breaking news
Bapatla
-
ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కల్యాణం, చండీహోమాలలో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నామగోత్రాలతో పూజ లు జరిపించుకున్నారు. ఇక శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చనలు శనివారంతో ముగిశాయి. శనివారం కూడా పెద్ద ఎత్తున భక్తు లు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కుంకుమా ర్చనలు జరిపించుకున్నారు. సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. నూతన అన్నదాన భవన పరిశీలన రాజగోపురం ఎదుట నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనాన్ని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. దసరా ఉత్సవాల నాటికి అన్నదాన భవనం అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. క్లోక్రూమ్, సెల్ఫోన్ కౌంటర్ను తనిఖీ చేసిన ఈవో సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కనకదుర్గనగర్లో నిర్మిస్తున్న సమాచార కేంద్రాన్ని పరిశీలించారు. ఈవో వెంట ఈఈ రాంబాబు, ఏఈ మస్తాన్, సునీల్ పాల్గొన్నారు. దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 7,508 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కు 306, బ్యాంక్ కెనాల్ 1,861, తూర్పు కాలువకు 728, పశ్చిమ కాలువకు 302, నిజాపట్నం కాలువకు 486, కొమ్మూరు కాలువకు 2,960 క్యూసెక్కులు విడుదల చేశారు. -
నిషేధం పెట్టడం సరికాదు
రైతులు సాగు చేసే పొగాకు పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయకుండా అసలు పంటే సాగుచేయవద్దని ప్రభుత్వం చెప్పడం సరికాదు. గత ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి పొగాకు కొన్నారు. తెగుళ్లు తక్కువని, గిట్టుబాటు అవుతుందని పొగాకు వేస్తే కొనకుండా కంపెనీలు మోసం చేశాయి. ప్రభుత్వమన్నా పొగాకు కొని ఆదుకుంటుందనుకుంటే ఆపని చేయకుండా పంటే సాగుచేయొద్దని చెప్పడం దుర్మార్గం. – బొల్లా రామాంజనేయులు, పొగాకు రైతు, పంగులూరు ● -
● తగ్గని వరద ఉధృతి
అమరావతి: కృష్ణా నదిలో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. అమరావతి వద్ద శనివారం కూడా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో నిలిచిన నీరు కృష్ణానదిలోకి చేరాల్సి ఉంది. కానీ నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. అమరావతి–విజయవాడ రోడ్డులో పెదమద్దూరు వద్ద వాగు చప్టాపై ఇంకా రెండు అడుగుల మేర నీరు ప్రవాహిస్తోంది. చప్టా శిథిలావస్థలో ఉండటం వల్ల అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే బస్సులు పెదమద్దూరు వరకు నడుపుతున్నారు. విజయవాడ వెళ్లాలంటే ఆటోలో నరుకుళ్లపాడు ఎండ్రాయి, చావపాడు గ్రామాల మీదుగా సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
స్వచ్ఛ ఆంధ్రలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
బాపట్ల: స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణం 57 ఎకరాల మేర భూమి ఉందని ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి చర్యలు చేపట్టామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టిన సంస్థలకు అవార్డుల ప్రదానోత్సవం చేస్తామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, హాస్టల్లో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేస్తుందని చెప్పారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వెయ్యి మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంథామరెడ్డి, ఎకై ్సజ్ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరావు, జిల్లా ప్రణాళిక అధికారి షాలేం రాజు, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామిత్వ సర్వే పనులను శరవేగంగా పూర్తి చేయాలి స్వామిత్వ సర్వే పనులను అధికారులు శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. స్వామిత్వ సర్వే, పి 4 అమలు, ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయం వంటి అంశాలపై డివిజన్, మండల స్థాయి అధికారులతో శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం ద్వారా మాట్లాడారు. చీరాల, వేటపాలెం, ఇంకొల్లు, చిన్నగంజాం, రేపల్లె, కర్లపాలెం, పి.వి పాలెం, పర్చూరు, మార్టూరు, చెరుకుపల్లి, రేపల్లె, నగరం, చుండూరు మండలాల్లో స్వామిత్వ సర్వే ఆశించిన స్థాయిలో జరగడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతాలలో సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సర్వే పురోగతికి డీఎల్డీఓలు బాధ్యులని స్పష్టం చేశారు. స్వామిత్వ సర్వేపై ప్రతిరోజూ మండల స్థాయిలో సమీక్షలు జరగాలన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిపర్యాటక దినోత్సవాన్ని వైభవంగా జరపడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లాలో సూర్యలంక బీచ్ లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహిస్తున్న విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కనక ప్రసాద్, ఆర్డీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
పొగాకు సాగును అడ్డుకునేందుకు టాస్క్ఫోర్స్
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లాలో సాగుచేసే బ్లాక్, వైట్ బర్లీ పొగాకుపై కూటమి ప్రభుత్వం నిషేధం విధించింది. ఆదేశాలు ఉల్లంఘిస్తే పంటను ట్రాక్టర్లు పెట్టి దున్నేస్తామని హెచ్చరించింది. తాజాగా నిషేధం అమలుకు అధికారులతో ఏకంగా టాస్క్ఫోర్సులు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీతోపాటు వ్యవసాయశాఖ అధికారి కమిటీలో ఉండగా, డివిజనల్ స్థాయిలో ఆర్డీవో, డీఎస్పీ, ఏడీ స్థాయి అధికారులు, మండల స్థాయిలో తహసీల్దారు, సీఐ, వ్యవసాయాధికారులతోపాటు ఇతర అధికారులు టాస్క్ఫోర్సులో సభ్యులుగా ఉండి సాగును అడ్డుకుంటారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఏడాది సాగు చేయకూడదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. -
అద్దె దుకాణాల కూల్చివేతపై ఆవేదన
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): ప్రతి నెల అద్దెలు చెల్లిస్తూ వస్తున్న వారిపై దుకాణ యజమాని మనవరాలు దౌర్జన్యానికి దిగారు. షాపులను ఖాళీ చేయాలంటూ రౌడీమూకతో కలిసి ఏకంగా జేసీబీ తీసుకొచ్చి షాపులను కూల్చివేయించారు. ఈ ఘటన శనివారం ఎస్.వి.ఎన్. కాలనీలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీ 4వ లైను ప్రధాన రహదారి మార్గంలో విజయవాడకు చెందిన వెంకటయ్య చౌదరి అనే వ్యక్తికి 778 గజాల స్థలంలో ముందు భాగంలో షాపులు, వెనుక ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ 35 సంవత్సరాల క్రితం కాలనీకి చెందిన రామచంద్రరావు షాపు అద్దెకు తీసుకుని సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. దీంతోపాటు బ్యాటరీ దుకాణం, సెలూన్ ఏర్పాటు అయ్యాయి. మూడు కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. వెంకయ్య చౌదరికి నెలకు వీరందరూ రూ.35 వేల చొప్పున అద్దె చెల్లిస్తూ వచ్చారు. వీటికి కరెంటు బిల్లులు, మున్సిపాలిటీ పన్నులు తదితరాలను రామచంద్రరావు చెల్లిస్తున్నారు. వెంకయ్య చౌదరికి సంతానం లేకపోవడంతో తూమాటి కృష్ణవేణిని దత్తత తీసుకున్నారు. కృష్ణవేణికి వివాహమై, ఇద్దరు సంతానం ఉన్నారు. వెంకయ్య చౌదరి తన స్నేహితుడైన శ్రీనివాస్, పద్మజలను ఈ ఆస్తికి గార్డియన్లుగా పెట్టారు. 2017లో వెంకయ్య చౌదరి మృతి చెందారు. అప్పటి నుంచి శ్రీనివాస్కే అద్దెలు చెల్లిస్తున్నారు. గత జనవరిలో కృష్ణవేణి వచ్చి అద్దెల నగదు తనకు ఇవ్వాలని చెప్పడంతో వారు అదే విధంగా చేస్తున్నారు. సమయం అడిగినా.. రెండు నెలల క్రితం కృష్ణవేణి వచ్చినప్పుడు దుకాణాలు ఖాళీ చేయాలని, ఈ స్థలం విక్రయించామని చెప్పారు. రెండు నెలల్లో ఖాళీ చేయడం కష్టమని, కనీసం ఏడాదైనా టైం కావాలని చెప్పారు. అవేమీ పట్టించుకోకుండా ఎలాగైనా ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి వెళ్లారు. అద్దెదారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. స్థలం విలువ ఎంతో చెబితే తామే కొనుగోలు చేసుకుంటామని వారందరూ కోరారు. ఆలోచించుకుని చెబుతామని కృష్ణవేణి వెళ్లిపోయారు. ఈ నెల 17వ తేదీన మళ్లీ వచ్చి దౌర్జన్యంగా షాపులకు తాళాలు వేశారు. బాధితులు పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకుండాపోయింది. అద్దెకు ఉన్నవారు ఖాళీ చేయాలని స్టేషన్ అధికారి చెప్పారని బాధితులు వాపోయారు. ఈ నెల 18వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్లోనూ వారు ఫిర్యాదు చేశారు. పట్టాభిపురం పోలీసులు కనీసం స్పందించలేదు. శనివారం మధ్యాహ్నం కృష్ణవేణి కుమార్తెనంటూ భూమిక అనే యువతి మరి కొంత మందితో వచ్చారు. జేసీబీతో షాపులు కూల్చివేయించారు. అడ్డుకునే యత్నం చేసే వారిపై మహిళలు, చిన్నారులు ఉన్నారని కూడా చూడకుండా బెదిరింపులకు దిగారు. బాధితులు ఫోన్ చేయగా పట్టాభిపురం హెడ్ కానిస్టేబుల్ వచ్చి గొడవ జరగలేదుగా అంటూ తిరిగి వెళ్లిపోయారని వారు తెలిపారు. కుటుంబాలతో రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు. -
కౌలు రైతులకూ అన్నదాత సుఖీభవ వర్తింపచేయాలి
లక్ష్మీపురం (గుంటూరు): రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం కౌలు రైతులే ఉన్నా గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు ఆరోపించారు. వారికి అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడిపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం చేయాలనే నిబంధన వల్ల కార్డులు రాలేదన్నారు. పంట రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం అయిందన్నారు. స్పందించి వారి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. నాగమల్లేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు ఎం.సాంబిరెడ్డి, పి.కృష్ణ, అమ్మిరెడ్డి, వై.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ బహుళ అమావాస్యను పురస్కరించుకుని శనివారం కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరిగింది. కార్యనిర్వాహణాధికారి బి. అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ప్రధాన అర్చకుడు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ పూజా కార్యక్రమాలు జరిపారు. 10 లక్షల పారాయణ, కుంకుమార్చన, అమ్మవారికి శ్రీ సూక్త సహిత దేవి ఉపనిషత్తులతో అభిషేకం, కుంకుమార్చన, దేవీ హోమం, కుష్మాండ పూజ, కూష్మాండ బలి పూజా కార్యక్రమాలు జరిగాయి. పైనం రంగారెడ్డి దంపతులు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో చావలి శ్రీధర్శర్మ, మండవ రమేష్, పావులూరి రమేష్, పావులూరి సుబ్బారావు, వరలక్ష్మి, పొన్నపల్లి సత్యన్నారాయణ, జంజనం హేమశంకరరావు, కూచిబొట్ల శ్రీనివాసశర్మ, కళ్యాణ చక్రవర్తి స్వామి, పసుపులేటి కొండలస్వామి, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ, మండవ మల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కోటి కుంకుమార్చన కమిటీ, సహాయకులు పర్యవేక్షించారు. -
ఇన్స్పైర్ నామినేషన్లు పెంచండి
డీఈఓ పురుషోత్తం బాపట్ల అర్బన్: ఇన్స్పైర్ అవార్డుల కోసం నామినేషన్ తప్పనిసరిగా ఉండాలని డీఈఓ పురుషోత్తం తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం మండల నోడల్ సైన్స్ ఉపాధ్యాయులకు బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ... ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు రిజిస్ట్రేషన్ చేయించాలని అన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రాజెక్టులు నూతన ఆవిష్కరణలకు దారి తీసేలా ఉండాలని, పేటెంట్ హక్కులు పొందే స్థాయి వరకు వెళ్లే విధంగా విద్యార్థులకు తగిన తర్ఫీదు ఇవ్వాలన్నారు. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయడమే ఉపాధ్యాయుల కర్తవ్యం కావాలని పేర్కొన్నారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సెప్టెంబర్ 15వ తేదీలోపు బాపట్ల జిల్లా నుంచి గరిష్టంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి హాజరైన నోడల్ సైన్స్ ఉపాధ్యాయులు వెంటనే తమ మండలాల్లోని అన్ని పాఠశాలలు రిజిస్టర్ అయ్యేట్లు చూడవలసినదిగా ఆదేశించారు. జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, నోడల్ టీచర్లు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
దుగ్గిరాల: ఎరువుల కొరత ఏర్పడుతుందని అనే అపోహతో రైతులు ఒకేసారి ఎరువులు అధిక సంఖ్యలో తీసుకెళ్లడం ద్వారా కొరత ఏర్పడుతుందని విజిలెన్స్ ఈఓ ఆర్.విజయ బాబు అన్నారు. శనివారం దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో విజిలెన్స్, అగ్రికల్చర్, ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు సంయుక్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. విజయబాబు మాట్లాడుతూ యూరియా 58 మెట్రిక్ టన్నులు, డీఏపీ 49 మెట్రిక్ టన్నులు సొసైటీలు, ప్రైవేటు డీలర్స్ వద్ద అందుబాటులో ఉందని గుర్తించామని తెలిపారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్స్ కె.చంద్రశేఖర్, వై.శివన్నారాయణ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల అర్బన్: సెప్టెంబరు 13వ తేదీన జరిగే జాతీయ లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని మండల న్యాయ సేవాధికార కమిటీ చైర్మన్ కే శ్యాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాపట్ల కోర్టుల సముదాయంలో మండల న్యాయ సేవా కమిటీ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోర్టులలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల సివిల్ కేసులు, భరణం కేసులు, గృహ హింస కేసులు, మోటార్ ప్రమాద కేసులు, రెవెన్యూ కేసులు, బ్యాంకు కేసులు, చెక్ బౌనన్స్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, ముందస్తు రాజీ చేసుకోదలచిన కేసులు ఇరుపక్షాల మధ్య సామరస్యపూర్వకంగా రాజీ చేసి పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుని తమ వివాదాలను శాంతియుతంగా రాజీచేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. -
యూరియా కొరత లేదనడం హాస్యాస్పదం
ఫిరంగిపురం: వ్యవసాయ పనులు ప్రారంభమైనప్పటికీ రైతులకు యూరియా అందుబాటులోకి రాలేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పేర్కొ న్నారు. మండల కేంద్రంలో శనివారం వ్యవసాయ కార్మికసంఘం సమావేశం నిర్వహించారు. అప్పారావు మాట్లాడుతూ యూరియా కొరతతో రైతులు ఇక్కట్లు పడుతుంటే అధికారులు మాత్రం కొరత లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలన్నారు. పనులు నిర్వహించి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదని తెలిపారు. వ్యవసాయ పనులు లేక వారు నానా ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. సీఐటీయూ మండల కార్యదర్శి షేక్, మస్తాన్వలి, ఎ.అంకారావు, నాయకులు, రైతులు పాల్గొన్నారు. కృష్ణానదిలోకి దూకి మహిళ ఆత్మహత్య తాడేపల్లి రూరల్: తాడేపల్లి సీతానగరం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఓ మహిళ కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం చోటుచేసుకుంది. తాడేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం ఘాట్ వద్దకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయభార్గవి (28) అనే మహిళ తన కుమార్తె అనేక్యతో కలసి వచ్చింది. భార్గవి కృష్ణానదిలోకి దూకడంతో స్థానికులు గమనించి సమాచారం అందించారని తెలిపారు. పోలీసులు వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిమిత్తం మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. పాప తన తండ్రి పేరు నరేష్ అని మాత్రమే చెబుతోందని, ఊరు పేరు చెప్పలేకపోయిందని తెలిపారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే తాడేపల్లి పోలీస్స్టేషన్ ఫోను నంబర్లు 86888 31361, 81438 73409, 97034 52206లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. అనేక్యను విజయవాడలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. -
సీనియార్టీ జాబితా రూపకల్పనకు వినతి
నెహ్రూనగర్: గుంటూరు జోనల్ పరిధిలోని ఉద్యోగుల సీనియార్టీ జాబితాను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు శనివారం బ్రాడిపేటలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ రీజినల్ డైరెక్టర్ ఎస్. హరికృష్ణను ఆయన చాంబర్లో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు సచివాలయ ఉద్యోగులందరి సీనియార్టీ జాబితాను జూలై 31వ తేదీ లోపు రూపొందించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. అనేకచోట్ల ఇది అమలు కాలేదని చెప్పారు. పారదర్శకంగా జాబితాను సిద్ధం చేయాలని కోరారు. వచ్చే పది రోజుల్లోపు గుంటూరు రీజియన్లోని ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో పనిచేస్తున్న వారి జాబితాను రూపొందించి, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని ఆర్డీ పేర్కొన్నట్లు రజాక్ తెలిపారు. తుది సీనియార్టీ జాబితాను రూపొందించి మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయానికి, ఉద్యోగులకు అందిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పార్షా మధు, సంఘ నగర నాయకులు అంకారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు వెస్ట్: మైనార్టీల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో పీఎంజేబీకే, సూర్యఘర్, టూరిజం అభివృద్ధిపై జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ పీఎంజేబీకే పథకం 25 శాతం మైనార్టీలున్న ప్రాంతాల్లోనే సాధ్యమన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం దీనికి ఎంపికై ందని తెలిపారు. సూర్యఘర్ పథకం కింద గుంటూరు పార్లమెంటు పరిధిలో 1.16 లక్షల మంది నమోదు అయ్యారన్నారు. 3,600 మంది ఉపయోగించుకుని లబ్ధి పొందారని పేర్కొన్నారు. జిల్లాలో టూరిజం అభి వృద్ధిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎన్టీఆర్ మానస సరోవరం, పేరేచర్ల వద్ద ఉన్న నందనవనం, ఉండవల్లి గుహలు, ఉప్పలపాడు విదేశీ పక్షుల కేంద్రం తదితరాల అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు కోరుతామన్నారు. సమావేశంలో డీఆర్వో షేక్ ఖాజావలి, సీపీఓ శేషశ్రీ, జిల్లా టూరిజం అధికారి శ్రీరమ్య, ఎల్డీఎం మహిపాల్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సంతమాగులూరు(అద్దంకి రూరల్): బైకు మీద వెళ్తున్న భార్యాభర్తలను వెనకు నుంచి లారీ ఢీకొట్టటంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటన సంతమాగులూరు మండలం రామిరెడ్డిపాలెం గ్రామం వద్ద శనివారం జరిగింది. సంతమాగులూరు ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలం గోకనకొండ గ్రామానికి చెందిన గద్దల తిరుపతయ్య, అతని భార్య కోటేశ్వరమ్మ (44) బైక్పై కొమ్మాలపాడు నుంచి సంతమాగులూరు వైపు వస్తున్నారు. రామిరెడ్డిపాలెంలోని రామాలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. కోటేశ్వరమ్మకు గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలైన తిరుపతయ్యను 108 వాహనంలో నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య చీరాల అర్బన్: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం బాపట్ల జిల్లా చీరాల ఐక్యనగర్లో చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఐక్యనగర్కు చెందిన డి.వెంకటేశ్వర్లు (36) ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ చేశాడు. హైదరాబాద్లో శిక్షణ తీసుకుని గ్రూప్స్, కానిస్టేబుల్ పోస్టులకు ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురై శనివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు టూటౌన్ ఎస్ఐ నాగశ్రీను తెలిపారు. యువకుడి అదృశ్యంపై ఫిర్యాదు చౌటుప్పల్: ఆఫీసుకు వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన గడిపూడి మురారి(30) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం వివాహమైంది. మూడు నెలల క్రితం గొడవ జరిగడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మురారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్కాలనీలో నివాసముంటున్న తన అక్క కాంచన వద్దకు వచ్చాడు. రోజూ హైదరాబాద్లో ఆఫీస్కి వెళ్లి తిరిగి రాత్రికి వస్తుండేవాడు. 18న మురారి ఆఫీస్కి వెళ్లాడు. అదేరోజు రాత్రి అక్క ఫోన్ చేయగా.. ‘బస్టాండ్ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నా’ అని చెప్పాడు. కానీ ఇంటికి వెళ్లలేదు. రెండు రోజులు అతడి ఫోన్ ఆన్లో ఉన్నప్పటికీ.. సమాధానం ఇవ్వలేదు. ఏదైనా పనిమీద ఉన్నాడేమోనని, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని భావించిన కాంచన అంతగా పట్టించుకోలేదు. 21వ తేదీ నుంచి మురారి సెల్ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. ఎంత ప్రయత్నించినా మురారి గురించిన సమాచారం తెలియరాలేదు. దీంతో శనివారం మురారి అక్క కాంచన చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు. -
అపూర్వ ధైర్యశాలి టంగుటూరి
నగరంపాలెం: స్వాతంత్య్ర సమరంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అపూర్వ ధైర్యసాహసాలతో బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు ఎదురు నిలబడ్డారని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవ పతాకదారుడు టంగుటూరి అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎంగా ప్రజాస్వామ్య పరిపాలనకు బలమైన పునాదులేసి, విశేష సేవలందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి, ఎస్బీ సీఐలు అళహరి శ్రీనివాస్, సీహెచ్ రాంబాబు, ఆర్ఐలు సురేష్, శ్రీహరిరెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్ఫూర్తి ప్రదాత ప్రకాశం పంతులు గుంటూరు ఎడ్యుకేషన్: స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిషు పాలకుల తుపాకీకి ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం పంతులు తరతరాలకు స్ఫూర్తి ప్రదాత అని జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిబసు మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టినా రాష్ట్రానికి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని వివరించారు. అత్యంత సాధారణ జీవనాన్ని సాగించిన ఆయన దేశభక్తి నేటి యువతకు మార్గదర్శకం కావాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, పరిపాలనాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డిప్యూటీ సీఈవో కృష్ణ, ఉద్యోగులు -
అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలి
డీఈవో కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్ నిరసన గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన అసెస్మెంట్ బుక్స్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షుడు కె. బసవ లింగారావు మాట్లాడుతూ.. ఈ విధానం కారణంగా విద్యార్థులు 50 నుంచి 70 గంటల బోధనా పీరియడ్స్ నష్టపోతున్నారని, ఆగస్టు నెలలో సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ విధానం తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ ఒకటో తరగతి విద్యార్థికి ఓఎంఆర్ షీట్ ఇవ్వడం పనికి రాని చర్య అన్నారు. ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠ్యాంశాల నుంచి ఒక్క ప్రశ్న సైతం ఇవ్వకుండా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తురని పేర్కొన్నారు. ఒక్కో పరీక్షకు ఎనిమిది పేపర్లతో ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడం చేయడం ఉపాధ్యాయులకు పెద్ద పరీక్షలా ఉందన్నారు. విద్యార్థుల మార్కులు ఐదు చోట్ల నమోదు చేయాలనడం తగదన్నారు. అనంతరం డీఈవో సీవీ రేణుక, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మీనారాయణ, పి.పార్వతి, ఎస్ఎస్ఎన్ మూర్తి, జి.దాస్, బి.సాయిలక్ష్మి, వెంకటేశ్వరావు, కిషోర్ షా, రాంమోహన్, శివరామకృష్ణ, రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అంధుల క్రికెట్ టోర్నీ విజేతగా ‘ఆంధ్రా గ్రీన్’
గుంటూరువెస్ట్ (క్రీడలు): ఏపీ రాష్ట్ర అంధుల క్రికెట్ జట్టు కోసం గత మూడు రోజులుగా స్థానిక అరండల్పేటలోని ఏసీఏ క్రీడా మైదానంలో క్రికెట్ అసోసి యేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏపీ, విజువల్లీ బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, డిఫరెంట్ డిసేబుల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన పోటీలు శుక్రవారంతో ముగిశాయి. విజేతగా ఆంధ్రా గ్రీన్స్ జట్టు నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనబరిచిన 42 మందిని ఎంపిక చేసి ఆంధ్రా బ్లూ, ఆంధ్రా ఎల్లో, ఆంధ్రా గ్రీన్ పేరుతో పోటీలు నిర్వహించారు. ఆంధ్రా గ్రీన్ విజేతగా నిలిచింది. వీసీఈఏ అధ్యక్షుడు జి.రవీంద్రబాబు ముఖ్యఅతిథిగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో క్రికెట్కు అండగా నిలుస్తున్న రామకృష్ణ పరమహంస, మోటివేషనల్ స్పీకర్ శ్రీధర్బాబు, మాజీ బ్లైండ్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత అజయ్కుమార్ రెడ్డి విజేతలకు ట్రోఫీని అందించారు. అజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ క్రికెటర్లను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఉత్తమ ప్రతిభ చాటిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. -
నగదు కోసం యాచకుడి హత్య
నిందితుడి అరెస్ట్ తెనాలి రూరల్: నగదు కోసం యాచకుడైన వృద్ధుడిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం సీఐ ఎస్. రమేష్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. పట్టణ త్రీ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో యాచకుడు వెంకటనారాయణ(70) జూన్ 8న రాత్రివేళ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం హత్యకు గురైనట్లు నిర్ధారించి, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా దర్యాప్తు చేపట్టారు. అవనిగడ్డ మండలం లంకమాన్యం ప్రాంతానికి చెందిన నిందితుడు కొల్లి రాజేష్ను అరెస్టు చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని సాయిబాబా గుడి వెనుక ఓ టింబర్ డిపో వద్ద నిద్రించిన వృద్ధుడి వద్ద రూ.3 వేల నగదు ఉంది. ఈ విషయం గమనించిన రాజేష్ అతడిపై దాడి చేసి హతమార్చి నగదుతో పారిపోయాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. సమావేశంలో ఎస్ఐలు ప్రకాశరావు, కరిముల్లా, కానిస్టేబుళ్లు మురళి, జయకర్ బాబు, సురేష్ పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల దొంగ అరెస్ట్
రూ. 16 లక్షలకు పైగా సొత్తు స్వాధీనం బల్లికురవ: పథకం ప్రకారం నివాస గృహాల్లో బంగారం, వెండి బైక్లు చోరీకి పాల్పడ్డ అంతర్ జిల్లాల దొంగను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. మేదరమెట్ల–నార్కెట్పల్లి నామ్ రహదారిలో బల్లికురవ మండలంలోని గొర్రెపాడు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి పట్టుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలు తెలియజేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన కత్తి రవికుమార్ 18వ సంవత్సరం నుంచే చెడు వ్యవసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతూ జైలుకు వెళ్లడం, బెయిల్పై రావటం.. మరలా చోరీలకు పాల్పడటం చేస్తున్నాడు. ఈనెల 5వ తేదీ అర్ధరాత్రి మేదరమెట్ల–నార్కెట్పల్లి నామ్ రహదారిలోని మండలంలోని రామాంజనేయపురంలో గుంటుపల్లి గురుమూర్తి ఇంట్లోకి ప్రవేశించి 32 గ్రాముల బంగారం, 30 తులాల వెండి చోరీకి పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని సంతమాగులూరు సీఐ వెంకటరావు, ఎస్సై వై నాగరాజు పరిశీలించి కేసు నమోదు చేశారు. బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు పర్యవేక్షణలో సీఐ సారథ్యంలో బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైలు నాగరాజు, పట్టాభిరామయ్య రెండు టీంలుగా పక్కా వ్యూహంతో ముద్దాయిని అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల, పల్నాడు, తూర్పు గోదావరి, కర్నూలు జిల్లాలో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. 102 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. బల్లికురవ, పల్నాడు జిల్లా నాదెండ్ల, దాచేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి రికవరీ చేసినట్లు వివరించారు. విశేష ప్రతిభతో నిందితుడిని అదుపులోకి తీసుకుని రికవరీ చేయటం పట్ల బాపట్ల ఎస్పీ తుషార్డూడీ, డీఎస్పీ రామాజంనేయులు, సీఐ వెంకటరావు, ఎస్సైలు వై.నాగరాజు పట్టాభిరామయ్యను అభినందించి రివార్డులు ప్రకటించారు. -
అక్రమార్కులకు అడ్డా తహసీల్దార్ కార్యాలయం
మార్టూరు: మార్టూరు తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తికి చెందిన ఇంట్లో ముగ్గురి పేరుతో ప్రభుత్వ భూమికి సంబంధించి మూడు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంలో సుమారు రెండు లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆ పార్టీ నాయకులే మీడియాకు వివరాలు అందజేయడం గమనార్హం. ఇదే విషయాన్ని విలేకరులు అధికారిని వివరణ కోరగా తాను డబ్బు తీసుకోలేదని చెప్పారు. కానీ ఆ తర్వాత అదే విలేకరికి ఫోన్ చేసి తాను పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన పట్టా నకలు తనకు వాట్సాప్ ద్వారా పంపమని కోరడం గమనార్హం. ఫారెస్ట్ అధికారుల ఆదేశాలు బేఖాతర్ బబ్బేపల్లి కొండ.. రెవెన్యూ పరిధి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చిందని సదరు భూమిలో ఎలాంటి ఆక్రమణలు కానీ, తవ్వకాలు కానీ జరపవద్దని జిల్లా ఫారెస్ట్ అధికారులు ఎల్.భీమన్న, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్బాబు గత సంవత్సర కాలంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయితే బబ్బేపల్లి శివారు గ్రామమైన రాజుగారిపాలెం గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కుమార్తె పేరుపై ఈ ఫారెస్ట్ భూమిలో ఓ ఎకరాకు పాస్ బుక్ మంజూరు చేయడం గమనార్హం. తోటి అధికారులకు తెలియకుండా.. భూ సంతర్పణలకు సంబంధించి సమాచార హక్కు చట్టం ద్వారా కొందరు వివరాలు అడగగా నేటికీ సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో పది కోట్ల రూపాయల విలువైన మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రస్తుతం ఓ అధికార పార్టీకి చెందిన నాయకుడికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఫారెస్ట్ భూమిపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సాగదు బబ్బేపల్లి రాజుగారిపాలెం గ్రామం ఫారెస్ట్ భూములను ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకోవడంపై పలుమార్లు హెచ్చరించాం. రెవెన్యూ అధికారులకు ఈ భూమిలో పట్టాలు పాస్ పుస్తకాలు ఇచ్చే అధికారం లేదు. ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకున్నా, అనధికార నిర్మాణాలు చేపట్టినా తగు చర్యలు తీసుకుంటాం. –రమేష్, కూకట్లపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ -
కదులుతున్న రైలుపైకి భార్యను నెట్టిన భర్త
తాడేపల్లిరూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను రన్నింగ్లో ఉన్న ట్రైన్పైకి తోసివేసిన ఘటన శుక్రవారం తాడేపల్లి గేటు సెంటర్లో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడుకు చెందిన వెంకటేశ్వరరావు, అతని భార్య అంజలి కొంతకాలంగా తాడేపల్లిలో నివసిస్తున్నారు. నాలుగేళ్ల కిందట విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నారు. ఇటీవల కలసి జీవనం కొనసాగిస్తున్నారు. అంజలి తాడేపల్లి సలాం సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం బైపాస్రోడ్లో ఉన్న ఓ హోటల్లో పని చేసేందుకు వెళుతోంది. గేటు సమీపంలో భర్త వెంకటేశ్వరరావు తారస పడ్డాడు. అదే సమయంలో రైలు వెళుతుండగా భర్త ఆమె జుట్టు పట్టుకుని వేగంగా వెళుతున్న రైలు మీదకు నెట్టాడు. రైలు ఢీకొనడంతో అంజలి తీవ్ర గాయాలతో అక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు 108కు ఫోన్చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పారిపోతున్న వెంకటేశ్వరరావును పట్టుకుని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఏబీసీ దాటేదెలా? ప్రయాణం సాగేదెలా?
