breaking news
Bapatla
-
బాపట్లలో టీడీపీ కార్యాలయానికి రెండెకరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూములను తమ పార్టీ కార్యాలయాల కోసం ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటున్న సీఎం చంద్రబాబు.. తాజాగా బాపట్లలో రెండెకరాల భూమిని కేటాయించుకున్నారు. పశ్చిమ బాపట్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1341–ఎ లోని రెండెకరాలను 33 ఏళ్ల పాటు లీజుకు టీడీపీ ఆఫీసుకు కేటాయిస్తూ బుధవారం ప్రభుత్వం జీఓ జారీచేసింది. బాపట్ల జిల్లా టీడీపీ అధ్యక్షుడి పేరుతో ఆ భూమిని కేటాయించి ఏడాదికి వెయ్యి రూపాయలు లీజు ధరగా నిర్ణయించారు. రెండు నెలల క్రితం తిరుపతి, మచిలీపట్నం నగరాల్లో కూడా అత్యంత విలువైన స్థలాలను ఆ పార్టీ కార్యాలయాల కోసం కేటాయించుకున్నారు. ⇒ కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో రూ.50 కోట్లకు పైగా విలువైన 1.60 ఎకరాలను సంవత్సరానికి రూ.1,000 చొప్పున 33 ఏళ్లకు లీజుకిచ్చారు. ఆ భూమిని గతంలో రవాణా శాఖకు ఇచ్చినా ఆ కేటాయింపును రద్దుచేసి మరీ టీడీపీ జిల్లా కార్యాలయానికి అప్పగించారు. ⇒ తిరుపతి రూరల్ మండలం అవిలాల గ్రామంలో రూ.100 కోట్ల విలువైన రెండెకరాల ప్రభుత్వ భూమిని కూడా రూ.వెయ్యికి 33 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేశారు. ⇒ అలాగే, కడప నగరంలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించుకున్నారు. ఈ భూమికి సంబంధించి వివాదం కొనసాగుతున్నా, కోర్టు పరిధిలో ఉన్నా లెక్కచేయకుండా దాన్ని తన పార్టీ జిల్లా అధ్యక్షుడి పేరు మీద ఇచ్చేశారు. విశాఖలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాలు ఇదిలా ఉంటే.. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గుడిలోవ గ్రామంలో రాష్ట్ర సేవా సమితికి 18.57 ఎకరాల భూమిని కేటాయిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈ భూమిని ఎకరాకు రూ.80 లక్షల చొప్పున మొత్తం రూ.14.85 కోట్లు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత లిమిటెడ్ కంపెనీ ఆన్షోర్ డ్రిల్లింగ్ పనుల కోసం గతంలో ఇచ్చిన 9.88 ఎకరాల భూమి లీజును మరో మూడేళ్లు పొడిగిస్తూ ఇంకో ఉత్తర్వు ఇచ్చారు. ఇక నూజివీడులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ ఏర్పాటుకు 9.96 ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు ఉచితంగా కేటాయించారు. ఆ భూమిని హార్టీకల్చర్, సెరికల్చర్ విభాగానికి బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చారు. పేదలకు ఇవ్వకుండా పార్టీకి కేటాయింపులు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు, గ్రామాల్లో మూడుసెంట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకూ ఆ హామీ గురించి పట్టించుకోలేదు. పైగా పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వకుండా తన పార్టీ ఆఫీసులకు మాత్రం వందల కోట్ల విలువైన స్థలాలను కేటాయించుకుంటున్నారు. అంతేకాక.. గతంలో లీజుకు తీసుకున్న భూములపై ఇంకా అధికారాలు పెంచుకునేలా పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూముల కేటాయింపు లీజు కాలాన్ని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పొడిగించారు. -
సారస్ మస్కట్గా గుంటూరు మిర్చి
గుంటూరువెస్ట్: సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) మస్కట్ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మంగళవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. సారస్ను రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సౌజన్యంతో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ నిర్వహిస్తోంది. గుంటూరు మిరపకు ప్రసిద్ధి కావడంతో ‘మిరప కాయ’నే ఎంపిక చేసి మస్కట్ను రూపొందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక రెడ్డి కళాశాల ఎదుట ఉన్న స్థలంలో జనవరి 6 నుంచి 18 వరకు ప్రదర్శనశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి సారస్ కార్యక్రమం జరుగుతుండడం విశేషమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రూ.8.20 కోట్ల విలువైన మద్యం కొనుగోలు నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : కొత్త ఏడాది వేడుకల సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలు జరిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో మందుబాబులు ఖుషీ ఖుషీ అవుతున్నారు. జిల్లాలో మంగళవారం రాత్రి మద్యం డిపోల నుంచి రూ.8.20 కోట్ల విలువైన మద్యం కేసులను వైన్ షాపు, బార్,రెస్టారెంట్ నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఈ మొత్తం 31వ తేదీ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. మరో పక్క ఎకై ్సజ్ అధికారులు ప్రత్యేకంగా టార్గెట్లు ఇచ్చి మద్యం అమ్మకాలు జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రైవేట్ వేడుకల నిర్వహణకు అనుమతులు కోరుతూ మంగళవారం రాత్రి వరకు గుంటూరు నగర పరిధిలో రెండు, మంగళగిరి పరిధిలో ఐదు దరఖాస్తులు వచ్చాయని ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. ఎరువుల దుకాణంలో ఆకస్మిక తనిఖీలు 6ఏ కేసు నమోదు..అమ్మకాలు నిలుపుదల నకరికల్లు: ఎరువుల దుకాణాల్లో అమ్మకాలకు సంబంధించిన పత్రాలు లేకుంటే కేసులు నమోదు చేస్తామని ఏడీఏ పి.మురళీకృష్ణ హెచ్చరించారు. పల్నాడు జిల్లా నకరికల్లులోని మహిత ట్రేడర్స్లో మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులు తనిఖీ చేసి ఎరువుల నిల్వలు పరిశీలించారు. పూర్తిస్థాయిలో తనిఖీల అనంతరం ఆయన మాట్లాడుతూ లైసెన్స్కు ఫాం–ఓ జత చేయని కారణంగా రూ.14.09 లక్షల విలువ గల 54.8 మెట్రిక్ టన్నుల యూరియా, డీఏపీ, 15–15–15 ఎరువుల అమ్మకాలు నిలుపుదల చేశామన్నారు. అలాగే రూ.78,500 విలువ గల 7.85 మెట్రిక్ టన్నుల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ఎరువులను సీజ్ చేసి 6–ఏ కేసు నమోదు చేశామన్నారు. అనంతరం చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆయన వెంట కమిషనరేట్ ఏఓ కె.వెంకటరావు, స్థానిక ఏఓ కె.దేవదాసు, సిబ్బంది ఉన్నారు. నేడు రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం అద్దంకి రూరల్: అద్దంకి డివిజన్ ఏర్పాటులో భాగంగా నూతన డివిజన్ కార్యాలయం బుధవారం ఉదయం స్థానిక ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ప్రారంభించనున్నట్లు రెవెన్యూ అధికారులు మంగళవారం తెలిపారు. ప్రస్తుత ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, అద్దంకికి ఇన్చార్జిగా వ్యవహరించనున్నారు. జాతీయ షూటింగ్లో ముఖేష్కు మరో రజతం గుంటూరు వెస్ట్(క్రీడలు): ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీ ల్లో గుంటూరుకు చెందిన నేలవల్లి ముఖేష్ మరో రజత పతకం సాధించాడని నేలవల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ జూని యర్ విభాగంలో ముఖేష్ 569/600 పాయింట్లతో మంగళవారం మరో రజత పతకం సాధించినట్లు తెలిపారు. ఒక్క పాయింట్ తేడా తో బంగారు పతకం చేజారిపోయిందన్నారు. ముఖేష్ను పలువురు అభినందించారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలమేరకు మంగళవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమన్వయంతో పాన్ ఇండియా పర్యావరణ చట్టపరమైన అక్షరాస్యత, సమాజ రక్షణ కొరకు చొరవపై మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని భద్రంగా ఉంచుదాం – రేపటిని రక్షిద్దాం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. పర్యావరణ క్షీణత, గాలి, నీటి కాలుష్యంపై మరింత అవగాహన కలిగి ఉండాలన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ –21 ప్రకారం ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన హక్కు కల్పించిందన్నారు. నీటి ప్రాముఖ్యత మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమన్నారు. పట్టణాల్లో గాలి, నీటి కాలుష్యం ఎక్కువగా ఉందన్నారు. కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. నీటి వినియోగం, కాలుష్య నివారణకు చేయవలసిన సలహాలు, సూచనలను చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, నీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రతిభ చూపిన ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు న్యాయమూర్తి సయ్యద్ జియాఉద్దీన్ బహుమతులు అందజేశారు. ఏపీ పొల్యూషన్ బోర్డు నుంచి నజీనా బేగం, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ అనిల్, ప్యానెల్ అడ్వకేట్, మీడియేషన్ అడ్వకేట్ వసుమతి పూర్ణిమ, భారతి సోప్స్ (త్రిపుల్ఎక్స్) వర్కర్స్, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్స్, విద్యార్థులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం స్టాఫ్, డీఎల్ఎస్ఏ సిబ్బంది పాల్గొన్నారు. -
మేదరమెట్ల విద్యార్థుల ప్రాజెక్టుకు స్టేట్ ఫస్ట్
మేదరమెట్ల: విజయవాడలో నిర్వహించిన స్టేట్లెవెల్ స్కిల్ కాంపిటిషన్లో మేదరమెట్ల జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం గెలుచుకుంది. ఈ ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులు షేక్ మెహసీనా కౌసర్, జి.హర్షిణి, జి.కీర్తన, సీహెచ్ దివ్య.. గైడ్చేసిన టీచర్ కె.రమ్యలతలను ప్రధానోపాధ్యాయులు అంజనీదేవి.. ఉపాధ్యాయులు మంగళవారం అభినందించారు. ప్రథమ స్థానం గెలుచుకున్న విద్యార్థులు రూ.25వేల నగదు బహుమతి కూడా విజయవాడలో అందుకున్నట్లు హెచ్ఎం తెలిపారు. -
కంటి తుడుపు కొనుగోళ్లు
పర్చూరు(చినగంజాం): పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మినహా రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 18 నెలలు దాటిన తరువాత కూడా పొగాకు రైతుల సమస్యకు పూర్తి పరిష్కారం చూపలేకపోయింది. గడచిన ఏడాది కాలంగా పొగాకు కొనుగోలు విషయాన్ని నాన్చుతూనే ఉంది. చివరి ఆకు వరకు కొనుగోలు చేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం హామీ నెరవేర్చలేకపోయింది. నల్ల బర్లీ పొగాకును ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేపడతామన్న హామీ ఇవ్వడంతో రైతులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. మార్క్ఫెడ్ తీరా కొనుగోలు సమయానికి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో కొనుగోలు చేపట్టకపోవడం, తీవ్రమైన ఆంక్షల మధ్య కొనుగోలు చేపట్టడంతో పొగాకు బేళ్లు రైతుల ఇళ్లలోనే మిగిలిపోయాయి. గ్రామాల్లో రైతుల వద్ద భారీగా నిల్వఉన్న పొగాకు బేళ్లు: ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా చేపట్టిన పొగాకు కొనుగోలు విషయంలో తీవ్రమైన ఆంక్షలు విధించడం, నాణ్యత లేదంటూ తిప్పి పంపడం, అధికార పార్టీ నాయకులు సిఫారసు చేసిన రైతుల నుంచే పొగాకు కొనుగోలు చేయడం వంటి చర్యలతో పర్చూరు నియోజకవర్గ పరిధిలో 30 నుంచి 40 శాతం మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారు. మిగిలిన 60 శాతం గ్రామాల్లో రైతులు తమ ఇళ్లలో నిల్వచేసుకున్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన 40 శాతం పొగాకు కూడా కొనుగోలు చేసిన ఐదు నెలల వరకు డబ్బులు జమ కాలేదు. మిగిలిన 60 శాతం పొగాకు రైతుల వద్దే మూలుగుతోంది. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం .... మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేపట్టిన ప్రభుత్వం చివరి ఆకు వరకు కొనుగోలు చేపడతానని హామీ ఇచ్చింది. మార్క్ఫెడ్ ద్వారా పొగాకు నాణ్యతను బట్టి రూ.12 వేలు, రూ.9 వేలు, రూ.6 వేలు అంటూ మూడు రకాల రేట్లను నిర్ణయించింది. అయితే ఎక్కువ శాతం తక్కువ రేట్లకే రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారు అనుయాయులకు టాప్ రేట్కు కొనుగోలు చేయడం, రైతుభరోసా కేంద్రంలో సాగు దిగుబడి వివరాలు నమోదు చేసుకున్నా అధికార పార్టీ వారికే మెసేజ్లు పంపి వారి నుంచి కొనుగోలు చేయడం వంటి చర్యలతో పాటు ఒక్కొక్క రైతు నుంచి పండించిన పంటలో కేవలం 20 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. -
‘ఘన’ంగా వ్యర్థాల నిర్వహణ
సబ్ కలెక్టర్ సంజనా సింహ అభినందన తెనాలి: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో తెనాలి మున్సిపాలిటీ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సబ్కలెక్టర్ వి.సంజనా సింహ అన్నారు. మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడుతో కలిసి సబ్కలెక్టర్ మంగళవారం పూలే కాలనీలోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని, బుర్రిపాలెంరోడ్డులోని మున్సిపల్ డంపింగ్ యార్డును సందర్శించారు. ఆయాచోట్ల జరుగుతున్న ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను స్వయంగా పరిశీలించారు. వివరాలను తెలుసుకున్నారు. పట్టణ అవసరాల ప్రకారం 20 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి కేంద్రం ఆవశ్యకత ఉన్నప్పటికీ, పూలే కాలనీలో 10 ఎంఎల్డీ మురుగునీటి శుద్ధి కేంద్రం నడుస్తుండటం మంచి విషయమన్నారు. మురుగునీటిని శుద్ధి చేయటం, శుద్ధి చేసిన నీటిని పొలాలకు తరలించటం వల్ల నాణ్యమైన పంటను తీసుకోవచ్చని తెలిపారు. అలాగే మున్సిపల్ డంపింగ్ యార్డులో చెత్తను 60 శాతం తొలగించారని తెలిపారు. చెత్తను మట్టిగా మార్చి పల్లపు ప్రదేశాల్లో మెరకకు ఉపయోగిస్తున్నారని, కొంత చెత్తను జిందాల్కు తరలిస్తున్నట్టు చెప్పారు. కొబ్బరిబోండాలను రోడ్డు పక్కన పడేయకుండా పీచు తీసే యూనిట్కు తరలించాలని ఆమె సూచించారు. మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు మాట్లాడుతూ ఇంట్లో వచ్చే చెత్తను అక్కడే విభజించుకుని తడిచెత్తను ఇంట్లో లేదా టెర్రస్లో మొక్కలకు వాడుకుంటూ పొడిచెత్తను మాత్రమే మున్సిపాలిటీకి ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. -
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
బాపట్ల: ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీర పాండియన్ తెలిపారు. బాపట్ల మండలం వెదుళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్తో కలసి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దాదాపు రెండు గంటలకుపైగానే తనిఖీలు కొనసాగించారు. ఓపీ, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గురించి అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్లో రక్త పరీక్షల నిర్వహణను పరిశీలించారు. డి చంద్రమోహన్ అనే వ్యక్తి వైద్య పరీక్షలకు రాగా అతని పేరు రిజిస్ట్రేషన్ ప్రారంభం నుంచి వైద్యం ముగిసే వరకు ఆయన పక్కనే ఉండి వైద్యం ఎలా అందుతుందని పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖలో అమలయ్యే వివిధ యాప్ల పనితీరుపై ఆరా తీశారు. రోగులకు అవసరమైన ఔషధాలను వైద్య అధికారులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఔషధాల పంపిణీ, నిల్వలను పరిశీలించారు. వైద్య సిబ్బంది ఆన్లైన్లో వేస్తున్న ఎఫ్ఆర్ఎస్ హాజరును పరిశీలించారు. ఒక్కొక్కరిని పిలిచి పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎం.ఏడుకొండలురెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, కె.ఏడుకొండలరెడ్డిలతో మా ట్లాడారు. వారిని పలు ప్రశ్నలు వేసి అభిప్రాయా లు సేకరించారు. వారి వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, వైద్య అధికారులు ఉన్నారు. -
సమ సమాజ నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ కీలకపాత్ర
ఏఎన్యూలో ఉత్తమ పురస్కారాలు ప్రదానంఏఎన్యూ(పెదకాకాని): సమ సమాజ నిర్మాణంలో ఎన్ఎస్ఎస్ కీలకపాత్ర వహిస్తుందని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ వలెంటీర్ల పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వర్సిటీ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ వి.దివ్యతేజోమూర్తి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీసీ ఆచార్య కె.గంగాధరరావు మట్లాడుతూ జాతీయ సేవా పథకం సేవల ప్రాధాన్యతను, విలువల గురించి, సామాజిక బాధ్యతల గురించి తెలియజేశారు. భావి తరాలకు విలువలు, ఉన్నతమైన మార్గం నిర్దేశాలు అందించడంలో జాతీయ సేవా పథకం ముందుంటుందన్నారు. ప్రత్యేక అతిథిగా రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారి ప్రొఫెసర్ మద్దినేని సుధాకర్ పాల్గొని యువత సేవాభావంతో, క్రమశిక్షణతో సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, ప్రత్యేక శిబిరాల ద్వారా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ స్థాయి జాతీయ సేవా పథకం ఉత్తమ కార్యక్రమ నిర్వహణ అధికారులుగా డాక్టర్ డి.ధాత్రికుమారి (ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు), డాక్టర్ జె.సుబ్బారావు (చేబ్రోలు హనుమయ్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాటికల్ సైన్స్), డాక్టర్ ఎం.దాసు (శ్రీ ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రేపల్లె), సీహెచ్ అంకమ్మనాయుడు ( విజ్ఞాన్ డిగ్రీ కళాశాల), ఎస్.శంకరయ్య (విజె డిగ్రీ కళాశాల, మంగళగిరి), డాక్టర్ పి.శ్రీనివాసులు (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చేబ్రోలు) ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ ఎన్ఎస్ఎస్ వలెంటీర్లుగా సీహెచ్ ఐశ్వర్య, బి.సంజన, సీహెచ్ కార్తికేయ శ్రీరామ్, జి.తిరుపతి కళ్యాణ్, ఎస్కె షరీన్, ఎస్కె మస్తాన్ వలిలకు వారి సేవలను అభినందిస్తూ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. వర్సిటీ రెక్టార్ ఆర్.శివరామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హత్యకేసులో ఆరుగురు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన పొన్నూరు రూరల్ సీఐ చేబ్రోలు: చేబ్రోలు మండలం నారాకోడూరులో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్య కేసులోని నిందితులను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 27వ తేదీన నారాకోడూరు గ్రామ శివారులో నత్తల మృత్యంజయరావును అదే ప్రాంతానికి చెందిన ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్య చేశారు. సంచలనం కలిగించిన ఈకేసును జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఛేదించి, నిందితులను అరెస్ట్ చేశారు. ఈమేరకు పొన్నూరు రూరల్ సీఐ పి.కృష్ణయ్య వివరాలను వెల్లడించారు. నారాకోడూరు గ్రామానికి చెందిన పెరికల శ్రీకర్ ఆధిపత్య విభేదాల కారణంగా ఎంపీటీసీ నత్తల రమేష్కు తమ్ముడైన మృతుడు నత్తల మృత్యంజయరావును హత్య చేయటానికి కుట్ర పన్నినట్లు తెలిపారు. గ్రామస్థాయి రాజకీయ ఆధిపత్య పోటీ, ఫ్లెక్సీల ఏర్పాటు, గత ఘర్షణలు, అవమానాల కారణంగా ప్రతీకార భావనతో పెరికల శ్రీకర్, పెరికల రమణయ్య, పెరికల వరుణ్, తూమాటి సుమన్, మేడికొండ వెంకటేష్లతో కలిసి కుట్రపన్ని, డబ్బు ప్రలోభాలతో బండ్లమూడి రాజు, ఇంటూరి అభినాష్లను లోబర్చుకుని ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. 27వ తేదీన గజవెల్లి స్పిన్నింగ్ మిల్లులో విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న మృత్యంజయరావును నారాకోడూరులోని కామధేను దానా గోడౌన్ సమీపంలో కారుతో ఢీ కొట్టి అనంతరం కత్తులతో దాడిచేసి హత్య చేసినట్లు నిందితులు ఒప్పున్నట్లు వివరించారు. మంగళవారం చేబ్రోలు సినిమాహాలు సమీపంలో పెరికల శ్రీకర్, బండ్లమూడి రాజు, ఇంటూరి అభినాష్, పెరికల రమణయ్య, పెరికల వరుణ్, ఒక మైనర్ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. నిందితుల్లో కొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. చేబ్రోలు, పొన్నూరు ఎస్ఐలు పి.వీరనారాయణ, వి.ఈశ్వర్, శ్రీహరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
గృహ లక్ష్యాలు పూర్తిచేయాల్సిందే!
గుంటూరు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: గృహ నిర్మాణ లక్ష్యాలను మార్చి నాటికి పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గృహ నిర్మాణాలపై సంబంధిత అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆప్షన్–3 గృహాల్లో స్టేజ్ డివియేషన్ ఉన్నవాటిని గుర్తించి వాటిని సరిచేసి పనులు వేగవంతం చేయాలన్నారు. కాంట్రాక్టర్లు ఒప్పందం మేరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పునాదులు నింపేందుకు జిందాల్ సంస్థ యాష్ ఉపయోగించుకోవాలన్నారు. లే అవుట్లలో మౌలిక వసతుల కల్పనకు అవసరాలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఇసుకకు ఎటువంటి ఇబ్బందులు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. ‘ఉల్లాస్ అక్షర ఆంధ్ర’ సక్రమంగా నిర్వహించాలి.. జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాల మేరకు సక్రమంగా నిర్వహించాని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. మంగవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఉల్లాస్ అక్షర ఆంధ్ర పై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సీఎంఎంలు, ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓస్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన నిరక్షరాస్యులకు ఉల్లాస్ అక్షర ఆంధ్ర ద్వారా అక్టోబరు నుంచి శిక్షణ కార్యక్రమం ప్రారంభించారన్నారు. వంద గంటలు జరిగే ఈ శిక్షణ కార్యక్రమం మార్చి వరకు కొనసాగుతుందన్నారు. -
మహిళ మెడలో ఆభరణాల చోరీ
అద్దంకి: వైకుంఠ ఏకాదశికి పట్టణంలోని మాధవ స్వామి దేవస్థానంలో దైవ దర్శనం చేసుకుని వెళ్తున్న ఓ మహిళ మెడలో బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అపహరించారు. పట్టణానికి చెందిన అమరా సుశీల తన భర్త శ్రీరాములుతో కలిసి దేవస్థానికి వెళ్లి దైవ దర్శనం తరువాత ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ఆమె మెడలోని బంగారు నానుతాడు, నల్లపూసల గొలుసు, ముత్యాల దండ గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లినట్లు బాధిత మహిళ పోలీసులకు తెలిపింది. అయితే ముత్యాల గొలుసు మాత్రం అక్కడే పడినట్లు గుర్తించినట్లు సీఐ తెలిపారు. -
మునగ పంట ద్వారా వ్యాపార అవకాశాలు
బాపట్ల: ఆధునిక రైతాంగం వ్యవసాయంతో పాటు వ్యాపార రంగంలో కూడా ఎదగాలని, ఆరుగాలం కష్టించి పనిచేసే రైతు ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే వ్యాపారవేత్తగా రాణించడానికి ప్రస్తుతం అనేక అవకాశాలున్నాయని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలలో మునగ పంట ద్వారా వ్యాపార అవకాశాలు అనే ప్రాజెక్టులో భాగంగా ఉద్యాన విభాగం ఆధ్వర్యంలో ఉచిత రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మునగ పంటను కుటీర పరిశ్రమగా స్థాపిస్తే అది రైతుకు లాభసాటి వ్యాపారమవుతుందని చెప్పారు. ఉద్యాన విభాగాధిపతి డాక్టర్ వి.శ్రీలత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు మునగ పంట ప్రాముఖ్యతను, మునగలోని పోషక విలువలను వివరించారు. విస్తరణ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి.ప్రశాంత కుమార్ మునగ విలువ ఆధారిత ఉత్పత్తులు, మునగను సులువుగా మార్కెటింగ్ చేసుకునే విధానాలను వివరించారు. డాక్టర్ ఎన్.రత్నకుమారి మునగ సాగులో పురుగులు, తెగుళ్ల నివారణ పద్ధతులతోపాటు రోజువారీ ఆహారంలో మునగ ప్రాముఖ్యత గురించి తెలిపారు. మునగ ఉత్పత్తులను తయారుచేసి, ఎగుమతి చేయడం ద్వారా ఆర్థికంగా బలపడుతున్న పరిశ్రమల వివరాలను రైతులకు వివరించారు. డాక్టర్ ఎం.లక్ష్మీమాధురి, డాక్టర్ జి.స్నేహలీల మునగ సాగులో మెలకువలు, మునగ ఉపయోగాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి వివరించారు. ఐసీఏఆర్ ఎస్సీ సబ్ప్లాన్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మహిళా రైతులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. -
న్యూ ఇయర్ పేరుతో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు
ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: న్యూ ఇయర్ ముసుగులో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆకతాయి పనులకు పాల్పడకుండా, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించాలన్నారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్రూట్ డ్రైవింగ్ చేయవద్దని, బైక్ల సైలెన్సర్లు తీసివేసి రణగొణధ్వనులను సృష్టిస్తూ వాహనాలను నడిపినా, మద్యం తాగి వాహనాలను నడిపినా వాహనాలను సీజ్ చేసి వాహన చోదకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఇతరుల ను ఇబ్బందులకు గురిచేసే వారిని ఉపేక్షించబోమన్నారు. బాణాసంచా కాల్చడం, పరిమితికి మించిన ధ్వనితో డీజేలు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహించినా చర్యలు తప్పవన్నారు. జిల్లాలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమైన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలన్నారు. -
నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి
నగరం: నాటుసారా రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి డాక్టర్ సీహెచ్ నరేష్కుమార్ తెలిపారు. స్థానిక స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నాటుసారా తయారీ కేంద్రాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎమ్మార్పీకి మద్యం విక్రయించేలా ఎకై ్సజ్ అధికారులు కృషి చేయాలని కోరారు. అక్రమ మద్యం అమ్మకాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన తరువాతే మద్యం అమ్మకాలు జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం షాపుల సమయాన్ని రాత్రి 10 నుంచి 12 గంటల వరకు పెంచినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు, సీఐ మార్టూరి శ్రీరామ్ప్రసాద్, ఎస్ఐ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
అదే రోజు జనరల్ బాడీ సమావేశం
8న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను జనవరి 8న నిర్వహించేందుకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు మంగళవారం షెడ్యూల్ విడుదల చేశారు. గత నెల 26న వాయిదా పడిన 1, 7వ స్థాయీ సంఘ సమావేశాలతో పాటు అదే రోజు జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన గతనెల 26న భేటీ అయిన ప్రణాళిక–ఫైనాన్స్కు సంబంధించిన 1వ స్థాయీ సంఘం, పనులకు ఆమోదం తెలిపేందుకు ఉద్దేశించిన 7వస్థాయీ సంఘ సమావేశాలను సభ్యులు బహిష్కరించడంతో నిరవధికంగా వాయిదా పడ్డాయి. జెడ్పీటీసీలకు సమాచారం ఇవ్వకుండా, వారికి తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తూ, ఏకపక్షంగా పనులను ఆమోదిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీలు సమావేశాలను బహిష్కరించారు. దీంతో ఆయా అంశాలకు సంబంధించిన పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో మరలా వాటిని ఆమోదింపచేసుకునేందుకు జనవరి 8న ఉదయం 9.30 గంటలకు స్థాయీ సంఘ సమావేశాలను ప్రారంభించి, ఉదయం 11.30 గంటలకు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనల ఆమోదంపై చర్చించనున్నారు. -
బీచ్లో రింబోలా..రింబోలా
చీరాల టౌన్: నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని సముద్ర తీర ప్రాంతం ఫ్లడ్ లైట్ల వెలుగులు, డీజేల హోరు, మద్యం, రెయిన్ డ్యాన్సులు, క్యాంపు ఫైర్లతో హోరెత్తనున్నది. కొద్ది రోజుల కిందట జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ రిసార్ట్స్, హోటల్స్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటుచేసి నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని మందు పార్టీలు, డీజేలు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించరాదని, నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ నిర్వాహకులు వాటిని ఖాతరు చేయకుండా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రిసార్ట్స్ల్లో డీజేలు, ప్రత్యేక టెంట్లు, కుర్చీలు, డ్యాన్సర్లు, మద్యం, సకల ఏర్పాట్లు చేశారు. రిసార్ట్సులో ప్రత్యేక ఎంట్రీ టికెట్ల ద్వారా, పాస్లు, కూపన్లు అందించారు. న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి రూ.1800 నుంచి రూ.2వేలు, జంటకు అయితే రూ.4000 వసూలు చేస్తున్నారు. రిసార్ట్స్ల్లో గదులు ఫుల్ జిల్లాలోని సముద్ర తీరప్రాంతాలైన రామాపురం, వాడరేవు, కఠారిపాలెం, సూర్యలంక, పొట్టిసుబ్బయ్యపాలెం, విజయలక్ష్మీపురం సముద్ర తీర ప్రాంతాల్లో సుమారు 70 వరకు రిసార్ట్స్ ఉన్నాయి. వీటిలో రోజుకు రూ.3000 నుంచి రూ.15 వేలు చార్జి వసూలు చేసే రిసార్ట్స్, గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని వాడరేవు, రామాపురం, సూర్యలంక తీరప్రాంతాలకు ఆంధ్ర రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వేలాది మంది గదులను బుక్ చేసుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా గదుల అద్దెలను కూడా భారీగా పెంచేశారు. ఆనందంగా ఎంజాయ్ చేద్దామనుకునే వారి జేబులను గుల్ల చేసేందుకు నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో పర్యాటకులను ఆనందంలో ఉర్రూతలూగించేందుకు మద్యం, వివిధ రకాల ఆహార పదార్థాలు, పలు రకాల మత్తు పదార్థాలను కూడా సిద్ధం చేశారని సమాచారం. ఎంట్రీ టికెట్ కొన్నవారికి పరిమితిగా ఆల్కహాల్, ఆహారం, రెయిన్ డ్యాన్సులు, క్యాంప్ ఫైర్లకు టోకెన్లు అందించారు. జిల్లాతోపాటుగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం ఈ న్యూ ఇయర్ ఈవెంట్ టికెట్లు కొనుగోలు చేశారు. ప్రత్యేకంగా బౌన్సర్ల నియామకం తీరప్రాంత రిసార్ట్సులో అనుమతులు లేకుండా నిర్వహించే ఈవెంట్లలో పర్యాటకులను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా బౌన్సర్లను ఏర్పాటు చేశారు. జనం రద్దీగా ఉంటుందని బౌన్సర్లను, కొంత మంది ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. అనుమతులు లేకుండా బీచ్ ఒడ్డున క్యాంప్ ఫైర్లు, ఫుడ్ స్టాళ్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో రిసార్ట్సుకు కనీసం వాహనాల పార్కింగ్ సక్రమంగా లేకున్నా ఈవెంట్లకు అన్నీ వసతులు ఉన్నాయని ప్రచారం చేసి మరీ టికెట్లు అమ్మకాలు చేస్తున్నారు. పట్టించుకోని అధికారులు రిసార్ట్స్ నిర్వాహకులు అనుమతులు లేకుండా భారీ ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఎకై ్సజ్, విద్యుత్శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. అధికారులను ఆ వైపు కన్నెత్తి చూడకుండా అన్నీ సమకూర్చి పంపారని ప్రచారం జోరుగా సాగుతుంది. నాలుగు నెలల కిందట రామాపురంలోని పలు రిసార్ట్స్ల్లో అర్ధరాత్రి రేవ్ పార్టీలు చేసిన ఘటనలు ఉన్నా కనీసం కట్టడి చేయలేని స్థితిలో అధికారులు ఉన్నారు. చీరాలలో కొత్తగా రెండుసార్లు రేవ్ పార్టీలు, కొన్ని రిసార్ట్సుల్లో యథేచ్ఛగా పేకాట, లోన–బయట, కోత ముక్క జూదంతోపాటుగా ఇతర ప్రాంతాలకు చెందిన మద్యాన్ని రిసార్ట్సు నిర్వాహకులే అందిస్తున్నా పోలీసులు కానీ, ఎకై ్సజ్ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. రేవ్ పార్టీలు జరుగుతున్నా కానీ రిసార్ట్సు నిర్వాహకుల జోలికి అధికారులు వెళ్లకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారనే సమాచారం ఉంది. మొత్తం మీద న్యూ ఇయర్ వేడుకలు రిసార్ట్ల నిర్వాహకులకు లక్షలు కురిపిస్తోంది. -
చీరాలలో ఎనీటైమ్ లిక్కర్
చీరాల: చీరాల్లో ఎనీటైమ్ లిక్కర్ అందుబాటులో ఉంటోంది. పేరుకే సమయపాలన పాటిస్తున్నామని చెబుతూ దొడ్డిదారిన మద్యం యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా డిసెంబరు 31వ తేదీ రాత్రి అదనంగా సమయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తే రెండు రోజులు ముందుగానే రాత్రి వేళల్లో మద్యం అందుబాటులోకి కొందరు వైన్ షాపుల నిర్వాహకులు తెస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓ టి. చంద్రశేఖర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో విఠల్నగర్కు చెందిన పాలేటి భూపతి రావు కృష్ణా వైన్స్లో మద్యం తాగుతూ మరణించాడని తెలిపారు. పాత భవాని థియేటర్ పక్కన గల కృష్ణా వైన్స్లో మద్యం అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయన్నారు. వీటిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆర్డీఓకు వినతిపత్రం అందించిన వారిలో పార్టీ బాపట్ల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసి మళ్ళ వాసు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గవిని శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ, ఎస్.నవీన్, కంచర్ల చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠ రాయుడు... నారసింహుడు
మంగళగిరి టౌన్: మంగళగిరిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్సవాలకు సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతోంది. శ్రీవారిని కొలిచేందుకు భక్తులు ముక్కోటి ఆశలతో సంసిద్ధులయ్యారు. మంగళవారం తెల్లవారుజాము 4 గంటల నుంచి స్వామి ఉత్తర ద్వారం నుంచి గరుడ వాహనంపై దర్శన భాగ్యం కల్పించనున్నారు. తరలిరానున్న భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దక్షిణావృత శంఖంతో తీర్థం... 1820లో తంజావూరు మహారాజు వారణాసి యాత్రలో మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని బంగారు తొడుగు గల దక్షిణావృత శంఖాన్ని సమర్పించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజున ఈ శంఖంతో స్వామికి అభిషేకం చేస్తారు. ముక్కోటి ఏకాదశినాడు ఈ శంఖంతో భక్తులకు తీర్థం అందిస్తారు. విశేషంగా తరలివచ్చే భక్తుల రద్దీని పురస్కరించుకుని 30వ తేదీతోపాటు, 31వ తేదీన ద్వాదశి రోజున కూడా దక్షిణావృత శంఖ తీర్థాన్ని ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు జరుగనున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 320 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీరిలో ముగ్గురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 50 ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు ఉన్నట్లు చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటల నుంచి వీరు విధులకు హాజరయ్యారని పేర్కొన్నారు. షిఫ్ట్లవారీగా బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. -
సుఖమయ జీవనానికి యోగా దోహదం
బాపట్ల: మానవాళి సుఖమయ జీవన విధానానికి యోగా ఎంతగానో దోహద పడుతుందని బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. మూడు రోజులుగా బాపట్ల మండలం జిల్లెళ్ళమూడిలో జరుగుతున్న జాతీయస్థాయి యోగాసన చాంపియన్ షిప్ ముగింపు సందర్భంగా సోమవారం జరిగిన సభకు నరేంద్ర వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారతీయతలో యోగా అంతర్భాగమన్నారు. పోటీల్లో పశ్చిమ బెంగాల్కు చెందిన యువతి అనీషా భౌమిక్కు చాంపియన్ ఆఫ్ చాంపియన్ షిప్ ట్రోఫీని ఎమ్మెల్యే, నిర్వాహకులు కలిసి అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్ యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్, ప్రధాన కార్యదర్శి మృణాల చక్రవర్తి, రాష్ట్ర యోగా అసోసియేషన్ అధ్యక్షుడు కూన కృష్ణదేవరాయులు, చైర్మన్ కళ్లం హరినాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్, వివేక సర్వీస్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, ప్రముఖ ఆడిటర్ చాపల సుబ్రహ్మణ్యం, అసోసియేషన్ కోఆర్డినేటర్ శ్రీమన్నారాయణ, సభ్యులు శీలం శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీనారాయణరెడ్డి నాగరాజు, వీరభద్రయ్య, ఇమ్మడిశెట్టి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కల్కి అలంకరణలో వైకుంఠవాసుడు
తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్వామివారిని శ్రీ కల్కి అవతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: వ్యవసాయ శాఖ అధికారులు పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో సోమవారం తనిఖీలు నిర్వహించి రూ.40.70లక్షల విలువైన ఎరువులను సీజ్ చేశారు. సాయికృష్ణ ఫర్టిలైజర్స్ దుకాణానికి చెందిన ఎరువుల గౌడన్స్, ఐదు స్టోరేజ్ పాయింట్లను అధికారులు తనిఖీ చేశారు. సరైన రికార్డులు లేకపోవడం, ఎరువుల నిల్వల్లో వ్యత్యాసం ఉండటంతో 150 టన్నుల ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.40.70 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. డీలరుపై సెక్షన్–6ఏ కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. తనిఖీల్లో పాలకొల్లు వ్యవసాయ సంచాలకులు మురళీకృష్ణ, వ్యవసాయ అధికారులు కె.వెంకట్రావు, ఐ.శాంతి, ఏఈవో బ్రహ్మయ్య పాల్గొన్నారు. అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరారామంలో మంగళవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరి ంచుకుని స్వామివారి ఉత్తర ద్వారదర్శనం నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం వేకువజామున స్వామివారి ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. అనంతరం స్వామివారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. స్థానిక కోదండరామాలయం, పాండురంగస్వామి ఆలయం, గీతామందిరంతోపాటుగా మండల పరిధిలోని వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో కూడా భక్తులకు ఉత్తరద్వార దర్శనం నిర్వహిస్తున్నట్లు ఆయా దేవాలయాల నిర్వాహకులు తెలిపారు. గుంటూరు వెస్ట్: సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శనను విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సారస్ కార్యక్రమాన్ని జనవరి 6వ తేదీ నుంచి 18 వరకు గుంటూరు–నరసరావుపేట రోడ్డులోని రెడ్డి కళాశాల ఎదుట ఉన్న స్థలంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా జాతీయ స్థాయి సారస్ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఆయా రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే చేనేత, హస్తకళలు, ఇతర సామగ్రిని ప్రదర్శించడం, విక్రయించడం జరుగుతుందన్నారు. ఇది మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనాన్ని తలపిస్తుందని చెప్పారు. 250కు పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. -
హమ్మయ్యా... బతికించారు..
