Bapatla
-
విత్తన గుళికలు తయారు చేయాలి
కోనేటిపురం(భట్టిప్రోలు): వర్షాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చేయాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సయ్యద్ అక్తర్ హుస్సేన్ పేర్కొన్నారు. భట్టిప్రోలు మండలం కోనేటిపురం గ్రామంలో సోమవారం పీండీఎస్ (ఫ్రీమాన్ సూన్ డ్రై సోయింగ్) కార్యక్రమం హుస్సేన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీనిలో బీజామృతం, బంకమట్టి, ఘన జీవామృతం పౌడర్, బూడిదతో తయారు చేయాలని తెలిపారు. ఈ పద్ధతిలో మినుములు, పెసలు, శనగలు, అలసందలు, కందులు లాంటి విత్తనాలను గుళికలుగా తయారు చేయవచ్చని చెప్పారు. రైతులు ఈ పద్ధతులను అనుసరించి విత్తనాలు వేయడం వల్ల వర్షాలు లేకపోయినా తక్కువ తేమతోనే మొలకలు వస్తాయన్నారు. కార్యక్రమంలో రేపల్లె ఎన్ఎఫ్ఎ బి.వి. శ్రీనివాస్, మండల నోడల్ పర్సన్ డి.ఝూన్సీరాణి, ఎఫ్ఎన్టీలు సురేష్, బాలాజి, ఐసీఆర్పీస్లు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ సయ్యద్ అక్తర్ హుస్సేన్ -
స్వాతంత్య్ర సమరంలో వెంకటరెడ్డి సేవలు ఎనలేనివి
జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ నిషేధిత భూముల జాబితాలో మార్పులకు చర్యలు బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియ ప్రారంభించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. 22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించే ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించడం, భూమి యజమానులకు హక్కు కల్పిస్తున్నామని కలెక్టర్ చెప్పారు. గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 410 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. అందులో 107 అర్జీలకు సంబంధించిన భూములను తొలగించి, భూమి యజమానులకు యాజమాన్య హక్కు కల్పించామని చెప్పారు. ఇ–భూమి, వెబ్ ల్యాండ్, వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రెవెన్యూ దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లాస్థాయి కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి విచారణతో పూర్తిగా పరిష్కరిస్తున్నామని వివరించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు వందలాది ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించామని చెప్పారు. ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న అర్జీలను పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. దశలవారీగా 22ఏ సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. వారంలో రెండు పర్యాయాలు జిల్లా స్థాయి కమిటీ సమావేశమై పరిశీలన, విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. రెవెన్యూ అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. కొల్లూరు, యద్దనపూడి, చిన్నగంజాం, మార్టూరు, కారంచేడు, కర్లపాలెం, చెరుకుపల్లి, పర్చూరు, చుండూరు, భట్టిప్రోలు మండలాలలో సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కనీసం ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నందుకై నా పనిచేయరా అని నిలదీశారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలని మార్గ నిర్దేశం చేశారు. జిల్లాస్థాయి కమిటీలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
యువతకు చంద్రబాబు మరో సారి మోసం
బాపట్ల: నిరుద్యోగ యువకులతో చంద్రబాబునాయుడు సర్కారు మరోసారి ఆటలాడుకుంటోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య ధ్వజమెత్తారు. నిరుద్యోగభృతి, జాబ్క్యాలెండర్లో స్పష్టత లేదంటూ సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం పేరుతో నారా లోకేష్ రాష్ట్రం మొత్తం తిరిగి యువకులకు హామీలు ఇచ్చి మొండిచేయి చూపారని ఆరోపించారు. నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి వస్తోందని నమ్మిన యువకులు ఆ పార్టీ వైపు మొగ్గుచూపుతే ఆ ఊసేలేకుండా పోయిందని చెప్పారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటూ స్పష్టతలేని హామీలతో మరోసారి యువతను ముంచేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. యువతకు మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. జగనన్న పాలనలోనే యువతకు న్యాయం.. జగనన్న పాలనలోనే యువతకు రాష్ట్రంలో న్యాయం జరిగిందని మేరుగ చందనాగ్ పేర్కొన్నారు. అధికారం చేపట్టిన వెంటనే సచివాలయ వ్యవస్థను రూపొందించి 1.46 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు. యువతకు ఉద్యోగాలతోపాటు సంక్షేమాన్ని అందించిన వై.ఎస్. జగన్మోహన్రెడ్డి అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసుకుంటూ వచ్చారని వివరించారు. పాలనలో పారదర్శకత ఉండాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి నేర్చుకోవాలని సూచించారు. సమావేశంలో యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ నక్క వీరారెడ్డి, రాష్ట్రకార్యదర్శి దొంతిబోయిన జై భారత్ రెడ్డి, నాయకులు నీలం వీరేంద్ర, జెల్లీ జోషి కాంత్, శీలం చంటి, దొంతిబోయిన ఏడుకొండలరెడ్డి, ఎరిపల్లి కోదండ వడ్డీముక్కల రవితేజ, ఐల ఏసుబాబు, షేక్ అక్రమ్, ఎస్.మురళి పాల్గొన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చెంచయ్య -
అక్రమాలే.. కొంటే ‘అవుట్’
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026పైసా పైసా కూడ బెట్టి పొదుపు చేసి..ఓ ప్లాటు కొందామనేది మధ్య తరగతి ప్రజల కల. కొంతమంది అయితే అప్పులు చేస్తారు. మరి కొందరు బంగారం తాకట్టు పెడతారు. ఇంకొందరు బ్యాంకుల్లో అధిక వడ్డీలకు రుణాలు తీసుకుంటారు. ఇంతా చేసి ఓ వెంచర్లో ప్లాటు కొన్నాక అది అక్రమం అని తేలితే.. ఆ వ్యక్తి, ఆ కుటుంబం పడే క్షోభ వర్ణనాతీతం. చీరాల అర్బన్: చంద్రబాబు జమానాలో ధృతరాష్ట్ర పాలన సాగుతోంది. చీరాల నియోజకవర్గంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అనధికారిక లేఅవుట్లు అందుకు ఒక నిదర్శనం. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చి లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టేందుకు ముందస్తుగా కన్వర్షన్ రుసుం చెల్లించాలి. అయితే సుమారు ఐదు నెలలుగా ఆర్డీఓ, తహసీల్దార్ లాగిన్ల నుంచి కన్వర్షన్ ఆప్షన్ తొలగించారు దీంతో స్థిరాస్థి వ్యాపారులు ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర స్థాయిలో కింద నుంచి పైవరకు ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయి అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తరువాత నిర్మాణ సమయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అత్యధికంగా అనధికారిక లేఅవుట్లు అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో అనధికారిక లేఅవుట్లు, అత్యధికంగా చీరాల నియోజకవర్గంలో ఉన్నాయి. అందులో బుడా (బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో సింగిల్ నెంబర్లో, ఓడా (ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలో రెండంకెల సంఖ్యలో అనధికారిక లేఅవుట్లు ఉన్నాయని అధికారికంగానే ప్రకటించారు. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారనే విషయం పక్కన పెడితే, కొత్తగా కూడా అనధికారిక (పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకోకుండా) లేఅవుట్లు వెలుస్తుండటం దేనికి సంకేతమో సంబంధిత అధికారులే చెప్పాలి. సంబంధీకులు కీలక నేతలకు కప్పం కడుతూ, రాజకీయ అండ ఉందని చెప్పుకుంటూ, అధికారులను కూడా సంతృప్తి పరుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చ గూటికి చేరాం .. ఇబ్బంది ఉండదులే... ఎన్నికల అనంతరం అనధికారిక లేఅవుట్లు వేసే వారిలో కొందరు ప్రత్యక్షంగా పచ్చ గూటికి చేరారు. మరికొందరు పరోక్షంగా పచ్చ నేతలతో రాయ‘బేరాలు’ నడుపుకుంటూ తమ పనులు చక్కబెట్టుకుంటున్నారనే వాదనలు బలంగా వివిపిస్తున్నాయి. ఓ మాజీ మున్సిపల్ చైర్మన్ గతంలో వేసిన, ప్రస్తుతం వేస్తున్న అడుగులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్య పాలెం సమీపంలో తీరం వెంట ప్రస్తుతం చేపట్టిన ఓ లేఅవుట్ ప్రక్రియ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందుకు సంబంధించి ఆ మాజీ చైర్మన్ పైకి కనిపిస్తున్నా, అంతర్లీనంగా మరికొందరు ఉన్నారని చెప్పుకుంటున్నారు. అడుగు వేద్దాం... పొట్టిసుబ్బయ్యపాలెం తీరం సమీపంలో వేస్తున్న అడుగులకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే అప్పుడు అసలు కథ మొదలు పెడదామనే భావనలో సంబంధీకులు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక్కడ అభ్యంతరాలు లేకుండా పని సాగితే అసలు ప్రాజెక్టు అప్పుడు ప్రారంభమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెరవెనుక బడా బాబులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. క్విడ్ ప్రోకోకు అడుగులు తీరప్రాంత అభివృద్ధి నేపథ్యంలో నిధులు మంజూరవుతాయని చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో సదరు లేఅవుట్ వెంట ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో క్విడ్ ప్రోకోకు అడుగులు వేస్తున్నారని చెప్పుకుంటున్నారు. లేఅవుట్కు ఇబ్బంది లేకుండా విక్రయాలు జరిగేలా, రోడ్డు కూడా వేస్తే భారీ మొత్తంలో నగదు కీలక నేతలకు, సంబంధిత అధికారులకు ముట్టచెప్పే ఒప్పందాలపై చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఆర్జెడ్ నిబంధనలా... అవేంటి? తీరంలో సీఆర్జెడ్ పరిధిలో నిర్మాణాలు చేపట్టేవారు కానీ, లేఅవుట్లు వేసే వారు కానీ పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించటం లేదనే విమర్శలు ఉన్నాయి. సీఆర్జెడ్ పరిధిలో నిర్మించిన, నిర్మిస్తున్న రిసార్టులు, వేసిన లేఅవుట్లు అందుకు నిలువెత్తు నిదర్శనాలంటున్నారు. అసలు నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఎందుకు అడ్డుకోవటం లేదనేది ప్రశ్న. సంబంధిత అధికారులకు ఆ నిర్మాణాలు కనిపించవా అని ప్రజలు మండిపడుతున్నారు. -
కట్టుకున్న భార్యే కడతేర్చింది
మృతదేహానికి రాయి కట్టి చెరువులో పడేసిన కేసులో వీడిన మిస్టరీనగరంపాలెం: ఈనెల 19వ తేదీన యనమదల / ఈదులపాలెం గ్రామాల పరిధిలోని ఎన్హెచ్ 16 సమీపానున్న చెరువులో నడుముకు రాయికట్టి గోనెసంచిలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం తాలూకా మిస్టరీ వీడింది. మద్యం మత్తులో ఉన్న భర్తను తాడుతో కట్టేసి, కర్రలతో కొట్టి భార్యే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసులో మృతుడి భార్య, మరో ముగ్గుర్ని ప్రత్తిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఈనెల 19న మృతుడి నడుంకు రాయిని తాడుతో కట్టి, గోనెసంచిలో పెట్టిఉంచారని అందిన సమాచారం మేరకు.. ప్రత్తిపాడు పీఎస్ సీఐ జి.శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతన్ని ఎవరైనా హత్య చేసి ఉంటారని, ఆ దిశగా దక్షిణ సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్రావు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా గుంటూరు దాసరిపాలెం గ్రామంలోని ఓ కుటుంబం ఇంటి సామగ్రి, పశువులతో పరారవుతున్నట్లు తెలిసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెం ప్లాట్స్లో ఉంటున్న తెనాలి ఐతానగర్ బత్తులవారివీధికి చెందిన ఉప్పుతల్ల లక్ష్మి అలియాస్ తన్నీరు తిరుపతమ్మ, ప్రస్తుతం తెనాలి పెదరావూరులో ఉంటున్న చౌడవరం సీఆర్నగర్కు చెందిన భార్యభర్తలు సిద్ధి అంకమ్మ, సురేష్, పేరేచర్ల లక్ష్మీనరసింహకాలనీ ఐదో వీధికి చెందిన ఓ మైనర్గా గుర్తించారు. చెరువులో మృతదేహం తన్నీరు వెంకటేశ్వర్లు (30)గా గుర్తించి, మృతురాలి భార్య తిరుపతమ్మ, ఆమె సోదరి అంకమ్మ, భర్త సురేష్, సోదరుడు మైనర్ను అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన కరల్రు, ఇనుప పలుగు, పారలు, మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య చేశారిలా.. వెంకటేశ్వర్లు మద్యానికి బానిసై, భార్య తిరుపతమ్మను శారీరక, మానసికంగా వేధించేవాడు. పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినా అతనిలో మార్పురాలేదు. ఈనెల 17న వెంకటేశ్వర్లు, తిరుపతమ్మకు మళ్లీ వివాదం నెలకొంది. దీంతో తిరుపతమ్మ ఆతన సోదరి, బావ, మైనర్లకు సమాచారం అందించింది. దీంతో భార్య, ఆ ముగ్గురు కల్సి వెంకటేశ్వర్లను తాడుతో కట్టేసి, కరల్రతో తీవ్రంగా కొట్టగా మృతిచెందాడు. తొలుత భర్త మృతదేహన్ని ఇంట్లో పూడ్చాలని అనుకున్నా, స్థానికులకు అనుమానం వస్తుందని భావించారు. దీంతో మిరపకాయల గోనె సంచిలో మృతదేహం వేసుకుని మోటార్సైకిళ్లపై తీసుకెళ్లి చెరువులో పడవేశారు. అయితే మృతదేహాం పైకి తేలకుండా నడుముకు రాయిని తాడుతో కట్టేసి చెరువులో వేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసుని చేధించిన సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ నరహరి, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, ప్రశంసా పత్రాలను అందించారు. సమావేశంలో దక్షిణ ఇన్ఛార్జ్ డీఎస్పీ మధుసూదన్రావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన గుంటూరు కలెక్టర్
గుంటూరు ఎడ్యుకేషన్: మార్కెట్ సెంటర్లోని హిందూ హైస్కూలులో పదో తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్షలు రాస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ పరీక్ష కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిర ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతోపాటు విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులతోపాటు రవాణా సదుపాయం తదితర వివరాలపై ఆరా తీశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ను పక్కాగా అమలు చేయడంతోపాటు పరీక్షలు జరుగుతున్న రోజుల్లో పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ దుకాణాలను మూసి వేయించాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా మాట్లాడుతూ 149 కేంద్రాల పరిధిలో నిరంతరం పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో చీఫ్ సూపరింటెండెంట్, శాఖాధికారులు పాల్గొన్నారు. -
శోభాయాత్ర నిర్వహణ అభినందనీయం
పట్నంబజారు: ఈనెల 27న శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శోభాయాత్ర కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామనవమి శోభాయాత్ర ఉత్సవ సమితి సభ్యులు మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎన్టీఆర్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డిని ఆహ్వానించారు. రెడ్డిపాలెంలోని ఆయన నివాసంలో కలిసిన సమితి సభ్యులు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. 27వ తేదీ సాయంత్రం 4 గంటలకు పాతగుంటూరులోని మణిహోటల్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమై గోరంట్ల వరకు జరిగే శోభాయాత్రలో పాల్గొనాలని విన్నవించారు. మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పవిత్ర శ్రీరామనవమి రోజున అద్భుతమైన శోభాయాత్రను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. భక్తులంతా ఏకతాటిపై ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న సమితి సభ్యులను ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వాహక సమితి సభ్యులు రామరాజు త్రికోటేశ్వరరావు, సాయి, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి తిరునాళ్ళ
కర్లపాలెం: శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన తిరునాళ్ళ మహోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరునాళ్లలో స్వామివారి ఆలయ జండాతో పాటు గ్రామంలో భక్తుల మొక్కుబడుల జండాలు ప్రత్యేకంగా అలంకరించిన 20 ట్రాక్టర్లపై ఉంచి మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్లతో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారి జండాలకు మహిళలు హారతులిచ్చి పూజలు చేసి టెంకాయలు సమర్పించారు. గ్రామోత్సవంలో స్వామివారి జండాలు ఏట్రవారిపాలెం నుంచి పాతనందాయపాలెం డొంకమీదుగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్ వరకు అక్కడి నుంచి తిరిగి ఊరేగింపు చేస్తూ స్వామివారి గుడి వద్దకు తీసుకువచ్చి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయించి రావిచెట్టుకు జండాలను ప్రతిష్టించారు. తిరునాళ్ళలో భాగంగా ఆలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించటంతో పాటు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తిరునాళ్లకు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి తిరునాళ్ళలో ప్రధాన ఘట్టమైన స్వామివారి మొక్కుబడి జండాల ఊరేగింపు తిలకించి స్వామిని దర్శించుకుని పూజలు చేసి రావి చెట్టు వద్ద కొబ్బరి కాయలు కొట్టారు. ఆలయం వద్ద ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మురళీ కోలాటం భజన భక్తులను ఆకట్టుకున్నాయి. తిరునాళ్లలో ఎలాంటి అల్లర్లు జరగకుండా స్థానిక ఎస్ఐ రవీంద్ర తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. -
పీజీఆర్ఎస్లో బాధితుడి ఆవేదన
గుంటూరు వెస్ట్ : ప్రపంచ క్షయ వ్యాధి (టీబీ) దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన పోస్టర్ను కలెక్టరేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. టీబీ నిర్మూలనకు సమష్టి కృషి అవసరం అనే థీమ్తో ఈ సంవత్సరం టీబఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు. గుంటూరు వెస్ట్: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాము ఉన్నట్లు నిత్యం చెబుతున్న అధికారులు సామాన్యుల సమస్యల పట్ల దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఎన్నిసార్లు తిరిగినా సరైన సమాధానం కూడా చెప్పకపోవడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాకు తమ అసహనాన్ని వ్యక్తం చేయగా కలెక్టర్ దీనిపై సీరియస్గా స్పందించారు. బాధితుల వివరాల ప్రకారం... సిరిపురపు స్వరాజ్యలక్ష్మి (77) అనే వృద్ధ మహిళకు చెందిన సుమారు ఎకరం వ్యవసాయ భూమి చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామంలో ఉంది. దీనిపై పూర్తి హక్కులకు సంబంధించిన దస్తావేజులు కూడా ఉన్నాయి. అయితే ఆమె పేరుతో అడంగుల్తోపాటు మీ భూమి వెబ్ ల్యాండ్ లో ఇతరులు అనే ఆప్షన్ లో నమోదు చేయమనడంతోపాటు , పట్టాదారు పాస్ పుస్తకం కోసం స్థానిక చేబ్రోలు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నారు. సదరు కార్యాలయం సిబ్బంది ఈ ఫైల్ ను జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి పంపారు. ఇప్పటికి సుమారు మూడేళ్ళు గడుస్తున్నా ఈ ఫైల్కు మోక్షం లభించలేదు. సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు అధికారుల ఉదాసీనత తోడవడంతో బాధితులకు చుక్కలు కనబడుతున్నాయి. దీంతో స్వరాజ్య లక్ష్మి కుమారుడు సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలిసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని వృద్ధుల సమస్యలు గాలికి వదిలేస్తే ఎలా అని ప్రశ్నించారు. న్యాయం స్థానాన్ని ఆశ్రయించి మీ అందరి పేర్లు పెడతానని పేర్కొనడంతో కలెక్టర్ సదరు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులు, వికలాంగుల సమస్యలకు అధిక ప్రాధాన్యతనివ్వాలని తాను చెప్పాను కదా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని ఆగ్రహించారు. తప్పకుండా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు వెళ్ళిపోయారు. -
తోటి విద్యార్థినులతో స్నేహంగా ఉండాలి
చెరుకుపల్లి: ప్రతి విద్యార్థిని తోటి విద్యార్థినులతో స్నేహ భావంతో మెలుగుతూ ఆరోగ్యకర వాతావరణంలో విద్యను అభ్యసిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు బిట్రా జయంతి, జి.నాగలక్ష్మీ అన్నారు. మండలంలోని కావూరు బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు మంచి స్నేహం, ఆరోగ్యకరమైన దిన చర్య పాటిస్తూ తోటి విద్యార్థుల పట్ల స్నేహ పూర్వకంగా పరస్పర గౌరవంతో మెలుగుతూ మంచి అలవాట్లు అలవర్చుకోవాలన్నారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఒత్తిడికి లోను కాకుండా దానిని ఎలా అధిగమించాలి, భావోద్యేగ నియంత్రణను ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై వివరిస్తూ విద్యార్థుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె.విజయలక్ష్మి, పాఠశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కెరీర్ గైడెన్స్, మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు జయంతి, నాగలక్ష్మి -
ఎదను కదిపిన ఆలాపన
సంగీత విద్వన్మణి డాక్టర్ చింతలపాటి మంజులకు సత్కారం తెనాలి: ఆ గానం సంగీత మధురిమలను పంచింది...ఆధ్యాత్మిక కీర్తనలు శ్రోతలను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. సంగీతాభిమానులకు పారవశ్వాన్ని కలిగించాయి. దాదాపు గంటన్నరసేపు సాగిన ఆ గానాలాపనకు శ్రోతలు కరతాళధ్వనులతో తమ ఆనందాన్ని చాటారు. ఎన్నో ఏళ్లుగా తన సంగీత విద్యతో శ్రోతలను రంజింపజేస్తూ, మరెందరికో శిక్షణనిస్తున్న చింతలపాటి మంజుల గానాలాపన ప్రతి ఎదనూ కదిపింది. ప్రతి కీర్తనకూ శ్రోతలనుండి కర తాళధ్వనులు అందుకున్నారు. స్థానిక బోసురోడ్డులోని హనుమాన్చౌక్లో గల శ్రీసీతారామమందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్ర మహోత్సవాలు ఇందుకు వేదికగా నిలిచాయి. సంగీతవ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా సొంతూరు తెనాలిలో వసంత నవరాత్ర ఉత్సవాల్లో సంగీత కచేరీ చేయటం అదృష్టంగా భావించానని డాక్టర్ మంజుల చెప్పారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెనాలి డబుల్హార్స్ మినపగుళ్లు అధినేత, కళాభిమాని మునగాల మోహన్శ్యాంప్రసాద్ డాక్టర్ మంజులను సత్కరించి అభినందించారు. సంగీతరంగంలో తెనాలికి గల ఘనవారసత్వాన్ని కొనసాగిస్తున్న విద్వన్మణిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీసీతారామమందిరం పాలకవర్గ కమిటి కార్యదర్శి కల్లూరి వేంకట సూర్యనారాయణమూర్తి, సభ్యులు నేతి ఆంజనేయశాస్త్రి డాక్టర్ మంజులను ప్రశంసించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
కారంచేడు: డీజే వ్యాన్ ఆటోను ఢీకొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈఘటన ఆదివారం 167–ఏ వాడరేవు– పిడుగురాళ్ల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్ఐ ఖాదర్బాషా అందించిన వివరాలు.. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి సౌండ్ సిస్టమ్తో ఉన్న వ్యాన్ చీరాల వైపు వేగంగా వెళ్తోంది. ఈక్రమంలో జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన షేక్ కాలేషావలి, భార్య, కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో చీరాల సమీపంలోని వాడరేవు బీచ్కు వెళ్తున్నారు. సరిగా రెండు వాహనాలు జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు– పర్చూరు గ్రామాల మధ్యకు రాగానే డీజే వ్యాన్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో మొత్తం ఎనిమిది మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో చీరాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్య కోసం గుంటూరుకు తరలించే క్రమంలో షేక్ కాలేషా వలి భార్య హబియా(45) మృతి చెందింది. మరో ఏడుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణించే ద్విచక్రవాహనదారులు, ఆటోవాలాలు తమ ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ కోరారు. మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీ... జాతీయ రహదారిలో మలుపు తిరుగుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన వాడరేవు–ి పడుగురాళ్ల జాతీయ రహదారిలో కారంచేడు– చీరాల మధ్య ఆదివారం చోటుచేసుకుంది. కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన కొర్రపాటి వెంకటేశ్వరరావు మరొక వ్యక్తితో కలసి యద్దనపూడి మండలం పూనూరు వెళ్లి తిరిగి కారంచేడుకు వస్తున్నారు. ఈ క్రమంలో కారంచేడు కొమ్మమూరు కాలువ కట్ట సమీపంలో రోడ్డు మలుపు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సరిగా అదే పర్చూరు వైపు నుంచి చీరాల వైపు వస్తున్న పూర్ణచంద్రరరావు తన బైక్తో వేగంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో మలుపు తిరగుతున్న వెంకటేశ్వరావు తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. అదే వాహనంపై ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలవడంతో అతనిని చీరాల ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని చెప్పారు. హోటల్ సామగ్రి తీసుకొస్తుండగా.. ముందు వెళ్తున్న బైక్ను వెనుక నుంచి మరో ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. ఈఘటన చీరాల–కారంచేడు రొంపేరు కుడి కాలువ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన చొప్పరపు శ్రీనివాసరావు (50) కొన్నేళ్లుగా కారంచేడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. కారంచేడు యూనియన్ బ్యాంక్ సమీపంలో హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటాడు. ఆదివారం శ్రీనివాసరావు హోటల్కు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడానికి చీరాలకు వెళ్లి వస్తున్నాడు. ఈక్రమంలో కారంచేడుకు చెందిన మరో వ్యక్తి తన బైకుతో ముందు వెళ్తున్న శ్రీనివాసరావు బైకును ఢీకొట్టాడు. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా, వెనక కూర్చొన్న మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఢీకొట్టిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వారిని చీరాల ఆస్పత్రికి తరలించారు. 11 మందికి గాయాలు -
టపాసుల గోదాములపై అధికారుల దాడులు
కారంచేడు: బాణసంచా గోదాములపై చీరాలకు చెందిన పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్నాయుడు, చీరాల డీఎస్పీ మొహ్మద్ మొయిన్, ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఏకకాలంలో కారంచేడు మండలంలోని టపాసుల నిల్వల గోదాములపై దాడులు నిర్వహించారు. దాడుల్లో నిల్వ ఉండాల్సిన చోట కాకుండా రహస్య ప్రాంతాల్లో అక్రమ నిల్వలు ఉంచారనే సమాచారంతో దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మండలంలోని స్వర్ణ, కారంచేడు గ్రామాల్లోని మూడు చోట్ల జరిపిన దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచి న మందుగుండు సామగ్రి పెద్ద మొత్తంలోనే కను గొన్నట్లు సమాచారం. దీంతో అధికారులు అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసి సీజ్ చేశారు. వీరితోపాటు ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, కారంచేడు తహసీల్దారు జీ నాగరాజు, సంబంధిత అధికారులు, రెవెన్యూ, ఫైర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
లారీ ఢీకొని బాలుడు దుర్మరణం
నగరం: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడిపై కళ్లెదుటే లారీ ఎక్కడంతో తల పగిలి మెదడు బయటకు వచ్చిన దృశ్యాన్ని చూసి కన్నతల్లి తల్లడిల్లిపోయింది. ఈ విషాద ఘటన ఆదివారం మండలంలోని శివంగులపాలెం జాతీయ రహదారి వద్ద జరిగింది. స్థానికులు, ఎస్ఐ బండ్ల భార్గవ్ కథనం ప్రకారం... మండలంలోని మంత్రిపాలెం శివారు బొడ్డువారిపాలెం గ్రామానికి చెందిన చెరుకూరి రాజేశ్వరావు, సుజిని దంపతులు. వారు తమ కుమారుడు దినేష్(13), కుమార్తెతో కలసి ద్విచక్ర వాహనంపై భట్టిప్రోలు వెళుతున్నారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దినేష్ తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో తల ఛిద్రమై మెదడు బయటకు వచ్చి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో రాజేశ్వరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కుమార్తె కూడా గాయాలపాలైంది. కుమారుడి మృతదేహం వద్ద తల్లి రోదిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దినేష్ మృతదేహానికి పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయాలపాలైన వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భార్గవ్ తెలిపారు. ప్రమాదాలతో భయాందోళన.. గత రెండు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పీటా గోపాలం ద్విచక్రవాహనంపై వెళుతున్న సమయంలో అంబులెన్స్ ఢీకొనడంతో మృతి చెందాడు. ఆదివారం అదే ప్రాంతంలో లారీ ఢీకొని బాలుడు మృతి చెందడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు .వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో హెచ్చరికల బోర్డులు పెట్టించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గుంటూరు జిల్లాలో 5.6 మిల్లీమీటర్ల వర్షపాతం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 20.2 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, అత్యల్పంగా ప్రత్తిపాడు మండలంలో 2 మి.మీ. వర్షం కురిసింది. సగటున 5.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడికొండ మండలంలో 17.4 మి.మీ., పెదకాకాని 13.6, గుంటూరు తూర్పు 11.2, తుళ్లూరు 8, మంగళగిరి 7.8, దుగ్గిరాల 3.4, మేడికొండూరు 3.4, తాడేపల్లి 3.2, చేబ్రోలు 3, వట్టిచెరుకూరు 3, తెనాలి 2.6, కొల్లిపర మండలంలో 2.5 మి.మీ చొప్పున వర్షం కురిసింది. జిల్లాలో మార్చి 22వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 7 మి.మీ. కురవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. గుంటూరు ఎడ్యుకేషన్ :ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుడిపాటి దాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో పెదనందిపాడు మండలం గోగులమూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గుడిపాటి దాస్ను ఎన్నుకున్నారు. 11 ఏళ్లుగా సంఘ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కె.బసవ లింగారావు ఇటీవల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడి స్థానాన్ని భర్తీ చేశారు. డాక్టర్ కొంగర శ్రీకాంత్ గుంటూరు మెడికల్: ఆధునిక జీవనశైలితో నేడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారని డాక్టర్ కొంగర శ్రీకాంత్ అన్నారు. ఆధునిక చికిత్సలతో జీవనశైలిలో మార్పులతో ఊబకాయాన్ని కట్టడి చేయవచ్చని తెలిపారు. ఆదివారం స్థానిక అమరావతిరోడ్లోని బండ్లమూడిగార్డెన్స్లో ఎండోలైఫ్ ఒబేసిటీ అప్డేట్ ఆధ్వర్యంలో ఊబకాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ అధిక బరువుతో అనేక వ్యాధులు వస్తున్నాయని, బరువు తగ్గించుకోవటం కోసం చాలా మంది అవస్థలు పడుతున్నారన్నారు. ఊబకాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఊబకాయం తగ్గించే వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఊబకాయాన్ని తగ్గించే మెడిసిన్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచామని, అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు అనేక మంది ఈ కార్యకమంలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వైద్యులు నర్మదా, నీరజ, స్వప్న్కి, ఋషి కృష్ణ, ఐఎంఏ సభ్యులు పాల్గొన్నారు. తాడికొండ: కవిత్వమంటే గొప్ప సామాజిక అన్వేషణ అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ అన్నారు. స్థానిక పెదపరిమి మొవ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘గ్రామ్ లోక్– యువ కవుల కోసం కవిత్వ మెలకువల’పై ఒక రోజు వర్క్షాప్ ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని యువకులు తమ చుట్టూ జరిగే సామాజిక అంశాలను అంతర్ముఖంగా దర్శిస్తూ ఆవేదన, సున్నితం, వ్యంగ్యం, చైతన్యం రగిల్చే విధంగా రాస్తూ యువకవులుగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ప్రముఖ కవి కొప్పర్తి వెంకట రమణమూర్తి మాట్లాడుతూ.. పెద్దగా చదువు లేని గుర్రం జాషువా, భరద్వాజ తమ రచనల ద్వారా జాతీయ పురస్కారాలు పొందారని గుర్తు చేశారు. సభాధ్యక్షులు ఎంవీఆర్ఎం ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎంవీ రామిరెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో వృద్ధాలయాల నిర్వహణతో పాటు నిరుద్యోగ యువతకు ఉచిత భోజన వసతితో కూడిన పోటీ పరీక్షల శిక్షణ ఇస్తూ 700 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు చేయూతనందిస్తున్నామని అన్నారు. మధ్యాహ్నం నిర్వహించిన వర్క్షాప్నకు సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు వల్లూరు శివప్రసాద్ అధ్యక్షత వహించారు. అనంతరం ‘కవిత్వంలో గ్రామీణ జీవనం’ అంశంపై డాక్టర్ సుంకర గోపాల్, మందరపు హైమావతి, కోసూరి రవికుమార్లు విశ్లేషించారు. వర్క్షాప్నకు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల నుంచి 50 మందికి పైగా గ్రామీణ యువకవులు, రచయితలు, రచయిత్రులు ఉత్సాహంగా హాజరయ్యారు. కార్యక్రమంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, ట్రస్టు అధ్యక్షులు మొవ్వ సాంబిరెడ్డి, కార్యదర్శి మున్నంగి శ్రీనివాసరెడ్డి, నరసింహారెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, విశ్రాంత ప్రొఫెసర్ శారద తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు అసభ్య వీడియోలు పంపుతున్న వ్యక్తి అరెస్ట్
● రెండు సెల్ఫోన్లు స్వాధీనం ● సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు వివరాలు వెల్లడి గుంటూరు రూరల్: ట్రూకాలర్లో మహిళల పేర్లను చూసి ఆయా సెల్ నంబర్లకు వీడియో కాల్స్ చేసి అసభ్యకర వీడియోలు పంపుతున్న వ్యక్తిని నల్లపాడు పోలీస్ స్టేషన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అడవితక్కెళ్లపాడులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ మధుసూదనరావు, సీఐ వంశీధర్ వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం, మాచవరం గ్రామానికి చెందిన రామనాథం నాగేశ్వరరావు గతంలో పెట్రోల్ బంకులో పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడి ఆడవారిని బెదిరించి డబ్బులు గుంజాలని తన ఫోన్లో రియల్ నంబర్స్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ నంబర్లను ట్రూ కాలర్లో చెక్ చేసి వాటిలో ఆడవారి పేర్లతో రిజిస్టర్ అయిన నెంబర్లకు వాట్సప్ ద్వారా మెసేజ్లు పెట్టడం, వారికి వీడియో కాల్స్ చేయడం అసభ్య కరమైన ఫొటోలను వీడియోలను పంపుతున్నాడు. తద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తుండేవాడు. పలకలూరు రోడ్డులోని ఒక మహిళకు అదే విధంగా అసభ్య పదజాలంతో వాట్సప్ ద్వారా బూతులు తిట్టి అసభ్యకరమైన ఫొటోలు పంపించాడు. ఆ మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆదివారం పలకలూరు రోడ్డు విజ్ఞాన్ కాలేజి దగ్గరలో నిందితుడిని పట్టుకొని అతడి వద్ద నుంచి వివో ఫోన్, ఆపిల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, మహిళా భద్రతా దష్ట్యా శక్తి టీములు నిరంతరం అందుబాటులో ఉంటున్నట్లు డీఎస్పీ మధుసూదనరావు తెలిపారు. ఆపదలో ఉన్న వారు 112కు ఫోన్ చేసి పోలీస్ వారి సహాయం పొందవచ్చని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదని సూచించారు. కేసులో ప్రతిభ కనబరిచిన నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్ఐ మహేష్కుమార్, సిబ్బందికి రివార్డు అందజేసి అభినందించారు. + రూ.11.80 లక్షల సొత్తు స్వాధీనం తెనాలిరూరల్: తెనాలి పట్టణం బుర్రిపాలెం రోడ్డులోని ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకుని రూ.11.80 లక్షల విలువైన సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే జువైనెల్ హోమ్లో శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మద్యం, గంజాయికి అలవాటుపడిన మరో బాలుడిని కలుపుకుని ఏకంగా ఎలక్ట్రానిక్ షోరూమ్లోనే చోరీ చేశాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్ధనరావు వివరాలను వెల్లడించారు. బుర్రిపాలెం రోడ్డులోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి అనంతరం జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకుని వారి నుండి రూ.11.80 లక్షల విలువైన సెల్ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణ ముత్యంశెట్టిపాలెంకు చెందిన 17 ఏళ్ల బాలుడు, చినరావూరు ఆర్టీసీ ఓల్డ్ డిపోరోడ్డుకు చెందిన 16 ఏళ్ల బాలుడు ఈ కేసులో నిందితులని తెలిపారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి రెండో అంతస్తులో గల గ్లాస్ డోరు పగులగొట్టి లోపలకు ప్రవేశించి వివిధ కంపెనీల మొబైల్స్, వాచీలు, బడ్స్, చార్జర్, అడాప్టర్లను దొంగతనం చేశారు. దీనిపై షోరూమ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో ఆదివారం గాంధీచౌక్లో నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ బి.జనార్ధనరావు చెప్పారు. ముత్యంశెట్టిపాలెంకు చెందిన బాలుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో అక్కల వద్ద నివాసం ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసైనట్టు తెలిపారు. ఆదాయం సరిపోక బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేరాలకుగాను అతడిపైన స్థానిక వన్న్ టౌన్, త్రీటౌన్, రూరల్ పోలీస్స్టేషన్లలో కేసులున్నాయి. వీటిలో రెండు కేసుల్లో ఇప్పటికే శిక్ష పడగా, తొమ్మిది నెలలపాటు విజయవాడ హోమ్లో ఉండి నాలుగు నెలల కిందట విడుదలయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఇంటర్ సెకండియర్ చదువుతూ మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటుపడిన చినరావూరు బాలుడిని కలుపుకుని సోనోవిజన్ షోరూమ్లో చోరీ చేసినట్టు వివరించారు. షోరూమ్ ఉన్న కాంప్లెక్సులోనే ఉన్న హోటల్లో క్లీనర్గా చేసిన 17 ఏళ్ల బాలుడు, రెక్కీ నిర్వహించి 16 ఏళ్ల బాలుడితో కలిసి చోరీ పాల్పడినట్టు తెలియజేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన సీఐ రాములునాయక్, ఆయన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిఽధిలోని బకింగ్హామ్ కెనాల్ ఉండవల్లి సెంటర్ బ్రిడ్జి పైనుంచి ఆదివారం ఓ వృద్ధుడు నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ సాయికుమార్ సంఘటనా స్థలానికి వచ్చి నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని వెలికితీయించారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని అంజిరెడ్డి కొట్టు సెంటర్ ప్రాంతంలో నివాసముండే ధనేకుల అర్జునరావు (68)గా గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్న అర్జునరావు ఆ నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు తెలిపారు. జరిగిన సంఘటనపై భార్య ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ సాయికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకే సమయంలో ప్రాణం పోయి ఉంటుందని అందువల్లే మృతదేహం నీటిపై తేలియాడిందని ఎస్ఐ తెలిపారు. అమరావతి: పిడుగుపాటుకు గురై మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామానికి చెందిన యువకుడు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎండ్రాయి గ్రామానికి చెందిన నల్లగోర్ల విజయకుమార్ గేదెలను తోలుకుని రోజులాగానే శనివారం కూడా పొలానికి వెళ్లాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివాన తోపాటు పిడుగు పడటంతో విజయ్కుమార్(25) అక్కడిక్కడే మృతిచెందాడు. గేదెలు ఇంటికి వచ్చినా విజయకుమార్ రాకపోవటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఎండ్రాయి పరిసర ప్రాంతాలలో గాలించారు. శనివారం రాత్రి పొలాల్లో విగతజీవిగా పడి ఉన్న విజయకుమార్ను గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని అమరావతి సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబసభ్యులకు ఆదివారం అప్పగించారు. మృతుడికి ఏడాది కిందటే వివాహమైంది. భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