బల్లికురవ: కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ప్రయాణికులు శాపంగా మారింది. వంతెన నిర్మాణం పేరుతో ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు. బల్లికురవ–అద్దంకి ఆర్అండ్బీ రోడ్డులో వారం రోజులుగా రాకపోకలు స్తంభించిపోయాయి. వల్లాపల్లి–ధర్మవరం గ్రామాల మధ్య అద్దంకి బ్రాంచ్ కాలువ దాటే చోట శిథిలాస్థకు చేరిన బ్రిడ్జి స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం రెండు నెలల కిందట చేపట్టారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఏబీసీకి నీరు నిలుపుదల చేయాలని ఆర్అండ్బీ అధికారులు ఎన్నెస్పీ అధికారులకు విన్నవించారు. అయితే ఆగస్టు 1వ తేదీ ప్రవాహ ఉధృతికి నీరు దిగువకు రావటంతో పనులకు ఆటంకం ఏర్పడింది. బంకమట్టితో డైవర్షన్ రోడ్డు.. ఏబీసీ కాలువల్లోని బంకమట్టితో డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ రోడ్డులోనే గ్రానైట్ లారీలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు జారుడు బల్లలా మారింది. ఈ సమస్యపై పత్రికల్లో కథనాలు వచ్చినా.. సమస్య పరిష్కరించకపోగా.. డైవర్షన్ రోడ్డును పూర్తిగా తొలగించారు. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. బల్లికురవ మండలంలో 12 గ్రామాలు, సంతమాగులూరు మండలంలోని 10 గ్రామాలు, అద్దంకి మండలంలోని 9 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 20 కిలోమీటర్ల అదనపు ప్రయాణం ఈ సమస్య వల్ల అద్దంకి ప్రాంతవాసులు కొమ్మినేనివారి పాలెం, వైదన, కొమ్మాలపాడు మీదుగా నరసరావుపేట వైపు వెళ్లాల్సి వస్తోంది. సుమారు 20 కిలోమీటర్ల అదనపు ప్రయాణం చేస్తున్నారు. బల్లికురవ, సంతమాగులూరు మండల వాసులు అద్దంకి చేరాలంటే కొమ్మాలపాడు, కొప్పరపాడు మీదుగా 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. 40 రోజులపాటు అవస్థలే.. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కప్పు దశకు చేరాయి. దీంతోపాటు క్యూరింగ్ పూర్తి కావాలంటే మరో 40 రోజులు పట్టే అవకాశం ఉంది. వ్యవసాయ పనులకు కూలీలను తీపుకెళ్లాలన్నా పంట ఉత్పత్తులను మార్కెట్కు తరలించాలన్నా ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వివరించారు. వేసవికాలంలో చేపట్టాల్సిన బ్రిడ్జి నిర్మాణ పనులు వ్యవసాయ పనుల సీజన్లో చేపట్టారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. డైవర్షన్ రోడ్డును తొలగిస్తున్న దృశ్యం అద్దంకి బ్రాంచ్ కాల్వను దాటే చోట నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి వేసవికాలంలో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. సాగర్ కాలువకు నీటి విడుదల చేసే సమయంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అందరిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. సక్రమంగా రాకపోకలు జరగాలంటే 40 రోజులు పడుతుంది. కనీసం బైకులు, బాటసారులు, రైతులు వ్యవసాయకూలీలు రాకపోకలు సాగించేలా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేయాలి. –దేవినేని కృష్ణబాబు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ -
బార్ అండ్ రెస్టారెంట్ల అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి
రేపల్లె: ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన బార్ పాలసీకి రేపల్లె పట్టణంలో నాలుగు బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు అనుమతులు లభించాయని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు చెప్పారు. స్థానిక ప్రొహిబిషన్ కార్యాలయంలో శుక్రవారం రెస్టారెంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపే వారితో సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు మూడు సంవత్సరాలపాటు బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేవారు రూ.5 లక్షలు నాన్ రిఫండబుల్ ఫీజు, రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని తెలిపారు. బార్లకు అందిన దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి సమక్షంలో బాపట్లలో లాటరీ విధానంలో ఎంపిక చేస్తారని తెలిపారు. బార్ పాలసీ విధి విధానాలను తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అధికారి బి.వెంకటేశ్వర్లు, సీఐ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ హేమంత్ నాగరాజు -
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
బాపట్ల: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభవంతుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ, విభిన్న ప్రతిభావంతుల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక గ్రీవెనన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వెరిఫికేషనన్్లో తొలగించిన వికలాంగుల పింఛన్దారులకు మరో అవకాశం కల్పిస్తామన్నారు. విభిన్న ప్రతిభావంతులు పెన్షన్ల కోసం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల దగ్గర అప్పీల్ చేసుకోవచ్చన్నారు. విభిన్న ప్రతిభావంతులకు తిరిగి వెరిఫికేషనన్ ద్వారా పింఛన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయమ్మ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధామాధవి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటేశ్వరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వామిత్వ సర్వే వేగం పెంచండి జిల్లాలో స్వామిత్వ సర్వేపై కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో డ్రోన్ సర్వే పనులను వేగవంతం చేయాలని, పూర్తయిన గ్రామాల్లో హక్కు పత్రాలను త్వరితగతిన పంపిణీ చేయాలని ఆదేశించారు. సర్వేలో తలెత్తే వివాదాలు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సర్వే ద్వారా ప్రజలకు తమ ఆస్తులపై స్పష్టమైన హక్కులు లభిస్తాయని, తద్వారా వారు బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు పొందవచ్చని కలెక్టర్ వివరించారు. పంచాయతీలకు సొంత ఆదాయాన్ని పెంచుతుందని తెలిపారు. సమావేశంలో సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కనకప్రసాద్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు గ్లోరియ, చంద్రశేఖర్, రామలక్ష్మి, డీపీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి లక్ష్యాలు, సాధించిన పురోగతి నిక్షిప్తం చేయాలి అభివృద్ధి లక్ష్యాలు, సాధించిన పురోగతిపై ఎప్పటికప్పుడు కేపీఐసీలో నిక్షిప్తం చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలని చెప్పారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో వెయ్యి మొక్కలు నాటాలని కలెక్టర్ తెలిపారు. అటవీ శాఖ అధికారులు, డ్వామా అధికారులు సమన్వయంతో మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో సీపీఓ షాలేమ్ రాజు, డీపీఓ ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలమట్టం పెరిగేలా ప్రణాళికలు తయారు చేయాలి భూగర్భ జల మట్టం జిల్లాలో మరింత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. జల వనరులు, భూగర్భ జలశాఖ అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రానైట్ క్వారీలు, మట్టి, కంకర తవ్వకాల ప్రభావంతో పర్యావరణం సమతుల్యత కోల్పోయి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయన్నారు. వాటిని పెంచడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లోని మండలాలలో పంట కాల్వల మధ్యలో బోర్లు వేసి భూగర్భ జలాలు పెరగడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కొల్లూరు మండలంలోనూ భూగర్భ జలమట్టం తగ్గడంపై ఆరా తీశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలమట్టం తగ్గుతుందని ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వాటిని అరికడుతూనే భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాపట్ల పట్టణం తాగునీటి చెరువు కట్ట బలోపేతం, పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూ.ఎనిమిది కోట్ల నిధులతో తయారుచేసిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి తక్షణమే పంపాలన్నారు. సమావేశంలో జల వనరులశాఖ ఎస్ఈ అబూతలీమ్, భూగర్భ జల శాఖ ఏడీ సురేష్, డ్వామా పీడీ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, ఇంజినీర్లు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
అడిగినంత ఇస్తే రికవరీలు తగ్గిస్తాం
సాక్షి ప్రతినిధి,బాపట్ల: జిల్లా ఉపాధి హామీలో అక్రమాల వ్యవహారం నీకింత..నాకింత అనే చందంగా మారింది. ఫేక్ మస్టర్లు, పనిచేయకుండానే బిల్లులతో కొందరు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. జిల్లా అధికారి నేను అడిగినంత ఇస్తే .. అక్రమాలను కప్పిపుచ్చుతానంటూ బేరం పెడుతున్నారు. జిల్లా అధికారి ముడుపులిచ్చిన వారి అక్రమాలను మరుగునపెడుతున్నారు. వాటా ఇవ్వని వారిని రికవరీ పేరుతో బుక్ చేస్తున్నట్లు కార్యాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఉపాధిలో అక్రమాలు, అవినీతి వ్యవహారం కుప్పలు తెప్పలుగా వెలుగు చూస్తున్నా.. ఉన్నతాధికారులు మాత్రం చర్యలకు మీనమేషాలు లెక్కించడం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అద్దంకి మండలంలో అక్రమాలు వెల్లువ ఉపాధి హామీ పనుల్లో అద్దంకి మండలంలో జూన్లో జరిగిన సామాజిక తనిఖీల్లో ఈ విషయం తేటతెల్లమైనట్లు సమాచారం. మండలంలోని 26 గ్రామ పంచాయతీల పరిధిలో 2024–2025 ఆర్థిక సంవత్సరంలో రూ.8,52,33,219 మేర ఉపాధి హామీ పనులు జరగ్గా 336 పనులకు సంబంధించి రూ.82,74,327 మేర పనుల్లో అవినీతి జరిగిందని కమిటీ తేల్చింది. కానీ 124 పనులకు సంబంధించి రూ.29,25,256లు మాత్రమే డీవియేషన్ ఉందని ప్రొసీడింగ్ అధికారి హోదాలో డ్వామా పీడీ అంగీకరించినా... 82 పనులకు చెందిన రూ.1,69,106 మాత్రమే రికవరీ పెట్టినట్లు సమాచారం. మిగిలిన రూ.19.34 లక్షలకు సంబంధించిన పనులను రిఫర్డ్ కింద రాసిన పీవో రూ.8,21,426లకు చెందిన పనులను రెక్టిఫికేషన్, మిగిలిన రూ.53.49 లక్షలకు చెందిన పనుల్లో అవినీతి జరగలేదని డ్రాప్డ్ రాశారు. నగరంలో మాత్రం రూ.48 లక్షల రికవరీ అద్దంకి, చీరాల మండలాల్లో పెద్దఎత్తున అవినీతి జరిగిందని 17వ విడత సామాజిక తనిఖీ తేల్చగా దానిని తోసిపుచ్చి మొక్కుబడిగా మాత్రమే రికవరీలు విధించిన డ్వామా అధికారి నగరం మండలంలో జరిగిన అవినీతి విషయంలో భిన్నంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. నగరం మండలంలోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.9,56,57,239 పనులు జరగ్గా రూ.1,08,60,208 అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీల్లో తేల్చారు. రూ.48,01,833 డీవియేషన్ ఉన్నట్లు అంగీకరించిన డ్వామా అధికారి రూ.48,01,833 మొత్తాన్ని పూర్తిగా రికవరీ కింద చూపడం గమనార్హం. నగరం మండలానికి చెందిన కొందరు ఫీల్డ్, టెక్నికల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతోపాటు ఏపీవో ఇతర అధికారులు ముడుపులు చెల్లించేందుకు ససేమిరా అనగా కొందరు మాత్రమే అరకొరగా ముట్టజెప్పడంతో ఆగ్రహించిన జిల్లా అధికారి డీవియేషన్ చూపిన మొత్తాన్ని రికవరీ కింద రాశారన్న ఆరోపణలున్నాయి. ఉపాధి హామీలో పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూస్తున్నా.. ఉన్నతాధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. చీరాలలో రూ.48.51 లక్షలకు రూ.1.19 లక్షలే రికవరీ చీరాల మండలంలో 14 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.9,16,80,215 పనులు జరగ్గా 246 పనులకు సంబంధించి రూ.48,51,541 మాత్రమే అవినీతి జరిగినట్లు 17వ విడత సామాజిక తనిఖీ తేల్చగా డ్వామా పీడీ మాత్రం రూ.29,30,909 డీవియేషన్ ఉందని అంగీకరించారు. కానీ రూ.1,19,915 మాత్రమే అవినీతి జరిగిందని రికవరీ పెట్టారు. మిగిలిన రూ.21,53,707 మొత్తాన్ని రిఫర్డ్ కింద, రూ.19,20,632 డ్రాప్డ్ అమౌంట్గా, రూ.6,57,289 మొత్తాన్ని రిక్టిఫికేషన్ కింద చూపి సామాజిక తనిఖీలో తేలిన అవినీతిని మాఫీచేశారు. అద్దంకి, చీరాల రెండు మండలాల్లో పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని సామాజిక తనిఖీ తేల్చగా తక్కువ రికవరీలు చూపడం వెనుక లక్షల్లో డబ్బులు చేతులు మారినట్లు డ్వామాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
దివ్యాంగుల తిప్పలు
రేపల్లె: ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏ పని చేసుకోలేని కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగుల పింఛన్లు తొలగించాలనే కుట్రతో ప్రభుత్వం ఇటీవల బాపట్ల జిల్లాలో 3829 మంది పింఛన్దారులకు నోటీసులు జారీ చేసింది. సదరం క్యాంపునకు వెళ్లి వికలాంగుల శాతాన్ని ధృవీకరించే సర్టిఫికెట్ పొందాలని నోటీసులో పేర్కొంది. కదలలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు అష్ట కష్టాలు పడుతూ తమకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన క్యాంపునకు హాజరైతే మీకు ఇక్కడ చూడడం కుదరదని సదరం క్యాంపు సిబ్బంది తెలియజేస్తున్నారు. దీంతో వికలాంగులు నిరాశగా వెనుక తిరుగుతున్నారు. మాకు ఇచ్చిన షెడ్యూల్లో ఇదే హాస్పిటల్ ఈ రోజే హాజరు కావాలని ఉంది కదా సార్ అని దివ్యాంగులు అడిగితే రిపీట్ డాక్టర్ చూడకూడదు సాంకేతిక లోపాల కారణంగా మండల పరిషత్ అధికారులు మీ షెడ్యూల్ ఖరారు చేశారు, వెళ్లి వారిని కలవండి మరలా షెడ్యూల్ ఇస్తారంటూ సమాధానం చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో దివ్యాంగులు వెనుదిరుగుతున్నారు. రేపల్లె పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం జరిగిన సదరం క్యాంపునకు రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలోని వివిధ గ్రామాల నుంచి 45 మంది దివ్యాంగులు హాజరయ్యారు. వారిలో ఆరుగురు దివ్యాంగులకు రిపీట్ డాక్టర్ కారణాలు చెబుతూ తిప్పి పంపడంతో నిరాశగా వెనుదిరిగారు. దివ్యాంగులమని చూడకుండా ఇష్టానుసారంగా తిప్పుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమూరు మండలం చంపాడు గ్రామానికి చెందిన బందెల ముసలయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే తమ షెడ్యూల్ ఇది కాదని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను కొన్నేళ్లుగా పింఛన్ పొందుతున్నానని 80 శాతం వికలాంగత్వం ఉన్నా రీ వెరిఫికేషన్ చేయించుకోవాలని నోటీస్ ఇవ్వడంతో తప్పక ఇక్కడికి వచ్చానన్నారు. వెరిఫికేషన్ కాకపోతే పింఛన్ రాదని అధికారులు చెబుతున్నారని తనకు పింఛన్ వస్తుందా లేదా అని బాధ వ్యక్తం చేశాడు. ప్రభుత్వం, అధికారులు ఏ ఆధారం లేని దివ్యాంగులను ఇబ్బందులు గురి చేయకుండా సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. -
శాంతించిన కృష్ణమ్మ
ఊపిరి పీల్చుకుంటున్న లంక గ్రామాల రైతులు భట్టిప్రోలు: కృష్ణమ్మ శాంతించింది. దీంతో లంక గ్రామాల రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద దిగువకు శుక్రవారం మధ్యాహ్నం 4.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. మండలంలోని ఓలేరు, పల్లెపాలెం, పెదలంక కాకుల డొంక వద్ద వరద తగ్గుముఖం పట్టింది. పొలాల్లో నిలిచిన నీరు వెనక్కి వెళుతుండడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు చర్యలు చేపట్టారు. చప్టాలపై నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ముందస్తు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను, నాటు పడవలను అందుబాటులో ఉంచారు. వీఆర్వోలు, ఇన్చార్జి ఆర్ఐ శివరామకృష్ణ, మండ్రు జక్రయ్య, ఎల్.సురేష్లు విధులు నిర్వర్తిస్తున్నారు. -
నీరందక ఎండుతున్న పంటలు
రేపల్లె: కృష్ణా పరీవాహక ప్రాంతంలోని పంట పొలాలను వరదలు ముంచెత్తుతుండగా..మరో వైపు నీరు అందక వెద పద్ధతిలో సాగు చేసిన వరి పంట ఎండిపోతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాలలో 85 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తుంటారు. వెద పద్ధతిలో ఇప్పటి వరకు 50 శాతం మాత్రమే సాగుచేసినట్లు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కాలువలకు నీరు విడుదల చేయలేదు. దీంతో పంటలకు నీరు అందకపోవటంతో ఎండిపోతున్నాయి. చివరకు ఇంజిన్ల ద్వారా నీరు పెడుతున్నారు. తక్కువ ఖర్చు అవుతుందని వెద పద్ధతిలో సాగు చేస్తే చివరకు తడిసిమోపెడు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పెనుమూడి, చాటగడ్డ, మైనేనివారిపాలెం, చోడాయపాలెం, కై తేపల్లి, పోటుమేరక, నగరం, ఈదుపల్లి, పెద్దమట్టపూడి, చిన్నమట్లపూడి, సిరిపుడి, ముత్తుపల్లి, ఆరేపల్లి తదితర గ్రామాలలో ఇప్పటికే సాగు చేస్తున్న పంట ఎండుముఖం పట్టడంతో రైతులు విలవిలలాడుతున్నారు. అధికారులు స్పందించి కాలువలకు నీరు విడుదల చేసి పంటను కాపాడాలని కోరుతున్నారు. -
23 నుంచి గోవాడలో కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య నుంచి 11 అమావాస్యలు పురస్కరించుకుని కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరుగుతుందని కార్యనిర్వాహణాధికారి బి. అశోక్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 23న సెప్టెంబర్, అక్టోబర్ 21న, నవంబర్, డిసెంబర్ 19న, 2026 జనవరి 18న, ఫివ్రవరి 17న, మార్చి 18, ఏప్రియల్ 17న, మే 16న, జూన్ 14న అమావాస్య పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు స్వర్ణ వెంకట శ్రీనివాసశర్మ, అర్చకులు చావలి శ్రీధర్ శర్మ, పొన్నపల్లి సత్యనారాయణ, ప్రత్తిపాటి రామకోటేశ్వరరావు తెలిపారు. ప్రతి నెలా 10 లక్షల పారాయణ, కుంకుమార్చన, అమ్మవారికి శ్రీ సూక్త సహిత దేవి ఉపనిషత్తులతో అభిషేకం, కుంకుమార్చన, దేవి హోమం, కుష్మాండ పూజ, కూష్మాడబలి పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. కోటి కుంకుమార్చన కమిటీ, సహాయకులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. -
వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
బాపట్లటౌన్: వినాయకచవతి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ తుషార్ డూడీ విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాలకు, మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో అనుమతులు తీసుకోవాలన్నారు. ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్టించుకునే భక్తుల సౌకర్యార్థం సులభంగా అనుమతులు పొందేందుకు సింగిల్విండో విధానాన్ని పోలీస్ శాఖ ప్రవేశపెట్టిందన్నారు. http://fanerhutrav.net అనే వెబ్సైట్ను పోలీస్ శాఖ ప్రారంభించిందన్నారు. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఈ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలన్నారు. దరఖాస్తుదారుడు పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత పోలీస్ అధికారి స్వయంగా పందిరి, మండప స్థలాన్ని తనిఖీ చేస్తారన్నారు. నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్ఓసీ) జారీ చేస్తారన్నారు. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతాపరమైన నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వినాయక మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేయరాదన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఇలా... http://fanerhutrav.net వెబ్సైట్ను ఓపెన్ చేసి దరఖాస్తుదారుడు అతడి ఫోన్ నెంబర్ నమోదు చేయాలి. -
మైక్రో ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా
రేపల్లె: రేపల్లె పట్టణంలో అధిక వడ్డీలు కట్టాలని వేధింపులకు గురిచేస్తున్న మైక్రోఫైనానన్స్ సంస్థల నుంచి బాధితులకు రక్షణ కల్పించాలని బాధిత మహిళలు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), సీపీఎం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని మైక్రో ఫైనానన్స్ సంస్థ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్.మణిలాల్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేట్ ఫైనానన్స్ సంస్థలు ఇళ్ల పట్టాల మీద లోన్ ఇస్తామని పేదలను నమ్మించి ఇంగ్లీషులో ఉన్న అగ్రిమెంట్ పేపర్లపై సంతకాలు చేయించుకొని అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు గురిచేస్తున్నారని విమర్శించారు. 12 శాతానికి మించి వడ్డీ వసూలు చేయరాదని నిబంధనలు ఉన్నప్పటికీ 30 శాతం వరకు వసూలు చేస్తూ పేదలను పీడిస్తున్నారన్నారు. రాత్రి ఆరు గంటల తర్వాత లోన్ రికవరీ పేరుతో మహిళలకు ఫోన్ చేసి వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బాధిత మహిళలు సింధు దేవి, తిరుపతమ్మ, కృష్ణంరాజు, దుర్గాప్రసాద్, మోషే, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
పర్చూరు(చినగంజాం): పొగాకు రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం రైతులందరినీ ఆదుకుంటుందని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు అన్నారు. పర్చూరు మార్కెట్ యార్డు పరిధిలోని నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. గోదాముల్లో నిలువ ఉంచిన పొగాకు పరిశీలించారు. పొగాకు రైతులకు బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ సంస్థ ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకును కొనుగోలు చేస్తోందన్నారు. పొగాకు నాణ్యతను బట్టి మూడు గ్రేడులుగా విభజించి రైతులకు గిట్టుబాటు ధలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో 7754 మంది రైతుల వద్ద మార్క్ఫెడ్ సంస్థ సుమారు రూ.100 కోట్లతో 13100 మెట్రిక్ టన్నులు పొగాకు కొనుగోలు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఏపీ మార్క్ఫెడ్ జనరల్ మేనేజర్ సీహెచ్ స్రీనివాసరావు, జిల్లా మేనేజర్లు నరసింహ, రమేష, పర్చూరు మార్కెట్ యార్డు చైర్మన్ గుంజి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా కేసులో ముగ్గురి అరెస్ట్
మర్రిపాలెం (విశాఖ జిల్లా): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ నెల 12న సుభాష్నగర్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్, తమిళనాడుకు చెందిన అర్జునన్ జెమినీ ఆర్ముగంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్ చేసిన కారును తనిఖీ చేయగా.. 21 కిలోల గంజాయిని గుర్తించారు. పరారీలో ఉన్న ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వారిని హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న గుంటూరుకు చెందిన అక్షయ గౌతమి(20), షేక్ మహమ్మద్ జాకీర్ (19), ఒంగోలుకు చెందిన పెర్లి విజయవర్ధన్ రాజు (25)గా గుర్తించినట్లు సీఐ తెలిపారు. వీరు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్ సమీపంలోని సుభాష్నగర్ వద్ద ప్రమాదం జరిగింది. పెర్లి విజయవర్ధన్ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మహమ్మద్ జాకీర్పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్ఐలు షేక్ సమీర్, రవికుమార్లను సీఐ అభినందించారు. -
బీసీల రక్షణ కోసం చట్టం అవసరం
నరసరావుపేట: వెనకబడిన తరగతుల(బీసీ)పై రోజురోజుకూ దాడులు, వివక్ష, దౌర్జన్యం, సామాజిక బహిష్కరణకు గురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ఏపీ బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ పేర్కొన్నారు. ట్రయాండ్ సిటీ హోటల్లో గురువారం నిర్వహించిన బీసీ సంక్షేమ సంఘం నాయకుల కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక చట్టం వల్ల బీసీలకు రక్షణతో పాటు వారిపై వివక్షను సమూలంగా అరికట్టగలదని నమ్మకం వ్యక్తం చేశారు. సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని కోరారు. చట్టసభల్లో 33 శాతం, స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం నియమించిన అన్ని కమిషన్లు రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలు సామాజికం, ఆర్థికం, రాజకీయంగా వెనకబాటులో ఉన్నారని పేర్కొన్నాయని తెలిపారు. బీసీ నిరుద్యోగుల కోసం ఎస్సీ, ఎస్టీల మాదిరి బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకుల విద్యాలయాలు, స్టడీ సర్కిళ్లు, వసతి గృహాలను సకల సౌకర్యాలతో నిర్మించాలని కోరారు. ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొల్లిపర బాలాజీ, యువజన అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని కోరిన సంఘ నాయకులు -
కబడ్డీ పోటీల్లో ఈపూరు విద్యుత్ సిబ్బంది సత్తా
ఈపూరు(శావల్యాపురం): రాష్ట్రస్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో ఈపూరు మండల విద్యుత్ సిబ్బంది పల్నాడు జిల్లా టీం తరఫున ప్రథమ బహుమతి సాధించడం అభినందనీయమని నరసరావుపేట ఎస్ఈ ప్రత్తిపాటి విజయ్కుమార్ తెలిపారు. కార్యాలయంలో గురువారం పోటీల్లోని విజేతలు పిన్నిబోయిన వెంకటేశ్వరరావు, కంచర్ల ఏడుకొండలు, సన్నిబోయిన రామాంజినేయులు, అచ్యుత్, మల్లికార్జున్లను అభినందించారు. ఎస్ఈ మాట్లాడుతూ అంకితభావంతో విధుల నిర్వహణతో పాటు క్రీడల్లోనూ రాణించటం ప్రశంసనీయమని తెలిపారు. మానసిక వికాసం, శారీరక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని పేర్కొన్నారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన పిన్నబోయిన వెంకటేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. విజేతలకు క్రీడా దుస్తులు అందజేశారు. -
పొగాకు పంటకు ప్రత్యామ్నాయం అపరాలు
అద్దంకి: పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు సాగు చేసుకోవాలని ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయనిర్మల సూచించారు. ‘ఆత్మ’ ప్రకాశం జిల్లా సౌజన్యంతో కొంగపాడులో వివిధ పంటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై గురువారం శిక్షణ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పొగాకుకు ప్రత్యామ్నాయంగా అపరాలు, మొక్కజొన్న, జొన్న పంటలు సాగు చేయాలని సూచించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మురళీధర్ నాయక్ మాట్లాడుతూ మినుము, కంది, పెసర, శనగ పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎం.ఉష మాట్లాడుతూ అపరాల పంటలో విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలని.. రసం పీల్చే పురుగుల నివారణ కోసం విత్తన శుద్ధి చేయాలని సూచించారు. ఉప్పునీటి యాజమాన్యం శాస్త్రవేత్త కె. మృదుల మాట్లాడుతూ అపరాలు.. మొక్కజొన్నలో కలుపు నివారణ చర్యలు గురించి తెలియజేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు బి.ఎఫ్రాయిం మాట్లాడుతూ కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం బర్లీ పొగాకు సాగు చేయవద్దని సూచించారు. మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు ఈ–పంట నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్ రామిరెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు సాయిబాబు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, మణికేశ్వరం సొసైటీ అధ్యక్షుడు నర్రా బ్రహ్మానందం, గుడిపూడి బ్రహ్మయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రిస్కిల్ల, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఆత్మ డిప్యూటీ డైరెక్టర్ విజయనిర్మల -
పింఛన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మోసం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా... ఉన్న దివ్యాంగ పింఛన్లను రీ వెరిఫికేషన్ పేరుతో తొలగించడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు బోక్క అగస్టీన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో దివ్యాంగ విభాగం ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత రాష్ట్ర ప్రజలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేస్తోందన్నారు. ఎన్నికల హామీలో మాత్రం రూ.6 వేలు పింఛను ఇస్తామని చెబితే సంబరపడ్డామని.. ఇప్పుడు నిర్దయగా తీసేస్తున్నారని మండిపడ్డారు. గతంలో 80 శాతం వైకల్యం ఉంటే ఇప్పుడు 40 శాతం ఉన్నట్లు చూపించి పింఛన్లు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత కలిగిన వారికి కూడా మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం అన్నారు. రీ వెరిఫికేషన్ పేరుతో ఆసుపత్రులకు, ఇతర కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీని వల్ల దివ్యాంగులు కార్యాలయాల మెట్లు ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. నాడు అండగా వైఎస్ జగన్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యాంగులకు అండగా నిలిచారు. 50 ఇళ్లకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి తమ కష్టాలను తీర్చారని దివ్యాంగులు పేర్కొన్నారు. ఇప్పుడు వలంటీర్ వ్యవస్థ తీసేయడంతో ఏ పని కావాలన్నా కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వారి కోసం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులతో కలిసి నిరసన చేపడతామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విధంగానే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దాసరి గణేష్బాబు, కొమ్మా లింగరావు, శంకర్, జె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు
మాచవరం : ఉద్యాన పంటల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఐ. వెంకట్రావు తెలిపారు. మండలంలోని గంగిరెడ్డిపాలెం, పిన్నెల్లి, వేమవరం గ్రామాల్లో ఆయన పర్యటించారు. మిరప, జామ, డ్రాగన్ ఫ్రూట్ పంటలను పరిశీలించారు. రైతులందరూ పంట నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.మిరప, కూరగాయలు, ఆయిల్ పామ్ పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ, యాజమాన్యం పద్ధతుల గురించి రైతులకు తెలియజేశారు. ఎండు తెగులు ఆశించిన జామ చెట్లకు 1గ్రా. కార్బెన్డజిమ్ లేదా 3గ్రా.కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి చెట్టు మొదట్లో పోయాలని తెలిపారు. జింక్, మెగ్నీషియం ధాతు లోప నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్, 2గ్రా. మెగ్నీషియం సల్ఫేట్, 10 గ్రా. యూరియా లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అనంతరం పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో పిడుగురాళ్ల హార్టీకల్చర్ ఆఫీసర్ అంజలి బాయి, విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ కరుణ కుమారి, ప్రభాకర్ రెడ్డి, సాగర్ బాబు, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