సత్తెనపల్లి: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ నుంచే ప్రభుత్వ పింఛన్దారులు తాము ఉన్న చోటు నుంచే జీవన్ ప్రమాణ్ యాప్లో ముఖ ఆధారిత గుర్తింపు పంపే సౌలభ్యం కలిగింది. వయోభారం మూలాన నడవలేని స్థితిలో ఉన్న పింఛన్దారులను గుర్తించి, ఉపఖజానా కార్యాలయం సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి, జీవన్ ప్రమాణ్ పేరుతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వాస్తవానికి బయోమెట్రిక్, ఐరిస్ విధానాల్లో చేతి వేలిముద్రలు అరిగి పోవడం, కంటి సమస్యలతో కొందరికి ఇబ్బందులు తప్పేవి కాదు. అవసరమైన సాంకేతికతను నవీకరిస్తున్నా సమస్యలు వెంటాడేవి. ఇప్పుడు యాప్తో ముఖ ఆధారిత గుర్తింపు విధానం అమల్లోకి తేవడంతో పండుటాకుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పల్నాడు జిల్లాలో 12,242 మంది ఏటా జనవరి నెల ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 28 లోపు జీవన ప్రమాణ పత్రాలు ఉపఖజానా కార్యాలయాల్లో పెన్షనర్లు సమర్పించాల్సి వచ్చేది. జిల్లాలో 9 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో సర్వీస్ పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు కలిపి 12,242 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.52,13,34,735 పింఛన్లు ఇస్తున్నారు. -
శ్మశానానికి వెళ్లాలంటే ‘చావు’కొస్తోంది !
మండలంలోని అడవులదీవి పంచాయతీ పరిధిలోని భీమవారిపాలెంలో శ్మశానానికి వెళ్లడానికి గ్రామస్తులు నరకయాతన పడుతున్నారు. కచ్చా రహదారి సమస్యాత్మకంగా మారింది. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే శవాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. రహదారి చిత్తడిగా మారింది. ఇరువైపులా ముళ్ల చెట్లు ఉండటంతో మృతదేహాలను తీసుకెళ్లడం కష్టమవుతోంది. అడవులదీవి గ్రామానికి చెందిన గ్రామ పోతురాజు (రేమాల వీరాస్వామి) సోమవారం మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించడానికి గ్రామస్తులు నరకయాతన పడ్డారు. రహదారి అంతా చిత్తడిగా ఉండటంతో ప్రజలు అసహనానికి గురయ్యారు. అధికారులు స్పందించి బాగు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. –నిజాంపట్నం -
ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా పి.నాగేశ్వరరావు
బాపట్ల: ఏపీ ఎన్జీవో బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పి.నాగేశ్వరరావును ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. బాపట్ల జిల్లా ఏపీ ఎన్జీవో అసోసియేషన్ యూనిట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో సోమవారం జరిగింది. తొలుత డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ప్రదర్శనగా ఉద్యోగులు ఎన్జీవో హోమ్కు చేరుకున్నారు. జిల్లాలోని ఏడు తాలూకాల నుంచి వచ్చిన 300 మంది ఏపీ ఎన్జీవో సంఘ సభ్యులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు షరీఫ్ వ్యవహరించారు. జిల్లాలోని 17 పదవులుగాను 17 నామినేషన్లు మాత్రమే రాగా ఏకగీవ్రంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులు వీరే... జిల్లా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులుగా పి.నాగేశ్వరరావు, కార్యదర్శిగా బి.ప్రసాదరావు, కోశాధికారిగా డి.నాగేశ్వరరావు, సహాధ్యక్షుడిగా చింత శేషుబాబు ప్యానల్ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో పల్నాడు జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కిలారు జగదీశ్వర్రావు, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి శ్యామ్ సుందర్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్ బాబు, కార్యదర్శి ఆర్.సి.హెచ్.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెనాలి తహసీల్దార్కు సీఎం అభినందన
తెనాలి రూరల్/గుంటూరు వెస్ట్: తెనాలి తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అభినందించారు. తహసీల్దార్ కార్యాలయానికి ఐఎస్ఓ ధ్రువీకరణ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆయన ప్రత్యేకంగా తహసీల్దారును సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించి, అభినందించారు. రెవెన్యూ శాఖలో అరుదైన రికార్డును గోపాలకృష్ణ నెలకొల్పారని, ఇరు తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రభుత్వ కార్యాలయానికి లేని ఘనత తెనాలి తహసీల్దార్ కార్యాలయం సాధించటం అభినందనీయమని ప్రశంసించినట్లు గోపాలకృష్ణ రాత్రి వెల్లడించారు. ఇటీవల 5,800 మంది రైతు సమస్యలను సింగిల్ విండో విధానంలో తహసీల్దారు పరిష్కరించారు. కార్యాలయ సిబ్బంది పనితీరుతోపాటు ప్రజలతో వ్యవహరించే విధానంలో గోపాలకృష్ణ మంచి మార్పులు తీసుకొచ్చారు. శిథిలావస్థలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని ఇటీవల దాతల సహకారంతో సర్వాంగ సుందరంగా ఆధునికీకరించి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పునఃప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి మనోహర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సమక్షంలో ఐఎస్ఓ ప్రతినిధి బృందం తహసీల్దార్ కార్యాలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ను ఈ నెల 15వ తేదీన అందించిన సంగతి విదితమే. తహసీల్దార్ వెంట రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. -
యాప్తో పారదర్శంగా లెక్కలు
‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్పై గ్రామ సంఘ సహాయకులకు శిక్షణ ఇంకొల్లు(చినగంజాం): గ్రామ పొదుపు సంఘాల సభ్యులు ‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్ను వినియోగించుకొని సంఘాల్ని సమర్థంగా నిర్వహించాలని బాపట్ల జిల్లా సంస్థాగత నిర్మాణ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కాకి రవికుమార్ తెలిపారు. మండల వెలుగు కార్యాలయంలో సోమవారం పర్చూరు, కారంచేడు మండలాల గ్రామ సంఘ సహాయకులకు యాప్పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ యాప్ ద్వారా సంఘాల సభ్యులకు, సభ్యురాళ్లకు పొదుపు, అప్పు వివరాలు ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా చూసుకునే సౌకర్యం ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా సంఘాల్లో జరిగే చిన్న తప్పిదాల్ని అరికట్టవచ్చని తెలిపారు. సంఘం, సభ్యుల లెక్కలు పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి నెలా నిర్ణీత తేదీ ప్రకారం గ్రామ సంఘ సహాయకులు లెక్కలను మొబైల్ ద్వారా ఆన్లైన్ చేస్తారని పేర్కొన్నారు. జిల్లా బ్యాంక్ లింకేజ్ డీపీఎం అనంత లక్ష్మణాచారి మాట్లాడుతూ తీసుకున్న అప్పు మొత్తాన్ని జీవనోపాధులకే వినియోగించుకోవాలని, తద్వారా కుటుంబాల ఆర్థికస్థితి పెరుగుతుందని తెలిపారు. శిక్షణకు రిసోర్స్ పర్సన్లుగా కె. విజయభాస్కర్, ఓ. శ్రీనివాసరావు, పర్చూరు, కారంచేడు ఏపీఎంలు టి. మోహనరావు, కె.రామకృష్ణ, ఇంకొల్లు ఏపీఎం అనురాధ, సీసీలు, వీఓఏలు పాల్గొన్నారు. -
3,4 తేదీల్లో ఏపీ హిస్టరీ కాంగ్రెస్ సమావేశాలు
పెదకాకాని: రాష్ట్రంలో చరిత్రపై పరిశోధనలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో జనవరి 3,4 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి డాక్టర్ మొవ్వా శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమావేశాల ప్రచార ప్రతులను వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్, వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మొవ్వా శ్రీనివాసరెడి మాట్లాడుతూ వైజ్ఞానిక పద్ధతులలో చరిత్ర అధ్యయనాన్ని ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్లో చరిత్ర పరిశోధనల ప్రగతిని మూల్యాంకన చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశమన్నారు. అవగనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరవుతారనీ, ఆధునిక చరిత్ర, సాంకేతికత, సామాజిక అంశాలపై పరిశోధనా పత్రాల సమర్పణ, చర్చలు జరుగుతాయని వివరించారు. పాలక సభ్యురాలు వాసిరెడ్డి ప్రత్యూష, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, ఏఎన్యూ హిస్టరీ ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్, డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ కె.గిరిబాబు, వీవీఐటీయూ పబ్లికేషన్ డివిజన్ సంధానకర్త మోదుగుల రవికృష్ణ పాల్గొన్నారు. ●గన్నవరం ఏడీఏ ఎం.సునీల్ ● పలు ఎరువుల షాపుల్లో ఆకస్మిక తనిఖీలుతెనాలి టౌన్: ఎమ్మార్పీ కంటే అధికంగా ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గన్నవరం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎం.సునీల్ హెచ్చరించారు. పట్టణంలోని ఎరువుల దుకాణాల్లో సోమవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, తెనాలి మండల వ్యవసాయాధికారి కె.సుధీర్బాబు, గుంటూరు మండల వ్యవసాయాధికారి బి.కిశోర్ తనిఖీల్లో పాల్గొన్నారు. స్టాక్ రిజిస్టర్ పరిశీలించి, రికార్డు తనిఖీ చేశారు. రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించారు. యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను ఎమ్మార్పీకంటే అధికంగా విక్రయిస్తే షాపు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బి.కిశోర్, ఏఈఓ మురళి, తదితరులు ఉన్నారు. రూ.15లక్షల ఎరువుల అమ్మకాలు నిలుపుదల చేబ్రోలు: రైతులకు ఎరువులు ఎమ్మార్పీ కన్నా అధికంగా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ రాష్ట్ర తనిఖీ బృందం అధికారి గన్నవరం ఏడీఏ ఎం.సునీల్, కమీషనరేట్ కార్యాలయ వ్యవసాయశాఖాధికారి బి. సురేష్బాబు తెలిపారు. చేబ్రోలు మండలంలోని శేకూరు, వడ్లమూడి, చేబ్రోలు గ్రామాల్లోని ప్రైవేటు ఎరువుల దుకాణాల్లో రాష్ట్ర బృందం సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పొన్నూరు ఏడీఏ వి. రామకోటేశ్వరి, స్థానిక ఏఓ ప్రియదర్శినిలు పాల్గొన్నారు. యూరియా నిల్వలు, అమ్మకాలు, ఎరువుల లభ్యత గురించి పరిశీలన చేశారు. శేకూరు, వడ్లమూడి గ్రామాల్లోని రెండు షాపుల్లో సరైన పత్రాలు, బిల్లులు లేకపోవటంతో రూ.15,19,870 విలువైన 85.4 మెట్రిక్ టన్నుల ఎరువులను నిలుపదల చేశారు. మండలంలో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ఎరువులు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రికార్డు మెయింటైన్ సరిగా లేని వారికి సంజాయిషీ తీసుకొని, లైసెన్స్ సస్పెన్షన్కి ఆదేశాలు జారీ చేశారు. -
ఆటో బోల్తా : పలువురికి గాయాలు
వేమూరు(అమర్తలూరు) : ఆటో బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పెరవలిపాలెం గ్రామానికి చెందిన కూలీలు మొక్కజొన్న, జొన్న పొలాల్లో పనుల కోసం సోమవారం ఉదయం అమృతలూరు బయలుదేరారు. డ్రైవరు ఫోన్ మాట్లాడుతూ ఆటో నడుపుతుండగా అమర్తలూరు మలుపు వద్ద బోల్తా పడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీలు గాయపడ్డారు. కోటేశ్వరమ్మకు తీవ్రం గానూ శ్రీనివాసరావు, అంజలికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ రవితేజ తెలిపారు. వేమూరు(భట్టిప్రోలు): అతి వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని ఐలవరం జరిగింది. గ్రామానికి చెందిన వీరంకి సాంబశివరావు(69) ఆదివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భోజనం చేసి ఇంటి ముందున్న హైవే పైకి వచ్చాడు. ఈ సమయంలో గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందినట్లు ఎస్ఐ ఎం. శివయ్య సోమవారం తెలిపారు. సాంబశివరావు కుమారుడు ఏడుకొండలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. వార్షిక నేర నియంత్రణ సమావేశంలో బాపట్ల ఎస్పీ బి. ఉమామహేశ్వర్ బాపట్ల టౌన్: జిల్లాలో ఫోక్సో కేసులు గత ఏడాది కంటే 35 శాతం తగ్గాయని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం వార్షిక నేర నియంత్రణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది జిల్లా పోలీస్ యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు, మహిళల రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. వ్యవస్థను బలోపేతం చేయడం, రౌడీలకు కౌన్సెలింగ్తో పాటు గ్రామస్థాయి నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మండలస్థాయి అధికారులతో పల్లె నిద్ర, నేరాలు నమోదైన వెంటనే వేగవంతమైన దర్యాప్తు చేసి చార్జ్షీట్లు దాఖలతో పాటు రౌడీల కదలికలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన మహిళల భద్రత, రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల వినియోగం, బైండోవర్ కేసులు, కౌన్సెలింగ్, చెడు నడత కలిగిన వారిపై నిఘా కారణంగా నేరాల తీవ్రత తగ్గిందని వివరించారు. మహిళల భద్రత కోసం ఐదు ప్రత్యేక శక్తి బృందాల్ని ఏర్పాటు చేసి 2,611 అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు 66,000 పైగా శక్తి యాప్ డౌన్న్లోడ్లు జరిగాయని చెప్పారు. ప్రతి శనివారం ‘‘నో యాక్సిడెంట్ డే’’గా 19 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. హెల్మెట్ అవసరంపై 640 అవగాహన కార్యక్రమాలతో పాటు కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ట్రావెల్స్ బస్సులు, భారీ వాహనాలపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని వివరించారు. అవసరమైతే డ్రైవర్లతో పాటు యాజమాన్యాలపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక బృందాలతో పనిచేస్తూ, డిజిటల్ అరెస్ట్, ఫేక్ వెబ్సైట్ల ద్వారా మోసాలకు పాల్పడిన ముద్దాయిలను ఇతర రాష్ట్రాల్లో అరెస్టు చేశామని తెలిపారు. 13 కేసుల్లో కఠిన శిక్షలు, ఏడు కేసుల్లో జీవిత ఖైదు, రెండు కేసుల్లో 20 సంవత్సరాల జైలుశిక్షలు పడినట్లు పేర్కొన్నారు. ప్రాపర్టీ కేసుల్లో రూ.3.62 కోట్ల రికవరీతో పాటు, ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో రూ.40 లక్షల విలువైన 60 బైకులను రికవరీ చేసి నిందితులకు జైలుకు పంపించామని వివరించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు, రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, చీరాల డీఎస్పీ ఎండి.మోయిన్ పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: నకిలీ కార్ల కేసులో ఏ–6 నిందితుడిగా ఉన్న హైదరాబాద్కు చెందిన ప్రకాష్గౌడ్ను నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ కార్ల కేసులో తొమ్మిది మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. ఇందులో నలుగురును అరెస్ట్ చేయగా, నకరికల్లుకు చెందిన రామకృష్ణ న్యాయస్థానంలో లొంగిపోయాడు. నకిలీ కార్లకు డాక్యుమెంట్లను హైదరాబాద్కు చెందిన ప్రకాష్గౌడ్, వైజాగ్కు చెందిన వర్మలు అందజేశారు. ఈ కేసులో వీరిని ఏ–6, ఏ–7 నిందితులుగా పేర్కొన్నారు. ప్రకాష్గౌడ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నిందితుడు వర్మను అరెస్ట్ చేయాల్సి ఉంది. -
క్షేత్రస్థాయిలో వైఎస్సార్ సీపీ బలోపేతమే లక్ష్యం
యద్దనపూడి: వైఎస్సార్ సీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయటానికి గ్రామస్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్రెడ్డి తెలిపారు. పర్చూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మోదుగుల బసవ పున్నారెడ్డితో సోమవారం ఆయన కలిసి మండలంలోని శ్యామలవారిపాలెం, పోలూరు, జాగర్లమూడి, మున్నంగివారిపాలెం, తనుబొద్దివారిపాలెం, గన్నవరం, పూనూరు గ్రామాల్లో పర్యటించారు. కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ● గాదె మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ గ్రామ కమిటీల నియామకంలో బంధుప్రీతి, వ్యక్తిగత స్వార్థంతో రాజకీయాల కోసం కాకుండా వైఎస్సార్ సీపీపై చిత్తశుద్ధి ఉన్న వారిని మాత్రమే కమిటీల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. విస్తృతంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వాలనే లక్ష్యంతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరికీ క్యూ ఆర్ కోడ్తో ఐడీ కార్డులను మంజూరు చేస్తారని, భవిష్యత్లో కమిటీ సభ్యులకు అన్ని విధాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ● పార్టీ పరిశీలకులు మోదుగుల బసవ పున్నారెడ్డి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ● కార్యక్రమంలో మండల కన్వీనర్ రావూరి వేణుబాబు, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మువ్వల రాంబాబు, షేక్ బుడే, ధూళ్లిపాళ్ల శివకుమారి, కుంచపు అంకమ్మ, బొబ్బేపల్లి శ్రీకాంత్, యన్నం శ్రీను, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు గంగిరెడ్డి కృష్ణారెడ్డి, దొడ్డా రవి, తనుబొద్ది రామిరెడ్డి, మున్నంగి బసివిరెడ్డి, గనిపిశెట్టి రమేష్బాబు, ఈమని శేషిరెడ్డి, గనిపిశెట్టి రామకృష్ణ, షేక్ ఖాసింవలి, రావూరి వీరయ్యచౌదరి, తనుబొద్ది రామిరెడ్డి, వీరారెడ్డి, చల్లా అన్నపూర్ణమ్మ, వెంకటరెడ్డి, చెరుకూరి వేణు, మేకా సుధాకర్, దేవగిరి సుబ్బారెడ్డి, నాగూర్ బాషా, లక్ష్మయ్య, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్చార్జ్ గాదె మధుసూదన్రెడ్డి, పార్టీ పరిశీలకుడు బసవ పున్నారెడ్డి -
జిల్లాలో 373 మొబైల్ ఫోన్లు స్వాధీనం
●జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ●రూ. 74.60 లక్షల విలువైన ఫోన్లు బాధితులకు అప్పగింత బాపట్ల టౌన్: జిల్లాలో గత మూడు నెలల్లో ఇటీవల రూ. 74.60 లక్షల విలువైన 373 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని సోమవారం బాధితులకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అందజేశారు. జిల్లా క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.7,17,80,000 విలువైన 3,301 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు చెప్పారు. ఎవరైనా ఎక్కువ విలువ గల మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు సెకండ్ హ్యాండ్గా విక్రయించేందుకు ప్రయత్నిస్తే, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని కొనవద్దని ఆయన సూచించారు. మిస్సింగ్ మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయడానికి జిల్లాలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే, దాని ఐఎంఈఐ నంబర్లు, దానికి సంబంధించిన బిల్లుతో పోలీస్ స్టేషన్లలో లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయవవ్చని తెలిపారు. -
ఏపీటీఎఫ్ డైరీ, కేలండర్ ఆవిష్కరణ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీటీఎఫ్ నూతన సంవత్సర కేలండర్, డైరీని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. జీవో ప్రతులతో కూడిన ఉపాధ్యాయ మార్గదర్శినిని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ప్రభుత్వ జీవోలు, సర్వీసు నియమ, నిబంధనలతో ఉపాధ్యాయులకు కరదీపికగా ఉంటుందని తెలిపారు. గత 50 ఏళ్లుగా నిరాటంకంగా ఉపాధ్యాయ, విద్యారంగ విషయాలతో జీవో పుస్తకాన్ని ప్రచురించడం గొప్ప విషయమని, ఇది ప్రతి ఉపాధ్యాయుని చేతిలో ఉండాల్సిన పుస్తకమన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, గుడిపాటి దాస్, కార్యదర్శులు పి.లక్ష్మీనారాయణ, చక్కా వెంకటేశ్వరరావు, పచ్చల శివరామకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్ కె.రమేష్, నాయకులు జహంగీర్, కిశోర్ షా, కృష్ణారావు, మునినాయక్, షుకూర్, అప్పారావు, మాల కొండయ్య పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బాపట్ల: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు విన్నవించారు. 231 అర్జీలు వచ్చాయి. పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు తొలుత తహసీల్దార్కు, అక్కడ పరిష్కారం కాకుంటే ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వాలన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే కలెక్టరేట్కు రావచ్చన్నారు. విధి నిర్వహణలో అధికారులు నిర్లిప్తంగా ఉండరాదన్నారు. అవగాహన కల్పించేలా రూపొందించిన ప్రచార బోర్డులను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఈ బోర్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సముద్రంలో నాచు మొక్కలు పెంచాలి సముద్రంలో నాచు మొక్కల పెంపకాన్ని జిల్లాలో విస్తారంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మత్స్యశాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా ప్రభుత్వం నాచు మొక్కల పెంపకం ప్రాజెక్టును ప్రారంభిస్తోందని కలెక్టర్ చెప్పారు. యూనిట్ స్థాపనకు ప్రభుత్వమే నూరు శాతం రాయితీపై నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 40 శాతం రాయితీ కేంద్రం నుంచి లభిస్తుందన్నారు. మిగిలిన 60శాతం నిధులను గ్రీన్ కై ్లమేట్ ఫండ్, అప్సడా ద్వారా లబ్ధిదారుడికి ఉచితంగా అందిస్తామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 50 యూనిట్లు లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. చిన్నగంజాం మండలం ఏటిమెగ గ్రామంలో లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింపజేయడానికి అధికారికంగా ఆమోదిస్తున్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి రూ.16వేలు నగదు ఇస్తామని తెలిపారు. మత్స్యశాఖ జిల్లా అధికారి గాలి దేవుడు, డీఆర్డీఏ పీడీ లవన్న, కమిటీలోని వివిధశాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. భూ సేకరణ త్వరితగతిన చేపట్టాలి భారీ పరిశ్రమగా సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మిస్తున్నందున భూమి త్వరగా కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. వివిధ ప్రాజెక్టుల మంజూరు, నిర్మాణాలకు అవసరమైన భూ సేకరణ, భూమి కేటాయింపులపై రెవెన్యూ, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్లో హైబ్రిడ్ విధానంలో సమావేశం నిర్వహించారు. నిధులు సిద్ధంగా ఉన్నందున వేగంగా భూమి కేటాయించాలని కలెక్టర్ చెప్పారు. అద్దంకి నియోజకవర్గం కింద బల్లికురవ మండలంలో 768 ఎకరాలు, మిగిలినవి సంతమాగులూరు మండలంలో భూమి గుర్తించాలన్నారు. 400 మంది రైతుల నుంచి భూసేకరణ జరగాల్సి ఉండగా, ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. భూసేకరణ కోసం రూ.120 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
అంజుమన్ భూమిపై ఎమ్మెల్యే తీరు దారుణం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు చిన్నకాకానిలోని అంజుమన్ సంస్థకు సంబంధించిన 71.57 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తుంటే అంజుమన్ అధ్యక్షుడు, వక్ఫ్బోర్డు కమిటీ సభ్యుడు, తూర్పు నియోజకవర్గ మైనారిటీ ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ ఏం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా అన్నారు. పాత గుంటూరులోని అంజుమన్ షాదిఖానాలో సోమవారం అంజుమన్ హమారా–హక్ హమారా పేరిట ముస్లిం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటైంది. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ ఖలీం అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రాష్ట్ర మంత్రి లోకేష్ ఓఎస్డీ, పర్సనల్ అసిస్టెంట్ సంబంధిత అధికారులకు చిన్నకాకానిలోని 71.57 ఎకరాల భూమిని ఐటీ పార్క్ కోసం ప్రైవేటీకరణ చేసేందుకు విన్నవించుకుంటే 11 నెలల తరువాత ఇప్పుడు వక్ఫ్ సీఈఓ, వక్ఫ్బోర్డు చైర్మన్, జిల్లా అంజుమన్ అధ్యక్షుడు, వక్ఫ్బోర్డు కమిటీ సభ్యుడు, ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్కు తెలియకుండానే ఎజెండాలో కమిటీ సభ్యులు సంతకాలు చేశారా? అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఏకంగా పచ్చ పత్రికలో టెండర్లు పిలుస్తూ నోటిఫికేషన్ ఇవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. తక్షణమే భూసేకరణకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ముస్లిం సంఘాలు మాట్లాడేందుకు ప్రయత్నించే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో భూ సేకరణ చట్టం ప్రకటనను తక్షణమే విరమించుకోవాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీయావుద్దీన్, జిల్లా మైనారిటీ విభాగం అధ్యక్షుడు పఠాన్ షైదా, సీపీఎం నగర కార్యదర్శి నళినికాంత్, మాజీ డిప్యూటీ మేయర్ గౌస్, లియాఖత్ అలీ, షన్ను, అప్సర్ బాబు, కార్పొరేటర్లు మహమ్మద్, ఆబిద్, ఫర్జానా, మైనారిటీ నాయకులు సలీం, సమీ ఉల్లా బేగ్, జాఫర్ ఖాన్, జబీర సలీం, ఇషాక్, నజీర్, సమద్, సైదా, సుభాని, రహీముద్దీన్, రియాజ్, జబిఉల్లా, బషీర్, ముస్లిం సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు మహమ్మద్ ఖలీం, మాజీ శాసనసభ్యుడు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్వలి, ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఖాజావలి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాదా మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, మాజీ ఎమ్మెల్యే జీయావుద్దీన్తో కలిసి అంజుమన్ సంస్థను అభివృద్ధి పథంలో నడిపించామన్నారు. ఆస్తులను కాజేస్తే అల్లాహ్ క్షమించడు చిన్నకాకానిలో ఉన్న అంజుమన్ సంస్థకు సంబంధించిన 71.57 ఎకరాల భూమికి పట్టాదారు పాస్పుస్తకాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. అంజుమన్ ఆస్తులను కాజేస్తే అల్లాహ్ క్షమించడని నూరి ఫాతిమా తెలిపారు. దీనిపై తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ... అంజుమన్ సంస్థకు సంబంధించిన చిన్న కాకానిలోని 71.57 ఎకరాల భూమికి సంబంధించి అధికారులతో, న్యాయనిపుణులతో మాట్లాడుతాను. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
మృతులు ప్రకాశం జిల్లా వాసులుగుంటూరు రూరల్: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనటంతో ఇరువురు యువకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం పరిధిలోని తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన చాట్ల నాని (16), చాట్ల అభిషేక్ (17)లు ఆదివారం ఉదయం పెదకాకాని సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి ద్విచక్రవాహనంపై వచ్చారు. అక్కడ ప్రార్థనలు ముగించుకుని తిరిగి సాయంత్రం సమయంలో ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు. రూరల్ మండలం దాసరిపాలెం సమీపంలో ద్విచక్రవాహనం నేషనల్ హైవేపై డివైడర్ను ఢీకొంది. తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృత్యువాతకు గురయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఽఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వద్దనున్న సెల్ఫోన్ల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం మహాశక్తి దేవత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి బగళాముఖి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లి పట్టణంలోని శ్రీవారి ఆలయాల్లో కనుల పండుగగా ప్రత్యేక పూజలు, స్వామివారి అలంకరణలు చేపడుతున్నారు. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీవారు జగన్మో హనకారుడు మోహిని అలంకరణలో దర్శనమిచ్చారు. మహిళా మాతలతో కుంకుమ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీవారిని దర్శించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ ప్రధాన అర్చకులు చిత్రకవి శ్యాము ఆచార్యులు గోత్రనామాలతో కుంకుమ పూజ నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీవారిని శ్రీలక్ష్మీశ్రీనివాసుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామిలను తమలపాకులతో అలంకరించి పూజలు చేశారు. మహిళా మాతలు పాశురాలను పఠించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అచ్చంపేట: అచ్చంపేట మండలం తాడువాయి గ్రామ ఎస్టీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున గొర్రెల స్థావరాలపై కుక్కలు దాడి చేశాయి. 32 గొర్రెలు మృతి చెందాయి. గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కె.వెంకటేశ్వర్లు గొర్రెల పెంపకంపై జీవనం కొనసాగిస్తుంటారు. ఆయన తన ఇంటి పక్కనే ప్రత్యేకంగా కేటాయించిన స్థలంలో 60 గొర్రెలను ఉంచగా ఆదివారం తెల్లవారుజామున సుమారు మూడు, నాలుగు కుక్కలు దాడిచేశాయి. 32 గొర్రెలను గాయపరచగా అవి అక్కడికక్కడే మృతి చెందాయి. తమకు ఎలాంటి జీవనాధారం లేదని, గొర్రెల పంపకమే ప్రధాన వృత్తిగా కొనసాగిస్తున్నామంటూ బాధితుడు వెంకటేశ్వర్లు, అతని భార్య విలపించారు. ప్రభుత్వం స్పందించి తమకు పరిహారం ఇప్పించాలని వారు కోరుతున్నారు. తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం స్వామివారిని శ్రీ కృష్ణావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన ఏఎన్యూ అంతర్ కళాశాలల బేస్బాల్ టోర్నీ
గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలోగల చేబ్రోలు హనుమయ్య ఫార్మసీ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల బేస్బాల్ మెన్స్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ విద్యాధర్ మాట్లాడుతూ ఈ పోటీలు నాకౌట్ పద్ధతిలో జరిగాయని తెలిపారు. పోటీలలో పాల్గొన్న అన్ని టీముల నుంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న జట్టు జనవరి రెండో తేదీన పూనేలోని సావిత్రి భాయిపూలే యూనివర్సిటీలో జరిగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొంటుందన్నారు. ఆదివారం జరిగిన పోటీలలో ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా, ద్వితీయ స్థానంలో ఏఎన్యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, తృతీయ స్థానంలో నరసరావుపేటకు చెందిన వాగ్దేవి డిగ్రీ కళాశాల నిలిచింది. క్రీడలను కళాశాల పీడీ ఏడుకొండలు నిర్వహించగా, అబ్జర్వర్గా యూనివర్సిటీ యోగా కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యనారాయణరావు, సెలక్షన్ కమిటీ మెంబర్స్గా డాక్టర్ పాతూరి శ్రీనివాస్, డాక్టర్ బుచ్చిబాబు, డాక్టర్ మెర్సిన్ బాబులు విధులు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల పీడీ డాక్టర్ గౌరిశంకర్, డాక్టర్ శివరామకృష్ణ, మల్లికార్జునరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ బోర్డు భూములను ఇతర సంస్థలకు అప్పగించవద్దు
చీరాల: అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థలకు చెందిన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ హుమయుం కబీర్ అన్నారు. ఆదివారం స్థానిక రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంజుమన్ ఏ ఇస్లామియా సంస్థలకు చెందిన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుందన్నారు. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల్లో ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి తోడ్పడాలే తప్పా వేరే సంస్థలకు అప్ప చెప్పకూడదని అన్నారు. గుంటూరులో వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంఽధించిన 71.57 ఎకరాలను ఐటీ పార్కుకు ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అన్యాయమని తెలిపారు. గతంలో ఇచ్చిన ఆస్తులను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు ధారాదత్తం చేస్తే ఉద్యమిస్తామని చెప్పారు. ముస్లిం మైనార్టీ వర్గాల అభివృద్ధికి ఉపయోగించాలే గానీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ టౌన్ అధ్యక్షుడు షేక్ అల్లాబక్షు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్, జిల్లా కార్యదర్శులు షేక్ సుభాని, షేక్ సలాం, వేటపాలెం మండల మైనార్టీ సెల్ ఇన్ఛార్జి షేక్ ఖాదర్, ఈపూరుపాలెం మండల సభ్యులు షేక్ నాగూర్, కొత్తపేట మైనార్టీ సెల్ సభ్యులు షేక్ అబ్దుల్లా, మాజీ కో–ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమార్కుల గుండెల్లో రైళ్లు
మార్టూరు: మార్టూరు కేంద్రంగా గత సంవత్సర కాలంగా జరుగుతున్న నకిలీ ధ్రువపత్రాలు, రిజిస్ట్రేషన్లపై కలెక్టర్ దృష్టి పెట్టడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బాధిత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశాలపై జాయింట్ కలెక్టర్ భావన శనివారం రాత్రి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ ధ్రువీకరణ పత్రాలు, భూ దందాలపై విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ దందాకు సంబంధించిన అధికారులతోపాటు ప్రైవేటు వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురై బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. జాయింట్ కలెక్టర్ నివేదికలోని అంశాలపైనే కాకుండా కలెక్టర్ ఇక్కడ జరుగుతున్న పరిణామాలను లోతుగా అధ్యయనం చేసి సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు. ప్రధానంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిన విషయం ఇక్కడ బహిరంగ రహస్యం. ఆకస్మిక తనిఖీలు.. రికార్డుల పరిశీలన అంటూ నెలలో రెండు మూడు పర్యాయాలు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించే ఆర్డీఓ గ్లోరియా ఏం తెలుసుకుంటున్నారంటూ రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ జరిగే అరాచకాలన్నీ కార్యాలయ కీలక ఉద్యోగి కనుసన్నలలోనే జరుగుతున్నట్లు సదరు సిబ్బంది చెప్పడం గమనార్హం. విచారణలో భాగంగా కలెక్టర్.. మార్టూరు తహసీల్దారు కార్యాలయం వద్ద బహిరంగ విచారణ చేపడితే బాధితుల సంఖ్య పెరుగుతుందనడటంలో సందేహం లేదు. తహసీల్దార్పై ప్రైవేటు కేసులు మ్యూటేషన్లకు సంబంధించిన ఫైళ్లపై ఆర్ఐ అశోక్.. డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మిల రిపోర్టులు కానీ, సంతకాలు కానీ లేకుండానే ప్రశాంతంగా జరిగిపోవటం ఇక్కడ సర్వసాధారణమైంది. తహసీల్దార్ ప్రశాంతిపై బాధిత రైతులు హైకోర్టులో ప్రైవేటు కేసులు వేయడం చూస్తే ఇక్కడ ఎంత అరాచకం నడుస్తుందో అర్థమవుతోంది. ప్రభుత్వ భూములకు రూ.లక్షలు తీసుకొని అడ్డగోలుగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం, ప్రభుత్వ భూములను అధికార పార్టీ నాయకులకు అప్పనంగా దోచిపెట్టడం ఆమెకు సర్వసాధారణమని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం నకిలీ ధ్రువీకరణ పత్రాల మంజూరు వివాదాన్ని ఎదుర్కొంటున్న వీఆర్ఓ బాలసుబ్రహ్మణ్యం సుమారు 15 ధ్రువీకరణ పత్రాలు విక్రయించినట్లు సమాచారం. గతంలో వీఆర్వోగా ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన ప్రసన్న, ప్రస్తుత వీఆర్వో మీనా.. తహసీల్దార్ కనుసన్నల్లో జారీ చేసిన నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై కూడా కలెక్టర్ విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయంలో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) జారీ చేసిన కనీస నిబంధనలు సైతం పాటించకపోవడం అధికారుల బరితెగింపునకు నిదర్శనం. నిజాయతీ అధికారిగా పేరు ఉన్న డిప్యూటీ తహసీల్దార్ నాగలక్ష్మి తన సీటులో పనిచేసే టైం కంటే కార్యాలయంపై బాధితులు వేసే కోర్టు కేసుల కోసం వెచ్చించే సమయమే ఎక్కువంటే అతిశయోక్తి కాదు. దీనిపై సీపీఎం నాయకుడు వై.రాంబాబు మాట్లాడుతూ మండలంలో రైతాంగం ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలపై తహసీల్దార్కు రైతు సంఘం తరఫున చాలాసార్లు చెప్పామన్నారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, లంచగొండితనాలపై అర్జీలు ఇచ్చినా ఫలితం లేదని చెప్పారు. ఇక్కడి పరిస్థితి కంచే చేను మేస్తున్న చందంగా ఉందన్నారు. కలెక్టర్ బహిరంగ విచారణ జరిపి నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మా కుటుంబానికి గ్రామంలో సర్వేనెంబర్ 366/3లో కొంత భూమి ఉంది. దీని విషయమై మా సరిహద్దు రైతులతో 2007 నుంచి ఇప్పటివరకు అద్దంకి కోర్టులో వివాదం నడుస్తోంది. భూమి మా ఆధీనంలోనే ఉండేది. గత ప్రభుత్వ హయాంలో రీ సర్వేలో భూమి మా పూర్వీకుల ఆస్తిగా మా పేరిట ఆన్లైన్ అయింది. ఎల్పీఎం నంబరు సైతం వచ్చింది. ఈ సంవత్సరం జూన్ నెలలో అప్పటి మార్టూరు సీఐ శేషగిరి నన్ను, మా అన్నయ్యను పోలీస్ స్టేషనుకు పిలిపించి బెదిరించారు. తహసీల్దార్ ప్రశాంతి ఏకపక్షంగా అవతల వారి వద్ద డబ్బు తీసుకొని నా భూమిని వారి పేరుతో ఆన్లైన్ చేసి వారికి అప్పగించారు. ఈ విషయమై తహసీల్దార్ ప్రశాంతి, సీఐ శేషగిరిపై గత సెప్టెంబరు 26వ తేదీన హైకోర్టులో విడివిడిగా ప్రైవేట్ కేసులు వేశాను. కలెక్టర్ విచారించి న్యాయం చేయాలి. – బెల్లంకొండ జానకీరామయ్య, ద్రోణాదుల -
తీరంలో సండే సందడి
చీరాల టౌన్: మండల పరిధిలోని వాడరేవు సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో కోలాహలంగా మారింది. వివిధ గ్రామాల ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వాడరేవు తీరానికి చేరుకున్నారు. వరుస సెలవులు కావడంతో చిన్నారులు, యువకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ సముద్రంలో స్నానమాచరించి ఆనందోత్సాహాలతో సందడి చేశారు. తీరం ఒడ్డున యువకులు సేదతీరుతూ సముద్రపు మన్నుతో ఆటలాడుతూ కడలి చెంత సంతోషంగా గడిపారు. చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాలతోపాటుగా పల్నాడు జిల్లాలోని పలుప్రాంతాలు, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెదిన ప్రజలు తమ కుటుంబ సభ్యులతో వాడరేవు చేరుకుని స్నానాలు ఆచరించి తీరంలో సరదాగా గడిపారు. దీంతో వాడరేవులో కోలాహలం నెలకొంది. -
వదలని బెట్టింగ్ భూతం!
