతినిధులకుగానీ, కమిషనర్కు గానీ అడ్మినిస్ట్రేషన్పై నిబద్ధత లేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారాన్ని గాలికి వదిలి కమిషనర్ సైతం టీడీపీ నాయకులతో కలిసి రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. గతంలో జీజీహెచ్లో ఎలుకలు కరిచి చిన్నారి, నేడు కుక్కల దాడిలో మరో చిన్నారి మృత్యువాతకు గురయ్యాడన్నారు. -
ఉత్తమ ప్రదర్శన ‘నాన్న నేనొచ్చేస్తా’
యడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం నిర్వహించిన 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎంవీ చౌదరి కళావేదిక ఈనెల 4 నుంచి 6వ తేదీ వరకు 10 నాటికలు ప్రదర్శించారు. ప్రతిరోజూ పండుగలా నిర్వహించిన ఈ పోటీలకు ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. కళాభిమానులు మూడు రోజులు అర్థరాత్రి వరకు ఉంటూ కళారూపాల్ని ఆద్యంతం తిలకించి ఆస్వాదించారు. నిత్యం ప్రేక్షకులకు వెయ్యి మందికి అల్పాహారం అందించడం, ప్రతిరోజూ 30 మంది చొప్పున 90 మందికి లక్కీడ్రా తీసి బహుమతుల్ని అందించారు. 15 మంది న్యాయనిర్ణేతలు, దాతలు, కళాకారులు, అతిథులు పలు రంగాలకు చెందిన ప్రముఖులకు జ్ఞాపికలు అందించి సత్కరించారు. ముత్తవరపు సురేష్బాబు సతీమణి ముత్తవరపు అరుణకుమారి లేడీ ఆర్టిస్టులను ఆడపడుచు లాంఛనాలిచ్చి సత్కరించారు. జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో అమృతలహరి థియేటర్ (గుంటూరు)వారి ‘‘నాన్న నేనొచ్చేస్తా’’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా యువభేరి థియేటర్స్(హైదరాబాద్) వారి ‘నా శత్రువు’ నాటిక, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా శ్రీసాయి ఆర్ట్స్(కొలకలూరి) వారి ‘జనరల్ బోగీలు’ నాటిక నిలిచాయి. కార్యక్రమంలో నాటక పరిషత్ ఉపాధ్యక్షుడు జరుగుల శంకరరావు, కార్యదర్శి ముత్తవరపు రామారావు, కోశాధికారి నూతలపాటి మాధవరావు, కాళిదాసు, ఎం.పద్మారావు పాల్గొన్నారు. -
మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా శ్రీనివాస్నాయక్
బాపట్ల: బాపట్ల మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా ఓ. శ్రీనివాస్నాయక్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. తిరుపతి ఉపసంచాలకులుగా పని చేస్తూ పదోన్నతిపై బాపట్లకు వచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిని, జేసీ ప్రఖర్జైన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మత్స్యకారులకు అందుబాటులో ఉంటానన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఇంటర్ అడ్మిషన్లు చేపట్టండి డీఐఈఓ నీలావతిదేవి నరసరావుపేట ఈస్ట్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఇంటర్మీడియెట్ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలను చేపట్టాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి సోమవారం తెలిపారు. ఈమేరకు ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు తెలియచేసినట్టు వివరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, గురుకుల కళాశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, గిరిజన సంక్షేమ కళాశాలలు తదితర ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఇంటర్మీడియెట్ విద్యార్థుల ప్రవేశాలను పెంచేలా ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు అందిస్తున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, మధ్యాహ్న భోజనం వంటి సంక్షేమ పథకాలను విద్యార్థుల దృష్టికి తీసుకవెళ్లాలన్నారు. ఇప్పటికే ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేపట్టినట్టు వివరించారు. కాగా, ఇంటర్ ఫలితాలను రెండవ వారంలో విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తుందని తెలిపారు. ముప్పాళ్లలో భారీ వర్షం ముప్పాళ్ళ: ముప్పాళ్లలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమవడంతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడితో అల్లాడిన ప్రజలకు కొంత ఉపశమనం లభించినప్పటికీ ఈదురుగాలులతో రైతులు ఇబ్బందులు పడ్డారు. కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, మిరప, పసుపు పంట దిగుబడులు తడవకుండా కాపాడుకునేందుకు పట్టలు కప్పేందుకు పరుగులు పెట్టారు. ఇప్పటికే పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని, తడిస్తే కొనేవారు ఉండరని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు నగరంలో పర్యటించిన ఐజీ పట్నంబజారు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం గుటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాతగుంటూరు పోలీసు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఆనందపేటలో జరిగిన వృద్ధురాలు పఠాన్ ఖాజాబీ హత్య, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో సంబంధిత కేసు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని, నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలని స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం ఆనందపేట 2వలైనులో హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ఐజీ వెంట ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్య, పాతగుంటూరు పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య తదితరులు ఉన్నారు. 1,53,787 బస్తాలు మిర్చి రాక కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,53,787 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,37,288 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 64,276 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక తెలిపారు. -
ఎరువుల వ్యాపారి ఉడాయింపు
మాచర్ల రూరల్: ఫర్టిలైజర్ వ్యాపారి నగదుతో ఉడాయించడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నాళం అమర నాగేశ్వరరావు ఎరువులు, పురుగు మందుల వ్యాపారం చేస్తూ గ్రామంలో సుమారు 50 మందికి పైగా రైతుల వద్ద రూ. 2.50 కోట్ల మేర అప్పులు తీసుకున్నాడు. కొందరి వద్ద పంట కొనుగోలు చేసి, మరికొందరి వద్ద ప్రామిసరీ నోట్లు, స్థలాలు, పొలాలు, అమ్మకం అగ్రిమెంట్లు రాసి నగదు తీసుకొని పరారయ్యాడు. సోమవారం గ్రామానికి చెందిన రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ బి.కిరణ్ కుమార్ను వినతి పత్రం అందించారు. తనకు చెందిన పొలం, ఇళ్లు, స్ధలాలు విక్రయిస్తానని అగ్రిమెంట్ రాసి రెండు రోజుల నుంచి కనిపించకుండా వెళ్లాడని, ఇంటికి తాళం వేసి సెల్ఫోన్ స్విచ్ ఆపి కుటుంబ సభ్యులు మొత్తం కన్పించటం లేదని వారు తహసీల్దార్కు తెలిపారు. అమర నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను ఇతరులకు అమ్మకుండా వచ్చే నగదును రైతులమైన మాకు చెందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీని పై స్పందించిన కిరణ్ కుమార్ సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం, రూరల్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. దీంతో వారు ఆయా కార్యాలయాలకు వెళ్ళి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించినట్లు తెలిపారు. ● ఇదిలా ఉండగా గత ఆరు నెలల కాలంలో సుమారు రూ. 100 కోట్ల వరకు వివిధ వ్యాపార వర్గాలు ఐపీ నోటీసులు దాఖలు చేయటం మాచర్ల పట్టణంలో సంచలనం రేకెత్తిస్తుంది. అప్పులిచ్చిన వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రభుత్వ ఆమోదానికి జెడ్పీ బడ్జెట్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదం సాధ్యం కాలేదు. వరుసగా రెండుసార్లు వాయిదా పడిన సర్వసభ్య సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందలేకపోయిన దృష్ట్యా పంచాతీరాజ్ చట్టంలోని సెక్షన్ 199 సబ్ రూల్ 3 కింద బడ్జెట్ను ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపినట్లు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సోమవారం చెప్పారు. పార్టీ ఫిరాయించిన చైర్పర్సన్కు వ్యతిరేకంగా.. జెడ్పీ ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా గత నెల 15న ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా పడింది. వైఎస్సార్ సీపీ నుంచి జెడ్పీటీసీగా గెలిచిన హెనీ క్రిస్టినా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాంచడంతో పాలకవర్గంలో సింహభాగమైన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు ఆమె తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కీలకమైన బడ్జెట్ ఆమోదం కోసం రెండు వారాల వ్యవధిలో గత నెల 29న రెండోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసినా, అదే రోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవమని, బడ్జెట్ ఆమోదానికి కావాల్సిన సంఖ్యలో టీడీపీ ప్రజా ప్రతినిధులు హాజరు కావడం లేదనే సమాచారంతో రెండు రోజుల ముందుగా సమావేశాన్ని వాయిదా వేశారు. చైర్పర్సన్ హోదాలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు జెడ్పీటీసీల అనుమతి లేకుండా, వారికి కనీస సమాచారమివ్వకుండా ఏకపక్షంగా పనులను మంజూరు చేస్తున్న విషయమై గతేడాది కాలంగా జెడ్పీటీసీలు ప్రతి సర్వసభ్య సమావేశంలోనూ గళం విప్పుతున్నారు. జెడ్పీ పాలకవర్గంలో భాగస్వాములైన జెడ్పీటీసీలను పక్కనపెట్టి అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యమిస్తూ, వారు చెప్పిన పనులకు జీ హుజూర్ అనడంపై జెడ్పీటీసీలు తీవ్ర అగ్రహంతో ఉన్నారు. ఆర్థిక సంవత్సర బడ్జెట్లో జెడ్పీటీసీలకు తెలియకుండా, సమావేశంలో ఆమోదింపచేయకుండా రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, జెడ్పీటీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఆమోదించుకోలేని దుస్థితి వరుసగా రెండుసార్లు వాయిదా పడిన సర్వసభ్య సమావేశం ఏకపక్ష పనులు అనుమతులపై తీవ్ర అభ్యంతరం పార్టీ ఫిరాయించిన చైర్పర్సన్కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చిన జెడ్పీటీసీలు బడ్జెట్ ఆమోదం తమ వల్ల కాదంటూప్రభుత్వానికి నివేదన గత ఏడాది మార్చి 31 నాటికే ఆమోదించుకోవాల్సిన బడ్జెట్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి ప్రభుత్వానికి పంపిన సీఈవో బడ్జెట్ ఆమోదం తమ వల్లకాదంటూ ప్రభుత్వానికి నివేదన చైర్పర్సన్ తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లే జెడ్పీ బడ్జెట్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపడం చైర్పర్సన్ తన అస్తిత్వాన్ని కోల్పోయినట్లుగా భావించాలి. జెడ్పీ చరిత్రలోనే కోరం కాక వాయిదా పడటం తొలిసారి. గతనెల 29న జరగాల్సిన సమావేశాన్ని 50 శాతం సభ్యులు వాయిదా వేయాలని కోరినట్లుగా జెడ్పీటీసీలకు లేఖలు పంపారు. 50 శాతం మంది వాయిదా కోరి ఉంటే, మూడింట ఒక వంతు సభ్యులతో కోరం ఏర్పాటు చేసి, గత నెల 29నే సమావేశాన్ని ఎందుకు జరపలేకపోయారో ప్రజలకు చెప్పాలి. బడ్జెట్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపడం జెడ్పీ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు పాలకమండలి సభ్యులను, జిల్లా ప్రజలను అవమానించడమే. పార్టీ ఫిరాయించిన చైర్పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి. – పిల్లి ఓబుల్రెడ్డి, రొంపిచర్ల జెడ్పీటీసీ బడ్జెట్ సమావేశం వరుసగా రెండుసార్లు వాయిదా పడటంతో ఇక ఆమోదింపచేసుకోవడం తమ వల్ల కాదంటూ ప్రభుత్వానికి నివేదించడం జెడ్పీ పరిపాలన తీరు, తెన్నులకు అద్దం పడుతోంది. గత ఏడాది మార్చి 31 నాటికే ఆమోదించుకోవాల్సిన బడ్జెట్ చివరికి ప్రభుత్వ ఆమోదం కోసం వెళ్లింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.643 కోట్ల ఆదాయంతో రూపొందించిన ఆంచనా బడ్జెట్లో రూ.640 కోట్లు వ్యయం చూపారు. అదే విధంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాలను మినహాయిస్తే జెడ్పీ బడ్జెట్ రూ.71.11 కోట్ల ఆదాయం, రూ.69.10 కోట్ల మిగులుగా చూపారు. -
తల్లీబిడ్డకు ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలి
గుంటూరు లీగల్: ప్రతి బిడ్డా ఆరోగ్యంగా జన్మించాలని, ప్రసవ సమయంలో తల్లీబిడ్డకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఒక బలమైన పునాదిని నిర్మించడమే ముఖ్యోద్దేశమని అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు సోమవారం గుంటూరు జీజీహెచ్లోని నర్సింగ్ విద్యార్థులకు, నర్సింగ్ సిబ్బంది, పిల్లల వైద్యశాఖ, ప్రసూతి వైద్య శాఖలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జియావుద్దీన్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా తల్లులు, నవజాత శిశువుల మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు మూడు లక్షల మంది మహిళలు ప్రసవం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించారు. ఈ సంఖ్యను తగ్గించడానికి తగు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రజలకు అవగాహన కల్పించడంలో, వారికి న్యాయ సహాయం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. సదస్సులో డాక్టర్ అరుణ, డాక్టర్ దేవకుమార్, డాక్టర్ జయంతి, డాక్టర్ ఝాన్సీవాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, నర్సింగ్ విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.కాలువలోకి దూసుకెళ్లిన కారు– ప్రాణాలతో బయటపడిన డ్రైవర్మంగళగిరి: నగర పరిధిలోని యర్రబాలెం చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటన సోమవారం జరిగింది. మంగళగిరి నుంచి కృష్ణాయపాలెం వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. కారులో డ్రైవర్ ఒక్కరు మాత్రమే వుండగా వెంటనే కారు డోర్ తీసుకుని కారుపైకి ఎక్కి కాపాడాలని అరవడంతో అటుగా వెళ్తున్న స్థానికులు అతడిని రక్షించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.యానాదులపై వేధింపులు తగవుబాపట్ల టౌన్: లైసెన్సుల పేరుతో యానాదులను వేధించడం సరికాదని యానాది హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి లక్ష్మయ్య పేర్కొన్నారు. వేటపాలెం పరిసర ప్రాంతాల్లోని యానాదులు తరతరాలుగా చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా మత్స్యశాఖ అధికారుల పేరు చేప్పి కొందరు లైసెన్సుల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి వచ్చి యానాదులు వివిధ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని చీలురోడ్డు సెంటర్లో రాస్తారోకో చేశారు. పొట్లూరి లక్ష్మయ్య మాట్లాడుతూ.. వేటపాలెం పరిధిలోని నిరుపేద యానాదులు ఎన్నో తరాలుగా చేపల వేట చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. లైసెన్సులు లేవనే పేరుతో వేధించడం అప్రజాస్వామికమన్నారు. దీనిపై తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. యానాది హక్కుల పరిరక్షణ సమితి బాపట్ల జిల్లా అధ్యక్షులు సీహెచ్ శంకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మేకల ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. అనంతరం పట్ణణంలోని చీలురోడ్డు సెంటర్ నుంచి ర్యాలీగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని జాయింట్ కలెక్టర్ ప్రఖర్జైన్కు వినతిపత్రం అందజేశారు. కొమరగిరి శ్రీను, పుట్టా వెంకటేశ్వర్లు, కొమరగిరి అయ్యప్ప, సైకం రమేష్, చేవూరి వెంకట్రావు, మల్లవరపు కృష్ణ, పుట్ట వెంకటేశ్వర్లు, బీఎస్పీ నాయకులు గుదే రాజారావు పాల్గొన్నారు. -
మసకబారింది!