నీట్ పీజీలో మెరిసిన పూనూరు విద్యార్థి
యద్దనపూడి: మెడికల్ విభాగంలో బుధవారం ప్రకటించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాల్లో యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన డాక్టర్ ఐలవరపు శృతి జాతీయ స్థాయిలో 3716వ ర్యాంకును సాధించారు. మొత్తం 2,42,000 మంది అభ్యర్థులు రాసిన నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో శృతి 3716వ ర్యాంక్ సాధించారు. పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన శృతి మొదటి నుంచి చదువులో అగ్రగామిగా ఉండేవారు. 2018 నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్ర స్థాయి మొదటి పది మంది విజేతల్లో ఒకరుగా నిలిచి గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గైనకాలజీ పూర్తి చేయటం ద్వారా పేద ప్రజలకు సేవలు అందించటం తన లక్ష్యమని శృతి తెలిపారు. శృతి తండ్రి హనుమంతరావు ఆరోగ్య శాఖలో ఉద్యోగి కాగా తల్లి హిమబిందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు, సోదరి ప్రణయ, పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.నీట్ పీజీలో 5850 ర్యాంక్ సాధించిన రాచూరు వాసిభట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామానికి చెందిన దీవి శ్రీసాయి హేమంత్ నీట్ పీజీ 2025లో 578 మార్కులు 5850 (ఆల్ ఇండియా) ర్యాంక్ సాధించారు. 2018లో నీట్ ఎంట్రన్స్ పరీక్షలో నేషనల్ 20 వేలు, రాష్ట్రంలో 1011 ర్యాంక్ సాధించాడు. గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీలో ఉచిత సీట్ పొంది 2018–2024లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. హేమంత్ తండ్రి శ్రీనివాస హరికుమార్ న్యాయవాదిగా, తల్లి అనంత శైలజ సచివాలయ మహిళా పోలీస్గా పనిచేస్తున్నారు. హేమంత్ను తాత విశ్రాంత తెలుగు పండిట్ దీవి వేంకట లక్ష్మీ నరసింహాచార్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు. -
కదం తొక్కిన దివ్యాంగులు
బాపట్ల: పింఛన్లు తొలగించటంతో ఆగ్రహించిన దివ్యాంగులు కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చి నిరసననలో పాల్గొన్నారు. రాష్ట్రప్రభుత్వం దివ్యాంగుల జోలికి వస్తే సహించేదిలేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. చల్లా రామయ్యకు మద్దతుగా మేరుగ నాగార్జునతోపాటు పార్టీ నాయకులు నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు తొలగింపును నిరసిస్తూ వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం నాయకుడు చల్లా రామయ్య గురువారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కారు. జిల్లాలో తొలగించిన 3824 దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చేంతవరకు టవర్ దిగేది లేదని రామయ్య భీష్మించుకుని కూర్చున్నాడు. పింఛన్లు తొలగించిన కొందరు దివ్యాంగులు అక్కడకు చేరుకుని రామయ్యకు మద్దతు తెలిపారు. నూటికి నూరు శాతం కాళ్లు చచ్చుబడిపోయిన వికలాంగుడికి పెన్షన్ తొలగించడంపై ప్రజా సంఘాల నాయకుడు కే శరత్తోపాటు పలువురు వికలాంగులు అధికారులను నిలదీశారు. మండుటెండలో వికలాంగ బాలుడిని రోడ్డుపై పడుకోబెట్టి నిరసన తెలిపారు. పోలీసులు బాలుడిని బలవంతంగా అంబులెనన్స్లో ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ను అడ్డుకునేందుకు యత్నించిన శరత్ను అరెస్టు చేసి వెదుళ్లపల్లి పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో ఆగ్రహించిన వికలాంగులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శరత్పై కేసు నమోదు చేసిన పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు. పోలీసులతో వాగ్వాదం చల్లా రామయ్యకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సెల్ టవర్ వద్ద నుంచి వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు తరిమికొట్టారు. ఎదురు తిరిగిన నలుగురిని బలవంతంగా పోలీస్స్టేషన్లకు తరలించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున నిరసన జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేద్దాం దిగి రమ్మని రామయ్యను కోరారు. ఎట్టకేలకు రామయ్య సెల్ టవర్ దిగారు. సెల్ టవర్ దిగిన వెంటనే చల్లా రామయ్యను అంబులెనన్స్లో ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఆ సమయంలో మేరుగ నాగార్జునకు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఎట్టకేలకు మేరుగ నాగార్జునతో కలిసి చల్లా రామయ్య ఆర్డీఓ గ్లోరియాకు వినతిపత్రం అందజేశారు. వికలాంగుల నాయకులతో చర్చలు జరిపిన వారిలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా, వికలాంగుల సంక్షేమ శాఖ పీడీ ఉన్నారు. అనంతరం రామయ్యను ఆసుపత్రికి తరలించారు. చల్లా రామయ్యపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాంబాబు తెలిపారు. అంతముందు శాంతిభద్రతను విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో పలువురు వైఎస్సార్సీపీ నాయకులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సైలు విజయ్కుమార్, చంద్రావతి, పోలీసు సిబ్బంది అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. చల్లా రామయ్యకు సంఘీభావం తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలురెడ్డి, నాయకులు కోకి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఇనగలూరి మాల్యాద్రి, జోగి రాజా, తన్నీరు అంకమ్మరావు, శాయిల మురళి తదితరులు పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని పక్కన బెట్టి దివ్యాంగులు, వృద్ధుల పెన్షన్లు తొలగింపులే ప్రధాన అజెండాగా ముందుకెళుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చేతులు, కాళ్లు సక్రమంగాలేని వారిపై ప్రభుత్వం ప్రతాపం చూపటం బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హలైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తే కూటమి ప్రభుత్వం వాటిని తొలగించేందుకే కంకణం కట్టుకుందన్నారు. దివ్యాంగులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. -
‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ప్లెక్సీ తొలగింపు
భట్టిప్రోలు(వేమూరు): భట్టిప్రోలు మండలం చింతమోటులో ఏర్పాటుచేసిన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ప్లెక్సీలు తొలగించేందుకు అధికారులు సిద్ధంకాగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్బాబు దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. గ్రామానికి చేరుకున్న అశోక్బాబు గ్రామంలో ప్రభుత్వం అనుమతి లేని ఫ్లెక్సీలు అన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. వేమూరు, చుండూరు సీఐలు ఆంజనేయులు, శ్రీనివాసరావు, భట్టిప్రోలు, కొల్లూరు ఎస్ఐలు శివయ్య, జానకీ అమర్వర్థన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామంలో తెలుగుదేశం ఫ్లెక్సీలు, బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ ఫ్లెక్సీలని తొలగిస్తే వెళ్లిపోతామని వరికూటి వారి స్పష్టం చేశారు. గ్రామాల్లో గొడవలు జరగకుండా పోలీసులు బాధ్యతలు తీసుకోవాలని కోరారు. పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలని కోరారు. ఫ్లెక్సీల వ్యవహారం పరిష్కారం చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పడమటి శ్రీనివాసరావు, బొల్లెదు ప్రతాప్, ఇమామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
వరద ముప్పును ఎదుర్కొనడానికి సిద్ధం
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి కొల్లూరు: వరద ముప్పును అధిగమించడానికి ప్రజల సహకారంతో అహ్నర్నిశలు శ్రమించి పనిచేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. కృష్ణా నదికి వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ గురువారం మండలంలోని దోనేపూడి, పెసర్లంక అరవిందవారధి, చిలుమూరులంక, సుగ్గునలంక లోలెవల్ వంతెనలను పరిశీలించారు. వరద సహాయక చర్యలపై తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిలుమూరులంకలో మూడు ఎస్టీ కుటుంబాలు వరదలకు నిర్వాసితులు కావడంతో వారికి ప్రభుత్వం తరపున చేపట్టిన సహాయ కార్యక్రమాల విషయంలో అధికారులు అశ్రద్ధగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులైన కుటుంబాలకు తక్షణం సురక్షిత ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి, గృహ నిర్మాణాలు చేపట్టడంతోపాటు, వారికి ఆధార్, రేషన్, ఉపాధిహామీ పథకం జాబ్ కార్డులు మంజూరు చేయించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం సంభవించకుండా చర్యలు వరదల కారణంగా ప్రజలు, పశువులకు ప్రాణ నష్టం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు. వరద ప్రవహిస్తున్న మార్గాలు, ఇతర కీలక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరద పెరిగితే వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, రోగగ్రస్తులను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి యుద్ధప్రాతిపదికన తగు చర్యలు చేపట్టడానికి కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని 22 వరద ముంపు గ్రామాలలో ఇరువురు చొప్పున మండలస్థాయి అధికారులను, మండలానికో జిల్లా స్థాయి అధికారిని కేటాయించినట్లు చెప్పారు. నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లిస్తాం వరదల కారణంగా పలు గ్రామాలలో వాణిజ్య పంటలు ముంపునకు గురైనట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. వరద నీటిలో మునిగిన పంటలను వరదలు తగ్గిన వెంటనే ఉద్యాన, వ్యవసాయ శాఖల ద్వారా పంట నష్ట అంచనాలు రూపొందిస్తామన్నారు. పంట నష్టానికి ప్రభుత్వం నిర్దేశించిన పరిహారం అందజేయడంతోపాటు, ఉచితంగా విత్తనాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. పంట భూముల కోతలు అరికట్టండి వరదల కారణంగా పంట భూములు కోతలకు గురై నష్టపోతున్నామని మండలంలోని తిప్పలకట్ట ప్రాంతానికి చెందిన పలువురు రైతులు కలెక్టర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వరదల సమయంలో పంట భూములు కోతకు గురికాకుండా గతంలో నిర్మించిన విధంగా గ్రాయిన్స్ నిర్మాణం చేపట్టడంతోపాటు, నది ఒడ్డును పటిష్ట పరచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. దోనేపూడి కరకట్ట దిగువున ఉన్న లోలెవల్ వంతెన, సుగ్గునలంక వద్ద ఉన్న లోలెవల్ వంతెనలు రహదారి ఎత్తుకు పెంచి నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ గంగాధర్గౌడ్, రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, కొల్లూరు తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు, ఆర్సీ ఏఈ విజయరాజు, ఎస్ఐ జానకి అమరవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
అల్లకల్లో లంక గ్రామాలు
బాపట్లఅచ్చంపేట : ఎగువ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 4,28,115 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4,32,175 క్యూసెక్కులు వదులుతున్నారు. కారెంపూడి: పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో పల్నాటి వీర్ల అంకాలమ్మ తల్లికి గురువారం రాత్రి గ్రామస్తులు వైభవంగా బోనాలు సమర్పించారు. సాక్షి ప్రతినిధి,బాపట్ల: కృష్ణానదికి వరద పెరుగుతోంది. గురువారం ఉదయం ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు 5.13 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. దీంతో దిగువన కృష్ణా పరీవాహక ప్రాంతంలో పలు గ్రామాల పరిధిలోని పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది. కొల్లూరు మండలం దోనెపూడి వద్ద ఉన్న లోలెవెల్ కాజవేపైకి నీరు చేరి ఆ మార్గంలో రాకపోకలు నిలిచి పోయాయి. వరద ప్రభావంతో చింతర్లంక, సుగ్గునలంక, పోతార్లంక గ్రామాల పరిధిలోని 150 ఎకరాల్లో సాగు చేసిన అరటి, పసుపు, కంద, కూరగాయల పంటలు నీటమునిగాయి. ఇదే ప్రాంతంలోని దాదాపు 200 ఎకరాల్లో పశువుల మేతతోపాటు ఇటుక బట్టీలను వరద ముంచెత్తింది. వరద ప్రభావంతో ఇప్పటికే పెసర్లంక, గాజుల్లంక, పోతార్లంక, సుగ్గునలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరిగితే తోకలవారిపాలెం, పెదలంక, చింతర్లంకతోపాటు కొల్లూరు మండలంలో 18 గ్రామాలతోపాటు భట్టిప్రోలు మండలంలోని ఐదు గ్రామాలకు నీరు చేరే అవకాశముంది. ఎగువ నుంచి కృష్ణా నదికి 6లక్షల క్యూసెక్కులకు మించి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే లంకగ్రామాల్లోని వేలాది ఎకరాలలో పంటలు నీటమునిగే అవకాశముంది. వరద నీరు 7 లక్షల క్యూసెక్కులకు మించితేనే లంకగ్రామాలకు నీరు చేరే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వరద మరింతగా పెరిగితేగే లంక గ్రామాలనుంచి ప్రజలను పునరావాసకేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. అధికారులు ఆదిశగా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. నిలిచిన రాకపోకలు భట్టిప్రోలు: కృష్ణా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో భట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాల్లోని పెదపులివర్రు–పెసర్లంక, ఓలేరు–పెసర్లంక, కోళ్లపాలెం–పెసర్లంక చప్టాల వద్ద నీరు చేరింది. ఆయా మార్గాల్లో తాత్కాలికంగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద మరింత పెరిగితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం లంక గ్రామాల వాసులు వెల్లటూరు చినరేవు హైలెవల్ వంతెన మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతి పెరుగుతుండడంతో స్థానికులు రేవులోకి వెళ్లవద్దని తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు ఆదేశించారు. కరకట్టకు గండ్లు పడే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి పటిష్టం చేయడమే కాక ఇసుక మూటలను సిద్ధం చేశామన్నారు. కొల్లూరు మండలం పెసర్లంక – పెదలంక అరవింద వారధి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మరేపల్లె: ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేసిన నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మోర్ల శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఆయన పెనుమూడి, పెనుమూడి పల్లిపాలెం గ్రామాలలో పర్యటించారు. పెనుమూడి, పల్లిపాలెంలను వరద చుట్టుముట్టే ప్రమాదం ఉన్నందున పెనుమూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. పల్లిపాలెం వాసులు వెంటనే పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
డాక్టర్ విశ్వేశ్వరరావుకు బంగారు పతకం
తెనాలిరూరల్: పట్టణ బోస్రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాలులో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు స్మారక ధార్మిక బంగారు పతకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావుకు బహూకరించారు. ఈ సందర్భంగా ‘కామన్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్’పై డాక్టర్ విశ్వేశ్వరరావు ప్రసంగించారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. అనిల్కుమార్, కార్యదర్శి డాక్టర్ మధుప్రభాకర్బాబు, డాక్టర్ కె. శ్యామ్ప్రసాద్, డాక్టర్ పావనిప్రియాంక, డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుటుంబసభ్యులు, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.25న సీజ్ చేసిన బియ్యానికి వేలంనరసరావుపేట: ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అండర్ సెక్షన్ 6ఏ కింద సీజ్ చేసిన 6,453 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సమక్షంలో ఈనెల 25న మరోసారి వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎం.వి.ప్రసాదు బుధవారం పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఈనెల 12న నిర్వహించిన వేలంలో సరైన ధర రానందున ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. బహిరంగ వేలం ప్రకటనలోని నియమ నిబంధనల మేరకు ఔత్సాహికులు పాల్గొనాలని కోరారు.పోస్టల్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోండినరసరావుపేట టౌన్: తపాలా శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాల్ స్పర్ష్ యోజన స్కాలర్షిప్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ జాఫర్ సాధిక్ తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కాలర్షిప్ను తపాలా శాఖ ప్రవేశపెట్టిందన్నారు. తపాలా శాఖ నిర్వహించే ఫిలాటెలి క్విజ్ , ఫిలాటెలి ప్రాజెక్ట్ల ఆధారంగా ఏడాదికి రూ.6 వేలు స్కాలర్షిప్ పొందవచ్చన్నారు. విద్యార్థి 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో చదువుతూ, సంబంధిత పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్ సభ్యుడై ఉండాలన్నారు. పాఠశాలల్లో ఫిలాటెలి క్లబ్ లేకపోతే అభ్యర్థి సొంత ఫిలాటెలి అకౌంట్ కలిగి ఉండాలన్నారు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని పోస్టాఫీసుల్లో సంప్రదించాలని సూచించారు. -
పత్తిపై దిగుమతి సుంకం తొలగింపు సరికాదు
నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు చిలకలూరిపేట: ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తి మీద అన్ని రకాల సుంకాలను మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం దారుణమని నల్లమడ రైతు సంఘం కన్వీనర్ డాక్టర్ కొల్లా రాజమోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయం పత్తి రైతులకు మరణ శిక్ష విధింపుతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఇది రైతు వ్యతిరేక చర్య అని ఖండించిందని వెల్లడించారు. పత్తిపై దిగుమతి సుంకాన్ని తొలగించే ప్రభుత్వ నోటిఫికేషన్ పత్తి రైతులపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశంలో పండించే పత్తి ధరపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందన్నారు. దేశీయంగా పండించే పత్తి ధర ఖచ్చితంగా తగ్గుతుందని, రైతులు మరింత అప్పుల పాలవుతారన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం క్వింటా పత్తికి రూ.10,075 రావాలని, కానీ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.7,710 మాత్రమే ఉందని వెల్లడించారు. ఆ ధరకు కూడా పత్తి అమ్ముడు పోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో దిగుమతి సుంకం ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పత్తి రైతులకు తీవ్రంగా నష్టపరుస్తుందన్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
దాచేపల్లి: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటనలో దాచేపల్లి మండలం గామాలపాడు గ్రామానికి చెందిన దొడ్డా శ్రీను(30) మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మిర్యాలగూడ నుంచి దాచేపల్లి వైపు వస్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ వాహనంలో గామాలపాడుకు చెందిన అన్నదమ్ములైన దొడ్డా సైదులు, దొడ్డా శ్రీను ఉన్నారు. కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం కిందపడి శ్రీనుకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సైదులు తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన తర్వాత ఈ రెండు వాహనాలు రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మరో ఆటోను బలంగా ఢీకొట్టాయి. ఆటో బోల్తాపడటంతో అందులో ఉన్న మరో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పిడుగురాళ్లలోని వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడు శ్రీనుకి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు -
నీట్ పీజీ సెట్లో డాక్టర్ ప్రవల్లికకు 1820 ర్యాంక్
నరసరావుపేట ఈస్ట్: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ–2025 పరీక్షలో పట్టణానికి చెందిన డాక్టర్ ముద్దా ప్రవల్లిక ఓపెన్ క్యాటగిరీలో 1820 ర్యాంక్ సాధించింది. వైజాగ్ ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె నీట్ పీజీ సెట్లో 613 మార్కులతో ఉత్తమ ర్యాంక్ సాధించింది. డాక్టర్ ప్రవళ్లిక తండ్రి ముద్దా రమేష్ పట్టణంలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకునిగా పని చేస్తుండగా, తల్లి ఉషారాణి గృహిణి. చిన్న పిల్లలకు వైద్యసేవలు అందించేందుకు తాను పీడియాట్రిక్ విభాగంలో పీజీ చేయనున్నట్టు డాక్టర్ ప్రవల్లిక తెలిపారు. -
బాలిక హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
గుంటూరు లీగల్ /చేబ్రోలు : మైనర్ కిడ్నాప్, హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1,100 జరిమానా విధిస్తూ గుంటూరు నాలుగవ అదనపు జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి శరత్ బాబు బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... గతేడాది జూలై 15వ తేదీన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం గ్రామంలో బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లికి చెందిన నరమామిడి నాగరాజు కొత్తరెడ్డిపాలెం, చేబ్రోలులో నివాసం ఉండేవాడు. బాలిక తల్లి ఎస్తేరు రాణితో నాగరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంబంధం బెడిసికొట్టిన తర్వాత ప్రతీకారంతో బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి గొంతు నులిమి, హత్య చేశాడు. మృతురాలి తండ్రి పేరుపోగు దావీదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును తెనాలి ఎస్డీపీఓ బి.జనార్దనరావు పర్యవేక్షణలో సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. న్యాయస్థానంలో నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణతో కేవలం ఏడాదిలోనే న్యాయస్థానంలో నిందితుడికి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఈ మేరకు బుధవారం నాలుగవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్బాబు తీర్పు వెలువరించారు. నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన పొన్నూరు రూరల్ సీఐ కోటేశ్వరరావు, చేబ్రోలు ఎస్సై వెంకటకృష్ణ, సీసీఎస్ పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.గుండెపోటుతో తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్ఐ మృతితాడికొండ: గుండెపోటుతో ట్రాఫిక్ ఏఎస్ఐ మృతి చెందిన ఘటన తుళ్లూరులో జరిగింది. ఇక్కడ ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రవీంద్ర (55) విధులు ముగించుకొని కారు నడపుతూ వెళుతుండగా తుళ్లూరు శివారు సాయిబాబా ఆలయం వద్దకు రాగానే గుండెపోటుకు గురయ్యారు. కారును రోడ్డుపైనే నిలిపి పక్కకు పడిపోయారు. ఉన్నట్టుండి కారు నిలిచిపోవడంతో సమీపంలో ఉన్న ఏపీఎస్పీ సిబ్బంది కారు అద్దాలు పగలగొట్టి రవీంద్రను బయటకు తీసి తుళ్లూరు పీహెచ్సీకి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.నవ వధువు ఆత్మహత్యతాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో అత్తకు చెప్పాడు. ఆమె పిలిచినా రంగనాయకమ్మ స్పందించలేదు. పక్కింటి వారి సహాయంతో జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏడాదిగా రంగనాయకమ్మకు కడుపునొప్పి ఉండడం వల్లే వివాహానికి నిరాకరించిందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు.వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంపుకొరిటెపాడు: జిల్లాలో వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంప్ ‘లక్ష్య’, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచురేషన్ క్యాంపు (జనన సురక్ష క్యాంప్)ను నగరంపాలెంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. క్యాంపును కడప రీజియన్ రీజినల్ హెడ్ ఈ. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య, ఫైనాన్షియల్ ఇంక్లూజ్ సాచురేషన్ క్యాంపునకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. క్రెడిట్ క్యాంపెయిన్ సమయంలో ఎస్హెచ్జీ గ్రూపులు, సీకేసీసీ రుణగ్రహీతలకు రుణాలు మంజూరు చేశామని తెలిపారు. కండ్లకుంట బ్రాంచ్ హెడ్ అశోక్కుమార్, సిబ్బందితోపాటు ఏపీఎం, ఇతర సీసీఏలు ఈ క్యాంపులో పాల్గొన్నారని చీఫ్ మేనేజర్ బి.కె.ప్రసాద్ తెలిపారు. -
అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీలు సీజ్
బల్లికురవ: గ్రానైట్ పలకలు, ముడిరాళ్లు పర్మిట్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను మైన్స్, విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం తెల్లవారుజామున బాపట్ల జిల్లా బల్లికురవ నుంచి సంతమాగులూరు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డులోని మల్లాయపాలెం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పర్మిట్ లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఒక ముడిరాయి లోడు లారీ, రెండు గ్రానైట్ పలకల లోడు లారీలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు అప్పగించారు. తనిఖీలో బాపట్ల జిల్లా విజిలెన్స్ ఏడీ రామచంద్ర, ఆర్ఐ రాజు పాల్గొన్నారు. అధికారులు తనిఖీలు చేపడుతున్నారన్న సమాచారంతో అక్రమ రవాణాదారులు ఎక్కడికక్కడ లారీలను నిలిపేశారు. అక్రమ రవాణాతో ప్రతిరోజూ బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీకి భారీగా గండి పడుతోంది. -
చీరాలను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
చీరాల: జిల్లా కేంద్రంగా చీరాలను ప్రకటించాలని కోరుతూ చేపట్టనున్న కార్యక్రమానికి మద్దతు ప్రకటించాలని చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు బుధవారం వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులను కోరారు. ఎన్ఆర్పీఎం హైస్కూలులో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి, అందరి మద్దతు కోరారు. బాపట్ల జిల్లాను దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జిల్లాగా పేరు మార్చాలని, చీరాలను జిల్లా కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణ, సురేష్, ప్రసాద్, మురళి, శ్రీరామ్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించడానికి ఈనెల 29న జిల్లా పునర్విభజన మంత్రుల కమిటీ రానుంది. ఈ నేపథ్యంలో చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు రాజకీయ పార్టీలు, వ్యాపార సంఘాలు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులంతా వచ్చి అర్జీల రూపంలో అందించాలని దేవరాజ్ కోరారు. అబాకస్ పోటీలలో బాపట్ల విద్యార్థుల ప్రతిభ బాపట్ల అర్బన్: జాతీయ స్థాయి అబాకస్ పోటీల్లో బాపట్లకు చెందిన యూసిమాస్ విద్యార్థులు సత్తా చాట్టారు. హైదరాబాద్ గచ్చి బౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన పోటీల్లో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల నుంచి 4 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో బాపట్ల నుంచి యూసిమాస్ విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి స్టేజ్ మీద బాపట్ల పేరును మారు మోగించారు. బాపట్ల కు చెందిన మంతెన కృతిక్ జాతీయస్థాయిలో నాలుగో స్థానం, దర్శి చేతన శేష ఆర్యాహి, భమిడిపల్లి శ్రీ వైష్ణవి ఆరవ స్థానంలో నిలిచి మెరిట్ ట్రోఫీలను కై వశం చేసుకున్నారు. యూసిమాస్ సంస్థ బాపట్ల డైరెక్టర్లు వనమా స్మైలీ, బొనిగల రాజేంద్రప్రసాద్లను పలువురు అభినందించారు. ఉరి పెట్టుకుని యువకుడు ఆత్మహత్య రేపల్లె : మద్యానికి డబ్బులు ఇవ్వలేదనే మనస్తాపంతో ఉరి పెట్టుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రేపల్లె పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ మల్లికార్జునరావు తెలిపిన వివరాల ప్రకారం.. మూడవ వార్డుకు చెందిన కోనేటి రాజేష్ కుమార్ (34), లావణ్యలకు 11 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యానికి బానిసైన రాజేష్ కుమార్ డబ్బులు కోసం తరచూ భార్యను వేధిస్తూ ఉండేవాడు. బుధవారం మద్యానికి డబ్బులు అడగగా భార్య లేవని చెప్పడంతో చనిపోతానని బెదిరించాడు. అన్నట్లుగా మధ్యాహ్నం ఇంటిలో ఫ్యానుకు ఊరి పెట్టుకొని మృతి చెందాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. డీ ఫార్మసీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో రెండేళ్ల కాలపరిమితి గల డీఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ గడువును సాంకేతిక విద్యాశాఖ ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జాస్తి ఉషారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ రెగ్యులర్, దూరవిద్య ద్వారా బైపీసీ, ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థినులతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు నుంచి తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు కలిగిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ప్రభుత్వం ద్వారా అడ్మిషన్ ఫీజులో మినహాయింపుతోపాటు ఉపకార వేతనాలకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రవేశం పొందిన విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలోనే హాస్టల్ వసతి ఉందని తెలిపారు. ఆసక్తి గల వారు సర్టిఫికెట్లతోపాటు పాస్పోర్ట్ సైజు ఫొటో, దరఖాస్తు రుసుం రూ.400తో కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఇతర వివరాలకు 92471 20305, 98480 38769 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
సాఫ్ట్బాల్ బాలికల జట్టు ఎంపిక
