breaking news
Bapatla
-
రెండు బైక్లు ఢీ.. ఇరువురికి గాయాలు
బల్లికురవ: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొనటంతో ఇరువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం మండలంలోని అంబడిపూడి –కొమ్మినేని వారిపాలెం లింకురోడ్డులో జరిగింది. కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన కాకుమాను అరుణ్కుమార్ పని నిమిత్తం బైకు బల్లికురవ వెళుతున్నాడు. సోమవరప్పాడు గ్రామానికి చెందిన గుజ్జులైని శ్రీనివాసరావు బైకుపై కొమ్మినేని వారిపాలెం వెళుతూ ఒకరినొకరు ఢీకొన్నారు. స్థానికులు బల్లికురవ 108కి సమాచారం ఇవ్వటంతో ఈఎంటీ అశోక్ ప్రథమ చికిత్స తదుపరి క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఇప్పటం వడ్డేశ్వరం పంట పొలాలకు వెళ్లే డొంక రోడ్డులో ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ ఖాజావలి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. అతడి వద్ద బట్టల సంచి మాత్రమే కనిపించిందని, ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతుడు శరీరంపై బ్లూ కలర్ ఫ్యాంటు, లైట్ బ్లూ, పసుపు తెలుపు రంగు నిలువు చారల చొక్కా ధరించి ఉన్నాడని, మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని, రెండు రోజుల నుండి ఇప్పటం వడ్డేశ్వరం ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాడని, ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. బైక్ అదుపు తప్పి యువకుడు మృతి మేదరమెట్ల (అద్దంకి రూరల్): అధికవేగంతో వెళుతున్న యువకుడు బైకు అదుపుతప్పి కిందపడి మృతి చెందిన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. మేదరమెట్ల పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం మండలంలో కోరిశపాడు గ్రామానికి చెందిన పాలేటి రాజేష్(22) ఒంగోలు వైపు నుంచి కొరిశపాడు వస్తుండగా తమ్మవరం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అధిక వేగంతో వచ్చి అదుపుతప్పి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
తెనాలి రూరల్: దురలవాట్లకు బానిసలై జల్సాలకు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తున్న నలుగురును రూరల్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆర్. ఉమేష్ వివరాలను వెల్లడించారు. రూరల్ పరిధిలోని జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహ సముదాయం వద్ద గంజాయి విక్రేతలు ఉన్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ ఆనంద్, సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసినట్లు చెప్పారు. డెప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, పెదరావూరు, జగ్గడిగుంటపాలెం వీఆర్వోల సమక్షంలో కఠెవరం గ్రామానికి చెందిన ముక్కాల ప్రకాశరావు, పెదరావూరు పెదమాలపల్లెకి చెందిన దర్శి ప్రదీప్కుమార్, చినపరిమి రోడ్డులో ఉండే నలిగల శివ నాగరాజు, తెనాలి రైల్వే క్వార్టర్స్కు చెందిన మెరుగుమాల ప్రశాంత్కిరణ్లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరంతా దురలవాట్లకు బానిసలైనట్లు తెలిపారు. విజయవాడకు చెందిన ఇమ్మానుయేలు నుంచి రూ 5వేలు, రూ.10వేలకు గంజాయి కొనుగోలు చేసి బస్టాండ్, రైల్వేస్టేషన్, తెనాలి పరిసర గ్రామాలలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. వీరికి గంజాయి సరఫరా చేస్తున్న ఇమ్మానుయేలుపై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. గత రెండు నెలల్లో గంజాయి కేసుల్లో పది మందిని అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. సమావేశంలో ఎస్ఐ కె. ఆనంద్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుళ్లు డి. రవి, బీహెచ్. సుబ్బారెడ్డి, లంక వరప్రసాద్, ఓంకార్ కపూర్ నాయక్ పాల్గొన్నారు. -
క్రీడాకారులకు ఆర్థోస్కోపీతో ఉపశమనం
గుంటూరుమెడికల్: ఆటలు ఆడే సమయంలో పలువురు గాయపడుతుంటారని, గాయాల ద్వారా క్రీడాలకు దూరంగా కాకుండా ఆర్థోస్కోపీతో వారికి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ అన్నారు. గుంటూరు ఆర్థోపెడిక్ అసోసియేషన్, గుంటూరు ఆర్ర్ధోస్కోపీ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు ఐటీసీ హోటల్లో ఆర్ర్ధోస్కోపీ కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ స్పోర్ట్స్ పర్సన్కు గాయాలు ఎక్కువగా అవుతాయని చెప్పారు. కీడ్రల్లో యువత ఎక్కువగా భాగస్వాములుగా ఉంటారన్నారు. ఆటలు ఆడే సమయంలో ఏదైనా దెబ్బ తగిలితే త్వరగా గాయాల నుంచి కోలుకుని ఉద్యోగాలు చేసుకోవటానికి, తిరిగి ఆటలు ఆడటానికి ఆర్థోస్కోపీ సర్జరీలు ఎంతో ఉపయోగపతాయని వివరించారు. ఈ సర్జరీతో క్రీడాగాయాలైన వారు త్వరగా కోలుకుంటారని, త్వరగా నడుస్తారని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఆర్థోస్కోపీ మెడికల్ టూరిజం అభివృద్ధి చెందాలని కోరారు. గుంటూరు మెడికల్ హబ్ అవుతుందని వెల్లడించారు. గుంటూరు కొత్తపేటలోని సంకల్ప హాస్పిటల్లో యువ వైద్యులకు, జూనియర్ వైద్యులకు, ప్రాక్టీస్లో ఆసక్తి ఉన్నవారికి షోల్డర్ అండ్ నీ లైవ్ సర్జరీలు లైవ్లో నాలుగు చేసి చూపించారు. షోల్డర్ అండ్ నీ సంకల్ప హాస్పిటల్లో పలు ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ ఆర్థోస్కోపీ సర్జన్స్ నాలుగు లైవ్ సర్జరీలు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 180 మంది యువవైద్యులు హాజరైనట్లు కాన్ఫరెన్స్ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ శివ కుమార్ మామిళ్ళపల్లి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ చైతన్య ఘంటా తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ఆర్థోస్కోపీ నిపుణులు లైవ్ సర్జరీలు నిర్వహించడమే కాకుండా వర్క్ షాప్ కూడా నిర్వహించారన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ యశస్వి రమణ -
సీపీఎం నేతపై టీడీపీ వర్గీయుల దాడి హేయం
నరసరావుపేట: క్రోసూరు మండలం దొడ్లేరు గోదావరి చైతన్య గ్రామీణ బ్యాంకులో బంగారం పోగొట్టుకున్న బాధిత రైతుల పక్షాన పోరాటం చేస్తున్న సీపీఎం నాయకుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దాడికి పాల్పడిన తెలుగుదేశం నాయకులు(బంగారం వ్యాపారులు)లను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులు వైఖరి, పోలీసుల తీరును ఖండిస్తూ కరపత్రం ఆవిష్కరించారు. విజయ్కుమార్ మాట్లాడుతూ పీడిత వర్గ ప్రజల పక్షాన నిలిచి నిస్వార్థంగా పోరాటాలు చేస్తున్న నాయకులపై అధికార పార్టీ వర్గీయులు దాడికి పాల్పడడం సిగ్గుచేటన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే మొఘల్ జాన్ను మండల అధ్యక్ష స్థానం నుంచి తప్పించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. రైతులు తనఖా పెట్టిన బంగారం గోల్మాల్ కావడంలో అప్రైజర్ నాగార్జునతో దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల హస్తం ఉందని అందుకే పోరాటాన్ని నీరుగార్చేందుకు దాడికి పాల్పడ్డారన్నారు. దీనిపై తమ పార్టీ రెండేళ్ల్ల పోరాటం ఫలితంగా 400 మంది బాధితులకు న్యాయం జరిగిందని, మిగిలిన 140 బాధితులకు న్యాయంచేయాలని పోరాటం చేస్తున్న క్రమంలో టీడీపీ నాయకులు దాడికి పాల్పడడం పోలీసులు వారికే వత్తాసు పలకడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ నెల 10న బ్యాంక్కు తాళంవేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగగా డీఎస్పీ వచ్చి మాట్లాడతారని ఆందోళన విరమించాలని ఎస్ఐ రవికుమార్ చెప్పడంతో ఆందోళన విరమించారన్నారు. ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన తిమ్మిశెట్టి హనుమంతరావుపై అదేరోజు టీడీపీ మండల అధ్యక్షులు మొఘల్ జాన్, సోదరుడు సమీర్లు దారికాచి దాడికి పాల్పడగా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. క్రోసూరు మండలంలోని పేద ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి హనుమంతరావు కృషిచేయడాన్ని అధికార పార్టీ నాయకులు ఓర్వలేక పోతున్నారన్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, బాధితునికి రక్షణ కల్పించకుంటే ఆందోళన చేపడతామన్నారు. బాధిత నాయకుడు తిమ్మిశెట్టి హనుమంతరావు, నాయకులు డి.శివకుమారి, జి.మల్లీశ్వరి, జి.ఉమశ్రీ, సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, ఏపూరి గోపాలరావు, పెద్దిరాజు, తెలకపల్లి శీను, హరి పోతురాజు, బాలకృష్ణ, సిలార్ మసూద్, పి వెంకటేశ్వర్లు, లక్ష్మీశ్వరరెడ్డి, హరిపోతురాజు, రాధాకృష్ణ, రవిబాబు పాల్గొన్నారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులను అరెస్ట్ చేయాలి బంగారం పోగొట్టుకున్న బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ -
ప్రజా కళలతోనే సామాజిక చైతన్యం
తెనాలి: కళలు జనజీవన స్రవంతిలో భాగమని ప్రజాకళలతోనే దోపిడీ వ్యవస్థను ఎదరించే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావొచ్చని, అలాంటి కళారూపాలను తయారుచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టుపార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూరులో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే క్రమంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరగనున్నాయని తెలిపారు. తొలిరోజున జరిగే ప్రదర్శనలో వెయ్యిమంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారని తెలిపారు. గుంటూరు జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో కళారూపాలతో కళాకారులు పాల్గొనాలని అన్నారు. సభాధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ ప్రజానాట్యమండలికి, కళాకారులకు తెనాలి పుట్టినిల్లుగా చెప్పారు. గుంటూరు జిల్లా నుండి 100 మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొంటారని అన్నారు. సీనియర్ కళాకారుడు, సమన్వయకర్త కనపర్తి బెన్హర్ మాట్లాడుతూ తెనాలి నుండి ‘పోస్టర్’ నాటికతో ఒంగోలులో జరిగే కళాప్రదర్శనలో పాల్గొంటామని చెప్పారు. ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు, నీలాంబరం, మల్లికార్జునరావు, రచయిత దేవరకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.రామకృష్ణ -
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నిక
లక్ష్మీపురం: ఉమ్మడి గుంటూరు జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా ఓలేటి రమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎస్. విజయలక్ష్మి, ఎం.షణ్ముఖ, ప్రధాన కార్యదర్శిగా ఎన్.కార్తిక్, కార్యాలయ కార్యదర్శిగా వి.కల్యాణ్, సంయుక్త కార్యదర్శిగా ఆర్. సరళబాబు, కోశాధికారిగా వెంకటేశ్వర్లు నియమితులైనట్లు ఎన్నికల అధికారి బాపట్ల గోపాల కృష్ణయ్య, సహాయ ఎన్నికల అధికారి దేవరపల్లి జగన్నాథం ప్రకటించారు. గుంటూరులోని జిన్నాటవర్ సెంటర్లో ఉన్న వసుంధర కాంప్లెక్స్లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మరో ఐదు స్థానాలకు ఏడు నామినేషన్లు మాత్రమే రావడంతో అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు రావులపాటి శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు మాట్లాడుతూ ఉద్యోగులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన ఉమ్మడి గుంటూరు జిల్లాల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడిగా ఓలేటి రమేష్కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన నూతన కార్యవర్గం -
ధూర్జటిది విశిష్ట స్థానం
వారణాశి రఘురామ శర్మ అద్దంకి: అష్ట దిగ్గజాల్లో ధూర్జటిది విశిష్ట స్థానమని వారణాశి రఘురామశ శర్మ అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక కమఠ్వేర స్వామి దేవస్థానంలో సృజన సాహిత్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన వహించారు. మలాది శ్రీనివాసరావు జ్యోతిప్రజ్వలన చేశారు. ‘ధూర్జటి మహాకవి భక్తితత్త్వం’ అనే అంశంపైన శ్రీ వారణాశి రఘురామశర్మ ఉపన్యాసం శ్రోతలను ఆకట్టుకుంది. ‘రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు’ అని నాటి రాజులను ఈసడిరచుకున్న కవిరాజు ధూర్జటి అని చెప్పారు. సాలీడు, పాము, ఏనుగు, తిన్నడు.. శివుని సేవించి మోక్షం పొందిన కథలను రసరమ్యంగా శ్రీ కాళహస్తీశ్వరమహాత్మ్య కావ్యంలో ధూర్జటి ఆవిష్కరించారన్నారు. ఆ పద్యాలన్నీ ధూర్జటి హృదయాన్ని ఆవిష్కరిస్తాయని, అతని ఉన్నత వ్యక్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని శర్మ పేర్కొన్నారు. రోటరీ తాజా మాజీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చుండూరి సుధాకరరావు, శ్రీ మలాది శ్రీనివాసరావులను, అసిస్టెంట్ గవర్నర్గా ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన షేక్ మహమ్మద్ రఫీని సత్కరించారు. అలాగే 2025 – 26 సంవత్సరానికి రోటరీక్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి కార్యవర్గంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గాన్ని సత్కరించారు. కార్యక్రమంలో షేక్ మహమ్మద్ రఫీ సభాహ్వానం చేయగా అద్దంకి లేవిప్రసాద్ వందన సమర్పణతో సభ ముగిసింది. కార్యక్రమంలో యు.దేవపాలన, వీరవల్లి సుబ్బారావు (రుద్రయ్య), గాడేపల్లి దివాకర దత్, కె.అనిలకుమారసూరి, సంకా సుబ్రహ్మణ్యం(బాబు), అనంతు నాగేశ్వరరావు, అద్దంకి లేవిప్రసాద్, లక్కరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరతీసిన టీడీపీ నేతలు
సత్తెనపల్లి: రాష్ట్రంలో ఏడాది నుంచి రాక్షస పాలన కొనసాగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్, బీసీ మహిళ ఉప్పాల హారిక, ఆమె భర్త రాముపై టీడీపీ గూండాలు రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేయడం అమానుషమని పేర్కొన్నారు. కారును ముందుకు కదలనీయకుండా రోడ్డుపై దాడి చేయడం అప్రజాస్వామికమని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీ మహిళలపై దౌర్జన్యాలు, దాడులు ఎక్కువ అయ్యాయనడానికి ఇదొక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పోకడ ఎమర్జెన్సీని తలపిస్తోందని, మహిళలకు రక్షణ లేదని తెలిపారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గుండాలు దాడిచేయడం దారుణమని ఖండించారు. ఒక మహిళ హోం మంత్రి అయి ఉండి కూడా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఇలాంటి దాడులను కూటమి ప్రభుత్వం మానుకోవాలని, లేనిపక్షంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడి చేసిన టీడీపీ గుండాలను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని శివనాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు దాచేపల్లి: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ దేవళ్ల రేవతి అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఆదివారం ఆమె తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనగా మారిందని ధ్వజమెత్తారు. మహిళలకు కనీస రక్షణ ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల మహిళా ప్రజాప్రతినిధులను మానసికంగా వేధించి, భౌతిక దాడులు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తోందని రేవతి మండిపడ్డారు. మహిళా ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ ఎక్కడ ఇస్తుందని ఆమె ప్రశ్నించారు. టీడీపీ గూండాలు హారికపై దాడి చేసి చంపేస్తామని బెదిరించడం దారుణమైన ఘటనగా పేర్కొన్నారు. దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి ప్రభుత్వ తీరుని ఎండగట్టాల్సిన ఆమె పిలుపునిచ్చారు. బీసీ మహిళ అయినా హారికపై దాడికి హోంమంత్రి బాధ్యత వహించి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని రేవతి డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ హారికపై దాడి అమానుషం చిలకలూరిపేట: బీసీ మహిళా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై రాళ్లు, కర్రలతో టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడడం అమానుషమని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ సభకు వెళుతుండగా కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలో దాడికి పాల్పడడాన్ని ఖండించారు. ప్రభుత్వ తీరును సభ్య సమాజం తీవ్రంగా అసహ్యించుంకుంటున్నదని వెల్లడించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ప్రభుత్వ విధానం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించేవారే ఉండకూడదన్నట్లు వ్యవహరించటం ప్రజాస్వామ్య విధానాలకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. ప్రశ్నించటం, నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివని, వాటిని కాలరాయాలని చూస్తే తీవ్ర ప్రజావ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
మహిళ నేత్రాలు దానం చేసిన కుటుంబసభ్యులు
తెనాలి: స్థానిక నాజర్పేటకకు చెందిన తెనాలి రైల్వేస్టేషన్ మేనేజర్, భారతీయ మజ్దూర్ సంఘ్ జోనల్ నాయకుడు టీవీ రమణ మాతృమూర్తి సీతాదేవి (80) ఆదివారం మృతిచెందారు. ఆమె కోరిక ప్రకారం నేత్రదానానికి సమాచారం పంపారు. సంబంధిత సంస్థ ప్రతినిధులు అరవింద, కృష్ణమోహన్ వచ్చి, ఆమె నేత్రాలను సేకరించి పంపారు. చీకటి ప్రపంచం నుండి ఇద్దరు రేపటి వెలుగులను చూస్తారనే విషయం తమకు ఎంతో ఆనందంగా ఉందని టీవీ రమణ అన్నారు. హిందూ చైతన్య వేదిక, విశ్వహిందూ పరిషత్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సీతాదేవి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. నేత్రదానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మంత్రి ప్రకటనలో స్పష్టత లేదు లక్ష్మీపురం: నెల రోజుల కిందటే సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ స్పందించకుండా, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ మంత్రి శనివారం ప్రకటన చేశారని, జీతాలు ఎప్పటి నుంచి పెంచుతామన్నారని కానీ, ఎంత పెంచుతారని కానీ స్పష్టత లేనందునే రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరు తక్కెళ్లపాడు హెడ్వాటర్ వద్ద ఆదివారం కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభంతో నగరపాలక సంస్థకు చెందిన ఉండవల్లి, మంగళగిరి, సంగం జాగర్లమూడి, తక్కెళ్లపాడు హెడ్ వాటర్ కార్మికులు సమ్మెలోకి దిగడంతో గుంటూరు నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. మున్సిపల్ అధికారులు సమ్మె చేస్తున్న కార్మికులపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్ప డినా పారిశుద్ధ్య కార్మికులను కూడా సమ్మెలోకి దింపుతామని హెచ్చరించారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు జీవో నంబర్ 36 ప్రకారం వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు, ఇంజనీరింగ్ కార్మికుల కేటగిరీల నిర్ధారణలో జరిగిన తప్పులు సరి చేయడం, గత 17 రోజుల సమ్మె ఒప్పందాలకు జీవోలు ఇవ్వకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యూని యన్ నగర అధ్యక్షులు పూనేపల్లి శ్రీని వాసరావు, జిల్లా నాయకులు పాశం పూర్ణచంద్రరావు, ఇంజినీరింగ్ విభాగం నాయకులు యా సిర్ ఖాన్, బాలకృష్ణ, రవి, జానీ, నాగరాజు, మహేష్, సురేష్, లీక్ వర్కర్లు పాల్గొన్నారు. -
రాజ్యాంగంపై దాడి చేస్తారా?
చీరాల రూరల్: దేశంలోని అన్ని వర్గాల శ్రేయస్సు కోసం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించి అందులో సెక్యులర్, సోషలిస్టు అనే పదాలు పొందుపరచారని వాటిని తొలగిస్తే రాజ్యాంగంపై దాడిచేసినట్టేనని విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్కుమార్ అన్నారు. ఏపీ ఊరూరా జనవిజ్ఞానం, వివిధ ప్రజా సంఘాల ఐక్యవేదికల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఘంటసాల విగ్రహం వద్ద రానున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్రాంత ఏసీపీ కట్టా వినయ్ రాజ్కుమార్, ఊరూరా జనవిజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడారు. రాజ్యాంగంలో పొందుపరచిన దేశభక్తి, ప్రజాస్వామ్యం, సామాజిక స్పృహ, లౌకిక భావాలు, సమసమాజ నిర్మాణం, శాసీ్త్రయ ఆలోచన, గణతంత్ర రాజ్యం, సామాజానికి న్యాయం, సామాజిక సంస్కరణ అనే ఈ పది అంశాలపై ప్రజల్లో విస్త్రృతంగా చర్చలు జరపాలని నిర్ణయించారు. విద్యార్థుల్లో కూడా ఆటోచనా ధోరణి పెంపొందించుటకు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు జరపాలని నిర్ణయించారు. రాజ్యాంగంలోని సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. అనంతరం వినయ్ రాజ్కుమార్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గాదె హరిహరరావు, వై.రవికుమార్, టి.అంకయ్య, నాగమనోహర్ లోహియ, ఎం.మణిబాబు, ఎస్కే సుభాని, జి.జోజిబాబు, జిలాని పాల్గొన్నారు. -
భక్తులతో కిటకిటలాడిన నృసింహుని ఆలయం
మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం, ఆదివారం సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చారు. దిగువ సన్నిధిలో నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దిగువ సన్నిధి నుంచి ఆటోలో ఎగువ సన్నిధికి వచ్చే భక్తులను మధ్యలోనే పోలీసులు ఆపేశారు. -
బగళాముఖి అమ్మవారికి విశేష పూజలు
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామ దేవత బగళాముఖి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు జరిగాయి. ఆషాఢ మాసం ఆదివారం సందర్భంగా అమ్మవారు విజయేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూలు, పండ్లు సమర్పించారు. పసుపు, కుంకుమలతో పూజలు చేశారు. అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలను అర్చకులు నిర్వహించారు. ఆషాఢమాసం కావటంతో మహిళలు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాడరేవు తీరంలో పర్యాటకుల సందడి చీరాల టౌన్: మండలంలోని వాడరేవు సముద్ర తీరం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆదివారం కావడంతో చీరాల, పర్చూరు, అద్దంకి, పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాలతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పర్యాటకులు అధికసంఖ్యలో వచ్చారు. ఆటలాడుకుంటూ కేరింతలు కొట్టారు. సముద్రంలో స్నానాలు ఆచరించారు. తీరం ఒడ్డున ఉన్న ఆంజనేయ స్వామికి, గ్రామంలోని కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సివిల్, మైరెన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.3 లక్షల విరాళం నరసరావుపేట ఈస్ట్: పులుపుల వారి వీధిలోని శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి రూ.3 లక్షలు విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన స్మార్ట్ కిడ్స్ ఇన్నోవేషన్స్ సంస్థ అధినేత గర్నీ సురేష్ ఈ మొత్తం అందించారు. ఆలయ రాతి నిర్మాణంలో భాగంగా 10వ రాతి స్తంభం నిర్మాణానికి వినియోగించాలని కోరారు. ఆలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో విరాళాన్ని మున్నలూరి సత్యనారాయణ ద్వారా కమిటీ ప్రతినిధులకు అందచేశారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు పులుపుల రాము, వనమా కృష్ణ, కోవూరి శివ శ్రీనుబాబు, గజవల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. వివాదాస్పద పీఈటీపై విచారణకు ఆదేశం పెదకాకాని: వివాదాస్పద వ్యాయామోపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఇటీవల నంబూరు శ్రీ ప్రోలయ వేమన జిల్లా పరిషత్ పాఠశాలకు పీఈటీగా మస్తాన్రెడ్డి బదిలీ అయ్యారు. ఆ సమయంలో తన రూం నుంచి ఎన్సీసీ విద్యార్థుల దుస్తులు, వారి అకౌంట్లో నగదు డ్రా చేయించడం, స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.500 వసూలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. మల్లేశ్వర స్వామి ఆలయానికి తులాభారం బహూకరణ పెదకాకాని: శివాలయం అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని డీసీ గోగినేని లీలాకుమార్ అన్నారు. శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానానికి పెదకాకాని గ్రామానికి చెందిన శివకోటి సాంబశివరావు, రోజా దంపతులు ఆదివారం శివకోటి రామారావు ధర్మపత్ని పద్మావతి పేరు మీద దేవస్థానానికి రూ.40,000 విలువచేసే స్టీల్ తులాభారం (కాటా) సమర్పించినట్లు డీసీ తెలిపారు. -
పేరుకే పొత్తు.. పదవులిస్తే ఒట్టు!
నరసరావుపేట: నియోజకవర్గంలోని కో ఆపరేటివ్ సొసైటీల అధ్యక్షుల నియామకంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని మరిచింది. మొత్తం తొమ్మిది సొసైటీ చైర్మన్ పదవులలో ఒక్కటి కూడా కూటమి పార్టీలైన జనసేన, బీజేపీలకు ఇవ్వలేదు. తమ పార్టీ వర్గీయులకే కట్టబెట్టుకుంది. దీనిపై జనసేన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. బయటపడి ప్రశ్నించిన వారిని పార్టీ అధినేత సస్పెండ్ చేస్తుండటంతో నేతలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మధ్య కొరవడిన సఖ్యత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ వర్గీయుల మధ్య సఖ్యత ఎప్పుడూ కనిపించలేదు. బీజేపీ తరఫున రంగిశెట్టి రామకృష్ణ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా... ఆయనతో తమకు సంబంధం లేదని ఆ పార్టీ వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. జనసేన వర్గీయుల పరిస్థితి కూడా అదే. ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు ఒక్క ఎంపీ కార్యక్రమాలకు తప్పితే మరెక్కడా పాల్గొనటం లేదు. ఏ పని ఉన్నా ఆయన వద్దకే వెళుతున్నారు. స్థానిక టీడీపీ ముఖ్యనేత జనసేన కార్యాలయానికి వెళ్లి మాట్లాడి వచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదు. కార్యకర్తల స్థాయిలో ఒకరిద్దరు తప్పితే ఎవరూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. బీసీ వర్గానికీ ఒక్కటీ లేదు... టీడీపీ వారు మాత్రం ఏ కార్యక్రమం తలపెట్టినా కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తీరా పదవులు పందేరం విషయంలో మాత్రం పొత్తు ధర్మాన్ని మరిచి వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు సామాజిక న్యాయానికి పాతరేశారని విమర్శలు వస్తున్నాయి. మొత్తం తొమ్మదింటిలో ఏడు సొసైటీలకు టీడీపీకి కొమ్ము కాసే ప్రధాన సామాజికవర్గానికి కేటాయించగా, మిగతా రెండూ ఇతర కులాలకు దక్కాయి. సామాజిక న్యాయం పాటించకుండా మొత్తం తొమ్మిది సొసైటీలు ఓసీలకే అప్పగించారు. బడుగు, బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గీయులకు ఒక్కటీ దక్కలేదు. తమకు తొలి నుంచి కనీస ప్రాధాన్యత కూడా దక్కడం లేదనే ఆవేదనలో అటు జనసైనికులు, ఇటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పై స్థాయిలో తమ ప్రయోజనాల కోసం కనీసం పట్టించుకోకపోవడంతోనే తమను పదవుల పంపకం సహా అన్నింటా తీవ్ర అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. బాధ్యతలు స్వీకరించింది వీరే... నూతనంగా నియమితులైన చైర్మన్లు, మెంబర్లకు శనివారం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు నియామక పత్రాలు అందజేశారు. చైర్మన్లుగా కన్యధారరాజు (లింగంగుంట్ల), యర్రం రాంబాబు (జొన్నల గడ్డ), కొల్లి వెంకటేశ్వర్లు (ఇక్కుర్రు), జల్లిపల్లి శేషమ్మ (విప్పర్ల),పొనుగోటి శ్రీనివాస రావు (సంతగుడి పాడు), సూరాబత్తుల రామారావు (బుచ్చిపాపన పాలెం), పల్లెల వెంకట రత్నారెడ్డి (రొంపిచర్ల), కుందేటి రామబ్రహ్మం (అన్నవరం), ఇంటూరి వెంకట ప్రసాద్ (సుబ్బయ్య పాలెం) స్వీకరించారు. వీరిలో కొంతమంది ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి టీడీపీ కార్యాలయానికే రాలేదని, కానీ పదవులు మాత్రం దక్కాయని చెబుతున్నారు. పదవులు అన్ని పార్టీలకు సమానంగా ఇవ్వాలనే నిబంధనను టీడీపీ గాలికి వదిలేసిందని పలువురు విమర్శిస్తున్నారు. కూటమిలో పొత్తు ధర్మం పాటించని టీడీపీ ఏకపక్షంగా సహకార సొసైటీ చైర్మన్ల నియామకం జనసేన, బీజేపీ వర్గీయులకు దక్కని పదవులు ఒక్క కులానికే ‘పచ్చ’ పార్టీ అత్యధిక ప్రాధాన్యం -
అంధకారంలో బాపట్ల పట్టణం
బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. పురపాలక సంఘంలో విద్యుత్తు, తాగునీరు ఇతర ఇంజినీరింగ్ విభాగాలలో సేవలు నిలిచిపోయాయి. పట్టణం అంధకారంలోకి వెళ్లిపోయింది. కార్మికులు విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో బైఠాయించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న కార్మికులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు విధుల్లోకి హాజరయ్యేది లేదని మొండికేసి కూర్చున్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మజుందర్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. చాలీచాలని జీతాలతో జీవనం సాగించలేక ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. కార్మికుల సమ్మెతో పట్టణంలో ప్రధానంగా తాగునీరు, విద్యుత్తు వంటి విధులకు విఘాతం కలిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. శిబిరంలో సీఐటీయూ నాయకులు శరత్, జిల్లా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, వెంకటేశ్వర రెడ్డి, సాంబిరెడ్డి, ప్రమీల, నరేష్ పాల్గొన్నారు. -
కాసుల కక్కుర్తి.. నాణ్యత నాస్తి
రేపల్లె: ప్రధాన పంట, మురుగు కాలువల మరమ్మతులకు ప్రభుత్వం కేటాయించిన నిధులు నామమాత్రపు పనులతో కూటమి నాయకుల జేబులు నింపుతున్నాయి. కూటమి నేతలే గుత్తేదారుల అవతారమెత్తి పనులు చేజిక్కించుకుని అందినకాడికి దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పంట కాల్వలకు తూతూ మంత్రంగా మరమ్మతులు నిర్వహించి ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో పది రోజులైనా ఆ పనులు ప్రజలకు ఉపయోగపడలేదు. కూటమి నేతలే కాంట్రాక్టర్లుగా... కృష్ణా డెల్టా పరిధిలోని తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలోని మేజర్, మైనర్ పంట కాల్వల అభివృద్ధి, పూడికతీతకు ప్రభుత్వం నుంచి రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో మూడు నియోజకవర్గాల పరిధిలోని కాల్వలలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడను తీయిస్తూ... కాలువలను బాగు చేయించటం, బలహీనంగా ఉన్న కట్టలను బలోపేతం చేయడం వంటి పనులను చేయిస్తున్నారు. ఆయా పనులకు సంబంధించి బాధ్యతలను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అప్పజెప్పటంతో నాసిరకంగా నిర్వహించారు. ప్రజాధనం కొల్లగొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేపల్లె నియోజకవర్గంలోని అరవపల్లి మెయిన్ కెనాల్ పంట కాలువ లాకుల వద్ద 10 రోజుల క్రితం కట్టను బలపరిచారు. వెదురు బద్దలు ఏర్పాటు చేసి ఇసుక బస్తాలను అడ్డుపెట్టి మమ అనిపించారు. వారం క్రితం కెనాల్కు కొద్దిపాటి నీరు రావటంతో అరవపల్లి వద్ద ఇసుక బస్తాలు కొట్టుకుపోయాయి. పూర్తిస్థాయిలో నీరు రాకముందే చేసిన అభివృద్ధి నీటిపాలవ్వటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనులను పర్యవేక్షించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. బలహీన పడిన కట్టలను బలపరచాలని కోరుతున్నారు. ఇంకా పనులు చేయాల్సినవి.. రేపల్లె సబ్ డివిజన్లో ప్రధానంగా ఉన్న ఆర్ఎం డ్రెయిన్ , బీఎం డ్రెయిన్ , జగజ్జేరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడమూరుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్కోర్స్, అరవపల్లి మెయిన్ కెనాల్ ఉన్నాయి. ఈ పంట కాల్వలలో తూటి కాడ, గుర్రపు డెక్క, ప్లాస్టిక్, చెత్తాచెదారాలతో పూడుకుపోయాయి. ఈ కాలువల ద్వారానే పంట పొలాల నుంచి వర్షపు నీరు బయటకు పోవాల్సి ఉంటుంది. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 34,060 హెక్టారులలో ఖరీఫ్లో వరి సాగు అవుతోంది. ఈ సాగు భూముల్లోని వృథా నీరుతోపాటు అధిక వర్షాలు కురిసిన సమయంలో వర్షపునీరు ఈ కాలువల ద్వారానే బయటకు వెళ్లాలి. ఇందులో భాగంగా చేపట్టిన తొలి విడత పనుల్లోనే కూటమి నేతల కాసుల కక్కుర్తికి పనులన్నీ వృథా అయ్యాయి. అరవపల్లి వద్ద కెనాల్లో నీటి ఉద్ధృతికి కోసుకుపోయిన కాల్వ కట్ట ఆ పనులు మళ్లీ చేయిస్తాం కాలువల మరమ్మతులలో భాగంగా అరవపల్లి కెనాల్లో లాకుల వద్ద బలపరిచిన కట్టలు నీటి ఒరవడికి కోసుకుపోవటాన్ని పరిశీలించాం. పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేదు. మళ్లీ కట్టలు పటిష్ఠం చేయాలని ఆదేశించాం. మరమ్మతులను దగ్గరుండి పర్యవేక్షిస్తాం. నాణ్యతాలోపాలు లేకుండా చూస్తాం. – దీనదయాళ్, డీఈ, ఇరిగేషన్ శాఖ, రేపల్లె కాలువ మరమ్మతులు, అభివృద్ధి పనులలో నాణ్యతాలోపాలు అధికారుల పర్యవేక్షణ లోపంతో గుత్తేదారుల ఇష్టారాజ్యం -
గెలిపించిన మాకు విలువ ఇవ్వరా?
