Bapatla
-
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
చుండూరు(వేమూరు): డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 6వ తేదీ వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీన ఉంటాయని తెలిపారు. మార్కుల శాతం, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని తెలిపారు. జోరుగా పొట్టేళ్ల పందేలు మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో నిషేధిత కోడి పందేలు, పొట్టేళ్ల పోటీలు జోరుగా సాగుతున్నాయి. తమ్మవరంలో మంగళవారం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. నెల్లూరు, భీమవరం నుంచి తెప్పించిన పొట్టేళ్లతో స్థానిక నాయకులు బరులు ఏర్పాటు చేశారు. భారీ మొత్తంలో పందేలు వేశారు. పోలీసులు సైతం కన్నెత్తి కూడా చూడలేదు. యర్రబాలెం, అనమనమూరు తమ్మవరం గ్రామాల్లో నిత్యం కోడి పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వీటిని అరికట్టాలని కోరుతున్నారు. హైవేలో ప్రమాద స్థలాల పరిశీలన రొంపిచర్ల: పల్నాడు జిల్లాలోని శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మంగళవారం పర్యటించింది. దాచేపల్లి టోల్గేట్ వద్ద నుండి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు ఉన్న రాష్ట్ర రహదారిలోని ప్రమాద స్థలాలను బృందం పరిశీలించింది. ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రత్యేక ప్రాంతాలను పరిశీలించి, ప్రమాదాలకు గల కారణాలను వారు పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో రొంపిచర్ల ఎస్ఐ మణికృష్ణతో పాటు ఎంఐఈ అధికారులు, హైవే అధికారులు, జిల్లా ఎస్పీ నియమించిన ప్రత్యేక పోలీస్ బృందం అధికారులు ఉన్నారు. -
గుడారాల పండుగకు ఏర్పాట్లు
అమరావతి: హోసన్న మందిరం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే గుడారాల పండుగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్ల గ్రామంలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించాలని హోసన్న మందిరం పెద్దలు నిర్ణయించారని పాస్టర్ అనీల్ తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాట్ల గురించి వివరిస్తూ హోసన్న మందిరం వ్యవస్థాపకులు హోసన్న మొదటి చర్చి లేమల్లె గ్రామంలో నిర్మాణం చేసినందు వల్ల ఈ పవిత్ర ప్రదేశంలో 18వ గుడారాల పండుగ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మార్చి 6వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ మధ్యాహ్నం వరకు గుడారాల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇచ్చే లక్షలాది మంది హోసన్నా విశ్వాసులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు వెయ్యికి పైగా మరుగుదొడ్లు, వచ్చిన విశ్వాసులందరికీ భోజన వసతి, పార్కింగ్తో పాటుగా వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సుమారుగా పదివేల మంది వలంటీర్లు పనిచేస్తారని అలాగే పోలీసు శాఖ వారి సహకారం తీసుకుంటామన్నారు. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి నుంచి గుడారాల పండుగ వేదిక వద్దకు ప్రత్యేక బస్సులు అర్టీసీ వారు నడుపుతారన్నారు. అనకాపల్లి నుండి భీమవరం మీదగా ఆ గుడారాల పండుగకు ప్రత్యేక రైతులు విశ్వాసులు తరలివస్తారన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే కాక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుండి భక్తులు లక్షలాది మంది ఈ పండుగకు తరలి వస్తాన్నారు. ప్రార్ధన వేదిక, ప్రార్ధన మందిరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. హోసన్నా మందిరంకు సుమారు 20ఎకరాల భూమి ఉండగా మిగిలినది రైతుల నుంచి సుమారు వంద ఎకరాలు లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుడారాల పండుగకు వచ్చు వీఐపీలకు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. -
విద్యుత్ తీగలు తగిలి రైతుకు తీవ్రగాయాలు
ఈపూరు(శావల్యాపురం): మండలంలోని బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన రైతు చీదా సుబ్బారావు తాను సాగు చేసిన కంది పంటకి కాపలాగా వెళ్ళి పంట పొలాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఎస్సై ఎం.ఉమామహేశ్వర రావు కథనం ప్రకారం.. చీదా సుబ్బారావుకు చెందిన కంది పొలం భధ్రుపాలెం–ముప్పాళ్ళ గ్రామాల మధ్య ఉంది. అయితే అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గమనించని చీదా సుబ్బారావు బహిర్భూమికి వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలి సంఘటన స్థలంలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంత సమయం గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చి పడుతూ లేస్తూ వెళ్ళగా ఆ చుట్టుపక్కల పొలంలో ఉన్న రైతు ఆంజనేయులు గమనించి జరిగిన సంఘటన గురించి సెల్ఫోను ద్వారా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సుబ్బారావుకు విద్యుత్తీగలు తగిలి తలకు, కాలికి శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వినుకొండ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యసేవలు నిమిత్తం గుంటూరు తరలించారని ఎస్సై తెలిపారు. క్షతగాత్రుడిని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. -
27న ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 27న జరగనున్న నేపథ్యంలో ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు వినియోగించుకోవచ్చని జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ షేక్.ఖాజావలి మంగళవారం తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ప్రైవేటు ఉద్యోగులకు యాజమాన్యాలు అనుమతివ్వాలని సూచించారు. ప్రకృతి సేద్య ఖరీఫ్ కార్యాచరణపై అవగాహన కల్పించండి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ప్రకృతి సేద్యం చేస్తున్న గ్రామ సంఘాల్లోని రైతులకు ఖరీఫ్ కార్యాచరణపై అవగాహన నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ చెప్పారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశపు హాలులో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడారు. ఖరీఫ్ కార్యాచరణ అమలుకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక, డీఆర్డీఏ శాఖలు ఏపీసీఎన్ఎఫ్ సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ప్రగతి, ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీంద్ర బాబు, డీఆర్డీఏ పీడీ విజయ లక్ష్మి, జిల్లా పశు సంవర్ధక అధికారి నరసింహారావు మాట్లాడుతూ కార్యాచరణ విజయవంతానికి కృషి చేస్తామన్నారు. రైతులు వట్టిచెరుకూరు ధనుంజయరావు, అత్తోట బాపయ్య, ఎరుకులపూడి విజయలక్ష్మి ప్రకృతి వ్యవసాయంలో తమ అనుభవాలను పంచుకున్నారు. ఇఫ్కో కొత్త ఎరువు మార్కెట్లోకి విడుదల కొరిటెపాడు(గుంటూరు): ఇఫ్కో వారు నూతనంగా తయారు చేసిన 28ః28ః0 అనే కాంప్లెక్స్ ఎరువును జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు మంగళవారం గుంటూరు రూరల్ మండలం, రెడ్డిపాలెం గూడ్స్షెడ్ వద్ద మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 28ః28ః0 ఇఫ్కో వారు తెప్పించడం ఆనందంగా ఉందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎరువుల విభాగం ఏడీఏ కేజేడీ రాజన్, గుంటూరు ఏడీఏ తోటకూర శ్రీనివాసరావు, డీసీఎంఎస్ జిల్లా బిజినెస్ మేనేజర్ డి.హరిగోపాలం, కొల్లిపర ఏఓ వెంకట్రావు, ఇఫ్కో జిల్లా మేనేజర్ రఘు తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు చైన్స్నాచర్లు అరెస్టు
బంగారం, నగదు స్వాధీనం నరసరావుపేట రూరల్: జిల్లాలోని పలుచోట్ల చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ పి.రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టుకున్న నిందితులతో హాజరై వివరాలను వెల్లడించారు. యడ్లపాడు మండలం చెంఘీజ్ఖాన్పేటకు చెందిన పోతురాజు బాలకృష్ణ, యద్దల నరేంద్రసాయిలను అరెస్టు చేశామన్నారు. వీరు పగలు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బయట, ఇళ్లల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయిస్తుంటారన్నారు. గతేడాది సెప్టెంబరు 15న నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో సాయంత్రం సమయంలో ఊరిచివర గంగమ్మ దేవాలయం వద్ద సిమెంట్బల్లపై కూర్చోని ఉన్న దేవిశెట్టి లక్ష్మమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వాహనంపై వేగంగా పారిపోయారన్నారు. పెదకూరపాడు, ముప్పాళ్ల మండలం తొండపి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామాల్లో కూడా ఒంటరి మహిళలపై దాడులు చేసి బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారన్నారు. ఈ నేరాలపై దేవిశెట్టి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్కేటీ బైపాస్ వద్ద ఇరువురిని అరెస్టుచేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. -
రెంటచింతలలో దొంగలు హల్చల్
రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. పలు ప్రాంతాల్లోని రెండు ఇళ్లల్లో తాళాలు పగలుగొట్టి చోరీలకు పాల్పడ్డారు. గ్రామంలోని ఆరోగ్యనాథుని మందిరం వద్దనున్న ఆదూరి ఇన్నారెడ్డి నాలుగు రోజుల కొందట వెళంగిని వెళ్లగా ఆయన భార్య రజని కొంతకాలంగా గుంటూరులోని మనవరాళ్ల వద్దకు వెళ్లి ఉంటోంది. మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఇన్నారెడ్డి విత్తనాల షాపులో పనిచేసే సాగర్ వచ్చి చూడగా ఇంటికి వేసిన తాళాన్ని గ్యాస్ కట్టర్తో కోసి ఇంట్లోని బీరువాను, ఇనుపపెట్టెను పగలగొట్టి వస్తువులను చెల్లాచెదురుగా పడవేసిన విషయాన్ని ఇన్నారెడ్డికి తెలిపారు. బీరువా, ఇనుపపెట్టెలో దాచిన 75 గ్రాములు బంగారు వస్తువులు, రూ.70 వేల నగదు అపహరణకు గురైనట్లు ఇన్నారెడ్డి పోలీసులకు వివరించారు. వెండి కిరీటాలు, చిన్నచిన్న వెండి వస్తువులను దొంగలు అక్కడే వదిలి వెళ్లినట్లు తెలిపారు. అలాగే స్థానిక రామాలయం వద్ద ఉంటున్న తాళ్ళూరి సాంబశివరావు భార్యతో కలిసి ఈ నెల 14న హైదరాబాద్లోని కుమారుడి వద్దకు వెళ్లి మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో బీరువాను తెరిచి దానిలో నున్న రూ.1 లక్ష నగదుతో పాటు రెండు బంగారు చెవి దిద్దులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాలను ఎస్ఐ సీహెచ్ నాగార్జున సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రెండు, మూడు రోజుల పాటు ఇల్లు విడిచి పొరుగు గ్రామానికి వెళ్లే సమయంలో స్థానిక పోలీసు స్టేషన్లో తెలియ చేయాలని తెలిపారు. రెండు ఇళ్లల్లో చోరీ బంగారం, నగదు అపహరణ -
మెడికల్ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకం
మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల: గత ప్రభుత్వ హయాంలో రూ. 505 కోట్ల నిధులతో మంజూరైన బాపట్ల మెడికల్ కళాశాల భవిష్యత్తును కూటమి ప్రభుత్వం ప్రశ్నార్ధకంగా మార్చడం దారుణమని, అసలు ఏం చేయబోతున్నారో కూడా ఎవరికీ తెలియడం లేదని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. మంగళవారం తనను కలిసిన విలేకరులతో కోన మాట్లాడారు. అసాధ్యమని భావించిన అనేక పనులను వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పూర్తిచేసి బాపట్ల వాసులకు అందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొన్ని కొత్త జిల్లాల కేంద్రాలు (హెడ్ క్వార్టర్స్) ఒక ప్రాంతంలో ఉండగా, మెడికల్ కళాశాలలు మరో ప్రాంతానికి మంజూరయ్యాయని, బాపట్లకి మాత్రం జిల్లా కేంద్రం, మెడికల్ కళాశాల రెండింటినీ తీసుకువచ్చామని, ఈ అభివృద్ధిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకుల మీద ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో కొన్ని మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయనుండటం పట్ల అభ్యంతరం తెలిపారు. బాపట్ల మెడికల్ కళాశాలపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కళాశాల నిర్మాణంలో ఎంతో క్లిష్టమైన భూసేకరణ, పునాదులకు సంబంధించిన పనులను తమ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చేపట్టిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాల విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయరాదని సూచించారు. బాపట్లలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. చింతపల్లి మేజర్కుసాగునీరు విడుదలఅచ్చంపేట: మండలంలోని కొండూరు పంచాయతీ పరిధిలోని శ్రీనివాసతండా వద్ద నాగార్జున సాగర్ కాలువల ద్వారా చింతపల్లి మేజర్కు సాగునీటి అవసరాలకు కెనాన్స్ ఏఈ చిల్కా భాస్కర్ ఆదేశాలతో మంగళవారం సాగునీటిని వదిలారు. చింతపల్లి మేజర్ కాలువ కింద ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న, పొగాకు తదితర పంటలు వేశారు. ఈ కాలువకు నీళ్లు రాకపోవడంతో రైతులు గత కొద్దికాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచే కస్తల మేజర్కు సాగునీటిని వదిలిన అధికారులు చింతపల్లి మేజర్కు వదలకపోవడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అధికారులు శ్రీనివాసతండా నుంచి ఐదు రోజులు కస్తల మేజర్కు, ఐదు రోజులు కస్తల మేజర్కు సాగునీటిని మార్చి మార్చి వదిలే విధంగా ఆదేశాలు జారీ చేశారు. అమరేశ్వరుని సేవలో క్యాట్ న్యాయమూర్తి అమరావతి: ప్రముఖ శైవ క్షేత్రం అమరావతిలో వేంచేసియున్న శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరుని మంగళవారం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(క్యాట్) న్యాయమూర్తి లతా భరద్వాజ్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు న్యాయమూర్తికి స్వాగతం పలికారు. అమరేశ్వరునికి, బాలచాముండేశ్వరీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట క్యాట్ మెంబర్ వరణ్సింధు కౌముది, అధికారులు ఉన్నారు. కాలువలో కారు బోల్తా అమర్తలూరు(వేమూరు): ఇంటూరు కాల్వలో కారు బోల్తా పడిన ఘటన మంగళవారం జరిగింది. అమర్తలూరు పోలీసుల కథనం మేరకు గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగే శుభ కార్యక్రమానికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. ఈక్రమంలో ఉదయం 6.30 నిమిషాలకు ఇంటూరు నుంచి చెరుకుపల్లి వెళ్లే దారిలో లారీని క్రాస్ చేస్తుండగా అదుపు తప్పి కారు ఇంటూరు కాల్వలో పడింది. అందులోఉన్న వారికి స్వల్ప గాయాలు కావడంతో చెరుకుపల్లిలో ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొంది, రేపల్లె వెళ్లినట్లు ఎస్ఐ జానకి అమర్ వర్థన్ తెలిపారు. -
శిడి బండి సంబరం
వైభవం.. ఉయ్యూరు: అశేష భక్తజన కోలాహలం.. సన్నాయి మేళాల జోరు, డప్పు వాయిద్యాల హోరు.. జై వీరమ్మ.. జైజై వీరమ్మ భక్తజన నినాదాల నడుమ.. శిడిబండి ఊరేగింపు కనుల పండువగా సాగింది. పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్యకిరణ్ శిడిబుట్టలో కూర్చున్న ఉత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. పారుపూడి, నెరుసు వంశస్తులు మూడు సార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. నయనానందకరంగా.. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో 11వ రోజు నిర్వహించే ప్రధాన ఘట్టమైన శిడిబండి వేడుక మంగళవారం నయనానందకరంగా సాగింది. పాత వాటర్ ట్యాంకు రోడ్డులో ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండికి స్థానికులు పసుపునీళ్లు ఓరబోసి గుమ్మడికాయలు కట్టి, కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఊరేగింపుగా బయలుదేరిన శిడిబండికి దారిపొడవునా భక్తులు పువ్వులు విసురుతూ పసుపునీళ్లు ఓరబోస్తూ హారతులు పట్టారు. పూలదండలు, గుమ్మడికాయలను శిడిబండికి కట్టి భక్తిపారవశ్యం చెందారు. కాలేజ్ రోడ్డు, ప్రధాన రహదారి వెంబడి సాగిన ఊరేగింపులో అశేష భక్తజనం పాల్గొని తన్మయత్వం చెందారు. శిడిబుట్టలో కూర్చున్న పెళ్లి కుమారుడు.. సంప్రదాయం ప్రకారం ఉయ్యూరు దళితవాడ నుంచి పెళ్లి కుమారుడు ఉయ్యూరు మౌర్య కిరణ్ ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మౌర్య కిరణ్ను శిడి బుట్టలో కూర్చోబెట్టి ఆలయ ప్రదక్షిణ చేయించారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా శిడిబండిని నిలిపి మూడుసార్లు శిడి ఆడించటంతో ఉత్సవం ముగిసింది. శిడి ఆడే సమయంలో భక్తులు అరటికాయలు విసురుతూ భక్తిపారవశ్యం చెందారు. వేడుక అనంతరం పెళ్లి కుమారుడితో పాటు ఉయ్యూరు వంశస్తులు, బంధువులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. గన్నవరం డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో 300 మంది సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఉత్సవానికి పోటెత్తిన భక్తజనం -
ఇంజినీ‘రింగ్ రింగ’
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): ఇంజినీరింగ్ విద్యార్థులు రింగరింగ అంటూ మత్తులో మునిగితేలుతున్నారు. నిషేధిత మత్తు పదార్థాలను కలిగి ఉండడంతోపాటు వాటిని తక్కువ ధరకు కొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. నాలుగేళ్లుగా గుంటూరులో సాగుతున్న ఈ మత్తు దందాను ఎకై ్సజ్ శాఖ అధికారులు తాజాగా రట్టు చేశారు. ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు మంగళవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంగళగిరి రూరల్ మండలం కాజకు చెందిన ఎం.సాయి కృష్ణ గుంటూరు సమీపంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతని సోదరుడు బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. సోదరుడి దగ్గరకు సాయి కృష్ణ వెళ్లిన సమయంలో అదే రూంలో ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్, తెనాలి చినరావూరుకు చెందిన ధరావత్ సతీష్కుమార్ పరిచయమయ్యాడు. సతీష్కుమార్కు బెంగళూరుకు చెందిన నితిన్తో కలిసి ఎండీఎంఏ మత్తుమందును సేవించేవాడు. దీనిని సాయికృష్ణ కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ మత్తుమందును గుంటూరులోనూ అమ్ముకోవచ్చని, లాభాలు పొందొచ్చని సతీష్కుమార్, నితిన్ సాయికృష్ణకు సూచించారు. దీంతో నితిన్ ద్వారా ఎండిఎంఏ మత్తు మందును నాలుగేళ్లుగా సాయి కృష్ణ, సతీష్ కుమార్ ఇద్దరూ గుంటూరు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు అమ్ముతున్నారు. సాయి కృష్ణ ఇటీవల గుంటూరు సమీపంలోని గోరంట్ల ప్రాంతంలో కోదండ రామా నగర్ లోని సాయి లక్ష్మీ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని అక్కడి నుంచే దందా నిర్వహిస్తున్నాడు. గుట్టురట్టు ఇలా.. రెండు రోజుల క్రితం గుంటూరు ఎకై ్సజ్–2 టౌన్ సీఐ ఎం. యశోధర దేవి, ఆమె సిబ్బంది బృందావన్ గార్డెన్స్ సమీపంలోని వేంకటేశ్వర స్వామి గుడి రోడ్డులో తనిఖీ చేస్తుండగా ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని ఆపి నిలబడి ఉన్నారు. అనుమానం వచ్చిన ఎకై ్సజ్ అధికారులు వారిని ప్రశ్నించారు. ఇద్దరూ తడబడుతుండడంతో వారిని తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద 2.52 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించగా సాయి కృష్ణ వద్ద కొన్నామని తెలిపారు. సాయి కృష్ణ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్కి వెళ్లి విచారించగా అతని వద్ద 8.15 గ్రాముల మత్తు మందుతోపాటు, ఏడుగురు విద్యార్థులు, ఒక కేజీ గంజాయి, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు లభించాయి. ఈ కేసులో మొత్తం 11 మంది నిందితులు ఉండగా 9 మందిని అరెస్ట్ చేసి కోర్టు హాజరు పరిచినట్లు ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంకా గంజాయి సరఫరా చేస్తున్న సాయి కృష్ణ బంధువు వేంపాటి చైతన్యతోపాటు బెంగళూరుకు చెందిన నితిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంది. వీరు పరారీలో ఉన్నట్టు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయిస్తూ పట్టుబడిన విద్యార్థులు 9 మంది అరెస్టు, పరారీలో ఇద్దరు బెంగళూరు నుంచి తక్కువ రేటుకు దిగుమతి గుంటూరులో అధిక ధరకు అమ్మకాలు వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్ శాఖ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు బెంగళూరులో గ్రాము రూ.1400కు కొనుగోలు ఎండీఎంఏ మత్తుమందును బెంగళూరులో గ్రాము రూ.1400 కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇంజినీరింగ్ విద్యార్థులకు రూ.4 వేల నుంచి రూ.ఐదువేలకు అమ్ముతున్నట్టు ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. గుంటూరు సమీపంలోని ప్రధానంగా రెండు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఈ మత్తు మందును సాయి కృష్ణ అలవాటు చేసినట్లు తెలుస్తోంది. గోరంట్లలోని తన ఫ్లాట్లోకి విద్యార్థులను పిలిపించి మత్తుమందు, గంజాయి అమ్ముతున్నట్టు సమాచారం. నాలుగేళ్లుగా ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్న సాయికృష్ణ తన గ్రామానికి చెందిన సమీప బంధువుతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెప్పించి విద్యార్థులకు విక్రయిస్తున్నట్టు ఎకై ్సజ్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ యశోధర దేవిని ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు. సీఐతో పాటు ఎస్ఐలు సత్యనారాయణ, మాధవి, హెడ్ కానిస్టేబుల్స్ హనుమంతురావు, సీహెచ్ రాజు, మైలా శ్రీనివాసరావు, రవిబాబు, బీఎస్ఎన్రాజు, పి నాగేశ్వరరావు, ఎం సూర్యనారాయణ, వివి చారి, చిన్న బాబు తదితరులనూ అభినందించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రవి కుమార్ రెడ్డి, గుంటూరు ఎకై ్సజ్ శాఖ అధికారి వి అరుణ కుమారి, ఏ ఈ ఎస్ ఈడే మారయ్య బాబు తదితరులు పాల్గొన్నారు. -
ట్రేడ్ లైసెన్స్ల పేరుతో..
వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించాలని వారం రోజుల క్రితం డిమాండ్ చలానాలను మున్సిపల్ అధికారులు అందించారు. పన్నులు సకాలంలో చెల్లించాలని విస్తృతంగా ప్రచారం చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఓ సైబర్ కేటుగాడు ఇటీవల ఓ ప్రైవేటు వైద్యశాలకు 6300805117 నంబరు నుంచి ఫోన్ చేసి మున్సిపల్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నాం.. మీరు ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించలేదు.. నేటితో రూ.1500 చెల్లిస్తే సరిపోతుందని, లేనిపక్షంలో పెనాల్టీలు చెల్లించాలని నమ్మబలికాడు. వెంటనే ఫోన్పే చేస్తే సరిపోతుందని, రశీదును మీకు వాట్సాప్లో పంపుతానన్నాడు. 8349772206 నంబరుకు ఫోన్పే చేయమన్నాడు. దీంతో ఆ వైద్యశాల సిబ్బంది ఫీజును ఫోన్పే ద్వారా చెల్లించారు. ఎంతసేపటికి రశీదు పెట్టకపోవటం, ఫోన్ చేసినా సమాధానం ఇవ్వకపోవటంతో మున్సిపల్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లగా తాము మోసపోయినట్లు గ్రహించారు. ఇలాగే పట్టణంలో పలువురికి ఫోన్లు చేసినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను కార్యాలయంలోనే చెల్లించాలని, ఎవరు ఫోన్ చేసినా స్పందించవద్దని ప్రచారం చేసి ప్రకటనలు చేశారు. -
తరలింపు
చౌకచక్యంగా బాపట్ల నుంచి గుజరాత్కు రేషన్ బియ్యంసాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు వ్యాపారులు గుజరాత్ రాష్ట్రానికి తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. బాపట్ల సమీపంలోని వెదుళ్లపల్లిలో ఉన్న ఓ రైస్మిల్లు యజమాని ఈ చౌక బియ్యాన్ని సేకరించి పాలిషింగ్ చేసి తరలిస్తున్నట్లు సమాచారం. ఆయనతోపాటు బాపట్ల పట్టణ పరిధిలోని మరో రైస్మిల్లు యజమానితోపాటు ఇదే మండలం అప్పికట్ల ప్రాంతంలోని ఇంకో రైస్మిల్లుకు చెందిన బాపట్ల టీడీపీ నేత అనుచరుడు రేషన్ బియ్యాన్ని కొని పాలిషింగ్ చేసి రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. కార్డుదారులను వంచిస్తున్న డీలర్లు.. మరోవైపు.. కొందరు డీలర్లు కార్డుదారులకు మొక్కుబడిగా డబ్బులు చెల్లిస్తుండగా.. మరికొందరు దౌర్జన్యంగా లాగేసుకుంటున్నారు. ఏమైనా ప్రశ్నిస్తే తెల్లకార్డు గల్లంతవుతుందని పచ్చనేతలు బెదిరిస్తున్నారు. దీంతో.. బియ్యం పోతే పోయింది కార్డు అయినా మిగులుతుందని చాలామంది పేదలు మిన్నకుండిపోతున్నారు. దీంతో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి, రేపల్లెతోపాటు పర్చూరు, చీరాల, బాపట్ల, వేమూరు నియోజకవర్గాల్లోనూ చాలామంది డీలర్లు గోడౌన్ల నుంచే రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడంలేదు. అక్రమంగా రాష్ట్ర సరిహద్దులుదాటిస్తున్న వైనం వెదుళ్లపల్లి, బాపట్ల, అప్పికట్ల ప్రాంతాల్లో రైస్ మిల్లుల నుంచి అక్రమ రవాణా వెదుళ్లపల్లి నుంచి నెలకు15 వేల క్వింటాళ్లు.. బాపట్ల, కర్లపాలెం మిల్లుల నుంచి 10 వేల క్వింటాళ్లు బియ్యం వ్యాపారుల నుంచి కిలో రూ.22కు కొంటున్న అక్రమార్కులు మిల్లుల్లో పాలిషింగ్ చేసి గుజరాత్లో రూ.40కు విక్రయాలు ఇక్కడ కిలో రూ.22కు కొన్న రేషన్ బియ్యాన్ని గుజరాత్లో కిలో రూ.40కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇలా ఒక్కో కిలోకు అన్ని ఖర్చులూ పోను రూ.15 తక్కువ కాకుండా వస్తోంది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.కోట్లలోనే రాబడి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వెదుళ్లపల్లి మిల్లు యజమాని నెలకు 15 వేల క్వింటాళ్లు సేకరిస్తుండగా.. మిగిలిన రెండు మిల్లుల నుంచి మరో 10 వేల క్వింటాళ్లు అనుకున్నా మొత్తంగా జిల్లా నుంచి గుజరాత్కు సగటున 25 వేల క్వింటాళ్లు తరలిపోతున్నట్లు సమాచారం. వెదుళ్లపల్లి మిల్లుకు చెందిన వ్యాపారితోపాటు బాపట్ల, అప్పికట్ల మిల్లులకు చెందిన వ్యాపారులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు గుంటూరు జిల్లా పొన్నూరు, పల్నాడు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేస్తున్నారు. రేషన్ బియ్యం ఖరీదు ఇలా.. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కార్డుదారులకు డీలర్లు కిలోకు రూ.8 చెల్లించి బియ్యం వ్యాపారులకు రూ.12కు ఇచ్చేవారు. అలాగే, బియ్యం అక్రమ రవాణాదారులు బియ్యం సేకరణ వ్యాపారులకు రూ.20 చెల్లించేవారు. కానీ, రేషన్ బియ్యానికి డిమాండ్ పెరగడంతో కార్డుదారులకు రూ.10 నుంచి రూ.12.. డీలర్లకు రూ.15 నుంచి రూ.17 వస్తోంది. ఇక వ్యాపారుల వద్ద నుంచి అక్రమ ఎగుమతిదారులు కిలో రూ.22 నుంచి రూ.24కు కొనుగోలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా సేకరణ.. బాపట్లతో పాటు పర్చూరు, అద్దంకి, రేపల్లె, చీరాల, వేమూరు, పొన్నూరు ప్రాంతాల్లోని డీలర్ల నుంచి కిలో బియ్యాన్ని రూ.15కు ఈ ముఠా కొనుగోలు చేస్తోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని వెదుళ్లపల్లితో పాటు మిగిలిన ఇద్దరు మిల్లర్లకు కిలో రూ.22 చొప్పున విక్రయిస్తున్నారు. వెదుళ్లపల్లి మిల్లు యజమాని ఒక్కరే నెలకు సుమారు 15 వేల క్వింటాళ్ల బియ్యాన్ని తన మిల్లుకు తరలించి ఎప్పటికప్పుడు పాలిషింగ్ చేసి లారీలు, ట్రక్కుల ద్వారా పొన్నూరు, గుంటూరు, మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్కు, అక్కడి నుంచి గుజరాత్కు తరలిస్తున్నట్లు సమాచారం. -
రైల్వే ఉద్యోగుల సమస్యలను కేంద్రం పరిష్కరించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే శాఖ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శి ఎస్.మంజునాథ్, ఎం.వి ప్రసాద్ డిమాండ్ చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లోని యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో వారు మాట్లాడుతూ రైల్వే ఉద్యోగుల సమస్యలను వివరించారు. అనంతరం రైల్వే ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. కేంద్రం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ డివిజన్ ట్రెజరర్ ఎస్.జి.కృష్ణయ్య, ఏడీఎస్ కె.కోటేశ్వరరావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ట్రెజరర్ సాంబశివరావు, ఏడీఎస్లు కరుణశ్రీ, హక్, లావణ్య, సంఘ నాయకులు వెంకటేష్, సాయి కృష్ణ, కిరణ్, ప్రసాంత్, మూర్తి, టి.వి.రావు, సునీల్కుమార్, ఉద్యోగ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
దగా పెరిగింది!
స్టయిల్ మారింది..అధికారుల పేర్లతో ఫోన్లు.. ఆనక ఫోన్పేలు అప్రమత్తంగా ఉండాలి ఆన్లైన్ ద్వారా మోసపోయినట్లు ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు మా దృష్టికిరాలేదు. అయితే చాలా మంది ఇటువంటి మోసాలబారిన పడినట్లు సమాచారం ఉంది. ప్రజలకు వీటిపై అవగాహన సదస్సులు నిర్వహించి, అప్రమత్తం చేస్తున్నాం. ప్రజలు తమ ఫోన్లలో యాప్లను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ సైబర్ నేరాల బారిన పడిన వారు నిర్భయంగా పోలీసు స్టేషన్లో పిర్యాదులు చేయాలి. – మల్లికార్జునరావు, పట్టణ సీఐ, రేపల్లె రేపల్లె రూరల్: సైబర్ నేరాలు తీరప్రాంతమైన రేపల్లెలోనూ పెచ్చుమీరుతున్నాయి. సైబర్ కేటాగాళ్ల ఉచ్చులో పట్టణంలోని అమాయకపు ప్రజలు ఇట్టేపడిపోతూ మోసపోతున్నారు. సైబర్ కేటుగాళ్లు పేద, మధ్య తరగతివారికి సైతం ఫేస్బుక్, వాట్సాప్ వంటి పలు సామాజిక మాధ్యమాల్లో ఎరవేస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. నేటి వరకు ఉద్యోగాలు, లక్కీడీప్లు అంటూ ఎరవేసిన కేటుగాళ్లు ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్ చేసి ఆన్లైన్లో పన్నులు చెల్లించాలని కొత్తతరహా వసూళ్లకు తెరతీశారు. దుస్తులు, సెల్ఫోన్ల పేరుతో టోకరా.. పట్టణానికి చెందిన గోపీ అనే యువకుడు ఫేస్బుక్ చూస్తుండగా అందులో మంచి మోడల్ దుస్తులు తక్కువ ధరకు కనిపించాయి. రూ.5వేల నుంచి రూ.10వేల విలువ చేసే దుస్తులు ఆఫర్లో కేవలం రూ.2వేలకే ఇస్తున్నట్లు చూపించాయి. వెంటనే డబ్బులను చెల్లించి దుస్తులను బుక్చేశాడు. వారం రోజుల తరువాత పనికిరాని దుస్తుల పీలికలతో డెలివరీ అయిన ప్యాకెట్ను ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు. రిటన్ పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అదేవిధంగా ఒక ప్రముఖ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ యాప్లో మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్నట్లు వినయ్ అనే యువకుడు తన ఫోన్లో వచ్చిన మెసెజ్లో చూశాడు. రూ.80,000 విలువ చేసే ఆపిల్ ఐఫోన్ రూ.2వేలకు, రూ.48వేల విలువ చేసే రీయల్మీ ఫోన్ కేవలం రూ.1600కు వస్తున్నట్లు ఆఫర్లో చూపుతోంది. వెంటనే డబ్బులు రూ.4వేలు చెల్లించి రెండు ఫోన్లను బుక్ చేసుకున్నాడు. తదుపరి పరిశీలించగా ప్రముఖ ఆన్లైన్ ఫ్లాట్ఫామ్ యాప్ పేరుతో, అదే డిజైన్లో రూపొందించిన డూప్లికేట్ యాప్ అని, తాను మోసపోయానని గ్రహించి, పలువురి వద్ద బావురమన్నాడు. రూటు మార్చి పేట్రేగుతున్న సైబర్ మోసగాళ్లు రేపల్లెలో మున్సిపల్ చలానాలపేరుతో డబ్బులు స్వాహా సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే తంతు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుస్పందించవద్దు మున్సిపల్ కార్యాలయానికి చెల్లించాల్సిన పన్నులు, ఫీజులు కార్యాలయంలో చెల్లించి రశీదులు పొందాలి. మున్సిపల్ కార్యాలయం పేరుతో అధికారులమంటూ ఎవరూ ఫోన్ చేసి ఆన్లైన్లో డబ్బులు చెల్లించాలని కోరినా స్పందించవద్దు. మున్సిపల్ కార్యాలయం పేరుతో సైబర్ కేటుగాళ్లు ఆన్లైన్లో ఫీజులు చెల్లించాలని వ్యాపారులకు ఫోన్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై వ్యాపారులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – కాకర్ల సాంబశివరావు,మున్సిపల్ కమిషనర్, రేపల్లె -
కేంద్ర పథకాల అమలు తీరుపై ఆరా
శావల్యాపురం: మండలంలోని శానంపూడి గ్రామంలో కేంద్ర టీం సభ్యులు పర్యటించి కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న పథకాలు పొందుతున్న లబ్థిదారులను మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామసచివాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో న్యూఢిల్లీ సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ మేనేజరు అండ్ కోఆర్డినేటరు వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రధానమంత్రి అవాస్ యోజన, స్వయ సహాయక సంఘూలు, పింఛన్లు పంపిణీ, గ్రామీణ సడక్ యోజన, గ్రామ స్వరాజ్య అభియాన్ తదితర పథకాల పురోగతిపై లబ్థిదారులను అడిగి తెలుసుకున్నారు. పథకాల నిర్వహణలో ఏమైనా ఇబ్బందులున్నాయా, అర్హులకు అందుతున్నాయా తదితరవన్నీ క్షేత్రస్థాయిలో లబ్థిదారులతో మాట్లా డారు. అనంతరం గ్రామంలో పర్యటించి ఆవాస్ యోజన పఽథకంలో నిర్మించిన నివాస గృహాలను పరిశీలించి లబ్థిదారులతో మాట్లాడి బిల్లులు గురించి ఆరా తీశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు గ్రామంలో పర్యటించి పథకాల వారీగా లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆయనతో పాటు సర్పంచ్ మొనపాటి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ చెన్నంశెట్టి రంగారావు, ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, కేంద్ర టీం సభ్యులు వి.సంధ్యారాణి, లక్ష్మి, లోకేష్, జి.సంధ్యా, భానుచంద్ర, హౌసింగ్ డీఈ ఎన్.శ్రీనివాసరావు, ఏఈ రసూల్, పంచాయతీ కార్యదర్శి బాల పరమేశ్వర రావు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. శావల్యాపురంలో... శావల్యాపురం: ఉపాధి పనులు పారదర్శకంగా జరిగేలా అధికారులు బాధ్యత వహించాలని న్యూఢిల్లీ కేంద్ర సంబోధ రీసెర్చ్ కమ్యూనికేషన్స్ అధికారి వికాస్ మల్కర్ అన్నారు. మంగళవారం మండలంలోని శానంపూడి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ మల్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ఉపాధి పనులు పేదలందరు సద్వినియోగం చేసుకొని మంచి ఆర్ధిక ప్రగతి సాధించాలన్నారు. కూలీలు చేస్తున్న పంట కాల్వ పనులను, మస్టర్ను పరిశీలించి ఉపాధి అధికారులకు తగు సూచనలు చేశారు. ఆయనతో పాటు ఏపీవో కె.రామారావు, డీఎఫ్టీ లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. శానంపూడిలో పర్యటించిన కేంద్రం బృందం -
పౌష్టికాహారంతో దృష్టి లోపాలకు చెక్
బాపట్ల: విద్యార్థులు దృష్టి లోపం రాకుండా పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పురపాలక ఉన్నత పాఠశాలలో పలువురు విద్యార్థులకు కళ్ల అద్దాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 3 వేల మంది విద్యార్థులకు కళ్ల అద్దాలు పంపిణీ చేశామన్నారు. డీఈఓ పురుషోత్తం, డీఎంహెచ్ఓ విజయమ్మ, బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా పాల్గొన్నారు. ఈక్రమంలో మున్సిపల్ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న వై.వెంకట వసంతకు కలెక్టర్ రూ.10వేలు అందజేశారు. ఓటు హక్కు కరపత్రాలు ఆవిష్కరణ.. బాపట్ల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లు అత్యంత జాగురూకతతో ఓటు చేయవలసి ఉంటుందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి.వెంకట మురళి చెప్పారు. ఓటర్లు ప్రథమ ప్రాధాన్యతా ఓటును నమోదు చేయనట్లయితే వారి ఓటు చెల్లుబాటు కాదన్నారు. మంగళవారం ఓటింగ్ విధానంపై ఎన్నికల నిఘావేదిక ప్రచురించిన కరపత్రాలను ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి బాపట్ల: బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. బాలికల సంక్షేమం, హక్కుల పరిరక్షణపై అనుబంధ శాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో సమావేశం ఆయన నిర్వహించారు. బాలికల హక్కుల పరిరక్షణకు జిల్లాస్థాయిలో కమిటీని నియమించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పని చేస్తుందన్నారు. అదేవిధంగా పీఎంఈజీపీ రుణాల మంజూరుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
నాగులుప్పలపాడు: ఈ ఏడాది మిర్చి రైతులు తీవ్రంగా నష్టాల్లో కూరుకుపోయారని, ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మండలంలోని ఒమ్మెవరం గ్రామంలో మిర్చి కళ్లాల్లో పంటను మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మాట్లాడుతూ మిర్చి పంటకు సరైన ధర లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతులు ఏనాడూ గిట్టుబాటు ధర కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వమే అండగా నిలిచిందన్నారు. గత ఏడాది మిర్చి ధరలు క్వింటాలుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు పలికాయని, ప్రస్తుతం ఈ ధరలు క్వింటాకు రూ.12 వేలకు పడిపోవడం బాధాకరమన్నారు. రైతులకు ఎకరాకు రూ.2.50 లక్షల వరకు పెట్టుబడి అవుతుందని, ఈ పరిస్థితుల్లో నల్లి, తామర తెగులుతో దిగుబడులు భారీగా తగ్గాయన్నారు. ఎకరాకు దిగుబడి 10 నుంచి 15 క్వింటాళ్లకు మించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఒక్కో ఎకరానికి రైతు సుమారు రూ.1.50 లక్షల వరకు నష్టపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పోలవరపు శ్రీమన్నారాయణ, గ్రీవెన్స్ సెల్ జిల్లా అధ్యక్షుడు పోలినేని కోటేశ్వరరావు, కంచర్ల సుధాకర్, కోటిరెడ్డి, కుమ్మూరి సుధాకర్, గండు వెంకట్రావు, హరిబాబు, రాంబాబు, అంజిరెడ్డి, బాలకృష్ణ, సుబ్బారావు, వెంకటేష్ ఉన్నారు. ధరల పతనంతో నష్టాల్లో మిర్చి రైతులు వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున -
హత్యకేసులో ఎనిమిది మందికి జీవిత ఖైదు
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండల పరిధిలో సుమారు పది సంవత్సరాల క్రితం జరిగిన ఓ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులకు ఒంగోలు ఏడో అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీ రాజా వెంకటాద్రి జీవిత ఖైదు విధించారు. అలాగే ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధించారు. బాపట్ల ఎస్పీ తుషార్ డూడీ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రెస్ నోట్ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుత బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు గ్రామానికి చెందిన దళిత మహిళ బూరగ యేసు దయమ్మ కుమారుడు బూరగరత్నం బాబు (22) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేసేవాడు. 2015లో రత్నం బాబు అదే గ్రామానికి చెందిన బాలిక షేక్ కరిష్మా (17) ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి తరపు పెద్దలు పలుమార్లు ఇద్దరినీ హెచ్చరించినా వారు ఖాతరు చేయలేదు. చెప్పిన మాట వినడం లేదని కరిష్మాను ఆమె తల్లిదండ్రులు మార్చి 23వ తేదీ 2015లో ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఈ క్రమంలో రత్నంబాబు కరిష్మాకు మైనారిటీ తీరాక పెళ్లి చేసుకుంటానని అప్పటివరకు ఆమెను తమ ఇంట్లోనే ఉంచుకుందామని తల్లిని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్లాడు. నెల రోజుల తర్వాత ఏప్రిల్ 28, 2015న కరిష్మా మేనమామలైన నజీర్, మున్నీర్ బాషా వారి స్నేహితుడు అన్వర్ బాషా కలిసి.. రత్నం బాబు ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు జె.పంగులూరు గ్రామ మసీదులో ఇద్దరి వివాహానికి అంతా నిశ్చయించామని వలపర్ల వెళ్లి పెళ్లికి అవసరమైన బట్టలు కొనుగోలు చేద్దామని నమ్మించి రత్నం బాబును తమతో తీసుకుని వెళ్లారు. అదే రోజు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో రత్నం బాబును రామకూరు ఉత్తరం వైపు పొలాల్లోకి తీసుకువెళ్లి మరికొందరితో కలిసి కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో ఉన్న రత్నం బాబు మృతదేహాన్ని స్థానికుల సమాచారంతో తెలుసుకున్న రత్నం బాబు తల్లి బూరగ యేసు దయమ్మ.. మార్టూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి చీరాల డీఎస్పీ సి.జయ రామరాజు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపి ఆధారాలు, సాక్షుల నుంచి వాంగ్మూలాలు సేకరించారు. హత్య జరిగినట్లు నిర్ధారించి మొత్తం తొమ్మిదిమందిని నిందితులుగా గుర్తించి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులపై హత్యానేరం రుజువు కావడంతో ఒంగోలు ఏడో అడిషనల్ అండ్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి టి.రాజా వెంకటాద్రి మంగళవారం సాయంత్రం తీర్పు వెలువరించారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో రామకూరు గ్రామానికి చెందిన ఏ8 ముద్దాయి షేక్ మస్తాన్ విచారణ సమయంలో మృతి చెందాడు. మిగిలిన వారిలో ముగ్గురు మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏ1 షేక్ మునీర్ బాషా, ఏ2 షేక్ అన్వర్ బాషా, ఏ3 షేక్ నజీర్ కాగా రామకూరు గ్రామానికి చెందిన ఏ4 షేక్ కరిముల్లా, ఏ5 షేక్ బాజీ బుడే, ఏ6 షేక్ సద్దాం హుస్సేన్, ఏ7 షేక్ షకీల.. యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన ఏ9 పఠాన్ మౌలాలికి జడ్జి రాజా వెంకటాద్రి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ వై.ప్రశాంతకుమారి సాక్ష్యాధారాలతో నిరూపించారు. సాక్షులకు సరైన రీతిలో నిర్భయంగా సాక్ష్యం చెప్పే విధంగా తర్ఫీదునిచ్చి నేరం రుజువై నిందితులకు శిక్ష పడేందుకు సహకరించిన వారిని ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేకంగా అభినందించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు పర్యవేక్షణలో మార్టూరు సీఐ ఎం.శేషగిరిరావు, కోర్టు కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసులు, ఎ.కిరణ్ లు కేసును ఛేదించారు. -
డీఐజీ వికృత చేష్టలు.. వీడియో వైరల్!