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్బాల్ సీనియర్ విభాగంలో జిల్లాస్థాయి బాలికల జట్టు ఎంపికలు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో 15 మందిని జట్టుకు, మరో ఐదుగురిని స్టాండ్బైకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిలో పల్లపాడుకు చెందిన సిహెచ్ అనిత, జి.సునందిని, ఎం.శృతి, సిహెచ్ పావని, బి.నందిని, కె.తేజస్విని, కె.చందన, ఇ.చంద్రిక, వి.లిద్య/ఎం.తిరుపతమ్మ, రొంపిచర్లకు చెందిన వి.శ్రీదేవి, పీవీఎన్ చంద్రిక, కొమెరపూడికి చెందిన బి.ప్రసన్న జ్యోతి, వినుకొండకు చెందిన ఆర్.రాగసుధ, క్రోసూరుకు చెందిన కె.దీవెన ఏంజల్, కేఎల్ఎస్ ప్రవల్లికలు ఉన్నారు. స్టాండ్ బైలుగా బి.శ్రీలక్ష్మి (రొంపిచర్ల), కె.సంజన (బ్రాహ్మణ కోడూరు), పి.శైలజ, జె.ధనలక్ష్మి, కె.తన్మయిసాయి (రామకృష్ణాపురం)లు ఎంపికయ్యారు. ఎంపికై న బాలికలు ఈనెల 30, 31 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో సాఫ్ట్బాల్ జిల్లా సెక్రెటరీ పి.సామంతరెడ్డి, జాయింట్ సెక్రెటరీ నర్రా శ్రీనివాసరావు, ట్రెజరర్ జనార్దన్ రెడ్డి యాదవ్లు పాల్గొన్నారు. ఎంపికలకు సెలక్షన్ కమిటీ మెంబర్లుగా పీడీలు సైదయ్య, వెంకటేశ్వరరావు, సుబ్బారావులు వ్యవహరించారు. ఎంపికై న బాలికలకు గురువారం నుంచి కొమెరపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పాఠశాల హెచ్ఎం బి.విజయ తెలిపారు. -
చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు
చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ సత్తెనపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ లూమ్స్, జెట్ లూమ్స్లకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తూ చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నాయని, ఈ అంశాలను అక్టోబర్ 6, 7 తేదీలలో సత్తెనపల్లిలో జరిగే చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 11వ మహాసభలో చర్చించి పోరాటాలకు పిలుపునిస్తామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ హెచ్చరించారు. సత్తెనపల్లిలో బుధవారం జరిగిన చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశానికి సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా శివ దుర్గరావు అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ చేనేతపై ఉన్న జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్లు కచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర మహాసభలలో చర్చించి, భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి అనుముల వీర బ్రహ్మం, కమిటీ సభ్యులు బిట్రా పానకాలు, పంతంగి ప్రభాకర్, గడ్డం సుసులోవ్, గనికపూడి యేసు రత్నం, వలపర్ల చిన్న దెబ్బయ్య, మోపత్తి బాబు రాజు పాల్గొన్నారు. -
ఐక్య పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
చీరాల అర్బన్: మున్సిపల్ రంగ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు ఐక్య పోరాటాల ద్వారానే పరిష్కారం సాధ్యమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక ఎన్జే రంగనాయకులు బాపనమ్మ కల్యాణ మండపంలో బుధవారం జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరించి అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన మహాసభలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చాప కింద నీరులా వర్క్ ఔట్సోర్సింగ్ విధానాన్ని ముందుకు తెస్తోందని తెలిపారు. దీని వల్ల కాంట్రాక్ట్ కార్మికులు తీవ్ర నష్టాన్ని చవి చూస్తారని చెప్పారు. గతంలో కార్మికుల పోరాటానికి మద్దతు తెలిపిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి కార్మికులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయని విమర్శించారు. ఉద్యోగాలను శాశ్వతం చేయడం, సమాన పనికి సమాన వేతనం, చట్టబద్ధ సౌకర్యాలు అమలు, రిటైర్మెంట్ ప్రయోజనాల హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులంతా రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్. మణిలాల్, ఉపాధ్యక్షుడు ఎం.వసంతరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కె.సామ్రాజ్యం, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు ఎన్.బాబూరావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ ఎలిజిబెత్, నెల్లూరు డివిజన్ కార్యదర్శి రామిరెడ్డి పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు -
బీచ్ ఫెస్టివల్కు సర్వం సిద్ధం చేయండి
బాపట్ల: స్థానిక సూర్యలంకలో వచ్చే నెలలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ను విజయవంతం చేయాలని కలెక్టర్ జె.వెంకట మురళి అధికారులను ఆదేశించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో బీచ్ ఫెస్టివల్కు సూర్యలంక వేదిక కానుందని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లపై బుధవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. పర్యాటక, సాంస్కృతిక, వినోద అంశాలను జోడించి, జిల్లా ప్రత్యేకతను చాటేలా ఈ వేడుకలు ఉండాలని ఆయన సూచించారు. ప్రాజెక్టు పూర్తయితే సూర్యలంక జాతీయ, అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలిచిపోతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో టూరిజం రీజినల్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న, ఇనన్చార్జ్ జేసీ గంగాధర్ గౌడ్, ఆర్డీవో గ్లోరియా, డెప్యూటీ కలెక్టర్ నాగిరెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఏవో మల్లికార్జున,మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవాల సందడి బీచ్లో మూడు రోజుల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, బీచ్ క్రీడలు, సంగీత నృత్య వినోదం, ఫుడ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు సందర్శకులను అలరించనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 27న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూర్యలంక బీచ్కు రానున్నారు. అదే రోజు రూ.97 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.కలెక్టర్ జె.వెంకట మురళి -
కృష్ణమ్మ ఆగ్రహం.. తగ్గని ప్రవాహం
కొల్లూరు : కృష్ణా నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. సముద్రంలోకి విడుదల చేస్తున్నా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు 4.69 లక్షల క్యూసెక్కులను అధికారులు విడుదల చేశారు. దీంతో కొంతమేర నీటి ప్రవాహం తగ్గి, సాయంత్రానికి 4.56 లక్షల క్యూసెక్కుల వరద నీరు నదిలో ప్రవహిస్తోంది. గ్రామాలను చుట్టుముట్టిన వరద నీరు వరద నీరు గ్రామాలను చుట్టుముట్టింది. మండలంలోని పెసర్లంక అరవిందవారధి వద్దనున్న నక్కపాయ గండి, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంక వద్ద, గాజుల్లంక సమీపంలో నది అంచులకు ప్రవహిస్తోంది. గతంలో పడిన గండ్ల నుంచి వరద నీటి ప్రవాహం లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకొని వెళ్లింది. ఇటుకల తయారీ కోసం తవ్విన భారీ గుంతలు వరద నీటితో నిండిపోయాయి. పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాల చుట్టూ నీరు చేరింది. ముంపు బారిన పంటలు మండలంలోని పోతార్లంక, చింతర్లంక గ్రామాల పరిధిలోని పల్లపు ప్రాంత పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. అరటి, కంద, బీర, దొండ వంటి పంటలు స్వల్ప విస్తీర్ణంలో వరద ముంపు బారిన పడ్డాయి. పల్లపు భూముల్లోకి భారీగా వరద నీరు చేరింది. సాగులో ఉన్న పశువుల మేత వరద నీటిలో మునకకు గురైంది. గ్రామాలకు నిలిచిన రాకపోకలు మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున చినరేవులో వరద నీరు లోలెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తోంది. ఈ మార్గంలో పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తోకలవారిపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాల ప్రజలు గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. రైతుల్లో ఆందోళన వరద ప్రభావం కారణంగా మండలంలోని తిప్పలకట్ట సమీపంలో నది అంచున ఉన్న పంట పొలాలు భారీగా కోతలకు గురవుతున్నాయి. ఆ ప్రాంత రైతులు తీవ్ర నష్టానికి గురవుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని పెసర్లంక, కొల్లూరు కరకట్ట దిగువనున్న నక్కపాయ, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాల పరిధిలోని ఇటుక బట్టీల్లోకి వరద నీటి ప్రవాహం చేరింది. దీంతో ఇటుక రవాణా ఈ ప్రాంతాల్లో స్తంభించింది. తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు, ఎస్ఐ జానకీ అమరవర్ధన్లు వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం పర్యటించారు. వరద నీటిలో దిగవద్దని, అవసరమైన పక్షంలో పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. -
‘జీజీహెచ్’లో జీతం.. ‘ప్రైవేటు’లో వైద్యం!
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో సీనియర్ వైద్యుల తీరుతో రోగులకు తీవ్ర అవస్థలుగుంటూరు మెడికల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుంటూరు జీజీహెచ్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు అందుబాటులో ఉండాలి. అవుట్ పేషెంట్ విభాగం (ఓపీ) రోగులకు సేవలు అందించాల్సి ఉంటుంది. వైద్యులకు బయోమెట్రిక్ హాజరు ఉన్నప్పటికీ సమయపాలన పాటించడం లేదు. సీసీ కెమెరాలు ఉన్నా వైద్యులు ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్ హాజరు వేసి గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రులకు, సొంత క్లినిక్లకు వెళ్లిపోతున్నారు. జీజీహెచ్లో ఉండాల్సిన సమయంలో ‘ప్రైవేటు’ వైద్య సేవల్లో తరిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలు అందించి, గంట సేపు భోజన విరామం తీసుకున్న తరువాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వార్డుల్లో బెడ్సైడ్ టీచింగ్ చేస్తూ రోగులను చూడాల్సి ఉంటుంది. కానీ కొంత మంది సీనియర్ వైద్యులు ఓపీలోనే జూనియర్ వైద్యులకు పాఠాలు చెబుతూ రోగులను వేచి ఉండేలా చేస్తున్నారు. మరికొంత మంది విభాగాధిపతులు ఓపీలకు రాకుండా వార్డుల్లో ఉంటూ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు. నిబంధనల ప్రకారం విభాగాధిపతులు కూడా ఓపీలకు హాజరై రోగులను పరీక్షించాల్సి ఉంటుంది. సీనియర్ వైద్యులు, విభాగాధిపతులు ఓపీలకు హాజరు కాకపోవడంతో జూనియర్లు తమకు తోచిన వైద్యం చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీని వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ, చికిత్సలు అందక రోగులు పలుమార్లు ఆసుపత్రికి రావాల్సి వస్తోంది. తనిఖీలు శూన్యం ఆసుపత్రిలో ఓపీ పనివేళల్లో సీనియర్ వైద్యులు విధుల్లో ఉన్నారా? లేదా? రోగులు వైద్య సేవలు పొందేందుకు ఏమైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా? అనే విషయాలు పరిశీలించేందుకు రోజూ జీజీహెచ్ అధికారులు, వైద్య కళాశాల అధికారులు సమన్వయంతో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఆప్తామాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, డెంటల్, పీడియాట్రిక్స్, రేడియాలజీ వంటి స్పెషాలిటీ వైద్య సేవలతోపాటు కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, క్యాన్సర్ వంటి సూపర్స్పెషాలిటీ వైద్య సేవల కోసం రోజూ 3 వేల నుంచి 4 వేల మంది రోగులు జీజీహెచ్కు వస్తున్నారు. రోగులు పెద్ద ఆసుపత్రిపై ఎంతో నమ్మకంతో వస్తుంటే, సీనియర్ వైద్యులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన ఆసుపత్రి, వైద్య కళాశాల అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలతో కాలయాపన చేస్తున్నారు. జీజీహెచ్కు సుదూర ప్రాంతాల నుంచి చికిత్సకు వస్తున్నామని, పెద్ద సార్లు అందుబాటులో ఉండకపోవడం వల్ల పలుమార్లు రావాల్సి వస్తోందంటూ పలువురు రోగులు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్సులో లిఖితపూర్వకంగా తెలియజేసినా ఫలితం లేదు. వైద్యుల పనితీరును పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఎందుకు మిన్నకుండిపోతున్నారో అర్థంకాక రోగులు తలలు పట్టుకుంటున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, కలెక్టర్ జీజీహెచ్ వైద్యుల సమయపాలనపై దృష్టి సారించాలి. -
డ్రగ్స్ ముప్పు నుంచి యువతను కాపాడుదాం
ఇన్చార్జి జేసీ గంగాధర్ గౌడ్ బాపట్ల: డ్రగ్స్ ముప్పు నుంచి యువతను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇన్చార్జి జేసీ గంగాధర్గౌడ్ తెలిపారు. జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణ, నివారణ చర్యలపై సమన్వయం కోసం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇన్చార్జి జేసీ మాట్లాడుతూ మత్తు పదార్థాల ముప్పు నుంచి యువతను రక్షించడం అందరి ప్రధాన బాధ్యతగా భావించాలని చెప్పారు. ప్రతి శాఖ ఒకే దిశలో కృషి చేస్తేనే ఫలితం వస్తుందని తెలిపారు. పోలీసు, ఎకై ్సజ్ శాఖలతో పాటు హెల్త్, ఎడ్యుకేషన్, పంచాయతీ రాజ్, సోషల్ వెల్ఫేర్ విభాగాలు కూడా చురుకుగా పని చేయాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, స్కూల్–కాలేజీల్లో జాగృతి సదస్సులు నిర్వహించాలని చెప్పారు. మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టడంలో సామాజిక, స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని ఆయన పిలుపునిచ్చారు. గుంటూరు ఇంటిలిజెన్స్ బ్యూరో అదనపు ఎస్పీ బి. ఫణిరాజు శర్మ మాట్లాడుతూం డ్రగ్స్ వ్యాప్తి యువత జీవితాలను నాశనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రైన్లు, బస్ స్టాండ్లు, పట్టణ శివారు ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని తెలిపారు. గంజాయి తరలింపు, సరఫరాపై కఠిన నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వలసలపై కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవోలు గ్లోరియ, చంద్రశేఖర్, రామలక్ష్మి, మెజిస్టీరియల్ సూపరింటెండెంట్ మల్లికార్జునరావు, క్రైమ్ డీఎస్పీ జగదీష్ నాయక్, బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, అధికారులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. -
సోమేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా రామ సుబ్బారావు
బాపట్ల అర్బన్: పట్టణంలోని సోమేశ్వరస్వామి ఆలయం చైర్మన్గా బూర్లె రామ సుబ్బారావును నియమిస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల సీనియర్ సభ్యులుగా, ఆర్యవైశ్య సంఘం, చాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులుగా సుబ్బారావు పని చేస్తున్నారు. తెనాలి రూరల్: తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆవరణలో కస్టమర్ సర్వీస్ సెంటర్ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పజెప్పడాన్ని నిరసిస్తూ తెనాలి టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె. పద్మావతి చేపట్టిన నిరసన దీక్షను బుధవారం విరమించారు. 10 రోజులుగా ఆమె దీక్ష చేస్తుండడంతో అఖిల భారత బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల నాయకులు గుంటూరు నుంచి తెనాలికి వచ్చారు. దీక్షలో కూర్చున్న ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అధికారుల వద్దకు వెళ్లి ఆమెకు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, ప్రైవేటు ఏజెన్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. సరిపడా ఉద్యోగులు ఉన్న తెనాలిలో ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వారు అధికారులకు సూచించారు. అనంతరం పద్మావతితో దీక్ష విరమింపజేశారు. రూ.4 లక్షలు గుంజుకుని పరారీ వేటపాలెం: బంగారు వ్యాపారిపై రౌడీషీటర్ దాడి చేసి రూ.4 లక్షలను బలవంతంగా లాక్కున్న ఘటన అక్కాయిపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో బుధవారం చోటు చేసుకుంది. గాయపడిన బంగారు వ్యాపారి చీరాల ఏరియా వైద్యశాలలో చిక్కిత్స పొందుతూ, అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. అక్కాయపాలెం లక్ష్మీపురానికి చెందిన రౌడీషీటర్ మల్లెల రాజేష్ తన వద్ద పాత బంగారం ఉందని, తక్కువ ధరకు అమ్ముతామని సెల్ నంబర్ను ఆన్లైన్లో ఉంచాడు. విజయవాడకు చెందిన బంగారు వ్యాపారి రహమాన్ ప్రకటన చూసి రాజేష్కు ఫోన్ చేశాడు. దీంతో లక్ష్మీపురం రావాలని రహమాన్కి చెప్పాడు. ఇది నమ్మిన అతడు బంగారం కొనుగోలు కోసం లక్ష్మీపురంలోని రౌడీషీటర్ ఇంటికి వచ్చాడు. వెంటనే వ్యాపారిపై దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.4 లక్షలను రాజేష్ లాక్కున్నాడు. అక్కడ నుంచి తప్పించుకొన్న వ్యాపారి చీరాల ఏరియా వైద్యశాలకు చేరి ఫిర్యాదు చేశాడు. రౌడీ షీటర్పై అనేక పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదై ఉన్నాయి. మాచర్ల రూరల్: ఉద్యోగులకు డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సాంబేలు శాంతిబాయి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఏల కోసం అసోసియేషన్ తరఫున ఈ నెల 14న హైకోర్టులో పిటిషన్ వేసినట్లు ఆమె చెప్పారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర దాటుతున్నా టీఏ, డీఏలను చెల్లించటంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హై కోర్టును ఆశ్రయించామని ఆమె తెలిపారు. తెనాలి అర్బన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లకు మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కఽళాశాల ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ రావి చిన్న వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ నెల 26వ తేదీలోపు వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. తెనాలి, గుంటూరులలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నమోదు కేంద్రాల్లో 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. అభ్యర్థులకు ఈ నెల 29, 30వ తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు సెల్ నంబర్ 93914 02683లో సంప్రదించాలని సూచించారు. -
బాలాజీకి జాతీయ ఫొటోగ్రాఫర్ అవార్డు
అవార్డు అందించిన బాలాజీ తీసిన చిత్రం అవార్డు అందుకుంటున్న బాలాజీ వేటపాలెం: వేటపాలేనికి చెందిన గాత్రం బాలాజీ మోహన్కృష్ణ జాతీయ స్థాయి ఫొటోగ్రాఫర్ అవార్డు అందుకున్నాడు. విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం అవార్డు ప్రదానోత్సవంలో రాష్ట్ర టూరిజం, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ చేతుల మీదుగా ఫొటోగ్రాఫర్ బాలాజీ సోమవారం అవార్డు అందుకున్నారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రఫీ అకాడీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రఫీ కౌన్సిల్, రాష్ట్ర సాంస్కృతిక సృజనాత్మక సమితి వారి సౌజన్యంతో ఈ పోటీలు నిర్వహించారు. ఫొటో ట్రావెల్ విభాగంలో బాలాజీ మోహనకృష్ణకి మెరిట్ సర్టిఫికెట్తోపాటు ప్రైజ్మనీ అవార్డు లభించింది. గతంలో కూడా బాలాజీ తీసిన ఉత్తమ ఫొటోగ్రఫీలో అనేక ఉత్తమ అవార్డులు అందుకున్నారు. -
శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
తాడికొండ: అమరావతి రాజధానిలోని వేంకటపాలెంలో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం యాగశాలలో పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు విశేష అభిషేకం నిర్వహించారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట, అధివాసం, సర్వదైవత్య హోమం చేపట్టారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, సందీప్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ధూళిపాళ్లకు సూట్కేసులు
రైతుల తరఫున పోరాడితే కేసులు...పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): రైతుల పక్షాన పోరాడే వారిపై పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కేసులు పెడుతున్నారని, ఆయనకు మాత్రం సూట్కేసులు వెళ్తున్నాయని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. కూటమి ఏడాదిన్నర కాలం పాలనలో రైతుల సమస్యలను నరేంద్ర పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. గుంటూరులోని తన కార్యాలయంలో అంబటి మురళీకృష్ణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుంటూరు చానల్కు గండ్లు పడ్డాయన్నారు. ఫలితంగా పెదకాకానిలో 11 వేల ఎకరాలు, చేబ్రోలులో 5 వేల ఎకరాలు, పొన్నూరు రూరల్లో 15 వేల ఎకరాలు నీట మునిగాయని పేర్కొన్నారు. కొండవీటి వాగు ప్రవాహం గుంటూరు చానల్లోకి చేరడంతో పొలాలన్నీ దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఇంతటి భారీ నష్టం సంభవిస్తే గుంటూరు చానల్ లాకులు మూసినట్టు ప్రభుత్వం చెప్పడం అబద్ధమేనన్నారు. అయితే ఆ నీరంతా ఆకాశం నుంచి వచ్చిందా, భూమి లోపలి నుంచి పైకి వచ్చిందా అనేది కూడా ప్రభుత్వమే చెప్పాలన్నారు. రైతులు మాత్రం కొండవీటి వాగు నుంచే భారీగా నీరు వచ్చి నష్టం చేసిందని చెప్పడాన్ని ఇక్కడ గమనించాలన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాలి గత ఏడాది పంటలు మునిగిపోయిన నేపథ్యంలో రూ.16 కోట్లు నష్టపరిహారంగా ఇచ్చామని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నారని, అయితే ఈ ఏడాది నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వనవసరం లేదా అన్ని అంబటి మురళీకృష్ణ ప్రశ్నించారు. అంతేగాక గతంలోనే నష్టపరిహారం చెల్లించామని, కాల్వలు కూడా బాగు చేయించామని ఎమ్మెల్యే నరేంద్ర చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. అదే నిజమైతే ఈ వర్షాలకు గండ్లు ఎలా పడ్డాయో చెప్పాలన్నారు. ఈ ఏడాది సార్వా సాగుకు రైతులు ఇప్పటికే ఎకరాకు రెండుసార్లు రూ. 20 వేలు ఖర్చు చేశారన్నారు. మూడోసారి నారుమడి వేసే పరిస్థితి కూడా లేదన్నారు. తక్షణమే ఎకరాకు తాత్కాలిక పరిహారంగా రూ.10 వేల నగదు, ఉచితంగా ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలన్నారు. ఇక అన్నదాతలు ఇంతటి దయనీయ స్థితిలో ఉంటే రెండు నెలలుగా ఎమ్మెల్యే నరేంద్ర నియోజకవర్గంలోనే కనిపించకపోవడం సిగ్గుచేటన్నారు. పంటల నష్టపోయినట్టు రైతులు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి చెబితే... పంటలు పోతే పోయాయని, రియల్ ఎస్టేట్కు ఇవ్వాలని చెప్పడం ఆయన దుర్బుద్ధిని తెలియజేస్తోందన్నారు. రైతుల పక్షాన పోరాడుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చేబ్రోలు, కొమ్మమూరు బ్రిడ్జికి సంబంధించి గుంతలు తీసి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద నీరు భారీగా వచ్చి నడిరోడ్డుపై గుండాలు ఏర్పడ్డాయన్నారు. దీనిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని అంబటి మురళీకృష్ణ సూటిగా ప్రశ్నించారు. పొన్నూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపణ -
వైఎస్సార్ సీపీ నేతలపై విమర్శలు తగదు
మంగళగిరి: కొండవీడు వాగు వరద మళ్లింపుతోపాటు కృష్ణా నది నుంచి నీరు వెనక్కి తన్నడం వలనే మంగళగిరి, తాడేపల్లి, పెదకాకాని తదితర మండలాలు మునిగాయని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. మండలంలోని నీరుకొండ, కురగల్లుల మధ్య వాగు ముంపు ప్రాంతాలను పరిశీలించిన వైఎస్సార్ సీపీ వివిధ అనుబంధ సంఘాల నాయకులు మాట్లాడుతూ తమ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి వాగు వరద మళ్లిపు, ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా 70 వేల ఎకరాలు పంటలు మునిగాయని చెప్పారన్నారు. రైతులను ఆదుకోవాలని కోరారన్నారు. టీడీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. వర్షం తగ్గినా మంగళవారం వరకు ఇక్కడ కనుచూపు మేర నీరు నిలిచిందన్నారు. కార్యక్రమంలో నాయకులు జంగాల నాగిరెడ్డి, మల్లవరపు సుధారాణి, సయ్యద్ గౌస్ మొహిద్దీన్, ఆర్ధల చిన్నారి, కట్టెపోగు భూషణం, షేక్ గౌస్ పాల్గొన్నారు. -
బంగారు గొలుసు అప్పగింత
అద్దంకి రూరల్: బస్సులో ప్రయాణికుడు పోగొట్టుకున్న బంగారు చైన్ను డిపో మేనేజర్ ఆ ప్రయాణికుడికి అందజేశారు. డీఎం తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు సమతా నగర్కు చెందిన ప్రయాణికుడు సుబ్రహ్మణ్యం మంగళవారం అద్దంకి డిపోకు చెందిన బస్సులో అద్దంకి నుంచి ఒంగోలు బయలుదేరాడు. బస్సులో తన బంగారు గొలుసు పోగొట్టుకున్నాడు. ఈ విషయం గమనించి అద్దంకి డిపో మేనేజర్ రామ్మోహనరావుకు తెలియజేశారు. డీఎం వెంటనే సంబంధిత బస్సు డ్రైవర్కు ఫోన్ చేశారు. డ్రైవర్ బస్సును పరిశీలించగా 2 సవర్ల బంగారు చైన్ కనబడటంతో తీసుకువచ్చి డీఎంకు అందజేశారు. -
వరద ఉధృతం.. భయం భయం
దాచేపల్లి: కృష్ణా నదిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మత్స్యకారుల కాలనీ ప్రమాదం అంచున ఉంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామపురం గ్రామంలోని మత్స్యకారుల కాలనీ అనుకొని కృష్ణానదిలో వరద నీరు మంగళవారం ఉధృతంగా ప్రవహిస్తుంది. కాలనీలోని నివాస గృహాలకు కూతవేటు దూరంలో వరద నీరు ప్రవహిస్తుండంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కాలనీలో 50 పైగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు నుంచి వరద నీరు దిగువకు విడుదల చేయడం వలన నది ఉధృతంగా ప్రవహిస్తుంది. నీటి విడుదల పెరిగితే మత్స్యకారుల కాలనీలోకి వరద నీరు చేరే అవకాశం ఉంది. నదిలో నీటి ప్రవాహం మరింత పెరిగితే మత్స్యకారులను అక్కడి నుంచి ఖాళీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
బైకును ఢీకొన్న లారీ.. వ్యక్తి మృతి
మేదరమెట్ల: వెనుక నుంచి వచ్చిన లారీ బైకును ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన కొరిశపాడు మండలం మేదరమెట్ల ఫైలాన్ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు జే.పంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన గోలమూడి కుమార్ (37) భార్య వెన్నెలతో కలసి ఒంగోలులో ఉంటున్న కుమారుని కలసి మోటారు బైకుపై తిరిగి స్వగ్రామం వస్తున్నారు. బైకు ఫైలాన్ సమీపానికి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ మోటారు బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్ను లారీ కొద్ది దూరం లాక్కొనిపోయింది. దీంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుమార్ భార్య వెన్నెల రోడ్డు పక్కన పడిపోయింది. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. తన కళ్ల ముందే భర్త విగతజీవిగా మారడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల ఎస్సై మహ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
బాలుడి మృతిపై అనుమానాలు
క్రోసూరు: మండలంలోని విప్పర్ల గ్రామంలోని ఎస్సీకాలనీ (గోవిందపురం)కు చెందిన బాలుడు రెండు మాసాల క్రితం మృతి చెందగా, బాలుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి పోలీసుస్టేషన్లో చేసిన ఫిర్యాదు మేరకు మంగళవారం పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన జరిగింది. ఎస్ఐ రవిబాబు తెలిపిన వివరాల మేరకు.. జూన్ నెల రెండవ తేదీన విప్పర్ల గ్రామానికి చెందిన ఎర్రగుండ్ల జోష్ణప్రకాశ్ (8) బావిలో పడి మృతి చెందాడు. అప్పుడు ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడనుకుని ఖననం చేశారు. పది రోజుల క్రితం మృతుడి తల్లి శ్రావణి తన కుమారుడిని చంపి బావిలో వేసారన్న అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని క్రోసూరు సీఐ రమేష్, ట్రైనీ ఎస్ఐ గోపిల పర్యవేక్షణలో గుంటూరు నుంచి వచ్చిన ఇద్దరు ఫోరెన్సిక్ వైద్యులు, తహసీల్దార్ వి.వి.నాగరాజు, వీఆర్వోల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తల్లి ఫిర్యాదు మేరకు మరణించిన రెండు మాసాల అనంతరం పోస్టుమార్టం -
అవగాహన ఫ్లెక్సీ ఆవిష్కరణ
గుంటూరు మెడికల్: ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ప్రచార ఫ్లెక్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బుధవారం ఉదయం 9 గంటలకు డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డెప్యూటీ డైరెక్టర్ శివశంకర్ బాబు, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ శ్రావణ్ బాబు, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అన్నపూర్ణ, డీపీహెచ్ఎన్ డాక్టర్ ప్రియాంక, స్టాటిస్టికల్ అధికారిణి పద్మజ, అసిస్టెంట్ మలేరియా అధికారి రాజు నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి గణేష్, తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో ఇన్నోవేషన్ హబ్ నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి మంగళగిరి టౌన్: యువతలోని వినూత్న ఆలోచనలను మెరుగుపట్టి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ను మంగళగిరిలో ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగర పరిధిలోని జాతీయ రహదారి వెంబడి ఉన్న మయూరి టెక్ పార్క్లో ఈ హబ్ ఏర్పాటైంది. దీనిని బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. యువతకు ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ సూర్యతేజ తెలిపారు. -
రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్ కట్
లబోదిబోమంటున్న దివ్యాంగుడు నగరం: కూటమి ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్లలో కోత పెడుతోంది. 90 శాతం పైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు సైతం మొండిచెయ్యి చూపుతున్నారు. నగరం మండలం పెద్దమట్లపూడి గ్రామానికి చెందిన లుక్కా నాగరాజుకు 90 శాతం అంగవైకల్యం ఉండడంతో 2011వ సంవత్సరం నుంచి పింఛన్ పొందుతున్నాడు. వికలాంగ పింఛన్ పొందుతున్న వారు మరోమారు వెరిఫికేషన్ చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రీ వెరిఫికేషన్కు వెళ్లిన నాగరాజుకు నిరాశ ఎదురైంది. పింఛన్ పొందేందుకు సరిపడినంత అంగవైకల్యం లేదని సచివాలయానికి సర్టిఫికెట్లు వచ్చాయి. నాగరాజు పింఛన్ నగదుపై ఆధారపడి జీవిస్తున్నాడు. ఇప్పుడు పింఛన్ నిలిపివేసినట్లు అధికారులు చెప్పడంతో తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. -
సాగుదామా.. ఆగుదామా!