మూడో కన్ను నకరికల్లు: 2023 జూలైలో స్థానిక ఇందిరమ్మకాలనీలోని ఒక ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.7లక్షల నగదు, కొంత బంగారం చోరీకి గురైంది. చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు వారంరోజుల్లోనే కేసును ఛేదించగలిగారు. సొత్తును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. – అదే ఏడాది ఆగస్టులో హైవే పక్కన ఉన్న ఏటీఎం ధ్వంసం చేసిన ఘటనలోను నిందితుడిని ఒక్కరోజులోనే పట్టుకోగలిగారు. అంత త్వరగా కేసులు ఛేదించడానికి పోలీసులకు ఉపయోగం పడిన ఆయుధం సీసీ కెమెరా.. ఇలా ఎన్నో కేసులను అతితక్కువ సమయంలో పోలీసులు ఛేదించగలిగారంటే అది కేవలం సీసీ కెమెరాలు అందించిన ఆధారాలే. 2023లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో 2023 సంవత్సరంలో నకరికల్లు గ్రామంలోని ప్రధాన కూడళ్లలో, అలాగే అద్దంకి–నార్కట్పల్లి రాష్ట్ర రహదారి పక్కన సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రూ.4 లక్షలు వెచ్చించి 28 పెద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ ఏ మూలన ఏం జరిగినా పోలీస్ కంట్రోల్ రూంలో రికార్డయి తెలిసిపోయేది. చోరీలు అరికట్టేందుకు, చోరీ కేసుల్లోని, రోడ్డు ప్రమాదాల్లో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన పాత్ర పోషించాయి. సీసీ కెమెరాలు ఇచ్చిన క్లూ ఆధారంగా ప్రమాదానికి కారణమై తప్పించుకుపోయిన నిందితులను వాహనాలతో సహా గుర్తించారు. ఇలాంటి ఎన్నో ఘటనలకు కారణమైన ఆధారాలను అందించిన సీసీ కెమెరాలు గత కొన్నిరోజులుగా ఏ ఒక్కటీ పనిచేయడం లేదు. దీంతో గ్రామస్తులు మళ్లీ భయం నీడన బతకాల్సి వస్తుంది. సాంకేతిక లోపాలు సరిచేయిస్తున్నాం సీసీ కెమెరాల నిర్వహణలో చిన్న చిన్న సాంకేతిక లోపాలు తలెత్తాయి. టెక్నీషియన్ల సహాయంతో లోపాలను గుర్తించి మరమ్మతులు చేయించి సత్వరమే వినియోగంలోకి తీసుకువస్తాం. శాంతిభధ్రతలకు అన్నివిధాల టెక్నికల్గా చర్యలు తీసుకుంటాం. – చల్లా సురేష్, ఎస్ఐ, నకరికల్లు ఒక్కటీ పని చేయడం లేదు.. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మళ్లీ ఇటీవల కాలంలో ఘర్షణలు, చోరీలు జరుగుతున్నాయని రోడ్డుపక్కన గృహాల వారు, శివారు ప్రాంతంలో నివాసముంటున్న వారు, దుకాణదారులు వాపోతున్నారు. వేసవి కావడంతో ఎక్కువగా దొంగతనాలు జరుగుతుంటాయి. అందునా సెలవుల కాలంలో ఇళ్లకు తాళాలు వేసి కుటుంబసమేతంగా ప్రజలు ఊళ్లకు, యాత్రలకు వెళ్తుంటారు. ఈ నేపధ్యంలో ఆస్తుల భధ్రత ప్రశ్నార్ధకంగా మారింది. అందునా అద్దంకి – నార్కట్పల్లి రాష్ట్ర రహదారి పక్కన గ్రామం కావడంతో చోరీలతో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. గతంలో జరిగిన చోరీల నేపధ్యంలో సీసీకె మెరాలు పనిచేయడం లేదన్న సమాచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతుకు గురైన సీసీ కెమెరాలు సత్వరమే వినియోగం తేవాలని ప్రజలు కోరుతున్నారు. నకరికల్లులో మొరాయించిన సీసీ కెమెరాలు 2023లో రూ.4 లక్షలు వెచ్చించి 28 కెమెరాలు ఏర్పాటు ఫుటేజీ సాయంతో ఎన్నో కేసులు సత్వరమే ఛేదించిన పోలీసులు గత కొన్నిరోజులుగా ఏ ఒక్కటీ పనిచేయని వైనం ప్రశ్నార్థకంగా మారిన ప్రజాభద్రత -
గుంటూరు డీఆర్ఎంగా సుథేష్ఠ సేన్ బాధ్యతల స్వీకరణ
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు డీఆర్ఎంగా ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) సుధేష్ఠ సేన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాజా మాజీ డీఆర్ఎం ఎం.రామకృష్ణ సుథేష్ఠకు బాధ్యతలు అప్పగించారు. ఎం.రామకృష్ణ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్కు ప్రిన్సిపల్ చీఫ్ సెఫ్టి ఆఫిసర్గా వెళ్లనున్న విషయం తెలిసిందే. సేన్ దక్షిణ మధ్య రైల్వేలో 1996 బ్యాచ్కు చెందిన వారు. ఆమె ఎకనామిక్స్లో ఆనర్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పబ్లిక్ పాలసీలో మాస్ట్ర్స్ డిగ్రీని పూర్తి చేశారు. తొలుత ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్కు ఎంపికై ముంబై సెంట్రల్ రైల్వేలో ఉద్యోగ బాధ్యతలు ప్రారంభించారు. అక్కడి నుంచి భోపాల్, జబల్పూర్, సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కత్తాలోని వెస్ట్ సెంట్రల్ రైల్వేల్లో పని చేశారు. అత్యంత నిష్ణాతులైన అధికారిగా గుర్తింపు పొందారు. ఆమె న్యూఢిల్లీలోని నార్తర్న్ రైల్వేలో ఆర్థిక సలహాదారు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (ఎఫ్ఏ అండ్ సీఏఓ)గా పని చేశారు. ఆమె డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, భారత ప్రభుత్వంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా, ఎన్సీఈఆర్టీగా డెప్యూటేషన్పై బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా పనిశారు. పోలీస్ విచారణకు హాజరైన డాక్టర్ ప్రభావతి ఒంగోలు టౌన్: మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టడీ కేసు విచారణాధికారి, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట గుంటూరు జీజీహెచ్ రిటైర్డ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆమెను 5వ నిందితురాలిగా చేర్చి విచారణ చేస్తున్నారు. సోమవారం ఉదయం విచారణకు వచ్చిన ఆమెను మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత హాజరుకావాలని చెప్పారు. తొలిరోజు సుమారు నాలుగున్నర గంటల పాటు విచారించారు. విచారణలో ఆమె సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం కూడా ఆమె విచారణకు హాజరుకానున్నారు. -
కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
వేటపాలెం: పోలీసు కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయతీ ప్రసాద్ పేటకు చెందిన కానిస్టేబుల్ బిల్లా రమేష్ (37) ఇంట్లో ఉరేసుకొని ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కానిస్టేబుల్ రమేష్ ఆదివారం విధుల నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తండ్రి, అమ్మమ్మ ఇంటి బయట నిద్రించారు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి కుమారుడు బయటకు రాకపోవడంతో తండ్రి కంగారు పడ్డారు. చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు తీసి చూడగా ఇంట్లో ఉరేసుకొని కనిపించాడు. రమేష్ వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కుటుంబ గొడవల కారణంగా ఐదేళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. పిల్లలను కూడా ఆమే చదివిస్తోంది. ఈ కేసు చీరాల కోర్టులో పెండింగ్లో ఉంది. చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు, వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు, వెదుళ్లపల్లి ఎస్సై భాగ్యరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. నాటికలు పరిషత్లకే పరిమితం కాకూడదు యడ్లపాడు: నాటికలు కేవలం పరిషత్ ప్రదర్శనలకే పరిమితం కాకూడదని, క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజాచైతన్యానికి పాటు పడేలా చేయాలని సినీనటుడు అజయ్ఘోష్ చెప్పారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో మూడు రోజులు నిర్వహించిన 22వ జాతీయస్థాయి పోటీల ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక రుగ్మతలపై మరిన్ని నాటికలు రచించి, గ్రామాల్లో ప్రదర్శించాలని కోరారు. ఇక్కడి నాటికల పోటీల నిర్వహణ, నిబద్ధత, వాటి ఆదరణ తీరు తెలుగురాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ విషయంలో డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు అభినందనీయుడన్నారు. ఏటా పోటీల సమయంలో యడ్లపాడు వస్తానని, తనకు ఓ నాటిక వేసే అవకాశం ఇవ్వాలని కమిటీని కోరారు. దేశాన్ని కాపాడేందుకు కమ్యూనిస్టు పార్టీలన్నీ ఏకం కావాలని ఒకరితో అంటే నీకు అడిగే అర్హత ఉందా అంటూ తనను ప్రశ్నించారని, ఓ అభిమానిగా ఽధైర్యంగా ప్రశ్నించే హక్కు ఆ ఎర్రజెండానే ఇచ్చిందని వేదిక ద్వారా స్పష్టం చేశారు. నేటి యువత కమ్యూనిస్టు పోరాట యోధుడు సుందరయ్య గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజల దుస్థితిపై నాటకాలు రావాలి.. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో పేదరికం, కనీస అవసరాలు, తాగునీరు అందని అవస్థలు, కిడ్నీలు అమ్ముకునే దుస్థితిపై స్పందించి రచయితలు నాటకాలు రాయాలని కోరారు. తెలుగురాష్ట్రాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అత్యధిక నాటక పరిషత్లు వెలుగొందుతున్నాయని తెలిపారు. తెలంగాణ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ట నాటక రంగాన్ని దాతలు, పరిషత్ నిర్వాహకులు, ముఖ్యంగా ప్రజలు బతికిస్తున్నారన్నారు. -
బడ్జెట్ లెక్కలపై అధికారుల వద్ద సమాధానం లేదు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసిన బడ్జెట్లో చాలా లోపాలున్నాయని వాటిపై ప్రశ్నిస్తే అధికారుల వద్ద నుంచి ఎటువంటి సమాధానం లేదని నగర డెప్యూటీ వనమా బాలవజ్రబాబు(డైమండ్బాబు) విమర్శించారు. సోమవారం నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ ఆమోద సమావేశం జరిగిన తీరును వజ్రబాబు ఖండించారు. కౌన్సిల్ హాల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. రూ.1534 కోట్లు బడ్జెట్ అంచనాల్లో చూపి, రూ.1018కోట్లు ఖర్చుపెడుతున్నట్లు చెప్పారని, ఈ నిధులు 57 డివిజన్లకు ఏ విధంగా ఖర్చు పెడతారని ప్రశ్నిస్తే సమాధానం లేదని విమర్శించారు. రూ.670కోట్ల ప్రారంభ నిల్వ చూపిన అధికారులు అది ఏయే ఖాతాల్లో ఉందని అడిగితే సమాధానం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ సంవత్సరంలో నగరపాలక సంస్థ ఖర్చు పెట్టబోయే రూ.187కోట్లకు లెక్కల్లో సారూప్యత లేదని, దీనిపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశామని వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఫిక్స్డ్ డిపాజిట్స్ కింద రూ.150 నుంచి రూ.200కోట్ల వరకు ఉండాలని, ప్రస్తుతం రూ.45కోట్లు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారని విమర్శించారు. సాధారాణ ఖర్చుల కింద ఈ సంవత్సరం రూ.169 కోట్లు ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపారని, వాటికి ఎలా ఖర్చుపెట్టారో చూపలేదని పేర్కొన్నారు. వీటన్నింటికీ ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ పులి శ్రీనివాసులు సీఎంఓలో పనుందని చెప్పి వెళ్లిపోయారని వజ్రబాబు విమర్శించారు. ఇన్ఛార్జ్ మేయర్ సజీల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.అధికారులు కూటమి ప్రభుత్వానికి అమ్ముడుపోయారని ఆయన వజ్రబాబు ఆరోపించారు. సుదీర్ఘంగా చర్చ జరగాల్సి ఉంది కూటమి సర్కారులో అధికారులు అమ్ముడుపోయారు కౌన్సిల్ నుంచి కమిషనర్ బయటకువెళ్లిపోవడమేమిటీ? నగర డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్రబాబు ధ్వజం -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
గోళ్లపాడు (ముప్పాళ్ల): ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని గోళ్లపాడు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. కుందురువారిపాలెం గ్రామానికి చెందిన కామేపల్లి చంద్రశేఖర్ (32) తన ట్రాక్టర్లో మొక్కజొన్న విత్తనాలు లోడుతో పొలంలో వస్తున్నాడు. పొలంలో ఉన్న గుంతలో పడి డ్రైవర్ సీటులో ఉన్న చంద్రశేఖర్ ఎగిరి కింద పడ్డాడు. చంద్రశేఖర్ గుండెలపై గుండా ట్రాక్టర్, లోడుతో ఉన్న ట్రక్కు వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ వి.సోమేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
గుండె ఎంతో కీలకం
శరీరంలోని అన్ని అవయవాలోకెల్ల గుండె ప్రధానమైంది. లబ్డబ్మంటూ ప్రతి నిమిషం కొట్టుకుంటూ ఉంటేనే మనిషి ప్రాణాలతో ఉన్నట్లు లెక్క. గుండె కోసం తప్పని సరిగా రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు , చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి వ్యసనాల జోలికి వెళ్లకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి. –డాక్టర్ పోలవరపు అనురాగ్, ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు -
పేదల నోటికందితే ఒట్టు!
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల కడుపు నిండే పరిస్థితి కూడా లేదు. వారికి అందించే రేషన్ సరకులపై అక్రమార్కుల కన్ను పడింది. కూలీనాలీ చేసుకుని కడుపు నిండితే చాలనుకునే పేద ప్రజల కోసం పౌరసరఫరాల శాఖ అందించే రేషన్ సరకులను కొందరు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నెల ప్రారంభంలో పేదలు ఎదురు చూసే సరకులు పూర్తిస్థాయిలో అందకపోవటంతో పస్తులుండాల్సి వస్తోంది. రేపల్లె రూరల్: రేషన్ దుకాణాలలో అందించే వస్తువులను కొంతమంది అక్రమార్కులు అదనపు ధర చెల్లించి డీలర్ల నుంచి కొనుగోలు చేస్తున్నారు. కందిపప్పు బహిరంగ మార్కెట్లో కిలో రూ.130 నుంచి రూ.170 వరకు ఉంది. పంచదార రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. రేషన్ దుకాణంలో కందిపప్పు కిలో రూ.67, పంచదార అరకిలో రూ.17లకు విక్రయిస్తున్నారు. డీలర్ల నుంచి అక్రమార్కులు బియ్యంతోపాటు కందిపప్పు కూడా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సక్రమంగా అందని సరకులు ప్రతి నెల ఏ వస్తువు ఇస్తారో కొనుగోలు చేసే వరకు తెలియని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కేవలం బియ్యం, పంచదారలు మాత్రమే పేదలకు అరకొరగా అందుతున్నాయి. కందిపప్పు, గోధుమ పిండి, బెల్లం, శెనగలు సైతం పంపిణీ చేయాలి. తూకం తక్కువగా ఉందన్న నెపంతో పంచదారను రెండు నెలలపాటు నిలుపుదల చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పంచదార పంపిణీ పునఃప్రారంభించారు. ప్రస్తుతం శ్రీరామనవమికై నా కందిపప్పు ఇస్తారని ఆశగా ఎదురుచూసిన కార్డుదారులకు నిరాశే ఎదురైంది. సరకులు పక్కదారి పట్టడంపై ప్రజాసంఘాల వారు, లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనలో అస్తవ్యస్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ మూడు నెలలుగా ఆగిపోయిన రేషన్ కందిపప్పు ఎప్పుడు ఏ సరకులిస్తారో కూడా తెలియని వైనం నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకుంటున్న అక్రమార్కులు ప్రభుత్వంపై ప్రజాసంఘాలు, కార్డుదారులు ఆగ్రహం నిఘా పెంచుతాం రేషన్ సరకులు నల్లబజారుకు తరలిస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. ఎక్కడైనా ఇలా జరిగితే వివరాలు చెప్పాలని ప్రజలను కోరుతున్నాం. వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. రేషన్ దుకాణాలపై నిత్యం నిఘా ఉంచుతాం. – ఎం.శ్రీనివాసరావు, తహసీల్దార్, రేపల్లె బోర్డులు ఏర్పాటు చేయాలి వార్డులకు వచ్చే రేషన్ వాహనాలపై బోర్డులు ఏర్పాటు చేసి కార్డుదారులకు అందించే రేషన్ వివరాలను ప్రదర్శించాలి. గ్రామాలలో నిర్ణీత తేదీలలో ఇచ్చిన విధంగా పట్టణంలోని వార్డులలో కూడా చేయాలి. వాహనాల వద్ద సరకులు తీసుకోని వారికి దుకాణాలలో అందించాలి. అధికారులు నిరంతరం నిఘా ఉంచాలి. – సి.వి. మోహనరావు, పట్టణాభివృద్ధి సంఘ కార్యదర్శి, రేపల్లె 3 నెలలుగా కందిపప్పు లేదు.. రేపల్లె నియోజకవర్గంలోని కార్డుదారులకు మూడు నెలల నుంచి కందిపప్పు ఇవ్వడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు నెలలు కందిపప్పు నిలుపుదల చేశారు. తరువాత తూతూమంత్రంగా మూడు నెలల పాటు 30శాతం మాత్రమే సరఫరా చేశారు. ఫిబ్రవరి నుంచి కందిపప్పు అందించటం లేదు. నియోజకవర్గంలో 226 రేషన్ దుకాణాల పరిధిలో 68,015 మంది కార్డుదారులు ఉన్నారు. -
నటనకు మూలం రంగస్థలమే
యడ్లపాడు: టీవీ, సినిమా, వెబ్సిరీస్, టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి సాధించినా అన్నింటికీ మూలం రంగస్థలం అన్నది నిజం. అది అనంతమైనది.. అజరామరమైనదని ప్రముఖ సినీ నటుడు అజయ్ఘోష్ పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం మూడోరోజు ఆదివారం జరిగే కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళానిలయం అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబుతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. సామాన్య ప్రేక్షకుడిగానే వచ్చా.. వెండితెర, బుల్లితెర, ఓటీటీ వంటి విభాగాలెన్ని ఉన్నా అందులో నిలదొక్కుకోవాలంటే నాటకరంగం నుంచి వచ్చిన కళాకారులకే సాధ్యమవుతుందని అజయ్ఘోష్ తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వారు తమ ప్రతిభను చాటి ఆయా పరిశ్రమల్లో రాణించగలుగుతారన్నారు. సుందరయ్య కళానిలయం వారు తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినా, తాను మాత్రం వినోదంతో పాటు సందేశాల్ని అందించే పరిషత్ నాటికలను వీక్షించేందుకు వచ్చిన ఓ సామాన్య ప్రేక్షకుడినే వచ్చానని తెలిపారు. నాటక రంగం అంటే తనకెంతో ఇష్టమని, నిరంతరం దానినుంచి చాలా విషయాలను నేర్చుకునేందుకే ఎక్కువగా ఇష్టపడతానని తెలిపారు. ముఖ్యంగా నాటక రచన, అందులోని మాటలు, కళాకారుల నటనా చాతుర్యాలు తనకెంతో స్ఫూర్తినిస్తాయన్నారు. తాను రంగస్థలంలో నిత్య విద్యార్థినేనని తెలిపారు. కృషి అభినందనీయం.. యడ్లపాడు అభ్యుదయ, కమ్యూనిజం భావజాలం కలిగిన గ్రామమని, సంస్కృతికి కళలే ఆయువు పట్టన్నారు. సమాజంలో ఒక మార్పును తీసుకురావాలనే గొప్ప ఉద్దేశంతో గత 22 సంవత్సరాలుగా నాటకోత్సవాలను నిర్వహించడం అద్భుతమని కొనియాడారు. వీటి నిర్వహణ కోసం అందరూ సమష్టిగా కృషి చేయడం అభినందనీయమన్నారు. కళాకారులను, రచయితలు, దర్శకులను తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించడం, కళాసేవల్ని అందించిన ప్రముఖుల్ని పురస్కారంతో సత్కరించడం, మహిళా ఆర్టిస్టులకు ఆడపడుచు లాంఛనాలతో సారెనిచ్చి సత్కరించడం పల్లె సంస్కృతికి నిదర్శనమన్నారు. స్ఫూర్తి నిచ్చేవి నాటకాలే... నేర్చుకోవాల్సింది ఇక్కడే...! ప్రముఖ నటుడు అజయ్ఘోష్ -
ఆరు నెలలకోసారి కిడ్నీ పరీక్షలు అవసరం
కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట, రక్తం కారటం, ఆకలి లేకపోటం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తే కిడ్నీలకు వ్యాధి సోకినట్లు అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటు మందులు వాడటం, బీపీ, షుగర్లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, షుగర్లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ చింతా రామకృష్ణ, సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు -
బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవాలి
అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలవుతున్నాయి. ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిలవుతాయి. దృష్టిలోపాలు వస్తాయి. పక్షవాతం కూడా వస్తుంది. రోజూ ఉప్పు వాడకం 5 గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీ వయస్సుతో సంబంధం లేకుండా, వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అదుపులో పెట్టేందుకు రోజూ యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు లాంటి ఆహారాన్ని తగినంత తీసుకోవాలి. –డాక్టర్ రేవూరి హరికృష్ణ, ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్టు, గుంటూరు. -
8వ అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి
తాడేపల్లి రూరల్ : కుంచనపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో నుంచి వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందిన ఘటనపై తాడేపల్లి పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఖాజావలి కథనం ప్రకారం కుంచనపల్లి అపర్ణ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ 8వ ఫ్లోర్లో తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన పాటిబండ్ల సదాశివరావు (53) ఆయన భార్య మాధవి, కుమార్తె నివాసం ఉంటున్నారు. ఉదయం బాల్కనీలో వాకింగ్ చేస్తుండగా సదాశివరావు కళ్లుతిరిగి 8వ అంతస్తు పైనుంచి కిందకి పడిపోయాడు. అక్కడికక్కడే మరణించాడు. భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య పిడుగురాళ్ల: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించి నడికుడి రైల్వే ఎస్ఐ వి.శ్రీనివాసరావు నాయక్ తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి పిడుగురాళ్ల, న్యూ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ల మధ్య, జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. ఇతని వయసు సుమారు 40 సంవత్సరాల పైనే ఉండవచ్చునన్నారు. ఆచూకీ తెలియలేదని, ఇతనికి సంబంధించిన బంధువులు ఎవరైనా ఉంటే నడికుడి రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో ఉంచామన్నారు. -