వలపు వల.. విశ్రాంత ఉద్యోగి విలవిల
మార్టూరు: వలపు వలకు ఓ విశ్రాంతి ఉద్యోగి చిక్కాడు. కిలాడీ మాయలో పడి ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట రూ.1.09 కోట్లు పోగొట్టుకున్నాడు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి బాధితుడు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా పెదనందిపాడు సమీపంలోని పుసులూరు గ్రామానికి చెందిన పొన్నం వెంకటేశ్వర్లు, ఆయన భార్య ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. వెంకటేశ్వర్లు గతేడాది ఆగస్టులో పదవీవిరమణ చేశారు. కొన్ని నెలల నుంచి మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలోని బంధువులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో నెలరోజుల కిందట కందుకూరి మౌనిక పేరుతో ఓ యువతి ఫేస్బుక్ ద్వారా వెంకటేశ్వర్లుతో పరిచయం పెంచుకొంది. తన సమీప బంధువు దాసరి నీరజ్ కుమార్ 15 ఏళ్లుగా ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ బాగా గడించాడని చెబుతూ అతన్ని సైతం వెంకటేశ్వర్లుకు పరిచయం చేసింది. చాటింగ్.. వీడియో కాల్స్తో సన్నిహితంగా.. అంతేకాక మౌనిక, వెంకటేశ్వర్లు వాట్సాప్ చాటింగ్, వీడియో కాల్స్ సైతం చేసుకుంటూ పరస్పరం సన్నిహితమయ్యారు. ఈ క్రమంలో మౌనిక, నీరజ్ కుమార్ ఆన్లైన్ ట్రేడింగ్లో విశేష అనుభవశాలి అంటూ హర్ష అనే మరో యువకుడిని సైతం వెంకటేశ్వర్లుకు పరిచయం చేశారు. వెంకటేశ్వర్లు తమను నమ్మాడు అని గ్రహించిన మౌనిక బృందం తమ ప్లాన్ అమలు ప్రారంభించారు. వెంకటేశ్వర్లు చేత మొదటిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న రూ.10 వేలు ఆన్ లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెట్టించి రూ.11,900 లాభం చూపించారు. రెండోసారి రూ.50 వేల పెట్టుబడికి రూ.20 వేల లాభాన్ని, మూడో సారి రూ.2 లక్షలు పెట్టించి రూ.40 వేల లాభాలు వచ్చాయని వెంకటేశ్వర్లు ఖాతాలో జమ చేశారు. ఆపై ముగ్గురూ కలిసి వెంకటేశ్వర్లును నమ్మించి అతని బ్యాంకు ఖాతాలో ఉన్న కోటి తొమ్మిది లక్షల రూపాయిలను ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట స్వాహా చేశారు. ఫోన్కు స్పందించకపోవడంతో... తాము అనుకున్న పనిపూర్తయ్యాక నిందితులు ముగ్గురూ బాధితుడు వెంకటేశ్వర్లుకు ఫోన్కు అందుబాటులో లేకపోవడంతో విషయం అర్థమైంది. ఈ మోసం గురించి వెంకటేశ్వర్లు మొదట బయటకు చెప్పుకోలేదు. జీవితకాలం సంపాదించిన సొమ్ము అంతా పోవడంతో తట్టుకోలేక ఆదివారం మార్టూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్రగాయాలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : వాణిజ్య అవసరాలకు అక్రమంగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం విద్యానగర్లో వణుకూరి పవన్కుమార్ కార్ఖానాలో నాలుగు ఎల్పీజీ సిలిండర్లను గుర్తించారు. ఈ మేరకు సీజ్ చేసిన సిలిండర్లను స్థానిక వీఆర్ఓకి అప్పగించారు. ఈ మేరకు అతనిపై 6–ఎ కేసు నమోదు చేశారు. ఈ సోదాల్లో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి
బెల్లంకొండ: స్టేషన్ ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు తెలిపారు. శనివారం బెల్లంకొండ పోలీస్ స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణ, కేసుల వివరాలను పరిశీలించారు. మండలవ్యాప్తంగా సీసీ కెమెరాల నిర్వహణను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వీలైనంత తొందరగా పెండింగ్ కేసులను పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని ఎస్ఐకు సూచించారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, గంజాయి సరఫరా వంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటూ, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలని ఎస్పీ తెలిపారు. గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు, పల్లెనిద్ర, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, పెదకూరపాడు రూరల్ సీఐ ప్రత్తిపాటి సురేష్, స్థానిక ఎస్ఐ పి.గోపి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు -
ప్రపంచ కవితా దినోత్సవ సభలో రంగిశెట్టి రమేష్
తెనాలి: ప్రపంచ కవితా దినోత్సవం రోజైన శనివారం సాయంత్రం తెనాలి నాజరుపేటలోని కమలశ్రీ సాహితీ నిలయంలో శ్రీకృష్ణ దేవరాయ కళావేదిక, విశ్వ సాహితీ కళావేదిక సంయుక్త నిర్వహణలో ‘విశ్వశాంతి ఆవశ్యకత–కవుల పాత్ర’ అంశంపై కవిసమ్మేళనం నిర్వహించారు. తొలుత ప్రాచీన కవుల నుంచి నేటి ఆధునిక కవుల చిత్రపటాలకు పూలతో నివాళులర్పించారు. సభకు శ్రీకృష్ణదేవరాయ కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వ సాహితీ కళావేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు రంగిశెట్టి రమేష్ అధ్యక్షత వహించారు. నేటి వర్తమాన పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య విశ్వశాంతి స్థాపనకు కవులందరు మరొక్కసారి పునరంకితం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యుద్ధం అనర్థాలపై సమాజాన్ని చైతన్యపరచి యుద్ధ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎలుగెత్తి చాటాలన్నారు. -
ఇంజినీరింగ్ కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్హతతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2026 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 24వ తేదీవరకు పొడిగించారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ఏపీ ఈఏపీసెట్–2026 (గతంలో ఎంసెట్) నోటిఫికేషన్ ఆధారంగా సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులతో తాజాగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్–2026 ఆధారిత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సైట్కు లాగిన్ అయ్యి ఏపీ ఈఏపీసెట్–2026పై క్లిక్ చేయాలి. ఏపీఈఏపీసెట్ సైట్లో పరీక్ష రాసేందుకు అర్హతలు, దరఖాస్తు పూరింపు ప్రక్రియతో పాటు కోర్సుల వివరాలు, ఏపీఈఏపీ సెట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇన్స్టక్షన్స్ మాన్యువల్ తదితర పూర్తి వివరాలను పొందవచ్చు. -
రంజాన్కు సర్వం సిద్ధం
రేపల్లె: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలోని ఈద్గాలను, మసీదులను నమాజులు నిర్వహించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. గత నెల రోజులుగా ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న రంజాన్ కఠోర ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో విరమించారు. శనివారం ఈద్–ఉల్–ఫితర్ (రంజాన్) ప్రత్యేక ప్రార్థనలకు ముస్లింలు సన్నద్ధమవుతున్నారు. రేపల్లె పట్టణంలోని పెనుమూడి రోడ్డులో ఉన్న తూర్పుజామియా మసీదు, పెద పోస్టాఫీసు సెంటరులోని పెదజామియా మసీదు, రామకోటిపేటలోని మదీనా మసీదు, లక్ష్మీ టాకీసు సెంటరులోని మర్కస్ మసీదు, జేఎల్బీ కళాశాల రోడ్డులోని అబూబకర్ మసీదు, నేతాజీనగర్లోని నసీరుద్దీన్ మసీదు, నగరం మండలం కట్టవలోని మదీనా మసీదుల, రేపల్లె పట్టణం ఉయ్యూరువారిపాలెం రోడ్డులోని ఈద్గా విద్యుద్దీపాలతో తీర్చిదిద్దారు. -
బాణసంచా మంటల్లో చిక్కిన ఇద్దరు చిన్నారులు
పెదకాకాని: కూటమి ప్రభుత్వంలో నాయకుల పర్యవేక్షణలో జరిగిన బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం నిర్వహణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. మహోత్సవం పెదకాకాని పొలిమేర సెంటర్ జెండా చెట్టు నుంచి బయలుదేరి గురువారం రాత్రి 2 గంటలకు వెనిగండ్లలోని వేమారెడ్డి గుడి సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో ఆటో పక్కనే నిలబడి బాణసంచా కాలుస్తున్న వ్యక్తి మద్యం మత్తులో ఆకాశంలోకి వదిలిన తారాజువ్వ నుంచి నిప్పురవ్వలు ఆటోలో నిల్వ ఉన్న బాణసంచాపై పడ్డాయి. ఆటోకు నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బాణసంచాపై పడుకుని నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారులు ఆ మంటల్లో చిక్కుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి అనాస్ పరిస్థితి విషమంగా ఉండగా.. అజయ్ అనే చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరికీ తండ్రులు లేదు. తల్లులు దర్గా వద్ద పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటున్నారు. గుంటూరు ఆర్డీఓ కె. శ్రీనివాసరావు, మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, తహసీల్దార్ కృష్ణకాంత్, టీపీ నారాయణస్వామిలు పరామర్శించారు. నిద్ర వస్తుండటంతో బాణసంచాపై పడుకుని ఉన్నామని, పక్కకు వెళ్ళి కాల్చాలని ఆ వ్యక్తిని కోరామని బాధితులు తెలిపారు. అయినప్పటికీ అతడు వినిపించుకోలేదని వాపోయారు. -
భక్తిశ్రద్ధలతో బాజీబాబా దర్గా ఉరుసు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం గురువారం కనుల పండువగా ప్రారంభమైంది. పెదకాకాని సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున ప్రత్యేక ప్రార్థనలతో ఉరుసు మహోత్సవం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో దర్గా ఈఓ షేక్ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు షఫా బావి నీటితో స్నానాలు చేసి దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం 7 గంటలకు బాజీబాబా గుఱర్రం దర్గాలో ప్రదక్షిణలు చేసింది. దర్గా ప్రాంగణమంతా భక్తులతో కళకళలాడింది. పెదకాకాని పొలిమేర సెంటర్ నుంచి ప్రత్యేక చాందిని అలంకరణలో గంధం బిందెలతో ప్రారంభమైన బాజీబాబా వారి గుర్రంతో శుక్రవారం ఉదయం వరకూ వెనిగండ్ల గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. ఈ మహోత్సవం బాణసంచా వెలుగులు, తీన్మార్ తప్పెట్లు, సన్నాయి వాయిద్యాలు, బాండ్మేళాలు, విద్యుత్ కాంతుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. దర్గాకు చేరుకున్న భక్తులు బాబా వారి గుర్రం వెంట నడిచారు. ఊరేగింపు ముగించుకుని బాబావారి గుర్రం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు దర్గాకు చేరుకుంటుందని అనంతరం భక్తులకు గంధం పంచిపెట్టడం, సలామి ప్రార్ధనలతో ఉరుసు మహోత్సవం ముగుస్తుందని ఈఓ షేక్ ఖాజావలి తెలియజేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సూపరింటెండెంట్లు, జూనియన్ అసిస్టెంట్లను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శీనానాయక్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు(చందు)కు సత్రాలు, వేద పాఠశాల, దత్తత ఆలయాలకు బదిలీ చేశారు. వేదపాఠశాల, దత్తత దేవాలయాల విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ వి.సత్యనారాయణమూర్తికి కేశఖండనశాల, దుర్గాఘాట్, కృష్ణమ్మ హారతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేశఖండనశాల, దుర్గాఘాట్, ఆడిట్ జనరల్ విధులు నిర్వహిస్తున్న హేమ దుర్గాంబకు ఆడిట్, జనరల్, అన్న దానం విధులు అప్పగించారు. జూనియర్ అసిస్టెంట్ ఎం.రమేష్ను ప్రధాన ఆలయం నుంచి పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.జగన్నాథరావును ప్రధాన ఆలయ ఇన్స్పెక్టర్ బాధ్యతలు అప్పగించారు. -
గ్యాస్ సిలిండర్... నో స్టాక్
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా తాడేపల్లి మండలంలో 24.4 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1 మి.మీ వర్షం పడింది. సగటున 5.6 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. చేబ్రోలు మండలంలో 19 మి.మీ., తుళ్ళూరు 18.2, తాడికొండ 17.4, మంగళగిరి 13, పెదకాకాని 5.2, గుంటూరు తూర్పు 1.4, గుంటూరు పశ్చిమలో 1.2 మి.మీ చొప్పున వర్షం పడింది. కోనేరుసెంటర్(మచిలీపట్నం): మచిలీపట్నంలో ఓ కీచక అర్చకుడి వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసు వివరాలను బందరు ఇన్చార్జ్ డీఎస్పీ ధర్మేంద్ర ఆర్పేట పోలీస్స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని లక్ష్మణరావుపురం రామాలయంలో నిజాంపేటకు చెందిన ఎ.రఘునాథశర్మ అర్చకుడిగా పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ కుటుంబంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న బాలిక ఉంది. ఆమైపె అర్చకుడు రఘునాథశర్మ కన్నేశాడు. ఆమెను తొలుత తన భార్యకు దగ్గర చేశాడు. అనంతరం బాలికతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. వారి కుటుంబం ఎక్కడికి వెళ్లినా భార్యాపిల్లలతో పాటు ఆ బాలికనూ తీసుకెళ్లేవాడు. మాయమాటలు చెప్పి గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు అనేకమార్లు ఆమైపె లైంగికదాడి చేశాడు. బాలిక బుధవారం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి బాలిక గర్భంధరించిందని నిర్ధారించారు. తల్లిదండ్రులు ఆగ్రహంతో అందుకు కారణం ఎవరంటూ బాలికను ప్రశ్నించారు. తాను గర్భం దాల్చటానికి కారణం రఘునాథశర్మ అని ఆమె చెప్పటంతో తల్లిదండ్రులు వెంటనే ఆర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రఘునాథశర్మను అరెస్ట్ చేశారు. ఈ సమావేశంలో ఆర్పేట సీఐ ఏసుబాబు, ఎస్ఐ యోహాను, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బాలికపై యువకుడి లైంగికదాడి చిట్టినగర్(విజయవాడపశ్చిమ):ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించిన యువకుడు ఆమైపె లైంగిక దాడికి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్స్టేషన్ పరిధిలోని పాత రాజరాజేశ్వరిపేటలో చోటు చేసుకుంది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. విజయవాడ పాతరాజరాజేశ్వరికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి వరకు చదువుకుని మధ్యలో మానేసి ఇంటి వద్దే ఉంటోంది. అదే ప్రాంతంలో నివసించే దేవరపాటి రాజేష్ అలియాస్ నాని మాయ మాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. -
శుక్రవారం శ్రీ 20 శ్రీ మార్చి శ్రీ 2026
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులకు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి దంపతులు నూతన వస్త్రాలను బహూకరించగా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దుశ్శాలువాతో వైఎస్ జగన్ను సన్మానించారు. పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు, సమన్వయకర్తలు అంబటి మురళీకృష్ణ, వనమా బాల వజ్రబాబు, బలసాని కిరణ్కుమార్, షేక్ నూరి ఫాతిమా, గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, వరికూటి అశోక్బాబు, పి. నాగమోహన కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పిన్నెల్లికి జన నీరాజనం
నకరికల్లు: అక్రమ కేసులో 98 రోజులపాటు అక్రమ నిర్భంధం అనుభవించి బెయిల్పై వస్తున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మండలంలో ఘన స్వాగతం పలికారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో అడ్డరోడ్డుకు చేరుకున్నారు. సుమారు మూడున్నర గంటలపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాకకోసం ఎదురుచూశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డరోడ్డు చేరుకోగానే హర్షధ్వానాలతో అభిమానులు హోరెత్తించారు. పిన్నెల్లిని, సత్తెనపల్లి ఇన్చార్జి గజ్జల సుధీర్భార్గవరెడ్డిని భారీ గజమాలతో సన్మానించారు. జయజయ నినాదాలతో హోరెత్తించారు. అడ్డరోడ్డు వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామిని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడులో టీడీపీ రెండు వర్గాల పోరులో వాళ్లకు వాళ్లు హత్యలకు పాల్పడితే కావాలని తమను అనవసరంగా ఇరికించారని వాపోయారు. 98 రోజులపాటు అక్రమంగా జైలులో పెట్టారన్నారు. ఎస్పీ సైతం ఆధిపత్యపోరులో ఈ హత్యలు జరిగాయని చెప్పినా తమను అన్యాయంగా కేసులో ఇరికించారన్నారు. తమకంటూ ఒకరోజు వస్తుందని... తప్పుడు కేసులు పెట్టడానికి కారణమైన వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెడతామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయాలని చూడడమే కాక తప్పుడు కేసులతో నోరు నొక్కాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామని... అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రెట్టింపు బలంతో దుర్మార్గంపై పోరాడతామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ మేడికొండ పరమేశ్వరరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, వైస్ ఎంపీపీ మేడం ప్రవీణ్కుమార్రెడ్డి, దూదేకుల బాషా పాల్గొన్నారు. దాచేపల్లిలో.. దాచేపల్లి : మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దాచేపల్లిలో ఘన స్వాగతం లభించింది. నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య కుటుంబ సభ్యులు గజమాలతో సన్మానించారు. చైర్మన్ సాంబయ్య నివాసంలో అల్పాహారాన్ని పీఆర్కే స్వీకరించారు. అనంతరం నారాయణపురం బంగ్లా సెంటర్లో ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ ఖాదర్ బాషా రంజాన్ పండుగ సందర్భంగా పీఆర్కేకు టోపీ, చౌకన్, కంకణం బహూకరించారు. నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు కోటా కృష్ణ, షేక్ సుభాని, నగర పంచాయతీ మాజీ చైర్మన్ మునగా పున్నారావు, జెడ్పీటీసీ మూలగొండ్ల ప్రకాష్ రెడ్డి, ఎంపీపీ కందులు జాను, వైస్ చైర్మన్లు షేక్ ఖాదర్ బాషా, కొమరభత్తిన విజయకుమార్, అధికార ప్రతినిధి షేక్ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్లు మందపాటి రమేష్ రెడ్డి, బుర్రా విజయ్ కుమార్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు పరిమి బాబు తదితరులు ఉన్నారు. ప్రత్యేక పూజలు మాచర్ల: మాచర్ల పట్టణానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా వేలాది మంది తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. రాయవరం జంక్షన్లో ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు చేశారు. -
మట్టి ఆధారంగా ఎరువుల మోతాదు
బాపట్ల: రైతులు నేలలో మట్టి నమూనా పరీక్షలు చేయించి, పోషక లోపాలను గుర్తించాక నివారణ చర్యలను చేపట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పంటల శరీర ధర్మశాస్త్ర విభాగాధిపతి డా.కె.జయలలిత అన్నారు. వ్యవసాయ కళాశాలలో ప్రధాన పంటలలో వచ్చే పోషకాల లోపాలు నివారణ అంశంపై జరిగిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఎరువులను అధికంగా వాడినా, తక్కువగా వాడినా అవి నేలపై ప్రతికూల ప్రభావాన్ని చూపెడతాయని తెలిపారు. నేలను పరిశీలించిన అనంతరం వచ్చిన నివేదికల ఆధారంగా ఎరువుల మోతాదులను నిర్ణయిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నత్రజని, భాస్వరం, పోటాష్ వంటి ప్రధాన పోషకాలను నేలకు సమతుల్యంగా అందించాలన్నారు. రసాయన ఎరువులతోపాటు సేంద్రియ ఎరువులను వాడితే నేల సారవంతం అవుతుందని తెలిపారు. రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఆచరిస్తూ శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడులను పొందవచ్చన్నారు. గోవిందపురం, పూండ్ల గ్రామాలకు చెందిన రైతులు ఈ శిక్షణలో పాల్గొని తగు సూచనలను పొందారు. ఈ కార్యక్రమంలో ఐసీఏఆర్ఎస్సీ ఉప ప్రణాళిక కో ఆర్డినేటర్ డాక్టర్ బి.అపర్ణ, డాక్టర్ జి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
స్ట్రోక్ చికిత్స వ్యవస్థ బలోపేతానికి కృషి
గుంటూరు మెడికల్: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ 19వ వార్షిక సదస్సు ఈనెల 13 నుంచి 15 వరకు కొచ్చిలోని గ్రాండ్ హయత్ హోటల్లో విజయవంతంగా నిర్వహించినట్లు ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి ప్రముఖ న్యూరాలజిస్టులు, స్ట్రోక్ నిపుణులు, పరిశోధకులు, ఆరోగ్య రంగ నిపుణులు పాల్గొన్నట్లు వెల్లడించారు. సదస్సులో డాక్టర్ విజయ ప్రెసిడెన్షియల్ ఓరియంటేషన్ ముఖ్య ఆకర్షణగా నిలిచిందని తెలిపారు. 1990లలో థ్రోంబోలైటిక్ చికిత్స అందుబాటులోకి రాకముందు పరిస్థితుల నుంచి ప్రారంభించి, 1995లో 3 గంటల్లో క్లాట్ బస్టింగ్ థెరపీ ఆవిష్కరణ, 2005లో స్ట్రోక్ కేర్ అభివృద్ధి, 2015లో న్యూరో ఇమేజింగ్, మెకానికల్ థ్రోంబెక్టమీ పురోగతి వరకు జరిగిన పరిణామాలను వివరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎంపిక చేసిన రోగులకు 24 గంటల వరకు చికిత్స అవకాశాలు విస్తరించిన విషయాన్ని డాక్టర్ పి.విజయ ప్రస్తావించారు. అత్యంత ప్రేరణాత్మకంగా నిలిచి, 400 మందికి పైగా జాతీయ అంతర్జాతీయ ప్రతినిధుల స్టాండింగ్ అవేషన్ అందుకున్నట్లు తెలిపారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ -
వైఎస్సార్ సీపీని అధికారంలోకి తేవటమే లక్ష్యం
తెనాలి:మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటమే అందరి లక్ష్యంగా కృషిచేద్దామని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి మున్సిపాలిటీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గత అయిదేళ్లు చైర్పర్సన్లుగా, కౌన్సిలర్లుగా, కో–ఆప్షన్ సభ్యులుగా పదవీకాలం పూర్తిచేసిన సందర్భంగా బుధవారం రాత్రి అభినందన సత్కారాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శశివేదికలో జరిగిన సభకు పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పకుండా, పార్టీకి ఎలాంటి డ్యామేజి లేకుండా, తనకు ఎలాంటి మచ్చ తేకుండా పరిపాలన చేసిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికను శివకుమార్ ముందుగా అభినందించారు. ఓటమితో కుంగిపోకుండా పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ పాటుపడిందని చెప్పారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో అయిదేళ్లపాటు దిగ్విజయంగా ప్రజాసేవలో గడిపే అవకాశం దక్కిందని గుర్తుచేశారు. శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో రూ.1800 కోట్ల సంక్షేమం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1800 కోట్ల సంక్షేమాన్ని అందించే అవకాశం తనకు కలిగినట్టు చెప్పారు. ఓసీలకు రిజర్వు చేసిన తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తానని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ప్రకటించినట్టు శివకుమార్ గుర్తుచేశారు. ఆ ప్రకారం తొలిగా ముస్లిం మైనారిటీకి చెందిన సయ్యద్ ఖలేదా నసీమ్, తర్వాత బీసీ వర్గానికి చెందిన తాడిబోయిన రాధికకు చైర్పర్సన్గా అవకాశం కల్పించినట్టు చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తికాలం వైఎస్సార్ సీపీ కౌన్సిల్ నడిచేందుకు తాడిబోయిన రమేష్ కృషిచేశారని చెబుతూ ఆయన్ను అభినందించారు. అనంతరం చైర్పర్సన్, వైస్చైర్మన్లు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులను శివకుమార్ సత్కరించారు. మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, మాజీ వై స్చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, కోటేశ్వరరావు, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, గెడ్డటి సురేంద్ర, ఝాన్సీవాణి, కుర్రా సుజాత, అన్నాబత్తుని పద్మజ, కఠారి రత్నకుమారి, మల్లెబోయిన సురేఖ, పెదలంక లక్ష్మీలావణ్య, మట్లపూడి సంధ్యారాణి, వీర్లపాటి విజయలక్ష్మి, షేక్ దుబాయ్బాబు, షేక్ ఇస్మాయిల్, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, కో–ఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, పెచ్చింగ్ సుభాని, షేక్ గౌసియా, పార్టీ నాయకులు తపాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ -
ప్రజల జీవితాల్లో ఉగాది ఆనందాన్ని నింపాలి
బాపట్ల: ఉగాది పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనందాలను నింపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆకాంక్షించారు. ఉగాది వేడుకలు గురువారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. తొలుత జిల్లా కలెక్టర్కు మేళతాళాలతో స్వాగతం పలికారు. పవన్ కుమార్ అవధాని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది పచ్చడిని అతిథులకు అందజేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంచాంగాన్ని విడుదల చేశారు. చిన్నారుల సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. పలువురికి ఉగాది పురస్కారాలను కలెక్టర్ అందజేశారు. జిల్లా ప్రజలంతా సుఖసంతోషాలతో అభివృద్ధి వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రగతిపథంలో జిల్లాను నడిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖలో సేవలు అందించిన నారాయణ శ్రీనివాసాచార్యులు, పవన్ కుమార్ అవధాని, ఫణి కుమార్ స్వామి, వేదాంత మురళీమోహన్, తెలుగు భాష వ్యాప్తిపై విశేష సేవలందిస్తున్న ఉపాధ్యాయులు చుండూరు వెంకటేశ్వర్లు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పి. శ్రీరామచంద్రమూర్తి, ఎం. కోటేశ్వరరావు, అల్లూరి శివ కోటేశ్వరరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి షాలేము రాజు, డీఆర్ఓ గంగాధర్ గౌడ్లకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, జిల్లా దేవదాయ శాఖ అధికారి ఎం. నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం
అమరావతి: ఉగాది పర్వదినాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి వారికి గురువారం వేకువ జామున మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి సహస్ర కుంకుమార్చన నిర్వహించారు.దేవాలయ ఈవో సునీల్కుమార్ ఆధ్వర్యంలో వెంకటాద్రినాయుడు మండపంలో స్వామి వారిని ఉంచి శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం భక్తులందరికి ఉచితంగా పంచాంగ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయంలో గురువారం ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉగాది వేడుకలకు ప్రముఖ ప్రవచన కర్త ఎం.కృష్ణకిషోర్ ఉగాది పండుగ విశిష్టతను వివరించారు. ప్రముఖ పౌరాణికులు శ్రీహరి శర్మ పంచాంగ శ్రవణం గావించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పంచాంగ శ్రవణం విని ప్రసాదాలు స్వీకరించారు. నరసరావుపేట రూరల్: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో గురువారం ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. పరాభవ నామ ఉగాది సందర్భంగా ఆలయంలో వేదపండితులకు సన్మానం ఘనంగా నిర్వహించారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ అర్చకులు కొండకావూరి సత్యనారాయణ, కొండకావూరి రామకృష్ణ, శ్రీరాముల రాజశేఖరశర్మలను సన్మానించి సంభావన అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు, సిబ్బంది పాల్గొన్నారు. కర్లపాలెం: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షాలకు పిడుగు పడి ఓ వరికుప్ప దగ్ధమైంది. స్థానిక వీఆర్వో సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియటంతో బుద్ధాం గ్రామంలో నర్రా నాగరాజుకు చెందిన వరికుప్పపై పిడుగు పడి మంటలు ఎగశాయి. స్థానిక రైతులు వెంటనే స్పందించి మంటలు ఆర్పి కుప్పను కల్లంలో ఆరబెట్టారు. రైతుకు సుమారు రూ.70వేల నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. -
నడుముకు రాయి కట్టి.. చెరువులోకి పడేసి..!
గుంటూరు రూరల్: గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురికాగా.. మృతదేహం కూడా కనిపించకుండా చేసేందుకు శరీరానికి హద్దు రాయి కట్టి గోనెసంచిలో చుట్టి చెరువులోకి పడేసిన దారుణ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరువులో చేపలు పట్టుకునేందుకు గురువారం ఒక యువకుడు వెళ్ళాడు. ఆ సమయంలో చెరువులో తెలియాడుతూ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నరహరి స్థానికులు, సిబ్బందితో కలిసి మృత దేహాన్ని బయటకు తీయించారు. -
భూసేకరణ ఎవరి కోసమో చెప్పాలి?
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణయ్య నరసరావుపేట: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కోసం రూ.24,700 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించి గెజిట్ విడుదల చేశారని, అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో 250 మీటర్ల వెడల్పు 129 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు, 59 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్రోడ్డు దీనికి అనుబంధంగా 32 రేడియల్ లింక్ రోడ్ల నిర్మాణానికి 300 గ్రామాల్లో 15 వేల ఎకరాల అసంబద్ద భూసేకరణ ఎవరి ప్రయోజనాల కోసమో చెప్పాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.కృష్ణయ్య ప్రశ్నించారు. స్థానిక కోటప్పకొండ రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో గురువారం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. అసంబద్ధ భూసేకరణ వల్ల అమరావతిలో కొన్ని గ్రామాలు పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న రేటు క్వింటా రూ.2400లు ప్రకటించి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా రైతులను మోసం చేయడం తగదన్నారు. రాష్ట్రంలో 9.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు కాగా పల్నాడు జిల్లాలో 1.50 లక్షల ఎకరాలు సాగు చేశారన్నారు. పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రాధాకృష్ణ, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, ఎస్.ఆంజనేయులు నాయక్, జిల్లా కమిటీ సభ్యులు గద్దె చలమయ్య, డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, జె.శంకరరావు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, గుంటుపల్లి బాలకృష్ణ పాల్గొన్నారు. -
ట్రేడ్ దోస్త్ కంపెనీ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
లక్ష్మీపురం: గుంటూరు అరండల్పేటలో నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ కంపెనీ పేర్లతో భారీ మొత్తంలో మోసం చేసి పరారైన నిర్వాహకుడిపై బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరండల్పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేరుతో అరండల్పేట 16వ లైనులో అన్నం పూర్ణచంద్రరావు, మరికొంత మందితో కలిసి గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నామని, పెట్టుబడి పెట్టిన వారికి 20 నెలల్లో రూ. లక్షకు రూ. 2 లక్షలు కలిపి ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అక్రమంగా వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారి పేర్లపై డ్రా తీసి 40 గ్రాముల బంగారం, తదితర స్కీమ్ల పేర్లతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇటీవల అన్నం పూర్ణచంద్రరావు తీరుపై అనుమానం వచ్చిన బాధితులు సంబంధిత డ్రాల గురించి నిలదీసే ప్రయత్నం చేయగా.. పూర్ణ చంద్రరావు పరారయ్యాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతా శివకోటేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక ఆపరేషన్కు రూ.లక్ష ఆర్థికసాయం
బాపట్ల: కర్లపాలెం మండలంలోని పెద్దపులివారిపాలెం సర్పంచ్ అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండగా మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతితోపాటు పార్టీ నాయకులు కలిపి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. అక్కల శ్రీనివాసరెడ్డి కుమార్తె ఆపరేషన్ నిమిత్తం నగదు అందజేసి ఆరోగ్యం మెరుగుపడేలా చూసుకోవాలని సూచించారు. వైద్యులతో కోన మాట్లాడి, మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, పేరాల వెంకట సురేష్, ధర్మేంద్ర, ఆట్ల నాగేశ్వరరెడ్డి ఉన్నారు. గుండెపోటుతో ఎస్ఐ మృతి చీరాల: ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వల్లాగి భాస్కరరావు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం ఇంటి వద్ద గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, ఒన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు, టూటౌన్, రూరల్ సీఐలు అశోక్కుమార్, శేషగిరిరావులు, ఎస్ఐలు ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1982 బ్యాచ్లో కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరిన ఆయన ఎస్సైగా పదోన్నతి పొంది చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. 42 సంవత్సరాల పాటు పోలీస్శాఖలో సేవలందించారు. ఆయన మరణం పట్ల సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జూదరుల అరెస్ట్ చీరాల: పంట పొలాల వద్ద పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ బుధవారం అరెస్ట్ చేశారు. చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని పొలాల్లో పేకాట ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు మెరుపుదాడి చేసి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.11,200 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఉపేక్షేంచేది లేదని హెచ్చరించారు. -
వైఎస్సార్ విగ్రహం స్వచ్ఛందంగా తొలగింపు
కారెంపూడి: మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో పొట్టిశ్రీరాములు కాలనీలో ఉద్రిక్తతకు తెరపడింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని స్వచ్ఛందంగా బుధవారం అక్కడ నుంచి తాత్కాలికంగా తీసివేశారు. మంగళవారం టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కూడా సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. కల్యాణ మండపం నిర్మాణానికి అడ్డుగా ఉన్న విగ్రహాలను టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు తాత్కాలికంగా తొలగించి సమస్యకు ముగింపు పలికారు. కల్యాణ మండపం అందరికీ ఉపయోగపడుతుందని కల్యాణ మండపం నిర్మాణం పూర్తయ్యాక ఇబ్బంది లేకుండా మళ్లీ విగ్రహాలను పునప్రతిష్ట చేసుకుంటామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర ఎక్కడ ?