చీరాల టౌన్: ఆన్లైన్ బెట్టింగ్లు చీరాల్లో అధికంగా ఉన్నాయి. చివరకు ఇంజినీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులు సైతం ఇళ్లలో నుంచి తెచ్చుకున్న డబ్బులతో బెట్టింగ్లు పెడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చీరాల్లో రూ.కోట్లలో బెట్టింగ్ కారణంగా చేతులు మారుతున్నాయి. ఇందుకు వేటపాలెం నుంచి ఈపూరుపాలెం వరకు పెద్ద ఎత్తున బుకీలుగా ఏజెంట్లు కథ నడుపుతున్నారు. గతంలో ఒకే చోట కూర్చొని బెట్టింగ్లు జరుగుతుంటే పోలీసులు నిఘా పెట్టి పట్టుకునేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. బెట్టింగ్ బాబులు రూటు మార్చారు. ప్రస్తుతం బిగ్బ్యాస్, బెట్ 365 అనే ఆన్లైన్ యాప్లను డౌన్లోడ్ చేసి టీవీలో ఒక బంతి కంటే ముందుగానే వచ్చే సమాచారాన్ని చూస్తూ ఫోన్ల ద్వారానే బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘాకు అందకుండా ఇంట్లోనే ఉంటూ బుకీ ఏజెంట్లు బెట్టింగ్ రాయుళ్లతో పందేలు కాయిస్తున్నారు. సులువుగా సంపాదించుకునే ఉద్దేశంతో చిన్న, మధ్య తరగతి కుటుంబాల వారు ఈ బెట్టింగ్కు బానిసలై చితికిపోతున్నారు. యువకులు, బంగారు వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు రూ.లక్షలు బుకీల ద్వారా పందేలు కాస్తున్నారు. కంప్యూటర్తోపాటు ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు బుకీల ద్వారా సమాచారం తెలుసుకుని స్థానికంగా బెట్టింగ్లు వేస్తున్నారు. వీరంతా బుకీలకు ఏజెంట్లుగా, చిన్న బుకీలుగా వ్యవహరిస్తున్నారు. నమ్మకంగా ఉంటూ పందేలు కాసేవారిని ఏర్పాటు చేసుకుంటున్నారు. చీరాల్లో 10 మందికి పైగా బుకీలు ఏజెంట్లున్నారు. జాండ్రపేటలో ఇద్దరు, వేటపాలెంలో ఇద్దరు, ఈపూరుపాలెంలో ఇద్దరు ఏజెంట్లు చీరాల ప్రాంతంలో జరిగే బెట్టింగ్లను నడుపుతున్నారు. నగదు లావాదేవీలంతా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఫలితాన్ని బట్టి డబ్బు అందుతుంది. ఇందుకు నమ్మకస్తులను మాత్రమే ఎంచుకుంటున్నారు బుకీ ఏజెంట్లు. నమ్మకం లేని వారి వద్ద ముందే డబ్బు డిపాజిట్ చేసుకుంటున్నారు. గ్రామాలలో సైతం నిన్నమొన్నటి వరకు పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్ భూతం నేడు గ్రామాలకు కూడా పాకింది. అక్కడా బుకీ ఏజెంట్లు ఏర్పడ్డారు. బెట్టింగ్కు అలవాటు పడిన కొందరు బుకీ ఏజెంట్లు గ్రామస్తుల నుంచి డబ్బులు, స్థిరాస్తులను సైతం వాటిపై బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా కారంచేడు, ఇంకొల్లు, పర్చూరుతోపాటు చీరాల్లో కూడా పలు గ్రామాల్లో ఈ బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. చీరాల పట్టణంలో ముంతావారి సెంటర్, కొట్లబజారు, పేరాల సెంటర్, ఈపూరుపాలెం తదితర ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్లు జరుగుతున్నాయి. కుటుంబాలు నాశనం చీరాల ప్రాంతంలో అధికంగా నివసించే చిన్న, మధ్యతరగతి కుటుంబాల వారు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. కొందరు ప్రాణాలు తీసుకుంటే, మరికొందరు ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. బెట్టింగ్ల కోసం చేసిన అప్పులు వడ్డీ సహా పేరుకుపోయి అవి తిరిగి చెల్లించలేని స్థితిలో వడ్డీ వ్యాపారులు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక ఇళ్లలోని బంగారం తాకట్టు పెడుతున్నారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఎక్కువగా యువకులు, విద్యార్థులు, వ్యాపారులే బలైపోతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చాప కిందనీరు ఉన్న బెట్టింగ్ భూతాన్ని పోలీసులు ఇకనైనా నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు. ఐపీఎల్, ఇతర క్రికెట్ పోటీలను చూసి కొందరు ఆనందిస్తుంటే చాలామంది బెట్టింగ్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ భూతం కారణంగా చాలా కుటుంబాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. సామాన్యులు కోలుకోలేని అప్పుల బాధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. -
ఫిబ్రవరి 5న జరిగే మహాసభను విజయవంతం చేయాలి
బాపట్ల: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై విజయవాడలో ఫిబ్రవరి 5న జరిగే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో జరిగిన ఏపీ జేఏసీ బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశానికి బొప్పరాజు హాజరయ్యారు. జిల్లా జేఏసీ చైర్మన్ సీహెచ్.సురేష్బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బొప్పరాజు మాట్లాడుతూ విజయవాడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో 2026 ఫిబ్రవరి 5న జరిగే మహాసభకు రాష్ట్రంలో 92 డిపార్టుమెంట్లకు చెందిన సంఘాల సభ్యులు హాజరు కానున్నారని తెలిపారు. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా హాజరు కావాలని కోరారు. రాష్ట్ర ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో జేఏసీ అమరావతి రాష్ట్ర అసోసియేట్ చైర్మన్ టీవీ ఫణి, ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం ప్రధానకార్యదర్శి పొన్నూరు విజయలక్ష్మి, వీఆర్వోల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోన ఆంజనేయకుమార్, నాలుగో తరగతి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.మల్లేశ్వరరావు, జి.అనుపమ, ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య, ఏపీ జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రజనీకాంత్, అసోసియేట్ చైర్మన్ బి.టి.వలి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు పి.రజని, కార్యదర్శి యస్.కె.హజరాబేగం, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షులు సుమన్, కో–ఆపరేటివ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు -
మనిషిని ముందుకు తీసుకెళ్లిన సైన్స్
గుంటూరు ఎడ్యుకేషన్: ఆదిమ కాలపు మానవుడి నుంచి ఆధునిక యుగంలోకి మనిషిని ముందుకు నడిపించడంలో ప్రశ్నించుకునే విధానం, శాసీ్త్రయత ద్వారా పురోగతి సాధ్యపడిందని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ వద్ద ఉన్న రెవెన్యూ కల్యాణ మండపంలో కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 15వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఎం.క్యూరీ సంకలనం చేసిన ’మానవతా మూర్తి మేడం క్యూరీ’ పుస్తకాన్ని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎం.గేయానంద్, ‘ఆధునిక భారత శాస్త్రవేత్తలు‘ పుస్తకాన్ని చలపతి విద్యాసంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు, ‘బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక‘ పుస్తకాన్ని మలినేని విద్యాసంస్థల అధినేత మలినేని పెరుమాళ్లు ఆవిష్కరించారు. భౌతికశాస్త్రంలో విశిష్ట సేవా పురస్కారాన్ని రాయపాటి శివ నాగేశ్వరరావుకు ప్రదానం చేయడంతోపాటు 30 మంది భౌతికశాస్త్ర ఉపాధ్యాయులను ’సీవీ రామన్, మేడం క్యూరీ’ ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. సభకు అధ్యక్షత వహించిన కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మానవ నాగరికత అభివృద్ధి చెందిన విధానంలో సైన్స్ కీలకపాత్ర పోషించిందని చెప్పారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సమాజంలో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. కొన్నేళ్లు సెన్స్ ఫెయిర్స్ నిర్వహిస్తూ, విజ్ఞానాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ప్రస్తుత ఏడాది విశిష్ట సేవా ప్రతిభా పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు వివరించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక దశాబ్దాలుగా విద్యార్థుల్లో, యువతలో శాసీ్త్రయ ఆలోచన విధానం పెంపొందించేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి కె.అలీన్, కె.విజయలక్ష్మి, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కళాధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తొలుత కె.వెంకటేశ్వరరావు, జయలక్ష్మి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పీవీ రమణ సారధ్యంలో ఎంవీఎస్ కోటేశ్వరరావు పాఠశాలతోపాటు మలినేని పెరుమాళ్లు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఉర్రూతలూగించాయి. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ టీచర్లకు ప్రతిభా పురస్కారాలు ప్రదానం ఎం.క్యూరీ సంకలనం చేసిన మూడు పుస్తకాల ఆవిష్కరణ -
నేడు యోగాసన చాంపియన్షిప్ బహుమతుల పంపిణీ
బాపట్లటౌన్: మండలంలోని జిల్లెళ్లమూడి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో మూడు రోజుల నుంచి జరుగుతున్న జాతీయస్థాయి యోగాసన చాంపియన్– 2025 బహుమతుల ప్రదానోత్సవం సోమవారం జరుగుతుందని రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ కళ్లం హరినాఽథ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర యువజన క్రీడాశాఖల మంత్రి ఎం. రాంప్రసాద్రెడ్డి, ఎమ్మెల్యేలు వేగేశన నరేంద్రవర్మ, మద్దులూరి మాల కొండయ్య, ఏలూరి సాంబశివరావు, శాప్ చైర్మన్ అనుమల రవి నాయుడు, స్టేట్ యోగా అసోసియేషన్ అధ్యక్షులు కూన కృష్ణదేవరాయులు, యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్ పాల్గొంటారని పేర్కొన్నారు. బాపట్ల: ఏపీ టీచర్స్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా శాఖ జనరల్ కౌన్సిలర్ సమావేశం బాపట్ల ప్రొడీజీ విద్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు అమృతపూడి శేఖర్బాబు అధ్యక్షత వహించారు. కార్యదర్శి నివేదిక ఏకగ్రీవంగా ఆమోదం పొందిన అనంతరం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా అమృతపూడి శేఖర్బాబు, ఉపాధ్యక్షులుగా మడుగుల కిషోర్, ఈర్షద్, పి. వెంకటేశ్వరరావు, కే శ్రీనివాసరావు, గోవా రవి, ప్రధాన కార్యదర్శిగా పీడీ సోషలిజం, కార్యదర్శులుగా కేవీ నారాయణ, దాసరి కృష్ణవేణి, వై చెన్నకేశవులు, ిసీహెచ్ శ్రీనివాసరావు, జె శ్రీనివాసరావు, కె వెంకటేశ్వరరెడ్డిలను ఎన్నుకున్నారు. ●వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ●రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేత పట్నంబజారు: రక్తదానం ప్రాణదానంతో సమానం అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదానం చేసిన వారికి ఆదివారం ప్రశంసా పత్రాలు అందజేశారు. బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, పార్టీ నేతలు, కార్పొరేటర్లు , అనుబంధ విభాగాల అధ్యక్షులతో కలిసి ప్రశంసా పత్రాలు అందజేశారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన శిబిరంలో 240 మంది రక్తదానం చేశారని, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నగరంపాలెం: ప్రకృతి సమాజ చిత్రాలు యరగ్రుంట్ల పాణిరావు కవితలని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు అన్నారు. బ్రాడీపేట కొరటాల సమావేశ మందిరంలో ‘నీరెళ్లిపోతున్నా నది నాతోనే’ కవితా సంపుటి ఆవిష్కరణ సభ ఆదివారం నిర్వహించారు. అమరావతి సాహితీ మిత్రులు అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు అధ్యక్షత వహించారు. యరగ్రుంట్ల పాణిరావు కవితల సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జీవ లక్షణం ఉన్న కవి పాణిరావు అని అన్నారు. జ్ఞాపకాలను చాలా అందంగా చిత్రించారని చెప్పారు. మానవ సంబంధాలను అద్భుతమైన భావుకత జోడించి బాగా చెప్పారని పేర్కొన్నారు. సాహితీవేత్త అబ్దుల్ రజాహుస్సేన్ మాట్లాడుతూ ప్రజలను మేలుకొలిపే కవిత్వంగా ఉందన్నారు. చక్కని ఆలోచనలు ఉన్న కవిత్వంగా, మంచి కవిత్వం అందించిన కవి అని కొనియాడారు. ప్రత్యేక అతిథిగా విమల సాహితీ వేదిక(హైదరాబాద్) అధ్యక్షులు డాక్టర్ జెల్ది విద్యాధరరావు మాట్లాడుతూ నవ్యత, మానవత, ఆకుపచ్చని జ్ఞాపకాలతో కవిత్వ సంపుటి పరిమళాలు వెదజల్లుతూ ఉందని అన్నారు. అనంతరం కవి యరగ్రుంట్ల పాణిరావుని సత్కరించారు. సభలో సురేష్, జిల్లా రచయితల సంఘం ప్రతినిధులు, సాహితీ ప్రియులు, బంధువులు పాల్గొన్నారు, తొలి ప్రతిని కవి తన సోదరి వాణీ సుమకు అందించారు. లక్ష్మీపురం: 104 ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు ఆయన కార్యాలయంలో ఆదివారం కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారని, అరబిందో నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడం అన్యాయని తెలిపారు. ప్రస్తుత భవ్య యాజమాన్యం కూడా ఇప్పటివరకు నియామక పత్రాలు గానీ, పే స్లిప్స్ కూడా ఉద్యోగులకు అందజేయలేదని వివరించారు. ఈ విషయాలపై చర్చించి న్యాయం చేస్తామని పెమ్మసాని చంద్రశేఖర హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ హర్ష, నాయకులు హరి, విజయ్ పాల్గొన్నారు. -
బైకు నుంచి పడి నవ వరుడు మృతి
బల్లికురవ ఎస్సీ కాలనీలో విషాదఛాయలు బల్లికురవ: అత్తగారింటికి బైకుపై బయలుదేరిన నవ వరుడు రోడ్డు మార్జిన్లోని కాలువలో బైకు సహా పడి చనిపోయాడు. ఈ ఘటన శనివారం రాత్రి బల్లికురవ–కొమ్మాలపాడులోని ఆర్ అండ్ బీ రోడ్డులోని చెన్నుపల్లి గ్రామ సమీపంలో జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. బల్లికురవ ఎస్సీ కాలనీకి చెందిన అమర్తపూడి కోటేశ్వరరావు, మేరమ్మ దంపతుల ఏకై క కుమారుడు ప్రశాంతకుమార్ (18)కి ఇటీవలే సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన అలేఖ్యతో వివాహం అయింది. ఏఎంఆర్ చెక్పోస్టులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైకుపై వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆదివారం చెన్నుపల్లి గ్రామస్తులు రోడ్ మార్జిన్లోని కాలువలో యువకుడు పడి ఉండటాన్ని గమనించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి చనిపోయినట్లుగా ప్రకటించారు. ఎస్సై వై.నాగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏకై క కుమారుడు, నవవరుడు చనిపోవటతో ఎస్సీ కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. రూ.ఐదు లక్షల విలువైన సొత్తు స్వాధీనం తెనాలి రూరల్: పలు చోరీ కేసులలో నిందితుడిని పట్టణ వన్టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక వన్ టౌన్ పోలీస్స్టేషన్లో సీఐ మల్లికార్జునరావు వెల్లడించిన వివరాల ప్రకారం... గుంటూరు కాకాని రోడ్డుకు చెందిన సయ్యద్ ఖాజా ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలకు పాల్పడుతుంటాడు. ఈ క్రమంలో అతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పట్టణంలో ఆటో చోరీకి గురైన నేపథ్యంలో కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడింది ఖాజా అని గుర్తించి నిందితుడిని వైకుంఠపురం ఆలయం సమీపంలో ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు నుంచి తెనాలి వన్ టౌన్ పోలీస్స్టేషన్, పాత గుంటూరు స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి రెండు ఆటోలు, త్రీటౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో మొబైల్ ఫోన్, పెదకాకాని, తాడేపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులకు సంబంధించి రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ కె.విజయ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర 51వ కౌన్సిల్ సమావేశాలను జనవరి 10, 11 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్నట్లు ఆ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాలులో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యారంగ సమస్యలతోపాటు, ఉపాధ్యాయులపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపైన చర్చించి భవిష్యత్తు పోరాట కార్యక్రమాలు రూపొందిస్తామని చెప్పారు. 10న బహిరంగసభ, ఉపాధ్యాయుల ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఫెడరేషన్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఎ.ఎన్.కుసుమ కుమారి, రాష్ట్ర ప్రచరణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడారు. జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి మహమ్మద్ గయా సుదౌలా, జిల్లా కార్యదర్శులు ఆదినారాయణ, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, రంగారావు, కామాక్షి, ప్రసాద్, కేదార్నాథ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నరసరావుపేట: వినియోగదారులు తమ గృహావసరాలకు ఇచ్చిన అనుమతికంటే అదనంగా విద్యుత్ వినియోగించుకుంటున్న వారు 50 శాతం రాయితీతో అదనపు రుసుం చెల్లించేందుకు ఏపీసీపీడీసీఎల్ ఇచ్చే గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. అదనంగా వాడుకునేవారు ఒక కిలోవాట్కు పాత ధర రూ.2250 కాగా నూతన ధర రూ.1250 చెల్లిస్తే సరిపోతుంది. అంటే ఒక కిలోవాట్కు రూ.1000 రాయితీ కల్పిస్తుంది. ఈ విధంగా రెండు కిలోవాట్లకు రూ.2వేలు, మూడు కిలోవాట్లకు రూ.3వేలు, నాలుగు కిలోవాట్లకు రూ.4వేలు, ఐదు కిలోవాట్లకు రూ.5వేలు రాయితీ లభిస్తుంది. వినియోగదారులు తమకు కావాల్సిన స్లాబును ఎంపిక చేసుకొని సమీప ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీసు, ఈ సేవ కేంద్రం, సంస్థ వెబ్సైట్కు చార్జీలు చెల్లించాలని ఆశాఖ అధికారులు కోరుతున్నారు. ప్రశాంత కుమార్ మృతదేహం ప్రశాంత కుమార్ (ఫైల్) -
బరి తెగించిన టీడీపీ నాయకులు
నగరం: అధికారాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు బరి తెగిస్తున్నారు.రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని నగరం శివారు ఎస్టీ కాలనీకి (యానాది)చెందిన ఎస్. రాజశేఖర్పై ఆదివారం దాడి చేశారు. అధికారంలో ఉండగా నివేశన స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించామని, తమ పార్టీకి కాకుండా వేరే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారా ? అని టీడీపీ నాయకులు దాడి చేశారని రాజశేఖర్ వాపోయాడు. కాలనీలో అభివృద్ధి పనులు గురించి మాట్లాడాలని ఎస్టీ కాలనీ వాసుల పెద్దలను పిలవడంతో నగరం గౌడపాలెం వెళ్లామని తెలిపాడు. అక్కడకు వెళ్లగానే టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేశారని రాజశేఖర్ కన్నీటిపర్యంతమయ్యాడు. టీడీపీకి అనుకూలంగా లేకపోతే ఎస్టీ కాలనీని ఖాళీ చేయాలని హకుం జారీ చేయడంతో ఎస్టీలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు వైఎస్సార్ సీపీ నాయకులను పిలవడం వల్లే టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. దీనిపై ఎస్ఐ భార్గవ్ను వివరణ కోరగా తాను వాహనాల తనిఖీలో ఉన్నానని, పోలీస్ స్టేషన్కు వెళ్లిన తర్వాత బాధితుల నుంచి కేసు తీసుకుంటానని తెలిపారు.ఎస్టీ కాలనీ నివాసులకు బెదిరింపులు కాలనీకి చెందిన రాజశేఖర్పై దాడి ఇతర పార్టీలకు అనుకూలంగా ఉంటే ఖాళీ చేయాలని హుకుం కాలనీని వదిలి వెళ్లేందుకు సిద్ధమైన ఎస్టీలు -
కుటుంబంలో కొడుకు, తండ్రి మరణం బాధాకరం
వేమూరు: విద్యుదాఘాతంతో కొడుకు మృతి చెందడంతో తండ్రి తట్టుకోలేక రైలు కింద పడి మృతి చెందిన కుటుంబాన్ని రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి పరామర్శించారు. మండల కేంద్రంలోని బేతాలు పురం గ్రామానికి చెందిన అట్లూరు సునీల్ విద్యుదాఘాతంలో శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీన్ని తట్టుకోలేని తండ్రి అట్లూరు వెంకయ్య సాయంత్రం రైలు కింద పడి మృతి చెందాడు. ఒకే కుటుంబంలో కొడుకు, తండ్రి మృతి చెందడంతో గ్రామ ప్రజలు, అధికారులు అందోళనకు గురయ్యారు. రెండు మృత దేహాలను పోస్టుమార్టం కోసం తెనాలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం గ్రామస్తులకు అప్పగించారు. రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెనాలి ప్రభుత్వ ఆసుత్రికి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి పోస్టుమార్టం త్వరగా చేయించారు. అనంతరం బేతాలు పురం గ్రామానికి వెళ్లి మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకే కుటుంబంలో కొడుకు, తండ్రి మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్కు పెళ్లి అయి సంవత్సరమే అయిందని, భార్య నిండు గర్భిణితో ఉందని ఆమె చెప్పారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ప్రభుత్వం నిధులతో ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ శాఖ అధికారులు పొలాల్లో కరెంట్ లైన్ల మరమ్మతులపై అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు సుశీల, వీఆర్వోలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
జనవరి 25న విజయవాడలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: జన విజ్ఞాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యంలో జనవరి 25న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించిన జేవీవీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 75 ఏళ్ల మన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, సమాఖ్య విధానాలు మౌలిక అంశాలుగా కలిగివున్నదనీ, అభివృద్ధికర ఉన్నత సమాజ ఏర్పాటుకు మన రాజ్యాంగం ఎంతో కీలకమైనదని అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో విద్యావంతులు, మేధావులు, ఉపాధ్యాయులు, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ ప్రాధాన్యతను, గొప్పతనాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు తెలియజేసి, అవగాహన పెంపొందింపచేయాల్సిన అవసరం ఉందన్నారు. జేవీవీ రాష్ట్ర సలహాదారు డాక్టర్ ఎం.గేయానంద్ మాట్లాడుతూ శాసీ్త్రయ సమాజ ఏర్పాటు లక్ష్యంగా 38 ఏళ్ల క్రితం ఏర్పడిన జేవీవీ మూఢనమ్మకాల నిర్మూలన, శాసీ్త్రయ దృక్పథం పెంపుదల కోసం కృషి చేస్తోందన్నారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ పాఠశాలలు కేంద్రంగా చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందింపచేసేందుకు, సైన్స్ ప్రయోగాలపై ఆసక్తిని రేకెత్తించేందుకు, సృజనాత్మక శక్తులను వెలికి తీసేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు, యురేకా వీడియో ఎక్స్పరిమెంట్ కాంపిటీషన్స్ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని వివరించారు. 2026 ఫిబ్రవరి మాసాన్ని సైన్స్ మాసోత్సవంగా పాటించాలన్నారు. తొలుత విశ్వం, భూమి ఆవిర్భావంపై ప్రత్యేకంగా రూపొందించబడిన జేవీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ యస్కే కాలేషా, సాహెబ్, కుర్రా రామారావు, సీహెచ్ జయప్రకాష్, బి.మాణిక్యం శెట్టి, పి.స్వరూపరెడ్డి, జీఎస్హెచ్పీ వర్మ, దార్ల బుజ్జిబాబు, జి.వెంకట్రావు, జాన్ బాబు, సునీత, దేవేంద్ర పాల్గొన్నారు. -
యోగాతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి
బాపట్ల: యోగాతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఇండియన్ యోగా ఫెడరేషన్, ఏపీ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లెళ్లమూడిఅమ్మవారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన 44వ జాతీయ యోగాసనాల చాంపియన్ షిప్ పోటీలను జిల్లా కలెక్టర్ శనివారం ప్రారంభించారు. యోగాసనాల పోటీల ప్రారంభ సూచికగా జ్యోతి వెలిగించారు. ఈ చాంపియన్ షిప్ పోటీల సందర్భంగా రూపొందించిన సావనీర్ను కలెక్టర్ విడుదల చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన యోగా మన దేశానిదే కావడం మనకు గర్వకారణం అన్నారు. జాతీయస్థాయి పోటీలకు 16 రాష్ట్రాల నుంచి 617 మంది పాల్గొనడం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో బాపట్ల శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, ఏపీ యోగ అసోసియేషన్ చైర్మన్ వై.హరినాథరెడ్డి, ఇండియా యోగ అసోసియేషన్ చైర్మన్ బిజీ పురోహిత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మృణాల్ చక్రవర్తి, కె.కృష్ణదేవరాయలు, అల్లాడి రవికుమార్, కె.గౌడ, విశ్వజనని పరిషత్ చైర్మన్ దినకర్, రామకృష్ణారావు, బీవీఎస్ లక్ష్మి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
● న్యాయం చేయాలని గ్రామస్తుల ఆందోళన ● తట్టుకోలేక తండ్రి మృతి ● బేతాళపురంలో విషాదఛాయలు
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి వేమూరు: విద్యుదాఘాతంలో యువకుడు మృతి చెందిన ఘటన మండంలో బేతాళపురంలో శనివారం చోటుచేసుకుంది. తట్టుకోలేక తండ్రి ఆత్యహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అట్లూరు సునీల్(22) అదే గ్రామానికి చెందిన కోగంటి శ్రీకాంత్ పొలంలో మొక్కజొన్న పంటకు ఎరువులు దింపేందుకు వెళ్లాడు. ఎరువుల ట్రాక్టర్ను 11 కేవీ లైను కింద పార్క్ చేశారు. సునీల్ కొంత మంది కూలీలతో కలసి ఎరువులను ట్రాక్టర్పైకి లోడు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తగలడంతో కింద పడిపోయాడు. అక్కడ పని చేస్తున్న కూలీలు ద్విచక్ర వాహనంపై సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వెళ్తుండగా మధ్యలోనే మృతి చెందాడు. సునీలు కుటుంబానికి న్యాయం చేయాలి సునీల్ మృతి చెందినట్లు తెలుసుకున్న బేతాలుపురం గ్రామస్తులు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దారు కార్యాలయం వద్ద రోడ్డుపై బెఠాయించారు. సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని ఽఅందోళన చేశారు. ట్రాఫిక్ నిలిచిపోయింది. మృతి చెందిన కుటుంబ సభ్యులతో కోగంటి శ్రీకాంత్, విద్యుత్ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం 11 కేవీ లైను తీగలు కిందకి వేలాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొలాల్లో విద్యుత్ లైనులు కిందకి వేలాడుతున్న విద్యుత్ శాఖ అధికారులు పట్టించు కోవడం లేదని రైతులు ఆరోపించారు. వేమూరు: బేతాలుపురానికి చెందిన అట్లూరు వెంకయ్య వ్యవసాయం చేస్తుంటాడు. భార్య ముగ్గురు పిల్లలు. కుమారుడు సునీల్ వ్యవసాయ పనుల్లో చేదొడువాదొడుగా ఉంటున్నాడు. కుమారుడికి పెళ్లి చేశాడు. ప్రస్తుతం కోడలు నిండుగర్భిణి. ఎప్పటి లాగే ఈ రోజు సునీల్ పనులకు వెళ్లి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విషాద వార్త విన్న తండ్రి గుండె తల్లడిల్లిపోయింది. చేతికాడికొచ్చిన బిడ్డను దేవుడు తీసుకెళ్లేపోయాడంటూ రోదిశాడు. భార్యకు ఏవిధంగా సమూదాయించాలని మధనపడ్డాడు. విషాదంలో మునిగిపోయాడు. ఇరుపొరుగు సర్దిచెప్పారు. సాయంత్రానికి తెరుకుంటాడులో అనుకుంటున్న సమయంలో కొడుకు లేని జీవితం ఎందుకని భావించాడు. రైలు కిందపడి తనవుచాలించాడు. శనివారం సాయంత్రం ధర్మపురం వద్ద రేపల్లె నుంచి గుంటూరు రైలు కింద పడి మృతి చెందాడు. -
ఘనంగా వజ్రోత్సవ ప్రతిభా పురస్కార కార్యక్రమం
గుంటూరు ఎడ్యుకేషన్: శ్యామలానగర్లోని శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ వజ్రోత్సవ ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థిని, ఉత్తరప్రదేశ్ గనులశాఖ కార్యదర్శి మాల శ్రీవాత్సవ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృత్తి పరమైన బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ తాను చదివిన పాఠశాలకు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. ప్రత్యేక అతిథులుగా అనిల్ హర్నాథక, ఐపీఎస్ అధికారి అశ్విన్, మద్ది సుదర్శన్ పాణి, విజయ, ఝాన్సీలక్ష్మి, బాలకుటీర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఎన్.మంగాదేవి, సంయుక్త కార్యదర్శి జయశ్రీ , సీఏవో దుర్గా రఘురాం, రావెల సాంబశివరావు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిపై కేసు నమోదు న్యాయవాదిని దూషించిన చల్లా సుబ్బారావు నరసరావుపేట టౌన్: న్యాయవాదిని దూషించిన టీడీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావుపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ ఫిరోజ్ శనివారం తెలిపారు. పట్టణానికి చెందిన న్యాయవాది శ్రీరామినేని ప్రసాద్ తనను అసభ్య పరుష పదజాలంతో దూషించాడని వన్టౌన్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. గొడవపడుతూ తిట్టిన ఫోన్ ఆడియో రికార్డును అందజేశారు. ఇచ్చిన ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ కావడంతో న్యాయాధికారి నుంచి వచ్చిన అనుమతితో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు రాజుపాలెం: ఎరువులను అధిక ధరలకు అమ్మినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు తెలిపారు. మండలంలోని గణపవరంలో గల ఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా స్టాక్ రిజిస్టర్, బిల్లు పుస్తకాలు, స్టాక్ డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని రైతులకు సూచించారు. దుకాణాదారులు ఎరువులు అమ్మినవెంటనే ఈ–పాస్ తప్పని సరిగా చేయాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి పి.వెంకటనర్సయ్య ఉన్నారు. ముగిసిన ‘కొలరిడో – నేషనల్ ఫెస్ట్’ గుంటూరు రూరల్: మండలంలోని చౌడవరం గ్రామంలోగల ఆర్వీఆర్జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న కొలరిడో 2025 నేషనల్ ఫెస్ట్ శనివారంతో ముగిసింది. దేశ నలుమూలల నుంచి వచ్చిన సుమారు 25 వేల మంది విద్యార్థులతో కళాశాల ప్రాంగణం కళకళలాడింది. సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. టెక్నికల్ విభాగంలో వినూత్న, సృజనాత్మక ఆలోచనలతో ఆకట్టుకున్నారు. కోడింగ్ చాలెంజ్లు, ప్రాజెక్ట్ ప్రదర్శనల్లో ప్రతిభ చాటారు. క్రీడా పోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రముఖ హాస్య నటుడు షకలక శంకర్ అందించిన స్క్రిప్ట్ ప్రేక్షకులపై నవ్వుల జల్లు కురిపించింది. అతిథుల చేతుల మీదుగా మొత్తం రూ.5 లక్షల విలువైన నగదు బహుమతులు, మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. యువతలోని సృజనాత్మక ఆలోచనలు, సాంకేతిక నైపుణ్యాలే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని కళాశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యక్షులు జె.మురళీమోహన్, డాక్టర్ ఎం. జగదీష్, కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ ఆర్. గోపాలకృష్ణ, ట్రజరర్ డాక్టర్ కె. కృష్ణప్రసాద్లు మాట్లాడారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ కె. రవీంద్ర, ఏవో డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ శ్రీనివాసరావు, కల్చరల్ కమిటీ ఇన్చార్జి కన్వీనర్ రంగరాయచౌదరి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీ నకరికల్లు: కేసులు పెండింగ్ లేకుండా పరిష్కరించడంతోపాటు ఫిర్యాదుదారులతో స్నేహభావంతో మెలగాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు అన్నారు. నకరికల్లు పోలీస్స్టేషన్ను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి అల్లర్లు, కొట్లాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామాలవారీగా సిబ్బందిని నియమించి సమాచార సేకరణ వేగవంతం చేశామన్నారు. -
జీవన విధానాన్ని తెలిపేది జానపద సాహిత్యం
అద్దంకి రూరల్: పల్లె ప్రజల జీవన విధానాన్ని తెలియజేసేది జానపద సాహిత్యమని ఉబ్బా దేవపాలన అన్నారు. శనివారం స్థానిక కాళికా సమేత కమఠేశ్వరస్వామి దేవస్థాన ఆవరణలో అద్దంకి లెవీ ప్రసాద్ అధ్యక్షతన సృజన సాహిత్య సమావేశం నిర్వహించారు. నిమ్మరాజు నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉబ్బా దేవపాలన జానపద గేయాలు.. వైశిష్ట్యం అనే అంశంపై ప్రసంగించారు. జానపదుల నోళ్లలో నిలిచిన విశిష్ట సాహిత్యం జానపదం అన్నారు. కలుపు పాటలు, ఏతం పాటలు, శ్రమజీవుల పాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసి హృదాయాలను రంజింప చేస్తాయన్నారు. కవి షేక్ మస్తాన్ను దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్.రాఘవరెడ్డి, లక్కరాజు శ్రీనివాసరావు, గాడేపల్లి దివాకరదత్తు, పాలపర్తి జ్యోతిష్మతి, కొల్లా భువనేశ్వరి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి అమరావతి: మండల పరిధిలోని ఉంగుటూరు శివారులోని నెమలికల్లు రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో పాస్టర్ మరణించగా అతడి భార్యకు తీవ్రగాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లేమల్లెకు చెందిన హరనాథ్బాబు(50) పాస్టర్గా పనిచేస్తూ లేమల్లె మండెపూడిలలో చర్చిలు ఏర్పాటు చేసి ప్రార్థనలు చేస్తుంటారు. ఈక్రమంలో ఆదివారం ప్రార్థనలు నిర్వహించటం కోసం శనివారం రాత్రి లేమల్లె గ్రామం నుంచి స్కూటీపై భార్య వెంకటరత్నంతో కలిసి హరనాథ్బాబు మండెపూడికి బయలు దేరారు. ఈక్రమంలో ఉంగుటూరు శివారు నెమలికల్లు రోడ్డులో మిరపకాయల బస్తాలు లోడ్ చేయటానికి ఆపి ఉన్న ట్రాక్టర్ ట్రక్ వెనుక భాగాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. ప్రమాద శబ్ధానికి పొలంలో ఉన్న రైతులు వచ్చి అంబులెన్స్కు సమచారమిచ్చి అమరావతి కమ్యూనిటీ హెల్త్సెంటర్కు తరలించారు. ఈసంఘటనలో పాస్టర్ హరనాథ్బాబు మరణించగా ఆయన భార్య వెంకటరత్నంకు తీవ్ర గాయాలు కాగా మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు హరనాథ్బాబుకు ఇద్దరు వివాహితులైన కుమారులు ఉన్నారు. అమరావతి పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా యూరియా కలిగి ఉంటే చర్యలు
వ్యవసాయశాఖ సంచాలకుడు మనజోర్ జిలాని సమూన్ వేమూరు(చుండూరు): నిబంధనలకు విరుద్ధంగా యూరియా కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ హెచ్చరించారు. చుండూరు మండలంలోని వేటపాలెంలో యూరియా సరఫరాపై శనివారం విచారణ చేపట్టారు. గ్రామంలో మొక్కజొన్న పంటలను రైతులతో కలసి పరిశీలించి ముఖాముఖి చర్చించారు. ఆయన మాట్లాడుతూ యూరియా సమస్యపై రియల్ టైమ్ వాస్తవ పరిస్థితులలో నిజనిర్ధారణ, పరిశీలన కోసం క్షేత్ర స్థాయి ధ్రువీకరణ చేపడుతున్నామని చెప్పారు. డీలర్లు, గోడౌన్లు, రైతు సేవా కేంద్రాలు, క్షేత్ర సఆథయిలో యూరియా నిల్వలు ధరలు విక్రయ విధానాలపై ప్రత్యేక్ష పరిశీలన జరిపి, వాస్తవ పరిస్థితులు ఎప్పడికప్పడు నిర్ధారిస్తు రైతులకు పత్రికల ద్వారా సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. రైతులతో వివిధ వ్యవసాయ అంశాలపై మాట్లాడారు. రబీ సీజనలో సాగు చేసే పంట గురించి ఆరా తీయగా ఎక్కువగా మొక్కజొన్న సాగు చేపట్టడం జరిగిందని రైతులు తెలిపారు. వేటపాలెంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అన్నపూర్ణ పాల్గొన్నారు. -
బలరామావతారంలో వైకుంఠవాసుడు
పెదకూరపాడు:జాతీయస్థాయిలో ఉత్తమ ప్రకృతి రైతు అవార్డును కేంద్ర ప్రభుత్వ విభాగం ఆర్.సి.ఓ.ఎన్.ఎఫ్ నుంచి పెదకూరపాడు గ్రామానికి చెందిన దర్శి శేషారావుకు అందించారు. శనివారం గుంటూరులో ప్రకృతి వ్యవసాయంపై జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో జాతీయ ఉత్తమ రైతు అవార్డును శేషారావుకు అందించారు. ఆర్.సి.ఓ.ఎన్.ఎఫ్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ సింగ్ రాజ్పుత్, ఆ సంస్థ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టరు వి.ప్రవీణ్ కుమార్, ఆర్.వై.ఎస్.ఎస్ మార్కెటింగ్ మేనేజర్ విజయ్, కో–ఆర్డినేటర్ మల్లేశ్వరి, పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పెదకూరపాడు: రోగుల ప్రాణాలు కాపాడాల్సిన 108 అంబులెన్స్ నడిరోడ్డుపై మొరాయించిన ఘటన పల్నాడు జిల్లా పెదకూరపాడులో శనివారం జరిగింది. జలాల్పురం గ్రామానికి చెందిన మరియమ్మకు ఊపిరి అందకపోవటంతో పెదకూరపాడు సీహెచ్సీ నుంచి మెరుగైన వైద్యం కోసం 108 వాహనం ద్వారా గుంటూరు తరలించారు. రోగిని ఆసుపత్రిలో దించి పెదకూరపాడు బయలుదేరిన 108 వాహనం ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో రోగి తరఫు కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ గార్డులతో ముందుకు నెట్టగా ఎట్టకేలకు కదిలింది. అయితే వాహనం పెదకూరపాడు చేరుకునే క్రమంలో పాటిబండ్ల మార్గంలో మరోమారు నిలిచిపోయింది. బ్యాటరీ దిగిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలిసింది. ఇటీవల ప్రభుత్వం 108 వాహనాల రంగులు మార్చి సొబగులు అద్దినప్పటికీ డీజిల్ కారటం, బ్యాటరీలు రీచార్జి కాకపోవడం, సీట్లు చినిగిపోయి అధ్వానంగా మారటం, ఎయిర్ కండిషనర్ సైతం మరమ్మతులకు గురవుతున్నా నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మంగళగిరిటౌన్: ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈనెల 30వ తేదీన మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ అధ్యక్షతన ముక్కోటి ఏకాదశి ఉత్సవ ఏర్పాట్లపై తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర, నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ, పట్టణ సీఐ వీరాస్వామిలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారి దర్శనానికి వాహనాల్లో తరలివచ్చే భక్తులు, వీఐపీల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ వసతి ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తొలిసారిగా స్లాట్ బుకింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. -