ఏఎంసీ చైర్మన్ పదవి రాక తమ్ముళ్ల నైరాశ్యం
పర్చూరు(చినగంజాం): పర్చూరు ఏఎంసీ చైర్మన్ పదవి నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నేతలను ఊరించి ఉసూరుమనిపించింది. ఇది పర్చూరు నియోజకవర్గ పరిధిలో అతి పెద్ద నామినేటెడ్ పదవి. శాసన సభ్యుడి తరువాత నియోజకవర్గంలో అంతటి హోదా కలిగిన పదవి కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల పలువురు టీడీపీ నేతలు దీనిని ఆశించి భంగపడ్డారు. ఆశావహులు నుంచి స్థానిక శాసనసభ్యుడిపై ఒత్తిడి తీవ్రమైంది. పర్చూరు నుంచి తొలుత ఏఎంసీ చైర్మన్ పదవి జనరల్ మహిళ కావడంతో బోడవాడ, నూతలపాడు, కొల్లావారిపాలెం, జాగర్లమూడి, స్వర్ణ, చినగంజాం గ్రామాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని రిజర్వేషన్ కేటగిరీని మార్చి బీసీలకు వచ్చేలా చేశారు. కష్టపడి పార్టీ గెలుపు కోసం ఖర్చుపెట్టి పని చేస్తే తమకు చైర్మన్ పదవి దక్కలేదని పలువురు టీడీపీ నేతలు నైరాశ్యంలో ఉన్నారు. తమ ఆవేదనను సన్నిహితుల వద్ద వెలిబుచ్చారని సమాచారం. ప్రయాణికుడికి బ్యాగు అప్పగింత ఇంకొల్లు(చినగంజాం): ప్రయాణికుడు మరిచిపోయిన బ్యాగును ఇంకొల్లు ఆర్టీసీ బస్టాండులోని కంట్రోలర్ తిరిగి అప్పగించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పంచాయతీ గుమస్తాగా పనిచేసే జితేంద్రరెడ్డి ఆదివారం పని నిమిత్తం ఒంగోలు నుంచి ఇంకొల్లుకు ఆర్టీసీ బస్సులో వచ్చారు. దిగే సమయంలో బ్యాగును బస్సులో మరచిపోయారు. కంట్రోలర్ బాబుకు చెప్పడంతో వెంటనే ఆయన సదరు బస్సు డ్రైవర్కు ఫోన్ చేసి బ్యాగు తిరిగి తెప్పించి యజమానికి అప్పగించారు. సాగర్ కాల్వలో దూకిన వృద్ధుడు విజయపురిసౌత్: నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన మునగాల సుబ్బారావు(63) అనే వృద్ధుడిని విజయపురిసౌత్ ఎస్ఐ మహమ్మద్ షఫీ తన సిబ్బందితో కలిసి కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో సుబ్బారావు ఆదివారం సాగర్ కుడి కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఎస్ఐ షఫీ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయంతో కొట్టు మిట్టాడుతున్న సుబ్బారావును తాళ్లు వేసి బయటకు తీశారు. సుబ్బారావు సురక్షితంగా బయటపడటంతో పోలీసులను స్థానికులు అభినందించారు. -
పాస్టర్ మృతిపై విచారణకు డిమాండ్
వేటపాలెం: పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పాస్టర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ చార్లెస్ ఫీన్నీ డిమాండ్ చేశారు. ఆదివారం వేటపాలెం క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు ఆధ్వర్యంలో వందల మందితో దేశాయిపేట నుంచి వేటపాలెం గడియార స్తంభం సెంటర్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పలువురు పాస్టర్లు మాట్లాడుతూ.. ప్రవీణ్ పగడాలను హత్య చేశారనే నమ్ముతున్నామని, ఒక దైవజనుడిని హత్య చేస్తే క్రైస్తవ్యం ఆగిపోతుందనుకుంటే అది పొరపాటే అన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఒక్క ప్రవీణ్ను చంపితే వందలాది మంది ప్రవీణ్లు పుట్టుకొస్తారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవుల రక్షణకు భరోసా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో అన్నాలదాసు భాస్కర్రావు, పాస్టర్ సత్యంబాబు, మాజీ ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రగోరి, మండల దైవ సేవకులు, మహిళలు పాల్గొన్నారు. భారీ ర్యాలీకి తరలివచ్చిన వందల మంది క్రైస్తవులు -
పోరాట యోధుడు పాపిరెడ్డి
గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ సోషలిస్ట్ ఫ్రంట్ యోధుడు మోదుగుల పాపిరెడ్డి (88) ఆదివారం కన్నుమూశారు. ఈయన వైఎస్సార్ సీపీ గుంటూరు, పల్నాడు జిల్లాల పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తండ్రి. పాపిరెడ్డి పౌర హక్కుల కోసం జీవితాంతం పోరాడారు. పాపిరెడ్డి ప్రస్థానం మోదుగుల పాపిరెడ్డి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో 1937 అక్టోబర్ 9న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన ఎంఏ, ఎల్ఎల్బీ వరకూ చదివారు. 1961లో గుంటూరులో న్యాయవాది వృత్తిలో కొనసాగారు. విద్యార్థి దశలోనే ఆయన సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితులయ్యారు. సోషలిస్ట్ పార్టీకి తన జీవితాన్ని అంకితం చేశారు. 1955లో రామ్మనోహర్ లోహియా గుంటూరుకు వచ్చినపుడు ఆయన ప్రసంగాలతో పాపిరెడ్డి ప్రభావితమయ్యారు. లోహియాకు అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. సోషలిస్ట్ ఉద్యమ నేతలైన మధుమిమాయో, రాజ్నారాయణ్, మధుదండావతే, జార్జి ఫెర్నాండేజ్ తదితరులతో కలిసి జాతీయస్థాయిలో పనిచేశారు. 1975లో లోక్నాయక్ జయప్రకాష్నారాయణ నిర్వహించిన ఉద్యమంలో పాల్గొని ఐదు నెలలు అజ్ఞాత జీవితం గడిపారు. 1975 నవంబర్ 14న అరెస్టు అయ్యారు. 1977 జనవరి వరకు రాజమండ్రి, సికింద్రాబాద్ జైళ్లలో ప్రభుత్వం ఆయనను నిర్బంధించింది. పాపిరెడ్డితోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ బి.సత్యనారాయణరెడ్డి, బీజేపీ నాయకులు జూపూడి యజ్ఞనారాయణ, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కాతా జనార్దనరావు తదితరులు జైల్లో కలిసి ఉన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని కాండ్లరేవు సత్యాగ్రహంలో జార్జిఫెర్నాండేజ్తో కలిసి పాపిరెడ్డి పాల్గొన్నారు. ఓపీడీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. కార్మికుల ఆకలిచావులను నిరసిస్తూ 1989లో గుంటూరు కలెక్టరేట్ వద్ద పాపిరెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేశారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. పాపిరెడ్డి తెలుగు భాషాభిమాని. తమిళనాడులో హోనూరు, కృష్ణగిరి జిల్లాల్లో పాదయాత్రలు జరిపి తెలుగు భాషాభివృద్ధి కోసం పోరాడారు. బరంపురంలో జరిగిన అఖిల భారత తెలుగు మహాసభల విజయానికి చీఫ్ పాట్రన్గా ఎంతో కృషిచేశారు. అఖిల భారత తెలుగు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై భాష కోసం పాటుపడ్డారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా పాపిరెడ్డి ఎన్నో ఉద్యమాలు చేశారు. ప్రజల స్వాతంత్య్రాన్ని కాంగ్రెస్ హరిస్తుందంటూ గళమెత్తారు. పాపిరెడ్డికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాన్ని అందించింది. వందలాది పురస్కారాలు పాపిరెడ్డిని వరించాయి. ఆయన సేవా కార్యక్రమాల్లోనూ ముందుండేవారు. పెదపరిమి గ్రామంలో ఆర్సీఎం స్కూలు కమిటీ కన్వీనర్గా పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తాడికొండలో సత్యసాయిబాబా కళాశాల పాలకవర్గ సభ్యుడిగా పనిచేశారు. పెదపరిమి గ్రామంలో వినాయకుడి ఆలయాన్ని నిర్మించారు. పలువురి సంతాపం మోదుగుల పాపిరెడ్డి మృతి వార్త తెలిసి గుంటూరు జిల్లాతోపాటు పలు జిల్లాల్లో ఆయన ఆత్మీయులు, అభిమానులు, రాజకీయ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. నివాళులర్పించిన వారిలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, ఆళ్ల రామకృష్ణారెడ్డి, వణుకూరి శ్రీనివాసులురెడ్డి, వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి ఇన్చార్జ్ సుధీర్ భార్గవ్రెడ్డి, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, భాష్యం రామకృష్ణ, మోపిదేవి వెంకటరమణ, కోవెలమూడి రవీంద్ర, రాయపాటి శ్రీనివాస్, రావెల కిషోర్బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, బీజేపీ నేత జూపూడి రంగరాజు ఉన్నారు. ఒకే జైలులో ఉన్నాం : యలమంచిలి శివాజీ పాపిరెడ్డి మృతికి రైతు నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో పాపిరెడ్డి తాను ఒకే జైలులో ఉన్నామని గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి బలసాని కిరణ్కుమార్ కూడా పాపిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. అంబటి నివాళి పాపిరెడ్డి మృతికి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నివాళి అర్పించారు. పాపిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అలాగే సీపీఎం రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కూడా పాపిరెడ్డి మృతికి సంతాపం తెలిపారు. జీవితమంతా ప్రజల కోసం తపించిన నేత సేవా కార్యక్రమాల్లోనూ ముందు ప్రముఖుల సంతాపం -
పర్చూరులో బెట్టింగ్ బుకీలు
పర్చూరు(చినగంజాం) పర్చూరులో బెట్టింగ్ బుకీలు రెచ్చిపోతున్నారు. యువకులను టార్గెట్ చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. యువకులను బెట్టింగ్ వెబ్సైట్లకు ఆకర్షితులను చేసి తద్వారా వచ్చే కమీషన్లను దండుకుంటున్నారు. బుకీల మాయమాటలకు ప్రలోభపడి నగదు అప్పు తెచ్చి మరీ బెట్టింగ్లు పెడుతున్నారు. ఆ తర్వాత అప్పులు తీర్చలేని పరిస్థితులలో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత యువతకు ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. క్రికెట్ మ్యాచ్లు మొదలైన రోజు నుండి ఆన్లైన్లో బెట్టింగులు జోరందుకున్నాయి. బెట్టింగ్కు పాల్పడుతున్న యువతను గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాల్సిన పోలీసు నిఘా విభాగం పూర్తిగా విఫలమైందని పలువురు విమర్శిస్తున్నారు. ముగ్గులోకి దించుతున్న బుకీలుక్రికెట్ బెట్టింగ్ జరిగే విధానాన్ని చూసి అందరూ బిత్తర పోతున్నారు. బెట్టింగ్లో పాల్గొనదలచిన వారు తొలుత తమ పేర్లను వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం వన్ ఎక్స్ బెట్, రెడ్డి అన్న బుక్, ఫెయిర్ బెట్ తదితర బెట్టింగ్ వెబ్సైట్లు లీడింగ్లో ఉన్నాయి. వన్ ఎక్స్ బెట్ యునైటెడ్ కింగ్ డమ్ కేంద్రంగా పనిచేస్తుండగా, రెడ్డి అన్న బుక్ ఫెయిర్ బెట్ చైన్నె కేంద్రంగా పనిచేస్తున్నాయి. వీటిలో బెట్టింగ్ రాయుళ్లు ముందుగా తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్న తరువాత కంపెనీ వారు ఒక క్యూఆర్ కోడ్ను పంపుతారు. క్యూర్ కోడ్ను స్కాన్ చేసి మన ఖాతాలో ఉన్న డబ్బులను బెట్టింగ్ వెబ్సైట్ ఖాతాలోకి మళ్లిస్తారు. మనం పంపించే డబ్బులను పాయింట్లలో లెక్కిస్తారు. ఉదాహరణకు మనం రూ.500 బెట్టింగ్ వెబ్సైట్లోకి మరలిస్తే మనకు కంపెనీ వారు 500 పాయింట్లు ఇస్తారు. వెబ్సైట్లో రిజిస్టర్ కాబడిన వ్యక్తి ఇతర వ్యక్తులను కంపెనీకి రిఫర్ చేసినట్లయితే ఒక్కో వ్యక్తికి ఐదు పాయింట్లు చొప్పున కంపెనీ అతనికి అదనంగా ఇస్తుంది. ఈ అదనపు పాయింట్లే కమీషన్ కాగా ఇవి రిఫర్ చేసిన వ్యక్తి ఖాతాలోకి పాయింట్ల రూపంలో వెంటనే జమ అవుతాయి. ఈ విధంగా వేరే వ్యక్తులను బెట్టింగ్ కంపెనీలకు రిఫర్ చేసి కమీషన్లు దండుకునే చిన్నచిన్న బుకీలు ప్రస్తుతం పర్చూరులో తయారయ్యారు. క్రికెట్ ఆట మొదలైన తరువాత ఏ టీమ్కు గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయో ఆ టీమ్పై బెట్టింగ్ పెడతారు. క్రికెట్ ఆట జరిగేటప్పుడు మనం బెట్టింగ్ పెట్టిన టీమ్ ఓడిపోయే అవకాశం ఉందని భావిస్తే వెంటనే బెట్టింగ్ డబ్బులను మరో టీమ్పైకి మార్చుకోవచ్చు. అయితే తొలుత ఒక రూపాయికి 10 రూపాయలు వచ్చినట్లు బెట్టింగ్ వెబ్సైటు వారు నమ్మిస్తారు. వచ్చిన చిన్నపాటి నగదును మన ఖాతాలో వెంటనే జమచేస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు నేరుగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా మన ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తారు. శని, ఆదివారాలలో అయితే ఫోనేఫే, గూగుల్ పే, పేటీఎం యాప్ల ద్వారా జమ చేస్తారు. మనం ఎక్కువ మొత్తంలో నగదు గెలుచుకున్నప్పుడు వాటిని మన ఖాతాలోకి మళ్లించకుండా మన అకౌంట్ను బ్లాక్ చేస్తారు. మ్యాచ్ని ఓడిపోయే సమయంలో బోర్డుని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఈ విధంగా బెట్టింగ్ కంపెనీ యువతను మోసం చేసి లాభాలను గడిస్తోంది. కొరవడిన నిఘాపోలీసులు రహస్యంగా గ్రామాల్లోని బెట్టింగ్ రాయుళ్ల వివరాలు సేకరించాలి. వారి బ్యాంక్ ఖాతాలను పరిశీలించి ఎక్కడి నుండి వారి ఖాతాలో తరచూ నగదు జమ అవుతుందో గమనించాలి. బెట్టింగ్ ఖాతాల నుంచి నగదు జమ అవుతుంటే అతడ్ని అనుమానించి అతని వద్ద నుంచి ఇతరుల పూర్తి సమాచారాన్ని రాబట్టాలి. బెట్టింగ్కు పాల్పడుతున్న వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చి మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. యువతకు రుణ సౌకర్యం కమీషన్లకు కక్కుర్తి పడి యువతను పెడత్రోవ పట్టిస్తున్న వైనం నిఘా విభాగం నిర్లక్ష్యం మరింత రెచ్చిపోతున్న బుకీలు పోలీసుల కంట పడకుండా పలు జాగ్రత్తలు బెట్టింగులు పెట్టడానికి యువకుల వద్ద తల్లిదండ్రులు ఇచ్చే డబ్బులు ఉండాల్సిన పని లేదు. లోన్ యాప్ల ద్వారా రుణాలు పొందే అవకాశాలు ఇప్పుడు మెండుగా ఉన్నాయి. ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్ తదితర వివరాలతో లోన్ యాప్ల ద్వారా రుణాన్ని పొందవచ్చు. రుణంగా పొందిన డబ్బులు మొత్తాన్ని యువకులు అమాయకంగా బెట్టింగులలో పెట్టి పోగొట్టుకుంటున్నారు. అనంతరం లోన్ యాప్ల ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చోటు చేసుకున్నాయి. -
అకాల వర్షం.. ఆశలు ఆవిరి
● తడిచి పాడైన పచ్చి ఇటుక ● వర్షం బారిన మొక్కజొన్న పంట కొల్లూరు మండలం గాజుల్లంక చినరేవు వద్ద వర్షపు నీటిలో నానుతున్న పచ్చి ఇటుకకొల్లూరు: అకాల వర్షం ఇటు రైతులను.. అటు ఇటుక ఉత్పత్తిదారులను నష్టాల పాల్జేసింది. శనివారం మధ్నాహ్నం అకస్మాత్తుగా వర్షం కురిసింది. మండలంలో వందలాది ఎకరాలలో మొక్కజొన్న పంట వర్షానికి తడిచింది. ఇటుక రాయి పరిశ్రమపైనా వర్షం ప్రభావం తీవ్రంగా పడింది. రైతులు కల్లాల్లో ఆరపెట్టిన మొక్కజొన్న గింజలతోపాటు, మొక్కజొన్న కండెలను ఆరపెట్టుకునే వెసులుబాటు లేకపోవడంతో తడిచి పోయాయని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. ఇటుక పరిశ్రమ ముగింపు దశలో ఉన్న తరుణంలో అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మండలంలో సుమారు రెండు కోట్ల వరకు పచ్చి ఇటుక వర్షానికి తడిచి ఎందుకూ పనికిరాకుండా పోయింది. గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షం కారణంగా తడిచిన మొక్కజొన్న పంట రంగుమారి ధర తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక మొక్కజొన్నకు ఆశించిన ధర లభించని తరుణంలో వర్షం రూపంలో వచ్చిన విపత్తుతో మరింత ధర తగ్గిపోయి పెట్టుబడులు లభించవన్న భావన రైతుల్లో వెల్లడవుతుంది. ప్రస్తుతం పరిశ్రమ చివరి దశలో ఉండటంతో తడిసిన ఇటుకలను తొలగించి తిరిగి బట్టీలకు అవసరమైన పచ్చి ఇటుక తయారు చేయాలంటే శ్రమతోపాటు, ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా పరిశ్రమ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇటుక అమ్మకాలు మందగించి పరిశ్రమ ఒడిదుడుకుల్లో ఉన్న సమయంలో వర్షం కారణంగా ఏర్పడిన నష్టంతో ఇటుక ఉత్పత్తిదారులు కోలుకునే అవకాశం లేదన్న ఆవేదన పరిశ్రమదారుల్లో వ్యక్తమవుతుంది. వర్షం కారణంగా కొల్లూరులో పలు రహదారులు జలమయమవడంతోపాటు, డ్రెయిన్ల్లో మురుగు పొంగి రోడ్లపైకి చేరడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. -
కాపులకు మొండి చెయ్యి
వేమూరు: కూటమి ప్రభుత్వం వేమూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి నియామకంలో కాపులకు మొండి చెయ్యి చూపించింది. చైర్మన్ పదవి కమ్మ సామాజిక వర్గానికి కేటాయించడంతో ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న కాపు నాయకులు నిరాశకు గురయ్యారు. తెనాలి మార్కెట్ యార్డులో వేమూరు నియోజకవర్గం ఉంది. 2016లో తెనాలి మార్కెట్ యార్డు నుంచి విడిపోయింది. వేమూరు నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాలు కలిసి వేమూరు మార్కెట్ యార్డుగా ఏర్పాటు చేశారు. వేమూరు నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు అధికంగా ఉన్నాయి. తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో ఎమ్మెల్యే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉన్నాడు. రెండో స్థానంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటంతో మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపులకు కేటాయిస్తారని ఆశించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు కాపు సామాజిక వర్గం నాయకులను పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గం నాయకులకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కట్టబెడుతోంది. 2014 తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. 2016 మార్కెట్ యార్డు ఏర్పాటు చేశారు. 2017లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన జొన్నలగడ్డ విజయబాబును మార్కెట్ యార్డు చైర్మన్గా నియమించారు. 2017 నుంచి 2019 వరకు ఆయన చైర్మన్గా ఉన్నారు. తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తాజాగా మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కమ్మ సామాజికవర్గానికి చెందిన గొట్టిపాటి పూర్ణకుమారిని వరించింది. దీంతో తెలుగుదేశం పార్టీలో కాపు సామాజిక వర్గం చెందిన సీనియర్ నాయకులు నిరాశకు గురయ్యారు. నాయకుల తీరుపై మండిపడుతున్నారు. మార్కెట్ యార్డు చైర్పర్సన్గా గొట్టిపాటి పూర్ణకుమారిని నియామకం ఆది నుంచీ కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యం రగులుతున్న కాపు సామాజిక నేతలు వైఎస్సార్ సీపీలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం 2019లో వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తర్వాత మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపు సామాజిక వర్గానికి కట్టబెట్టి ప్రాధాన్యత కల్పించింది. నియోజకవర్గంలో ఎస్సీ సామాజికవర్గం తర్వాత కాపు సామాజికవర్గం ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపులకు కేటాయించారు. 2020 మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కాపు సామాజికవర్గానికి చెందిన బొల్లిముంత ఏడుకొండలు పదవీ బాధ్యతలు చేపట్టారు. 2020 నుంచి 2023 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2023 జూన్ నెలలో రెండో విడత ఆయనకే కేటాయించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ ఉప్పు శిరీషకు యార్డు చైర్మన్ పదవి ఇచ్చారు. ఆమె 2023 నుంచి 2024 వరకు ఆ పదవిలో కొనసాగారు. పార్టీ పదవుల్లోనూ కాపు సామాజికవర్గానికి అధిక ప్రాధా న్యం కల్పించారు. పార్టీ పదవుల్లోనూ కాపు సామాజికవర్గానికి టీడీపీ మొండి చెయ్యి చూపింది. -
చీరాల మున్సిపల్ కార్యాలయానికి తాళాలు