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ: ఆంధ్రప్రదేశ్లో రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు ఎలా ఉన్నారో, కూటమి ప్రభుత్వంలో రైతులు ఏ విధంగా ఉన్నారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించారని చెప్పారు. ఈ క్రాప్ నమోదు చేసి ప్రతి రైతుకు పంట నష్టం జరిగినప్పుడు సహాయం అందించారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నేరుగా రైతుల ఖాతాల్లోనే పరిహారం జమ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు పండించిన మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో క్వింటా రూ.2400 అమ్మిన మొక్కజొన్నలు కేవలం రూ.1600కు కూడా కొనుగోలు లేక రైతులు లబోదిబోమంటున్నారని చెప్పారు. పొగాకు, ధాన్యం, కందులు, ఇతర పంటలు కూడా గిట్టుబాటు ధరకు కొనేవారు లేరని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీస అవసరాలకు కూడా గ్యాస్ లభించే పరిస్థితి లేదన్నారు. గంజాయి, డ్రగ్స్కు కేంద్రంగా... గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయని, డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ పార్లమెంటు సభ్యుడు పుట్టా మహేష్యాదవ్ పోలీసులకు దొరకడం సిగ్గుచేటన్నారు. మదనపల్లిలో చిన్నారి హత్య వంటి దారుణాలు కూడా గంజాయి మత్తులోనే జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రేషన్సరుకులు ఇంటి వద్దకే సరఫరా చేశామని పేర్కొన్నారు. గతంలో సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇస్తామంటూ, ప్రజలకు, ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు టోపీ పెట్టారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 50 వేల ఎకరాల్లో హార్టికల్చర్ సాగవుతుందని ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పారని, మిరప, కంది, పత్తి అన్ని పంటలను కలిపినా 50 వేల ఎకరాల సాగులో లేదని గుర్తు చేశారు. గ్రానైట్ అక్రమ రవాణా, బెట్టింగ్లు, లాడ్జీల్లో అసాంఘిక కార్యకలాపాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించడం వంటివి తప్ప చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. పోలీస్స్టేషన్ల్లో అక్రమ కేసులు బనాయించడం, కాలనీల్లో బ్రాందీషాపులు ఏర్పాటు చేయడం యథేచ్ఛగా జరుగుతున్నాయని తెలిపారు. అదేమని ప్రశ్నిస్తే వారిపైనే కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించాలని మహిళలు ధర్నా చేస్తుంటే వారిపై దాడులు చేయడం దారుణమన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం అంతా గ్రాఫిక్స్లో తప్ప వాస్తవ రూపంలో కనిపించడం లేదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని చిన్న, చితక వారిని బెదిరించడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పీ4 పథకంలో భాగంగా 100 కుటుంబాలను దత్తత తీసుకున్నానని చెబుతున్న ఎమ్మెల్యే జీవీ ఒక్కరికన్నా న్యాయం చేశారా అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలందరికి ఉగాది నూతన సంవత్సరాది శుభాకాంక్షలు, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎం.ఎన్.ప్రసాద్, రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం నాయకులు జుజ్జూరి ఐరామ్మూరి, పట్టణ అధ్యక్షులు కొత్తమాసు శివ, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ బేతం గాబ్రియేలు, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ గంధం బాలిరెడ్డి, వినుకొండ మండలం రూరల్ కన్వీనర్ దండు చెన్నయ్య, శావల్యాపురం కన్వీనర్ బోడెపూడి కొండలు, గుంజి వాసు, కొత్త కృష్ణారెడ్డి, బి.నాగేశ్వరరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. -
ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలి
బాపట్ల: ఏపీఐఐసీ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల నిర్మాణం వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణంతోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించడానికి వీలవుతుందని కలెక్టర్ చెప్పారు. నిజాంపట్నం, వేటపాలెం, అమర్తలూరు, పర్చూరు, బాపట్ల మండలాలలో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం చేపట్టాలన్నారు. -
గోలివాగులో సంచరిస్తున్న మొసలి
రెంటచింతల: మండలంలోని గోలి గ్రామ సమీపంలోని గోలివాగు బ్రిడ్జిపై రాత్రి వేళ మొసలి సంచరిస్తుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోలి వాగు బ్రిడ్జిపై మొసలి సంచరిస్తున్న విషయం గమనించిన గ్రామస్తులు తహసీల్దార్ దొప్పలపూడి మేరి కనకం దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె వెంటనే స్పందించి ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్, అటవీశాఖ అధికారులకు సమాచారం తెలియచేసి వాగు సమీపంలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. ప్రతి రోజు వాగులో దుస్తులు శుభ్రం చేసే మహిళలకు, ఈ రహదారిపై నుంచి జెట్టిపాలెం ఏపీ మోడల్ స్కూల్కు వెళ్తున్న గోలి గ్రామానికి చెందిన విద్యార్థులకు, గ్రామ సమీపంలో నాపరాయి క్వారీ కార్మికులకు, నాగమయ్య స్వామి ఆలయానికి వచ్చే భక్తులు, వాగులో పశువులకు దాహార్తిని తీర్చేందుకు వచ్చే పశుపోషకులు ఈ వాగులో మొసలి సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఐ మన్మోహన్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
న్యాయస్థానమే ఆదుకుంది
మంగళగిరి టౌన్: పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసేలా మంగళగిరి మండలం ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాల యాజమాన్యం వ్యవహరించిందని హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ అన్నారు. ఆత్మకూరు నిర్మల సీబీఎస్ఈ పాఠశాల నందు 2024– 25లో 83 మంది 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఒరిజినల్ మార్కుల జాబితాలు జారీ చేయని నేపథ్యంలో వారి తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పిల్లలకు ఒరిజినల్ మార్కుల జాబితాలను అందించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిపై పిల్లల తరఫున వాదనలు వినిపించిన హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ, పిల్లల తల్లిదండ్రులతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అడ్వకేట్ బేతపల్లి మాట్లాడుతూ, 2024–25లో నిర్మల సీబీఎస్ఈ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు యాజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయటం జరిగిందని తెలిపారు. ఈనెల 9వ తేదీన జస్టిస్ న్యాపతి విజయ్ రెండు వారాల లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలని తీర్పు ఇవ్వటం సంతోషించదగ్గ విషయమని అన్నారు. హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ -
తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించిన కాయకల్ప బృందం
తెనాలిఅర్బన్: తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలను కాయల్ప బృందం మంగళవారం సందర్శించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గ్లోరి, క్వాలిటీ మేనేజర్ వాసుబాబు, క్వాలిటీ కన్సల్టెంట్ వాసు రాజు తతదితరులు ఆసుపత్రిలోని పలు వార్డులు, ఓపీ సేవలు, ల్యాబ్, రేడియాలజీ తదితర విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించి పలువురు అభిప్రాయాలు తెలుసుకున్నారు. సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్డర్ సౌభాగ్యవాణి, ఆర్.ఎం.వో డాక్టర్ మల్లిఖార్జునరావు, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలిరూరల్: తల్లి మందలించిందన్న కారణంలో కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అంగలకుదురు గ్రామానికి చెందిన మన్నవ తిరుపతయ్య(35) బేలుదారు పనులు చేస్తుంటాడు. పనికి వెళ్లగా వచ్చిన డబ్బుంతా మద్యంకే వాడేస్తుండడంతో తల్లి సోమవారం మందలించింది. మనస్థాపానికి గురై పురుగులమందు తాగిన అతన్ని కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వైద్యశాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ తెలిపారు. మృతుడి భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. -
రూ.1.15 కోట్లకు మోసం
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : సుమారు రెండేళ్లకుపైగా మిర్చి డబ్బులు కోసం కాళ్లు అరిగేలా పొరుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వస్తున్నామని బాధిత మిర్చి రైతులు వాపోయారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లా తనగల గ్రామ వాసులు బోయ నారాయణ, పచ్చర్ల రాజు, ఈడిగ నరసింహగౌడ్, కురవ వెంకటేశ్ (సర్పంచ్), ఉప్పర లక్ష్మణ (షాబాదా గ్రామం)లు మంగళవారం గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గత రెండేళ్లుగా చవి చూసిన కష్టాలను మొరపెట్టుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్, జిల్లా ఎస్పీలకు వినతిపత్రాలు అందించారు. అనంతరం మిర్చి బాధిత రైతులు మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరులోని రెండు చిల్లీస్ ట్రేడింగ్ సంస్థల నిర్వాహాకులకు మిర్చి బస్తాలు పంపించేవాళ్లమని అన్నారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం 2,300 మిర్చి బస్తాలు తీసుకురాగా, ప్రస్తుతం ధరలేదని ఓ కోల్డ్స్టోరేజీలో నిల్వ చేయాలని నిర్వాహాకులు సూచించారని చెప్పారు. వారి చెప్పినట్లుగానే సదరు స్టోరేజీలో నిల్వ చేశామన్నారు. నిర్వాహాకులను డబ్బులు అడిగితే అదిగో ఇదిగో అంటూ దాటవేశారు. దీంతో అనుమానం వచ్చి స్టోరేజీలో ఆరాతీయగా మా పేర్లపై మిర్చి బస్తాల్లేవని, నిర్వాహాకులు, వారి కుటుంబ సభ్యులపై ఉన్నాయని అన్నారు. మేమంతా మోసపోయిన గుర్తించి నిర్వాహాకులను గట్టిగా అడిగితే, మిర్చి విక్రయించినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. దీనికిగాను చెక్కులు, ప్రామిసరీనోట్లు, రూ.100ల అగ్రిమెంట్లు రాసిచ్చారని అన్నారు. అలాగే గుంటూరు లాలుపురంలో స్థలం, కర్నూలులో ఎకరంన్నర పొలం విక్రయించగా వచ్చే డబ్బులు చెల్లిస్తామని బురిడి మాటలు చెప్పారని వాపోయారు. అయితే ఆ చెక్కులు, అగ్రిమెంట్ ఇతరత్రా కాగితాలు వల్ల ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్సి మోసగించి, రూ.1.15 కోట్లు చెల్లించకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. పొరుగు రాష్ట్రం నుంచి వందలాది కి.మీ ప్రయాణించి గుంటూరు వస్తుంటే సదరు ట్రేడింగ్ నిర్వాహాకులు తమను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు. సదరు ట్రేడింగ్ కంపెనీల నిర్వాహాకులను నుంచి తమకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు. -
గ్యాస్ కొరత లేదు...
గుంటూరు వెస్ట్: జిల్లాలో గృహ అవసర గ్యాస్ కొరత లేదని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. మంగళవారం స్థానిక బస్టాండ్ దగ్గరలో ఉన్న ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎల్.పి.జీ ఏజెన్సీని తనిఖీ చేశారు. అక్కడే ఉన్న వినియోగదారులతో ముఖాముఖీ మాట్లాడి ఎప్పుడు బుక్ చేశారో తెలుసుకొని, బుధవారం ఉదయం నాటికి సిలిండర్ పంపిణీ చేయాలని గోడౌన్ ఇన్చార్జిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అనవసరమైన ఆందోళనతో గ్యాస్ బుక్ చేయవద్దని వినియోగదారులను కోరారు. కొందరు డెలివరీ బాయ్స్ నిర్లక్ష్యంగా ఉన్నారని ఫిర్యాదు చేయగా, వారి పనితీరు మార్చుకోనట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న పెండింగ్ బుకింగ్లకు సంబంధించి కొండపల్లి ప్లాంట్ నుంచి లోడ్ వస్తుందని, బుధవారం నుంచి ముందు బుకింగ్ చేసుకున్న వారికి ముందు పంపిణీ చేసే విధంగా సిద్ధంగా ఉన్నామని గోడౌన్ ఇన్చార్జి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ కోమలి పద్మ, జిల్లా మేనేజరు, పౌరసరఫరాల ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
నరసరావుపేట: వినియోగదారులు తమ హక్కులను కాపాడుకోవడంతోపాటు, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే, వారు తమ తల్లిదండ్రులు, సమాజానికి మెరుగ్గా వివరించగలరని అన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ కొనుగోళ్లు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాల బారిన పడకుండా వినియోగదారులకు మరింత విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత లోపించినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకోవడం, ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరా అధికారి ఎంవీ ప్రసాద్ మాట్లాడుతూ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్నప్పుడు అది సకాలంలో, సరైన తూకంతో వస్తోందా, లేదా అని గమనించాలని కోరారు. సమావేశంలో భాగంగా ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖ అధికారులు విద్యార్థులకు నాణ్యత ప్రమాణాల యంత్రాలను ప్రదర్శించారు. ఆహార పదార్థాల్లో నాణ్యతను ఎలా గుర్తించాలో విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. వినియోగదారుల హక్కులపై రూపొందించిన వాల్పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు. వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్న ఆర్టీఐ సంస్థ ప్రతినిధులకు సర్టిఫికెట్లు అందజేశారు. హైస్కూల్ విద్యార్థులు, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నివారణే ధ్యేయం కావాలి
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: సమాజానికి చేటు కలిగించే బాల్య వివాహాల నివారణే ధ్యేయంగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జిల్లా స్థాయి బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార ముగింపు కార్యక్రమం ఎస్. ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. గత నవంబరు 27వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా అమలులో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. వివిధ శాఖలు నిర్వర్తించాల్సిన ప్రత్యేక కార్యాచరణ పై ఆయా శాఖాధిపతులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికల ఆరోగ్యం పెద్ద సమస్యగా మారుతుందని, యుక్త వయసులోనే కుటుంబభారం పడుతుందని, జీవితం అంటే ఏమిటో తెలిసే సమయానికి జీవితం చరమాంకానికి చేరుతుందని అన్నారు. సమాజంలో బాలికలకు, మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సమాజ నిర్మాణంలో వారికి కీలక పాత్ర అందేటట్లు సహకరించాలని తెలిపారు. బాలికలు, మహిళల ఆరోగ్యం కుటుంబానికి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. బాల్య వివాహాలు సామాజిక రుగ్మత అన్నారు. తల్లిదండ్రులకు సరయిన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వివరించారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు మాట్లాడుతూ బాల్య వివాహిత రహిత గ్రామాలుగా గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాలను తీర్మానించే క్రమంలో ఆ శాఖకు చెందిన వివిధ స్థాయిలలోని బాల్య వివాహ నిషేధిత అధికారులు తమ బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. జిల్లా విద్యా శాఖాధికారి డాక్టర్ సలీం బాషా మాట్లాడుతూ బడి బయట పిల్లలు, ఎక్కువసార్లు బడికి హాజరు కానీ పిల్లలపై దృష్టి పెట్టి, అటువంటి పిల్లలు బాల్య వివాహ బాధితులు కాకుండా విద్యా సంస్థలు అన్నిటిలో అవగాహనా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. సమావేశంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, సాధికారిత అధికారి ప్రసూన పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, మునిసిపల్ అధికారులు, మండల, గ్రామ, వార్డు అధికారులు పాల్గొన్నారు. -
బాపట్ల
బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026దేవుడితోనూ బాబు ఆటలు ఇఫ్తార్ సహరి (బుధ) (గురు) నరసరావుపేట 6.26 4.59 గుంటూరు 6.24 4.57 బాపట్ల 6.24 4.577ప్రాతఃకాల పూజలు పెదపులివర్రు (భట్టిప్రోలు):మండల పరిధిలో ఉన్న పెద పులివర్రు పంచాయతీ లోని గాజుల పేటలో కొలువైన అభయాంజనేయ స్వామికి మంగళవారం ప్రాతఃకాల ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,500, గరిష్ట ధర రూ.9,300, మోడల్ ధర రూ.8,300 వరకు పలికింది. ఢిల్లీ బృందం పరిశీలన అమరావతి:స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను నేషనల్ క్యాలిటీ ఎస్యూరెన్స్ ప్రోగ్రాంలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. బాపట్ల: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగించిన దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టరు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న దేవస్థానానికి ఎంతోమంది మహానుభావులు బాధ్యతలు నిర్వర్తించిన చైర్మన్ కుర్చీలో కూర్పొనే అర్హత బి.ఆర్.నాయుడుకు లేదని పేర్కొన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినేవిధంగా బీఆర్ నాయుడు ప్రవర్తించినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవటం బాధాకరమన్నారు. బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మంగళవారం బాపట్ల పట్టణంలో నిరసన ప్రదర్శన జరిగింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ భవనం వరకు ఇది కొనసాగింది. నిరసనను ఉద్దేశించి డాక్టరు మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి పాలక మండలి చైర్మన్గా ఉన్న బి.ఆర్.నాయుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించటం సిగ్గు చేటన్నారు. అంతటి పవిత్రమైన పదవిలో ఉండి ఆ పనులు చేసిన బీఆర్ నాయుడు మళ్లీ తిరుమలలో అడుగుపెట్టడానికి వీలులేదని ప్రజలు ముక్తకంఠంతో నినదించేందుకు వస్తే వారిపై దాడులు చేయించి మరీ ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించటం సరికాదన్నారు. పేదలను కాపాడేందుకు ఉన్న చట్టాలను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలా ప్రవర్తించడం తగదని హితవు పలికారు. వెంటనే బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
పక్కా గృహాలు త్వరగా పూర్తి చేసుకోండి
వేటపాలెం: మండల పరిధిలోని జగనన్న కాలనీల్లో పక్కా గృహాల లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని చల్లారెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని కొణిజేటి చేనేతపురి కాలనీ పక్కనే ఉన్న జగనన్న కాలనీని కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వమే నిధులు ఇస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణాల్లో జాప్యంపై ఆరా తీశారు. ఉగాది నాటికి రెండున్నర లక్షల గృహ ప్రవేశాలు జరపాలని ముఖ్య మంత్రి సూచనలను లబ్ధిదారులు గుర్తించాలన్నారు. జిల్లాలో 6,481 పక్కా గృహాలు నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం సూచించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాలు పురోగతి లేకపోవడంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గృహ నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యం గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. చేనేతపురి కాలనీ పక్కన 254 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటి వరకు 181 గృహాలు నిర్మాణం మాత్రమే పూర్తికాగా .. ఇంకా మిగిలినవి వివిధ నిర్మాణ దశల్లో నిలిచిపోవడంపై పరిశీలించారు. కాలనీ వాసులు తమకు తాగునీరు రావడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తే మరి కొంత మంది ఇక్కడ నివాసం ఉంటారని ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పిలిపించి కలెక్టర్ మాట్లాడారు. పైప్లైన్లు దెబ్బతినడం వల్ల నీళ్లు రావడం లేదని సంబంధిత ఏఈ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆర్డీఓ టి. చంద్రశేఖర్ నాయుడు, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. రిసార్ట్స్కు ర్యాంకింగ్ స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్లో భాగంగా తీర ప్రాంతంలోని రిసార్ట్స్కు ర్యాంకింగ్ ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ అమలు తీరుపై తీర ప్రాంత మండలాల్లోని వివిధ శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛత గ్రీన్ లీఫ్ రేటింగ్ (పర్యావరణానికి హాని లేకుండా చేసే పారిశుద్ధ్య వ్యవస్థ) అమల్లోకి వస్తుందన్నారు. ఈ వ్యవస్థ అమలు తీరుపై గత నెలలో ఆయా శాఖల అధికారులు, రిసార్ట్స్ యజమానులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రస్తుతం బాపట్ల జిల్లా పదో స్థానానికి చేరిందన్నారు. మరికొన్నింటిలో ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఈ క్రమంలో సూర్యలంక, వాడరేవు, పాండురంగాపురం, రామాపురం బీచ్ ప్రాంతాలన్నీ పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందాలన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతంలోని 57 రిసార్ట్స్లు పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్, డీఎల్డీవోలు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ -
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు రాజ్యాంగం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టరు బి.ఆర్.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దేశం మొత్తం అమలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు రాజ్యాంగం అమలు అవుతోందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం ఎంతో పవిత్రంగా చూసే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసేలా చంద్రబాబు సర్కారు పని చేస్తోందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని నింద వేయటం ఎంతో దారుణమన్నారు. కల్తీ లేదని సీబీఐ తేల్చినా చంద్రబాబు సర్కారుకు బుద్ధి రాలేదన్నారు. ఇప్పుడు ఆ దేవస్థానం చైర్మన్ బి.ఆర్.నాయుడు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించటం సిగ్గు చేటన్నారు. ఆ పదవిలో ఒక్క క్షణం కూడా కొనసాగకుండా ఆయన రాజీనామా చేయాలని కోన డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు ఎల్లప్పుడూ కాపాడేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేస్తే ఆయనను క్రిస్టియన్గా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుందన్నారు. అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగ మోహన్ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి మోదుగుల బసవపున్నారెడ్డి, నాయకులు నక్క వీరారెడ్డి, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరులీలా శ్రీనివాసరెడ్డి, వడ్డిముక్కల డేవిడ్, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు. -
నేడు గోవాడలో కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): గోవాడలో ప్రసిద్ధి గాంచిన గంగ పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం కోటి కుంకుమార్చన సామూహిక లలిత పారాయణం జరగనున్నట్లు చైర్మన్ పావులూరి రమేష్, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాస వర్మలు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ఇప్పటి వరకు 7 అమావాస్య కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ నెలలో 18వ తేదీన ఫాల్గుణ అమావాస్య మహోత్సవం జరుగుతుందని తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అర్చకులు చావలి శ్రీధర్ శర్మ, ఎస్ఎస్ఎఫ్ బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మహా కుంభాభిషేకం కార్యక్రమంలో భాగంగా వీరభద్రుడి పూజ, గవ్యాంత పూజలు, తదితర కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారు జామున అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు లారీలను ఎస్ఐ అపర్ణ సీజ్ చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా రాజధాని ప్రాంతం నుంచి రెండు లారీలు నల్ల మట్టితో విజయవాడ వెళ్తుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారని చెప్పారు. వాటికి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తెనాలిలో పర్యటించిన ఢిల్లీ బృందం తెనాలిఅర్బన్: కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని బృందం తెనాలిలో మంగళవారం పర్యటించింది. ఆదిత్య శుక్లా నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులు బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డును పరిశీలించారు. ఘన వ్యర్థాల నిర్వాహణపై ఆరా తీశారు. వర్మీ, ఆర్గానిక్ కంపోస్టు, కోకో పిట్ కేంద్రాన్ని, ఎస్టీపీ ప్లాంట్ను పరిశీలించారు. వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.ఆర్.అప్పల నాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఏఈ సునీల్, పంచాయతీ రాజ్ డీఈ శివరామకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై భారీ మంటలు నరసరావుపేట రూరల్: గుంటూరు–కర్నూలు జాతీయ రహదారిపై పెట్లూరివారిపాలెం వద్ద మంగళవారం రాత్రి భారీగా మంటలు వ్యాపించాయి. రోడ్డు పక్కన ఉన్న చెత్తకు అగ్గి అంటుకోవడంతో ఈ మంటలు వ్యాప్తి చెందాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. -
201 మంది బాధితులకు ఫోన్లు అందజేత
బాపట్లటౌన్: మొబైల్ ఫోన్ల వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వర్ తెలిపారు. మొబైల్ ఫోన్లను పొగొట్టుకున్న 201 మంది బాధితులకు మంగళవారం ఫోన్లను అందజేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది గడిచిన మూడు నెలల వ్యవధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు రూ. 1.61 కోట్ల విలువైన 806 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి నెలా ‘మొబైల్ రికవరీ మేళా‘ నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేస్తున్నామన్నారు. 100 శాతం మొబైల్ ఫోన్లను రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్లలో పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రజలు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, సరైన బిల్లులు లేని, అతి తక్కువ ధరకు విక్రయించే అనుమానాస్పద ఫోన్లను కొనవద్దన్నారు. ఎక్కడైనా మొబైల్ ఫోన్ దొరికినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లలో అప్పగించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు పి.జగదీష్ నాయక్, ఎండీ మోయిన్, ఏ శ్రీనివాసరావు, సోషల్ మీడియా సెల్ సీఐ వి.సూర్యనారణ, ఎస్బీ సీఐ బి.నారాయణ, ఆర్ఐ షేక్ మౌలుద్దిన్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి నేర నియంత్రణే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై పోలీస్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్లో ఉన్న తీవ్రమైన సాధారణ కేసుల దర్యాప్తును వేగవంతంగా నిర్వహించాలన్నారు. ప్రాపర్టీ కేసుల్లో దొంగిలించబడిన సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 30 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించేలా కార్యాచరణ ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు, ముఖ్య ప్రదేశాల్లో వేకువజామున 2 గంటల నుంచి నిర్వహించాలన్నారు. దేవాలయాల వద్ద భద్రతను పటిష్టం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటు వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉగాది, రంజాన్ పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు పి.జగదీష్ నాయక్, ఎండీ మోయిన్, ఎ. శ్రీనివాసరావు జిల్లాలోని సీఐలు,ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
వలంచీర్స్పోయే!
చీరాల అర్బన్: చంద్రబాబు ఏ హామీ అయినా ఇవ్వగలడు. నమ్మించగలడు.. వంచించగలడు. ఎన్నికల వేళ ఆయన ఇచ్చిన హామీలు... తరువాత వాటిని పట్టించుకోకపోవటం అందుకు నిదర్శనమనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామన్నారు. జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామన్నారు. ఉగాది కానుకగా అమలు చేస్తామని వలంటీర్లను నమ్మబలికారు. ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మర్చిపోయారు. రేపు ఉగాది. బాబు ఏది మా జాబు .. అని వలంటీర్లు అడుగుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తీరు ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలంటీర్ వ్యవస్థకు పురుడు పోశారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించారు. ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే నేరుగా అందాయి. క్షేత్ర స్థాయిలో పరిపాలనకు దిక్సూచిలుగా మారారు. పారదర్శక సేవలు అందించారు. ప్రజల నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చింది. ఆశ పడ్డారు.. భంగ పడ్డారు – ఎన్నికల వేళ చంద్రబాబు చెప్పిన మాటలకు ఎక్కువ మంది వలంటీర్లు ప్రభావితం అయ్యారు. వలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తూ, నెలకు జీతం రూ.10వేలు చేస్తామనే మాటకు ఆశపడ్డారు. అయితే తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆ ఊసే ఎత్తక పోవటంతో భంగపడ్డారు. ప్రస్తుతం బాధపడుతున్నారు. వలంటీర్లలో చాలా మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారు. పని లేకుండా ఇంట్లో పెద్దలకు భారం కాకుండా ఉండేందుకు కొలువు చిన్నదైనా గౌరవంగా ఉంటుందని, పది మందికి సేవ చేసే అవకాశం ఉంటుందని వలంటీర్లుగా చేరారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికి రుణపడి ఉంటామని చెప్పుకున్నారు. అయితే తరువాత జరిగిన పరిణామాల క్రమంలో ఉన్న ఉద్యోగం పోయి, మరలా నిరుద్యోగులుగా మిగిలారు. వలంటీర్ వ్యవస్థ లేకుంటే చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన మరో హామీ నిరుద్యోగ భృతి అన్నా దక్కక పోతుందా అని భావించారు. అయితే నిరుద్యోగ భృతి అమలు ఎప్పటికో తెలీదు. అసలు అమలు చేస్తారో లేదో తెలీదు. ఇది ఒక రకంగా తమ జీవితాలతో చెలగాటమాడుకున్నట్లేనని వారు వాపోతున్నారు. అయితే తమ బాధను బహిరంగంగా కూడా చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రేపల్లెలో ఎగసిన నిరసన
బాపట్లమంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026 ఇఫ్తార్ సహరి (మంగళ) (బుధ) గుంటూరు 6.24 4.58 నరసరావుపేట 6.26 5.00 బాపట్ల 6.24 4.58అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు. రేపల్లె: ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ నాయ కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలగించిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను వెంటనే ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో పట్టణంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్చేశారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత మూడు గంటలకు పైగా కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేసినప్పటికీ మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో రహదారిపై బైఠాయించి ప్రజాస్వా మ్య పరిరక్షణ కోరుతూ నినాదాలు చేశారు. డీఈ మధుసూదనరావు ఫ్లెక్సీల తొలగింపుపై సమాధానం ఇవ్వకపోవటంతో నిరసన కొనసాగించారు. సమాచా రం అందుకున్న పట్టణ సీఐ మల్లికార్జునరావు అక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పార్టీ నాయకులు, పోలీసు ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, రాజకీయ పక్షపాతం లేకుండా వ్యవహరించాలని నాగమోహన్కృష్ణ డిమాండ్చేశారు. అనంతరం తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కు వెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుతూ వినతి పత్రా న్ని సమర్పించారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలను మీరు తొలగిస్తారా... మేము తొలగించమంటారా అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుంటే అక్కడే ఉన్న సీఐ వాగ్వాదానికి దిగా రు. అడ్డుకోబోయి న నాగమోహన్కృష్ణతో వాగ్వాదంకు దిగి చొక్కా పట్టుకుని స్టేషన్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు ప్రతిఘటించడంతో చేసేదిలేక సీఐ బెదిరింపులకు దిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ● నాగమోహన్కృష్ణ మాట్లాడుతూ రేపల్లె నియోజకవర్గంలో అధికారులు అధికార ప్రతినిధులకు తొత్తులుగా పనిచేయటం సిగ్గుచేటన్నారు. రేపల్లె పట్టణంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నా మున్సిపల్ కమిషనర్ కంటికి కనిపించకపోవటం బాధాకరమన్నారు. మంత్రి మెప్పుపొందేందుకు వైఎస్సార్ సీపీ ప్లెక్సీలను మాత్రమే తొలగించటం హేయమైన చర్యన్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే అన్ని ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శాంతియుత ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చిత్రాల ఓబేదు, చిమటా బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సముద్రాల ప్రభుకిరణ్, మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, మహిళా విభాగం కన్వీనర్ వీసం నాగలక్ష్మి, నాయకులు ఉమారాణి, చందోలు నాగలక్ష్మికుమారి, సజ్జా పద్మావతి, ఆలా రాజ్పాల్, నిజాంపట్నం కోటేశ్వరరావు, కొలుసు బాలకృష్ణ, నాగిశెట్టి పవన్, వుయ్యూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పరమపద నాథ అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం భక్తులకు పరమపద నాథ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వహణాధికారి కె. సునీల్కుమార్ తెలియజేశారు. ఉత్సవ కై ంకర్యపరులుగా ఆత్మకూరు గ్రామానికి చెందిన మురికిపూడి మాధవరావు కుమారులు వ్యవహరించగా ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా కృష్ణమూర్తి వ్యవహరించారు. -
పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం
ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: పొట్టి శ్రీరాములు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతిని సోమవారం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా కొనియాడారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని, పలుమార్లు జైలుకు వెళ్లిన గాంధేయవాది అన్నారు. ఆంధ్రుల కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఖ్యాతిని ప్రతి తెలుగు వారు గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ భుజంగరావు, ఎస్బీ–2 సీఐ రాంబాబు, వెల్ఫేర్ ఆర్ఐ మౌలుద్దీన్ పాల్గొన్నారు. -
గోల్షాట్ బాల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం విజయవంతం
కొల్లూరు, (వేమూరు) : గోల్ షాట్ బాల్ దేశవ్యాప్త ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు మండలంలోని చిలుమూరు శ్రీరామ సైనిక్ స్కూల్లో విజయవంతంగా జరిగాయి. ఈనెల 14, 15 తేదీల్లో రెండు రోజులు పాటు నిర్వహించిన సమావేశాల్లో దేశంలోని 13 రాష్ట్రాల నుంచి వచ్చిన కార్యదర్శులు పాల్గొన్నారు. గోల్డ్ షాప్ బాల్ క్రీడాభివృద్ధికి, భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యాచరణ, క్రీడ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కోచ్లు, పీఈటీలు, పీడీలకు గోల్ షాట్ బాల్ ఆటపై అవగాహన సదస్సు, ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొన్న వ్యాయామ ఉపాధ్యాయులకు పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారికి రాష్ట్ర స్థాయి రిఫరీలుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ గేమ్ ఫౌండర్, ప్రధాన కార్యదర్శి నోట్ల రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. శ్రీ రామా సైనిక్ స్కూల్ అధ్యక్షులు కె.తులసి విష్ణు ప్రసాద్, గోల్డ్ షాట్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు బిహార్ రాష్ట్రానికి చెందిన రామ్ పరమేష్ కుమార్ (అసోసియేషన్ ట్రెజరర్), తమిళనాడుకు చెందిన ఆర్. కరుణాకర్ (సౌత్ ఇండియా ఇన్చార్జ్), మహారాష్ట్రకు చెందిన యోగేష్ పటేల్ (వెస్ట్ ఇన్చార్జ్), ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ (ఈస్ట్ ఇంచార్జ్), ఢిల్లీకి చెందిన నితిన్ షైన్ (నార్త్ ఇన్చార్జ్), వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి దేవి ప్రియ ప్రారంభించిన కార్యక్రమంలో ఆర్గనైజర్ సెక్రటరీ వణుకూరి గోపికృష్ణ, వర్కింగ్ సెక్రటరీ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు -
పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దుచేయాలి