కారంచేడు: కూటమి పాలనలో అన్నదాతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడంలో దారుణంగా విఫలమైంది. దీంతో అన్నదాతలు మళ్లీ పంటలు సాగు చేసేందుకు జంకుతున్నారు. ఈ ఏడాది సాగు భూములను కౌలుకు అడిగే వారే కరువయ్యారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలోని కర్షకుల దీనావస్థపై కథనం.. పతనమైన కౌలు, ధాన్యం ధరలు: బాపట్ల జిల్లాలోనే అత్యధిక మాగాణి సాగు ప్రాంతంగా ఉన్న కొమ్మమూరు కాలువ ఆయకట్టు కింద సుమారు లక్ష ఎకరాల్లో వరి సాగు చేస్తారు. చీరాల, కారంచేడు, వేటపాలెం, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల్లోని గ్రామాల్లో రైతులు 2270, 2595, 892 రకం విత్తనాలను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ రకం విత్తనాలు ఎకరానికి వాతావరణాన్ని బట్టి 30 నుంచి 50 బస్తాల వరకు దిగుబడులు వస్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో బస్తా (75 కేజీలు) ధాన్యం ధర రూ.2400 నుంచి రూ.2600 వరకు అమ్మకాలు జరిగాయి. కూటమి ప్రభుత్వంలో బస్తా ధర రూ.1600– రూ.1700 మాత్రమే ఉంది. అవి కూడా అడిగే వారు లేరు, కొనే వారు అంతకన్నా లేరని అన్నదాతలు వాపోతున్నారు. కౌలు ధరలు కూడా వైఎస్సార్ సీపీ పాలనలో ఎకరం మాగాణి భూములకు 17–18 బస్తాలు ఉంటే, నేడు 11–13 బస్తాల కౌలు మాత్రమే ఉంది. అది కూడా అడిగే వారే కరువయ్యారని రైతులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో సాగు ఖర్చు ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.22 వేలు అయితే నేడు రూ.25 వేల నుంచి రూ.27 వేల వరకు అవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వంలో కర్షకులకు కన్నీళ్లే.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఉన్నారు. సాగుకు ముందే పెట్టుబడి నిధులతో సాగును ప్రారంభించిన అన్నదాతలకు సమయానుకూలంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేవారు. ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు నష్టపోయినా వెంటనే ఇన్స్యూరెన్స్, పంట నష్ట పరిహారాలు అందించారు. వైఎస్సార్ సీపీ పాలనలో ఏ ఒక్క ఏడాదిలోను రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేవని రోడ్డెక్కలేదు. కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించిన ఏడాదిలోనే అన్నదాతలు పంటలకు గిట్టుబాటు ధరలు లేక, కొనే నాథుడు లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. -
‘కృష్ణా’లో పెరుగుతున్న వరద ఉద్ధృతి
మొదటి ప్రమాద హెచ్చరికతో అప్రమత్తంగా ఉండాలని సూచన కొల్లిపర: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్, ఇతర జలాశయాలు నిండుకుండల్లా మారుతున్నాయి. దీతో కృష్ణా నదికి సుమారుగా 5 లక్షల క్యూసెక్కులు వరద నీరు రాగా, మంగళవారం అధికారులు ఈ మేరకు దిగువకు వదిలారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తహసీల్దార్ జి.సిద్ధార్థ, ఎస్సై కోటేశ్వరరావులు తెలిపారు. మండలంలోని లంక గ్రామంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న 24 గంటల్లో కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. లంక గ్రామంలోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. నదులు, ఇతర జల వనరుల వద్దకు ప్రజలు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసరమైతే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పడవ వేయాలని నడిపే వ్యక్తులకు ఆదేశించారు. పాడి రైతులు పశువులను నదిలో దించడానికి ప్రయత్నించరాదని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
మట్టి అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ విచారణ
నగరం: రేపల్లె నియోజకవర్గం పరిధిలోని నగరం, చెరుకుపల్లి మండలాలలో కూటమి నాయకులు జరిపిన మట్టి అక్రమ తవ్వకాలపై మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నగరం, చెరుకుపల్లి మండలాల్లోని పలు గ్రామాలలో కూటమి నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. లక్షలాది రూపాయలు దోచుకున్నారు. పచ్చని పంట పొలాలను చెరువులుగా మార్చివేశారు. కూటమి నాయకుల అక్రమాలపై ప్రజలు, ప్రజాసంఘాలతోపాటు జై భీమ్రావ్ భారత్ పార్టీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం నగరం మండలం పెదమట్లపూడిలో పర్యటించి మట్టి తవ్విన ప్రాంతాలను పరిశీలించారు. కొలతలు వేశారు. తవ్వకాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్ ఆర్ఐ రాజేంద్రప్రసాద్, సర్వేయర్ నాగలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.నేటి నుంచి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్రేపల్లె: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి.సి.రవిచంద్రకుమార్ చెప్పారు. స్థానిక కళాశాలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలలో సైన్న్స్ విభాగంలో బీఎస్సీ (కంప్యూటర్ సైన్న్స్), బీఎస్సీ (కెమిస్ట్రీ), బీఎస్సీ (ఫిజిక్స్), బీఎస్సీ (జువాలజీ) కోర్సులు, బీఏ (హిస్టరి), బీఏ (ఎకనామిక్స్), బీకాం (జనరల్), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్న్స్) కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులందరూ ఆన్లైన్లో అడ్మిషన్ ప్రక్రియలో పేర్లు నమోదు చేసుకొని, అడ్మిషన్ పొందాలని కోరారు.24న టీటీసీ పరీక్ష నిర్వహణబాపట్ల: ఈ ఏడాది ఆగస్టులో జరిగే టీటీసీ లోయర్ గ్రేడ్–థియరీ రెగ్యులర్, ప్రైవేటు అభ్యర్థులకు ఈనెల 24వ తేదీన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తునట్లు డీఈఓ పురుషోత్తం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, వైఎస్సార్ కపడ జిల్లాలో ఉంటాయని తెలిపారు. హాల్టికెట్లు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేయించుకోవాలని సూచించారు.జీజీహెచ్లో ఫిర్యాదుల బాక్సుగుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ, హెచ్డీఎస్ కమిటీ సభ్యుడు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల బాక్స్ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఫిర్యాదుల బాక్స్లో పది ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిపై హెచ్డీఎస్ కమిటీ చర్చించి, పరిష్కరించేందు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.108 కిలోల గంధంతో అభిషేకార్చననగరంపాలెం: స్థానిక అరండల్పేట శ్రీఅష్టలక్ష్మీ మందిరం కోటి కుంకుమార్చనలో భాగంగా శ్రావణ మంగళవారం స్వామి, అమ్మవారికి విశేష పూజలు, శ్రీచక్ర మహామేరుకు విశేష అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం 108 కిలోల గంధంతో విశేష అభిషేకార్చన భక్తిశ్రద్ధలతో చేపట్టారు. హారతులు, మంత్రపుష్పం అనంతరం కుంకుమార్చనకు హాజరైన వారు స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు నిర్వాహకులు అందించారు. నక్షత్ర హారతి, మంత్రపుష్పం చేపట్టగా, నిర్వాహకులు మర్రిపాటి ప్రసాద్శర్మ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
త్వరలో అనుబంధ విభాగాల నియామకాలు
నెహ్రూనగర్: ౖవెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నియోజకవర్గ, డివిజన్ అనుబంధ విభాగాల నియామకాలను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్లు తెలిపారు. గుంటూరు నగరంలోని అంబటి రాంబాబును, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ను వారి కార్యాలయాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి, గుంటూరు, పల్నాడు జిల్లాల అనుబంధ విభాగాల ఇన్చార్జి షేక్ మస్తాన్వలి మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లాతోపాటు, గుంటూరు పశ్చిమ, తెనాలి నియోజకవర్గాల అనుబంధ విభాగాల కమిటీల గురించి ప్రస్తావించారు. త్వరితగతిన కమిటీలు పూర్తి చేసేలా దృష్టి సారించాలని కోరారు. వారు మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం కల్పించేలా పదవులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి షేక్ మస్తాన్వలి మాట్లాడుతూ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటుతో పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. -
లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు న్యాయ సహాయం అవసరమైతే ఈ క్లినిక్ను సందర్శించాలని తెలిపారు. దీనికి ప్యానెల్ అడ్వకేట్గా పి.రాజేష్ లింగం, పారా లీగల్ వలంటీర్గా పి.శిరీషను నియమించారు. కార్యక్రమంలో సైనిక సంక్షేమ అధికారి ఆర్.గుణశీల, మాజీ సైనిక ఉద్యోగులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
లక్ష్మీపురం: ఆటో కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. గుంటూరు హిందూ కళాశాల సెంటర్లో మంగళవారం ఫెడరేషన్ తరఫున ఆటో కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు షేక్.మస్తాన్వలి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలన్నారు. వాహన మిత్ర కింద రూ.25 వేల సాయం అందివ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు, తక్కువ వడ్డీకి రుణాలు అందించే ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అన్ని రకాల ఫీజులు, పెనాల్టీలు తగ్గించాలని కోరారు. లేకుంటే ఈ నెల 24వ తేదీన ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో చర్చించి ఆందోళన చేపడతామన్నారు. గుంటూరు జిల్లా ఆటోడ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు, గుంటూరు నగర ఆటోడ్రైవర్స్ యూనియన్ కార్యదర్శి జి.శంకర్ రావు, కె.కోటేశ్వరరావు, షేక్ ఖాసిం, అశోక్, షేక్ జానీ, వెంకటయ్య, సాంబయ్య, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి చీరాల అర్బన్: ప్రతి వినియోగదారుడికి నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక పాపరాజుతోటలోని బాపనమ్మ కల్యాణ మండపంలో జిల్లా విద్యుత్శాఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పట్టణ, పల్లె ప్రాంతాల్లో లోఓల్టేజీ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రజాభిప్రాయసేకరణలో మంచి ఫలితం సాధించాలని సూచించారు. ఆర్డీఎస్ఎస్ పనులు సకాలంలో పూర్తిచేసి వినియోగదారులకు అందించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అలానే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన వినియోగదారులకు అందించాలని, రైతులకు విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల మీద వాటి పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎస్ఈ ఆంజనేయులు, డైరెక్టర్ టెక్నికల్ మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ ప్రాజెక్ట్సు ఎన్.వెంకటేశ్వర్లు, జిల్లాలోని ఈఈలు, డీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
తాడికొండ: అమరావతిలోని వేంకటపాలెంలో గల వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. లోక కల్యాణార్థం మొదటిసారి గా ఆలయంలో పవిత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం అర్చకులు విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, ఆచార్య రుత్విక్ వరణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ నిర్వహించారు. 19వ తేదీ ఉదయం పంచగవ్యారాధన, అకల్మష హోమం, వాస్తు పూజ, వాస్తు హోమం, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్ట అధివాసం, సర్వదైవత్య హోమం చేపడుతారు. 20న ఉదయం పుణ్యాహవాచనం, కుంభ ఆరాధన, ప్రధాన హోమాలు, స్నపన తిరుమంజనం, పవిత్రాభిమంత్రణ, పవిత్ర సమర్పణం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, మహా శాంతి హోమం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. 21వ తేదీ ఉదయం పుణ్యాహవచనం, యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ, కుంభ సమర్పణం, విశేష ఆరాధన, ఆచార్య, ఆగమ సలహాదారు, ఋత్విక్కులకు బహుమానం, యాజమాన ఆశీర్వాచనం చేపట్టనున్నారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు పటిష్టం
కొల్లూరు: వరద ప్రభావిత ప్రాంతాలలో పటిష్టవంతమైన రక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అధికారులను ఆదేశించారు. మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున చినరేవు లో లెవల్ వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరద ప్రవాహాన్ని ఎస్పీ సోమవారం పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ వరద తీవ్రతపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాలలో పశువుల కాపరులతోపాటు, స్థానిక ప్రజలు నదిలో దిగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతోపాటు, గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలను ఆ మార్గంలో రాకపోకలు సాగించకుండా నిరోధించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, కొల్లూరు ఎస్ఐ జానకిఅమరవర్ధన్ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ -
బాపట్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు
బాపట్ల అర్బన్: వర్షాలు, వరదలు దృష్ట్యా పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు డ్రెయినేజీలు, నీటి కుంటలలో దోమలు ఉత్పత్తి జరగకుండా గంబూషియా చేప పిల్లలను సోమవారం వదిలే కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ జి.రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఖాళీలను యజమానులు శుభ్రం చేయించుకోవాలని, పిచ్చిమొక్కలు, అపరిశుభ్రంగా ఉంటే సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. పురప్రజలు కూడా మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు సీహెచ్ కరుణ, నజీర్ ఉన్నారు. -
నేడు, రేపు మంగళగిరిలో సీఎం పర్యటన
మంగళగిరి టౌన్: మంగళగిరిలో మంగళవారం, బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి సోమవారం అధికారులతో కలసి పరిశీలించారు. నగర పరిధిలోని సీకే కన్వెన్షన్లో జీరో ప్రావర్టీ పి–4 కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. సీటింగ్, సభాస్థలి, వీడియో గ్యాలరీ, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. నగర పరిధిలోని ఎన్ఆర్ఐ ఫ్లైఓవర్ వద్ద ఉన్న మయూరి టెక్ పార్క్లో బుధవారం జరగనున్న రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న దృష్ట్యా, అక్కడి ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సమన్వయంతో విధులు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్, శాసనమండలి సభ్యులు పెందుర్తి వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, ప్లానింగ్ శాఖ జాయింట్ సెక్రటరీ శంకరరావు, సంయుక్త కలెక్టర్ భార్గవ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా, సీఎంఓ కార్యాలయ అధికారి ఇక్బాల్ సాహెబ్, ఎంటీఎంసీ కమిషనర్ అలీమ్ బాషా పాల్గొన్నారు. వినుకొండ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు వినుకొండ: ఇండియా ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో వినుకొండ ఫొటోగ్రాఫర్లు వంగపల్లి బ్రహ్మయ్య, కేసానుపల్లి సుబ్బారావులు అవార్డులు అందుకున్నారు. ఈ మేరకు విజయవాడలో జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ ఇతర ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అవార్డులు అందుకున్న ఇరువురుని వినుకొండ ఫొటోగ్రాఫర్లు అభినందించారు. విరిగిన ఇనుప గడ్డర్తో ఇబ్బందులు తెనాలి రూరల్: తెనాలి–చందోలు మార్గంలోని వైకుంఠపురం రైల్వే వంతెన వద్ద తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో వంతెన దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన ఇనుప గడ్డర్ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో విరిగి కింద పడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం మరమ్మతులు చేయించారు. తరచూ గడ్డర్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గాంధీ ఆశ్రమానికి రూ.లక్ష విరాళం తెనాలి అర్బన్: పెదరావూరుకు చెందిన షేక్ హానీఫ్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు బాషా మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమ నిర్వాహణకు రూ.లక్ష చెక్కును నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. బుర్రిపాలెం రోడ్డులోని ఆశ్రమంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో షేక్ జానీ సైదా, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఫొటోకు జీవం పోస్తాడు పీవీఎస్
బాపట్లటౌన్/బాపట్లఅర్బన్: జీవితంలోని మధుర స్మృతులన్నీ దాచుకునే దృశ్య సంచిక ఫొటో..బాపట్ల మండలం ముత్తాయపాలెం గ్రామానికి చెందిన పీవీఎస్ నాగరాజు తన చేతిలోని కెమెరాను క్లిక్ మనిపిస్తే చాలు...మండలం నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఏదో ఒక అవార్డు సాధించడం ఖాయం. గ్రామీణ ప్రాంతాల ప్రజల స్థితిగతులు, జీవ వైవిధ్యం, ప్రకృతి సౌందర్యాలు, గిరిజనుల జీవన విధానం, భారతీయ సంస్కృతి, గిరిజనుల జీవన పోరాటం, తీరప్రాంతాల్లోని మత్స్యకారుల జీవన స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పడేపాట్లు ఇలా సహజ సిద్ధంతో కూడిన ఛాయాచిత్రాలను తన కెమెరాలో బంధించడం అతని అలవాటు. పీవీఎస్ తీసిన ఫొటోలకు ఇప్పటివరకు 207 అవార్డులు లభించాయి. వాటిల్లో రాష్ట్రస్థాయిలో 19, జాతీయస్థాయిలో 105, అంతర్జాతీయ స్థాయిలో 83 చొప్పున అవార్డులు లభించాయి. తాను తీసిన ఛాయాచిత్రాలకు లభించిన అవార్డులను గుర్తించిన ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2024లో పీవీఎస్ నాగరాజుకు డాక్టరేట్ అందజేశారు. ఫొటోగ్రఫీలో పీవీఎస్ నాగరాజుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం -
కృష్ణాకు తగ్గిన వరద
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉపరితల ఆవర్తన ప్రభావంతో జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 13న జిల్లావ్యాప్తంగా భారీవర్షాలు కురవగా సోమవారం రాత్రి మరోమారు ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా నిజాంపట్నం మండలంలో 32.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా కర్లపాలెం, నగరంలలో 29.4 ఎంఎం, బాపట్లలో 24.8, పిట్టలవానిపాలెంలో 22.6, పర్చూరులో 21.2, రేపల్లె, సంతమాగులూరులలో 16.2, మార్టూరులో 12.4, బల్లికురవలో 12.2, చీరాలలో 9.2, అమృతలూరులో 8.2 మిల్లీమీటర్ల చొప్పున జిల్లాలో సగటున 11.99 ఎంఎం వర్షం కురిసింది. కృష్ణాకు తగ్గిన వరద కృష్ణా నదికి వరద తగ్గడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి సోమవారం ఉదయం దిగువకు 2.80 లక్షల క్యూసెక్కులు విడుదల చేసిన అధికారులు సాయంత్రానికి దీనిని 2.50 లక్షలకు తగ్గించారు. దీంతో కొల్లూరు మండలంలోని లంక గ్రామాలతోపాటు కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఎటువంటి వరద ముప్పు లేదని అధికారులు తెలిపారు. ఈనెల 13 ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు 5.80లక్షల క్యూసెక్కులు విడుదల చేసిన విషయం తెలిసిందే. కృష్ణానది ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయన్న సమాచారంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం సోమవారం జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని రద్దు చేసుకొని అందరూ వేమూరు నియోజకవర్గానికి తరలివెళ్లారు. కానీ వరద తగ్గుముఖం పట్టడంతో ప్రజలతోపాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
లంక గ్రామాలను భయపెడుతున్న వరద
కొల్లూరు: లంక గ్రామాల ప్రజలను వరద భయం వెంటాడుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్న వరద నీటి ప్రవాహం ఇరవై రోజులుగా తగ్గుతూ పెరుగుతూ వస్తోంది. తెలంగాణాతోపాటు, ఎగువ ప్రాంతాలలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతుంది. నాలుగు రోజుల కిందట 5.75 లక్షల క్యూసెక్కులు నదికి రావడంతో లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు చొచ్చుకువచ్చింది. పంటలు ముంపునకు గురయ్యాయి. ఆ తర్వాత వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. తిరిగి ఆదివారం రాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. సోమవారం ఉదయం కృష్ణా నదికి 2.89 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. అయితే వరద నీటి విడుదల క్రమంగా తగ్గుతూ 2.50 లక్షలకు చేరింది. నదిలో ప్రవాహ తీవ్రత కొంత మేర తగ్గింది. లోలెవల్ వంతెన మీదుగా ప్రవాహం కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద ప్రవాహం కారణంగా లోతట్టు ప్రాంతాలలోకి వరద నీరు చేరుతుంది. నాలుగు రోజుల కిందట వచ్చిన వరద కారణంగా మండలంలోని పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం ప్రాంతాలలోని ఇటుక బట్టీల మట్టి కోసం తవ్విన గుంతలలోకి వరద నీరు భారీగా చేరింది. ప్రస్తుతం విడుదల చేస్తున్న వరద నీరు కారణంగా గాజుల్లంక చినరేవు నుంచి ప్రవహిస్తున్న వరద నీటి తీవ్రత అధికమైంది. దీంతో దోనేపూడి కరకట్ట దిగువనున్న లోలెవల్ వంతెన మీదుగా నీరు ప్రవహిస్తుంది. లోలెవల్ వంతెనపై నుంచి వరద నీటి ప్రవాహం కారణంగా మండలలోని పోతార్లంక, తోకలవారిపాలెం, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి తదితర గ్రామాల ప్రజలు గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామాల మీదుగా రాకపోకలు సాగించాల్చిన పరిస్థితి తలెత్తింది. -
ముందుకు రాని లైసెన్స్దారులు
కూటమి ప్రభుత్వం దోచుకుంటుంది.. కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుంది. ఇష్టానుసారంగా లైసెన్స్లు పెంచి దోచుకుంటుంది. హైదరాబాద్లో ఏడాదికి బార్ లైసెన్స్ రూ.45లక్షలు ఉండగా కూటమి ప్రభుత్వం ఒక్కో బారుకు రూ.75 లక్షలు కడి తేనే టెండర్లు వేయాలని హుకుం జారీ చేసింది. ఇది పక్కా దోపిడీ. సూరగాని చెంచుబాబు, బార్ యజమాని 26 వరకు గడువు కొత్త బార్ టెండర్లను ఈనెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చారు. సోమవారం టెండర్లు వేసేందుకు ప్రారంభం కాగా ఒక్క టెండరు కూడా రాలేదు. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ప్రభుత్వం మరో బార్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. 28న టెండర్ల బాక్సు తెరుస్తాం. ఈనెల 26వ తేదీ వరకు గడువు ఉంది. – పీ.నాగేశ్వరరావు, ఎకై ్సజ్ సీఐ, చీరాల చీరాల: కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా లైసెన్స్ ఫీజు అడ్డగోలుగా పెంచడంతో టెండర్లు దాఖలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. హైదరాబాద్ వంటి భాగ్యనగరంలో సంవత్సరానికి బార్ లైసెన్స్ రూ.45 లక్షలు ఉండగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒక్కొక్క బార్కు రూ.75 లక్షలు కడితేనే టెండర్లు వేయాలని హుకుం జారీ చేసింది. దీంతో బార్ షాపుల యజమానులకు చిర్రెత్తుకొచ్చింది. దీనికి తోడు అమ్మిన అమ్మకాలలో 50 శాతం టాక్స్లు వసూలు చేస్తుంది. రెండు నెలల కాలపరిమితిలో ఈ టాక్స్ విధిస్తుంది. దీనికి తోడు రూ.100 లోపు చీప్ క్వార్టర్లు అమ్ముకోవడానికి వీలులేదు. ఇది కేవలం వైన్ షాపుల్లోనే అమ్మాలి. అలానే పార్సిల్ సర్వీస్ ఉండదు. సోమవారం నుంచి బార్లకు టెండర్లు ప్రక్రియ మొదలు కాగా చీరాలలో ఒక్క టెండరు రాలేదు. గతంలో చీరాల ప్రాంతంలో ఆరు బారు షాపులుండగా నష్టాల బారిన పడి రెండు మూసివేశారు. ప్రస్తుతం నాలుగు నడుస్తుండగా కూటమి ప్రభుత్వం మరో బారును అదనంగా పెంచింది. అంటే చీరాలకు ఏడు బారులను నిర్వహించాలని ప్రభుత్వ నిబంధన. దీంతో ఈ వ్యాపారం చేయలేమని ప్రభుత్వం బార్ లైసెన్స్ల విధానం మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో 17 బార్లు ఉండగా అదనంగా రెండు బార్లను గౌడ కులస్తులకు కేటాయించింది. కొన్ని సంవత్సరాలుగా బార్లను నడుపుతున్న యజమానులు కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. వైన్ షాపులకు 25 శాతం పర్సంటేజి ఇస్తామని, ఆ తర్వాత 9 శాతం మాత్రమే ఇచ్చారు. దీంతో వైన్ షాపుల యజమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో 14.5 శాతం ఇచ్చారు. మద్యం పాలసీలోనే కూటమి ప్రభుత్వం దోపిడీ, దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతుందని వాపోతున్నారు.మొదటి రోజు నిల్ -
రోగులకు సహనంతో సేవలు అందించాలి
రేపల్లె: ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు సహనంతో వైద్య సేవలను అందించాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పద్మావతి పేర్కొన్నారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు అధికంగా అయ్యేలా పనిచేయాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్త వహించి వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యశాలలో సదుపాయాలన్నీ అందుబాటులో ఉంచాలన్నారు. వైద్యశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వైద్యశాలలో రికార్డులు పరిశీలించి వివిధ రోగుల గదులను పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ సుధాకరం, వైద్యులు గణేష్, జీవన్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి పద్మావతి -
కరకట్ట భద్రతకు పటిష్ట చర్యలు
ఆర్సీ ఏఈఈ నాగేశ్వరనాయక్రేపల్లె: బలహీనంగా ఉన్న కృష్ణా కరకట్టలను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్సీ ఏఈఈ నాగేశ్వరనాయక్ చెప్పారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు వస్తున్నందన సోమవారం ఆయన ఓలేరు నుంచి లంకెవానిదెబ్బ వరకు కరకట్టను పరిశీలించారు. బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఓలేరు పల్లెపాలెం వద్ద బలహీనంగా ఉన్న కరకట్టను పటిష్ట పరిచే చర్యలు చేపట్టారు. వరద ఉధృతి పెరిగినా కరకట్టలకు ఎటువంటి ప్రమాదం వాటిల్లకుండా బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పటిష్టపరుస్తున్నట్లు చెప్పారు. ముందస్తుగా ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2009 వరదల సమయంలో కోతకు గురైన కరకట్ట ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు అధిక మొత్తంలో వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. వరద నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున కృష్ణా నదిలోకి చాపల వేటకు మత్స్యకారులు వెళ్లరాదని సూచించారు. నది పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
ద్విచక్ర వాహన దొంగలు అరెస్టు
రేపల్లె: ద్విచక్ర వాహన దుండగులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు పేర్కొన్నారు. స్థానిక కార్యాలయంలో సోమవారం దుండగుల వివరాలను వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన పట్టణంలోని రింగు రోడ్డు సెంటర్లో బొర్రా కృష్ణ తన ద్విచక్ర వాహనాన్ని సెంట్రల్ పార్కింగ్ చేసి దుకాణానికి వెళ్లాడు. తిరిగి వచ్చి చూసేసరికి తన వాహనం కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె–పెనుమూడి రోడ్డులో పోలీసులు సోమవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొల్లూరుకు చెందిన ముగ్గురు బాలురు పట్టుబడ్డారు. వారిని విచారించగా ద్విచక్ర వాహనాన్ని దొంగిలించడంతోపాటు పలు నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.9.6 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ వీరికి గతంలో నేర ప్రవృత్తి లేదని పేర్కొన్నారు. డబ్బుల కోసం ఇటువంటి నేరాలకు పాల్పడటం ప్రారంభించారన్నారు. యూట్యూబ్లో వచ్చే వివిధ అంశాలను పరిశీలించి ఈ దొంగతనాలు సులభంగా చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను గమనిస్తూ ఉండాలని చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. సమావేశంలో పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రూ.9.6 లక్షల విలువైన 10 వాహనాలు స్వాధీనం -
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర పంటలు
బల్లికురవ: ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఆరోగ్యకరమైన పంటలను పండించవచ్చని బాపట్ల జిల్లా అడిషనల్ డీపీఎం మోహన్ తెలిపారు. సోమవారం నక్కబొక్కలపాడు గ్రామంలో ఎన్పీఎం షాపులో కషాల తయారీని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. పంటల సాగులో చీడపీడల నివారణకు అవసరమైన కషాయాలను ముందుగానే తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం సాగువైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రతి రైతు తనకున్న భూమిలో కొంత భాగంలోనైనా ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరారు. మాస్టర్ ట్రైనర్ అప్పారావు, ప్రకృతివ్యవసాయ ఇన్చార్జి కల్పన ఉన్నారు. -
పల్నాడు జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్
ఉచిత ఉపకరణాలు వినియోగించుకోండి పెదకూరపాడు: ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు ప్రభుత్వం అందించే ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా సహిత విద్య సమన్వయకర్త సెల్వరాజ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష, సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. సెల్వరాజ్ మాట్లాడుతూ పెదకూరపాడు నియోజకవర్గంలో 520 మంది విద్యార్థులు భవిత పాఠశాలలో ఉన్నారని తెలిపారు. వారిలో ఉపకరణాల అవసరమైన వారికి నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్, ఆర్థోపెడిక్ సంబంధించిన ప్రత్యేక ప్రతిభావంతులను ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బందం ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన ఉపకారణాలను అందించేలా ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం డాక్టర్ నితీష్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఏకుల ప్రసాదరావు, సత్యనారాయణ, హెచ్ఎం కేవీ రమణ, స్కూల్ అసిస్టెంట్లు సుబ్బారావు, సుశితాప్రియ, లక్ష్మీనారాయణ, నూర్జహాన్, అచ్చయ్య, నసీమా బిగ్, బాబు, ఐఈఆర్పీ టీచర్లు లక్ష్మి, కమల, స్వాతి, రమాదేవి, రహీం తదితరులు పాల్గొన్నారు. -
నూతన బార్ పాలసీని సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి బి.వెంకటేశ్వర్లు బాపట్లటౌన్: నూతన బార్ పాలసీ విధానాన్ని ఆసక్తి కలిగిన వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారి బి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న 2022–2025 బార్ పాలసీను రద్దుచేసి 2025–2028 సంవత్సరాలకుగానూ నూతన బార్ పాలసీని విడుదల చేసిందన్నారు. బాపట్ల మున్సిపాలిటీ–04 , చీరాల మున్సిపాలిటీ –07, రేపల్లె మున్సిపాలిటీ–04, అద్దంకి నగర పంచాయతీ–01 చొప్పున 17 బార్ ఉన్నాయన్నారు. వీటితోపాటు గీత కులాలకు సంబంధించి బాపట్ల మున్సిపాలిటీ–01, రేపల్లె మున్సిపాలిటీ–01 రెండుతో కలిపి మొత్తం 19 బార్ ఉన్నాయన్నారు. బార్లకు కేటాయింపు పాత పద్ధతిలోని వేలం ద్వారా కాకుండా, ఏ–4 షాపులకు జరిపిన విధంగా డ్రా ఆఫ్ లాట్స్ (చీటీలు) ద్వారా జరపబడుతుందన్నారు. డ్రా ఆఫ్ లాట్స్లో పాల్గొనే అభ్యర్థులు రూ.5 లక్షల దరఖాస్తు ఫీజును, రూ.10,000 ప్రాసెస్సింగ్ ఫీజును ఆన్లైన్, ఆఫ్లైన్ హైబ్రిడ్ పద్ధతి ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులపై ఎటువంటి పరిమితి లేదని, ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చన్నారు. దరఖాస్తు సమర్పించేందుకు ఆఖరు తేదీ ఈనెల 26 వరకు గడువు ఉందన్నారు. లైసెన్స్ ఫీజును ఒకేసారి కాకుండా ఆరు సమాన వాయిదాల ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. నూతన బార్ పాలసీ ద్వారా బార్ల టైమింగ్స్ అదనంగా మూడు గంటలు పొడిగించి, ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు నడుపుకునేందుకు ప్రభుత్వం సడలింపు చేసిందన్నారు. -
పిడుగు గుట్టు.. పసిగట్టు !