చీరాల: చీరాల మున్సిపల్ కమిషనర్ నియంత పోకడలు పోతున్నారు. అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పట్టణ ప్రథమ పౌరుడు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావును కార్యాలయంలోకి వెళ్లనీయకుండా గతంలో ఎన్న డూ లేని విధంగా సెక్యూరిటీని పంపి కార్యాలయానికి తాళం వేయించారు. ప్రతి ఏటా బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు చైర్మన్ ఆధ్వర్యంలో కార్యాలయంలో జరుగుతాయి. ఈసారి మాత్రం చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నారనే నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసిన కమిషనర్ కౌన్సిలర్లు, చైర్మన్లు కార్యాలయానికి వెళ్లకుండా తాళాలు వేయించారు. అదేమంటే బాబూ జగ్జీవన్రామ్ జయంతి రోజున సెలవు దినమని ప్రచా రం చేయించారు. వాస్తవంగా అధికారులు, సిబ్బంది లేకున్నా చైర్మన్ తన ఛాంబర్లో మహనీయుల జయంతి వేడుకలను జరుపుకోవచ్చు. తహసీల్దార్ కార్యాలయంతోపాటు మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో జగ్జీవన్రామ్ జయంతి నిర్వహించారు. కమిషనర్కు ఏమి ఆదేశాలు అందాయో ఏమోగాని రోజూ ఉండే సెక్యూరిటీ సిబ్బందిని బయటకు పంపి తాళాలు వేయడం విశేషం. దీంతో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్చైర్మన్ బొనిగల జైసన్బాబు, కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు గేటు బయటనే జగ్జీవన్రామ్ చిత్రపటాన్ని ఏర్పాటుచేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చైర్మన్ను అవమానించేందుకే... వారు మాట్లాడుతూ కమిషనర్ ఒక బీసీ చైర్మన్ను అవమానించేందుకే కార్యాలయానికి తాళాలు వేశారని ఆరోపించారు. ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. చైర్మన్నే లోపలికి రాకుండా తాళాలు వేశారంటే ఆ కమిషనర్కు ఉన్న అహంకారం అర్థమవుతుందన్నారు. కమిషనర్ను సస్పెండ్ చేసేంత వరకు పోరాడతామన్నారు. ఇటువంటి పరిస్థితి ఐదేళ్లలో ఎప్పుడూ జరగలేదని, ఇది చైర్మన్ను అవమానించడమేనన్నారు. కమిషనర్ వైఖరిపై నిరసన నిరసనగా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కమిషనర్ డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. వైస్ చైర్మన్ శిఖాకొల్లి రామసుబ్బులు, కౌన్సిలర్లు గోలి జగదీష్, కంపా అరుణ్, గొట్టిపాటి ఎబినేజర్, కీర్తి వెంకట్రావు, బత్తుల అనిల్, గుంటూరు ప్రభాకరరావు, చీమకుర్తి బాలకృష్ణ, తోకల అనిల్, కో–ఆప్షన్ సభ్యుడు షేక్ కబీర్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు యాతం మేరిబాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు వాసిమళ్ల వాసు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బరితెగింపు బీసీ మున్సిపల్ చైర్మన్కు ఘోర అవమానం గేటు బయటనే బాబూ జగ్జీవన్రామ్ జయంతి వేడుకలు -
చోరీ కేసును ఛేదించిన బాపట్ల పోలీసులు
బాపట్లటౌన్: జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన ఇంకొల్లు చోరీ కేసును బాపట్ల పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. రూ.75 లక్షల విలువైన నగదు, బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వెల్లడించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీస్స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 3 అర్ధరాత్రి సమయంలో ఇంకొల్లులోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా నివాసం ఉంటున్న జాగర్లమూడి శివ ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీలో రూ.55 లక్షల నగదు, రూ.24 లక్షల విలువచేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు క్లూస్టీం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వివరాలు సేకరించి అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకొని దొంగిలించిన సొత్తును రికవరీ చేశారు. దొంగతనం జరిగింది ఇలా.. చోరీకు పాల్పడిన మహమ్మద్ షరీఫ్ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అమీద్పురం గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను గతంలో చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో అదే జైలులో గంజాయి కేసులో ముద్దాయి అయిన ఇంకొల్లు గ్రామానికి చెందిన సాయితో పరిచయం అయ్యింది. ఆ పరిచయంతో ఇరువురు స్నేహితులయ్యారు. వారిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ ఏడాది మార్చి 30న షరీఫ్ ఇంకొల్లులోని సాయి ఇంటికి వచ్చాడు. సాయి నిర్వహిస్తున్న హోటల్లో వంట మాస్టర్గా చేరాడు. నాలుగు రోజులుగా పక్కా ప్లాన్ చేసుకొని ఈనెల మూడున అర్ధరాత్రి శివప్రసాద్ ఇంటి వెనుక వైపు ఉన్న మెట్ల ద్వారా గోడపైకి ఎక్కి తాళాలు పగలకొట్టి పెంట్హౌస్లోకి చొరబడ్డారు. బాధితుడు రెండవ అంతస్తులో నిద్రిస్తుండగా మూడో అంతస్తులో ఉన్న బీరువా ఉన్న గది తాళాలు, బీరువా తాళాలను ఇనుప కడ్డీలు, రాడ్డుల సహాయంతో పగలకొట్టి సొమ్మును దోచుకెళ్లారు. ముద్దాయిపై ఇప్పటికీ 14 కేసులు ఉన్నాయి. రూ.75.50 లక్షల సొత్తు రికవరీ చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు రూ.55.50 లక్షల నగదు, బంగారు గాజులు–7 జతలు (17 సవర్లు), బంగారు నానుతాడు–1 (2.5 సవర్లు), బంగారు గొలుసు–1 (రెండున్నర సవర్లు), బంగారు ఉంగరం–1 (అర సవరు), చెవి బుట్టలు ఒక జత (1/2 సవర్లు), చెవి దిద్దులు మూడు జతలు (3/4 సవర్లు) మొత్తం 24 సవర్ల బంగారం, వాటి విలువ రూ.20,00,000. మొత్తం విలువ రూ. 75.50 లక్షల సొమ్మును రికవరీ చేశారు. పోలీసులకు అభినందన నేరం జరిగిన 24 గంటలలోనే నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తు రికవరీలో ప్రతిభ కనబరిచిన చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్, ఇంకొల్లు సర్కిల్ సీఐ వై.వి.రమణయ్య, ఇంకొల్లు ఎస్ఐ జి.సురేష్, ఇంకొల్లు పోలీస్స్టేషన్ హెడ్కానిస్టేబుల్ జి.వీర్రాజు, కానిస్టేబుల్ కె.హరిచంద్రనాయక్, జి.కె.వి సుబ్బారావు, ఎ.ముకేష్వర్మ, హోంగార్డులు కె.పనిత్కుమార్, ఎన్.శరత్బాబులకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతిని అందజేశారు. 24 గంటల్లోనే రూ.75 లక్షల సొత్తు రికవరీ అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ తుషార్డూడీ -
కల్యాణం చూతము రారండి...
విద్యుత్ దీపాల వెలుగుల్లో రేపల్లె రైలుపేటలోని పట్టాభిరామస్వామి ఆలయం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి సందడి నెలకొంది. సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా రామాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయాల ముందు చలువ పందిళ్లు వేశారు. సీతారాముల కల్యాణం తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. అన్నదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. –రేపల్లె రూరల్/ బాపట్ల టౌన్బాపట్ల మండలం ముత్తాయపాలెంలో రామాలయం ముందు వేసిన చలువ పందిరి -
జగ్జీవన్రామ్ విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడు
బాపట్ల :అణగారిన వర్గాల నుంచి వచ్చినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించి ఎన్నో ఉన్నత పదవులను అలంకరించిన మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ విద్యార్థి లోకానికి ఆదర్శనీయుడని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షులు మరుప్రోలు కొండలరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్రామ్ జయంతి సభ శనివారం నిర్వహించారు. కొండలరెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ప్రారంభించిన అంటరానితనం వ్యతిరేక ఉద్యమంలోను, సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలోను చురుగ్గా పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించిన జగ్జీవన్రామ్ స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశపు మొట్టమొదటి కార్మిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిగా వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో ఆయన నిర్వహించిన పాత్ర గణనీయమైనదని, భారతదేశంలో హరిత విప్లవ సాధనలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనదన్నారు. 1974లో కరువు సంభవించినప్పుడు ఆ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించి రైతాంగం మన్ననలు పొందారన్నారు. తొలుత జగ్జీవన్రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, పిన్నిబోయిన ప్రసాద్, జోగి రాజా, షోహిత్ తదితరులు పాల్గొన్నారు. బాబూ జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలి బాపట్లటౌన్ : బాబూ జగ్జీవన్రామ్ జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళుర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ అణగారిన వర్గాలు వివక్షకు గురౌతున్న తరుణంలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం నిస్వార్థ పోరాటాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అంటరానితనం వంటి అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపటంలో తన వంతు కృషి చేశారన్నారు. ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమాల్లోనూ గాంధీజీతో కలిసి అడుగులు వేశారన్నారు. అలాంటి గొప్ప నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడుని స్మరించుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. ఆదర్శనీయమైన మహోన్నత వ్యక్తి నుంచి సద్గుణాలను అలవర్చుకుని సమాజం కోసం మనవంతు కృషి చేయాలన్నారు.ఏఆర్ డీఎస్పీ విజయసారధి, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఎస్బీ సీఐ నారాయణ, అడ్మిన్ ఆర్ఐ మౌలుద్దీన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
అలరిస్తూ.. ఆలోచింపజేస్తూ..
కొనసాగుతున్న సుందరయ్య కళానిలయం జాతీయస్థాయి నాటికల పోటీలుయడ్లపాడు: పుచ్చలపల్లి సుందరయ్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 22వ జాతీయస్థాయి నాటికల పోటీలు రెండోరోజైన శనివారం కొనసాగాయి. రెండు రోజులు జరిగిన ఆరు ప్రదర్శనలు బంధాలు, వాటి విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి గురించి వివరించాయి. నాటికలోని ప్రతి సంఘటన సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఆలోచనలను రేకిస్తుంది. ఈ కళారూపాల్ని తిలకించేందుకు కళాభిమానులు అధిక సంఖ్యలో తరలి రావడం, అర్థరాత్రి వరకు అన్ని ప్రదర్శనల్ని ఎంతో ఆసక్తిగా తిలకించడం విశేషం. మానవ సంబంధాల్లో శూన్యతను ప్రశ్నించే ‘నా శత్రువు’.. ఆధునిక జీవనశైలిలో టెక్నాలజీ ఆధిపత్యాన్ని కేంద్రంగా తీసుకుని, మానవ సంబంధాల్లో ఎదురవుతున్న శూన్యతను బహిర్గతం చేస్తున్న ఇతివృత్తం ‘నా శత్రువు’ నాటిక. సెల్ఫోన్, ల్యాప్టాప్, సోషల్ మీడియా వంటివి సమయాన్ని మింగేస్తూ, మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్నాయని ఈ నాటిక స్పష్టంగా చూపిస్తుంది. కుటుంబ సంబంధాలు, అనుబంధాల విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో, ఈ నాటిక ఒక హెచ్చరికగా నిలుస్తుంది. జయభేరీ థియేటర్స్ హైదరాబాద్ వారు సమర్పించిన ఈ నాటికను అక్కల తామేశ్వరయ్య రచించగా వడ్డాది సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ● అదేవిధంగా ఆధునిక ఆడపిల్లల స్వతంత్ర భావనలు, ఆడపిల్లలు భారం అన్నట్టుగా నమ్మే వక్ర భావజాలాన్ని సూటిగా విమర్శించిన ‘రుతువు లేని కాలం’, ఓ సామాన్య మహి ళ రైల్వే శాఖపై సంధించిన అస్త్రంగా సాగిన ‘జనరల్ బోగీలు’ నాటికలు ఆలోచింపజేశాయి. -
వైద్య కళాశాల ల్యాబ్ను పరిశీలించిన కేంద్ర బృందం
గుంటూరు మెడికల్: పల్నాడు జిల్లాలో రెండేళ్ల చిన్నారి బర్డ్ఫ్లూతో మృతి చెందడంతో నిర్ధారణ చేసేందుకు రెండు రోజులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కేంద్రం బృందం పర్యటిస్తోంది. పల్నాడు జిల్లాలో ఒక రోజు, మంగళగిరి ఎయిమ్స్లో మరోరోజు పరిశీలన అనంతరం మూడోరోజు శనివారం గుంటూరు వైద్య కళాశాలకు వచ్చింది. కళాశాలలోని వైరాలజీ ల్యాబ్ (వీఆర్డీఎల్)ను సభ్యులు పరిశీలించారు. నరసరావుపేటలో బర్డ్ఫ్లూతో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు తొమ్మిది మందికి గుంటూరు వైద్య కళాశాల ల్యాబ్లో శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ల్యాబ్లో ఉన్న వసతులు, వారికి చేసిన వైద్య పరీక్షల గురించి మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వాణిశ్రీని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ నిర్వహణ, పనితీరు, వైద్య పరికరాలు, సిబ్బంది గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బృందంలో ఐడీఎస్సీ ఏపీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మల్లేశ్వరి, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ భార్గవి రాజ్, ఎన్సీడీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అంకూర్ గార్గ్, ఎన్సీడీసీ మైక్రోబయాలజిస్ట్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ నిధి షైని, ఎయిమ్స్ మంగళగిరి పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర, ముంబాయి ఐసీఎస్ఆర్ సైంటిస్ట్ డాక్టర్ శైలేష్ పవర్ ఉన్నారు. -
గొప్ప సామాజిక సంస్కర్త డాక్టర్ జగ్జీవన్రామ్
బాపట్ల: గొప్ప సామాజిక సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతి కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల వసతి గృహంలో శనివారం నిర్వహించారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్బాబు, ఆర్డీఓ పి గ్లోరియా తదితరులు పుష్పమాలలతో నివాళులర్పించారు. జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగ్జీవన్రామ్ను ప్రేరణగా తీసుకుని విద్యార్థినులు ముందుకు సాగాలని చెప్పారు. ఎస్సీల నుంచి తొలి రాజకీయ నాయకుడు, భారత ఉప ప్రధానిగా ఎదిగిన గొప్ప వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. మంత్రి పదవులను సమర్థంగా నిర్వహించారని, మంత్రిగా ఆయన పనిచేసిన కాలంలో హరిత విప్లవం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పేదరికం నుండి వచ్చిన జగ్జీవన్రామ్ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారని, భారతదేశ సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేశారన్నారు. ఆర్థికంగా అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రతినెలా మూడో శుక్రవారం ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని చెప్పారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా జిల్లాలో మూడు వేల మందికి ఆధార్ కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు ఉచితంగా అందించామన్నారు. జగ్జీవన్రామ్, అంబేద్కర్ సాధించిన విజయాలను భావితరాలకు వివరించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వ వసతి గృహాలలో నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలను ప్రభుత్వం దేవాలయాలుగా భావిస్తున్నందున ఇక్కడే నిర్వహిస్తామన్నారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ భారతమాత ముద్దుబిడ్డ జగ్జీవన్రామ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ జిల్లా సాధికారత అధికారి రాజ్ దెబోరా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఎస్ విజయమ్మ, ఎస్సీ, ఎస్టీ నాయకులు చారువాక, ఎన్ ధర్మానాయక్, జి నాగమణి తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రఖర్జైన్ ఘనంగా జయంతి వేడుకలు -
నేల కొరిగిన నాలుగు విద్యుత్ స్తంభాలు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగరంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షానికి అమరావతి రోడ్, ఆంజనేయస్వామి గుడి వద్ద వీధి లైట్ల కోసం వేసిన నాలుగు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు మున్సిపల్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో తక్షణమే సరఫరా నిలిపివేశారు. స్తంభాలు కూలడంతో అమరావతి రోడ్లో ట్రాఫిక్కు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సంబంధిత అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది స్తంభాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. తప్పిన పెను ప్రమాదం అప్రమత్తమైన కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులు -
నంద్యాల, సూర్యాపేట ఎడ్లకు ప్రథమ బహుమతి
తెనాలి రూరల్: స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహిస్తున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన, పశు పాల ప్రదర్శన పోటీలు ముగిశాయి. గత నెల 29వ తేదీ నుంచి జరుగుతున్న పోటీల్లో చివరి రోజైన శుక్రవారం సీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించారు. 11 జతల ఎడ్లు పోటీ పడ్డాయి. రాత్రి పొద్దు పోయే వరకు హోరాహోరీగా పోటీలు జరిగాయి. నంద్యాల జిల్లా పెదకొట్టలకు చెందిన జోరెడ్డి కేశవరెడ్డి, తెలంగాణ జిల్లా సూర్యాపేటకు చెందిన ఏఎస్పీ సుంకి సురేందర్రెడ్డి కంబైన్డ్ ఎడ్ల జత నిర్ణీత సమయంలో 3619.9 అడుగులు లాగి ప్రథమ బహుమతిని పొందాయి.తాడేపల్లికి చెందిన లంకిరెడ్డి నిక్షేత్రెడ్డి ఎడ్ల జత(3394.10 అడుగులు) రెండో బహుమతిని, ప్రత్తిపాడు మండలం పెద్దగొట్టటిపాడుకు చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్ల జత (3351.8 అడుగులు) మూడో బహుమతిని సాధించాయి. సీనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతిగా బెల్లెట్ బండిని అందజేశారు. పోటీలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పర్యవేక్షించారు. -
చీరాల క్రీడాకారుల ప్రతిభ
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చీరాల రూరల్: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలలో చీరాల క్రీడాకారులు విశేష ప్రతిభచూపించారు. తమ ప్రత్యర్థులను పదునైన పంచ్లతో బెంబేలెత్తించి అనేక పతకాలను కై వసం చేసుకున్నారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 2 నుండి 3వ తేది వరకు గుంటూరు తెనాలిలో 5వ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ క్యాడిట్ మరియు సబ్ జూనియర్, సీనియర్ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో చీరాలకు చెందిన తైక్వాండో క్రీడాకారులు కోచ్ మల్లెల సురేష్ ఆధ్వర్యంలో పోటీలలో పాల్గొన్నారు. ఎంతో ప్రతిభ చూపిన మన క్రీడాకారులు బంగారు, కాంస్య, రజత పతకాలను కై వసం చేసుకున్నారు. పతకాలు కై వసం చేసుకున్నవారిలో మినీ సబ్జూనియర్స్ విభాగంలో ఎం.లియో క్రిష్ 21 కేజిల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. 35 కిలోల సబ్జూనియర్ విభాగంలోఎం.దివ్యసాన్వి రజత పతకం, క్యాడిట్ వెయిట్ 21 కిలోలు విభాగంలో ఆర్.ఆకాశరెడ్డి బంగారు పతకం, 35 కేజిల విభాగంలో ఎస్కె.వైభవ్ రజత పతకం, జూనియర్స్ విభాగంలో ఐ.రాహుల్ 51 కిలోల విభాగంలో రజతం, ఎం.మ్యాక్సిమస్ 55 కేజిల విభాగంలో రజత పతకం సాధించాడు. సీనియర్స్ విభాగంలో జి.భాస్కర్ 51 కేజిల విభాగంలో బంగారు పతకం సాధించాడు. 60 కేజిల విభాగంలో షేక్ బాజి బంగారు పతకం సాధించాడు. 65 కేజిల విభాగంలో ఎం.మహేష్బాబు బంగారు పతకం సాధించాడు. ఎస్కె.సుభాని 54 కేజిల విభాగంలో రజత పతకం సాధించాడు. ఈ పోటీలలో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు మహారాష్ట్ర నాసిక్లో జరిగే సీనియర్ నేషనల్ తైక్వాండో పోటీలలో పాల్గొంటారని జల్లా తైక్వాండో అసోసియేషన్ సెక్రటరి మల్లెల సురేష్ తెలిపారు. పోటీలలో పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్ సురేష్లు శుక్రవారం ఒన్టౌన్ పోలీసుస్టేషన్ ట్రాఫిక్ ఎస్సై ఎం.పవన్కుమార్ను మర్యాదపూర్వంగా కలిశారు. క్రీడాకారులను కోచ్ను ఎస్సై సత్కరించారు. జాతీయ స్థాయి పోటీలలో రాణించి చీరాలకు మంచిపేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను క్రీడాభిమానులు క్రీడాప్రేమికులు అభినందనలు తెలియజేశారు. బంగారు, కాంస్య, రజత పతకాలు కై వసం జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించిన బంగారు పతకదారులు -
ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలి
చీరాల టౌన్: ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేని ప్రభుత్వం ఓ వైపు.....అకాల వర్షంతో అన్నదాతలు పండించిన పంట తడిచి రైతులను నట్టేట ముంచిందని ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈపురుపాలెం తదితర గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో తడిచిన ధాన్యాన్ని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రబీ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమన్నారు. ప్రభుత్వం ధర రూ.1750 ఉండగా రబీ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులు, దళారులు బస్తాను రూ.1350కి కొనుగోలు చేయడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రబీ ధాన్యాన్ని మార్చిలోనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోగా అధికారంలోకి వచ్చిన టీడీపీ, కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒకవైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, మరోవైపు ప్రభుత్వం పట్టించుకోకపోవడం మళ్లీ అకాల వర్షాల కారణంగా కల్లాల్లో ఉన్న ధాన్యం తడిచిపోవడంతో అన్నదాత తీవ్రంగా నష్టపోయాడని అన్నారు. రైతుల కష్టాలను గుర్తించి సీఎం చంద్రబాబు బస్తాకు రూ.1750 ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తే పార్టీ తరపున పోరాడి అండగా నిలబడతామన్నారు. రైతులను పరామర్శించిన వారిలో పలువురు నాయకులు ఉన్నారు. -
సంరక్షణ కేంద్రాలున్న ప్రాంతాలు..