గుంటూరు: ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుకు తొలి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది. ‘‘అసలు మేము పార్టీ వాళ్లమా.. కాదా? ఇతర పార్టీల నుంచి వచ్చినోళ్లకి విలువ ఉంది గానీ మీ గెలుపు కోసం, తెలుగుదేశం కోసం కష్టపడిన మాకు విలువ ఉందా? మీ చుట్టూ పిచ్చికుక్కల్లా తిరుగుతున్నాం.. పార్టీ గెలిచిన నాటి నుంచి మమ్మల్ని ఆలకించినోళ్లు లేరు’’ అంటూ టీడీపీ మహిళా నేతలు మండిపడ్డారు. పెదనందిపాడు మండలం పాలపర్రులో ఆదివారం బూర్ల పర్యటిస్తున్న ఆయనకు మహిళలు మాటల తూటాలతో చుక్కలు చూపించారు. వీవోఏ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన వారికి సహకరించడం ఏమిటని ఆయన్ను ప్రశ్నించారు. కార్యాలయానికి ఎన్నిసార్లు వచ్చినా పట్టించుకునే వారు గానీ ఆలకించే వారు గానీ లేరని ఆగ్రహించారు. తాము పార్టీలో వాళ్లమా కాదా అనేది ఇప్పుడు ఊర్లో అందరి మధ్యా చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీని గెలిపించుకుని సంవత్సరం అవుతుందని, ఏరోజైనా తమను పట్టించుకున్నారా? అని ఫైర్ అయ్యారు. అరిస్తే నేను బెదిరే వాడిని కాదు దీనికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘అది మీ ఊరి సమస్య మీరే తేల్చుకోవాలంటూ సమాధానం ఇవ్వగా.. మరి మా ఊరు సమస్య అన్నప్పుడు నువ్వు ఓట్లకి ఎందుకొచ్చావ్ అప్పుడు ?’’ అంటూ మహిళలు ఎదురు ప్రశ్నించారు. ఒక దశలో తీవ్ర అసహనానికి గురైన ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ‘‘నాకు చాలా ఓర్పు ఉంది.. సాయంత్రం వరకు ఉండే ఓపిక ఉందని, వచ్చినప్పుడు అరిస్తే నేను బెదిరేవాడిని కాను.. నేను బెదరను!’’ అంటూ మహిళలకు వేలు చూపిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరనం తమకు లేదని మహిళలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడి అవినీతికి పాల్పడిన వీవోఏ వివరాలను నమోదు చేసుకున్నారు. వారం రోజుల్లో విచారణ చేయించి, అవినీతి నిరూపణ అయితే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహిళలు శాంతించారు. తొలి అడుగులో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులును నిలదీసిన టీడీపీ మహిళలు -
రక్షణ.. ఆమడదూరం
బాపట్ల: సముద్ర తీరంలో రక్షణ కవచంలా ఉన్న మడ అడవులు క్రమంగా అంతరించిపోతున్నాయి. తీరం కోతకు గురికాకుండా ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడే మడ అడవులు నానాటికీ కనుమరుగు అవుతున్నాయి. అటవీశాఖ ఈ మడ అడవుల అభివృద్ధిని గాలికి వదిలేసింది. రాష్ట్రంలో 973 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరంలో కనీసం పట్టుమని 500 ఎకరాల్లో కూడా మడ అడవులు లేకపోవటం గమనార్హం. జీవరాశులపైనా ప్రభావం సూర్యలంక సముద్ర తీరంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రధాన డ్రైనేజీలు కలుస్తాయి. వాటికి అనుసంధానంగా ఉండే ఏటి పరివాహక ప్రాంతాల్లో సముద్రపు పోటు నీటితో బతికే మడ అడవులు ఎన్నో జీవరాశు లకు రక్షణగా నిలుస్తున్నాయి. ఇవి అంతరించిపోవటంతో పలు జీవరాశుల్లో కొన్ని కనుమరుగు అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలైన తుపాన్లు, సునామీలు సంభవిస్తే ఆ ప్రభావం జనావాసాలపై పడకుండా మడ అడవులు తీర రక్షణ గోడగా నిలుస్తున్నాయి. యథేచ్ఛగా రొయ్యల చెరువుల ఏర్పాటు తీర ప్రాంత గ్రామాలకు మేలు చేసే వీటిని పరిరక్షించాల్సిన అటవీ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పైగా మడ అడవులను నరికేసి అన్యాక్రాంతం చేసుకున్న తీరంలో రొయ్యల చెరువులు ఏర్పాటవుతున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. మడ అడవుల పెంపకం సంగతి పక్కన పెడితే.. ఉన్నవాటిని తొలగిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతోపాటు సముద్ర తీరంలో జీవరాశులకు ఊతంగా నిలిచే అడవులు అంతరిస్తే ఆ ప్రభావం తీర ప్రాంత గ్రామాలపై పడే ప్రమాదం ఉంది. అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలకే పరిమితం అవుతోంది. శ్రీకాకుళం మొదలు నెల్లూరు జిల్లా వరకు విస్తరించిన ఈ అడవుల రక్షణ, అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ప్రభుత్వం కాపాడాల్సిన అవసరం ఉంది. -
ఆశల సాగుకు శ్రీకారం
బాపట్ల : గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బాపట్లలో వాతావరణం అనుకూలంగా మారడంతో పుడమి తల్లి సేద తీరింది. మట్టిని నమ్ముకొని జీవనం సాగించే కర్షకులను సాగుకు స్వాగతం పలికారు. ఈ ఏడాది సాగు కష్టతరమే అనుకున్న అన్నదాతల ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. ఓ వైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ అన్నదాతలు మాత్రం ససాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. గట్లు వేసుకోవడం, వాటిని చదును చేసుకోవడం, ఎరువులు చిమ్మడం, విత్తనాలు చల్లుకునే పనుల్లో మునిగారు. నిన్నటి వరకు బీడు భూములను తలపించేలా ఉన్న పొలాలను సైతం సాగు సిద్ధం చేస్తున్నారు. అందరి చూపు ఈ రకాల వైపే.. బాపట్ల నియోజకవర్గంలో ఖరీఫ్లో సాధారణంగా 24,500 హెక్టార్లు సాగు చేయాల్సి ఉంది. ప్రతి ఏడాది సుమారు మూడు వంతుల మేర బీపీటీ 5204 (సాంబ మసూరి), నెంబర్లు రకాలైన 523, 92, ఎన్ఎల్ఆర్ 28523 (శ్రీరంగ) సాగు చేపట్టేవారు. ఇసుక నేలల్లోని ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసే వారు మాత్రమే ఎన్ఎల్ఆర్ 145 వైపు మొగ్గు చూపేవారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. అసలు సాగుకే దూరమైన ఆయకట్టు శివారు ప్రాంతాల్లోని రైతులు ఈ సారి రూటు మార్చే పనిలో ఉన్నారు. మున్ముందు వర్షాలు ఉంటాయో... లేవోనన్న భయంతో ఎక్కువకాలం ఉండే రకాలను సాగుచేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే ఎన్ఎల్ఆర్ 145, బీపీటీ 5204 రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. నీటి సౌకర్యం ఉండి, బోర్లు ద్వారా అయినా సాగు చేయగలమనుకునే రైతులు మాత్రమే ఎక్కువ కాలం పట్టే రకాల వైపు చూస్తున్నారు. వెద పద్ధతే మేలంటున్న యంత్రాంగం ప్రస్తుత పరిస్థితుల్లో నార్లు పోసుకొని 25 రోజుల తర్వాత నార్లు పీకి మళ్లీ నాట్లు వేసుకునే కంటే వెద పద్ధతి మేలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాగు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఇలా చేస్తే పైరు నీటి ఎద్దడిని తట్టుకోవడంతోపాటు తక్కువ కాలంలోనే పంట చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. నారు పెంచడం, దమ్ము చేయటం, నాటు వేయించడం వంటివి కలుపుకొని ఎకరాకు సుమారు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం భూమిలో సరిపడా తేమ శాతం ఉంటుంది కాబట్టి మొక్క త్వరితగతిన బతికే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు కారణమైన మీథేన్, నైట్రస్ ఆకై ్సడ్ వాయువులు ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని, తద్వారా వాతావరణంలో కలిగే ప్రతికూల మార్పులను కూడా వెద సాగు తట్టుకుంటుందని వివరించారు. ఇన్నాళ్లు దాగుడు మూతలాడిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. చెరువులు... కాలువలకు జలకళ వచ్చింది. పదునెక్కిన భూములను చూసి సాగు పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు. వరుస వర్షాలకు పదునెక్కిన భూములు బాపట్ల నియోజకవర్గంలో రైతులు హర్షం సాగు పనులకు సిద్ధమైన అన్నదాతలు -
ప్రమాదవశాత్తు సివిల్ ఇంజినీర్ మృతి
నవీపేట: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని కోస్లీ గ్రామ సమీపంలోని చెరువులో పడి ప్రైవేట్ సివిల్ ఇంజినీర్ గుత్తి ఉమా గణేశ్(30) మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ శనివారం తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం గ్రామానికి చెందిన ఉమా గణేశ్ భైంసా నుంచి బోధన్ వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులలో సివిల్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అనూష ప్రాజెక్ట్లో కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న గణేశ్, నిర్మల్ జిల్లా బాసరలోని కార్యాలయంలో ఉంటూ విధులకు వెళ్లేవాడు. కోస్లీ శివారులో మొరం తవ్వకాలు జరగడంతో పర్యవేక్షణకు శుక్రవారం సాయంత్రం బైక్పై వెళ్లి తిరిగి రాలేదు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని ఎస్ఐ వినయ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుని తండ్రి మల్లేశ్వర్రావుకు సమాచారం అందించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడి కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వందవాసి మండలం పొదిరి గ్రామానికి చెందిన కొంతమంది 2022లో తెనాలి మండలం అంగలకుదురులో కూలి పనుల కోసం వచ్చి, కొన్ని రోజులు ఇక్కడ నివాసం ఉన్నారు. వీరితో వచ్చిన ఆరు గోపి అప్పట్లో మతిస్థిమితం లేని దివ్యాంగురాలైన 21 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబసభ్యులు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు గోపి శిక్ష పడుతుందన్న భయంతో కోర్టు వాయిదాలకు రాకుండా తమిళనాడులో ఉంటున్నాడు. పోలీసులు అతడిని తమిళనాడు నుంచి తీసుకువచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారు. నిందితుడి ఆచూకీ గుర్తించడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ డి. శ్రీనివాసరావు, ఏఎస్ఐ వెంకటరమణ, సీపీ సుబ్బారెడ్డిని పోలీసు అధికారులు అభినందించారు. -
పులిచింతలకు 20,077 క్యూసెక్కులు విడుదల
సత్రశాల (రెంటచింతల): సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రెండు యూనిట్ల నుంచి, రెండు క్రస్ట్గేట్ల ద్వారా మొత్తం 20,077 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు ఏపీ జెన్కో ప్రాజెక్టు డ్యామ్ ఈఈ సుబ్రమణ్యం, ఏడీఈ ఎన్.జయశంకర్ శనివారం తెలిపారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా 8,757 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతలకు విడుదల చేసి 1.874 ఎంఎం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు 2 క్రస్ట్గేట్ల ద్వారా 11,320 క్యూసెక్కులు వరద నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటిమట్టం ప్రాజెక్టు పూర్తి స్థాయి 75.50 మీటర్లకు నీరు చేరుకుందని, రిజర్వాయర్లో గరిష్ట స్థాయిలో 7.080 టీఎంసీలు నిల్వ ఉందని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ నెహ్రూనగర్ : కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో శనివారం ప్రకటించిన సర్వేక్షణ్ అవార్డుల్లో గుంటూరు నగరం స్థానం సాధించిందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపిక అయ్యాయని పేర్కొన్నారు. ఇందులో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు నగరం స్థానం దక్కించుకుందని వెల్లడించారు. న్యూ ఢిల్లీలోని విద్యా భవన్లో ఈ నెల 17న రాష్ట్రపతి అవార్డ్లను అందిస్తారని, తనతో పాటు మేయర్ వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో జాతీయ స్థాయిలో నగరం నిలవడానికి కృషి చేసిన ప్రజారోగ్య సిబ్బంది, అధికారులు, ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ కార్యవర్గం ఎన్నిక గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ (జీటీఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎంఎం షరీఫ్, డి.యల్లమందరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాత గుంటూరులోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన జీటీఏ ఉమ్మడి గుంటూరుజిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా రమాదేవి, అసోసియేట్ అధ్యక్షుడిగా ప్రభాకర్రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా చలపతిరావు, పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ.విజయకుమార్, సంయుక్త కార్యదర్శిగా పి. రమేష్బాబు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏ. దశరఽథ్కుమార్, సంయుక్త కార్యదర్శిగా ప్రశాంత్ బాబు నియమితులయ్యారు. ఇసుక అక్రమ తవ్వకాలను సహించం మంత్రి మనోహర్ కొల్లిపర: ఇసుక అక్రమ తవ్వకాలను సహించేది లేదని, సొంత పార్టీ వాళ్లయినా అక్రమానికి పాల్పడితే చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కృష్ణానది నుంచి ఇసుక తరలింపులో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన దృష్టికి రావడంతో శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ప్రారంభంలో ఇసుక నిల్వ.. ప్రస్తుతం అనే అంశాలపై రేపటిలోగా తనకు నివేదికను అందించాలని ఆదేశించారు. నదిలో అర్ధరాత్రి మిషన్లతో తవ్వకాలు జరుగుతున్నారని తనకి సమాచారం వచ్చిందని, దీనిపై సమాధానం చెప్పాలని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులను ఆయన ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోయేసరికి వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలు విషయం తేలే వరకు డంపింగ్ యార్డ్ నుంచి ఇసుకను తరలించవద్దని అధికారులను ఆదేశించారు. -
పర్యాటక కేంద్రంగా పెనుమూడి రేవు
రేపల్లె: కృష్ణమ్మ పరవళ్లను తాకుతూ వీచే చల్లటి గాలులు... చూపరులను ఆకర్షణీయంగా కనువిందు చేసే సహజసిద్ధ దీవులు... దీవులలో పక్షుల కిలకిల రాగాలు.... నదిలో విహరించటానికి నావలు... కాసేపు ఆనందంగా గడిపేందుకు ప్రకృతి అందాలను సంతరించుకున్న ప్రాంతమే పెనుమూడి. ఈ రేవు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఆదాయంతోపాటు తీర ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుంది. సహజ సిద్ధంగా దీవులు పెనుమూడి ప్రాంతంలో కృష్ణానది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడ్డ దీవులు మరింత అందాలను సంతరించుకున్నాయి. కృష్ణమ్మ కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. హంసలదీవిలో కలిసే ముందర కృష్ణా జిల్లా పులిగడ్డ–బాపట్ల జిల్లా పెనుమూడి మధ్యలో మూడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ పాయల మధ్యలో సహజ సిద్ధంగా ఉన్న దీవులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. బోటు షికారుకు అనుకూలం పెనుమూడి రేవులో బోటు షికారుకు అనువైన ప్రాంతంగా ఉంది. పెనుమూడి రేవుకు 20 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉండటంతో ఆటుపోట్ల ప్రభావంతో ఈ ప్రాంతంలో నీటి పరిమాణం ఏమాత్రం తగ్గుదల ఉండదు. సెలవుల సమయంలో పలు ప్రాంతాల నుంచి వర్యాటకులు ఆ ప్రాంతానికి వచ్చి సాధారణ పడవలు మాట్లాడుకుని సరదాగా తూర్పువైపున ఉన్న దీవిలోకి వెళ్లటంతోపాటు నదిలో ప్రయాణించి సరదాగా గడుపుతూ ఉంటారు. ఆప్రాంతంలో బోటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ ప్రాంతం సినిమా షూటింగ్లకు అనువైనదిగా ఉంది. గతంలో చిత్రీకరణలు జరిగాయి. గతంలో జయ జానకీ నాయక సినిమాలో ఒక సన్నివేశం వారధిపై చిత్రీకరించారు. సినీ నటుడు ఆలీ నటించిన పండుగాడు ఫొటో స్టూడియో సినిమాలోని పలు సన్నివేశాలను పెనుమూడి రేవుతోపాటు దీవులలో చిత్రీకరించారు. డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జీవిత చరిత్రపై తీసిన సినిమాతోపాటు పలు టెలీఫిలిమ్ల షూటింగ్లు జరిగాయి. అభివృద్ధికి అనువుగా పెనుమూడి నది మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ దీవులు బోటు షికారుకు అనువైన ప్రాంతం సినిమా షూటింగ్లకు తగిన రమణీయ దృశ్యాలు టూరిజంపై దృష్టి సారించాలి పెనుమూడి రేవును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ టూరిజం శాఖ దృష్టి సారించాలని తీరప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఆ దిశగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రాంతం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఎంతో మందికి ఉపాధి కలగటంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది. -
బాపట్ల
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025పనులు లేని సమయంలో పేదలకు పని కల్పించి ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తెచ్చింది. అయితే కొంతమంది పెద్దలు, అవినీతి అధికారులు కలసి తమకు ఉపాధిగా మార్చుకున్నారు. మైనర్ల పేరుతో జాబ్ కార్డులు సృష్టించి ఉపాధి సొమ్మును స్వాహా చేస్తున్నారు. దీంతో వాస్తవంగా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. 7న్యూస్రీల్ -
ఫిరాయింపుదారులకే పగ్గాలు
చీరాల: ‘పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని.. పక్క పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వారి కంటే పార్టీనే నమ్ముకున్న వారికి న్యాయం చేస్తాం’ అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు. అయితే ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి. చెప్పేదొకటి.. చేసేదొకటి.. అనే తీరున చీరాల నియోజకవర్గంలో టీడీపీ వ్యవహార శైలి ఉంది. పార్టీ అధినేత చెప్పిన మాటలనే పెడచెవిన పెట్టి పక్క పార్టీలో నుంచి టీడీపీలో చేరిన వారికే ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కౌన్సిలర్కు దక్కని గౌరవం పార్టీనే నమ్ముకుని కష్టాలు పడి పార్టీ కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం దూరంగా ఉంటున్నారు. పార్టీ జెండాను భుజాన వేసుకుని పనిచేసిన వారిలో కొంత మంది మౌనం పాటిస్తున్నారు. అయితే పార్టీని నమ్ముకున్న వారికి మాత్రం సరైన గౌరవం లభించడం లేదు. చీరాల మున్సిపాలిటీలో టీడీపీ సింబల్పై గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సింబల్పై పోటీ చేసేందుకు ఎంతో మంది పోటీపడ్డారు. అయితే టీడీపీ తరఫున ఆయన 3వ వార్డులో పోటీ చేసి గెలుపొందారు. అనూహ్యంగా కొన్ని వార్డుల్లో పోటీ చేసిన టీడీపీ అన్నింటా ఓడినా మూడో వార్డు మాత్రం గెలుచుకున్నారు. టీడీపీ అధినేత చెప్పిన విధంగా పార్టీ తరుఫున గెలిచిన కౌన్సిలర్కు సరైన గౌరవం ఇవ్వాల్సి ఉండగా ఇటీవల టీడీపీలో చేరిన వారికే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కూటమి అధిష్టానం కూడా పార్టీ తరఫున గెలిచిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేకు సూచించినట్లు సమాచారం. అందుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించి కూటమికి మద్దతు పలికిన వారే హవా చూపిస్తున్నారు. పార్టీ ఫిరాయింపుదారులదే పైచేయి చీరాల మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎక్కువ సంఖ్యలో గెలిచి మెజార్టీ ఎక్కువగా ఉండడంతో వైఎస్సార్సీపీనే చైర్మన్ పీఠం కై వసం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఓటమి పాలవడంతో అప్పటి వరకు పార్టీలో ఉన్న కౌన్సిలర్లు కూటమికి మద్దతు పలికారు. ప్రస్తుతం కూటమిలో వెళ్లిన కౌన్సిలర్లదే హవా నడుస్తోంది. అప్పటి వరకు వెన్నంటే నడిచిన వారంతా కూటమి చెంతకు చేరి చైర్మన్ జంజనం శ్రీనివాసరావును ఎలాగైనా చైర్మన్ పీఠం నుంచి దించేందుకు కౌన్సిలర్లు అందరూ కూటమి కట్టారు. కౌన్సిలర్ల పదవీకాలం ఎనిమిది నెలలు మాత్రమే ఉండగా ఎమ్మెల్యేపై కౌన్సిలర్లు ఒత్తిడి తీసుకువచ్చి అవిశ్వాస తీర్మానం చేయించారు. పక్క పార్టీ నుంచి వచ్చినవారికి గ్రీన్ కార్పెట్ పార్టీ సింబల్పై గెలిచిన కౌన్సిలర్కు దక్కని గౌరవం చీరాల టీడీపీలో వింత పోకడలు 16న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చైర్మన్ పీఠంపై పలువురు కౌన్సిలర్లు మొగ్గు చైర్మన్ కుర్చీ కోసం పలువురు కౌన్సిలర్లు పోటీ పడుతున్నారు. పోటీపడుతున్న వారందరూ మొన్నటి వరకు వైఎస్సార్ సీపీలో ఉన్నవారే. టీడీపీ తరఫున గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావును కాకుండా వైఎస్సార్సీపీని వీడి కూటమికి మద్దతు పలికిన కౌన్సిలర్లే చైర్మన్ సీటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిది నెలల పదవీకాలం మాత్రమే ఉన్నా అవిశ్వాసం పెట్టించి తిరిగి చైర్మన్గా కొత్తవారిని ప్రకటించేందుకు కూటమికి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు ఊవ్విళ్లూరుతున్నారు. చైర్మన్ పీఠం కోసం క్యాంపు రాజకీయాలు.. ప్రలోభాలు.. టూర్లు అంటూ కౌన్సిలర్లను కొద్దిరోజులపాటు తిప్పారు. అయితే రేసులో ఉన్నవారంతా మిగిలిన కౌన్సిలర్లను తమకు మద్దతుగా ఓటు వేస్తారా అనేది ఆశావహుల శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంది. మే14న అవిశ్వా సం జరగగా అప్పటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు కౌన్సిల్ సమావేశాలను నిర్వహించలేదు. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ప్రకటన రాగా చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా... ఓటింగ్ నిర్వహిస్తారా అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆశావహుల ఆశలు ఫలిస్తాయా.. ఫెయిల్ అవుతాయానేది సందిగ్దంలో ఉంది. -
బాబూ.. కృష్ణా కరకట్టకేదీ రక్షణ?
హామీలివ్వడం.. ఆపై వాటి ఊసే ఎత్తకపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కృష్ణా కరకట్ట బలోపేతానికి చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేశారు. కానీ, ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచినా అతీగతీ లేదు. వానాకాలం వస్తున్న నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని తీరప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని భయపడుతున్నారు. ఇకనైనా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతున్నారు. రూ.222 కోట్లతో అభివృద్ధి చేసిన వైఎస్సార్ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ నుంచి లంకెవాని దిబ్బ వరకు కరకట్ట అభివృద్ధితోపాటు రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.222 కోట్లు కేటాయించి, పనులు చేయించారు. ఈ పనులే నేటి వరకు రక్షణ కవచంలా కాపాడుతున్నాయి. రేపల్లె: కృష్ణా నదీ తీరానికి రక్షణ కవచంగా నిలవాల్సిన కరకట్ట భద్రతా లోపాలతో ప్రజలను భయపెడుతోంది. పలు చోట్ల బలహీనంగా మారడం, అక్రమ పైపులైన్ల ఏర్పాటు, అధికారుల నిర్లక్ష్యం, పాలకుల హామీలను మర్చిపోవటం కలిసి ప్రజలకు ఆందోళన మిగిల్చాయి. ఓలేరు నుంచి లంకెవాని దిబ్బ వరకు 35 కిలోమీటర్ల మేర కరకట్ట పలుచోట్ల బలహీనంగా ఉంది. వరదల కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీసం చర్యలు చేపట్టకపోవడంతో తీర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరకట్టను పటిష్టం చేస్తామని గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కరకట్ట పటిష్టతకు చర్యలు చేపట్టకపోవడంతో తీర ప్రాంత వాసులు పెదవి విరుస్తున్నారు. పైప్లైన్లతోనే పొంచి ఉన్న ప్రమాదం నిబంధనల ప్రకారం కరకట్టకు 500 మీటర్ల దూరంలోపు ఎటువంటి చెరువుల తవ్వకాలు జరపకూడదు. పెనుమూడి నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్టకు ఆనుకొని సుమారు రెండు వేల ఎకరాలకుపైగా భూములను చెరువులుగా తవ్వి పలువురు ఆక్వా సాగు చేస్తున్నారు. వాటికి నీరు అందించడానికి పక్కనే ఉన్న బ్యాంక్ కెనాల్ నుంచి కరకట్టను తవ్వి అక్రమంగా పైపులు ఏర్పాటు చేశారు. దీనివల్ల కరకట్ట బలహీనపడి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఓలేరు వద్ద గండి పడిన సందర్భంలో లీకేజీ వద్ద నుంచే కరకట్ట కోతకు గురై కృష్ణమ్మ రేపల్లె పట్టణాన్ని ముంచెత్తింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పలుచోట్ల బలహీనంగా నది కరకట్ట వందల సంఖ్యలో అక్రమంగా పైపులైన్లు పటిష్టం చేస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఏడాది గడిచినా ఆ ఊసే ఎత్తని సీఎం ఇకనైనా చర్యలు తీసుకోవాలంటున్న తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి నివేదిక పంపాం ఓలేరు నుంచి లంకెవానిదిబ్బ వరకు కరకట్ట పటిష్టతకు సర్వే నిర్వహించాం. అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించాం. నిధులు మంజూరైన వెంటనే పనులను ప్రారంభిస్తాం. కరకట్టకు ఏర్పాటు చేసిన అక్రమ పైప్లైన్లను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశాం. – నాగేశ్వర నాయక్, కరకట్ట పర్యవేక్షణ అధికారి గత ఏడాది తప్పిన ముప్పు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 అక్టోబర్ 2న ఉగ్రరూపం దాల్చుతూ నది ప్రవహించింది. 11.38 లక్షల క్యూసెక్కులతో కడలి వైపు పరుగులు తీసింది. ఆ సమయంలో కరకట్ట పైనుంచి తాకి ప్రవహించింది. పలు ప్రదేశాలలో కట్ట బలహీనపడి నీటి లీకులు వచ్చాయి. రేపల్లె మండలం మైనేనివారిపాలెం వద్ద అప్రమత్తమైన ప్రజలు అధికారులతో కలిసి ఇసుక బస్తాలు, బంకమట్టితో కరకట్టను పటిష్ఠం చేశారు. కనగాలవారి పాలెం, పిరాట్లంక, రాజుకాల్వ ప్రాంతాలలో బలహీనంగా ఉన్న కరకట్టను పటిష్ఠ పరిచారు. రేపల్లె మండలం రావి అనంతవరం సమీపంలో కరకట్ట పలుచోట్ల బలహీనపడి లీకులు రావటంతో అధికారులు, ఆయా గ్రామాల ప్రజలు ఇసుక బస్తాలు సాయంతో తాత్కాలికంగా బలోపేతం చేశారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటం
బల్లికురవ: గ్రానైట్ లారీలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మితిమీరిన వేగం, అనుభవలేమితో ఎక్కడ ఎప్పుడు ఎలా ఢీ కొడతారోనని వాహన చోదకులు, పాదచారులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ, సంతమాగులూరు మండలంలోని గురిజేపల్లి, కొండల నుంచి స్టీల్గ్రే, బ్లాక్ పెరల్ గ్రానైట్ క్వారీలున్నాయి. రెండు మండలాల్లో విస్తరించి ఉన్న ఈ ఖనిజానికి అనుబంధంగా సుమారు వెయ్యి పైగా పరిశ్రమలు ఉంటాయి. గ్రానైట్ మీటరు, ముడిరాళ్లు, వృథా మెటీరియల్, పలకల వంటి ఎగుమతులను మార్టూరు, గుళ్లపల్లి, కృష్ణపట్నం పోర్టు, అనంతపురం, బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ పట్టణాలకు నిత్యం 500 పైగా లారీల ద్వారా ఎగుమతులు చేస్తుంటారు. లైసెన్స్ లేకుండానే.. సాధారణ లారీల కంటే గ్రానైట్ లోడు విపరీతమైన బరువుతో ఉంటాయి. 90 టన్నుల నుంచి 150 టన్నుల వరకు లోడు చేసే లారీలను ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్లు మాత్రమే నడపగలరు. కానీ లారీల యజమానులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బల్లికురవ, మార్టూరు రోడ్డులో ఆటోలు నడిపే వారు, పొలాల్లో ట్రాక్టర్లతో దుక్కులు దున్నే వారిని లారీ డ్రైవర్లుగా నియమిస్తున్నారు. కనీసం లైసెన్స్ అంటే ఏమిటో కూడా తెలియని వారు అధికంగా ఉన్నారు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనుభవం ఉన్న డ్రైవర్లను రెండు మండలాల్లో వేళ్ల మీద లెక్కించవచ్చు. అందుకే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్లు, ఇన్సూరెన్స్లు చెల్లించకుండానే లైన్ మాముళ్లతో అనుభవంలేని డ్రైవర్లతో నెట్టుకొస్తున్నారు. ఎటు చూసినా ధ్వంసం ఇటీవల బల్లికురవ, ఈర్లకొండ క్వారీలనుంచి రాళ్లు ఎగుమతి చేసే లారీ డ్రైవర్ సాయంత్రం 4 గంటల సమయంలో బల్లికురవ వస్తూ వల్లాపల్లి–అంబడిపూడి గ్రామాల మధ్య మార్జిన్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టాడు. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవటం వల్ల పెను ప్రమాదం తప్పింది. వల్లాపల్లి సబ్స్టేషన్ నుంచి అంబడిపూడి, గుంటుపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరానిచ్చే మెయిన్ లైన్ కావటంతో ఆశాఖ అధికారులు హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరి కొత్త విద్యుత్ పోల్ ఏర్పాటుతోపాటు తెగిన సప్లయ్ వైర్లు సరిచేసేందుకు 4 గంటలపాటు శ్రమించారు. తరచూ ప్రమాదాలు చెన్నుపల్లి అనంతవరం రోడ్డులో మల్లాయపాలెం–వేమవరం గ్రామాల మధ్య ఇటీవల అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతానికి చెందిన మేకల నాగార్జున గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తూ భోజనానికి పల్సర్ బైకుపై వెళ్తుండగా మలుపులో ఎదురుగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకు, లారీ కిండ పడి నుజ్జునుజ్జు అయింది. నాగార్జున త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి గాయాలపాలై వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. నూతనంగా జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మట్టి తరలించే టిప్పర్లు సుమారు 360 పైచిలుకు తిరుగుతున్నాయి. ఇవి మితిమీరిన వేగంతో వెళ్తూ గ్రానైట్ లారీలు, టిప్పర్లు వేగానికి వాహనచోదకులు రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఓడరేవు చీరాల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భాగంగా మట్టి తరలించే టిప్పర్లు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్లకు పర్చూరు, అన్నంబోట్లవారిపాలెం ప్రాంతాల్లో నలుగురు బలయ్యారు. తనిఖీలు ఎక్కడ? గతేడాది కాలంలో బ్రేక్ ఇన్స్పెక్టర్లు కేసులు నమోదు చేసిన ఘటనలే లేవు. గత ప్రభుత్వ హయాంలో బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల్లో విస్తృత తనిఖీలతో డ్రైవర్ లైసెన్స్లేని వారికి ట్యాక్స్లు చెల్లించని, ధ్రువీకరణ పత్రాలు లేనివారికి అపరాధ రుసుంతో కేసులు నమోదుతో అప్పట్లో లారీ యజమానులు హెవీె లైసెన్స్ ఉన్న వారిని డ్రైవర్లుగా నియమించుకున్నారు. అనుభవంలేని డ్రైవర్లను నియమించుకోవటం వల్ల తరచూ ప్రమాదాలతోపాటు రాళ్లు దొర్లి రోడ్లపై పడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. గ్రానైట్ ఎగుమతి లారీలు, టిప్పర్లకు అనుభవం లేని డ్రైవర్ల నియామకం తరచూ ప్రమాదాలు భయాందోళనలో ప్రజలు బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల్లో 860 పైగా లారీలు, టిప్పర్లు లైసెన్స్ ఉన్న డ్రైవర్లను నియమించుకోండి గ్రానైట్ రాళ్లు తరలించే లారీలకు అనుభవంతోపాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారినే డ్రైవర్లుగా నియమించుకోవాలి. అప్పుడే సురక్షితంగా గమ్యం చేరటంతోపాటు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చు. – వై.నాగరాజు, ఎస్ఐ -
సాగునీటి కాలువల్లో అవినీతి పూడిక
సాక్షి ప్రతినిధి, బాపట్ల: నగరం మండలం అద్దంకివారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వీరాస్వామి పిల్లలు రేష్మా 13 సంవత్సరాలు (8వ తరగతి,) హారిక 11 సంవత్సరాలు (7వ తరగతి) గూడవల్లి భారతి పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో రేష్మాకు 22 సంవత్సరాలు(జాబ్కార్డు నంబర్ 100075), భారతికి 21 సంవత్సరాలు (జాబ్కార్డు నంబర్ 100076) వయస్సు వేసి జాబ్కార్డులు పుట్టించి మైనర్లుగా ఉన్న వారిపేరున పోస్టాఫీసులో ఖాతాలు తెరిచి కాలువ పనులు చేసినట్లు నగదును ఖాతాలకు మళ్లించారు. వీరా స్వామి తమ్ముడు కిషోర్ కుమార్తె లక్ష్మి మైనర్కాగా ఆమెకు 21 సంవత్సరాల వయస్సు చూపించి( జాబ్కార్డు నంబర్ 100079) పేరున అదే పోస్టాఫీసులో ఖాతా తెరిచి పనులు చేసినట్లు డబ్బులు డ్రా చేశారు. చరణ్ (జాబ్కార్డు నంబర్ 100071)అనే వ్యక్తి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగి కాగా ఇక్కడ జాబ్కార్డు పుట్టించి నెల రోజులపాటు ఆయన ఖాతాలోకి డబ్బులు మళ్లించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క నగరం మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీలో ఫేక్ మస్టర్ల జాబితా చాంతాడంత. పచ్చనేతలు, సీనియర్ మేట్లు కలిసి ఉపాధిలో అక్రమాలకు తెగబడగా డ్వామా అధికారులు వాటాలు పుచ్చుకొని వారి అవినీతికి వెన్నుదన్నుగా నిలవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పచ్చ నేతలకు ఉపాధిగా మారింది.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జిల్లాలో పచ్చపార్టీ నేతలు అక్రమాలకు అడ్డాగా మార్చారు. పనులు చేసిన పేదలకు సరైన కూలీ కల్పించాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు ఆ సంగతి గాలికి వదలి పనికి హాజరుకాని వారిని పనులకు వచ్చినట్లు మస్టర్లో చూపించి డబ్బులు కొట్టేస్తున్నారు. చేసిన పని మేరకు కొలతలు చూసి డబ్బులు ఇస్తే వాస్తవంగా పనిచేసిన కూలీలకు గిట్టుబాటు లభిస్తుంది. కానీ ఫేక్మస్టర్లకు డబ్బులు షేర్ చేస్తుండడంతో నిజంగా పనిచేసిన పేదలు నామమాత్రపు కూలీతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అక్రమాలలో వాటాలు ఫేక్ మస్టర్ల పేరుతో కొట్టేస్తున్న డబ్బులను ఫీల్డ్ అసిస్టెంట్లు తనకు ఉద్యోగం ఇచ్చిన పచ్చనేతతోపాటు డ్వామా అధికారులకు వాటాలు పంచుతున్నారు. వాస్తవానికి ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి కొత్తవారిని నియమించుకోవాలంటే గ్రామ పంచాయతీ తీర్మానం అవసరం. జిల్లాలోని చాలా పంచాయతీల్లో వైఎస్సార్ సీపీకి చెందిన సర్పంచ్లు ఉండటంతో పచ్చనేతలు ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించి సీనియర్ మేట్ల పేరుతో కొత్తవారిని నియమించుకున్నారు. ఇందుకోసం ఒక్కరి వద్ద రూ.రెండు లక్షల వరకూ వసూలు చేశారు. ఉపాధి పనుల్లో వాటాలు పంచాలని ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు ఫేక్ మస్టర్ల డబ్బుల్లో సగం డబ్బులు స్థానిక పచ్చనేతకు చెల్లిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు మిగిలిన మొత్తంలో టెక్నికల్ అసిస్టెంట్, ఏపీవోలతోపాటు డ్వామా జిల్లా అధికారికి వాటాలు పంచుతున్నారు. షాట్ నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్లో అక్రమాలు వెలుగు చూస్తున్నా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి డ్వామా అధికారులు ఏపీడీ విచారణ అస్త్రాన్ని ప్రయోగించి అక్రమాలను కప్పిపుచ్చుతున్నట్లు ఆ శాఖ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ఒక్కొక్క సోషల్ ఆడిట్కు జిల్లా అధికారులు రూ.లక్షకు తగ్గకుండా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. వేసవిలో రూ.కోట్లాది నిధులతో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా కృష్ణా, నాగార్జునసాగర్ కాలువల పరిధిలో ఇటీవల పూడికతీత పనులు చేసినట్లు హడావుడి చేశారు. మరోవైపు కాలువలకు నీటి విడుదల మొదలైంది. ఏడాది తర్వాత జరిగే సోషల్ ఆడిట్ నాటికి కాలువ పూడికతీత పనులు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు కనిపించవు. ఇదే అవకాశంగా పచ్చనేతలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వామా అధికారులు కలిసి ఆధునికీకరణ పనుల పేరుతో కోట్లాది రూపాయల నిధులు బొక్కినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ జరిపితే అక్రమాలు వెలుగుచూసే అవకాశముంది. -
సహోద్యోగి కుటుంబానికి అండగా కానిస్టేబుళ్లు
చీరాల: సహోద్యోగి అకాల మరణంతో కుటుంబాన్ని ఆదుకునేందుకు తామున్నామంటూ కానిస్టేబుళ్లు ముందుకు వచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 2009 బ్యాచ్ కానిస్టేబుల్ బిల్లా రమేష్ ఇటీవల అకాల మరణం చెందారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రూ.1.58 లక్షలను సమకూర్చారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ శుక్రవారం వేటపాలెంలోని బిల్లా రమేష్ ఇంటికి వెళ్లి వృద్ధాప్యంలో ఉన్న అతని అమ్మమ్మకు నగదును అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ రమేష్ చిన్న తనంలోనే తల్లిని కోల్పోయాడని, అమ్మమ్మ దాసరి సుబ్బులు అన్ని బాధ్యతలు తీసుకుని పెంచి పోషించిందని తెలిపారు. రమేష్ అకాల మరణంతో కష్టకాలంలో 2009 కానిస్టేబుల్ బ్యాచ్కు చెందిన అతడి మిత్రులు నగదును సమకూర్చారని చెప్పారు. ఇది ఇతర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. రూ.1.58 లక్షలు సమకూర్చిన మిత్రులు -
రైతన్నల క‘న్నీటి’ తడులు...
వాతావరణ పరిస్థితుల్లో విపరీతమైన మార్పుల ప్రభావం ఖరీఫ్ రైతాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. ముందుగా వెద పద్ధతిలో సాగైన పంటకు నీరందక ఎండుపోతున్నాయి. అదనుకు కురవాల్సిన వర్షాలు పడకపోవడంతోపాటు ఎండలు మండుతూ, విపరీతమైన వేడి గాలులు వీస్తుండటంతో మొలక దశలో ఉన్న వెద పద్ధతిలోని వరి మొక్కలు దెబ్బతింటున్నాయి. బీటలు వారిన పొలాలకు డీజిల్ ఇంజిన్లు, విద్యుత్తు మోటార్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు, అమృతలూరు, చుండూరు మండలాలలో విత్తనాల తరుణం కావడం, ఇటు వర్షాలు పడకపోవడం, సాగు నీటి కాలువల ద్వారా నీరు విడుదల కాక సమయం మించిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – కొల్లూరు -
హాస్టళ్లలో వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం
రేపల్లె: హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందని ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎం.సూర్యప్రకాశ్ విమర్శించారు. పట్టణంలోని అంబేడ్కర్ బాలికల గురుకుల వసతి గృహాన్ని శుక్రవారం ఎస్ఎఫ్ఐ బృందం పరిశీలించింది. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ హాస్టల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 618 మంది విద్యార్థినులు ఉన్న గురుకులంలో ఆర్వో ప్లాంట్ పనిచేయక తాగునీటి కోసం అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు. మోటర్ పనిచేయక పోవడంతో స్నానాలు, ఇతర అవసరాలకు కింద నుంచి మూడవ అంతస్తు వరకు నీటిని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని వివరించారు. ఫిబ్రవరిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయులు వసతి గృహాన్ని సందర్శించిన సమయంలో ఆయా సమస్యలను విద్యార్థినులు ఆయనకు వివరించారని గుర్తు చేశారు. వారం రోజుల్లో ఆర్వో ప్లాంట్ బాగు చేయిస్తామని, నిధులు వెంటనే కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించి నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం సిగ్గుచేటని ఖండించారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థినుల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కేవీ లక్ష్మణరావు, బాలికల విభాగం కన్వీనర్ కె.భవాని, పి.నిఖిత, వై.నవీన్ పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సూర్యప్రకాశ్ -
ఓటరు క్లెయిమ్ల విచారణ వేగవంతం చేయండి
చీరాల టౌన్: బీఎల్వోలు విధులను సమర్థవంతంగా నిర్వహించి ఓటరు క్లెయిమ్ల విచారణ వేగవంతం చేయాలని ఈఆర్వో, ఆర్డీఓ టి.చంద్రశేఖర నాయుడు సూచించారు. శుక్రవారం చీరాల మండల పరిషత్ కార్యాలయం సమావేశపు హాలులో చీరాల నియోజకవర్గంలోని బీఎల్వోలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటరు అర్జీలు పెండింగ్లో లేకుండా పనిచేయాలన్నారు. నిశితంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో విచారణ చేయాలని పేర్కొన్నారు. అభ్యంతరాల వివరాలను తెలియజేయాలని కోరారు. మృతుల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. విచారణ ఈసీ నిబంధనల ప్రకారం చేయాలని కోరారు. సమస్యలుటే తమకు తెలియజేయాలని సూచించారు. తహసీల్దార్ కె.గోపీకృష్ణ, ఎన్నికల డీటీ సుశీల, మున్సిపల్, వేటపాలెం మండలాల్లోని బీఎల్వోలు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
బాపట్ల టౌన్:ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎంప్లాయీస్ యూనియన్ లక్ష్యమని ఆ యూనియన్ కార్యదర్శి వైఎస్ రావు తెలిపారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ ఆవరణంలో శుక్రవారం ఎంప్లాయీస్ యూనియన్ 74వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వైఎస్ రావు మాట్లాడుతూ 74 సంవత్సరాలుగా ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ కార్మికుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఉద్యోగులకు కావాల్సిన సౌకర్యాలు, వారికి రావలసిన రాయితీలు, ఉద్యోగులకు అందించే ప్రయోజనాల కోసం కీలకపాత్ర పోషిస్తుందన్నారు. బాపట్ల డిపో కార్యదర్శి వై.నరసింహారావు మాట్లాడుతూ క్యాజువల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయించడంలో, సమాన పనికి సమాన వేతనం, యూనిఫామ్ ఇప్పించడం, వైద్య సౌకర్యాలు అందించడంలో ఎంప్లాయీస్ యూనియన్ చేసిన కృషి మరువలేనిదన్నారు. కార్యక్రమంలో బాపట్ల డిపో అధ్యక్షులు టి.చంద్రశేఖర్, టి.యస్.నారాయణ, ఎం.కోటేశ్వరరావు గ్యారేజ్ సెక్రటరీ చలపతి, సి.సి.ఎస్. డెలిగేట్ ఎం.పి.కుమార్, సీనియర్ సభ్యుడు ఐ.యస్.రావు, బాపట్ల జిల్లా ఏపీ జేఏసీ అమరావతి మహిళా చైర్ పర్సన్ పి.రజిని పాల్గొన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి వై.ఎస్.రావు -
అస్మదీయుడికి నామినేటెడ్ పదవి
వేమూరు: కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాదారులకు నామినేటెడ్ పదవులు లభించడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊసా రాజేష్కు వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా పదవి కట్టబెడ్డటంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. చావలి గ్రామానికి చెందిన ఆయన మెయిన్ సెంటరులో ప్రభుత్వం భూమి కబ్జా చేసినట్లు గ్రామస్తులు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అందులో ఏర్పాటు చేసిన చికెన్ స్టాల్ తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసినా రాజేష్ పట్టించుకోలేదు. చికెన్ స్టాల్ తొలగించకుండా ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులపై కోర్టుకు వెళ్లాడు. ఇది కాకుండా గ్రామంలోని చెరువు స్థలం కూడా ఆక్రమించుకుని, రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించుకున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీన్ని కొల్లూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తప్పుడు సర్వే నంబర్ వేసి భార్యపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది. పైగా భవనంపై ప్రైవేటు ఫైనాన్స్ నుంచి రుణాన్ని కూడా తీసుకున్నట్లు గ్రామంలో గుసగుసలు విన్పిస్తున్నాయి. భూ కబ్జాలతో పాటు రాజేష్ ఏప్రిల్ 24న దళిత యువకుడిపై చెప్పుతో దాడి చేశాడు. దీనిపై ఎస్సీ ఎట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఇటువంటి వ్యక్తికి కూటమి ప్రభుత్వం నామినేటివ్ పదవి ఇవ్వడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. పైకి జనసేన నేతలు సిద్ధాంతాలు చెబుతూ, లోపల భూకబ్జాదారులకు పదవులు ఇస్తోందని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కళ్లు తెరవాలని, పార్టీ కోసం పని చేసిన వ్యక్తులను గుర్తించి పదవులు ఇవ్వాలని, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. -
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి
నాదెండ్ల: ఓ యంత్ర పరికరాన్ని దిగుమతి చేసేందుకు వచ్చిన లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎన్టీఆర్ జిల్లా చిరువూరు మండలం, వావిలాల గ్రామానికి చెందిన దంతాల వీరభద్రరావు (67) చిలకలూరిపేటలో లారీ ట్రాలర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం నరసరావుపేటలో ఓ యంత్ర పరికరాన్ని లోడ్ చేసుకుని గణపవరం గ్రామానికి వచ్చాడు. శుక్రవారం ఉదయం కూలీలు రాకపోయేసరికి 10 గంటలకు ట్రాలర్ యజమానికి ఫోన్ చేసి తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పాడు. సమీపంలోని దుకాణంలో గ్యాస్ తగ్గడానికి పౌడర్ ప్యాకెట్ తీసుకుని నీటిలో కలిపి తాగాడు. లారీలో విశ్రాంతి తీసుకున్నాడు. 11.30 గంటల సమయంలో ట్రైలర్ యజమాని ఫోన్ చేయగా వీరభద్రరావు ఫోన్ స్విచాఫ్లో ఉంది. దీంతో యజమాని అక్కడకు చేరుకుని చూడగా, వీరభద్రరావు లారీలో మృతి చెంది కనిపించాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి నాదెండ్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై జి.పుల్లారావు మృతుడి కుమారుడితో ఫోన్లో మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామానికి పంపారు. గుండెపోటు కారణంగా వీరభద్రరావు చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
సంతమాగులూరు(అద్దంకి): సంతమాగులూరు(అద్దంకి): మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన ఊదరగుడి సురేష్ కనిపించచడం లేదని అతని తండ్రి మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య శుక్రవారం తెలిపారు. సురేష్ ఈ నెల 8వ తేదీ ఉదయం బాపట్ల దగ్గరలో ఉన్న నరసాయపాలెం గ్రామంలో అతని బంధువు చనిపోవడం వలన అక్కడికి వెళ్లి తిరిగి అదే రోజు సాయంత్రం 8 గంటలకు మార్టూరు వచ్చాడు. అక్కడ నుంచి ఇంటికి వస్తున్నానని భార్య నాగవేణికి ఫోన్ చేసి చెప్పాడు. అయితే తర్వాత ఎంతకీ రాకపోవడతో భార్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ కావడంతో ఆందోళన చెందారు. ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు, ఎరుపు రంగుతో ఉంటాడని, బయటకు వెళ్లేటప్పుడు మెరూన్ రంగు నిండు చేతుల చొక్కా, తెలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. సదరు వ్యక్తి గురించి తెలిసిన వారు సంతమాగులూరు ఎస్ఐ 9121102168 నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు. మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధికార ప్రతినిధిగా సంగీతరావు సత్తెనపల్లి: మాదిగ లాయర్స్ ఫెడరేషన్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధికార ప్రతినిధిగా బొక్కా సంగీతరావు ఎన్నుకున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎల్ఎఫ్ రాష్ట్ర ఇన్చార్జి, సీనియర్ న్యాయవాది పూసులూరి జీవా అధ్యక్షతన గుంటూరులో జరిగిన సమావేశంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన న్యాయవాది బొక్కా సంగీతరావుని ఉమ్మడి గుంటూరు (గుంటూరు, బాపట్ల, పల్నాడు)జిల్లా అధికార ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సంగీతరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో న్యాయవాదుల సమస్యలు పరిష్కారం దిశగా పనిచేస్తానన్నారు. మాదిగల 30 ఏళ్ల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ కూటమి ప్రభుత్వంలో నెరవేరడం మాదిగ జాతి ప్రజల అదృష్టమన్నారు. అందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యాహ్నభోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు నకరికల్లు: విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠినచర్యలు తీసుకుంటామని డెప్యూటీ డీఈఓ ఏసుబాబు హెచ్చరించారు. నకరికల్లులోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదని గురువారం తల్లిదండ్రులు ఆందోళన చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాల మేరకు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచి చూశారు. నాణ్యతను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ముందుగా బియ్యం, కూరగాయలు నాణ్యతను పరిశీలించుకున్నాక వండాలని సూచించారు. వంట గదులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. మరోసారి నాణ్యత లోపించినా, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వచ్చినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ కె.పుల్లారావు, జాలాది శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. -
ఆది ఆంధ్ర కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడుగా గుండాల ఎన్నిక
బాపట్ల: దగ్గుమళ్లివారిపాలెంలోని ఆది ఆంధ్ర కో–ఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీ అధ్యక్షుడిగా గుండాల విజయ్ డేవిడ్రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ఏవీవీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎన్నికల అధికారి లలిత కుమారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఆది ఆంధ్ర కోఆపరేటివ్ సొసైటీలో మొత్తం 177 మంది సభ్యులు ఉండగా ఎన్నికల్లో 158 మంది సభ్యులు పాల్గొన్నారు. అంతా ఆమోదం తెలపడంతో అధ్యక్షుడిగా గుండాల విజయ్ డేవిడ్రాజు, ఉపాధ్యక్షుడిగా బి.వెంకటస్వామి, డైరెక్టర్లుగా బిల్లా ఎడ్విన్ రాజు, సలగల ఏసమ్మ, కూచిపూడి పరిశుద్ధం, మేకల సత్యానందం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికను ఎన్నికల అధికారి లలితకుమారి అధికారికంగా ప్రకటించారు. అధ్యక్షుడు గుండాల విజయ డేవిడ్రాజు మాట్లాడుతూ ఆది ఆంధ్ర సొసైటీ ఎన్నికల్లో వరుసగా నాలుగో సారీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎన్నికల అధికారి లలితకుమారి అధ్యక్షుడికి నియామక పత్రాన్ని అందించారు. -
కొత్త కోర్సులు పిలుస్తున్నాయి.. బ్రో !