సాక్షి, గుంటూరు: తాను సమాజంలో బాధత్య గల స్థాయిలో ఉన్నాననే విషయం ఆయన మరిచిపోయారు. భార్యను శారీరంగా హింసించారు. అంతేకాదు.. మరో మహిళతో సంబంధం పెట్టుకుని కట్టుకున్న ఇల్లాలినే మానసికంగా వేధించారు. విసిగిపోయిన ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది. గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ వికృత చేష్టలు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరు పోస్టల్ కాలనీకి చెందిన తాళ్లూరి అనుసూయా రాణి, భారత్ పేటకు చెందిన వీర్నపు కిరణ్ ఇద్దరు గతంలో పాలకొల్లు ఎల్ఐసీ శాఖలో అసిస్టెంట్లుగా పని చేశారు. 1998 డిసెంబర్లో గుంటూరు శారదాకాలనీ చర్చిలో వీళ్ల వివాహం జరిగింది. అయితే ఈ జంటకు సంతానం కలగకపోవడంతో.. 2002లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఈలోపు.. 2009లో కిరణ్కుమార్కు విజయనగరంలోని రిజిస్ట్రార్గా ఉద్యోగం వచ్చింది. ఆపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 2018లో డీఐజీగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి భర్త కిరణ్కుమార్ వికృత చేష్టలను ఆమె చూడసాగింది. ప్రస్తుతం అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. కిరణ్ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. పది నెలల క్రితం పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసి భర్త కిరణ్ కుమార్ బాబును తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. పోషణ, చదువు బాధ్యతలు తాను చూసుకునేలా రాసి ఇచ్చారు. అయితే అనసూయ శనివారం విజయవాడలోని ఓ శుభకార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఆమెను చూసి కిరణ్ రగిలిపోయారు. బాబు సంరక్షణ విషయంలో గొడవ జరిగి ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. ఆస్పత్రి నుంచి తన పుట్టింటికి వెళ్తున్న ఆమెపై మళ్లీ దాడికి యత్నించాడు. దీంతో ఆమె అరండల్పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్కుమార్ను అదుపులో తీసుకుని స్టేషన్కు తరలించిన పోలీసులు.. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు. -
క్వారీ తిరునాళ్లకు సకల సౌకర్యాలు
చేబ్రోలు: మహారాత్రి సందర్భంగా క్వారీ తిరునాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా ఆదేశించారు. వడ్లమూడి క్వారీ తిరునాళ్ల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ అధికారుల కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. భక్తుల అభిషేకాలు, దర్శనాలు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ, ఎలక్ట్రికల్ ప్రభల బరువు, సామర్థ్యం, ఎత్తు, ట్రాఫిక్ నియంత్రణ, వెహికల్స్ పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులను శాఖల వారీగా విడిది స్టాల్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజులు పాటు వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకల్లో మొదటిరోజు పశువుల ప్రదక్షిణలు ఉంటాయని, రెండో రోజు వాహనాల ప్రదక్షిణలు పూజలు ఉంటాయని, మూడవరోజు ఈనెల 26వ భక్తుల అభిషేకాలు మహాశివరాత్రి వేడుకలు ఉంటాయని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కె.శ్రీనివాసశర్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ.ఉమాదేవి, ఈఓపీఆర్డీ టి.ఉషారాణి, ఆలయ ఈఓ రామకోటేశ్వరరావు, తిరునాళ్ల కమిటీ చైర్మన్ జి.శ్రీకాంత్, 52 శాఖల అధికారులు పాల్గొన్నారు. తెనాలి సబ్కలెక్టర్ సంజనా సింహా -
డాక్టర్ కవితకు అరుదైన అవార్డు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్) గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ ముక్కు కవిత, కేంద్ర మంత్రి కె.రామమోహన్ నాయుడు చేతుల మీదుగా అరుదైన పురస్కారం అందుకున్నారు. టైమ్స్ నెట్వర్క్ ఇండియా హెల్త్ కేర్ అవార్డుల పురస్కారం ఆదివారం వైజాగ్లో నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన కృషి చేసినందుకు మార్గదర్శకులను గుర్తించి అవార్డులను అందజేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్ను రూపొందించడంలో మెరుగైన పాత్ర వహించి గణనీయమైన కృషి చేసినందుకు డాక్టర్ కవితకు అవార్డు లభించింది. అవార్డు అందుకున్న డాక్టర్ కవితకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, వైద్య కళాశాల, జీజీహెచ్కు చెందిన పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది సోమవారం అభినందనలు తెలిపారు. -
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తాడికొండ: చిన్నారులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే టీకాలు సకాలంలో వేయించేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు అన్నారు. సోమవారం తుళ్లూ రు పీహెచ్సీని సందర్శించిన ఆయన వైద్య బృందంతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏఏ టీకాలు ఏ సమయంలో వేయించాలి అనే విషయంపై స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని యు విన్ పోర్టల్లో అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు. గ్రామాల్లో సీడీఎన్సీ సర్వే చేసి ప్రతి గ్రామంలోని కుటుంబాలకు ఐడీ నంబర్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డి.శ్రీనివాస్, వసుంధర, శివపార్వతీ, సీహెచ్ఓ వెంకట రమణ, ఎంఎస్ రాణి, పర్యవేక్షకులు సుధాకర్, డీఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీమ్ పాల్గొన్నారు. -
ఇస్సోపార్బ్ అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే
మంగళగిరి: ఇండియన్ సొసైటీ ఆఫ్ పెరినాటాలజీ అండ్ రీ ప్రొడక్ట్ మెడిసన్(ఇస్సోపార్బ్) కొత్త అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే బాధ్యతలు స్వీకరించారు. నగర పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మూడు రోజులు పాటు నిర్వహించిన ఇస్సోపార్బ్ 40వ జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వహించిన సదస్సులో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సును ఇస్సోపార్బ్ విజయ వాడ చాప్టర్ నిర్వహించింది. ప్రారంభోత్సవానికి ఇస్సోపార్బ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నారా యణ జానా, కార్యదర్శి డాక్టర్ మిశ్రా చౌదరి, ఎన్టీఆర్యూహెచ్ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి హాజరై అనేక అంశాలను చర్చించారు. చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ కె.గీతాదేవి, కార్యదర్శి కె.లత ప్రాతినిథ్యం వహించగా 450 మంది ప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని పలు అంశాలను చర్చించారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఇద్దరికి గాయాలు మార్టూరు: దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరకుండానే ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన మార్టూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. హైవే అంబులెన్స్ సిబ్బంది రవి, స్థానికుల వివరాల మేరకు.. జూలూరు శ్రీకృష్ణ (40), జూలూరు వంశీకృష్ణ, కె.వివేక్లు తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి నూజివీడుకు కారులో బయలుదేరారు. సరిగా ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో స్థానిక దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి మొదట ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం డివైడడ్ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు తీవ్రంగా ధ్వంసం కాగా అందులో ఉన్న ముగ్గురిలో జూలూరు శ్రీకృష్ణ (40) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన వంశీకృష్ణ, వివేక్లు గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
హనుమత్ వైభవం చాలా గొప్పది
తెనాలి: హనుమత్ వైభవం చాలా గొప్పదని, వాస్తవానికి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయస్వామిగా పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి(బాలస్వామి) అన్నారు. స్థానిక షరాఫ్బజారులోని శ్రీసువర్చలా సమేత శ్రీపంచముఖ ఆంజనేయస్వామి దేవాలయాన్ని బాలస్వామి సోమవారం దర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. తన బాల్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంతో అనుబంధాన్ని గుర్తుచేశారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. హనుమంతుడి ధ్వజం ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయాలు ఉంటాయని చెప్పారు. హనుమాన్ చాలీసా కూడా జయహనుమతోనే ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. మాఘమాసంతో సహా ఏ మాసంలో ఏరోజు ఏమేం చేయాలో? ధర్మ ఆచరణ విధివిధానాలను పెద్దలు చెప్పారనీ, ప్రజలు శాస్త్రప్రకారం ధర్మాన్ని పాటిస్తూ, భగవంతుడిని ఆరాధిస్తూ తమ జీవనవిధానాన్ని ఆచరించాలని సూచించారు. బాలస్వామీజీకి ఆలయ ఈఓ అవుతు శ్రీనివాసరెడ్డి, హరిప్రసాద్, ప్రధాన అర్చకుడు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, ఆర్వీ కిరణ్కుమార్ స్వాగతం పలికారు. స్వామీజీతో సాలిగ్రామ మఠం కార్యదర్శి రావూరి సుబ్బారావు, సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, సభ్యులు రాజేశ్వరరావు, ప్రభరాణి, వరలక్ష్మి, ప్రమీల పాల్గొన్నారు. నీతి ఆయోగ్ బృందం తక్కెళ్లపాడు సందర్శన పెదకాకాని: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సద్వినియోగంపై నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం తక్కెళ్లపాడు పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం సందర్శించింది. బృందం సభ్యులు జిష్యుపాల్, స్వప్నలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సడక్ యోజన, పింఛన్ పంపిణీ, డ్వాక్రా యానిమేటర్లతో మాట్లాడారు. డ్వాక్రా స్వయం సహాయ సంఘాలకు మంజూరు చేసిన నిధుల సద్వినియోగంపై డ్వాక్రా సంఘాల మహిళలతో చర్చించారు. ఈ పథకాలను సంబంధించిన పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పసుపు ధరలు దుగ్గిరాల: పసుపు గరిష్ట ధర రూ.9800 పలికింది. దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుకు సోమవారం 320 బస్తాలు రాగా మొత్తం అమ్మకం జరిగినట్లు ఉన్నతశ్రేణి కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. సరకు కనిష్ట ధర రూ.9600, గరిష్ట ధర రూ.9800, మోడల్ ధర రూ.9800, కాయ కనిష్ట ధర రూ.9,551, గరిష్ట ధర రూ.9700, మోడల్ ధర రూ.9700 పలికినట్లు తెలిపారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీరాల రూరల్: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈఘటన సోమవారం చీరాల రైల్వే స్టేషన్ ఫైరాఫీసు గేటు సమీపంలోని వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. ఫైరాఫీసు గేటు సమీపంలో వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో ప్రమాద స్థలాన్ని పరిశీలించగా మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉండవచ్చని, మృతదేహంపై బ్లాక్ కలర్ చొక్కా, గళ్ల లుంగీ ఉందని చెప్పారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు జీఆర్పీ ఎస్సై 94406 27646 కు సమాచారం అందించాలన్నారు. -
కాజ టోల్ ప్లాజాను రద్దుచేయాలి
మంగళగిరి టౌన్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అధిక టోల్ఫీజు వసూలు చేస్తున్న కాజ టోల్ప్లాజాను వెంటనే రద్దు చేయాలని ప్రయాణికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రెస్క్లబ్లో సోమ వారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాజ టోల్గేట్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 79 కిలోమీటర్ల దూరంలో టోల్ప్లాజా ఉండకూడదని దీనిపై లారీ ఓనర్స్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో రూ.150 ఉండే టోల్పాస్ ఇప్పుడు రూ.340 చేశారని దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ఈ టోల్గేటును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. -
సర్వేను అడ్డుకున్న పచ్చమూకలు
కొల్లూరు: టీడీపీ వర్గీయులు అడ్డగింత కారణంగా వివాదాస్పదంగా మారిన నడకదారి హద్దుల వ్యవహారం సర్వే జరగకుండానే నిలిచిపోయింది. మండలంలోని జువ్వలపాలెం శివారు గుంటూరుగూడెంలో టీడీపీకి చెందిన పక్క పొలం రైతు తన పంట పొలంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి బలవంతంగా తన భూమిని ఆక్రమించుకున్నాడని మారీదు ప్రసాద్ అనే రైతు ఆరోపించాడు. గుంటూరుగూడెంకు చెందిన రైతు ప్రసాద్ ఈ వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగంను సైతం సంప్రదించి సర్వే చేయించి న్యాయం చేయాలని అప్పట్లోనే వినతి పత్రం రూపంలో మొరపెట్టుకున్నాడు. ఈనెల 4న ‘సాక్షి’లో ‘పేద రైతుపై దౌర్జన్యకాండ’ శీర్షికతో కథనం సైతం వెలువడింది. సమస్యను పరిష్కరించేందుకు బాధిత రైతును ప్రభుత్వ సర్వేకు దరఖాస్తు చేసుకోవాలని కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు సూచించడంతో వారు అధికారిక సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రవేటు సర్వేయర్లతో టీడీపీకి చెందిన నాయకుడు వేములపల్లి రవికిరణ్ కొలతలు కొలిపించి తనపై దౌర్జన్యానికి పాల్పడి తమపై దాడి చేయించి పొలం ఆక్రమించుకోవడంతోపాటు, నష్టం కలిగించారన్న బాధితుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ప్రభుత్వ సర్వేయర్లు కొలతలు సేకరించాలని ఆదేశించడంతో సోమవారం కొలతల ప్రక్రియ కోసం సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో బాధిత రైతులు తమ వద్దనున్న పత్రాలను అందజేసి దాని ప్రకారం తమ హద్దులు నిర్ణయించాలని సర్వేయర్లను కోరారు. టీడీపీ నాయకుడు వర్గీయులు మాత్రం మొత్తం భూమికి కొలతలు సేకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, బాధిత రైతు పేర్కొంటున్న 2 సెంట్ల భూమి తమకు చెందినదని కొలతల సేకరణను అడ్డగించారు. ఒక దశలో బాధిత రైతుల పక్షాన నిలిచి సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపైన సైతం దురుసుగా వ్యవహరిస్తూ వివాదం సృష్టించారు. దీంతో భూమి హద్దులు నిర్ధారించేందుకు వెళ్లిన సర్వేయర్లు టీడీపీ నాయకులు వివాదంలో ఉన్న 2 సెంట్ల భూమి కొలిసేందుకు ఒప్పుకునేది లేదని పట్టుపట్టడంతో సాయంత్రం వరకు వేచి చూసి వెనుతిరిగారు. బాధిత రైతు పక్షాన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సుగ్గున మల్లేశ్వరరావు వివాదాస్పదమైన భూమి వద్దకు వెళ్లి కొలత ప్రక్రియ చట్టబద్ధంగా నిర్వహించాలని సర్వేయర్లను కోరారు. నడకదారి వివాదంలో ప్రభుత్వ సర్వే అడ్డగింత కొలతలు సేకరించవద్దంటూ పట్టు రికార్డుల ప్రకారం కొలతలు సేకరించాలని పేద రైతు మొర ఇరు వర్గాల నడుమ వివాదంతో సర్వే నిలిపివేసిన యంత్రాంగం లింక్ డాక్యుమెంట్లతో సమస్య పరిష్కరిస్తాం నడక దారి వివాదంలో తన వద్ద ఉన్న పత్రాల మేరకు 1.06 సెంట్లకు కొలతలు నిర్వహించి హద్దులు నిర్వహించాలని బాధిత రైతు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పక్క రైతు సైతం తమ పత్రాల మేరకు ఆభూమి తమ కు చెందుతుందని వెల్లడించడంతో కొలతల సేకరణను నిలుపుదల చేయాల్చి వచ్చింది. ఆ భూములకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సైతం తీసుకురావాలని ఇరుపక్షాలకు సూచించి తిరిగి కొలతలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. –బి. వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు. -
తరలింపు వేగవంతం ..
మంగళవారం శ్రీ 18 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, బాపట్ల: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం అద్దంకి ప్రాంతంలో పచ్చ నేతలు మట్టి, గ్రావెల్ అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు గుండ్లకమ్మ నది నుంచి ఇసుక, మరికొందరు నియోజకవర్గంలో ఇసుకతోపాటు గ్రావెల్, మట్టి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వీరంతా మంత్రి అనుచరులు కావడంతో అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అద్దంకి మండలం ధర్మవరంకు చెందిన పచ్చనేత ధర్మవరం పెద్ద చెరువు నుంచి గ్రావెల్ తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. 113 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో సుమారు పదికి పైగా యంత్రాలతో వంద టిప్పర్ల ద్వారా మట్టి తరలించి అమ్ముకుంటున్నారు. రేయింబవళ్లు అక్రమ రవాణా సాగుతోంది. తాజాగా అద్దంకి నియోజకవర్గంలో ... బెంగళూరు – అమరావతి ఎక్స్ప్రెస్వే రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా తాళ్లూరు ప్రాంతం నుంచి అద్దంకి నియోజకవర్గం ముప్పవరం వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. చెరువు నుంచి రోజుకు వందలాది ట్రిప్పర్ల మట్టి, గ్రావెల్ను హైవేకు తరలిస్తున్నారు. దీంతోపాటు అద్దంకి నియోజకవర్గంలోని రియల్ వెంచర్లు, ఇతర అవసరాలకు ధర్మవరం చెరువు నుంచే గ్రావెల్ తరలిస్తున్నారు. ఒక టిప్పర్ గ్రావెల్కు హైవే కాంట్రాక్టర్లు రూ.ఐదు వేలు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన రాబడి రోజుకు రూ.లక్షల్లో ఉన్నట్లు అంచనా. న్యూస్రీల్ ధర్మవరం పెద్ద చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు బెంగళూరు – అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి సరఫరా విద్యుత్ మంత్రి ఇలాకాలో ఆగని గ్రావెల్, మట్టి దందా రియల్ వెంచర్లకూ ఇక్కడి నుంచే సరఫరాగ్రావెల్, మట్టి రవాణాపై ‘సాక్షి’లో కథనం రావడంతో తరలింపును కొద్ది రోజులు నిలిపి, ఇప్పుడు మళ్లీ వేగవంతం చేశారు. చెరువు నుంచి మట్టి లేదా గ్రావెల్ తరలించాలంటే నిబంధనల మేరకు నీటిపారుదల శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అయితే తనకు అనుమతులు ఉన్నట్లు సదరు నేత బుకాయిస్తున్నట్లు సమాచారం. వాస్తవంగా అనుమతులు ఉంటే రోజువారీ తరలిస్తున్న మట్టి, గ్రావెల్ వివరాలు, ప్రభుత్వానికి ఎంత మొత్తం చెల్లించారో కూడా తెలియజేయాలి. ఆ వివరాలు అధికారులకు ఇచ్చిన దాఖలాలు కనిపించడంలేదు. నియోజకవర్గంలో పలు చెరువులు ఉన్నా ఆయా గ్రామాల ప్రజలు గ్రావెల్, మట్టి అక్రమ తరలింపుకు అంగీకరించ లేదని తెలుస్తోంది. తొలుత ఇదే మండలంలోని కలవకూరు, శింగరకొండ తదితర గ్రామాల చెరువుల నుంచి గ్రావెల్ తరలించేందుకు పచ్చనేతలు ప్రయత్నించగా గ్రామస్తులు అంగీకరించలేదు. ముళ్ల కంపలు, ఇతర చెట్లు ఉన్న ధర్మవరం చెరువును ఆధునీకరించాల్సిన అధికారులు, పచ్చనేతలు కుమ్మకై ్క మట్టి, గ్రావెల్ అమ్మకానికి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చిన్నారులకు సకాలంలో టీకాలు వేయించాలి
తాడికొండ: చిన్నారులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందించే టీకాలు సకాలంలో వేయించేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు అన్నారు. సోమవారం తుళ్లూ రు పీహెచ్సీని సందర్శించిన ఆయన వైద్య బృందంతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చిన్నారులకు బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏఏ టీకాలు ఏ సమయంలో వేయించాలి అనే విషయంపై స్పష్టంగా అవగాహన కల్పించాలని కోరారు. టీకాలకు సంబంధించిన సమాచారాన్ని యు విన్ పోర్టల్లో అప్లోడ్ చేసే విధానాన్ని వివరించారు. గ్రామాల్లో సీడీఎన్సీ సర్వే చేసి ప్రతి గ్రామంలోని కుటుంబాలకు ఐడీ నంబర్లు ఇచ్చేలా చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారులు డి.శ్రీనివాస్, వసుంధర, శివపార్వతీ, సీహెచ్ఓ వెంకట రమణ, ఎంఎస్ రాణి, పర్యవేక్షకులు సుధాకర్, డీఎస్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ కరీమ్ పాల్గొన్నారు. -
సర్వేను అడ్డుకున్న పచ్చమూకలు
కొల్లూరు: టీడీపీ వర్గీయులు అడ్డగింత కారణంగా వివాదాస్పదంగా మారిన నడకదారి హద్దుల వ్యవహారం సర్వే జరగకుండానే నిలిచిపోయింది. మండలంలోని జువ్వలపాలెం శివారు గుంటూరుగూడెంలో టీడీపీకి చెందిన పక్క పొలం రైతు తన పంట పొలంలోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి బలవంతంగా తన భూమిని ఆక్రమించుకున్నాడని మారీదు ప్రసాద్ అనే రైతు ఆరోపించాడు. గుంటూరుగూడెంకు చెందిన రైతు ప్రసాద్ ఈ వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగంను సైతం సంప్రదించి సర్వే చేయించి న్యాయం చేయాలని అప్పట్లోనే వినతి పత్రం రూపంలో మొరపెట్టుకున్నాడు. ఈనెల 4న ‘సాక్షి’లో ‘పేద రైతుపై దౌర్జన్యకాండ’ శీర్షికతో కథనం సైతం వెలువడింది. సమస్యను పరిష్కరించేందుకు బాధిత రైతును ప్రభుత్వ సర్వేకు దరఖాస్తు చేసుకోవాలని కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు సూచించడంతో వారు అధికారిక సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రవేటు సర్వేయర్లతో టీడీపీకి చెందిన నాయకుడు వేములపల్లి రవికిరణ్ కొలతలు కొలిపించి తనపై దౌర్జన్యానికి పాల్పడి తమపై దాడి చేయించి పొలం ఆక్రమించుకోవడంతోపాటు, నష్టం కలిగించారన్న బాధితుల ఫిర్యాదు మేరకు తహసీల్దార్ ప్రభుత్వ సర్వేయర్లు కొలతలు సేకరించాలని ఆదేశించడంతో సోమవారం కొలతల ప్రక్రియ కోసం సర్వేయర్లు వివాదాస్పద భూమి వద్దకు వెళ్లారు. ఈనేపథ్యంలో బాధిత రైతులు తమ వద్దనున్న పత్రాలను అందజేసి దాని ప్రకారం తమ హద్దులు నిర్ణయించాలని సర్వేయర్లను కోరారు. టీడీపీ నాయకుడు వర్గీయులు మాత్రం మొత్తం భూమికి కొలతలు సేకరించడానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, బాధిత రైతు పేర్కొంటున్న 2 సెంట్ల భూమి తమకు చెందినదని కొలతల సేకరణను అడ్డగించారు. ఒక దశలో బాధిత రైతుల పక్షాన నిలిచి సామరస్యంగా సమస్యను పరిష్కరించేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపైన సైతం దురుసుగా వ్యవహరిస్తూ వివాదం సృష్టించారు. దీంతో భూమి హద్దులు నిర్ధారించేందుకు వెళ్లిన సర్వేయర్లు టీడీపీ నాయకులు వివాదంలో ఉన్న 2 సెంట్ల భూమి కొలిసేందుకు ఒప్పుకునేది లేదని పట్టుపట్టడంతో సాయంత్రం వరకు వేచి చూసి వెనుతిరిగారు. బాధిత రైతు పక్షాన వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు సుగ్గున మల్లేశ్వరరావు వివాదాస్పదమైన భూమి వద్దకు వెళ్లి కొలత ప్రక్రియ చట్టబద్ధంగా నిర్వహించాలని సర్వేయర్లను కోరారు. నడకదారి వివాదంలో ప్రభుత్వ సర్వే అడ్డగింత కొలతలు సేకరించవద్దంటూ పట్టు రికార్డుల ప్రకారం కొలతలు సేకరించాలని పేద రైతు మొర ఇరు వర్గాల నడుమ వివాదంతో సర్వే నిలిపివేసిన యంత్రాంగం లింక్ డాక్యుమెంట్లతో సమస్య పరిష్కరిస్తాం నడక దారి వివాదంలో తన వద్ద ఉన్న పత్రాల మేరకు 1.06 సెంట్లకు కొలతలు నిర్వహించి హద్దులు నిర్వహించాలని బాధిత రైతు సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పక్క రైతు సైతం తమ పత్రాల మేరకు ఆభూమి తమ కు చెందుతుందని వెల్లడించడంతో కొలతల సేకరణను నిలుపుదల చేయాల్చి వచ్చింది. ఆ భూములకు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలను సైతం తీసుకురావాలని ఇరుపక్షాలకు సూచించి తిరిగి కొలతలు నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. –బి. వెంకటేశ్వర్లు, తహసీల్దార్, కొల్లూరు. -
కాలువలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
కారంచేడు: వ్యవసాయ పనుల నిమిత్తం తమ యజమాని పొలంలోని ధాన్యం బస్తాలను ఇంటికి తోలేందుకు కూలీలతో పొలానికి బయలుదేరిన వ్యక్తి అకాల మరణం చెందాడు. కారంచేడు ఎస్ఐ వి.వెంకట్రావు, ప్రతక్ష్య సాక్షుల వివరాల మేరకు.. మండల కేంద్రం కారంచేడు అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన గర్నెపూడి పోతురాజు (51) సోమవారం తమ యజమాని ఇంటి నుంచి ట్రాక్టర్ తీసుకొని వ్యవసాయ కూలీలతో ధాన్యం బస్తాలు తీసుకురావడానికి పొలానికి బయలుదేరాడు. వాడరేవు–పిడుగురాళ్ల ప్రధాన రహదారిలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో కల్యాణ మండపం ఎదురుగా ఉన్న రొంపేరు కాలువపై నిర్మించిన వంతెన ఎక్కే క్రమంలో అదే వంతెనపై ఎదరుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో ఒక్కసారిగా కాలువలోని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ట్రాలీలో ఉన్న వ్యసాయ కూలీలు చాకచక్యంగా కిందికి దూకేశారు. ఇంజిన్లో ఉన్న పోతురాజుకు కిందకు దూకే అవకాశం లేక నీళ్లలో పడిపోయాడు. నీటిలో ఉన్న పోతురాజును వ్యవసాయ కూలీలు బయటకు తీశారు. అక్కడకు చేరుకున్న మరికొందరితో కలసి సీపీఆర్ చేశారు. 108 వాహనాన్ని పిలిపించి వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు పోతురాజు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య లూర్ధు, కుమారులు ఏసు రాజు, గాబ్రియేలు ఉన్నారు. కంటతడి పెట్టించిన మృతుడి భార్య రోదన కూలి పనులు చేసుకుంటే గాని పూట గడవని పేద కుటుంబం పోతురాజుది. అనారోగ్యంతో ఉన్న భార్యను చిన్నచిన్న పనులకు మాత్రమే పంపించేవాడు. తానే అన్నీ అయి బిడ్డలను చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పోతురాజు మృతితో కుటుంబ సభ్యులు దిక్కులేనివారయ్యారు. మాకు దిక్కెవరయ్యా అంటూ మృతుడి భార్య లూర్ధు రోదిస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. డ్రైవర్ మృతి, ఐదుగురు కూలీలకు గాయాలు కారంచేడులో రొంపేరు కాలువ వద్ద ఘటన -
విద్యుత్ నెట్ వర్క్లో ఏఐ ఆధారిత పరిష్కారాలపై సదస్సు
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి కళాశాలలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఎనర్జీ డిస్ఎగ్రిగేషన్ ఏఐ బేస్డ్ సొల్యుషన్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ అంశంపై అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యవక్తగా సౌత్ కొరియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ రామ్మోహన్ మల్లిపెద్ది హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎనర్జీ డిస్ఎగ్రిగేషన్ పద్ధతి అంటే కరెంట్ మీటర్ నుంచి కరెంటు పరికరాల శక్తి వినియోగాన్ని వేరు చేసే ఓ టెక్నిక్ అని తెలిపారు. శక్తి వినియోగంలో ఆధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ ఉపయోగించి ఉపకరణాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించవచ్చని దాని ద్వారా ఉపకరణాల పనితీరును మెరుగుపరుచుకోవడం శక్తి వినియోగాన్ని తగ్గించుకోవడం చేయవచ్చన్నారు. ఉపకరణాల వినియోగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా పనితీరుకు సరిపడా శక్తిని అందించబడుతుందని వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ కె.గిరిబాబు, ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఏవీ సరేష్ బాబు, డాక్టర్ సీహెచ్ నాగసాయి కళ్యాణ్ పాల్గొన్నారు. -
జీబీ సిండ్రోమ్పై అవగాహన కల్పించండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: గులియన్ బ్యారి(జీబీ) సిండ్రోమ్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ వ్యాప్తిని అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపట్టిన అభా కార్డుల నమోదు ప్రక్రియ, జీబీ సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తిపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో సమావేశం నిర్వహించారు. ప్రాణాంతకమైన జీబీ సిండ్రోమ్ వ్యాధికి జిల్లా వాసులు గురిగాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలోని విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. బ్యాక్టీరియా సోకి వ్యాధిగ్రస్తులైన వారికి ప్రభుత్వం ప్రత్యేక వైద్యం అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. గుంటూరు జీజీహెచ్లో, ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్లో ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అభా కార్డుల నమోదు ప్రక్రియ పది రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లాలో కిడ్నీ డయాలసిస్ కేసులు 1010 ఉన్నాయని, నూతనంగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు తక్షణమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.చేనేతల ఆర్థిక స్థితిగతులను మెరుగు పరచాలి.. బాపట్ల: చేనేత కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. చేనేత కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు తీసుకోవలసిన చర్యలపై సంబంధిత అధికారులతో సోమవారం స్థానిక కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ముద్ర పథకం కింద చేనేత కుటుంబాలకు చేయూత అందించేందుకు 1,044 మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఇప్పటివరకు 76 మందికి మాత్రమే ఆయా బ్యాంకుల ద్వారా రుణాలు అందాయని తెలిపారు. జిల్లాలో చీరాల, వేటపాలెం, భట్టిప్రోలు, చెరుకూరు, రేపల్లె, మార్టూరు మండలాల్లో నేత కార్మికుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వీరిని చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు, ఎల్డీఎం కలసి వ్యక్తిగతంగా వెళ్లి వారితో చర్చించి రుణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు నాగమల్లేశ్వరరావు, ఎల్డీఎం శివకృష్ణ, డీఆర్డీఏ పీడీ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఇస్సోపార్బ్ అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే
మంగళగిరి: ఇండియన్ సొసైటీ ఆఫ్ పెరినాటాలజీ అండ్ రీ ప్రొడక్ట్ మెడిసన్(ఇస్సోపార్బ్) కొత్త అధ్యక్షురాలిగా డాక్టర్ సులేఖా పాండే బాధ్యతలు స్వీకరించారు. నగర పరిధిలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో మూడు రోజులు పాటు నిర్వహించిన ఇస్సోపార్బ్ 40వ జాతీయ సదస్సు సోమవారం ముగిసింది. మూడు రోజులు పాటు నిర్వహించిన సదస్సులో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సును ఇస్సోపార్బ్ విజయ వాడ చాప్టర్ నిర్వహించింది. ప్రారంభోత్సవానికి ఇస్సోపార్బ్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నారా యణ జానా, కార్యదర్శి డాక్టర్ మిశ్రా చౌదరి, ఎన్టీఆర్యూహెచ్ఎస్ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి హాజరై అనేక అంశాలను చర్చించారు. చాప్టర్ అధ్యక్షురాలు డాక్టర్ కె.గీతాదేవి, కార్యదర్శి కె.లత ప్రాతినిథ్యం వహించగా 450 మంది ప్రతినిధులు హాజరైన కార్యక్రమంలో పెరినాటాలజీ, రీ ప్రొడక్ట్ మెడిషన్లోని పలు అంశాలను చర్చించారు. -
ట్రాక్టర్ అడ్డుపెట్టి దౌర్జన్యం
బల్లికురవ: కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. గ్రామ పంచాయతీ రోడ్డుపై ఏకంగా ట్రాక్టర్ అడ్డుపెట్టి రాకపోకలకు ఇబ్బందులు సృష్టించారు. ఫిర్యాదు చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వారి ‘పచ్చ’పాతానికి నిదర్శనంగా మారింది. ●వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని అంబడిపూడి గ్రామ పంచాయతీలోని చిన అంబడిపూడి గ్రామంలోని బీసీ కాలనీలో గత టీడీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి సర్పంచ్ మందలపు శ్రీలక్ష్మి, బుజ్జి ఆనందరావు ఇంటినుంచి పల్లపు రామకృష్ణారావు ఇంటివరకు సిమెంట్ రోడ్డు వేశారు. నిధుల లేమితో సైడు కాలువల పనులు నిలిచాయి. ఈ రోడ్డులోని టీడీపీ నాయకుడు మన్నం శ్రీను తన ఇంటిముందుకు మురుగు నీరు వస్తుందంటూ రోడ్డుపై మట్టికుప్పలు తోలి రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ ట్రాక్టర్ను అడ్డుపెట్టాడు. దీంతో స్థానికంగా ఉండే బాధితులు పల్లపు రామకృష్ణారావు, వెంకటరావు, వెంకటరమణ, శారద, మహేష్బాబులు ఇప్పటికే రెండు పర్యాయాలు గ్రీవెన్స్లో తహసీల్దార్ రవినాయక్కు, ఎంపీడీఓ కుసుమ కుమారికి ఫిర్యాదు చేశారు. ఇదంతా మనుసులో పెట్టుకున్న మన్నం శ్రీను నాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ గొడవలకు దిగడంతో ఫిర్యాదుదారులు ఐదుగురితో పాటు మన్నం శ్రీను ఆయన భార్య భూలక్ష్మిని జనవరి 23న తహసీల్దార్ వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా బైండోవర్ చేశారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదని తమ ఇంటి ముందు రోడ్డులో నడిచి వెళ్లలేకపోతున్నామని బాధితులు వాపోయారు. ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకుని రోడ్డుకు పెట్టిన అడ్డంకులను తొలగించి రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని బాధితులు కోరుతున్నారు. రాకపోకలకు తీవ్ర ఆటంకం బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామంలో టీడీపీ నేత దాష్టీకం -
విజ్ఞాన్లో డ్రోన్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో డ్రోన్ టెక్నాలజీ సెంటర్(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ అటానమస్ సిస్టమ్స్)ను హైదరాబాద్లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.విద్యాసాగర్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సెంటర్ వలన విద్యార్థులకు డ్రోన్్ డిజైన్, ప్రోగ్రామింగ్, డ్రోన్ల వినియోగంపై శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. టెక్నాలజీలో హ్యాండ్స్– ఆ అనుభవం కల్పించేందుకు ల్యాబ్ సౌకర్యాలు, విద్యాపరమైన కోర్సులు, వర్క్షాప్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఆటోనమస్ నావిగేషన్, రిమోట్ సెన్సింగ్పై ప్రత్యేక కోర్సులను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో వర్క్షాప్లు, సెమినార్లు, అతిథి ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పా టు చేస్తామన్నారు. విద్యార్థులకు కొత్త డ్రోన్ ఆధారిత స్టార్టప్లను ప్రారంభించేందుకు మద్దతు అందిస్తామని వివరించారు. పరిశ్రమలతో కలిసి కొత్త డ్రోన్న్ సొల్యూషన్న్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. డ్రోన్న్టెక్నాలజీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలతో సహకారానికి తోడ్పాటుపడతా మని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డ్రోన్న్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్పై పోటీలు నిర్వహించడం, డ్రోన్పై పై కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వైస్ చాన్స్లర్ పి.నాగభూషణ్ మాట్లాడుతూ ఈ డ్రోన్ టెక్నాలజీ సెంటర్ను హైదరాబాద్లోని ఎస్ఈసీ ఇండస్ట్రీస్ ప్రై వేట్ లిమిటెడ్ మరియు విజ్ఞాన్ యూనివర్సిటీల సంయుక్త ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ పాల్గొన్నారు. -
పోలీసుల తీరుతో ఆత్మహత్యాయత్నం
జె.పంగులూరు: పోలీసుల వేధింపులు భరించలేక వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన కొడుకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా ఆ డబ్బా లాక్కొని తల్లి తాగిన ఘటన బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం అలవలపాడులో సోమవారం రాత్రి జరిగింది. బాధితుల కథనం మేరకు.. రెండేళ్ల క్రితం అలవలపాడు గ్రామానికి చెందిన షేక్ ఇమామ్, అతని భార్య సల్మా కుటుంబ కలహాలతో విడిపోయారు. వారికి 18 నెలల పాప ఉంది. షేక్ ఇమామ్ తన భార్య తనవద్దకు రావాలని పెద్ద మనుషులను పిలిపించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక చట్టపరంగా విడాకులు కావాలని కోరాడు. దీంతో సల్మా తనను గృహహింస చేస్తున్నారంటూ భర్త, అత్త మరికొందరిపై రేణింగవరం స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇమామ్ కుటుంబం మొదటి నుంచి వైఎస్సార్ సీపీ సానుభూతిపరులుగా ఉండేవారు. ఈ కేసును ఆసరాగా చేసుకుని కొందరు టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తేవడంతో ఇమామ్ కుటుంబంతో సంబంధం లేని మరో తొమ్మిది మందిపై రేణింగవరం ఎస్ఐ వినోద్బాబు 498 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రతి రోజూ తొమ్మిది మందిని ఎస్ఐ స్టేషన్కి పిలిపించి వేధిస్తున్నారు. అంతటితో ఆగకుండా సోమవారం ఎస్ఐ తనతో దురుసుగా ప్రవర్తించారని, ‘నీ భార్య బంగారం ఆమెకు ఇచ్చేయి. లేకుంటే నీపై దొంగతనం కేసు నమోదు చేస్తా.. నీ కుటుంబాన్ని రోడ్డు కీడుస్తా..బంగారాన్ని సీజ్ చేస్తా.. జీవితంలో బయటకు రాకుండా చేస్తా..’ అంటూ దురుసుగా మాట్లాడాడని బాధితుడు ఇమామ్ వాపోయాడు. ఎస్ఐ మాటలు భరించలేక పురుగుల మందు తాగి చనిపోదామని తెచ్చుకుంటే.. ఆ మందు డబ్బాను లాక్కొని ఇమామ్ తల్లి గాలీబ్బీ తాగింది. ఆమెను హుటాహుటిన అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ విషయంలో ప్రమేయం లేని తన చెల్లెలిని పసిపిల్ల తల్లి అని కూడా చూడకుండా రాత్రిళ్లు స్టేషన్కు పిలిపించి టార్చర్ పెడుతున్నారని బాధితుడు కన్నీటిపర్యంతం అయ్యాడు. ఈ విషయమై ఎస్ఐను వివరణ కోరగా దంపతుల మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఇద్దరినీ పిలవగా, సల్మా స్టేషన్కు వచ్చేందుకు ఇష్టపడటం లేదని, కోర్టులో ఈ వ్యవహారం తేల్చుకోమని చెప్పడం మాత్రమే జరిగిందని తెలిపారు. కొడుకు చేతిలోని పురుగుల మందు డబ్బా లాక్కొని తాగిన తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలు -
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె రూరల్: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే.ఝాన్సీ అన్నా రు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవో ఎం.సుచిత్రకు అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం వినతిపత్రం అందజేసి అనంతరం మాట్లాడారు. అంగన్వాడీలకు గ్రాడ్యుటీని వెంటనే అమలు చేయాలన్నారు. అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలన్నారు. కనీస వేతనం రూ.26000 అందించాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్ధిష్టమైన గైడ్లైనెన్స్ను రూపొందించి అమలు చేయ్యాలన్నారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయాలన్నారు. సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చు లకు రూ.20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. సమ్మెకాలంలో చనిపోయిన వారికి సైతం ఇదే విధానాన్ని కొనసాగించాలన్నారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలని, అన్నియాప్లు కలిపి ఒకేయాప్ మార్పు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెనూ చార్జీలు పెంచటంతో పాటు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయ్యాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ కనీసం మూడు నెలలు ఇవ్వాలన్నారు. ప్రీ స్కూల్ బలోపేతం చేయ టంతో పాటు ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎన్. కృష్ణకుమారి కె.రత్నకుమారి, నిర్మల జ్యోతి, డి.జ్యోతి, శ్రీలక్ష్మి, రాజ్యలక్ష్మి, సీఐటీయూ నాయకులు కె.వి.లక్ష్మణరావు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఝాన్సీ -
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు
రూ.2.40 లక్షల విలువైన 24 కిలోల గంజాయి పట్టివేత నగరంపాలెం: ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో సోమవారం ట్రైనీ ఐపీఎస్ దీక్ష, జిల్లా ఏఎస్పీ కె. సుప్రజ (క్రైం)తో కలిసి కేసు వివరాలను ఆయన తెలిపారు. గుంటూరు రూరల్ మండలం శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి సమీపాన ఉంటున్న దమ్మాలపాటి మణికంఠ ఏడో తరగతి వరకు చదివాడు. చెడు అలవాట్లకు బానిసయ్యాడు. బేల్దారి పనులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్గా వెళ్లేవాడు. గతేడాదిలో వైజాగ్ వెళ్లి, తిరుగు ప్రయాణంలో తునిలో దిగి, గంజాయి ఎక్కడ విక్రయిస్తారని వాకబు చేశాడు. అనంతరం విశాఖపట్నం జి.మడుగు మండలం పెద్ద కిల్తారికి చెందిన చింతల సత్యనారాయణ అలియాస్ సతీష్తో పరిచయమైంది. దీంతో రూ.10 వేలకు రెండు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. అక్కడ నుంచి ప్రతిసారి బస్లో వెళ్లి, రైళ్ల ద్వారా గుంటూరుకు గంజాయి తెచ్చేవాడు. యాభై గ్రాములు సంచులను రూ.500కు విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ క్రమంలో రెండు రోజుల కిందట చింతల సత్యనారాయణకు ఫోన్ చేసి భారీగా గంజాయి కావాలని అడిగాడు. దీంతో సత్యనారాయణ భార్య చింతల పద్మ 24 కిలోల గంజాయిని సోమవారం మణికంఠ నివాసానికి తీసుకువచ్చింది. ముందస్తు సమాచారంతో మణికంఠను, చింతల పద్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.40 లక్షల ఖరీదు చేసే 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సతీష్ను త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. -
కొలిక్కి రాని బంగారం చోరీ కేసు
మంగళగిరి: బంగారం చోరీ కేసు పోలీసు అధికారులకు అంతుచిక్కడం లేదు. రూ.5 కోట్ల అని చెబుతుండడంతో అధికారులు లోతైన విచారణ చేపట్టారు. సోమవారం ఎస్పీ సతీష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులకు దర్యాప్తుపై పలు సూచనలు చేశారు. ఏఎస్పీ రవి కుమార్ నేతృత్వంలో ఫిర్యాదుదారుడు దివి నాగరాజుతో పాటు దుకాణంలో పని చేస్తున్న ఐదుగురు యువకులను రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారిస్తున్నారు. పట్టణానికి చెందిన దివి రాము, విజయవాడలో డీవీఆర్ జ్యూయలరీ దుకాణం నిర్వహిస్తుంటాడు. అందులో మేనేజర్గా పనిచేసే దివి నాగరాజు ఈ నెల 15వ తేదీ రాత్రి సుమారు ఐదు కిలోల వివిధ రకాల బంగారు ఆభరణాలను సంచిలో పెట్టుకుని స్కూటీపై వస్తుండగా ఆత్మకూరు బైపాస్లోని అండర్ పాస్ వద్ద గుర్తు తెలియని ఇద్దరు యువకులు అడ్డుకుని సంచిని లాక్కుని పారిపోయారని మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో చోరీ జరిగిన తీరుపై ట్రయల్ రన్ నిర్వహించారు. సంచి లాక్కుని వెళ్లిన తీరుపై నిర్వహించిన ట్రయల్ రన్లో లాగినా సంచి చేతికి వచ్చే అవకాశం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విజయవాడలో ఆభరణాలతో బయల్దేరిన నాగరాజు ఏ మార్గంలో మంగళగిరి చేరుకున్నారనే అంశంపై సీసీ కెమెరాలను పరిశీలించారు. విజయవాడ దుకాణం వద్ద నుంచి కెమెరాలను పరిశీలించిన పోలీసులు 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ఇద్దరు వ్యక్తులు నాగరాజును వెంబడించినట్లు గుర్తించి వారిని అనుమానిస్తున్న పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. దీంతో అసలు చోరీ జరిగిందా లేదా అనే అంశంతో పాటు చోరీ జరిగిన రోజున దుకాణంలో ఐదు కేజీల బంగార ఆభరణాలున్నాయా.. ఆభరణాలు తయారు చేయించుకున్న దుకాణదారులు, కస్టమర్లు ఎవరు అనే కోణంలోను దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీష్ కుమార్ -
దైవ దర్శనానికి వెళ్లి వస్తూ..
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఇద్దరికి గాయాలు మార్టూరు: దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఇంటికి చేరకుండానే ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈఘటన మార్టూరు 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. హైవే అంబులెన్స్ సిబ్బంది రవి, స్థానికుల వివరాల మేరకు.. జూలూరు శ్రీకృష్ణ (40), జూలూరు వంశీకృష్ణ, కె.వివేక్లు తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని తిరిగి నూజివీడుకు కారులో బయలుదేరారు. సరిగా ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో స్థానిక దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి మొదట ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం డివైడడ్ను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు తీవ్రంగా ధ్వంసం కాగా అందులో ఉన్న ముగ్గురిలో జూలూరు శ్రీకృష్ణ (40) ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మిగిలిన వంశీకృష్ణ, వివేక్లు గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది క్షతగాత్రులను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
కాజ టోల్ ప్లాజాను రద్దుచేయాలి
మంగళగిరి టౌన్: మంగళగిరి– తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని అధిక టోల్ఫీజు వసూలు చేస్తున్న కాజ టోల్ప్లాజాను వెంటనే రద్దు చేయాలని ప్రయాణికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ బాల వెంకటరావు, ప్రధాన కార్యదర్శి నన్నపనేని నాగేశ్వరరావు కోరారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రెస్క్లబ్లో సోమ వారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కాజ టోల్గేట్ వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 79 కిలోమీటర్ల దూరంలో టోల్ప్లాజా ఉండకూడదని దీనిపై లారీ ఓనర్స్ మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు. గతంలో రూ.150 ఉండే టోల్పాస్ ఇప్పుడు రూ.340 చేశారని దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ఈ టోల్గేటును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. -
‘ప్రకృతి’తో ఆరోగ్యకర పంటలు
ప్రకృతి వ్యవసాయం జిల్లా అడిషనల్ డీపీఎం మోహన్ యద్దనపూడి: ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వనరులను వినియోగించుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని ప్రకృతి వ్యవసాయశాఖ అడిషనల్ డీపీఎం మోహన్ అన్నారు. సోమవారం మండలంలోని పూనూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్పీఎం (పురుగు మందులు లేని వ్యవసాయం) దుకాణం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విచక్షణ రహితంగా ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల ప్రస్తుతం భూసారం క్షీణించి గాలి, నీరు కలుషితమవటంతో పాటు ప్రజలు అనారోగ్యంతో బాధపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని నివారణకు ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఇంటిలో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు పండించుకొని ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు. ఎన్ఎఫ్ఏ శ్రీనివాసరావు, ఎన్పీఎం మాస్టర్ ట్రైనర్ భీమరాజులు మాట్లాడారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది తయారు చేసిన కషాయాలను పరిశీలించారు. మాస్టర్ ట్రైనర్ వెంకటేశ్వర్లు, వ్యవసాయాధికారి మేరమ్మ, హోమియో వైద్యాధికారి గుర్రం అంజమ్మ, మండల సమైఖ్య అధ్యక్షురాలు బత్తుల కృష్ణవేణి, ఎల్టూలు వెంకటరత్నం, కోటిబాబు, మోడల్ మేకర్ నాగరాజు, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల నేస్తమై.. భద్రతే సమస్తమై..