జిల్లాలోని సముద్ర తీర గ్రామాలైన చిన్నగంజాం మండలం పరిధిలో ఏటిమొగ్గ, కుంకుడు చెట్టపాలెం, వేటపాలెం మండల పరిధిలో రామచంద్రాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, రామాపురం, బాపట్ల మండల పరిధిలోని సూర్యలంక తీరాల వద్ద ఒక్కొక్క సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఉన్న సముద్ర తీరంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 145 తల్లి తాబేళ్లు తీరానికి వచ్చి 16,170 గుడ్లు పెట్టి వెళ్లాయి. వీటిని వలంటీర్లు సేకరించి ఆరు సంరక్షణ కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం ఈ గుడ్లు ఇప్పటి వరకు 2358 తాబేళ్ల పిల్లలుగా మారడంతో వాటిని సముద్రంలోకి సురక్షితంగా వదిలేశారు. ఈ ప్రక్రియ మే నెల వరకు కొనసాగుతుంటుంది. -
ప్రజల విజ్ఞప్తులను పరిష్కరించాలి
అద్దంకి రూరల్: ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ప్రజావేదిక నిర్వహించారు. ప్రజలు నుంచి వచ్చి విజ్ఞాపన పత్రాలను స్వీకరించారు. పట్టణంలోని రోడ్లు డ్రైనేజిలకు సంబంధించినవి, దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లు, విద్యుత్ సమస్యలపై ప్రజలు నుంచి ఎక్కువగా విజ్ఞప్తులు అందాయి. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీచరణ్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, విద్యుత్ శాఖ డీఈ మస్తాన్రావు, ఎంపీడీవో సింగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు. 309 మంది విద్యార్థినులకు సైకిళ్లు అందజేత.. అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో విద్యుత్ శాఖ మంది గొట్టిపాటి రవికూమార్ 309 మంది ప్రకాశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు నూతన సైకిళ్లు అందజేశారు. నియోజకవర్గంలోని మిగతా పాఠశాలలలోని విద్యార్థినులకు సైకిళ్లు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి
ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా రేపల్లె రూరల్: క్రైస్తవుల భద్రతకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఐఆర్ఈఎఫ్ అధినేత బిషప్ డాక్టర్ ఇమ్మానుయేలు రెబ్బా అన్నారు. అనుమానాస్పద స్థితిలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రేపల్లె క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవుని వాఖ్యాన్ని ప్రజలకు చేర్చి పరిశుద్దులను చేసే పాస్టర్లపై దాడులకు పాల్పడటం అమానుషమని పేర్కొన్నారు. క్రైస్తవులపై దాడులు జరగకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ బాపట్ల జిల్లా మాజీ అధ్యక్షుడు చిత్రాల ఓబేదు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అన్నికోణాలలో సమగ్ర విచారణ జరిపి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో పాస్టర్లపై దాడులు జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రవీణ కుటుంబ సభ్యులకు క్రైస్తవ సంఘాలు అన్ని వేళలా అండగా నిలుస్తాయని అన్నారు. ర్యాలీ బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, నెహ్రు బొమ్మ సెంటరుల మీదగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్, పోలీసుస్టేషన్లలో వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు గుజ్జర్లమూడి ప్రశాంత్కుమార్, గుజ్జర్లమూడి ఇమ్మానుయేలు, సముద్రాల ప్రభుకిరణ్, షేక్ ఖుద్దూష్, ఆలా రాజ్పాల్, జాలాది మునియ్య, జాలాది సునీల్, వివిధ చర్చిల పాస్టర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి
రాజుపాలెం: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎస్ఈ డాక్టర్ పి.విజయ్కుమార్ సూచించారు. మండలంలోని కొండమోడు విద్యుత్ శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో శుక్రవారం సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఇందులో ఎస్ఈ మాట్లాడుతూ.. బిల్లుల వసూలులో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవిలో టాన్స్ఫార్మర్ వద్ద లోడ్ బ్యాలెన్సు చేసుకోవాలని సూచించారు. 50 శాతం అదనపు లోడు సబ్సిడీ స్కీమును గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకుని వెంటనే బిల్లులు చెల్లించాలని తెలిపారు. గ్రామాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఎక్కువగా ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందుగా మండలంలోని రాజుపాలెం, గణపవరం, అనుపాలెం సబ్ స్టేషన్లలో తనిఖీలు చేశారు. సమావేశంలో విద్యుత్ శాఖ డీఈఈ బి.నాగసురేష్బాబు, మాచర్ల ఈఈ ఎన్. సింగయ్య, ఏఈఈ కోట పెదమస్తాన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కూలీల ఆటో బోల్తా.. ఒకరు మృతి
వినుకొండ: మిరపకాయల కూలీల ఆటో తిరబడి ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని ఏనుగుపాలెం సమీపంలో జరిగింది. ఉమ్మడివరం నుంచి నూజెండ్ల మండలం త్రిపురాపురం గ్రామానికి మిర్చి కోసేందుకు ప్రతిరోజు కూలీలు వెళ్తూ ఉంటారు. ఉదయం ఏనుగుపాలెం సమీపంలో ఆటో తిరగబడింది. ఈ ప్రమాదంలో జోజమ్మ (60) మృతి చెందింది. మార్తమ్మ, వెంకాయమ్మ, అంకమ్మ, కోటమ్మ, మరియమ్మ, ఆదెమ్మ తదితర ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో వారిని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందిస్తున్నారు.మరో ఏడుగురికి తీవ్రగాయాలు -
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
కొల్లూరు: విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడిన ఇరువురు లైన్మెన్ల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సాయం కింద నగదు అందజేసినట్లు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని ఈపూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. అదే సమయంలో విద్యుత్ సరఫరా జరగడంతో దోనేపూడి లైన్మన్ పోతార్లంక లీలాదుర్గాశంకర్ (51), ఈపూరు సచివాలయం జూనియర్ లైన్మన్ ఆకుల మహేష్ (37)లు మృతి చెందారు. ప్రమాద ఘటనపై కొల్లూరు తహసీల్దార్ను జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి ఆరా తీశారు. కలెక్టర్ ఆదేశాలతో మృతుల కుటుంబాలను పరామర్శించిన తహసీల్దార్ ఒక్కొక్క మృతుడి కుటుంబానికి దహన సంస్కారాల ఖర్చుల కింద రూ.10 వేలు అందజేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. -
నాటు సారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
బాపట్ల: జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ అధికారులకు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్లో నాటు సారా నిర్మూలన జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో నాటుసారా తయారు చేసే గ్రామాలను గుర్తించాలన్నారు. నాటుసారా నిర్మూలనకు గ్రామ, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. ముందుగా గ్రామాలలో నాటుసారా నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. నాటు సారా తయారు చేయడంలో మార్పులు రానట్లయితే గ్రామాలలో తయారీ దారులపై దాడులు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పోలీస్, ఎకై ్సజ్ శాఖ, అటవీ శాఖ అధికారులు సమన్వయముతో పనిచేసి నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. నాటు సారా తయారీదారులు మానుకున్నట్లయితే వారి జీవనోపాధి మెరుగుపరచడానికి గిరిజన సంక్షేమశాఖ ద్వారా బ్యాంకు రుణాలు అందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లాఅటవీ శాఖ అధికారి భీమా నాయక్, ఎకై ్సజ్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ ప్రఖర్జైన్ -
చికెన్ వల్ల ఎవరికీ బర్డ్ప్లూ సోకలేదు
నెక్ అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామి నరసరావుపేట: రాష్ట్రంలో కోళ్ల వల్ల బర్డ్ప్లూ సోకి మనుషులు మృతి చెందిన సంఘటనలు లేవని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ (నెక్ ) అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామి పేర్కొన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ చికెన్, గుడ్లు తిని దేశాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ప్లూతో మృతి చెందిన చిన్నారి ఆరాధ్య ఉదంతంపై కేంద్ర బృందం శుక్రవారం ఇక్కడకు వచ్చిన సమయంలో బాలస్వామి కూడా వచ్చారు. జరిగిన విషయం తల్లిదండ్రులు, స్థానిక వైద్యులు, పశుసంవర్ధకశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత 25 ఏళ్ల నుంచి బర్డ్ప్లూ కోళ్లకు వస్తున్నా మనుషులకు సంక్రమించిన దాఖలాలు లేవని అన్నారు. ఆరాధ్య మృతికి సంబంధించి పౌల్ట్రీ రంగంపై నిందలు వేయటం తగదన్నారు. బర్డ్ఫ్లూతో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోళ్లు మృతి చెందినా, మనుషులకు ఈ వ్యాధి ఇప్పటివరకు సోకలేదని చెప్పారు. ఇటీవలనే తణుకులో రెండు లక్షల కోళ్లు, తెలంగాణలోని చౌటుప్పల్లో భారీగా కోళ్లు చనిపోయాయని గుర్తుచేశారు. వాటిని తొలగించి ఖననం చేసే కూలీలకు కూడా ఈ వ్యాధి సోకలేదని అన్నారు. చికెన్ తింటున్న వారికి సంక్రమించలేదని అన్నారు. -
మైనార్టీలను మోసగించిన చంద్రబాబు
కొల్లూరు: మైనార్టీలను సీఎం చంద్రబాబు తీవ్రంగా మోసం చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మైనార్టీలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న చంద్రబాబునాయడు పార్లమెంట్లో మైనార్టీలకు వ్యతిరేకంగా రూపొందించిన వక్ఫ్ బోర్డు బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మైనార్టీలను అణగదొక్కే రీతిలో చట్టాలను చేసుకుంటూ పోతుంటే, వాటికి టీడీపీ మద్దతునిస్తుందన్నారు. చంద్రబాబు రెండు నాలుకల విధానాన్ని అర్థం చేసుకోలేక మైనార్టీలు గత ఎన్నికల్లో మద్దతు నిచ్చి మోసపోయారన్నారు. ముస్లిం సమాజాన్ని వేధించి వారి పూర్వీకులు అల్లా పేరుతో దానం చేసిన భూములు లాక్కొని కార్పొరేట్ మిత్రులకు అప్పగించే విధంగా చంద్రబాబు సర్కారు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ చట్టం అమలు వలన ముస్లిం సమాజానికి తీవ్రమైన నష్టం వాటిల్లనుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ తొలి నుంచి మైనార్టీలకు అండగా ఉంటూ, వక్ఫ్ బోర్డు బిల్లును ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించబోమని చెప్పిన విషయాన్ని ముస్లిలు గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలపెట్టుకునే అలవాటు ఎన్నడూ లేదని అశోక్బాబు విమర్శించారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకం వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు -
భారీ దొంగతనం
ఇంకొల్లులో ఇంకొల్లు (చినగంజాం): బాపట్ల జిల్లా ఇంకొల్లులో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన రూ.55.50 లక్షల నగదు, రూ.20 లక్షల విలువైన బంగారు నగలు అపహరించుకుని తీసుకెళ్లారు. ఎస్ఐ జీ సురేష్ అందించిన సమాచారం ప్రకారం... ఇంకొల్లు గ్రామంలో ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న ఇంటిలో జాగర్లమూడి శివప్రసాద్ నివాసం ఉంటున్నారు. ఆయన రెండో అంతస్తులో నిద్రిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మూడో అంతస్తులోకి ప్రవేశించి గది తాళాలు పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.55.50 లక్షల నగదు, 24 సవర్ల బంగారు వస్తువులను అపహరించి తీసుకెళ్లారు. ఉదయం నిద్ర లేచిన ఆయన దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, ఎస్ఐ జీ సురేష్లు క్లూస్ టీంను పిలిపించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. తాను డైరెక్టర్గా ఉన్న ఎంఆర్ఆర్ ప్రకాశం హైస్కూల్ విద్యార్థుల ఫీజులు రూ.20 లక్షలు, పంట అమ్మిన డబ్బు రూ.30 లక్షలు, వ్యాపారం ద్వారా తన సోదరులు సంపాదించిన రూ.5.50 లక్షల నగదుతోపాటు రూ.20 లక్షల విలువైన బంగారు నగలు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.● రూ.55 లక్షల నగదు, 24 సవర్ల బంగారం దోపిడీ ● రంగంలోకి దిగిన క్లూస్ టీం ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు -
పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు
కొరిటెపాడు(గుంటూరు): పచ్చిరొట్ట విత్తన ధరలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్లో రాయితీ విత్తన పంపిణీ ప్రక్రియలో భాగంగా ఏటా రైతులకు ఉపయోగపడే పచ్చిరొట్ట విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర పొలాల్లో చల్లి పూతకు వచ్చిన తర్వాత కలియదున్నితే సేంద్రీయ పదార్థం బాగా పెరుగుతుందని శాసీ్త్రయంగా నిరూపితమైంది. దీంతో ఇటీవల ఈ విత్తనాలకు రైతుల నుంచి డిమాండ్ పెరిగింది. ఫలితంగా ప్రభుత్వం రాయితీపై వీటిని అందిస్తోంది. తాజాగా రాయితీ ధరలను ఖరారు చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లా(గుంటూరు, పల్నాడు, బాపట్ల)కు ఈ ఏడాది 9,536 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు కేటాయించారు. అందులో గుంటూరు జిల్లాకు 301 క్వింటాళ్ల జీలుగ, 436 క్వింటాళ్లు జనుము, 967 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 1,704 క్వింటాళ్లు కేటాయించారు. పల్నాడు జిల్లాకు 2,607 క్వింటాళ్లు జీలుగ, 1,559 క్వింటాళ్లు జనుము, 1,178 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 5,544 క్వింటాళ్లు కేటాయించారు. అలాగే బాపట్ల జిల్లాకు 856 క్వింటాళ్లు జీలుగ, 853 క్వింటాళ్లు జనుము, 779 క్వింటాళ్లు పిల్లిపెసర కలిపి మొత్తం 2,488 క్విటాళ్లు కేటాయించారు. వీటిని 50 శాతం రాయితీతో రైతులకు ఇవ్వనున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా వీటిని సరఫరా చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు. గరిష్టంగా ఐదు బ్యాగులు జీలుగ విత్తనాలు క్వింటా పూర్తి ధర రూ.12,300 కాగా, 50 శాతం రాయితీతో రూ.6,150 చొప్పున రైతులకు అందజేయనున్నారు. అలాగే క్వింటా జనుము విత్తనాల పూర్తి ధర రూ.10,900 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.5,450 చెల్లించాలి. పిల్లిపెసర క్వింటా పూర్తి ధర రూ.18 వేలు కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.9 వేలు చొప్పున రైతులకు విక్రయిస్తారు. జీలుగ, జనుము విత్తనాలు 10 కిలోల ప్యాకెట్ల రూపంలో, పిల్లిపెసర 8 కిలోల ప్యాకెట్ కింద ఎకరాలోపు రైతులకు ఒక బ్యాగ్, రెండు ఎకరాలకు రెండు బ్యాగులు, మూడు ఎకరాలకు మూడు బ్యాగ్లు, నాలుగు ఎకరాలున్న రైతులకు నాలుగు బ్యాగ్లు, ఐదు ఎకరాలు, అంత కన్నా ఎక్కువ ఉన్న వారికి గరిష్టంగా ఐదు బ్యాగుల పంపిణీ చేయనున్నారు. రైతు ఆసక్తిని బట్టి మూడు రకాల విత్తనాలు వేర్వేరుగానూ, మూడు రకాల విత్తనాలు కలిపి ఒకే బ్యాగ్ రూపంలోనూ ఇవ్వనున్నారు. మూడు కలిపిన వాటిలో నాలుగు కిలోల చొప్పున జీలుగ, జనుము, రెండు కిలోల పిల్లిపెసర ఉంటాయి. 10 కిలోలు కలిగిన మిక్సింగ్ కిట్ పూర్తి ధర రూ.1,296 కాగా, 50 శాతం రాయితీ పోనూ రూ.648లు చొప్పున రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాలు అవసరమైన రైతులు రైతు సేవా కేంద్రాల(ఆర్ఎస్కే)లో తమ వాటా చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఏపీ సీడ్స్ ఉమ్మడి గుంటూరు జిల్లా మేనేజర్ పి.సుమలత శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు 9,536 క్వింటాళ్ల కేటాయింపు 50 శాతం రాయితీతో రైతులకు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు -
దివ్యాంగుల సమస్యలపై దృష్టి సారించాలి
గుంటూరు జిల్లా జేసీ భార్గవ్తేజ గుంటూరువెస్ట్: దివ్యాంగుల సమస్యలపై అధికారులు దృష్టి సారించి వారి ఇబ్బందులను గుర్తించా లని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మంది రంలో నిర్వహించిన జిల్లాస్థాయి వికలాంగుల కమి టీ సమావేశంలో జేసీ మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులు వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. వివిధ దివ్యాంగ సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్సులు, మున్సిపల్ కాంప్లెక్సుల్లో దుకాణాలు, స్టాల్స్ కేటాయింపులో దివ్యాంగులకు అవకాశాలు కల్పించాలన్నారు. సదరం సర్టిఫికెట్ల జారీలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వంద శాతం వినికిడి లోపం ఉన్నవారికి ఉచితంగా బస్సు పాస్ ఇవ్వాలన్నారు. దివ్యాంగుల ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తే వారి కుటుంబాలు బాగుంటాయని పేర్కొన్నారు. అవసరం మేరకు ట్రైసైకిళ్లు మంజూరు చేయాలని కోరారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయడంలో గ్యారంటీగా ప్రభుత్వ ఉద్యోగి సూరిటీ అడుగుతున్నారని, దీన్ని కొంత ఆలోచించాలని పేర్కొన్నారు. వికలాంగుల సంక్షేమ అధికారి సువార్త, జెడ్పి సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డీసీహెచ్ఎస్గా డాక్టర్ బండారు