ఈవీఎం గోదాములను భద్రంగా ఉంచాలి
గ్రామ, వార్డు సచివాలయాలు భవనాల నిర్మాణం 2026 జనవరి 31నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ మినీ వీసీ హాలులో గ్రామ, వార్డు సచివాలయ భవనాల నిర్మాణ పనులు, ఈకేవైసీ, ఏపీ సేవ పేమెంట్, స్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించి బాల బాలికలు, టీచర్లు పాఠశాలలకు హాజరు, ఎంఈఓలు పాఠశాల తనిఖీ, ఎంబీయూ, మధ్యాహ్నం భోజనం, తల్లికి వందనం, వివిధ అంశాలపై ఎంపీడీఓలు, ఎంఈ ఓ 1– 2లు, గ్రామ, వార్డు సచివాలయాల అధికారుల తో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈకేవైసీ, ఏపీ సేవ పేమెంట్ పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించా రు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నా రు. బాలబాలికలు వంద శాతం పాఠశాలలకు హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను వారానికి రెండు రోజులు తనిఖీ చేయాలన్నారు. తల్లికి వందనం పథకం ఇంకా జిల్లాలో కొందరికి రాలేదని, ఏ కారణం చేత తల్లికి వందనం రాలేదో పరిశీలించి వంద శాతం పూర్తి చేయాలని ఎంఈఓలను ఆదేశించారు. వ్యక్తిగత కారణాలతో పనులు పెండింగ్ పెడితే బాధ్యులపై చర్య లు తీసుకుంటామని తెలిపారు. డీఎల్డీఓ విజయలక్ష్మి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, డిప్యూటీ డీఈఓలు, పీఆర్ ఈఈ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
న్యూఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరి
● రిసార్ట్స్, రెస్టారెంట్లలో పార్టీలకు అనుమతిలేదు ● అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు ● జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ రిసార్ట్స్, రెస్టారెంట్ల యజమానులకు సూచించారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో శనివారం జిల్లాలోని రిసార్ట్స్, రెస్టారెంట్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 60 రిసార్ట్స్, రెస్టారెంట్లు ఉన్నాయని తెలిపారు. లిక్కర్ పార్టీలు నిర్వహించరాదని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లతో కూడిన బోర్డులు యాత్రికులకు కనిపించే విధంగా రిసెప్షన్ వద్ద, డైనింగ్ ప్రదేశాలలో ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. మద్యం తాగి ఎవరు సముద్రంలోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మైనర్లు వచ్చి రిసార్ట్స్, రెస్టారెంట్లలో రూములు కోరితే వారికి ఇవ్వవద్దని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి సంక్రాంతి పండుగ ముగిసే వరకు, ఆ తర్వాత కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి వీలు లేదన్నారు. రిసార్ట్స్, హోటళ్లు, రెస్టారెంట్ల పరిధిలోగానీ, వారు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తులు గానీ ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, చీరాల డీఎస్పీ ఎం.డి.మొయిన్, సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్బీ సీఐ జి.నారాయణ, బాపట్ల రూరల్ స్టేషన్ సీఐ కె.శ్రీనివాసరావు, చీరాల రూరల్ సర్కిల్ సీఐ పి.శేషగిరి, బాపట్ల జిల్లా పరిధిలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్, హోటల్ యజమానులు, నిర్వాహకులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
చీరాల టౌన్: తమ సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్లో అర్జీలు దాఖలు చేసిన ప్రతి అర్జీదారుని సమస్యను పరిష్కరించి న్యాయం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు తెలిపారు. చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల్లోని ప్రజలు పెట్టుకున్న అర్జీలపై శనివారం ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 19 అర్జీలు పూర్తిగా ఆధారాలు, రికార్డులతో విచారించి బాధితులకు న్యాయం చేశారు. మూడు అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయి విచారణలు చేసి వాటికి కూడా పరిష్కారం చూపుతామని ఆర్డీఓ తెలిపారు. ఆర్డీఓ మాట్లాడుతూ చీరాల డివిజన్ పరిధిలో ఉన్న ప్రతి మండలంలో వచ్చిన భూ సమస్యలు, పీజీఆర్ఎస్ అర్జీలను క్షుణ్ణంగా విచారించి అర్జీదారునికి నిర్ణీత సమయంలో సమస్య పరిష్కరించేందుకు ప్రతి మండలంలో ఒకసారి ప్రత్యేక పరిష్కార వేదికను అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి అర్జీ విచారించి అర్జీదారులతో మాట్లాడడంతోపాటుగా ఆన్లైన్లో ప్రతి అర్జీదారుని వివరాలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు నివేదించి పరిష్కారం చేస్తున్నామన్నారు. రెవెన్యూ, ఇతర భూసమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించేందుకే ప్రత్యేక పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్లు కుర్రా గోపికృష్ణ, గీతారాణి, జె.ప్రభాకరరావు, డిప్యూటీ తహసీల్దార్లు, మండలాల సర్వేయర్లు, పంచాయతీల కార్యదర్శులు, వీఆర్వోలు, అర్జీదారులు పాల్గొన్నారు. ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు -
మార్టూరు పంచాయతీ కార్మికుల విధులు బహిష్కరణ
మార్టూరు: స్థానిక గ్రామ పంచాయతీ కార్మికులు శుక్రవారం నుంచి నిరవధికంగా విధుల బహిష్కరణ చేపట్టారు. నలుగు నెలల పెండింగ్ జీతాలు మంజూరు కోరుతూ ఆందోళన బాట పట్టారు. మార్టూరు పంచాయతీ కార్యాలయంలో నిరసన కార్యక్రమంలో కార్మికులు మాట్లాడుతూ.. క్రిస్మస్ పండుగకు ఒక రోజు ముందు వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇచ్చిన మాటపై నిలబడలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టాల్ మెంట్పై బైకులు కొనుగోలు చేసిన 8 మంది వాహనాలు కిస్తీలు చెల్లించలేకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వారు తమ వాహనాలను జప్తు చేసినట్లు కార్మికులు వాపోయారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావును వివరణ కోరగా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వేతనాలు ట్రెజరీకి పంపించామని త్వరలో వారి ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. మార్టూరుకు చెందిన 50 మంది పంచాయతీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. -
వైద్య రంగంలో పీపీపీ విధానమే పెద్ద స్కాం
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్లో నేడు వైద్య రంగాన్ని పీపీపీ విధానంలో కొనసాగించడం అతి పెద్ద స్కాంగా మారబోతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ అనుమానాన్ని వ్యక్తం చేసింది. శుక్రవారం గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహించడం వల్ల ఆ భారం రోగులపై, వైద్య విద్యార్థులపై పడుతుందని చెప్పారు. పీపీపీ విధానంలో నిర్మించే విమానాశ్రయాలు, రహదారులతో వైద్య రంగాన్ని పోల్చకూడదని తెలిపారు. నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలకు రెండు పర్యాయాలు టెండర్ల ప్రక్రియను నిర్వహించినా కేవలం ఒకే ఒక్క బిడ్ రావడానికి ప్రజా వ్యతిరేకతగా భావించి ముఖ్యమంత్రి పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని ఆయన కోరారు. ఉద్యోగాలలో రాజ్యాంగ పరమైన రిజర్వేషన్లను పరోక్షంగా అంత మొందించడానికే సీఎం చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంపై అమిత ప్రేమను కనబరుస్తున్నారని విమర్శించారు. ● శాసనమండలి మాజీ సభ్యుడు, కమిటీ రాష్ట్ర కో– కన్వీనర్ కె.ఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పీపీపీ పద్ధతిలో నిర్వహించ తలపెట్టిన వైద్య కళాశాలలకు ఇప్పటికే అందిస్తున్న భూములు, వసతులు, సిబ్బందికి రెండేళ్ల పాటు వేతనాలు ప్రభుత్వం చెల్లించిందన్నారు.అంతేకాకుండా అదనంగా వయాబిలిటీ గ్యాప్ ఫండ్ పేరుతో అనుయాయులకు లబ్ధి చేకూర్చడం దేశంలో మరెక్కడా లేదని విమర్శించారు. ● జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, కమిటీ కో– కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ దేశంలో అనుమతి పొందిన ఏ ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ యాజమాన్యానికి ఇచ్చిన దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం మూడు సంవత్సరాల కాల వ్యవధిలోనే 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభించిందన్నారు. ఐదింటిని సంపూర్ణంగా పూర్తి చేసి అమలులోకి తెచ్చిందని తెలిపారు. మరో రెండిటిని పూర్తి చేందని చెప్పారు. కూటమి ప్రభుత్వం భూసేకరణ జరిగి నిర్మాణంలో ఉన్న పది ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేసేందుకు 20 సంవత్సరాలు పడుతుందని పేర్కొనడాన్ని అసమర్థతగా పేర్కొన్నారు.లాభాపేక్షతో ధనార్జన కేంద్రాలుగా మారిన బడా వైద్య సంస్థలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్వహణ బాధ్యత అప్పచెప్పడం భావ్యం కాదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో 65 మెడికల్ కళాశాలలో ఉండగా, అందులో 38 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 38 మొత్తం మెడికల్ కళాశాలల్లో ప్రభుత్వ రంగంలో కేవలం 19 మాత్రమే ఉన్నాయని వివరించారు. ● దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకుడు, కమిటీ రాష్ట్ర కో– కన్వీనర్ కొరివి వినయ కుమార్ మాట్లాడుతూ పది ప్రభుత్వ మెడికల్ కళాశాలల విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జనవరి 9న విజయవాడలోని ధర్నా చౌక్ లో జరిగే సామూహిక నిరసన దీక్షను పెద్దఎత్తున నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే అన్ని రాజ కీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, బ హుజన సంఘాలు భాగస్వామ్యులై సామూహిక నిరసన దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ● జన చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిరంతరం నష్టాన్ని, సంక్షోభాన్ని ఎదుర్కొంటు న్న రైతులకు కూడా వయబిలిటీ గ్యాప్ ఫండ్ వర్తింప చేయగలరా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ప్రభుత్వ మెడికల్ పరిరక్షణ కమిటీ జనవరి 9న విజయవాడలో సామూహిక నిరసన దీక్ష -
మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
బాపట్ల మాదక ద్రవ్యాల నియంత్రణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, నియంత్రణపై జిల్లాస్థాయి కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి ఉత్పత్తుల నియంత్రణ, మహిళలపై నేరాల నియంత్రణలో బాపట్ల జిల్లా రాష్ట్రంలోనే ఐదో స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇటీవల రాజధానిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బాపట్ల జిల్లా ఎస్పీని ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్పీని అభినందించారు. మూడో స్థానంలో రావడానికి అధికారులు కృషి చేయాలన్నారు. గుర్తించిన 71 ప్రాంతాలలో చిల్ల చెట్ల తొలగింపు, సీసీ కెమెరాల ఏర్పాటు, వినియోగంలో లేని భవనాలపై నిఘా ఉంచాలన్నారు. ఈగల్ టీం సమర్థంగా పనిచేస్తుందన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణపై పాఠశాలలు, కళాశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. గంజాయి వినియోగించే ప్రాంతాలు గుర్తింపు గంజాయి వంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణపై పటిష్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ తెలిపారు. గంజాయి వినియోగించే 71 ప్రాంతాలను పోలీసులు గుర్తించారన్నారు. ఈగల్ టీం సమర్థంగా పనిచేస్తుందన్నారు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు నియంత్రణపై చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు. గంజాయి ఉత్పత్తులు పూర్తిగా అరికట్టామన్నారు. ఒడిశా ప్రాంతం నుంచి గంజాయి దిగుమతిని అరికట్టామన్నారు. ఆ రాష్ట్రం నుంచి పనులపై జిల్లాకు వచ్చిన కూలీలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అవగాహన కల్పించాలన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవోలు, డీఎస్పీలు, కమిటీలోని ఆయా శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి జిల్లా అభివృద్ధి కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. ఎస్టీలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు, దివ్యాంగుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే వాటికి ఆయన పరిష్కార మార్గం చూపారు. దివ్యాంగులు, ఎస్టీలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు తమ వంతు సహాయం అందించాలని అన్నారు. దివ్యాంగులు, ఎస్టీల హక్కులను గౌరవించాలన్నారు. మనం చేయగలిగినంత మేర సహాయం అందించాలన్నారు. బాపట్ల జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్నన్నప్పటికీ ఆయా శాఖలకు జిల్లా అధికారులు లేకపోవడం బాధాకరమని, దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. రహదారి ప్రమాదాలను పూర్తిస్థాయిలో అరికట్టాలి రహదారుల ప్రమాదాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులు ఆదేశించారు. రహదారుల భద్రతపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. రహదారుల భద్రతా చర్యలు లేకపోతే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రమాదాలు తరచూ నమోదయ్యే ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విరివిగా నిర్వహించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైతే బాధిత కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందో గుర్తించాలన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
ముక్కోటికి మంగళాద్రి ముస్తాబు
మంగళగిరి టౌన్ : ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి గోపురం, ముఖ మండపం, కోనేరులకు చారిత్రక నేపథ్యం ఉంది. నాలుగు వందల ఏళ్ల కిందట ముఖ మండపం, 200 ఏళ్ల కిందట గాలి గోపురం నిర్మించారు. వీటికి తోడు 200 ఏళ్లనాటి దక్షిణావృత బంగారు శంఖం కూడా ఈ ఆలయంలో ఉంది. ఇది ఎంతో విశిష్టమైనది. ఏటా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. దక్షిణావృత బంగారు శంఖంతో లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం చేస్తారు. పట్టణంలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయం వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ మాడ వీధుల్లో బంగారు దక్షిణావృత శంఖు తీర్థం స్వీకరించేందుకు భక్తుల కోసం క్యూలైన్లు నిర్మించారు. ఈనెల 29న జగన్మోహిని అలంకారం, 30న తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామి దేవరుల సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారదర్శనం ద్వారా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ముక్కోటికి ఆన్లైన్ సేవలు ఈనెల 30న వైకుంఠ ఏకాదశి (ముక్కోటి)ని పురస్కరించుకుని స్వామి దర్శనార్థం ఆన్లైన్ సేవలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. టికెట్ పొందదలచిన వారు మొబైల్ ద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఏపీ టెంపుల్స్ యాప్ డౌన్లోడ్ లేదా www. aptemples. org వెబ్సైట్ ద్వారా పొందవచ్చని తెలియజేశారు. ఆన్లైన్ టిక్కెట్లను టైమ్ స్లాట్ ప్రకారం బుక్ చేసుకోవాలని, టికెట్తో పాటు ఆధార్ లేదా పాన్ కార్డ్ ఫొటోస్టాట్ కాపీలను దర్శనానికి వచ్చే సమయంలో వెంట ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు 8500149595ను సంప్రదించాలని కోరారు. -
మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్గా పొన్నెకల్లు యువతి
తాడికొండ: రాజస్థాన్లో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు ఫరెవర్ స్టార్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫేవరేట్ మిస్ టీన్ ఇండియా గ్రాండ్ ఫినాలే పోటీల్లో మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్గా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన పరిటాల దివ్య ఎంపికై ంది. మిస్ టీన్ ఇండియా ఎంపిక పోటీల ప్రక్రియ ఏడాది క్రితమే మొదలై ఆన్లైన్లో అండర్–18 విభాగంలో ఎంపిక కోసం కమిటీ దరఖాస్తులు ఆహ్వానించగా దేశవ్యాప్తంగా 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అత్యంత ప్రతిభావంతులైన వారికి ఆడిషన్లు, గ్రూమింగ్, మూల్యాంకనాలు ఇలా వివిధ దశల్లో వడపోత అనంతరం 101 మందికి రాజస్థాన్లోని జైపూర్లో జాతీయస్థాయి వేదికపై పోటీలు నిర్వహించారు. పోటీలలో వివిధ అంశాలలో తన ప్రతిభ ప్రదర్శించిన పరిటాల దివ్య టైటిల్ హోల్డర్గా నిలిచి ఫేవరెట్ మిస్ టీన్ ఆంధ్రప్రదేశ్గా నిలిచారు. ఆమెకు కిరీటంతో పాటు గుర్తింపు పతకం ఇచ్చి అభినందించారు. దివ్య తండ్రి నరేష్ చైన్నెలోని నిర్మాణంగంలో ఉన్నారు. తమ కుమార్తెకు ఇంత పెద్ద గుర్తింపు రావడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. -
265 మొబైల్ ఫోన్లు అప్పగింత
నగరంపాలెం: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సుమారు రూ.53 లక్షల విలువైన 265 మొబైల్ ఫోన్లను పొగొట్టుకున్న వారికి శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఎస్పీ వకుల్ జిందాల్ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.7.53 కోట్ల విలువైన 3,679 మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించామని చెప్పారు. బాధితుల ఫిర్యాదుల ఆధారం చేసుకుని సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైన వెంటనే పోలీస్ హెల్ప్లైన్ నంబర్ 8688831574 లేదా సీఇఐఆర్ వెబ్సైట్ లేదా జిల్లా సైబర్ సెల్ లేదా దగ్గర్లోని పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు చేయాలని ఆయన సూచించారు. ఐటీ కోర్ సీఐ నిషార్ భాషా, కానిస్టేబుళ్లు శ్రీధర్, మానస, ఇమామ్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కరీముల్లాను జిల్లా ఎస్పీ అభినందించారు. -
ప్రజల కోసం పోరాడే వారిపై పీడీ యాక్టా?
జె.పంగులూరు: నిరంతరం పేదల కోసం పోరాడే రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పీడీ యాక్టు అమలు చేయడం అన్యాయమని, వెంటనే ఆ యాక్టును రద్దు చేసి, విడుదల చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం పంగులూరులో ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో నాయకులు డిమాండ్ చేశారు. సీపీఎం సీనియర్ నాయకుడు నాగబోయిన రంగరావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రైతుల దగ్గర అక్రమంగా భూములు తీసుకోవడాన్ని అప్పలరాజు వ్యతిరేకించి పోరాడుతున్నారన్నారు. ఇది జీర్ణించుకోలేని ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్టు పెట్టి, అరెస్టు చేసి విశాఖపట్నం జైలులో పెట్టారన్నారు. ఈ గ్రామానికి దగ్గరలో అంతకుముందే హటోర్ కంపెనీ వల్ల అక్కడ భూమి, భూగర్భ జలాలు, గాలి విషపూరితమయ్యాయని, వాటి ఫలితంగా అక్కడ ప్రజలు క్యాన్సర్, పక్షవాతం, గుండెపోటు, వంటి వ్యాధులు వచ్చి అల్లాడిపోతున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ రైతులు, ప్రజలు బల్క్ డ్రగ్ పార్కు వద్దని పోరాటం చేస్తున్నారని, ఆ పోరాటంలో ప్రజలకు అండగా రైతు సంఘం నాయకత్వంలో అప్పలరాజు నిలిచాడని రంగారావు తెలిపారు. ఎన్నికల సమయంలో ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేయబోమని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ మరిచిపోయి ఫ్యాక్టరీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మానవ అవయువాలు, మాదకద్రవ్యాలు అమ్మేవారు, గుండాలు, రైతులపై పెట్టే పీడీ యాక్టు ప్రజల కోసం పనిచేసే అప్పలరాజుపై పెట్టడం అన్యాయమన్నారు. రైతుల దగ్గర ఉన్న భూమిని లాక్కొని, వారిని బజార్లు పడేయాలని ప్రయత్నంలో ప్రభుత్వాలున్నాయని, దీన్ని ప్రతి ఒక్కరూ ఖడించాలన్నారు. సుమారు 27 వేల ఎకరాలు వాన్ పిక్ భూమి ఖాళీగా ఉన్న, రైతుల భూములను బలవంతంగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పేదవాళ్లకు భూములు పంచాలని గతంలో పోరాడే వారమని, ఇప్పుడు రైతుల భూములను తీసుకోవద్దంటూ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. విశాఖపట్నంలో ఎకరా 99 పైసలకు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని, ఇందుకేనా ఈ ప్రభుత్వాన్ని గెలిపించిందని రంగారావు ప్రశ్నించారు. పేదలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకం పేరు మార్చి నిధులు తగ్గించి పేదల నోటి దగ్గర కూడు తీస్తున్నారని, మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్లకు అప్పజెబుతున్నారని, పాఠశాలలను కూడా ప్రైవేటు వాళ్లకే అప్పచెబుతారని రంగారావు విమర్శించారు. గంజాయికి వ్యతిరేకంగా పనిచేసిన పెంచలయ్యను నడిరోడ్డుపైన నరికేస్తే ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, పోలీస్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమ నేతలను పీడీ యాక్టు పెట్టి అరెస్ట్ చేయటం అన్యాయమని, తక్షణమే ప్రభుత్వం ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి, కౌలు రైతు సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు రాయిని వినోద్బాబు, అట్లూరి లాజర్ మాట్లాడారు. సమావేశంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పి.ఆదుం సాహెబ్, బాచిన శేషగిరి, రావూరి వెంకటేశ్వర్లు, బాచిన ఆంజనేయులు, అవల హనుమంతరావు, పాలపర్తి రవి, కీర్తిపాటి రామరావు, నూతలపాటి సుబ్బారావు, కొనతం భాస్కరరావు, సుధాకర్ పాల్గొన్నారు. ఇంత దుర్మార్గ పాలన ఎక్కడా లేదు అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్టు వెంటనే రద్దు చేయాలి అఖిల పక్ష సమావేశంలో నాయకుల డిమాండ్ -
భక్తి శ్రద్ధలతో ధనుర్మాస పూజలు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లిలోని వడ్డవల్లి శ్రీరామాలయం, వేంకటేశ్వర స్వామి దేవాలయం, రైల్వేస్టేషన్రోడ్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. వడ్డవల్లిలో శ్రీవారిని అభిషేక అలంకరణ చేపట్టగా రైల్వేస్టేషన్రోడ్లో శ్రీవారిని త్రివిక్రమ అలంకరణ చేపట్టి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్య లో హాజరై స్వామి వారి కృపకు పాత్రులయ్యా రు. వడ్డవల్లిలో మహిళలు పాశురాలు పఠించ గా, రైల్వేస్టేషన్రోడ్లో కోలాట ప్రదర్శన నిర్వహించారు. తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం స్వామివారిని రామావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనమే ‘సారస్’ గుంటూరు వెస్ట్: సారస్–మినీ భారత సాంస్కృతిక, కళా సమ్మేళనంగా నిర్వహించడం జరుగుతుందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ తెలిపారు. సారస్ (సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిస్ట్స్ సొసైటీ) ప్రదర్శనశాల ఏర్పాట్లపై శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలసి సమీక్ష నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ దేశం నలు మూలల నుంచి 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారన్నారు. 250కి పైగా ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ మినీ భారత సమ్మేళనానికి పెద్ద ఎత్తున ప్రచారం జరగాలన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రదర్శనలను తిలకించడమే కాకుండా వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు, హస్త కళలు, చేనేతలు, ఆహార పదార్థాల రుచులను తెలుసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. జాతీయ షూటింగ్లో ముఖేష్కు రజతం గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఢిల్లీలో జరుగుతున్న 68వ జాతీయ షూటింగ్ చాంపియన్షిప్ పోటీ ల్లో శుక్రవారం గుంటూరుకు చెందిన నేలపల్లి ముఖేష్ రజత పతకం సాధించాడని నేలవల్లి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 25మీటర్ల రాపిడ్ ఫైర్ జూనియర్ విభాగంలో ముఖేష్ రజత పతకం గెలుపొందాడన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన సూరజ్ శర్మ బంగారు పతకం గెలువగా హరియాణాకు చెందిన జతిన్ కాంస్య పతకం సాధించాడన్నారు. చాంపియన్షిప్లో సీనియర్ జూనియర్ విభాగాల్లో పోటీపడిన ముఖేష్ రిలేలో 600కు గాను 579 పాయింట్లు సాధించి సీనియర్లో నాలుగో స్థానం జూనియర్లో ప్రథమ స్థానంలో నిలిచాడ న్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరగనున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్ షిప్ జూనియర్ విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, టీం, మిక్స్డ్, 25 మీటర్ల స్పో ట్స్ పిస్టల్, స్టాండర్డ్ పిస్టల్, రాపిడ్ ఫైర్ పిస్టల్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడన్నారు. ముఖేష్ను ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు సలలిత్, కార్యదర్శి రాజ్కుమార్, కేఎల్ యూనివర్సిటీ స్పోట్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ కాకర్ల హరి కిషోర్, పీడీ శ్రీహరి, పూజిత అభినందించారన్నారు. -
విధులకు సచివాలయ ఉద్యోగులు డుమ్మా
చినగంజాం: ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ కూటమి ప్రభుత్వ పాలనలో నిర్వీర్యమవుతోంది. అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది మండలంలోని పల్లెపాలెం గ్రామ సచివాలయం. పల్లెపాలెం గ్రామ సచివాలయం సిబ్బంది కొన్ని రోజులుగా స్థానిక ప్రజలకు అందుబాటులో లేకపోవడం, కనీసం సమాధానం చెప్పేందుకు ఎవరూ ఉండటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది ఉదయం కార్యాలయానికి రావడం ముఖ హాజరు వేయడం, వారిష్టారీతిన బయటకు వెళ్లిపోవడం, సాయంత్రం వేళలో వచ్చి ముఖ హాజరు ముగించడం చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్, పంచాయతీ కార్యదర్శి, వెటర్నరీ లేక ఫిషరీస్ అసిస్టెంట్, గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండేలా గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థను ఏర్పాటు చేసి అందుకు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పల్లెపాలెం గ్రామ సచివాలయంలో కార్యాలయానికి వెళ్లిన గ్రామస్తులకు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. కనీసం ఒక ఉద్యోగి అయినా ప్రజలకు అందుబాటులో లేకపోగా సజావుగా సమాధానం ఇచ్చే పరిస్థితి కరువైంది. గ్రామ ప్రజలు కొందరు ఫోన్ ద్వారా గ్రామ కార్యదర్శిని సంప్రదించగా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ జవాబు రావడంతో చేసేదేమి లేని పరిస్థితుల్లో ఎంపీడీఓ కె.ధనలక్ష్మిని కలసి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంపీడీఓ కె.ధనలక్ష్మిని సంప్రదించి వివరణ కోరగా పల్లెపాలెం సచివాలయంలో సిబ్బంది గత కొద్ది రోజులుగా అందుబాటులో ఉండటం లేదని పనుల కోసం వెళ్లి ఇదేమిటని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఇచ్చే పరిస్థితి లేదని తనకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యాలయంలో అందుబాటులో లేని సిబ్బందికి మెమోలు జారీ చేయనున్నట్లు, ఇకముందు ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
బాపట్ల
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నిల్వ 41.5360 టీఎంసీలు. పశ్చిమ డెల్టాకు నీటి విడుదల దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి శుక్రవారం పశ్చిమ డెల్టాకు 2,120 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. 7ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన బొర్రా వెంకటేశ్వరరావు కుటుంబం రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. -
ధాన్యం రైతుకు తేమ కష్టాలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ధాన్యం రైతులకు తేమ శాతం కష్టాలు తప్పడం లేదు. వారం రోజులు ఆరబెట్టినా రైతు సేవా కేంద్రాల్లో తేమ శాతం 20కి తగ్గకుండా వస్తుందని ఆవేదన చెందుతున్నారు. అదే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తోలితే అక్కడ 25కి తగ్గకుండా ఉంటోంది. దీంతో ధాన్యంలో కోతలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పేరుకు మద్దతు ధరకు ధాన్యం అమ్ముతున్నా.. రైస్ మిల్లులవారు పాయింట్కు కిలోకు తగ్గకుండా ధాన్యం కోత పెడుతున్నారని తెలుస్తోంది. ఈ లెక్కన తేమ శాతం 25 ఉంటే 8 కిలోల ధాన్యాన్ని మిల్లర్లు తగ్గించి కొంటున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి 75 కిలోల బస్తా ధాన్యం ఽమద్దతు ధర రూ.1792 ఉండగా కోత పెట్టిన ధాన్యానికి కిలోకు రూ.24 చొప్పున 17 శాతానికి పైన అదనంగా ఎన్ని కిలోలు తేమ శాతం ఉంటే అంత మొత్తం కోతపెడుతున్నారు. దీంతో పేరుకు మద్దతు ధరకు ధాన్యం అమ్మినా బస్తా ధాన్యానికి రూ.1500ల లోపే వస్తుందని రైతులు చెబుతున్నారు. తేమశాతం మిషన్లలో తేడాలున్నట్లు మొదటినుంచి ఆరోపణలున్నాయి. రైతుసేవాకేంద్రాల్లోని యంత్రాలకు మిల్లుల్లోని యంత్రాలమధ్య తేడాలు చూపిస్తుండడంతో ఆ ఆరోపణలకు బలం చూకూరుతోంది. రైతులనుంచి ధాన్యం కొట్టేసేందుకు మిల్లర్లు తేమశాతం యంత్రాల్లో తేడాలు చూపేలా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అధికారులు మిల్లర్లపై చర్యలు తీసుకొని దీనిని సరిదిద్దాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇబ్బందికరంగా పొగమంచు ఇటీవల కాలంలో పొగమంచు అధికంగా ఉండడంతో ధాన్యం ఆరబెట్టడం రైతులకు కొంత ఇబ్బందిగా మారింది. వారం రోజులపాటు ఆరబెట్టినా ధాన్యం సక్రమంగా ఆరడంలేదు. తేమశాతం అధికంగా చూపిస్తుండడంతో చాలామంది రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇదే అవకాశంగా దళారులు బస్తా ధాన్యం రూ.1400 నుంచి రూ.1450కే కొనుగొలు చేస్తుండడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. మద్దతు ధర లభించే పరిస్థితి లేకపోవడంతో చాలామంది రైతులు ఈ సంవత్సరం కుప్పలు వేస్తున్నారు. వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు, రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, చెరుకుపల్లె, బాపట్ల నియోజకవర్గంలోని పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాల్లో రైతులు అధికంగా కుప్పలు వేసుకుంటున్నారు. ధర పెరిగితే కుప్పలను నూర్పిడి చేసే అవకాశముంది. సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలో లక్ష టన్నుల ధాన్యం కొంటామని ధాన్యం సేకరణ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ధాన్యం సేకరణ లక్ష్యం 2 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకూ 75,839 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా నగరం మండలంలో 11,390 టన్నులు, చెరుకుపల్లిలో 9,418, బాపట్లలో 7,115, కర్లపాలెంలో 6,614, కొల్లూరులో 6,504, అమృతలూరులో 5,983, మార్టూరులో 5,800, పిట్టలవానిపాలెం 4,943, నిజాంపట్నం లో 4,922, భట్టిప్రోలు 4,832, వేమూరు 4,790, రేపల్లెలో 4,259 టన్నుల చొప్పున ధాన్యం సేకరించారు. దాదాపు 22 మండలాల్లో 89,764 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు షెడ్యూల్ ఇవ్వగా శుక్రవారం నాటికి 75,839 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు రైతులకు రూ.172 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.166 కోట్లు ఇచ్చినట్లు డీఎం శ్రీలక్ష్మి తెలిపారు. జిల్లాలో 73 మిల్లుల పరిధిలో ధాన్యం సేకరణకు బ్యాంకు గ్యారంటీలు తీసుకొన్నామని, పండగ నాటికి మరో 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు ఆమె చెప్పారు. మరోవైపు దాదాపు 30 రైస్ మిల్లుల నుంచి ప్రతిరోజూ 29 టన్నుల బియ్యం తీసుకుంటున్నామని, ఈ లెక్కన ధాన్యం నిల్వ ఉంచేందుకు రైస్ మిల్లుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవని డీఎం తెలిపారు. ఈ సీజన్లో ఖచ్చితంగా రైతుల నుంచి రెండు లక్షల టన్నుల ధాన్యం కొంటామన్నారు. తేమశాతం యంత్రాల్లో తేడా లేకుండా సరిదిద్దామని ఆమె తెలిపారు. -
చీరాల మున్సిపల్ కమిషనర్ బదిలీ
చీరాల: చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ బదిలీ అయ్యారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆయన చీరాల మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. 15 నెలల పాటు చీరాలలో కమిషనర్గా పనిచేసిన ఆయన కమిషనర్ల బదిలీల్లో శుక్రవారం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వెయిటింగ్లో ఉన్న డానియేల్ జోసఫ్ను చీరాల మున్సిపల్ కమిషనర్గా నియమించారు. ఆయన కొద్ది రోజుల్లో చీరాల మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
వృద్ధుడి నేత్రదానం
రేపల్లె: మండలంలోని నల్లూరుపాలేనికి చెందిన సుఖవాసి సుబ్బారావు(87) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన నేత్రాలను దానం కుటుంబ సభ్యులు నాగాయలంకకు చెందిన సుదర్శి మానవతా సేవా సంస్థకు సమాచారం అందించారు. దీంతో సంస్థ ప్రతినిధులు విజయవాడ ఎల్వీ కంటి ఆసుపత్రి ప్రతినిధులు ఆధ్వర్యంలో మృతుడు సుబ్బారావు నేత్రాలను శుక్రవారం సేకరించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులు రఘు శేఖర్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటికి 253 మంది వద్ద నేత్రాలను సేకరించి ఇతరులకు నేత్రదానం చేయటం జరిగిందని చెప్పారు. నేత్రదానానికి అంగీకరించి సుబ్బారావు కుమార్తెలు సబ్బినేని ప్రమీలారాణి, సబ్బినేని వెంకటేశ్వరమ్మ, అల్లుడు సబ్బినేని సుబ్బారావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటో ఢీకొని యువకుడు దుర్మరణం మేదరమెట్ల: ఓ వ్యక్తి తన తమ్ముడు వద్దకు వెళ్లి తిరిగి మోటారు బైక్పై వెళుతుండగా ఆటో ఢీకొని దుర్మరణం పాలైన సంఘటన కొరిశపాడు మండల పరిధిలోని రావినూతల–దైవాలరావూరు రోడ్డులో గురువారం రాత్రి జరిగింది. కొరిశపాడు పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. బల్లికురవ మండలం చినమల్లాయపాలెం గ్రామానికి చెందిన తంగిరాల వంశీ (24) మోటారు బైక్పై కొరిశపాడు మండలంలోని కనగాలవారిపాలెంలో తమ్ముడును కలిసి తిరిగి వస్తుండగా బైక్.. రావినూతల శివారులో ఉన్న పెట్రోల్ బంక్ సమీపానికి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీ తలకి, మెడకు, కాలికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. లారీ ఢీకొని టైల్స్ వర్కర్ మృతి రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామ సమీపంలో శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎక్స్్ప్రెస్ హైవేపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా కురిచేడు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన హుస్సేన్(40) మృతి చెందాడు. హుస్సేన్ విప్పర్ల గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ఓ పెట్రోల్ బంకులో టైల్స్ పనికి వచ్చాడు. రాత్రివేళ బంకు సమీపంలో ఉన్న హోటల్కి వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా రొంపిచర్ల వైపు వెళుతున్న లారీ ఢీకొట్టింది. హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య నాగార్జునసాగర్: ఇటీవల భార్య మరణించగా మనస్తాపం చెందిన భర్త చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగార్జునసాగర్ హిల్ కాలనీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల పట్టణానికి చెందిన నల్లమల వెంకటేశ్వర్లు(65) భార్య ఇటీవల మృతి చెందింది. మనస్తాపం చెందిన వెంకటేశ్వర్లు శుక్రవారం మాచర్ల సమీపంలోని కాలువలో దూకి చనిపోవడానికి ప్రయత్నించగా అక్కడే స్నానం చేస్తున్న అయ్యప్ప మాలధారులు కాపాడారు. అక్కడి నుంచి బయలుదేరిన వెంకటేశ్వర్లు హిల్ కాలనీ సమీపంలో చెట్టుకు లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సాగర్ ఎస్ఐ ముత్తయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి నకరికల్లు: ఓ వివాహిత అనుమానాస్పద స్థితితో మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని కుంకలగుంట గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లవి (23)కి బెల్లంకొండ మండలం నందిరాజుపాలెం గ్రామానికి చెందిన బూదాటి జయపాల్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం ఉన్నారు. కొన్నిరోజులుగా భార్య ప్రవర్తన, వేరేవాళ్లతో ఫోన్ మాట్లాడుతోందనే విషయమై దంపతులు గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన పల్లవిని భర్త పుట్టింట్లో వదలిపెట్టి వెళ్లాడు. మనస్తాపానికి గురైన పల్లవి గురువారం ఊపిరి బిగబట్టి స్పృహ కోల్పోగా.. నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.సతీష్ శుక్రవారం తెలిపారు. మోసగించిన స్వర్ణకారుడిపై కేసు యడ్లపాడు: ఆభరణాలు చేయించి ఇస్తానని స్వర్ణకారుడు పలువుర్ని నమ్మించి రూ.కోట్లలో వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన గత మూడు రోజులుగా కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. సదరు కేసుకు సంబంధించి ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో యడ్లపాడు పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. యడ్లపాడు గ్రామానికి చెందిన ఇళ్ళ ఊర్మిళ తాను రూ.3 లక్షల నగదును బంగారం ఆభరణా లకోసం అదే గ్రామానికి చెందిన ఏలూరి కామేశ్వరరావుకు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కామేశ్వరరావు తనతోపాటు మండల వ్యాప్తంగా పలువురు మోసపోయినట్లు ఆరోపించారు. నిందితుడు పలువుర్ని మోసం చేసినట్లు తెలిపిందని ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