వేటపాలెం: కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేసినా యువకులకు కొలువులు దక్కడం లేదు. ఇంటి దగ్గరే ఉంటున్న పిల్లలను చూసి పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పట్టణాలకు వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ, చాలీచాలని జీతాలతో అవస్థలు పడుతున్నారు. దీంతో ఇటీవల సివిల్, మెకానికల్ కోర్సుల జోలికి వెళ్లడం విద్యార్థులు మానేశారు. సీఎస్ఈ, ఈసీ బ్రాంచ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో 70 శాంతం మంది ఈ రెండు బ్రాంచిలే ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, కోర్సు పూర్తి చేసుకున్న తరువాత ఉద్యోగ అవకాశాలు అందరికీ అందడం లేదు. కేవలం 15 నుంచి 20 శాతం మందికే వస్తున్నాయి. ప్రత్యామ్నాయాలు తప్పనిసరి సీఎస్ఈ, ఈసీ బ్రాంచ్లకు దీటుగా నేడు మరికొన్ని కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీఫీషియల్ ఇంటిలిజెన్స్, డెటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ వంటి ఎమర్జింగ్ ఏరియాలను కవర్ చేయగల నాలెడ్జ్ ఉన్న కోర్సులివి. రోబోటెక్ పరిజ్ఞానం ఉండటం ఈ కోర్సుల్లో ప్రధాన పాత్ర. వీటికి ప్రస్తుత మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మేజర్, మెయిన్ కోర్సులు చేసే అవకాశం జిల్లా వ్యాప్తంగా చీరాల, బాపట్లలో ఉన్న నాలుగు ఇంజినీరింగ్ కళాశాలల్లో 3,000 సీట్లు పైగా ఉన్నాయి. వీటిలో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ బ్రాంచుల్లో 2,200 సీట్లు ఉన్నాయి. మెకానికల్, ఈఈఈ, సివిల్ వంటి కోర్ బ్రాంచుల విద్యార్థులకు సైతం సాఫ్ట్వేర్ రంగంలో అవకాశాలు ఉండటం విశేషం. ప్రభుత్వం ప్రకటించిన నూనత జాతీయ విద్యా విధానంతో ఒకే సమయంలో మేజర్, మెయిన్ కోర్సులు చేసుకునే వెసులుబాటు ప్రస్తుతం ఉంది. మెయిన్గా కోర్ కోర్సులు తీసుకున్నా మైనర్ కింద ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సు చేయడానికి అవకాశం ఉంది. ఈసీఈలో చేరితే సెమీ కండక్టర్, చిప్ తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈఈఈ విద్యార్థులైతే ఈఎల్ఎస్, ఎంబెడ్ సిస్టం లాంటి కోర్సులు నేర్చుకోవడంతో మంచి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ వారు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఇంజినీరింగ్ విద్యలో పలు నూతన కోర్సులు ఆసక్తి చూపుతున్న యువత చీరాల, బాపట్ల కళాశాలల్లో వేలాది సీట్లు డేటా సైన్స్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్, సీఎస్ఈ కోర్సుల వైపు మొగ్గు -
బావమరిది దాడిలో బావ మృతి
చేబ్రోలు: అక్కాబావల మధ్య జరుగుతున్న వివాద విషయం తెలుసుకున్న బావమరిది అక్కడకు వెళ్లి బావతో గొడవ పడి క్షణికావేశంలో కర్రతో తలపై దాడి చేసి గాయపరచటంతో మరణించిన సంఘటన చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండవరం గ్రామానికి చెందిన నన్నపనేని కృష్ణబాబు (35)కు అదే గ్రామానికి చెందిన మక్కే భువనేశ్వరితో 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వారం రోజుల నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా గొడవ పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్న సమయంలో కృష్ణబాబు, భువనేశ్వరిల మధ్య వివాదం జరుగుతుండటంతో భువనేశ్వరి తమ్ముడు గోపీకి ఫోన్ చేసి గొడవ జరుగుతున్న విషయాన్ని తెలియజేసింది. గోపి అక్కాబావల ఇంటికి వచ్చి గొడవ విషయం గురించి మాట్లాడుతుండగా బావ బావమరిదిల మధ్య మాటమాట పెరిగింది. క్షణికావేశంలో గోపి బావను సమీపంలో ఉన్న పెద్ద కర్రతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలై పడిపోయాడు. బంధువులు తీవ్ర గాయాలైన కృష్ణబాబును వడ్లమూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారు. మృతుని తల్లి నన్నపనేని వీరకుమారి ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్ఐ డి వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కొనుగోలు చేయాలి
రైతుల నుంచి మొత్తం పొగాకులక్ష్మీపురం: జిల్లాలో రైతుల నుంచి మొత్తం నల్లబర్లీ పొగాకును గిట్టుబాటు ధరకు కొనగోలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు డిమాండ్ చేశారు. నాణ్యత లేదనే పేరుతో తిప్పి పంపడం సరికాదని తెలిపారు. గుంటూరు చుట్టగుంట సెంటర్లోని మార్కెట్ యార్డులో శుక్రవారం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఫిరంగిపురం మండలంలోని తక్కెళ్లపాడు, కండ్రిక, మేరికపూడి గ్రామాల రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకులో తేమ శాతం ఎక్కువగా, నాసిరకంగా ఉందనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సీ గ్రేడ్ కింద 80 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, క్వింటాకు ఆరు వేల రూపాయలు మాత్రమే దక్కుతుందని తెలిపారు. కండ్రిక గ్రామానికి చెందిన కాంతారావు అనే రైతు 16 చెక్కులు తీసుకు రాగా, నాసిరకంగా ఉందని 10 తిప్పి పంపేశారని పేర్కొన్నారు. గ్రామానికి చెందిన మరో రైతు రామయ్య నాలుగు చెక్కులు కొనగోలు కేంద్రానికి తీసుకురాగా రెండు తిప్పి పంపారని చెప్పారు. ఫిరంగిపురం మండలం మేరిక పూడి గ్రామానికి చెందిన రైతు ముక్కంటి 55 చెక్కులు తీసుకు రాగా మొత్తం తెచ్చిన ట్రాక్టర్లోనే అధికారులు వెనక్కి పంపారని వివరించారు. ఈ స్థితిలో రైతాంగానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధిక వడ్డీలకు అప్పు చేసి పంట పండిస్తే కొనగోలు కేంద్రాల్లో తక్కువ ధర వేయడం, తిప్పి పంపడం సరికాదని పేర్క్ననారు. తెచ్చిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 30వేల టన్నులు ఉత్పత్తి కాగా ఇప్పటికి నాలుగు వేల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ స్థితిని గమనించి ప్రైవేటు కంపెనీలు గ్రామాలలోనే తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోలు వేగం పెంచాలని, లేనిపక్షంలో ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వై.కృష్ణ పాల్గొన్నారు. రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రైతు సంఘ నాయకులు -
అనుగురాజు కాంస్య విగ్రహానికి రూపకల్పన
తెనాలి: పన్నెండో శతాబ్దంలో పల్నాడును పరిపాలించిన అనుగురాజు విగ్రహాన్ని తెనాలికి చెందిన ప్రముఖ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు రూపొందించారు. ఆయన చరిత్రకు సంబంధించిన ఫొటోలు అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, విగ్రహ కమిటీ సూచనతో శిల్పకారులు పలు డ్రాయింగులు, కంప్యూటర్ డిజైన్లను తయారుచేశారు. ఆ ప్రకారం తొమ్మిది అడుగుల నమూనాను తయారుచేసి కమిటీ సంతృప్తిని వ్యక్తంచేశాక 700 కిలోల కాంస్యాన్ని వినియోగించి అనుగురాజు విగ్రహాన్ని సిద్ధం చేశారు. చారిత్రక ఆధారాల ప్రకారం అనుగురాజు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ ప్రాంతం నుంచి వచ్చి పల్నాడును పరిపాలించారు. ఆయన శరీరాకృతి, వస్త్రధారణను ఊహించి విగ్రహాన్ని రూపొందించామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర చెప్పారు. ఈ విగ్రహాన్ని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో గంగమ్మతల్లి గుడి ఎదురుగా ప్రతిష్టించనున్నారు. విగ్రహ కమిటీ సభ్యులు, అనుగురాజు యాదవ్ అభిమానులతో గురువారం ఆ విగ్రహాన్ని పల్నాడుకు తీసుకువెళ్లారు. పిడుగురాళ్లలో ప్రతిష్ట నిమిత్తం రూపొందించిన తెనాలి శిల్పులు 12వ శతాబ్దంలో పల్నాడును పాలించిన అనుగురాజు 700 కిలోల కంచుతో తొమ్మిది అడుగుల నిలువెత్తు విగ్రహం -
తిరగబడ్డ రైతుబిడ్డ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రెండోవిడత భూసేకరణలో ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత సెగ తగిలింది. సొంత సామాజిక వర్గానికి చెందిన రైతులే తిరగబడటంతో ఒక అడుగు వెనక్కి వేసింది. బుధవారం జరిగిన కేబినేట్ మీటింగ్లో దీనిపై నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది. రైతులతో చర్చించి వారిని ఒప్పించి నిర్ణయం తీసుకుంటామంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టింది. పొంతన లేని లెక్కలు ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు గ్రామాల్లో జరుగుతున్న తీరుకు సంబంధం లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పూలింగ్ పేరుతో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేశారు. పైగా ప్రభుత్వం కూడా ఎక్కడ భూమి తీసుకుంటుందో.. ఏ గ్రామాల్లో ఎంత అవసరమో చెప్పకుండా ఏకంగా గెజిట్ విడుదల చేసింది. ముందు ప్రకటించిన గ్రామాల్లోనే కాకుండా తాడికొండ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా గ్రామసభలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. ప్రభుత్వం పైకి చెబుతున్నది ఒకటైతే.. పరోక్షంగా లక్ష ఎకరాలకు పైగా భూసమీకరణ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తలాతోక లేని అభిప్రాయ సేకరణ తాడికొండ మండలంలోని మూడు గ్రామాల్లో 7,256 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని మూడు గ్రామాల్లో 10,878, అమరావతి మండలంలోని ఎనిమిది గ్రామాల్లో 19,504, పెదకూరపాడు మండలంలోని రెండు గ్రామాల్లో 4,586 కలిపి 42,226 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించి గ్రామ సభలు నిర్వహించారు. నోటిఫికేషన్ కూడా వీటికి సంబంధించి విడుదల అయింది. అయితే గెజిట్తో సంబంధం లేకుండా అభిప్రాయ సేకరణ పేరుతో తాడికొండ మండలంలో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఈ సభలకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సమీకరణకు భూములివ్వబోమని తెగేసి చెప్పారు. వినతిప్రతం కూడా అందజేశారు. భూ బాగోతంపై రైతులు బేజాత్పురం, రావెల గ్రామ సభల్లో ప్రశ్నించినప్పటికీ ఎమ్మెల్యే, ఆర్డీవోలు మాట దాటవేత ధోరణే తప్ప సమాధానం చెప్పలేదు. నోటిఫికేషన్కు ముందు జరిపిన గ్రామ సభలకు సంబంధం లేకుండా గత గురువారం తాడికొండ మండలంలోని పాములపాడు, బేజాత్పురం, రావెల గ్రామాల్లో, తర్వాత రోజు ఫణిదరం, దామరపల్లి, బండారుపల్లి గ్రామాల్లో సభలు నిర్వహించారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో రైతులు ఏకంగా అడ్డం తిరిగారు. తాము భూములిచ్చేది లేదంటూ ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ అంటూ నినాదాలు హోరెత్తించారు. దీంతో అధికారులు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మధ్యలోనే వెనుతిరిగారు. రెండో విడత భూ సమీకరణపై వెనక్కి తగ్గిన కూటమి ప్రభుత్వం రాజధాని రైతుల వ్యతిరేకతతో కేబినేట్ నిర్ణయం వాయిదా సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత సొంత సామాజిక వర్గమే బాబుకు ఎదురు తిరగడంతో ప్రభుత్వంలో కలకలం రేగింది. ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసి మేలు చేస్తావనుకుంటే మరోసారి సమీకరణ పేరుతో నోళ్లు కొడతారా ? అంటూ గ్రామాల్లో రైతులు దుర్భాషలాడుతున్నారు. భూములు ఇచ్చేది లేదంటూ గ్రామాల్లో మైక్ ప్రచారం చేయడం సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. -
కంప్యూటర్ కోర్సుల వైపు మొగ్గు
ఇంజినీరింగ్ విద్యలో అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సులకు డిమాండ్ పెరిగింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సులకు డిమాండ్ తగ్గిపోయింది. దీనికి బదులుగా కొత్తగా వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటిల్జెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కోర్సులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఈ రోబోటెక్ కోర్సులకు దేశంలో కాకుండా విదేశాల్లో కూడా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావడంతో విద్యార్థులు వీటిపై మొగ్గు చూపతున్నారు. –ఎస్. లక్ష్మణరావు, కరస్పాండెంట్, సెయింట్ ఆన్స్ కాలేజీ, చీరాల -
శాకంబరిగా బాల చాముండేశ్వరి
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం బాల చాముండేశ్వరి దేవి భక్తులకు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని కూరగాయలతో ఆకర్షణీయంగా అలంకరించారు. లోక కల్యాణార్థం అమ్మవారిని కూరగాయలతో అలంకరించామని ఆలయ స్థానాచార్యుడు చంద్రశేఖరశర్మ తెలిపారు. ఆలయంలోని జ్వాలాముఖి దేవికి కూడా శాకంబరిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. -
చీరాల ‘చైర్మన్’పై గందరగోళం
చీరాలలో చైర్మన్ ఎవరనే విషయంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే ఎటూ తేల్చకపోవడంతో టీడీపీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. పదవి ఆశిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కౌన్సిలర్లను మంచిగా ‘చూసుకునే’ వారికే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చీరాల: ఎమ్మెల్యే రంగంలోకి దిగడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినా కొత్త చైర్మన్ ఎంపిక కత్తి మీద సాములా మారింది. కుల సమీకరణలు, ఆదాయ వనరులను బట్టి ఎక్కువ మొత్తం వెచ్చించిన వారికే దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాంపు ఏర్పాటు, విశాఖపట్నం, పాపికొండల టూర్ అంటూ సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పదవీ కాలం ఉండడంతో డబ్బు ఖర్చు పెట్టేందుకు మరికొందరు సంశయిస్తున్నారు. చైర్మన్ పదవిపై మోజు ఉన్నవారు మాత్రం తహతహలాడుతున్నారు. ఈ నెల 16న జరిగే ఎన్నికలో చైర్మన్ ఎవరనేది తేలనుంది. ‘అవిశ్వాసం‘తో వేటు చీరాల మున్సిపాలిటీలో నాలుగు సంవత్సరాలపాటు చైర్మన్గా పనిచేసిన జంజనం శ్రీనివాసరావుపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గతంలో ముందుకొచ్చారు. టీడీపీ మద్దతు కౌన్సిలర్లతోపాటు ఆమంచి వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొత్తం 22 మంది సంతకాలు చేసిన వినతిపత్రాన్ని ఏప్రిల్ 23న కలెక్టర్ జె.వెంకట మురళికి 17 మంది సభ్యులు అందించారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు కూడా టీడీపీకి మద్దతు పలికారు. దీంతో మే 14న కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్అఫీషియోలతో కలిపి 26 మంది పాల్గొని అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమ వైపునకు తిప్పుకొని క్యాంపుల పేరు ఇతర ప్రాంతాలకు పంపించారు. చైర్మన్ సీటును ఆశిస్తున్న వారు మిగిలిన కౌన్సిలర్లకు సకల రాజమర్యాదలు చేసి అవిశ్వాస ఓటింగ్ నాటికి తిరిగి చీరాలకు తీసుకువచ్చారు. అవిశ్వాసం నెగ్గిన నాటి నుంచి ఎవరికి చైర్మన్ పదవి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. సామాజిక, రాజకీయ సమీకరణాలు చూస్తే తమకే సీటు కేటాయించాలని ఆశావహులు ఇప్పటికే ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రేసులోని వారందరూ వైఎస్సార్సీపీ సభ్యులే చీరాల మున్సిపల్ ఎన్నికలలో 33 వార్డుల్లో ఎక్కువ శాతం వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లు విజయం సాధించారు. టీడీపీ నుంచి ఒక్కరు మాత్రమే గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గానికి 9 మంది ఉన్నారు. 2024లో ఎన్నికల అనంతరం వైఎస్సార్సీపీకి చెందిన కౌన్సిలర్లు కూటమికి మద్దతు పలికారు. చైర్మన్పై అవిశ్వాసం ప్రకటించిన తర్వాత ఆ పదవికి పోటీపడుతున్న వారందరూ మొన్నటి వరకు వైఎస్సార్సీపీలో ఉన్నవారే. అయితే టీడీపీ సింబల్పై గెలిచిన ఏకై క కౌన్సిలర్ కె.యానాదిరావు రేసులో లేకపోవడంతో వైఎస్సార్సీపీని వీడి కూటమికి మద్దతు పలికిన కౌన్సిలర్లకే అవకాశం ఉంది. రేసులో ఉన్నవారంతా మిగిలిన కౌన్సిలర్లను అన్నివిధాలా ‘మంచి’ చేసుకోవాల్సి పరిస్థితి నెలకొంది. చీరాల మున్సిపల్ చైర్మన్ పదవిపై ఎటూ తేల్చని ఎమ్మెల్యే రోజు రోజుకూ పెరిగిపోతున్న ఆశావహుల జాబితా కౌన్సిలర్లకు డబ్బులిచ్చి మద్దతు పొందే వారికే ప్రాధాన్యత బరిలో ప్రధానంగా నలుగురు ఎనిమిది నెలల పదవీకాలం ఉన్న మున్సిపల్ పాలక వర్గానికి తమనే చైర్మన్గా చేయాలంటూ ఇప్పటికే ఎమ్మెల్యే ముందు నలుగురు ప్రతిపాదనలు ఉంచారు. ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య సామాజికవర్గానికి చెందిన మించాల సాంబశివరావు, సీనియార్టీ ప్రకారం తనకే ఇవ్వాలని పొత్తూరి సుబ్బయ్య, గౌడ సామాజికవర్గానికి చెందిన సూరగాని లక్ష్మి, చేనేత సామాజికవర్గానికి చెందిన గోలి స్వాతి పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే మాత్రం ఈ విషయంలో అనేక రాజకీయ, సామాజిక సమీకరణలతో ముందుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. -
రైతు సంఘం నేతపై టీడీపీ నాయకుల దాడి
క్రోసూరు అమరావతి బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో క్రోసూరు: కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని సీజీజీబీ బ్యాంకులో గోల్డ్ బాఽధితులకు అండగా నిలిచి పోరాడుతున్న రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు తిమ్మిశెట్టి హనుమంతరావుపై దొడ్లేరు గ్రామానికి చెందిన టీడీపీ మండల అద్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు సమీర్ దాడిచేశారని బాధితుడితో కలిసి సీపీఎం నేతలు గురువారం క్రోసూరులోని అమరావతి బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. ఈ విషయమై బాధితుడు తిమ్మిశెట్టి మాట్లాడుతూ తాను దొడ్లేరు గ్రామం వెళ్తుండగా, టీడీపీ మండల అధ్యక్షుడు మొగల్జాను, అతని తమ్ముడు దారికాచి దుర్భాషలాడుతూ నీకు ఇక్కడేం పని.. దొడ్లేరు ఎందుకొస్తున్నావంటూ దాడిచేసి కొట్టారని తెలిపాడు. గతంలో సాగు నీరు విషయమై కూడా దౌర్జన్యం చేశారని తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కలిసి డిమాండ్ చేస్తూ సీపీఎం నేతలతో కలిసి రాస్తారోకో చేశారు. ఆందోళనకారులతో సీఐ సురేష్, ఎస్ఐ రవిబాబు మాట్లాడి విరమింపజేశారు. -
పాత జాతీయ రహదారిపై కారు బీభత్సం
వీఆర్వోతో పాటు మరో నలుగురికి గాయాలు తాడేపల్లి రూరల్ : మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా వీఆర్వోతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వైద్యం నిమిత్తం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు అతి వేగంగా వెళుతున్న కారు పాత జాతీయ రహదారిపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దగ్గర ఎదురుగా వస్తున్న నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. తొలుత పెదకాకాని నుంచి బదిలీ అయి ఇప్పటం వీఆర్వోగా విధులకు హాజరయ్యేందుకు నులకపేటలోని తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న జయంతి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఐదు అడుగులు పైకి లేచి రోడ్డుపై పడింది. ఈ ఘటనలో ఆమెకు కుడి కాలు మోకాలి వద్ద విరిగిపోయింది. వీఆర్వో ద్విచక్ర వాహనం అనంతరం కారు మరో రెండు వాహనాలను ఢీకొంది. ఇందులో ఇద్దరు పురుషులు, మహిళ, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. వీఆర్వోను 108 వాహనంలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన నలుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు అతి వేగంగా ఉండవల్లి సెంటర్ వైపు వెళ్లడంతో యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. డ్రైవర్ వారి వాహనాలను సైతం ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనపై తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య, ఆర్ఐ వేదాంతం వివరాలు సేకరిస్తున్నారు. -
కోన ప్రభాకరరావు విగ్రహం ఏర్పాటుకు డిమాండ్
బాపట్ల: జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం ప్రత్యేకత చాటుకున్న దివంగత కోన ప్రభాకరరావు విగ్రహాన్ని బాపట్ల పాత బస్టాండ్ డివైడర్పై తిరిగి ప్రతిష్టించాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ చేశారు. గురువారం కోన ప్రభాకర రావు 109వ జయంతి సందర్భంగా కోన రఘుపతి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ.. కోన ప్రభాకర రావు బాపట్లకు చేసిన సేవలు స్మరించుకునేలా విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు స్ఫూర్తిని పొందేలా చూడాలన్నారు. రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన విగ్రహాలను తిరిగి అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు మాట తప్పారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు. ఎన్టీఆర్, గుర్రం జాషువా, పొట్టి శ్రీరాములు విగ్రహాలను కూడా తిరిగి ప్రతిష్టించాలని కోరారు. పురపాలక సంఘం ఆమోదించిన తీర్మానం ఇప్పటికై నా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్ బాబు, మండల పార్టీ అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, యువజన నాయకులు కోకిలగడ్డ చెంచయ్య, డి.జయభారత్ రెడ్డి, పార్టీ మున్సిపల్ విభాగం నాయకుడు షేక్ సయ్యద్ పీర్, బులిరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, జోగి రాజా, ఇనగలూరి మాల్యాద్రి, షోహిత్, ఉరబిండి గోపి, గొర్రుముచ్చు పుష్పరాజ్యం, వేల్పుల మీరాబీ, మునీర్, కోకి రాఘవరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు చల్లా రామయ్య ఆధ్వర్యంలో చేతి కర్రలను పంపిణీ చేశారు. -
తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణానికి కార్యాచరణ
అచ్చంపేట: మండలంలోని పుట్లగూడెం నుంచి బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం వరకు అడవిలోనుంచి నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు, ఇటీవల కూల్చివేతకు గురైన తుల్జాభవానీ దేవాలయ పునర్నిర్మాణాలకు అటవీ శాఖాధికారులు గురువారం కార్యాచరణ ప్రారంభించారు. వీటి సాధనకోసం తాము ఢిల్లీ వరకు వెళ్లి ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని అఖిలభారత గిరిజన వికాస పరిషత్ అధ్యక్షుడు భూక్యా తులసీనాయక్ (బీటీ నాయక్), కార్యదర్శి భూక్యా రమేష్ నాయకులు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బ్రిటిష్ కాలంలో ఉన్న నాలుగున్నర మీటర్ల వెడల్పుగల రోడ్డు నిర్మాణానికి, అడవి మధ్యలో ఉన్న తమ ఆరాధ్య దేవత తుల్జా భవానీ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కావలసిన భూమి కేటాయింపునకు అధికారులు సర్వే నిర్వహి ంచారన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే అచ్చంపేట, బెల్లంకొండ మండలాల మధ్య దూరం తగ్గి రాకపోకలకు అనువుగా ఉంటుందని తెలిపారు. ఫారెస్ట్ అధికారులు పాత రికార్డులు, శాటిలైట్ పిక్చర్స్ పరిశీలించి బాట ఉన్న విషయాన్ని రూఢీ చేసుకున్నారన్నారు. అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి అనువైన స్థలం కోసం అన్వేషించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెస్సర్స్ మరోని ఇన్ఫ్రా సంస్థ మేనేజర్ జి.బాలాజీ, సివిల్ ఇంజినీర్ డి.నాగరాజు, నరసరావుపేట ఫారెస్ట్ రేంజర్ అధికారి అడవిలో అనువైన స్థలాలను పరిశీలించారన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు, వెంకటాయపాలెం సర్పంచ్ భూక్యా నాగమ్మ, మాజీ సర్పంచ్ మేళం శ్రీరామమూర్తి, హన్మంత్ నాయక్, ఆర్యవైశ్య నాయకులు దేవరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి పర్చూరు(చినగంజాం): అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి తెలిపారు. స్థానిక అద్దంకి నాంచారమ్మ ఫంక్షన్ హాలులో బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ సమాయత్త సభ పార్టీ మండల అధ్యక్షుడు కఠారి అప్పారావు అధ్యక్షతన నిర్వహించారు. గాదె మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పటికీ రాష్ట్రంలో చక్కటి పాలన అందించారని, సంక్షేమ పథకాలను అవాంతరం లేకుండా చేశాన్నారు. చంద్ర బాబు సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా తమ నాయకుడు జగన్మోహనరెడ్డిని దూషించటమే ధ్యేయంగా పెట్టుకన్నారని ..ఇటువంటి నాయకుడు మనకు అవసరమా ? అని దుయ్యబట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి కోడ్ను ఆయా కుటుంబాలకు చెందిన సెల్ఫోన్లలో స్కాన్ చేయించి అందులో వచ్చే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో, ఇతర వాగ్దానాలు, హామీలు, సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు వివరించాలని మధుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, వైస్ ఎంపీపీ పాలేరు వీరయ్య, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్, బూత్ కమిటీ అధ్యక్షుడు ముప్పాళ్ళ రాఘవయ్య, కోట శ్రీనివాసరావు,తులసీ నాగమణి, గోరంట్ల శివకుమారి, యూత్ అధ్యక్షుడు కొల్లా శేషగిరి, మల్లా శ్రీను, ప్రచార కమిటీ అధ్యక్షుడు దాసరి వెంకటరావు, మల్లిశెట్టి జగన్నాథం, యద్దనపూడి హరిప్రసాద్, కంచనపల్లి రమేష్, గాదె సురేష్, ఇంకొల్లు మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు పాల్గొన్నారు. -
అంతరాష్ట్ర దొంగ అరెస్టు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ జగదీష్ గురజాల: అంతరాష్ట్ర చైన్ స్నాచర్ను అరెస్టు చేసినట్లు గురజాల డీఎస్పీ బి.జగదీష్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన మంచికల్లు గ్రామానికి చెందిన బొల్లెద్దుల కోటేశ్వరరావు దంపతులు గురజాల బైపాస్ మీదుగా దాచేపల్లికి వెళ్తుండగా మార్గం మధ్యలో జగనన్న కాలనీ వద్ద మహిళ మెడలోని నానుతాడు అపహరణకు గురైందన్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో దంపతులు ఫిర్యాదు చేశారన్నారు. సీఐ ఆవుల భాస్కర్ టీంను ఏర్పాటు చేసి విచారణ సాగించారని, పలు సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించగా విచారణలో నిందితుడు తెలంగాణ రాష్ట్రం, సూర్యపేట జిల్లా, కోదాడ మండలం బాలాజీ నగర్ తండాకు చెందిన బర్మవత్ నాగరాజుగా గుర్తించామని చెప్పారు. అతడిని విచారించగా చైన్ స్నాచింగ్ను ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని వద్ద రూ.10 లఽక్షలు విలువ కలిగిన 92 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నాగరాజు డీజే ఆపరేటర్గా పనిచేస్తూ చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తు జీవనం సాగిస్తుంటాడన్నారు. అతను ఫిబ్రవరి నెల 16వ తేదీన నరసరావుపేట సత్తెనపల్లి మధ్య మాదాల గ్రామం వద్ద టీవీఎస్పై భర్తతో కలిసి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును, 19వ తేదీన పిడుగురాళ్ల మండలం శ్రీనివాసపురం వద్ద ఓ మహిళ మెడలో చైన్ లాక్కొని వెళ్లి పోయినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. నందిగామ, గండేపల్లి, వత్సవాయి, చిల్లకల్లు, తెనాలి త్రీ టౌన్, పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు సంబంధించి పలు కేసులు ఇతనిపై ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన సీఐ ఆవుల భాస్కర్, ఎస్ఐ వై.వినోద్ కుమార్, బి.అనంత కృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రేపు వాటర్ పోలో జట్ల ఎంపికలు నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలోని స్విమ్మింగ్ పూల్లో సబ్ జూనియర్స్, జూనియర్స్ జిల్లా వాటర్ పోలో జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ కార్యదర్శి వై.వి.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా జట్లుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీలలో విశాఖపట్నం బీచ్రోడ్డులోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించనున్న 10వ అంతర్ జిల్లాల చాంపియన్షిప్ పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లును ఈనెల 11వ తేదీ సాయంత్రం 5గంటల లోపు స్విమ్మింగ్ పూల్ కార్యాలయంలో ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలతో నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. -
సంబరం .. ఇంద్ర వైభవం
నయన మనోహరంగా దుర్గమ్మకు శాకంబరి అలంకారం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. శాకంబరి ఉత్సవాలు మూడు రోజులపాటు వైభవంగా కొనసాగాయి. పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శాకంబరీదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మను నయన మనోహరంగా వివిధ రకాల కూరగాయలతో అలంకరించారు. ఉత్సవాలు పరిసమాప్తం శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులపాటు జరిగిన శాకంబరి ఉత్సవాలు పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని నూతన యాగశాలలో గురువారం ఉదయం ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈవో శీనానాయక్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఈఓ అన్నదానం పథకానికి రూ. 50 వేల విరాళం సమర్పించారు. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారి మూల విరాట్ను వివిధ ఫలాలు, డ్రైఫ్రూట్స్తో అలంకరించారు. ఆలయాన్ని బత్తాయి. దానిమ్మ, పైనాపిల్, పచ్చి ఖర్జూరం, ఆల్బక్రా, యాపిల్, పుచ్చకాయలు, పలు రకాల ద్రాక్షలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. మూడు రోజుల ఉత్సవాల్లో 36 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను వినియోగించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మ సన్నిధిలో గురుపూజా మహోత్సవం వ్యాస పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో గురు పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. దేవస్థానానికి చెందిన తంగిరాల వెంకటేశధ్వర ఘనాపాటి, శంకరమంచి శివప్రసాద్, అహితాగ్ని గుంటూరు రామచంద్ర సోమయాజులు దంపతులను సత్కరించి పట్టువస్త్రాలు, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ ఈఓ శీనానాయక్ దంపతులు గురువులకు హారతులిచ్చి పూజ నిర్వహించారు. నగదు బహుమతి ఇచ్చి సత్కరించారు. -
వ్యాసాయ.. విష్ణురూపాయ!