తెనాలి: కేంద్ర పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం–2025ను తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తెనాలి హెడ్ పోస్టాఫీసులో జరిగిన తెనాలి డివిజన్ పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్ల వార్షిక సమావేశానికి డివిజనల్ అధ్యక్షులు ఐ.కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఎన్.నాగేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, కేంద్రప్రభుత్వ పెన్షనర్లు అందరినీ 8వ వేతన సంఘ పరిధిలోకి తీసుకోవాలని, 8వ వేతన సంఘాన్ని 2026 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు అనుకూలంగా సీఏటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను వెంటనే అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక డివిజనల్ కార్యదర్శి ఎల్.ప్రసాదరావు, కోశాధికారి పి.జోనేష్, రషీద్ సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలిండియా జాయింట్ జనరల్ సెక్రటరీ ఎం.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 8వ కేంద్ర వేతన సంఘ టర్మ్ ఆఫ్ రిఫరెన్స్, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి కోరిన ప్రశ్నావళి గురించి వివరించారు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు రాజేంద్రప్రసాద్ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త పోరాటాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. నరసరావుపేట పెన్షనర్ల డివిజనల్ కార్యదర్శి ఎన్జీ ఘోష్, పెన్షనర్ల రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.తిరుమలరావు, బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల నాయకులు శివ మాట్లాడారు. తదుపరి 70–90 ఏళ్లు నిండిన సంఘ సభ్యులను గౌరవంగా సత్కరించారు. -
అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 59 మంది బాధితులు హాజరై వారి సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. బాధితుల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్న ఎస్పీ సమస్యలను సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఎస్.ఐ లక్ష్మీరాజ్యం, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.చినగంజాం: మహిళపై అనుమానంతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన సోమవారం మండలంలోని మోటుపల్లి శివారు ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్సై శీలం రమేష్ వివరాల మేరకు.. ఒక మహిళతో మోటుపల్లి గ్రామానికి చెందిన పొగడదండ శ్రీనివాసరావు అనే వ్యక్తి గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవల కాలంలో సదరు మహిళ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో సోమవారం ఉదయం మోటుపల్లి గ్రామ శివారు ప్రాంతంలో కత్తితో ఆమైపె దాడి చేసి హత్యాప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి గాయాలపాలైన ఆమెను 108 వాహనంలో చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు చినగంజాం ఎస్సై తెలిపారు. వేటపాలెం: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని వేగంగా దూసుకెళ్తున్న బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన దేశాయిపేట పంచాయతీలోని మార్కెట్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. చీరాలకు చెందిన బి.వెంకటరమణ(60) దేశాయిపేట మార్కెట్ వద్ద చీరాల–వేటపాలెం ప్రధాన రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో చీరాల వైపు బైక్పై వెళ్తున్న యువకుడు ఢీకొట్టడంతో వెంకటరమణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న యువకుడికి సైతం తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ఉద్యోగోన్నతులకు సంబంధించి అర్హులైన స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ కేడర్ల వారీగా తాత్కాలిక సీనియార్టీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. తాత్కాలిక, జనరల్ సీనియారిటీ జాబితాను సంబంధిత ఉపాధ్యాయుల అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారీగా డీఈవో.జీఎన్టీ.బ్లాగ్స్పాట్.కామ్లో ఉంచినట్లు తెలిపారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సంబంధిత అధికారి ద్వారా తగిన ధ్రువపత్రాలతో ఈనెల 22లోపు సాయంత్రం 3.00 గంటల నుంచి 7 గంటల వరకు అన్ని పనిదినాల్లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వినతుల స్వీకరణ కమిటీకి సమర్పించాలని సూచించారు. నిర్దిష్ట గడువు అనంతరం అందిన వినతులు స్వీకరించబడవని పేర్కొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో 2025 డిసెంబర్లో జరిగిన బీటెక్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఫస్ట్ సెమిస్టర్కు 925 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 795 మంది ఉత్తీర్ణులయ్యారు. అభ్యర్థులు రీవాల్యుయేషన్కు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవడానికి, రీవాల్యుయేషన్ దరఖాస్తులను 26వ తేదీలోగా పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2190 చెల్లించాలని ఆలపాటి తెలిపారు. -
కాపురానికి తీసుకెళ్లాలంటూ న్యాయ పోరాటం
తాడేపల్లిరూరల్: అగ్ని సాక్షిగా తాళి కట్టి భార్యను చేసుకున్న భర్త తనను వదిలివేయడంతో, తనకు న్యాయం చేయాలంటూ ఆమె బంధువులతో కలసి భర్త ఇంటి ముందు సోమవారం నిరసనకు దిగిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్ మండలం కుంచనపల్లి గ్రామంలోని ఎస్వీ అపార్ట్మెంట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు... కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన చైతన్యకు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన యర్రంనేని విజయ్తో 2017లో పెద్దల సమక్షంలో వివాహమైంది. 2019లో వీరికి కుమారుడు జన్మించాడు. తనకి ఇష్టం లేని పెళ్లి చేశారంటూ విజయ్ భార్యను వదిలివేశాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. ఆ తర్వాత భర్త, అత్తమామలు బాబును చూసేందుకు వచ్చారు. భార్యను కాపురానికి తీసుకు వెళ్లలేదు. తనను కాపురానికి తీసుకువెళ్లమని ఎన్నిసార్లు వేడుకున్నా అత్తమామలు, భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా పామర్రు, తాడేపల్లి పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయినా న్యాయం జరగలేదు. దీంతో 2020లో కోర్టును ఆశ్రయించింది. కాపురానికి తీసుకువెళ్లాలని కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ భర్త నుంచి ఎటువంటి స్పందన లేదు. తమకు సంబంధం లేదంటూ అత్తమామలు కూడా చేతులెత్తేశారు. భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తెలిసిన బంధువుల ద్వారా ఆరా తీస్తే ఆయన హైదరాబాదులో వేరే యువతితో సహజీవనం చేస్తున్నాడని, ఫారిన్ వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడని తెలుసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం కుంచనపల్లిలోని అపార్ట్మెంట్ వద్ద కుటుంబ సభ్యులతో కలసి ఆందోళనకు దిగింది. బాధితురాలు చైతన్య తండ్రి చౌదరి మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలని నిరసన చేపట్టినట్లు తెలిపారు. భర్త ఇంటి ముందు భార్య నిరసన -
చరిత్రలో చిరస్థాయిగా అమరజీవి త్యాగం
బాపట్ల: భాషా ప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మతోపాటు జిల్లా అధికారులు, ఆర్య వైశ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు. వీరు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ అమరజీవి త్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, నేటి యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.గ్లోరియా, బీసీ సంక్షేమ శాఖ డీడీ శివ నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అబ్బులు, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, ఆర్య వైశ్య సంఘాల నాయకులు, జిల్లా కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో జరిగిన పొట్టి శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వీక్షించారు. విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలి బాపట్ల: విద్యా వ్యవస్థలో ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో మెలగాలని, అప్పుడే అభివృద్ధి మొదలవుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. విద్యారంగం, గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు, ఎండీఓలతో వీక్షణ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో నూరు శాతం విద్యార్థుల హాజరు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హాజరు శాతం తక్కువగా ఉండడంపై సంబంధిత ఎంఈఓలను ఆయన నిలదీశారు. చిన్నగంజాం మండలంలో గడిచిన మూడు నెలలుగా పని తీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. సచివాలయాల పరిధిలో చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. 4,600 కుటుంబాల సర్వే నేటికీ పెండింగ్లో ఉండడంపై అధికారులను నిలదీశారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది హాజరు నూరు శాతం ఉండాలన్నారు. కర్లపాలెం మండలంలో సిబ్బంది హాజరు తక్కువగా ఉండడం ఏమిటని ప్రశ్నించారు. ఏపీ సేవ నగదు తక్షణమే ప్రభుత్వ ఖజానాకు చేర్చాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈ ఓ. శ్రీనివాస్ సింగ్, సచివాలయాల ఇన్చార్జి విజయలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ పి.యశ్వంత్, ఎండీఓలు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్ నివాళులువడదెబ్బ నివారణకు ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. వడదెబ్బ నివారణ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం చేపట్టారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత దృష్టిలో ఉంచుకొని ప్రజలకు అవగాహన కల్పించేందుకు వడదెబ్బ తగలకుండా చేయవలసిన పనులు చేయకూడని పనులు (డూస్ అండ్ డోంట్స్) పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ, నోడల్ అధికారి డాక్టర్ లలిత రాజేశ్వరి, డాక్టర్ వి.లోకేష్, డాక్టర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలి
జాయింట్ కలెక్టర్ భావన వశిష్టబాపట్ల: ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. తన పరిధిలో ఉన్న వాటికి అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. కొన్ని పరిశీలనకు, మరికొన్నింటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ‘రైతన్న మీకోసం‘ కార్యక్రమాలను జిల్లాలో జయప్రదంగా నిర్వహించాలని తెలిపారు. ప్రారంభ సూచికగా వ్యవసాయ శాఖ రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను జేసీ విడుదల చేశారు. ఆరు రోజులపాటు గ్రామాలలో నిర్వహించే ఈ కార్యక్రమాలు రైతన్నలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు, పెట్టుబడులు–పరిశ్రమలు, సంక్షేమ నుంచి సంపాద సృష్టించే దిశగా రైతులు అడుగులు వేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామ సచివాలయాల స్థాయిలో ఎనిమిది మందితో బృందాలను నియమించాలన్నారు. ప్రతిరోజు ప్రతి బృందం 30 గృహాలను లక్ష్యంగా నిర్దేశించుకుని సందర్శించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. రైతు సేవా కేంద్రాల స్థాయిలో ఈ కార్యక్రమాలు విరివిగా చేపట్టాలన్నారు. ప్రతిరోజూ జిల్లా రెవెన్యూ అధికారి జిల్లా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం జాతీయ పశు వ్యాధి నియంత్రణ టీకాలు ఏప్రిల్ 29వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్గౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు తదితరులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు
మంతెనవారిపాలెం(కర్లపాలెం): శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలు దోహదపడతాయని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ చెప్పారు. పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెంలో గ్రామస్తులు రూ.2.50 లక్షలతో గ్రామంలో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను సోమవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజుతో కలసి ప్రారంభించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి, స్వాతంత్య్ర సమరయోధులు వెంకటరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ● జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామస్తులంతా కలసి తమ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం అభినందనీయమన్నారు. ప్రస్తుత సమాజం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందన్నారు. గ్రామస్తులందరూ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామస్తులంతా ఐక్యంగా పనిచేయటం అభినందనీయమన్నారు.సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటపతిరాజు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్ఐ శివకుమార్ ఉన్నారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ -
పర్యాటకం.. పితలాటకం
ఆదాయం ఘనం.. వసతులు నామమాత్రంచీరాల అర్బన్: మండల పరిధిలోని వాడరేవు పంచాయతీకి ఆదాయం ఘనంగానే వస్తున్నా సౌకర్యాలు నామమాత్రంగా ఉన్నాయి. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాడరేవు పంచాయతీ కీర్తివారిపాలెం వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. తీరానికి వచ్చే పర్యాటకుల వాహనాల (కారు, ఇతర పెద్ద వాహనాలు) నుంచి రుసుం వసూలు చేసే విధంగా ఆ చెక్పోస్ట్ నెలకొల్పారు. నిర్వహణ బాధ్యతను పంచాయతీ సిబ్బందికి అప్పగించారు. వచ్చిన ఆదాయంతో గ్రామంలోను, తీరంలోను మెరుగైన వసతులు కల్పించాలనేది లక్ష్యం. అయితే నిర్వహణ తీరుపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చెక్పోస్ట్ వద్ద వాహనాల నుంచి రుసుం వసూలు చేసే బాధ్యతలను వేలం ద్వారా ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. ఏడాది కాలానికి కాంట్రాక్టర్ రూ.7 లక్షలు చెల్లించాలని నిబంధన విధించారు. స్నానానికీ ఇబ్బందే.. ప్రస్తుతం ఉన్న స్నానపు గదులు సరిపోవడం లేదని పలు సందర్భాల్లో పర్యాటకులు చెబుతున్నా కనీస స్పందన కరువైంది. సముద్ర స్నానం అనంతరం మంచినీటితో స్నానం చేసేందుకు ఏర్పాట్లు చేయడంలో ఇక్కడి యంత్రాంగం విఫలమైంది. సాధారణంగా వాడరేవు తీరానికి శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆయా రోజుల్లో పర్యాటకులు స్నానమాచరించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు వైపులా రుసుం వసూలు వాడరేవు–పిడుగురాళ్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక ఆ మార్గం నుంచి, ఇటు కీర్తివారిపాలెం(పాత రోడ్డు) నుంచి పర్యాటకులు తీరానికి వస్తున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల రోడ్డు నుంచి వాడరేవు పంచాయతీ పరిధిలో ఉన్న తారురోడ్డు వరకు ఏ వాహనం వచ్చినా రుసుం వసూలు చేస్తున్నారు. ఈ మేరకు పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. సముద్రంలో స్నానాలకు వెళ్లే వారిని హెచ్చరించేందుకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అలానే గజ ఈతగాళ్లు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ఎన్నికలు నిర్వహించనందున పంచాయతీకి ఆర్థిక సంఘం నిధులు రాలేదు. కాంట్రాక్టర్ తొలివిడతగా రూ.4.5 లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తం చెల్లించాల్సి ఉంది. జీతభత్యాలు, పారిశుధ్యానికే అంతంత మాత్రంగా నిధులు ఉన్నాయి. వాటర్ ట్యాంకుల్లో తాగునీరు రాని మాట వాస్తవమే. అదనంగా పనులు చేసేందుకు నిధుల కొరత ఉంది. మా వంతు బాధ్యతగా ఉన్నంతలో సౌకర్యాలు కల్పిస్తున్నాం. – రమేష్, పంచాయతీ సెక్రటరీ, వాడరేవు -
వస్తువుల కొనుగోలులో మోసపోరాదు
బాపట్ల: ప్రజలు ఏ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో మోసానికి గురికాకుండా అవగాహన పొందాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నాణ్యత ప్రమాణాలతో రూపొందించిన తూనికలు, కొలతలు యంత్రాల ప్రదర్శించారు. వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ రూపొందించిన గోడపత్రాలను జేసీ విడుదల చేశారు. ఆహార పదార్థాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా, పౌర సరఫరాల కార్పొరేషన్ జీఎం శ్రీలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రణీత్, తూనికలు కొలతలశాఖ సహాయ కమిషనర్ లిల్లీ, డీటీఓ పరందామరెడ్డి, వాణిజ్య శాఖ అధికారి గౌరీ, డీసీఐసీడీ ఇమ్మానియేలు పాల్గొన్నారు. జేసీ భావన వశిష్ట -
నాణ్యత ప్రమాణాలతో శనగల కొనుగోలు
పర్చూరు(చినగంజాం): నాణ్యత ప్రమాణాల ఆధారంగా రైతుల వద్ద నుంచి శనగల కొనుగోలు చేస్తామని జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్సీసీఎఫ్) అధికారులు మనోజ్, భానుచందర్లు సూచించారు. మండలంలోని నూతలపాడు గ్రామంలోని శనగల కొనుగోలు కేంద్రాన్ని వారు సోమవారం సందర్శించారు. శనగల కొనుగోలు తీరును పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దళారుల జోక్యం లేకుండా నేరుగా రైతుల వద్ద నుంచి నాణ్యతను ప్రమాణంగా తీసుకొని శనగ కొనుగోలు చేస్తారన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ విన్నకోట సతీష్, రైతులు పాల్గొన్నారు. -
సోదర భావంతో కలిసికట్టుగా ఉండాలి
బాపట్ల: అందరూ సోదర భావంతో కలిసికట్టుగా ఉండి శాంతి భద్రతలను స్థాపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక షాదీఖానాలో ఇఫ్తార్ విందు జరిగింది. ముస్లిం మత పెద్ద ఖలీల్ లాఖాన్, జిల్లా కలెక్టర్ ఖురాన్ గ్రంథాన్ని బహుమతిగా అందజేశారు. ముందుగా అందరూ కలిసి నమాజ్ చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన కలెక్టర్ వినోద్ కుమార్ ముస్లింలకు స్వయంగా తన చేతులతో వడ్డించారు. అనంతరం వారితో కలిసి విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ ప్రజలందరూ బాగుండాలని దైవాన్ని కోరుకోవడం అభినందనీయమని కలెక్టర్ చెప్పారు. యుద్ధం నేపథ్యంలో మక్కా పుణ్య క్షేత్రానికి వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేరొన్నారు. బాపట్ల జిల్లాలో ఎవరైనా మక్కాకు వెళ్లేవారు ఉంటే వారికి ఎలాంటి సమస్యలు రాకుండా వారి ప్రయాణ సౌకర్యాలకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ పి.గ్లోరియా, ఇంటర్మీడియెట్ బోర్డ్ జిల్లా అధికారి జుబేర్, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, కరీముల్లా సాహెబ్ పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు సీజ్
రాజధాని ప్రాంతం నుంచి చేబ్రోలుకు తరలిస్తున్న అధికార పార్టీ నేతలు చేబ్రోలు: నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి రాజధాని ప్రాంతం నుంచి అధికార పార్టీకి చెందిన నాయకులు మట్టిని పెద్ద పెద్ద లారీలలో తీసుకువచ్చి చేబ్రోలు ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాజధాని ప్రాంతం నీరుకొండ నుంచి ఐదు టర్బో లారీలలో మట్టి తీసుకువచ్చి స్థానిక జీబీసీ రహదారి పక్కన ఖాళీ ప్రదేశంలో మెరక చేస్తుండటంతో కొంతమంది పోలీసులకు, రెవెన్యూ, అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం తెల్లవారుజామున మట్టిలోడ్తో వచ్చిన లారీలను స్థానిక ఎస్ఐ పి.వీరనారాయణ ఆధ్వర్యంలో సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మొత్తం ఐదు లారీలకు చెందిన డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదకాకాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నాయకులు గత కొద్ది రోజులుగా చేబ్రోలు పరిసర గ్రామాల్లో మట్టిని పెద్ద పెద్ద లారీల్లో ఇక్కడకు తరలించి బ్రోకర్ల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టుబడ్డ లారీలు అధికార పార్టీకి చెందిన వారివి కావటంతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. -
భక్తిశ్రద్ధలతో సత్తెమ్మతల్లి 16 రోజుల పండుగ
అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో స్వయంభు సత్తెమ్మతల్లి దేవాలయంలో సత్తెమ్మతల్లి, సత్యదేవుళ్ల కళ్యాణ 16 రోజుల పండుగ మహోత్సవాలు సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పొంగళ్లు పొంగించి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మహోత్సవ నిర్వహకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా అమ్మవారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించి 16వ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అందులో భాగంగానే ఈనెల 1వ తేదీన అమ్మవారికి కళ్యాణం నిర్వహించామని, తిరిగి 16 రోజుల పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు శ్రీనివాసరావు, సత్యవతి దంపతులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అచ్చంపేట: ఉగాది పండుగను పురస్కరించుకుని స్థానిక గ్రామదేవతగా వెలుగొందుతున్న అచ్చమ్మ పేరంటాళమ్మ తల్లి మహోత్సవాలు మంగళ ,బుధ, గురు వారాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ కన్వీనర్ సూరే వెంకట సుబ్బారావు సోమవారం తెలిపారు. ప్రతి ఏటా ఉగాదికి ముందు నుంచి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. తొలిరోజు తోరణపాకు అలంకరణ, విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, మండపారాధనలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మూడు రోజుల పాటు ప్రాతఃకాల పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. చివరిరోజు అమ్మవారికి కుంకుమ పూజలు, అర్చనలు, లలితాసహస్రనామ పారాయణం, పంచాంగ శ్రవణం, మహో నైవేద్యం, వేపపూత ప్రసాద పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గుంటూరురూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదీన గుంటూరు నగర పర్యటన ప్రతిపాదనలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్జిందాల్లు అందుకు అవసరమైన ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్రోడ్ శ్రీ కన్వెన్షన్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్స్టాండ్ వరకు పర్యటించే అవకాశాలు ఉన్నందున వాటి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఆర్ఎం సామ్రాజ్యం, ట్రాఫిక్ డీఎస్పీ బి.శ్రీనివాస్, ఈస్ట్ డీఎస్పీ అజీజ్, పాత గుంటూరు సీఐ వెంకటరావు, లాలాపేట సీఐ శివరామకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరావు, డీటీసీ సీతారామిరెడ్డి, ఈస్ట్ తహసీల్దార్ సుభాని, ఇతర శాఖల అధికారులు పలువురు పాల్గొన్నారు. -
వర్సిటీ పురుషుల ఖోఖో విజేత కృష్ణవేణి
నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల ఖోఖో టోర్నమెంట్లో కృష్ణవేణి కళాశాల జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో విజేతగా నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన టోర్నమెంట్లో తమ కళాశాల జట్టు ప్రథమ స్థానం సాధించటంతోపాటు జట్టులోని పి.గోపినాథ్, బి.దిలీప్, ఎన్.అనిల్, పి.వెంకట్రావు, ఎం.యూష్లు వర్సిటీ జట్టుకు ఎంపికయ్యారని వివరించారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగనున్న సౌత్జోన్ ఖోఖో పోటీల్లో ఏఎన్యూ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జట్టు విజయానికి కృషి చేసిన వ్యాయామ అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య, ప్రిన్సిపల్ నాతాని, వ్యాయామ అధ్యాపకుడు ఈదర ఆదిబాబు, అధ్యాపకులు ఎం.తిరుపతిరావు, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. గుంటూరు నగర అధ్యక్షునిగా వెలుగూరి కృష్ణమూర్తి, కార్యదర్శిగా కోట శివకృష్ణ, కోశాధికారిగా కొలిపాకుల లక్ష్మీకాంత్ ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా చిట్టెపు శ్రీధర్రెడ్డి నియమితులయ్యారు. నూతన కార్యవర్గం సభ్యుల చేత జిల్లా అధ్యక్షులు చక్కా సత్యనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు. సభలో నూతన అధ్యక్షులు కృష్ణ్ణమూర్తి మాట్లాడుతూ నూతన సభ్యుల సంక్షేమానికి అసోసియేషన్ కృషి చేస్తుందని చెప్పారు. కార్యదర్శి శివకృష్ణ్ణ మాట్లాడుతూ వ్యాపార ధోరణే కాకుండా సమాజం పట్ల తమ వంతు బాధ్యతగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. మాస్టర్ ప్రింటర్స్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శి నేతగాని ఫిలిప్స్ తన సందేశాన్ని అందించారు. కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు తోట శ్రీనివాస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. గుంటూరు ఎడ్యుకేషన్: శ్రీనివాసరావుతోటలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యంలో ఆదివారం బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్పై వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐఆర్సీ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్కు సంబంధించిన ముఖ్యాంశాలు, తాజా నియమాలు, మార్గదర్శకాలు, ఆడిట్లో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలపై అవగాహన కల్పించారు. అనంతరం బ్రాంచ్ చైర్మన్ రుద్రవరపు భరద్వాజ్ బ్యాంకు శాఖల ఆడిట్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు బ్యాంక్ బ్రాంచ్ ఆడిట్ దోహదం చేస్తుందన్నారు. వర్క్షాప్లో ఐసీఏఐ గుంటూరుశాఖ వైస్ చైర్మన్ వనిమిరెడ్డి వెంకట నరేష్, కార్యదర్శి కన్నెగంటి మృత్యుంజయరావు, కోశాధికారి నాగబీరు రాజశేఖర్, సి కా సా చైర్మన్ షేక్ బాజీ, కమిటీ సభ్యులు దేసు సంపత్ , చింతా రఘు నందన్, సీఏలు పాల్గొన్నారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని ప్రముఖ సినీనటుడు డాక్టర్ గద్దె రాజేంద్రప్రసాద్ ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందించి సత్కరించారు. -
జోన్ –3 ఎన్నికలు ఏకగ్రీవం
ఒంగోలు వన్టౌన్: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ శాఖ టెక్నికల్ అధికారుల సంఘం (జోన్ –3) ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఒంగోలు అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్ ప్రకటించారు. నామినేషన్ల ప్రక్రియ అనంతరం ఒక్కొక్క పోస్టుకు ఒక్కో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు వెల్లడించారు. ఒంగోలులోని రవాణా శాఖ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో మొత్తం 9 మంది ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలలో జోన్ 3 పరిధిలో నూతన కార్యవర్గ సభ్యులు, అధ్యక్షునిగా వి.బాలకృష్ణ, (మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, మంగళగిరి), గుంటూరు జిల్లా, ప్రధాన కార్యదర్శిగా కె.జయప్రకాశ్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ఒంగోలు), ట్రెజరర్గా కె.కరుణాకరన్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, కావలి, నెల్లూరు జిల్లా) ఎన్నికై నట్లు వెల్లడించారు. జిల్లా రిప్రజెంటేటివ్ పోస్టులు మొత్తం ఆరు ఏకగ్రీవం కాగా, వారిలో గుంటూరు జిల్లాకు చెందిన జి.అమృతరాణి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, తెనాలి), పల్నాడు జిల్లాకు చెందిన సీహెచ్ మనీషా (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, నరసరావుపేట), బాపట్ల జిల్లాకు చెందిన కె.రవినాయక్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, చీరాల) ప్రకాశం జిల్లాకు చెందిన బి.భాను ప్రకాష్ (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, ప్రకాశం) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఏ మల్లికార్జున్రెడ్డి (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), మార్కాపురం జిల్లాకు చెందిన కె.ఎల్.రావు (అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, డీటీసీ కార్యాలయం, మార్కాపురం) ఉన్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ ఎన్నికలకు సహాయ ఎన్నికల అధికారిగా ఒంగోలు తాలూకా కార్యదర్శి మక్దూం షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమంలో జోన్ 3 పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు పాల్గొని నూతనంగా ఎన్నికై న జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులను అభినందించారు. -
కూటమి ప్రభుత్వంలో డ్రగ్గిస్టులు
పట్నంబజారు: కూటమి ప్రభుత్వంలో కామాంధులు, డ్రగ్గిస్టులకు కేరాఫ్కు మారిందని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. నగరంలోని ఆయన కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెలంగాణలోని ఒక ఫామ్ హౌస్లో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని దొరకటం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహేష్ ఈ విధంగా వ్యవహరిస్తే, రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులను నేరుగా మత్తు పదార్థాలకు అలవాటు అవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం డబ్బులు కోసం గంజాయి, డ్రగ్స్ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. రౌడీలను, డ్రగ్గిస్టులను, మహిళలను వేధించే వారిని పార్లమెంటుకు, అసెంబ్లీకి పంపుతున్నారని ఆరోపించారు. కచ్చితంగా ఎంపీ మహేష్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. -
డాక్టర్ రమణ యశస్వికి ఎన్టీఆర్ ట్రస్ట్ అవార్డు
గుంటూరు మెడికల్ : కవి, సేవా తత్పరుడు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకుగాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.ఽ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో డాక్టర్ యశస్వి రమణ అవార్డు తీసుకున్నారు. థలసీమియా రోగులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసినందుకు, వాక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 ఏళ్లకు పైగా వికలాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు ఉచితంగా అందజేసి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు, పేదలకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నందుకు డాక్టర్ యశస్వి రమణకు ఎన్టీఆర్ ట్రస్టు అవార్డు, ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజర్ శ్రీకాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా నుండి డాక్టర్ యశస్వి రమణను మాత్రమే ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అవార్డు అందుకున్న డాక్టర్ రమణ యశస్వికి గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులు, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, ఐఎంఏ నేతలు, రోటరీ క్లబ్ నేతలు, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో జాలాది వాసి మృతి
చిలకలూరిపేటటౌన్: బైక్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన పిల్లి దొరకరాజు (38) ఆదివారం తెల్లవారుజామున వ్యక్తిగత పనులపై చిలకలూరిపేట వెళ్లి తిరిగి బైక్పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేలూరు గ్రామం దాటిన తర్వాత, బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న ఎండిపోయిన పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాజు తలకు బలమైన రక్త గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అమరావతి: విజయవాడ నుంచి అమరావతికి వస్తున్న ఆర్టీసీ బస్సు అమరావతి గ్రామ సమీపంలో ఒక్కసారిగా ముందు టైరు పేలి రోడ్డు పక్కన కందకంలో దిగబడటంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి అమరావతికి వస్తున్న ఆర్టీసీ బస్సు మండల పరిధిలోని పెదమద్దూరు దాటి అమరావతి సమీపానికి రాగానే ఒక్కసారిగా ముందుటైరు పేలింది. ఈక్రమంలో బస్సు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న కందకంలోకి దూసుకు వెళ్లి దిగబడి పూర్తిగా ఒకపక్కకి ఒరిగి పోయింది. ఈసమయంలో బస్సులో ఉన్న ఇరవై మంది ప్రయాణీకులు, డ్రైవర్, కండక్టర్లు ఎలాగోలా బస్సునుంచి దిగిపోయారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు నాగవర్ధిని, శివపార్వతి, రమాదేవిలకు స్వల్ప గాయాలయ్యాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని అందరు ఊపిరిపీల్చుకున్నారు. అమరావతి: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మై భారత్ కేంద్రం గుంటూరు ఆధ్వర్యంలో అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం ఆదివారం అమరావతిలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో త్రిపుర రాష్ట్రం నుంచి యువతీయువకులు క్షేత్ర దర్శనంలో భాగంగా అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయాన్ని, ధ్యాన బుద్ధ విగ్రహాన్ని, పురావస్తు మ్యూజియాన్ని దర్శించారు. త్రిపుర రాష్టానికి చెందిన 37 మంది యువతీయువకులు పాల్గొన్నారు. మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సంస్కృతి, సంప్రదాయాలు, విలువల పరస్పర మార్పిడిని ప్రోత్సహించేందుకు అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో తుళ్ళూరి సాంబశివరావు బెజ్జం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా బదరీ కేదారేశ్వర శాంతి కల్యాణం
కర్లపాలెం: అగ్రహారం గ్రామంలో ఉన్న గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి శివపార్వతుల శాంతి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా శివాలయంలో ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి పలు రకాల పూలమాలలతో అలంకరించారు. లోక కల్యాణం కోసం శాస్త్రోక్తంగా శివపార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. -
మహిళలు అక్షరాస్యులు కావాలి
● డీఆర్డీఏ పీడీ పి. ఝాన్సీరాణి ● వయోజనుల అక్షరాస్యత వార్షిక పరీక్ష కేంద్రాల తనిఖీ యడ్లపాడు: మండలంలోని 22 గ్రామాల్లో ఆదివారం అక్షర ఆంధ్ర–అక్షర పల్నాడు కార్యక్రమంలో భాగంగా అధికారులు వయోజనులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలనకు జిల్లా డీఆర్డీఏ పీడీ పి ఝాన్సీరాణి ఆకస్మికంగా మండలాన్ని సందర్శించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రలో జరిగే పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో 2200 మంది వయోజనులు అక్షరాభ్యాసం చేస్తున్నారని వీరిలో 1670 మంది డ్వాక్రా సభ్యులు కాగా, 530 మంది ఉపాధి కూలీలు ఉన్నట్లు తెలిపారు. చదువుపై వయోజనులు చూపుతున్న ఆసక్తిని ఆమె అభినందించారు. చదువు లేని డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు తమ రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. పొదుపు సంఘాల్లో డబ్బుల లెక్కలు తెలుసుకోవడం, ఉపాధి హామీ కూలీ డబ్బుల లెక్కలు చూసుకోవడం ,బ్యాంకు చెక్కులపై సొంతంగా సంతకాలు చేయడం వంటి అంశాల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశమని ఆమె పేర్కొన్నారు. మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు వందశాతం హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఎంపీడీవో వి హేమలత, డిప్యూటీ ఎంపీడీవో షేక్ జాకీర్హుస్సేన్, సచివాలయ మండల అధికారి నాగిరెడ్డి, ఏపీఎం కె రవీంద్రకుమార్, ఏపీఓ డి సుందరరావు, సీసీలు వై పెద్దయ్య, సీహెచ్ నాగేశ్వరరావు, జి నాగేశ్వరరావు, ఎం ద్రాక్షాయమ్మ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు. -
అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తవ్వకాలు
● పూలింగ్కి ఇచ్చిన భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ● జేబులు నింపుకొంటున్న తమ్ముళ్లు ● పట్టించుకోని మైనింగ్ ఇతర అధికారులు తాడికొండ: రాజధాని ప్రాంతంలోని అనంతవరం గ్రామంలో అధికార పార్టీ నాయకులు అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. కొండ వెనుక ఉన్న ఫూలింగ్ భూముల్లో రాత్రివేళ గ్రావెల్ తవ్వకాలు చేసి అక్రమంగా తరలించడంతో సదరు రైతు లబోదిబోమంటున్నాడు. రాజధానిలో గ్రావెల్కు తీవ్ర డిమాండ్ ఉండటంతో అధికార పార్టీకి చెందిన నాయకులు రాత్రివేళ జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలతో భారీగా మట్టి దందా కొనసాగిస్తున్నారు. ఈ గ్రావెల్ను అమరావతి మండలం వైకుంఠపురం ఇతర గ్రామాలకు తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. దీనిపై అటు మైనింగ్, రెవెన్యూ ఇటు పోలీసులు కూడా తొంగిచూసిన దాఖలాలు లేకపోవడంతో యధేచ్ఛగా ప్రభుత్వ సంపద తరలిపోతుంది. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసి నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గంజాయి కేసులో నిందితుల అరెస్ట్
పట్నంబజారు: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, పాత గుంటూరు పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో కే.వెంకట ప్రసాద్ వివరాలను వెల్లడించారు. గుంటూరు తారకరామానగర్కు చెందిన షేక్ మహబూబ్ బాషా అలియాస్ 220 బాషా గంజాయి తాగటానికి అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో లంబసింగ్ వాటర్ ఫాల్స్ దాటిన తరువాత అన్నారం అనే గ్రామం వద్ద తాబేలీ ఛత్రపతి, తామిలి కొండలరావు వద్ద లిక్విడ్ గంజాయి కొనుగోలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఛత్రపతి, కొండలరావుకు గంజాయి కావాలని ఫోన్ చేయగా, లిక్విడ్ గంజాయి తీసుకుని వారు ఈనెల 15వ తేదీన వస్త్ర నగర్ వద్దకు వచ్చారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి కిలో లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు వారినీ అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
అండర్–17, 19 బాక్సింగ్ జట్లు ఎంపిక