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్ఎస్)గా డాక్టర్ బండారు వెంకట రంగారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన డాక్టర్ బండారు కర్నూలు మెడికల్ కాలేజీలో 1982లో ఎంబీబీఎస్ చదివారు. 1992లో పీడాటిక్స్లో పీజీ వైద్య పూర్తి చేశారు. మెదక్ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్గా విధుల్లో చేరారు. 2009లో డెప్యూటీ సివిల్ సర్జన్గా ఉద్యోగోన్నతి పొంది ప్రకాశం జిల్లా కంభంకు బదిలీ అయ్యారు. 2019లో సివిల్ సర్జన్గా ప్రమోషన్ పొంది మాచర్లకు బదిలీ అయ్యారు. 2014లో బాపట్ల ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్గా పనిచేశారు. 2022 నుంచి పల్నాడు డీసీహెచ్ఎస్గా నరసరావుపేట ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. గుంటూరులోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రంగారావును వైద్యులు, కార్యాలయ ఉద్యోగులు అభినందించారు.బోయపాలెం డైట్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణగుంటూరు ఎడ్యుకేషన్: ప్రత్తిపాడు మండలం బోయపాలెం జిల్లా వృత్తి విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల్లో డెప్యూటేషన్పై పని చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఎంఈఓలు, హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శుక్రవారం ఓప్రకటనలో తెలిపారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిపారు. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను డిప్యూటేషన్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని తెలి పారు. ఈనెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించి, ఈనెల 16,17వ తేదీల్లో పరీక్షలు, ఈనెల 19న ఇంటర్వ్యూ నిర్వహిస్తామని పేర్కొ న్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డైట్బోయపాలెం.కామ్ సందర్శించాలని, సందేహాల నివృత్తికి 94408 46046 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆఫ్లైన్లో దరఖాస్తును ప్రతి సబ్జెక్టుకు వేర్వేరుగా చేయాలని, దరఖాస్తుల స్వీకరణకు గుంటూరు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.జీజీహెచ్లో మీకోసం మేముగుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో 7వ వారం మీకోసం మేము పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ పేషెంట్లకు హాస్పిటల్ నియమావళి గురించి సూచనలు చేశారు. ల్యాబ్ పరీక్షలు, మరేదైనా ఎవరైనా ఎటువంటి ప్రలోభాలకు మోసపోవద్దని తెలిపారు. ఎలాంటి సమస్యనైనా ఎవరికీ డబ్బు చెల్లించవద్దని, ఒకవేళ ఎవరైనా డబ్బు అడిగితే రశీదు అడగాలని, ఇవ్వని పక్షంలో సూపరింటెండెంట్, సీఎస్ఆర్ఓంకు ఫిర్యా దు చేయాలన్నారు. కార్యక్రమంలో నర్సింగ్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.ద్విచక్రవాహనం ఢీ కొని మహిళ మృతిఅద్దంకి రూరల్: గేదెలు కాసుకుని ఇంటికి వెళుతున్న మహిళను ద్విచక్రవాహనం ఢీకొట్టటంతో మహిళ మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి అద్దంకి మండలంలో చోటుచేసుకుంది. సంఘటనకు చేరుకుని సీఐ సుబ్బరాజు, ఎస్సై ఖాదర్బాషా జరిగిన తీరును పరిశీలించారు. ద్విచక్రవాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తెలిపిన వివరాలు.. మండలంలోని కొటికలపూడి గ్రామానికి చెందిన కొటికలపూడి గ్రామానికి చెందిన మూరబోయిన కోటేశ్వరమ్మ (54)గేదెలు కాసుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా వేణుగోపాలపురం రోడ్డు వద్దకు రాగానే రజానగరం గ్రామానికి చెందిన మురళీకృష్ణ ద్విచక్రవాహనంపై అద్దంకి నుంచి రజానగరం వెళుతూ కోటేశ్వరమ్మను ఢీకొట్టాడు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఇరువురిని 108లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రగాయాలైన కోటేశ్వరమ్మ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మురళీకృష్ణ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బాపట్లలో పచ్చనేతల దుశ్చర్య
బాపట్ల : రోడ్డు విస్తరణకు సహకరించాడు...నిబంధనల ప్రకారం టెండర్లలో సైకిల్ స్టాండ్ను దక్కించుకున్నాడు. ఏరియా వైద్యశాలలో ఏమాత్రం ఉపయోగంలేని స్థలానికి ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.32 వేలు అద్దె చెల్లిస్తున్నాడు..అయినా కూటమి సర్కారు అతనిపై కక్ష కట్టింది. సైకిల్ స్టాండ్ నిర్వాహకుడు వైఎస్సార్ సీపీ నాయకుడు కావడమే అందుకు కారణం. అతని సైకిల్ స్టాండ్ తొలగించాలంటూ పలు విధాలుగా కూటిమి నేతలు ప్రయత్నించారు. కోర్టులో వివాదం ఉన్నప్పటికీ ఎటువంటి ఆదేశాలు రాకముందే టీడీపీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని సూపరింటెండెంట్ను ముందుపెట్టి మరీ సైకిల్ స్టాండ్ను శుక్రవారం తొలగించారు. టీడీపీ నాయకుల హడావుడితో రైల్వేస్టేషన్ వద్ద గందరగోళం నెలకొంది. బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలోని ఏరియా వైద్యశాల ఆవరణలో శ్రీనివాస సైకిల్ స్టాండ్ను వైఎస్సార్ సీపీ నాయకుడు నర్రావుల వెంకట్రావు పదేళ్ల కిందట టెండర్లో సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి నిబంధనల ప్రకారం అద్దె చెల్లిసూ వస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఆ పార్టీ నేతల కన్ను సైకిల్ స్టాండ్పై పడింది. స్టాండ్ను తొలగించాల్సిందిగా సూపరింటెండెంట్ మౌఖిక ఆదేశాలు ఇవ్వగా వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించాడు. స్టాండ్ ఉన్నచోట అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటూ కోర్టుకు తప్పుడు పత్రాలను సమర్పించారు. ఈమేరకు కోర్టులో వివాదం కొనసాగుతుంది. అయితే సూపరింటెండెంట్ సిద్దార్థ ఎటువంటి నోటీసు ఇవ్వకుండా టీడీపీ నాయకులతోపాటు పోలీసులను, జేసీబీని తీసుకువచ్చి స్టాండ్ తొలగింపునకు పూనుకున్నారు. అక్కడ ఏమి జరుగుతుందో కొద్దిసేపటి వరకు అర్ధం కాకపోయిన వెంకట్రావు తనకు అన్యాయం చేయోద్దంటూ ప్రాథేయపడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న టీడీపీ నాయకులు, వెంకట్రావును పక్కన ఉన్న చల్లా రామయ్య అనే వ్యక్తిని లాగి పక్కనపడేశారు. టీడీపీ నాయకులు వెంకట్రావుపై దాడి చేస్తునప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. స్టాండ్ తొలగించేందుకు తనకు నోటీసు ఇవ్వాలని, అక్కడ ఉన్న వాహనాలు దెబ్బతినే ప్రమాదం ఉందని సూపరింటెండెంట్కు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తొలగింపు చర్యలు చేపట్టారు. దీంతో అక్కడ ఎవరైనా ప్రశ్నిస్తే టౌన్ సీఐ రాంబాబు వారిని వాదించి పక్కకు పంపివేశారు. తన స్టాండ్ తొలగింపును అక్రమంగా చేపట్టారంటూ సూపరింటెండెంట్ సిద్దార్థ, సీఐ రాంబాబు, టీడీపీ నాయకుడు గవిని శ్రీనివాసరావులపై డీఎస్పీ రామాంజనేయులకు బాధితుడు వెంకట్రావు ఫిర్యాదు చేశారు. కోర్టులో వివాదం ఉన్నప్పుడు నిబంధనకు విరుద్ధంగా స్టాండ్ తొలగించటం, అందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు తనకు జరిగిన అన్యాయంపై మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోతామని తెలిపారు. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వెంకట్రావు తీసుకువచ్చిన గంజాయిని పొడి చేసి పొట్లాలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. న్యూగుంటూరు రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాలనీ, మణిపురం ఓవర్బ్రిడ్జీ కింద, పాతగుంటూరు సుద్దపల్లి డొంక, నందివెలుగు రోడ్డులోని ఉన్న ఒక ఖాళీ వెంచర్, గుజ్జగుండ్ల సెంటర్ సమీపం, శారదాకాలనీ, కృష్ణబాబుకాలనీ, ఐపీడీకాలనీ, సంపత్నగర్లోని కొబ్బరితోట ప్రాంతం, కేవీపీ కాలనీలో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు అధికంగా జరుగుతున్నట్టు సమాచారం. లిక్విడ్, సిగరెట్ల రూపంలోనూ గంజాయిని విక్రయిస్తున్నారు. కోర్టు వివాదంలో ఉండగా సైకిల్ స్టాండ్ తొలగింపు సీఐతోపాటు పలువురిపై డీఎస్పీకి ఫిర్యాదు మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళతామన్న బాధితుడు -
శనివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వేటపాలెం: బాపట్ల జిల్లాలో సముద్రపు తాబేళ్ల (ఆలీవ్ రిడ్లే) సంరక్షణలో అటవీ శాఖ ముందుంది. జిల్లాలో చిన్నగంజాం మండలం ఏటిమొగ్గ నుంచి బాపట్ల మండలం సూర్యలంక వరకు 55 కిలో మీటర్లు సముద్ర తీరం వెంట సముద్ర తాబేళ్ల సంరక్షణకు అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో ఆరు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి పిల్లలుగా తయారైన తరువాత వాటిని సముద్రంలోకి విడిచి పెడుతుంటారు. వీటి సంరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో 12 మంది వలంటీర్లను అటవీ శాఖ ఏర్పాటు చేసింది. వీటిపై పర్యవేక్షణకు కోఆర్డినేటర్ను నియమించారు. తాబేళ్ల సంరక్షణ ఇలా... ఆలీవ్ రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాదీ జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు మాత్రమే ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. సముద్రం నుంచి అర్థరాత్రి వేళల్లో తాబేళ్లు ఒడ్డుకు చేరుకొని తీరానికి దగ్గరలో ఇసుకలో గుంటలు ఏర్పాటుకొని గుడ్లు పెడుతుంటాయి. ఒక్కొక్క తల్లి తాబేలు 100 నుంచి 160 గుడ్ల వరకు పెడుతుంటుంది. వేకువజామునే అటవీ శాఖ ఏర్పాటుచేసిన వలంటీర్లు తీరం వెంట వెళ్లి తల్లి తాబేళ్ల కాళ్ల అనవాళ్లను గుర్తించి అవి ఎక్కడ గుడ్లు పెట్టింది కనుగొంటారు. తల్లి తాబేళ్లు పెట్టిన గుంటను జాగ్రత్తగా తవ్వి గుడ్లను సేకరించుకొని వెళ్లి సంరక్షణ కేంద్రంలో గుంటలు ఏరా్పాటు చేసి అక్కడ పెడతారు. సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన గుంతల్లో నుంచి గుడ్లు పిల్లగా మార్పు కావడానికి 33 డిగ్రీల ఉష్ణోగ్రత మాత్రమే ఉండాలి. ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటకుండా చూసే బాధ్యత వలంటీర్లపై ఉంటుంది. ఆ గుడ్లు 48 నుంచి 55 రోజుల్లో పిల్లలుగా మార్పు చెందుతాయి. ఈ పిల్లలను తిరిగి వలంటీర్ల ద్వారా సురక్షితంగా సముద్రంలో వదిలిపెడతారు. తాబేళ్లు పిల్లలను సముద్రంలోకి వదులుతున్న అటవీ అధికారులు సంరక్షణ తల్లి పెట్టిన వదిలిన కేంద్రం తాబేళ్లు గుడ్లు పిల్లలు ఏటిమొగ్గ 36 4063 764 కుంకుడుచెట్లపాలెం16 1687 611 రామచంద్రాపురం26 2944 339 పొట్టి సుబ్బయ్యపాలెం26 2896 227 రామాపురం 17 1929 211 సూర్యలంక 24 2651 206 న్యూస్రీల్వేల సంఖ్యలో సంరక్షించాం తాబేళ్ల సంరక్షణ కేంద్రాల వద్ద తొమ్మిదేళ్లుగా వలంటీర్గా పనిచేస్తున్నాను. వేల సంఖ్యలో తాబేళ్ల పిల్లలను సంరక్షించి సముద్రంలోకి వదిలి పెట్టాం. వేకువజామునే సముద్రం ఒడ్డునే తల్లి తాబేళ్లు పెట్టిన గుడ్లు సేకరించడానికి వెళతాం. వాటి కాలి అడుగు జాడలను బట్టి అవి గుడ్లు పెట్టిన చోటును గుర్తిస్తాం. – కే అర్జునరావు, వలంటీర్ తాబేళ్ల సంరక్షణకు 12 మంది వలంటీర్లు ఈ ఏడాది ఇప్పటి వరకు 145 తల్లి తాబేళ్ల నుంచి 16,170 గుడ్లు సేకరణ సురక్షితంగా 2,358 ఆలీవ్ రిడ్లే తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి విడుదల ఇప్పటి వరకు తల్లి తాబేళ్లు పెట్టిన గుడ్లు, సముద్రంలోకి వదిలిన పిల్లలు వివరాలు... -
విద్యుత్ షాక్తో ఇద్దరు లైన్మెన్ల మృతి
కొల్లూరు: విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేస్తున్న సిబ్బందికి షాక్ కొట్టి ఇద్దరు లైన్మెన్ మృతిచెందారు. మరో నలుగురు ఉద్యోగులు గాయపడ్డారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈపూరులంక సబ్ స్టేషన్కు విద్యుత్ సరఫరా అయ్యే 32 కేవీ లైన్పై తాటిచెట్టు పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొల్లూరు విద్యుత్ శాఖ ఏఈ కె.సుధాకర్బాబు శుక్రవారం ఉదయం కరెంటు సరఫరాను నిలుపుదల చేయించి ఆరుగురు సిబ్బందితో కలిసి లైన్లకు మరమ్మతు పనులు చేపట్టారు. వారు మరమ్మతులు చేస్తుండగానే ఆకస్మికంగా ఒక లైన్కు విద్యుత్ సరఫరా కావడంతో ఆరుగురు ఉద్యోగులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దోనేపూడి గ్రామ లైన్మన్ పోతార్లంక లీలాదుర్గా శంకర్ (51), ఈపూరు సచివాలయం జూనియర్ లైన్మన్ ఆకుల మహేష్ (37) విద్యుత్ షాక్తో స్తంభం పై నుంచి కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన శంకర్ను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లే సమయానికి మృతిచెందాడు. మహేష్ను కొల్లూరు పీహెచ్సీకి తరలిస్తుండగా మరణించాడు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులు మునిపల్లి శ్రీను, రామకృష్ణ, మల్లిఖార్జున, నాగేశ్వరరావు కూడా విద్యుత్ షాక్కు గురయ్యారు. మరో నలుగురు ఉద్యోగులకు గాయాలు బాపట్ల జిల్లా ఈపూరులంకలో ఘటన -
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్
నూజెండ్ల: వ్యక్తి హత్యాయత్నానికి పథకం రచించిన సెల్ఫోను వాయిస్ రికార్డు బయటపడటంతో ఐదుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఎం.వి.కృష్ణారావు తెలిపిన వివరాల మేరకు మండలంలోని అల్లీభాయిపాలెం గ్రామానికి చెందిన కర్ణాటి వెంకటరావు అదే గ్రామానికి చెందిన మీరావలీ మధ్య నగదు లావాదేవీలు ఉన్నాయి. వెంకటరావు దగ్గర మీరావలీ అప్పుగా కొంత నగదు తీసుకున్నాడు. ఈ విషయంలో ఇరువురు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. అప్పు తీర్చకపోగా కర్ణాటి వెంకటరావును హత్య చేసేందుకు ప్రణాళిక రచన చేశాడు. ఈక్రమంలో పాటకోట లాలయ్య, గద్వాల మీరావలీ, బ్రహ్మం, దూదేకుల దస్తగిరితో కలిసి చంపాలని నిర్ణయించుకొని దానికి తగిన నగదు ఇవ్వటానికి మీరావలి ఒప్పందం చేసుకున్నాడు. ఈ పథకం విషయమై జరిగిన సంభాషణలు వారిలో ఒకరు రికార్డు చేశారు. వాయిస్ రికార్డు లీక్ అవటంతో కర్ణాటి వెంకటరావు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వాస్తవమని పోలీసులు నిర్థారణ చేసి నిందితుడు మీరావలితో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ ఎంవీ కృష్ణారావు తెలిపారు. ఇళ్ల స్థలాల పరిశీలన మంగళగిరి: నగర పరిధిలోని యర్రబాలెం డాన్బాస్కో స్కూలు వద్ద శుక్రవారం పంపిణీ చేసే ఇళ్ల స్థలాలను శుక్రవారం ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్థల పట్టాల పంపిణీని ప్రారంభించనున్న నేపధ్యంలో ఎస్పీలీ పరిశీలన జరిపారు. అధికారులకు భద్రతా సూచనలు చేశారు. ట్రాఫిక్, , వాహనాల పార్కింగ్కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ వై. శ్రీనివాసరావు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం తగదు
నాదెండ్ల: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఘనవ్యర్థాల నిర్వహణపై కార్యదర్శులు అలసత్వం వహించకుండా పనిచేయాలని, లేనిపక్షంలో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్రెడ్డి చెప్పారు. పలు గ్రామాల్లో గురువారం ఆయన పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త సేకరణ, ఘనవ్యర్థాల నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బుక్కాపురంలో రోడ్ల వెంబడి చెత్త కుప్పలు ఉండటం, పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామస్తులు పలు ఫిర్యాదులు ఆయన దృష్టికి తేవటంతో కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేశారు. ఎండుగుంపాలెం గ్రామంలో ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని సందర్శించి పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యదర్శికి మెమో జారీ చేశారు. జంగాలపల్లెలో స్వామిత్వ సర్వే చివరి దశలో ఉండటంతో కార్యదర్శికి పలు సూచనలు చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామాల కార్యదర్శులతో ఇంటి పన్ను వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. ఇకనుంచి అన్ని గ్రామాల్లో 22 అడుగుల వెడల్పుతో రోడ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ నిర్మలా లక్ష్మీకుమారి పాల్గొన్నారు. డీపీఓ విజయభాస్కర్రెడ్డి ఇద్దరు కార్యదర్శులకు మెమోలు -