ఒక్క క్షణం కన్ను మరల్చినా.. దాని పర్యవసానం మాత్రం నిండు ప్రాణాలే. కానీ స్టీరింగ్ పట్టిన మరుక్షణం వారికి ఒకటే ధ్యాస.. తనని నమ్ముకుని వెనుక ప్రయాణికులున్నారని.. వారిని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఉంటాయని! అలా దాదాపు 25 నుంచి 34 ఏళ్లలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా సురక్షిత డ్రైవింగ్ చేసిన వారికి ఉత్తమ పురస్కారాలను అందించి ఆర్టీసీ ప్రత్యేక గుర్తింపునిచ్చింది. పట్నంబజారు: రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రమాదరహిత కెరీర్ కొనసాగించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన డ్రైవర్లకు పురస్కారాలు అందజేశారు. గుంటూరు 1, 2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలకు ముగ్గురు చొప్పున 15 మందికి వీటిని ప్రదానం చేశారు. వీరితోపాటు జిల్లా స్థాయిలో మరో ముగ్గురికి అత్యుత్తమ డ్రైవర్ పురస్కారాలను అందజేశారు. గుంటూరు జిల్లాలోని ఐదు డిపోలలో 345 బస్సులు ఉన్నాయి. 642 మంది డ్రైవర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. నిత్యం జిల్లా వ్యాప్తంగా లక్ష మందికిపైగా ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఆర్టీసీలో కొత్తగా నియామకాలు నిలిచిపోయాయి. వేల మంది డ్రైవర్లు ఉద్యోగ విరమణ, మెడికల్ అన్ఫిట్ పొందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఉన్న డ్రైవర్లతోనే చాలాచోట్ల డబుల్ డ్యూటీలు చేయిస్తున్నారు. వారికి తగిన విశ్రాంతి ఉండటం లేదు. రిటైర్డు అయిన డ్రైవర్లకు పెన్షన్ తక్కువ మొత్తంలో వస్తోంది. పురస్కారాలు పొందిన డ్రైవర్లు వీరే... జిల్లా స్థాయిలో ఎల్ఎస్ రావు, కేఎస్ రెడ్డి, బీఎస్ రెడ్డి పురస్కారాలు పొందారు. గుంటూరు 1 డిపో పరిధిలో ఆర్ఎన్ రావు, ఏవీ రాజు, కేవై కొండలు, గుంటూరు 2 డిపో పరిధిలో పీవీ రత్నం, జేఎల్ రెడ్డి, ఎస్ సుబ్బారావు, తెనాలి డిపో నుంచి కేవీ రెడ్డి, ఎంఎం కుమార్, బీకే అంకమ్మ, పొన్నూరు డిపోలో షేక్ జి.గౌస్, పీకే ఖాన్, జీఎస్ఎస్ రావు, మంగళగిరి డిపో నుంచి డి.యోహాన్, బీవీ రావు, కేఎస్ఎస్ రావులకు అవార్డులు అందజేశారు. వీరికి 25 నుంచి 34 సంవత్సరాల వరకు ఎలాంటి ప్రమాదం లేకుండా డ్రైవింగ్ చేసిన రికార్డు ఉంది. దశాబ్దాలుగా ప్రమాదరహిత డ్రైవింగ్ చేసిన వారికి పురస్కారాలు అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆర్టీసీ అధికారుల సూచన -
కళలు దైవ ప్రసాదితాలు
అద్దంకి: కళలు దైవ ప్రసాదితాలని సినీ సాహితీ విమర్శకుడు వారణాసి రఘురామశర్మ అన్నారు. నాటకరంగంలో అపూర్వ ప్రతిభ కనబరచి వేలాది ప్రదర్శనలతో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు అద్దంకి (తన్నీరు) నాగేశ్వరరావుకు సాహితీ కౌముది ఆధ్వర్యంలో ఆదివారం ‘పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మల విశిష్ట కళా పురస్కారం – 2025’ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పుట్టంరాజు కళాక్షేత్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురామశర్మ మాట్లాడుతూ పట్టణానికి చెందిన ప్రముఖ రంగస్థల నటుల్లో ఒకరైన నాగేశ్వరరావు సుదీర్ఘ కాలంగా అంకితభావంతో నటించారని తెలిపారు. 3 వేలకు పైగా ప్రదర్శనల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారని చెప్పారు. ఆయన చింతామణి నాటకంలో శ్రీహరి వేషధారణలో చేసే నటన అపూర్వమన్నారు. పూర్వకాలంలో రంగస్థలంపై పురుషులే సీ్త్ర పాత్రలు ధరించేవారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఇతర నాటకాల్లో సీ్త్ర పాత్రలు వారే ధరిస్తున్నా, చింతామణిలో మాత్రం పురుషులే శ్రీహరి పాత్ర ధరిస్తూ మెప్పిస్తున్నారని చెప్పారు. ఆ కోవకు చెందిన నటుడే నాగేశ్వరరావు అని అభినందించారు. సీ్త్ర పాత్రను పురుషుడు మెప్పించడం చాలా కష్టమన్నారు. అదంతా దేవుడు వారికి ప్రసాదించిన వరమన్నారు. పదికాలాల పాటు నాగేశ్వరరావు ఇలాగే కళా సేవ చేస్తూ ఉండాలని ఆకాంక్షించారు. తరువాత పుట్టంరాజు బుల్లెయ్య , రామలక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ పక్షాన పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి దంపతులు పురస్కారాన్ని నాగేశ్వరరావుకు అందించారు. దానిలో భాగంగా దుశ్శాలువాతో సత్కరించి మెమెంటో, ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేశారు. ఆర్వీ రాఘవరావు, పీసీ హెచ్ కోటయ్య, షేక్ మస్తాన్, లాయర్ రమేష్, ఐ.హనుమంతరావు, ఉప్పు కృష్ణ, గుంటూరు ఆచారి, ఒంగోలు జయబాబు, గండ్రకోట నరసింహారావు, ఆలకుంట శ్రీనివాసరావు, అడుసుమల్లి అనంత కోటేశ్వరరావు పాల్గొన్నారు. వారితోపాటు సాహితీ, నాటకరంగ ప్రముఖులు, సాంస్కృతిక వేత్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పురస్కార గ్రహీతకు అభినందనలు తెలిపారు. వారణాసి రఘురామ శర్మ నాగేశ్వరరావుకు కళా పురస్కారం ప్రదానం -
డాక్టర్ ప్రజ్ఞాచారికి ‘కళా కిరీటి’ అవార్డు
తెనాలి: రూరల్ మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సాహితీవేత్త డాక్టర్ నూతక్కి పూర్ణ ప్రజ్ఞాచారికి గోదావరి కల్చరల్ అసోసియేషన్ కళా కిరీటి జాతీయ పురస్కారాన్ని అందజేసింది. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ పంచమ వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఈ అవార్డు అందజేశారు. తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు పరిధిలోని మలికిపురంలో ఆదివారం కళా కిరీటి జాతీయ పురస్కారాలను బహూకరించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, గోదావరి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు చొప్పర శ్రీనివాస్, శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమడ ప్రతాప్, గోకా వెంకట్రావ్, నరసింహమూర్తి తదితరులు డాక్టర్ పూర్ణ ప్రజ్ఞాచారిని ఘనంగా సత్కరించారు. -
పండితులను తీర్చిదిద్దిన సంస్కృత కళాశాల
తెనాలి: చరిత్రపుటల్లో తెనాలి సంస్కృత కళాశాల చిరస్మరణీయంగా నిలిచిపోతుందని రామాయణ ప్రవచన సుధాకర, సంస్కృత కళాశాల విశ్రాంత ప్రధాన ఆచార్యులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు అన్నారు. శతాధిక వసంతాలు నడిచిన తెనాలిలోని కోట లక్ష్మయ్యనాయుడు సంస్కృత కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం ప్రథమ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం స్థానిక రాష్ట్రప్రభుత్వ పెన్షనర్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. పూర్వవిద్యార్థులు, అధ్యాపకుల జ్ఞాపకాలతో రూపొందించిన ప్రత్యేక సంచిక ‘మనోరమ’ను ఆవిష్కరించారు. కళాశాల పూర్వ విద్యార్థి, ఆగమ పండితుడు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కళాశాల భవన దాత ముదిగొండ చంద్రమౌళిశాస్త్రి ఆశయాలకు అనుగుణంగా కళాశాల ఏర్పాటై వందేళ్లకు పైగా నడిచినా తర్వాత మూతపడటం బాధాకరమన్నారు. ఎందరో గొప్ప పండితులను తీర్చిదిద్దిన కళాశాల ప్రస్తుతం ఇలా కావడం కలచి వేస్తోందన్నారు. కళాశాల చరిత్ర నిలిచి ఉండేందుకు పూర్వ విద్యార్థుల సంఘం మహాసంకల్పం చేసిందన్నారు. తిరిగి అదే కళాశాలలో సాహిత్యానికి, భాషకు సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశలో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. దాతల ఆశయానికి అనుగుణంగా విద్యను అభ్యసించి సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి వ్యక్తి తిరిగి అదే కళాశాలలో మరెన్నో జ్ఞాన జ్యోతులను వెలిగించడానికి ప్రయత్నించాలని కోరారు. సంఘం కన్వీనర్ పి.వినాయకరావు, దేవయజనం మురళీకృష్ణ, ఈఎల్వీ అప్పారావు, చిలుమూరు రామలింగేశ్వరరావు కె.శ్రీనివాస్ శర్మ, మేడూరు శ్రీనివాసమూర్తి, ఎ.సూర్యనారాయణ, జయప్రద, ఎం.సుధారాణి, సద్యోజాతం శేష వీరేశ్వర శర్మ, ఎం.సత్యనారాయణ శాస్త్రి, లక్ష్మీనరసింహారావు, జె.అరుణ గోపాలచార్యులు, ముదిగొండ శ్రీరామ్ మాట్లాడారు. బోధనా సిబ్బంది కొందరు కాలం చేయగా, వారి కుటుంబసభ్యులను సత్కరించారు. పూర్వజన్మ సుకృతం కళాశాల పూర్వ విద్యార్థిని, తెలుగు సంస్కృత అకాడెమీ మాజీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఈ కళాశాల తనకు భాషా పరిజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించిందని చెప్పారు. సంస్కృత కళాశాలలో చదవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఉత్తమ జ్ఞానాన్ని, నడవడికను కూడా పొందగలిగామని పేర్కొన్నారు. మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు. డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు -
విశ్వకర్మను పూజిస్తే సకల శుభాలు
తెనాలి: శ్రీవిరాట్ విశ్వకర్మను పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) అన్నారు. పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తెనాలి వచ్చిన ప్రజ్ఞానంద సరస్వతి రెండోరోజైన ఆదివారం స్థానిక కొత్తపేటలోని శ్రీవిరాట్ విశ్వకర్మ దేవస్థానానికి విచ్చేశారు. విశ్వకర్మకు, కామాక్షి అమ్మవారికి, దాసాంజనేయస్వామికి హారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ప్రవచించారు. శ్రీవిరాట్ విశ్వకర్మ దేవాలయంలో ఆరికట్ల వెంకటేశ్వరరావు అర్చకత్వం చేసినరోజుల్లో తాను వారి శిష్యరికంలో పూజాకార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తుచేసుకున్నారు. వెంకటేశ్వరరావు కాలం చేశాక, తాను అర్చకత్వ బాధ్యతను స్వీకరించి కొంతకాలం ఆ బాధ్యతలను నిర్వర్తించానని చెప్పారు. ఆ కారణంగానే శ్రీవిరాట్ విశ్వకర్మ, కామాక్షి అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఆలయానికి వచ్చినట్టు వివరించారు. కార్యక్రమంలో దేవాలయం ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి, అర్చకుడు టీవీఎల్ కాంతారావు, కమిటీ సభ్యులు తాళాబత్తుని ఉదయశంకర్, మానేపల్లి జేజిబాబు, జి.సాయి, లక్ష్మీపతి, జి.అర్జున్, సాయి ఈశ్వరశర్మ, కె.నరేంద్ర, ముద్దాభక్తుని రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
బంగారం దోపిడీపై ఎన్నో అనుమానాలు
మంగళగిరి: నగర పరిధిలోని ఆత్మకూరు సాయిబాబా ఆలయం వద్ద శనివారం రాత్రి జరిగిన బంగారం దోపిడీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నార్త్ జోన్ డీఎస్పీ మురళీకృష్ణ నేతృత్వంలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. పట్టణంలోని కొప్పురావు కాలనీకి చెందిన దివి నాగరాజు విజయవాడలో డీవీఆర్ గోల్డ్ షాపు నడుపుతున్నారు. శనివారం రాత్రి సుమారు 5 కేజీల బంగారాన్ని తన వద్ద పని చేసే యువకుడితో మంగళగిరి ఇంటికి పంపారు. యువకుడు ఆత్మకూరు జంక్షన్ వద్దకు వచ్చేసరికి కొందరు దుండగులు అడ్డగించి బంగారం దోచుకుని పారిపోయారని నాగరాజు రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. వాస్తవాలు తేల్చే పనిలో పోలీసులు ఈ ఘటనపై పలు అనుమానాలు రావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నాగరాజు అప్పుల బాధ తట్టుకోలేక గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూడు నెలల క్రితం నాగరాజు సతీమణి కుటుంబ కలహాల నేపథ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లతో నాగరాజు అప్పుల్లో కూరుకుపోయి వాటి నుంచి బయటపడేందుకు బంగారం దోపిడీ నాటకం ఆడారా? అనే కోణంలో విచారిస్తున్నారు. బంగారం తీసుకెళ్లిన యువకుడిని పోలీసులు విచారిస్తుండగా... నాగరాజు సోదరుడు దివి రవి వచ్చి అతడు చాలా నమ్మకస్తుడని చెప్పారు. అతడిని విచారించవద్దని పోలీసులతో పేర్కొనడం గమనార్హం. ఆత్మకూరు జంక్షన్లో సంఘటన జరిగినట్లు చెబుతున్న సమయం రాత్రి 7.30 నుంచి 10.30 గంటల వరకు సీసీ టీవీ ఫుటేజీలో దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు. బంగారం తరలించిన యువకుడి వాహనం సైతం ఫుటేజీలో లేకపోవడంతో పోలీసుల అనుమానం బలపడుతోంది. ఇప్పటికే పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని దుకాణానికి తీసుకెళ్లి విచారించారు. -
సూర్య భగవానునికి 241 పాత్రలతో పాయసం నివేదన
మంగళగిరి టౌన్: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ వేదిక ప్రాంగణంలో మాఘ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సూర్య భగవానుడికి వాసవీ క్లబ్, వాసవీ పరివార్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహిళా సభ విభాగాల ఆధ్వర్యంలో 241 పాత్రలతో పాయసంతో సూర్య భగవానుడికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఆవు పాలు, పిడకలతో ఏక కాలంలో శ్రీ సూర్యనారాయణస్వామికి పాయసం వండి నివేదించడం ఎంతో శుభప్రదమని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతోమంది మహిళలు పాల్గొన్నారని నిర్వాహకులు తెలియజేశారు. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారమని, ఆ రోజున తలపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రోగ్రాం ఆర్గనైజర్, కో–ఆర్డినేటర్ సుజాత, రామకృష్ణ పాల్గొన్నారు. ‘రాష్ట్ర సమ్మాన్’ పురస్కారం ప్రదానంతెనాలి: తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో సంస్కృతి కళాక్షేత్ర ఇంటర్నేషనల్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని జీపీ బిర్లా సైన్స్ ఆడిటోరియంలో జరిగిన భారత్ ఉత్సవ్–2025లో తెనాలికి చెందిన చిన్నారి మేధావి బండికళ్ల ప్రదీప్ నారాయణకు ‘రాష్ట్ర సమ్మాన్’ అవార్డును ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళా, సాంస్కృతిక రంగాల ప్రముఖులు హాజరై చిన్నారిని అభినందించారు. భవిష్యత్లో మరిన్ని ఘనతలు సాధించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఏడాదిన్నర వయసు నుంచే అద్భుత జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తున్న ప్రదీప్నారాయణ మూడేళ్ల వయసులో జాతీయ గీతాన్ని 52 సెకన్లలో ఆలపిస్తున్నాడు. పండ్లు, కూరగాయలు, మనిషి శరీర భాగాలు వంటివి 500 పైగా గుర్తిస్తున్నాడు. తెలంగాణ ‘రాష్ట్ర సమ్మాన్’ సహా ఇప్పటికి ఎనిమిది జాతీయ పురస్కారాలు, అంతర్జాతీయ స్థాయిలో పది అవార్డులు అందుకున్నాడు. కస్టమ్స్ అధికారులు అవయవదానం లక్ష్మీపురం: కస్టమ్స్ డే వేడుకలలో భాగంగా కస్టమ్స్, జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి దంపతులు అవయవదానం చేశారు. విజయవాడలో శనివారం నిర్వహించిన వేడులలో ఆయన మాట్లాడుతూ బాక్స్ ఆఫ్ కై న్డ్ నెస్ స్థాపకులు ఒకే రోజు 4 వేల మందితో రక్తదానం చేయించారని అభినందించారు. ప్రతిఒక్కరు సేవాభావం, మానవత్వం కలిగి ఉండాలన్నారు. తాను, తన సతీమణి అవయవదానం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రాంగణంలో ఉన్న కస్టమ్స్ శాఖ అధికారులు 36 మంది కూడా అవయవదానం చేస్తూ అంగీకారపత్రం ఇచ్చారు. సెప్ట్క్ ఛైర్పర్సన్ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఇంతమంది అవయవదాతలుగా నమోదు కావడం సంతోషకరంగా ఉందన్నారు. ఆకట్టుకున్న గాత్ర కచేరీ నగరంపాలెం: స్థానిక లక్ష్మీపురం శ్రీత్యాగరాజ కళావేదికపై విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్యాగరాజ నీరాజనం ఆదివారంతో ముగిసింది. డీవీర్ సీత గాత్ర కచేరీని త్యాగరాజ కీర్తన, నిన్నే భజన అనే కీర్తనతో ప్రారంభించారు. పలు వాగ్గేయకార కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. ఆమెకు వాయులీనంపై వారణాసి శ్రీకృష్ణ రాఘవ, మృదంగంపై బి.సురేష్బాబు వాయిద్య సహకారాన్ని అందించారు. కళాకారులను ఎం.వై.శేషురాణి, ప్రముఖ సాహితీవేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లు, నేతి విశ్వేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి మోదుగుల రవికృష్ణ, కన్వీనర్ చంద్రమోహన్ పాల్గొన్నారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 17 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025తేజోరూపిణిగా బగళాముఖి చందోలు(కర్లపాలెం): గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారు ఆదివారం భక్తులకు తేజోరూపిణిగా దర్శనంఇచ్చారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మాఘ మాస అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 538.50 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 10,000 క్యూసెక్కులు విడుదలవుతోంది. వీరుల గుడికి వీరాచారులు కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెం పూడిలో ఉన్న పల్నాటి వీరుల గుడికి వివిధ ప్రాంతాల నుంచి ఆదివారం వీరాచారులు తరలివచ్చారు.సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో జీబీ సిండ్రోమ్ (గులియన్బెరి సిండ్రోమ్) కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు జీజీహెచ్లో ఆదివారం ప్రకాశం జిల్లా అలసానిపల్లెకు చెందిన బి.కమలమ్మ(45) చికిత్స పొందుతూ మృతి చెందింది. జీబీ సిండ్రోమ్తో ఈ నెల 3న జీజీహెచ్ న్యూరాలజీ వార్డులో అడ్మిట్ అయి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆదివారం కార్డియాక్ అరెస్ట్తో చనిపోయింది. వాస్తవానికి ప్రతినెలా గుంటూరు జీజీహెచ్లో పది మంది నుంచి పదిహేను మంది ఈ వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు చెందిన వారు గుంటూరు జీజీహెచ్కు తరలి వస్తున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జీజీహెచ్లో జీబీ సిండ్రోమ్ కేసులకు న్యూరాలజీ వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. ఖరీదైన ఇంజక్షన్లను తక్షణమే ఇస్తున్నట్లు న్యూరాలజీ వైద్యులు తెలిపారు. భయపడాల్సిన పనిలేదు... ఆదివారం చోటు చేసుకున్నది తొలి మరణమేమీ కాదని... గత ఏడాది కాలంలో ఈ ఆస్పత్రిలోనే నలుగురు వ్యాధి బాధితులు మృతి చెందినట్లు చెబుతున్నారు. ఖరీదైన వైద్యం అవసరమేగానీ, వ్యాధికి భయపడాల్సిన పని లేదని వైద్యులు పేర్కొన్నారు. లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం కమలమ్మ మృతి చెందింది. కాగా, నరసరావుపేటకు చెందిన మరో మహిళ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిలో ఇద్దరు గుంటూరు జిల్లాకు చెందిన వారు. వీరి పరిస్థితి నిలకడగా ఉందని న్యూరాలజిస్టులు వెల్లడించారు. నెలకు 10 నుంచి 15 కేసులు న్యూరాలజీ వైద్య విభాగానికి ప్రతి నెల సగటున 10 నుంచి 15 జీబీ సిండ్రోమ్ కేసులు వస్తూనే ఉన్నాయి. ఒక్కో పేషెంట్కు ఖరీదైన ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి వస్తోంది. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జీజీహెచ్లో 115 మంది చికిత్స పొందారు. కాగా వీరిలో 66 మందికి మాత్రమే ఇంట్రావీనస్ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు చేయడం ద్వారా వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇతరులు సాధారణ వైద్యం ద్వారానే రికవరీ అయినట్లు న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి మాత్రమే ఇంజక్షన్లు అవసరం వస్తుందని తెలిపారు. ఒక్కో ఇంజక్షన్ రూ. 50 వేల వరకు ఉంటుందన్నారు. బాధితుల్లో 20 శాతం మందికి మాత్రమే ఈ ఇంజక్షన్లు చేయాల్సి వస్తోందని తెలిపారు. చికిత్స పొందుతున్న వారిలో కేవలం 5 నుంచి 7.5 శాతం మంది మాత్రమే మరణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. నెల బాధితుల సంఖ్య 2024 మార్చి 16 ఏప్రిల్ 6 మే 11 జూన్ 10 జూలై 4 ఆగస్టు 3 సెప్టెంబరు 13 అక్టోబరు 17 నవంబరు 9 డిసెంబరు 10 2025 జనవరి 11 ఫిబ్రవరి 5 ఎలా వస్తుందంటే.. 7న్యూస్రీల్పూర్వజన్మ సుకృతం కళాశాల పూర్వ విద్యార్థిని, తెలుగు సంస్కృత అకాడెమీ మాజీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... ఈ కళాశాల తనకు భాషా పరిజ్ఞానాన్ని, సంస్కారాన్ని అందించిందని చెప్పారు. సంస్కృత కళాశాలలో చదవడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఉత్తమ జ్ఞానాన్ని, నడవడికను కూడా పొందగలిగామని పేర్కొన్నారు. మూతబడిన కళాశాలను కనీసం సాహిత్యానికి సంబంధించిన ఉత్తమ గ్రంథాలయంగా రూపొందిస్తే సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. అందుకు తన వంతు సహాయం అందిస్తామన్నారు. గుంటూరు జీజీహెచ్లో బాధితురాలి మృతి ప్రతినెలా సగటున 10 నుంచి 15 మందికి చికిత్స సత్వర వైద్యసేవలు అందిస్తుండటమే కారణం భయపడాల్సిన పనిలేదంటున్న వైద్య నిపుణులు వయస్సుతో సంబంధం లేకుండా.. ఆడ, మగ తేడా లేకుండా జీబీ సిండ్రోమ్ సోకుతుంది. ఇది అంటు వ్యాధి మాత్రం కాదు. 25 శాతం మందికి ఈ వ్యాధి సోకడానికి కారణాలు తెలియదు. 20 శాతం మందికి దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, రిస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వల్ల సోకుతోంది. గ్యాస్ట్రో ఎంట్రైటీస్ (జీఈ) ఇన్ఫెక్షన్ వల్ల, డయేరియా వల్ల కూడా వస్తోంది. కాళ్లు, చేతులు చచ్చుబడిపోవడం వ్యాధి సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణం. వ్యాధి నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తొలుత కాళ్లకు వ్యాధి సోకి తర్వాత శరీరం పై భాగానికి ఎగబాకుతుంది. వ్యాధి నుంచి కొంత మంది గంటల వ్యవధిలోనే కోలుకోవచ్చు. మరికొంత మందికి నెలల సమయం పడుతుంది. జ్వరం, విరేచనాలు, దగ్గు, జలుబు వచ్చి తగ్గుతున్న సమయంలో వారికి కాళ్లల్లో, చేతుల్లో తిమ్మిర్లు ప్రారంభమై కాళ్లు బలహీనపడితే దీనిని జీబీ సిండ్రోమ్గా గుర్తించాలి. తక్షణమే చికిత్స కోసం న్యూరాలజిస్టులను సంప్రదించాలి. -
సేవాలాల్ జయంతి నిర్వహణలో ప్రభుత్వం విఫలం
యడ్లపాడు: శ్రీ సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీనునాయక్ విమర్శించారు. యడ్లపాడు ఎర్రకొండ సమీపన ఉన్న సుగాలీ కాలనీలో ఎస్టీ యూత్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనునాయక్ మాట్లాడుతూ తండాలో జన్మించి నిలువెల్లా సేవాగుణం నిండుకొన్న సంత్ సేవాలాల్ బ్రిటిష్ పాలకులను అడ్డుకున్న ధీశాలి అన్నారు. సేవాలాల్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం క్యాజువల్ లీవ్గా ప్రకటించగా, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారని, ఇక్కడి కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో విఫలమైందన్నారు. ముందుగా కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సుగాలి వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు బాణావతు శ్రీనునాయక్, ముడావతు బాలాజీ నాయక్, హనుమానాయక్, రమావతు శ్రీనునాయక్, అంజినాయక్, దశావతు శంకర్ నాయక్, వెంకట్నాయక్, శివకృష్ణ నాయక్, రావూరి దుర్గానాయక్ పాల్గొన్నారు. ఏపీ గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీనునాయక్ -
ఫుట్బాల్ విజేత బాపట్ల జట్టు
చీరాల రూరల్: చీరాలలోని ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో నాలుగు జిల్లాల జోనల్ స్థాయిలో (నల్లమల జోన్) ఆదివారం నిర్వహించిన ఫుట్బాల్ మీట్లో బాపట్ల జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో నల్లమల జోన్లోని గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల అసోసియేషన్ జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాపట్ల జిల్లా జట్ల క్రీడాకారులు వీరోచితంగా పోరాడి మూడు జట్లు క్రీడాకారులను మట్టి కరిపించి విజేతగా నిలిచారు. ఉత్తమ ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అనంతపురంలో మార్చి 25 నుంచి నిర్వహించనున్న హైలీగ్ పోటీలకు పంపిస్తామని జోనల్ స్థాయి కోఆర్డినేటర్ నూతలపాటి దేవదాసు తెలిపారు. ఈ పోటీల్లో బాపట్ల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిమళ్ల విజయ్కుమార్, కోఆర్డినేటర్ దేవదాసు, బొనిగల ప్రేమయ్య, బాలసౌరి, రమ్మికుమార్, నరేష్ పర్యవేక్షించారు. మున్సిపల్ కౌన్సిలర్ సల్లూరి సత్యానందం పాల్గొన్నారు. -
విక్రయాలు బక్కచిక్కెన్ !