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్–17, 19 బాలుర బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. పోటీల పర్యవేక్షణను అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.చిరంజీవి, బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాఽథ్లు పర్యవేక్షించారు. చిరంజీవి మాట్లాడుతూ ఎంపికై న జట్లు 21 నుంచి 23 వరకు విశాఖలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు.. అండర్–19 : సీహెచ్ అభిషిత్ పాల్, రామేశ్వర్, ఎన్.లోకేష్ చౌదరి, అండర్–17లో జి.సాయిహర్ష, బి.దేవ సుధాకర్, ఎస్.కుశ్వంత్ రాజ్ కుమార్, ఎస్.చరణ్ దీప్, బి.వెంకట మనోహర్, ఎస్.సత్యకుమార్, పి.కార్తీక్, ఎస్.రోహిత్ కుమార్, ఎస్.విజయ్ కుమార్, జి.కనిష్క్, జి.సాయిరామ్ చరణ్ ఉన్నారు. -
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి
తాడేపల్లి రూరల్: దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి.. వారి సమగ్ర అభివృద్ధికి పాలకుల ప్రణాళికలు చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. బీసీ రమణ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేక 80 శాతం బీసీ కులాలు చట్టసభల్లో అడుగుపెట్టడం లేదని అన్నారు. దీంతో ఆయా వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. బహుజన పోరాట వీరుడు కాన్షీరాం జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో బీసీ భవనాలకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. బీసీలను చైతన్యం చేయడమే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్య బీసీ నాయకులు పాల్గొన్నారు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు గతంలో పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. అర్జీదారులు సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. స్తంబోద్భవం అలంకారంలో నరసింహస్వామి మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం స్తంబోద్భవం అలంకారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. భక్తులు కనులారా దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లను ఈవో కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. ఉత్సవ కై ంకర్యపరులుగా రావూరి కృష్ణమూర్తి, సుబ్బారావులు వ్యవహరించారు. -
వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలకే నిబంధనలు
రేపల్లె: రేపల్లె పట్టణంలో అధికారుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారుతోంది. అధికారంలో ఉన్న టీడీపీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించగా, టీడీపీ ఫ్లెక్సీల జోలికి మాత్రం వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణకు స్వాగతం పలుకుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 24 గంటలు గడవక ముందే తొలగించారు. ఆందోళనలో వ్యాపారులు నూతన సంవత్సరం, సంక్రాంతి తదితర పండుగలను పురస్కరించుకుని పట్టణంలో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పలు వ్యాపార దుకాణాల ఎదుట ఈ భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. భారీ ఫ్లెక్సీల కారణంగా దుకాణాలు మూసుకుపోయి వ్యాపారాలు జరగటంలేదని వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నెలలు గడుస్తున్నా వాటిని తొలగించకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఆదివారం కేవలం వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను మాత్రం తొలగించి అత్యుత్సాహం చూపటంపై పట్టణ ప్రజలు, ప్రజాసంఘాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఓల్డ్ టౌన్ నుంచి ఇసుకపల్లి వరకు వైఎస్సార్ సీపీ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఒకే పార్టీకి చెందిన ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. అన్ని పార్టీల విషయంలో నిబంధనలు ఒకేలా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
కల్లాల్లో కండెలు ... కళ్లల్లో నీళ్లు
చీరాల అర్బన్: అన్నదాత సుఖీభవ.. అంటూ ఎన్నికల వేళ చంద్రబాబు మాటలు కోటలు దాటాయి. ఆచరణలో ఆ పథకం కింద రైతుల్లో భారీగా కోతలు పెట్టారు. లబ్ధిదారులకు అందిన సాయం అరకొరే. కౌలు రైతులకు మొండి చెయ్యి చూపారు. గిట్టుబాటు ధర అటుంచి, కనీసం పండిన పంటలకు మద్దతు ధరకు కొనుగోలు చేసేవారు లేకుండా పోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అందుకు దర్పణం పడుతోంది. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే నయమని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆకాశంలో మబ్బులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు. ప్రైవేటుగా అమ్ముకుంటే నష్టం. ఆగుదామంటే ఎప్పుడు మద్దతు ధరతో మార్కెఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరుగుతాయో తెలియడం లేదని రైతులు తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట ... నోటికి అందేనా? చేతికి వచ్చిన పంట, నోటికి అందుతుందో లేదోనని మొక్కజొన్న రైతుల ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల నుంచి వాతావరణం మారుతోంది. ఆకాశంలో అకస్మాత్తుగా మబ్బులు ఏర్పడుతున్నాయి. మరీ ఉదయం వేళ ఎప్పుడు వర్షం కురుస్తుందో అన్నట్లుగా వాతావరణం ఉంటోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పైరు కోతకు వచ్చింది. కొందరు కూలీలతో కండెలను విరిపిస్తున్నారు. మరికొందరు మిషన్లతో కోపిస్తున్నారు. దిగుబడి ఆశాజనకంగా లేదు. దీనికితోడు జల్లులు పడితే కల్లాల్లో ఉన్న మొక్కజొన్న కండెలు, గింజలను తడవకుండా కాపాడుకోవటం తలకు మించిన భారం అవుతుందని రైతులు వాపోతున్నారు. పెరిగిన పెట్టుబడులు...దిగజారిన ధరలు మొక్కజొన్న సాగుకు గతం కంటే ఈ ఏడాది పెట్టుబడులు పెరిగాయి. ఎకరాకు సుమారు రూ.50 వేలు పైగా పెట్టుబడి ఖర్చులు అవుతున్నాయి. అన్నీ సక్రమంగా ఉంటే ఎకరాకు 40 నుంచి 45 క్వింటాళ్లు దిగుబడి రావాలి. అయితే ఈ ఏడాది దిగుబడి ఎకరా 30 నుంచి 40 క్వింటాళ్ల లోపే ఉంటుందంటున్నారు. గతేడాది క్వింటా మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,300 ప్రకటించారు. ఈ క్రమంలో క్వింటాకు రూ.2500 మద్దతు ధర ప్రకటించాలి. మార్కెఫెడ్ ద్వారా యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేయించాలి. లేదంటే ప్రస్తుతం బయట మార్కెట్లో క్వింటా రూ.1700లకే అడుగుతున్నారు. ఆ ధరకు విక్రయిస్తే భారీగా అప్పులు మూట గట్టుకోవాల్సిన పరిస్థితి. రూ.2,500 లెక్కన కొనుగోలు చేస్తే మిగులు లేకపోయినా కనీసం పెట్టుబడి, చాకిరి అయినా వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు లేదు. ఇదిగో, అదిగో అంటున్నారే కానీ మాకు సాగునీరు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. సాగునీరు ఉంటే బంగారం పండిస్తాం. వర్షాధారంగా మొక్కజొన్న సాగుచేశాం. వ్యయప్రయాసలకోర్చి వర్షాభావ పరిస్థితులు నీటి తడులు ఇచ్చాం. అయినా దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. 35 నుంచి 40 క్వింటాళ్ల లోపే ఉంటుంది. ప్రైవేటు మార్కెట్లో క్వింటా రూ.1700గా చెప్తున్నారు. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాకు రూ.2,500 ఉండాలి. వెంటనే మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయించాలి. లేదంటే నష్టపోతాం. – కోరంకి వెంకటేశ్వర్లు, పాపాయిపాలెం వాతావరణం మారుతోంది. మబ్బులు పడుతున్నాయి. జల్లులు పడితే కండెలపై పట్టాలు తేవాలంటే తలకు మించిన భారం అవుతోంది. అమ్ముదామంటే ప్రైవేటు వ్యాపారులు క్వింటా రూ.1700 అంటున్నారు. జల్లులు పడి తడిస్తే ఇంకా తక్కువకు అడుగుతారు. క్వింటా రూ.2,500 లేకుంటే నష్టపోతాం. ఒకటిన్నర ఎకరంలో మొక్కజొన్న సాగుచేశా. ఇప్పటికి రూ.90వేలు పెట్టుబడి అయ్యింది. మా చాకిరి, కౌలు కాకుండా. ఈ క్రమంలో వెంటనే మద్దతు ధర క్వింటాకు రూ.2,500లుగా ప్రకటించాలి. –పులి వెంకటేశ్వర్లు, గవినివారిపాలెం -
గురువులకే పెద్ద పరీక్ష
చీరాల: విద్యాశాఖలో వింత పోకడలు రాజ్యమేలుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఉపాధ్యాయులపై అదనపు భారం పడుతోంది. పదో తరగతిలో నూతన సంస్కరణల పేరుతో పలు ప్రత్యేక కార్యక్రమాలను అడ్డగోలుగా చేపట్టడంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఇన్విజిలేషన్ డ్యూటీలు, పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను 25 శాతం మేర నియమించడం వంటి విధానాలను తెరపైకి తెచ్చారు. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామంటూ గొప్పలు చెబుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. ఆది నుంచి అదే తీరు... విద్యార్థిగా ఉన్నత స్థాయికి ఎదిగాలంటే పదో తరగతి కీలకం. అలాంటి విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం వింత నిర్ణయాలు తీసుకుంటోందని విద్యావేత్తలు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు వంద రోజుల ప్రణాళికను తీసుకువచ్చారు. డిసెంబర్ నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో పాఠశాలలకు ఇతర శాఖల అధికారులను నియమించారు. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారు, ప్రణాళిక అమలు తీరుపై వారు పర్యవేక్షణ చేశారు. విద్యాశాఖపై పరాయి పెత్తనం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. స్కూల్కు రాని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యాశాఖ అధికారులు విద్యార్థుల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి వారొచ్చేలా చర్యలు తీసుకున్నారు. మరో అడుగు ముందుకేసి పరీక్షల్లో, హాజరు శాతంలో తక్కువగా ఉన్న విద్యార్థులను గుర్తించారు. డివిజన్ వారీగా రెసిడెన్షియల్ శిక్షణ పేరుతో సీ, డీ గ్రేడ్ విద్యార్థులను ప్రత్యేకంగా హాస్టల్ తరహాలో ఉంచి శిక్షణ అందించారు. లోటుపాట్లు తెలుసుకోకుండా ఏర్పాటు చేయడం వలన క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. వెనుబడి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రత్యేకంగా చదివించడం, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వలన ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పాఠశాల నుంచి దూరంగా వేరే చోట ఉంచి చదివించడం, వేర్వేరు పాఠశాలల నుంచి వచ్చిన వారందరిని ఒక చోట ఉంచడం వలన కొత్తవారితో ఇమడలేక విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో అమలు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. విజయవాడ నుంచి విధుల కేటాయింపు దశాబ్దాలుగా పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో సీనియార్టీ ఆధారంగా విధులు కేటాయించారు. ఈ ఏడాది డీఈఓలకు సంబంధం లేకుండా విజయవాడ కమిషనరేట్ నుంచే డ్యూటీల కేటాయింపునకు శ్రీకారం చుట్టారు. లీప్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో ఉపాధ్యాయులకు డ్యూటీలు వేశారు. తమకు ఏ సెంటర్లో డ్యూటీలు ఇచ్చారు, సీఎస్గా, డీఓగా, ఏడీఓగా డ్యూటీల కేటాయింపులను యాప్లోనే చూసుకున్నారు. పలు తప్పిదాలు కనిపించడంతో ఉపాధ్యాయులు గగ్గోలు పెట్టారు. డ్యూటీలు పారదర్శకంగా కనిపించలేదని వాపోయారు. గతంలో డీఈఓ కార్యాలయం నుంచి డ్యూటీలు వేయగా అనారోగ్య సమస్యలున్న వారు మార్చుకునే వెసులుబాటు ఉండేది. కమిషనర్ ఆఫీస్ నుంచే డ్యూటీలు వేయడంతో మార్చుకునేందుకు వీలు లేకుండా పోయింది. పది కిలోమీటర్ల పరిధిలో సెంటర్లకు చీఫ్లుగా నియమించాలనే నిబంధన ఉన్నా దాదాపు 18–20 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారిని కూడా పలు సెంటర్లలో చీఫ్లుగా వేశారు. దీంతో ఉరుకులుపరుగులు పెడుతూ డ్యూటీలు చేయాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. -
మహాశక్తి దేవతగా బగళాముఖి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో కొలువై ఉన్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఆది మహాశక్తి అలంకరణలో పూజలు అందుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి విచ్చేసి ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావటంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం ఈనెల 19, 20 తేదీలలో ఘనంగా నిర్వహించనున్నట్లు దర్గా ఈఓ షేక్ ఖాజా మస్తాన్ తెలిపారు. గుంటూరు జిల్లా పెదకాకాని హజరత్ సయ్యద్ బాజీ షహీద్ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం బాజీబాబా దర్గాలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఉరుసు మహోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిర్వహణకు రాష్ట్ర వక్ఫ్బోర్డు రూ.17.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే ఉరుసు నిర్వహణకు వక్ఫ్ బోర్డు సూపరిండెంట్లు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 19వ తేదీ సాయంత్రం చాందిని అలంకరణ, రాత్రి 10 గంటలకు పెదకాకాని ముస్లింపాలెం జెండా చెట్టు నుంచి వైభవంగా ఉరుసు మహోత్సవం ప్రారంభం అవుతుందన్నారు. 20వ తేదీ దీపారాధన, గంధం పంపిణీ, ఖురాన్ పఠనం, సలామి ప్రార్థనలు జరుగుతాయన్నారు. 19వ తేదీ రాత్రి ఉరుసు మహోత్సవం సందర్భంగా భక్తులందరికీ ఉచిత అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకులతో కలసి దర్గాలో ఉరుసు మహోత్సవ వాల్పోస్టర్ ఆవిష్కరించారు. దుగ్గిరాల: దుగ్గిరాల రైలుపేటలోని పసుపు యార్డు సమీపంలోని వేంకటేశ్వర స్వామి జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని ఆదివారం కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, శాంతి హోమంతో వేడుకలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి కల్యాణం కనులారా తిలకించారు. అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేశారు. కల్యాణం ఏర్పాట్లను ఆలయ కమిటీ పర్యవేక్షించింది. -
చక్కగా రాస్తే భవిత పదిలం
బాపట్ల టౌన్:పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 364 పాఠశాలల నుంచి 15,944 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వారిలో 15,780 మంది రెగ్యులర్ విద్యార్థులు, 164 మంది సప్లమెంటరీ విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 82 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్ టిక్కెట్లను చూపి పరీక్షకు నేరుగా హాజరుకావచ్చు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖాధికారి డి. శ్రీనివాస్ అన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కేంద్రంలోకి సెల్ఫోన్లను తీసుకెళ్లరాదని తెలిపారు. పరీక్ష ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయని చెప్పారు. కనీసం పావుగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. అనివార్య కారణాలతో ఆలస్యం అయితే 9.45 గంటల వరకు విద్యార్థులను హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. 10 గంటలు దాటిన తర్వాత ఎవరినీ కేంద్రంలోకి అనుమతించబోమని తెలిపారు. ఇన్విజిలేటర్లు, విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లు, రాజకీయ నాయకుల ఫొటోలతో కూడిన ప్యాడ్లు తీసుకురాకూడదని చెప్పారు. పాఠశాల పేరుతో ఉన్న ఐడీ కార్డులు, యూనిఫామ్ను విద్యార్థులు ధరించరాదన్నారు. ఆయా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో జిరాక్స్, నెట్ సెంటర్లను తెరిచి ఉంచరాదన్నారు. 82 డిపార్ట్మెంటల్ అధికారులు, 82 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 19 మంది సీ కేటగిరి కస్టోడియన్లు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 10 మంది రూట్ ఆఫీసర్లను నియమించామన్నారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలోని 82 కేంద్రాల వద్ద ఇద్దరు చొప్పున సిబ్బంది నియమించామన్నారు. అన్ని సెంటర్లలో ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా చూసుకోవాల్సిందిగా ఎస్ఐ స్థాయి అధికారిని నియమించామన్నారు. పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంత వరకు పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల దూరంలో విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధికులు ఎవరూ ఉండరాదన్నారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమాధాన పత్రాలను తరలించే సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా మొబైల్ పెట్రోలింగ్ నిర్వహించేలా చూస్తామని తెలిపారు. సమస్య తలెత్తిన వెంటనే 112 కు డయల్ చేయాలన్నారు. మాల్ప్రాక్టీస్కు పాల్పడినా, సహకరించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. -
విజయమే లక్ష్యంగా పనిచేద్దాం
నాగమోహన కృష్ణ నేతృత్వంలో రేపల్లె: జన రంజక పాలన అందించిన జగనన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయమే శిరోధార్యమని, నాగమోహన కృష్ణ నాయకత్వంలో రేపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున అన్నారు. వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా పీటా నాగమోహనకృష్ణ బాధ్యతలు చేపట్టి రేపల్లెకు తొలిసారి విచ్చేసిన సందర్భంగా ఇసుకపల్లి వేపాళ్ళమ్మ ఆలయ సమీపంలో శనివారం రాత్రి నిర్వహించిన పరిచయ వేదిక కార్యక్రమంలో మేరుగ నాగార్జున మాట్లాడారు. ● రేపల్లె నియోజకవర్గంలో పార్టీ జెండా మరింత బలంగా రెపరెపలాడాలని మేరుగ పిలుపునిచ్చారు. రానున్న 2029 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రేపల్లె గడ్డపై వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసేలా జగనన్న ఆశీస్సులతో సమన్వయకర్తగా నియమితుడైన నాగమోహన్కృష్ణ నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు ఒక తాటిపై పనిచేయాలని పిలుపునిచ్చారు. ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ పచ్చని పొలాలతో ప్రశాంతమైన రేపల్లె తీరప్రాంతాన్ని జూద కేంద్రంగా మార్చిన ఘనత రెవెన్యూశాఖ మంత్రి సత్యప్రసాద్కే దక్కుతుందన్నారు. రేపల్లె అభివృద్ధిని పక్కన పడేసి మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని పేకాట, కోడిపందాల వంటి జూదాలతో కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్టవేసి ప్రజాసేవకు పరితపించే నాగమోహన్కృష్ణకు జగన్మోహన్రెడ్డి బాధ్యతలు అప్పగించారన్నారు. ● కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ వేమూరు, అద్దంకి నియోజకవర్గాల సమన్వయకర్తలు వరికూటి అశోక్బాబు, డాక్టర్ అశోక్కుమార్లు మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్మోహన్, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు చిత్రాల ఓబేదు, చిమటా బాలాజీ, అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, మండల పార్టీ కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సముద్రాల ప్రభుకిరణ్, మహిళా కన్వీనర్ వీసం నాగలక్ష్మి, నాయకులు పట్టెం శ్రీనివాసరావు, అబ్దుల్ ఖుద్దూష్, చందోలు నాగలక్ష్మికుమారి, ఉమారాణి, సజ్జా పద్మావతి, తదితరులు పాల్గొన్నారు. సభకు హాజరైన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాట్లాడుతున్న మేరుగ నాగార్జున, పక్కన సమన్వయకర్త నాగమోహనకృష్ణ, వేదికపై వరికూటి అశోక్బాబు, అశోక్కుమార్, కారుమూరు వెంకటరెడ్డి -
పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ ఉమ్మడి గుంటూరు జిల్లా విభాగానికి నిర్వహించిన ఎన్నికల్లో నూతన అధ్యక్షురాలిగా ఎన్. నిర్మల భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో సంఘ ప్రధాన కార్యదర్శిగా పి. శామ్యూల్ పాల్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎంఎల్ఎల్వీ. ప్రతాప్, కోశాధికారిగా ఎల్. రవీంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా వి. గణేష్ కుమార్. ఎస్. పురుషోత్తం రాజు, బి. నాగేశ్వరరావు నాయక్. జి.వి.ఆర్.ఏ. శేషారావు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బి.శ్రీనివాసరావు, ఎం. బుల్లయ్య, ఎస్కే. నీలోఫర్, వి. పవన్ కుమార్, సంయుక్త కార్యదర్శి గా ఆర్. శివరామయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి. శ్రీనివాసరావు, కె. మోహన్ రావు, వి. చంద్ర మోహన్, కె. విద్యాసాగర్ రెడ్డి, జేఏసీ సభ్యుడిగా బి. మధుసూదన్ ప్రకాష్, ప్రత్యేక ఆహ్వానితులుగా బి.సిరిల్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు షేక్ షరీఫ్ వ్యవహరించారు. కార్యక్రమాన్ని సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతన అధ్యక్షురాలు నిర్మల భారతి మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీసీ చంద్రమోహన్ పూర్ణ చంద్ర రెడ్డి, రామచంద్రరావు, తోట ఉషాదేవి పలువురు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకుల కోసం భారత్ గౌరవ్ రైళ్లు
చీరాల: వేసవి సెలవుల్లో దేశంలో పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ భారత్ గౌరవ్ రైళ్ళ ద్వారా నాలుగు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించిందని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా అన్నారు. శనివారం స్థానిక రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్యాకేజి–1లో దివ్య దక్షణ యాత్రలో భాగంగా ఆరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు ఉంటాయని, ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై విజయవాడ, చీరాల, ఒంగోలు, గూడూరు మీదుగా వెళుతుందన్నారు. ప్యాకేజి–2లో జ్యోతిర్లింగ దర్శన యాత్రలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాఽథ్, బీమశంకర్, త్రయంబకేశ్వర్, ఘృష్ణేశ్వర్, ప్యాకేజీ–3లో పూరి, కోణార్క్, బైధ్యనాఽథ్, వారణాశి, అయోధ్య, ప్రయాగరాజ్, ప్యాకేజి–4లో మధుర, విద్రవాన్, శ్రీమాతా వైష్ణోదేవి కట్ర, హరిద్వార్, రిషికేష్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చన్నారు. పర్యాటకుల కోసం తయారు చేసిన ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లో వేసవి సెలవుల్లో యాత్రలు చేయవచ్చన్నారు. ఈ రైలు కేవలం పర్యాటక అవసరాల కోసం రూపొందించిందన్నారు. ప్రయాణికులకు భద్రతతో పాటు టూర్ గైడ్ ఉంటారన్నారు. ట్రైన్ టిక్కెట్లోనే భోజనం, స్థానిక హోటల్లో బస, రోడ్డు రవాణా ఖర్చులు ఉంటాయన్నారు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లలో టిక్కెట్ను బుక్ చేసుకోవచ్చని, వేసవి సెలవుల్లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి ఇది ఒక మంచి అవకాశమన్నారు. -
వైభవంగా శ్రీనివాసుడి కల్యాణం
రేపల్లె: మైనేనివారిపాలెం గ్రామం కృష్ణానది ఒడ్డున గురు నిలయం ఆవరణంలోని శ్రీ గాయత్రీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు శనివారం మూడవ రోజు కనుల పండువగా జరిగాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవ, ప్రాతఃకాలార్చన నిర్వహించారు. స్వామివారికి, దేవేరులకు మంగళస్నానాలు ఆచరించి వధువరులుగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛరణ నడము శాంతి కల్యాణం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి విగ్రహానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు కళ్యాణ్ చక్రవర్తి స్వామివారి కల్యాణ ఘట్టాలను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని కన్నులారా తిలకించారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. బాపట్ల: బాపట్ల ఆర్టీసీ పాత బస్టాండ్లో ఉన్న లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి వారి 55వ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా శనివా రం ఉదయం స్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి శాంతి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారికి పుష్పయాగం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులతో పురవీధుల్లో ఊరేగింపు జరిగింది. మహిళలు కోలాటం నిర్వహించారు. తాడికొండ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తుళ్లూరులో పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. తుళ్లూరులో నిర్వహించే అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం కేటాయించిన 6.80 ఎకరాల స్థలంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతి వనా న్ని ఏర్పాటు చేస్తున్నారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలి పారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్, ఆర్యవైశ్య ట్రస్ట్ ప్రెసిడెంట్ డి. రాకేష్ వివరాలను అందిస్తూ పదివేల మంది కార్యక్రమానికి హాజరవుతారన్నారు. రెంటచింతల: స్థానిక కానుకమాత చర్చి విచారణ గురువులు రెవ. ఫాదర్ ఏరువ లూర్దుమర్రెడ్డి 36వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫాదర్ మర్రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందించారు. కానుకమాత చర్చి సహాయ గురువులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ పరిశోధనలలో నైతిక ప్రమాణాలు పాటించాలి
చేబ్రోలు: పరిశోధనల్లో జంతువుల వినియోగం విషయంలో ఎథికల్ గైడ్లైన్స్ను కచ్చితంగా పాటించడం అవసరమని ఢిల్లీలోని సీసీఎస్ఈఏ సీనియర్ కన్సల్టంట్ డాక్టర్ వివేక్ త్యాగి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ పరిధిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో సీసీఎస్ఈఏ (కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్సిపెరిమెంట్స్ ఆన్ యానిమల్స్) ఆర్థిక సౌజన్యంతో ‘‘రీడిఫైనింగ్ ఎక్సిపెరిమెంటల్ ఫార్మాకాలజీ’’ అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి కాన్ఫరెన్స్ శనివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని ‘‘ఎథికల్, ఆల్టర్నేటివ్ అండ్ డిజిటల్ ఫ్రాంటియర్స్’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. డాక్టర్ వివేక్ త్యాగి మాట్లాడుతూ పరిశోధనల కోసం ప్రయోగ జంతువులను ఉపయోగించే సందర్భంలో జంతు సంక్షేమాన్ని కాపాడడం అవసరం అన్నారు. హైదరాబాద్లోని ఐసీఎంఆర్–ఎన్ఐఎన్ సైంటిస్ట్ డాక్టర్ ఎన్. హరీష్ శంకర్ మాట్లాడుతూ వైద్యశాస్త్రం, ఫార్మకాలజీ మరియు జీవశాస్త్ర పరిశోధనల్లో జంతు నమూనాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ అనేక రోగాలపై పరిశోధనలు చేయడంలో జంతు నమూనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పారు. 350 మందికిపైగా విద్యార్థులకు నిర్వహించిన ఓరల్ మరియు పోస్టర్ ప్రెజెంటేషన్లలో సత్తా చాటిన వారికి బహుమతులు అందజేశారు. హైదరాబాద్లోని సీఎస్ఐఆర్–సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జే. మహేష్ కుమార్, సీఎస్ఐఆర్–ఐఐసీటీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కే. సురేష్ బాబు, బెంగళూరులోని దయానంద్ సాగర్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. విజయ్ కుమార్, ఆయా విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో 592 కేసులు పరిష్కారం
బాపట్లటౌన్: రాజీయే రాజమార్గమని బాపట్ల సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 4వ అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్బాబు అన్నారు. బాపట్ల కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కేసుల పరిష్కారానికి నాలుగు బెంచ్లు ఏర్పాటుచేశారు. బాపట్ల కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న 592 కేసులు పరిష్కరించారు. ఆయా కేసులకు రూ.1.82 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. పరిష్కరించిన కేసుల్లో 522 క్రిమినల్ కేసులు, 70 సివిల్ కేసులు ఉన్నాయన్నారు. లోక్ అదాలత్లో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి. వాణి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం.పవన్కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.కళ్యాణి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవిని శ్రీనివాసరావు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల అవినాష్, లోక్ అదాలత్ మెంబర్లుగా భీమా లీలాకృష్ణ, ఊట్ల రామారావు, సీహెచ్ రామాంజనేయులు, జీఎస్ నాగమోహిని పాల్గొన్నారు. -
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
గుంటూరు ఎడ్యుకేషన్ : పేద, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత విద్యా బాటలు వేసిన కమ్మ హాస్టల్ సేవలు 102 వసంతాల మైలురాయిని చేరుకోవడం గొప్ప విశేషమని, విద్యార్థులు అంకుర పరిశ్రమలు స్థాపించే స్థాయికి చేరాలని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. శనివారం అరండల్ పేటలోని కమ్మ విద్యార్థి సహాయ సంఘం (కమ్మ హాస్టల్) 102 వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.15 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘శ్రీ యలమంచిలి జనార్దనరావు కంప్యూటర్ ల్యాబ్’’ ను సుజనా చౌదరి ప్రారంభించారు. అనంతరం కమ్మ హాస్టల్ చరిత్రను ప్రతిబింబించే ‘‘కమ్మ హాస్టల్ చరిత్ర’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. శాఖమూరి లక్ష్మీదేవమ్మ కమ్మ హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించిన సభకు కమ్మ విద్యార్థి సహాయ సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండబోలు బసవపున్నయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ మనిషి ఉన్నత మనుగడకు అత్యంత ముఖ్యమైన విద్య, వైద్య రంగాల్లో కొండబోలు బసవపున్నయ్య నేతత్వంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సేవాభావంతో కొనసాగుతున్న ఈ సంస్థ అభివృద్ధికి పూర్వ విద్యార్థులు మరింతగా ముందుకు వచ్చి చేయూతనందించాలన్నారు. కార్యక్రమంలో కమ్మ విద్యార్థి సహాయ సంఘ కార్యదర్శి కె.కృష్ణ ప్రసాద్, అధ్యక్షుడు ఎం. బంగారు బాబు ఉపాధ్యక్షుడు డాక్టర్ మద్దినేని గోపాలకృష్ణ, సినీ నిర్మాత బండ్ల గణేష్, ప్రముఖ పారిశ్రామికవేత్త కర్నాటి వెంకటేశ్వర్లు, బొల్లేపల్లి సత్యన్నారాయణ, ఎన్. కోటేశ్వరరావు, అట్లూరి సుబ్బారావు, రత్నబాబు, డాక్టర్ యర్రా నాగేశ్వర రావు, పూర్వ విద్యార్థులు, పాలక మండలి సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం
నరసరావుపేట: గౌరవ వేతనంతో విశేష సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని, లేనిపక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించక తప్పదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి హెచ్చరించారు. పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏఎల్ ప్రసన్న అధ్యక్షతన యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. మల్లీశ్వరి మాట్లాడుతూ తమ వేతనాలు పెంచాలనే దశలవారీ పోరాటాలలో భాగంగా ఇటీవల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గం అన్నారు. యూనియన్ నాయకులతో నిర్వహించిన చర్చల సందర్భంగా ప్రభుత్వ పెద్దలు 10 డిమాండ్లకు గాను తొమ్మిది నెరవేర్చామని అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉగాది సందర్భంగా పండగ నాటికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె సందర్భంగా శిబిరానికి వచ్చిన కూటమి అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఊక దంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతమణి కోశాధికారి మాధవి, సభ్యులు సావిత్రి, జయలక్ష్మి పాల్గొన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.మల్లేశ్వరి -
దుర్గమ్మకు కానుకగా బంగారు సూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ఏలూరు జిల్లాకు చెందిన భక్తులు రూ. 5.32 లక్షల విలువైన బంగారు మంగళ సూత్రాలను శనివారం కానుకగా సమర్పించారు. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన మేడపాటి వెంకట నాగిరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు 32.500 గ్రాముల బంగారం రూ. 5.32 లక్షలతో మంగళ సూత్రాలను తయారు చేయించారు. తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మంగళసూత్రాలను అమ్మవారికి సమర్పించారు. దాతలకు వేద ఆశీర్వచనం అందచేసిన అనంతరం అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. బంగారు మంగళ సూత్రాలను ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. -
పచ్చ రాజఖాకీయం
● చీరాల వైఎస్సార్ సర్కిల్లో ఫ్లెక్సీల తొలగింపులో లోపించిన పారదర్శకత ● రాజకీయ ఒత్తిడా .. స్వయం నిర్ణయమా అంటున్న ప్రజలు చీరాల అర్బన్: స్థానిక గడియార స్తంభం సెంటర్లోని వైఎస్సార్ సర్కిల్లోని ఫ్లెక్సీల విషయంలో పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. పక్షపాతం చూపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కలెక్టర్ ఏం చెప్పారు. పోలీసులు ఏం చేశారు. పోలీసుల చర్యలకు రాజకీయ ఒత్తిడి కారణమా, లేకుంటే వారి స్వయం నిర్ణయమేనా, ఇది దేనికి సంకేతమని ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి చర్యలతోనే పోలీస్ శాఖ మసక బారుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఫ్లెక్సీలు, హోర్డింగులు పెట్టకూడదని హెచ్చరిక బోర్డు ఉన్నా, దాన్ని అతిక్రమించడంతో మున్సిపాల్టీకి ఆదాయం లేకపోగా అప్రతిష్ట మూటగట్టుకున్నట్లు అవుతుందని ప్రజలు అంటున్నారు. దీన్ని బట్టి ఇంటెలిజెన్స్, స్పెషల్బ్రాంచ్ తమ బాస్లకు ఏం నివేదకలు ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. కలెక్టర్ ఏం చెప్పారు...పోలీసులు ఏం చేశారు? ● గత సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కలెక్టర్ వి.వినోద్ కుమార్ హాజరయ్యారు. ఆ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు యాతం మేరీబాబు, బొనిగల జైసన్బాబు తదితరులు కలెక్టర్ను కలిశారు. గడియార స్తంభం సెంటర్లోని వైఎస్సార్ సర్కిల్లో రాజశేఖరరెడ్డి విగ్రహం చుట్టూ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, వాటిని తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని రాత పూర్వకంగా కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అక్కడే ఉన్న డీఎస్పీ మొయిన్కు అక్కడే కాదు, విగ్రహాల వద్ద ఎక్కడ ఫ్లెక్సీలు ఉన్నా తొలగించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఆ సందర్భంగా సదరు సర్కిల్లో ఉన్న పోలీస్ శాఖ పరంగా వాహన చోదకులకు ప్రయాణ భద్రతపై అవగాహన కల్పించే ఫ్లెక్సీని మాత్రమే పోలీసులు తొలగించారు. మిగిలిన ఫ్లెక్సీలను అలానే ఉన్నాయి. ఘనంగా వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం ● వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా తరలిరాగా ఆరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నియోజవకర్గ సమన్వయకర్త కరణం వెంకటేష్బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ సందర్భంగా సర్కిల్లో వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాారు. ముందస్తుగా మున్సిపల్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్నారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా హుందాగా వ్యవహరించారు. కేక్ కట్ చేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తరువాత ఏం జరిగింది? ● ఈ క్రమంలో సర్కిల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను తొలగించారు. మళ్లీ పోలీస్శాఖ పరంగా అంతకు ముందున్న ఫ్లెక్సీని అక్కడ తిరిగి పెట్టారు. వాస్తవానికి పోలీస్శాఖ పరంగా వాహన చోదకులు తీసుకోవల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ అంశం. అయితే మిగిలిన ఫ్లెక్సీలతో పాటు ఉండటం విమర్శలకు తావిస్తోంది. సర్కిల్లో ఉన్న టీడీపీ ఫ్లెక్సీ అలానే ఉంది. మరో ఒకటి, రెండు ఫ్లెక్సీలు కూడా అలానే ఉన్నాయి. ఇది పక్షపాతం కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ సర్కిల్లో ఫ్లెక్సీలు తొలగించాలని కలెక్టర్ చెప్పిన విషయం నాకు తెలీదు. పోలీస్ పరంగా రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాం. ప్రస్తుతం వాహన చోదకులు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశాం. వాటికి సంబంధించి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది వివాదాస్పదం అనుకుంటే మా ఫ్లెక్సీని తొలగిస్తాం. మిగిలిన ఫ్లెక్సీలను తొలగించాల్సిన బాధ్యత మాది కాదు మున్సిపాలిటీది. వాటిపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులదే. – సుబ్బారావు, వన్టౌన్ సీఐ, చీరాల ప్రస్తుతం నేను వైజాగ్లో జరుగుతున్న వర్క్షాప్లో ఉన్నా. వాస్తవానికి మున్సిపల్ పరిధిలో ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరి. కొన్ని చోట్ల రుసుం కూడా చెల్లిస్తారు. అది నిర్ణీత కాలం మాత్రమే. వివాదాలకు తావులేకుండా ఉండేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తామంటే పోలీస్కు అనుమతి ఇచ్చాం. వైఎస్సార్ సీపీ వారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటుకు, కార్యక్రమం అనంతరం తీసేవిధంగా అనుమతి ఇచ్చాం. డీఎస్పీతో మాట్లాడి నేను దగ్గరుంచి అన్ని ఫ్లెక్సీలను తొలగించే విధంగా చర్యలు చేపడతాను. ఆరోగ్య కరమైన వాతావరణం కల్పిస్తాం. – డానియల్ జోసెఫ్, మున్సిపల్ కమిషనర్, చీరాల కలెక్టర్ అంటే జిల్లాకు ముఖ్య అధికారి. జిల్లా న్యాయాధికారి హోదా. పరిపాలన పరంగా నిర్ణయాధికారి. అలాంటి కలెక్టర్ ఆదేశాలను పోలీసులు బేఖాతరు చేయటంతో కలెక్టర్ మాటకు విలువ లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరి ఎవరి మాటను వారు ఖాతరు చేస్తారనే కోణంలో మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా మున్సిపల్ పరిధిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలి. అలానే కొన్ని సందర్భాల్లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలకు, హోర్డింగ్లకు సంబంధించి అనుమతి పొందిన ఏజెన్సీల ద్వారా, లేదా నేరుగా ఏర్పాటు చేస్తారు. అందుకు మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. అయితే వైఎస్సార్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ కోవకు చెందినవి కావు. దీంతో మున్సిపాలిటీకి అప్రతిష్ట తప్ప, ఇలాంటి చర్యల వల్ల ఆదాయం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయకూడదని హెచ్చరిక బోర్డు ఉండటం అందుకు కారణం. -