అమరావతి: సాక్షాత్తు శ్రీమహావిష్ణువే ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువుగా, వేదవ్యాసుడిగా అవతరించాడని భవఘ్ని గురూజీ అన్నారు. మండల పరిధిలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో గురుపూర్ణిమ వేడుకలలో చివరి రోజున వ్యాస ఆరాధన ఘనంగా నిర్వహించారు. భవఘ్ని గురూజీ మాట్లాడుతూ వేద వ్యాసుడు నాలుగువేదాలు, అష్టా దశ పురాణాలతో పాటుగా మహాభారతాన్ని మానవాళికి అందించాడన్నారు. మానవుడిని సన్మార్గంలో నడిపించి, అధ్యాత్మిక జ్ఞానసంపదను అందించిన గురువులను స్మరించుకోవటం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సందర్భంగా ఆది గురువు వ్యాస భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదవ్యాస భగవానుని ఆశీర్వచనం అందరికీ అందించారు. వేడుకల్లో భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. సాయిబాబా మందిరంలో... పవిత్ర పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ షిర్డీసాయి – పర్తిసాయి కపోతేశ్వర ధ్యాన మందిరంలో గురుపూర్ణిమ వేడుకలను గురువారం అత్యంత ఘనంగా నిర్వహించారు. వేకువజామునే బాబావారికి సుప్రభాతసేవ, నగర సంకీర్తన, షిర్డీ హారతి కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తర్వాత బాబా విగ్రహానికి పంచామృతాలతో మహా భిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకారం చేసి పూజలు నిర్వహించారు. అనంతరం దత్తాత్రేయ, షిర్డీబాబా, సత్యసాయిబాబా చిత్రపటాలకు, బాబావారి పాదుకలకు భక్తులతో పూజలు చేయించారు. చివరగా అన్నదానం నిర్వహించారు,. వైకుంఠపురం భవఘ్ని ఆరామంలో ఘనంగా గురుపూర్ణమి -
ప్రభుత్వ సదుపాయాలు సద్వినియోగం చేసుకోండి
మేదరమెట్ల: విద్యార్థులకు ప్రభుత్వం అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం (పీటీఎం) జరిగింది. కార్యక్రమంలో భాగంగా పాఠశాలలోని 452 మంది విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. కలెక్టర్ వెంకట మురళి, తహసీల్దార్ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి, మన్నె రామారావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, మండల నాయకులు పాల్గొన్నారు. పెరుగుతున్న సాగర్ నీటిమట్టం విజయపురి సౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం ఆరు గంటలకు 541.20 అడుగులకు చేరింది. కాగా, ఇది 190.8366 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 4,204, ఎడమ కాలువకు 3,202, ఎస్ఎల్బీసీకి 1,500 క్యూసెక్కులు విడుదల అవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం 8,906 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,16,833 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. కందులు కొనుగోలు చేయండి నరసరావుపేట: కందుల ధరలు తగ్గుతున్న నేపథ్యంలో జిల్లా రైతుల నుంచి కొనుగోలు చేయాలని దాల్ మిల్లర్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు కోరారు. గురువారం కలెక్టరేట్లో దాల్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. వినుకొండ, దాచేపల్లి మండలాల్లో రైతుల వద్ద ఉన్న కందులను మెరుగైన ధరకు కొనాలన్నారు. ఈ వారంలోగా ధరను మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నిర్ణయించి కొనుగోళ్లు ప్రారంభించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, జిల్లా వ్యవసాయ అధికారి జె.జగ్గారావు, ఆర్డీవోలు కె.మధులత, రమణాకాంత్రెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు బకాయిల చెల్లింపు పూర్తి నరసరావుపేట: జిల్లాలో గురువారం ధాన్యం కొనుగోలు బకాయిల్లో రూ.6.29 కోట్లు చెల్లింపులు ప్రధాన కార్యాలయ నుంచి రైతుల అకౌంట్లకు జమ చేశామని, దీంతో మొత్తం బకాయిలు రూ.11.36 కోట్ల చెల్లింపులు పూర్తిచేసినట్లు జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2024–25 రబీ సీజన్లో 68 రైతుసేవా కేంద్రాల ఆధ్వర్యంలో 37 కొనుగోలు కేంద్రాల ద్వారా 550 మంది రైతుల నుంచి రూ.11.36 కోట్ల విలువైన 4,904 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది జూన్ 30 వరకు రూ.4.07 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. జూలై ఒకటో తేదీన మరో రూ. కోటి రైతుల అకౌంట్లకు వేశామన్నారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరాకు చర్యలు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి నరసరావుపేట: నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ డి.పుల్లారెడ్డి చెప్పారు. గురువారం ఆయన బరంపేట విద్యుత్ కార్యాలయంలో పల్నాడు జిల్లా సర్కిళ్లపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పనులు, రెవెన్యూ కలెక్షన్లు పెంపుదల, పీఎం సూర్య ఘర్లపై సమీక్ష చేసి లక్ష్యాలు నిర్దేశించామన్నారు. వ్యవసాయ పంపు సెంట్ల కనెక్షన్ల కోసం సుమారు రెండు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వచ్చే మూడు నెలల వ్యవధిలో ఆ సర్వీసులు అందజేయాలని అధికారులను ఆదేశించామన్నారు. లో ఓల్టేజ్, అధిక లోడులు ఉన్న ప్రాంతాల్లో బేస్మెంట్లు వేసి అధిక ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారి పి.విజయకుమార్, ఈఈ సీహెచ్ రాంబొట్లు పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.18 లక్షల చొప్పున పరిహారం
ఆర్ఈఎంజెడ్ కోసం భూములిచ్చే రైతులతో కలెక్టర్ బాపట్ల: అద్దంకి నియోజకవర్గంలో రెన్యువబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (ఆర్ఈఎంజెడ్) స్థాపనకు అవసరమైన భూమి కొనుగోలుకు ఎకరాకు రూ.18 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో రైతులతో ఆయన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఆర్ఈఎంజెడ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదించిందని గుర్తుచేశారు. బల్లికురువ, సంతమాగులూరు మండలాల్లోని కుందూరు, మామిళ్ళపల్లి, మక్కినవారి పాలెం, గుడిపాడు గ్రామాలలో భూమి కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. దాదాపు 1,800 ఎకరాల కొనుగోలుకు నిర్ణయించినట్లు చెప్పారు. రైతులు ఎకరాకు రూ. 20 లక్షలు ఇవ్వాలని కోరారని తెలిపారు. ల్యాండ్ ఎక్విజేషన్ నిబంధన మేరకు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు. జోన్ ఏర్పాటుతో స్థానికంగా పారిశ్రామిక అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. దాదాపు 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వివరించారు. స్థానికుల్లో అర్హులైన వారికి ముందుగా అవకాశం కల్పిస్తారని తెలిపారు. నిబంధన మేరకు ఎకరాకు రూ.18 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీనికి రైతులందరూ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, ఉప కలెక్టర్ లవన్న, బల్లికురవ మండల రెవెన్యూ అధికారి ఎం.రవినాయక్, సంతమాగులూరు మండల రెవెన్యూ అధికారి కె.రవిబాబు, జోన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివ శంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎంఆర్ల వేతనాలు పెంపు ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాలలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ల రోజు వారీ వేతనాన్ని వీడీఏ పాయింట్ల ఆధారంగా పెంచినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఆయన జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. పలు శాఖల్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ల రోజువారీ వేతనాలను సవరించినట్లు తెలిపారు. అత్యంత నైపుణ్యం గల వారికి రూ.900 ఉండగా, ఇప్పుడు రూ.937గా మార్చినట్లు వివరించారు. నైపుణ్యం గల వారికి రూ.850 ఇస్తుండగా ఇప్పుడు రూ. 885కి, సెమీ స్కిల్డ్ వారికి రూ.750 ఇస్తుండగా.. రూ.781కి, నైపుణ్యం లేని వారికి ప్రస్తుతం రూ.650 ఇస్తుండగా రూ.677కి పెంచినట్లు తెలిపారు. ఈ వేతనాలు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వర్తిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వెంకట శివప్రసాద్, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
డ్రెయిన్లలో పూడికతీత పనులు ప్రారంభం
రేపల్లె: ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా డ్రెయిన్లలో పూడిక తీయించకపోవడంపై గత వారం సాక్షిలో ‘‘ముంపు ముప్పు’’ అనే శీర్షికన నియోజవర్గంలోని ప్రధాన మురుగు కాలవలు గురప్రు డెక్క, తూటి కాడతో పూడి పోవడంతో పంటకు నష్టం జరిగే ప్రమాదాన్ని వివరిస్తూ కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు పూడిక తీత పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా వాడ మురుగు, ఆర్ఎం డ్రెయిన్లలో గురప్రు డెక్క, తూటి కాడలను తీయిస్తున్నారు. దీనిపై నియోజకవర్గంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, సాక్షికి కృతజ్ఞతలు తెలియజేశారు. సమష్టి కృషితో డిపో అభివృద్ధి చీరాల అర్బన్: ఉద్యోగుల సమష్టి కృషితోనే డిపో అభివృద్ధి సాధ్యమవుతుందని బాపట్ల డీపీటీఓ సామ్రాజ్యం అన్నారు. గురువారం చీరాల ఆర్టీసీ డిపో, బస్టాండ్, గ్యారేజీలను ఆమె పరిశీలించారు. బస్సులను పూర్తి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం బస్టాండ్లోని పలు విభాగాలను ఆమె పరిశీలించారు. బస్టాండ్ పరిసరాలు, మరుగుదొడ్లు, స్టాల్స్ను పరిశీలించారు. తాగునీటి వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓఆర్ పెంచేందుకు సిబ్బంది కృషి చేయాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ, బస్సుల సమయపాలన పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. డిపో మేనేజర్ జంజనం శ్యామల, సిబ్బంది ఉన్నారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తాం ఎన్నెస్పీ డీఈ విజయలక్ష్మి శావల్యాపురం: మండలంలోని గంటావారిపాలెం అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలో మేజరు కాల్వ అభివృద్ధి పనులు ఈనెలాఖారులోగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టినట్లు లింగంగుంట్ల ఎన్నెస్పీ డీఈ జరుగుల విజయలక్ష్మి చెప్పారు. పోట్లూరు గ్రామానికి చెందిన లింగా రత్తమ్మ తన పొలానికి సాగునీరు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయగా గురువారం క్షేత్రస్థాయిలో విచారణ నిమిత్తం మేజరు కాల్వను పరిశీలించారు. డీఈ మాట్లాడుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్ జలశయాలకు పూర్తిస్థాయిలో నీటి సామర్థ్యం పెరుగుతుందని, ఉన్నతాధికారుల సమావేశం అనంతరం ఎబీసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఏబీసీ కెనాల్ పరిధిలోని మేజరు కాల్వల్లో రూ.60 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి విధివిధానాలు అధికారులకు సూచనలు చేస్తున్నట్లు తెలిపారు. పోట్లూరు మేజరు కాల్వ పరిధిలో నూతన సైపన్ నిర్మాణ పనులకు రూ.30లక్షల నిధులు అంచనాలు వేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. వీఆర్వో నరసింగరావు, ఎన్నెస్పీ ఏఈ పోట్లూరు లక్ష్మీనారాయణ రైతులు ఉన్నారు. నీటిగుంటలో పడి వ్యక్తి మృతి వినుకొండ: వినుకొండ రూరల్ మండలం, గోకనకొండ గ్రామానికి చెందిన పాలపర్తి ఆంజనేయులు(45) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందాడు. ఈనెల 8వ తేదీన గ్రామ సమీపంలో బహిర్భూమికని వెళ్లి గ్రామ శివారులో గల పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందాడు. మరుసటి రోజు ఉదయాన్నే బంధువులు వెతుక్కుంటూ నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా శవమై తేలియాడుతున్నట్లు సమాచారం. మృతునికి భార్య ఏగేశ్వరమ్మ, కుమారుడు అనిల్, కుమార్తె అఖిల ఉన్నారు. వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగంపై ఆత్మస్థైర్యంతో పోరాటం
కొల్లూరు: అబద్ధ్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేయకుండా ప్రజలను నట్టేట ముంచుతుందని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు మండిపడ్డారు. కొల్లూరు గాంధీనగర్ వద్ద పార్టీ మండల కన్వీనర్ సుగ్గున మల్లేశ్వరరావు అధ్యక్షతన గురువారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అశోక్బాబు మాట్లాడుతూ కూటమి నేతలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గ్రామాలలో విష సంస్కృతిని అలవాటు చేయడం దురదృష్టకరమని ఖండించారు. రెడ్బుక్ రాజ్యాంగానికి కార్యకర్తలు భయపడకుండా కలసికట్టుగా ఉంటూ ఆత్మస్థైర్యంతో ప్రజాసమస్యలపై పోరాటం చేయా లని ఆయన పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అణచివేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని, తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తే వారి పైనా ప్రైవేటు కేసులు పెట్టేందుకు సిద్ధమని హెచ్చరించారు. చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మోసాలను నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని అన్నారు. క్యూఆర్ కోడ్ను వినియోగించే విధానంపై నాయకులు, కార్యకర్తలకు ఆయన వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు చొప్పర సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యులు బుల్లా నవరత్నం, బావిరెడ్డి వెంకట్రామయ్య, గుంటూరు రామారావు, కోఆప్షన్ సభ్యుడు షేక్ బాజి, సర్పంచ్లు మంచాల వసుంధర, గుర్రం మురళి మేకతోటి శ్రీకాంత్, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, మాజీ సర్పంచి కట్టుపల్లి సోమయ్య, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి వివిద విభాగాల నాయకులు కోగంటి లవకుమార్, బిట్రగుంట సత్యనారాయణ, పెరికల పద్మారావు, జోషిబాబు, సుధారాణి, గుర్రం వీరరాఘవయ్య, సిరాజుద్దీన్, చలంచర్ల కనకదుర్గ, దివి వెంకటేశ్వరరావు, హుసేన్, నాంచారయ్య, సురేష్, కనపర్తి మోహన్రావు, గుంటూరు పవన్కుమార్, శివన్నారాయణ, గరిక రమేష్, రామ్మోహన్ పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు కొల్లూరులో విస్తృతస్థాయి సమావేశం -
అక్రమ నిర్మాణాలు చేసిన రిసార్టులపై చర్యలు
చీరాల టౌన్: చీరాల తీర ప్రాంతాల్లో సీఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేసిన రిసార్ట్స్పై చర్యలు తప్పవని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా డీపీవో ప్రభాకరరావు, పొల్యూషన్ కంట్రోల్ ఈఈ రాఘవరెడ్డిలతో కలిసి వాడరేవు, రామాపురం, విజయలక్ష్మీపురం, కఠారిపాలెం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. నిబంధనలను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన పలు రిసార్ట్సులను పరిశీలించారు. సముద్ర మట్టానికి దగ్గరగా నిర్మాణాలు చేసిన రిసార్ట్సు వివరాలను సేకరించి కొలతలు తీసుకున్నారు. నిబంధనలు విస్మరించి అక్రమ కట్టడాలు చేసిన పలువురు నిర్వాహకులకు నోటీసులు అందించారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. -
విద్యారంగ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
రేపల్లె: విద్యారంగ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా అందరినీ ఆత్మీయంగా కలిపే కార్యక్రమం ఇదని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో కొత్త ఒరవడిని సృష్టిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి పనిచేసే సంస్కృతిని పెంచడమే కార్యక్రమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని, ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. ‘ఒక క్లాసుకు ఒక టీచర్’ విధానంలో 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు మొక్కలు అందించారు. ఆర్డీవో రామలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, కమిషనర్ సాంబశివ రావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, నాయకులు పంతాని మురళీధరరావు, మేకా రామకృష్ణ, స్కూల్ హెచ్ఎం సీహెచ్ సుందరరావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ -
హోంగార్డు కుటుంబానికి రూ.5లక్షలు సాయం
నరసరావుపేట రూరల్: అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు కుటుంబానికి తోటి హోంగార్డులు అండగా నిలిచారు. మృతుని కుటుంబానికి ఒక రోజు వేతన మొత్తం రూ.5 లక్షలను సాయంగా అందించారు. తెనాలి రూరల్ పీఎస్లో విధులు నిర్వహిస్తూ హోంగార్డు వై.శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన గుండెపోటుతో మృతిచెందాడు. హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచేందుకు తోటి హోంగార్డులు ముందుకు వచ్చారు. ఒక రోజు వేతనాన్ని సాయంగా అందించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ చేతుల మీదగా శ్రీనివాస్ కుటుంబసభ్యులకు సాయం చెక్ను అందజేశారు. హోంగార్డు కుటుంబానికి సాయం చేసేందుకు ముందుకు వచ్చని జిల్లా హోంగార్డులను అదనపు ఎస్పీ అభినందించారు. హోంగార్డుగా విధులు నిర్వహిస్తూ గుండెపోటు కారణంగా ఉద్యోగ విరమణ చేసిన బండ్లమోటు పీఎస్ హోంగార్డు ఎ.నాసరయ్యకు రూ.5 లక్షల చెక్ను అదనపు ఎస్పీ సంతోష్ అందించారు. కార్యక్రమంలో హోంగార్డు ఆర్ఐ ఎస్.కృష్ణ పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లను రద్దుచేయాలి
సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మణిలాల్ రేపల్లె: కార్మిక లోకానికి నష్టం చేకూర్చే లేబర్కోడ్లను ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం రేపల్లె పట్టణంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, రైస్ మిల్ ముఠా, సివిల్ సప్లయర్స్ ముఠా, ఆశ వర్కర్లు, ఆటో డ్రైవర్లు, సుమో డ్రైవర్లు, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు, బజార్ ముఠా వర్కర్లు, మున్సిపల్ ఇంజినీరింగ్, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు పాల్గొన్నారు. మణిలాల్ మాట్లాడుతూ దేశంలో కార్మికవర్గం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఉమ్మడిగా తిప్పికొట్టాలని కోరారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ప్రైవేటీకరణ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు. కార్మికులకు కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ధరల పెరుగుదలకు పరిహారంతో పాటు ఐదేళ్ల ఒకసారి కనీస వేతనాల సవరణ చేయాలని కోరారు. కేంద్రంలో 8వ వేతన సంఘాన్ని, రాష్ట్రంలో 12వ వేతన సంఘాన్ని నియమించాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శామ్యూల్ మాట్లాడుతు కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం మాత్రమే అమలు చేయాలన్నారు. బిల్డింగ్ వెల్ఫేర్ లేబర్ బోర్డు పునరుద్ధరించాలన్నారు. కార్మిక చట్టాలను తనిఖీ చేసే లేబర్ అధికారుల విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. తొలుత వివిధ కార్మిక సంఘాల కార్మికులు బస్టాండ్ సెంటరులో మానవహారంగా ఏర్పడి ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రింగు రోడ్డు వరకు సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ, రైతు కూలీ సంఘాలతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు ర్యాలీగా భారీ ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఎం.శోభారాణి, నాయకులు కె.ఝాన్సీ సి.వాణిశ్రీ, పి.బిక్షాలు, ఎం.ఈశ్వరరావు, టి.బుజ్జి, పి.విజయ్, రాఘవ, కె.ఆశీర్వాదం, కె.రమేష్, జి.వెంకటేశ్వరరావు, కె.మాణిక్యరావు, ఎం.సాయి, కాలేశా పాల్గొన్నారు. -
‘కూటమి’ దెబ్బకు రైతు కుదేలు
సత్తెనపల్లి: రైతులు ఖరీఫ్ సాగుకు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సాగుకు సంబంధించిన పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో రైతులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రైతుకు రూ. 13,500 చొప్పున రైతు భరోసా మంజూరు చేయడంతో కొంత లబ్ధి చేకూరింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా కంటే అదనంగా కొంత చేర్చి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ కింద అందిస్తామని టీడీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. నిధులు విడుదలవుతాయా? కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా రూ. 20 వేలు అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏడాదైనా ఇంతవరకు పైసా కూడా ఇవ్వలేదు. రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుండటంతో ప్రస్తుతం గ్రామాల్లో ఈ పథకానికి సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ చేపట్టారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ లబ్ధి పొందడానికి సమీప రైతు సేవా కేంద్రాలకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేదెన్నడో... అర్హులను గుర్తించి నిధులు విడుదల చేసేదెప్పుడో.. అని రైతులు తలలు పట్టుకుంటున్నారు. భారంగా మారిన సాగు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఏటికేడు పెరుగుతున్నాయి. దుక్కి, కూలీల ఖర్చులు కూడా అమాంతం పెరిగాయి. వీటన్నింటిని దాటి పంటలను సాగు చేయాలంటే తగిన దిగుబడి చేతికి వస్తుందన్న ఆశ కూడా పూర్తిగా లేదు. వాతావరణ పరిస్థితుల కారణంగా గతంలో కంటే తక్కువగా పంటలు సాగు చేస్తున్నారు.రైతులకు కూటమి ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం, పంట నష్టపోతే బీమా పరంగా అండ లభించడం లేదు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం గురించి కనీసంపట్టించుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక సాయం అందివ్వని ప్రభుత్వం ఖరీఫ్ పెట్టుబడికి తప్పని పాట్లు నగదు లేక కష్టపడుతున్న అన్నదాతలు జిల్లాలవారీగా పరిస్థితి ఇదీ... జిల్లా అర్హులైన రైతులు ఈకేవైసీ పూర్తి ఈకేవైసీ పెండింగ్ గుంటూరు 1,07,942 1,02,731 5,211 పల్నాడు 2,39,110 2,31,495 7,615 బాపట్ల 1,59,157 1,52,842 6,315 -
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
పిడుగురాళ్ల రూరల్: మిరప నారు పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు సూచించారు. కామేపల్లి రైతు భరోసా కేంద్రంలో బుధవారం సమగ్ర ఉద్యాన మిషన్ ఆధ్వర్యంలో మిరప నారు పెంపకంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు, డాట్ సెంటర్ అధికారి డాక్టర్ నగేష్ హాజరయ్యారు. ముందుగా కామేపల్లిలో నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట్రావు నర్సరీ చట్టం– 2010 గురించి యజమానులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. జిల్లా డాట్ సెంటర్ అధికారి డాక్టర్ నగేష్ మిరప నారుమడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తన శుద్ధి, సస్యరక్షణ , విత్తే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కో– ఆర్డినేటర్ మస్తాన్వలి, ఉద్యాన శాఖ అధికారి కుమారి అంజిలిబాయి, గ్రామీణ ఉద్యాన శాఖ అధికారులు కరిముల్లా, దస్తగిరి పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకట్రావు -
బాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి బాపట్ల: బాలలకు చదువుకునే చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి సూచించారు. బాపట్ల జిల్లాలోని కర్లపాలెం మండలంలో బుధవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గణపవరం జిల్లా పరిషత్ హైస్కూలు ఆవరణలో విద్యార్థులతో పనులు చేయించటాన్ని గమనించి ఆమె ప్రధానోపాధ్యాయలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులను, హాజరు పటికను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. వంటకాలను రుచి చూశారు. బాలల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు 1098 నంబరును ప్రతి చోట రాయించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ప్రతి పాఠశాలలో తప్పని సరిగా ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలని కోరారు. బాల బాలికలకు వారి హక్కులకు భంగం కలిగిస్తే బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. బాపట్లలోని బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖముఖిగా మాట్లాడారు. వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని కోరారు. కార్యక్రమంలో చారులత, డీసీపీఓ పురుషోత్తమరావు, కర్లపాలెం ఎంఈఓ మనోరంజనీ పాల్గొన్నారు. -
నేటి నుంచి టౌన్చర్చి శతవార్షికోత్సవాలు
ఆహ్వానపత్రికను ఆవిష్కరిస్తున్న ప్యారిష్ పాస్టర్ రెవ.దేవరపల్లి ఏసురత్నం తెనాలి: పట్టణంలో టౌన్చార్చిగా పిలుచుకునే ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చి(తూర్పు గుంటూరు సినడ్) క్రీస్తు దేవాలయం శతవార్షిక మహోత్సవాలు గురువారం నుంచి వైభవంగా ఆరంభం కానున్నాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఈ వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రిక, బ్రోచర్ను బుధవారం టౌన్చర్చిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ప్యారిష్ పాస్టర్ రెవరెండ్ దేవరపల్లి ఏసురత్నం, అడిషనల్ పాస్టర్లు రెవరెండ్ వై.లెనిన్బాబు, రెవరెండ్ డి.సాల్మన్రాజు, రెవరెండ్ ఎంవీబీ ప్రకాష్బాబు అడ్హాక్ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించి, వివరాలను తెలియజేశారు. 10,11,12 తేదీల్లో ఉదయం ప్రార్థన, ఆరాధనలు, సాయంత్రం చర్చి వెలుపల వేదికలపై సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. గౌరవ అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఏఈఎల్ చర్చి కంట్రోలర్ జస్టిస్ కురియన్ జోసెఫ్, కేరళకు చెందిన మాజీ జడ్జి జోసెఫ్ పీఎస్, ఆంధ్రప్రదేశ్ మాజీ జూనియర్ జడ్జి ఎన్.జేసురత్నకుమార్ హాజరవుతారని తెలిపారు. ● రెవ.వై.లెనిన్బాబు మాట్లాడుతూ హాఫ్దొర టౌన్చర్చిని కట్టించి విద్యాలయం, వైద్యశాలను నిర్మించి ప్రజలకు సేవలందించినట్టు తెలిపారు. మూడురోజుల ఉత్సవాలకు ప్రజలు హాజరై దేవుని మన్ననలు పొందాలని అడిషనల్ పాస్టర్లు రెవ.డి.సాల్మన్రాజు, రెవ.ఎంవీబీ ప్రకాష్బాబు కోరారు. శతవార్షిక మహోత్సవాల్లో భాగంగా 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సెయింట్జాన్స్ విద్యాసంస్థ పక్కన ఉన్న లూథరన్ యూపీ స్కూలు ప్రాంగణంలో ప్రేమ విందు ఉంటుందని అడ్హాక్ కమిటీ సభ్యుడు జి.వేమయ్య చెప్పారు. -
గుంటూరు జిల్లా రెడ్క్రాస్కు పతకాలు
గుంటూరు ఎడ్యుకేషన్: సామాజిక సేవా విభాగంలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన గుంటూరు జిల్లా రెడ్క్రాస్కు గవర్నర్ పురస్కారాలు లభించాయి. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రెడ్క్రాస్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో భాగంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్క్రాస్ గుంటూరు జిల్లా చైర్మన్ డాక్టర్ వడ్లమాని రవి, వైస్ చైర్మన్ పి.రామచంద్రరాజు అవార్డులను అందుకున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి, 2023–24 ఆర్థిక సంవత్సరానికి తృతీయ ఉత్తమ జిల్లాగా గుంటూరు రెడ్క్రాస్కు అవార్డులు వరించాయి. వైకుంఠపుర వాసుని ఆదాయం రూ.46.76 లక్షలు తెనాలిరూరల్: స్థానిక వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ టి.సుభద్ర, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వి.అనుపమ నేతృత్వంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. 113 రోజుల అనంతరం లెక్కింపు జరిపారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, మహిళలు స్వచ్ఛందంగా లెక్కింపు సేవలో పాల్గొన్నారు. దేవస్థానంలోని హుండీ లెక్కింపు ద్వారా రూ.46,76,204 నగదు స్వామి వారికి సమకూరింది. అలానే 19.50 గ్రాముల బంగారం, 319 గ్రాముల వెండిని భక్తులు స్వామి వారికి సమర్పించారు. అలానే రద్దయిన పాత రూ. వెయ్యి నోట్లు ఆరు, రూ. 500 నోట్లు పది గుర్తు తెలియని భక్తులు హుండీలో వేశారు. లెక్కింపులో భక్తులు, వలంటీర్లు, చెంచుపేట ఆప్కాబ్ బ్యాంక్ సిబ్బంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు. సమన్వయంతో సైబర్ నేరాలకు చెక్ నగరంపాలెం: పోలీస్ శాఖ, బ్యాంక్లు సమన్వయంతో సైబర్ నేరాలను అరికడదామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో బుధవారం జిల్లాలోని బ్యాంక్ల మేనేజర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న దృష్ట్యా సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయన్నారు. ఈ క్రమంలో జిల్లాలోని ప్రజలు, ఖాతాదారులకు ముందస్తు సమాచారం, అవగాహన కల్పిద్దామన్నారు. వినియోగదారులు పోర్టల్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు ఎఫ్ఐఆర్ లేకుండా సహాయమందుతుందని చెప్పారు. ఖాతాదారులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి నగదు లావాదేవీలు నిర్వర్తించే వేళల్లో బ్యాంక్లను సంప్రదించి నిజనిజాలను పరిశీలించాలని పేర్కొన్నారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, లోన్ యాప్ మోసాలపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. ఖాతాదారులకు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే బ్రోచర్ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైం), యూనియన్ బ్యాంక్ డీజీఎం జవహర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్రెడ్డి, బ్యాంక్ల మేనేజర్లు పాల్గొన్నారు. -
రేపు వెలగపూడిలో ప్రపంచ జనాభా దినోత్సవం
ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ తాడికొండ: ఈనెల 11న తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో ప్రపంచ జనాభా దినోత్సవం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్న నేపఽథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లను బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి సభా స్థలి ఏర్పాట్లు, బార్ కోడింగ్, వాహనాల పార్కింగ్, సీటింగ్, తాగునీరు, పారిశుద్ధ్య పనులు తదితర నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. పలు సూచనలు జారీ చేశారు. గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు, సీపీఓ శేషశ్రీ, డీపీఓ నాగసాయి కుమార్, పీడీ డ్వామా శంకర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఎంపీడీఓ శిల్ప, తుళ్లూరు తహసీల్దార్ సుజాత,అధికారులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో వేదవ్యాస ఆరాధన అమరావతి: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన వైకుంఠపురం భవఘ్ని ఆరామంలోని వేదవ్యాసాలయంలో గురిపూర్ణిమ మహోత్సవాలలో రెండవరోజు కార్యక్రమాలలో భాగంగా బుధవారం వ్యాస భగవానునికి సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, వ్యాస ఆరాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భవఘ్ని గురూజీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ సమాజంలో ఆధునికత, నాగరికత పేరుతో మానవాళి చెడు మార్గం పట్టకుండా సన్మార్గంలో నడిపించడానికి వ్యాస భగవానుడు అందించిన భగవద్గీత మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వేడుకలలో ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన, షూక్ బాపూజీ పద్యనాటకం భక్తులను ఎంతగానో అలరించాయి. భక్తులు పలు జిల్లాల నుంచి భారీగా పాల్గొన్నారు. జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన సీఈ విజయపురి సౌత్: నాగార్జునసాగర్ కుడి కాలువ జలవిద్యుత్ కేంద్రాన్ని శ్రీశైలం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చీఫ్ ఇంజినీర్ జి.తిరుమల ప్రసాద్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలం క్రస్ట్ గేట్లు ఎత్తి నాగార్జునసాగర్కు నీటి విడుదల జరుగుతుండటంతో కుడి జలవిద్యుత్ కేంద్రంలో పవర్ జనరేషన్కు సిద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెన్కో క్వార్టర్స్ను పరిశీలించారు. సీఈ తిరుమల ప్రసాద్ను జెన్కో అధికారులు ఘనంగా సత్కరించారు. కుడి జలవిద్యుత్ కేంద్రం ఈఈ సీహెచ్ అప్పాజీ, సివిల్ ఎస్ఈ కె.వెంకటరమణ, సివిల్ ఈఈ సుబ్రహ్మణ్యం, 327 యూనియన్ సెక్రటరీ బి.సూరజ్చంద్, అధ్యక్షుడు ఎం.సాంబశివ, ఎన్.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. అమరేశ్వరుని ఆదాయం రూ.27.09 లక్షలు అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత నాలుగు నెలలుగా హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. కోటప్పకొండ దేవస్థానం సహాయ కమిషనర్ చంద్రశేఖరరావు పర్యవేక్షణలో దేవాలయంలోని 10 హుండీలను తెరచి అందులో ఉన్న నగదును లెక్కించారు. ఈఓ రేఖ మాట్లాడుతూ హుండీల ద్వారా రూ.26,32,499, అన్నదానం హుండీల ద్వారా రూ.75,596, మొత్తం రూ.27,09,095 వచ్చిందన్నారు. -
కోన ప్రభాకరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
బాపట్ల: మాజీ గవర్నరుగా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకరుగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసిన దివంగత కోన ప్రభాకరరావు విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే పాత బస్టాండ్ వద్ద డివైడర్పై తిరిగి ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి కోరారు. బుధవారం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోన మాట్లాడుతూ.. రాష్ట్రానికి, దేశానికి కోన ప్రభాకర రావు చేసిన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల పట్టణానికి తాగునీరు అందించిన ఘనత కోన ప్రభాకరరావుకే దక్కుతుందన్నారు. ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చే విధంగా బాధ్యతలు నిర్వహించారన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రహదారి విస్తరణలో పాత బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి తిరిగి ఏర్పాటు చేస్తామని ఆ రోజు తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఆ తీర్మానం అమలుకు నోచుకోలేదని, ఆయన జయంతి సందర్భంగానైనా పురపాలక సంఘం అధికారులు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలన్నారు. సుప్రీంకోర్టు సైతం డివైడర్లపై విగ్రహాలు పెట్టుకోవచ్చనే సూచన చేసిందన్నారు. మరి ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. రహదారి విస్తరణలో తొలగించిన విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని అడుగుతున్నామని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు, గుర్రం జాషువా విగ్రహాలను తొలగించి మూలన పెట్టేశారన్నారు. వాటిని కూడా తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. గురువారం జరిగే కోన ప్రభాకరరావు జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జోగి రాజా, శ్రీనివాసరెడ్డి, తన్నీరు అంకమ్మరావు తదితరులు ఉన్నారు. -
నేరాల నియంత్రణకు డ్రోన్ల నిఘా కీలకం
బాపట్ల టౌన్: నేరాల నియంత్రణకు డ్రోన్లతో నిఘా కీలకమైందని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. జిల్లాలోని ఆరు పోలీస్స్టేషన్లకు ఆయా స్టేషన్ల పరిధిలోని దాతలు డ్రోన్లను అందించారు. బుధవారం దాతలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణలో డ్రోన్ల ద్వారా నిఘా కీలకమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను దాతలు అందించడం అభినందనీయం అన్నారు. డీజేఐ మినీ–3 డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు అందించారన్నారు. నిజాంపట్నం పోలీస్స్టేషనుకు రాఘవేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ తరఫున కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఒకటి, నిజాంపట్నంలోని ఏబీఏడీ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ పెర్ల్ మైరెన్ కంపెనీలు సంయుక్తంగా మరో డ్రోన్ అందించాయి. రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్కు డి.పి.ఎస్. ఫుడ్స్ తరఫున ఒకటి, భట్టిప్రోలు పోలీసు స్టేషనుకు కొల్లూరు మండలం జువ్వలపాలం చెందిన వేములపల్లి రవికిరణ్ ఒకటి, చెరుకుపల్లి పోలీస్ స్టేషనుకు మండలంలోని ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్స్ ఒకటి, వేమూరు పోలీస్ స్టేషనుకు హైదరాబాద్కు చెందిన యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక డ్రోన్ బహూకరించినట్లు తెలిపారు. అనంతరం దాతలను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాస రావు, రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జున రావు, రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు, వేమూరు సీఐ ఆంజనేయులు, నిజాంపట్నం, భట్టిప్రోలు, వేమూరు, చెరుకుపల్లి ఎస్ఐలు పాల్గొన్నారు. ఆరు డ్రోన్లను అందించిన దాతలు జిల్లా ఎస్పీ తుషార్డూడీ అభినందన -
వారధిపై అలుముకున్న అంధకారం
రేపల్లె: పెనుమూడి – పులిగడ్డ వారధి అంధకారంలో మగ్గిపోతోంది. ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై అనుసంధానంగా ఉన్న ఈ వారధి రాష్ట్రంలో రెండో అతి పెద్దదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వీధి దీపాలు మరమ్మతులకు గురవ్వటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వంతెనపై రాత్రివేళ ప్రయాణం చేయడం కత్తిమీద సాములా మారింది. రోజూ వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు ఈ వంతెనపై నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. పులిగడ్డ – పెనుమూడి మధ్య ప్రయాణించాల్సిన వారికిదే ప్రధాన మార్గం. తరచూ ప్రమాదాలు ఇటీవల రేపల్లె మండలం ఆరవపల్లికి చెందిన కుటుంబం మచిలీపట్నం బీచ్కి వెళ్లి వస్తుండగా రాత్రి సమయంలో వారధిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా తెనాలికి చెందిన కుటుంబం మోపిదేవి గుడికి కారులో వెళ్తూ ఉండగా వారధిపై జరిగిన ప్రమాదంలో వారిలోని ముగ్గురు చనిపోయారు. రుద్రవరానికి చెందిన యువకుడు, పేటేరుకు చెందిన యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదం గురై మృత్యువాత పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో పాత దీపస్తంభాలు ఉన్నా కరెంట్ సరఫరా లేదు. ఈ వంతెనపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడమే కాకుండా, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తాం పెనుమూడి – పులిగడ్డ వారధిపై లైటింగ్ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రాత్రి సమయంలో లైటింగ్ లేకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను వివరించి, సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తాం. – శ్రీనివాసరావు, తహసీల్దార్ నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు విద్యుద్దీపాలు వెలగకపోవటంతో తరచూ ప్రమాదాలు -
శరణు శాకంబరి
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో రెండో రోజైన బుధవారం పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని శాకంబరిగా దర్శించుకున్నారు. మరో వైపున ఆషాఢ మాసోత్సవాలు కొనసాగుతుండగా.. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాల నుంచి పలు భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సుమారు 50కిపైగా భక్త బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. శాకంబరి ఉత్సవాలకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల నుంచి సుమారు 25 టన్నులకు పైగా కూరగాయలు, ఆకుకూరలను సేకరించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శాకంబరిగా దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. కనకదుర్గనగర్, మహామండపం మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కదంబ ప్రసాదం పంపిణీ చేసింది. ఆలయ ప్రాంగణంలో చేసిన అలంకారం నుంచి ఒక్క కూరగాయ, ఆకుకూరనైనా ఇంటికి తీసుకువెళ్లాలనే భావనతో భక్తులు కూరగాయల కోసం ఎగబడటం కనిపించింది. చివరి రోజైన గురువారం అమ్మవారిని పండ్లు, ఫలాలు, డ్రై ఫ్రూట్స్తో అలంకరించనున్నారు. ఇందు కోసం యాలకులు, జీడిపప్పులతో దండలను సిద్ధం చేస్తున్నారు. యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. -
ఎండుతున్న రైతు గుండె!