నరసరావుపేట: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధితో లక్షలాది కోళ్లు చనిపోవడం, ఆయా జిల్లాల్లో చికెన్, గుడ్ల విక్రయాలు నిలిపేయడం, జనంలో నెలకొన్న భయాందోళనలు వెరసి వీటన్నిటి ప్రభావం జిల్లాలోని చికెన్ విక్రయాలపై పడింది. జిల్లాలో ఎక్కడా బర్డ్ఫ్లూ లేదని, 100 డిగ్రీల మంటపై వండిన చికెన్ను తినవచ్చని పశుసంవర్ధకశాఖ అధికారులు ప్రకటించినా ప్రజలు పట్టించుకోలేదు. ఈ ఆదివారం కొద్ది బేరం తప్పితే చికెన్షాపులు అన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అయితే మటన్, చేపలు, రొయ్యలు విక్రయించే దుకాణాలు మాంసం ప్రియులతో కిటకిటలాడాయి. పట్టణ పరిధిలోని వినుకొండ రోడ్డు, కలెక్టరేట్ రోడ్డు, పల్నాడు రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, గుంటూరు రోడ్డు, మాంసం మార్కెట్, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చికెన్ దుకాణాలు వెలవెలబోవగా, ఆ పక్కనే ఉన్న మటన్ దుకాణాలు, మినీ వ్యాన్లలో చేపలు విక్రయించే మినీ వ్యాన్ల వద్ద జనం రద్దీ కనిపించింది. ప్రజల్లో బర్డ్ఫ్లూ భయాందోళనలు నెలకొన్నా.. చికెన్ ధరలు స్వల్పంగానే తగ్గడం గమనార్హం. గత ఆదివారం కేజీ రూ.260కు విక్రయించిన వ్యాపారులు ఈ ఆదివారం స్కిన్తో రూ.220, స్కిన్లెస్ రూ.240లని బోర్డులు వేలాడ దీశారు. మటన్ కేజీ రూ.900లకు విక్రయించగా, చేపలు రాగండి కిలో రూ.180, బొచ్చె రూ.220, కొరమేను రూ.500కి విక్రయించారు. బర్డ్ప్లూ భయంతో చికెన్ దుకాలు వెలవెల మటన్, చేపలు, రొయ్యల వైపునకు మళ్లిన మాంసం ప్రియులు -
టైరు పేలి కారు బోల్తా
జె.పంగులూరు: వేగంగా ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో కారు బోల్తా పడి ముగ్గురికి గాయాలైన సంఘటన మండలంలోని జాగర్లమూడివారిపాలెం జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై ఆదివారం జరిగింది. బి. రామసుబ్రహ్మణ్యం కుటుంబం కారులో వైజాగ్ నుంచి కడప బయలు దేరారు. జాతీయ రహదారిపై జాగర్లమూడివారిపాలెం ఫైఓవర్పైకి రాగానే కారు ముందు టైర్ ఒక్క సారిగా పేలింది. దీంతో కారు బోల్తా కొట్టింది. ఆ సమయంలో కారులో సుబ్రహ్మణ్యంతో పాటు అతడి భార్య వెంకటసుబ్బలక్ష్మి, కుమార్తె ఉన్నారు. ముగ్గురుకి గాయాలు కావడంతో హైవే అంబులెన్స్లో ఒంగోలు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. రేణింగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చీరాల రూరల్: గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చీరాల – వేటపాలెం రైల్వేస్టేషన్ మధ్య గల అరవకాలనీ సమీపంలో చోటు చేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ సీహెచ్. కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీంచించారు. మృతుని వయస్సు సుమారు 40 ఏళ్లు ఉండవచ్చు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని ఆచూకీ తెలిసినవారు 9440627646 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీ... బొల్లాపల్లి: మిరప కోతకు వచ్చిన కూలీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన మండలంలోని రావులాపురం – రేమిడిచర్ల గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం జరిగింది. బండ్లమోటు పోలీసులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలోని నల్లదిబ్బల పల్లెకు చెందిన పల్లపు చిన్న (25) మండలంలోని గుమ్మనంపాడు గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి మిరప కాయల కోత కూలికి వచ్చాడు. తన ద్విచక్ర వాహనంపై గుమ్మనంపాడు నుంచి రాజులపాలెం వెళ్తుండగా మార్గ మధ్యంలో గుర్తుతెలియని వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిన్న అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని తల్లి పల్లపు మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్లమోటు ఎస్ఐ ఎ.బాలకృష్ణ తెలిపారు. మృతుడికి భార్య స్వాతి, ఒక కుమారుడు కలరు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా.. రోడ్డు ప్రమాదానికి సంబంధించి యువకుడు మృతిచెందిన సంఘటన ప్రాంతంలో మండలంలో రెండు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వాహనానికి చెందిన నంబరు ప్లేట్ పడి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం బెల్టు షాపులకు మద్యం సరఫరా చేసే వాహనం అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వారమే సమయం.. నత్తేనయం!
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల 26వ తేదీన కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహాత్సవానికి వారం రోజులే సమయం ఉంది. ఏకాదశి ముందురోజు ఆదివారం కావడంతో ఈనెల 23 నుంచే కోటప్పకొండకు భక్తుల రాక ప్రారంభమవుతుంది. తిరునాళ్ల ఏర్పాట్లపై నెలరోజుల నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా కీలకమైన శాఖలు ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఆలయ ప్రాంగణంలో రంగులు వేసే పనే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కొండ దిగువున బారికేడింగ్, లైటింగ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి పనులపై అధికారులు ఇప్పటివరకు దృష్టిపెట్టలేదు. కొండకు వచ్చే రహదారుల్లో మరమ్మతులు ఇప్పటివరకు ప్రారంభించలేదు. దగ్గర పడుతున్నా చలనం ఏదీ..? కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చే లక్షలాది మంది యాత్రికుల కోసం ప్రభుత్వ శాఖలు విస్త్రృత ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఇందుకోసం నెలరోజుల నుంచే జిల్లా అధికారులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. అయితే తిరునాళ్లకు సమయం దగ్గర పడుతున్నా పలు శాఖల్లో చలనం కనిపించడం లేదు. కొండ దిగువున శివరాత్రి రోజు రాత్రి జాతరకే లక్షలాది మంది తరలివస్తారు. ఈ ప్రాంతంలో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాల్సి ఉంది. కొండ దిగువున ప్రధాన రహదారి వెంట బారికేడ్లు ఏర్పాటు చేసే పనిని ఆర్అండ్బీ నిర్వహించాల్సి ఉంది. ఈ పనులు ఇంకా ప్రారంభించలేదు. ప్రధాన రహదారులతో పాటు భక్తులు స్నానాలు ఆచరించే చిలకలూరిపేట మేజర్ కాలువ వద్ద విద్యుత్దీపాలు ఏర్పాటు చేయాలి, ఆర్అండ్బీ (ఎలక్ట్రికల్) శాఖ దీనిని చేపటాల్సి ఉండగా పనులు ప్రారంభం కాలేదు. యాత్రికులకు తాగునీటి సమస్య తలెత్తకుండా నీటి కుళాయిలు ఏర్పాటుతో తాత్కాలిక మరుగుదొడ్లను ఆర్డబ్ల్యూఎస్ శాఖ నిర్వహిస్తోంది. ఆయా పనుల్లో పురోగతి కనిపిండచం లేదు. ప్రభుత్వ శాఖల స్టాల్స్, పోలీసు ఉన్నతాధికారుల తాత్కాలిక వసతి కోసం సిద్ధం చేసే మైదానాన్ని ఇప్పటివరకు శుభ్రం చేయకపోవడంతో పిచ్చిమొక్కలతో దర్శనమిస్తుంది. ఆలయ ప్రాంగణంలో పరిస్థితి.. కొండ మీద ప్రధానాలయం కాకుండా ఇతర ఆలయాలకు రంగులు వేసే పనిని నెల రోజుల క్రితం ప్రారంభించారు. ఈ పనులు ఇంకా సాగుతున్నాయి. క్యూలైన్లకు మరమ్మతులు చేపట్టి రంగులు వేయడం పూర్తయింది. ఽఆలయ ప్రాంగణంలోని ఆర్చీకి రంగులు వేస్తున్నారు. పార్కింగ్ ప్రాంతంలో ఉన్న క్యూలైన్లకు తాటాకు పందిరి ఏర్పాటు చేస్తున్నారు. తిరునాళ్ల పనుల్లో కనిపించని పురోగతి 23 నుంచి కోటప్పకొండ తిరునాళ్ల మహోత్సవం కొండ దిగువున పనులు ప్రారంభించని పలు శాఖలు ఏర్పాట్లలో ప్రధాన శాఖల నిర్లక్ష్య వైఖరి ఆలయంలోనూ కొనసా..గుతున్న పనులు 20వ తేదీ నాటికి ఆలయంలో పనులు పూర్తి ఈనెల 23వ తేదీ ఆదివారం నుంచే భక్తుల తాకిడి ఉంటుందని భావిస్తున్నాం. అందుకు తగ్గట్టు ఆలయంలో చేపట్టిన పనులు 20వ తేదీకి పూర్తిచేయాలని నిర్ణయించాం. రంగులు వేసే పని మూడు రోజుల్లో పూర్తవుతుంది. ప్రసాదాలు తయారీని ప్రారంభించాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – డి.చంద్రశేఖరరావు, ఆలయ ఈఓ -
దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా తిరుమలాదేవి
వేటపాలెం: రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలిగా వేటపాలెం జెడ్పీటీసీ బండ్ల తిరుమలాదేవి ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రలోని 26 జిల్లాల దేవాంగ ప్రతినిధుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎంపిక జరిగినట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా చీరాల మాజీ జెడ్పీటీసీ పృధ్వీ అరుణ ఎన్నికై నట్లు చెప్పారు. సంఘ అధికార ప్రతినిధిగా పందిళ్లపల్లికి చెందిన యారాసు అరుణ్బాబు, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులుగా పసుమర్తి మల్లికార్జునరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా గుంటూరు మధుసూదనరావు, సభ్యులుగా చల్లా విజయ్ ఎన్నికయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి పిడుగురాళ్ల: మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల ఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మసీదు ఎదురు సిమెంట్ బెంచీ మీద గుర్తు తెలియని సుమారు 35 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతి చెంది ఉన్నాడని గుర్తించామన్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెంకన్నకుంటలో గుర్తు తెలియని మహిళ... వెల్దుర్తి: మండలంలోని మిట్టమీదిపల్లె గ్రామ సమీపంలోని వెంకన్న కుంటలో ఆదివారం సుమారు 30 నుంచి 40సంవత్సరాలలోపు ఉండే గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ సమందర్ వలి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని మిట్టమీది పల్లె గ్రామం వద్ద నీటి కుంటలో మహిళ మృతదేహం తేలాడుతుందనే గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లి నీటి కుంటలో ఉన్న మహిళ మృతదేహాన్ని వెలుపలకు తీసి పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. మృతురాలి మెడలో పసుపు కొమ్ము, పసుపు తాడు, కాలికి రాగి మెట్టలు ఉన్నట్లు తెలిపారు. ఈ మహిళ మూడు రోజుల కిందట ఈ కుంటలో పడినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మహిళ ఆచూకీ తెలిసిన వారుంటే వెంటనే వెల్దుర్తి పోలీసు స్టేషన్కు సమాచారమివ్వాలని ఎస్ఐ సమందర్ వలి కోరారు. -
సత్తా చాటిన నరసరావుపేట
కరాటే, కుంగ్ఫూ, తైక్వాండో చాంపియన్ షిప్ పోటీల్లో విజేత అద్దంకి రూరల్: స్థానిక గీతామందిరంలో ఆదివారం జాతీయ స్థాయి ఓపెన్ కరాటే, కుంగ్ఫూ, తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 6 రాష్ట్రాల నుంచి 650 మంది పాల్గొనగా.. నరసరావుపేట టీం విజయం సా ధించింది. పోటీల చీఫ్ ఆర్గనైజర్ పి.రాంబాబు మాట్లాడుతూ సొంత ఊరికి పేరు తేవాలని కోరికతోనే అద్దంకిలో నిర్వహించినట్లు తెలిపారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సాయిరాం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య, చిన్ని మురళీ కృష్ణ, చిన్ని శ్రీనివాసరావు, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, మలాది శ్రీనివాసరావు, కరాటే మాస్టర్ వెంకట రత్నం పాల్గొన్నారు. మాలలు ఆర్థికంగా ఎదగాలి అద్దంకి రూరల్: మాల కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలను వినియోగించుకుని మాలలంతా ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్న్ విజయ్కుమార్ అన్నారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ భవన్ నియోజకవర్గ మాలమహానాడు అధ్యక్షుడు అంకం కిరణ్కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ కార్పొరేషన్కు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా కృషి చేస్తామన్నారు. తొలుత స్థానిక బంగ్లారోడ్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. గోగుల వీరాంజనేయులు, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గోపతోటి శాంసన్, స్వర్ణవంశీకృష్ణ పాల్గొన్నారు. బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి తెనాలి: త్వరలో రానున్న బడ్జెట్లో బీసీ సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో బీసీ సబ్ప్లాన్తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని, ఈ మేరకు బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కేటాయించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గతంలో మాదిరిగా రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. బీసీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4 వేల పింఛను ఇస్తామన్న హామీని నిలుపుకోవాలని కోరారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
అక్రమ తవ్వకాలపై మైనింగ్ అధికారుల దాడులు
గుంటూరు రూరల్: నగర శివారుల్లో అక్రమంగా మట్టి తవ్వకాలపై ఆదివారం మైనింగ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు, జిల్లా మైనింగ్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గుంటూరు వెస్ట్ మండలం చౌడవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 104లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లుగా వచ్చిన ఫిర్యాదుపై తనిఖీలు చేశారు. పుప్పాల గోపీకృష్ణ అలియాస్ ఆడిటర్ గోపీకృష్ణ అక్రమంగా మైనింగ్కి పాల్పడుతున్నట్లు గుర్తించారు. మట్టి తవ్వకాలు చేస్తున్న పొక్లెయిన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నల్లపాడు పోలీసులకు అప్పగించారు. -
విదేశీ అతిథులొచ్చాయి..!
పర్చూరు(చినగంజాం): పర్చూరు మండలం వీరన్నపాలెం గ్రామంలో విదేశీ పక్షులు కనువిందు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా ఒక్కొక్కటిగా వచ్చి చేరుతుండటంతో క్రమంగా వాటి సంఖ్య పెరుగుతోంది. గ్రామానికి ఉత్తరం వైపు ఉన్న కొత్త చెరువు మధ్యలో ఉన్న చిన్న దీవిలాంటి ప్రాంతంలో పక్షలు వేసవి విడిదిగా వచ్చి చేరుతాయి. సైబీరియా దేశానికి చెందిన ఈ పక్షులు ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చి ఐదారు నెలల పాటు ఇక్కడే ఉండి గుడ్లను పొదిగి పిల్లలను వృద్ధి చేసి తిరిగి వెళ్లి పోతుంటాయి. వలసవచ్చిన కొంగజాతి పక్షులు ఈ ప్రాంతంలో ఐదారు మాసాలు గడిపి సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని సంతతితో పాటు జూలై, ఆగస్టు మాసాల్లో తమ ప్రాంతానికి తిరుగు ప్రయాణమై వెళ్లిపోతాయని వారు తెలిపారు. వీటిని చూస్తూ గ్రామస్తులు తమ గ్రామ అతిథులు మళ్లీ వచ్చారంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పర్చూరు మండలం వీరన్నపాలెంలో సైబీరియా పక్షుల సందడి -
ఉత్సాహంగా డాక్టర్స్ క్రికెట్ పోటీలు
పెదకాకాని: డాక్టర్స్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. నంబూరులోని డీఎన్ఏ క్రికెట్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఉమ్మడి గుంటూరు జిల్లాల పోటీల్లో వైద్యులు పాల్గొని ఉత్సాహంగా ఆడారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు మాట్లాడుతూ వైద్య వృత్తిలో నిత్యం ఒత్తిడి, ఆందోళన ఉంటాయని, వాటిని తట్టుకునేందుకు క్రీడా పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. పోటీల్లో బ్రిందా బ్రైయిన్ – ఎ 1 ఎవన్జర్స్, ఐకాన్–జీబీఆర్, టైమ్ పాస్ టిల్లు – శ్రీ టీమ్లు పోటీ పడ్డాయి. ఎ1 ఎవన్జర్స్, జీబీఆర్, శ్రీ టీమ్ విజేతలుగా నిలిచాయి. ఫైనల్స్కు చేరిన శ్రీటీమ్ అమృత టీమ్తో పోటీపడగా శ్రీటీమ్ విజయం సాధించింది. టీమ్లో మ్యాన్ఆఫ్ ది మ్యాచ్గా నిమ్మకాయల పృథ్వీరాజ్, బెస్ట్ బౌలర్గా పృథ్వి ట్రోఫీలను అందుకున్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజినీరింగ్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ జి. శివకుమార్రెడ్డి, డాక్టర్స్ స్పోర్ట్స్ కల్చర్ ఆర్గనైజేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ టి.ఎస్. రెడ్డి, డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు, వైద్యులు దావులూరి రమేష్, సందీప్ వెల్లా, దాట్ల శ్రీనివాసరెడ్డి, జాన్ షహిద్, ఎండీ. అస్లం, ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. -
తాబేళ్ల మృత్యుఘోష!