‘సాహితీ కిరణం’లో ముందస్తు ఉగాది వేడుకలు
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం సంస్థ వ్యవస్థాపకులు పొత్తూరు సుబ్బారావు, జయలక్ష్మిల ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు శనివారం సంస్థ కార్యాలయంలో ఘనంగాా జరిగాయి. కార్యక్రమానికి పర్యావరణ రచయిత డాక్టర్ తూములూరి రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించారు. అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ కవులు, రచయితలు సామాజిక స్పృహతో రచనలు చేయాలన్నారు. కార్తికా డెవలపర్స్ అధినేత వి.వి రాఘవరెడ్డి, జల్ది విద్యాధరరావులు ప్రసంగించారు. విడుదల నిహారిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీ విజేతలకు ప్రముఖ రంగస్థల నటులు, రచయిత విడుదల సాంబశివరావు నగదు బహుమతులు అందించారు. ప్రముఖ కథా రచయిత్రి తాటికోల పద్మావతి రచించిన కథా పద్మాలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనాన్ని ప్రముఖ రచయిత వడలి రాధాకృష్ణ నిర్వహించారు. సయ్యద్ జానీబాషా, బండికల్లు జమదగ్ని, ఎస్.ఎం సుభాని, వీఎస్వీ ప్రసాద్, సోమేపల్లి వశిష్ట, కొణతం నాగేశ్వరరావు, దార్వేముల అనిల్, సుభద్రాకృష్ణ, సుబ్బయమ్మ, పుల్లారావు, శ్రీనివాసరావులు కవితా పఠనం చేశారు. వివిధ రంగాలలో పేరు పొందిన చలపాక ప్రకాష్ (పత్రికా రంగం), కడియాల ప్రభాకరరావు (సంగీతం), రాసంశెట్టి నరసింహారావు(గాయకులు), వై. కనకదుర్ (సాహిత్యం), అత్తోట సౌజన్య (గాయని)లను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. కథల పోటీలలో విజేతలైన ఇంద్రగంటి మధుసూదన్రావు, మొగిలి పద్మ, మౌనశ్రీ మల్లిక్, కోరాడ అప్పలరాజు, చిట్యాల శ్రీధర్కుమార్, పట్నాల ఈశ్వరరావు, పుప్పాల కృష్ణమూర్తి, ఎం సత్యగౌరీ, బీవీ మిత్ర కొత్తూరు సీతారామరాజు, సి రాజేశ్వరి, కిషోర్ కుమార్లకు నగదు బహుమతులు అందించారు. ప్రముఖ వ్యాఖ్యాత పెద్దూరి దాసు సభా సమన్వయం చేశారు. వేడుకలు పొత్తూరు గ్రామంలోని సాహితీ కిరణం పత్రిక కార్యాలయంలో పొత్తూరి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. కొంచెం కావాలిపుడు శీర్షికన కవితా గానం చేసిన ఎస్. ఎం. సుభానిని జాస్తి వీరాంజనేయులు శాలువాతో సత్కరించారు. ప్రముఖ సాహితీ వేత్త పెద్దురి వెంకటదాసు, ప్రముఖ కథా రచయిత వడలి రాధాకృష్ణ, పట్టాభి కళాపీఠం అధ్యక్షులు తూములూరి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ కవి రచయిత డాక్టర్ జెల్ది విద్యాధరరావు, జమదగ్ని, వశిష్ఠ సోమేపల్లి, సయ్యద్ జానీబాషా, తాటికోల పద్మావతి, ఎం. సుభద్రకృష్ణ, ప్రముఖ సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, ముట్లూరి ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్. దమయంతి తదితరులు సుభానికి అభినందనలు తెలిపారు. -
నాగమోహన కృష్ణ పరిచయ సభకు వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పిలుపు రేపల్లె: వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహనకృష్ణ పరిచయ సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున శుక్రవారం పిలుపునిచ్చారు. నగరం మండలం పీటావారిపాలెంకు చెందిన పీటా నాగమోహనకృష్ణ బాధ్యతలు చేపట్టిన అనంతరం నియోజకవర్గ కేంద్రమైన రేపల్లె పట్టణానికి తొలిసారి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఇసుకపల్లిలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పరిచయ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాగార్జున కోరారు. నూతన సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నాగమోహన్కృష్ణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. -
కవయిత్రి మొల్లమాంబ చిరస్మరణీయురాలు
డీఆర్ఓ గంగధర్ గౌడ్ బాపట్ల: మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని కవయిత్రి మొల్ల మాంబ తన రచనల ద్వారా నిరూపించారని జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల మాంబ జయంతి శుక్రవారం నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టరేటలోని పీజీఆర్ఎస్ హాల్లో లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. డీఆర్ఓ మాట్లాడుతూ మహిళలు కూడా సాహిత్య రంగంలో గొప్ప స్థాయికి ఎదగగలరని కవయిత్రి మొల్ల మాంబ తన రచనల ద్వారా నిరూపించారని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో కవయిత్రి మొల్ల మాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంఘాల నాయకులు డీఆర్వోఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ డీడీ శివ నాగేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అబ్బులు, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
బాపట్ల
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్:నాగార్జునసాగర్ జలాశయ మట్టం శుక్రవారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఏరియా ఆసుపత్రి తనిఖీ నరసరావుపేట: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శుక్రవారం తనిఖీ చేశారు. ఆసుపత్రి విస్తరణ నిర్మాణ పనులను పరిశీలించారు. నిమ్మకాయల ధరలు తెనాలి:తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6,500, గరిష్ట ధర రూ.8,500, మోడల్ ధర రూ.7,300 వరకు పలికింది. I -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మంగళగిరి టౌన్ : విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి చెందిన ఉయ్యాల చందు (27) మంగళగిరి మండలం ఆత్మకూరులోని వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం పని నిమిత్తం ఆత్మకూరు వాటర్ ప్లాంట్కు చేరుకున్నాడు. అక్కడి నుంచి వాటర్ ట్యాంక్ ఉన్న ఆటోతో మంగళగిరి పట్టణం టిప్పర్ల బజార్లో నారాయణ స్కూల్కు చేరుకున్నాడు. అక్కడి వాటర్ ట్యాంక్లోకి ఆటోలోని ట్యాంక్ నుంచి పైపు ద్వారా నీరు నింపుతున్నాడు. విద్యుత్ వైర్లు, వాటర్ ట్యూబ్స్ ఎర్త్ కావడంతో ఆటోలో కూర్చుని ఉన్న చందుకు విద్యుదాఘాతం తగిలింది. సిబ్బంది అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంగళగిరి టౌన్: సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంలో ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరమని పంజాబ్ రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ (సీఐసీ) ఇంద్రపాల్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.ఎస్. నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ పంజాబ్ సమాచార హక్కు కమిషన్ పనితీరు, సెకండ్ అప్పీల్ కేసులను ఎలా డిస్పోజ్ చేస్తున్నారో వివరించారు. అనంతరం ఇంద్రపాల్ సింగ్ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్ పాల్గొన్నారు. నెహ్రూనగర్: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ రెండో రోజు కూడా కొనసాగింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మీట్లో డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాసులు శుక్రవారం క్రికెట్, ఇతర పోటీలను టాస్ వేసి ప్రారంభించారు. మహిళలకు కబడ్డీ, త్రోబాల్, స్కిప్పింగ్, 100 మీటర్స్ వాకింగ్, టెన్నికాయిట్ డబుల్స్, చెస్, క్యారమ్స్ వంటి పోటీలు జరిగాయి. స్పోర్ట్స్ మీట్ శనివారంతో ముగుస్తుందని డీసీ శ్రీనివాసులు చెప్పారు. -
రుక్మిణి కల్యాణం అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రుక్మిణి కల్యాణం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్య నిర్వహణా ధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా వింజమూరి శ్రీకృష్ణ రాజేంద్రప్రసాద్ కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా ప్రగడ నరసింహమూర్తి వ్యవహరించారు. -
అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం ప్రారంభం
ఏఎన్యూ(పెదకాకాని): దేశ ఐక్యత, సమగ్రతను బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ కేంద్రం గుంటూరు వారు నిర్వహిస్తున్న అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఏఎన్యూలో జరిగిన ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్రం నుంచి మొత్తం 37 మంది యువతి యువకులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో సంస్కృతి, ఉపాధి అవకాశాలు, సాంకేతికత వంటి అంశాలపై పరస్పర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ జానపద నృత్య ప్రదర్శనలు, క్షేత్రస్థాయి సందర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ దేశ ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడంలో ఇటువంటి యువజన సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం.సుధాకర్, మై భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, ఓఎస్డీ ప్రొఫెసర్ ఆర్వీఎస్ఎస్ఎన్ రవి కుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దివ్యతేజోమూర్తి తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో యువత సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. -
గుంటూరు జీజీహెచ్లో కేంద్ర కమిటీ పరిశీలన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు పలు వార్డులను పరిశీలించారు. ఎన్ఐసీ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ రవీంద్రకుమార్, జాయింట్ డైరెక్టర్ రాజ్కుమార్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చెందిన రూపల్ ప్రకాష్, శ్యామల్రావు, హుస్సేన్లు అధికారుల బృందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు ఆన్లైన్లో నెక్ట్స్జెన్ పేరుతో నమోదు చేసేందుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగా గుంటూరు జీజీహెచ్లో కాగిత రహిత ఓపీ సేవలు రోగులకు అందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా జీజీహెచ్ అధికారులు నెక్ట్స్జెన్ పేరుతో రోగుల డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను నమోదు చేస్తున్నారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను ఏవిధంగా నమోదు చేస్తున్నారనే విషయాలను ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం స్వయంగా పరిశీలించారు. అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రిలో పరిశీలనకు తరలి వెళ్లారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ కలెక్టర్, స్పెషల్ అడ్మినిస్ట్రేటర్ సుధారాణి, అడ్మినిస్ట్రేటర్ డి.ప్రవీణ్కుమార్, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ప్రసాద్, తదితరులు కేంద్ర బృందం వెంట ఉండి వారికి సమాచారం అందజేశారు. -
తీరం తాబేళ్ల స్వర్గధామం
వేటపాలెం: జిల్లాలో సముద్రపు తాబేళ్లు (ఆలీవ్ రిడ్ల్లే) సంరక్షణలో అటవీ శాఖ ముందు వరుసలో నిలిచింది. జిల్లాలో బాపట్ల మండలం సూర్యలంక నుంచి చిన్నగంజాం మండలం పరిధిలోని ఏటిమొగ్గ వరకు 35 కిలో మీటర్లు సముద్ర తీరం వెంట సముద్ర తాబేళ్ల సంరక్షణకు అటవీశాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో ఆరు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో తాబేళ్ల గుడ్లను సేకరించి పిల్లలుగా తయారు చేసిన తరువాత వాటిని సముద్రంలోకి విడిచి పెడుతుంటారు. వీటి సంరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా తీర ప్రాంతాల్లో 12 మంది వలంటీర్లను అటవీ శాఖ నియమించింది. వీటిపై పర్యవేక్షణకు ప్రాజెక్టు +కోఆర్డినేటర్ను నియమించారు. సంరక్షణ కేంద్రాలు ఇక్కడే.. జిల్లాలోని సముద్ర తీర గ్రామాలైన సూర్యలకం, వేటపాలెం మండల రామాపురం, పొట్టి సుబ్బయ్యపాలెం, రామచంద్రాపురం, కుంకుడు చెట్లపాలెం, చిన్నగంజాం మండలం ఏటిమొగ్గ తాబేళ్ల సంరక్షణ కేంద్రాలున్నాయి. జిల్లాలో ఉన్న సముద్ర తీరంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 155 తల్లి తాబేళ్లు తీరానికి వచ్చి 17,779 గుడ్లు పెట్టి వెళ్లాయి. వీటిని వలంటీర్లు సేకరించి ఆరు సంరక్షణ కేంద్రాల్లో ఉంచారు. ప్రస్తుతం ఈ గుడ్లు తాలూకూ 390 పిల్లలుగా మారడంతో వాటిని సముంద్రంలోకి సురక్షితంగా వదిలేశారు. ఈ ప్రక్రియ మే వరకు కొనసాగుతుంటుంది. తాబేళ్ల సంరక్షణ ఇలా... ఆలీవ్ రెడ్లీ తాబేళ్లు ప్రతి ఏడాదీ జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు మాత్రమే ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడుతుంటాయి. సముద్రం నుంచి రాత్రి వేళల్లో తాబేళ్లు ఒడ్డుకు చేరుకొని తీరానికి దగ్గరలో ఇసుకలో గుంటలు చేసుకొని గుడ్లు పెడుతుంటాయి. ఉదయాన్నే అటవీ శాఖ ఏర్పాటు చేసిన వలంటీర్లు తీరం వెంట వెళ్లి.. తల్లి తాబేళ్ల కాళ్లు ఆనవాళ్లను గుర్తించి అవి ఎక్కడ గుడ్లు పెట్టింది కనుగొంటారు. ఈ గుడ్లు సేకరించుకొని వెళ్లి సంరక్షణ కేంద్రంలో గుంటలు ఏర్పాటుచేసి అక్కడ పెడతారు. ఆ గుడ్లు 48 నుంచి 55 రోజుల్లో పిల్లలుగా మార్పు చెందుతాయి. ఈ పిల్లలను తిరిగి వలంటీర్లు ద్వారా సురక్షితంగా సమ్రుంలో వదిలిపెడతారు. సంరక్షణ ముఖ్యోద్దేశం సముద్రం తాబేళ్ల జాతి అంతరించి పోకుండా కాపాడుకోవడం కోసం తల్లి తాబేళ్లు తీరంలో పెట్టిన గుడ్లను ఇతర జంతువుల పట్టుకోకుండా కాపాడటం, తాబేలు పిల్లలు పక్షులు, గద్దల బారిన పడి మరణించకుండా కొంత మంది తాబేళ్ల గుడ్లను దొంగిలించి తీసుకెళ్లకుండా వీటిని సంరక్షించుకోవడానికి చర్యలు చేపట్టారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 2016వ సంవత్సరం నుంచి సముద్ర తాబేళ్లు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో సంరక్షణకు వలంటీర్లను నియమించాం. ఇప్పటివరకు 390 తాబేళ్ల పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి విడుదల చేశాం. –సుమేష్ గౌరవ్, ప్రాజెక్టు కోఆర్డినేటర్, వేటపాలెం -
తండ్రి చెంతకు చేరిన కొడుకు, కోడలు
సురక్షితంగా అప్పగించిన రూరల్ పోలీసులు చీరాల: కనబడకుండా పోయిన కొడుకు, కోడలు, ఎనిమిది నెలల బాబును ఈపూరుపాలెం పోలీసులు తిరిగి తండ్రి చెంతకు చేర్చారు. ఈ మేరకు శుక్రవారం ఈపూరుపాలెం ఎస్సై ఎ.చంద్రశేఖర్ వివరాలను వెల్లడించారు. కొడుకు, కోడలు, ఎనిమిది నెలల బాబుతో సహా కనబడటం లేదని చీరాల మండలం వాడరేవుకు చెందిన అర్జీలి నూకరాజు సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి రెండు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేశామన్నారు. గురువారం కాకినాడ సమీపంలోని వారి స్వగ్రామమైన దుమ్ములిపేట గ్రామంలో ఉన్నట్లు కనుగొని వారిని సురక్షితంగా చీరాల రూరల్ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చామని తెలిపారు. కొడుకు, కోడలు బతుకుదెరువు కోసం ఇంటిలో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారని తెలిపారు. బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చారన్నారు. ఈ విషయంపై డీఎస్పీ ఎండీ మొయిన్ వారితో మాట్లాడారు. కొడుకు, కోడలు ఎనిమిది నెలల బాబుతో సహా సురక్షితంగా అప్పగించడంపై అతని తండ్రి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఖబరస్తాన్ మీదుగా వంతెన నిర్మాణం తగదు
శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి మంగళగిరి టౌన్ : మంగళగిరి–తెనాలి రోడ్డులో ఖబరస్తాన్పై బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన శ్రేయస్కరం కాదని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని తాళ్ళాయపాలెంలో శుక్రవారం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డు విస్తరణ అంశంపై స్పందించిన ఆయన హిందూ సంప్రదాయం దృష్ట్యా ఇలాంటి నిర్మాణాలపై రాకపోకలు అనుకూలంగా ఉండవని పేర్కొన్నారు. తెనాలి రోడ్డు విస్తరణపై ప్రజలు, మత పెద్దల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. వీటిని గౌరవంగా పరిగణనలోకి తీసుకుని మంత్రి నారా లోకేష్ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. నగరంపాలెం: గ్యాస్ బుకింగ్ పేరుతో జరిగే సరికొత్త సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుని, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆన్లైననులో గ్యాస్ బుకింగ్కి వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామని, అదనంగా కేటాయిస్తామని సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని చెప్పారు. వాట్సాప్, ఎస్ఎంఎస్ల ద్వారా నకిలీ వెబ్సైట్ లింకులు పంపిస్తూ ముందుగా డబ్బులు చెల్లిస్తే వెంటనే గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని అన్నారు. -
సమష్టి కృషితోనే నూతన ఆవిష్కరణలు
చేబ్రోలు: పరిశోధనలకు విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసినప్పుడే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని హైదరాబాద్లోని జీనోమిక్స్ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో డాక్టర్ రత్నగిరి పోలవరపు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘ప్లాంట్ సైన్స్ కొలోక్వియమ్’’ అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి కాన్ఫరెన్స్ను శుక్రవారం ప్రారంభించారు. సావనీర్ను ఆవిష్కరించారు. ‘‘బయోటెక్నాలజికల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోయాక్టివ్ ఫైటో కెమికల్స్ ఆఫ్ మెడిసినల్ వ్యాల్యూ’’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. జీనోమిక్స్, విజ్ఞాన్ వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కన్సార్టియం సెంటర్ ఫర్ అడ్వాన్డ్స్ జీనోమిక్స్ రీసెర్చ్ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య ప్రారంభించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రత్నగిరి పోలవరపు మాట్లాడుతూ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు వైద్యరంగం, ఔషధ తయారీ, వ్యవసాయ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. జబల్పూర్లోని మంగళయాతన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ కేపీఎంఎస్వీ పద్మశ్రీ , వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తాజా అంశాలపై పరిశోధనా పత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మైసూరులోని సీఎస్ఐఆర్–సీఎఫ్టీఆర్ఐ ప్లాంట్ సెల్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్వీ శ్రీధర్, మేక జగన్మోహన్రావు, విజ్ఞాన్ సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఈవో మేఘన కూరపాటి, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ కృష్ణకిషోర్, డీన్లు పాల్గొన్నారు. ‘జీనోమిక్స్ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్’ ప్రెసిడెంట్, సీఈవో -
హామీ మేరకు రైతులకు ఆర్థిక సాయం
భట్టిప్రోలు: ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. భట్టిప్రోలు మార్కెట్ యార్డు ఆవరణలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్, ఎమ్మెల్యే ఆనందబాబు, జిల్లా అధికారులు పాల్గొని సీఎం చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసారం వీక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20 వేలు మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రైతు సంతోంగా ఉంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉన్న వేమూరు నియోజకవర్గంలో ఈ పథకం ద్వారా 29 వేల మంది రైతులకు రూ. 15.75 కోట్లు లబ్ధి చేకూరిందని తెలిపారు. రైతులకు హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నామని, భూసార పరీక్షల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమచేసే విధానాన్ని రికార్డు స్థాయిలో అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వరదలు, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీని సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. మిగిలిన సమస్యలను కూడా జిల్లా కలెక్టర్ వినోద్కుమార్తో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఏసీబీ ఉమ్మడి గుంటూరుకు ఉగాది పురస్కారాలు
నగరంపాలెం (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం ఉగాది–26 పురస్కారాలను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) గుంటూరు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉత్తమ, రెండు సేవా పతకాలు లభించాయి. ఉమ్మడి జిల్లా అదనపు ఎస్పీ మహేంద్ర మత్తేకు సేవా పతకం, హెడ్కానిస్టేబుల్ బి.శ్రీనివాసరావుకు ఉత్తమ సేవా పతకం, కానిస్టేబుల్ యు.సురేష్బాబు సేవా పతకానికి ఎంపికయ్యారు. ఏఎస్పీ మహేంద్ర మత్తే తొలుత గ్రేహాండ్స్, విశాఖపట్నం, పాడేరు, విజయవాడ జీఆర్పీ, విశాఖపట్నం అర్బన్ ఇంటిలిజెన్స్, శ్రీకాకుళం జిల్లా డీఎస్పీగా, విశాఖపట్నం సిటీ టాస్క్ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. 2023లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొంది, ఏసీబీ ఉమ్మడి గుంటూరు జిల్లాకు బదిలీయ్యారు. రుక్మిణి కల్యాణం అలంకారంలో నరసింహస్వామి మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రుక్మిణి కల్యాణం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్య నిర్వహణా ధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా వింజమూరి శ్రీకృష్ణ రాజేంద్రప్రసాద్ కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా ప్రగడ నరసింహమూర్తి వ్యవహరించారు. దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.57 లక్షలు విరాళం నగరంపాలెం: స్థానిక లాలాపేటలోని పురాతనమైన శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం పునఃనిర్మాణానికి గుంటూరు కొత్తపేట పద్మావతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వీరగంధం సుబ్బారావు రూ.57 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శుక్రవారం సుబ్బారావు ఆయన భార్య సువర్ణపద్మావతి జ్ఞాపకార్థం లాలాపేట శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం బ్యాంక్ ఖాతాకు నగదు జమ చేశారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కార్యాలయంలో దాత సుబ్బారావుని సత్కరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ టి.సుభద్ర, మిర్చియార్డు డైరెక్టర్ కొనకళ్ల సత్యం పాల్గొన్నారు. కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ నరసరావుపేట:పట్టణంలోని కుమ్మరబజార్లో ఆ వర్గీయులు ఏర్పాటుచేసిన తొలి తెలుగు మహిళ రామాయణం కవయిత్రి మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కవయిత్రి మొల్ల గొప్పతనం గురించి వివరించారు. సమీపంలోని మహాలక్షమ్మ చెట్టు వద్ద పూజలు చేశారు. ఇరువురిని కుమ్మరి సంఘ వర్గీయులు సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు మాజీ ఎంపీపీ మంగమ్మ, శాలివాహన సంఘ జిల్లా అధ్యక్షుడు తొర్లకొండ చిన అంజయ్య, ఇంటలెక్చువల్ ఫోర్ రాష్ట్ర కార్యదర్శి ఇయం.స్వామి, పట్టణ వర్కింగ్ అధ్యక్షులు అచ్చిశివకోటి, నాయకులు మోరా శ్రీనివాసరావు, షేక్ శిలార్, సంఘ నాయకులు పాల్గొన్నారు. -
ఊడలు దిగిన అక్రమాలకు ఊతం
చీరాలలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ఇసుక అక్రమ తవ్వకాలతో కొన్ని ప్రాంతాల్లో చెరువులుగా మారిన భూములుచీరాల అర్బన్: చంద్రబాబు చెప్పే మాటలకు, చేతలకు పొంతన ఉండదు. ఎన్నికల వేళ చెప్పిన హామీల్లో కప్పదాట్లు అందుకు నిదర్శనం. చీరాల నియోజవకర్గంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అందుకు నిదర్శనమని ప్రజలు అంటున్నారు. ఎక్కడ బాబు నీ ఉక్కు పాదమని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ఐఏఎస్లు, ఐపీఎస్లకు రెండు రోజుల పాటు నిర్వహించిన సమీక్ష సమావేశంలో దిశా, నిర్దేశం చేసిన పలు అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో రాజకీయ అండనేది బహిరంగ రహస్యం. దీంతో కింద స్థాయి అధికారులు స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఓ మాజీ కానిస్టేబుల్ కనుసన్నల్లో దందా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా ఓ మాజీ కానిస్టేబుల్ కనుసన్నల్లో సాగుతోందని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అందుకు అతనికి రాజకీ య అండ ఉండడమే కారణం అంటున్నారు. అలా అండ, దండలు అందించేందుకు మూలవిరాట్టుకు, ఉత్సవ విగ్రహాలకు, భాజాభజతీంత్రలకు స్థాయిని బట్టి సంతృప్తి పరుస్తున్నాడని చెప్పుకుంటున్నారు. స్వామి కార్యం.. స్వకార్యం ఎంత రాజకీయ అండ ఉన్నా, అధికారుల మద్దతు లేనిదే ఈ అక్రమ ఇసుక దందా సాగదు. ఈ క్రమంలో కొందరు అధికారులు స్వామి కార్యం, స్వకార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దందా చేసే వ్యక్తికి సంబంధించిన వారైతే మిన్నకుంటూ, విడిగా ఎవరన్నా ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. తీరప్రాంతంలోని ఓ ఎస్ఐపై ఆరోపణలు తీరప్రాంతానికి చెందిన ఓ ఎస్ఐపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కార్యకర్త మాదిరి పనిచేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇటీవల తీరంలో ఓ స్థిరాస్తి వివాదానికి సంబంధించి అక్కడే ప్రైవేటు పంచాయితీ నిర్వహించాడనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించి అతను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ క్రమంలో బాధితుడు ఓ మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించాడు. ఆ మాజీ ఎమ్మెల్యే జోక్యంతో ఉన్నతాధికారులు ఆ ఎస్ఐకి చీవాట్లు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. ఇక స్టేషన్లో సామాన్యులకు న్యాయం జరగదనే భావనకు ఆ ప్రాంత ప్రజలు వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు. చంద్రబాబు పలు అంశాలపై ఐఏఎస్లు, ఐపీఎస్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఆ క్రమంలో ప్రజలకు పారదర్శకమైన సేవలు అందాలని చెప్పారు. అవినీతి, అక్రమాలకు చెక్ చెప్పాలన్నారు. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనైనా చీరాల నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై స్పందించి కలెక్టర్, ఎస్పీలు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, రేషన్ బియ్యం నల్లబజారుకు తరలటం, ప్రైవేటు పంచాయితీలు, తీరంలో అసాంఘిక కార్యకలాపాలు ఇలా అనేక రకాలైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగుతుంటే నిఘా వ్యవస్థ నిద్ర పోతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ పరిధిలో అది పోలీస్ శాఖ అయినా, ఇతర ఏ అంశానికి సంబంధించైనా నీడలా ఉండి జిల్లా పోలీస్ బాస్కు రిపోర్ట్ చేయాల్సిన బాధ్యత స్పెషల్ బ్రాంచి (ఎస్బీ)ది. ఆ నిఘా వ్యవస్థ తన ఉనికిని కోల్పోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తీరంలో జరిగిన కోడి పందేలు నుంచి నేటి వరకు స్థానిక ఎస్బీ అధికారులు ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితులను నివేదిస్తున్నారా? లేక వాస్తవాలు తెలిసీ ఉన్నతాధికారులు తెలీనట్లు నటిస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇసుక భూముల్లో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతో భారీ గోతులు ఏర్పడి, అందులో నీరు చేరి కొన్ని చెరువులుగా మారాయి. పట్టా, అసైన్డ్ భూములతో పాటు కొంతమేర ప్రభుత్వ భూముల్లో కూడా తవ్వకాలు సాగిన సందర్భాలు ఉన్నాయంటున్నా రు. ఇక కొన్ని ప్రాంతాల్లో భారీ కొండలుగా ఉన్న ఇసుక తిన్నెలు కనుమరుగయ్యాయి. టీడీపీ జ మానాలో సుమారు 50వేల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా జరిగి ఉంటుందనే వాదనలు వి నిపిస్తున్నాయి. ఏర్పడ్డ గోతులు, కనుమరుగైన ఇసుక తిన్నెలను మైనింగ్ అఽధికారులు లెక్కలు క డితే అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని అంచనా. -
రైల్వే పోలీసులకు ఏబీసీడీ అవార్డు
చీరాల రూరల్: ఆంధ్ర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) హరిష్ కుమార్ గుప్తా చేతులు మీదుగా 2025 సంవత్సరం త్రైమాసికానికి సంబంధించి శుక్రవారం చీరాల, ఒంగోలు రైల్వే పోలీసులు ప్రతిష్టాత్మకమైన ఏబీసీడీ అవార్డులు అందుకున్నారు. గతేడాది ఒంగోలు జీఆర్పీలో నమోదైన కేసును మూడు రోజుల్లో త్వరితగతిన ఛేదించి పోగొట్టుకున్న 341 గ్రాములు బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను రికవరీచేసి బాధితులకు అందజేశారు. దీనికి గాను ఈ అవార్డును అందజేసినట్లు చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపారు. కేసు దర్యాప్తు రైల్వే డీఐజీ సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో విజయవాడ ఎస్ఆర్పీ సత్యదేవ్సింగ్ పర్యవేక్షణలో చేసినట్లు చెప్పారు. కేసు చేధనలో చీరాల జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య, ఒంగోలు సీఐ షేక్ మౌలా షరీఫ్, నెల్లూరు డీఎస్పీ జి.మురళీధరరావు, హెడ్కానిస్టేబుల్ కె.భాస్కర్, కానిస్టేబుల్ బి.రాము అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. -
ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసింది శూన్యం
పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే శంకరరావు అచ్చంపేట: పెదకూరపాడు నియోజకవర్గంలో 2014 – 19 వరకు టీడీపీ పాలనలోగానీ, గత రెండేళ్ల కూటమి పాలనలోగానీ జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఏంటో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు ఉందా అని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరావు ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం అచ్చంపేటకు వచ్చిన శంకరరావు విలేకరులతో మాట్లాడుతూ... 5 సంవత్సరాల వైఎస్సార్ సీపీ పాలనలో తానేం చేశానో నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అమరావతి నుంచి బెల్లంకొండ వరకు ట్రిబుల్ రోడ్డుకు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారని, 60 శాతం పనులు పూర్తి చేశామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎందుకు పనులు ఆపారో చెప్పాలన్నారు. మాదిపాడు వద్ద కృష్ణానదిపై రూ.63 కోట్లతో వంతెన మంజూరు చేయించి పనులు ప్రారంభిస్తే దానికి కూడా కొనసాగించడం లేదన్నారు. మాదిపాడు నుంచి తండాలను కలుపుతూ పులిచింతల ప్రాజెక్టు రోడ్డుకు నిధులు మంజూరు చేయిస్తే ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, దొడ్లేరు గ్రామాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్రోసూరులో పాలిటెక్నిక్ భవనం, గ్రామ గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పక్కా స్కూలు భవనాలు, అదనపు తరగతి గదులు, గ్రామ గ్రామానికి అంతర్గత పక్కా రహదారులు తమ హయాంలోనే నిర్మించిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ప్రజలను మభ్యపెట్టడం, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. నిరుపేద మహిళకు నెలకు రూ.1500 చొప్పున, నిరుద్యోగులకు రూ.3000 నిరుద్యోగ భృతి, ఉచిత సిలిండర్లు వంటి హామీల సంగతేంటన్నారు. నెరవేర్చకుండా సూపర్ సిక్స్ సక్సెస్ అని చెప్పుకోవడంపై ఎద్దేవా చేశారు. చిత్తశుద్ది ఉంటే మిగిలిపోయిన పనులు పూర్తి చేయాలని, పెదకూరపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం తీసుకురావాలని, బెల్లకొండ మండలానికి పులిచింతల బ్యాక్ వాటర్ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. చేతకాకపోతే ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు మంచి చేసి మన్ననలు పొందాలి తప్ప తమ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పనుల ఫొటోలు పెట్టుకుని, గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 40 సంవత్సరాలలో జరగని అభివృద్ది పనులు తన 5 సంవత్సరాల కాలంలో చేశానని ధీమా వ్యక్తం చేశారు. మంజూరు చేయించడానికి, పూర్తిచేయించి బిల్లులు ఇప్పించడానికి తేడా తెలియని టీడీపీ నాయకులు కూడా మాట్లాడటం హ్యస్యాస్పదంగా ఉందన్నారు. -
ఒకేషనల్ విద్యతో ఆర్థికాభివృద్ధి సాధ్యం
మచిలీపట్నంఅర్బన్: విద్యార్థులను ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధికి ఒకేషనల్ విద్య దోహదపడుతుందని కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. కృష్ణవేణి ఐటీఐ కళాశాలలో ఒకేషనల్ విద్యకు సంబంధించి గురువారం ఒక రోజు ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకేషనల్ విద్య విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలను అందించి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు సహాయపడుతుందన్నారు. సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కుముదిని సింగ్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్యను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జీసీడీఓ జి.సీతామహాలక్ష్మి, ఏపీఓ కె.ఏడుకొండలు, ఏఎంఓ శ్యామ్, ఎంఐఎస్ సుభాన్, సీఎంఓ టి.రమేష్, వీసీఎస్ జి.పద్మజ, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఒకేషనల్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
● గుంటూరు, పల్నాడు జిల్లాల్లో బృందాలుగా సోదాలు ● 26 సిలెండర్లు సీజ్ చేసి కేసులు నమోదు
నగరంపాలెం: గుంటూరు, పల్నాడు జిల్లాలలో వాణిజ్య అవసరాలకు గృహావసరాల ఎల్పీజీ సిలెండర్లను అక్రమంగా వాడే దుకాణాలు, హోటళ్లపై గుంటూరు రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగపు అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కట్టమూరి వారి వీధిలోని స్వీట్ షాప్లో తనిఖీ చేయగా, యాజమాని ఐదు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నరసరావుపేట రోడ్లో ఐదు, గుంటూరు నగరంలోని లిబర్టీ సెంటర్లో బిర్యానీ హోటల్లో మూడు, ఓ కిచిడీ పాయింట్లో మూడు, ఆటోనగర్ ఇందిరానగర్ హోటల్లో ఐదు, కిచిడీ పాయింట్లో ఐదు సిలెండర్లను గుర్తించి స్వాధీనం చేశారు. తనిఖీల్లో భాగంగా 26 గృహ ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లను సీజ్ చేసి, స్థానిక సీఎస్డీటీలకు అప్పగించారు.కేసులు నమోదు చేశారు. గుంటూరు ప్రాంతీయ విజిలెనన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక పౌరసరఫరాల శాఖ అధికార, సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి రూరల్: భార్యను హత్య చేస్తానని బెదిరిస్తున్న రౌడీషీటర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన రౌడీషీటర్ సుద్దపల్లి రాజేంద్ర కొంత కాలం క్రితం అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. భర్త వేధింపుల కారణంగా భార్య మూడు నెలల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని గ్రామంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె ఇంటికి పెట్రోలు సీసా తీసుకెళ్లి చంపేస్తానని భార్య, ఆమె కుటుంబసభ్యులను రాజేంద్ర బెదిరిస్తున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచినట్టు రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ గురువారం తెలిపారు. ఇదే రౌడీషీటర్ గతేడాది అక్టోబరులో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ వద్ద ఏడాది కాలానికి రూ. ఐదు లక్షలకు సెల్ఫ్ బాండ్ తీసుకుని, ఏవిధమైన ఘర్షణలు, నేరాల్లో పాల్గొనని బైండోవర్ అయ్యాడు. తీరు మారకపోవడంతో అరెస్ట్ చేశామని, అలానే అతని నుంచి రూ. ఐదు లక్షల నగదు రికవరీ చేస్తామని వివరించారు. గుంటూరు ఇంజినీర్కు గుర్తింపు గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరుకు చెందిన యువ ఇంజినీర్ ఆకెళ్ళ నరసింహ సాయినాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయిలో డైమెన్షనల్ ఇంజినీరింగ్ రంగంలో గణనీయమైన ముద్ర వేసిన కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. ప్రపంచ ప్రఖ్యాత హూస్టన్లోని టెస్లా సంస్థ నుంచి ఆఫర్ అందుకున్నారు. గుంటూరులో పుట్టి పెరిగిన సాయినాథ్ తన పాఠశాల విద్యను బ్రాడీపేటలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. అనంతరం సత్తెనపల్లి మండలంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందిన సాయినాథ్, గత దశాబ్దంలో అత్యంత సమర్థుడైన డైమెన్షనల్ ఇంజినీర్గా ఎదిగారు. ప్రతిష్టాత్మకమైన అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఏఎస్ఎంఈ), జీడీ అండ్ టీ, సీనియర్ లెవల్ సర్టిఫికేషన్ పొందారు. -
తెనాలిలో భారీ చోరీ