రంగును బట్టి హెచ్చరికబెల్లంకొండ: వర్షాకాలం వచ్చిందంటే ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. పిడుగులు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిడుగు ఎప్పుడు పడుతుందో.. ఎలా పడుతుందో తెలియని పరిస్థితిలో ప్రమాదాలు వాటిల్లి ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది. అదేవిధంగా మెరుపుల దాటికి గృహోపకరణాలు కూడా కాలిపోతూ ఉంటాయి. పిడుగులోని కాంతి ప్రభావంతో నష్టం భారీగానే కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో పిడుగు నుంచి రక్షించుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ ఎప్పటికప్పుడు మెసేజ్ల రూపంలో హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. పిడుగుపాటును ముందే తెలుసుకోగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఈ పిడుగు ప్రమాదాన్ని ‘దామిని లైట్నింగ్ యాప్’తో అరగంట ముందే గుర్తించగలిగే అవకాశం ఉంది. ముప్పు ముందే తెలుసుకోవచ్చు పూణే కేంద్రంగా ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ (ఐఐటీఎం) నాలుగేళ్ల క్రితం ఈ యాప్ను రూపొందించింది. పిడుగుపాటును గుర్తించేందుకు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో 83 చోట్ల ప్రత్యేక సెన్సార్లను అమర్చారు. కాపర్ ఎర్త్వైర్తో ప్రమాదాలకు చెక్.. ఇంటి పరిసర ప్రాంతాల్లో పిడుగుపాటు నుంచి కాపర్ ఎర్త్ వైర్ ఏర్పాటుతో తప్పించుకునే అవకాశం ఉంది. ఇంటి ఆవరణలో కొంత ఎత్తయిన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి కాపర్ ఎర్త్ (రాగి వైర్ ను అనుసంధానం చేస్తూ భూమిలోకి పాతాలి) ఏర్పాటు చేయడం ద్వారా దాదాపుగా కిలోమీటర్ దూరంలో పడిన పిడుగును నేరుగా భూమిలోకి ఇదే ఆకర్షించుకుంటుంది. ఎర్త్ వైర్ను ఉప్పు, కర్ర బొగ్గు, నీటి మిశ్రమాలతో రాగి వైరు కలిగిన రాడ్ను భూమి లోపలికి ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. రెడ్ కలర్ : మీరు ఉన్న ప్రాంతంలో మరో ఏడు నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ ఎరుపు రంగులోకి మారుతుంది. ఎల్లో కలర్: మరో 10 నుంచి 15 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే యాప్ లోని సర్కిల్ పసుపు కలర్ లోకి మారుతుంది. నీలం కలర్ : 15 నుంచి 25 నిమిషాల్లో పిడుగు పడే అవకాశం ఉంటే ఆ సర్కిల్ బ్లూ కలర్లోకి మారిపోతుంది. వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా పనులు ఆపుకొంటే మంచిది. అత్యవసర పనులు ఉండి వర్షంలో బయటకు వెళ్లిన సమయంలో దామిని లైటింగ్ యాప్ ఉపయోగించి పిడుగు ఎక్కడ పడుతుందో.. ఏ సమయంలో పడుతుందో పసికట్టవచ్చు. తద్వారా ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ఉండవచ్చు. – ప్రవీణ్ కుమార్, తహసిల్దార్, బెల్లంకొండ -
రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన కూటమి ప్రభుత్వం
లక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో రూ.1.75 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీపీఐ గుంటూరు జిల్లా 26వ మహాసభలు ఆదివారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. తొలుత బీఆర్ స్టేడియం నుంచి సీపీఐ జిల్లా కార్యాలయం వరకు ప్రజాప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ సంవత్సర కాలంలో 21 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్–6 హామీలన్నీ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. నూతన బస్సులు కొనుగోలు చేయకుండా, తగిన సిబ్బంది నియామకం జరగకుండా మహిళలకు ఉచిత బస్సు పథకం వలన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని తాము చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. రాజధానికి మరో 40 వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. లూలూ కంపెనీకి రూ.400 కోట్ల విలువైన భూములను 99 సంవత్సరాలపాటు లీజుకు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. 2029 నాటికి పేదరికం పోతుందని చంద్రబాబు చెబుతున్నారని, ఇటువంటి విధానాలతో పాలన చేస్తే 1000 ఏళ్లకు కూడా పేదరికం పోదని స్పష్టం చేశారు. ఒంగోలులో ఈనెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న రాష్ట్ర మహాసభలకు గుంటూరు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని విస్మరించి, అసలు పోరాటంలో భాగస్వాములు కాని ఆర్ఎస్ఎస్ వారి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దొంగ ఓట్లు– దొంగ నోట్ల రాజ్యం ప్రస్తుతం దేశంలో నడుస్తోందని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశ ప్రజలకు ఆయుధంగా ఇచ్చిన ఓటు హక్కును రద్దు చేస్తున్నారన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై దేశమంతా చర్చ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, పవన్, దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు. జాతీయ ఎన్నికల కమిషన్ కూడా బీజేపీతో లాలూచీ పడిందని, సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటే గాని ఓటర్ లిస్టు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర వేశారని విమర్శించారు. మోదీ పాలనలో అంబానీ, అదాని వంటి కార్పొరేట్ వర్గాలు, పెట్టుబడిదారులు ప్రపంచ కుబేరులుగా ఎదిగారని దుయ్యబట్టారు. అనంతరం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, నగర కార్యదర్శి అరుణ్కుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.రామకృష్ణ పార్టీ జిల్లా మహాసభలు ప్రారంభం -
కృష్ణ రివర్ క్రాస్ స్విమ్మింగ్ పోటీలు
తాడేపల్లిరూరల్: ఉండవల్లి అమరావతి కరకట్టపై గల ఆక్వా డెవిల్స్ అసోసియేషన్లో సిమ్మింగ్ కాంపిటేషన్ను ఆదివారం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపల్లి రామకృష్ణ మాట్లాడుతూ ఆడ్వా డెవిల్స్ ప్రాంగణంలో ఉన్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని పలు సముద్రాలను ఈదుతున్న క్వీన్ విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్లు 1.5 కి.మీ. కృష్ణ రివర్ క్రాస్ స్విమ్మింగ్ కాంపిటేషన్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రపంచంలోని ఏడు సముద్రపు చానల్స్లో భాగంగా రెండవది అయిన అమెరికాలోని మెయిన్ ల్యాండ్ నుంచి సౌత్ కాలిఫోర్నియా బీచ్ వరకు 33.5 కి.మీ స్విమ్మింగ్ చేయడానికి సెప్టెంబర్ నెలలో వెళ్తున్న సందర్భంగా ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం అసోసియేషన్ లైఫ్ చైర్మన్ గోకరాజు గంగరాజు సూచన మేరకు వారికి రూ. 25,116 చెక్కును అందజేశారు. అసోసియేషన్ కార్యదర్శి వై.వి. రమేష్ కుమార్మాట్లాడుతూ క్వీన్ విక్టోరియా తన పిల్లలను శిక్షణ శిబిరంలో చేర్పించి, తాను కూడా పిల్లలతో పాటు ఈత నేర్చుకుని మాస్టర్ స్విమ్మింగ్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఆక్వా డెవిల్స్ ప్రాంగణంలో ఉన్న కృష్ణానదిలో ఓపెన్ వాటర్లో ప్రాక్టీస్ చేసి ప్రపంచంలోని సముద్రాలను ఈదుతున్న మొట్టమొదటి తెలుగు మహిళ , ఆమె కుమారుడు ఆక్వా డెవిల్స్ గౌరవ సభ్యులు కావడం గర్వకారణమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోపాలం సాంబశివరావు, సహాయ కార్యదర్శి ఎ.రామిరెడ్డి, కోశాధికారి కె.వి.రామయ్య, కార్యవర్గ సభ్యులు కె.సాంబశివరాజు, యర్రంశెట్టి శ్రీనివాసరావు, కర్రిసాంబయ్య, పి.శ్రీనివాసులు, కె.ఆశీర్వాదం, అబ్దుల్ గఫూర్ తదితరులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్ కుమార్లను అభినం దించారు.ఈత పోటీల్లో ప్రతిభ చూపుతున్న తల్లీకుమారులు క్వీన్ విక్టోరియా, స్టీఫెన్కుమార్లకు ఘనసన్మానం -
మరాఠా కల్యాణం.కామ్ వెబ్సైట్ ప్రారంభం
గుంటూరు మెడికల్: మరాఠా రాష్ట్ర సంఘం –ఆంధ్ర ప్రదేశ్ రిజిస్టర్డ్ కమిటీ రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం గుంటూరు అరండల్పేటలో జరిగింది. సమావేశంలో సంఘం లక్ష్యాలు, గత ఏడాది కాలంలో చేసిన పనులు గురించి చర్చించారు. మరాఠా రాష్ట్ర సంఘం ఏపీ శాఖ అధికారిక చిహ్నం(లోగో)ను సంఘం గౌరవ అధ్యక్షుడు గంగాధరరావు తెన్నేటి ఆవిష్కరించారు. మరాఠాల వివాహ సంబంధాల విషయంలో ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను సంఘం గమనించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మరాఠా కల్యాణం.కామ్ వెబ్సైట్ను సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు సింధే రవిచంద్రరావు, ఉపాధ్యక్షుడు కదం శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అన్ని భాషల్లో రూపొందించిన ఈ వెబ్సైట్ సేవలు దేశంలోని మరాఠాలు అందరూ ఉచితంగా పొందవచ్చునని మరాఠా రాష్ట్ర సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మరాఠా వెంకట్ సోమాజీ తెలిపారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారులు వెంకటేశ్వరరావు డుమ్నే, ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు మోతే, సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లోజి జాదవ్, సెక్రెటరీ హరినాథ్రావు జాదవ్, జాయింట్ సెక్రటరీ శంకరరావు మోరే, ఉప కోశాధికారి కదం రామచంద్రుడు పాల్గొన్నారు. -
భర్త రెండో పెళ్లిపై భార్య ఫిర్యాదు
తెనాలి రూరల్: భార్యకు విడాకులివ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్న భర్తపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన లింగంశెట్టి ఉమామహేశ్వరరావు 2003లో భూలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు విడాకులివ్వకుండానే 2012లో మరో మహిళను వివాహం చేసుకోగా ఇద్దరు కుమార్తెలు కలిగారు. రెండో భార్య కుమార్తెల పేరున ఉమామహేశ్వరరావు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు తీసుకుని ఆస్తి రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేయించాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య భూలక్ష్మి ఆధారాలతో పోలీసును ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు.ఆటో: ద్విచక్ర వాహనం ఢీపెదకూరపాడు: ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు గాయపడిన సంఘటన మండలంలోని పెదకూరపాడు– లింగంగుంట్ల మధ్య ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పాటిబండ్లకు చెందిన మన్నవ జోసఫ్, జలాల్పురం గ్రామానికి చెందిన మన్నవ కిరణ్లు పెదకూరపాడు వచ్చి తిరిగి వెళుతున్నారు. ఇదే సమయంలో పొడపాడు నుంచి ఆటోలో ప్రయాణికులతో సారెకుక్క జోసఫ్ పెదకూరపాడు వస్తున్నాడు. ఈ క్రమంలో పెదకూరపాడు–లింగంగుంట్ల వద్ద మూల మలుపులో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న జోసఫ్, కిరణ్లు నాలుగు అడుగులు మేర ఎత్తుకు ఎగిరి రోడ్డుపై పడ్డారు. జోసఫ్కు తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కిరణ్ తలకు బలమైన గాయం కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఆటో డ్రైవర్ సారెకుక్క జోసఫ్కు కూడా గాయాలయ్యాయి. ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో గాయపడిన వారిని పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరుకు తరలించారు. ఇందులో కిరణ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఎన్ఆర్ఐ మహిళ బ్యాగ్ చోరీపట్నంబజారు: ఎన్ఆర్ఐ మహిళ బ్యాగ్ చోరీ అయిన ఘటన గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో ఆదివారం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం ప్రకారం.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళ గుంటూరుకు చేరుకున్నారు. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో దిగిన తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమె బ్యాగ్ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పాత గుంటూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. సుమారు పాతిక సవర్లకు పైగా, పెద్ద ఎత్తున నగదు దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని పాత గుంటూరు పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఏ ఒక్కరికీ తెలియకుండా, మీడియాకు సమాచారం తెలియకుండా దాచిపెట్టారు. ఇప్పటికే పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది రోజుల్లో భారీ చోరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధికారులు సమాచారాన్ని మీడియాకు తెలియకుండా దాచి ఉంచారని సమాచారం. -
తుంగభద్ర డ్రెయిన్లో కొట్టుకుపోయిన యువకుడు
చుండూరు( వేమూరు): తుంగభద్ర డ్రెయిన్లో యువకుడు కొట్టుకుపోయిన ఘటన ఆదివారం ఉదయం మండలంలోని దుండిపాలెంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..చుండూరు మండలంలోని దుండిపాలెం గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రశాంత రాజు (20) ఉదయం కాళ్లు శుభ్రం చేసేందుకు తుంగభద్ర డ్రెయిన్ వద్దకు వెళ్లాడు. ఈ సమయంలో జారి మునిగి పోయాడు. రేపల్లె ఆర్డీవో, చుండూరు మండలం తహసీల్దారు సంఘటన స్థలం వద్దకు వచ్చారు. వెంటనే గజ ఈతగాళ్లను పిలిపించి వెతికించినా, ప్రశాంత రాజు ఆచూకీ దొరకలేదు. సోమవారం కూడా వెదకడం ప్రారంభిస్తామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
నాగార్జునకొండలో పర్యాటకుల సందడి
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండను ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్దఎత్తున చేరుకున్నారు. స్థానిక లాంచీస్టేషన్ నుంచి నాగార్జునకొండకు నాగసిరి లాంచీ, శాంతిసిరి లాంచీలలో వెళ్లారు. అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, యాంపీ స్టేడియం, శ్రీ రంగనాథస్వామి దేవాలయాలను సందర్శించారు. అనంతరం ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. పర్యాటకులు నాగార్జునకొండను సందర్శించటంతో లాంచీస్టేషన్కు రూ.1,88,150 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. అచ్చంపేట: ఎగువ నాగార్జునసాగర్, కృష్ణానదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఆదివారం సాయంత్రం ఏడు గంటల వరకు పులిచింతల ప్రాజెక్టుకు 2,08,330 క్యూసెక్కులు వచ్చి చేరింది. దిగువకు ఆరు క్రస్ట్ గేట్ల ద్వారా 1,93,855 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 38.4077 టీఎంసీలు ఉంది. నిత్యాన్నదానానికి విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన కందుల లక్ష్మణరావు కుటుంబం ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన కందుల లక్ష్మణరావు, విజయ వెంకట లక్ష్మి, కుమారుడు, కోడలు రామప్రసాద్, ప్రభాచంద్ర, మనవడు, మనవరాలి పేరిట రూ. 1,00,116 విరాళాన్ని నిత్యాన్నదానానికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం నిండిపోయింది. శ్రావణమాసం ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు ఉభయ రాష్ట్రాలతోపాటు సుదూర స్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. రొంపిచర్ల: రొంపిచర్ల సమీపంలోని శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్ హైవేపై ఆదివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించింది. సుబ్బయ్యపాలెం క్రాస్రోడ్పై భారీ లారీలో డీజిల్ అయిపోయి మరమ్మతులకు గురైంది. దీంతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రాత్రి 7.30 నుంచి 9.30 గంటల వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. స్థానిక పోలీస్స్టేషన్కు కూడా వాహన చోదకులు సమాచారం అందించారు. ఎవరూ స్పందించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఉమ్మడి జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వంశీకృష్ణారెడ్డి
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లిథమ్ ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ ఈ.వంశీకృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి జిల్లా ముఖ్య శిక్షణ అధికారి పి. నర్సింహారెడ్డి పర్యవేక్షణ అధికారిగా క్రీడా కోడ్– 2011 అనుసరించి ఎన్నికల నిర్వహించడానికి నిర్ణ యించారు. సమావేశానికి సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుగా జి.కృష్ణకిశోర్రెడ్డి, పి.శివపార్వతి వ్యవహరించారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి. రమ ణ, రాష్ట్ర ఎగ్జిక్యూ టివ్ మెంబర్ బి.లక్ష్మీప్రసన్న పర్యవేక్షణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా న్యాయవాది ఎస్.వి. రమణారెడ్డి వ్యవహరించారు.ఉమ్మడిగుంటూ రు జిల్లా అమెచ్యూర్ సాఫ్ట్ బాల్ నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా ఈ. వంశీకృష్ణా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సంతోష్ ప్రభుకుమార్, కార్యదర్శిగా పి. సామంత్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా నర్రా శ్రీనివాస్, కోశాధికారిగా ఏ. జనార్దన్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వి.శబరినాథ్, పి. శివపార్వతి, బి. యామిని, వై. రంజాన్బీలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న కార్యవర్గాన్ని పూలమాలలు, దుశ్శాలువలతో సత్కరించారు. -
పచ్చ నేతల కర్ర పెత్తనం
బాపట్లసోమవారం శ్రీ 18 శ్రీ ఆగస్టు శ్రీ 2025నియోజకవర్గంలో 146 దుకాణాలు డీలర్లపై పగ ఉదాహరణలు ఎన్నో.. మాకే ప్రొటోకాల్ ఇవ్వాలి 7 గ్రామాల్లో యథేచ్ఛగా దందా రేషన్ డీలర్లకు బెదిరింపులు అధికారులతో కేసులు నమోదు నియోజకవర్గంలో 40 షాపుల పైగా 6– ఏ కేసులు ఒక్కో దుకాణదారుడు రూ.1.50 లక్షలు ఇవ్వాలంటూ హుకుం పంచాయతీ కార్యాలయాల్లో తిష్ట అధికారులకు ఆదేశాలు జారీ నరసరావుపేట: స్థానిక కోటబజార్లో గల మహాలక్ష్మమ్మచెట్టు వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. మహిళలు జలబిందెలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పూజలు చేశారు. కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది.శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామంలో పోలేరమ్మకు ఆదివారం బోనాలు ఘనంగా సమర్పించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తెచ్చారు.తాడేపల్లి రూరల్: మంగళగిరి మండలం ఆత్మకూరులో గంగానమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. అమ్మవారికి 101 బిందెలతో జలాభిషేకం నిర్వహించారు. -
మోటార్ బైక్ను ఢీకొట్టిన టూరిస్టు బస్సు
వేటపాలెం: రోడ్డు పక్కన ఆగి ఉన్న మోటార్ బైక్ను వెనక నుంచి వచ్చిన టూరిస్టు బస్ ఢీకొట్టిన సంఘంటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. జాతీయ రహదారి 216 బైపాస్ రోడ్డులో పొట్టి సుబ్బయ్యపాలెం జంక్షన్ వద్ద ఆదివారం సంఘటన చోటు చేసుకుంది. తెనాలి వైపు నుంచి నెల్లూరు వెళుతున్న టూరిస్టు బస్ జంక్షన్ వద్ద రోడ్డు పక్కన బైక్ ఆపుకుని ఉన్న రాపూరి బాలాజీ, డేవిడ్లను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు ఎగిరి రోడ్డుపై పడటంతో తలలకు గాయాలయ్యాయి. స్థానికులు 104కు సమాచారం ఇవ్వగా, యువకులను అంబులెన్స్లో చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్ బాపట్లలో నిర్వహణరాష్ట్ర అధ్యక్షుడు షేక్ లాల్వజీర్గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్ను త్వరలో బాపట్లలో నిర్వహిస్తామని రాష్ట్ర అధ్యక్షుడు షేక్ లాల్వజీర్ తెలిపారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈసీ మీటింగ్లో వజీర్ మాట్లాడుతూ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వెటరన్స్ అథ్లెటిక్ మీట్కు శాప్ నుంచి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తామన్నారు. సీనియర్ అథ్లెట్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర పోటీల్లో విజేతలను త్వరలో రాజస్తాన్లోని అజ్మీర్లో జరగనున్న జాతీయ పోటీలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో మాదిలేటి రెడ్డి, నజీర్, గిరి, డాక్టర్ పురుషోత్తం, నగేష్ ఖన్నా, లక్ష్మి, మల్లికా తదితరులు పాల్గొన్నారు.కరాటేలో మంగళగిరి క్రీడాకారుల ప్రతిభమంగళగిరి టౌన్: ఆల్ ఇండియా కరాటే చాంపియన్ షిప్–2025 పోటీల్లో మంగళగిరికి చెందిన క్రీడాకారులు ప్రతిభ చాటారని కోచ్ డి.ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సిద్ధ్దార్థ కరాటే అకాడమీ ఒంగోలులో నిర్వహించిన 43 యూనివర్సిటీ ఆల్ ఇండియా ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో ఆదివారం మంగళగిరికి చెందిన క్రీడాకారులు పోటీలలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అండర్–10 విభాగంలో హర్ష గోల్డ్ మెడల్, జయదేవ్ బ్రాంజ్ మెడల్, అండర్–9 విభాగంలో నిఖిలేష్ బ్రాంజ్ మెడల్, అండర్–7 విభాగంలో ఈశ్వర్ బ్రాంజ్ మెడల్, అండర్–14 విభాగంలో చరణ్ బ్రాంజ్ మెడల్ సాధించారని తెలిపారు. బాలికల అండర్–7 విభాగంలో శ్రీవల్లి సిల్వర్ మెడల్, శ్రీదుర్తి బ్రాంజ్ మెడల్, అండర్–9 బాలికల విభాగంలో ఉపజ్ఞ సిల్వర్ మెడల్ కై వసం చేసుకున్నట్లు తెలిపారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను మంగళగిరి ఎంఎంకే స్టేడియం ప్రతినిధులు అభినందించారు. -
ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు చేతుల్లో పెట్టొద్దు!