విజ్ఞాన్లో పరిశోధన కేంద్రాలు ప్రారంభం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో శాసీ్త్రయ పరిశోధనలకు రెండు అత్యాధునిక పరిశోధనా కేంద్రాల్ని ప్రారంభించినట్లు వైస్ చాన్సలర్ పి. నాగభూషణ్ శుక్రవారం తెలిపారు. నానో సైన్స్, ఎనర్జీ మెటీరియల్స్, సెన్సార్ టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో ‘రామన్ సెన్సర్ సెంటర్’, ‘డాక్టర్ లావు రత్తయ్య సెంటర్ ఫర్ ఎనర్జీ మెటీరియల్స్ (డాక్టర్ లారా–సీఈఎం)’ కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. రామన్ సెన్సర్ సెంటర్ ద్వారా నానో సైన్స్ను సాంకేతిక అనువర్తనాలుగా మార్చే దిశగా విస్తృత పరిశోధనలు సాగనున్నాయని చెప్పారు. లావు రత్తయ్య సెంటర్ ఫర్ ఎనర్జీ మెటీరియల్స్ ద్వారా ఎనర్జీ సంబంధిత పదార్థాలు, పునరుత్పాదక శక్తి వనరులు, బ్యాటరీ టెక్నాలజీ, ఎనర్జీ స్టోరేజ్ మెటీరియల్స్పై లోతైన పరిశోధనలు చేపట్టనున్నట్లు తెలిపారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, చాన్స్లర్ డాక్టర్ పావులూరు సుబ్బారావు, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, పాల్గొన్నారు. -
అనారోగ్యంతో పోలీస్ జాగిలం టైగర్ మృతి
బాపట్ల టౌన్: పోలీస్ శాఖలో విశేషసేవలు అందించిన జాగిలం టైగర్ మృతి చెందడం బాధాకరమని బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. మృతిచెందిన టైగర్కు శుక్రవారం పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు భద్రతా విభాగంలో 2017 సంవత్సరం నుంచి విశేష సేవలు అందించిన పోలీసు స్నిఫర్ జాగిలం ‘టైగర్’ అనారోగ్యంతో మృతి చెందింది. మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎస్పీ వెదుళ్లపల్లి గ్రామంలో డాగ్ కెన్నెల్ భవనంలో ఉంచిన ‘టైగర్’కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖకు ‘టైగర్’ జాగిలం విశేష సేవలు అందించిందన్నారు. స్నిఫర్ విభాగంలో సుమారు మూడేళ్ల పాటు ఎనలేని సేవలు అందించి, అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమన్నారు. వీఐపీ, వీవీఐపీ బందోబస్తుల సమయంలో పేలుడు పదార్థాలను గుర్తించడంలో చురుగ్గా, సమర్థవంతంగా పనిచేసిందన్నారు. ‘టైగర్’ స్నిఫర్ జాతికి చెందిన మగ జాగిలం. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో స్నిఫర్ విభాగంలో శిక్షణ పొందిందన్నారు. 2017 సంవత్సరం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహించగా, 2022లో జిల్లాల విభజన అనంత రం బాపట్ల జిల్లా పోలీస్ శాఖకు కేటాయించబడింది. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బాపనేశ్వర్ 2017 సంవత్సరం నుంచి జాగిలానికి హ్యాండ్లర్గా వ్యవహరించారన్నారు. టైగర్ అందించిన సేవలకుగాను ‘టైగర్’ జాగిలానికి రూ.25 వేల నగదు బహుమతి అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్, డాగ్ హ్యాండ్లర్లు పాల్గొన్నారు. పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు -
పర్యాటకరంగ అభివృద్ధికి కృషి
చీరాల టౌన్: జిల్లాలో తీరప్రాంతం, పర్యాటక రంగంలో వృద్ధి చెందేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. శుక్రవారం చీరాల మండలంలోని వాడరేవు, రామాపురం సముద్ర తీర ప్రాంతాలను, నిర్మాణం ఆగిన రెవెన్యూ అతిథి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. తీరప్రాంతంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉందని పర్యాటకులను విశేషంగా ఆకర్షించే వాడరేవు, రామాపురం గ్రామాల్లో పర్యాటకరంగంలో దూసుకెళ్లేందుకు అనువైన ప్రణాళికలను రచించామన్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2ల ద్వారా సముద్ర తీరప్రాంతాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్లు రూపొందించినట్లు తెలిపారు. వాడరేవు, రామాపురం ప్రాంతాలకు ఆంఽధ్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, జిల్లాలతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు విశేషంగా వస్తున్నారని పర్యాటకుల కోసం అనుకూలమైన వసతులు, ఏర్పాట్లు, ఆహ్లాదకర ప్రదేశాలు తయారు చేయాలన్నారు. అధికారులు సమన్వయంగా పనిచేస్తే పర్యాటకరంగంలో జిల్లా అగ్రభాగాన నిలుపవచ్చన్నారు. అనంతరం తీరప్రాంత గ్రామాల్లోని వసతులు, దెబ్బతిన్న రోడ్డు మార్గాలను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు. చీరాల, బాపట్ల ఆర్డీఓలు తూమాటి చంద్రశేఖర నాయుడు, గ్లోరియా, చీరాల, బాపట్ల తహసీల్దార్లు కె.గోపికృష్ణ, షలీమా, సర్వేయర్ బసవాచారి, ఆర్ఐ శేఖర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పని దొరకడం లేదని..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పట్టపగలు ఓ వ్యక్తి కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన నెల్లూరులోని కనకమహాల్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వడ్డేశ్వరం గ్రామానికి చెందిన 41 సంవత్సరాల వయసున్న అమీర్వలీ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో పనుల కోసం కొద్దిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరక్కపోవడంతో మానసికంగా ఆందోళనకు గురై గురువారం ఉదయం కనకమహాల్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డుపై చిన్న కత్తితో తన మెడ, పొట్ట భాగాల్లో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమీర్వలీని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు. -
ప్రమాద భరితంగా ఘాట్ రోడ్ మార్గం
తెనాలి రూరల్: ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెనాలి శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ మేజర్ కాకుమాను ఉళ్లక్కి వర్థంతి సభ నిర్వహించారు. బోసురోడ్డులోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొని డాక్టర్ ఉళ్లక్కి సేవలను స్మరించుకున్నారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె.శ్యామ్ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో విజయవాడకు చెందిన ప్రభ నర్సింగ్ హోం వైద్యురాలు కోడె ప్రభాదేవికి డాక్టర్ ఉళ్లక్కి స్మారక గోల్డ్ మెడల్ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘ఎంపవరింగ్ హెల్త్ ఇన్ మిడ్ లైఫ్’ అనే అంశంపై డాక్టర్ ప్రభాదేవి ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ కోటేశ్వరప్రసాద్, డాక్టర్ జి.రవిశంకరరావు, డాక్టర్ టి.అఖిలేష్, డాక్టర్ కె.అనిల్ కుమార్, డాక్టర్ జి.నరసింహారావు, డాక్టర్ పి.ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు. తెనాలి టౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనులపండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం స్వామివారిని పరశురామావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
శివైక్యం చెందిన బ్రహ్మయ్య గురూజీ
బాపట్ల: ఆంజనేయస్వామి ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఎందరో ప్రముఖులకు మార్గదర్శి అయిన బ్రహ్మయ్య గురూజీ(79) శివైక్యం చెందారు. బాపట్ల కేంద్రంగా గత 25 సంవత్సరాలుగా హనుమ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులకు, ఆశీర్వాదాలు అందజేస్తూ బ్రహ్మయ్య గురూజీ ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నారు. ఆయన మరణ వార్త తెలుసుకొని పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం ఆయన అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శిష్యులు, బంధువుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. భవిష్యత్తులో బ్రహ్మయ్య గురూజీ స్మృతి వనం ఏర్పాటు చేసి, గడిచిన 25 సంవత్సరాలుగా ఆయన ప్రజలకు అందించిన ఆధ్యాత్మిక పరిమళాలను కొనసాగించేలా కార్యక్రమాల రూపకల్పన చేసేందుకు శిష్యులు సిద్ధమవుతున్నారు. అంతిమయాత్రలో ఆడిటర్ పుప్పాల చిన్న సాయిబాబు, బొమ్మిశెట్టి వెంకటరత్న గుప్తా, కొత్తమాసు సత్యనారాయణ, న్యాయవాది అలపర్తి నాగేశ్వరరావు, అలపర్తి శ్రీనివాసరావు, సామాజికవేత్త చింతకాయల పార్థసారథి, పెదమల్లు ఉదయ్ చందర్రావు, మూర్తి, పలువురు ఆధ్యాత్మికవేత్తలు పాల్గొని నివాళులర్పించారు. -
వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రత్తిపాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన హైవేపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం పదహారవ నంబరు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వయస్సు సుమారు 30– 35 మధ్య ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు 86888 31386, 91548 76312 నంబర్లకు సమాచారం అందించాలని ప్రత్తిపాడు ఎస్ఐ కె.నరహరి తెలిపారు. -
సహకార ఆందోళన ఉధృతం
రొంపిచర్ల: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ 20 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ నుంచి స్పందన కరువైంది. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్లు ఐక్యంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. 6వ తేదీన ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డీసీసీబీ బ్రాంచీల ఎదుట ధర్నా నిర్వహించారు. 16వ తేదీన అన్ని జిల్లాల సహకార శాఖ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. 22వ తేదీన 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ఎదుట ధర్నాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆరు దశల్లో ఆందోళన చేపట్టాలని నిర్ణయించగా, ఇప్పటికే నాలుగు దశల ఆందోళన కార్యక్రమాలు పూర్తయ్యాయి. మిగిలిన ఆందోళన కార్యక్రమాలను ఈనెల 29వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి 5వ తేదీన విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు జేఏసీ ప్రకటించింది. నిరవధిక దీక్షలకు సిద్ధం వేతనాలు తదితర ప్రయోజనాలను డీఎల్ఎస్ఎఫ్ ద్వారా చెల్లించాలని 12 డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించే వరకు ఆందోళనలను విరమించబోమని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకు కూడా సిద్ధమని హెచ్చరిస్తున్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వెన్నెముకగా నిలిచిన సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉంది. ఈ నెల 29వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో తలపెట్టిన మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలిరానున్నారు. ఈ పరిస్థితుల్లో సహకార ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి పరిస్థితి నెలకొంది. 20 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన స్పందన లేని ప్రభుత్వం ఆగ్రహంలో జేఏసీ నాయకులు మహాధర్నాకు సిద్ధమంటున్న జేఏసీ -
కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం ఉత్తిదే
గుంటూరు మెడికల్: పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు ప్రభుత్వ వైద్యాధికారులు, ఆస్పత్రుల నిర్వాహాకులు తూట్లు పొడుస్తున్నారు. పేదలకు ఉచితంగా వైద్యం అందించకుండానే అందించినట్లుగా ఆస్పత్రుల యజమానులు తప్పుడు రికార్డులు చూపెడుతూ పేదల ఉసురు పోసుకుంటున్నారు. వారి తప్పుడు పనులకు ప్రభుత్వ వైద్యాధికారులు అందినంత పుచ్చుకుని వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ పెన్షనర్స్కు, వారి కుటుంబ సభ్యులకు, ఎంఎల్ఏలకు, మాజీ ఎంఎల్ఏలకు, ఇతర సిబ్బందికి వైద్య సేవలందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు, రిఫరల్ ఆస్పత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. సదరు సర్టిఫికెట్ను పొందాలంటే ‘ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రీటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్, 1972’ను తప్పనిసరిగా పాటించాలి. జిల్లాలో ఉన్న కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఈ నిబంధనలు అమలు కావటం లేదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిబంధనలు ఇవీ.... తెల్ల రేషన్కార్డు ఉన్నవారు, దారద్య్రరేఖకు దిగువున ఉన్న వ్యక్తులకు ఉచితంగా ప్రభుత్వ గుర్తింపు ఉన్న కార్పొరేట్, సూపర్స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించాలి. ఆస్పత్రిలో ఉన్న పడకల్లో ఐదుశాతం ఈ పేదల కోసం కేటాయించి అన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి ఉచిత వైద్య సేవలను ఇవ్వాలి. అవసరమైతే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయాలి. ఓపీ సేవలు, వార్డు సేవలు కూడా ఉచితంగా అందించాలి. అంతేకాకుండా రెండు గ్రామాలను దత్తత తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి నెలా ఒక ఉచిత వైద్యశిబిరం సదరు గ్రామంలో ఏర్పాటుచేయాలి. విద్యార్థులకు సైతం ఉచిత వైద్యం... కేవలం పెద్దవాళ్ళకే కాకుండా విద్యార్థులకు కూడా ఉచిత వైద్య సేవలను అందించాల్సి ఉంది. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు , ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, బీసీ వెల్ఫేర్ స్కూల్, ఎస్టీ హాస్టల్స్, ఎస్టీ ఆశ్రమ్ స్కూల్స్ విద్యార్థులకు, మాబడి స్కూల్స్ విద్యార్థులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలి. వీరితో పాటు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్, జిల్లా రిఫరల్ కమిటీ, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ,ఇతర ప్రభుత్వ అధికారులు రిఫర్ చేసే విద్యార్థులకు కూడా గుర్తింపు ఉన్న ఆస్పత్రులు ఉచితంగా సేవలందించాలి. కానీ జిల్లాలో రెన్యూవల్ అయిన ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్ వైద్యుల మొక్కుబడి తనిఖీలు ప్రైవేటు ఆసుపత్రుల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారో లేదో తనిఖీ చేసేందుకు విజయవాడకు చెందిన డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులను ముఖ్యంగా గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన సీనియర్ వైద్యులను నియమిస్తుంది. తనిఖీ కోసం వెళ్లే వైద్యులకు, వైద్యాధికారులకు సదరు ఆస్పత్రి నిర్వాహాకులే కారు ఏర్పాటుచేసి, మధ్యాహ్నం స్టార్ హోటల్స్లో విందు ఏర్పాటుచేసి, తిరిగి వచ్చే సమయంలో భారీగానే తాయిలాలు ఇస్తున్నట్లు పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. తప్పనిసరిగా తనిఖీలు చేయాలి ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు జిల్లాలో సుమారు 80 వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో ప్రతి నెలా ఎంత మంది రోగులకు చట్ట ప్రకారం ఉచిత వైద్య సేవలను అందించారో పూర్తి వివరాలతో నివేదిక పంపించాల్సి ఉంది. అయితే కొన్ని ఆస్పత్రుల్లో తనిఖీల ఊసే లేదు. గతంలో విజిలెన్స్ అధికారులు కూడా ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలను అందించటం లేదనే విషయాన్ని నిర్ధారించారు. ఉచిత వైద్యం రికార్డులకే పరిమితం పేదల ఉచిత సేవలకు మంగళం సేవలను అందించకుండానే అనుమతులు నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఆస్పత్రుల నిర్వాహకులు -
రంగం సిద్ధం
ఓఆర్ఆర్ భూ సేకరణకు గుంటూరు జిల్లాలో 67.15 కిలోమీటర్లు.. ● పల్నాడు జిల్లాలో 17 కిలోమీటర్లు... ● 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ... ● ఈ వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్న జేసీ ● నందివెలుగు నుంచి కాజ వరకు 17.5 కిలోమీటర్ల లింక్ రోడ్డు ● జాతీయ రహదారితో అనుసంధానం.... సాక్షి ప్రతినిధి, గుంటూరు: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు భూ సేకరణకోసం అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గుంటూరు, పల్నాడు జిల్లాలలో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం ఓఆర్ఆర్ ఐదు జిల్లాలు, 23 మండలాలు, 97 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. 189.90 కిలోమీటర్ల మేర పరిధిలో ఓఆర్ఆర్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలో 67.15 కిలోమీటర్లు, పల్నాడులో 17 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా తప్ప మిగిలిన నాలుగు జిల్లాలకు గెజిట్ను ప్రచురించింది. గుంటూరు జిల్లాకు ఆదివారం కేంద్రం గెజిట్ను ప్రకటించిది. పల్నాడు జిల్లాకు ఈ నెల ఏడున గెజిట్ వచ్చింది. గుంటూరు జిల్లాలో త్వరలో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో 21 రోజులు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. దీంతోపాటు తెనాలి మండలం నందివెలుగు గ్రామం నుంచి జాతీయ రహదారి కాజ గ్రామం వరకు లింక్ రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ● అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఐదు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల గుండా వెళ్లనుంది. గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలోని కాజ, చిన కాకాని గ్రామాలు, గుంటూరు నగరంలోని బుడంపాడు, ఏటుకూరు, పాతూరు, అంకిరెడ్డిపాలెం, మేడికొండూరు మండలం సిరిపురం, వరగాని, వెలవర్తిపాడు, మేడికొండూరు, డోకిపర్రు, విశదల, పేరేచర్ల, మందపాడు, మంగళగిరిపాడు, తాడికొండ మండలం పాములపాడు, రావెల, దుగ్గిరాల మండలం చిలువూరు, గొడవర్రు, ఈమని, చింతలపూడి, పెనుమూలి, కంఠంరాజు కొండూరు, పెదకాకాని మండలం నంబూరు, అనుమర్లపూడి, దేవరాయబొట్లపాలెం, తెనాలి మండలం కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కఠెవరం, సంగం జాగర్లమూడి, కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, దంతలూరు, కుంచవరం, అత్తోట, చేబ్రోలు మండలం నారా కోడూరు, వేజెండ్ల, శుద్దపల్లి, చేకూరు, వట్టిచెరుకూరు మండలం కొర్నేపాడు, అనంతవరప్పాడు, చమళ్లమూడి, కుర్నూతల గ్రామాల మీదుగా వెళ్లనుంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం ముస్సాపురం, పాటిబండ్ల, తాళ్లూరు, లింగంగుంట్ల, జలాల్పురం, కంభంపాడు, కాశీపాడు, అమరావతి మండలం ధరణికోట, లింగాపురం, దిడుగు, నెమలికల్లు గ్రామాల మీదుగా వెళ్తుంది. పల్నాడు జిల్లాకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇప్పటికే ఆయా సర్వే నెంబర్లను ప్రకటించారు. ఈ సర్వే నెంబర్లలో క్రయవిక్రయాలు నిలిపివేయనున్నారు. సర్వే నెంబర్లలో రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ చేస్తారు. అన్నీ పరిశీలించిన తర్వాతే కేంద్రం 3–డి నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ మొదలు కావడంతో ఓఆర్ఆర్ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. -
దూసుకొచ్చిన మృత్యువు
వినుకొండ: పండుగ వేళ వినుకొండ పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. అతివేగంగా దూసుకొచ్చిన ఒక మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒక బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామానికి చెందిన గుంజి శ్రీను, భార్య శ్రీదేవి కుమారులు శ్రీకాంత్, శ్రీహరిలు కలిసి గుంటూరు జిల్లా తెనాలిలోని ఒక శుభకార్యానికి హాజరై తిరిగి ఇంటికి వెళు తుండగా ఈ ప్రమాదం జరిగింది. వినుకొండ పట్టణంలోని చెక్పోస్ట్ సెంటర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బాలుడు గుంజి శ్రీహరి (14) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బాలుడు స్థానిక మారెళ్ల జెడ్పీహెచ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మినీ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నా రు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాంబాబు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరు కున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కొత్తా అంకారావును స్థానికులు విద్యుత్ స్తంభానికి కట్టివేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడపి బాలుడి మృతికి కారణమైన డ్రైవర్ ఉదయం ఐదు గంటల నుంచే ప్రమాద స్థలం సమీపంలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లో ఫూటుగా మద్యం తాగి రోడ్డుపై వాహనాలను ఢీకొట్టాడు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన మినీ లారీ మద్యం మత్తులో లారీ డ్రైవర్ ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి -
క్రిస్మస్ ప్రార్థనల్లో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి
ప్రత్తిపాడు: పెదనందిపాడులోని ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చిలో గురువారం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఫాదర్లు ప్రార్థనల అనంతరం క్రీస్తు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా లావు నాగేశ్వరావు సంఘ పెద్దలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ అంటే ప్రేమ, కరుణకు ప్రతీక అని చెప్పారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా బాల ఏసు తిరునాళ్ల
● ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శం ● విచారణ గురువు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ అచ్చంపేట: క్రిస్మస్ వేడుకలలో భాగంగా మండలంలోని తాళ్లచెరువులోని బాల ఏసు దేవాలయంలో తిరువాళ్ల మహోత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు మందిరానికి తరలి వచ్చి, కొవ్వొత్తులు సమర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విద్యుత్ దీప కాంతులతో చర్చి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. గుంటూరు రోమన్ క్యాథలిక్ మిషన్ పీఠాధిపతి చిన్నాబత్తిన భాగ్యయ్య దివ్యపూజా బలి నిర్వహించారు. క్రీస్తు సందేశాన్ని బోధించారు. క్రిస్మస్ అనగా దేవుడైన క్రీస్తు మానవరూపుడై భువికి అరుదెంచిన వేళ అన్నారు. అందిరిపై క్రీస్తు దీవెనలు మెండుగా ఉండాలని ప్రార్థించారు. లోకరక్షకుడైన ఏసు క్రీస్తు పాపులను రక్షించుటకు భూమిపై అవతరించారని చెప్పారు. ఎదుటి వారి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని బోధించారు. పొరుగు వారిని ప్రేమించాలని, ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలని ప్రబోధించారు. విచారణ గురువులు తుమ్మా మర్రెడ్డి, రెవ. ఫాదర్ తుమ్మా కరుణాకరరెడ్డి, రెవ. ఫాదర్ పవన్, రెవ. ఫాదర్ రేపూడి రాయప్ప, రెవ ఫాదర్ థామస్ బైబిల్ పఠనం చేశారు. 64 మంది కన్య సీ్త్రలు ప్రార్థనలో పాల్గొన్నారు. క్రైస్తవ గీతాలు ఆలపించారు. ప్రత్యేక బృందాలచే కోలాటం ప్రదర్శన చేశారు. గ్రామ సృష్టికర్త అరళానందస్వామి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి దేవాలయ సమీపంలో అన్నదానం నిర్వహించారు. బాలఏసు స్వరూపంతో అలంకరించిన తేరు ప్రదక్షిణ మహోత్సవం కనుల పండువలా జరిగింది. తాళ్లచెరువు గ్రామవీధులలో మేళతాళాలు, బాణసంచాలతో తేరు ఉరేగింపు ఆకట్టుకుంది. పలు గ్రామాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. క్రీస్తుకు కొవ్వొత్తులు సమర్పించుకున్నారు. రైతులు తమ వ్యవసాయ సామగ్రిని చర్చి చుట్టూ తిప్పి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా చర్చి ముందు స్టాల్స్, రంగుల రాట్నాలు, చెరుకు గడల విక్రయాలు ఏర్పాటయ్యాయి. మండలంలోని పలు గ్రామాలలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అచ్చంపేట, మాదిపాడు, తాడువాయి, చెరుకుంపాలెం, కోనూరు, గ్రంథసిరి, వేల్పూరు, చింతపల్లి, చిగురుపాడు తదితర గ్రామాలలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సాగరమాత ఆలయంలో ఘనంగా క్రిస్మస్ విజయపురి సౌత్: స్థానిక ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగరమాత దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ విచారణ గురువు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువుల పాక నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా జోసఫ్ బాలసాగర్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయం అన్నారు. మానవుడిగా మన మధ్య జన్మించిన రోజే క్రిస్మస్ పర్వదినమని, ఆయన సందేశాలను సమస్త మానవాళి ఆచరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు అనిల్, కిరణ్, సిస్టర్స్, భక్తులు పాల్గొన్నారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025క్రీస్తు జననం..లోకానికి పర్వదినం ఏసు క్రీస్తు జన్మదినాన్ని విశ్వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రిస్మస్ను పురస్కరించుకుని బుధవారం అర్ధరాత్రి నుంచి బాపట్ల జిల్లాలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురువారం ఉదయం విశ్వాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో చర్చిల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మత పెద్దలు సందేశం వినిపించారు. చీరాలలోని 100 సంవత్సరాల చరిత్ర గల సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పెద్దఎత్తున క్రైస్తవులు పాల్గొన్నారు. –సాక్షి నెట్వర్క్కారంచేడులో ఏసుక్రీస్తు జననం గురించి వివరించే సెట్టింగ్ చీరాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులు బాపట్ల సీబీజడ్ చర్చిలో సందేశం వినిపిస్తున్న పాస్టర్ రెవ.పవిత్రకుమార్ రేపల్లె ఏఈఎల్సీ చర్చిలో క్రీస్తు సందేశాన్ని అందిస్తున్న పాస్టర్ మాణిక్యారావు బాపట్ల ప్రార్థనలో పాల్గొన్న మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విశ్వాసులు 7విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 566.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 51,426 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో హుండీల కానుకల లెక్కింపు శుక్రవారం జరుగుతుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లిలోని ఆర్సీఎం చర్చి ఆధ్వర్యంలో గురువారం రాత్రి మేరిమాత గ్రామోత్సవం నిర్వహించారు. విచారణ గురువు దాసయ్య ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. -
రోడ్డుపైనే సీఐ, ఏఎస్ఐ కొట్లాట.. ఎస్పీ సీరియస్
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రోడ్డుపైనే ఏఎస్ఐ, సీఐ ఘర్షణ పడిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. చీరాల రూరల్ ఏఎస్ఐ రవికుమార్ బుధవారం అర్ధరాత్రి చీరాల చర్చి సెంటర్లో కారు పార్కు చేశారు. అక్కడ ట్రాఫిక్కు అంతరాయంగా ఉన్న ఆ కారును పక్కకు తీయాలని స్థానిక పోలీసులు చెప్పారు.దీంతో ఏఎస్ఐ ఆగ్రహిస్తూ..తనకారునే తీయమంటారా అంటూ వారిపై చిందులు తొక్కాడు. పోలీసులకు, ఏఎస్ఐకి మధ్య మాటామాటా పెరగడంతో అక్కడకు వన్టౌన్ సీఐ సుబ్బారావు వచ్చారు. అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్లిపోవాలని ఏఎస్ఐని ఆదేశించారు. దీంతో మరింతగా ఆగ్రహించిన ఏఎస్ఐ..సీఐతో వాగ్వాదానికి దిగాడు. ఏఎస్ఐని అక్కడినుంచి పంపించేయాలని పోలీసులకు సీఐ చెప్పి వెళ్తుండగా అతడిని ఏఎస్ఐ వెంబడించి దూషించాడు.ఓ దశలో సీఐ వైపు ఏఎస్ఐ దూసుకురావడంతో ఇరువురూ కలియబడ్డారు. దీంతో పోలీసులు ఏఎస్ఐకు నాలుగు దెబ్బలు వేసి స్టేషన్కు లాక్కెళ్లారు. ఈ గొడవనంతా స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏఎస్ఐ ప్రవర్తనే గొడవకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు వన్టౌన్ సీఐ ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఏఎస్ఐను వీఆర్కు పంపించి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు. -
హత్య కేసును ఛేదించిన పోలీసులు
తాడేపల్లి రూరల్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అంజిరెడ్డి కాలనీ నుంచి కొలనుకొండ బైపాస్కు వెళ్లే రహదారిలో జరిగిన హత్య కేసును తాడేపల్లి పోలీసులు ఛేదించారు. ఇద్దరిని అరెస్ట్ చేసి బుధవారం కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. ఈనెల 2న అరటితోటలో మృతదేహం ఉందని సమాచారం రావడంతో సీఐ వీరేంద్ర సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి హత్యగా నిర్ధారించారు. మృతుడిని బ్రహ్మానందపురంలో నివాసించే ఇళ్లచెరువు వెంకటరావు అలియాస్ వెంకట్ (32)గా గుర్తించారు. విషయం తెలుసుకున్న అతడి తండ్రి వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి వచ్చి, తమ అబ్బాయిని హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు సీఐ వీరేంద్ర కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి, టెక్నికల్గా కొన్ని ఆధారాలు సేకరించారు. అంజిరెడ్డి కాలనీకి చెందిన మల్లినేని సాయిభవాని, వేమూరు మహేష్ను అదుపులోకి తీసుకుని విచారించగా, వారే హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మహిళతో సంబంధం మృతి చెందిన వెంకటరావు అంజిరెడ్డి కాలనీలో గతంలో నివసించే వాడు. అక్కడి నుంచి బ్రహ్మానందపురంలో ఇల్లు నిర్మించుకుని వెళ్లాడు. అతడికి అంజిరెడ్డి కాలనీలో వేరే మహిళతో సంబంధం ఉండడంతో అక్కడకు వచ్చి వెళ్లే సమయంలో సాయిభవాని, మహేష్లతో గొడవ పడేవాడు. ఇది మనసులో పెట్టుకుని ఈనెల 20న అంజిరెడ్డి కాలనీ, మదర్ థెరిస్సా కాలనీ మధ్యలో ఉన్న రోడ్డులో కాపుకాసి బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. కేసును ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన సీఐ వీరేంద్రను, ఎస్ఐ ఖాజావలిని, సిబ్బంది ప్రదీప్ను ఆయన అభినందించారు. హత్య జరిగింది ఇలా... బ్రహ్మానందపురంలో నివాసముండే వెంకటరావు ఈనెల 20న అంజిరెడ్డి కాలనీలోని ప్రియురాలి దగ్గర నుంచి రాత్రి 12 గంటల సమయంలో ఆటోలో ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో సాయి భవాని పుట్టినరోజు సందర్భంగా మహేష్, వారి చిన్ననాటి స్నేహితులు మరో ఐదుగురు మద్యం పార్టీని నడిరోడ్డులో జరుపుకుంటున్నారు. వెంకటరావు వారి వద్దకు వెళ్లి అడ్డు తప్పుకోవాలని కోరాడు. దీనికి సాయి భవాని, మహేష్లు ‘‘నీ కోసం ఎప్పటినుంచో చూస్తున్నామురా! ’’ అంటూ ఆటోలో కూర్చుని ఉన్న వెంకటరావును కొట్టి కిందికి దించారు. అక్కడ ఉన్న మిగిలిన ఐదుగురు పారిపోయారు. ఆ సమయంలో వెంకటరావును విచక్షణా రహితంగా రాళ్లతో కొట్టడం వారు గమనించారు. అదే రాత్రి ఐదుగురిలో ఒక వ్యక్తి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఏదో ఫేక్ కాల్ అని భావించి వదిలివేశారు. ఉదయం అంజిరెడ్డి కాలనీలో హత్య జరిగిందని తెలియడంతో సదరు యువకుడ్ని విచారించగా ఉదంతం బయట పడింది. అతిగా మద్యం తాగిన మత్తులో విచక్షణా రహితంగా వెంకటరావును మద్యం బాటిళ్లతో, రాళ్లతో కొట్టడంతో రోడ్డుపై మృతి చెందాడు. అనంతరం ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి పక్కనే ఉన్న అరటితోటలో పడవేశారు. -
27న కేఎల్యూ స్నాతకోత్సవం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 15వ స్నాతకోత్సవం ఈనెల 27 వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి.పార్థసారథివర్మ తెలిపారు. విజయవాడ గవర్నర్పేట మ్యూజియం రోడ్డులోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 184 మంది పీహెచ్డీ, 700 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేషన్, 4500 మందికి పైగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వీరిలో 340 ఎంబీఏ, 105 ఎం.టెక్, 40 మంది లా కోర్సులు, 3200 మంది బీ.టెక్, 12 మంది ఆర్కిటెక్చర్, 48 మంది బీ.ఫార్మ్, 330 మంది బీసీఏ, 325 మంది బీబీఏ, 37 మంది బీకామ్, 18 మంది బీఎస్సీ (వీసీ), 25 మంది బీఏ, 180 మంది బీఎస్సీ అగ్రికల్చర్, 14 మంది ఎం.ఫార్మసీ, 32 మంది ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ), 220 మంది ఎంసీఏ డిగ్రీ వారు ఉన్నారని వివరించారు. ఈ డిగ్రీలను విద్యార్థులకు ప్రత్యక్షంగా ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. గత విద్యా సంవత్సరంలో అత్యంత ప్రతిభ కనబరచిన 44 మంది విద్యార్థులకు బంగారు, 40 మందికి రజత పతకాలను, నగదు బహుమతులను అందించనున్నట్లు చెప్పారు. స్నాతకోత్సవ కార్యక్రమానికి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్ వినోద్ కె. సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారన్నారు. టాటా మెమోరియల్ సెంటర్, ముంబై ఎండీ, ఐఏపీ పీడియాట్రిక్ హీమాటో–ఆంకాలజీ విభాగ చైర్పర్సన్ ప్రొఫెసర్ శ్రీపాద్ బనవల్లి గౌరవ అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యక్రమ సంధాన కర్త వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. డిగ్రీలు తీసుకునే విద్యార్థులందరికీ ఇప్పటికే సమాచారం అందించామని, 27 వ తేదీ ఉదయం 9 గంటలకు యూనివర్సిటీ వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. కార్యక్రమానికి డాక్టర్ కె.సుబ్రమణ్యం, డాక్టర్ కె.రామకృష్ణ ప్రధాన కన్వీనర్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ ప్రో చాన్సలర్ డాక్టర్ కేఎస్ జగన్నాధరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారులు హక్కులతో పాటు బాధ్యతలను నెరవేర్చాలి
గుంటూరు ఎడ్యుకేషన్: వినియోగదారులు హక్కులతో పాటు బాధ్యతలను సైతం నెరవేర్చాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సైన్స్ అధికారి షేక్ గౌసుల్మీరా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోఉన్న తరుణంలో నకిలీ వస్తువుల జాడ్యం మార్కెట్లను పట్టి పీడిస్తోందని అన్నారు. దీనిని అధిగమించేందుకు వినియోగదారుల సమాచార కేంద్రం ద్వారా కేసులు వేసి పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. – మరో అతిథి జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు, జిల్లా జడ్జి కె.విజయలక్ష్మి మాట్లాడుతూ వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాలని, వీలైనంత వరకు ఐఎస్ఐ, హాల్మార్క్ చిహ్నాలు కలిగిన వస్తువులను కొనుగోలు చేయాలని సూచించారు. – అనంతరం విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాసరచనలో తెలుగు, ఇంగ్లిషు మీడియం వారీగా గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థిని భవిత, నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కృష్ణతులసి, ఎలక్యూషన్లో మంగళగిరి మున్సిపల్ హైస్కూల్ విద్యార్థిని కనకపుట్లమ్మ, నారాకోడూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని సాక్షి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి కోమల పద్మ, ఎంఈవోలు అబ్దుల్ ఖుద్దూస్, హవీలా, నాగేంద్రమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు
బొల్లాపల్లి: నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంత రావు బుధవారం బండ్లమోటు పోలీస్ స్టేషన్ను సందర్శించారు. అక్కడి రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతలు, నేరాల దర్యాప్తు గురించి సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ... పలు జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న పికిలి చంటిని బండ్లమోటు స్టేషన్ పరిధిలో అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడి నుంచి రూ. 10 లక్షల విలువైన 19 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితుడిపై పలు చోట్ల 43 కేసులు నమోదయ్యాయని తెలిపారు. బండ్లమోటు స్టేషన్ పరిధిలో మరో 19 కేసులు నమోదు చేశామన్నారు. బైకుల యజమానులు స్థానిక ఎస్సైని సంప్రదించాలని సూచించారు. సమావేశంలో వినుకొండ రూరల్ సీఐ బి. బ్రహ్మయ్య, బండ్లమోటు ఎస్ఐ సయ్యద్ సమీర్ బాషా, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ఎదురు దెబ్బ
బాపట్లగురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఇటుక పరిశ్రమకు ఉపాధి కరువు... తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.900, గరిష్ట ధర రూ.1400, మోడల్ ధర రూ.1100 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 41.6347 టీఎంసీలు.జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు రేపల్లె: సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు అన్నారు. వార్షిక తనిఖీలలో భాగంగా బుధవారం రేపల్లె పట్టణ, రూరల్ సర్కిల్ కార్యాలయాలను, డీఎస్పీ కార్యాలయాలను సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలలో, సెల్ఫోన్లలో వచ్చే లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాల న్నారు. ఈ లింకులను కదిపితే తమ బ్యాంకు ఖాతాలలో నగదుపై ఆశలు వదులుకోవాలన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా గిఫ్ట్ బాక్స్ల పేరు తో, ఏపీకే యాప్ పేరుతో వచ్చే మెసేజ్లను వెంటనే తొలగించాలన్నారు. ఆయా యాప్లను వినియోగిస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తుందని చెప్పారు. సైబర్ నేరాలకు గురైన వారు 1930 నంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. తొలుత ఓల్డ్టౌన్లో సైబర్ నేరాలపై ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు, పట్టణ, రూరల్ సీఐలు మల్లికార్జునరావు, సురేష్బాబు, ఎస్ఐలు రాజశేఖర్, ఆనందరావు, సిబ్బంది పాల్గొన్నారు. వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి కర్లపాలెం: జాతీయ రహదారిపై వేగ నియంత్రంణకు పోలీస్ సిబ్బంది, హైవే అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. బుధవారం ఎస్పీ, డీఎస్పీ, రామాంజనేయులు రూరల్ సీఐ హరికృష్ణతో కలసి కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల పరిధిలో గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనా స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర, చందోలు ఎస్ఐ శివకుమార్ యాదవ్, సిబ్బంది పాల్గొన్నారు.ఇటుక అమ్మకాలు రెండేళ్లగా పూర్తిగా మందగించిపోయాయి. అప్పు చేసి తయారు చేసిన ఇటుక కళ్లాల్లోనే మిగిలిపోవడం భారంగా మారింది. ఇటుక దిగుమతి చేసుకున్న వ్యక్తులు నగదు చెల్లించకపోవడం, ఇటుక అమ్మకాలు అంతంత మాత్రంగా ఉండటంతో పరిశ్రమ నిర్వహణ భారంగా మారి, బట్టీలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. – బారెడ్డి సుబ్బారెడ్డి, ఇటుక పరిశ్రమ మాజీ నిర్వాహకులు, కొల్లూరు. కొల్లూరు: అంతరాష్ట్రీయంగా పేరొందిన కొల్లూరు ఇటుక పరిశ్రమ పరిస్థితి నేడు బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అనే దుస్థితికి చేరుకుంది. ఇటుక పరిశ్రమలు ఇతర ప్రాంతాలలో వ్యాపించడంతోపాటు, అవసరాలకు మించి ఉత్పత్తి.. నిర్మాణ రంగం కుదేలవడం కొల్లూరు ఇటుక పరిశ్రమకు పెను ముప్పులా మారింది. ఇటుక పరిశ్రమకు కొల్లూరు మండలంలోని కృష్ణా నదీ పరివాహక లంక గ్రామాలు నిలయంగా మారాయి. పరిశ్రమ వేలాది మంది రాష్ట్ర, అంతరాష్ట్ర వలస కూలీలతోపాటు, స్థానిక ప్రజల ఉపాధికి ఊతంగా నిలుస్తుంది. 50 పరిశ్రమల వరకు మూత.. డిసెంబర్ నుంచి మే నెల వరకు కొనసాగే ఇటుక ఉత్పత్తి వల్ల ఈ ప్రాంతంలో ఏడాది పొడవునా రూ.వందల కోట్లలో వ్యాపార లావాదేవీలు జరిగేవి. కొల్లూరు, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, దోనేపూడి, తోకలవారిపాలెం, తురకపాలెం, తిప్పలకట్ట, పోతార్లంక గ్రామాల పరిధిలో సుమారు రెండు వేలకు పైగా ఎకరాలలో విస్తరించి ఉన్న పరిశ్రమ కుంచించుకుపోవడం ఆరంభమైంది. ఇటుక అమ్మకాలు పడిపోవడం, ఇటుక తయారీకి రూ.5 ఖర్చు అవుతుండగా, అమ్మకాలు సైతం రూ.5 కే జరుగుతుండటంతో ఉత్పత్తిదారులు అప్పులపాలవుతున్నారు. రెండేళ్ల కిత్రం వరకు ఈప్రాంతంలో సుమారు 140 చిన్న, పెద్ద ఇటుక పరిశ్రమలు ఉండగా, నేడు సుమారు 50 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. ఏడాదికి సుమారు 30 కోట్ల వరకు ఇటుకలను తయారు చేసిన పరిశ్రమ నేడు సగానికి సగం చేయాలన్నా జంకే పరిస్థితి తలెత్తింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సమయంలో ఒక్కో ఇటుకరాయి రూ.6కు మించి ధర రావడంతో ఏడాదికి సుమారు రూ.180 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఇటుక కొనే నాథుడే లేకపోవడంతో ఎక్కడ ఇటుక అక్కడ కళ్లాలకే పరిమితమైంది. అమ్మకాలు మందగించడంతో బట్టీలలోనే నిలిచిపోయిన ఇటుక 7ఇటుక అమ్మకాలు లేకపోవడంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇటుక బట్టీలలో ఎక్కడ ఇటుక అక్కడే ఉండిపోయింది. సాధారణంగా నవంబర్, డిసెంబరు నెలలో పరిశ్రమ ఆరంభమై ఏప్రిల్ వరకు కొనసాగేది. ఇటుక అమ్మకాలు లేకపోవడంతో కోట్ల సంఖ్యలో నిల్వ ఉండిపోయింది. ఇటుక అలానే ఉండటంతో పెట్టుబడులు భారంగా మారి ఉత్పత్తి ఆలస్యానికి కారణమవుతోంది. – ఘంట శివరంగారావు, ఇటుక ఉత్పత్తిదారుడు, కొల్లూరు. ఇటుక పరిశ్రమల నిర్వహణకు పెద్ద సంఖ్యలో కూలీల అవసరం ఉన్న నేపథ్యంలో వేలది మంది వలస కూలీలు, స్థానిక కూలీలు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఇటుక పరిశ్రమగడ్డు పరిస్థితులకు చేరుకోవడంతోపాటు వేల సంఖ్యలో కూలీలకు ఉపాధి లేకుండా పోతుంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, బాపట్ల, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తదితర జిల్లాలతోపాటు, ఇతర రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్ఘడ్ ప్రాంతాలకు చెందిన సుమారు ఎనిమిది వేల మంది వలస కూలీలు ఇటుక పరిశ్రమలో పనులు చేసేందుకు వస్తారు. వీరికి తోడు స్థానికంగా ఉండే ప్రజలు సుమారు మరో మూడు వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం కొందరు నిర్వాహకులు పరిశ్రమలు కొనసాగించకపోవడంతో కూలీలకు పని దొరకని పరిస్థితి తలెత్తుతుంది. -
ఏసుక్రీస్తు బోధనలు ఆనుసరణీయం
గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ప్రపంచానికి శాంతి, ప్రేమ, సహనం, త్యాగ సందేశాన్ని అందించిన ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి ఆచరణీయమైనవని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు అందరూ శాంతి, సమాధానాలతో, ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగను నిర్వర్తించుకోవాలని ఆకాంక్షించారు. తోటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, సహనం, త్యాగం వంటి విలువలు సమాజాన్ని మరింత బలపరుస్తాయని ఆయన తెలిపారు. క్రిస్మస్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రధాన చర్చిలు, ప్రార్థనా మందిరాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. -
గోదాదేవి అలంకరణలో శ్రీవారు
సత్తెనపల్లి: ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సత్తెనపల్లిలోని వడ్డవల్లి శ్రీ రామాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, రైల్వేస్టేషన్ రోడ్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి గోత్రనామాలతో అభిషేకాలు నిర్వహించారు. కోలాట ప్రదర్శన చేపట్టారు. రైల్వేస్టేషన్రోడ్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం స్వామివారిని వామనావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెదకాకాని: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీఈడీ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు బుధవారం విడుదల చేశారు. మొదటి, రెండు సంవత్సరాల రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు. అలానే బీటెక్, బీఆర్క్ పరీక్షల నూతన షెడ్యూల్ను విడుదల చేశారు. బీటెక్, బీఆర్క్ పరీక్షలు జనవరి 3వ తేదీ, 9వ తేదీ జరుగుతాయన్నారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్సైట్లో సంప్రదించాలని తెలిపారు. తెనాలిటౌన్: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సతీమణి జయశ్రీ బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం దేవస్థానానికి విచ్చేశారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, వన్టౌన్ సీఐ వి.మల్లిఖార్జునరావు, ఆలయ సహాయ కమిషనర్/ కార్యనిర్వహణ అధికారి వి.అనుపమ, అర్చకులు ఆలయ మర్యాదప్రకారం జయశ్రీకి స్వాగతం పలికారు. అనంతరం శ్రీలక్ష్మీపద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని, పూజలు చేశారు. సాక్షి టాస్క్ఫోర్స్: డ్రగ్స్ కేసులో చీరాల మండలం రామకృష్ణాపురానికి చెందిన మాదిగాని బాలప్రకాష్ బాలు(ప్రస్తుతం బాపట్ల మండ లం స్టువర్టుపురంలో నివాసం) అనే వ్యక్తిని రెండు రోజుల కిందట హైదరాబాద్లో రాజేంద్రనగర్ ఎస్ఓటీ, రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో ఇతను ఏ3గా ఉన్నాడు. బాలప్రకాష్బాలుకు టీడీపీ కృష్ణాజిల్లాలో ఎంపీకి అనుచరుడుగా వ్యవహరిస్తున్న మాదిగాని గురునాథంకు దగ్గరి బంధువు. ఇతను పుట్టింది చీరాల మండలం రామకృష్ణాపురంలో కాగా అసాంఘిక కార్యకలాపాలన్నీ రాష్ట్రంలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లాతో పా టు తెలంగాణ రాష్ట్రంలోనూ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చీరాల, బాపట్ల ప్రాంతాల్లో సంచలనంగా మారింది. -
మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా
బొల్లాపల్లి: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం సీతారాంపురం తండాలో డీఎస్పీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 100 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం. హనుమంతరావు మాట్లాడుతూ తండాలో గంజాయి వాడకం నివారించేందుకు విస్తృత తనిఖీలు చేపట్టామని తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వం మాదకద్రవ్యాల నివారణకు ఉన్నతాధికారి స్థాయితో నిఘా ఏర్పాటు చేసిందని, తండావాసులు గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. చాక్లెట్లు, సిగరెట్లు ద్వారా గంజాయి సరఫరా జరుగుతోందనే సమాచారం ఉందన్నారు. సమీప అటవీ ప్రాంతంలో గంజాయి మొక్కలు కనిపించినా ఈగల్ టీంకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తండాల్లో చోరీలకు పాల్పడే వారికి ఆశ్రయం కల్పిస్తున్నారని సమాచారం ఉందని తెలిపారు. నేరాలకు పాల్పడిన, అలాంటి వారికి ఆశ్రయం కల్పించినా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. కార్డెన్ సెర్చ్లో రికార్డులు లేని 32 ద్విచక్ర వాహనాలు, కారు, వైండింగు వైరు 4 చుట్టలు, గొడ్డళ్లు 4, కత్తులు 3, కొడవళ్లు సీజ్ చేశామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్డెన్ సెర్చ్లో వినుకొండ రూరల్ సీఐ బి.బ్రహ్మయ్య, బండ్లమోటు ఎస్ఐ సయ్యద్ సమీర్ బాషా పాల్గొన్నారు. సీతారాంపురం తండాలో కార్డెన్ సెర్చ్ -
ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్బాపట్ల: జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ, రైల్వే, పర్యాటక, ఫిషరీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి జిల్లాలో జరుగుతున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు రవాణా సౌకర్యం, రహదారులు మెరుగ్గా ఉంటే అభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్మాణాలతో ప్రజల ప్రయాణాలు ఎంతో సులభంగా మారుతాయన్నారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి–167ఏ త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు–నిజాంపట్నం రహదారి నిర్మాణం, నిడుబ్రోలు–చందోలు ఆర్ అండ్ బీ రహదారి విస్తీర్ణం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కర్లపాలెం–గణపవరం రహదారి పనులు పురోగతిపై ప్రతివారం నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూర్యలంక బీచ్ లో నిర్మాణాలు వేగంగా చేపట్టాలన్నారు. పార్కింగ్ సమస్య లేకుండా చూడాలన్నారు. హరిత రిసార్ట్స్ భవనం ఆధునికీకరణ పనులు వేగంగా చేపట్టాలన్నారు. చీరాల ఏరియా ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం అత్యంత వేగంగా చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ నిర్మాణం త్వరలో పూర్తిచేసి ప్రారంభించాలన్నారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ఇండియన్ బ్యాంక్ మహిళల స్వయంసమృద్ధి, మహిళా సాధికారతకు కృషి చేస్తుందని బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని బ్యాంక్ జనరల్ మేనేజర్, ఆర్బీడీ వి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్లో బుధవారం ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యాన ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్ జరిగింది. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎస్హెచ్జీ అవుట్ రీచ్ క్యాంపెయిన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రూ.1150 కోట్ల స్వయం సహాయక బృందాలకు రుణాలను మంజూరు చేశామన్నారు. ఎంతో మంది తమ చిన్న వ్యాపార అవసరాల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి తమ జీవితాలను కష్టతరం చేసుకుంటున్నారని అన్నారు. ఇండియన్ బ్యాంక్ ద్వారా స్వయం సహాయక బృందాల కోసం ఉత్పత్తులను రూపొందిస్తున్నామని చెప్పారు. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు పొందవచ్చన్నారు మహిళలకు సాధికారత కల్పించి వారిని లక్షాధికారులగా మార్చటానికి ఉద్దేశించిన ‘సీడ్స్ టు సక్సెస్’ ప్రచారం, లక్షపతి దీదీ గురించి మహిళలకు వివరించారు. ఈ సందర్భంగా మహిళలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. విజయవాడ జోనల్ మేనేజర్ ఎం.రాజేష్ మాట్లాడుతూ విజయవాడ జోన్లో స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేకత కలిగిన 4 మైక్రోశాట్ బ్రాంచిలు ఉన్నాయన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారు 5 వేల స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం అందిస్తోందని, 43 బ్రాంచిలు స్వయం సహాయక బృందాల ఆర్థిక అవసరాలను తీర్చటానికి నిరంతరం పనిచేస్తున్నాయని, బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్కుమార్, జోనల్ మేనేజర్ ఎన్.గౌరీశంకర్రావు, రాష్ట్ర అధికారులు ఏఎన్వీ నాంచారరావు, ఉమ్మడి కృష్ణా జిల్లాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. -
బైక్ దొంగల ముఠా..
యడ్లపాడు: బైకుల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను యడ్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.3.70 లక్షల విలువైన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం చిలకలూరిపేట రూరల్ పోలీస్స్టేషన్లో సీఐ బి.సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. యడ్లపాడు జాతీయ రహదారి ఉప్పరపాలెం అండర్ పాస్ వంతెన వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులు వివరాలు అడిగేలోగా బైక్ను వదిలి కొందరు పరారయ్యారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. నిందితులు చిలకలూరిపేటకు చెందిన పోలిశెట్టి మహేష్ బాబు, చిలక విఘ్నేష్ (సన్నీ), పల్లపు ఆంజనేయులులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ టి.శివరామకృష్ణ, ఏఎస్ఐ ఇస్మాయిల్, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హెచ్జీ జె.సాంబశివరావులను ఉన్నతాధికారులు అభినందించారు. -
చేదెక్కిన నల్ల చెరకు
క్రిస్మస్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు బాపట్ల జిల్లాలో క్రైస్తవ లోకం సిద్ధమైంది. దాదాపు పది రోజుల ముందు నుంచే పండుగ హడావుడి ప్రారంభమైంది. చర్చిలను నూతన రంగు లతో అందంగా రూపుదిద్దారు. క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటూ రంగురంగుల కాంతులు చిమ్మే క్రిస్మస్ స్టార్లను వెలిగించారు. జిల్లాలోని చర్చిలన్నీ క్రిస్మస్ పండగ నిర్వహణకు సిద్ధమయ్యాయి. – వేమూరు/భట్టిప్రోలుబల్లికురవ: ఆహార ధాన్యమైన వరి పంట సాగు పెట్టుబడులు పెరగటం వాణిజ్య పంటల ఆటుపోట్లతో నల్ల చెరకు సాగు విస్తీర్ణం ఏడాదికేడాదికి పెరుగుతోంది. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం నల్లచెరకు సాగుకు అనుకూలంతోపాటు పెట్టింది పేరు. సారవంతమైన నల్లరేగడి భూములు నీటివసతి, బోర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుతో 18 సంవత్సరాలుగా తిరునాళ్లు, జాతర్లలో అమ్మే నల్ల చెరకును సాగు చేస్తున్నారు. పెరిగిన సాగుతో తగ్గిన ధరలు.. బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు, వైదన, కొప్పెరపాడు, ఎస్ఎల్ గుడిపాడు, కొత్తూరు, రామాంజనేయపురం, వెలమవారిపాలెం, అద్దంకి మండలంలోని చక్రాయపాలెం, శింగరకొండపాలెం, గ్రామాల్లో ఈ ఏడాది ఖరీఫ్ జూన్, జూలై, ఆగస్టులో సుమారు 900 ఎకరాల్లో సాగు చేపట్టారు. సొంత భూములతోపాటు కౌలుకు తీసుకొని ఒక్కో రైతు అరెకరా నుంచి రెండు ఎకరాల వరకు పంట సాగు చేపట్టారు. బోదెలు చేసి ఆ బోదెల్లో అడుగు ముక్కలను ఎకరాలకు 12 వేల నుంచి 13 వేల వరకు నాటారు. సస్యరక్షణ నీటి తడులతో గడలు 6 నుంచి 7 అడుగుల వరకు పెరిగి అమ్మకానికి సిద్ధమవుతున్నాయి. వారం రోజులుగా వ్యా పారులే తోటల వద్దకు వచ్చి గడల వంతున కొనుగోలు చేస్తున్నారు. గతేడాది గడ ఒక్కో టి రూ.16 నుంచి రూ.20 పలకగా నేడు రూ.12 నుంచి రూ.14కి మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు రైతులు తాటిపర్తి అంజిరెడ్డి, భవనం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రోడ్లపైనే అమ్మకాలు.. చెరుకు గడలకు ధరలు దిగజారటంతో వారం రోజులుగా రోడ్లపైనే అమ్మకాలు చేపడుతున్నారు. మేదరమెట్ల–నార్కెట్పల్లి నామ్ రహదారిలోని కొప్పరపాడులో, కొప్పెరపాడు–వినుకొండ రోడ్డులో కూకట్లపల్లి గ్రామ సమీపంలో గడలు కట్టలు కట్టి అమ్మకాలు చేపడుతున్నారు. ఎకరా పంట సాగుకు రూ. 2 లక్షల నుంచి రూ.2.5 లక్షలు ఖర్చు అవుతోందని, ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు దక్కడమే గగనమని రైతులు వాపోతున్నారు. పది సంవత్సరాలుగా చెరకు సాగు చేస్తున్నా. వ్యాపారులే తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో దళారుల బెడదలేదు. కానీ ఈ సంవత్సరం ధర ఆశించిన స్థాయిలో లేదు. గత సంవత్సరంతో పోలిస్తే గడ ఒక్కోటి రూ.4 నుంచి రూ.5 తగ్గింది. పెట్టుబడులు పెరిగాయి. ధర పెరగకపోతే పెట్టుబడులే దక్కుతాయి. – తాటిపర్తి అంజిరెడ్డి, కూకట్లపల్లిసారవంతమైన భూములో చెరకు సాగుతో గడల్లో నాణ్యతతో దిగుబడులు బాగున్నాయి. ధర దిగజారడంతో ఆశించిన స్థాయిలో లాభాలు దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. – సుబ్బారావు -
అంతర్ జిల్లాల క్రికెట్ చాంపియన్ గుంటూరు
విజయవాడ రూరల్: నున్నలోని గ్రీన్ హిల్స్ మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ముగిసింది. స్కూల్ అండర్–17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలవగా, చిత్తూరు జిల్లా ద్వితీయ, కర్నూలు జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్లో గుంటూరు జట్టు నిర్ణీత ఒవర్లలో 78 పరుగులు చేయగా, చిత్తూరు జట్టు 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గుంటూరు జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో కర్నూలు జట్టు కడప జట్టుపై విజయం సాధించింది. కర్నూలు జట్టు 101 పరుగులు చేయగా, కడప జట్టు 68 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. ముగింపు కార్యక్రమంలో వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి ట్రోఫీ, పతకాలు అందజేశారు. ప్రిన్సిపాల్ నక్కనబోయిన గోపాలకృష్ణ, ఎస్జీఎఫ్ఏపీ అండర్–17 బాలికల అంతర్–జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ అబ్జర్వర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ●84 మందికి రూ.3.84 కోట్లు ఇవ్వాలని ఆరోపణ ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు యడ్లపాడు: ఓ స్వర్ణకారుడు నమ్మించి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఆభరణాలు చేసిస్తానని చెప్పి సుమారు 84 మంది బాధితుల నుంచి రూ.3.84 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని వసూలు చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా యడ్లపాడులో బుధవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...యడ్లపాడు గ్రామం రచ్చబండ సెంటర్ సమీపంలో నివసించే ఏలూరి కామేశ్వరరావు అనే వ్యక్తి స్వర్ణకారుడు. గతంలో అతని తండ్రికి మంచి పేరు ఉండటంతో చుట్టుపక్కల గ్రామస్తులు కొత్త ఆభరణాల తయారీ కోసం పెద్ద మొత్తంలో బంగారం, అడ్వాన్స్ నగదు అందజేశారు. కొంతకాలంగా నగలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న కామేశ్వరరావు, ఏడాదిగా బాధితులకు కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు. బాధితులు ఫోన్ చేస్తే మాత్రం ‘త్వరలోనే ఇచ్చేస్తాను‘ అని నమ్మబలుకుతూ వాయిదాలు వేస్తూ వస్తున్నాడు. చివరకు మోసపోయామని గ్రహించి బుధవారం ఫిర్యాదు చేసేందుకు సుమారు 84 మంది బాధితులు వచ్చారని తెలిపారు. సుమారు రూ.3.84 కోట్లు నష్టపోయినట్లుగా బాధితులు పేర్కొంటున్నారని వెల్లడించారు. లిఖితపూర్వక ఫిర్యాదులు ఇవ్వాలని కోరామన్నారు. కేసు నమోదు చేసి, పూర్తిస్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ టి. శివరామకృష్ణ తెలిపారు. -
మార్టూరులో భూ మాయ
ఇష్టారాజ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ఆక్రమణ సహకరిస్తున్న రెవెన్యూ, డివిజనల్ స్థాయి అధికారులు అధికారులను బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్న ప్రజాప్రతినిధి కీలక అనుచరుడు ఒత్తిడితో గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన సబ్ రిజిస్ట్రార్ ఇసుక దందా...రేషన్ దందా... తాజాగా భూ దందాకు టీడీపీ నాయకులు తెరతీశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూములను ఆక్రమించుకుంటున్నారు. వీరి భూ దందాకు ఓ వీఆర్వో సహాయ సహకారాలు అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అధికారులను బెదిరించి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు ఓ సబ్ రిజిస్ట్రార్ గుండెపోటు గురయ్యాడు. -
క్రిస్మస్ పండుగకు ఏర్పాట్లు పూర్తి
ఫిరంగిపురం:క్రిస్మస్ను పురస్కరించుకొని స్థాని క బాలఏసు దేవాలయంలో ప్రత్యేక పూజాబలి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశా రు. దేవాలయానికి విద్యుత్ దీపాలు వేయడంతో కాంతులీనుతుంది. నవదిన ప్రార్థనల్లో భాగంగా కొత్తపేటకాలనీ, లూర్దునగర్, క్రీస్తునగర్, జగన్ కాలనీ ప్రాంతాల్లో దేవాలయ సహాయ విచారణ గురువు కె.సాగర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. 24న ఉదయం విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో దివ్యపూజాబలి, రాత్రి 11.30 గంటలకు క్రీస్తుజయంతి మహోత్సవం, జాగరణ దివ్యపూజాబలిలో మేత్రాసన గురువు చిన్నాబత్తిని భాగ్యయ్య పాల్గొంటారని చెప్పారు. 25న దివ్యపూజాబలి నిర్వహిస్తారని గురువులు ఫాతిమా మర్రెడ్డి, టి.కమలేష్లు పాల్గొంటారని తెలిపారు. అదేరోజు రథోత్సవం, తేరు ప్రదక్షణ నిర్వహిస్తారని చెప్పారు. ఆంధ్రా రోమ్ ఫిరంగిపురం ఫిరంగిపురం: ఆంధ్రారోమ్గా ఫిరంగిపురాన్ని పిలుస్తారని బాలఏసు దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి అన్నారు. బిషప్హౌస్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫిరంగిపురం అనగానే కథోళిక క్రైస్తవులు ఎక్కువ మంది కలిగిన గ్రామంగా ప్రసిద్ధి చెందిందన్నారు. దేవాలయం నిర్మించి 140 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. తెనాలిటౌన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీలక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం స్వామివారిని నరసింహావతారంలో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: తెనాలి తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మంగళవారం పరిశీలించారు. తెనాలి తహసీ ల్దార్ కార్యాలయాన్ని దాతల సాయంతో ఆధునికీకరించి ఇటీవల పునఃప్రారంభించిన సంగతి విదితమే. ఈ కార్యాలయాన్ని తన పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, నూతన సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. కార్యాలయానికి అధునాతన శోభగులద్దిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, దాతలను అభినందించారు. కలెక్టర్ వెంట తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా ఉన్నారు. ప్రత్తిపాడు: పోలేరమ్మ తల్లికి భక్తులు బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో కొలువుదీరిన పోలేరమ్మ తల్లికి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నెక్కొండ గ్రామానికి చెందిన వి.వి శేఖర్రెడ్డి సుమారు రూ.5.60లక్షల విలువచేసే బంగారు హారాన్ని అమ్మవారికి సమర్పించారు. హారాన్ని మంగళవారం ఆలయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జక్కా శ్రీనివాసరావుకు అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
బాపట్లలో104 ఉద్యోగుల ఆందోళన
బాపట్ల: గ్రామీణ పేదలకు ప్రతి నెలా నిర్ణీత తేదీల్లో వైద్యసేవలు అందిస్తున్న 104 వాహనంలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యాన జిల్లా కలెక్టరేట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల ఎదుట ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్ మాట్లాడుతూ 104 ఉద్యోగుల పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడ్డ చందంగా ఉందని అన్నారు. అరవింద సంస్థ నుంచి భవ్య సంస్థలకు మారిన 104 ఉద్యోగుల్ని యజమాన్యం వేధింపులు గురి చేస్తుందన్నారు. ఉద్యోగులకు ఉన్న 15 సాధారణ సెలవులు రద్దు చేశారని, నెలకు ఒక సెలవు పెట్టినా జీతంలో కోత విధిస్తున్నారన్నారు. గత ఆరు నెలల నుంచి ప్లే స్లిప్పులు, జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వలేదన్నారు. ప్రతినెలా అరవిందలో పనిచేస్తున్న జీతం కంటే రూ.500 నుంచి రూ.2000 వరకు జీతం తగ్గించి ఉద్యోగులకు ఇస్తున్నారన్నారు. ప్రశ్నించిన ఉద్యోగులపై యాజమాన్యం వేధింపులకు గురిచేస్తూ డ్యూటీలు చేయకుండా ఆపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి 104 ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినోద్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి.సురేందర్నాయుడు, పి.పవన్ కుమార్, ఎం.హరిబాబు, సీహెచ్.అశోక్కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
30న బాపట్లలో మెగా జాబ్మేళా
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30న బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాబ్ మేళా ప్రచార గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది విస్తృత ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలన్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఎం. మాధవి, ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్, ఇన్చార్జి రవికిరణ్, సౌగంధి హారిక పాల్గొన్నారు. -
విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి బాపట్ల: రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మంగళవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ హైస్కూలు మరమ్మతులు చేపట్టిన భవన ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. విద్యాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలపై మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, స్థానిక ఎమ్మెల్యే నరేంద్రవర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, శివనారాయణ, ఆర్డీఓ పి.గ్లోరియా, డి ఈఓ.డి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రఘునాధ్రెడ్డి, తహసీల్దార్ షేక్ సలీమా, పాఠశాల టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రఘురామ కృష్ణమరాజును పదవి నుంచి తొలగించాలి
● బ్యాంకులను ముంచినందుకు తక్షణమే అరెస్టు చేయాలి ● మాలజాతిపై ద్వేషంతోనే ఐపీఎస్ అధికారి సంజయ్ అరెస్టు ● సునీల్కుమార్ను సస్పెండ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం ● మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ డిమాండ్చీరాలరూరల్: బ్యాంకుల వద్ద కోట్లాది రూపాయ ల రుణాలు పొంది వాటిని ఎగ్గొట్టి బ్యాంకులను నిండా ముంచిన రఘురామకృష్ణమరాజును అరెస్ట్ చేయాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షు డు మాచవరపు జూలియన్ డిమాండ్ చేశారు. మంగళవారం చీరాల్లోని దళిత మహాసభ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ను వెనుకేసుకురావడం దురదృష్టకరమని, తక్షణమే ఆయనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలన్నా రు. ఇటీవల రఘురామకృష్ణంరాజుపై సీబీఐ అధికారులు చీటింగ్ కేసు నమోదు చేయడాన్ని ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ సమర్థించడం మంచిదేనన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందన్నారు. సునీల్కుమార్ మాటలను తప్పుబట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. ఐపీఎస్ అధికారుల సర్వీస్ రూల్స్ గురించి సునీల్కుమార్కు బాగా తెలుసునన్నారు. తమ ఆత్మగౌరవం కోసం సునీల్కుమార్ డీజీపీ హోదా, ఉద్యోగం వదులు కోవడానికి సిద్ధపడ్డారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాల ద్వేషి... చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మాలజాతిపై, మాల ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ విమర్శించారు. అందులో భాగంగానే ఐపీఎస్ అధికారులు సంజయ్ను అరెస్టు చేసి పీవీ సునీల్కుమార్ను సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు. చంద్రబాబు మాల ద్వేషని అందుకే మాలజాతిని అణచివేసేందుకు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం తన బాధ్యతను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేశామని, మాదిగలకు మేలు జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు రాష్ట్రంలోని బ్యాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయడంలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాలజాతికి చెందిన అధికారులను, ఉద్యోగులను వేధిస్తున్నారని, తప్పుడు కేసులుపెట్టి అరెస్టులు, సస్పెండ్ చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు మాలలపై ద్వేషం లేకుంటే ఐపీఎస్ అధికారులు సంజయ్, సునీల్కుమార్లకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మల్లెల బుల్లిబాబు, మేరిగ రమేష్, సలగల కెనడి, ప్రియతమ్ ఉన్నారు. -
పశుసంతతితో లాభాలు
బల్లికురవ: పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎస్ఎస్ఎస్ ద్వారా గర్భధారణతో పశుసంతతి పెంచుకోవాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ బి. మురళీ కృష్ణ రైతులకు సూచించారు. మంగళవారం మండలంలోని వైదన గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్, పశుగణాభివృద్ధి సంస్థ సంయుక్త సహ కారంతో ఉచిత పశువైద్యశిబిరం నిర్వహించారు. శిబిరంలో 37 గేదెలకు చూడి పరీక్షలు 151 గేదెలు, దూడలు, గేదెలకు నట్టల నివారణ మందు అందజేశారు. డీడీ మాట్లాడుతూ పాడిపరిశ్రమలో మెలకువలతో పాటు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు, చికిత్సలతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ పాలు ఉత్పత్తి పెంచుకోవాలని కోరారు. శిబిరంలో వైద్యాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడు మృతి కర్లపాలెం: ప్రమాదవశాత్తు బైక్తో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొని ఓ యువకుడు మృతిచెందిన సంఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలోని పేరలి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. కర్లపాలెంం ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల మేరకు చీరాల మండలం పేరాల గ్రామానికి చెందిన అమర్తలూరి హర్షవర్థన్(25) కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలకు తమ బంధువుల ఇంటికి వచ్చాడని తెలిపారు. తిరిగి స్వగ్రామం పేరాలకు బైకుపై వెళుతున్న నేపథ్యంలో పేరలి మంచినీటి చెరువు సమీపంలోని కరెంటు స్తంభాన్ని ప్రమాదవశాత్తు బైక్ ఢీ కొనటంతో తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందాడని తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. గుంతకల్లు– మార్కాపురం ప్యాసింజర్ రైలు ప్రారంభం లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నంద్యాల మీదుగా గుంతకల్లు – మార్కాపూర్ రోడ్ మధ్య నూతన ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రారంభమైంది. దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదన మేరకు రైల్వే మంత్రిత్వ శాఖ గుంతకల్లు– మార్కాపూర్ రోడ్– గుంతకల్లు(నంద్యాల మీదుగా) రోజువారీ ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపిందని గుంటూరు రైల్వే డివిజన్ పీఆర్ఓ వినయ్ కాంత్ మంగళవారం తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం లక్ష్మీపురం: నాన్–ఫేర్ రెవెన్యూ చొరవలో భాగంగా, దక్షిణ మధ్య రైల్వే, గుంటూరు డివిజన్, గుంటూరు రైల్వే స్టేషన్న్లో స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్ఎం సుధేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లోని ఒకటో నెంబర్ ఫ్లాట్ఫారంలో మంగళవారం ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన స్లీపింగ్ ప్యాడ్స్ను ఆమె ప్రారంభించారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను, బెడ్స్, వాష్ రూమ్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యం మొత్తం 64 పడకల సామర్ధ్యాన్ని కలిగి ఉందన్నారు. చిలకలూరిపేటలో పోక్సో కేసు నమోదు చిలకలూరిపేట టౌన్: ఓ యువకుడిపై రూరల్ పోలీస్స్టేషన్లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామానికి చెందిన బాలిక తన అమ్మమ్మ ఊరైన చిలకలూరిపేట మండలం గోవిందపురం గ్రామానికి ఇటీవల సెలవులపై వచ్చింది. ఈ క్రమంలో చిరుమామిళ్ల గ్రామానికి చెందిన యువకుడు మాయమాటలు చెప్పి గ్రామం నుంచి బాలికను తీసుకెళ్లాడంటూ బాలిక తండ్రి రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రూరల్ ఎస్ఐ జి. అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. మంగళవారం పసుమర్రు వంతెన వద్ద యువకుడిని అరెస్టు చేసి కోర్టు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
న్యాయం చేస్తారా.. ఊరు వదిలి వెళ్లాలా?