10 కిలోల వెండి, 10 గ్రాముల బంగారం అపహరణ తెనాలి రూరల్: తెనాలి గంగానమ్మపేటలోని శ్రీ సాయి బాలాజీ జ్యుయలర్స్లో బుధవారం అర్ధరాత్రి దాటాక భారీచోరీ జరిగింది. షాపు తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గూర్ఖా గమనించి యజమానికి ఫోన్ చేసి పిలిపించడంతో విషయం బయటపడింది. షాపు యజమాని ఫిర్యాదుతో సీఐ రాముల నాయక్ ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించారు. దాదాపు తొమ్మిది కిలోల వెండి ముడి సరుకు, ఒక కిలో వెండి వస్తువులు, 10 గ్రాముల బంగారం అపహరణకు గురైనట్లు షాపు యజమాని ఫిర్యాదు చేశారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. సీసీ టీవీ ఫుటేజ్ల్లో ఇద్దరు వ్యక్తులు ముసుగులు ధరించి వెళుతున్నట్టు గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
ఆనందం.. ఆవిర్భావం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16 ఆవిర్భావ దినోత్సవం జిల్లా వ్యాప్తంగా గురువారం పండుగలా నిర్వహించారు. జిల్లాలోని ముఖ్య పట్టణాలతోపాటు గ్రామగ్రామాన వేడుకలు జరుపుకున్నారు. వాడవాడలా పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. పలుచోట్ల అన్నదానాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ జనం కోసం పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, తిరిగి అధికారంలోకి రావడం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. – సాక్షి, నెట్వర్క్ భట్టిప్రోలులో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన సమన్వయకర్త వరికూటి అశోక్బాబుబాపట్లలో కేక్ కట్ చేస్తున్న మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతిపర్చూరులో మాట్లాడుతున్న ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి చీరాలలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సమన్వయకర్త కరణం వెంకటేష్బాబు, పార్టీ నాయకులు చెరుకుపల్లిలో కేక్ కట్ చేస్తున్న పార్టీ నాయకులు -
కత్తితో పొడిచి వ్యక్తి హత్య
బాపట్లటౌన్: మండలంలోని ఈతేరులో కత్తితో పొడిచి వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈతేరు గ్రామానికి చెందిన గేరా వెంకటేశ్వర్లు (52), అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ భర్త కట్టా కోటేశ్వరరావు అతనిపై కక్ష పెంచుకున్నాడు. గురువారం ఒంటరిగా కనిపించిన వెంకటేశ్వర్లుపై కూరగాయలు కోసే కత్తితో ఒక్కసారిగా దాడి చేశాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పొన్నూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మార్గంమధ్యలోనే అతను మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. రూరల్ సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని బాపట్ల డీఎస్పీ పి.జగదీష్నాయక్, రూరల్ సీఐ ప్రభాకర్, ఎస్ఐ శ్రీనివాసరావులు పరిశీలించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
పేదలు గర్వపడేలా వైఎస్సార్ సీపీ ఆవిర్భావం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ప్రతి పేదవాడు గర్వపడేలా.. విద్య, వైద్యం, న్యాయం మన హక్కు అని చాటి చెప్పేలా, యువ భావజాలంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ జెండాను మోదుగుల, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ పెత్తందారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా, పేదల సంక్షేమమే ఽకోసం వైఎస్సార్సీపీ పుట్టిందన్నారు. దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ.. దివంగత ముఖ్యమంత్రి డాక్డర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగానో పాటుపడుతున్నారన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని చంద్రబాబు కుటుంబ అవసరాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చేలా వైఎస్ జగన్ దృష్టి సారిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ పదహారేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారే తప్ప.. ఏ రోజు వైఎస్సార్ సీపీ అధికారంలో ఉందా.. ప్రతిపక్షంలో ఉందా అనేది చూసుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, షేక్ గులాంరసూల్, అనుబంధ విభాగాల నేతలు వంగల వలివీరారెడ్డి, పఠాన్ సైదాఖాన్, యర్రెడ్ల వెంకటేష్రెడ్డి, మారంరెడ్డి భాస్కర్రెడ్డి, చింతపల్లి వెంకటరమణ, రమణి, షరిఫుద్దీన్, కొత్తా చిన్నపరెడ్డి, నర్సిరెడ్డి, వెంకాయమ్మ, కోటి తదితరులు పాల్గొన్నారు. -
రూ.70.66 కోట్ల అంచనాలతో బడ్జెట్ ఆమోదం
అధిక ప్రాధాన్యం అభివృద్ధి పనులకు కేటాయింపు చీరాల: చీరాల మున్సిపాలిటీ బడ్జెట్ 2026–27 సంవత్సరానికి రూ.70.66 కోట్ల అంచనాలతో ఆమోదించారు. గురువారం మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు అధ్యక్షతన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. 2025–26 ముగింపు నిల్వ రూ.21.26కోట్లను 2026–27 ప్రారంభ నిల్వగా చూపారు. రూ.70.66 కోట్లు జమలు అవుతాయని అంచనాలు వేశారు. ప్రారంభ నిల్వతో కలుపుకుని రూ.91.93 కోట్లు కాగా, ఖర్చులు రూ.69.72కోట్లు అవుతాయని అంచనా వేశారు. ముగింపు నిల్వ 2026–27గాను రూ.22.20 కోట్లను చూపారు. 2026–27 సంవత్సరానికి గాను ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలు, స్టాంప్ డ్యూటీ, ప్రకటన పన్ను, ట్రేడ్ లైసెన్స్లు, షాపుల అద్దెలు, వాటర్ చార్జీలు, పట్టణ ప్రణాళిక, ఇతర ఫీజులు కలుపుకుని రూ.26.51 కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. 2026–27 సంవత్సరానికి చేపట్టే అభివృద్ధి పనులకు రూ.48.26 కోట్లు, ప్రభుత్వం నుంచి వివిధ పథకాలపై గ్రాంటుల రూపంలో రూ.44.15కోట్లు మంజూరు రూపంలో ఖర్చు చేయవచ్చని బడ్జెట్ను అంచనాలు వేశారు. ఈ బడ్జెట్ను కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఎక్స్అఫిషియో సభ్యుడి హోదాలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ చీరాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. అందుకు తాను ముందుంటానన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: సూర్యలంక బీచ్ను గోవా బీచ్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సు గురువారం కూడా కొనసాగింది. సూర్యలంక బీచ్ అభివృద్ధిపై చర్చ సాగింది. బీచ్ అభివృద్ధిపై రూపొందించిన ప్రణాళిక నివేదికను సీఎంకు అందించారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో ఓపీ చీటీ తీసుకునేందుకు వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ గురువారం మీడియాకు తెలిపారు. ఓపీ చీటి కాలవాలనుకునేవారు 95523 00009 నంబరుకు హాయ్ అని మెసేజ్ పంపిస్తే వాట్సాప్ అందిస్తున్న పలు రకాల వాట్సాప్ సేవలతోపాటు, గుంటూరు జీజీహెచ్ ఓపీ చీటి సేవలు కూడా వస్తాయన్నారు. క్యూలైనులో నిలుచుని ఓపీ తీసుకునే పనిలేకుండా ఏరోజు ఓపీ కావాలని, ఏ డిపార్టుమెంట్కు సంబంధించి ఓపీ కావాలి అని వాట్సాప్ ద్వారా రోగులు ముందస్తుగా ఓపీని బుక్ చేసుకోవచ్చన్నారు. సదరు రోగి జీజీహెచ్కు వచ్చి వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న వివరాలు తెలియజేస్తే తక్షణమే సంబంధిత వైద్య విభాగానికి రిఫర్ చేస్తూ ఓపీ చీటి పొందవచ్చన్నారు. ప్రజలు వాట్సాప్ ఓపీ వైద్య సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ యశశ్వి రమణ కోరారు. -
నేడు ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల
నూజండ్ల:మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో శుక్రవారం కోటిగట్ల ప్రసన్నాంజనేయస్వామి తిరునాళ్ల నిర్వహించనున్నారు. తిరునాళ్ల సందర్భంగా కమిటీ పెద్దల ఆధ్వర్యంలో మొక్కుబడి ప్రభను ఏర్పాటుచేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది గ్రామస్తులంతా ఐకమత్యంతో తిరునాళ్లను జరుపుకోవటం ఆనవాయితీ. నూజండ్ల, రెడ్డిపాలెం, దాట్లవారిపాలెం, మారెళ్లవారిపాలెం, తలార్ల పల్లె, అప్పాపురం తదితర గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులుపాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పెద్దలు తెలిపారు. రేపల్లె: బాపట్ల జిల్లా మైనేనివారిపాలెం గ్రామంలోని శ్రీ గురు నిలయంలో శ్రీగాయత్రీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీనివాస వైభవోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. లక్ష్మీ, పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామికి సుప్రభాత సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో స్వామివారిని, దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం శ్రీ రంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ కై ంకర్యపరులుగా కొడాలి సీతారామయ్య, బసవానంద్, వెంకట అజయ్లు, ఆస్థాన కై ంకర్యపరులుగా పచ్చళ్ల విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. నకరికల్లు: ఆగి ఉన్న లారీని వేగంగా వెళ్తున్న మరో లారీ ఢీకొట్టడంతో ఆగి ఉన్న లారీ బోల్తా పడింది. దీంతో భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటన మండలంలోని చల్లగుండ్ల వద్ద అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై గురువారం జరిగింది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ వైపు నుంచి కోడిగుడ్లు లోడుతో లారీ చెన్నయ్కు బయలుదేరింది. మార్గమధ్యలో చల్లగుండ్ల వద్ద రోడ్డు పక్కన ఆపి డ్రైవర్ వంట చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వెనుకనుంచి వస్తున్న కంటైనర్ లారీ వేగంగా ఢీకొట్టడంతో కోడిగుడ్ల లారీ హైవే పక్కన ఉన్న పొలాలలో బోల్తా పడింది. దీంతో లారీలోని సుమారు రూ.6 లక్షల విలువైన కోడిగుడ్లు పగిలిపోయాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్పై వర్క్షాప్
నరసరావుపేట రూరల్: పరాక్ రాష్ట్రీయ సర్వేక్షణ్పై రెండు రోజులపాటు ఎంఏంఎ కళాశాలలో నిర్వహించిన వర్క్షాప్ గురువారం ముగిసింది. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ప్రతి మండలం నుంచి ఇద్దరు క్లస్టర్ ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్స్, ఇద్దరు ఎస్జీటీలు వర్క్షాప్లో పాల్గొన్నారు. ముగింపు సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు పాల్గొని నేషనల్ అసెస్మెంట్ సర్వే గురించి సమగ్రంగా చర్చించారు. పాఠశాలకు మంచి కరికులం అందించడానికి, జాతీయ, రాష్ట్ర, మండల స్థాయిలో మనం ఏ స్థాయిలో ఉన్నామనేది ఈ వర్క్షాపు ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలో జిల్లా మూడవ స్థానంలో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వర్క్షాపు ఆర్పీలుగా ఏఎంవో పూర్ణచంద్రరావు, ఎం.గుర్రుహ్మం, బాల సౌరయ్య, అబ్దుల్ ఖాదర్లు పాల్గొన్నారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
నెహ్రూనగర్: వారంతా నాలుగు పదులకుపైగా వయస్సు గలవారు. వయస్సుతో పనిలేకుండా పరుగులెత్తారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు మూడు రోజులపాటు స్పోర్ట్స్ మీట్ గురువారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ హనుమంతు, ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు అరుణకుమారి, మణికంఠలు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. మొదటి రోజు 50, 100, 200 మీటర్లు రన్నింగ్, 400 మీటర్లు వాకింగ్, టెన్నికాయిట్, ట్రిపుల్ జంప్, షాట్పుట్, జావెలిన్ త్రో, చెస్, క్యారమ్స్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. నేడు క్రికెట్ ఇతర క్రీడలు ఉంటాయని డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు దుర్గాప్రసాద్, శ్రీలత, ఏఈఎస్లు మారయ్యబాబు, రవీంద్రలు, రాష్ట్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి నరసింహ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామేశ్వరరావు, కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు రమణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు యశోధర దేవి, ఉమ్మడి గుంటూరు జిల్లా కానిస్టేబుల్స్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ అధ్యక్షులు కోటయ్య, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, మినిస్టీరియల్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ -
బాపట్ల
శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,400, గరిష్ట ధర రూ.9,500, మోడల్ ధర రూ.9,000 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం గురువారం 537.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. చీరాల అర్బన్: చీరాల నియోజకవర్గంలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. దివ్యాద్రి అనే వ్యక్తి చీరాల నుంచి రేషన్ బియ్యాన్ని నల్లబ బజారుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది బహిరంగ రహస్యం. ఇటీవల తమకు డబ్బులు వద్దు.. బియ్యం ఇవ్వండని పలువురు మహిళలు ఆందోళనకు దిగటం, పలు రేషన్ షాపుల్లో రిజిస్టర్లోని స్టాకు కన్నా అదనంగా బియ్యం నిల్వలు ఉండటం అందుకు నిదర్శనం. అందుకు కీలక నేత, యువనేతల అండే కారణమని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో సదరు నల్లబజారు వ్యాపారి ఎక్కడన్నా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే డబ్బుతో కొంటా లేదంటే ఎమ్మెల్యే ఆంతరింగికుడితో చెప్పిస్తా అని బీరాలు పోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రేషన్ బియ్యం అక్రమ తరలింపు బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఓ రేషన్ షాపు నుంచి రేషన్ బియ్యాన్ని మినీ వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. దీన్ని ఓ వ్యక్తి గమనించాడు. ఫొటోలు, వీడియోలు తీశాడు. వ్యాన్ డ్రైవర్, లోడింగ్ కూలీలు అంతా ఫొటోలు తీయవద్దని అతడిని వారించారు. దీంతో ఆ వ్యక్తి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల కంటే ముందే వచ్చిన నల్లబజారు వ్యాపారి ఈ క్రమంలో పోలీసుల కంటే ముందు నల్లబజారు వ్యాపారి ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. సదరు వ్యక్తితో వాదనకు దిగాడు. ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలని వాదనకు దిగాడు. పోలీస్ సహాయం కోసం ఎదురు చూస్తున్న ఆ వ్యక్తికి నిరాశే మిగిలింది. ఈ లోపు ఎమ్మెల్యే ఆంతరింగికుడితో మాట్లాడు అంటూ నల్లబజారు వ్యాపారి తన ఫోన్ను ఆ వ్యక్తికి ఇవ్వబోయాడు. చివరకు ఆ వ్యక్తి తన ఫోన్లో తీసిన ఫొటోలు, వీడియోలు డిలీట్ చేశాడు. నల్లబజారు వ్యాపారి ఇదే అదునుగా సరుకుతో సహా వాహనాన్ని పంపించి వేశాడు. అయితే అంతకు ముందే కొందరికి ఆ ఫొటోలను, వీడియోలను పంపినట్లు సమాచారం. చీరాల టు చిలకలూరిపేట నల్లబజారు వ్యాపారి రూటు మార్చాడు. ప్రస్తుతం రేషన్ బియ్యం చీరాల నుంచి చిలకలూరిపేటకు తరలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీలర్లు.. కార్డుదారుల నుంచి కిలో రూ.10 నుంచి రూ.12 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొందరు డబ్బు తీసుకోకుండానే వేలిముద్రలు వేస్తున్నారు. డీలర్లు అలా సేకరించిన బియ్యాన్ని అతనికి విక్రయిస్తారు. డీలర్లకు కిలోకి రూ.14 ఇచ్చి కొనుగోలు చేస్తాడు. చిలకలూరిపేటలో అదే బియ్యం కిలో రూ.24కు విక్రయిస్తాడని ప్రచారం జరుగుతోంది. కిలోకి రూ.10 ఆదాయం అని చెప్పుకుంటున్నారు. రవాణాకు సిద్ధంగా వాహనం 7చీరాల నియోజకవర్గం నుంచి నెలకు సుమారు 10వేల బస్తాల రేషన్ బియ్యం నల్లబజారుకు తరలుతున్నాయి. బస్తాకు 50 కిలోల చొప్పున 10 వేల బస్తాలకు 5 లక్షల కిలోలు. కిలోకి రూ.10 లాభం చొప్పున విక్రయించగా వచ్చే మొత్తం రూ.50 లక్షలు. అందులో కీలక నేత, యువ నేతలకు రూ.20 లక్షలు. తన దందాకు అడ్డంకులు లేకుండా ఉండేందుకు సంబంధీకులను సంతృప్తి పరిచేందుకు, రవాణా, ఇతర ఖర్చులు వెరసి సుమారు రూ.16 లక్షలు. నికరాదాయంగా చెప్పుకునేది నెలకు రూ.14లక్షలుగా ఉంటుందని నల్లబజారు వ్యాపారులు, పలువురు డీలర్లతో పాటు విషయం తెలిసిన వారు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్, జేసీ, విజిలెన్స్, పోలీస్, సివిల్సప్లయిస్ తదితర శాఖల్లోని ఉన్నతాధికారులు దృష్టి సారించి రేషన్ బియ్యం నల్లబజారుకు తరలకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
మార్టూరు: నిశ్చితార్థం చేసుకున్న యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపానికి గురైన తల్లీ కుమార్తె ఎలుకల మందు, గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదులలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక బీసీ కాలనీకి చెందిన సిరికొండ శ్రీనివాసరావు, సుజాత (45) దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె దివ్య (25) ఉన్నారు. కుమారుడు హేమంత్ కుమార్ అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె దివ్య హైదరాబాద్లో మూడేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. దివ్యకు మార్టూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి రావులకొల్లు శేషుబాబుతో పెద్దలు వివాహం నిశ్చయించి గత ఏడాది డిసెంబర్ 14న నిశ్చితార్థం చేశారు. ఈ వేసవిలో వివాహం జరగాల్సి ఉండగా.. ఈ నెల 4న మాట్లాడాలంటూ దివ్యను, ఆమె తల్లిదండ్రులను మార్టూరులోని తన నివాసానికి శేషుబాబు పిలిపించాడు. దివ్యను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కుమార్తె మార్టూరులోనే ఎలుకల మందుతోపాటు గడ్డి మందు కొనుగోలు చేసి ద్రోణాదుల వచ్చి ఇద్దరూ తాగేశారు. మరుసటి రోజు సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న దివ్య, సుజాతను గమనించిన శ్రీనివాసరావు మొదట చిలకలూరిపేట ఆస్పత్రికి... అనంతరం గుంటూరులోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరి్పంచారు. వారం రోజులుగా చికిత్స పొందుతున్న సుజాత, దివ్య ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మృతిచెందారు. సుజాత భర్త శ్రీనివాసరావు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న గుంటూరు పోలీసులు మార్టూరు పోలీసులకు సమాచారం అందించగా దర్యాప్తు చేస్తున్నారు. ఇరువురి మృతికి కారకుడైన శేషుబాబుపై అధికారులు చట్టపరంగా చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. -
నిర్లక్ష్యం పడగలో టీడీపీ పాలన
● ఏరియా వైద్యశాల రోడ్డు మధ్యలో పెద్ద గుంత ● ఆ గుంతను చీరాల పోలవరం ప్రాజెక్టు అని పిలుస్తున్న ప్రజలు ● సదరు పనులకు గత ఏడాదిలోనే డీఎంఎఫ్ నిధులు రూ.55 లక్షలు మంజూరు ● అప్పుడే పరిపాలనాపరమైన ఆమోదం ఇచ్చిన కలెక్టర్ ● నేడు కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఏం జరుగుతుందో.... చీరాల అర్బన్: చీరాలలో తమ దర్పం కోసం పలువురు పాలకులు తప్పులు చేస్తున్నారు. వారి మొప్పు కోసం అధికారులు తందాన అంటున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడి, ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు, నెలకొన్న పరిస్ధితులు అందుకు దర్పణం పడుతున్నాయని చెప్పుకుంటున్నారు. టీడీపీలోని అంతఃకలహాలా, లేకుంటే మరేదైనా కారణం ఉందో కాని గత రెండు నెలలు కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. ఈ క్రమంలో నేడు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగే కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో ఎవరి వాణి, ఏవిధంగా వినిపిస్తుందో వేచిచూడాల్సిందే. ఎవరు పట్టించుకుంటారో.. ● చీరాల ఏరియా వైద్యశాల రోడ్డులో గుంత ఏర్పడి ఏడాదికి పైగా అయినా మరమ్మతులు చేపట్టక పోవటం... గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహ సర్కిల్లో మున్సిపల్ అధికారుల హెచ్చరిక బోర్డును ఖాతరు చేయకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకున్న పాలకవర్గం (టీడీపీ వచ్చాక) తమ విధులను సక్రమంగా నిర్వహించక పోవటం... కాలుష్య కాసారంలా మారిన కుందేరులో కనీసం మురుగు నీటి పారుదలకు అడ్డుగా ఉన్న తూటుకాడను తొలగించకపోవడం అలవాటుగా మారింది. ఈ మూడు అంశాలను ఒంగోలు బైపాస్ రైడర్ బస్సుల్లో ప్రయాణించే వారు నిత్యం చూస్తూనే ఉంటారు. చీరాల పోలవరం ప్రాజెక్టుగా నామకరణం ● ఏరియా వైద్యశాల రోడ్డులో ఏర్పడ్డ గుంతకు కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఆ గుంతకు చీరాల పోలవరం ప్రాజెక్ట్ అని ప్రజలు ముద్దు పేరు పెట్టారు. అక్కడ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పుడో, ఇక్కడ ఈ గుంతను పూడ్చి రోడ్డు వేసేదెప్పుడోనని ప్రజలు మండి పడుతున్నారు. ● సదరు పనికి సంబంధించి డీఎంఎఫ్ (డిస్ట్రక్ట్ మినరల్ ఫండ్) నిధులు రూ.55 లక్షలు గత ఏడాదిలో మంజూరయ్యాయి. అప్పుడే కలెక్టర్ పరిపాలనా పరమైన ఆమోదం ఇచ్చారు. ఈ క్రమంలో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాల్సి ఉన్నా నిబంధనల పేరుతో కాలయాపన చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కౌన్సిలర్లు నోరు మెదపరా? ● నేడు కౌన్సిల్ బడ్జెట్ సమావేశం రెండు నెలల తరువాత జరుగుతోంది. దాదాపు ఇదే చివరి సమావేశం కావచ్చు. కనీసం ఈ సమావేశంలో అయినా కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ప్రజల పక్షాన తమ గళం వినిపిస్తారో, లేదోనని పుర ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏరియా వైద్యశాల రోడ్డులో దెబ్బతిన్న ప్రాంతంలో 50 మీటర్లు మేర పనిచేశాం. మరో 115 మీటర్లు మేర పని చేయాల్సి ఉంది. అందులోనే ఈ గుంత కూడా ఉంది. ఆ పనులకు గాను డీఎంఎఫ్ నిధులు రూ.55 లక్షలు మంజూరయ్యాయి. కలెక్టర్ పరిపాలనా పరమైనా ఆమోదం ఇచ్చారు. తాత్కాలికంగా ఆ గుంతను పూడ్చటం వల్ల సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆగాం. ఈ పనితో పాటు జనరల్ ఫండ్, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి కూడా టెండర్ల ప్రక్రియ జరుగుతోంది. టెండర్ ప్రక్రియ పూర్తయితే కాంట్రాక్టర్తో పనులు వేగవంతంగా చేయిస్తాం. – టి.రఘురామ్, డీఈ, చీరాల మున్సిపాలిటీ -
పార్థసారథి అలంకారంలో నరసింహస్వామి
మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం పార్థసారథి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ ఈవో కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన లంకా నాగేశ్వరరావు కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన పచ్చళ్ళ సుబ్రహ్మణ్యం కుమారులు వ్యవహరించారు. నేడు శ్రీరంగనాయకులు అలంకారం... శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు శ్రీరంగనాయకులు అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈవో సునీల్కుమార్ కోరారు. తాడేపల్లి రూరల్ : కృష్ణానది దిగువ ప్రాంతంలో బ్రిటీష్కాలం నాటి రైల్వే బ్రిడ్జి పిల్లర్లను తొలగించే కార్యక్రమాన్ని రైల్వే అధికారులు చేపట్టారు. మొదటి పిల్లర్ను పగలకొట్టడం ప్రారంభించి బుధవారానికి వారం రోజులు దాటింది. ఆ పిల్లర్ను సగం కూడా పగలకొట్టేందుకు భారీ బ్రేకర్ వల్ల కావడం లేదు. నల్లరాయి, సిమెంట్తో కట్టిన ఈ బ్రిడ్జి చాలా దృఢంగా ఉంది. సగం వరకు పిల్లర్ను పగలకొట్టి పెద్ద పెద్ద జేసీబీలు తీసుకువచ్చి తోసినా పిల్లర్లను కదలించలేకపోతున్నారు. కృష్ణానదిలో మొత్తం 15 పిల్లర్లు ఉన్నాయి. రైల్వే అధికారులు ఈ పిల్లర్లను తొలగించి డబుల్లైన్ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక పిల్లర్ పగలకొట్టడానికి సుమారు 15 రోజుల వ్యవధి పడుతుందని, 15 పిల్లర్లు తొలగించాలంటే రెండు బ్రేకర్లు 5 నెలలు సమయం పడుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఇండియన్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ సొసైటీ ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే పురస్కారాల్లో భాగంగా గుంటూరుకు చెందిన శాఖమూరు పద్మ పెయింటింగ్స్ అండ్ క్లే క్రాఫ్ట్స్ విభాగంలో ‘ఇండియా ఆర్ట్స్ 2026’ అవార్డు పొందారు. ఈ మేరకు బుధవారం శాఖమూరు పద్మ అవార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. సైన్స్లో బీఈడీ పట్టభద్రురాలైన పద్మ కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసి, పెయింటింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్పై ఉన్న మక్కువతో ఆయా అంశాల్లో బోధకురాలిగా మారారు. ఐదేళ్ల వయసు మొదలు అన్ని వయసుల వారికి వారి ఆసక్తికి అనుగుణంగా ఆర్ట్స్ నేర్పుతున్న పద్మ ప్రస్తుతం గుంటూరు జిల్లా లాం లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విభాగంలో పనిచేస్తున్నారు. -
కాంట్రాక్టర్లకు గుబిల్లు
● చీరాల మున్సిపాలిటీలో పేరుకుపోయిన బిల్లులు ● పనులు చేసినా అందని బిల్లులు ● 17తో ముగియనున్న కౌన్సిల్ పదవీకాలం ● కాంట్రాక్టర్లలో నెలకొన్న అసంతృప్తి ● సుమారు రూ.4 కోట్ల మేర బిల్లులు నిలిచిన వైనం ● నేడు వాడవాడలా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం ● విలేకరుల సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ – రఘురాం, మున్సిపల్ డీఈ -
హెడ్ కానిస్టేబుల్ వీరరాజుకు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు
వేటపాలెం: అనారోగ్యంతో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్కు పోలీస్ లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. వేటపాలేనికి చెందిన జి. వీరరాజు ఇంకొల్లులో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకొన్నారు. ఈ నెల 9వ తేదీన గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చీరాలలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్, ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య, ఎస్సై జి.సురేష్, వేటపాలెం ఎస్సై జీపీ జనార్దన్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియాజేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి ఎస్పీ బి. ఉమామహేశ్వర్ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అనంతరం మృతదేహానికి పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వేటపాలేనికి చెందిన వీరరాజు 1991లో ఏఆర్ కానిస్టేబుల్గా శాఖలో ప్రవేశించారు. -
హత్య కేసును ఛేదించిన రైల్వే పోలీసులు
వివరాలు వెల్లడించిన జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని పెదకాకాని రైల్వే స్టేషన్లో ఈనెల 4వ తేదీన జరిగిన హత్యకేసు మిస్టరీని గుంటూరు రైల్వే పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను మంగళవారం రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు అరెస్టు చూపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4వ తేదీన పెదకాకాని రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ చివర భాగంలో ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి హత్యకు గురి అయినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. ఘటనా ప్రదేశ ంలో మృతి చెందిన వ్యక్తిని పరమడం అనీష్(40) అలియాస్ బ్లేడ్గా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును డీఎస్పీ అక్కేశ్వరరావు పర్యవేక్షణలో జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు రైళ్లలో దొంగతనాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడని మృతుడి పై చైన్నె, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో పలు దొంగతనాలు, నేరాలకు పాల్పడిన కేసులు నమోదు అయినట్లు విచారణలో తెలిసింది. మృతుడు అనీష్ తనతో కలిసి దొంగతనాలు చేసే తోటివారిని నిత్యం వేధిస్తుండటం.. ఆధిపత్య పోరు ప్రధాన కారణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. వీరందరినీ పలు రైల్వే స్టేషన్లలో బ్లేడ్ బ్యాచ్గా పిలుస్తారని, మృతుడు అనీష్ దొంగతనం చేసిన సొత్తులో ఎక్కువ భాగం తనకు ఇవ్వాలని, తోటి సహచరులపై ఒత్తిడి తేవడం వారిని కూడా పలు మార్లు బ్లేడ్తో కోస్తా అని బెదిరించడం వల్ల ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనీష్ వేధింపులను తాళలేక ఈనెల 4వ తేదీన హతమార్చేందుకు పథకం రూపొందించారు. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఎఫ్.కుమార్ అలియాస్ అంతోని కుమార్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్న దీపేష్ ఎం.ఎస్, అలియాస్ మెంటల్ భాయ్, అనంతపురంకు చెందిన కొప్పుల వెంకటేష్ అలియాస్ వెంటి, అలియాస్ వెంగీ భాయ్లు పెదకాకాని రైల్వే స్టేషన్లో అనీష్పై బ్లేడ్లతో దాడి చేసి అతి కీరాతకంగా హతమార్చి పరారయ్యారు. ఈనెల 9వ తేదీన సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్–1లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నించగా వారిని జీఆర్పీ సీఐ అంజిబాబు పట్టుకుని స్టేషన్కు తరలించి విచారించగా అనీష్ను హత్య చేసినట్లు అంగీకరించారు. వీరందరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఈ కేసును ఛేదించిన జీఆర్పీ సీఐ జి.అంజిబాబు, ఆర్పీఎఫ్ ఎస్ఐ మహబూబు సుభాని, కానిస్టేబుల్లు వలి, మస్తాన్, ఆర్పీఎఫ్ సీఐ వీరబాబు, శంకర్, ఆర్పిఎఫ్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్, ఏఎస్ఐ శ్రీనివాస్ సిబ్బందిని డీఎస్పీ, రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు. -
ఏఎన్యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ సంవత్సరానికి రెండేళ్ళ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సులలో ప్రవేశ పరీక్ష షెడ్యూల్ను దూరవిద్య కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ విడుదల చేశారు. ప్రవేశ పరీక్ష కేంద్రాలు: సెంటర్ ఫర్ డిస్టెనన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), విజయ దుర్గ డిగ్రీ కాలేజ్ (కర్నూలు), ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ (అనంతపూర్), విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్ డిగ్రీ కాలేజ్ (మాచర్ల), ఎస్బీఎస్వైఎం డిగ్రీ కాలేజ్( మైదుకూరు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం) మొత్తం 12 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఏపీ ఐసెట్ 2025లో అర్హులకు మినహాయింపు.. ఏపీ ఐసెట్–2025లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వర్సిటీ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను, ర్యాంక్ కార్డులు పొందవచ్చని దిట్టకవి ఆచార్య రామచంద్రన్ పేర్కొన్నారు. -
పోక్సో కేసులో హెచ్ఎంకు జైలు, జరిమానా
ఇంకొల్లు(చినగంజాం): బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన హెడ్మాస్టర్కు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించినట్లు ఎస్సై జి. సురేష్ మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. 2019లో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న కొడవలివారిపాలెం గ్రామానికి చెందిన నిందితుడు బడుగు వీరయ్య (40) ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నేరాన్ని తగిన సాక్ష్యాధారాలతో నిరూపించడంతో ఒంగోలు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి కె. శైలజ మంగళవారం తీర్పు ఇచ్చినట్లు తెలిపారు. నిందితుడికి మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.8 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి నగరం: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని సజ్జావారిపాలెంలో జరిగింది. ఎస్ఐ బండ్ల భార్గవ్ సమాచారం మేరకు రేపల్లె–నిజాంపట్నం రహదారిలో సజ్జావారిపాలెం మసీదు వద్ద ఈనెల 5వ తేదీన నడుచుకుంటూ వెళ్తున్న సుమారు 35 సంవత్సరాల వయసుగల గుర్తు తెలియని వ్యక్తిని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యక్తికి గాయాలు కావడంతో 108 ద్వారా నగరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యసేవల కోసం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ భార్గవ్ మంగళవారం వెల్లడించారు. ఈ ఘటనపై గ్రామ వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి సమాచారం తెలిసిన వారు. నగరం పోలీసువారిని లేదా 9440900877ను సంప్రదించాలని కోరారు. గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి మంగళగిరి టౌన్: ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కొలసాని వెంకటేశ్వరరావు(60) మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. విజయవాడ రామవరప్పాడులో నివాసముంటున్న కొలసాని వెంకటేశ్వరరావు 1980లో ఏపీఎస్పీ కానిస్టేబుల్గా చేరారు. 2005లో ఏఆర్ కానిస్టేబుల్గా, 2019లో సివిల్ పీసీగా బదిలీ అయ్యి గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. సివిల్ కానిస్టేబుల్గా ఉంటూ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీలోని డాగ్ స్క్వాడ్లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈయనకు 2008లో గుండెజబ్బు రావడంతో స్టంట్స్ వేశారు. 2011లో బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంగళగిరిలోని ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్ గ్రౌండ్లో పీపీటీ టెస్ట్లో వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మంగళగిరి ఎయిమ్స్కు తరలించగా, పరీక్షించిన వైద్యులు వెంకటేశ్వరరావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాగార్జుననగర్లో వివాహిత బలవన్మరణం సత్తెనపల్లి: వివాహిత బలవన్మరణానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని నాగార్జుననగర్లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగార్జుననగర్కు చెందిన జెల్లి ఆదిలక్ష్మి (28) ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మ రణానికి పాల్పడింది. మృతురాలికి భర్త నాగరాజు, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 10 ఏళ్ల క్రితం వివాహం కాగా కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన ఆదిలక్ష్మీ తిరిగి వచ్చింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడికి గురౌతూ బలవన్మరణానికి పాల్పడింది. తన మరణానికి ఎవరు కారకులు కాదని, భర్త, అత్త,మామలు మంచి వాళ్ళు అంటూ ఆమె లేఖ రాసింది. బలవన్మరణానికి గల కారణం ఏమిటనేది రాయలేదు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్ఐ పి. పవన్కుమార్ క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లి కిలారి తిరుపతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు బ్రాంచి కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం నకరికల్లు: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మండలంలోని కండ్లకుంట సమీపంలోని గుంటూరు బ్రాంచి కెనాల్లో గుర్తించినట్లు ఎస్ఐ కె.సతీష్ మంగళవారం తెలిపారు. గుర్తించిన వ్యక్తికి సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందన్నారు. లేత ఆకుపచ్చ రంగు నిక్కరు, సిమెంట్రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు తెలిపారు. కేసీపీ పవర్ప్లాంటు–4 వద్ద మృతదేహం లభ్యమైందన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని మార్చురీకి తరలించామన్నారు. ఆచూకీ తెలిసినవారు 9440796246, 9966460427 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఉపాధి పనులు సక్రమంగా చేయాలి
వేమూరు: గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరగకుండా పని చేయించాలని డ్వామా జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఎ. విజయలక్ష్మి తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సామాజిక తనిఖీ ప్రజా వేదిక మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వేతనాల వివరాలపై కూలీలకు అడిగి తెలుసుకున్నారు. చిన్న తప్పుల వల్ల రూ. 30 వేల వరకు రికవరీ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవి కుమార్, హెచ్ఆర్ మేనేజర్ చంద్రశేఖర్, సతీష్, సత్య కృష్ణ, సామాజిక తనిఖీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఆరోగ్యమూ ముఖ్యమే
బాపట్ల: ప్రతి విద్యార్థికి చదువుతోపాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని ఎన్సీడీ సీడీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. స్థానిక బధిరుల పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న వెదుళ్ళపల్లి వైద్యులను అభినందించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టరు విజయమ్మ మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని చెప్పారు. ఆర్కేఎస్కే స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నిర్మలగ్లోరీ, డీఐఓ సీహెచ్ రత్న మన్మోహన్, డాక్టర్ లలితా రాజేశ్వరి, సౌజన్య, లక్ష్మీసౌజన్య, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అవయవ దానంపై అవగాహన అవసరం బాపట్ల టౌన్: అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ తెలిపారు. శిబిరానికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన బాపట్ల ఏరియా వైద్యశాలలో అవయవదానంపై అవగాహన, నమోదు శిబిరం జరుగుతుందన్నారు. బ్రెయిన్ డెడ్ సందర్భంలోనే దాతల అవయవాలను తీసుకొని, అవసరమైన వారికి వినియోగిస్తారని తెలిపారు. దాతలు తమ ఆధార్ కార్డు వివరాలతో ఈ శిబిరంలో పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కే సిద్ధార్థ, కార్యదర్శి డాక్టర్ పి.సి. సాయిబాబు, సభ్యులు కె. అనిల్ కుమార్, పి. ప్రసాదరావు పాల్గొన్నారు. -
చర్చిస్తారా.. చాలిస్తారా..?