సముద్రంలో కాలుష్యాన్ని నియంత్రిస్తూ జీవజాలం మనుగడకు దోహదపడుతున్న సముద్రపు తాబేళ్లు(ఆలీవ్ రెడ్లీ) మృత్యువాత పడుతున్నాయి. సముద్రతీరంలో తాబేళ్ల మరణాల గణాంకాలు చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఇదే కొనసాగితే తాబేళ్ల జాతి క్రమేపీ అంతరించి పోయే ప్రమాదం ఉందని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం శ్రద్ధపెట్టి తాబేలు జాతి సంరక్షణకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. బాపట్ల, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం, కృష్ణా, కాకినాడ, అనకాపల్లి, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, విశాఖపట్టణం తదితర జిల్లాల పరిధిలోని తీర ప్రాంతంలో ఒక్క జనవరి నెలలోనే 3,085 తాబేళ్లు మరణించినట్టు వాటి సంరక్షణ కోసం పనిచేస్తున్న ట్రీ ఫౌండేషన్ సంస్థ వెల్లడించింది. వాస్తవానికి ఇవన్నీ తీరానికి కొట్టుకొచ్చినవే. మృతి చెంది సముద్రంలో కలిసి పోయిన తాబేళ్ల సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు అధికంగా ఉంటుందని అంచనా. – సాక్షి ప్రతినిధి, బాపట్లసముద్ర జీవుల్ని రక్షిస్తూ.. సముద్రంలో విపరీతంగా ఉత్పత్తి అయ్యే నాచు.. సూర్యకిరణాలను సముద్రపు లోతుల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల సముద్రంలో పెరిగే జంతు జాలానికి ఆక్సిజన్ సక్రమంగా అందే అవకాశముండదు. అదే జరిగితే జంతుజాలం చాలా వరకు చనిపోవడంతో పాటు మిగిలిన జంతు జాలానికి ఎదుగుదల ఉండదు. తాబేళ్లు ఈ నాచును ఆహారంగా తీసుకుని దాని ఉత్పత్తిని నియంత్రిస్తున్నాయి. సముద్రంలో కాలుష్యాన్ని ఉత్పత్తి చేసే జల్లి ఫిష్లను సైతం తాబేళ్లు ఆహారంగా తీసుకుంటాయి. సముద్ర గర్భంలో ఉన్న కొండలు, గుట్టల్లో చేపలు గుడ్లుపెట్టే కేంద్రాలను తాబేళ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాయి. దీనివల్ల మత్స్య సంపద వృద్ధి చెంది మత్స్యకారులకు మేలు జరుగుతుంది.ఆ విధంగా అంతరిస్తున్నాయ్..సముద్ర తాబేళ్లు జలాల అడుగున ఉంటున్నప్పటికి ప్రతి 40 నిమిషాలకోసారి శ్వాస తీసుకునేందుకు ఉపరితలానికి రావాల్సిందే. ఇలావచ్చి తిరిగి వెళ్లే క్రమంలో మోటారు బోట్లు, మత్స్యకారుల టేకు, నానాజాతి వలల వల్ల కొన్ని, కాలుష్యానికి గురై మరికొన్ని మృత్యువాత పడుతున్నాయి. ఏపీలోని మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల్లో ఈ తరహా వలలు అధికంగా వాడుతుండడంతో తాబేళ్ల మరణాలు అధికంగా ఉన్నాయని టీ ఫౌండేషన్ వెల్లడించింది. ఏటా జనవరి నుంచి మే వరకు గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు తీరప్రాంతానికి వచ్చి ఇసుకలో గుంతలు తీసి గుడ్లు పెట్టి వెళతాయి. 48 నుంచి 50 రోజుల మధ్యకాలంలో ఆ గుడ్లు పిల్లలుగా మారతాయి. ఈ క్రమంలోనే తాబేలు జాతి అధికంగా అంతరిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాబేలు గుడ్లు, పిల్లల సమయంలో నక్కలు, కుక్కలు, ఇతర జంతువులు కొన్ని గుడ్లు, పిల్లల్ని తినేస్తున్నాయి. పిల్లలుగా మారిన తాబేళ్లు 3 గంటల్లోపు నీటిలోకి చేరకుంటే చనిపోతాయి. కొన్ని నీటిలోకి చేరినా శ్వాస కోసం నీటిపైన తేలియాడేటప్పుడు పెద్ద పెద్ద పక్షులు వాటిని పొడిచి చంపుతున్నాయి. ఉత్పత్తి అవుతున్న తాబేలు పిల్లల్లో 10 శాతం కూడా బతకడం లేదని అంచనా. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను చంపడం, వాటి గుడ్లను తినడం నేరం. ఈ నేరానికి పాల్పడితే ఏడేళ్లు జైలు శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా విధిస్తారు.ప్రభుత్వ చర్యలు శూన్యం తాబేళ్ల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. తాబేళ్లు గుడ్లు పెట్టే జనవరి నుంచి మే నెలల్లో తీరంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఆ ఐదు నెలల పాటు ప్రత్యేకంగా అవగాహన కలిగిన సిబ్బందిని నియమించి తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షణ కేంద్రాల్లో పొదిగించాలి. పిల్లలు ఉత్పత్తి అయ్యాక వాటిని సురక్షితంగా నీటిలో వదలాలి. ఇందుకోసం తగినన్ని నిధులు కేటాయించి సంరక్షణ కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడాలి. మరోవైపు సముద్రంలో తాబేళ్లు చిక్కుకోని వలలనే వాడేలా మత్స్యకారులకు ఆదేశాలివ్వాలి. తాబేళ్ల ప్రాధాన్యంపై ఎప్పటికప్పుడు మత్స్యకారులకు అవగాహన కల్పించాలి. ఇందుకు ప్రభుత్వం అటవీ, పర్యావరణ శాఖలు సమన్వయం చేసుకోవాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు.తాబేళ్ల రక్షణకు ట్రీ ‘ఫౌండేషన్’! తాబేళ్ల రక్షణకు చెన్నై కేంద్రంగా ఉన్న ట్రీ ఫౌండేషన్ కొంత మేర కృషి చేస్తోంది. 2017 నుంచి ఇక్కడ తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తీరంలోని చినగంజాం మండలం ఏటిమొగ్గ, కుంకుడుచెట్లపాలెం, వేటపాలెం మండలం రామచంద్రాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, రామాపురం, బాపట్ల మండలం సూర్యలంక తీరంలో సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి 12 మంది సిబ్బందితో తాబేలు గుడ్లు సేకరించి వాటిని పొదిగించి పిల్లలను తిరిగి సముద్రంలోకి వదులుతోంది. 2023లో 7,102, 2024లో 9,694 చొప్పున తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలామని, ఈ ఏడాది ఇప్పటివరకు 14 తాబేళ్లు వచ్చి 1,541 గుడ్లు పెట్టినట్టు ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. జిల్లా అటవీశాఖ దీనిని పర్యవేక్షిస్తోంది. గత ప్రభుత్వంలో ఫౌండేషన్ సభ్యులకు నెలకు రూ.10 వేలు చొప్పున గౌరవవేతనం ఇవ్వగా.. ఈ ప్రభుత్వం వచ్చాక అదీ ఇవ్వకపోవడంతో సభ్యులకు ఐటీసీ సంస్థ గౌరవ వేతనాలు చెల్లిస్తోంది.ఇప్పటి వరకు 16,796 పిల్లలను సముద్రంలోకి వదిలాం.. సముద్ర తాబేళ్ల రక్షణకు ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని తీరప్రాంతంలో 6 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. 12 మంది సిబ్బంది ద్వారా తాబేళ్లు పెట్టిన గుడ్లు ఎప్పటికప్పుడు సేకరించి, సంరక్షణ కేంద్రాల్లో పొదిగించి పిల్లలను సురక్షితంగా సముద్రంలోకి వదులుతున్నాం. గడిచిన రెండేళ్లలో ఇప్పటి వరకు 16,796 పిల్లలను సముద్రంలోకి వదిలాం. – చంద్రారెడ్డి, జిల్లా కో–ఆర్డినేటర్, ట్రీ ఫౌండేషన్ -
సమన్వయంతో తిరునాళ్లకు ఏర్పాట్లు
అమర్తలూరు (వేమూరు): అధికారులందరూ సమన్వయంతో పని చేసి శివరాత్రి తిరునాళ్లను విజయవంతం చేయాలని రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. అమర్తలూరు మండలంలోని గోవాడ గ్రామంలో బాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో రెండో సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన శివరాత్రి తిరునాళ్ల ఉంటుందని గుర్తుచేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులపై ఆరా తీశారు. తెనాలి, రేపల్లె, బాపట్ల, పొన్నూరు డిపోల నుంచి 30 బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ అధికారులు వివరించారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఆటోలను దేవస్థానం వరకు రానీయొద్దని ఆర్టీసీ అధికారులు ఈ సందర్భంగా కోరారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సౌకర్యంపై దృష్టి పెట్టాలని ఆర్డీవో అన్నారు. సీసీ కెమెరాలు, టాయిలెట్స్ ఏర్పాటుకు సూచనలు చేశారు. దర్శనం కల్పించే విషయంలో సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 26వ తేదీన రాత్రి ప్రభల ఊరేగింపులు ఉంటాయని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తిరునాళ్ల ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర, ఎండోమెట్ అధికారి అనుపమ, రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరరావు, తహసీల్దారు నెహ్రూబాబు, దేవస్థానం ఈవో అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు రేపల్లె ఆర్డీవో సూచన -
జిల్లా పరిశ్రమల అధికారి వీవీ సురేంద్ర సస్పెన్షన్
బాపట్ల: జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ వి.వి. సురేంద్ర విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరుగుతున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల సర్వేపై అధికారులను తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు. నేత్ర పర్వంగా భావనాఋషి కల్యాణం మంగళగిరి టౌన్: మంగళగిరిలోని నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో శ్రీ భద్రావతి సమేత భావనాఋషి కల్యాణం శనివారం వైభవంగా నిర్వహించారు. మంగళగిరి పట్టణ పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. సాయంత్రం స్వామివార్ల పులి వాహనంపై గ్రామోత్సవం జరిగింది. కల్యాణాన్ని పురస్కరించుకుని రాజీవ్ సెంటర్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలను సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. -
కొరిశపాడు పనుల్లో వేగం పెంచండి
ఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం బాపట్ల: కొరిశపాడు రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. ఎర్రం చిన్నపోల్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు సంబంధించి శనివారం అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు వంద శాతం పనులు పూర్తి అయినందున 1వ డివిజన్ ప్రధాన కార్యాలయాన్ని ఒంగోలు నుంచి బాపట్లకు తరలించేందుకు ప్రతిపాదన తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి 1.33 టీఎంసీలతో బాపట్లలో 20 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏర్పాటు చేయనున్న కొరిశపాడు రిజర్వాయర్ పనులను మ్యాప్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీహరి వివరించారు. రిజర్వాయర్లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా ప్రతిపాదన తయారు చేయాలని పేర్కొన్నారు. ఎల్ ఏ స్థాయిలో ఉన్న పనులను అవార్డు స్థాయికి తీసుకురావాలని సూచించారు. పెద్దూరు, తూర్పుపాలెం స్ట్రక్చర్కు నిధులకు సంబంధించి ప్రతిపాదనలను తయారు చేయాలన్నారు. రిజర్వాయర్కి సంబంధించి సర్వే వివరాలపై ఆరా తీశారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు అవసరమైన రికార్డుల విషయంలో కొరిశపాడు తహసీల్దార్లు సహకరించాలని ఆయన ఆదేశించారు. రిజర్వాయర్ పూర్తికి ఎల్ ఏ, ఆర్ అండ్ ఆర్, పనులను కావాల్సిన నిధులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విజయజ్యోతిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్, చీరాల వాటర్ రీసోర్స్ డిప్యూటీ ఇంజినీర్ సుజాత, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆహ్లాదకర వాతావరణం అందరి బాధ్యత రేపటి తరాల కోసం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ప్రజలకు పిలుపు ఇచ్చారు. శనివారం స్థానిక బాపట్ల పట్టణంలో 32వ వార్డు చంగల్రావుతోట తోటలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని, అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు వ్యర్థ పదార్థాలను మూడు రకాల డస్ట్ బిన్లలో వేయాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం మానవజాతి మనుగడకు పెను ప్రమాదకరమని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన సూచించారు. 32వ వార్డు చంగల్రాయుడు తోటలో చెత్త నుంచి తయారైన ఎరువుతో పూల మొక్కలు, పండ్ల తోటలను సాగు చేస్తున్న పుష్ప అనే మహిళ గృహాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఆమెను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. కుందేరు ఆక్రమణలను నివారించాలి కుందేరు వాగు ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో రెవెన్యూ, డ్రైనేజ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాగుకు సంబంధించి సమగ్ర సర్వే రిపోర్ట్ రూపొందించాలని ఆదేశించారు. వాగు విస్తరణ, రెండువైపులా కాలువలు నిర్మించడానికి డీపీఆర్ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. బాపట్ల ఆర్డీవో గ్లోరియా, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, డ్రైనేజ్ శాఖ ఇంజినీర్ సుబ్బారావు, బాపట్ల తహసీల్దార్ సలీమా, చీరాల తహసీల్దార్ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రత ఎంతో ముఖ్యం బాపట్ల: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా రోడ్డు భద్రత నిబంధనలపై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అభినందించారు. స్థానిక బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో రవాణా శాఖ నిర్వహించిన ఈ పోటీల్లో విజేతలకు ధ్రువీకరణపత్రాలు, మెమెంటోలను శనివారం ఆయన అందజేశారు. జిల్లా రవాణాశాఖాధికారి టి.కె. పరంధామరెడ్డి మాట్లాడుతూ పోటీల్లో పి.శ్రీవల్లి (8వ తరగతి) మొదటి, జె.షణ్ముఖ ప్రియ (9వ తరగతి) రెండో, టి.సన్నిధి (6 వ తరగతి) మూడో, ఎన్. మాధురి (7వ తరగతి), పి.వర్షిక (5వ తరగతి) కన్సోలేషన్ బహుమతులు పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఐ ఎన్. ప్రసన్న కుమారి, ఏఎంవీఐ పి. అంకమ్మరావు, రోడ్డు సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ ఎ. నరేంద్ర కుమార్, ఉపాధ్యాయురాలు జి.హేమలత తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రహరి.. ఆయనే మరి!
నాటక రంగానికి ఎందరో మహనీయులను అందించిన అద్దంకి గడ్డపై సీ్త్ర పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచారాయన. ఏడు పదుల వయస్సులో కూడా అతివ పాత్రలకు ప్రాణం పోస్తున్నారు. చింతామణి నాటకంలోని శ్రీహరి పాత్రకు పేటెంటుగా.. అభినవ శ్రీహరిగా బిరుదు పొందారు నటుడు అద్దంకి నాగేశ్వరరావు. అద్దంకి రూరల్: అద్దంకి నాగేశ్వరరావు చింతామణి నాటకంలో కీలక సీ్త్ర పాత్ర అయిన శ్రీహరిగా ఒదిగిపోయి జీవం పోశారు. హాస్య ప్రధానమైన సుబ్బిశెట్టి పాత్రకు దీటుగా చలోక్తులు, హావభావాలతో శ్రీహరి పాత్ర నాగేశ్వరరావే ధరించాలన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ఆ పాత్రకు సంబంధించిన మేకప్, వస్త్రధారణ అంతా స్వయంగా ఆయన చూసుకుంటారు. స్టేజీపై ఒక్కసారి సీ్త్ర పాత్రలో నాగేశ్వరరావును చూసిన వారు.. మేకప్ తీసిన తర్వాతే ఆయన్ను గుర్తుపడతారంటే అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు అసలు సీ్త్రయా,పురుషుడేనా.. అని పందేలు కూడా కాసేవారంట! ‘సత్యహరిశ్చంద్ర’లో కేశవుడు, నక్షత్రకుడు, తిరుపతమ్మ మహత్యంలో వెంకమాంబ, శ్రీకృష్ణ రాయబారంలో ద్రోణుడు, రామాంజనేయ యుద్ధంలో సుగ్రీవుడు, విశ్వామిత్రుడు, సాయిబాబా మహత్యంలో సాయిబాబా వంటి ఎన్నో పాత్రలు ధరించారాయన. చింతామణి నాటకంలోని శ్రీహరి పాత్రలోనే 3 వేలకుపైగా ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. బాలనటుడిగా రంగ ప్రవేశం చిన్నతనంలో తండ్రి ప్రోత్సాహంతో బండారు రామారావు చక్రం తిప్పిన హరిశ్చంద్ర నాటకంలో లోహితాసుడు పాత్ర ధరించి 8 సంవత్సరాలకే నాగేశ్వరరావు నాటక రంగ ప్రవేశం చేశారు. బండారు రామారావు స్వయంగా అభ్యాసం చేయించారు. తపనతో ఆయన కూడా మెలకువలు నేర్చుకున్నారు. నాటక రంగ ఉద్దండులుగా పేరుగాంచిన పుట్టంరాజు శంకరరావు, బండారు రామారావు, అద్దంకి మాణిక్యాలరావు మార్గదర్శకత్వంలో వారి సరసన నిలిచి శెభాష్ అనిపించుకున్నారు నాగేశ్వరరావు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడులో తెలుగు వారున్న ప్రతి చోటా ప్రదర్శనలు ఇచ్చారు. పలు బిరుదులు, ప్రశరసలు సత్తెనపల్లి సమతా ఆర్ట్ వారు నటబ్రహ్మ, నందమూరి కళాపరిషత్తు నుంచి అభినవ శ్రీహరి, ఒంగోలు ఫ్రెండ్స్ అసోసియేషన్ నుంచి నట చక్రవర్తి బిరుదులను నాగేశ్వరరావు పొందారు. అనేక స్వచ్ఛంద సంస్థల వారు సత్కారాలు చేశారు. ఈ నెల 16న అద్దంకిలో పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మల కళాపురస్కారాన్ని అందుకోనున్నారు. చింతామణి నాటకంలో శ్రీహరి సీ్త్రపాత్రలో 3 వేల ప్రదర్శనలు అతివ పాత్రకు జీవం పోసిన నటుడు అద్దంకి నాగేశ్వరరావు నేడు పుట్టంరాజు బుల్లెయ్య, రామలక్ష్మమ్మల కళాపురస్కారం ప్రదానం ప్రభుత్వం అండగా ఉండాలి నాటక రంగానికి ఆదరణ కరవైంది. కళాకారులంతా పేదవారే. ప్రభుత్వ పరంగా సహాయం అందించాలి. ఇది ఒక ప్రయోజనకరమైన కళ. దీనిని వాహకంగా తీసుకుని నాటకంలో మార్పుచేర్పులు చేసుకుని అంతరించి పోతున్న రంగానికి మెరుగులు దిద్దే కళాకారులు ప్రస్తుతం అవసరం. నాటక రంగానికి పూర్వవైభవం రావాలి. సంపాదనపై ఆశపడి ఎవరూ నాటక రంగానికి రావద్దు. – అద్దంకి నాగేశ్వరరావు -
అగ్రి క్లినిక్స్తో వ్యవసాయ పట్టభద్రులకు ఉపాధి
జిల్లా వ్యవసాయాధికారి రామకృష్ణ బాపట్ల: నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్న వ్యవసాయ పట్టభద్రులకు అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్ పథకం ఆశాకిరణం వంటిదని బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి వై.రామకృష్ణ పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నాబార్డు ఆధ్వర్యంలో శనివారం వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయ డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉద్యోగాన్వేషణతో నిరాశ పడకుండా వారికి ఈ పథకం లబ్ధి చేకూరుస్తుందని వివరించారు. ఈ పథకం ద్వారా ప్రతి నిరుద్యోగ వ్యవసాయ పట్టభద్రుడికి వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత వ్యాపారం, పరిశ్రమల స్థాపనకు ఇరవై లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణం మంజూరుకు అవకాశం ఉందని చెప్పారు. సమష్టిగా నిర్వహించే గ్రూపునకు కోటి రూపాయల వరకు లోను మంజూరు చేస్తారని వివరించారు. రుణం పొందిన వారికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ 30 నుంచి 45 రోజుల పాటు నిపుణులతో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగ పట్టభద్రులు స్వీయ శక్తితో ఎదిగేందుకు ఈ రుణ సదుపాయం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. వ్యవసాయ సంబంధిత ప్రాజెక్టులను రూపొందించుకుని రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ఇన్చార్జి అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు అన్నారు. వర్క్ షాపులో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి రవి కుమార్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ శివకృష్ణ పాల్గొన్నారు. వివాహిత అనుమానాస్పద మృతి మార్టూరు: మండలంలోని కోలలపూడి లో ఓ వివాహిత(22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఓ మహిళ స్థానికంగా కోళ్ల ఫారం నిర్వహిస్తూ ఉంటోంది. ఉదయం ఆమె కుమార్తె ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమె తల్లి స్థానికుల సహకారంతో కిందకి దించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. అద్దంకి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడితో సుమారు నాలుగు నెలల క్రితం ఈ యువతికి వివాహం అయింది. శనివారం భార్యను కాపురానికి తీసుకురావడానికి భర్త కోలలపూడి రావలసి ఉండగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతురాలిని ఉదయమే అత్తంటి గ్రామం తీసుకెళ్లడంతో పూర్తి వివరాలు తెలియరాలేదు. విద్యుదాఘాతంతో రైతు మృతి కొల్లూరు: పంట పొలానికి నీరు పెట్టుకునేందుకు వెళ్లిన రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ఘటన మండలంలోని చినపులివర్రులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. గ్రామానికి చెందిన మాతంగి వరరాజాబాబు(59) మొక్క జొన్న పంటకు నీరు పెట్టేందుకు శనివారం మధ్యాహ్నం పొలం వెళ్లాడు. విద్యుత్ మోటారు ఆన్చేశాడు. మోటారు నుంచి విద్యుత్ ప్రసరించడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొంత సమయానికి సమీపంలోని పొలాలకు చెందిన రైతులు వరరాజాబాబు పడిపోయి ఉండటాన్ని గమనించి, విద్యుత్శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మృతుడు బంధువులు, విద్యుత్శాఖ ఏఈ కె.సుధాకర్బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.ఏడుకొండలు తెలిపారు. మహిళపై దాడికి పాల్పడిన నిందితుడి అరెస్ట్ వేమూరు: వుహిళపై దాడి చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రవికృష్ణ శనివారం తెలిపారు. వివరాలు.. మండలంలోని జంపని గ్రామానికి చెందిన ఏటూకూరి భాగ్యలక్ష్మిపై వడ్రంగి ఉల్లితో దాడి చేసిన కేసులో వై.ప్రభాకర్ను అరెస్ట్ చేసి తెనాలి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. న్యాయమూర్తి నిందితుడికి 28 రోజులు రిమాండ్ విధించగా రేపల్లె సబ్ జైలుకు తరలించినట్లు ఎస్ఐ వివరించారు. -
వీఐటీ– ఏపీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు
తాడికొండ: వీఐటీ– ఏపీ విశ్వ విద్యాలయంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న బిజినెస్ ప్రాక్టీసెస్ ఇన్ డిజిటల్ ఎరాపై అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నీతి ఆయోగ్ ఆర్థిక శాస్త్ర సీనియర్ సలహాదారు డాక్టర్ ప్రవాకర్ సాహూ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రా న్ని రూ.2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని, ప్రభు త్వ దార్శనిక విధానం, స్వర్ణాంధ్రకు భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. వికసిత్ భారత్ 2047కు ఇది అనుగుణంగా ఉన్న విధానాలను వివరించారు. వీఐటీ ఏపీ వర్సిటీ వీసీ డాక్టర్ ఎస్వీ కోటారెడ్డి మాట్లాడుతూ అనేక అంతర్జాతీయ విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలతో చేసుకున్న ఎంఓయూలు తమ వర్సిటీకే తలమానికమన్నారు. తమ వర్శిటీలోని ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా విద్యార్థులలోని యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు నిధులను కూడా అందజేస్తున్నామని వివరించారు. గౌరవ అతిథులు న్యూకాలజీ బిజినెస్ స్కూల్, ఆస్ట్రేయా ప్రొఫెసర్ డాక్టర్ ప్రాన్సిస్కో పోలూచి, ఎడిన్బర్గ్ బిజినెస్ స్కూల్ హెరియట్– వాట్ యూనివర్సి టీ యూకే డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ డీన్ ప్రొఫెసర్ డాక్టర్ స్వీనీలు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ద్వారా వ్యాపార సామ్రాజ్యం మెరుగు పడుతుందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, రీసెర్చ్ డీన్ డాక్టర్ రవీంద్ర ధూలి, అసోసియేట్ డీన్ డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ ఎ అస్రార్ అహ్మద్, డాక్టర్ సుహైల్ అహ్మద్,భట్, డాక్టర్ మొహమ్మద్, అబ్దుల్ ముఖీత్ మాజ్ పాల్గొన్నారు. -