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025సకాలంలో వర్షాలు పడి కాలువలకు సమృద్ధిగా నీరు వస్తే పంట పొలాలు పైర్లతో కళకళలాడుతుండేవి. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడటం, ప్రస్తుతం వరుణుడు మొహం చాటేయటం, ఈదురు గాలులు వీస్తుండటంతో మొలక దశలో ఉన్న నారు మడులు, వెద పెట్టిన పొలాలు మొక్క దశలోనే మాడిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బాపట్ల టౌన్: కళ్లెదుటే రైతుల ఆశలు ఆవిరి అవుతుండటంతో ఆవేదన చెందుతున్నారు. డీజిల్ ఇంజిన్లు, నీటిని పెట్టేందుకు అవసరమైన ట్యూబులు అద్దెకు ఇచ్చే షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే దుక్కులు, ఎరువులకు రూ.వేలకు వేలు ఖర్చు చేసి నారుమడులు పోసుకున్న రైతులు మొక్క దశలో ఉన్న పైరును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. సహజంగా రైతులకు నీటి కష్టాలు అక్టోబర్ మాసంలో పైర్లు బిర్రుపొట్ట దశలో ఉన్నప్పుడు తలెత్తేవి. ఒకటి, రెండు తడులు అందిస్తే ఈని నవంబర్, డిసెంబర్ మాసాల్లో కోతలకు వచ్చేవి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆదిలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. నారు మడుల దశలోనే డీజిల్ ఇంజిన్లపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లోని రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే దాదాపు రూ.పది వేలు ఖర్చు బాపట్ల జిల్లాలో ఏటా రైతులు నార్లు పోసుకొని, నాట్లు వేసుకునే పద్ధతికే మక్కువ చూపేవారు. ఈ ఏడాది జూన్ మాసంలో వర్షాలు కురవడంతో నారు మడులతోపాటు వెద పద్ధతి వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం మొలకలు వచ్చిన పైర్లు కూడా భూమిలో తేమ లేకపోవడం, భానుడి భగభగతో మాడిపోతున్నాయి. నారు మడులు అయితే పూర్తిగా ఎండిపోతున్నాయి. వెద పద్దతిలో సాగు చేసిన పొలాలకు విత్తనాల కొనుగోలు, ట్రాక్టర్ల కూలీ, మందుల పిచికారి, దుక్కులు ఇలా అన్నీ కలిపి ఇప్పటికే ఎకరాకు రూ. 10 వేల వరకు ఖర్చు చేశారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. న్యూస్రీల్నాలుగు రోజుల్లో కాలువలకు నీరు ప్రస్తుతానికి మున్సిపాలిటీ చెరువుకు తాగునీటి అవసరాలకు కాలువల నీటిని అందిస్తున్నాం. రెండు రోజులుగా దీనికే సరఫరా చేస్తున్నాం. పీటీ చానల్కు నాలుగు రోజుల్లో నీరు విడుదల చేస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.– వెంకటరమణ, ఇరిగేషన్ జేఈఈ, బాపట్ల కాలువ నీరు వస్తే మేలు మాది చీరాల మండలం, గవినివారిపాలెం. కర్లపాలెం మండలం సమ్మెట వారి పాలెం పంచాయతీ పరిధిలో పొలం ఉంది. ఇటీవల కాలువలకు సాగునీరు రావడంతో నారుమడులు సిద్ధం చేసుకొని నారు పోశా. ప్రస్తుతం నీరు రావడం లేదు. కొద్దిపాటి నీటిని కాలువ మొదట్లో ఉన్న రైతులు డీజిల్ ఇంజిన్లతో వాడుతున్నారు. బోరు ద్వారా నీటిని అందించేందుకు పైపులు తీసుకెళ్తున్నా. – శ్రీనివాసరావు, రైతు, గవినివారిపాలెం పెరిగిన ఖర్చులతో భారం పీటీ చానల్ పరిధిలో హైదరపేట – సమ్మెట వారి పాలెం మధ్యలో 3 ఎకరాలు ఉంది. మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. నాలుగు రోజుల క్రితం నాట్లు వేసేందుకు నారు విత్తనాలు పోశా. ప్రస్తుతం నారు మొలకదశలో ఉంది. వర్షాలు పడటం లేదు. కాలువల్లో నీరు అడుగంటిపోయింది. డీజిల్ ఇంజిన్తో తడులు అందిస్తున్నా. మొత్తం తడపాలంటే రూ. 2,500 నుంచి రూ.3,000 వరకు ఖర్చు అవుతోంది. – పిట్టు గురవారెడ్డి, శీలంవారిపాలెం ఆదిలోనే తప్పని క‘న్నీటి’ కష్టాలు నీరందక ఎండిపోతున్న నారు మడులు డీజిల్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్న అన్నదాతలు ఎకరం తడిపేందుకు రూ.వేల ఖర్చు కాలువల్లో అడుగంటిన సాగునీరు ఆందోళనలో మునిగిపోయిన రైతులు -
ఎర్ర జెండాలు కన్నెర్ర
ఎర్ర జెండాలతో చీరాల పట్టణంలో ర్యాలీ తీస్తున్న వివిధ రంగాల కార్మికులు చీరాల: కార్మికులను కట్టు బానిసలుగా మార్చడంతోపాటు కంపెనీల యాజమానులకు అధిక లాభాలను తీసుకొచ్చేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన కార్మిక చట్టాలను రూపొందించాయని ఏపీ ఐఎల్టీడీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధనలక్ష్మి పేర్కొన్నారు. దీన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. నూతన కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె చీరాలలో విజయవంతం అయింది. సీఐటీయూ, వైఎస్సార్టీయూసీ, టీఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్లు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నాయి. కార్మికుల హక్కులను, రక్షణను విస్మరించే చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నాయకులు, కార్మికులు ఎర్ర జెండాలతో సమ్మె నిర్వహించారు. ఈ కారణంగా ఐఎల్టీడీ కంపెనీ మూతపడింది. కంపెనీ వద్ద జరిగిన ప్రదర్శనలో ఫెడరేషన్ నాయకులు ధనలక్ష్మి మాట్లాడారు. వంద సంవత్సరాల క్రితం సమ్మెలు చేసి కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం సాధించుకున్నారని, ప్రస్తుత చట్టాలు అమల్లోకి వస్తే ఆ చట్టాలన్నీ కోల్పోతారన్నారు. పట్టణంలో వివిధ కార్మిక సంఘాలు, అంగన్వాడీ, మెప్మా, మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. భారీ ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ నాయకులు వసంతరావు, గోసాల సుధాకర్, పఠాన్ కాలేషా, కె.రామకృష్ణ, బాబ్జి, కాలేషా, ఆనందబాబు, నాగరాజు, వెంకటేశ్వర్లు, పోతురాజు, అమీర్, కార్మికులు పాల్గొన్నారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలి బాపట్ల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీల ఆధ్వర్యంలో బుధవారం బాపట్లలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పలు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు పాల్గొన్నారు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి జీబీసీ రోడ్డు, రథం బజారు ద్వారా అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుంది.ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్, ఏఐటీయూసీ నాయకులు సింగరకొండ, కె.శరత్, బి.తిరుమలరెడ్డి, అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజబెత్, గీత, కృష్ణవేణి, రాహేలు, రత్నం, బుచ్చిరాజు హరిబాబు, ఒ.లక్ష్మణ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మె విజయవంతం యజమానులకు లాభాలు తెచ్చేందుకే లేబర్ కోడ్స్ మండిపడిన కార్మిక లోకం -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు శరత్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అర్ధనగ్న మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అనంతరం ప్రదర్శన చేపట్టారు. శరత్ మాట్లాడుతూ 15రోజులుగా వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బుధవారం చేపట్టిన చలో విజయవాడకి తరలిరావాలని కోరారు. జూలై 4నుంచి అత్యవసరాలు మంచినీళ్లు, విద్యుత్తు లాంటి విధు లు నిర్వహిస్తున్న కార్మికులు కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఇంజినీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అమలుచేయాలి, జీవో నెంబర్ 36 ప్రకారం రూ.24,500 వేతనం అమలుచేయాలని, తక్షణం తల్లికి వందనం ఇవ్వాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, గత సంవత్సరం 17రోజుల సమ్మె ఒప్పందాలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యూనియన్ నాయకులు రత్నం, నాని, అశోక్, బాపట్ల పట్టణ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూని యన్ నాయకులు మురళీకృష్ణ, హరిబాబు, సాంబిరెడ్డి, ప్రమీల, నరేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐటీయూ నాయకులు శరత్ -
వైఎస్సార్ సీపీ నాయకుడిపై ఇనుప రాడ్లతో దాడి
చీరాల అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావూరి బాలకోటిరెడ్డిపై టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రుడు చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు కావూరి బాలకోటిరెడ్డి తెలిపిన వివరాల మేరకు... చీరాల మండలం కొత్తపాలేనికి చెందిన కావూరి బాలకోటిరెడ్డి మంగళవారం చీరాల నగర్లో జరిగిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్న సమయంలో తిరిగి ఇంటికి వెళుతున్నాడు. మార్గంమధ్యలో దండుబాట వద్ద చెట్టు కింద కూర్చున్నాడు. ఈ సమయంలో బక్కా శివప్రసాద్రెడ్డి అనుచరులు రాజు సుబ్బారెడ్డి, బక్కా పరుశురామిరెడ్డిలు.. బాలకోటిరెడ్డిపై ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. రాజకీయంగా గ్రామంలో కీలకంగా మారుతున్నావని.. ప్రజలకు అన్ని విషయాల్లో తోడుంటున్నావని.. నీవు లేకపోతే తమకు అడ్డు ఉండదంటూ దుర్భాషలాడారు. అన్నింటా అడ్డు తగులుతున్నావని, సర్పంచ్గా పోటీ చేస్తానని చెబుతున్నావంటూ గాయపరిచారు. తలకు బలమైన గాయం కావడంతో బంధువులకు సమాచారం అందించగా చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చారు. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు బాధితుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేశారు. దాడి సంఘటన సమాచారం తెలుసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, పార్టీ నాయకులకు ఏరియా వైద్యశాలకు వెళ్లి బాలకోటిరెడ్డిని పరామర్శించారు. దాడి చేయడం హేయమైన చర్య అని, టీడీపీ పాలనలో వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
ఆర్మీజవాన్ పార్థివదేహానికి నివాళులర్పించిన డాక్టర్ గణేష్
నగరం: జమ్మూ కశ్మీర్లోని రాజౌరీలో విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి మృతి చెందిన ఆర్మీ జవాన్ ఉప్పాల రవికుమార్ పార్థివదేహం మంగళవారం స్వగ్రామమైన చిరకాలవారిపాలెం చేరింది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆర్మీ జవాన్ రవికుమార్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవికుమార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్మీ అధికారులు రవికుమార్ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఇంకోల్లు రామకృష్ణ, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి నిజాంపట్నం కోటేశ్వరరావు, యార్లగడ్డ మదన్మోహన్ పాల్గొన్నారు. -
ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు
డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి చీరాలటౌన్: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించి వలసలు నిర్మూలించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సిబ్బంది, ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని బాపట్ల జిల్లా డ్వామా పీడీ ఎ.వి.విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం చీరాల మండల పరిషత్ కార్యాలయంలో 2024 ఏప్రిల్ నుంచి మార్చి 2025 వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాజిక తనిఖీ బృందం చీరాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులపై తనిఖీ చేపట్టారు. మండలంలో చేపట్టిన 1243 పనులు, ఖర్చులు రూ.9 కోట్లు, పంచాయతీరాజ్ నిధులు రూ.1.82 కోట్లు, ఎన్ఆర్ఈజీఎన్ రూ.6.95 కోట్లతో ఉపాధి పనులు చేశారు. పంట కాలువలు, పూడికతీత పనులు, గోకులం షెడ్లు 10 నిర్మాణాలు, ఉపాధి కూలీలకు చెల్లించిన నగదు, వసతులు, మెటీరియల్ సరఫరా, మొక్కల సంరక్షణ తదితర పనులపై సామాజిక తనిఖీ బృందం పంచాయతీల వారిగా చేసిన పనులను వివరించారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో చేసిన పనులు, చెల్లింపుల వివరాలను, కూలీలు వివరాలను సిబ్బంది అధికారులకు వివరించారు. సామాజిక తనిఖీకి ప్రిసైడింగ్ ఆఫీసర్గా పీడీ విజయలక్ష్మి వ్యవహరించగా జిల్లా హెచ్ఆర్ మేనేజర్ చంద్రశేఖర్, ఎంపీడీవో శివన్నారాయణ, జిల్లా ఏపీడీ కోటయ్య నాయక్, ఏపీవో దాసు, ఫీల్డు అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఉపాధి పనుల గురించి డ్వామా పీడీ పలు సూచనలు చేశారు. -
ప్రకృతి మాతకు ప్రణామం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మంగళవారం శాకంబరీ ఉత్సవాలు అంగ రంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వర స్వామి వార్లతో పాటు ఘాట్రోడ్డులోని కామథేను అమ్మ వారు, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాల్లో దేవతా మూర్తులను కాయగూరలు, ఆకుకూరలతో అలంకరించారు. నూతన యాగశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించగా, ఈఓ శీనానాయక్, ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయం, ఉపాలయాలను కరివేపాకు, నిమ్మకాయలు, వివిధ రకాల కాయగూరలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో కూరగాయలతో ఏర్పాటుచేసిన శివలింగాకృతి, పక్కనే స్వామి వారికి నమస్కరిస్తున్న అమ్మవారు, కుమార స్వామి, గణపతి ప్రతిమలు ఆకట్టుకున్నాయి. నీటి కొలనులో సొరకాయలతో తీర్చిదిద్దిన హంసలు, దోసకాయలతో రూపొందించిన బాతులు భక్తులను కనువిందు చేస్తున్నాయి. కాకరకాయలతో చేసిన మొసలి విశేషంగా ఆకట్టుకుంటోంది. మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తిని శాకంబరీగా అలంకరించిన ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సారెను స్వీకరించారు. కదంబం కోసం బారులు తీరిన భక్తులు శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లతో అలంకారం ప్రత్యేకత. ఆ కూరగాయలను ఉపయోగించే తయారు చేసే కదంబ ప్రసాదం కోసం భక్తులు బారులు తీరారు. ఏడో అంతస్తులో ఉచిత ప్రసాద వితరణ వద్ద ఉదయం ఆలయ ఈఓ శీనానాయక్ అమ్మవారి చిత్రపటానికి పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రసాద పంపిణీని ప్రారంభించారు. పిల్లా పాపలతో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తబృందాలు కదంబ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయ ఈవో అన్నప్రసాద తయారీ పోటులో కదంబ ప్రసాద తయారీని పరిశీలించారు. ప్రసాద తయారీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తుందరికి ప్రసాదం అందేలా చూడాలని ఆదేశించారు. అమ్మవారి దర్శనానికి విచ్చే సిన భక్తులు కాయగూరలు, ఆకుకూరలతో తయారు చేసిన దండలను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై ఘనంగాశాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కూరగాయలు, ఆకుకూరలతో దుర్గమ్మకు అలంకరణ మూడు రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిబాపట్ల: వర్షాకాలంలో సీజనల్ అంటు వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ దిగువ ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైరల్ ఫీవర్ వచ్చే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డెంగీ, చికెన్ గున్యా, మలేరియా, వైరల్ ఫీవర్లు నమోదైతే తక్షణమే స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలలో అత్యవసరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. వ్యాధులు ప్రబలకుండా నివారించడమే ముఖ్యోద్దేశం అన్నారు. సాధారణం కంటే జ్వరాల కేసులు ఏ ప్రాంతంలోనైనా అధికమైతే వెంటనే సమాచారం పంపాలన్నారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన ఔషధాలను నిల్వ చేసుకోవాలన్నారు. ఔషధాల కొరత లేకుండా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కాల్వల పూడికతీత పనులు వేగంగా చేపట్టాలన్నారు. వర్షాకాలంలో ఖాళీ ప్రదేశాలు, గృహాల మధ్య నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. నిర్లిప్తంగా ఉంటే చర్యలు తప్పవన్నారు. ప్రతి ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు. భూమిలో కుళ్లిపోయే స్వభావం ఉన్న వ్యర్థాలను పచ్చ కుండీలు, ప్లాస్టిక్ తదితరమైన వ్యర్థ పదార్థాలను ఎరుపు చెత్తకుండీలో వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా, సాగర్ కాల్వల నుంచి నీరు విడుదలవుతున్నందున జిల్లాలోని ఆర్డబ్ల్యూఎస్ చెరువులన్నిటిని నింపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డీపీఓ ప్రభాకరరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే చర్యలు
–రేషన్ దుకాణం సీజ్ చేసిన ఆర్డీఓ చీరాల టౌన్: ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడే డీలర్లపై చర్యలు తప్పవని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు హెచ్చరించారు. మంగళవారం మున్సిపాలిటీలోని 38 నంబర్ రేషన్ దుకాణంపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ, ఇతర అధికారులు తనిఖీలు నిర్వహించారు. వైకుంఠపురంలోని 38 నెంబర్ రేషన్ దుకాణదారుడు దుడ్డు ప్రభాకర్ ప్రజలకు బియ్యం, పంచదార సక్రమంగా అందించకుండా నగదు చెల్లించడంపై ఫిర్యాదులు అందాయి. దీంతో దుకాణానికి కేటాయించిన బియ్యం, పంచదారకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. తనిఖీల్లో 300 కిలోల రేషన్ బియ్యం, 57 ప్యాకెట్లు పంచదార అదనంగా ఉండటంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ సరుకులు పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ దుకాణాన్ని, సరుకులను సీజ్ చేశారు. ఆర్డీవో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకులను సక్రమంగా పంపిణీ చేయకుండా ప్రజల నుంచి నగదుకు కొనుగోలు చేసినా, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా పంపిణీ పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంటే కొందరు డీలర్లు అక్రమాలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. రేషన్ డీలర్లు విధిగా నిబంధనల ప్రకారం సరుకులు పంపిణీ చేసి స్టాక్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడినా, బియ్యానికి బదులు డబ్బులు ఇచ్చిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజ్ చేసిన బియ్యం, పంచదారను ఎన్ఫోర్స్మెంట్ డీటీ గీతాకు అందించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ కె.గోపికృష్ణ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
‘నూటా’ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు
ఏఎన్యూ: నూటా (ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యాపక సంఘం) ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఆచార్య కె.సుమంత్ కుమార్, ఆచార్య ఎం.జగదీష్ నాయక్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నూటా ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల అధికారి ఆచార్య ఎస్.మురళీమోహన్కు మంగళవారం వారిరువురూ వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల ప్రక్రియలోని లోపాలపై తాము హైకోర్టును ఆశ్రయించామని తమ పిటీషన్పై మంగళవారం వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు నూటా ఎన్నికల కోసం ఈనెల 1వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు
ఎస్పీ తుషార్ డూడీ ––––––––––––––––––––––– బాపట్లటౌన్: కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్డూడీ హెచ్చరించారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాలోని కళాశాలలు, విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్నారు. తనిఖీల అనంతరం పోలీస్ అధికారులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తుల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో సిగరెట్లు, పాన్, గుట్కా, గంజాయి, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదనే నిబంధన ఉందన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పొగాకు ఉత్పత్తులు, పాన్, గుట్కా వంటి వాటిని విక్రయిస్తున్న వారిపై కోట్పా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు ఉన్నతమైన భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, ఆ లక్ష్య సాధన కోసం కృషి చేసే సమయంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.మాదకద్రవ్యాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు, టోల్ ఫ్రీ నంబర్ 1972 కు కాల్ చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. -
అదృశ్యం కేసులో పది మంది ఆచూకీ గుర్తింపు
లక్ష్మీపురం: ఈ నెల 2వ తేదీన కొబాల్డ్పేటలో ముగ్గురు మహిళలు, ఏడుగురు చిన్నారులు అదృశ్యం అయిన కేసును పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఛేదించారు. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పట్టాభిపురం సీఐ తెలిపిన వివరాల ప్రకారం... కోబాల్డ్పేట 6వ లైనులో నివాసం ఉండే సయ్యద్ సందానీకి, అతని భార్య కరీమూన్కు కొంత కాలంగా చిన్న గొడవలు జరుగుతున్నాయి. అదే భనవంలో పై పోర్షన్లో నివాసం ఉండే షేక్ చిన్న బాజీకి, ఆమె భార్య రజియాకు కూడా మనస్పర్థలు ఉన్నాయి రజియా చెల్లెలు సైదాబీకూడా తన భర్తతో గొడవల కారణంగా వచ్చి వీరి వద్దనే తన కుమార్తెతో ఉంటోంది. కరీమూన్, రజియా, సైదాబీలు ఎక్కడికై నా వెళ్లి పని చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ నెల 2వ తేదీన బయలుదేరారు. కరీమూన్ తన ముగ్గురు మగ పిల్లలను, రజియా తన ముగ్గురు పిల్లలను, సైదాబీ తన కుమార్తెను వెంట బెట్టుకుని వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. వీరి కోసం ప్రత్యేక బృందాన్ని కేటాయించారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తన సిబ్బందితో ఏఎస్సై ఆంటోని, హెడ్ కానిస్టేబుల్ ప్రసాదరావు, కోటేశ్వరరావు, నరసింహారావు, మాణిక్యరావుల సహాయంతో హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలో వీరు ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. -
జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
గుంటూరు వెస్ట్: జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, శాసనమండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జి మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నెలకొల్పేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, బీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అధికారులలో కొరవడిన సమన్వయం జిల్లా సమీక్షా సమావేశంలో సమన్వయం లేకుండా పోయింది. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య ఎక్కడా సమన్వయం లేకపోవడం గమనార్హం. సమావేశంలో తల్లికి వందనంపై చర్చ జరిగేటప్పుడు పూర్తి వివరాలు డీఈఓ రేణుక వెల్లడించలేకపోయారు. దీంతో శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్లు నిలదీశారు. కొందరికి రూ.13 వేలు, మరికొందరికి రూ.10 వేలు ఎందుకు పడుతున్నాయని శాసన సభ్యులు ప్రశ్నించగా అధికారుల వద్ద సమాధానం కరువైంది. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని వెల్లడించారు. అర్హత ఉన్నప్పటికీ ఎందుకు నగదు జమ చేయలేదని నిలదీశారు. కలెక్టర్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతోపాటు సీసీఆర్సీ కార్డులతోపాటు కౌలు రైతులకు రుణాలు లక్ష్యాల మేరకు ఎందుకివ్వలేదని ప్రశ్నించినప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నామని అధికారులు దాటవేత ధోరణిలో బదులిచ్చారు. ఇక పీ4 విషయానికి వస్తే మరీ దారుణంగా వ్యవహరించారు. జిల్లాలో గుంటూరు తూర్పు నియోజకవర్గానికి 17,050, పశ్చిమకు 14,757, మంగళగిరికి 9,968, పొన్నూరుకు 9,632, ప్రత్తిపాడుకు 6,700, తెనాలికి 11,173 మందిని ఆదుకోవాలని లక్ష్యాలుగా నిర్ణయిస్తే ఒక్కరు కూడా ఎంత మందికి న్యాయం చేవామో చెప్పలేదు. ఇంకా పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించలేదని తెలిసింది. ఈ సమావేశానికి కూడా మంగళగిరి శాసన సభ్యులు, మంత్రి నారా లోకేష్ హాజరు కాలేదు. ఆయనతోపాటు ప్రత్తిపాడు శాసనసభ్యుడు బూర్ల రామాంజనేయులు, తెనాలి శాసన సభ్యుడైన మంత్రి నాదెండ్ల మనోహర్లు రాలేదు. – ఇన్చార్జి మంత్రి కందుల దుర్గేష్ -
పికిల్ బాల్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
గుంటూరువెస్ట్ (క్రీడలు): పికిల్ బాల్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం గుంటూరులోని వీవీవీ హెల్త్క్లబ్లో నిర్వహించారు. ఎన్నికలకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ నుంచి పి.నరసింహా రెడ్డి, ఏపీ పీపుల్ బాల్ సంఘం కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఒలింపిక్ సంఘం నుంచి కె.వేణుగోపాల్తోపాటు న్యాయవాది చిగురుపాటి రవీంద్రనాధ్ హాజరయ్యారు. చీఫ్ ఇన్ ప్యాట్రన్గా టి.అరుణ్ కుమార్, చైర్మన్గా చుక్కపల్లి రాకేష్, గౌరవాధ్యక్షుడిగా టి.హరికిషన్ సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్గా డాక్టర్ ఎం.శివకుమార్, ఉపాధ్యక్షులుగా సి.హెచ్.రవీంద్రబాబు, ఎన్వీ కమలాకాంత్, ఎస్వీ రామకోటేశ్వరరావు, డాక్టర్ పి.వరుణ్, డాక్టర్ టి.హనుమంతరావు, ఎం.భరత్ కుమార్, కార్యదర్శిగా జీవీఎస్ ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ ఎం.కళ్యాణ చక్రవర్తి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ఫణీంద్ర, ఎన్ ఫణిరామ్, ఎస్కే మన్సూర్ వలి, ఎ.సుబ్బారావు, నిర్వహణ కార్యదర్శిగా కె.అరుణ్ కుమార్, కోశాధికారిగా కె.సుస్మితా చౌదరిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
రైలు కింద పడి యువకుడు మృతి
రేపల్లె: రైలు కింద పడి యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ వెంకటాద్రి వివరాల మేరకు సికింద్రాబాద్ నుంచి రేపల్లెకి రాత్రి 9 గంటలకు వచ్చే డెల్టా ఎక్స్ప్రెస్ కింద యువకుడు పడి మృతి చెంది ఉండటాన్ని రైల్వే గ్యాంగ్మెన్లు గమనించి మంగళవారం సమాచారం ఇచ్చారన్నారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు నగరం మండలం ధూళిపూడి గ్రామానికి చెందిన కొండవీటి మణి (25)గా గుర్తించామన్నారు. మోర్లవారిపాలెం రైల్వే గేటుకు సమీపంలో ప్రమాదం జరిగిందన్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
రక్షించేందుకు తోటి రైతులు చేసిన ప్రయత్నం విఫలం కొల్లూరు : వరి ఎండిపోకుండా పంటకు నీరు పెట్టే క్రమంలో కౌలు రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యుఒడిలోకి చేరిన సంఘటన కొల్లూరులో జరిగింది. కుటంబ సభ్యులు, స్థానిక రైతుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా కొల్లూరు గుంటపునుగులు చెట్టు ప్రాంతానికి చెందిన పత్తిపాటి శ్రీనివాసరావు (53) వరి చేనుకు విద్యుత్ మోటరు సాయంతో నీరు పెట్టేందుకు మంగళవారం ఉదయం అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉన్న పొలం వద్దకు సహచర రైతులతో కలసి వెళ్లాడు. విద్యుత్ సరఫరా ఆలస్యం కావడంతో తోటి రైతులకు ఫోన్ చేసి సరఫరా సమయంపై ఆరా తీసి అక్కడే వేచి ఉన్నాడు. కొద్ది సేపటికి కరెంట్ రావడంతో మోటరు ఆన్చేసే ప్రయత్నం చేశాడు. స్టార్టర్ బాక్స్కు విద్యుత్ వెలువడి విద్యుదాఘాతానికి గురయ్యాడు. చుట్టుపక్కల రైతులు గమనించి అతనిని రక్షించేందుకు కర్రలతో కొట్టడంతో పక్కకి పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని హుటాహుటిన కొల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకువెళ్లగా, వైద్యులు సూచనలతో తెనాలి వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, వివాహమైన కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆడుదాం ఆంధ్రాపై విజిలెన్ ్స వివరాల సేకరణ సత్తెనపల్లి: క్రీడాకారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రాపై విజిలెనన్స్ అధికారులు మంగళవారం వివరాలను సేకరించారు. విజిలెనన్స్ రేంజ్ ఇన్స్పెక్టర్ షేక్ సైదులు నేతృత్వంలోని నలుగురు విజిలెన్స్ బృందం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఆర్వో అప్పారావు వద్ద వివరాలు కోరారు. ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా ఇచ్చి దాని ప్రకారం వివరాలు నింపాలని సూచించారు. పట్టణంతోపాటు మండలంలోని గ్రామ/వార్డు సచివాలయాల అడ్మిన్లు అందర్నీ మున్సిపల్ కార్యాలయానికి పిలిపించి వారి చేత ప్రొఫార్మా ఎలా పూర్తి చేయాలో సూచనలు చేశారు. మాజీ మంత్రి అంబటికి పోలీసులు నోటీసులు సత్తెనపల్లి:పోలీసుల విచారణకు హాజరు కావాలని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఉల్లంఘించారంటూ పలు సెక్షన్లతో విచారణకు హాజరు కావాలని కోరారు. నోటీసులు అందుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈనెల 11న సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉర్దూ బాలుర జూనియర్ కళాశాలలో సీట్ల భర్తీ గుంటూరు ఎడ్యుకేషన్: పాత గుంటూరు నందివెలుగురోడ్డులోని ఏపీ రెసిడెన్షియల్ ఉర్దూ మైనార్టీ బాలుర జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో చేరేందుకు అర్హులైన పేద ముస్లిం విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు సంప్రదించాలని ప్రిన్సిపల్ పి. సాంబశివరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బైపీసీలో 20, సీఈసీలో 15 సీట్లలో ప్రవేశానికి బీసీ–ఈ, బీసీ–బీ కేటగిరీ విద్యార్థులు అర్హులని తెలిపారు. నేడు సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్కుమార్ లక్ష్మీపురం: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. పాలకులను హెచ్చరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బుధవారం ఉదయం 9 గంటలకు గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి భారీ ర్యాలీ ప్రారంభం అవుతుందని చెప్పారు. బీఆర్ స్టేడియం వరకు సాగుతుందని వివరించారు. అన్ని వర్గాల కార్మికులు, ఉద్యోగులు, యువత, ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా పోలీసుల బదిలీల్లో అవస్థలు
● గుంటూరు అర్బన్ నుంచి సుదూర ప్రాంతాలకు బదిలీలు ● తమకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన నగరంపాలెం: గ్రామ, వార్డు సచివాలయాల బదిలీల పక్రియ గందరగోళంగా మారిందని మహిళా పోలీసులు వాపోయారు. బదిలీల దరఖాస్తుల్లో ఐదు ఆప్షన్లకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వందల కిలో మీటర్ల దూరం బదిలీలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం(డీపీఓ) ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం కావాలంటూ నినదించారు. గత నెల 28న గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే మహిళా పోలీసుల బదిలీల పక్రియ మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని మహిళా పోలీసులు ఆయా డీపీఓల్లో దరఖాస్తులు చేసుకున్నారు. రెండు రోజుల క్రితం బదిలీల పక్రియ ముగిసి, పోస్టింగ్లు కల్పించారు. ఒక్కసారిగా మహిళా పోలీసుల్లో ఆందోళన మొదలైంది. గుంటూరు అర్బన్ జిల్లాలోని వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే వారికి పల్నాడు, బాపట్ల జిల్లాలను కేటాయించారని వాపోయారు. కనీసం ఐదు ఆప్షన్లల్లో ఒకట్రెండు వాటికి దరఖాస్తులు చేసినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. ఏడు నెలల బాబు ఉన్నాడని దరఖాస్తులో తెలియజేసినా గుంటూరు అర్బన్ నుంచి మేడికొండూరు మండలం రూరల్కు బదిలీ చేశారని ఓ మహిళా పోలీస్ వాపోయింది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారి అందుబాటులో లేరని చెప్పడంతో డీపీఓ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో చంటి బిడ్డలతో వచ్చిన వారు సైతం వెనుదిరిగి వెళ్లారు. -
నూతన బస్లను ప్రారంభించిన మంత్రులు
అద్దంకి: ఆర్టీసీ నూతన బస్సులను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, క్రీడా శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్రెడ్డి మంగళవారం ప్రాంరంభించారు. విద్యుత్శాఖ మంత్రి మాట్లాడుతూ అద్దంకికి ఇప్పటి వరకూ 12 కొత్త బస్సులను ఇచ్చినట్లు చెప్పారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో లోక్ సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ వెంటకమురళి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ విజిలెన్స్ దాడులు వేటపాలెం: వేటపాలెంలో విద్యుత్ విజిలెన్స్ సిబ్బంది మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానిక విద్యుత్ సబ్స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో విజిలెన్స్ డీఈ ఎం.భాస్కర్ వివరాలు వెల్లడించారు. విద్యుత్ సిబ్బంది 36 బృందాలుగా ఏర్పడి వేటపాలెం టౌన్ ప్రాంతంలో 3232 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేశారు. తనిఖీల్లో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువగా వాడుతున్న 66 మందికి రూ.2.35 లక్షలు అపరాధ రుసుం విధించారు. అనుమతించిన కేటగిరీలో కాకుండా మరొక కేటగిరీలో వాడుతున్న 12 మంది వద్ద రూ.10 వేల అపరాధ రుసుం వసూలు చేశారు. దాడుల్లో జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ గువ్వల ఆంజనేయులు, విజిలెన్స్ ఏడీ విజయ శ్రీనివాస్, చీరాల ఆపరేషన్ డివిజన్ డీఈ జాన్ థామస్, వేటపాలెం ఏడీ పెరుగు శ్రీనివాస్రావు, వేదవ్యాస్, చీరాల డివిజన్ ఏడీలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సెలింగ్గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో మంగళవారం ఏఎన్ఎంలకు సాధారణ బదిలీల కౌన్సెలింగ్ జరిగింది. నాలుగు రోజుల కిందట నిర్వహించిన కౌన్సెలింగ్పై పలు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తిరిగి జూమ్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించారు. సుమారు 900 మందికి పైగా వార్డు సచివాలయ ఏఎన్ఎం గ్రేడ్–3 కౌన్సెలింగ్లో పాల్గొన్నారు. ఈ పక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. కనుల పండువగా అమ్మవారికి సారె మహోత్సవం బాపట్లటౌన్: పట్టణంలోని శృంగారపురంలో వేంచేసియున్న వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలోని గోవిందమ్మ అమ్మవారికి మంగళవారం పట్టణంలోని మహిళల ఆధ్వర్యంలో ఆషాఢ సారె సమర్పించారు. తొలుత పట్టణంలోని మహిళలు పుసుపు, కుంకుమ, పండ్లు, పూలు, చీరలు, గాజులు, సలిమిడి, వడపప్పుతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువులను పూజించాలి అమరావతి: ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువు లను పూజించాలని భవఘ్నిగురూజీ అన్నారు. మండలంలోని వైకుంఠపురం భవఘ్ని ఆరామంలో గురిపూర్ణిమ మహోత్సవాల తొలిరోజు మంగళవారం కార్యక్రమాలను భక్తిప్రపత్తుల తో నిర్వహించారు. భవఘ్ని గురూజీ మాట్లా డుతూ ఆధ్యాత్మిక జ్ఞాన సంపద భారతదేశం సొంతమన్నారు. ఋషులు, మునులు, గురువులు మన కు అందించిన మహోన్నతమైన జ్ఞాన సంపదను సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో బోధించే గురువులను స్మరించుకోవటం అదృష్టంగా భావించాలన్నారు. తొ లుత మంగళవా రం ఉదయాన్నే వ్యాసభగవానులకు సుప్రభాతసేవ, వ్యాసభగవానుడి ఉ త్సవమూర్తికి రథోత్సవం, ఆదిగురువు వ్యా స భగవానుడికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. -
వాడవాడలా దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ జయంతిని పురష్కరించుకొని వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొన్నిచోట్ల క్షీరాభిషేకాలు చేశారు. కేక్లు కట్చేసి స్వీట్లు పంచి పెట్టారు. రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనాథలకు దుప్పట్లు, దుస్తులు పంపిణీ చేయడంతోపాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆస్పత్రులలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి జనరంజక పాలనను జనం గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయనను దేవుడిలా కొలిచిన పేద, మధ్యతరగతి ప్రజలు మరోమారు స్మరించుకున్నారు. ● వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం అద్దేపల్లిలో సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ఆధ్వర్యంలో దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. సమన్వయకర్త వరికూటి అశోక్బాబు ర్తకదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరమణ, పార్టీ మండల అధ్యక్షుడు పడమటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేమూరు, కొల్లూరు, చుండూరు, అమర్తలూరు మండలాలలో వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ● రేపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఈవూరు గణేష్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత రేపల్లె పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. బస్టాండ్ సెంటర్ వరకూ ర్యాలీ నిర్వహించి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తరువాత గుళ్లపల్లి వరకూ ర్యాలీ నిర్వహించి అనంతరం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవూరు గణేష్తోపాటు పార్టీ నేతలు చిత్రాల ఒబెదు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నగరం, నిజాంపట్నం మండలాల్లో కూడా వైఎస్సార్ జయంతి వేడుకలు నిర్వహించారు. ● అద్దంకిలో సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో కేక్కట్ చేశారు. తరువాత ఎన్టీఆర్ నగర్లోని వైఎస్సార్ విగ్రమానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, జ్యోతి హనుమంతరావు, రాధాకృష్ణమూర్తి పాల్గొన్నారు. ● పర్చూరులో నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఇంకొల్లు స్థూపం సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఆ తర్వాత చినగంజాంలో వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అనంతరం కారంచేడులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. కేట్కట్ చేశారు. తరువాత పర్చూరు, యద్దనపూడి, మార్టూరు మండలాలలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ● చీరాలలో సమన్వయకర్త కరణం వెంకటేశ్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత గడియారస్తంభం సెంటర్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేకంగా మహిళలతో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆస్పతిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో పార్టీ నేతలు మేరీబాబు, అంకాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహాలకు క్షీరాభిషేకాలు పలుచోట్ల అన్నదానం, రక్తదాన శిబిరాలు రోగులకు పండ్లు పంపిణీ, అనాథలకు దుప్పట్ల పంపిణీ ఆయా నియోజకవర్గాలలో పాల్గొన్న సమన్వయకర్తలు -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
బాపట్ల : అర్జీలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పోలీస్ అధికారులను ఆదేశించారు. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 55 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, ఆస్తి తగాదాలు, స్థల వివాదాలు ఇతర పలు సమస్యలపై వచ్చిన ప్రజల అభ్యర్థనలను ఎస్పీ కూలంకషంగా విని, అర్జీలను పరిశీలించాలని సూచించారు. సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలను త్వరితగతిన చట్టపరిధిలో పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో మాట్లాడుతూ బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవవహరిస్తూ, వారి సమస్యలను నిర్దేశిత గడువులోనే సంతృప్తికర రీతిలో పరిష్కరించాలన్నారు. పునరావృత అర్జీలు రాకుండా శాశ్వత పరిష్కారాలు చూపాలని స్పష్టం చేశారు. అర్జీలను పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, చీరాల డీఎస్పీ మొయిన్, పీజీఆర్ఎస్ సెల్ ఇనన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ -
మీటర్ల ఏర్పాటుపై కూటమి నాయకులను నిలదీయండి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని నిలిపివేయాలని, ఈ విషయంపై ప్రజలంతా ప్రజాప్రతినిధులను నిలదీయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని నిరసన తెలిపారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారానికి రాకముందు గత ప్రభుత్వం అదాని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర ప్రజలకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండని పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే అదానితో అనేక ఒప్పందాలు కుదుర్చుకొని ప్రజల నెత్తిన విద్యుత్ స్మార్ట్ మీటర్ల భారాన్ని మోపుతూ బలవంతంగా ప్రజలకు అంటగడుతున్నారని, దీనివలన ఇప్పటికే ప్రజలకు అర్థం కాకుండా విద్యుత్ చార్జీలు పెంచి నడ్డి విరిచారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్మీటర్లు బిగింపు వలన ప్రజలంతా మరింతగా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. ఈ మేరకు పోస్టర్లు ప్రదర్శించారు. పీడీఎం రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, బీసీ సంఘం నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిలుపు ఇచ్చిన ప్రజాసంఘాల నాయకులు మీటర్ల ఏర్పాటుపై ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసన -
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఫీజు రీయింబర్స్తో పేద, మధ్యతరగతి ప్రజల బిడ్డలను ఉన్నత చదువులు చదివించారు. ఆరోగ్యశ్రీతో పేదలకు ఉచిత వైద్యం అధించాడు. లక్షల్లో ఖర్చయ్యే గుండె ఆపరేషన్లను సైతం రూపాయి ఖర్చులేకుండా చేశారు. జలయజ్ఞంతో సాగునీటి పథకాలు తెచ్చారు. ఉచిత విద్యుత్ అందించి అన్నదాతలకు వ్యవసాయాన్ని మరింత చేరువచేశారు. ఒకటా రెండా వందలాది సంక్షేమ, అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు ఉరికించారు. జనం గుండెల్లో దేవుడిలా గుడికట్టుకున్నారు. ప్రత్యర్థులు సైతం శభాష్ అనిపించేలా పాలన సాగించారు. ఆయనే దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి. ఆయన పాలనలో బాపట్ల ప్రాంత అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు. జయంతి నేపథ్యంలో జిల్లా వాసులు దివంగత నేత పాలనను మరోమారు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. రైతులకు ‘ఉచిత’ విద్యుత్ బాపట్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.15 కోట్లతో బాపట్ల సమ్మర్ స్టోరేజి ట్యాంకు పరిధిలో ఫిల్టర్ బెడ్లు, పైపులైన్లు నిర్మించారు. బాపట్లతోపాటు తీరప్రాంతంలోని రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో రైతులు ఇసుక నేలల్లో మూడు పంటలు పండించుకుంటున్నారు. హైలెవల్లో చీరాల పరుగులు చీరాల నియోజకవర్గంలో రూ.120 కోట్లతో చీరాల అభివృద్ధి, రూ.6 కోట్లతో హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించారు. చేనేతల రుణాలు మాఫీచేసి అభయహస్తం అందించారు. వీటితోపాటు చీరాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలలో సంక్షేమ, అభివృద్ధి పనులుచేపట్టారు.న్యూస్రీల్నేడు జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు పేద జనం గుండెల్లో గూడుకట్టుకున్న దేవుడు దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను మంగళవారం జిల్లాలో పెద్దఎత్తున నిర్వహించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అన్ని నియోజకవర్గాలలో దివంగత నేత విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అన్నదానాలు, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. దివంగత వైఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి ఆరోగ్యశ్రీతో పేదలకు వైద్యం ఫీజు రీయింబర్స్తో పేద, మధ్యతరగతి వారికి ఉన్నత చదువులు తీరప్రాంత రైతులకు ఉచిత విద్యుత్ కో ఆపరేటివ్లోకి జంపని షుగర్ ఫ్యాక్టరీ నిజాంపట్నంలో సునామీ బాధితులకు పక్కా గృహాలు విజయవాడ నుంచి రేపల్లె వరకు కృష్ణా కరకట్ట నిర్మాణం అద్దంకిలో జలయజ్ఞం కింద మూడు సాగునీటి పథకాలు రూ.1100 కోట్లతో మేదరమెట్ల– నార్కెట్పల్లి రహదారి దివంగత నేతను కొనియాడుతున్న జిల్లా వాసులు ఆయన దారిలోనే కుమారుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలన నేడు జిల్లాలో ఘనంగా దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు -
నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో!