బాపట్ల: ఆర్టీసీ స్థలాన్ని షాపింగ్ మాల్స్కు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 137ను వెంటనే రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.టి.వలి డిమాండ్ చేశారు. బాపట్లలోని ప్రభుత్వ పెన్షనర్స్ బిల్డింగ్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోవడం కోసం అన్ని సంఘాలు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజా రవాణా సంస్థ ఆస్తులను ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేయడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. విజయవాడ నగర నడిబొడ్డునున్న గవర్నర్పేట డిపోలు, పాత బస్టాండ్కు చెందిన నాలుగు ఎకరాల స్థలం సుమారు రూ.400 కోట్ల విలువ చేస్తుందని, దాన్ని లులు షాపింగ్ మాల్కు అప్పగించడం ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రెండు డిపోల్లో 200 బస్సులు, 1100 మంది ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా ప్రైవేట్ వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చడాన్ని ప్రజలు సహించరని వలి విమర్శించారు.బాపట్ల జిల్లా మాజీ కార్యదర్శి వై.ఎస్. రావు మాట్లాడుతూ 1959లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించిన గజం రూ.16 ధరతో, సుమారు రూ.4.60 లక్షలకు ఆర్టీసీ యాజమాన్యం ఈ భూమిని కొనుగోలు చేసిందని గుర్తు చేశారు. ఇంత విలువైన ప్రజా ఆస్తిని కొద్ది మంది వ్యాపారవేత్తల చేతుల్లోకి ఇవ్వడం చరిత్రలోనే పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. సమావేశంలో బాపట్ల జిల్లా కార్యదర్శి పి.కమలాకర్రావు, నెల్లూరు జోనల్ మహిళా నాయకురాలు పి. రజిని, ఎం.పి. కుమార్, బాపట్ల జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. చింపనయ్య, బాపట్ల డిపో ప్రెసిడెంట్ టి. చంద్రశేఖర్, సెక్రటరీ వై.ఎన్. రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ.ఎస్.రావు పాల్గొన్నారు.ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.టి.వలి -
గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
వినుకొండ: గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్తో అ సెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. వినుకొండ జాషువా కళా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి, గిరిజన హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా నేటికీ రాష్ట్రంలో లక్షలాది మంది గిరిజనులు కనీసం కూడు, గూడు, నీడ లేక పరితపిస్తున్నారని తెలి పారు. ఇప్పటికీ రేషన్, ఆధార్ కార్డులు లేక దుర్భర మైన జీవితాలు గడుపుతున్నారని పేర్కొన్నారు. నేటికి ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరం అవుతున్నారని చెప్పారు. గిరిజనుల అభ్యున్నతికి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయలు నిధులు దారి మళ్లించకుండా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, బీఎస్పీ కార్యదర్శి రాజు, పల్నాడు జిల్లా యువజన నాయకుడు జరపల కృష్ణా నాయక్, యువజన అధ్యక్షుడు హనుమంతు నాయక్, పల్నాడు జిల్లా అధ్యక్షుడు రంగ నాయక్, గౌరవ అధ్యక్షుడు విష్ణు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నేత బాలాజీ నాయక్, డాక్టర్ కోటేశ్వరరావు నాయక్, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్, మాచర్ల జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సామి, రేమిడిచర్ల సర్పంచ్ బ్రహ్మం, రాంజీ నాయక్, వివిధ సంఘాల నేతలు హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశంలో గిరిజన సంఘాల నేతలు తీర్మానం మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతోందని.. -
మచ్చుకై నా కనిపించని ‘క్రమశిక్షణ’
సంబంధం లేని వారిపై చర్యలకు సిద్ధం ఉద్యోగుల ప్రయోజనాలకు గండి జీజీహెచ్కు జనవరిలో వచ్చిన ఫైల్ జూలై నెలలో ప్రత్యక్షం క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఫైల్ తొక్కిపెట్టిన వైనం ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు ఒకరికి బదులు మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు యత్నం -
ఆటోకు ఉచిత దెబ్బ
డిగ్రీలు చదివినా ప్రభుత్వ ఉద్యోగాలు రాక కొందరు...చదువు లేక మరికొందరు ఆటోలను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఆర్థిక స్థోమత లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఆటో కొనుగోలు చేస్తున్నారు. నెలనెలా ఈఎంఐలు చెల్లిస్తూ మిగిలిన సొమ్మును కుటుంబాలను నడుపుతున్నారు. మరికొందరు ఆటోలు అద్దెకు తీసుకుని నడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దీంతో ఆటోవాలాల ఉపాధికి దెబ్బతగిలింది. ఎన్నికల సమయంలో ఆటోవాలాలకు ఏడాదికి రూ.15000 ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు దాని ఊసే ఎత్తడం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై డ్రైవర్లు మండిపడుతున్నారు. బాపట్ల అర్బన్: కూటమి ప్రభుత్వం సీ్త్ర శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఆటో డ్రైవర్లలో ఆందోళన మొదలైంది. సీ్త్ర శక్తి పథకం తమ ఉపాధిని దెబ్బతీసేలా ఉందని భయపడుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేశామని, రేపటి నుంచి అప్పులు ఎలా తీర్చాలని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 30 వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వీటిపై ఆధారపడి జీవించే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. 14 నెలలైనా అమలు కాని హామీ తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.15000 ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆర్థిక సాయంతోపాటు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మబలికింది. అధికారం చేపట్టి 14 నెలలు అవుతున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. అమలు చేస్తామని స్పష్టమైన హామీ లేదు. దీనికితోడు సంక్షేమ బోర్డు మాటే ఎత్తటం లేదు. తక్కువ వడ్డీతో ఆటోలకు రుణాలు ఇస్తామని హామీకి అతీగతి లేదు. సీ్త్ర శక్తి పథకం అమలు చేయడంతో ఆటో కార్మికులు జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో ఫైనాన్న్స్ చెల్లించలేని పరిస్థితి వస్తుందని వాపోతున్నారు. -
ధైర్యానికి దిశ.. ‘శక్తి’తో నిరాశ
ఆడబిడ్డకు అండగా నిలవాలనే ధ్యేయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ‘దిశ’.. ఆపన్నుల గుండెల్లో ధైర్యం నింపింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనతో రూపుదిద్దుకున్న యాప్తో ఎందరో రక్షణ పొందారు. కానీ నేడు కూటమి పాలకులు తెచ్చిన ‘శక్తి’ యాప్తో భరోసా కాదు కదా.. కనీసం యాప్ ఉన్న విషయం కూడా చాలామందికి తెలియదు. పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో దిశ పోలీసు స్టేషన్లను ప్రారంభించి, యాప్ అందుబాటులోకి తెచ్చారు. మహిళలు, యువతులు, బాలికలు తమ సమస్యలు చెబితే తక్షణ సాయం అందేది. సేవ్ అవర్ సోల్స్ (ఎస్వోఎస్)కు కాల్ చేస్తే క్షణాల్లో పోలీసులు రక్షించారు. కాకాని రోడ్డులో ఒక దుర్మార్గుడి చేతిలో హత్యకు గురైన బీటెక్ విద్యార్ధిని రమ్య కేసులో అప్పటి స్టేషన్ ఎస్హెచ్వో కె. వాసు కేవలం 20 రోజులలోపు చార్జిషీటు దాఖలు చేశారు. ఏడు నెలల్లో నిందితుడికి ఉరిశిక్ష పడింది. ప్రత్యేక కోర్టుల ద్వారా ఈ శిక్ష పడేలా చేశారు. మైనర్లపై అత్యాచారాలకు ఒడిగట్టిన వారికి శిక్షలు పడేలా చర్యలు చేపట్టారు. దిశ యాప్ ప్రారంభంమైన నాటి నుంచి 2024 ఎన్నికల వరకు 1.30 కోట్ల మందికిపైగానే సేవలను వినియోగించుకున్నారు. గుంటూరు రేంజ్ పరిధిలో 11.13 లక్షల మంది సేవలు పొందారు. దిశ ఎస్ఓఎస్ ఫోన్కాల్స్ అందుకున్న వెంటనే 2,300 మందిని ఆపద నుంచి రక్షించారు. 403 మందిని ఇంటికి సురక్షితంగా చేర్చారు. దిశ యాప్నకు సంబంధించి నమోదు అయిన కేసుల్లో 96 శాతం చార్జీషీట్లు నిర్ణీత వ్యవధిలో కోర్టుకు సమర్పించారు. సగటున బాధితుల నుంచి 60 నుంచి 70 ఫోన్ కాల్స్ వచ్చేవని అధికారులు చెప్పారు. జిల్లా ‘దిశ’ ఎస్ఓఎస్ కాల్స్ ఎఫ్ఐఆర్ నమోదు/ చర్యలు తీసుకున్నవిగుంటూరు 78,724 1,781 బాపట్ల 14,600 883 పల్నాడు 15,171 1,105 రక్షణ చర్యలు తీసుకుంటాం నిత్యం కళాశాలల వద్ద రక్షక్ వాహనాలు ఏర్పాటు చేస్తాం. ఆకతాయిలపై దృష్టి సారించి వారిపై తగిన కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే సిబ్బందిని ఉమెన్స్ కళాశాల వద్ద ఉదయం, సాయంత్రం సమయాల్లో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించాం. అవసరమైతే స్వయంగా పరిశీలనకు వెళ్తా. యువతులు, మహిళలు, బాలికల రక్షణకు చర్యలు తీసుకుంటాం. – షేక్ అబ్దుల్ అజీజ్, డీఎస్పీ, గుంటూరు ఈస్ట్ -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగంలో పల్నాడు నేతలకు చోటు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ఇరువురు నాయకులను పార్టీ రాష్ట్ర విభాగంలో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇరిగిదిండ్ల లాజర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ సంయుక్త కార్యదర్శిగా, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకర్గానికి చెందిన షేక్ దస్తగిరిని రాష్ట్ర బీసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.ఆర్టీయూసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఏడుకొండలుభట్టిప్రోలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్టీయూసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా వేమూరుకు చెందిన బొల్లిముంత ఏడుకొండలును నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఏడుకొండలు నియామకం కోసం వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు కృషి చేశారు. ఏడుకొండలు నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
గుడ్లూరు: ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి కావేరి ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో బస్సులో ఉన్న క్లీనర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున తెట్టు ఓవరు బ్రిడ్జి దగ్గర జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనరు ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందాడు. మృతుడు సంతోష్ది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామం. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. క్లీనరు మృతి -
ఆదమరిస్తే అంతే సంగతులు
బల్లికురవ: సాగర్ కాలువకు నీటి విడుదల సమయంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం సమస్యగా మారింది. డైవర్షన్ రోడ్డులో వర్షం కురిసిన సమయంలో జారుడు బల్లలా మారుతోంది. ఆదమరిస్తే 20 అడుగుల లోతులో ఉన్న కాలువలో పడాల్సిందే. బల్లికురవ– అద్దంకి ఆర్అండ్బీ రోడ్డులోని వల్లాపల్లి–ధర్మవరం గ్రామం మధ్య అద్దంకి బ్రాంచ్ కాలువ 33/0 వద్ద.. గతంలో ఉన్న పాత బ్రిడ్జి స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.65 కోట్లు జూన్ మాసాంతంలో మంజూరయ్యాయి. ఇప్పటికీ పనులు పూర్తికాకపోవడంతోపాటు సాగర్ కాలువ నీటి విడుదలతో కొంత జాప్యం జరిగింది. డైవర్షన్ రోడ్డుకు బురద మట్టి తోలడంతో పాటు గ్రానైట్ ఎగమతి చేసే ఖాళీ భారీ వాహనాలు కూడా ఈ డైవర్షన్ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగించడంతో గోతులు ఏర్పడ్డాయి. భారీ వాహనాల రాకపోకలు నిషేధం అంటూ బల్లికురవ అద్దంకి, అంబడిపూడి వద్ద బోర్డులు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇప్పటికై నా పనులు వేగవంతం చేయడంతో పాటు డైవర్షన్ రోడ్డులో ఏర్పడ్డ గోతులకు ఎర్రమట్టి తోలి రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని వాహన చోదకులు, ప్రజలు వేడుకుంటున్నారు.వల్లాపల్లి వద్ద డైవర్షన్ రోడ్డులో పొంచి ఉన్న ప్రమాదం -
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళి నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాకుళంలో జన్మించిన సర్దార్ గౌతు లచ్చన్న భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ గౌరవం పొందిన ఏకై క వ్యక్తి అన్నారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు ప్రజలిచ్చిన బిరుదు సర్దార్ అని తెలిపారు. జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. బడుగువర్గ పోరాట జీవిగా లచ్చన్న చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(పరిపాలన), ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఎంటీ ఆర్ఐ ఎస్.కృష్ణ, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ -
వ్యవసాయ శాఖ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ మూత
వేమూరు: రైతులు సాగు చేస్తున్న పంటలకు వాడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను పరీక్ష చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను కూటమి ప్రభుత్వం మూత వేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే వేమూరు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డులో ల్యాబ్ను నిర్మించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరిశీలించేందుకు ఇద్దరు విస్తరణాధికారులను నియమించారు. 2023– 2024 వరకు ప్రభుత్వం అందిస్తున్న ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు టెస్టింగ్ ల్యాబ్ ద్వారా పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను మూత వేసేందుకు కుట్ర పన్నింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు టెస్టింగ్ ల్యాబ్కు రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు మూత వేశారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ను తెరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.పొగాకు సక్రమంగా కొనుగోలు జరిగేలా చూడాలిజె.పంగులూరు: వర్షాకాలం వచ్చిందని నల్లబర్లీ పొగాకు సక్రమంగా కొనుగోలు జరిగేలా చూడాలని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు ప్రభుత్వాన్ని కోరారు. పంగులూరు గ్రామంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రామారావు మాట్లాడారు. రైతులు ఇప్పటికే పొగాకు మడేలు కట్టి సుమారు ఆరు నెలలైందని, పొగాకు నాణ్యత లోపించిందని తెలిపారు. మార్క్ఫెడ్ అధికారులు కూడా నాణ్యత ప్రమాణాలు బట్టి క్వింటా పొగాకు రూ.6 వేలు నుంచి రూ.9 వేలకు మించి కొనుగోలు చేయడం లేదని అన్నారు. 30 శాతం వరకు పొగాకు బేళ్లు రిజెక్ట్ చేస్తున్నారని, తద్వారా రైతులు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు నష్టపోతున్నారన్నారు. గ్రామాల్లో కొంత మంది రైతుల పేర్లు రాక, మండెలు అలానే ఉన్నాయని, స్టాక్ గోదాంలు లేవని ఈ వారం కొనుగోలు నిలిపివేశారన్నారు. మొదట ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు జరపాలని, అక్కడి నుంచి మార్కెఫెడ్ వారు వేరే ప్రాంతాలను తరలించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు నష్టపోయారని.. దూరప్రాంతాలకు పొగాకు బేళ్లు తీసుకురావాలని కోరడం భావ్యం కాదని, ప్రభుత్వమే ఖర్చు భరించాలని కోరారు. కొనుగోలు ప్రారంభించి సుమారు 60 రోజులైనా ఇంతవరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారని, ఆ హామీ అమలు కాలేదని రామారావు అన్నారు. -
రైతులు, కౌలురైతులను ఆదుకోవాలి
బాపట్ల: అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య పేర్కొన్నారు. బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ శాఖా కార్యదర్శులు, పట్టణ, మండల కమిటీ సభ్యుల జిల్లాస్థాయి తరగతులు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షతన శనివారం జరిగాయి. గంగయ్య మాట్లాడుతూ వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు. దీనివల్ల రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎక్కువ చోట్ల వరిని వెద పెట్టడం వల్ల నీట మునిగి నష్టపోయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులతో పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి మైక్రో ఫైనాన్స్ సంస్థలపై నిఘా ఉంచి పేదలను దోపిడీ చేసిన వారిపై చర్య తీసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని అన్నారు. పార్టీ జిల్లా నాయకులు సీహెచ్ మజుంధర్, ఎం వసంతరావు, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య -
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
● జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి ● దొడ్లేరు గ్రామంలో పర్యటన దొడ్లేరు(క్రోసూరు): ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అధికారులను ఆదేశించా రు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ప్రభా విత ప్రాంతమైన మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని శనివారం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ బి.రవి సందర్శించారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్తో కలసి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లను పరిశీలించారు. వరద ప్రభా విత ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలను, ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. గర్భిణులు, పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల ఉధృతి పెరగకుండా మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయించారు. హసనాబాద్ రోడ్డులో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని పరిశీలించారు. ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మొగల్ సుభాన్బేగ్ ఉన్నారు. -
రిటైర్డ్ పోలీసు అధికారి వెంకటేశ్వర్లుకు సర్వీసు అవార్డు
బాపట్ల: రిటైర్డ్ పోలీసు అధికారి అద్దంకి వెంకటేశ్వర్లు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి పోలీస్ మెడల్ ఫర్ మెమోరియస్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకటేశ్వర్లు ఒంగోలు పీటీసీలో ఎస్ఐగా ఉద్యోగ విరమణ చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పులిగడ్డవారిపాలేనికి చెందిన ఆయన కానిస్టేబుల్గా 1983లో చేరి, అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగ సమయంలో 205 రివార్డులతోపాటు ఉత్తమ సేవా పతకం, సెంట్రల్ హోం మినిస్టర్ మెడల్, ఇండియన్న్పోలీస్ మెడల్ అందుకున్నారు. ముఖ్యంగా లాలాపేటలో దొంగనోట్ల కేసు, గోల్డ్ కుంభకోణం, ఎర్ర చందనం వంటి పలు కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేశారు. పల్నాడు ప్రాంతంలో పనిచేసిన కాలంలో నక్సలైట్ల కేసులో చురుకుగా పనిచేసి పలువురిని అరెస్ట్ చేశారు. పేద విద్యార్థులకు సాయం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి వారి భవిష్యత్కు వెంకటేశ్వర్లు బంగారు బాట వేశారు. పలువురు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. 2003లో మెట్టగౌడపాలేనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దత్తత తీసుకుని పూర్తిగా ఆర్థిక సాయం అందించారు. 2012లో ఐలవరంలో ఇంటర్ విద్యార్థికి ఆర్థిక సాయం, భట్టిప్రోలులో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో వెల్లటూరులో తండ్రి అప్పుల ఊబిలో చిక్కుకుని చనిపోతే కూతురుని చదివించారు. ప్రస్తుతం ఆమె పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. 2018లో దాచేపల్లిలో ఓ బాలికను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించి, మానవత్వం చాటుకున్న పోలీస్గా నిలిచారు. -
సగర్వం.. మురిసె త్రివర్ణం
బాపట్లశనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20257అమరావతి: స్థానిక గ్రామ దేవత పెద్దింటమ్మ గుడిలో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మ వారిని గాజులతో వైభవంగా అలంకరించారు. అనంతరం పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో శుక్రవారం పద్మావతి అమ్మవారికి సారె సమర్పించారు. సత్తెనపల్లి: త్రిశక్తి దుర్గాపీఠం 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారంతో ఘనంగా ముగిశాయి. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాపట్ల: జిల్లా చరిత్ర, వైభవాన్ని తెలియజేసేలా రూపొందిన ప్రత్యేక గీతాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళిలు కలసి స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆవిష్కరించారు. జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కలెక్టర్ రచయితలకు పోటీలు నిర్వహించారు. అందులో నందిరాజు విజయ్ కుమార్ రచించిన గీతాన్ని ఉత్తమ గీతంగా ఎంపిక చేశారు. జె.నాగపూర్ణ, రమాదేవి స్వరకల్పనతో సంజయ్ కుమార్, రమాదేవి, కుమారి కీర్తి, స్వాతిలు గానం చేసిన గీతాన్ని వేదికపై ప్రదర్శించారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల, వీఆర్ క్రియేషన్స్ ఈ పాటను రూపొందించడంలో కృషి చేశారని మంత్రి దృష్టికి కలెక్టర్ తెచ్చారు. బాపట్ల /బాపట్ల అర్బన్: స్వాతంత్య్ర దిన వేడుకలు శుక్రవారం స్థానిక బాపట్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకలు అంబరాన్ని అంటాయి. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ముఖ్యఅతిథిగా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పోలీసుల కవాతు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రాంగణంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. దేశభక్తి గీతాలతో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అలరించాయి. జాతీయత, సంస్కృతులను చాటుతూ తొమ్మిది ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆలోచింప చేశాయి. జిల్లా అభివృద్ధిని వివరించేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. సమరయోధుల కుటుంబ సభ్యులైన మరుప్రోలు శ్రీనివాస్ రెడ్డి వెంకటేశ్వరమ్మ, యర్రం అన్నమ్మ, జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కుటుంబ సభ్యురాలైన పింగళి రమాదేవిలను మంత్రి సత్కరించారు. అమర సైనికుల కుటుంబ సభ్యులైన షర్మిల బేగం, షేక్ అత్తరున్నీసా, సింగంశెట్టి నాగ సుజాత, రబియా బీబీలకు ఇంటి స్థలాల పత్రాలను మంత్రి, కలెక్టర్లు పంపిణీ చేశారు. జిల్లా అభివృద్ధికి సహకరించండి అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఫలాలను అట్టడుగు వర్గాల వారికి అందించడం, తద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జిల్లా అభివృద్ధిలో పయనించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. నిరుపేదలను ఆదుకునేందుకు పీ4 విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు. ఈ విషయంలో రాష్ట్రంలోనే బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చేనేత కార్మికుల అభివృద్ధికి అడుగులు వేస్తోందన్నారు. కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించడంతో చేనేతల కష్టాలు తీరుతాయన్నారు. సూర్యలంక బీచ్ను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకు వెళుతుందని తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత, బాపట్ల, చీరాల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, ఎంఎం కొండయ్య, ఏపీ చేనేత కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ సజ్జల హేమలత, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు, ప్రముఖులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. రుణసాయం అందజేత 360 మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు ఉన్నతి పథకం ద్వారా రూ.3.60 కోట్ల రుణ సహాయం అందించారు. 28 మందికి పీఎంఈజీపీ రుణం, 340 మంది ఎస్హెచ్జీ వ్యాపారులకు రుణం, డ్వాక్రా సభ్యులకు బ్యాంక్ లింక్ ద్వారా రుణం, పీఎంఎఫ్ఎంఈ పథకం కింద 19 మందికి నగదు, 6,570 మంది డ్వాక్రా సభ్యులకు సీ్త్రనిధి రుణం, వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ఐదుగురికి లాప్టాప్లు, వినికిడి మిషన్లు, 8 మందికి మహిళలకు కోడిగుడ్లతో తయారు చేసే పదార్థాలు విక్రయించేందుకు బండ్లను అందజేశారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతిని ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాల ఆలాపన, నృత్యాలు, ప్రదర్శనలతో విద్యార్థులు అలరించారు. చీరాలకు చెందిన మహిత తన మైక్రో ఆర్ట్ ప్రతిభతో 65 పెన్సిళ్లపై డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, 86 పెన్సిళ్లపై నెల్సన్ మండేలా, 73 పెన్సిళ్లపై గాంధీ, 25 పెన్సిళ్లపై డొక్కా సీతమ్మ జీవిత చరిత్రలను, 800 పెన్సిళ్లపై భగవద్గీతలోని 700 శ్లోకాలను లిఖించి ఆకట్టుకున్నారు. -
మద్యం విక్రయాల పెంపునకు ‘పర్మిట్’
మద్యం ఆదాయంపైనే దృష్టి పెట్టిన కూటమి సర్కార్.. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది. ఇప్పటివరకు బార్లకు మాత్రమే పరిమితమైన సిట్టింగ్.. ఇక వైన్స్లోనూ ‘పర్మిట్ రూం’ పేరుతో ఏర్పాటు చేసుకునేలా కూటమి పాలకులు వెసులుబాటు కల్పించారు. ఈ సాకుతో రూ.కోట్లలో వ్యాపారుల నుంచి ఫీజుగా వసూలు చేయనున్నారు. పరోక్షంగా ఈ భారం మళ్లీ ప్రజలపైనే పడనుంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: మద్యం ఏరులై పారించేందుకు కూటమి ప్రభుత్వం గేట్లు ఎత్తేసింది. ఇప్పటికే ప్రైవేటు వ్యక్తులకు దుకాణాలు కట్టబెట్టి రూ. వేల కోట్ల రాబడి పొందుతోంది. ఇది చాలదన్నట్లు ప్రజల ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతోంది. ఇప్పుడు వైన్స్ వద్ద పర్మిట్ రూములు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిలిచ్చింది. ఇప్పటికే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారులు మద్యం విక్రయాలు పెంచుకుంటున్నారు. అందినకాడికి పిండేస్తున్న పాలకులు వార్షిక లైసెన్సు ఫీజులు కట్టడానికి మద్యం వ్యాపారులు వాడవాడలా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేయిస్తున్నారు. పర్మిట్ రూముల పేరుతో చంద్రబాబు సర్కార్ వసూళ్లు మొదలుపెట్టడంతో ఆ భారం మళ్లీ ప్రజలపైనే పడనుంది. ప్రతిమద్యం దుకాణం వద్ద కూర్చొని మద్యం తాగేందుకు ప్రభుత్వం పర్మిట్ రూములు తప్పనిసరి చేసింది. ఇందుకు ప్రత్యేకంగా రిటైల్ ఎకై ్సజ్ సుంకం పేరుతో భారీగా వడ్డనకు సిద్ధమైంది. రూ. 55 లక్షలలోపు వార్షిక లైసెన్సు ఫీజు చెల్లించే మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్కు రూ. 5 లక్షలు లైసెన్సు ఫీజు నిర్ణయించింది. రూ. 65 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు వార్షిక లైసెన్సు రుసుము ఉన్న దుకాణాలకు రూ.7.50 లక్షలు ఫీజుగా తేల్చింది. ఈ మొత్తం నవంబర్ 10వ తేదీ నాటికి ఒకే విడతలో చెల్లించాల్సి ఉంటుంది. బాదుడే బాదుడు... జిల్లాలో బాపట్ల, రేపల్లె, వేమూరు, నగరం, చీరాల, పర్చూరు, అద్దంకి ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 129 మద్యం దుకాణాలు ఉన్నాయి. రూ. 55 లక్షల వార్షిక లైసెన్సు రుసుము చెల్లించే దుకాణాలు 42 కాగా, రూ. 65 లక్షల నుంచి రూ.85 లక్షల వార్షిక ఫీజు చెల్లించే దుకాణాలు 86 ఉన్నాయి. వీటిలో పర్మిట్ రూముల లైసెన్సు ఫీజు కింద ప్రభుత్వానికి ఏడాదికి రూ. 8.50 కోట్లు అదనపు రాబడి సమకూరనుంది. ఈ దుకాణాలలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 12 దుకాణాలు మినహా మిగిలిన వాటిలో 90 శాతం దుకాణాల వ్యాపారులు విక్రయాలు పెంచుకునేందుకు వాడవాడలా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వైన్స్లో మద్యం క్వార్టర్ బాటిల్పై రూ. 20 నుంచి రూ.50 వరకూ అధిక ధర వసూలు చేస్తున్నారు. ఇక బెల్టు దుకాణాల వద్ద ధరలు మరింత అదనంగా ఉన్నాయి. జిల్లాలో మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బహిరంగ మద్యపానం పెరిగి ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించి ఈ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 10వ తేదీ నాటికి ఒకే విడతలో ఫీజు చెల్లించాలి. – బి.వెంకటేశ్వర్లు, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారికూటమి నేతలు మాటలకే పరిమితంమద్యం అమ్మకాలపై 20 శాతం ప్రాఫిట్ పర్సంటేజీ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం తర్వాత 8 శాతం కమీషన్తో సరిపెట్టింది. నష్టాల్లో కూరుకుపోతున్నామని నిర్వాహకులు కోర్టుకు వెళ్లడంతో పర్సెంటేజీ 14 శాతానికి పెంచి చేతులు దులుపుకొంది. ఇప్పటికే స్థానిక పచ్చ నేతలకు ఎంతో కొంత ముట్టజెబుతూ పర్మిట్ రూములు అనధికారికంగా వ్యాపారులు ఏర్పాటు చేశారు. బహిరంగంగా మందు బాబులు దుకాణాల వద్దే మద్యం తాగడంపై ఫిర్యాదులు వస్తున్నాయంటూ కూటమి ప్రభుత్వం ఇలా వసూళ్లకు దిగింది. గత ప్రభుత్వంలో మద్యం విధానాన్ని తప్పుపట్టిన కూటమి నేతలు.. బెల్టు దుకాణాలు లేకుండా కట్టడి చేస్తామని ఊదరగొట్టారు. ఇప్పుడు విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు దుకాణాల వద్దే పర్మిట్ రూముల పేరుతో మందు తాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
గుంటూరు రేంజ్ కార్యాలయ ఆవరణలో వేడుకలు
నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జెండా ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ, పోలీస్ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఆర్ఎస్ఐలు సంపంగిరావు, ప్రసాద్, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలుమేడికొండూరు : మండల పరిధిలోని గుండ్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన మహిళలు నల్లపాడు పరిధిలో ఓ వివాహానికి వెళుతూ పాటిబండ్ల నుంచి వస్తున్న ఆటో ఎక్కారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత గుండ్లపాలెం వద్ద ఎదురుగా గేదె అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిరిపురం గ్రామానికి చెందిన మిరియాల లిల్లీ రాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆటో లాక్కొని వెళ్లడంతో పక్కటెముకలు దెబ్బతిన్నాయి. కుడి చేయితో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం గుంటూరు జిల్లా వడ్లమూడికి చెందిన భక్తులు 82 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని కానుకగా సమర్పించారు. వడ్లమూడికి చెందిన వి.శ్రవణ్కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ.8.50 లక్షల విలువైన 82 గ్రాముల బంగారం, పచ్చలతో తయారు చేయించిన లక్ష్మీహారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్. రమేష్బాబు, ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ సెలవుదినంతో పాటు, శనివారం శ్రీకృష్ణాష్టమి సెలవు, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజుల సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. సెలవులకు తోడు వివాహ సుముహూర్తాలు కూడా ఉండడంతో నూతన వధూవరులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