కర్లపాలెం: రొయ్యల కంపెనీల నుంచి వస్తున్న కలుషిత నీటితో.. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని దీని వలన పంటలు పండించుకోవటానికి, తాగునీరుగా వినియోగించుకోవటానికి బోర్లలో నీరు పనికి రావటం లేదని కంపెనీల నుంచి వస్తున్న దుర్వాసనకు ఉండలేకపోతున్నామని గ్రామాలు ఖాళీచేయాల్సిన పరిస్థితి వస్తుందని కర్లపాలెం మండలం దుండివారిపాలెం పంచాయతీ పరిధిలోని తిమ్మారెడ్డిపాలెం గ్రామస్తులతోపాటు రొయ్యల కంపెనీల సమీపాన ఉన్న మోటుపాలెం, బోలాయపాలెం, బిడారుదిబ్బ, దుండివారిపాలెం, గ్రామాల ప్రజలు మంగళవారం 216 జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై పలు గ్రామాలకు చెందిన ప్రజలు ధర్నా చేయటంతో సుమారుగా గంటకు పైగా రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం, దుండివారిపాలెం గ్రామ పంచాయతీల పరిధిలో భారతీయ జనతాపార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలు నెలకొల్పారు. ఈ కంపెనీలకు సమీపంలో దమ్మనవారిపాలెం, తిమ్మారెడ్డిపాలెం, శ్రీరామ్నగర్, బోలాయపాలెం, దుండివారిపాలెం, బిడారుదిబ్బ గ్రామాలు ఉన్నాయి. ఈ కంపెనీలలోని రొయ్యల వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసన చుట్టు ప్రక్కల గ్రామాలకు వ్యాపించటంతో ఆగ్రామాల ప్రజలకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా కంపెనీకి అతి సమీపంగా ఉన్న తిమ్మారెడ్డిపాలెం గ్రామంలో భూగర్భ జలాలు కలుషితమై నీరు రంగు మారటంతోపాటు దుర్వాసన వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు వదులుతున్న కలుషిత నీరు తమ పంట పొలాల్లోకి వస్తున్నాయని దీంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని గ్రామంలోని బోరింగ్ పంపుల నుంచి వచ్చే నీరు కూడా తాగేందుకు పనికిరావటం లేదని ఆనీటితో స్నానం చేసినా దురదలు, దద్దుర్లు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను కలెక్టర్కి అర్జీ రూపంలో విన్నవించినా తమకు న్యాయం జరగలేదని గ్రామాలు వదిలి వెళ్లటమే మార్గంగా కనిపిస్తుందని తిమ్మారెడ్డిపాలెం గ్రామస్తులు వాపోతున్నారు. తిమ్మారెడ్డిపాలెంలోని గ్రామస్తులతో పాటు దమ్మనవారిపాలెం, బోలాయపాలెం, తిమ్మారెడ్డిపాలెం, దుండివారిపాలెం, బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కొంతమంది జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. తిమ్మారెడ్డిపాలెం గ్రామస్తులు మహిళలు, పిల్లలతో సహా తాము పండించిన వరిపైరుతో పాటు కంపెనీలు తమ పొలాల్లోకి వదిలిన పచ్చగా మారిన కలుషిత నీటిని క్యాన్లతో తీసుకుని వచ్చి రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న కర్లపాలెం ఎస్ఐ రవీంద్ర, చందోలు ఎస్ఐ ఎంవి శివకుమార్ యాదవ్, బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళన చేస్తున్న వారికి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ధర్నా విరమించేందుకు గ్రామస్తులు అంగీకరించలేదు. కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకెళతాం.. తిమ్మారెడ్డిపాలెం వద్ద గ్రామస్తులు జాతీయ రహదారిపై ధర్నా చేస్తున్నారని పోలీసుల ద్వారా తెలుసుకున్న తహసీల్దార్ షాకీర్ పాషా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు చెప్పిన విషయాలను విని సీఐ హరికృష్ణతో కలసి రొయ్యల కంపెనీల నుంచి పొలాలకు వస్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం తహసీల్దార్, సీఐ గ్రామస్తులతో మాట్లాడుతూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించటం మంచిది కాదని చెప్పారు. కలెక్టర్ వద్దకు తీసుకువెళ్లి సమస్యను తెలియజేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సంఘటనా స్థలానికి కలెక్టర్ రావాలని, మా సమస్యలను ఆయన స్వయంగా చూడాలని గ్రామస్తులు పట్టుబట్టారు. అధికారులు నచ్చచెప్పటంతో ఎట్టకేలకు ధర్నా విరమించారు. -
భారీ వాహనాన్ని ఢీకొన్న కారు
మార్టూరు: జాతీయ రహదారిపై వెళుతున్న భారీ వాహనాన్ని బ్రేకులు ఫెయిలైన కారణంగా వెనుక వస్తున్న కారు ఢీకొన్న సంఘటన మంగళవారం మధ్యాహ్నం కోనంకి, కోలలపూడి గ్రామాల మధ్య జరిగింది. హైవే మొబైల్ సిబ్బంది నాయక్ వివరాలు ఇలా ఉన్నాయి. భారీ ఇండస్ట్రియల్ ట్యాంకర్ను తడ నుంచి చత్తీస్ ఘడ్ తరలిస్తున్న వాహనం ఒంగోలు నుంచి విజయవాడ వైపు వెళుతోంది. విజయవాడ పాయకాపురానికి చెందిన పిళ్ళై విజయ్కుమార్ తన భార్యతో అదే మార్గంలో ఒంగోలు నుంచి విజయవాడ కారులో వెళుతున్నారు. ఈ క్రమంలో కారు బ్రేకులు ఒక్కసారిగా ఫెయిలవడంతో అదుపుతప్పి ముందు వెళుతున్న వాహన ట్యాంకర్ను బలంగా ఢీ కొట్టి ఆగిపోయింది. ప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన విజయ్కుమార్ను హైవే మొబైల్ సిబ్బంది మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రహదారికి మధ్యలో ప్రమాదం జరగడంతో హైవే సిబ్బంది వాహనాలను పక్కకు తప్పించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూశారు. నాయక్ సమాచారంతో మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రామ కమిటీల్లో వేమూరు ఆదర్శం
వైఎస్సార్ సీసీ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల జోన్–3 ఇన్చార్జి రవీంద్రరెడ్డి వేమూరు: గ్రామ కమిటీల నిర్మాణంలో వేమూరు నియోజకవర్గం ఆదర్శంగా నిలిచిందని వైఎస్సార్ సీసీ ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల జోన్–3 ఇన్చార్జి రవీంద్రరెడ్డి తెలిపారు. చెరుకపల్లి గ్రామంలోని వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవీంద్రరెడ్డి మాట్లాడుతూ పార్టీ గ్రామ, మండల, నియోజక వర్గ కమిటీలు, వాటి అనుబంధ కమిటీల నిర్మాణం గురించి నియోజక వర్గంలోని నాయకులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నియోజక వర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో 5500 కమిటీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలో తమ నియోజకవర్గం రెండోస్థానంలో నిలిచిందని చెప్పారు. గత ఏడాది నవంబరు 27వ తేదీన భట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామం నుంచి కమిటీల ఏర్పాటు ప్రారంభించామన్నారు. పార్టీ గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు, కోటి సంతకాలు కార్యక్రమం అందరికి కన్నా ముందు పూర్తి చేయడం జరిగిందని పరిశీలకుల దృష్టికి తెచ్చారు. పార్టీ జోన్–1 పరిశీలకులు హర్షవర్థన్ మాట్లాడుతూ పదవులు పొందిన పార్టీ నాయకులకు గుర్తింపు కార్డులు అందజేస్తామన్నారు. గుర్తింపు కార్డు వల్ల అనేక ప్రయోజనలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో జోన్–4 పరిశీలకు శివశంకర్, బూత్ కమిటీ రాష్ట్ర ఇన్చార్జి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ లలిత కుమారి, పార్టీ మండల అధ్యక్షులు దాది సుబ్బారావు, సుగ్గల నాగమల్లేశ్వరరావు, పడమటి శ్రీనివాసరావు, హిమ చంద్ర శ్రీనివాసరావు, అన్నపురెడ్డి రాఘురామి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కోగంటి లవకుమార్, మండల పరిశీలకులు చిలుమూరు రామోహనరావు, పెరికల పద్మారావు, ఎస్సీ సెల్ నియోజక వర్గ అధ్యక్షుడు పొతర్లంక సురేష్, జంపని పురుషోత్తం, జంగం వాసు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు పల్నాడు జట్టు
నకరికల్లు: క్రీడాకారులు రాణించేందుకు క్రీడాభిమానుల ప్రోత్సాహం ఎంతగానో దోహదపడుతుందని ఖో–ఖో అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వి.వీరభద్రారెడ్డి అన్నారు. సీనియర్ ఖో–ఖో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ పోటీలు ఈనెల 24వ తేదీ నుంచి 26 వరకు గుడివాడలో నిర్వహించనున్నారు. ఈ మేరకు పోటీలలో పాల్గొనేందుకు సన్నద్ధమైన క్రీడాకారులు మంగళవారం నకరికల్లు నుంచి గుడివాడ పయనమయ్యారు. నకరికల్లు ఉన్నతపాఠశాల పూర్వవిద్యార్థి పాపాబత్తుల కోటేశ్వరరావు తన కుమారుడు పాపాబత్తుల దానియేలు జ్ఞాపకార్థం క్రీడాకారులకు క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఖో–ఖో పురుషుల, మహిళల జట్టులోని 30 మంది క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పూర్తిస్థాయి శిక్షణ పొందిన క్రీడాకారులు జిల్లాకు గొప్పపేరు తెచ్చిపెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 మంది క్రీడాకారులు నకరికల్లు ఉన్నతపాఠశాల నుంచే ఉండడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఖో–ఖో అసోసియేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి చింతా పుల్లయ్య, ట్రెజరర్ ఝాన్సీ, మాజీ కార్యదర్శి రావు కిషోర్, వ్యాయామ ఉపాధ్యాయులు పి.వెంకయ్య, ఎం.వీరయ్య, పి.ఆంజనేయులు తదితరులు క్రీడాకారులను కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములుకండి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): మాదక ద్రవ్యరహి త సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు డ్రగ్స్ వద్దు బ్రో, సంకల్పం ర్యాలీని మంగళవారం గుంటూరులోని మహాత్మగాంధీ పార్క్ వద్ద ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ కొవెలమూడి రవీంద్ర, తూర్పు డీఎస్పీ అబ్దుల్అజీజ్, పోలీస్ అధికారు, సిబ్బంది పాల్గొన్నారు. విస్తృత అవగాహన నగరంపాలెం: మాదక ద్రవ్యాల నివారణ కోసం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నా రు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో మంగళవారం(నవంబర్–2025) నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ ఏ ఒక్కరిపై అయిన ఒక మాదక ద్రవ్యాల కేసు నమోదైనా, అతని విధిగా సస్పెక్ట్ షీట్ నమోదు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై జిల్లా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్) పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి -
ఆగిఉన్న లారీని ఢీకొన్న బైక్
బాపట్లటౌన్: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందిన ఘటన మండలంలోని చింతావారిపాలెం సమీపంలో చోటుచేసుకుంది. వివ రాల్లోకి వెళితే.. మండలంలోని ముత్తాయపాలెం గ్రామానికి చెందిన లుక్కా శ్రీనివరప్రసాదరావు (46), అతని స్నేహితుడు కొక్కిలిగడ్డ నారాయణస్వామి ఇరువురు ద్విచక్రవాహనంపై బాపట్ల నుంచి ముత్తాయపాలెం వైపు వస్తున్నారు. మార్గమధ్య లో చింతావారిపాలెం సమీపంలో ఇసుకలోడుతో ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టారు. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి ఇరువురిని చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ లుక్కా శ్రీనివరప్రసాదరావు మృతిచెందాడు. నారాయణస్వామిను ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మృతుడు శ్రీనివరప్రసాదరావు 20 సంవత్సరాలకు పైగా ఆర్మీలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. మృతుడి స్వగ్రామం నిజాంపట్నం మండలం, చినమట్లపూడి, మృతుడి సోదరి శాంతకుమారి ముత్తాయపాలెంలో నివాసం ఉంటుంది. ఆర్మీ రిటైర్డ్ అయిన తర్వాత గత ఐదేళ్ల క్రితం సోదరి నివాసానికి సమీపంలో స్థలం కొనుగోలు చేసి ముత్తాయపాలెంలోనే నూతన గృహం నిర్మించుకున్నారు. మృతునికి భార్య ఉషశ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి పిల్లల చదువుల నిమిత్తం గత ఏడాది కాలంగా విజయవాడలోనే నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం కళాశాలలకు సెలవు కావడంతో సోమవారం కుటుంబ సభ్యులతో స్వగ్రామమైన ముత్తాయపాలెం గ్రామానికి చేరుకున్నారు. ఇంతలోనే ఈ ఘోరం జరగడంతో మృతుడి కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టిస్తుంది. -
కోటప్పకొండ ఉద్యోగి గుండెపోటుతో మృతి
నరసరావుపేటరూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నరసరావుపేట పట్టణంలో ని శ్రీనివాసనగర్కు చెందిన చిరుమామిళ్ల నాసరయ్య(40) 13 సంవత్సరాలుగా తోటమాలిగా(కన్సాలిడేట్) విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న నాసరయ్య ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. ఇతర సిబ్బంది గమనించి హూటాహుటిన కోటప్పకొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే నాసరయ్య మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. నాసరయ్య మృతి వార్త తెలుసుకున్న కోటప్పకొండ ఆలయ సిబ్బంది, అర్చకులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి వచ్చారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి ప్రాంగణం హృదయవిదారకంగా మారింది. ఈఓ వేధింపులతోనే..! నాసరయ్య మృతికి ఈఓ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ చల్లా శ్రీను కారణమంటూ బంధువులు ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండలో పనిచేస్తున్న ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని తెలిపారు. ఈఓగా చంద్రశేఖర్ వచ్చిన దగ్గర నుంచి సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న నాసరయ్యను అన్నదానానికి మార్చారని, తరువాత మొక్కలకు నీళ్లు పెట్టే పనులు అప్పగించారని వివరించారు. వారం రోజుల క్రితం మెమో ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని తెలిపారు. ముగ్గురు తోటమాలీలు ఉండగా నాకే పనులు అప్పగించి ఈఓ వేధిస్తున్నాడని పలుమార్లు బాధపడ్డాడని నాసరయ్య భార్య వరలక్ష్మి తెలిపారు. అర్చకుల ఉద్యోగాలు అమ్ముకున్నారు.. కోటప్పకొండలో ఖాళీగా ఉన్న మూ డు అర్చక పోస్టులను ఈఓ చంద్రశేఖర్ రూ.30లక్షలకు అమ్ముకున్నాడని అర్చకులు ఆరోపించారు. ఏరియా ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యేను అర్చకులు కలిసి వివరించారు. అన్ని అర్హతలు ఉన్న తమకు అర్చక పోస్ట్లు ఇవ్వకుండా ఒకే కుటుంబానికి లాభం చేసేలా ఈఓ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తరువాత దీనిపై మాట్లాడదాం అంటూ ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేకు నిరసన సెగ.. గుండెపోటుతో మృతిచెందిన నాసరయ్య మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ఈఓ వేదింపులతోనే గుండెపోటుతో మృతిచెందాడని తెలిపారు. మనుషుల ప్రాణాలు తీయడానికే ఈ ప్రభుత్వం వచ్చిందా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఓపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారి ఆగ్రహం చల్లారలేదు. కోటప్పకొండలో ఎమ్మెల్యే తరఫున పర్యవేక్షిస్తున్న వెంకటప్పయ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. -
పంచాయతీల విభజనకు
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పర్చూరు(చినగంజాం): కొన్ని నెలల్లో పంచాయతీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీల విభజన అంశం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వం పంచాయతీల విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీలను ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాల మేరకు విభజన చేపట్టాలంటూ కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని అధికారులు విభజనకు సంబంధించిన అంశాలను నివేదిక తయారు చేయడంలో తలమునకలవుతున్నారు. ఎక్కువ పంచాయతీలను విభజించే విధంగా ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు సిఫార్సుల మేరకు స్థానిక శాసనసభ్యులు కలెక్టర్లకు ప్రతిపాదనలు అందజేయడంతో వాటిని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దానికి సంబంధించి ఆయా పంచాయతీల తీర్మానాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలను పరిగణలోకి తీసుకునే పనిలో అధికారులు తలమునకలువుతున్నారు. ఇంకొల్లు మండలంలో.. ఇంకొల్లు పంచాయతీని ఇంకొల్లు (13935) హనుమోజీపాలెం (1132), గొల్లపాలెం (888) పంచాయతీలుగా విభజించేందుకు ప్రతిపాదనలు చేశారు. గంగవరం పంచాయతీని గంగవరం (2263), తాటిపర్తివారిపాలెం (686)గాను, ఇడుపులపాడు పంచాయతీని ఇడుపులపాడు(5036), అంకిరెడ్డిపాలెం(600), ఇడుపులపాడు ఎస్సీ కాలనీ (1800)గాను, సూదివారిపాలెం పంచాయతీని సూదివారిపాలెం (730), ఇడుపులపాడు పంచాయతీలోని అంబటిపాలెం (350)ని కలిపి సూదివారిపాలెం పంచాయతీ (1080)గా ఏర్పాటు, కొణికి పంచాయతీని కొణికి (1800), కొణికి పల్లె (1100)గాను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్టూరు మండలంలో నాగరాజుపల్లి పంచాయతీని నాగరాజుపల్లి(2631), నాగరాజుపల్లి తండా, ఎస్సీ కాలనీ కలిపి నాగరాజుపల్లి తండా పంచాయతీ(1561)గాను, -
అర్జీలు గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా నాణ్యతతో పరిష్కరించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. అర్జీలను పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు, సిబ్బందితో స్థానిక న్యూ వీసీ హాల్లో కలెక్టర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వెళ్లేలా పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. వంద సేవలు మాత్రమే ప్రస్తుతం అందుతున్నాయని, మరిన్ని సేవలు అందుబాటులో ఉన్న విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి, విచారించాలన్నారు. ప్రజలకు మేలు జరగడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ఆ దిశగా కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించేందుకు సచివాలయాలలో ప్రత్యేకంగా అర్జీలు నమోదు చేయించాలన్నారు. ఐ–జి ఓ టి, ఈ శ్రమ పోర్టల్ నమోదు కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించడానికి అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎప్పటికప్పుడు వివరాలు పంపాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, మెప్మా పీడీ ఆనందసత్యపాల్, సీపీఓ షాలేం రాజు, కార్మిక శాఖ అధికారి వెంకట శివప్రసాద్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలక్ష్మి, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని బాపట్ల పట్టణం డీకే పాలెం మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని ఇందు కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో వ్యక్తిగత ఆత్మస్థైర్యం పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్, ఆర్డీఓ పి గ్లోరియా, ఎంఈఓలు డి శ్రీనివాస్, డి ప్రసాదరావు, తహసీల్దార్ షాలిమా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలి బాపట్ల:బాపట్లలో చేపట్టిన ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేస్తే జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ఇందు కోసం భూసేకరణ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. భూ సేకరణ ప్రక్రియపై రెవెన్యూ అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల అభివృద్ధితో రవాణా వ్యవస్థ పెరుగుతుందని, తద్వారా ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తున్న అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, జల వనరుల శాఖ, రోడ్లు భవనాల శాఖ, అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఆహార పదార్థాలలో కల్తీలు ఉంటే ఆరోగ్యానికి హానికరం ఆహార పదార్థాలలో కల్తీలు ఉంటే ప్రజల ఆరోగ్యానికి హానికరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. వినియోగదారుల అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఆహార భద్రత నాణ్యతశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రాలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. నాణ్యంగా, సురక్షితమైన ఆహార పదార్థాలతోనే ప్రజల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఆహార పదార్థాలలో కల్తీలు అధికంగా వస్తున్నందున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తులను ప్రజలు పరిశీలించాలన్నారు. రంగులు వినియోగించే ఆహార పదార్థాలు ప్రజారోగ్యానికి హానికరమన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఆహార భద్రతపై అవగాహన పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, డీఎస్ఓ జమీర్ బాషా, ఆహార భద్రత తనిఖీ అధికారి ప్రణీత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం చేయాలి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో నిర్వహించే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై సంబంధిత లైన్ డిపార్టుమెంట్ల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్, వీక్షణ సమావేశం ద్వారా హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, అన్ని మండల ఏపీవోలు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ లీకై ఇల్లు దగ్ధం
మార్టూరు: గ్యాస్ లీక్ కావడంతో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని జొన్నతాళి గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. బాధిత కుటుంబం వివరాల మేరకు.. స్థానిక యాదవవీధిలో రెండు పోర్షన్లు గల ఇంటిలో తండ్రీకొడుకులు రెండు కుటుంబా లుగా విడివిడిగా నివాసం ఉంటున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో అందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ సమయంలో కుమారుడు చిట్టిబోయిన శివయ్య గదిలో గ్యాస్ లీకై విద్యుత్ సరఫరా కావడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలి ముక్కలయింది. పేలుడు ధాటికి తండ్రి చిట్టి బోయి న సింగరయ్య నివాసంలోని ఖాళీ సిలిండర్ 200 మీటర్ల దూరంలోని నివాసాల మధ్య పడింది. ఎవరికి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాచిపెట్టిన నగదు.. బంగారం బూడిద ! శివయ్య భార్య శాంతికి చెందిన రూ.17 వేల నగదు కాలిపోగా ప్లాస్టిక్ బాక్సులో దాచి ఉంచిన సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు మంటలకు మాడి కనిపించకుండా పోయాయి. సుమారు ఎనిమిది గ్రాముల ఆభరణాల ముక్కలు మాత్రమే మిగిలాయి. శివయ్య తండ్రి సింగరయ్య నివాసంలో రూ.9 వేల నగదుతోపాటు రెండు పోర్షన్లలోని రూ. లక్షకు పైగా ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కాగా మొత్తంరూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని వాపోయారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం అంచనాలు ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు తెలిపారు. -
చిరుధాన్యాల ఉత్పత్తులతో మహిళలకు ఆర్థికాభివృద్ధి
బాపట్ల: మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల ప్రాసెసింగ్ ద్వారా వివిధ ఆహార ఉత్పత్తులుగా మార్చే ప్రక్రియతో గ్రామీణ మహిళలు ఆదాయాన్ని మరింతగా పెంచుకోవచ్చని బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డీడీ స్మిత్ అన్నారు. సోమవారం గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా స్వయం ఉపాధికి చిరుధాన్యాల ప్రాసెసింగ్ –మహిళా సాధికారత అనే అంశంపై కళాశాలలో మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్మిత్ మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాసెసింగ్ మహిళలకు అత్యంత అనుకూలమైన స్వయం ఉపాధికి మార్గమన్నారు. తక్కువ పెట్టుబడి, కొద్ది స్థలం, తక్కువ శక్తితో ఇంటి వద్దనే ప్రారంభించగలిగే అవకాశాలు ఇందులో విస్తారంగా ఉన్నాయని తెలిపారు. మహిళల్లో ఉన్న నైపుణ్యాలను సాంకేతికతతో మేళవిస్తే స్థిరమైన ఉపాధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శిక్షణలో రాగి, జొన్న, సజ్జ, కొరల్రు, సామలు వంటి చిరుధాన్యాల పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు జి.రవిబాబు, బి.శ్రీనివాసులరెడ్డి, కె.వి.ఎస్.రామిరెడ్డి, ఎస్.విష్ణువర్ధన్, కె.లావణ్య పాల్గొన్నారు. -
భారీ క్రేన్ దగ్ధం–తప్పిన ప్రమాదం
చీరాల: వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జరుగుతున్న ఆర్వోబీ పనుల్లో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ సోమవారం ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగర్కాలనీ వద్ద ఈపూరుపాలెం స్ట్రయిట్ కట్ వద్ద రైల్వే లైను సమీపంలో వంతెన నిర్మాణానికి ఉపయోగిస్తున్న భారీ క్రేన్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ ఆఫ్లో ఉన్నా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్రేన్లో భారీగా ఆయిల్ ఉండడంతో మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. అదృష్టవశాత్తూ అక్కడ పనులు జరగకపోవడం, కార్మికులు ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ నాగభూషణం ఘటనా స్థలానికి సిబ్బందిని పంపించి స్థానికులను అక్కడ నుంచి పంపించివేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని అతికష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వేట్రాక్ పక్కనే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం షార్టు సర్క్యూట్తో జరిగిందా.. మరేదేమైనా కారణం ఉందా అనే కోణంలో అగ్నిమాపక అఽధికారులు విచారణ చేపట్టారు. -
కారుబోల్తా.. నలుగురికి గాయాలు
బాపట్లటౌన్: కారు బోల్తాపడి.. నలుగురు యువకులు గాయపడిన ఘటన మండలంలోని సూర్యలంక రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని అసోదివారిపాలేనికి చెందిన ముడుగు రంగారెడ్డి, మర్రి సింహారెడ్డి, మంచాల ఏడుకొండలరెడ్డిలతో పాటు మండలంలోని వెదుళ్లపల్లి కొత్తపాలెం గ్రామానికి దొంతిన నాని తన స్నేహితుడిని సూర్యలంకలోని ఎయిర్ఫోర్స్ హాస్పిటల్లో చేర్చేందుకు సోమవారం సాయంత్రం కారులో వెళ్లారు. ఎయిర్ఫోర్స్ నుంచి బాపట్ల వైపు వస్తుండగా సూర్యలంక రోడ్డులోని చప్టా సమీపంలోకి వచ్చే సరికి కారు అదుపుతప్పి చప్టావద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు కారులో నుంచి జారి రోడ్డు పక్కనే పడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నలుగురు వ్యక్తులు చీరాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మర్రి సింహారెడ్డి పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు చీరాలలోని వైద్యశాలకు వెళ్లి క్షతగాత్రుల పరిిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. -
నేడు జిల్లా ఇన్చార్జి మంత్రి బాపట్లకు రాక
బాపట్ల: బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సంవత్సరంలో జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సమీక్షిస్తారని తెలిపారు. పిడుగురాళ్ల: రైతులకు ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ, ఉద్యాన శాఖ అన్ని పంటలపై సమగ్ర విజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుంటూరు లాంఫాం క్షేత్ర సందర్శన నిమిత్తం సోమవారం వెళ్లారు. ఈ సందర్భంగా జీవన ఎరువుల ఉపయోగం, వినియోగం గురించి వివరించటం, విత్తన ఉత్పత్తి, మిరపలో తామర పురుగుల నివారణ, పుట్టగొడుగుల సాగు, ఆయిల్ఫామ్ సాగు, అపరాల సాగు విధానం, డ్రోన్ ఉపయోగం గురించి వివరించడం జరిగిందని అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఎం.సంధ్యారాణి, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు ఉన్నారు. గుంటూరువెస్ట్: జిల్లా అగ్నిమాపక భవనం నిర్మాణానికి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం శంకుస్థాపన చేశారు. భవనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రూ.3.39 కోట్లతో నిర్మించనున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆకాక్షించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం.ఎ.క్యూ జిలానీ, జిల్లా అగ్నిమాపక అధికారి ముక్కు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలిఅర్బన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్వామివారిని వరాహావతారంతో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తాడికొండ: అమరావతి రాజధానికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి గత మూడు నెలలుగా గుంతలమయంగా మారడంతో పంట లు అధ్వాన్నంగా తయారయ్యాయి. మరమ్మతుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తుండటంతో ఇప్పటికే పూర్తిగా పాడైన పెదపరిమి–తుళ్లూరు మధ్య రహదారిపై దుమ్ము లేచి పంటలపై పేరుకుపోవడంతో పంటలు దుమ్ము కొట్టుకొని పనికిరాకుండా పోతున్నా యని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి నెల దాటినా అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో అటు రైతులతో పాటు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇలా ఉండటం పట్ల అంతా మండిపడుతున్నారు. -
సొసైటీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.బాలాజి భట్టిప్రోలు: రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు (సొసైటీలు) ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.బాలాజి విమర్శించారు. భట్టిప్రోలులోని ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారు మెరుగైన జీవనాన్ని గడిపే విధంగా చర్యలు చేపడతామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు కార్మికుల సంక్షేమాన్ని, పరిశ్రమ రక్షణను విస్మరించారని పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు వివిధ రాయితీల రూపంలో చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో సొసైటీలు కొనఊపిరితో కొనసాగుతూ కార్మికులకు ఉపాధి కల్పించలేని దుస్ధితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి, సొసైటీల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కె.రామకోటేశ్వరరావు, కె.వీరమోహన్రావు, ఏఐటీయూసీ నాయకులు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతమైతే చర్యలు
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పదేపదే పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 60 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను విన్నవించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని కోరారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధిచిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకు వివరించారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ మహిళా ఎస్ఐ లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్
నగరంపాలెం: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు కేసులో ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు ఆటగాళ్లను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హోలులో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. సోమవారం టాస్క్ఫోర్స్ సమాచారంతో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో పట్టాభిపురం పీఎస్ సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో వికాస్ నగర్ మూడో వీధిలోని ఓ డాబాపై ఆకస్మిక తనిఖీలు చేశారు. హాలులో ఇద్దరు టేబుల్ ఎదురు కూర్చొని ఉండగా, మరో ఆరుగురు ఫోన్లల్లో బెట్టింగ్లు చేస్తున్నట్లు గుర్తించారు. సోమవారం ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్బాష్ లీగ్ తొమ్మిదో మ్యాచ్(సిడ్నీ థండర్/బ్రిస్బానే హార్ట్) బెట్టింగ్ నిర్వర్తించే క్రమంలో వీరందర్ని పట్టుకున్నారు. నిర్వాహకుడైన తాతినేని శ్రీనివాసరావు, విజయభాస్కరరెడ్డి, కొరిటెపాడు నాలుగో వీధికి చెందిన షేక్ సలీం అలియాస్ శ్రీను, తిరుమలశెట్టి నాగు, శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి ప్రాంతంలో ఉంటున్న కోటపాటి వెంకటరెడ్డి, పొన్నూరు రోడ్ సాయిబాబాకాలనీ ఒకటో వీధి వాసి దొడ్డా శ్రీకాంత్, బృందావన్ గార్డెన్స్ ఏడో వీధిలో ఉంటున్న జిల్లేలమూడి బ్రహ్మతేజ, నెహ్రునగర్ తొమ్మిదో వీధికి చెందిన పల్లె సుధాకర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13.60 లక్షలు, ఆన్లైన్లో రూ.5.05 లక్షలు ఫ్రీజ్, ల్యాప్టాప్, ఎనిమిది సెల్ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో నల్లచెరువు మేనకగాంధీనగర్కు చెందిన తాతినేని శ్రీనివాసరావు గత పదేళ్లుగా ఆనన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. కొరిటెపాడు పార్కు వెనుక ఉండే యర్రబోతుల విజయభాస్కరరెడ్డితో కలసి శ్రీనివాసరావు బెట్టింగ్లు నిర్వహించే వాడని చెప్పారు. ఇద్దరూ ఒక బెట్టింగ్లను పలువురికి అలవాటు చేశారని, యాప్ల ద్వారా బాల్ టు బాల్ బెట్టింగ్ నిర్వహించే వారని వివరించారు. పేకాటలో మోసం అంతర్జాతీయ, జాతీయ, లీగ్ క్రికెట్ మ్యాచ్ల వేళ తాతినేని శ్రీనివాసరావు సెల్ఫోన్లో వాట్సాప్ గ్రూప్లోని సభ్యులకు సమాచారం చేర వేసేవాడని ఎస్పీ తెలిపారు. పీచ్ ఈఎక్స్సీహెచ్ యాప్ సంబంధించి లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు పంపించి బెట్టింగ్లు చేసేవాడని వివరించారు. ఇదిగాక శ్రీనివాసరావు అప్పుడప్పుడు తెలిసిన వ్యక్తులతో పేకాట ఆడేవాడని చెప్పారు. ఇందులో సెల్ఫోన్, రిస్ట్ వాచీ, చెవిలో బ్లూ టూత్ ఉపయోగించి మిగతా ఆటగాళ్లను మోసగించేవాడన్నారు. ఆటగాళ్లకు ఫోన్పేల నగదు చెల్లించేవారని, వంద నుంచి పదివేల రూపాయల వరకు పందేలు ఉంటాయని తెలిపారు. అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ చెప్పారు. పీచ్ ఈఎక్స్సీహెచ్ యాప్ వెనుక ఎవరూ ఉన్నారనేది విచారిస్తున్నామని, గత పదేళ్లల్లో శ్రీనివాసరావుపై ఒక్క కేసు నమోదై ఉందని వెల్లడించారు. కేసుని ఛేదించిన డీఎస్పీలు అరవింద్ ( గుంటూరు పశ్చిమ), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), ఎస్ఐ నాగేంద్ర, పోలీస్ సిబ్బందిని అభినందించారు. -
భట్టిప్రోలులో హిందూ సమ్మేళనం
భట్టిప్రోలు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మండల కేంద్రమైన భట్టిప్రోలు రథం సెంటర్లో ఉప మండల హిందూ సమ్మేళనం సోమవారం సాయంత్రం నిర్వహించారు. తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గుంటూరు విభాగ్ ప్రచార కార్యవాహ్ గోలి రామారావు మాట్లాడారు. పారాయణలు, భజన సంకీర్తనలు, కోలాట ప్రదర్శనలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి. కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యన్నారాయణ, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయ భాస్కరి, నిర్వాహకులు వేల్పూరి శ్రీనివాసరావు, బూర్లె అరుణ కుమారి, బండారు శ్రీనివాసరావు, తూనుగుంట్ల సాయిబాబా, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ పాల్గొన్నారు. బల్లికురవ: పెళ్లి పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిన ఇంట్లో దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సోమవారం యజమాని ఇంటకి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండటంతో దొంగతనం జరిగినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన వివరాల మేరకు.. మండలంలోని చెన్నుపల్లి గ్రామంలోని రామాలయం ఎదురుగా గుంటుపల్లి హరిబాబు ఇటీవలే ఇంటిని మరమ్మతులు చేసుకొని నివాసం ఉంటున్నాడు. కుమార్తె వివాహ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇంటికి వచ్చి చూడగా బీరువాల్లో ఉండాల్సిన అర కిలో వెండి, నాలుగు సవర్ల బంగారం, రూ. 30 వేలు నగదు చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుగ్గిరాల: బీటెక్ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నావు ఎందుకంటూ తండ్రి మందలించగా మనస్తాపం చెంది కాలువలో పడి గల్లంతైన పఠాన్ గఫార్ (24) శవమై కనిపించాడు. వడ్డేశ్వరం గ్రామానికి చెందిన గఫార్ తండ్రి మందలించి కారణంగా శనివారం బకింగ్ హామ్ కెనాల్లో పడి గల్లంతయ్యాడు. తండ్రి నాగూర్ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం బకింగ్ హామ్ కాలువలో రెండు రోజులుగా వెతుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి తుమ్మపూడి సమీపంలో మృతదేహం కనిపించింది. గఫార్ కుటుంబ సభ్యులకు తెలియపరచగా వారు తమ కుమారుడేనని గుర్తించారు. అనంతరం పంచనామా నిమమిత్తం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
బ్రేక్ ఫిట్నెస్ కోసం గుంటూరు వెళ్లటం సరికాదు
బాపట్ల: ఆటోలు బ్రేక్ ఫిట్నెస్ కోసం గుంటూరు వెళ్లే విధంగా చలానాలు రావటం సరికాదని బాపట్ల జిల్లా కార్మికశక్తి ఆటో యూనియన్ నాయకులు జి.పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఈమేరకు బాపట్ల పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టిన ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గత 25 సంవత్సరాలుగా బాపట్లలోనే లైనెన్స్లు, బ్రేక్ ఫిట్నెస్లు చేపడుతున్నారని వివరించారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో ఇప్పుడు ఫిట్నెస్లు బాపట్ల నుంచి గుంటూరు తరలించటం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్కన మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించటంతో ఆటోలు నడిపే కార్మికులు రోడ్డున పడ్డారని వివరించారు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అదనపు భారాన్ని ఆటోడ్రైవర్లపై మోపి ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికై న చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, యోహోన్, ఏసుబాబు ఉన్నారు. -
ఉరకలెత్తిన ఉత్సాహం
సందడిగా వివా– వీవీఐటీయూ యువజనోత్సవం పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో జాతీయస్థాయి యువజనోత్సవం (వీవా–వీవీఐటీయూ 2025–26) వేడుకలు ఘనంగా ముగిశాయి. రెండు రోజుల యువజనోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంకేతిక, సాంస్కృతిక, క్రీడలు యువతను ఆకట్టుకున్నాయి. ● ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ యువజన ఉత్సవాల నిర్వహణ వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుందని, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాల పెంపునకు దోహదపడతాయని తెలిపారు. ● వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ రెండు రోజుల యువజనోత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారని, మంచి అనుభూతులతో సంతోషంగా గడిపారని తెలిపారు. ● వీవీఐటీయూ ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు విజయవంతంగా యువజనోత్సవాన్ని నిర్వహించారని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుదలకు ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపారు. ● ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, వీవీఐటీయూ చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ● ఈ వేడుకలో చాంపియన్ చిత్ర బృందం హీరో రోషన్, హీరోయిన్ అనస్వరా రాజన్ బృందం, వానర చిత్ర బృందం హీరో అవినాష్ తిరువీధుల, హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సందడి చేశారు. కార్యక్రంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ వై. మల్లికార్జునరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ కె.గిరిబాబు, ఆధ్యాపకులు పాల్గొన్నారు. -
కాకుమానులో గంజాయి స్వాధీనం
ప్రత్తిపాడు: ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుడిని కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు సౌత్జోన్ డీఎస్పీ జి. భానోదయ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం కాకుమాను ఎస్ఐ ఏక్నాథ్ స్థానిక అప్పాపురం రోడ్డు సమీపంలోని కరుణ రూరల్ గోడౌన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పెదనందిపాడు వైపు నుంచి బాపట్ల వైపు వెళుతున్న ఆటోని నిలిపి తనిఖీ చేస్తుండగా, ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒక వ్యక్తి దూకి పొలాల్లోకి పారిపోయాడు. దీంతో ఆటోలో ఉన్న బాపట్ల మండలం చెరువుజమ్ముల పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి దొరికింది. ఈ మేరకు మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి మూడున్నర కేజీల గంజాయి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ జి. శ్రీనివాసరావు, ఎస్ఐ. ఏక్నాథ్లు బాలుడిని అదుపులోకి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. -
ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
గుంటూరు రూరల్: నల్లపాడు ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ గేమ్స్ (ఏపీఎస్జీఎమ్)– 2025 మీట్ సోమవారం ప్రారంభమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే బి. రామాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జీవితంలో పైకి ఎదగడానికి క్రీడలు ఒక గొప్ప వేదికగా ఉంటాయని చెప్పారు. ఆటలు ఆడేటప్పుడు కేవలం ప్రతిభ కాదు గెలవాలన్న పట్టుదల కూడా ముఖ్యమని సూచించారు. సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, గెలుపు ఓటములు సహజమని తెలిపారు. ప్రిన్సిపాల్ పి.రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 19 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 382 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల పీడీలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దివ్యాంగ యువతి అదృశ్యం
కారంచేడు: చిన్నతనం నుంచే మూగ, చెవుడుతో ఉన్న యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికి కనిపించకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారంచేడు ఎస్సై షేక్ ఖాదర్బాషా వివరాల మేరకు..కారంచేడు యజ్ఞశాలపేటకు చెందిన కట్టా రాజేశ్వరరావు సుభాషిణి దంపతులకు 22 సంవత్సరాల కుమార్తె హేమంతిదేవి ఉంది. ఈమె చిన్నప్పటి నుంచి చెవుడు, మూగ అవ్వడంతో ఇంటి వద్దనే చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటుంన్నారు. ఈమె ప్రతి రోజూ ఇంటి వద్ద నుంచి పశువుల కొష్టంకు వెళ్లి పశువులకు దాణా పెట్టి వస్తుంటుంది. ఈక్రమంలోనే సోమవారం కూడా ఇంటి నుంచి పశువుల కొష్టంకు వెళ్లిన యువతి మధ్యాహ్నం వరకు ఇంటికి చేరలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు సమీపంలోని అందరినీ విచారణ చేశారు. గత్యంతరం లేక సాయంత్రం ఆమె విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద ఫోన్ కూడా ఉందని ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తల్లిదండ్రులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం బృందాలను ఏర్పాటు చేశామని, ఎస్పీ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ సూచనలతో విచారణ వేగవంతం చేస్తున్నామన్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 91211 02145 నంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు. -
అలరించిన సంప్రదాయ దినోత్సవం
బాపట్ల: వ్యవసాయ విద్యార్థులకు విద్యా నైపుణ్యం, కెరీర్ గైడెన్స్, సాహిత్య కార్యకలాపాలలో శిక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా బాపట్ల వ్యవసాయ కళాశాలలో సంప్రదాయ దినోత్సవం ఆదివారం నిర్వహించారు. భారతీయ సంప్రదాయాన్ని చాటుతూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఒడిశా, నాగాలాండ్, ఝార్ఖండ్లతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆకర్షణీయమైన వస్త్రధారణలతో వేడుకకు మరింత వన్నె చేకూర్చారు. పలు సంప్రదాయ నాట్యాలు, జానపద నృత్యాలతో పాటు అలనాటి చలన చిత్రాల్లోని మధుర గీతాలకు కూడా నర్తించి అలరించారు. లలిత గీతాలాపన, వాద్య సంగీత ప్రదర్శన, స్కిట్లు వంటి పలు వినోదాత్మక ప్రదర్శనల ద్వారా ఆహూ తులను పరవశింపజేశారు. అంకురం, అవని, అనంతం నిర్దేశాలుగా క్లబ్ బాధ్యతలను నిర్వర్తిస్తుందని వ్యవసాయ కళాశాల ఇన్చార్జి అసోసియేట్ డీన్ ఎస్.ఆర్. కోటేశ్వరరావు తెలిపారు. విద్యార్థుల్లో వేడుకలు జాతీయ సమైక్యతా భావనను నెలకొల్పుతాయని, భారతీయ సంప్రదాయాన్ని గౌరవించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రస్తుత విద్యార్థులకు పూర్వ విద్యార్థులు జూమ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాలలో పలు రాష్ట్రాల విద్యార్థుల సందడి -
బాపట్ల
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సత్తెనపల్లి: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంలో అర్చకులు అలంకరించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు నిలిచిపోయింది. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.7827 టీఎంసీలు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 568.80 అడుగులకు చేరింది. ఇది 253.5634 టీఎంసీలకు సమానం. అద్దంకిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరైన నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్రేపల్లె వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్న నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్, నాయకులు వేమూరులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు 7 -
మాదక ద్రవ్యాలతో సమాజానికి పెనుముప్పు
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి పెనుముప్పుగా పరిణమించాయని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జేకేసీ కళాశాలలో నిర్వహించిన ‘‘రోటోఫెస్ట్–2025’’ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవికృష్ణ మాట్లాడుతూ యువత క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజ సేవ పట్ల నిబద్ధత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రోటరీ అనేది మానవాళి ఆరోగ్యం, భవిష్యత్తు కోసం నిరంతరం సేవలు అందిస్తున్న అద్భుతమైన సంస్థ అని పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అనేక మంది విద్యార్థులను డీ–అడిక్షన్ సెంటర్లకు పంపించి పునరావాసం కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ ప్రతినిధులు మామిడి సుబ్బారావు, నంబూరు కృష్ణమూర్తి, కనమర్లపూడి రవి కిరణ్, ఏవీ హరనాథ్ బాబు, గార్లపాటి రవి కిరణ్, ముప్పవరపు వెంకట సత్యనారాయణ, పట్టాభిపురం సీఐ జి.వెంకటేశ్వర్లు, ఈగల్ సీఐ విక్టర్, ఎస్సై సునీల్ బాబు, విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ -
10 కిలోల గంజాయి స్వాధీనం
చీరాల రూరల్: టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిపిన తనిఖీల్లో 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేరళ రాష్ట్రానికి చెందిన నిందితుడిని అరెస్టు చేసినట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపారు. ఆదివారం రాత్రి జీఆర్పీ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్, ఒంగోలు ఆర్పీ సీఐ ఎస్కే మౌలా షరీఫ్ ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, అక్రమ మద్యం సరఫరా వంటి వాటిని గుర్తించేందుకు ఆదివారం రైలు బండ్లలో సాధారణ తనిఖీల్లో భాగంగా కేరళ రాష్ట్రానికి వెళ్లే టాటానగర్ ఎక్స్ప్రెస్లో తనిఖీ చేపట్టారు. ఈపురుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో జనరల్ బోగీలో ఒకవ్యక్తి వద్ద అనుమానాస్పదంగా ఉన్న బ్లాకు కలర్ బ్యాగును పరిశీలించగా 10 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. నిందితుణ్ణి ప్రశ్నించగా తనది కేరళ రాష్ట్రం ఎర్నాకుళానికి చెందిన ఆశిన్ షిబుగా చెప్పాడన్నారు. గంజాయితో పాటు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పట్టబడిన గంజాయి విలువ రూ. 50,000 ఉంటుందని ఎస్సై వెల్లడించారు. నిందితుడు విజయనగం జిల్లా పరిసర ప్రాంతాల్లో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైలు బండ్లలో అక్రమంగా తరలించి కేరళ రాష్ట్రంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన నిందితుడు ఆశిన్ షిబును అరెస్టు చేసిన రైల్వే పోలీసులు టాటా నగర్ ఎక్స్ప్రెస్లో ఘటన -
పురావస్తు మ్యూజియం కలేనా?