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): ధూళిపాళ్ల నరేంద్ర.. నోరు అదుపులో పెట్టుకో.. మన్నవ గ్రామంలో బొనిగల నాగమల్లేశ్వరరావుపై దారుణంగా దాడి చేసి.. గూండాలు, రౌడీషీటర్లని వ్యాఖ్యానించటం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు హెచ్చరించారు. 60 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఒక దళిత కుటుంబంపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గుంటూరు నగరం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం తాను, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కలిసి ఆస్పత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావును చూసి రావటం జరిగిందన్నారు. దళిత కుటుంబానికి చెందిన నాగమల్లేశ్వరరావుపై టీ స్టాల్ వద్ద టీడీపీ నేతలు దాడి చేయడం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ఆ కుటుంబానికి చెందిన అమరేంద్రపై కూడా దాడి చేశారని, ఆ కుటుంబాన్ని మట్టుబట్టేందుకు ధూళిపాళ్ల, ఇతర టీడీపీ నేతలు సిద్ధమయ్యారన్నారు. గీత దాటిస్తే భూస్థాపితం చేయండని చెప్పటం.. చంపండి అని చెప్పడం ఒకటేనని దుయ్యబట్టారు. కచ్చితంగా ధూళిపాళ్ల శిక్షార్హులని, ఆయనపై 307 ఐపీసీ కేసు నమోదు చేయాలని, ఏ1గా పెట్టాలని డిమాండ్ చేశారు. ధూళిపాళ్ల ఆదేశాలతోనే దాడి – అంబటి మురళీ కృష్ణ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆదేశాలతోనే నాగేమల్లేశ్వరరావుపై దాడికి తెగబడ్డారని అంబటి మురళీకృష్ణ నిప్పులు చెరిగారు. ఆసుపత్రిలో ఉన్న నాగమల్లేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందన్నారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్యంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి వాకబు చేశారని తెలిపారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పొంతన లేని మాటాలు మాట్లాడుతున్నారన్నారు. నాగమల్లేశ్వరరావు సోదరుడిపై కూడా దాడి చేసినప్పుడు ఆయన ఫిర్యాదు చేస్తే.. తిరిగి అతనిపైనే కేసు నమోదు చేశారన్నారు. కూటమి నేతలకు పోలీసులు, దాసోహమై వ్యవహరిస్తున్నారన్నారు. పొన్నూరు రూరల్ ఎస్ఐ కిరణ్ ఏకపక్షంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని.. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. చేబ్రోలు ఎస్ఐ వెంకటకృష్ణచౌదరి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లను స్టేషన్కు పిలిపించి, గోడ కుర్చీలు వేయించి, ఒక మేడమ్కు వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు నాగమల్లేశ్వరరావు సోదరుడు, ప్రస్తుత ఎంపీటీసీ బొనిగల అమరేంద్రప్రసాద్, పార్టీ నేతలు చింతలపూడి మురళీకృష్ణ, షేక్ నాజర్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి -
దళితులపై పెరిగిన దాడులు
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారపు శివనాగేశ్వరరావు సత్తెనపల్లి: రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, పేదల పైన దాడులు పెరిగాయని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ న్యాయవాది రాజారపు శివనాగేశ్వరరావు అన్నారు. సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీ గూండాలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేయడం దారుణం, అమానుషమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి ఈ సంఘటనే నిదర్శనమన్నారు. టీడీపీ మూకలు నాగమల్లేశ్వరరావును కొట్టి తీవ్రంగా గాయపరిచారని, టీడీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత దళితులపైనా, పేద వర్గాలపైనా దాడులు అధికమయ్యాయన్నారు. మొన్న తెనాలిలో దళిత యువకులపై పోలీసులు నడిబజారులో కొట్టిన సంఘటన మరొక ఉదాహరణ అని, రాష్ట్రంలో దళితులంటే తెలుగుదేశం పార్టీకి చిన్న చూపు అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని, ఇకనైనా దళితులు, పేదల పై దాడులను మానుకోవాలని లేకుంటే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ‘నూటా’ ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల అధికారికి లేఖ ఏఎన్యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధ్యాపక సంఘం(నూటా) ఎన్నికల్లో పారదర్శకత లోపించడం వలన ఈ నెల 9న జరిగే నూటా ఎన్నికలను బహిష్కరిస్తూ ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్కు సోమవారం లేఖ అందజేసినట్లు ఆచార్య కె.సుమంత్ కుమార్(అధ్యక్ష పదవికి పోటీ అభ్యర్థి), ఆచార్య ఎం.జగదీష్ నాయక్(ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు పోటీ అభ్యర్థి) తెలిపారు. తమకు పోటీగా నిలబడిన అభ్యర్థులు విశ్వవిద్యాలయం పరిపాలన పరమైన పదవుల్లో కొనసాగటం వలన ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపిస్తుందని, కనుక ఎన్నికల నిర్వహణ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ 15 రోజులు పాటు ఎన్నికలను వాయిదా వేయాలని ఈనెల 4, 5 తేదీల్లో ఎన్నికల అధికారి ఆచార్య మురళీమోహన్కు వినతి పత్రాలు అందించినా నేటికీ తగిన చర్యలు తీసుకోకపోవడంతో పాటు తమ లేఖలకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్నారు. -
పిచ్చి కుక్క స్వైరవిహారం
ఏడుగురికి తీవ్రగాయలు మార్టూరు: ఈ మధ్య పిచ్చికుక్కలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మండలంలోని కోలలపూడి గ్రామంలో ఓ పిచ్చికుక్క సోమవారం ఉదయం స్వైర విహారం చేసింది. స్థానిక ఎస్సీ కాలనీలో కనిపించిన వారందరినీ కరుస్తూ మొత్తం ఏడుగురు వ్యక్తులను గాయపరిచింది. గాలి ఏసుకు తల, మొహంపై తీవ్ర గాయాలు కాగా గద్దల సత్యం, దాసరి సుబ్బులు, మురికిపూడి మహేష్, మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. బాధితులను మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వ్యాక్సిన్ వేసి చికిత్స అందించారు. తాతా వెంకటరత్నం అనే మహిళ తన ఇంటి ముందు మంచం పై పడుకొని ఉండగా పిచ్చికుక్క ఆమె చెంపలపై నుదుటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమెను పరిశీలించిన వైద్యులు ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం అవుతుందని తెలిపినట్లు బంధువులు తెలిపారు. రెడ్బుక్ను కూటమి నేతలు తగులబెట్టాలి నరసరావుపేట: రాష్ట్రంలో 13 నెలలుగా కొనసాగుతున్న రెడ్బుక్ రాజ్యాంగపు రౌడీయిజానికి 1161 మంది గురై వారి భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిన నేపథ్యంలో, ఎట్టకేలకు హైకోర్టు స్పందించి రిమాండ్ విధించే ముందు మేజిస్ట్రేట్లు నిబంధనలను గట్టిగా పాటించాలని ఆదేశించడం హర్షణీయమని సోషల్ యాక్టివిస్టు ఈదరగోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అరాచక పాలన చేసిన కూటమి నేతలు, పోలీసులకు ఈ ఆదేశాలు చెంపపెట్టు లాంటివని అన్నారు. ఈ ముఖ్యమైన అంశంపై సోషల్ మీడియా యాక్టివిస్ట్ హరీశ్వరరెడ్డి చొరవ తీసుకుని హైకోర్టులో పిటిషన్ వేయడం అభినందనీయమని అన్నారు. ఇంతటితో ఆగకుండా ఇప్పటికే పెట్టిన 1161 కేసులను సమీక్షించి నిర్దోషులను కేసుల నుంచి తప్పించేందుకు పోలీసు వేధింపులు, హింసకు గురైన వారికి ఊరట కల్పించి, నష్టపరిహారం ఇప్పించేందుకు, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సిట్టింగ్ జడ్జితో ఒక ప్రత్యేక విచారణ కమిటీని హైకోర్టు నియమించేలా పోరాటం కొనసాగించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ఇకనైనా బుద్ధి తెచ్చు కుని, పశ్చాత్తాపం చెంది రెడ్బుక్ని నడిరోడ్డులో తగల పెట్టాలని డిమాండ్ చేశారు. మంచి యూనిట్లు ఎంపిక చేసుకొనిఆదాయం పెంచుకోండి నరసరావుపేట: ప్రతిఒక్కరూ మంచి యూనిట్లను ఎంపిక చేసుకొని వాటి ద్వారా కుటుంబానికి ఆదాయం పెంచుకునేలా కృషిచేయాలని అధికారులు సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పీఎంఇజీపి, పీఎంఎఫ్ఎంఎఫ్ రుణాలపై బ్యాంకర్లచే లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని డీఆర్డీఎం పీడీ ఝాన్సీరాణి మాట్లాడారు. లబ్ధిదారులకు కావలసిన శిక్షణ, ఉపాధి అవకాశాలు ఉన్నాయని, మార్కెటింగ్ చేసేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లైన అమెజాన్, ప్లిఫ్కార్ట్ వంటి వాటి ద్వారా వీలు కల్పించడం జరుగుతుందని అన్నారు. హార్టీకల్చర్ జిల్లా అధికారి ఐ.వెంకటరావు మాట్లాడుతూ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) తయారు చేసుకొని తర్వాత కొటేషన్, ఆధార్, పాన్కార్డు సిద్ధం చేసి సంబంధిత అధికారికి అందజేసిన తర్వాత లాగిన్లో అప్డేట్చేసి వాటిని అప్రూవల్ ఇవ్వటం జరుగుతుందని అన్నారు. జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం రాయితీతో కూడిన యూనిట్లను ఎంచుకొని వాటిపై లబ్ధిదారులు లబ్ధిపొందేలా చేయడమే కలెక్టర్ అరుణ్బాబు ఆలోచన అన్నారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాంప్రసాద్, డీపీఎం డేవిడ్, శ్రీనివాస్, యూనియన్ బ్యాంకు, సీజీజీబి అధికారులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ తిరగబడి వ్యక్తి మృతి
సంతమాగులూరు(అద్దంకి): ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడిన ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈఘటన సంతమాగులూరు మండలం వెల్లలచెరువు గ్రామ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. జే పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన నల్లపాటి మల్లికార్జునరావు(41) తన ట్రాక్టరును నడుపుకుంటూ సంతమాగులూరు నుంచి వినుకొండ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెల్లలచెరువు గ్రామ సమీపంలోని పెట్రోలు బంకు సమీపంలోకి రాగానే గోతుల రోడ్డు కావడంతో బ్రేక్ వేయగా అదుపు తప్పి తిరగబడింది. ఈ ఘటనలో మల్లికార్జునరావు పైనుంచి కిందపడగానే ట్రాక్టరు టైరు తలపైకి ఎక్కింది. రక్తగాయం ఆవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. భర్త మృతితో భార్య, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మృతుడి మామ తేలప్రోలు ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పట్టాభిరామయ్య తెలిపారు. -
ఆర్మీ జవాన్ మృతి
నగరం: ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి నగరం మండలం చిరకాలవారిపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ఉప్పాల రవికుమార్ (24) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. చిరకాలవారిపాలెం గ్రామానికి చెందిన ఉప్పాల ఇమ్మానుయేలు, లక్ష్మి దంపతుల ద్వితీయ కుమారుడు రవికుమార్ నాలుగేళ్ల కిందట ఆర్మీలో జవాన్గా చేరాడు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న రవికుమార్ ఇటీవల వివాహం నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల కుమార్తెతో నిశ్చితార్ధం చేసుకుని వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో ఆపరేషన్ సిందూర్ విధుల్లోకి హాజరుకావాలని ఆర్మీ నుంచి ఆదేశాలు రావటంతో విధుల్లోకి వెళ్లాడు. త్వరలోనే వివాహ ముహుర్తాన్ని ఖరారు చేసుకుని స్వగ్రామానికి వచ్చి వివాహం చేసుకోవాల్సిన కుమారుడు రవికుమార్ గత శనివారం జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో విధులు నిర్వర్తిస్తుండగా ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి అక్కడిక్కడే మృతి చెందాడు. రవికుమార్ భౌతికకాయం మంగళవారం స్వగ్రామమైన చిరకాలవారిపాలెం గ్రామానికి రానుంది. రవికుమార్ అకాల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. -
నిబంధనల మేరకే పొగాకు కొనుగోలు
జే.పంగులూరు: నిబంధనల మేరకే నల్లబర్లీ పొగాకు కొనుగోలు చేస్తామని.. ఇప్పటికి రైతులు వద్ద నుంచి 1000 చెక్కుల వరకు కొనుగోలు చేశామని, గ్రేడుల ప్రకారమే ధర నిర్ణయిస్తున్నట్లు మార్క్ఫెడ్ డీఎం కే కరుణశ్రీ, ప్రాజెక్ట్ డైరెక్టర్ పీ రమేష్ అన్నారు. మండల పరిధిలోని పంగులూరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ జిల్లా అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రైతులకు మేలు చేసేందుకే పంగులూరులో నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరి వద్ద పొగాకు కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు సహకరించి గ్రేడ్ చేసి పొగాకు చెక్కులు తీసుకొస్తే మంచి ధర పలుకుతుందని తెలిపారు. రైతులు వద్ద నల్లబర్లీ పొగాకు కొనాలంటే తప్పనిసరిగా బేళ్ల వద్ద ఫొటో దిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. అలా చేస్తేనే పొగాకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో షెడ్యూలు అయిన రైతులు వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. పచ్చాకు, బొగులు, నలుపు, డ్యామేజ్ ఉంటే పొగాకు కొనుగోలు చేయమని తెలిపారు. కారణం లేకుండా సీఆర్ చేయడం కుదరదని తెలిపారు. రాబోయే 2, 3 రోజుల్లో తమ్మవరం, మార్టూరు, చినగంజాం గ్రామాల్లో పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆందోళన.. అధికారులు రైతుల వద్ద నుంచి వారి ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే చేలో పండించిన పంట, శుభ్రంగా గ్రేడ్ చేసుకొని, చెక్కులు తొక్కుకొని వస్తే వాటిలో కొన్నింటిని మాత్రమే కొని, మిగతా వాటిని తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేడ్ చేసుకొని వచ్చిన మంచి రకం పొగాకును కూడా కొనుగోలు చేయడం లేదని రైతులు తెలిపారు. స్పందించిన అధికారులు మాట్లాడుతూ రైతులు తెచ్చిన నల్లబర్లీ చెక్కులు మంచివిగా ఉండి కొనుగోలు చేయకపోతే మా దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు బయ్యర్లను అడగ్గా బాగోలేని చెక్కులు మాత్రమే వెన్కు పంపుతున్నట్లు సమాధానం ఇచ్చారు. మాకు కాదు మీరు చెప్పాల్సిందంటూ రైతులకు అని బయ్యర్లపై మండిపడ్డారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మార్క్ఫెడ్ మేనేజర్ పి సుబ్రమణ్యం, ఏఓ సుబ్బారెడ్డి, బయ్యర్ శ్రీధర్, ఏఎంసీ సెక్రటరీ కె సుర్యప్రకాష్రెడ్డి, అసిస్టెంట్ మార్కెటింగ్ కె రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. ఇష్టానుసారంగా కొనుగోలు చేస్తున్నారని రైతుల ఆందోళన సమాధానం చెప్పలేక తడబడిన మార్క్ఫెడ్ అధికారులు -
ఉత్తమ ప్రదర్శనగా ‘ఐ యేట్ ఇండియా’
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో మూడురోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. న్యూస్టార్ మోడ్రన్ థియేటర్స్, విజయవాడ వారు ప్రదర్శించిన ‘ఐ యేట్ ఇండియా’ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. మరో నాలుగు బహుమతులను అందుకుంది. ఇదే నాటికకు ఉత్తమ దర్శకత్వం (డాక్టర్ ఎం.ఎస్.చౌదరి), ఉత్తమ ఆహార్యం (దినేష్), ఉత్తమ రంగాలంకరణ (దివాకర ఫణీంద్ర), జ్యూరీ బహుమతి (లోహిత్) సహా మొత్తం ఐదు బహుమతులు లభించాయి. ● ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా చైతన్య కళాభారతి, విశాఖపట్నం వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటిక ఎంపికై ంది. ఇదే నాటిక ఉత్తమ నటి (శోభారాణి), ఉత్తమ క్యారెక్టర్ నటి (నాగరాణి), బహుమతులను అందుకుంది. తృతీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని తెలుగు కళాసమితి, విశాఖపట్నం వారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’ నాటిక దక్కించుకుంది. ఇదే నాటికకు ఉత్తమ రచన (పీటీ మాధవ్), ఈ నాటికలో నటించిన పి.వరప్రసాద్ ఉత్తమ నటుడు బహుమతిని, డి.హేమ ఉత్తమ ప్రతినాయకురాలు బహమతులను గెలుచుకున్నారు. ● ఇతర ప్రదర్శనల్లో ‘అ సత్యం’ నాటికకు ఉత్తమ సంగీతం (పి.లీలామోహన్), ఆ నాటికలో నటించిన పి.రామారావుకు ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతి లభించాయి. ‘వీడేం మగాడండీ బాబూ’ నాటికలో నటించిన జీఎస్ చలపతికి ఉత్తమ హాస్యనటుడు బహుమతి లభించాయి. ‘అనుకున్నదొకటి అయినదొకటి’నాటికలో పిల్ల బిచ్చగాడు పాత్రధారి రుత్విక్కు జ్యూరీ బహుమతి వచ్చింది. న్యాయనిర్ణేతలుగా చెరుకుమల్లి సింగారావు, వి.హైమావతి, గోపరాజు విజయ్ వ్యవహరించారు. పోటీల అనంతరం ఈదర వెంకట పూర్ణచంద్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ విజేతలకు బహుమతులను అందజేశారు. సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, డీఎల్ కాంతారావు పాల్గొన్నారు. తొలుత పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలతో చివరిరోజు కార్యక్రమాలను ఆరంభించారు. తెలుగు కళాసమితి, విశాఖపట్నంవారి ‘నిశ్శబ్దమా నీ ఖరీదు ఎంత?’ నాటికను ప్రదర్శించారు. పీటీ మాధవ్ రచనకు చలసాని కృష్ణప్రసాద్ అధ్యక్షత వహించారు. చివరగా చైతన్య కళాభారతి, కరీంనగర్వారి ‘ఖరీదైన జైళ్లు’ నాటికను ప్రదర్శించారు. పి.వెంకటేశ్వరరావు మూలకథకు పరమాత్ముని శివరాం నాటకీకరించగా, మంచాల రమేష్ దర్శకత్వం వహించారు. నిర్వాహక సంస్థల బాధ్యులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకట నారాయణ, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు ఇదే నాటికకు మరో నాలుగు బహుమతులు -
మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0ను పండుగ వాతావరణంలో నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశం పండుగ వాతావరణంలో వేడుకగా జరపాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహణపై సోమవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ 2.0 సమావేశాన్ని జయప్రదంగా నిర్వహించడానికి ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులకు ముందుగా సమాచారం పంపాలన్నారు. విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు గౌరవప్రదంగా వారిని ఆహ్వానించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,818 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయన్నారు. అందులో ఒకటి నుంచి 10వ తరగతి వరకు 1,59,108 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. విద్యార్థి మిత్ర బహుమానాలను అందుకున్న విద్యార్థులంతా నూతన దుస్తులు ధరించి పాఠశాలకు హాజరు కావాలన్నారు. జూనియర్ కళాశాలలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉంచామని, మంగళవారం నాటికి నర్సరీల నుండి ఆయా మండలాలకు చేరుతాయన్నారు. మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో విద్యార్థుల ప్రగతి నివేదిక, హెల్త్ కార్డుల పంపిణీ చేపట్టాలన్నారు. షైనింగ్ స్టార్ అవార్డులు పొందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులను పిలిపించి వేదికపై మాట్లాడించాలన్నారు. ముందస్తుగా విద్యార్థుల తల్లిదండ్రులకు క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఈఓ పురుషోత్తం, ఏపీసీ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీపీఓ ప్రభాకరరావు, అటవీశాఖ అధికారి వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇన్కం టాక్స్ అధికారి మృతి
జే.పంగులూరు: డివైడర్ను ఢీకొని రోడ్డు ప్రమాదంలో ఇన్కం టాక్స్ అధికారి మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని జాగర్లమూడివారిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. హైవే పోలీసుల వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన దాసరి కృష్ణచైతన్య (46) గుంటూరులోని ఇన్కం టాక్స్ ఆఫీసులో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. సోమవారం ఒంగోలులోని తన మామయ్య ఇంటి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఒంగోలు నుంచి గుంటూరుకు తన స్కూటీపై వెళ్తున్నారు. జాతీయ రహదారిపై జాగర్లమూడివారిపాలెం వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కృష్ణచైతన్య తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. -
మేరు నగధీరుడు వైఎస్సార్
ఒంగోలు సిటీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలు జీవితకాలం గుర్తుంచుకోదగ్గ మేరు నగధీరుడు అని ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. నేడు వైఎస్సార్ 76వ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సోమవారం ఆయన పిలుపునిచ్చారు. బత్తుల మాట్లాడుతూ సుదీర్ఘ పాదయాత్రలో పేదవాడి గుండెచప్పుడు పసిగట్టిన దార్శనికుడు వైఎస్సార్ అని అన్నారు. వృత్తిపరంగా వైద్యుడైనా ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యాలను గుర్తించి ఆరోగ్యశ్రీ పేరుతో కార్పొరేట్ వైద్యం పేదల దరి చేర్చారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో కార్పొరేట్ విద్య, 108 సేవలు ఆయన వల్లే పురుడు పోసుకున్న విషయాన్ని ఆయన రాజకీయ వైరులు సైతం స్వాగతించారన్నారు. నేడు వీధికి ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నారంటే అది నాడు వైఎస్సార్ దార్శనికత వల్లే సాధ్యమైందని చెప్పారు. వ్యవసాయాన్ని సంస్కరణల బాట పట్టించి 82 నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించి అపర భగీరథునిగా వైఎస్సార్ నిలిచారన్నారు. ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అందించి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయాన్ని పండగ చేశారని చెప్పారు. విలువలతో కూడిన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. నేడు మహానేత వైఎస్సార్ జయంతిని జయప్రదం చేద్దాం వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి -
పట్టణంలో వైద్యురాలి ఇంట భారీ చోరీ
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని వైద్యురాలి ఇంటిలో గుర్తు తెలియని దుండగులు భారీ చోరీ చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...స్థానిక పురుషోత్తమపట్నంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్యురాలిగా విధులు నిర్వర్తిస్తున్న ఇమ్మడి రాణి సంయుక్త సుమారు రెండేళ్లుగా శారద హైస్కూల్ రోడ్డులో నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం విధులు ముగించుకుని కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఉంటున్న అన్నయ్య వద్దకు వెళ్లింది. సోమవారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి ప్రధాన ద్వారం తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా, దాని పక్కనే మరోవైపు ఉన్న తలుపు తెరిచి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూసింది. గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు గ్రహించింది. బీరువా తెరిచి ఇంట్లో అంతా చిందర వందరంగా వస్తువులు, దుస్తులు పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలాన్ని సందర్శించి పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాల సేకరించారు. ఇంట్లోని 70 గ్రాముల బంగారం, రూ.2 లక్షల నగదు, కేజీన్నర వెండి వస్తువులు, పట్టు చీరెలు అపహరణకు గురయ్యాయని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ పి రమేష్ తెలిపారు. సుమారు రూ.13 లక్షలు అపహరణ -
భరద్వాజ రచనలు సందేశాత్మకం
చీరాల: సమాజంలోని ఆకలి, ఆవేదన, కష్టాలు, కన్నీళ్లు, దోపిడీ వంటి కథాంశాలను వస్తువులుగా స్వీకరించి సమకాలిన సామాజిక సందేశాలుగా రావూరి భరద్వాజ రచనలు చేశారని రచయిత బీ రం సుందరరావు అన్నారు. ఆదివారం స్థానిక సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో రావూరి భరద్వాజ సాహితి సమితి ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జయంతిని నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు ఎ.నాగవీరభద్రాచారి అధ్యక్షత వహించారు. భరద్వాజ రచనలు జీవితానికి ఎంతో ఉపయోగపడతాయని, వారు సృష్టించిన పాత్రలు సజీవాలని రిటైర్డు ప్రిన్సిపాల్ బత్తుల బ్రహ్మారెడ్డి అన్నారు. అనంతరం బీరం సుందరరావుకు రావూరి భరద్వాజ సాహితీ పురస్కారాన్ని అందించారు. కార్యక్రమంలో కడలి జగదీష్కుమార్, గొర్రెపాటి ప్రభాకర్, కట్టా రాజ్ వినయ్కుమార్, గాదె హరిహరరావు, అత్తులూరి రామారావు, వడలి రాధాకృష్ణ, నాగమాంబ, కోట వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరుగురిపై పిచ్చి కుక్క దాడి
పెదకూరపాడు: పెదకూరపాడులోని ముస్లిం కాలనీలోని పిచ్చి కుక్క ఆరుగురుపై ఆదివారం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్ల పఠాన్ మహ్మద్ అమన్, వృద్ధుడు షేక్ ఖాసిం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న షేక్ హుస్సన్, నిమ్మకాయల వ్యాపారి షేక్ ఖాసింలతో పాటు మరో ఇద్దరిపై దాడిచేసి కరచింది. నాలుగేళ్ల అమన్కు తీవ్ర గాయాలయ్యాయి. జూన్ 18వ తేదిన మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన చిన్నారులు, వృద్ధులు 16 మందిపై పిచ్చి కుక్క దాడి చేసింది. రోడ్డు పక్కనే మాంసం విక్రయాలు జరుపుతుండంతో గుంపులు కుక్కలు అమరావతి, సత్తెనపల్లి కాలచక్ర రోడ్డుపై తిరుగుతూ వాహనదారులను కరుస్తున్నాయి. -
సెల్ఫోన్ లేని బడి నేడు అవసరం
తెనాలి: నేడు పిల్లల విద్యాభివృద్ధికి సెల్ఫోన్ అత్యంత అవాంతరంగా మారిందని, పాఠశాలలో సెల్ఫోన్తో పని లేని విధానం ఉండాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రావు అధ్యక్షతన ఆదివారం తెనాలి ప్రాంతీయ కార్యాలయంలో జరిగింది. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సెల్ఫోన్ ప్రభావంతో పిల్లలు పాడైపోతున్నారని, ఉపాధ్యాయుల భోదనపై కూడా సెల్ ప్రభావం పడుతోందని అన్నారు. రోజువారీ రకరకాల సమాచారం అప్లోడ్, డౌన్లోడ్తో, ఆన్లైన్ శిక్షణలతో బోధన సమయం హరించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు కూడా సెల్ ఫోన్ వాడకం నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన సూచించారు. బోధన సమయాన్ని పిల్లలకు మా త్రమే కేటాయించాలని, పాఠశాల రోజువారీ పనిని మెరుగుపరచాల్సిన అవసరం ఉపాధ్యాయులపై, అధికారులపై ఉందన్నారు. అవసరమైతే అదనంగా ఒక గంట పాఠశాలలో సమయాన్ని గడిపి విద్యార్థులకు మార్గదర్శనం చేయాలన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ హనుమంతరావు మాట్లాడుతూ పీటీఎంలో విట్నెస్ అధికారిని నియమించాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కన్వీనర్ టీఎస్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను తక్షణం నియమించాలని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. యూటీఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్, ఎం.కళాధర్లు మాట్లాడుతూ బదిలీలు, ప్రమోషన్లు తర్వాత ఉపాధ్యాయులకు డీడీఓ కోడ్స్, పొజిషన్ ఐడీలో తక్షణం కేటాయించి జీతాలు ఈ నెలలోనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా సహాధ్యక్షులు ఎ.వెంకటేశ్వర్లు, కోశాధికారి దౌలా, జిల్లా కార్యదర్శులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
పంచాయతీ కార్యదర్శులపై పనిభారం
బాపట్ల టౌన్: పంచాయతీ కార్యదర్శులపై రోజురోజుకు పెరుగుతున్న పనిభారాన్ని తగ్గించాలని సీనియర్ పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు అన్నారు. పట్టణంలోని ఎన్జీవో హోంలో ఆదివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. పల్నాటి శ్రీరాములు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా సరిపడా నిధులు లేకపోవడం వల్ల పారిశుద్ధ్య పనుల్లో కీలక పాత్ర పోషించే క్లాప్ మిత్రాలకు ఇచ్చే నెల జీతం రూ.6000 చాలక పోవడంతో పని చేసేందుకు ఎక్కువ మంది ముందుకు రావడంలేదన్నారు. ప్రభుత్వమే నెలకు పదివేల రూపాయలు చొప్పున నేరుగా చెల్లించాలన్నారు. ప్రస్తుతం పాత రిక్షాల స్థానంలో ఆటోలు, ట్రాక్టర్లు మంజూరు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శిని గ్రామ పంచాయతీ విధులకు మాత్రమే పరిమితం చేసి సచివాలయ డీడీవో బాధ్యతలు నుంచి తొలగించాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సర్వేలను చేయించే బాధ్యత ఒక పంచాయతీ కార్యదర్శికి మాత్రమే అప్పగించడం వలన పని ఒత్తిడికి గురవుతున్నామన్నారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పనితీరు అంచనా వేయడం సమంజసం కాదన్నారు. పారిశుద్ధ్యం లోపించిందనే పేరుతో ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ లాంటి చర్యలు తీసుకోవడం దుర్మార్గం అన్నారు. ఇటీవల వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశారని, ఆ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ పంచాయతీ కార్యదర్శులు డి.మురళి బాపూజీ, డి.సుజాత, ఎం.శ్రీనివాసరావు, షేక్ జిలాని పాల్గొన్నారు. సీనియర్ పంచాయతీ కార్యదర్శి పల్నాటి శ్రీరాములు -
కౌలుకోలేని దెబ్బ
గిట్టుబాటు ధర లేక కౌలు రైతులు నష్టపోతున్నారురాష్ట్ర ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప వ్యవసాయ రంగంలో వృద్ధి లేనేలేదు. ఉత్పత్తి వ్యయం కన్నా మద్దతు ధరలు 20 శాతం తక్కువ ఉన్నాయి. దీంతో పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు రానందున రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కౌలుదారులకు సకాలంలో రుణ అర్హత పత్రాలు ఇచ్చి బ్యాంకర్ల ద్వారా వాస్తవ సాగుదారులకు రుణాలు మంజూరు చేయాలి.– బత్తుల హనుమంతురావు, రైతు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడుసరైన గిట్టుబాటు ధరలు లేవునాకు 4 ఎకరాల సొంత భూమి ఉంది. దీనికి తోడు మరో 24 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని మిరప, పొగాకు, శనగ వంటి పంటలు సాగు చేశా. పండించిన పంటకు గిట్టుబాటు ధర అటుంచి కొనే నాథుడే కరువయ్యాడు. గత సంవత్సరం ఒక ఎకరం పొలం 28 నుంచి 32 వేల వరకు కౌలు చెల్లించా. ఈఏడాది అంత కౌలు చెల్లించి సాగుచేసే పరిస్థితి లేదు.– గనిపిశెట్టి రమేష్, చిమటవారిపాలెంయద్దనపూడి: వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడింది. పది మందికి పట్టెడన్నం పెట్టే అన్నదాత అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రకృతి వైపరీత్యాలకు ఎదురొడ్డి ఆరుగాలం కష్టపడినా గిట్టుబాటు ధర లేకపోవటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. గత ప్రభుత్వంలో రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకోగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం సీజన్ ప్రారంభమవుతున్నా కూడా అన్నదాత సుఖీభవ ఇస్తామంటూ ఒక్కరూపాయి కూడా ఇవ్వని దుస్థితి నెలకొంది. ముఖ్యంగా సొసైటీలు, బ్యాంకుల్లో అప్పు చెల్లించలేదంటూ బంగారం వేలం వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్రాప్ హాలిడే ప్రకటించేందుకు కౌలు రైతులు సమాయత్తమవుతున్నారు.కౌలు రైతులే అధికంజిల్లాలో 3.87 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 1.87 లక్షల మంది రైతులున్నారు. వీరిలో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉన్నారు. గత ఏడాది ప్రభుత్వం లక్ష మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు మంజూరు చేయగా 22 వేల మందికి మాత్రమే బ్యాంకుల ద్వారా కౌలు రైతులు రుణ సదుపాయం పొందారు. ఈ ఏడాది లక్ష మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 17,867 మందికి మాత్రమే కౌలు కార్డులు మంజూరు చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో గత ఏడాది 9089 మంది సీసీఆర్ కార్డులు మంజూరు చేయగా ఈ ఏడాది 1156 మందికి మాత్రమే కౌలు కార్డులు మంజూరు చేశారు.సాగు సమయం ఆసన్నమవుతున్నా..వాస్తవానికి ప్రతి ఏడాది రోహిణికార్తె నుంచి కౌలు వ్యవహారాలు సాగుతుంటాయి. ఈ ఏడాది జూలై నెల ప్రారంభమైనప్పటికీ కౌలు లావాదేవీలు అరకొరగానే కొనసాగుతున్నాయి. జిల్లాలో సొంత భూమి సాగు చేసే రైతులకంటే 60 శాతానికి పైగా భూమి కౌలు రైతుల చేతుల్లోనే ఉంటుంది. భూ యజమానులు, కౌలుదారుల మధ్య ఓ మాట ప్రకారం ఆ తంతు సాగిపోతోంది. కానీ ఈ ఏడాది వరుస నష్టాలతో కౌలు సాగుకు కర్షకులు అంతగా అసక్తి చూపటం లేదు. కౌలు ధర తరువాత నిర్ణయించుకుందామని తొలుత సాగు చేయమని భూ యజమానులు కోరుతున్నా కౌలుదారుల నుంచి ఆశించిన స్పందన రావటం లేదు. గత ఏడాది పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, మార్టూరు తదితర మండలాల్లో గత ఏడాది ఎకరా రూ.30 వేల నుంచి రూ.38వేల వరకు పొగాకు, మిర్చి పంటలకు కౌలుకు తీసుకోగా, అదే ఎకరా ఈ ఏడాది రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు పడిపోయింది.మద్దతు ధర లేక.. సాగు సాయం రాక తీవ్ర నష్టాలు ఈ ఖరీఫ్ సాగుకు ముందుకు రాని కౌలు రైతులు గతంలో మహర్దశ .. నేడు దుర్దశ జిల్లాలో కౌలు ధరలు ఢమాల్ ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటున్న రైతన్నలు గిట్టుబాటు ధరలు లేకపోవటమే ప్రధాన కారణం రుణాలు ఇచ్చేవారు కరువు చోద్యం చూస్తున్న ప్రభుత్వం -
అడవి తల్లిపై గొడ్డలి వేటు
బాపట్లటౌన్: పర్యావరణ పరిరక్షణకు అడవులు ఎంతగానో దోహదపడతాయని, వాటిని పరిరక్షించాలంటూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చే నాయకులు, అధికారులు పెంచిన తోటలను కాపాడటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. అటవీ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన అటవీ శాఖాధికారులు చుట్టం చూపుగా వచ్చి పోతుండటంతో దొంగల చేతికి తాళం ఇచ్చిన చందంగా మారింది. పగలు.. రాత్రి తేడా లేకుండా దుండగులు యథేచ్ఛగా అడవుల్లోని జామాయిల్, జీడిమామిడి చెట్లను నరికి ఇళ్లకు, మార్కెట్కు తరలిస్తున్నారు. గత కొన్ని నెలలుగా తంతు జరుగుతున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్నారిలా.. మండలంలోని కప్పలవారిపాలెం, ముత్తాయపాలెం, రామానగర్, ఆదర్శనగర్, సూర్యలంక, కర్లపాలెం మండలంలోని పేరలి, తుమ్మలపల్లి, గణపవరం, నర్రావారిపాలెం, మేకలవారిపాలెం తదితర గ్రామాలకు అందుబాటులో ఫారెస్ట్ భూమి ఉంది. అయితే ఆయా గ్రామాల ప్రజలతో వేరే ప్రాంతాల్లో ఉన్న వ్యాపారులు ఒప్పందం కుదుర్చుకొని రాత్రికి రాత్రే అడవికి వెళ్లి తోటలను నరకటం, వాటిని పడవల సాయంతో కాలువలు దాటించడం.. కాలువ దాటిని కలపను ట్రాక్టర్లు, ఆటోలలో వేరే ప్రాంతానికి తరలించడం పరిపాటిగా మారింది. ఇదిలా ఉండగా మరికొందరు ఉదయం సమయంలో తోటకు వెళ్లి వాళ్లకు నచ్చిన చెట్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని రాత్రి సమయంలో నరకడం జరుగుతుంది. నరికిన సరుకును రాత్రికి రాత్రే అవసరమైన వినియోగదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారుల నుంచి తప్పించుకునేందుకు పట్టణంలోని వివిధ అడితీల్లో కలపను ఇక్కడే కొనుగోలు చేసినట్లుగా ఫోర్జరీ బిల్లులు సృష్టించి తనిఖీల కోసం వచ్చిన అధికారులకు చూపించడం ఇక్కడి ప్రజలకు షరా మామూలైంది. పెట్టుబడి ప్రభుత్వానిది.. సొమ్ము స్మగ్లర్లకు.. అటవీ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి జామాయిల్, సరుగుడు, జీడిమామిడి తోటలు వేశారు. అయితే అవి పెరిగిన తర్వాత తోటలకు వేలం నిర్వహించాల్సి ఉంటుంది. లేదంటే కట్చేసి టన్నుల ప్రకారం కలపను విక్రయించాల్సి ఉంటుంది. అయితే తోటలు పెరిగిన తర్వాత కట్ చేయకపోవడం, పలు రకాల తెగుళ్లు సోకి ఎండిపోతున్న చెట్లును అక్కడే వదిలివేయటంతో స్మగర్లు ఎండిన చెట్లను వంట చెరకుగా, పచ్చిచెట్ల బాదులను శ్లాబులకు ఉపయోగించే బాదులుగా, పేపర్ మిల్లులకు విక్రయించుకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో బీట్లో మొక్కలు నాటేముందు కనీసం 10 వేల మొక్కలకు తగ్గకుండా నాటుతున్నారు. అవి పెరిగిన తర్వాత కనీసం రెండు వేల మొక్కలు కూడా ఉండటం లేదు. ఇంతజరుగుతున్నా ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి స్మగ్లర్ల బారినుంచి తోటలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరిస్తున్న అటవీ విస్తీర్ణం రాత్రికి రాత్రే యథేచ్ఛగా తరలిపోతున్న కలప పచ్చని తోటలకు సైతం నిప్పంటిస్తున్న వైనం చోద్యం చూస్తున్న అధికారులు అడవులు నరికినా అడిగేదెవరు? బాపట్ల మండలం ముత్తాయపాలెం, కర్లపాలెం మండలం పేరలి ప్రాంతాల్లో అటవీ భూమి వేల ఎకరాల్లో ఉంది. వీటిల్లో ముత్తాయపాలెం సెక్షన్ పరిధిలో ఏ, బీ బీట్లు, పేరలి సెక్షన్ పరిధిలో ఏ, బీ బీట్లు ఉన్నాయి. వీటిల్లో జామాయిల్, జీడిమామిడి తోటలు సుమారు 25 వేల హెక్టార్ల మేర ఉంటాయి. అయితే తోటలు పెరిగిన తర్వాత వాటిని కొట్టించి వచ్చిన కలపను విక్రయించి ఆ సొమ్ముతో మిగిలిన అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. అయితే అధికారులు స్థానికంగా ఉండకపోవడం, తోటలకు అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చిపోతుండటంతో రాత్రికి రాత్రే సుమారు వందల సంఖ్యలో జామాయిల్ బాదులు మార్కెట్కు తరలివెళ్తున్నాయి. -
చినపులివర్రులో టీడీపీ నాయకుడి ఆగడాలు
కొల్లూరు: అధికార దాహంతో టీడీపీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. చినపులివర్రుకు చెందిన ఓ టీడీపీ నాయకుడు గ్రామం ప్రారంభంలో ఉన్న డ్రెయిన్లో పూడిక తీసి ఆ మట్టిని తన పొలానికి వెళ్లే దారి కోసం కాలువకు అడ్డుగా మెరక పోసుకున్నాడు. టీడీపీ నాయకుని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలంలో పంటలు ముంపునకు గురికాకుండా వర్షపు నీరు పారుదలకు వినియోగపడాల్చిన డ్రెయిన్ను మెరుగు పరచడంలో నిర్లక్ష్యం వహించడంతోపాటు, డ్రెయినేజీ కట్టలను బలపర్చడానికి వినియోగించాల్చిన పూడికతీత మట్టిని సొంత అవసరాలకు పచ్చ నాయకులు తరలించుకోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. మట్టిని తరలించుకుపోవడానికి తోడు భారీ యంత్రాన్ని మట్టి తవ్వకానికి వినియోగించడం కారణంగా ఆర్అండ్బీకి చెందిన బీటీ రోడ్డు ధ్వంసం కావడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిన్లో పూడికతీసిన మట్టి పొలం దారికి తరలింపు రహదారి ధ్వంసం స్థానికుల ఆగ్రహం -
ప్రజలను వంచించిన చంద్రబాబు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి మార్టూరు(చినగంజాం): రాష్ట్ర ప్రజలను చంద్రబాబు తన మోసపూరిత మాటలతో వంచన చేస్తున్నారని.. ప్రజలంతా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్న మైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు ఇన్చార్జ్ గాదె మదుసూదనరెడ్డి పిలుపునిచ్చారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ ( రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో) అనే కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన మార్టూరులోని ఇంటూరి ఫంక్షన్ హాలులో ఆదివారం నాయకులు, కార్యకర్తలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు జంపని వీరయ్య చౌదరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో గాదె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తొలుత బాబు జగ్జీవనన్రాం, మహానేత వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ను ఆయన ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, రాష్ట్ర యూత్ వింగ్ సంయుక్త కార్యదర్శి ఉప్పలపాటి అనిల్, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషావలి, మాజీ డెయిరీ చైర్మన్ ఉప్పలపాటి చెంగలయ్య, తాటి వెంకటరావు, ద్రోణాదుల మాజీ సర్పంచ్ పెంటేల సత్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు అడక గంగయ్య, ఐటీ వింగ్ అధ్యక్షుడు జి. రవిచంద్, ఎస్టీ సెల్ చిన్ననాయక్, మండల వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ బాష, బండి రామయ్య, మైలా నాగేశ్వరరావు, గడ్డం మస్తాన్వలి, బాబు నాయక్, మండల పార్టీ కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అనుబంధ విభాగం అధ్యక్షులు, వివిధ హోదాల్లోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ తదితరులు భారీగా పాల్గొన్నారు. -
కార్మికుల బకాయిలు వెంటనే చెల్లించాలి
బాపట్ల టౌన్ : ఆర్టీసీ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంఎస్ఆర్ కల్యాణ మండపంలో ఆదివారం ఆర్టీసీ ఎంప్లాయీస్ జిల్లా కార్యదర్శి వై. శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీలో రిటైరైన ఉద్యోగులకు, మరణింంచిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, లీవ్ఎన్ క్యాష్మెంట్ సెటిల్మెంట్ చెల్లింపులు సంవత్సరాలు గడుస్తున్నాసరే జరగడం లేదన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వీరికి చెల్లించాల్సిన బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించి ఆ కుటుంబాలను ఆదుకోవాలన్నారు. 11వ పీఆర్సీ చెందిన 24 నెలలు బకాయిలు, డీఏ మంజూరు, డీఏ అరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు. ఉద్యోగులు ఉద్యమాల బాట పట్టకుండా చూడాలన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జి.నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఇవ్వాలనుకున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయకముందే మూడు వేల ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయాలని, తక్షణమే వివిధ కేటగిరుల్లో 10 వేల మంది సిబ్బందిని నియమించుకొనేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య, బాపట్ల జిల్లా ఏపీజెఏసీ అమరావతి చైర్మన్ సురేష్ , ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రకోశాధికారి యం.డీఏ.సిద్ధిక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మందపాటి శంకరరావు, రాష్ట్రకార్యదర్శి యన్.వి.కృష్టారావు, రాష్ట్ర సహాయకార్యదర్శి బి.టి.వలి, నెల్లూరు జోన్ జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు వాకా రమేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు పసుపులేటి చిరంజీవి, గుంటూరు జిల్లా కార్యదర్శి ఇ.విజయ్కుమార్, పల్నాడు జిల్లా అధ్యక్షులు ఖాజా, కార్యదర్శి జి.తిరుపతిరావు పాల్గొన్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఓబేదు నియామకం
రేపల్లె: వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రేపల్లె పట్టణానికి చెందిన చిత్రాల ఓబేదును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ఓబేదు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. జగన్ యువసేన నియోజకవర్గ అధ్యక్షుడుగా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం అధ్యక్షుడుగా, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్ష పదవులతో పాటు గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాష్ట్ర హస్త కళలశాఖ డైరెక్టర్గా పనిచేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా జగనన్న వెంటే ఉంటానను. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఓబేదు మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, రేపల్లె నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ ఈవూరు గణేష్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఓబేదుకు పట్టణానికి చెందిన పలువురు వైఎస్సార్సీపీ నాయకులు అభినందనలు తెలిపారు. -