చీరాల అర్బన్: పాలకవర్గం పారదర్శకంగా పని చేయాలి. ప్రజల పక్షాన నిలవాలి. కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పట్టణ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతినిధులుగా గళం విప్పాలి. తప్పొప్పులపై సమగ్ర చర్చ జరగాలి. అంతిమంగా పురప్రజల ప్రయోజనాలు, పట్టణ అభివృద్ధే లక్ష్యంగా పాలకులు, అధికారుల అడుగులు ఉండాలి. వైఎస్సార్ సీపీ హయాంలో ఆ పంథా నడిచింది. అయితే టీడీపీకి పాలకవర్గం పగ్గాలు అందాక వాటికి తిలోదకాలు ఇచ్చారు. ప్రజా సమస్యలను, పట్టణాభివృద్ధికి గాలికి వదిలేశారు. కనీసం నెలకు ఒకసారి నిర్వహించే కౌన్సిల్ సాధారణ లేదా అత్యవసర సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడంలో విఫలమయ్యారు. గత రెండు నెలలు కౌన్సిల్ సమావేశాలు జరగకపోవటం అందుకు నిదర్శనం. టీడీపీలోని అంతర్గత కుమ్ములాటలే కారణమని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. వారి విభేదాలతో ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేయటం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భారీ మొత్తంలో బకాయిలు పన్నులు, అద్దెలు వసూళ్లకు సంబంధించి పాలకవర్గానికి చెందిన వలువురికి బినామీలుగా ఉన్నవారి మొండి బకాయిలు అధికారులకు తలనొప్పిగా మారాయి. స్థానిక గడియార స్తంభం సెంటర్లోని రావు గారి బిర్యానీ హౌస్ బకాయి సుమారు రూ.40 లక్షల వరకు ఉంది. ఆ హోటల్ నిర్వాహకుడు చైర్మన్ మించాల సాంబశివరావుకు బినామీ కావటంతో అధికారులకు ఆ బకాయి వసూలు చేయటం కష్టతరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఇలానే మరికొన్ని మొండి బకాయిలు ఉన్నట్లు సమాచారం. మున్సిపల్ పాలకవర్గానికి గురువారం జరగబోయే బడ్జెట్ సమావేశం దాదాపు చివరిది కావచ్చు. 17వ తేదీతో వారి పదవీకాలం ముగియనుండటం అందుకు కారణం. మధ్యలో రెండు నెలలు కౌన్సిల్ సమావేశాలు జరగలేదు. అది ప్రత్యక్షంగా చైర్మన్ సాంబశివరావు, పరోక్షంగా ఎమ్మెల్యే కొండయ్యల వైఫల్యమేనని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో కనీసం చివరి సమావేశంలోనైనా మొండి బకాయిల వసూళ్లకు సంబంధించి మాట్లాడతారా.. మమ అనిపిస్తారా.. అనే చర్చ జనాల్లో నడుస్తోంది. హుందాగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. మొండి బకాయిలుగా గుర్తింపు పొందినవి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ నేపథ్యం ఉన్న వారివే సింహభాగం ఉన్నాయి. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే బకాయిలు ఉండకూడదు... ముందస్తుగా చెల్లించండని హితోపదేశం చేస్తున్నారు.పన్నులు, అద్దె బకాయిల వసూళ్లుకు మా వంతు బాధ్యతలు మేం నిర్వహిస్తున్నాం. రావు గారి బిర్యానీ హౌస్కు సంబంధించిన బకాయి కూడా ఒకటి, రెండు రోజుల్లో మున్సిపల్ ఖజానాకు జమయ్యేలా కార్యాచరణ చేపట్టాం. అందరూ బకాయిలు చెల్లించి సహకరించాలని కోరుతున్నాం. బకాయిలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న విషయాన్ని కూడా గుర్తెరగాలని సూచిస్తున్నాం. – మాల్యాద్రి, ఆర్ఓ, చీరాల మున్సిపాలిటీ -
అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం
నాదెండ్ల: గణపవరం జాతీయ రహదారి వద్ద శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయ తొలి వార్షికోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తుల దర్శనార్ధం ప్రత్యేక క్యూలైనులు ఏర్పాటు చేశారు. ఆలయ పూజారులు పి. లక్ష్మీనారాయణ, కన్నా శాస్త్రి భక్తుల గోత్రనామపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం భారీ అన్నదానం చేశారు. కార్యక్రమాలను మాజీ సర్పంచ్ వలేటి హిమంతరావు, గణపవరం మద్ది లక్ష్మయ్య కంపెనీ ముఠాకూలీలు, కార్మికులు, సిబ్బంది పర్యవేక్షించారు. వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరు గ్రామ దేవతలు ముత్యాలమ్మ, కట్లమ్మ, మహాలక్ష్మమ్మ, పరివార దేవతల ఆవరణలో మంగళవారం అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి నెల రెండవ మంగళవారం జరపతలపెట్టిన కార్యక్రమంలో భాగంగా భక్తులు, వివిధ భజన మండలి వారు పాల్గొని చాలీసా పారాయణం చేశారు. స్వామి వారికి పూజలు చేశారు. తెనాలి: మండల గ్రామం అంగలకుదురులోని పంచాయతీ కార్యాలయం వద్ద గల సాయిబాబా సత్సంగ కేంద్రం 31వ వార్షికోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన చేశారు. అనంతరం హారతి, రాత్రి 8 గంటల వరకు సాయిబాబా నామ సంకీర్తనను జరిపారు. ఉదయం 10 గంటలకు భజన, 11 గంటలకు వెస్ట్బెర్రీ స్కూల్ ప్రిన్సిపాల్, ప్రవచనకర్త టీవీ సుబ్రహ్మణ్యంచే సత్సంగం జరిగాయి. మధ్యాహ్నం హారతి, అనంతర ప్రసాద వినియోగం చేశారు. సాయంత్రం అంగలకుదురులో శ్రీరామభక్త హనుమాన్ మహిళా కోలాట బృందంచే కోలాటంతో సాయిబాబా నామ సంకీర్తనలతో పురవీధుల్లో చిత్రరాజాలను ఊరేగించారు. రాత్రి అన్నప్రసాద వినియోగం జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పట్నంబజారు(గుంటూరుఈస్ట్):అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం మహిళ దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.సాంబ్రాజ్యం అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు. మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు జి.సౌజన్య, ఎ.ఉషాకిరణ్ పాల్గొన్నారు. ఆర్టీసీ సర్వీసుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు, నగదు పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
కలెక్టర్ ఉత్తర్వులూ బేఖాతర్!
చీరాల అర్బన్: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు ఆధ్వర్యంలో పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు కలెక్టర్ను కలిశారు. గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహ సర్కిల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని రాత పూర్వకంగా కోరారు. దీనిపై కలెక్టర్ వి.వినోద్కుమార్ స్పందించారు. వెంటనే ఫ్లెక్సీలను తొలగించాలని డీఎస్పీ మహ్మద్ మొయిన్కు చెప్పారు. వివాదాలకు తావులేకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంగా డీఎస్పీ కలెక్టర్కు వివరించారు. ఆ సమాధానానికి కలెక్టర్ సంతృప్తి చెందలేదు. కేవలం అక్కడ మాత్రమే కాకుండా ఎక్కడైనా విగ్రహాల వద్ద ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని, వాటిని తొలగించాలని డీఎస్పీకి కలెక్టర్ చెప్పారు. అయితే మంగళవారం సాయంత్రం వరకు వైఎస్సార్ సర్కిల్లోని ఫ్లెక్సీలు అలానే ఉన్నాయి. దీంతో కలెక్టర్ ఉత్తర్వులను కూడా అమలు చేయరా అని జనాల్లో చర్చ నడుస్తోంది. మున్సిపల్ హెచ్చరిక బోర్డు ఉన్నా.. గడియార స్తంభం సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహ సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు లేదా హోర్డింగులు ఏర్పాటు చేయకూడదని మున్సిపల్ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయినా టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు, పోలీస్ వారికి సంబంధించిన ఫ్లెక్సీ ఒకటి, ఓ విద్యా సంస్థకు చెందిన ఫ్లెక్సీ ఒకటి వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేశారు. దీనిపై గతంలో మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసెఫ్ను వివరణ అడగ్గా గతంలో టౌన్ ప్లానింగ్ వారు ఆ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ఉంటారు. పరిశీలించి తగిన చర్యలు చేపడతామని చెప్పారు. అయితే ఆ తరువాత కూడా అక్కడ ఫ్లెక్సీలు సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ ఉన్న ఫ్లెక్సీలను తొలగించలేదు. కవ్వింపు చర్యలు గతంలో టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు సమయంలో జరిగిన సంఘటనలు కవ్వింపుకు దారి తీశాయి. అయినప్పటికీ వైఎస్సార్ సీపీ నాయకులు శాంతియుతంగా అక్కడ ఫ్లెక్సీని తొలగించాలని ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఆ క్రమంలో పోలీసులు అక్కడున్న ఫ్లెక్సీని తొలగించారు. అయితే ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలో అదే ఫ్లెక్సీ అక్కడ వెలిసింది. అందుకు టీడీపీ రాజకీయ ఒత్తిడే కారణమనేది బహిరంగ రహస్యం. అదే రీతిలో వైఎస్సార్ సీపీ కూడా ఆలోచిస్తే పరిస్థితి ఏంటనే కోణంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. పోలీస్శాఖకు సంబంధించిన ఫ్లెక్సీ ఉన్న ఫ్లెక్సీ వివాదం చాలదన్నట్లు పోలీస్శాఖకు సంబంధించిన ఓ ఫ్లెక్సీని స్థానిక పోలీసులు అదే సర్కిల్లో ఏర్పాటు చేశారు. వివాదాలకు తావులేకుండా ఉండేందుకు తాము ఫ్లెక్సీ అక్కడ పెట్టామనేది పోలీస్ వాదన. అయితే సర్కిల్లో ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదనేది ప్రజల ప్రశ్న. రాజశేఖర్రెడ్డి విగ్రహ సర్కిల్లో ఎలాంటి ఫ్లెక్సీలు లేదా హోర్డింగులు ఏర్పాటు చేయకూడదనే మున్సిపల్ హెచ్చరిక బోర్డు సంగతి ఏంటి?. పాలన సాగిస్తున్న పాలకపక్షం నాయకులు, లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన పోలీసులు ఆ సర్కిల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్లు? ఆ హెచ్చరిక బోర్డు వారికి వర్తించదా అని ప్రజలు విమర్శిస్తున్నారు. అంతిమంగా కలెక్టర్ మాటలను కూడా ఖాతరు చేయరా అని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా వాస్తవాలను, జరుగుతున్న పరిణామాలను ప్రజలు సునిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని అటు పాలకులు, ఇటు అధికారులు గుర్తెరగాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేదంటే సరైన సమయంలో సరైన సమాధానం చెప్తారని వ్యాఖ్యానిస్తున్నారు. -
పట్టణ ప్రణాళికపై ఏసీబీ కన్ను
నగరంపాలెం: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) ప్రధాన కార్యాలయ ఆవరణలోని పట్టణ ప్రణాళిక విభాగంలో మంగళవారం ఉమ్మడి గుంటూరు ఏసీబీ అధికార, సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే నేతృత్వంలో నలుగురు సీఐలు నాగరాజు, సుబ్బారావు, సురేష్, మన్మథరావు, ముగ్గురు ఎస్ఐలు సిబ్బంది ఒక్కసారిగా బృందాలుగా ఏర్పడి ఉదయం 11 గంటల తర్వాత గుంటూరు జీఎంసీకి చేరుకున్నారు. మొదటి అంతస్తులోని పట్టణ ప్రణాళిక విభాగంలోకి వెళ్లారు. అందులో కార్యాలయపు రికార్డులను నిశితంగా పరిశీలించారు. ఆన్లైన్ ఫిర్యాదులను పరిశీలించారు. ఎక్కువగా వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి, తనిఖీలు చేశారు. అనంతరం పట్టణ ప్రణాళిక విభాగపు సిటీ ప్లానర్ రాంబాబుతో మాట్లాడారు. ఇటీవల ఆన్లైన్, నేరుగా వచ్చిన ఫిర్యాదులపై సిటీ ప్లానర్ను ఆరాతీశారు. కీలక రికార్డులు స్వాధీనం అప్పటికే కార్యాలయంలో కూర్చుని ఉన్న ఇద్దరితో మాట్లాడారు. ఓ పని నిమిత్తం వచ్చానని, గతంలో ఒకరికి కొంత మొత్తంలో ముట్టజెప్పినట్లు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే సదరు అధికారి ఎవరనేది ఫిర్యాదు చేప్పేందుకు నిరాకరించినట్లు సమాచారం. అంతేగాక పట్టణ ప్రణాళిక విభాగపు అధికార, సిబ్బందితోనూ ఏసీబీ అధికారులు చర్చించారు. వివిధ ఫైళ్లకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. పలువురు అధికారులను విచారించారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలపై ఆరా తీస్తున్నారు. కీలకమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిబంధనల ఉల్లంఘనలు, వరుస ఫిర్యాదుల దృష్ట్యా కార్యాలయపు సిబ్బందిని సైతం విచారిస్తున్నారు. అనంతరం ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మత్తే మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగానికి రెగ్యులర్గా వచ్చే ఫిర్యాదులపై పరిశీలన చేస్తున్నామని అన్నారు. బుధవారం సైతం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. మధ్యాహ్నా వేళ ఏసీబీ జేడీ (విజయవాడ) సురేష్బాబు గుంటూరు నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చారు. ఏఎస్పీ మహేంద్ర మత్తేతో కాసేపు మాట్లాడారు. అనంతరం ఏఎస్పీకి సిబ్బందికి జేడీ పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలు దాదాపు రాత్రి వరకు కొనసాగాయి. ఏసీబీ తనిఖీలతో జీఎంసీ ఆవరణలోని మిగతా విభాగపు అధికార, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. -
సమస్యలు పరిష్కరించే వరకు కదలం
పర్చూరు(చినగంజాం): వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై మండలంలోని నాగులపాలెం గ్రామానికి చెందిన ప్రజలు మంగళవారం రహదారి నిర్మాణంతో తమకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించాలంటూ రోడ్డెక్కారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వాహనాలను అడ్డుకొని తీరతామని వారంతా ధర్నా నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణం చేయటం ద్వారా నాగులపాలెం గ్రామానికి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. తమ గ్రామానికి జాతీయ రహదారి నుంచి సర్వీసు రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించకపోతే వర్షాకాలంలో వరద ముంపు వల్ల గ్రామంతోపాటు తమ పొలాలు మునిగిపోయే ప్రమాదముందని రైతులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి జాతీయ రహదారితో అనుసంధానిస్తూ సర్వీసు రోడ్డు ఏర్పాటు చేయకుంటే గ్రామ ప్రజలు, విద్యార్థులు కిలోమీటర్ల మేర నడచి వెళ్లి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిలిచిన ట్రాఫిక్.. గ్రామస్తుల నిరసనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ వాహనాలు నిలిచిపోయింది. అధికారులు వచ్చి సమస్యను పరిష్కారమార్గం చూపే వరకు నిరసన విరమింపబోమని రైతులు, ప్రజలు స్పష్టం చేశారు. స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి వచ్చి రైతులు, గ్రామ ప్రజలతో మాట్లాడారు. అధికారులు ఆర్డీవో గ్లోరియా, డీఎస్పీ జగదీష్ నాయక్, తహసీల్దార్ బ్రహ్మయ్యలు అక్కడకు చేరుకొని రైతులకో సర్వీసు రోడ్డు చర్యలు తీసుకుంటామని, డ్రైనేజీ ఏర్పాటుకు సత్వరం చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. 20 కి.మీలోపు వాహనాలు కలిగిన వారికి నెలవారి పాసులు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు, రైతులు నిరసన విరమించారు. -
ఆక్వా రైతుల గుండె చెరువు
ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆక్వా రైతుల గుండె చెరువవుతోంది. సాగు కోసం సిద్ధం చేసిన చెరువులను సైతం ఇప్పుడు ఖాళీగా ఉంచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతి ఏడాది జనవరి మాసంలో చెరువులను సిద్ధ్దం చేసి, ఫిబ్రవరి మొదటి వారంలో రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టేవారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి సాగునీరు డ్రైన్లకు విడుదల కాలేదు.బాపట్ల: సముద్రంలో ఉన్న నీరు పోటు సమయంలో కాలువల్లోకి భారీగా చేరడంతో కాలువ నీటిలో ఉప్పుశాతం భారీగా పెరిగింది. సాధారణంగా ఫిబ్రవరి, మార్చి మాసాలలో రొయ్యల సాగుకు అనుకూలమైన పేరలి డ్రైయిన్, వెదుళ్ళపల్లి డ్రైయిన్లో ఉప్పుశాతం (సెల్ నీటి శాతం) 15 వరకు ఉండేది. ఈ ఏడాది అది కాస్తా 30 శాతానికి పెరిగింది. ఇంత ఉప్పుశాతంలో రొయ్యల సాగుకు శ్రీకారం చుడితే వాటి పెరుగుదల నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. సాగు చేసే రైతులు ఈ కారణంగానే జంకుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ప్రతి ఏడాదిలానే ఈ సారి కూడా ఆక్వారైతులు జనవరి మాసంలో చెరువులను సిద్ధం చేసేందుకు బయట వ్యాపారుల నుంచి వడ్డీలకు నగదు తీసుకొచ్చారు. ఎకరం చెరువును సిద్ధం చేయటానికి ట్రాక్టర్ సహాయంతో నాలుగుసార్లు దుక్కి దున్నినందుకు రూ. 3 వేలు, చెరువు చదరంగంగా ఉండేందుకు లెవలింగ్ చేసినందుకు ట్రాక్టర్కు రూ. 5 వేలు, జేసీబీ సహాయంతో కట్టలు ఎగుపోసినందుకు గంటకు రూ. వెయ్యి చొప్పున చెరువు పూర్తిగా శుభ్రం చేసేందుకు సుమారు రూ.4 వేలు, రొయ్యల చెరువులో భూమి నుంచి అంటువ్యాధులు ప్రబలకుండా భూమిలోనే జిప్సమ్ వాడకం, రొయ్యలకు పోషకాలను సమృద్ధిగా అందించేందుకు వర్మీకంపోస్ట్, చెరువులకు సాగునీటిని అందించేందుకు అవసరమైన కాలువలు, రొయ్యలకు గాలి అందించే ఎయిర్రేటర్స్ మరమ్మతులు, కల్వర్ట్ మరమ్మతులు.. ఇలా అన్నీ కలిపి ఎకరం చెరువుకు రూ. 50 వేల వరకు ఖర్చు చేశారు. ఈ ఏడాది కాలువల్లో ఉప్పుశాతం ఎక్కువగా ఉండటంతో సాగు ప్రశ్నార్థంకంగా మారిందని ఆక్వా రైతులు వాపోతున్నారు. -
వైభవంగా విఘ్నేశ్వరుని ఆలయ వార్షికోత్సవం
రేపల్లె: పట్టణంలోని పెదకూరగాయల మార్కె ట్ సమీపంలో వేంచేసియున్న శ్రీసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవలతో పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేక మహోత్సవాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నసంత ర్పణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తెనాలి: శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఈనెల 13వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు బుర్రిపాలెంరోడ్డులోని శ్రీమహాత్మ సేవాశాంతి ఆశ్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి, ఆశ్రమవాసులకు అన్నదానం చేయటానికి నిర్ణయించినట్టు సంఘ నాయకులు వేజండ్ల శివన్నారాయణ, నిమ్మలూరి కమలాకరరావు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. శాలివాహన సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘ నాయకులు మోదుకూరి శివరామకృష్ణప్రసాద్, నాంచార య్య, అయ్యవార్లు, క్రిష్టరావు, శంకరరావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఉరిటి శ్రీనివాసరావు, పి.జ్వాలారావు, వి.నాగరాజు, ఎం.శ్రీనివాసరావు తదితరులున్నారు. మంగళగిరిటౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సోమవా రం గోవర్ధనోద్ధరణ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శెనగల రామహనుమాన్, శేషాంజనేయ గోపాల్లు వ్యవహరించగా, ఆస్థాన కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు. గుంటూరువెస్ట్: జి. రామ్. జి – గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పమని గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. వికసిత్ భారత్– జి. రామ్. జి పోస్టర్ను సోమవారం గుంటూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విడుదల చేశారు. జేసీ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం, ఉపాధికి కొత్త హామీగా జి రామ్ జి నిలుస్తుందన్నారు. 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తుందన్నారు. సమయానికి కూలి చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారం వంటి అంశాలను ఇందులో చేర్చారన్నారు. -
ఎయిమ్స్లో తొలిసారిగా ట్రాన్స్–హ్యూమరల్ రీప్లాంటేషన్
మంగళగిరి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో ఓ వ్యక్తికి ట్రాన్స్ హ్యూమరల్ రీ ప్లాంటేషన్ చేశారు. తెగిపోయిన చేతిని ఎయిమ్స్ ప్లాస్టిక్ సర్జన్లు తిరిగి జోడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ జార్ఖండ్కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి విజయవాడలోని హనుమాన్జంక్షన్ సమీపంలో రోడ్డు నిర్మాణ సంస్థలో మిషన్లోడ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. గత నెల 22వ తేదీన మిషన్లో చేయి ఇరుక్కుపోయి తీవ్రంగా నుజ్జునుజ్జు అయ్యింది. అదేరోజు మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాల అత్యవసర విభాగానికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చారు. వైద్యబృందం రోగికి పరీక్షలు నిర్వహించి, వైద్య సేవలు అందించింది. అరుదైన, అత్యంత క్లిష్టమైన మైక్రో వాస్క్యులర్ ప్లాస్టిక్ సర్జరీని డాక్టర్ శాంతకుమార్, డాక్టర్ శివలింగప్ప నేతృత్వంలోని బృందం, డాక్టర్ లిఖిత రెడ్డి, డాక్టర్ మనోజ్లు సుమారు 8 గంటల పాటు నిర్వహించారని, ప్లాస్టిక్ సర్జరీ, అనస్తీషియా బృందాలు ఈ శస్త్ర చికిత్సలో రక్తం ప్రసరించేలా చేసి చేతిని కాపాడారని పేర్కొన్నారు. తెగిపోయిన భాగాన్ని సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఎయిమ్స్ వైద్యశాలలో నైపుణ్యం గల వైద్యులు ఉండడం వల్ల ఈ శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం 14 రోజులు క్రిటికల్ కేర్ యూనిట్లో నిశితంగా పరిశీలించామని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉందని, వార్డులో కోలుకుంటున్నాడని, తదుపరి పరీక్షల అనంతరం డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులను ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ అభినందించారు. -
ఆదాయ వనరుగా సముద్రపు మొక్కల సాగు
చినగంజాం: మత్స్యకార మహిళలకు సముద్రపు మొక్కల సాగు మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడుతుందని సెంట్రల్ సాల్ట్ అండ్ మైరెన్ కెమికల్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ అరూప్ ఘోష్ అన్నారు. మండలంలోని పెదగంజాం పంచాయతీ ఏటిమొగ గ్రామంలో నిర్వహిస్తున్న సముద్రపు మొక్కల సాగు యూనిట్ను కేంద్ర బృందం సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార మహిళలకు సముద్రపు మొక్కల సాగు ఆదాయ వనరుగానే కాక తీరంలో సాగు చేయడం వల్ల సముద్ర జీవరాశుల మనుగడకు ఆధారం అవుతుందన్నారు. తీరంలో సాగు చేపట్టిన ఎకో వేవ్ ఓషానిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ కొమ్మిరెడ్డి మాధవి వెంకటేశ్వరరెడ్డిని వారు అభినందించారు. మహిళా పారిశ్రామిక వేత్తగా సముద్ర మొక్కల పెంపకం సాగులో ముందడుగు వేసిన ఆమెను ప్రశంసిస్తూ త్వరలో చీరాల ఓడరేవు, కొత్త ఓడరేవు గ్రామంలో ఈ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్న సముద్రపు మొక్కల పెంపకం యూనిట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చీరాల ఐటీసీ గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ వి. వినోద్కుమార్ను మర్యాద పూర్వకంగా కలిసి సముద్రపు మొక్కల పెంపకం విషయమై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పద్ధతిని సాగు విధివిధానాలను కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ లక్కాకుల సతీష్, బాపట్ల జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస నాయక్, డిప్యూటీ డైరక్టర్ ఆఫ్ ఫిషరీస్ గాలి దేవుడు, మత్స్యశాఖాధికారి రవీంద్ర స్థానిక మత్స్యకార రైతులు పాల్గొన్నారు. -
14,15 తేదీల్లో వీవీఐటీయూ ఉద్గమ హ్యాకథాన్
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్శిటీలో ఏసీఎం విద్యార్థి విభాగం అధ్వర్యంలో మార్చి 14,15 తేదిల్లో జాతీయస్థాయి హాకథాన్ ఉద్గమ 1.0 నిర్వహించనున్నట్లు వర్సిటీ ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. మండలంలోని నంబూరు వీవీఐటీయూ నందు సోమవారం హ్యాకథాన్ ఉద్గమ 1.0 పోస్టర్లను అధ్యాపకులు, విద్యార్థులతో కలసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రో చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ యువ ఆవిష్కర్తలు బృందాలుగా ఏర్పడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఆధునిక సాంకేతికతపై ఆలోచనలు పంచుకుని నిజజీవిత సమస్యలకు వినూత్న పరిష్కారాలు రూపొందించడం ఈ హ్యకథాన్ ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రొటోటైప్లను, ప్రాజెక్ట్లను న్యాయనిర్ణేతలు, పరిశ్రమ నిపుణుల ముందు ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఈ హ్యాకథాన్ పోటీల్లో పాల్గొనదలచిన సాంకేతిక విద్యార్థులు ఏసీఎం. వీవీఐటీగుంటూరు.కామ్ వైబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఐటీ విభాగాధిపతి డాక్టర్ ఆళ్ళ కళావతి, హ్యాకథాన్ సమన్వయకర్త డాక్టర్ బి.సాయిజ్యోతి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘బాబు’య్...‘డాబు’య్..!
చీరాల అర్బన్: చంద్రబాబు ప్రచార ఆర్భాటం ఎక్కువ. ఆచరణ సున్నా. బాబు మాటలు, నీటి మూటలు. ఉట్టికి ఎక్కలేనోడు, స్వర్గానికి ఎక్కుతానన్నట్లు బాబు మాటలు, చేతలు ఉంటున్నాయి. అభివృద్ధిని గాలికి వదిలేసి, ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యం. ఇదేనా చంద్రబాబు విజనరీ అంటే అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు అందుకు దర్పణం పడుతున్నాయని అంటున్నారు. ఎన్నికల వేళ ప్రకటించిన ఆడబిడ్డ నిధి ఎక్కడ బాబు? ఎప్పుడు అమలు పరుస్తావంటూ మహిళలు మండిపడుతున్నారు. ఆడబిడ్డ నిధి హామీతో మహిళల ఓట్లు గత అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. ఆ పథకంతో 18 నుంచి 59 సంవత్సరాల వయస్సున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నది ప్రధానమైంది. ఆ హామీతో మహిళలు కొంతమేర టీడీపీ వైపు మొగ్గుచూపారు. ఓట్లు దండుకున్నారు. గెలిచాక ఆ హామీని మరిచారు. దీనిపై మహిళలు మండి పడుతున్నారు. ఇంటి జాగా లేదు.. త్రీ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తాడంట! చంద్రబాబు సర్కార్ వచ్చి సుమారు రెండు సంవత్సరాలవుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు ఇంటి స్ధలం ఊసేలేదు. ఇప్పుడు పెద్ద కుటుంబానికి త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తానని హామీ ఇస్తున్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసి, సమస్యలకు సంబంధించి ప్రజల దృష్టిని మర ల్చేందుకు ఇలాంటి మాయమాటలు చెప్పటం బాబుకు అలవాటయ్యిందని ప్రజలు అంటున్నారు. ఇదేనా బాబు విజనరీ అని విమర్శిస్తున్నారు. ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట చంద్రబాబుది అంతా డైవర్షన్ రాజకీయం. తిరుపతి లడ్డూ నుంచి అన్ని అంశాలలో అతనిది అదే పంధా. ఆత్మస్తుతి, పరనిందకే పెద్దపీట. బాబు పాలన వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవవుతున్నా .. ఇంకా గత ప్రభుత్వ వైఫల్యమని నిందలు వేస్తూ, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తెలుసుకుంటున్నారు. హామీల బాబు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
నడిరోడ్డుపై వ్యక్తి హల్చల్
పెట్రోల్ పోసుకొని కొల్లూరు: ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కొల్లూరు గౌడపాలెం ప్రాంతానికి చెందిన గరిక గోపాలంకు గతంలో ఆయన ఇంటి పక్కన నివసించే కుటుంబంతో ఇంటి స్థలం విషయంలో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో గోపాలంపై దాడి జరగడంతో కొల్లూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. దాడికి పాల్పడిన కుటుంబ సభ్యులు సోమవారం తనను దూషిస్తున్నారంటూ గోపాలం భార్య కొల్లూరు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గోపాలం సోదరుడు వెంకయ్య తెనాలి–రేపల్లె రోడ్డుపై ఆందోళనకు దిగాడు. రోడ్డుపై దుంగలను అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను అడ్డగించాడు. ఆర్టీసీ బస్సు ఎదురుగా పడుకొని నిరసన చేపట్టడంతోపాటు, తనపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అతని కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకొని అతనిపై నీళ్లు పోయడంతోపాటు, రోడ్డుకు అడ్డుగా వేసిన దుంగలను తొలగించడంతో, వాహనాల రాకపోకలు కొనసాగాయి. పోలీసులు కేసు విషయంలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదు. గతంలో స్థలం విషయంలో గోపాలంపై జరిగిన దాడిపై కేసు నమోదు చేయడం జరిగింది. సోమవారం తమను దాడి చేసిన నిందితుని కుటుంబ సభ్యులు తిడుతున్నారని ఫిర్యాదు చేయడంతో సిబ్బంది వారిని పిలిచి హెచ్చరించి పంపడం జరిగింది. – పి.కోటేశ్వరరావు, ఎస్ఐ, కొల్లూరు -
సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఈనెల 8న ప్రకటించిన సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అఖిల భారతస్థాయిలో అత్యధిక మార్కులతో పాటు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రభంజనం సృష్టించినట్లు సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. సోమవారం గుంటూరు కొత్తపేటలోని శ్రీమేధ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నందకిషోర్ మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా సీఏ, సీఎంఏ కోర్సుల్లో 450కు పైగా ఆలిండియా ర్యాంకులను సాధించామని చెప్పారు. తాజా ఫలితాల్లో కె.చంద్రశేఖర్ 400 మార్కులకు గాను 308 మార్కులతో టాపర్గా నిలిచాడని తెలిపారు. అదే విధంగా ఏ.నాగసాయి 298, ఐ.జ్ఞానతేజ 297, బి.మణి 294, ఎం.సప్తగిరి 267 వంటి టాప్ మార్కులు సాధించారని తెలిపారు. సీఏ ఫౌండేషన్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించేందుకు శ్రీమేధ అధ్యాపక, అధ్యాపకేతర బృంద సహకారం ఎంతగానో ఉందన్నారు. సీఏ ఫౌండేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఏ ఇంటర్, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు సీఏ ఫౌండేషన్ క్రాష్ బ్యాచ్ తరగతులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా అన్నా నందకిషోర్, డైరెక్టర్ అన్నా శ్రీలక్ష్మి విద్యార్థులను అభినందించారు. -
మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యం
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని గుంటూరు పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్లో మహిళా ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, డెప్యూటీ మేయర్ షేక్ షజిల, సినీనటి నివేద పేతురాజ్ హాజరై మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా దేశం బలంగా ఉంటుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. నివేద పేతురాజ్ మాట్లాడుతూ సమాజంలో నేడు మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని చెప్పారు. మహిళలు తమకు నచ్చిన రంగం వైపు అడుగులు వేయడానికి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించాలన్నారు. మెడికల్ ఆకాంలజిస్ట్ డాక్టర్ కందుల రామ్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళల ఆరోగ్యంపై తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని, ప్రాథమిక దశలోనే అన్ని రకాల క్యాన్సర్లు గుర్తించేందుకు రాయితీతో మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మహతి మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి వల్ల మహిళల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించేలా నానోగ్రామ్ పరీక్ష అందుబాటులో ఉందన్నారు. క్యాన్సర్ సోకిన వారికి రొమ్ము తొలగించకుండానే క్యాన్సర్ కణితులు తొలగించే ఆధునిక ఆపరేషన్లు నేడు అందుబాటులో ఉన్నాయన్నారు. కిమోథెరఫీ, రేడియేషన్ థెరఫీ చికిత్సల్లో కూడా అత్యాధునిక క్యాన్సర్ డ్రగ్స్, ఆధునిక రేడియేషన్ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. సర్వేకల్ క్యాన్సర్ సోకకుండా వ్యాక్సిన్లు నేడు అందు బాటులో ఉన్నాయని, తొమ్మిదేళ్ల బాలిక మొదలు, 35 సంవత్సరాల వయస్సు వారు వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ సోకకుండా కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కిమ్స్ చక్రలో మహిళా ఆరోగ్యంపై అవగాహన సదస్సు -
నదిలో మునిగి విద్యార్థి గల్లంతు
అమరావతి: నదిలో స్నానానికని వెళ్లి విద్యార్థి గల్లంతయిన సంఘటన సోమవారం దిడుగులో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని దిడుగు గ్రామానికి చెందిన శీలం నందగోపాల్ మధ్యాహ్న సమయంలో తన స్నేహితులతో కలిసి కృష్ణానదిలోకి స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగిన ఏడుగురులో శీలం నందగోపాల్ లోతుకు వెళ్లటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న సీఐ అచ్చియ్య తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి వరకు ఎంతగా గాలించినా నందగోపాల్ జాడ తెలియలేదు. చీకటి పడి గాలింపు చర్యలు కష్టంగా ఉండటంతో మంగళవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. నందగోపాల్ కుటుంబ సభ్యులు, బంధువులు నదిఒడ్డున గుండెలవిసేలా విలపించటం గ్రామస్తులను కలిచివేసింది. -
అనుబంధాలకు...‘సెల్’ చీటీ
కొల్లూరు : అనుబంధాలు.. ఆప్యాయతలు.. కష్ట, సుఖాలలో పాలు పంచుకునే మానవ జీవనానికి సెల్ ఫోన్ శరాఘాతంగా మారింది. వ్యక్తిగత జీవనంలో సెల్ ఫోన్ అంతర్భాగంగా మారిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ఫోనే సర్వస్వం అన్న తరహాలో వ్యక్తుల జీవన శైలి కొనసాగుతుంది. మానవ సంబంధాలకు గండికొడుతూ, అనుబంధాలకు ఆప్యాయతలకు సెల్లు చీటీ పలుకుతున్న సెల్ ఫోన్ను అవసరానికి మించి వినియోగించడానికి నేటి సమాజం ప్రాధాన్యత ఇవ్వడంతో మానవ సంబంధాలకు క్రమక్రమంగా విలువ తరగిపోయే ప్రమాదం పొంచి ఉంది. సెల్ ఫోన్ వినియోగం, సాంకేతికత పెరిగిన తరుణంలో శుభ, అశుభ కార్యాల పిలుపులు సైతం వాట్సాప్లకు పరిమితమైపోవడంతో, నోరారా పిలుపులు వినిపించకుండా సెల్ ఫోన్ ఆహ్వానాలతో సరిపెట్టాల్చిన పరిస్థితి దాపురించింది. మానవ జీవితంలో పాత కాలపు గురుతులు.. సెల్ ఫోన్కు బానిసగా మారిన నేటి యువత జీవన విధానానికి అద్దం పట్టే విధంగా ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. ఒకే ప్రాంతంలో సెల్ఫోన్ పరిజ్ఞానం లేని వృద్ధ మహిళలు ఖాళీ సమయంలో ఒక చోటకు చేరి కష్ట, సుఖాల నుంచి ఓదార్పుగా అనుబంధాలు, ఆప్యాయతలకు ఆదర్శంగా సంప్రదాయ ఆటతో కాలక్షేపం చేస్తుంటే, మరో పక్క అదే ప్రాంతంలో సెల్ ఫోన్ వినియోగించే యవత మాత్రం ఈ లోకంతో పొంతన లేని విధంగా సెల్ ఫోన్లో మమేకమైపోయారు. -
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
చీరాల: ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించేందుకు నియోజకవర్గ కేంద్రాల్లోనే గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. సోమవారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో జిల్లా స్థాయి గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్తోపాటు స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, జాయింట్ కలెక్టర్ భావన, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీదారుల ఇబ్బందుల దృష్ట్యా ప్రతి సోమవారం ఒక్కో రెవెన్యూ డివిజన్ కేంద్రం, నియోజకవర్గ కేంద్రంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చీరాలలో వివిధ రకాల సమస్యలపై 296 అర్జీలు అందాయని, క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు పరిశీలించి నెల రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఫ్లెక్సీలు తొలగించాలి.. చీరాల గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మాజీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, జిల్లా వాణిజ్య విభాం అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణ, జిల్లా యువజనవిభాగం ఉపాధ్యక్షులు కోడూరి ప్రసాద్రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు గోసాల అశోక్ తదితరులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే అక్కడ ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ను ఆదేశించారు. అర్హులకు ఆటోనగర్లో స్థలాలివ్వాలి ఆటోనగర్ స్థలాల కోసం గతంలో డీడీ చెల్లించినవారిని అర్హులుగా గుర్తించి న్యాయం చేయాలని ది చీరాల తాలూకా ఆటోమోబైల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. కొందరు స్థానికులు ఈ భూమి తమదని కోర్టుకు వెళ్లడంతో పనులు ఆగిపోయాయన్నారు. 2017లో కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. గత రెండేళ్లుగా ఆటోమొబైల్ వర్కర్స్ను సంప్రదించకుండా కొందరు వ్యక్తులు ఏపీఐఐసీతో లాలూచీ పడి కొందరికి స్థలాలు అక్రమంగా కట్టబెట్టారన్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని, నిరుపేదలైన కార్మికులకు ఒక్కొక్కరికి ఒక్కో ప్లాటు కేటాయించి మిగిలిన నిర్మాణాలు ఆపివేయాలని వినతిపత్రంలో కోరారు. శీలం రవి అరాచకాలను అరికట్టాలి చీరాల 32వ వార్డులో సామాజిక కార్యకర్త అని చెప్పుకుంటూ శీలం రవి అనే వ్యక్తి వ్యక్తిగత కక్షతో, కుట్రపూరితంగా సచివాలయం సిబ్బంది, మున్సిపల్ అధికారులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని వార్డు ప్రజలు కలెక్టర్ను వేడుకున్నారు. వినతిపత్రం అందించిన వారిలో గోసాల అశోక్, ఆదిశేషు, ఉప్పు సంతమ్మ, తోటపల్లి రూతమ్మ, సుభాషిణి, అల్లడి స్వరూప ఉన్నారు. చీరాల: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ వినోద్కుమార్ ఎదుట అనుచితంగా ప్రవర్తించిన ఎస్.దేవరాజ్ అనే వ్యక్తిపై చీరాల ఒన్టౌన్ పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. చీరాల ఆర్డీవో టి.చంద్రశేఖర్ నాయుడు ఎదుట నిందితుడిని హాజరుపర్చినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.