మా భూములు చూపించండి సారూ
సంతమాగులూరు (అద్దంకి): తమకు పూర్వార్జితంగా సంక్రమించిన భూమిని చూపాలని కోరుతూ గ్రామానికి చెందిన అర్వపల్లి కుటుంబీకులు శుక్రవారం సంతమాగులూరు మండల తహసీల్దార్ రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. సంతమాగులూరు మండలంలో భూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో ఆక్రమణదారులు పెచ్చుమీరుతున్నారు. ఇతరుల భూమిని సైతం తప్పుడు రికార్డులు సృష్టించి తమ పేరుతో ఆన్లైన్ చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నా యి. ఈ క్రమంలో సర్వే నంబరు 171/1లో తమ కు పూర్వార్జితంగా సక్రమించిన 3.50 ఎకరాల భూమి తమ పేరుతో లేకుండా పోయిందని సంతమాగులూరులోని అర్వపల్లి ఇంటిపేరు కలిగిలిన అర్వపల్లి రత్నారావు, వెంకటనారాయణ, పిచ్చయ్య, రామారావు, శ్రీనివాసరావు తదితరులు వాపోయారు. తమ రికార్డుల ప్రకారం సర్వే చేయించి భూమిని ఎవరు ఆక్రమించారో గుర్తించి ఆన్లైన్ చేయాలని.. తమకు ఆ భూమి ఎలా తమకు సక్రమించిందో చూపే పత్రాలను తహసీల్దార్కు అందజేశారు. తహీల్దారు విచారణలో ఈ సర్వే నంబరుకు సంబంధించి ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆయా భూములు కలిగిన పట్టాదారుల రికార్డుల విచారణతో పూర్తి వివరాలు వెలుగు చూడాల్సి ఉంది. -
గుండ్లకమ్మ ముంపు గ్రామాల పరిశీలన
మేదరమెట్ల (అద్దంకి రూరల్): కొరిశపాడు మండలంలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామమైన యర్రబాలెంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుక్రవారం పరిశీలించారు. నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లను ప్రారంభించారు. ముంపు గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, దేవాలయాల నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలోని ఎస్సీ కాలనీలో సమస్యలు తెలుసుకున్నారు. ముగిసిన గంగాదేవి తిరునాళ్ల అచ్చంపేట: ఓర్వకల్లులో గత మూడు రోజులుగా జరుగుతున్న స్వయంభు గంగాదేవి పేరంటాళమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. అమ్మవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను దేవదాయశాఖ, ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ.5,05,497 రాగా, అమ్మవారి దర్శన టిక్కెట్ల రూపంలో రూ.74,340 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.కోటేశ్వరరావు తెలిపారు. ఆలయం వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు నెమలికల్లుకు చెందిన తుమ్మా నరేంద్రరెడ్డి పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. రుద్రవరం గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలకు గంగమ్మతల్లి ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించి ఉరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ సత్తెనపల్లి డివిజన్ ఇన్స్పెక్టర్ వి.లీలావతి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేడు శివరాత్రి ఉత్సవాలపై సమీక్ష అమర్తలూరు: మహాశివరాత్రి తిరునాళ్ల విజయవంతం చేసేందుకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్థానం కార్య నిర్వహణాధికారి అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోవాడ బాలకోటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 11 గంటలకు రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు. గుంటూరు డీవైఈవోగా ఏసురత్నం గుంటూరు ఎడ్యుకేషన్ : గుంటూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారిగా నియమితులైన సీనియర్ ఎంఈవో జి. ఏసురత్నంకు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక అభినందనలు తెలియజేశారు. శుక్రవారం డీఈవో కార్యాలయంలో గుంటూరు డీవైఈవోగా పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్ఏసీ)పై నియమితులైన జి. ఏసురత్నం డీఈవో రేణుకను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు ఏ.తిరుమలేష్, ఎంఈవో అబ్దుల్ ఖుద్ధూస్, ఉర్దూ డీఐ షేక్ ఎండీ ఖాసిం పాల్గొన్నారు. చిరుమామిళ్లలో ఆలయాల వార్షికోత్సవం నాదెండ్ల: చిరుమామిళ్ళ గ్రామంలోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం వార్షికోత్సవాలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఎస్టీ కాలనీలోని శివాలయం, నాదెండ్ల డొంకరోడ్డులోని కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాలను 2019లో గ్రామానికి చెందిన విద్యాదాత నడికట్టు రామిరెడ్డి తన సొంత నిధులతో నిర్మించారు. ప్రత్యేక పూజల్లో నడికట్టు రామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు సిరిపురపు అప్పారావు, గ్రామస్తులు యన్నం శివారెడ్డి, మద్దూరి భాస్కరరెడ్డి, అప్పిరెడ్డి, జగన్మోహన్రెడ్డి, మిట్టపాలెపు వెంకటేశ్వరరావు, భవనం శ్రీనివాసరెడ్డి, కమ్మ సీతయ్య, నర్రా శ్రీనివాసరావు, వీరారెడ్డి పాల్గొన్నారు. -
వివక్షపై న్యాయ విద్యార్థుల ఆవేదన
● ఏఎన్యూలో విభాగాధిపతి మార్పునకు డిమాండ్ ● లేదంటే తమకు టీసీలిచ్చి పంపించాలని వేడుకోలు ● ఆందోళనకు దిగిన విద్యార్థులతో రిజిస్ట్రార్ చర్చలు ● సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ పెదకాకాని: వివక్షతో న్యాయ శాస్త్రం విభాగాధిపతి, కొందరు ఆచార్యులు తమను మొదటి ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శుక్రవారం ఎల్ఎల్ఎం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం న్యాయ శాస్త్ర విభాగానికి వెళ్లి విద్యార్థులతో, ఆచార్యులతో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాజరు సరిపోలేదని కొన్ని సామాజిక వర్గాల విద్యార్థులను విభాగాధిపతి పరీక్షలకు అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకంటే తక్కువ రోజులు క్లాసులకు వచ్చిన వారిని పరీక్షలకు అనుమతించారని, ఇదేంటని ప్రశ్నించారు. వివక్ష రోజురోజుకు పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విభాగాధిపతి, కొందరు ఆచార్యుల వేధింపులు తట్టుకోలేక పలువురు విద్యార్థులు టీసీలు సైతం తీసుకొని అర్ధాంతరంగా వెళ్లిపోయారని తెలిపారు. ఈ వైఖరి సరికాదని, దీనిపై విచారణ జరపాలని కోరారు. గత సంవత్సరం కూడా హాజరు సరిపోలేదని 11 మంది విద్యార్థులను పరీక్షలు రాయనివ్వలేదని, వారిలో ఎక్కువ శాతం అణగారిన సామాజిక వర్గాల వారే ఉన్నారని గుర్తుచేశారు. దీనిని వర్సిటీ ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ విభాగంలో ఓ ఆచార్యుడు సుదీర్ఘకాలం సెలవు పెట్టి తరగతులకు రాకపోయినా హాజరైనట్లు చూపించారని, అతడే కొందరు విద్యార్థులకు హాజరు లేకపోయినా పరీక్షలు అనుమతించారని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలు వివక్షతోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. మరికొందరు విద్యార్థులు మాట్లాడుతూ కిషోర్ అనే ఆచార్యుడు గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అని, ఎంతో ప్రతిభ కలిగిన ఆయన అర్ధాంతరంగా సెలవు పెట్టి వెళ్లిపోవటం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతోందని, దీని వెనక కొన్ని వర్గాల కుట్ర ఉందని ఆరోపించారు. అన్ని విషయాలు విన్న రిజిస్ట్రార్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎవరు వివాదాలకు దిగవద్దని ఆదేశించారు. కొందరు అతిథి ఆచార్యులు మాట్లాడుతూ తమ విషయంలో కూడా విభాగాధిపతి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. తమను అవమానకరంగా చూస్తున్నట్లు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కూడా వారు స్పష్టం చేశారు. తరగతులకు నిత్యం హాజరుగాని ఓ వర్గం విద్యార్థికి హాజరు వేసి ప్రథమ ఇంటర్నల్ పరీక్ష రాయించిన ఓ అతిథి ఆచార్యుడు వివాదాన్ని ముందుగానే ఊహించి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు సమాచారం. -
సంజీవయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
బాపట్లటౌన్: పేదల అభ్యున్నతి కోసం ఆహర్నిశలు శ్రమించిన మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. రాష్ట్రంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతిలో భాగంగా శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా, కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో ఓ సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో మునెయ్య, సుంకలమ్మ దంపతులకు 1921 ఫిబ్రవరి 14న దామోదరం సంజీవయ్య జన్మించారన్నారు. స్వగ్రామంలో 4వ తరగతి వరకు చదివి కర్నూలులోని అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ పాఠశాలలో విద్యను అభ్యసించి, కర్నూలు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో చేరి 1938లో ఎస్ఎస్ఎల్సీలో జిల్లాలోనే ప్రథమునిగా ఉత్తీర్ణుడయ్యాడన్నారు. సంజీవయ్యకు చదువు పట్ల అమితమైన ఆసక్తిని గుర్తించిన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సంజీవయ్య చదువులో ఒక్కో మెట్టు ఎక్కుతు మద్రాస్లో న్యాయవిద్యను అభ్యసించారన్నారు. పిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో పలు మంత్రి పదవులు చేపట్టారన్నారు. 38 సంవత్సరాల పిన్న వయస్సులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. 1960లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి దళిత ముఖ్యమంత్రిగా కీర్తినీ ఆర్జించారన్నారు. రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన నిస్వార్ధ రాజకీయ నాయకుడు సంజీవయ్య అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ ఘనుడు దామోదరం సంజీవయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, ఏ.ఓ శ్రీనివాసరావు, ఏ.ఆర్ డీఎస్పీ విజయసారధి, ఎస్బీ సీఐ నారాయణ, ఆర్ఐ మౌలుద్దీన్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్డూడీ -
సమస్యలు పరిష్కరించాలని బ్యాంకు ఉద్యోగుల ధర్నా
కొరిటెపాడు: ఈనెల 24 నుంచి 25వ తేదీ వరకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్(యూఎఫ్బీయూ) తరఫున బ్యాంకుల సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ గుంటూరు మాడ్యూల్ డెప్యూటీ జనరల్ సెక్రటరీ కె.కోటిరెడ్డి తెలిపారు. సమ్మె సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన సెంటర్లు, జిల్లా హెడ్ క్వార్టర్స్లో శుక్రవారం నిర్వహించిన నిరసనలో బ్యాంకు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్బీఐ గుంటూరు మెయిన్ బ్రాంచి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోటిరెడ్డి మాట్లాడుతూ తమ డిమాండ్లు బ్యాంకులోని అన్ని విభాగాలలో తగిన రిక్రూట్మెంట్, వారానికి ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వర్క్మెన్, ఆఫీసర్ డైరెక్టర్ల పోస్టుల భర్తీ చేయాలని కోరారు. కార్యక్రమంలో గుంటూరు మాడ్యూల్ ఎస్.బి.ఐ. ఆఫీసర్స్ అసోసియేషన్ చీఫ్ రీజినల్ సెక్రటరీ కె.ఆర్.వి.జయ కుమార్, యు.ఎఫ్.బి.యు. అడ్వైజర్ పి.కిషోర్, ప్రెసిడెంట్ ఇ.రవిచంద్రారెడ్డి, జిల్లా సెక్రటరీ మహమ్మద్ సయ్యద్బాషా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ సెక్రటరీ ఎం.రాంబాబు, బెఫీ స్టేట్ ప్రెసిడెంట్ ఎం.సాంబశివరావు పాల్గొన్నారు. 24 నుంచి బ్యాంకుల సమ్మెకు నేతల పిలుపు -
సత్తాచాటిన వేటపాలెం ఎద్దులు
మాచవరం: మండల కేంద్రమైన మాచవరంలో శ్రీలక్ష్మితిరుపతమ్మగోపయ్య స్వామి వార్ల కల్యాణోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు బల ప్రదర్శన పోటీల్లో భాగంగా ఆరుపళ్ల విభాగంలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరీషాచౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్లు 4000 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. ఏటుకూరి శ్రీనివాసరావు (పెదకూరపాడు), రామినేని రత్తయ్య (తోటపాలెం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా) కంబైన్డ్ జత 3773.7 అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో, నలమాద ఉత్తమ్పద్మావతి (ఎమ్మెల్యే, కోదాడ, తెలంగాణ) ఎడ్లు 3420.1 అడుగులు దూరాన్ని లాగి మూడవ స్థానంలో, అనంతనేని శ్రీకావ్య, శ్రీమధు (యనమలకుదురు, పెనమలూరు మండలం, కృష్ణాజిల్లా ఎడ్లు 3396.1 అడుగులు దూరాన్ని లాగి నాల్గవ స్థానంలో, మేకా అంజిరెడ్డి ( చల్లగుండ్ల, నెకరికల్లు మండలం, పల్నాడు జిల్లా, ఎడ్లు 3023.5 అడుగులు దూరాన్ని లాగి ఐదో స్థానంలో, మన్నెంపల్లి యశస్వణి (మాచవరం, పల్నాడు జిల్లా), వసంతతవరపు శ్రీలాస్య, శ్రీమనోజ్ (పిన్నెల్లి, మాచవరం మండలం, పల్నాడు జిల్లా) కంబైన్డ్ జత 2339.5 అడుగులు లాగి ఆరో స్థానంలో, యామని రామారావు ( కొత్తపాలెం, మాచవరం మండలం, పల్నాడు జిల్లా) ఎడ్లు 2000 అడుగులు, ముత్న వెంకటరెడ్డి (గోగులపాడు, గురజాల మండలం, పల్నాడు జిల్లా) ఎడ్లు 528 అడుగులు లాగి ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచి వరుస బహుమతులు అందుకున్నాయి. శుక్రవారం న్యూ కేటగిరి (సేద్యం విభాగం)లో పోటీలు కొనసాగుతున్నాయి. ఆరుపళ్ల విభాగంలో ప్రథమస్థానం కై వసం -
భూగర్భజలాల పెంపు అందరి బాధ్యత
బాపట్ల: భూగర్భ జలాల పెంపు అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించాలని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. జలవనరులను సంరక్షించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన చెప్పారు. ప్రభుత్వ భవనాల ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. 256 గ్రామాలలోని 261 అంగన్వాడీ కేంద్రాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించడానికి ప్రభుత్వం నిధులను విడుదల చేసిందని చెప్పారు. ఒక్కోదానికి రూ.16 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిబంధనలు అనుసరించి పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. సమావేశంలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పి.డి. ఉమా, పంచాయతీరాజ్ ఇన్చార్జి ఎస్ఈ జి.రత్నబాబు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంజీవయ్య సేవలు చిరస్మరణీయం బాపట్ల: దామోదరం సంజీవయ్య సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సంజీవయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప సంఘటన అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
జిల్లా ఎస్పీ సతీష్కుమార్
క్వారీ తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు చేబ్రోలు: మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్లకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శుక్రవారం స్వామి వారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 26వ తేదీన జరిగే తిరునాళ్లకు బందోబస్తు, గుడి వద్ద ఏర్పాట్లు, ఫెన్సింగ్, ట్రాఫిక్, ప్రభలు నిలుపు ప్రదేశాలు తదితరాలను ఆయన పరిశీలించారు. దేవదాయ, ఇతర శాఖల అధికారులతో చర్చించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించే ప్రదేశం, చిన్న దుకాణాల ఏర్పాటు ప్రాంతాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ప్రదేశాలను కేటాయించాలని సూచించారు. గుంటూరు – తెనాలి ప్రధాన రహదారి వెంట ఆలయం ఉండటంతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభల నిర్వాహకులకు నిర్ణీత స్థలం కేటాయించాలని, డ్రోన్ కెమెరాతో నిఘా పెట్టాలని తెలిపారు. తర్వాత దీప స్తంభ నిర్మాణానికి ఎస్పీ భూమిపూజ చేశారు. నారకోడూరు ప్రధాన జంక్షన్ వద్ద, నారా కోడూరు – తెనాలి రహదారిపై ట్రాఫిక్ నియంత్రణకు సూచనలు చేశారు. ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ జనార్దన్రావు, దేవదాయ శాఖాధికారి పోతుల రామకోటేశ్వరావు, పొన్నూరు రూరల్ సీఐ వై కోటేశ్వరరావు, ఎస్ఐ డీవీ కృష్ణ పాల్గొన్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
గుంటూరు రూరల్: అప్పులబాధతో పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన వరగాని బాబూరావు(60) వ్యవసాయం చేస్తున్నాడు. అతడి భార్య స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటపని చేస్తుండేది. వీరికి ఇద్దరు మగ, ఒక ఆడపిల్ల ఉంది. ముగ్గురికి వివాహాలు జరిపించారు. బాబూరావు తనకున్న 40 సెంట్ల భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని అందులో పత్తి, మిరప పంటలు సాగు చేస్తున్నాడు. పంటలకు మద్దతు ధరలు లేక, పంటలు నష్టపోవటంతో అప్పులపాలయ్యాడు. దీంతో ఈనెల 13వ తేదీన తన చిన్నకుమారుడు రాజుకు ఫోన్చేసి తాను వ్యవసాయం వలన నష్టపోయి అప్పులపాలయ్యానని, అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై తమ పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫోన్చేసి చెప్పాడు. బంధువులతో కలిసి పొలంవద్దకు వెళ్ళి చూడగా అప్పటికే పురుగుల మందుతాగి ఆపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే 108లో చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు.. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణానదిలో గుర్తుతెలియని మృతదేహం
తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో కృష్ణా నది దిగువ ప్రాంతంలోని గేట్ల వద్ద నీటిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానిక మత్స్యకారులు తాడేపల్లి పోలీసులకు శుక్రవారం సమాచారం ఇచ్చారు. ఎస్ఐ జె. శ్రీనివాసరావు ఘటనా స్థలానికి వెళ్లి నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. అతడి వద్ద గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎస్ఐ మాట్లాడుతూ సుమారు 27 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చని, మృతుడి ఒంటిపై ఖాకీ ఫ్యాంట్ షాట్, వైలెట్ కలర్ ఫుల్హ్యాండ్స్ టీషర్ట్, మాసిన గడ్డం ఉందని, బహుశా ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే 086452721865కు ఫోన్ చేయాలని కోరారు. -
ఇకపై వారానికోసారి సివిల్ పోలీసులకు పరేడ్
తెనాలి రూరల్: పరేడ్తో క్రమశిక్షణ అలవడుతుందని, ఇప్పటివరకూ ఏఆర్ సిబ్బందికే ఉన్న ఈ పరేడ్ ఇకపై సివిల్ పోలీస్లకూ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్ తెలిపారు. స్థానిక వీఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ గ్రౌండ్స్లో శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ(ఏఆర్) హనుమంతు, ట్రైనీ ఐపీఎస్ దీక్ష, తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది పరేడ్ నిర్వహిస్తూ ఎస్పీకి గౌరవ వందనం చేశారు. మార్చ్ ఫాస్ట్, వెపన్ డ్రిల్, పోలీస్ బ్యాండ్ ఆకట్టుకున్నాయి. ఆర్ఎస్ఐ సంపంగిరావు సెరిమోనియల్ పరేడ్ కమాండర్గా వ్యవహరించారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల విధుల్లో భాగంగా ప్రతి శుక్రవారం పోలీస్ పరేడ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సీఐలు వి.మల్లికార్జునరావు, కె. రాములు నాయక్, ఎస్. రమేష్ బాబు, ఏఆర్ సీఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. -
సత్రశాలలో మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు
దేవదాయశాఖ డెప్యూటీ కమిషనర్ బసవ శ్రీనివాసరావు సత్రశాల(రెంటచింతల): మహాశివరాత్రి పర్వదినం పురష్కరించుకుని ఫిబ్రవరి 26న సత్రశాల గంగా భ్రమరాంబ సమే త మల్లికార్జునస్వామి ని దర్శించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించాలని గుంటూరు దేవదాయ శాఖ డెప్యూటీ కమిషనర్ కామినేని బసవ శ్రీనివాసరావు కోరారు. శుక్రవారం స్థానిక దేవస్థానం ప్రాంగణంలో ఆయన ఎండోమెంట్ ఈఓ గాదె రామిరెడ్డితో మహాశివరాత్రి ఏర్పాట్లపై చర్చించి పలు సూచనలు చేశారు. సత్రశాల వరకు ఉన్న రహదారికి ఇరువైపులా ఉన్న గుంతలను వెంటనే పూడ్చే పనులు చేపట్టాలని ఆదేశించారు. ముందుగా ఆయన దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట అర్చకులు మల్లికార్జునశర్మ నీలం మల్లయ్య, మున్నా లింగయ్య తదితరులు ఉన్నారు. -
పిట్ట కొంచెం.. ‘ఆట’ ఘనం!
పెదకాకాని: చదువుతో పాటు క్రీడల్లోనూ శ్రీలక్ష్మి రాణిస్తూ మన్ననలు పొందుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, వ్యాయామ ఉపాధ్యాయుడి శిక్షణతో ఫుట్బాల్లో రాణిస్తోంది. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది. ఆమె క్రీడా ప్రతిభను గుర్తించిన కేంద్రం గతేడాది స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం కూడా పంపింది. పెదకాకాని: మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన తాడిబోయిన తాతారావు, శాంతి దంపతుల చిన్న కుమార్తె శ్రీలక్ష్మి ప్రస్తుతం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తాతారావు సాంఘిక నాటక రచయిత. శ్రీలక్ష్మి బాగా చదువుతోంది. బాలికలోని క్రీడా ప్రతిభను చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వినయ్కుమార్ 8వ తరగతి నుంచే ఫుట్బాల్లో శిక్షణ ప్రారంభించారు. దీంతో జాతీయ స్థాయి పోటీల్లో సైతం సత్తా చాటుతోంది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన శ్రీలక్ష్మి 13 నుంచి 17వ తేదీ వరకు ప్రోగ్రాంలో పాల్గొంది. క్రాఫ్ట్ సంస్థ నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఢిల్లీలో జరిగిన బాలల హక్కులు, బాల కార్మికులు, బాల్యవివాహాలకు సంబంధించిన సెమినార్కు ఎంపికై ంది. గుంటూరు జిల్లాలో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జరిగిన డిబేట్లో ప్రథమ స్థానం పొందింది. ఓటర్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి నుంచి ప్రశంసాపత్రం అందుకుంది. జిల్లా స్థాయిలో జరిగిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి డీఈఓ సీవీ రేణుక నుంచి సర్టిఫికెట్ అందుకుంది. ఐఏఎస్ కావడమే లక్ష్యం : శ్రీలక్ష్మి ఎర్రకోట వద్ద స్వాతంత్య్ర దినోత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. అన్నివిధాలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల రుణం తీరనిది. ఉపాధ్యాయులను ఎన్నటికీ మర్చిపోను. బాగా చదివి కలెక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు. జాతీయస్థాయి ఫుట్బాల్లో జిల్లా బాలిక ప్రతిభ చదువు, ఇతర పోటీల్లోనూ రాణిస్తున్న శ్రీలక్ష్మి జిల్లా ఉన్నతాధికారుల నుంచి పలు ప్రశంసాపత్రాలు