కొనసాగుతున్న నాటికల పోటీలు
తెనాలి: రోటరీ కళాపరిషత్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ – తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ద్వితీయ ఆహ్వాన నాటికల పోటీలు రెండవ రోజైన ఆదివారం కొనసాగాయి. ప్రదర్శనలకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ జ్యోతిప్రజ్వలన చేశారు. సినీ మాటల రచయిత, కళల కాణాచి, తెనాలి అధ్యక్షుడు డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, పోస్టల్ ఎంప్లాయీస్ కళాపరిషత్ అధ్యక్షుడు డీఎల్ కాంతారావు, ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, గుమ్మడి వెంకట నారాయణ పాల్గొన్నారు. తొలిగా చైతన్య కళాస్రవతి–ఉక్కునగరం, విశాఖ వారి ‘అ సత్యం’ నాటికను ప్రదర్శించారు. సుధ మోదుగు మూలకథకు పిన్నమనేని మృత్యుంజయరావు నాటకీకరించగా పి.బాలాజీనాయక్ దర్శకత్వంలో ప్రదర్శించారు. తదుపరి న్యూస్టార్ మోడ్రన్ థియేటర్ ఆర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ వారి ‘ఐ యేట్ ఇండియా’ నాటికను ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఎం.ఎస్.చౌదరి. చివరిగా యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారి ‘అనుకున్నదొకటి అయినదొక్కటి’ హాస్యనాటికను ప్రదర్శించారు. గోపి వల్లభ రచనకు ఆర్.వాసుదేవరావు దర్శకత్వం వహించారు. -
దొంగల బీభత్సం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని ఉండవల్లి అమరావతి రోడ్డులో సాయిబాబా గుడి వద్ద శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు చోరులు బీభత్సం సృష్టించారు. ఉండవల్లి రోడ్డులో తిరుగుతూ పలుచోట్ల సీసీ కెమెరాల వైర్లు ధ్వంసం చేశారు. ఎలక్రిక్టల్ షాపులో చోరీ చేశారు. సేకరించిన వివరాల ప్రకారం.. రాధాకృష్ణ హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్ షాపు యజమాని శనివారం రాత్రి 10 గంటల సమయంలో షాపు మూసి ఇంటికి వెళ్లారు. అనంతరం 12.10 నిమిషాలకు ముగ్గురు వ్యక్తులు మాస్క్లు ధరించి హార్డ్వేర్ షాపు చుట్టుపక్కల సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, కెమెరాలను ధ్వంసం చేశారు. 1.45 గంటలకు షాపు రేకులపై నుంచి వెనుకవైపు ఉన్న చిన్న సందులోకి దిగారు. పలుగుతో వెనుక తలుపు పగలుగొట్టి లోపలకు దూరారు. 2.45 గంటల వరకు షాపులో ఉండి వస్తువులను మూటలు కట్టుకుని గోడ అవతల విసిరివేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. మాస్క్లు ధరించడంతో గుర్తించడం కష్టంగా మారింది. షాపు యజమాని తాడేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో గుంటూరు నుంచి వేలిముద్రల నిపుణులు వచ్చి పరిశీలించారు. షాపులో సుమారు రూ.3 లక్షల విలువైన సరుకు, రూ.50 వేలు చోరీ అయినట్లు యజమాని తెలిపారు. పలుచోట్ల సీసీ కెమెరాలు ధ్వంసం రూ.3 లక్షల సామగ్రి దొంగతనం -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
రేపల్లె: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయాన్ని ఆదివారం సాయంత్రం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైఎస్సార్ ఎప్పుడూ ప్రజాసంక్షేమాన్ని కోరుకుందని, ఆ దిశగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు పడ్డాయని గుర్తుచేశారు. కూటమి కుయుక్తులపై వైఎస్సార్ సీపీ బలంగా పోరాడుతుందని, ఎక్కడా తగ్గేదిలేదన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నియోజకర్గంలో ప్రజలకు నిరంతరం తోడుగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికై పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రేపల్లె పట్టణ, మండలాల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, డుండి వెంకట రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చదలవాడ శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ నిజాంపట్నం కోటేశ్వరరావు, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు వీసం నాగలక్ష్మి, నాయకులు యార్లగడ్డ మదన్మోహన్, చిమటా బాలాజీ, అబ్దుల్ ఖుద్దూష్, గౌస్, నీలా నాంచారయ్య, పట్టెం శ్రీనివాసరావు, కొలుసు బాలకృష్ణ, సజ్జా పద్మావతి, కాటూరి శారద, లియాఖత్ భాషా, ఆలా రాజ్పాల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.భారీగా రేషన్ బియ్యం స్వాధీనంప్రత్తిపాడు: రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపిన ప్రకారం... వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడుకు చెందిన ఓ రైస్ మిల్లులో అక్రమంగా రేషన్ బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేశారన్న సమాచారం జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు అందింది. దీంతో ఎస్పీ ఆదేశాల మేరకు గుంటూరు సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ జి. భానూదయ, సీఐ రమానాయక్, సిబ్బందితో కలిసి మిల్లులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా మిల్లులో రేషన్ బియ్యం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారాన్ని రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులకు తెలియజేశారు. వట్టిచెరుకూరు తహసీల్దార్ క్షమారాణి, సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్లు మిల్లు వద్దకు చేరుకున్నారు. బస్తాల్లో నిల్వ చేసిన సుమారు 60 టన్నులకు పైగా రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.తొలి ఏకాదశి పూజలుమంగళగిరి: మంగళగిరి తాడేపల్లి సంస్థ పరిధిలోని ఆరవ బెటాలియన్లో ఆదివారం ఆషాఢ తొలి ఏకాదశి సందర్భంగా మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. బెటాలియన్ కమాండెంట్ మాట్లాడుతూ భక్తులు అమ్మవారికి సారె చీరెలు సమర్పించడం ఆనవాయితీ అని, అమ్మవారి దయతో కుటుంబాలు సంతోషంగా ఉంటాయని నమ్మకం అని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాడెంట్ ఆశ్వీరాదం, అధికారులు, స్థానిక మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పణతాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం శివాలయం వీధికి చెందిన మహిళలు ఆదివారం విజయవాడ కనక దుర్గమ్మ వారికి ఆషాఢ సారె సమర్పించారు. శ్రీ సోమేశ్వరస్వామి వారి దేవాలయంలోని పార్వతీ దేవికి తొలుత సారె సమర్పించి, మేళతాళాలతో కాలినడకన విజయవాడ దుర్గమ్మ వారికి సారె తీసుకెళ్లారు. స్థానిక మహిళలు అమ్మాజి, అనూష, సరళ, స్రవంతి, కౌసల్య, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025లోక్ అదాలత్లో 5,300 పైగా కేసులు పరిష్కారం ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని కోర్టుల్లో 5300కు పైగా కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. భారతి పేర్కొన్నారు. జిల్లాలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో మొత్తం 27 బెంచీల ద్వారా పరిష్కారమైన కేసుల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు. 5200కు పైగా క్రిమినల్ కేసులు, 155 సివిల్ దావాలతో పాటు 17 ప్రీలిటిగేషన్ కేసులు పరిష్కరించారు. మోటార్ వాహన ప్రమాద బీమా తదితర కేసుల్లో రూ.8 కోట్లకు పైగా కక్షిదారులకు పరిష్కార చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి బెంచీలో న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారం కోసం సహకరించిన న్యాయవాదులకు, పోలీసులకు, వివిధ ప్రభుత్వ శాఖల ప్రతినిధులకు, బ్యాంకు అధికారులకు, బీమా సంస్థల ప్రతినిధులకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందనలు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ తదితరులు నిరంతరం పర్యవేక్షించారు. ఎయిమ్స్లో 13 మంది విద్యార్థుల సస్పెన్షన్ మంగళగిరి: ఎయిమ్స్లో మెడికల్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నట్లు అధికార ప్రతినిధి వంశీకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశామని పేర్కొన్నారు. ఏడాదిన్నరపాటు 13 మంది విద్యార్థులపై ఈ సస్పెన్షన్ విధించామని వివరించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.సాక్షి ప్రతినిధి,బాపట్ల: డ్వామాలో అక్రమ వసూళ్ల బాగోతం ఇప్పడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నిత్యం కోట్లాది రూపాయల పనులు జరుగుతున్న డ్వామాలో వసూళ్ల పర్వం పతాక స్థాయికి చేరింది. ఆ విభాగం ఉన్నతాధికారి కిందిస్థాయి ఉద్యోగుల నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఆ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రతి మండలం నుంచి రూ.25 వేలకు తగ్గకుండా ముడుపులు ఇవ్వాలని షరతు విధించారు. ఇది కాకుండా ప్రతి సోషల్ ఆడిట్కు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 20 సోషల్ ఆడిట్లు జరగ్గా రూ.20 లక్షలు వసూలు చేసినట్లు కిందిస్థాయి అధికార వర్గాల సమాచారం. తాజాగా ఈ నెల 8వ తేదీన చీరాల సోషల్ ఆడిట్ ఉండగా రూ.లక్ష సిద్ధం చేసుకోవాలని ఇప్పటికే సంబంధిత అధికారిని ఆదేశించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. లక్షలో రూ.50 వేలు జిల్లా ఉన్నతాధికారి పేరు చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి జరిగిన పనులను షాట్ డైరెక్టర్ కార్యాలయం సోషల్ ఆడిట్ చేస్తుంది. అక్కడి నుంచి నలుగురు డీఆర్పీలతోపాటు ఒక ఎస్ఆర్పీ సోషల్ ఆడిట్లో పాల్గొంటారు. డీఆర్పీలు గ్రామాల్లో జరిగిన పనులను పూర్తిగా తనిఖీ చేసి ఆ తర్వాత డ్వామా పీడీతో కలిసి తనిఖీలు చేస్తారు. తనిఖీ అధికారులు అక్రమాలు ఎత్తి చూపితే మీరు కక్షతో కంప్లెయింట్ రాశారని చెప్పి డ్వామా అధికారి తన వద్ద పనిచేసే ఏపీడీని విచారణకు ఆదేశిస్తారు. దీంతో జరిగిన అక్రమాలు కనుమరుగవుతాయి. ఇందుకోసం డ్వామా అధికారి ప్రతి సోషల్ ఆడిట్కు రూ.లక్ష వసూలు చేస్తున్నారు. ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఏపీవోలు జిల్లా అధికారి అడిగిన మొత్తం చెల్లించాల్సి వస్తోంది. అయితే పనుల్లో అక్రమాలకు పాల్పడినవారే కాక అక్రమాలు చేయని అధికారులు సైతం కామన్గా డ్వామా అధికారికి డబ్బులు చెల్లించాల్సి రావడం ఇబ్బందిగా మారింది. ఉన్నతాధికారి పేరు చెప్పి వసూళ్లు ఇదికాకుండా జిల్లా ఉన్నతాధికారి పేరుచెప్పి ప్రతి మండలం నుంచి రూ.20 వేలు ఇవ్వాలని ఇటీవల డ్వామా అధికారి హుకుం జారీ చేశారు. ఇక ఆ అధికారి బయట అడుగు పెడితే చాలు ఏ మండలానికి వెళ్లినా వాహనం డీజల్, ఇతర ఖర్చుల పేరున ఏపీవోలు రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. ఏ అధికారైనా రూ.10 వేల చెల్లించకపోతే గూగుల్ మీట్లో సదరు అధికారికి తిట్ల దండకం తప్పదని పలువురు ఏపీవోలు సాక్షికి తెలిపారు. వసూళ్లు ఇలా... ● సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఇతర పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని సోషల్ ఆడిట్లో తేలడంతో నగరం మండలంలో కొందరు అధికారులను జిల్లా అధికారి సస్పెండ్ చేశారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ● కొల్లూరు మడంలంలో ఆయిల్ఫాం సాగుకు సంబంధించి ఉపాధి కూలీల మంజూరు విషయంలో ఫైల్ శాంక్షన్ కోసం అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ● యద్దనపూడి మండలంలో రూ.13 లక్షల విలువచేసే రోడ్డు నిర్మాణం కోసం స్థానిక నేత నుంచి రూ. 2.50 లక్షలు వసూలు చేయగా సదరు రోడ్డు నిర్మాణానికి పర్చూరు ఎమ్మెల్యే ఆమోదం లేదంటూ జిల్లా కలెక్టర్ సదరు పనిని నిలిపి వేయడంతో చివరకు డ్వామా అధికారి తీసుకున్న డబ్బులు వెనక్కి తిరిగి చెల్లించినట్లు తెలుస్తోంది. ● బాపట్లకు ప్రాంతానికి చెందిన ఒక టెక్నికల్ అసిస్టెంట్ యద్దనపూడి బదిలీ కోసం విన్నవించుకోగా జిల్లా అధికారి డబ్బుల కోసం డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఆ వ్యక్తి 50 కిలోల అలసందలు తీసుకువచ్చి ఇవ్వగా వాటితోపాటు మరో రూ.50 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో టెక్నికల్ అసిస్టెంట్ అంత ఇచ్చుకోలేనని చెప్పినా అధికారి ససేమిరా అనడంతో చివరకు రూ.40 వేలు చెల్లించినట్లు సమాచారం. 7న్యూస్రీల్ జిల్లా అధికారి బరితెగింపు సోషల్ ఆడిట్ కోసం రూ.లక్ష ఇప్పటి వరకూ 20 సోషల్ ఆడిట్లు పనుల మంజూరుకు లక్షల్లో డబ్బులు బదిలీలకు భారీగా ముడుపులు అధికారుల రీ పోస్టింగులకూ పెద్ద మొత్తంలో డిమాండ్ స్పందించకపోతే డిప్యూటీ సీఎం తాలూకా అంటూ బెదిరింపులు జిల్లా ఉన్నతాధికారి పేరుచెప్పి ప్రత్యేక వసూళ్లు ఆందోళన బాటలో కిందిస్థాయి అధికారులు, సిబ్బందిస్పందించకుంటే బెదిరింపులు ఉపాధి హామీ పథకంలో కోట్లాది రూపాయల పనులు జరుగుతుండడంతో అంతే స్థాయిలో డ్వామా అధికారి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారులు డబ్బులు చెల్లించే విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా సరిగ్గా స్పందించక పోయినా తాను డిప్యూటీ సీఎం తాలూకా అని, ఆయన ఓఎస్డీ తన బ్యాచ్మేట్ అంటూ డ్వామా అధికారి బెదిరింపులకు దిగుతున్నట్లు అధికారులు. సిబ్బంధి వాపోతున్నారు. సదరు అధికారి వేదింపులు భరించలేక కిందిస్థాయి అధికారులు, సిబ్బంది త్వరలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. -
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలి బాపట్ల: ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు అందిపుచ్చుకొని వారి స్థితిగతులను మెరుగుపరుచుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు యంత్రాలు, చెక్కులు పంపిణీ చేశారు. ప్రజల జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి మెప్మా ద్వారా చీరాల మండలంలో 2, బాపట్ల మండలంలో ఇద్దరు లబ్ధిదారులకు ఎలక్ట్రికల్ ఆటోలను జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు అందజేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా 646 మంది సభ్యులకు బ్యాంకు లింకేజీ పథకం ద్వారా, 3686 మందికి శ్రీనిధి పథకం ద్వారా, 384 మందికి లక్ పతి దిది ద్వారా, 14 మంది సభ్యులకు ఉన్నతి పథకం ద్వారా 53 కోట్ల 42 లక్షల రూపాయల చెక్కును, మెప్మా శాఖ ద్వారా 340 మంది స్వయం సహాయక గ్రూపు సభ్యులకు వివిధ బ్యాంకుల ద్వారా సూక్ష్మ చిన్న, మధ్య తరహా రుణం క్రింద రూ.5 కోట్ల 20 లక్షల చెక్కులను అందజేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రాజ్ దేబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారి శివలీల, వ్యవసాయ శాఖ జేడీ రామకృష్ణ, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ ఎం జ్యోత్స్న పాల్గొన్నారు. ప్రతి ఏటా జీడీపీలో 15శాతం వృద్ధి రేటు పెరిగేలా చూడాలి బాపట్ల జిల్లా జీడీపీలో ప్రతిఏటా 15 శాతం వృద్ధి రేటు పెరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్పై శనివారం స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అన్ని రంగాలలో వృద్ధి సాధించాలంటే అందుబాటులో ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అధికారులంతా సమగ్ర ప్రణాళిక రూపొందించుకుని చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. బ్లాక్ బర్లీ పొగాకు రైతుల పరిస్థితి పునరావృతం గాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలన్నారు. ఆక్వా రంగంలోనూ లాభసాటి సాగు జరిగేలా రైతులకు సూచనలు ఇవ్వాలన్నారు. ప్రజల తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. -
బాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబుకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అని, ఆయన చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకెళ్దాం అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. పర్చూరు నియోజకవర్గ స్థాయి ‘బాబు షూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా క్యాడర్ సమాయత్త సభ ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి అధ్యక్షత వహించారు. నాగార్జున మాట్లాడుతూ వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు ‘బాబు ష్యూరిటీ– మోసం గ్యారంటీ’ అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఇచ్చిన హామీలను ఏడాదిన్నర కావస్తున్నా అమలు చేయకపోగా ప్రజలను మోసం చేసే విధానాలను ప్రజలలోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం విషయంలో ఆయన గొప్ప ఆవిష్కరణలు చేపట్టి, కులం, మతం, పార్టీ అని చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసిన గొప్ప వ్యక్తి జగన్మోహనరెడ్డి అని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏవిధంగా ప్రజలను మోసం చేసిందో అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ వైఎస్ కూటమి ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని అన్నారు. పొగాకు కంపెనీలకు, పార్టీ నాయకులకు మేలు చేసేందుకే బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కూటమి ప్రభుత్వ తీరు కన్పిస్తుందని విమర్శించారు. పొగాకు, మిర్చి, కంది, శనగ, మినుములు, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ పర్చూరు ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోలో చూపించిన కార్యక్రమాలు అమలు చేయలేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, క్యూఆర్ కోడ్ను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, పర్చూరు పంచాయతీరాజ్ అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ కాలేషా వలి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు తోకల కృష్ణమోహన్, పార్టీ మండల కన్వీనర్లు జంపని వీరయ్యచౌదరి, కఠారి అప్పారావు, మున్నం నాగేశ్వరరెడ్డి, చిన్ని పూర్ణారావు, ఉప్పలపాటి చెంగలయ్య, పావులూరు సర్పంచ్ బొల్లెద్దు లుధియమ్మ, సీనియర్ నాయకులు భవనం శ్రీనివాసరెడ్డి, కొల్లా వెంకటరావు, గడ్డం మస్తాన్వలి, బిల్లాలి డేవిడ్, దాసరి వెంకట్రావు, యూ అనిల్, కుమ్మరి చందు, కాటి లక్ష్మణ్, పాలేరు వీరయ్య, ఎంపీపీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
చీరాల అర్బన్: ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలను గుప్పించి అధికారం చేపట్టిన తర్వాత హామీలను విస్మరించి ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు బహుముఖ ప్రజ్ఞాశాలి అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. శనివారం సాయంత్రం చీరాల మండలంలోని రామకృష్ణాపురంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంశంపై నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. నాగార్జున మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తే నాలుక కట్ చేస్తామని చంద్రబాబు అనడం ఆయన అహంకారానికి నిదర్శమన్నారు. తల్లికి వందనం పేరుతో రూ.15వేలు ఇస్తానని చెప్పి రూ.2 వేలు తగ్గించి జమ చేశారన్నారు. సాకుల పేరుతో చాలా మందికి డబ్బులు జమ కాలేదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను మూలన పెట్టేశారన్నారు. సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. పొగాకు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారన్నారు. అధికార పార్టీ పెట్టే అక్రమ కేసులపై ఎవరూ భయపడవద్దని, పార్టీ అందరికి అండగా ఉంటుందన్నారు. పథకాల్లో ఎన్నో కోతలు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. హామీలు అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదన్నారు. గత ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేసి నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూఆర్ కోడ్ కలిగిన పత్రాలను ఆవిష్కరించారు. దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏవిధంగా ప్రజలకు వివరించాలనేది పవర్ పాయింట్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకట ప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, బీసీ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బత్తుల అనిల్, చీరాల మండల అధ్యక్షుడు ఆసాది అద్దంకిరెడ్డి, వేటపాలెం మండల అధ్యక్షుడు సాధు రాఘవ, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మైనార్టీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ షేక్ కబీర్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు కోడూరి ప్రసాద్రెడ్డి, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ చీరాల అధ్యక్షుడు రాజు శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ బిట్రా శ్రీనివాసరావు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఆసాది అంకాలరెడ్డి, వేటపాలెం పార్టీ మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోసం చేయడంలో బాబు బహుముఖ ప్రజ్ఞాశాలి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున చీరాలలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమం -
నీటి మోటార్ల దొంగలు అరెస్ట్
నాలుగు మోటార్లు స్వాధీనం వేటపాలెం: పొలాల్లో సాగు నీటికి ఉపయోగించే మోటార్లు దొంగిలించే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి.జనార్దన్ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలను వెల్లడించారు. చల్లారెడ్డిపాలెం పంచాయతీ కొత్తపాలేనికి చెందిన రైతు మర్రి నాగార్జున తమ పంట పొలాలకు ఉపమోగించి నీటి మోటార్లు దొంగతనాకి గురైట్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కొణిజేటి చేనేత కాలనీలో నివాసం ఉంటున్న షేక్ నాసిర్ వాలి, వేటపాలెం మార్కెట్ సెంటర్లో నివాసం ఉంటున్న షేక్ సుభాని.. ఇద్దరు చెడు వెసనాలకు అలవాటు పడి పొలాల్లో ఉండే మోటార్ల దొంగతనానికి పాల్పడ్డారు. ఈ మేరకు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 5 హెచ్పీ మోటార్లు మూడు, 2 హెచ్పీ మోటార్లు రెండు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ రూ.1.10 లక్షలు ఉంటుందన్నారు. నిందితులిద్దరినీ చీరాల కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. 15న జిల్లా అథ్లెటిక్ జట్టు ఎంపిక గుంటూరు వెస్ట్ ( క్రీడలు ) : అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సింథటిక్ ట్రాక్లో ఉదయం 9 గంటలకు జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ఆధార్తోపాటు వయస్సు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టును ఆగస్ట్లో బాపట్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు. నేడు అండర్–14 పికిల్ బాల్ పోటీలు వివివి హెల్త్ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక జేకేసీ కళాశాల రోడ్డులోని క్లబ్లో అండర్– 14 బాల బాలికల ఓపెన్ పికిల్ బాల్ పోటీలు నిర్వహిస్తామని క్లబ్ డైరెక్టర్ టి.అరుణ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కిరాణా షాపులో మద్యం బెల్టు షాపు
బలిజేపల్లి(వేమూరు): కిరాణా షాపులో మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్న నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వేమూరు మండలం బలిజేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు బంధువులు మద్యం బెల్టు షాపు నిర్వహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఎకై ్సజ్ అధికారులు బెల్టు షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తెలిపారు. బలిజేపల్లి గ్రామంలో మద్యం బెల్టు షాపులతోపాటు గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు వ్యక్తం చేశారు. అధికారులు గ్రామంలో మద్యం బెల్టు షాపు, గంజాయి అమ్మకాలు నిర్మూలన చేయాలని కోరారు. -
కల్తీ మద్యం తయారీ ముఠా అరెస్ట్
రేపల్లె: కల్తీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేపల్లె మండలం మోళ్లగుంట గ్రామంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. గ్రామంలోని మోపిదేవి సతీష్ గృహాన్ని పరిశీలించారు. గృహంలో కల్తీ మద్యం తయారు చేసే ముడి సరుకుతోపాటు మద్యం నిల్వ ఉంచే టిన్లు, క్వార్టర్ సీసాలు కనిపించాయి. మోళ్లగుంటకు చెందిన మోపిదేవి సతీష్, కన్నా రాములతోపాటు కృష్ణాజిల్లా గుల్లలమోద గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి సూర్యలను అదుపులోకి తీసుకున్నారు. మోపిదేవి సతీష్, సూర్య, రాములతోపాటు మరో ముగ్గురు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. ఇథనాల్ ఆల్కహాల్ 10 లీటర్లు, 21 ఖాళీ క్యాన్లు, 510 ఖాళీ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన సూత్రధారి అయిన యానం శ్రీను అలియాస్ నులికుర్తి శ్రీనివాస్ హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి ఇథనాల్ ఆల్కహాల్ను సతీష్కు పంపుతాడు. ఆల్కహాల్లో రంగు నీరు కలిసి సతీష్, సూర్య, రాములు 180 మిల్లీలీటర్ల సీసాలలో నింపి చుట్టు ప్రక్కల ప్రాంతాలలో విక్రయిస్తూ అక్రమంగా నగదు సంపాదిస్తున్నాడు. ఈ కేసులో ప్రధాన సూత్రధారులైన యానం శ్రీను, రూతుల శ్రీనివాస్ (హైదరాబాద్), చరణ్జిత్ (హైదరాబాద్)లను త్వరలో అరెస్ట్ చేస్తామని ఎకై ్సజ్ అధికారి తెలిపారు. వీరిరువురికి హైదరాబాద్లో ఉన్న నకిలీ మద్యం తయారీ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. సమావేశంలో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ జనార్థన్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మధుబాబు, ఎకై ్సజ్ సీఐ దివాకర్, ఎస్ఐలు రాజ్యలక్ష్మి, రామారావు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు దళితులపై అక్కసు ఎందుకు?
చీరాల టౌన్: ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబునాయుడు దళితులను కుక్కలతో పోల్చి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. దళితులంటే సీఎంకు ఎందుకు అంత చిన్నచూపు? దళితుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’ అని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ల వాసు డిమాండ్ చేశారు. శనివారం చీరాల ఒన్టౌన్ సీఐ సుబ్బారావును వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్, వైఎస్సార్సీపీ నాయకులు కలిసి చంద్రబాబుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వాసిమళ్ల వాసు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, పట్టణాధ్యక్షుడు యాతం మేరిబాబులు మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడుకు దళితులంటే ఎప్పుడూ చులకన భావమేనని రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సింగయ్యను కుక్కతో పోల్చడం దుర్మార్గమన్నారు. దళితుల ఓట్లు కావాలని.. కానీ వారు కుక్కలంటూ అగ్రవర్ణ భావజాలంతో, పదవీ అహంకారంతో మాట్లాడిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్బుక్ పాలనలో ప్రజలు, పార్టీల నాయకులును వేధిస్తూ దుర్మార్గ పాలన చేస్తున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్న హయాంలో గోదావరి పుష్కరాల సమయంలో చాలామంది చనిపోయారని, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా కందుకూరు, ఇతర ప్రాంతాల్లో ప్రజలు చనిపోయినా కనీసం స్పందించకుండా దుర అహంకారాన్ని ప్రదర్శించారన్నారు. వైఎస్సార్ సీపీలో దళితులకు సముచిత స్థానం ఇచ్చి ఉన్నత పదవులు కట్టబెటితే.. చంద్రబాబు మాత్రం దళితులను కుక్కలతో పోల్చడం హేయమన్నారు. ఇదే పంథా కొనసాగిస్తే చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మున్సిపల్ కౌన్సిలర్లు కంపా అరుణ్, బత్తుల అనీల్, పార్టీ నాయకులు గవిని శ్రీనివాసరావు, కోడూరి ప్రసాద్రెడ్డి, రాఘవ, వాసిమళ్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు. సీఎంపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు -
ఆధునికీకరించని లాకులు...అన్నదాతకు కష్టాలు
బాపట్ల: నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు కొమ్మమూరు కాలువపై నరసాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన లాకులు..షెట్టర్లు శిథిలావస్థకు చేరాయి. బ్రిటిష్కాలం నాటి 15 షెట్టర్లకు తోడు మరో 10 షెట్టర్లు నిర్మించారు. ఆ తర్వాత వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. కనీసం వచ్చే నీటికి అడ్డుకట్ట వేయలేకపోవటంతో ఎగువ ప్రాంతాలకు నీరు సక్రమంగా పారుదల లేకపోవటంతో రైతులు అల్లాడిపోతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి తాత్కాలికంగా తన సొంత ఖర్చులతో లాకులకు మరమ్మతులు చేయించారు. రైతులకు కొంత ఉపశమనం కలిగించాయి. ఈ ఏడాది మరమ్మతులకు అవకాశం లేకపోవటంతో రైతులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. నల్లమడ లాకుల ఏర్పాటు ఇలా... కృష్ణాపశ్చిమ డెల్టా నుంచి 69.545 కిలో మీటర్లు మేరకు కొమ్మమూరు కాలువ నరసాయపాలెం వద్ద ఉన్న నల్లమడ లాకుల వద్దకు చేరుకుంటుంది. కొమ్మమూరు కాలువ మొత్తం ఆయకట్టు 2.15 లక్షల ఎకరాలు కాగా అనధికారిక సాగు మరో 50 వేల ఎకరాలు ఉంటుంది. ఈ మేరకు దుగ్గిరాల వద్ద 3600 క్యూసెక్కులు వదిలినప్పటికి బాపట్ల చానల్, పీటీ చానల్లకు పోగా నల్లమడ లాకుల వద్దకు 1100 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడ నుంచి 70,599 ఎకరాల ఆయకట్టు ఉండగా ఎగువ కాలువ మట్టం(లోతు)11.92 అడుగులు ఉండగా దిగువ ఆయకట్టు 8.92 అడుగులు ఉంటుంది. వెడల్పు ఎగువ ప్రాంతంలో 64.0 అడుగులు ఉండగా దిగువ ప్రాంతంలో 48.0 అడుగులు ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి నరసాయపాలెం, వెదుళ్లపల్లి, చెరుకుపల్లి ట్యాంకు కాలువ, పెద్దగంజాం వరకు ఈ లాకుల నుంచే నీరు వెళుతుంది. ఈ లాకుల వద్ద కనీసం ఆరు అడుగులు లోతులో నీటి నిల్వ ఉంటే గానీ బాపట్ల, పీటీ చానల్కు నీటి పారుదల ఉండే అవకాశం లేదు. శిథిలావస్థలో లాకులు...షెట్టర్లు బ్రిటిష్కాలంలో ఏర్పాటు చేసిన లాకులు, షెట్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. నల్లమడ వద్ద లాకులు, ఉప్పరపాలెం వద్ద ఉన్న షెట్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఉప్పరపాలెం వద్ద ఉన్న 15 షెట్టర్లు బ్రిటిష్ కాలం నాటివి కాగా 10 షెట్టర్లు 15 ఏళ్ల కిందట ఏర్పాటు చేశారు. కాలువ మరమ్మతులు చేయకుండా షెట్టర్లు ఏర్పాటు చేయటం వలన ఆవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఆ కాలంగా కురిసే వర్షపు నీటికి తోడు పంట కాలువలో ఉండే నీటితో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాకులు, షెట్టర్లు దెబ్బతిని పోవటంతో కీలకమైన సమయంలో నీటి నిల్వలకు ఇబ్బందికరంగా మారిపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మాత్రం ఆధునికీకరణ నిధులు వస్తే పూర్తిస్థాయిలో లాకులు, షట్టర్లు మరమ్మతులు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. శిథిలావస్థలో నల్లమడ షట్టర్లు ప్రతి ఏడాదీ మరమ్మతుల కోసం ఎదురుచూపులు పట్టించుకోని అధికారగణం ఆందోళనలో దిగువ ప్రాంత రైతులు -
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం
చీరాల అర్బన్: మహిళలందరికీ ఆగస్టు 15న మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సన్నద్ధం చేస్తున్నట్లు నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం చీరాల ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. ఆర్టీసీ డిపో మేనేజర్ జంజనం శ్యామల, బీజేపీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించారు. బస్సులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడిపోయి ప్రమాదభరితంగా ఉండటాన్ని గుర్తించి వాకబు చేశారు. మరమ్మతులు చేయించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు తాగునీటి వసతి లేకపోవడాన్ని గుర్తించారు. మరుగుదొడ్లలో అధికంగా వసూలు చేయవద్దని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రైవేటు బస్సులకు దీటుగా ఆర్టీసీ బస్సులను తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఉచిత ఆర్టీసీ పథకానికంటే భిన్నంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్టీసీ యూనియన్ల ప్రతినిధులు, రిటైర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు జోనల్ చైర్మన్ను సత్కరించారు. ఏఎంసీ చైర్మన్ కౌత్రపు జనార్దన్, బీజేపీ సీనియర్ నాయకులు మువ్వల వెంకటరమణారావు పాల్గొన్నారు. నెల్లూరు జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి -
బాపట్ల జిల్లా ప్రథమం
పీ–4 అమలులో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళికి సీఎం అభినందనలు బాపట్ల: పీ–4 అమలులో బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రణాళిక, అధికారుల సమష్టి పనితీరు చాలా బాగుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. పీ–4 అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో శుక్రవారం రాజధాని అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లాలో 62,388 బంగారు కుటుంబాలు ఉంటే 44,920 కుటుంబాలను 3,528 మంది మార్గదర్శిలకు దత్తత ఇవ్వడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచారని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశంసించారు. బంగారు కుటుంబాలను 72శాతం అనుసంధానించడం అభినందనీయమన్నారు. మిగిలిన 17వేల కుటుంబాలను మార్గదర్శిలకు దత్తత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు బాపట్లను స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం సూచించారు. పీ–4 విధానంలో బంగారు కుటుంబాలకు చేయూతనందిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి సీపీఓ షాలేమ్ రాజు, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ గ్లోరియా, తదితరులు హాజరయ్యారు. నేడు నృసింహుని హుండీ కానుకల లెక్కింపు మంగళగిరి టౌన్: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శనివారం నిర్వహించనున్నట్లు కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఎగువ, దిగువ సన్నిధిలోను, శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీలను ఉదయం 9 గంటలకు లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల భక్తులు పాల్గొనవచ్చని ఆయన తెలియజేశారు. -
ఇంటింటికి చంద్రబాబు మోసాలు
రేపల్లె: అధికారం కోసం మోసపూరిత హామీలివ్వటం, ప్రజలను మోసగించటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంశంపై జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం తప్ప ప్రజలను, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరన్నారు. మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్రెడ్డి పవిత్ర గ్రంథంలా భావిస్తే చంద్రబాబు చిత్తు పేపరులా చెత్తకుండీలో పడవేశారన్నారు. హామీలు అమలు చేయకుండానే అమలు చేసేశాం, సూపర్ సిక్స్పై ప్రశ్నించే వారి నాలుక కట్ చేస్తామని చంద్రబాబు అనటం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఏ హామీలు అమలు చేశారో బహిరంగంగా ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు వైఎస్సార్ సీపీ ఇంటింటికి చంద్రబాబు మోసాలను తీసుకెళుతుందన్నారు. ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత : డాక్టర్ ఈవూరు గణేష్ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ మాట్లాడుతూ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు, ప్రజలపై అక్రమ కేసులు తప్ప సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిందేమీలేదన్నారు. దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ శిరసా వహించాలన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు గుర్తు చేస్తూ ఇంటింటికి అందించాలన్నారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు, మండల సమన్వయకర్తలు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, నాయకులు యార్లగడ్డ మదన్మోహన్, కాటూరి శివనాగబాబు, చదలవాడ శ్రీనివాసరావు, కర్రి వెంకట కృష్ణారెడ్డి, వీసం నాగలక్ష్మి, బొర్రా శ్రీనివాసరావు, చిమటా బాలాజీ, దొంతిబోయిన కొండలురెడ్డి, లుక్కా బాపనయ్య, తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ అడిగితే నాలుక కోస్తాననటం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున గుళ్లపల్లిలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ పాల్గొన్న సమన్వయకర్తలు డాక్టర్ గణేష్, వరికూటి అశోక్బాబు -
పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు
అద్దంకి: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చే కార్యక్రమాన్ని అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ పరిశీలకులు తూమాటి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు గిట్టుబాటు ధర అన్నారని.. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేదన్నారు. మిర్చి రైతు నట్టేట మునిగాడన్నారు. పొగాకు రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. వరి రైతు ఉరివేసుకునే పరిస్థితి ఉందన్నారు. అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూ ఆర్ కోడ్ కలిగిన ప్రచార పత్రాన్ని ఆవిష్కరించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర ప్రచార విభాగం నాయకుడు పులికం కోటిరెడ్డి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, పాలపర్తి శ్రీధర్, కె.శ్రీవిద్య, సంతమాగులూరు జెడ్పీటీసీ అడవి శ్రీను, కొల్లా భువనేశ్వరి, మాకినేని శ్రీనివాసరావు, బాజీవలి, మురహరి యాదవ్, రఘురామగుప్తా, ఓబుల్ రెడ్డి తదితర నాయకులు మాట్లాడారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, సంతమాగులూరు మండల కన్వీనర్ వూట్ల నాగేశ్వరరావు, ఓబులరెడ్డి, కాశీదేవి, రాష్ట్ర ప్రచార కమిటీ నాయకుడు కోయి అంకారావు, ముత్తవరపు రమణయ్య, బాబూ, ఊడత్తు సురేశ్, బి.మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుట్రలతోనే కూటమి అధికారం : ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఒంటిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోతామని గ్రహించిన చంద్రబాబు అండ్ కో కూటమి కట్టి కుట్ర లతో గెలిచారని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. కూటమి నేతలు అక్రమార్జనకే సమయం సరిపోతుందని, ప్రజల గురించి వారికి పట్టదన్నారు. నమ్మించి మోసం చేసిన చంద్రబాబు : పానెం చిన హనిమిరెడ్డి పార్టీలో అక్కడా.. ఇక్కడా నాటకాలాడే నాయకులను తాను నమ్మనని నియోజవర్గ ఇన్చార్జి పానెం చిన హనిమిరెడ్డి అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. హామీల అమలుపై ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి భయకంపితులను చేస్తున్నారని, వాటికి ఎవరూ భయపడవద్దన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. కూటమి సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళదాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున అద్దంకిలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ నియోజకవర్గ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవరావు, నియోజకవర్గ సమన్వయకర్త చిన హనిమిరెడ్డి -
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ ఒప్పంద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పడమటి బిక్షాలు కోరారు. టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులకు, పార్క్ కూలీలకు, ఆఫీసు సిబ్బందికి, టౌన్ప్లానింగ్ సిబ్బందికి కేటగిరిల వారీగా జీఓ 36 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని విన్నవించారు. రిటైర్ అయిన కార్మికుల స్థానంలో, మృతి చెందిన వారి స్థానాలలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. సమస్యను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శివప్రసాద్ హామీ ఇచ్చారు. సింగం వాణిశ్రీ పాల్గొన్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణం వద్దు బాపట్ల: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాచవరపు రవికుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విద్యార్థి విభాగం సమావేశం నిర్వహించారు. రవికుమార్ మాట్లాడుతూ ఈ మేరకు ఈనెల 7వ తేదీన విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బాపట్ల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు యల్లావుల సోహిత్ యాదవ్, పర్చూరు నియోజకవర్గ అధ్యక్షులు కాటి లక్ష్మణ్, రాష్ట్ర విద్యార్థి విభాగం కమిటీ జాయింట్ సెక్రటరీ షేక్ పర్వే జ్, రేపల్లె అధ్యక్షులు వసీం మొహమ్మద్, చీరాల అధ్యక్షులు గోనబోయిన వెంకటేష్, జిల్లా విద్యార్థి యువ నాయకులు చోప్రా రాజశేఖర్ ఉన్నారు. -
కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వాలి
పర్చూరు(చినగంజాం): యజమానితో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ కౌలు కార్డులివ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. పర్చూరులో రామానాయుడు ప్రెస్ వెల్ఫేర్ అసోసియేషన్ హాలులో శుక్రవారం నిర్వహించిన కౌలు రైతు సంఘం జిల్లా విస్తృత సమావేశంలో ప్రసంగించారు. కౌలు రైతులందరికీ గ్రామ సభలు జరిపి కౌలు కార్డులు ఇవ్వాలని.. కనీసం ఫసలీ రాయించి ఆ ప్రకారమైనా కార్డులివ్వాలని కోరారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. పొగాకు కొనుగోలు మందకొడిగా సాగుతోందని తెలిపారు. మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారని, మిర్చి పంటదీ అదే పరిస్థితి అన్నారు. కౌలు రైతులకు కార్డులివ్వడం , బ్యాంకు ద్వారా రుణాలివ్వడం, తిరిగి పంట వేసుకునేందుకు ప్రోత్సహించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కౌలు రేట్లు చాలా భారంగా ఉన్నాయని కౌలు రైతులంతా ఉమ్మడిగా కౌలు రేట్లు తగ్గించుకోవాలని కోరారు. దేవదాయ భూములు సాగు చేస్తున్న రైతులందరికీ కౌలు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా నాయకుడు కొండయ్య మాట్లాడుతూ వెంటనే సభ్యత్వాలు పూర్తి చేయాలని మండల మహాసభలు జరపాలని జూలై 26న స్వర్ణ గ్రామంలో నిర్వహించే జిల్లా మహాసభలకు అన్ని మండలాల నుంచి రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశానికి టి. యషయ్య అధ్యక్షత వహించారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు బండి శంకరయ్య, భాను, ఏడుకొండలు, గోవింద్, వెంకటరావు, రహీం, కొమ్మినేని శ్రీను, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ లారీ ఎదురైతే హడలే..
బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు, అద్దంకి మండలాల్లో రహదార్లపై టూవీలర్, కార్లపై ప్రయాణించాలంటే భయంగా ఉంది. 4 నుంచి 7 గ్రానైట్ బండలు, లారీ ట్రాలీలపై ఎగుమతితో ఎక్కడ ఒరుగుతాయోనని భయపడుతున్నాం. – ధర్మవరపు రవికుమార్ ఆదాయం సమకూరుతున్నా అభివృద్ధి లేదు.. బల్లికురవ, ఈర్లకొండ చుట్టూ 25 పైచిలుకు గ్రానైట్ క్వారీలు మండలంలో 600 పైచిలుకు పరిశ్రమలు ఉన్నాయి. ఎగుమతులకు రాయల్టీ చెల్లింపు ద్వారా ఆదాయం సమకూరుతున్నా రహదార్లు అభివృద్ధి చెందడం లేదు. ఇక్కడ నుంచి ప్రభుత్వానికి చెల్లించే ఆదాయంతో పూర్తిస్థాయిలో అన్ని రహదార్లను అభివృద్ధి పరచవచ్చు. – తంగిరాల వెంకేటేశ్వర్లు, సీపీఎం నాయకుడు ● -
అల.. ఆక్రమణల తీరం
మడ అడవుల నుంచి అలల వరకు ఆక్రమణలే.. సాక్షి ప్రతినిధి,బాపట్ల: వేటపాలెం మండలాల పరిధిలోని విజయలక్ష్మీపురం, ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రం తీరం(బీచ్)లో ఉన్న ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములను ఈ ప్రాంతానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులు టీడీపీ నేతలు, రిసార్ట్స్ యజమానులకు కట్టబెట్టి రూ.కోట్లు దండుకుంటున్నారు. ప్రైవేటు భూముల ధరతో పోలిస్తే కాస్త తక్కువ ధరకు ప్రభుత్వ, అటవీ భూములు లభిస్తుండడంతో రిసార్ట్స్ వ్యాపారులు రెవెన్యూ అధికారులకు అడిగినంత ముట్టజెప్పి భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారు. కబ్జా భూములను తమ రిసార్ట్లలో కలిపేసుకొని వాటిని మరింతగా విస్తరిస్తున్నారు. ఇదే అదనుగా చీరాల టీడీపీ ముఖ్య నేత కొందరు రెవెన్యూ అధికారితో కలిసి ఇక్కడున్న ప్రభుత్వ, అటవీ భూములను కొట్టేసి వాటిని తిరిగి రిసార్ట్ వ్యాపారులతోపాటు జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వేటపాలెం మండలంలో ఇప్పటికే వేలాది ఎకరాలుగావున్న అటవీ, ప్రభుత్వ భూములను టీడీపీ నేతలతో కలిసి రెవెన్యూ అధికారులు అమ్మకానికి పెట్టి రూ.కోట్లు గడించినట్లు రెవెన్యూ వర్గాల్లోనే జోరుగా ప్రచారం సాగుతోంది. ఆక్రమించి.. విస్తరించి రెవెన్యూ అధికారులకు డబ్బులు గుమ్మరించి కొంత, కబ్జాచేసి మరికొంత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్న వ్యాపారులు, పచ్చనేతలు తీరంలో రిసార్ట్లు, అధునాతన విడిది గృహాలు నిర్మించుకుంటున్నారు. వేటపాలెం మండలంలో విజయలక్ష్మీపురం మొదలు కొని ఓడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తీరంవరకూ ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. ఊపందుకున్న రిసార్ట్స్ నిర్మాణాలు చీరాల, వేటపాలెం సముద్రతీర ప్రాంతానికి రోజురోజుకూ పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. వీకెండ్స్లోనే ఏపీ నలుమూలలనుంచే కాక అటు తెలంగాణ నుంచి లక్షలాదిమంది తరలివస్తుండగా మిగిలిన రోజుల్లోనూ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తీరంలో వ్యాపారం పెరగడంతో ఇక్కడ రిసార్ట్స్ నిర్మించేందుకు ఏపీతో పాటు తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, సినీ పరిశ్రమకు చెందిన వారితోపాటు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులతో సహా అన్నివర్గాలకు చెందిన స్థితి మంతులు భూములు కొంటున్నారు. దీంతో ఒకప్పుడు ఎకరం రూ. 25 లక్షలలోపు వున్న భూముల ధరలు నేడు ఎకరం రూ. 3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు ధర పలుకుతోంది. వేటపాలెం పరిధిలోని ఓడరేవు మొదలు పొట్టిసుబ్బయ్యపాలెం వరకూ ఎకరం ధర సగటున రూ. 5 కోట్లుగా వుంది. అధికారులకు కాసుల పంట వేటపాలెం ప్రాంతంలో ప్రైవేటు భూములకు మించి ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూములు ఉండడంతో ఇదే అవకాశంగా కొందరు రెవెన్యూ అధికారులు పెద్ద ఎత్తున డబ్బులు దండుకొని ఆ భూములను రిసార్ట్ యజమానులు, పచ్చనేతలకు అప్పగిస్తున్నారు. ఇక్కడి పచ్చనేత తనకు అనుకూలురైన ఒకరిద్దరు రెవెన్యూ అధికారులను వేటపాలెంలో నియమించుకొని భూముల విక్రయాలతో రూ.కోట్లు దండుకుంటునట్లు ఆరోపణలున్నాయి. – అక్రమాలు సృతిమించడంతో వేటపాలెం తహసీల్దారును ఇటీవల జిల్లా కలెక్టర్ వెంకట మురళి సరెండర్ చేశారు. తీరంలో భూ ఆక్రమణలపై చీరాల ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఇది సజావుగా సాగితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశముంది. టీడీపీ నేతలు, రెవెన్యూ అధికారులు కలిసి దందా రిసార్ట్స్ యజమానులకు తీరం భూముల అప్పగింత ప్రభుత్వ, అటవీ, అసైన్డ్ భూముల అమ్మకం కొన్న భూముల్లో ప్రభుత్వ భూములను కలిపేసుకుంటున్న వైనం తీరంలో ఎకరా రూ. 3 కోట్ల నుంచి 6 కోట్లు అమాంతం పెరిగిన భూముల ధరలు ఇదే అవకాశంగా ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న రెవెన్యూ అధికారులు సీఆర్జెడ్ నిబంధనలకు తిలోదకాలు మడ, సర్వి చెట్లు కొట్టేసి సీ వ్యూకు రిసార్ట్లు ఆక్రమణలు ‘అల’.. పట్టించుకోరేలా? తీరంలో రిసార్ట్లు నిర్మించిన వ్యాపారులు తీరం అలల వరకూ ఆక్రమించి ఆ ప్రాంతంలో గ్రావెల్, చిప్స్ వేసి చదును చేసి తమ రిసార్ట్లకు వచ్చే పర్యాటకులకు విడిదిగా మారుస్తున్నారు. సాయంత్రం పూట పర్యాటకులు ఆ ప్రాంతాల్లో కూర్చొని సముద్రాన్ని చూసేలా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తీరాన్ని సముద్రం నీటివరకూ ఆక్రమిస్తున్నా చర్యలు శూన్యమనే చెప్పాలి. నిబంధనలకు ఆ‘మడ’ దూరం రిసార్ట్ల పరిధిలో సీ వ్యూ కనిపించేందకు అడ్డుగావున్న మడ, సర్వి చెట్లను అడ్డంగా నరికివేస్తున్నారు. తీరంలోని మడ, సర్వి చెట్లను నరికి వేయడం నేరం. కానీ అధికారులను లోబరుచుకొన్న రిసార్ట్ల యజమానులు ఏమాత్రం ఖాతరు చేయక చెట్లను నరికి వేస్తున్నారు. సముద్ర తీరంలో అలల తాకిడి, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తీరం కోతకు గురికాకుండా ఉండేందుకు మడ చెట్లను పెంచుతారు. ఉదాహరణకు 2005లో వచ్చిన సునామీ దెబ్బకు ఇదే ప్రాంతంలోని పొట్టిసుబ్బయ్యపాలెంలో 9 మంది మరణించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు సర్వి మొదలు ఇతర సామాజిక వనాలను అటవీశాఖ పెంచుతుంది. -
ఛిద్రమవుతున్న రోడ్లు
బల్లికురవ: గ్రామీణ రహదార్లు గ్రానైట్ భారీ వాహనాల రాకపోకలతో ఛిద్రమౌతున్నాయి. అడుగుకో గోయ్యితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోంది. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ నుంచి తీసే స్టీల్గ్రే మీటరు, ముడిరాళ్లు మార్టూరు, గణపవరం, జొన్నతాళి, వేమవరం, మే దరమెట్ల, సంతమాగులూరు, ఒంగోలు, మురికి పూడి, తాతపూడిలోని పరిశ్రమలతోపాటు బెంగళూరు, తాడిపత్రి, చెన్నె, హైదరాబాద్ పట్టణాలకు నిత్యం ఎగుమతులు జరుగుతుంటాయి. ఒక్కో లారీపై ప్రమాదకరంగా 4 నుంచి 7 బ్లాక్లను ఎక్కిస్తూ 70 నుంచి 90 టన్నుల వరకు తరలిస్తున్నారు. గోతుల కారణంగా అంటూ ఎక్కడ రాయి దొర్లి కింద పడుతుందోనని ప్రజలు వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. ప్రతిపాదనలకే పరిమితం.. భారీ వాహనాల రాకపోకలతో బల్లికురవ–నాగరాజుపల్లి–మార్టూరు, చెన్నుపల్లి–వేమవరం జంక్షన్–తాతపూడి –అనంతవరం, కొణిదెన–వేమవరం జంక్షన్–ఉప్పుమాగులూరు, నక్కబొక్కలపాడు–కొదదెన–మార్టూరు, బల్లికురవ–సంతమాగులూరులో రోడ్లు మోకాటిలోతు గోతులతో 10 కిలో మీటర్లు ప్రయాణానికి సైతం 40 నుంచి 50 నిమిషాల సమయం పడుతోంది. గోతుల్లో గ్రానైట్ లారీలు కూరుకుని ట్రాఫిక్జామ్లతో బస్సులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులకు గమ్యం చేరతామన్న గ్యారంటీ లేదు. గ్రానైట్దారుల ఆధీనంలో.. చెన్నుపల్లి–అనంతవరం రోడ్లులో కొండాయపాలెం గ్రామాల మధ్య క్వారీ నిర్వాహకులు ఆర్అండ్బీ రోడ్డును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రహదారిపైనే యంత్రాలు, లారీలు నిలపడం, లోడింగ్ చేపట్టడం వల్ల తారురోడ్లు సైతం జారుడు బల్లను తలపిస్తున్నాయి. వర్షాకాలంలో ఈరోడ్డులో ప్రయాణించాలంటే సాహసం చేయక తప్పదు. దెబ్బతిన్న రోడ్లకు ప్రతిపాదనలు తయారు చేసి పంపుతున్నారు. నిధులు మంజూరుతో టెండర్కు కాంట్రాక్టర్లను ఆహ్వానించినా భారీ వాహనాల రాకపోకలకు మెయింటెనెన్స్ ఇవ్వలేక రోడ్ల అభివృద్ధికి కాంట్రాక్టర్లు మందుకు రావడం లేదు. -
ఒరిగిన అమరేశ్వరాలయ రాజగోపురం తలుపు
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానం దక్షిణరాజగోపురానికి అమర్చిన రెండు తలుపుల్లో ఒక తలుపు పక్కకు ఒరిగిపోయింది. బుధవారం రాత్రి దేవాలయ భద్రతా సిబ్బంది తలుపులు మూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ మాట్లాడుతూ రాజగోపుర తలుపు మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో వేగంగా వచ్చిన ఓ కారు తలుపును ఢీ కొట్టటం వల్ల ఇసుపరాడ్ వంకర వచ్చిందన్నారు. ఈతరహా తలుపులు మరమ్మతులు చేసే వడ్రంగ నిపుణులను పిలిపించటానికి ఏర్పాట్లు చేశామని రెండుమూడు రోజులలో మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అప్పటివరకు గాలిగోపురం వద్ద సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు. అలాగే పోలీసుల సహకారంతో మరమ్మతులు పూర్తయ్యే వరకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. నేడు భూ సమీకరణ గ్రామ సభలు తాడికొండ: తాడికొండ మండలం దామరపల్లి, ఫణిదరం, బండారుపల్లి గ్రామాల్లో భూ సమీకరణ కోసం ఎమ్మెల్యే అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తాడికొండ తహసీల్దార్ మెహర్ కుమార్ గురువారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఫణిదరం, 11 గంటలకు దామరపల్లి, 12 గంటలకు బండారుపల్లి గ్రామాల్లో గ్రామ సభ జరగనుంది. రైతులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన సూచించారు. సీఎస్ సమీక్షకు హాజరైన కలెక్టర్ నరసరావుపేట: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియా సమావేశానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు, జేసీ సూరజ్ గనోరే కలెక్టరేట్ నుంచి వర్ుచ్యవల్గా హాజరయ్యారు. పీ–4, పాజిటివ్ పబ్లిక్ పెర్సప్సన్, మహిళా స్వయం శక్తి సంఘాలకు వార్షిక క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్, మైక్రో క్రెడిట్ ప్లాన్, పోషణ్ ట్రాకర్, బాల సంజీవని లబ్ధిదారుల ఫేషియల్ అథంటికేషన్, కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, రుతుపవన సన్నాహక చర్యలు, అంశాలపై సమీక్ష చేశారు. దీనిలో కలెక్టర్తో పాటు డీఆర్ఓ ఏకా మురళి, సీపీఓ శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. రేవుల్లో పడవలు తిప్పుకొనేందుకు వేలం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణానది రేవుల్లో పడవలు, బల్లకట్టు తిప్పుకొనేందుకు గురువారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ అధ్యక్షతన సీల్డ్ టెండరు, బహిరంగ వేలం నిర్వహించారు. ఆరు రేవులకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు పడవలు, బల్లకట్టు తిప్పుకొనేందుకు హక్కుల కల్పిస్తూ సీల్డ్ టెండరు, బహిరంగ వేలంలో అచ్చంపేట, అమరావతి మండలాల్లోని నాలుగు రేవులను పాటదారులు దక్కించుకున్నారు. మాచవరం, కొల్లిపర మండలాల్లోని రేవులకు జరిగిన వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో వాటిని వాయిదా వేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్పై శిక్షణ తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని వివిధ రాష్ట్రాల అధికారులు గురువారం సందర్శించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్క్యాంపస్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్పై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాల నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్లు, ఆయా రాష్ట్రాల రెవెన్యూ అధికారులు విచ్చేశారని తెలిపారు. రేపీ ఎస్టీఎంఏ టెక్నికల్ ఎక్స్పర్ట్ తిరుమల కుమార్, కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ తనూజ, జీఐఎస్ ఎక్స్పర్ట్ హరీష్, ప్రాజెక్ట్ మేనేజర్లు బస్వంత్, కిషోర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
భవనాశికి గ్రహణం
భవనాశి మినీ రిజర్వాయర్కు గ్రహణం పట్టింది. ఎన్నికలకు ముందు అద్దంకిలో పర్యటించిన ప్రస్తుత మంత్రి నారా లోకేష్, నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లు అధికారంలోకి వస్తే పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదు.అద్దంకి: కూటమి ప్రభుత్వం తీరుతో 5 వేల ఎకరాల మెట్ట రైతులు సాగునీటి ఆశలు ఆవిరౌతున్నాయి. దానికి తోడు బడ్జెట్లో రిజర్వాయరు కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కేటాయించకపోవడంతో ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం లేదనేది తేటతెల్లం అయింది. బాపట్ల జిల్లాలోని శింగరకొండలో బ్రిటిష్ కాలంలో 250 ఎకరాల్లో భవనాశి చెరువు నిర్మాణం జరిగింది. ఈ చెరువు కింద ఇప్పటికీ హైలెల్, లో లెవెల్, ప్లగ్హోల్ కాలువల ద్వారా అద్దంకిలోని నర్రావారిపాలెం, వేలమూరిపాడు, మణికేశ్వరం, గోపాలపురం, చక్రాయపాలెం గ్రామాల్లోని 1197 ఎకరాల్లో మాగాణి సాగువుతోంది. గతంలో ఈ చెరువు పల్లంలో ఉండటంతో పరిసర గ్రామాల కొండలపై నుంచి వచ్చిన వర్షపు నీటితో కలకళలాడేది. పూడిక చేరడంతో నిల్వ సామర్థ్యం తగ్గడంతో సాగు అంతంతమాత్రంగా మారింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా భవనాశి చెరువుకు బల్లికురవ మండలంలోని వెలమవారిపాలెం దగ్గర గుండ్లకమ్మ నదిపై చెక్ డ్యామ్ నిర్మించి, ఆ నీటిని ఫీడర్ చానల్ ద్వారా చెరువుకు తరలించి మినీ రిజర్వాయరుగా మార్చాలని భావించారు. రూ.27 కోట్లు కేటాయించడంతో 2013లో పనులు మొదలయ్యాయి. తరువాత టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. పెరిగిన వ్యయం దీంతో ప్రాజెక్టు వ్యయం రూ.45 కోట్లకు పెంచారు. వెలమారిపాలెం వద్ద చెక్డ్యామ్, భవనాశి కట్ట ఎత్తు పెంచడం, భవనాశి చెరువుకు నీరు చేరే విధంగా నది నుంచి ఫీడర్ చానల్ నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం చెక్డ్యామ్, చెరువు కట్ట ఎత్తు పెంచే పనులు పూర్తి కాగా.. 12.6 కిలోమీటర్ల మేర తవ్వాల్సిన ఫీడర్ చానల్ పనులు మూడొంతులు మాత్రమే పూర్తయ్యాయి. అలాగే చెరువు విస్తరణ పనులు పూర్తి కాలేదు. ఫలితంగా ప్రస్తుతం కాంట్రాక్టర్ క్లోజింగ్ ఇవ్వాలని వేడుకోలుతోపాటు, ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, అవసరమైన భూమ సేకరణ కోసం మరో రూ. 40 కోట్లు అవసరం అవుతాయని ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో రూ.27 కోట్ల అంచనా పనులు ప్రస్తుతం వందకోట్లకు మించినా ఇది కలగానే మారిందని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రస్తుతం సాగువుతున్న 1197 ఎకరాలతోపాటు, తారకరామ ఎత్తిపోతల పథకానికి నీరు అంది, మొత్తం 5 వేల ఎకరాల మెట్ట భూములు మాగాణిగా మారతాయి. నెరవేరని మంత్రుల హామీలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తయితే ఐదు వేల ఎకరాలకు సాగు నీరు మినీ రిజర్వాయర్ నిర్మాణం జరిగేనా? -
వైఎస్సార్సీపీ నేతలపై దాడులను సహించం
చుండూరు(వేమూరు): వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేసినా, వారి గురించి అసభ్యకరంగా మాట్లాడినా సహించబోమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు హెచ్చరించారు. చుండూరు మండలంలోని మోదుకూరు గ్రామంలో బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు అనపు రెడ్డి రఘురామి రెడ్డి ఇంటిపై రాళ్లు విసిరి విచక్షణరహితంగా కొందరు ప్రవర్తించారన్నారు. రఘురామి రెడ్డి ఇంటికి గురువారం ఆయన వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదుకూరు గ్రామంలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. గంజాయి తాగి వైఎస్సార్సీపీ నాయకులపై కొందరు దాడులు చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకుల ఇళ్లపై రాళ్లు వేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచనలను వీడి, అందరూ కలిసి ఉండాలని కోరారు. తప్పు ఎవరు చేసినా అది తప్పేనని తెలిపారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కులం అనే ముసుగు వేయకూడదని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాని కోరారు. రఘురామి రెడ్డి ఇంటిపై రెండు సార్లు దాడులు చేయడాన్ని ఖండించారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు చేస్తే ఊరుకోబోమని చెప్పారు. నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు మండల పార్టీ అధ్యక్షుడి ఇంటిపై రాళ్లు విసిరిన దుండగులు సంఘటన స్థలం పరిశీలన అనంతరం బాధితుడికి అశోక్బాబు పరామర్శ -
ప్రజలను వంచించిన చంద్రబాబు
భట్టిప్రోలు (కొల్లూరు): ప్రజలను మోసగించడంలో చంద్రబాబు మాత్రమే అతిపెద్ద మోసగాడని బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం మండలంలోని అద్దేపల్లిలో ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమం వేమూరు నియోజకవర్గ స్థాయిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రజలను నిట్టనిలువునా మోసం చేస్తూ పథకాలను అమలు చేయకుండానే మభ్యపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయకుండానే ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు అబద్ధాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్చిన తరుణం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతాంగానికి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తానని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నేడు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనలో వరి రైతులకు ఉరి వేసకుని.. మిర్చి రైతులకు రైలు కింద పడి.. పొగాకు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తడం దురదృష్టకరమైన విషయమన్నారు. పంటలకు మద్దతు ధర ఇవ్వకుండా, ఇస్తానన్న పెట్టుబడి సాయం, ఇతర పథకాలు అందించకుండా సీఎం చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మేలు ఏంటో చెప్పాలని ఆయన నిలదీశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చేసిన సంక్షేమ పథకాల అమలును నేడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తెలియజేయడంతోపాటు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్కో కుటుంబానికి చేకూరిన లబ్ధి గురించి జగనన్న సైనికులందరూ ప్రతి గ్రామంలో వివరించాలని కోరారు. తద్వారా చంద్రబాబుపై యుద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు బాకీ పడుతున్న చంద్రబాబు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీర్చలేని బాకీ పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి ఇంటికీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లబ్ది చేకూరిస్తే, నేడు చంద్రబాబు ప్రజలను అప్పులపాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అబద్ధపు హామీలను మండలస్థాయి, గ్రామ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారపార్టీ నాయకులు కేసులు పెడతార్న భయాలు, అపోహలు వద్దని సూచించారు. ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తప్పుడు కేసులు పెడితే చివరకు పోలీసులపైనే ప్రయివేటు కేసులు పెట్టేందుకూ వెనుకాడే ప్రసక్తే లేదన్నారు. ఈ సందర్భంగా ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’పై ఆయన కార్యకర్తలు, నాయకులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ దావూరి లలితకుమారి, వైఎస్సార్ సీపీ జిల్లా స్థాయి నాయకులు కోగంటి లవకుమార్, హుసేన్, వైఎస్సార్ సీపీ భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, చుండూరు, అమృతలూరు మండల కన్వీనర్లు పడమట శ్రీనివాసరావు, దాది సుబ్బారావు, సుగ్గున మల్లేశ్వరరావు, అన్నపరెడ్డి రఘురామరెడ్డి, హేమచంద్ర శ్రీనివాసరావు, వేమూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొల్లిముంత ఏడుకొండలు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం మన బాధ్యత వైఎస్సార్ సీపీ కుటుంబం మొత్తం కలిసికట్టుగా పోరాటం చేయాలి బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీపై గ్రామ గ్రామాన ప్రచారం తక్షణ అవసరం కూటమి ప్రభుత్వంపై యుద్ధానికి ఇది తొలిమెట్టు వేమూరులో కార్యక్రమం ప్రారంభోత్సవంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పిలుపుప్రతిపక్ష నేతలపై వేధింపులతో సరి బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమటి మాధవరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టడం, జైలుకు పంపడం అనే సంతృప్తి మినహా ఏడాది పాలనలో చేసిందేమీ లేదన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలతో చివరకు ఆ పార్టీ కార్యకర్తలే విసిగి వేసారే పరిస్థితి వచ్చిందన్న విషయం పచ్చి నిజమన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాల వల్ల నేడు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆయనను తలచుకుంటున్నారని పేర్కొన్నారు. పాలిచ్చే గేదెను వదులుకొని పొడిచే దున్నపోతును తెచ్చుకున్నామన్న ఆలోచన ప్రజలతోపాటు టీడీపీ కార్యకర్తలలోనే ఉందని చెప్పారు. -
గృహ నిర్మాణంలో లక్ష్యాలను సాధించాలి
బాపట్ల: పక్కా గృహాల నిర్మాణాలలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ డీఈలు, ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో గురువారం ఆయన కలెక్టర్ చాంబర్లో దీనిపై సమీక్ష నిర్వహించారు. నిర్మాణాలలో పురోగతి లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాకు 8,299 పక్కా గృహాలను ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు 3,687 గృహాలే పూర్తి కావడంతో మండల స్థాయి అధికారులను కలెక్టర్ నిలదీశారు. దీనికి కారణాలపై ఆరా తీశారు. చార్జి మెమోలు ఇచ్చినా పనితీరులో మార్పు లేదని అసహనం వ్యక్తపరిచారు. గృహ నిర్మాణ శాఖలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో 17వ స్థానంలో ఉన్న జిల్లాను 23వ స్థానానికి దిగజార్చారని ఆయన మండిపడ్డారు. లక్ష్యాలను సాధించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, మండల ఈఈలు, డీఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
ఏకపక్ష వైఖరికి కత్తెర పడేనా?
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరగనున్న ఈ సమావేశానికి ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీలు, అధికారులకు జెడ్పీ నుంచి ముందస్తుగా సమాచారాన్ని పంపారు. గత మార్చి 15న కోరం లేకపోవడంతో వాయిదా పడిన సమావేశం మరలా ఇప్పటి వరకూ జరగలేదు. చైర్పర్సన్ ఏకపక్ష ధోరణిపై వ్యతిరేకత ప్రజల ఓట్లతో గెలిచిన జెడ్పీటీసీలకు సముచిత గౌరవాన్ని ఇవ్వకపోవడంతోపాటు ముందస్తు అనుమతుల పేరుతోనూ జెడ్పీ చైర్పర్సన్ నేరుగా సంతకాలు చేసి పనులు చేస్తున్న ధోరణికి వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు మార్చి 15న ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించారు. టీడీపీ ఎమ్మెల్యేల సిఫార్సులతో, అత్యవసర పనుల పేరుతో రూ.కోట్ల విలువైన పనులకు ముందస్తు అనుమతులు ఇస్తున్న తీరును ఖండించారు. వాటిలో కమీషన్లు, పర్సంటేజీ తీసుకుని అవినీతి, అక్రమాలతో జెడ్పీని నడుపుతున్నారని ఆరోపణాస్త్రాలు సంధించారు. మార్చిలో ఏర్పాటు చేసిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆర్థిక సంవత్సర బడ్జెట్న ఆమోదించాల్సి ఉండటంతోపాటు రూ.12 కోట్ల విలువైన పనులకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ముందస్తు అనుమతులను ఇచ్చేయడంతో సమావేశానికి హాజరైన పక్షంలో సభ్యులు అంగీకారం తెలిపినట్లవుతుందనే కోణంలో గైర్హాజరయ్యారు. తద్వారా జెడ్పీటీసీలు తమ హక్కులను పరిరక్షించుకోవడంలో సఫలీకృతమయ్యారు. అజెండాలో ‘రూ.22 కోట్ల విలువైన పనులు’ చైర్పర్సన్ వైఖరితో జెడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. తాము గెలిచీ ప్రయోజనమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. చైర్పర్సన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్చి 15న బడ్జెట్ సమావేశానికి గైర్హాజరు కావడంతో, అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపి ఆమోదింపజేసుకున్న పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో జెడ్పీటీసీలకు తెలియకుండా ముందస్తు అనుమతుల పేరుతో రూ.12 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చేశారు. తాజా సమావేశంలో మరో రూ.10 కోట్ల మేరకు ముందస్తు అనుమతులు ఇచ్చారు. మొత్తం రూ.22 కోట్ల పనులను ఆమోదం కోసం శుక్రవారం జరగనున్న సర్వసభ్య సమావేశపు అజెండాలో పొందుపర్చారు. చైర్పర్సన్ ‘నిధుల మంజూరు’ ధోరణిపై వైఎస్సార్ సీపీ సభ్యుల తీవ్ర అసంతృప్తి ఆమోదం కోసం నేటి సర్వసభ్య సమావేశం అజెండాలో పొందుపరిచిన అధికారులు -
ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు
భట్టిప్రోలు(కొల్లూరు): ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే ఎటువంటి విచారణ లేకుండానే నేరుగా కోర్టుకు హాజరుపరుస్తామని మైనింగ్ శాఖ ఏజీఎం పి.ఫణిరాజ్ కుమార్ సింహ హెచ్చరించారు. గురువారం మండలంలోని ఓలేరులో కొన్ని నెలల క్రితం అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఆదేశాలతో మైనింగ్, రెవెన్యు శాఖాధికారులు విచారణ చేపట్టారు. ఇసుక తవ్వకాలు చేపట్టిన ఓలేరు ఉచిత ఇసుక క్వారీని మైనింగ్ శాఖ ఏజీఎం పరిశీలించి గ్రామస్తులను విచారించి వారి నుంచి వివరాలు సేకరించారు. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా వాటిల్లుతున్న ముప్పును గ్రామస్తులు వివరించడంతో ఆయా అంశాలను నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ, తమ పరిశీలనలో వెలుగుచూసిన అంశాలను కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిపారు. మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ కె.స్నేహ, తహసీల్దార్ మేక శ్రీనివాసరావు, ఎస్ఐ ఎం.శివయ్య ఉన్నారు. విచారణ లేకుండానే నేరుగా కోర్టుకు హాజరుపరుస్తాం మైనింగ్ శాఖ ఏజీఎం ఫణిరాజ్ కుమార్ సింహ -
‘నల్లబర్లీ’ పూర్తిగా కొనాల్సిందే..!
జె.పంగులూరు: ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తున్న రైతుల వద్ద ఉన్న నల్లబర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేయాలని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాయిణి వినోద్బాబు డిమాండ్ చేశారు. పంగులూరులోని మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసిన నల్లబర్లీ కొనుగోలు కేంద్రాన్ని గురువారం రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు పరిశీలించారు. అక్కడ ఉన్న రైతుల వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ సందర్భంగా రామారావు, వినోద్బాబులు మాట్లాడుతూ నిబంధనల పేరుతో పొగాకు చెక్కులను వెనక్కి పంపటం మానుకోవాలని, రైతులు తెచ్చిన పొగాకు చెక్కులు మొత్తం ఆలస్యం చేయకుండా కొనాలని కోరారు. రైతులు అనేక వ్యయప్రయాసలకు ఓర్చి పొగాకు చెక్కులు కొనుగోలు కేంద్రానికి తీసుకొని వస్తే, ఇక్కడ నిబంధనల పేరుతో చెక్కులు వెనక్కి పంపుతున్నారని మండి పడ్డారు. మంచి గ్రేడ్ ఉన్న పొగాకు కూడా తక్కువ ధర వేస్తున్నారన్నారు. వెనక్కి పంపితే మరింత భారం.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న పొగాకు చివరి ఆకు కూడా కొంటామని చెబుతోందని, కానీ కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న నిబంధనలు రైతులకు మేలు చేసేవిగా లేవన్నారు. రైతులు గత నాలుగు నెలలు నుంచి తమ పంటను అమ్ముకోవాలని చూశారన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చి తమ పేరు రాగానే చెక్కులు తీసుకొని మార్కెట్ యార్డు వద్దకు రాగా వివిధ కారణాలతో సగానికి సగం చెక్కులు వెనక్కి పంపుతున్నారని ఆరోపించారు. గ్రేడ్ చేసుకొన్ని చెక్కులు తీసుకొని వస్తే, మళ్లీ వాటిని వెనక్కి పంపుతున్నారని, తిరిగి వాటిని గ్రేడ్ చేసి చెక్కులు తొక్కితే రైతులకు మరింత భారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు నష్టపోకుండా మేలు చేసేవిధంగా చూడాలన్నారు. పొగాకు నాణ్యతను బట్టి మూడు గ్రేడ్లు చేసిన, ధరలు మాత్రం అతి తక్కువగా వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ సింగారావు దృష్టికి వియాన్ని తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో రైతులు గుడిపాటి మల్లారెడ్డి, తానికొండ సుధాకర్, తలపనేని స్వామి, రావెళ్ల ఉమామహేశ్వరరావు, చుక్కా కాంతయ్య, మదాల సాంబశివరావు, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. నిబంధనల పేరుతో పొగాకు చెక్కులను వెనక్కి పంపితే సహించం ప్రభుత్వం వ్యాపార పరంగా కాకుండా, రైతులకు మేలు జరిగేలా కొనాలి రైతు సంఘం నాయకుల డిమాండ్ -
నేడు ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’పై సమావేశం
రేపల్లె: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టినట్లు వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ తెలిపారు. గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను దగా చేసిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేసేందుకు ‘రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ పేరుతో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి మాజీ మంత్రి, పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హాజరవుతారన్నారు. సమావేశానికి నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు. రేపు చీరాలలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ చీరాల: రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేయడంపై పార్టీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు గురువారం తెలిపారు. చీరాల మండలం రామకృష్ణాపురంలోని క్యాంపు కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం 3గంటలకు జరిగే కార్యక్రమానికి ఎమ్మెల్సీ, జిల్లా పరిశీలకులు తూమాటి మాధవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున హాజరవుతారన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, చీరాల, వేటపాలెం మండలాల, పట్టణ అధ్యక్షులు, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ మెంబర్లు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. రేపు ఇంకొల్లులో నియోజకవర్గ స్థాయి సమావేశం పర్చూరు(చినగంజాం): బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ నియోజకవర్గ స్థాయి కార్యక్రమం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని ఇన్చార్జ్ గాదె మధుసూదనరెడ్డి అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు పర్చూరు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పాల్గొనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మండల కన్వీనర్లు మాజీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అనుబంధ విభాగం అధ్యక్షుడు వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. -
భూగర్భ జల శాఖ ఏడీఏగా జి.సురేష్
బాపట్ల: భూగర్భ జల శాఖ సహాయ సంచాలకులుగా జి.సురేష్ గురువారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్.జె.వెంకట మురళిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఇప్పటివరకు ఇక్కడ సహాయ సంచాలకులుగా పనిచేసిన కె.రామబాలాజీ పల్నాడు జిల్లాకు బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా నుంచి పదోన్నతితో బదిలీపై వచ్చిన సురేష్కు అధికారులు, కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్యంగా పనిచేయాలి చీరాల: నియోజకవర్గ అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, సహజ వనరులపై దృష్టి, స్వర్ణాంధ్ర –2047 ఉద్దేశమని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో విజన్ ప్లాన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, సేవారంగం విస్తరిస్తేనే ఆదాయం ఎక్కువగా వస్తుందన్నారు. భవిష్యత్తులో అదే కీలకమన్నారు. విజన్ ప్లాన్పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు అంశాలపై మాట్లాడారు. ఆర్డీఓ టి.చంద్రశేఖర్ నాయుడు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, తహసీల్దార్ గోపీకృష్ణ, ఎంపీడీఓ శివసుబ్రహ్మణ్యం, అధికారులు పాల్గొన్నారు. బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి వేమూరు: మద్యం బెల్టు షాపుల నిర్వాహకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కె.హేమంత్ నాగరాజు అన్నారు. మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయం గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని మద్య షాపుల నిర్వాహకులు సమయ పాలన పాటించాలన్నారు. మద్యం ప్రభుత్వం ధరలకు విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని కోరారు. సీఐ రవి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆస్తుల కోసం శవ పంచాయితీ
జె. పంగులూరు: మానవత్వం మంటగలిసింది. ఆస్తి పాస్తులకు ఉన్న విలువ మనిషికి లేదని మరోసారి నిరూపితమైంది. ఆస్తుల కోసం మృత దేహాన్ని ఇంటి ముందు పెట్టి, ఆస్తి పంచాయితీ కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లిన సంఘటన కలచి వేసింది. వివరాలు.. మండలంలోని రామకూరు గ్రామానికి చెందిన ఎర్రిబోయిన సురేష్ వారం రోజుల క్రితం గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంఘటన పాఠకులకు తెలిసిందే.. కాగా మృత దేహానికి పోస్ట్మార్టం చేయించి మంగళవారం అప్పగించారు. అయితే అతని అంత్యక్రియలను భార్యతో పాటు, భార్య బంధువులు అడ్డుకున్నారు. సురేష్ తండ్రి అంజియ్య ఆస్తి పంపకాలు జరపలేదని, ఆస్తి పంచి.. సురేష్ భార్య తిరపతమ్మకు, ఆమె పిల్లలకు రాసి ఇచ్చేవరకు మృతదేహాన్ని కదిలించడానికి వీలు లేదని తెగేసి చెప్పడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. మృతుడు సురేష్ తండ్రి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు జరిగాయి. మనుమలు, మనువరాళ్లు కూడా పెద్దవారయ్యారు. అయితే వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ అంజయ్య ఆస్తిని కుమారులకు పంచేందుకు అంగీకరించలేదు. దీంతో మంగళవారం నుంచి గురువారం వరకు రెండు రోజుల పాటు కుటుంబ సభ్యులకు, బంధువులకు వాగ్వాదం, గొడవలు జరిగాయి. చివరికి గురువారం మధ్యాహ్నం రేణింగవరం పోలీస్ స్టేషన్కు పంచాయితీ చేరింది. అక్కడ ఎస్ఐ వినోద్బాబు ఇరువర్గాలతో మాట్లాడి రాజీ కుదర్చేందుకు సాయంత్రం 4 గంటలు అయింది. పోలీస్ స్టేషన్ వద్దే పత్రాలు రాసుకుని బంధువులు, కుటుంబ సభ్యులు రామకూరు చేరి.. అంత్యక్రియలు నిర్వహించారు. ఆస్తులు పంచకుండా తమ దగ్గరే ఉంచుకొని, వృద్ధాప్యంలో కూడా తన పెత్తనమే చెల్లాలని ఒక వ్యక్తి చేసిన ప్రయత్నానికి ఓ కుటుంబలోని నాలుగు ప్రాణాలు బలైపోయిన ఘటన కూడా రామకూరు గ్రామంలోనే జరిగింది. ఇప్పుడు ఆస్తి కోసం అంత్యక్రియలు కూడా అడ్డుకున్న ఘటన కూడా ఇదే గ్రామంలో జరగడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియలు అడ్డుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు -
జాతీయ సమ్మెను జయప్రదం చేయండి
అద్దంకి: దేశవ్యాప్తంగా వాపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 9న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకుడు తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్ ఆవరణలో బుధవారం జాతీయ సమ్మె పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. సమావేశం కేఎల్డీ ప్రసాద్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ సమ్మెలో అన్ని ట్రేడ్ యూనియన్లు, ఎల్ఐసీ, కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు కలిసి సమ్మె చేస్తున్నట్లు వెల్లడించారు. కె.రఘుచంద్ మాట్లాడుతూ సమ్మెలో అందరూ పాలు పంచుకుని జయప్రదం చేయాలని కోరారు. ఉరి వేసుకుని మహిళ మృతి అద్దంకి రూరల్: కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల వద్ద చోటు చేసుకుంది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. నూజిళ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన మరియకుమారి (35) అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల్లో పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ కలహాలా.. లేదా ఇతర కారణాలనే అనే విషయం తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
పునీత థామస్వారి అడుగుజాడల్లో నడవాలి
తుమృకోట(రెంటచింతల): క్రీస్తు సూక్తులను నిత్యం ఆచరిస్తూ పునీత థామస్వారు క్రైస్తవులకు ఆదర్శంగా నిలిచారని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలలో నడిచి సమాజంలో నిజమైన క్రైస్తవులుగా జీవించాలని రెవ.ఫాదర్ ఎం.రాజరత్నం అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలో నున్న పునీత థామస్వారి చర్చి 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విచారణ గురువులు మాలై పవిత్రన్ ఆధ్వర్యంలో రెవ.ఫాదర్ కొణతం ఎలీషారాజుతో కలిసి సమష్టి దివ్యపూజాబలి సమర్పించి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పల్నాడు ప్రాంతంలోనే తుమృకోట చర్చి అతి పురాతనమైందన్నారు. అపోస్తులు 12 మందిలో ఒకరైన థామస్ వారు భారతదేశంలో మొట్టమొదటిసారి క్రీస్తు సువార్తను ప్రచారం చేశారని గుర్తుచేశారు. భక్తులకు పులిహార పంపిణీ చేశారు. పెద్దలు అశోక్, మల్లి, దుగ్గింపూడి శౌరి రాయపురెడ్డి, రెంటచింతల కానుకమాత చర్చి దళ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రెవ.ఫాదర్ రాజరత్నం వైభవంగా పునీత థామస్వారి చర్చి 125వ వార్షికోత్సవం -
సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం
రేపల్లె: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కార్మికులు గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మణిలాల్ మాట్లాడుతూ కార్మికుల వేతనాలు పెంచాలని, సమస్యలను పరిష్కరించాలని గత 15 రోజుల నుంచి శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. 4వ తేదీ నుంచి సమ్మెలో భాగంగా అత్యవసర సేవలైన నీటి, విద్యుత్ సరఫరా విధులలో కార్మికులు సైతం తమ సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ రేపల్లె అధ్యక్షుడు ప్రభాకరరావు, కార్యదర్శి రవిబాబు, కోశాధికారి రాఘవేంద్రరావు, సభ్యులు యువరాజు, రవి, ప్రభాకర్, అనూష, గీత తదితరులు పాల్గొన్నారు. సీపీఎం పట్టణ కార్యదర్శి మణిలాల్ -
శింగరకొండ విచ్చేసిన పీఠాధిపతులు
అద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ దేవస్థానానికి గురువారం అయోధ్య జానకి ఘాట్ జయ శరణ్ జీ మహరాజ్, అయోధ్య విశ్వకుటుంబ ఆకార పీఠం ట్రస్ట్ చీఫ్ సూర్యప్రకాష్ సరస్వతి రుద్రదిండి, చినమస్తాన్దేవి పీఠాధిపతులు, మహా మండేశ్వరీ పద్మావతి, నారాయణ ప్రత్యంగి మహాదేవి విచ్చేశారు. దేవస్థాన అర్చకులు పీఠాధిపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శింగరకొండలో గల హరహర గోశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పీరాధిపతులు మాట్లాడుతూ హిందువులందరూ గోమాతను పూజించాలన్నారు. గోశాల సుబ్బారావు బృందం పీఠాధిపతులను సన్మానించారు. తదుపరి అద్దంకి పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, పోలేరమ్మ దేవాలయం, కాళికా కమఠేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట విశ్వ కుటుంబ ధర్మ పరిరక్షణ అఖారా ఆంధ్రప్రదేశ్ వైస్ చైర్మన్ వాకా వెంకట బాలగంగాధర్, చావా రామకృష్ణ, యామర్తి వెంకటేశ్వర్లు, అంకం నాగరాజు, గోశాల సుబ్బారావు, చెన్నుపల్లి శ్రీనివాసాచారి, పాపారావు, బ్రహ్మనందం, తదితరులున్నారు. -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
తాడికొండ: పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల ఒకటో తేదీ నుంచి 90 రోజుల పాటు నిర్వహిస్తున్న దేశవ్యాప్త మధ్యవర్తిత్వ క్యాంపైన్ను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ (డిస్ట్రిక్టు అండ్ సెషన్స్ జడ్జి) బీఎస్వీ హిమబిందు విజ్ఞప్తి చేశారు. సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 5న నిర్వహించే 2వ జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బుధవారం రాష్ట్ర సచివాలయం సమీపంలోని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ.... జూలైలో పరిష్కరించదగ్గ కేసులను గుర్తించి, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శిక్షణ పొందిన దాదాపు 893 మంది విశ్రాంత న్యాయమూర్తులు, సమాజ సేవకులు, న్యాయవాదులకు ఆయా కేసులను అప్పగించనున్నట్లు చెప్పారు. మధ్యవర్తిత్వం ద్వారా లేదా లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు ఇరువురూ లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. రాజీపడ దగ్గ కేసులు రాష్ట్రంలో మొత్తం 1,15,071 ఉన్నట్లు గుర్తించారని తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఉప కార్యదర్శి డాక్టర్ హెచ్ అమర రంగేశ్వర రావు మాట్లాడుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ప్యాటర్న్ ఇన్ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ రవీనాథ్ తిలహరి సూచనల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. సహాయ కార్యదర్శి ఎన్జే రావు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీ బీఎస్వీ హిమబిందు -
రైళ్లలో పోలీసుల విస్తృత తనిఖీలు
గంజాయి చాక్లెట్ల బ్యాగు గుర్తించిన పోలీస్ జాగిలం తెనాలి రూరల్: తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తెనాలి మీదుగా ప్రయాణించే పలు రైళ్లలో సోదాలు చేశారు. గుంటూరు మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ డి. శ్రీనివాస్ రెడ్డి, తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్. రమేష్బాబు, ఎస్ఐలు డి. రామకృష్ణ, ఎం. లక్ష్మీనారాయణరెడ్డి, ఎన్. ప్రకాశరావు, ఈగల్ టీమ్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డాగ్ స్క్వాడ్(మార్షల్)తో తనిఖీలు చేపట్టి అనుమానితులను విచారించారు. అనుమానాస్పదంగా ఉన్న బ్యాగును పోలీసు జాగిలం గుర్తించగా, తనిఖీ చేయడంతో గంజాయితో తయారు చేసిన చాక్లెట్లు లభించాయి. బ్యాగును స్వాధీనం చేసుకుని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ నుంచి తెనాలి వరకు రన్నింగ్ రైళ్లలో తనిఖీలు చేపట్టామని చెప్పారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.