అద్దంకి: పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఆనవాళ్లను భద్రపరచి, భావి తరాలు చూసేందుకు ఉపయోగపడే పురావస్తు మ్యూజియం ఏర్పాటు కలగానే మిగిలింది. గతంలో పురావస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేస్తామని మాటిచ్చి ప్రతిపాదనలు తయారు చేసి పంపినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఏటికేడు పురాతన ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చరిత్ర పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అద్దంకి కోటకు అనవాళ్లు కనుమరగయ్యాయని చెబుతున్నారు. పురాతన కట్టడాలు.. అద్దంకి పట్టణం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నుంచే ఉన్నట్లు ఇక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. తరువాత వివిధ రాజవంశాలు అద్దంకి రాజధానిగా చేసుకుని రాజ్య పాలన చేశాయి. ఇక్కడ బ్రిటిష్ కాలంనాటి నిర్మాణాలున్నాయి. పురాతన కట్టడాల విషయానికొస్తే చోళుల కాలం నాటి వేయి స్తంభాల దేవాలయం, 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన నాట్య గణపతి ఆలయం, 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించిన పాత శివాలయం(రామలింగే శ్వరాలయం) ఇక్కడే అగస్త్య మహాముని ప్రష్టించిన అగస్తేశ్వరాలయం, పోతురాజు గండిలో తొమ్మిది విగ్రహాలు, రెడ్డిరాజుల కాలం కాకానిపాలెంలోని కోదండరామస్వామి ఆలయం, నాంచారమ్మ ఆలయం(పోలేరమ్మ), రంగనాయకుల ఆలయం, 16వ శతాబ్దానికి చెందిన నరసింహ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, 13వ శతాబ్దం నాటి గాడిద శాసనం, క్రీస్తు పూర్వ 848లోని పండరగని తొలి తెలుగు పద్య శాసం, 1902లో నిర్మించిన విక్టోరియా మహారాణి సత్రం, 1920లో నిర్మించిన ప్రభుత్వ వైద్యశాల, 1850లో నిర్మించిన పోలీస్స్టేషన్, 1930లో నిర్మించిన తాలూకా ఆఫీసు, క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నాటి సమాధులు, ధర్మవరం కొండపైని బౌద్ధం ఆనవాళ్లు, ధర్మవరం, నన్నూరుపాడు, పేరాయిపాలెం, మణికేశ్వరం, ధేనువకొండ, అద్దంకి కొండ, తదితర ప్రాంతాల్లో పురాత ఆనవాళ్లు కోకొల్లలుగా దొరికినా భద్రపరచే ప్రదేశం లేక ఇప్పటికే కనుమరుగయ్యాయి. అద్దంకి రెవెన్యూ డివిజన్గా మారుతున్న తరుణంలో అద్దంకి పరిసర ప్రజలతోపాటు, చరిత్రను చదువుకునే విద్యార్థుల కోసం పురావస్తు మ్యూజీయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురాతన ఆనావాళ్లు మెండుగా ఉన్న అద్దంకిలో ఒక పురావస్తు మ్యూజియం అవసరం ఎంతైనా ఉంది. భద్రపరచక ఇప్పటికే కొన్ని ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. మ్యూజియం ఏర్పాటు చేయకుంటే చరిత్ర పేజీల్లో మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, పురావస్తు అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి మ్యూజియం ఏర్పాటు చేయాలి. – జ్యోతి చంద్రమౌళి, చరిత్ర పరిశోధకుడు -
ఉండవల్లిలో ఫ్లెక్సీలు చింపిన గుర్తు తెలియని వ్యక్తులు
తాడేపల్లి రూరల్: మండల పరిధిలోని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. పార్టీ ఉండవల్లి కమిటీ అధ్యక్షులు వీర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా ఉండవల్లిలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడం దారుణమని ఖండించారు. తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఇటువంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదని, ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా ఈ విషయాలపై దృష్టి సారించి, ఫ్లెక్సీలు చించినవారు ఏ పార్టీ వారు అయినా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. శనివారం రాత్రి 12 గంటలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రి 2 గంటలకు చింపివేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎవరి ఫ్లెక్సీలకు వారే బాధ్యులు: సీఐ వీరేంద్ర ఏ పార్టీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, అవి ఎవరు చించినా తమకు సంబంధం లేదని, పార్టీ వారే సంరక్షించుకోవాలని సీఐ వీరేంద్ర తెలిపారు. ఫ్లెక్సీలు తొలగిస్తే వెంటనే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు -
పోలియో రహిత సమాజమే లక్ష్యం
బాపట్ల: పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక బాపట్ల పట్టణం రైల్వే పేట ప్రాథమిక పాఠశాలలో ఆదివారం కలెక్టర్ ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియోను బాపట్ల జిల్లా నుంచి తరిమి వేయాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,315 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.45 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయడం లక్ష్యం అన్నారు. పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలకు కలెక్టర్, ఆయన సతీమణి భూమిక చంద్రలాలీ వచ్చి కుమారుడికి పోలియో చుక్కల మందు వేయించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, తహసీల్దార్ షాలీమా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
పండుగలా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
బాపట్ల జిల్లాలో భారీగా సేవా కార్యక్రమాలుసాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా పండుగలా జరిగాయి. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. కేక్లు కట్ చేశారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బెడ్లు, దుప్పట్లు అందజేశారు. బైక్ర్యాలీలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో వాడవాడలా వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన మంచిని, పథకాల అమలును ప్రజలు మరోమారు గుర్తు చేసుకున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి విరాళం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరంలో ఉండే యువకుడు బకింగ్హామ్ కెనాల్లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతైన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేశ్వరానికి చెందిన నాగూర్, షంషుద్దీన్ల పెద్ద కుమారుడు గఫూర్ (25) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గ్రామంలోనే ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేదు. శనివారం సాయంత్రం వడ్డేశ్వరం నుంచి బకింగ్హామ్ కెనాల్ దాటే బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు రద్దీ సాధారణంగా ఉండగా, మధ్యాహ్నం 12 గంటల నుంచి అనూహ్యంగా పెరిగింది. దీంతో ఘాట్రోడ్డుపైకి కార్లు, ఇతర వాహనాలను అనుమతించలేదు. కేవలం భక్తుల ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ఆదివారం కావడంతో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమానికి రద్దీ కనిపించింది. మరో వైపున పెద్ద ఎత్తున భవానీలు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులను సమర్పించారు. ఘాట్రోడ్డు క్యూలో రద్దీ.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్నారు. మహా నివేదన అనంతరం మహామండపం మీదగా వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉండగా, ఘాట్రోడ్డు మార్గంలో భక్తుల తాకిడి కనిపించింది. పల్స్పోలియోను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పోలియో చుక్కలు వేశారు. -
అపరిచిత లింక్లను క్లిక్ చేయొద్దు
బాపట్ల టౌన్: క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ వచ్చే అపరిచిత లింక్లను క్లిక్ చేయవద్దని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అపరిచిత లింక్లను క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు వినూత్న మార్గాలను ఎంచుకొని ప్రజలను మోసం చేస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారన్నారు. నూతన సంవత్సరాలను ఆసరాగా చేసుకొని క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు అపరిచిత లింక్లు, ఏపీకే ఫైల్లను ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేస్తున్నారన్నారు. వాటిని క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం అయిన పాన్, ఆధార్ కార్డ్ల నంబర్లు, వాటి ఫోటోలు, బ్యాంకు ఖాతా గురించిన సమాచారం తదితర వివరాలను అపరిచిత లింక్ల్లో పంచుకోవద్దని హెచ్చరించారు. ఫోన్ నంబర్ ఆధారంగా కూడా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఈమెయిల్ తదితర సోషల్ మీడియా ద్వారా క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ల పేరుతో అపరిచిత లింక్లను పంపడం. విదేశీ లాటరీ, క్యాష్బ్యాక్ గెలుచుకున్నారని పేర్కొంటూ ప్రాసెసింగ్ ఫీజులు లేదా వ్యక్తిగత వివరాలు అడగడం లాంటి చేస్తారని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రయాణం, బహుమతులు, హోటళ్లు, పార్టీ పాస్లు, ఎలక్ట్రానిక్స్పై భారీ డిస్కౌంట్లు ఇస్తామని చెప్పే నకిలీ సందేశాలు, ఈ–మెయిల్లు, సోషల్ మీడియా ప్రకటనలు వస్తుంటాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
నెహ్రూనగర్: ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆదివారం లాడ్జి సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో పౌర హక్కులు అడుగంటి పోతున్నాయని, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు నేడు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేలాదిమంది పోలీసు బలగాలని అడవుల్లో దింపి అక్కడ ఆదివాసుల జీవితాలను సర్వనాశనం చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయటం వంటి చర్యలను నిలిపివేయాలన్నారు. జాయింట్ సెక్రెటరీ చిన్న మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పుతూ ఈ దేశ ప్రజల పైన మతదాడులు చేస్తుందన్నారు. జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో జరిగే పౌర హక్కుల సంఘం మహాసభలకు మేధావులు, మైనా ర్టీలు, దళితులు, ఆదివాసీలు వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. వి ప్రభాకర్ ఎన్ నీలాంబరం, డి సుధాకర్ పాల్గొన్నారు. గెలుపును పంచడమే నిజమైన ఆట విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత గుంటూరు ఎడ్యుకేషన్ క్రీడలంటే పతకాలు కాదని, గెలుపును పంచడమే ఆటకు నిజమైన నిర్వచనమని విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత అన్నారు. వికాస్నగర్లోని వికాస్ క్రీడా మైదానంలో భాష్యం ఒలంపస్ పేరుతో మూడు రోజులపాటు జరిగిన వార్షిక స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న డీసీపీ సరిత మాట్లాడుతూ క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తాయన్నారు. మన అనే భావన క్రీడా స్ఫూర్తి ద్వారా పెంపొందించబడుతుందన్నారు. దేశానికి వన్నెతెచ్చిన ఎంతోమంది క్రీడాకారులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భాష్యం యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. తొలుత డీసీపీ సరిత భాష్యం స్పోర్ట్స్ మీట్ జెండాలను ఆవిష్కరించి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. విద్యా ర్థులు నిర్వహించిన ఓపెన్ పరేడ్లో వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డీసీపీ సరిత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈఓలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణంలో శానిటరీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న యువతి గుండెపోటుతో ఆదివారం మృతి చెందింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని 1వ వార్డు, పోలకంపాడు, పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో మేడూరి ప్రవల్లిక(30) శానిటరీ సెక్రటరీగా పని చేస్తోంది. భర్త రాజకుమార్ కూడా ఇదే శాఖలో పనిచేస్తున్నారు. ప్రవల్లిక నిండు గర్భణి. గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రవల్లిక మృతివార్త తెలుసుకున్న మున్సిపల్ అధికారులు నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ లక్ష్మీపురం: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను మరింత అంధకారంలోకి నెట్టివేసే విధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ దేశంలో కార్మిక వర్గం హక్కులను సాధించుకున్నది కమ్యూనిస్టు ఉద్యమం వల్లేనని స్పష్టం చేశారు. అనంతరం సీపీఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, సీపీఐ నగర కార్యదర్శి ఆకీటి అరుణ్కుమార్ మాట్లాడారు. -
తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటంలో కీలకపాత్ర
తెనాలి: సంఘ గుర్తింపు రద్దయినప్పటికీ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో నిరంతర చర్చలు కొనసాగిస్తున్నామనీ, రాబోయే ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తుందని తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్గుప్తా స్పష్టం చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ) గ్రూప్–సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం చెంచుపేటలోని రావి టవర్స్లో ప్రారంభించారు. గ్రూప్–సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణపతి అధ్యక్షత వహించారు. రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు, కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డీఎల్ కాంతారావు మాట్లాడుతూ నాటి తరం కార్మికుల పోరాట స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని, ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుకు సమష్టి పోరాటాలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు రద్దు చేసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రూప్ ‘సి’ సంఘం మరింత బలపడిందని పేర్కొన్నారు. ఎన్ఎఫ్పీఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్.పరాశర్ మాట్లాడుతూ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ) గ్రూప్ ‘సి’ సంఘ గుర్తింపును కేంద్రప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దు చేసిందన్నారు. పి–4 సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె. మురళి, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.విద్యాసాగర్, జీడీఎస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి, పీ3, పీ4, జీడీఎస్ సంఘాల జాతీయ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్గుప్తా -
లోపభూయిష్టంగా విద్యా ప్రణాళిక
బాపట్ల టౌన్: విద్యా శాఖ పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందని ఎస్టీయూ బాపట్ల జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బాపట్ల పట్టణంలోని సంఘ కార్యాలయంలో సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళిక ఆదివారాలు, పండుగ సెలవు రోజుల్లో కూడా ఉండడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు విశ్రాంతి లేకుండా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను అభ్యసించినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతుంటే అందుకు భిన్నంగా అవిశ్రాంతంగా చదవడం, మార్కులే ప్రతిభకు కొలమానంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖాధికారులు చేపడుతున్న చర్యలు ఆక్షేపణీయమన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ ఇప్పటికే ఉపాధ్యాయులు బోధనేతర కార్యక్రమాలతో విలువైన బోధన సమయాన్ని కోల్పోతున్నామని అన్నారు. సమావేశంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి పీవీ నాగరాజు, జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ నూరుబాషా సుభాని, రాష్ట్ర కౌన్సిలర్స్ గుగ్గిలం ఉదయ శంకర్, డీవీ సుబ్బారావు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు వంకా ప్రభాకరరావు, తోట శివయ్య, శివాంజనేయులు, ఏవీ నారాయణ, బుజ్జిబాబు, ఓ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ -
రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ ప్రకాశం
జె.పంగులూరు: ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్ఆర్, బీఎన్ఎం జూనియర్ కళాశాలలో గత మూడు రోజుల నుంచి పంగులూరులో జరుగుతున్న 44వ రాష్ట్ర స్థాయి బాలబాలికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ప్రకాశం బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించింది. ద్వితీయ స్థానం కృష్ణ, మూడో స్థానం వైజాగ్, విశాఖ పట్నం సంయుక్తంగా సాధించాయి. బాలికల విభాగంలో చిత్తూరు మొదటి స్థానం సాధించింది. రెండో స్థానం శ్రీకాకుళం సాధించగా, మూడో స్థానం విజయనగరం, ప్రకాశం జట్లు సంయుక్తంగా సాధించాయి. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గరటయ్య, కె.హనుమంతరావు, యూనియన్న్ బ్యాంక్ అసోసియేషన్ సెక్రటరీ రాజేష్ ఖన్నా, కేకేఎఫ్ఐ సెక్రటరీ సీతారామిరెడ్డి, రఘుబాబు, గ్రామ పెద్దలు వీరనారాయణ, రామారావు, రావూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్ల వివరాలు మొదట జరిగిన చిత్తూరు, శ్రీకాకుళం బాలికల ఫైనల్ మ్యాచ్లో మొదటి టాస్ గెలిచిన చిత్తూరు జట్టు డిఫెన్స్ ఎంచుకొని నిర్ణీత 9 నిమిషాలకు 26 పాయింట్లు సాధించింది. అనంతరం డిఫెన్స్ చేసిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 9 నిమిషాల్లో 14 పాయింట్లు సాధించింది. 12 పాయింట్ల తేడాతో శ్రీకాకుళంపై చిత్తూరు విజయం సాధించింది. అనంతరం జరిగిన బాలుర మ్యాచ్లు మొదట టాస్ గెలిచిన ప్రకాశం జట్టు రన్నింగ్ ఎంచుకుంది. డిఫెన్స్ చేసిన కృష్ణా నిర్ణీత 9 నిమిషాలకు 10 పాయింట్లు సాధించింది. అనంతరం డిఫెన్స్ చేసిన ప్రకాశం నిర్ణీత 9 నిమిషాలకు 24 పాయింట్లు సాధించి మ్యాచ్ వన్ సైడ్ చేసింది. మంచి ప్రతిభ కనబరిచిన బాజీ ఆల్ రౌండర్ ట్రోఫీని అందుకున్నాడు. బాలికల విభాగంలో చిత్తూరుకు ప్రథమ స్థానం -
వృద్ధురాలిని ఇంటికి చేర్చిన శ్రద్ధ ఫౌండేషన్
రేపల్లె: మతిస్థిమితం లేక తప్పిపోయిన వృద్ధురాలు విశాఖపట్టణానికి చేరడంతో అక్కడి శ్రద్ధ రిహాబిటేషన్ ఫౌండేషన్ సభ్యులు ఆశ్రయం కల్పించి, నాలుగు నెలల తరువాత కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. రేపల్లె పట్టణం 4వ వార్డుకు చెందిన మేత్ర సూరిబాబు భార్య శివ చెంచులక్ష్మి మతిస్థిమితం లేక ఆగస్టు 1న ఇంటి నుంచి వెళ్లిపోయి విశాఖపట్టణం చేరారు. వీధుల్లో తిరుగుతున్న ఆమెను అక్కడి శ్రద్ధ రిహాబిటేషన్ ఫౌండేషన్ సభ్యులు చేరదీసి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించటంతో పాటు చికిత్సలు అందించారు. నాలుగు నెలలు గడిచాక మతిస్థిమితం రావటంతో శివ చెంచులక్ష్మి తనది రేపల్లె పట్టణంలోని 4వ వార్డు అని ప్రతినిధులకు తెలియజేశారు. ఫౌండేషన్లో విధులు నిర్వహించే పొన్నూరుకు చెందిన డాక్టర్ శ్రావణి, పొన్నూరుకు చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులకు విషయాన్ని తెలియజేశారు. క్లబ్ ప్రతినిధులు రేపల్లె ప్రాంతంలోని ఉపాధ్యాయుడు ఉల్లంఘుంట వెంకటేశ్వరరావును సంప్రదించి శివ చెంచులక్ష్మి కుటుంబ సభ్యుల ఆచూకీని కనుగొన్నారు. ఆదివారం శ్రద్ధ రిహాబిటేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆమెను రేపల్లెకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆశ్రయం కల్పించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
పెదకాకాని: అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం ఆదివారం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జీవీఆర్ ప్రైమ్ హోటల్లో ఆదివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడుగురు మహిళలు, 9 మంది పురుషులు (విటులు), ఒక మేనేజర్, ఒక ఆర్గనైజర్ మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు పెదకాకాని పోలీసుస్టేషన్కు తరలించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, పేకాట, వ్యభిచారం, కోడిపందాలు, సింగిల్ నెంబర్ లాటరీలు వంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంహించేది లేదన్నారు. అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారు, నిర్వహించే వారు, వాటికి సహకరించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు ఎడ్యుకేషన్: శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మార్చి 1న నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల చిత్రకారులు జనవరి 20లోపు పేర్లు నమోదు చేసుకోవాలని క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కేపీ బాబు ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, యువతలో సృజనాత్మతకను కళలను, పెంపొందించడంతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. చిత్రలేఖన పోటీలతో పాటు ప్రదర్శనలో పాల్గొనేందుకు వివరాల కోసం 98853 77653 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ మోడల్ హైస్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సిహెచ్ జోసఫ్ సుధీర్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూశాఖ రాష్ట్ర అధ్యక్షుడు పి.మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సుధీర్బాబు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సును పెంచడంతో పాటు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉపాధ్యాయుల మ్యాచింగ్ గ్రాంట్ సమస్యను పరిష్కరించడంతో పాటు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ ఉద్యోగోన్నతులను చేపట్టాలన్నారు. ఫిట్మెంట్ అమలుతోపాటు, పే ప్రొటెక్షన్, సర్వీస్ రూల్స్, సెలవు రోజుల్లో స్టడీ అవర్స్ తగ్గింపు, తెలుగు, హిందీ భాషా పండితుల అప్గ్రేడేషన్కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ ముందు ఉంటుందని అన్నారు, ఏపీ మోడల్ స్కూల్స్ రాష్ట్రోపాధ్యాయ సంఘ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ టెన్త్ స్టడీ అవర్స్ విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, స్లిప్ టెస్టులను నిర్వహించి, తక్షణ మూల్యాంకనం, మార్కులు ఆన్లైనంలో అప్లోడ్కు తగిన పమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. వెబ్ ఎక్స్ సమావేశాలను తగ్గించాలని కోరారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూ అధ్యక్షుడు పి.సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శౌరిరాజు, రాష్ట్ర ఆసోసియేట్ అధ్యక్షుడు ఎం.ప్రభుదాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లెపు శ్రీనివాసరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ మేరీ వేలాంగిణి, సీహెచ్ ఝాన్సీవాణి, పద్మజ, విజయలక్ష్మి, పద్మావతి, మేరీ సూజన్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్: కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నట్లు సమితి అధ్యక్షుడు మల్లెల హరేంద్రనాథ్ చౌదరి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్లో 85 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినులు గుంటూరు కుందులరోడ్డులోని కమ్మజన సేవా సమితి కార్యాలయంలో వ్యక్తిగతంగా, సంస్థ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాలు పొంది, పూర్తి చేసి ఈనెల 30లోపు అందజేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల చెందిన విద్యార్థినులకు 80 శాతం మార్కులు వచ్చినా అర్హులేనని, తల్లిదండ్రులు లేని విద్యార్థినులకు 50 మార్కులతో ఉత్తీర్ణులైనా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. విద్యార్థినుల ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఉపకార వేతనాలకు ఎంఇక చేస్తామని, ఎంపికై నవారికి రూ.ఏడువేలు చొప్పున ఉపకార వేతనం అందజేస్తామని హరేంద్రనాఽథ్చౌదరి తెలిపారు. -
ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో న్యుమేర్ సత్తా
850 డాలర్లు ప్రైజ్మనీ అందజేసిన నిర్వాహకులు చీరాల రూరల్: బంగ్లాదేశ్లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చీరాలకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు షేక్ న్యుమేర్ అత్యుత్తమ ప్రదర్శనతో ద్వితీయ స్థానం సాఽధించాడు. పోటీల నిర్వాహకులు చేతులు మీదుగా 850 డాలర్లు ప్రైజ్మనీ అందుకున్నాడు. ఈనెల 16వ తేదీ నుంచి 20 వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓపెన్ ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు షేక్ హుమాయూన్ కబీర్ కుమారుడు షేక్ న్యుమేర్ మెన్స్ సింగిల్స్ విభాగంలో పాల్గొని, కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థులను పదునైన రాకెట్లతో చిత్తు చేసి ద్వితీయ స్థానం సాధించాడు. నిర్వాహకుల చేతులు మీదుగా ప్రైజ్మనీతో పాటు మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాడు. న్యుమేర్ను పలువురు సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందనలు తెలియజేశారు. న్యుమేర్ గతంలో కూడా అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. జె.పంగులూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లా బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్గా వైఎస్సార్ సీపీ నాయకులు స్వయంపు హనుమంతురావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనకు ఒంగోలు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. స్వయంపు హనుమంతురావు వైఎస్సార్ సీపీ నాయకులుగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ సుపరిచితులే. కొంతకాలం పంగులూరు ఇన్చార్జ్గా ప నిచేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ఆధిష్టానం బీఎస్ఎన్ఎల్ అధికారులకు పేరును సిఫార్సు చేసింది. కార్యక్రమంలో గుంటూరు పీజీ ఎంటీడీ సప్పరపు శ్రీధర్, గుంటూరు డీజీఎం సీవీ గిరిబాబు, ఒంగోలు డీఈ చంద్రశేఖర్, ఒంగోలు ఎస్డీ మురళీ కృష్ణ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన 28వ ప్రాంతీయస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడలు, ఆటల పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు కలసి విద్యార్థినులను అభినందించారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకుల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న, చేసుకోని విద్యార్థులకు చివరి విడత స్పాట్ కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఈనెల 22వ తేదీ, 24వ తేదీలలో స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. సత్తెనపల్లి: పట్టణ పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన మైనర్ విద్యార్థిని గుంటూరుకు చెందిన ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ యువకుడికి గుంటూరుకు చెందిన మరో యువకుడు ట్విట్టర్లో పరిచయం కావడంతో ఇరువురు కలిసి విజయవాడకు చెందిన మైనర్ విద్యార్థిని కారులో సత్తెనపల్లికి తీసుకువచ్చారు. గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులకు సత్తెనపల్లికి చెందిన ఓ యువకుడు సహకరించడంతో ముగ్గురు కలిసి ఆమెను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ గదిలో ఉంచారు. విద్యార్థిని తండ్రి కుమార్తె అదృశ్యమైందని విజయవాడ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ పోలీసులు మైనర్ విద్యార్థిని సెల్ఫోన్ సంకేతాల ఆధారంగా సత్తెనపల్లిలో ఉన్నట్లు లోకేషన్ చూపించడంతో వారు ఇక్కడి పోలీసులను సంప్రదించినట్లు సమాచారం. -
క్రీడల్లో అఖిల్ జిగేల్
అద్దంకి: కష్టే ఫలి అనే నానుడిని నిజం చేశాడు ఓ యువకుడు. సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన గంటెనపాటి సువార్త, కరుణాకర్ కుమారుడు అఖిల్ ఇస్రాయేల్. చదువుతో పాటు, పలు క్రీడల్లో ప్రావీణ్యం సంపాందించి గిన్నిస్తో పాటు లిమ్కా బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. 15 సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు అందుకుని ప్రశంసలు పొందాడు. బ్రూస్లీ ఆదర్శం చిన్నతనం నుంచే అఖిల్ బ్రూస్లీ సినిమాలు చూసి, అతని లాగా తాను కూడా చేయాలని అనుకునే వాడు. క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలనే తపన ఉండేది. పేద కుటుంబం కావడం, ప్రోత్సహించేవారే లేకపోవడంతో ఆశయ సాధనలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా పట్టు వదల్లేదు. బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడు. చదవుకు పట్టణం వెళ్లిన సమయంలో అక్కడ వివిధ రకాల క్రీడల్లో ప్రావీణ్యం పొందాడు. 2011 నుంచి మూడు సంవత్సరాల పాటు గుంటూరులో మస్తాన్ అనే గురువు వద్ద కుంగ్ఫూ నేర్చున్నాడు. 2014 నుంచి మరో మూడు సంవత్సరాలు హైదరాబాదులోని సుమన్ షోటోకాన్ అకాడమీలో కిక్ బాక్సింగ్, కరాటేలో శిక్షణ పొందాడు. తరువాత మార్షల్ ఆర్ట్ చేసి, బ్లాక్ బెల్ట్లు వన్ డౌన్, టూ డౌన్ పొందాడు. జైపూల్లో ఐ మాస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 16 దేశాలకు చెందిన వారు పాల్గొన్న ఈవెంట్లో రెండు సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. బీపీఈడీ, తరువాత ఎంపీఈడీ చేశాడు. వరల్డ్ రికార్డుల్లో స్థానం అఖిల్ గత నెలలో తమిళనాడులో ఈవెంట్లో పాల్గొన్నాడు. 15 నిమిషాలు ఆపకుండా పంచ్లు, కిక్లు ఇచ్చి గిన్నిస్తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సాఽధించాడు. 30 నిమిషాలు అపకుండా ఇచ్చిన ప్రదర్శనల్లో నోబెల్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. స్టిక్ రోటేషన్ (కర్రసామును పోలిన) ఈవెంట్లో 12 నిమిషాలు కర్రను ఆపకుండా తప్పి మరో రికార్డు సాధించాడు. టాంగ్టా క్రీడలో సిల్వర్ మెడల్ పొందాడు. గట్కా, టాంగ్టా క్రీడా ఏపీ కోచ్గా ఉన్నాడు. సినీ యాక్టర్ సుమన్, స్టంట్మాస్టర్ల చేతుల మీదుగా ఎనిమిది సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు, రామ్ లక్ష్మణ్ల నుంచి మూడు సార్లు, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేతుల మీదుగా ఒక సారి బెస్ట్ మాస్టర్ అవార్డు పొందాడు. కిషన్ రెడ్డి, హీరో ప్రశాంత్, చలపతిరావు, శ్రీశాంత్లతో కలుపకుని మొత్తం 15 సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు పొందాడు. వేలాది మందికి తాను నేర్చుకున్న విద్యలను ఉచితంగా నేర్పుతున్నందుకు ఏలూరులో బోధి ధర్మ అవార్డు పొందాడు. వేలాది మందికి ఉచిత శిక్షణ నేర్చుకున్న విద్యలను శిష్యులకు నేర్పడంతో పాటు, శిష్యులతో కలిసి అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పటి వరకూ లక్ష మందికి ఉచిత ఉచిత శిక్షణ ఇచ్చాడు. భవిష్యత్తులో స్పోర్ట్ కోటాల్లో పోలీసు డిపార్ట్మెంటులో మంచి ఉద్యోగం సాధించాలని ఆశయంగా పెట్టుకున్నానని అఖిల్ చెప్పాడు. -
నిషేధిత జాబితా నుంచి పట్టా భూములు తొలగించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి బాపట్ల జిల్లాలోని పట్టా భూములను అత్యధికంగా తొలగించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. నిషేధిత భూముల జాబితా, చుక్కల భూముల జాబితా నుంచి భూములను తొలగించడంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. అధికారుల సమష్టి కృషితోనే బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, సీఎం నుంచి అందుకున్న ప్రశంసలు రెవెన్యూ అధికారులకే చెందుతాయని కలెక్టర్ చెప్పారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని ఇప్పటి వరకు జిల్లాలో 1,527 అర్జీలు నమోద య్యాయన్నారు. సెప్టెంబర్ నెల నుంచి 597 అర్జీలు పరిష్కారమయ్యాయన్నారు. మిగిలిన 930 అర్జీలు పెండింగ్లో ఉండగా శనివారం 42 అర్జీలపై రెవెన్యూ దస్త్రాల పరిశీలన, విచారణ చేపట్టారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు విస్తృత సేవలు బాపట్ల: అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు బాగుండాలని కలెక్టర్ చెప్పారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, సీడీపీఓలు పాల్గొన్నారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు చీరాల టౌన్: పంటల సాగుకు ముఖ్యమైన యూరియా జిల్లాలో అవసరం మేరకు అందుబాటులో ఉందని, యూరియాను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. శనివారం చీరాల పట్టణంలోని అన్నపూర్ణ ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా విక్రయాలు చేపట్టాలని అధిక ధరలకు అమ్మకాలు చేస్తే డీలర్ షిప్ రద్దు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని రైతులకు కావాల్సిన యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందిస్తుందన్నారు. ప్రతి రైతు యూరియాను కొనుగోలు చేసి రశీదులు పొందాలన్నారు. యూరియాను అధిక ధరలకు అమ్మకాలు చేస్తే కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్ 77028 06804 ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు, ఇన్చార్జి వ్యవసాయాధికారి అన్నపూర్ణమ్మ ఉన్నారు. -
ఉత్కంఠభరితంగా ఖోఖో పోటీలు
జె.పంగులూరు: స్థానిక మాంగుట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల క్రీడా ప్రాగణంలో, ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరుగుతున్నాయి. శనివారం మెదటి పూల్లో బాలురకు 12, బాలికలకు 12 మ్యాచ్ జరిగాయి. మొత్తం 48 టీంలు పాల్గొన్నాయి. బాలుర టీంలో క్వార్టర్ ఫైనల్కు ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖ, విజయనగరం, చిత్తూరు, ఈస్టు గోదావరి, కృష్ణ జిల్లా జట్లు చేరాయి. బాలికల విభాగంలో క్వార్టర్ ఫైనల్కు అనంతపురం, విజయనగరం, కర్నూలు, చిత్తురు, ప్రకాశం, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జట్లు చేరాయి. చివరి రోజు ఆదివారం క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యచ్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
బెల్ట్ షాపులతో కుటుంబాలు సర్వనాశనం
జె.పంగులూరు: గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తున్నాయని, దీని వల్ల అనేక కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయని, వెంటనే కట్టడి చేయాలని కోటపాడు దళితులు కోరారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్ సింగారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నాలుగు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, వీటిల్లో మద్యం కొనుగోలు చేసి పలువురు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. బెల్ట్ షాపులపై ఈ నెల 8న మహిళలు దాడి చేసి మద్యం సీసాలను తగులబెట్టారని చెప్పారు. ఎకై ్సజ్ అధికారులు తనిఖీ చేసి మద్యం సీసాలు ఎక్కడా లేవని తెలిపారన్నారు. మరుసటి రోజు నుంచే మళ్లీ నాలుగు బెబెల్టు షాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. వీటి నిర్వహణలో అధికారులు, నాయకులు పాత్ర కూడా ఉండటంతో ఽధైర్యంగా నడుపుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. తక్షణమే బెల్టు షాపులను కట్టడి చేయకపోతే పేదలు సర్వనాశం అయిపోతారని, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోటపాడు ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణకు ప్రతీక క్రీడలు
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలు కేవలం పతకాలు, ట్రోఫీల కోసం మాత్రమే కాదని, అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, ఓర్పు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని గుంటూరు జిల్లా అగ్నిమాపక విపత్తు స్పందన అగ్నిమాపకశాఖాధికారి ఎం.శ్రీనివాసరెడ్డి అన్నారు. వికాస్నగర్లోని వికాస్ గ్రౌండ్లో భాష్యం ఒలంపస్ పేరుతో నిర్వహిస్తున్న జోనల్స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ శనివారం రెండు రోజు కొనసాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో క్రీడలు నేర్పిస్తాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, పాల్గొనడమే ముఖ్యమని చెప్పారు. ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. మరో అతిథి డాక్టర్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తరగతి గదులు మేధస్సును పెంచితే, ఆట స్థలాలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాష్యం సాంబశివపేట, ఆర్టీసీ కాలనీ, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, నగరాలు క్యాంపస్లకు చెందిన ప్రైమరీ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈవోలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భాష్యం స్పోర్ట్స్ మీట్లో వక్తలు -
కౌన్సిల్ సమావేశం రసాభాస
చీరాల: చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసాగా సాగింది. ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని ప్రకటించినా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే కౌన్సిల్ హాలులో 13 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సరైన కోరం లేకుండా సమావేశం ప్రారంభించడంపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అభ్యంతరాలు తెలిపారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాడీవేడి వాదనలు మొదలయ్యాయి. ఇలా చేయడం సరికాదంటూ మాట్లాడగా టీడీపీ కౌన్సిలర్లు కూడా వాదనలు వినిపించారు. కోరం లేకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. తమకేమి సంబంధం లేదని, మున్సిపల్ చైర్మన్ను అడగాలని ఆయన చెప్పారు. చీరాల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి మొత్తం 35 మంది ఉండాలి. అయితే కౌన్సిల్లో 13 మంది ఉన్నా సమావేశం ఎలా నిర్వహిస్తారని కమిషనర్ను ప్రశ్నించారు. గతంలోనూ కూడా 18 మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడే సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఆయన దాటవేత ధోరణితో మాట్లాడడంతో చైర్మన్ను అడిగారు. తమకు సంఖ్యా బలం ఉందంటూ ఏకపక్షంగా టీడీపీ కౌన్సిలర్లు సమావేశం నిర్వహించుకుని ఆల్ పాస్ చేయించుకోవాలనే నిర్ణయంతోనే ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. సభను అర్థవంతంగా నిర్వహించడం లేదంటూ బయటకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశం ప్రారంభించిన తర్వాత కొద్ది సమయానికి 17మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అజెండాలోని 128 అంశాల్లో పలు అభివృద్ధి పనులను, ఇతర అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. చైర్మన్, చైర్మన్ కుర్చీని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ బత్తుల అనిల్ అగౌరవపరిచారంటూ, ఆయన్ను సస్పెండ్ చేయాలని టీడీపీ కౌన్సిలర్ సత్యానందం ప్రతిపాదించారు. కౌన్సిలర్లు అందరి సూచనలతో ఆయన్ను నెల రోజుల పాటు చైర్మన్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డీఈ రంగనాఽథ్, టీపీఓ శ్రీనివాసులు, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