అన్నదాతకు అకాల కష్టం
కారెంపూడి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కర్షకులు నానా అవస్థలు పడ్డారు. నోటి దగ్గరకొచ్చిన పంటను కాపాడుకోడానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. కారెంపూడి మండలంలో కళ్లాల్లో ఉన్న మిర్చి, ధాన్యం, కందులు తడిసి పోకుండా వాటిని కుప్పలుగా చేసి పట్టలు కప్పడంలో రైతులు తలమునకలయ్యారు. పట్టలు తీసుకుని పొలాలకు ఉరుకులు పరుగులు పెట్టి పొలాలలో కళ్లాలలో ఉన్న పంట ఉత్పత్తులు తడిసిపోకుండా పట్టలు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. మబ్బులు పట్టగానే కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని, మిర్చిని చాలా మంది వచ్చిన ధరకు తెగనమ్మేశారు. ఇప్పటికే కళ్లాల్లో ఆరిన పంటలను గోతాలకు పట్టి ఇళ్లు చేర్చుకున్నారు. కోతకు రబీ వరి.. కళ్లాల్లో మిర్చి, కంది ఉరుములు మెరుపులతో కూడిన జల్లులతో రైతుల గుండెలు దడదడలాడాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ఎక్కడ తడిసిపోతాయోనని వాటిని కాపాడుకోడానికి అష్టకష్టాలు పడ్డారు. మరో వైపు కంది కళ్లాలు జరుగుతున్నాయి. కళ్లాలను త్వరగా పూర్తి చేసేందుకు రైతు కూలీలు కష్టపడ్డారు. వర్షం రాకతో కళ్లం చేసిన గింజలతో కూడిన పొట్టును మిషన్లో పోసే అవకాశం కూడా లేకుండా పోయింది. మిరప కాయల కోతలు కూడా జరుగుతున్నాయి. దీంతో కోసిన కాయలు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో వైపు రబీ వరి చేలన్నీ కోతకు వచ్చాయి. ఈ దశలో వర్షం పడితే గింజ పాడైపోతుందని గింజలు నేలపాలు అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఎరువుల కొట్లలో బాకీలున్న చిన్న సన్నకారు రైతులు కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని జిలకర సన్నాలు 75 కిలోల బస్తా రూ.1540కే తెగనమ్మారు. కొనేనాథుడు లేడని, వర్షం వల్ల బతిమాలి పంటను అమ్మాల్సిన దుస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాచర్లలో భారీ వర్షం మాచర్ల: అత్యధిక ఎండతో ఇబ్బంది పడుతున్న మాచర్ల వాసులకు మారిన వాతావరణం కాస్తంత ఉపశమనం కలిగించింది. గురువారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మికంగా మార్పు వచ్చి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు సేద తీరారు. పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు పారింది. కోతకొచ్చిన రబీ వరి పంట కళ్లాల్లోనే మిర్చి, కంది వాటిని కాపాడుకునేందుకు రైతుల తంటాలు వర్షం దెబ్బకి వరిని నష్టానికి అమ్ముకున్న కొందరు రైతులు -
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
బాపట్ల: వేసవి కాలంలో తాగునీటి ఇబ్బంది రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండ తీవ్రత, వడగాల్పులు ఉంటాయని తెలిపారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విరామం ఇవ్వాలన్నారు. అత్యవసర పరిస్థితిలో తాగునీరు, ఓఆర్ఎస్, పండ్ల రసాలు వంటివి తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగిలితే వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఒంటరి వృద్ధ మహిళల ఆరోగ్యంపై ఆశా వర్కర్లు రోజు పర్యవేక్షించేలా చూడాలన్నారు. డయేరియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అన్ని రకాల తాగునీటి పరీక్షలు చేయడానికి సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు. ప్రతి గురువారం రాత్రి డ్రమ్ములలోని నీటిని తీసివేయాలని, శుక్రవారం ఉదయం వాటిని ఎండబెట్టి సాయంత్రం నింపుకోవాలని ప్రజలను కోరారు. కుక్కల బెడద నివారించాలని అధికారులతో పేర్కొన్నారు. 70 ఏళ్లు దాటిన వారికి ఆయుష్మాన్ భారత్ కింద కార్డు జారీ కోసం ఈకేవైసీ చేయించాలని తెలిపారు. పారిశుద్ధ్యంపై ఆరా పారిశుద్ధ్యంపై కలెక్టర్ ఆరా తీశారు. ఐవీఆర్ఎస్ ద్వారా వివరాలు సేకరించగా 42 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. రోజు సిబ్బంది ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త, ప్రమాదకర వస్తువులను వేర్వేరుగా సేకరించాలని ఆదేశించారు. వాటిని ఎస్డబ్ల్యూపీపీ ప్రదేశంలో పడేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులలోని నీటి నిల్వలపై ఆరా తీశారు. తక్కువ లోతు గల బోర్ల నీటిని వాడవద్దని ప్రజలకు సూచించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో నిర్వహించే సర్వేలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆరేళ్లలోపు పిల్లల ఆధార్ నమోదును 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. జిల్లా జేసీ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి డి.గంగాధర్ గౌడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల డీఎల్డీవో విజయలక్ష్మి, వీక్షణ సమావేశం ద్వారా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం -
ఎస్సీ కాలనీలో దాడికి యత్నం
మార్టూరు: మండలంలోని వలపర్ల ఎస్సీ కాలనీలో గురువారం సాయంత్రం జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియోలు బాధితులు జిల్లా ఎస్పీకి పంపడంతో స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలనీకి చెందిన కొన్ని కుటుంబాలు ఒంగోలు సమీపంలో పొగాకు పనుల నిమిత్తం ఇటీవల వెళ్లాయి. అక్కడ జరిగిన వివాదం నేపథ్యంలో రెండు రోజుల క్రితం వలపర్లకు తిరిగి వచ్చాయి. అనంతరం గురువారం సాయంత్రం ఘర్షణ ప్రారంభమైంది. ఓ వర్గానికి చెందిన కొందరు యువకులు కర్రలతో ఓ కుటుంబంపై దాడికి వస్తున్న దృశ్యాలను వీడియోలు తీసి జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి పంపారు. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. ఎస్పీ ఆదేశాలతో సీఐ శేషగిరిరావు సిబ్బందిని వలపర్లకు పంపించి ఇరు వర్గాలకు చెందిన కొందరిని స్టేషనుకు పిలిపించారు. -
రెడ్బుక్ రాజ్యాంగం ప్రకారమే దాడులు
వినుకొండ: దేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం మాత్రమే ఉందని, ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే అమలవుతోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో గాయపడ్డ ఆళ్ల సాంబిరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎం.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ కూటమి నేతలు నేరపూరిత, ఘర్షణ వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టే తాము రెడ్బుక్ రాజ్యాంగం అంటున్నామన్నారు. ఇటీవల బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామంలో ఆళ్ల సాంబిరెడ్డి, ఆళ్ల పాపిరెడ్డిలపై టీడీపీ నాయకులు దాడి చేసి గాయపరిచారని, వారి ఇళ్లపై కూడా దాడులకు పాల్పడ్డారన్నారు. ఈ ఘటనను స్థానిక టీడీపీ నేతలు కూడా ఖండించారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏ రాజ్యాంగంలో ఉందని, గ్రామాల్లో భావప్రకటన స్వేచ్ఛ కూడా లేకుండా మోటారు సైకిళ్లపై మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్రం కనిపిస్తే ఆ బళ్లు ధ్వంసం చేయడం, అకారణంగా దాడులు చేయడం కూటమి నేతలకు పరిపాటిగా మారిందన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులను గుర్తించి కేసులు నమోదు చేయడం, వేధించడంతో పాటు ఇరువర్గాల ఘర్షణలో కూడా ఒక వర్గం వారికి స్టేషన్ బెయిల్, మరో వర్గం వారిపై 307కేసులు నమోదు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఇది రెడ్బుక్ రాజ్యాంగం కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా రాజ్యాంగ బద్ధంగా పరిపాలన చేయాలని అన్నారు. గ్రామాల్లో కక్షలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు అమ్మిరెడ్డి అంజిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కక్షాపూరిత వాతావరణాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, చిన్నచిన్న ఘర్షణల్లో కూడా పోలీసులు తలదూర్చి కేసులు నమోదు చేయడం తాము ఎక్కడా చూడలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యలు పట్టించుకోకుండా గ్రామాల్లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బాధితుడు సాంబిరెడ్డి మాట్లాడుతూ అకారణంగా తమ కుటుంబంపై దాడి చేసి తన జేబులో సెల్ఫోన్ లాక్కొన్నారన్నారు. అదేమని ప్రశ్నించినందుకు తమ కుటుంబంపై మూకుమ్మడిగా దాడికి తన కన్నతల్లిపై కూడా దాడి చేశారన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన గెలుపు కోసం పనిచేశానని, తనపై జరిగిన దాడిని టీడీపీ నాయకులు వక్రీకరించడం బాధాకరమని అన్నారు. పార్టీ బొల్లాపల్లి మండల అధ్యక్షుడు బత్తి గురవయ్య, వినుకొండ అధ్యక్షులు దండు చెన్నయ్య, మన్నెయ్య, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోటారు సైకిళ్లపై మాజీ సీఎం జగన్ బొమ్మ పెట్టుకున్నా తట్టుకోలేక పోతున్నారు ఉద్దేశపూర్వకంగా దాడులు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్ -
భార్య, అత్తపై యువకుడి దాడి
చీరాల: భార్య, అత్తలపై ఓ యువకుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన గురువారం రాత్రి పేరాల మసీదు సెంటర్ సమీపంలో చోటు చేసుకుంది. ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.......రేపల్లె నియోజకవర్గం అడవులదీవికి చెందిన తోకల కరుణాకర్కు పేరాలకు చెందిన కట్టా సంధ్యారాణితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. మనస్పర్థలు రావడంతో కొంతకాలం నుంచి సంధ్యారాణి పేరాల మసీదు సెంటర్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుంది. కరుణాకర్ తరచుగా భార్య ఇంటికి వచ్చి గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇంట్లో ఆమె తల్లి లక్ష్మి, కుమారుడు ఉన్న సమయంలో కరుణాకర్ వచ్చి గొడవపడ్డాడు. ఇంట్లో ఉన్న కత్తితో సంధ్యారాణిని పొడిచాడు. అత్త అడ్డుకోబోగా దాడి చేసి పారిపోయాడు. ఇద్దరు కేకలు వేసుకుంటూ రక్తపు గాయాలతో బయటకు రావడంతో చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. పోలీసులు వారి నుంచి ఫిర్యాదును స్వీకరించారు. టూటౌన్ సీఐ నాగభూషణం వివరాలు సేకరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు -
కన్నకొడుకే కాలయముడు
బొల్లాపల్లి: కన్న కొడుకు చేతిలో జన్మనిచ్చిన తల్లి దారుణంగా హత్యకు గురైన సంఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో గురువారం జరిగింది. వినుకొండ రూరల్ సీఐ బి.ప్రభాకర్, బండ్లమోటు ఎస్ఐ ఎ.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... వెల్లటూరు గ్రామానికి చెందిన గజ్జ చిన్న నరసయ్య, గజ్జ సోమమ్మ (67) దంపతులకు ముగ్గురు మగ, ఇద్దరు ఆడ సంతానం. చిన్న కుమారుడు బాదరయ్య అవివాహితుడు కావడంతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మిగిలిన సంతానంలో అందరికీ వివాహాలై వేర్వేరుగా ఉంటున్నారు. మతిస్థిమితం లేని తల్లి ఎప్పుడు గొణుగుతుండడం, తనకు వివాహం కాకపోవడంపై అసంతృప్తిగా ఉన్న నిందితుడు బాదరయ్య తెల్లవారుజామున మంచం మీద పడుకుని నిద్రిస్తున్న తల్లిని రోకలిబండతో కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు గజ్జ శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అందజేశారు. -
విద్యాశాఖ వెబ్సైట్లో ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితా
అభ్యంతరాల స్వీకరణ 11 వరకు గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియార్టీ జాబితాను డీఈవోజీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓప్రకటనలో తెలిపారు. విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు అర్హత కలిగిన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు వెబ్సైట్లో ఉంచి సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈనెల 11వ తేదీలోపు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో లిఖిత పూర్వకంగా సమర్పించాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. సౌపాడులో వీధి కుక్కల దాడి ఏడుగురికి తీవ్ర గాయాలు గుంటూరు రూరల్: వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామంలో వీధిక్కులు దాడిచేసి ఏడుగురిని గురువారం తీవ్రంగా గాయపరిచాయి.తీవ్రంగా గాయపడిన వారిని 108లో గుంటూరుకు జీజీహెచ్కు తరలించారు. ఇటీవల గ్రామాల్లో శునకాల బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత శనివారం వట్టిచెరుకూరు గ్రామంలో రైతు మక్కెన సుబ్బారావుకు చెందిన బర్రెదూడపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇప్పటికీ దూడ పరిస్థితి విషమంగానే ఉంది. తాజాగా గురువారం జరిగిన దాడిలో గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికై నా అధికారులు కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య పారా వలంటీర్లు వారధులు 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ నరసరావుపేటటౌన్: న్యాయవ్యవస్థకు, ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. సత్యశ్రీ పేర్కొన్నారు. గురువారం అదనపు జిల్లా కోర్డు ప్రాంగణంలో పారా లీగల్ వలంటీర్లకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. పారా లీగల్ వలంటీర్ల విధులు, నైతికత, రాతపూర్వక నైపుణ్యం, రోజువారి జీవితంలో అవసరమయ్యే అనేక చట్టాలను, చట్టపరమైన సలహాలు ఇచ్చే విధివిధానాలను గురించి వివరించారు. న్యాయవ్యవస్థకు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించి ప్రజలకు చట్టాలపై కనీస అవగాహన కల్పించేలా కృషి చేయాలని సూచించారు. ధాన్యం సేకరణ లక్ష్యం 10వేల మెట్రిక్ టన్నులునరసరావుపేట: రబీ సీజన్లో ధాన్యం సేకరణ 10వేల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా నిర్ధేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గనోరే సూరజ్ ధనుంజయ పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం సేకరణ సమావేశం వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. రబీలో 2024–25 సంవత్సరానికి 234 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 20,561 హెక్టార్లలో వరిసాగు చేశారన్నారు. దీనిలో 1,32,773 ఎంటీల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయటం జరిగిందన్నారు. గ్రేడ్ ఏ రకం ధాన్యం క్వింటా రూ.2320లు, సాధారణ రకం క్వింటా రూ.2300లుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు కనీస మద్దతు ధర పొందాలంటే ఈ–పంట ద్వారా పంటను నమోదుచేయించి 100శాతం ఈకేవైసీ చేయించాలన్నారు. మాయిశ్చర్ మీటర్లను త్వరగా కాలిబ్రేషన్ చేయించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నారదమునిని ఆదేశించారు. తనిఖీ చేసి మిల్లు సామర్ధ్యం, ఇతర వివరాలు ఆన్లైన్ ద్వారా నమోదు చేయాలన్నారు. కనీస మద్దతు ధరకు రైతుభరోసా కేంద్రాల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశామని, కొనుగోలుకేంద్రాల ద్వారా తాము పండించిన పంటను విక్రయించాలని సూచించారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 517.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం నుంచి కుడి కాలువకు 3,031 క్యూసెక్కులు విడుదలవుతోంది. నిత్యాన్నదానానికి విరాళం మోపిదేవి: వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి నిత్యన్నదానానికి కావూరుకు చెందిన తుమ్మల సాయి రాఘవ్ రూ. లక్ష విరాళాన్ని గురువారం సమర్పించారు.కొనసాగుతున్న సదరం క్యాంప్ తెనాలిఅర్బన్: తెనాలి జిల్లా వైద్యశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదరం క్యాంప్ గురు వారం కొనసాగింది. పలు విభాగాలకు చెందిన దివ్యాంగులు పరీక్షలు చేయించుకున్నారు. 7 -
సముద్రంలోకి తాబేలు పిల్లలు విడుదల
వేటపాలెం: మండలం పరిధిలోని రామాపురం సముద్రతీరంలో అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్, ఐటీసీ బంగారు భవిష్యత్ సంయుక్త ఆధ్వర్యంలో సముద్ర తాబేళ్ల రక్షణ కేంద్రం నుంచి 404 పిల్లలను సముద్రంలోకి విడుదల చేశారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య చేతుల మీదుగా గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ రకపు తాబేళ్లను సంరక్షించడం గొప్ప విషయం అని ఆయన అన్నారు. జిల్లా అటవీ శాఖాధికారి ఎల్.భీమయ్య మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 6 సముద్ర తాబేళ్లు రక్షణ కేంద్రాలు ఉన్నాయని గుర్తుచేశారు. దాదాపు 145 తాబేళ్లు 15 వేల గుడ్లు పెట్టగా, కృత్రిమంగా పొదిగించి సముద్రంలోకి పిల్లలను వదులుతున్నట్లు చెప్పారు. చీరాల నియోజకవర్గం పరిధిలో రామచంద్రాపురం, పొట్టి సుబ్బయ్య పాలెం, రామాపురం గ్రామాలలో ఈ కేంద్రాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త శవనం చంద్రారెడ్డి, ఐటీసీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సూరజ్ ప్రదాన, మాజీ సర్పంచ్ జంగిలి రాములు, రామాపురం గ్రామస్తులు సున్నపు సుబ్బారావు, రజని పాల్గొన్నారు. -
బస్సును ఢీకొట్టిన ద్విచక్ర వాహనం
బాపట్ల టౌన్: ఆగి ఉన్న బస్సును ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన మండలంలోని అసోదివారిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. అసోదివారిపాలెం సమీపంలో హైవేపై స్కూల్ బస్సు నిలిచి ఉంది. అదే సమయంలో చీరాల నుంచి బైకుపై కర్లపాలెం వెళ్తున్న వృద్ధ దంపతులు అదుపుతప్పి బస్సును ఢీకొట్టారు. బస్సు కింది భాగంలోకి టీవీఎస్ ఎక్స్ఎల్ దూసుకెళ్లి ఇరుక్కుపోయారు. వాహనచోదకులు తక్షణమే స్పందించి వారిని బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. వారు కర్లపాలెం మండలం తిమ్మారెడ్డిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. -
సాగు వ్యర్థాల నిర్వహణపై అవగాహన
బాపట్ల: నేల సజీవంగా ఉంటేనే మొక్కలు ఫలవంతమైన ప్రయోజనాన్ని రైతులకు చేకూరుస్తాయని వ్యవసాయ కళాశాల డీన్ డాక్టరు పి.ప్రసూనరాణి పేర్కొన్నారు. దీనికి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటూ వ్యవసాయ వ్యర్థాలను పునర్వినియోగించాలని సూచించారు. వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో గురువారం ఐసీఏఆర్, ఎస్సీ సబ్ ప్లాన్లో భాగంగా వ్యవసాయ వ్యర్థాల నిర్వహణపై వ్యవసాయ కళాశాల సేద్య శాస్త్ర విభాగంలో రైతులకు అవగాహన, సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ వ్యర్థాల ద్వారా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చని చెప్పారు. సూక్ష్మ జీవులు, వానపాములను కాపాడుకోవడం ద్వారా మట్టి జీవన ప్రమాణాన్ని పెంచవచ్చన్నారు. సాగు రంగంలో విప్లవాత్మక మార్పులను చేపట్టేందుకు ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ కార్యక్రమాల్లో రైతులు పాల్గొని లబ్ధి పొందాలని కోరారు. కళాశాలలోని వర్మీకంపోస్టు, అజోల్లా, పుట్ట్టగొడుగుల పెంపకం యూనిట్లను రైతులు సందర్శించారు. సేద్య విభాగాధిపతి డా.కె.చంద్రశేఖర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొండుభొట్లవారిపాలెం గ్రామానికి చెందిన 25 మంది రైతులు, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్సీ సెల్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.సుశీల, డాక్టర్ బి.సురేష్ కుమార్, డాక్టర్ డి.వి.ఎస్.అక్షయ్, డాక్టర్ నాయుడు, డాక్టర్ బి.మౌనిక, డాక్టర్ బి.రాజ్యలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జాబ్ కార్డులను తొలగించడం అన్యాయం
అమరావతి: యాక్టివ్గా లేవనే సాకుతో జాబ్ కార్డులను తొలగించడం అన్యాయమని జాబ్ కార్డుతో సంబంధం లేకుండా అడిగిన ప్రతి ఒక్కరికీ పని చూపాలని వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి రవిబాబు అన్నారు. గురువారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల సమస్యలు తెలుసుకోవటం కోసం నిర్వహించిన ఉపాధి హామీ బైక్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. మండలంలోని పలు గ్రామాలలోఉపాధి హామీకూలీలు తమ సమస్యలను బైక్యాత్రలో వ్యవసాయ కార్మికసంఘ ప్రతినిధులకు వివరించారు. రవిబాబు మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పనులుచేసిన కూలీలు కూడా ప్రస్తుతం జాబ్ కార్డులు యాక్టివ్గా లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. జాబ్కార్డులు లేక, పనులకు వెళ్లలేక అనేకమంది కూలీలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆధార్కార్డుకు బ్యాంకు ఎకౌంటుకి ఫోన్ నెంబర్లకు లింకులు లేకపోవటం కూడా పెద్ద సమస్యగా మారిందన్నారు. నిరక్ష్యరాశ్యులైన కూలీలకు ఫోన్నంబరు లింక్చేయటంపై అవగాహన లేక చేసిన పనికి వేతనాలు అందక కూలీలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సమస్యలు పరిష్కరించి, కూలీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంఘం నాయకులు జమ్మలమూడి భగత్, ఏపూరి వెంకటేశ్వర్లు యేసయ్య తదితరులు పాల్గొన్నారు. -
మూగ వేదన
కూటమి పాలనలో పశువులకు అందని సంచార వైద్య సేవలు ● మొదటి విడత వాహనాలు నిలిపివేత ● తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పోషకులు ● వైద్యం చేయించాలంటే వ్యయప్రయాసలు వాహనాలను పునరుద్ధరించాలి గత ప్రభుత్వ హయాంలో సంచార పశు వైద్య వాహనాలు ఉండేవి. వాటి ద్వారా పశువులకు ఇంటి వద్దే వైద్యం అందేది. ప్రస్తుతం ఆ వాహనాలు నిలిచిపోవడంతో మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇటీవల అనారోగ్యంతో రెండు గొర్రెలు చనిపోయాయి. పశువులకు అనారోగ్యం వస్తే తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మూగజీవాల ఆరోగ్యం దెబ్బతింటే ప్రైవేటు వాహనాల ద్వారా సమీపంలోని పశు వైద్యశాలకు తరలించాల్సి వస్తోంది. దీంతో వ్యయప్రయాసలు తప్పడం లేదు. ప్రభుత్వం తక్షణమే సంచార పశువైద్య వాహనాలను పునరుద్ధరించాలి. – వల్లు చిన్నగంగయ్య, ముత్తాయపాలెం రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు జిల్లాలో పశుసంవర్ధక శాఖలో మొదటి విడతలో వచ్చిన ఆరు సంచార పశు వైద్య వాహనాల గడువు ముగియడంతో పక్కన పెట్టారు. ప్రస్తుతం రెండో విడతలో వచ్చిన వాహనాలతో పశు పోషకులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. మొదటి విడతలో వచ్చిన వాహనాలు మరో 15 రోజుల్లో పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాం. – డాక్టర్ వేణుగోపాల్, జిల్లా పశువైద్యాధికారి బాపట్ల టౌన్: రాష్ట్రంలో 108, 104 తరహాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు వినూత్నంగా ఆలోచించి గ్రామీణ ప్రాంతాల్లోని పశువులకు వైద్యసేవలు అందేలా ప్రణాళిక అమలు చేసింది. 2022 మే 18వ తేదీన సంచార పశు వైద్య వాహనాలకు శ్రీకారం చుట్టింది. ఉన్నత లక్ష్యంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ చర్యలు చేపట్టారు. నియోజకవర్గానికి ఒక వాహనాన్ని కేటాయించారు. నిరంతరాయంగా పశువులకు సేవలు అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక వీటికి గ్రహణం పట్టింది. నెల రోజులుగా వాహనాలు మూలకు చేరాయి. కాంట్రాక్టు గడువు ముగియడంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు వాటిని నిలిపివేశారు. ఆందోళనలో పశుపోషకులు జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు, ఇతర పెంపుడు జంతువులు ఉన్నాయి. సమస్య వస్తే జంతువును వాహనంలోకి హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా ఎక్కించి అక్కడే అన్ని పరీక్షలు చేసేవారు. 20 రకాల మల సంబంధిత, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్తోపాటు ఆటోగ్లేవ్ ప్రయోగశాలను కూడా వాహనంలో ఉంచారు. అత్యున్నత టెక్నాలజీతో వాహనాన్ని తీర్చిదిద్దారు. దీనికి 108, 104 తరహాలోనే 1962 నంబరును కేటాయించారు. జిల్లాలో రెండు విడతలలో 6 చొప్పున వాహనాలు మంజూరు చేశారు. ప్రస్తుతం నెల రోజులుగా 6 వాహనాలతోనే వైద్యం అందిస్తున్నారు. పశువులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. నియోజకవర్గం ఆవులు గేదెలు గొర్రెలు మేకలు పందులు కోళ్లు అద్దంకి 3,658 87,341 1,78,129 19,299 1,251 63,666 బాపట్ల 4,195 68,554 50,931 10,952 126 1,54,663 చీరాల 1,640 26,844 33,467 2,723 151 44,125 పర్చూరు 3,676 50,287 1,05,939 8,557 528 64,226 రేపల్లె 6,226 90,187 44,175 3,997 468 2,69,760 వేమూరు 2,535 58,551 14,882 4,462 695 1,79,582 మొత్తం 21,930 3,81,764 4,27,523 49,990 3,219 7,76,022 జిల్లాలోని పశువుల సమాచారం -
హత్యాయత్నం కేసులో ఐదుగురు అరెస్ట్
పరారీలో మరో నిందితుడుచీరాల: స్థలం విషయంలో తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారి తీసింది. ఈ సంఘటన చీరాల రూరల్ మండలం గవినివారిపాలెంలో గత నెల 28న జరిగింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను ఈపూరుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం పోలీస్స్టేషన్లో విలేకరులకు డీఎస్పీ ఎండీ మోయిన్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. చీరాల మండలం గవినివారిపాలెంలో చీదరబోయిన లక్ష్మీనారాయణ ఇంటి ముందు స్థలంలో రాములమ్మ భూమి ఉంది. అక్కడ పాత ఇల్లు కూల్చి కొత్తగా నిర్మిస్తున్నారు. స్థలం హద్దుల విషయంలో గొడవలు జరిగాయి. చీదరబోయిన లక్ష్మీనారాయణ మేనల్లుడు అయిన రైల్వే పోలీస్ కానిస్టేబుల్ పిన్నిబోయిన లక్ష్మీనారాయణ ఈ గొడవలలో జోక్యం చేసుకున్నాడు. గత నెల 28న రాములమ్మతో చీదరబోయిన లక్ష్మీనారాయణ కుమారుడు భరత్కుమార్ గొడవ పెట్టుకున్నాడు. రాములమ్మకు ఆమె మనుమడు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చీదరబోయిన నాగేశ్వరరావు మద్దతుగా వచ్చాడు. నాగేశ్వరరావును హత్య చేస్తే తమకు అడ్డు ఉండదని ప్రత్యర్థులు నిర్ణయించుకుని ఇంటి ముందు కూర్చొని ఉన్న అతడిపై కత్తితో దాడి చేశారు. స్థానికులు రావడంతో నిందితులు పరారయ్యారు. నిందితులను కావూరివారిపాలెం జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. చీదరబోయిన లక్ష్మీనారాయణ, చీదరబోయిన వీరయ్య, చీదరబోయిన భరత్కుమార్, గొర్ల వేణు, వెంపరాల కుమారస్వామిలు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. పిన్నిబోయిన లక్ష్మీనారాయణ పరారీలో ఉన్నాడు. డీఎస్పీతోపాటు రూరల్ సీఐ శేషగిరిరావు, రూరల్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బందిని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు. -
ఎన్సీడీ సర్వే వేగవంతం చేయండి
బాపట్ల: ఎన్సీడీ సర్వేను వేగవంతం చేయాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టరు ఎస్.విజయమ్మ వైద్యులకు సూచించారు. గురువారం స్థానిక కార్యాలయంలో వైద్యాధికారులతో ఈ సర్వేపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో వివరాలు పొందుపరచాలని సూచించారు. ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య విషయాలపై ఆరా తీసి వివరాలు నమోదు చేయాలన్నారు. వైద్యం కోసం రూ.లక్ష ఆర్థిక సాయం బాపట్ల: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కోమట్ల ధనలక్ష్మి కుటుంబానికి కుమ్మరి కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్టు రూ.లక్ష సాయం అందించింది. గురువారం స్థానిక మర్రిపూడిలో ధనలక్ష్మి కుటుంబ సభ్యులకు ఈ మొత్తం అందించారు. ట్రస్టు అధ్యక్షులు ఓటికుండల విజయభాస్కర్రెడ్డి , ఓటికుండల శ్రీనివాసరెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి ఓటికుండల లక్ష్మణరావు, కోశాధికారి కుమ్మరి అంజిరెడ్డి, సభ్యులు వేజండ్ల శ్రీనివాసరావు, రామయ్య, తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు రాతమశెట్టి సత్యనారాయణ రూ.5వేలు అందజేశారు. ఇసుక ట్రాక్టర్ను ఢీకొన్న లారీ వేమూరు: మండలంలోని చంపాడు ఇరిగేషన్ కాలువ వంతెన వద్ద ఇసుక ట్రాక్టర్ను లారీ ఢీకొంది. వివరాలు మేరకు... కొల్లూరు మండలంలోని గాజులంక నుంచి తెనాలికి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పోలీసు స్టేషన్లో ముడుపులు చెల్లించడంతో రాత్రి వేళ తిరిగే లారీలు, ట్రాక్టర్ల యజమానులపై పోలీసులు కేసు నమోదు లేదు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గాజులంక గ్రామం నుంచి ఇసుక లోడుతో ట్రాక్టర్, లారీ బయలుదేరాయి. చుంపాడు ఇరిగేషన్ కాలువ వంతెన వద్ద ట్రాక్టర్ను లారీ ఢీకొని పడిపోయింది. వంతెన వద్ద ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అక్రమ ఇసుక విషయం తెలుసుకున్న తెలుగు దేశం పార్టీ నాయకులు ఘటనాస్థలం వద్దకు చేరుకున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు వచ్చి మిషన్లు ద్వారా ఇసుక లారీని తొలగించారు. సీఐ మాట్లాడుతూ స్టేషన్లో ఫిర్యాదు అందలేదన్నారు. కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. -
మొరాయిస్తున్న సాగర్ కుడికాలువ గేట్లు
విజయపురిసౌత్: సుమారుగా 10.50లక్షల ఎకరాలకు సాగునీరందించే కుడి కాలువ గేట్లు మూడేళ్లకే మరమ్మతులకు లోనయ్యాయి. 8వ గేటు కిందికి దిగకపోవడంతో గురువారం ఎమర్జెన్సీ గేటు ద్వారా దానిని మూసివేసి 2వ గేటు ద్వారా కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్కు మూడు గేట్లు ఉండగా, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్కు 9 గేట్లు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కుడి కాల్వ 9వ గేటు కిందికి, పైకి జరుగకపోవడంతో బలవంతగా కిందికి దింపేందుకు ప్రయత్నం చేయగా ఊడిపోయి కాలువలోకి కొట్టుకు పోయింది. ఆ గేటును అమర్చకపోవటంతో చాలా రోజులు వరకు నీటి విడుదల కొనసాగింది. ఆ సమయంలోనే కుడి, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్దగల తూములకు కొత్తగేట్లకు టెండర్లు పిలిచారు. 9వ గేటు మరమ్మతులు చేశాక అదే కంపెనీకి పనులు అప్పగించారు. కుడి హెడ్ రెగ్యులేటర్ గేట్లకు తొమ్మిదింటికిగాను రూ.3.30కోట్లు, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ మూడు గేట్లకు రూ.2.50కోట్లు, సూట్ గేటుకు రూ.1.50కోట్లకు 2022లో టెండర్లు పిలిచి పనులు చేయించారు. అవికాస్త అప్పుడే మరమ్మతులకు గురైనట్లు సమాచారం. విద్యుదుత్పాదన కేంఽద్రం ద్వారా కుడి కాలువకు నీటిని విడుదల చేయడంతో హెడ్రెగ్యులేటర్ గేట్లు అంతగా వినియోగించ లేదు. నీటి అవసరాల మేరకు ఎక్కువగా 2,9వ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. ఇటీవలే ఈ రెండు గేట్లు మూసివేసి 8వగేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం దానిని మూసేందుకు ప్రయత్నించగా కిందికి దిగలేదు. దీంతో ఇంజినీర్లంత శ్రమించి ఎట్టకేలకు మూసివేశారు. ప్రస్తుతం 2వ గేటు ద్వారా 3,031 క్యూసెక్కులు కుడి కాలువకు విడుదల చేస్తున్నారు. బుధవారం వరకు 4050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
పిడుగురాళ్ల: వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ను అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్కుమార్ సూచించారు. పిడుగురాళ్ల పట్టణ, గ్రామీణ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులతో రూరల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో గురవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్ఈ మాట్లాడుతూ... విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని, పెండింగ్ పనులను పూర్తి చేయాలని సూచించారు. కరెంట్ బిల్లుల వసూళ్లలో అలసత్వం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ పరిధిలోని జానపాడు, రూరల్ పరిధిలోని జూలకల్లు సబ్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. వేసవిలో లోడ్ పెరుగుతున్న కారణంగా దానికి అనుగుణంగా విద్యుత్ శాఖ సిబ్బంది సిద్ధంగా ఉండి అంతరాయాలు లేకుండా విద్యుత్ను అందించాలని ఆదేశించారు. 50 శాతం అదనపు లోడ్ సబ్సిడీ స్కిమ్ను గృహ వినియోగదారులందరు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.నాగసురేష్బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎన్.సింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్కుమార్