‘ఉచిత బస్సు ప్రయాణం’ ప్రారంభం
చీరాల అర్బన్: సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం చీరాల ఆర్టీసీ బస్టాండ్లో జిల్లా వ్యాప్తంగా సీ్త్రశక్తి పథకాన్ని ప్రారంభించారు. చీరాల ఆర్డీఓ టి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, కలెక్టర్ జె.వెంకటమురళి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. మహిళలతోపాటు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్లు బస్సులో ప్రయాణించారు. ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, ఆర్టీసీ ఆర్ఎం సామ్రాజ్యం, డిపో మేనేజర్ జె.శ్యామల, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన 31 మందికి ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లు, 20 మందికి వినికిడి మిషన్లును మంత్రి, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు సత్వర న్యాయమే స్వాతంత్య్రం
బాపట్ల: నిరుపేదలకు సత్వరమే న్యాయం అందించటమే నిజమైన స్వాతంత్య్రం లక్ష్యం అని జిల్లా జడ్జి కే శ్యాంబాబు అన్నారు. బాపట్ల జిల్లా కోర్టు ఆవరణలో స్వాతంత్య్ర వేడుకలు సందర్భంగా ఆరవ అదనపు జిల్లా జడ్జి కే శ్యాంబాబు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి శుభాకాంక్షలు అందజేశారు. అట్టడుగు వర్గాలకు అందిస్తున్న ఉచిత న్యాయ సేవల గురించి వివరించారు. అనంతరం నాటి త్యాగమూర్తుల సేవలను స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కే వాణి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎం పవన్కుమార్, రిటైర్డ్ జిల్లా జడ్జి ఎన్ రమేష్, ఏజీపీ శ్యామలాదేవి, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవిని శ్రీనివాసరావు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కే లక్ష్మీనారాయణ, బాపట్ల జిల్లా బార్ ఆసోసియేషన్ అధ్యక్షులు కే అవినాష్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
మహానుభావుల త్యాగఫలంతో స్వేచ్ఛ
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: ఎంతోమంది మహానుభావుల పోరాటం, ప్రాణ త్యాగాలతోనే స్వాతంత్య్ర ఫలాలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్పై జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ ఎగురవేశారు. త్రివర్ణ పతాకానికి ఆయన సెల్యూట్ చేసి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. స్వాతంత్య్రం పొందిన తర్వాత ఆర్థికంగా ఎంతో పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. సైనికపరంగా, విదేశీ విధానాల పరంగా ప్రత్యేకత చాటుతున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు అందరం పునరంకితం అవుదామని తెలిపారు. ఇన్చార్జి జిల్లా సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి మల్లికార్జున రావు, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అంబులెన్స్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ప్రారంభం
గుంటూరు రూరల్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా అంబులెన్న్స్ డ్రైవర్స్–వర్కర్స్ యూనియన్ను శుక్రవారం ప్రారంభించారు. జాతీయ జెండాను ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ శివాజీ, సీఐటీయూ జెండాను ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకుడు టీవీజీ రవిశంకర్, గుంటూరు జిల్లా అంబులెన్న్స్ డ్రైవర్స్ –వర్కర్స్ యూనియన్ బోర్డును యూనియన్ గౌరవాధ్యక్షుడు షేక్ మస్తాన్వలి ఆవిష్కరించారు. శివాజీ మాట్లాడుతూ ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ దేశవ్యాప్తంగా రవాణా కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. సీఐటీయూ అనుబంధంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్న అంబులెనన్స్ డ్రైవర్లను అభినందించారు. ఆటోలు, అంబులెనన్స్, ఇతర రవాణా కార్మికులకు ప్రభుత్వమే పార్కింగ్, వెయిటింగ్ హాల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు మాట్లాడుతూ అంబులెనన్స్ డ్రైవర్లకు ఏ సమస్య వచ్చినా ఎల్లవేళలా సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి శంకర్రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాలుగా కార్మికులపై భారాలు మోపుతున్నాయన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ గుంటూరు నగర తూర్పు, పశ్చిమ ప్రధాన కార్యదర్శులు కట్లకుంట శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, నగర నాయకులు షేక్ ఖాసీం వలి, ఆది నికల్సన్, షేక్ ఖాసిం షహీద్, దొడ్డా కోటేశ్వరరావు, యూనియన్ నాయకులు షేక్ బాషా, ఈసూబ్, వాజిద్, ప్రేమ్ కుమార్, పాల్గొన్నారు. -
తప్పిపోయిన తల్లిని కొడుకు వద్దకు చేర్చిన షీ టీం
చీరాల అర్బన్: తప్పిపోయిన తల్లిని కొడుకు చెంతకు చేర్చారు చీరాల షీ టీం పోలీసులు. వివరాల్లోకి వెళితే.. బీహార్ నుంచి తప్పిపోయి 13 రోజుల కిందట వృద్ధురాలు రామ్కుమార్ దేవి చీరాలకు వచ్చింది. చీరాల సంపత్నగర్లోని ఓ షాపు ఎదురుగా ఉంటూ అర్థం కాని భాషలో ఏడుస్తుండేది. స్థానికులు గుర్తించి ఆమె యాచకురాలుగా లేదని భావించి ఆమెకు ఆహారం అందించారు. రోజులు గడచినా ఆమె బంధువులు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. షీ టీం ఎస్సై హరిబాబు తమ బృందంతో బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విచారణ చేశారు. ఎట్టకేలకు ఆమె బీహార్ వాసిగా గుర్తించి ఆమె కుమారుడు అనిల్ సింగ్ను చీరాలకు రప్పించి సురక్షితంగా ఆమెకు కొడుకు చెంతకు చేర్చారు. ప్రత్యేక శ్రద్ధ చూపిన పోలీసులను స్థానికులు అభినందించారు. స్వాతంత్య్రం రోజు ఏరులై పారిన మద్యం చీరాల: స్వాతంత్య్ర దినోత్సవం సమయా న చీరాల ప్రాంతంలో మద్యం ఏరులై పారింది. మద్యం షాపులు మూసివేయాలనే నిబంధన ఉన్నా అమ్మ కాలు సాగాయి. ఎమ్మార్పీ కంటే రూ.30 నుంచి రూ.50 అదనంతో అమ్మకాలు చేపట్టారు. మద్యం షాపులు బయటే గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు సాగించారు. పట్టణంలోని పలు వైన్ షాపుల ముందు ఇదే తంతు నడిచింది. జేబుల్లో, బ్యాగుల్లో, ద్విచక్రవాహనాల్లో పెట్టుకుని అమ్మకాలు సాగించారు. -
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మంగళగిరి టౌన్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరి పంట రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు డిమాండ్ చేశారు. మంగళగిరిలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రామారావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 70 వేల ఎకరాల వరి పంట రైతులు నష్టపోయినట్లు పేర్కొన్నారు. మొదటి విడతలో పంట వేసినప్పుడు వర్షాలు లేక పంట ఎండిపోయిందని, అప్పుడు ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి పెట్టారని, రెండోసారి వరిపంటవేసిన తరువాత అకాల వర్షాల కారణంగా నష్టపోయారని అన్నారు. గుంటూరు చానల్, కొండవీటివాగును రెండువైపులా వెడల్పు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే నష్టానికి కారణమన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జేవీ రాఘవులు, జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు కమలాకర్ పాల్గొన్నారు. యువకుడిపై కత్తితో దాడి తెనాలిరూరల్: పాతకక్షల నేపథ్యంలో యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసి గాయపర్చిన ఘటన మండలంలోని కొలకలూరులో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఉన్నం చినజాన్, సుద్దపల్లి రవీంద్రకు గతంలో విభేదాలున్నాయి. ఇరువురు కలసి మద్యం తాగే క్ర మంలో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. రవీంద్ర తనతో తెచ్చుకున్న కత్తితో జాన్పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం తాడేపల్లిలోని ప్రైవేటు వైద్యశాలకు పంపారు. జాన్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
ఉత్తమ సేవలకు పతకాలు, ప్రశంసాపత్రాలు
డి. మల్లికార్జునరావు అద్దంకి రూరల్ సీఐ ఆర్.రాంబాబు బాపట్ల టౌన్ సీఐ పి.వి. ఆంజనేయులు వేమూరు సీఐ పి. శేషగిరిరావు చీరాల రూరల్ సీఐఎ. సుబ్బరాజు అద్దంకి సీఐ కె.శ్రీనివాసరావు బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ బాపట్ల సర్కిల్ సీఐప్రభుత్వ, పోలీస్శాఖలలో విశేషకృషి చేసిన ఉత్తమ అధికారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ముఖ్యంగా పోలీస్శాఖలో విశిష్ట సేవలు అందించిన 37 మంది జిల్లా పోలీస్ అధికారులకు పతకాలను అందజేశారు. ఒకరికి మహోన్నత సేవా పతకం, ఇద్దరికి ఉత్తమ సేవా పతకాలు, తొమ్మిది మందికి అతి ఉత్తమ సేవా పతకాలు, పదహారు మందికి ఉత్తమ సేవా పతకాలు లభించాయి. వీటితోపాటు 95 మందికి పోలీసు అధికారులకు సిబ్బందికి ప్రశంసాపత్రాల చొప్పున మొత్తం 132 మందికి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. –బాపట్లటౌన్ -
ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన లారీ
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి లారీ డ్రైవర్ మృతి పర్చూరు(చినగంజాం): ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన సంఘటనలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన శుక్రవారం పర్చూరు మండల పరిధిలోని తిమ్మరాజుపాలెం వద్ద చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. చీరాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నరసరావుపేట నుంచి చీరాల వైపు వస్తోంది. పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద బస్సులోని కొందరు ప్రయాణికులను దించి అప్పుడే హైవే ఎక్కుతోంది. ఆ సమయంలో పర్చూరు నుంచి వస్తున్న లోడు లారీ ఆర్టీసీ బస్సును బలంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ వైపు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో లారీని నడుపుతున్న డ్రైవర్ వాసుమల్ల సాల్మన్రాజు (43)కు తీవ్ర గాయాలై లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పర్చూరు ఎస్ఐ జీవీ చౌదరి, ఏఎస్ఐ సాంబశివరావు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి లారీలో ఇరుక్కుపోయిన అతనిని శ్రమించి అతికష్టం మీద బయటకు తీశారు. ప్రమాదంలో అతని కాళ్లు నుజ్జు అయి అతనికి తీవ్ర రక్తస్రావం కావడంతో అతనిని అంబులెన్స్లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి గుంటూరు తరలిస్తుండగా మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న పర్చూరుకు చెందిన కోటేశ్వరమ్మకు తలకు, మండలంలోని పెదజాగర్లమూడికి చెందిన మరో మహిళ సలోమికి ఎదురు సీటు రాడ్ పొడుచుకొని నుదుటిపై తీవ్ర గాయమైంది. వారివురిని పర్చూరు ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. మరో ఇరువురు మహిళలకు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కేసు నమోదు చేసుకొన్నట్లు ఏఎస్ఐ సాంబశివరావు తెలిపారు. -
వరదకు కొట్టుకుపోయిన పెదమద్దూరు రోడ్డు
నిలిచిపోయిన అమరావతి– విజయవాడ రాకపోకలు అమరావతి: కొద్ది రోజుల కింద వచ్చిన వరదకు పెదమద్దూరు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అమరావతి నుంచి విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెదమద్దూరు వద్ద సుమారు అర కిలోమీటరు మేర పూర్తిగా ధ్వంసమైంది. వైకుంఠపురం, పెదమద్దూరు గ్రామాల ప్రజలతోపాటుగా అమరావతి నుంచి విజయవాడకు వెళ్లే వారికి విజయవాడ నుంచి అమరావతి వచ్చే యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్నా రు. మండలంలోని అమరావతి నుంచి వైకుంఠపురం పెదమద్దూరు వెళ్లాలంటే నరుకుళ్లపాడు, ఎండ్రాయి, చావపాడు మీదుగా సుమారు 12 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిందే. ప్రస్తుతం విజయవాడ–అమరావతి బస్సులు పెదమద్దూరు వరకు వచ్చి అక్కడి నుండి వెనుతిరుగుతున్నాయి. గురువారం రాత్రి పెదమద్దూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ సిబ్బంది కాపాలా కాస్తున్న అమరావతికి చెందిన ట్రాక్టర్ అమరావతి నుంచి వైకుంఠపురం వైపు వెళ్ళటానికి ఈ రోడ్డు గుండా వచ్చి ప్రమాదవశాత్తు వాగులో పడి వరదనీటిలో మునిగిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్కు ప్రాణాపాయం తప్పింది. వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు కనీస మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
దేశ సేవకు యువత సంసిద్ధులై ఉండాలి
బాపట్లటౌన్: దేశ సేవకు యువత సంసిద్ధులై ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్ర వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుషార్డూడీ జెండా ఏగురవే శా రు. ఎస్పీ మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల పాటు సాగిన బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూసిన భారత దేశం, ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలితంగా 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రం వారి త్యాగ ఫలితమేనని, స్వతంత్ర సమరయోధులను గుర్తుచేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత ఎల్లవేళలా దేశ సేవ కు సంసిద్ధులై ఉండాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మనవంతు కృషి చేయాలన్నారు. త్యాగధనులు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో.. ఆ కలలను మనమందరం సాకారం చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన విద్యార్థులకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి, డీపీఓ అధికారులకు మిఠాయిలను పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఏవో బి. శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, ఏఆర్ డీఎస్పీ పి. విజయసారధి, ఎస్బీ సీఐ నారాయణ, ఆర్ఐలు షేక్ మౌలుద్దీన్, టి.శ్రీకాంత్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
దేశ రక్షణ కోసం రెడ్ షర్ట్ ఆర్మీ సిద్ధంకావాలి
మంగళగిరి టౌన్: బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, దేశ రక్షణ కోసం రెడ్ షర్ట్ ఆర్మీ సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఒంగోలులో ఈనెల 28న జరగనున్న రాష్ట్ర మహాసభల్లో పాల్గొనున్న రెడ్షర్ట్ వలంటీర్లకు మంగళగిరి నగర పరిధిలోని బైపాస్ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద గల ప్రాంగణంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని శుక్రవారాన్ని ఆయన నాయకులతో కలసి సందర్శించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై చురుకై న పాత్ర పోషించాలని తెలిపారు. దేశంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి రెడ్షర్ట్ ఆర్మీ సిద్ధం కావాలని చెప్పా రు. పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేసి సామాజిక చైతన్యం పెంపొందించడంలో ముందుండి కృషి చేయాలని సూచించారు. రైతులు, కార్మికులు, నిరుద్యోగ యువత, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుండా నేటి ప్రభుత్వాలు కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నితిరుపతయ్య, పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్, నాయకులు కంచర్ల కాశయ్య, జాలాది జాన్బాబు పాల్గొన్నారు. -
యువతీ, యువకులు ఆధ్యాత్మికంగా ఎదగాలి
నేషనల్ యూత్ ఫెస్టివల్లో ప్రముఖ సినీ నటుడు భానుచందర్ చీరాల రూరల్: యువతీ, యువకులు చెడునడతలను విసర్జించి చదువుతోపాటు ఆధ్యాత్మికంగా ఎదగాలని సినీ నటుడు భానుచందర్ సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జీసస్ వర్షీఫ్ సెంటర్ నిర్వహకులు డాక్టర్ నోవా అజయ్కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో జాతీయ యూత్ ఫెస్టివల్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు భానుచందర్ పాల్గొని తన జీవితంలో ప్రభువైన ఏసుక్రీస్తు చేసిన అద్భుతాలను తన కుటుంబ సాక్ష్యంగా యువతీయువకులకు ఎంతో విపులంగా వివరించారు. ప్రతి ఒక్కరూ బైబిల్లోని పది ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే ఏసుక్రీస్తును ఆరాధించినట్లేనని చెప్పారు. తనవలే తన పొరుగువారిని ప్రేమించాలని ఏసుక్రీస్తు చెప్పారని ప్రతి ఒక్కరూ ఎదుటివారిపై సోదర ప్రేమను చూపాలని సూచించారు. రోజులు బహు చెడ్డగా ఉన్నవని ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని తన రక్షకునిగా స్వీకరించి మారుమనస్సు పొందాలని సూచించారు. కార్యక్రమంలో యువతి, యువకులు వీనులవిందైన సంగీతాల మధ్య దేవుని గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో నిర్వహకులు డాక్టర్ నోవా అజయ్కుమార్ ఆయన సతీమణి రమా ఏంజలిన్, యూత్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతి, యువకులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. -
కారంచేడుకు కీర్తి..
స్వాతంత్రోద్యమంలో 18 మంది కారంచేడు యోధులు కారంచేడు: 78 ఏళ్ల కిందట మనకు వచ్చిన స్వాతంత్య్రం వెనుక ఎంతో మంది శ్రమ, దీక్ష, పోరాటాలు, ప్రాణ త్యాగాలు ఉన్నా యి. అప్పటి మన స్వాతంత్య్ర పోరాటాల్లో కారంచేడుకు చెందిన 18మంది యోధులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపుతో వీరంతా అప్పటి దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గ్రామంలో పాత శివాలయం వద్ద వీరు సమావేశమైనట్టు చరిత్ర చెబుతోంది. ఉప్పు సత్యాగ్రహంలో వీరందరూ జైలు జీవితం గడిపారు. అప్పట్లో ఒక సారి చీరాలకు వచ్చిన మహాత్మాగాంధీని కూడా కలిసి సత్యాగ్రహం గురించి చర్చించారు. వీరికి గ్రామానికి చెందిన యనమండ్ర వెంకటసుబ్బయ్య పంతులు, పోతిని వెంకటసుబ్బయ్య పంతులు, కారంచేటి మల్లయ్య పంతులు నాయకత్వం వహించినట్లు చరిత్ర చెబుతోంది. దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో దగ్గుబాటి నాయుడమ్మ, యార్లగడ్డ వెంకన్నచౌదరి, పోతిన వెంకన్నచౌదరి, గోరంట్ల లింగయ్యచౌదరి, యార్లగడ్డ అంజయ్యచౌదరి, గొట్టిపాటి శ్రీరాము లు, పోతిన వెంకయ్యచౌదరి, నాళం సుబ్బారావుగుప్తా, యార్లగడ్డ చినలక్ష్మయ్య, యార్లగడ్డ మునసుబుగారి సుబ్బరాయుడు, మండవ మల్ల య్య, దగ్గుబాటి సుబ్బన్నచౌదరి, జాగర్లమూడి వెంకటకృష్ణయ్య చౌదరి, తవ్వా వెంకటసుబ్బయ్య గుప్తా, జాగర్లమూడి వెంకటకృష్ణయ్య చౌదరిలు పాల్గొన్నట్లు చరిత్ర చెబుతుంది. -
స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలన
బాపట్ల: బాపట్లలో భారత స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. భారీ వర్షాల కారణంతో ప్రజలకు అసౌకర్యాలు కలుగకుండా జెండా పండుగను నిర్వహించాలన్నారు. బాపట్ల మహిళా ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం సంబంధిత కళాశాల ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించారు. వర్షాలు వచ్చినప్పటికీ జాతీయ పండుగను వైభవంగా జరపాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరవుతారన్నారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలు, స్టాల్స్ ప్రదర్శన నిర్వహించే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. త్వరగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, ఇన్చార్జి జేసీ జి.గంగాధర్గౌడ్, ఆర్డీవో గ్లోరియా ఉన్నారు. ట్రయల్ రన్ బాపట్లటౌన్: గురువారం ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్య్ర వేడుకలను వీక్షించడానికి విచ్చేసే ప్రజలకు, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా తగిన భద్రత చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు వస్తుండటంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ జి.నారాయణ, పట్టణ సీఐ ఆర్.రాంబాబు, ఆర్ఐలు షేక్ మౌలుద్దీన్, టి.శ్రీకాంత్ పాల్గొన్నారు. -
వరద ఉధృతం
లంక గ్రామాల ప్రజలను వరద భయం వెంటాడుతోంది. గురువారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి ఐదు లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకువస్తుంది. పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. పలు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మునగ, దొండ, బొప్పాయి పంటలు నీటిలో నానుతున్నాయి. ఇటుక బట్టీలు నీట మునిగాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ● లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు ● అందుబాటులో బోట్లు, గజ ఈతగాళ్లు కొల్లూరు: కృష్ణా నదిలో వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల ప్రజలను వరద భయం పట్టి పీడిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు గురువారం 5 లక్షల 65 వేల 201 క్యూసెక్కులు విడుదల చేశారు. గాజుల్లంక చినరేవు నుంచి వచ్చిన వరద నీరు మండలంలోని దోనేపూడి కరకట్ట దిగువున ఉన్న లో లెవల్ వంతెన పైనుంచి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, కిష్కింధపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి గ్రామాలకు చెందిన ప్రజలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. ప్రస్తుతం వీరు భట్టిప్రోలు మండలం వెల్లటూరు, కొల్లూరు మండలం గాజుల్లంక మీదు గా చుట్టూ తిరిగి ప్రయాణం సాగిస్తున్నారు. అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి, ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంక సమీపంలోని గండి, గాజుల్లంక గ్రామం వెంబడి నది గట్టుకు గండ్లు ఏర్పడ్డాయి. వరద నీరు ఇటుకరాయి మట్టి కోసం తవ్విన గుంతల్లోకి చొచ్చుకొని రావడంతో ఆ మూడు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. మండలంలోని చింతర్లంకలో నది అంచున ఉన్న లోతట్టు పంట భూముల్లోకి వరద నీరు చేరడంతో అరటి, కంద, పసుపు, కూరగాయల పంటలు ముంపు బారిన పడ్డాయి. పోతార్లంక –గాజుల్లంక గ్రామాల నడుమ కంద, అరటి, పసుపు, కూరగాయల పంటలను వరద ముంచెత్తింది. కొల్లూరు, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల పరిధిలో ఉన్న ఇటుక బట్టీలు నీట మునిగాయి. -
జిల్లాలో పెరిగిన భూగర్భ జలమట్టం
జిల్లా కలెక్టర్ అరుణ్బాబు నరసరావుపేట రూరల్: జిల్లాలో భూగర్భ జల నీటిమట్టం గతేడాది కన్నా 2.26 మీటర్లు పెరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు తెలిపారు. నీటి వనరులపై సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సాగునీటి సంఘం సభ్యులు, అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలం 30 మీటర్లు అడుగున ఉండే బొల్లాపల్లి మండలం, వెల్దుర్తి మండలాల్లో సైతం వరుసగా ఆరు మీటర్లు, మూడు మీటర్లు పెరిగిందని తెలిపారు. జిల్లాలో పెద్దఎత్తున ఫారం పాండ్లు నిర్మాణాల వలన వచ్చే ఏడాదికి భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని వివరించారు. సమగ్ర నీటి నిర్వహణలతో సాగునీటి సంఘ సభ్యులను, రైతులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. పదిహేను రోజుల్లో అన్ని ప్రాజెక్టులకు మరమ్మతులు, కాల్వలో పూడిక తీత పనులు పూర్తికావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూగర్భ జలమట్టం 20 మీటర్లు, 10 మీటర్లు దిగువున ప్రాంతాల్లో జలమట్టం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శాసీ్త్రయ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కాంతారావు, చీఫ్ ఇంజినీర్ బి.శ్యామ్ప్రసాద్, ఎస్ఈ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు వేటపాలెం విద్యార్థినులు
రెండు స్కూటీలు, ఒక మోటార్ బైక్ స్వాధీనం అద్దంకి రూరల్: బైకులు, స్కూటీలు దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకుల ఆటను పోలీసులు కట్టించారు. గురువారం అద్దంకి సీఐ సుబ్బరాజు నిందితుల వివరాలను వెల్లడించారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి కుంచాల ఏసుకుమార్, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఉప్పల శివయ్యలు కలసి అద్దంకిలోని రెండు స్కూటీలు, ఒక బైకును దొంగిలించారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు అద్దంకి ఎస్సై పీవీ నరసింహులు, సిబ్బంది గురువారం స్థానిక శింగరకొండ రోడ్డులోని ద్వారకా నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ఒక బైకు, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. -
తటాకం కాదు మైదానం!
ఈ చిత్రం చూసి, ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది.. అనుకుంటే బురదలో కాలేసినట్లే.. వారు అలా ఈత కొడుతుంది ఎటూపోయే మార్గంలేక నిలిచిపోయిన వర్షం నీటిలో.. బెల్లంకొండ జెడ్పీ హైస్కూల్ మైదానంలో రెండు రోజులుగా భారీవర్షాలు కురవడంతో వర్షపు నీరు పాఠశాల మైదానంలో నిలిచిపోయింది. మోకాళ్ల లోతు నీళ్లు ఉండడంతో చిన్నారులు గురువారం ఇలా ఈత కొడుతూ కనిపించారు. వర్షం పడిన ప్రతిసారి పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా నీరు రోజుల తరబడి నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. – బెల్లంకొండ -
విద్యార్థినుల అదృశ్యం
కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులు వేటపాలెం: ఇద్దరు బాలికలు అదృశ్యమైన కేసును 24 గంటల్లో ఛేదించి బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు తెలిపారు. బుధవారం సీఐ స్థానిక స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేశాయిపేట, వేటపాలెం గ్రామాలకు చెందిన ఇద్దరు బాలికలు స్థానికంగా ఉండే కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరిద్దరికి చదువుపై ఆసక్తి లేదు. దీంతో మంగళవారం ఇద్దరు కళాశాలకు అని వెళ్లారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాలేదని తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి వాకబు చేశారు. ఆచూకీ తెలియకపోవడంలో అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై జనార్దన్ కేసు నమోదు చేసి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మైనర్ బాలికలు అదృశ్యంపై ఎస్పీ సీరియస్గా తీసుకొని వారి ఆచూకీ కోసం ఐదు ప్రత్యేక టీంలు ఏర్పాటు శారు. జిల్లా ఐటీ కోర్ టీం సాంకేతిక సహకారంతో ఇద్దరు మైనర్ బాలికల కోసం గాలింపు చేపట్టారు. బాలికలు ఇద్దరు గుంటూరు రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని తీసుకొచ్చి బుధవారం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదువుకోవాలని మందలించగా అలిగి ఇంటి నుంచి వెల్లిపోయినట్లు తెలిపారు. బాలికలను 24 గంటలోపు కనిపెట్టి కేసును ఛేదించిన చీరాల డీఎస్పీ ఎండీ మోయిన్, రూర్ సీఐ శేషగిరిరావు, ఎస్సై పి. జనార్దన్ను ఇంకొల్లు ఎస్సై జీ. సురేష్ను ఎస్పీ అభినందించారు. -
డీజిల్ దొంగల అరెస్టు
ఇన్నోవా కారు, 150 లీటర్ల డీజిల్ స్వాధీనం అద్దంకి రూరల్: రాత్రి సమయంలో పార్కింగ్ చేసిన లారీలు, బస్సుల్లో డీజిల్ దొంగతనం చేస్తున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం అద్దంకి సీఐ సుబ్బరాజు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన బాణావత్ బాలబాదు నాయక్, బాణావత్ తులసీబాబు నాయక్, మోరబోతు శ్రీను నాయక్, రామవత్ దుర్గానాయక్లు ఒకే ఊరికి చెందినవారు. వాళ్లంతా ఆయిల్ వాహనాలల్లో దొంగతనాలు చేస్తుంటారు. వీరు ఈనెల 10 వ తేదీన అద్దంకిలోని రామ్నగర్ పెట్రోలు బంకు వద్ద పార్కింగ్ చేసిన బస్సు నుంచి ఆయిల్ చోరీ చేశారు. దీనిపై బస్ యజమాని మేరువ శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో ఎస్సై నరసింహులు, ట్రైనీ ఎస్సై వెంకటేశ్వరరెడ్డి, కానిస్టేబుల్స్ టీమ్గా ఏర్పడ్డారు. నలుగురు దొంగలను అద్దంకి సమీపంలోని శింగరకొండ వద్ద కారులో కూర్చున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 150 లీటర్ల డిజిల్, ఇన్నోవా కారును సీఐ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. రెండు నెలల కిత్రం సంతమాగులూరు పరిధిలోని మక్కెనవారిపాలెం పెద్ద కాలువ వద్ద డీజిల్ను దొంగతనం చేశారు. వీరిపై గతంలో సంతమాగులూరు, కారంపూడి, బండ్లమోడు, బట్టిప్రోలు పలు కేసులు నమోదయ్యాయి -
అంతర్జాతీయ వేదికపై మెరిసిన జెస్సీ
గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అభినందనలు లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): జూలై 24 నుంచి 29 వరకు దక్షిణ కొరియాలో జరిగిన 20వ ఆసియా రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ 2025లో సోలో డ్యాన్స్ సబ్ జూనియర్ విభాగంలో రజత పతకం గెలుచుకున్న మంగళగిరికి చెందిన అంతర్జాతీయ స్కేటర్, జెస్సీరాజ్ తన పతకాల జాబితాలో మరో మైలురాయిని చేర్చుకోవడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీని జెస్సీ రాజ్ మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. ముందుగా జెస్పీని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ క్రీడా ప్రయాణానికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె కోచ్ సింహాద్రిని ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, జెస్సీ విజయయాత్రలో నిరంతర ప్రోత్సాహం, నిబద్ధత కనబరుస్తున్న ఆమె తల్లిదండ్రులను కూడా జిల్లా కలెక్టర్ అభినందించారు. -
2070 నాటికి సూపర్పవర్గా భారతదేశం
బాపట్ల: భారతదేశం 2070 నాటికి సూపర్ పవర్గా తయారవుతుందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బుధవారం బాపట్ల కలెక్టరేట్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమెరికా, చైనా అగ్రదేశాల తర్వాత ఆర్థిక ప్రగతిలో భారతదేశం మూడోస్థానంలో నిలుస్తుందన్నారు. భారతదేశం 2047 నాటికి అభివృద్ధి సాధించే దిశగా కృషి జరుగుతుందన్నారు. జిల్లాలో 15 లక్షల మంది జనాభా ఉన్నారని జాతి సమైక్యతకు చిహ్నంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ఆయన చెప్పారు. ఈనెల 15వ తేదీన జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. ఈనెల 15వ తేదీన పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరిగే 79వ స్వాతంత్య్ర దినోత్సవానికి ప్రజలందరూ హాజరు కావాలని ఆయన కోరారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య ప్రాధాన్యత, విలువలను ప్రతి ఒక్కరికీ తెలియ జేయాలని ఆయన కోరారు. భారతదేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. డీఆర్డీడీఏ పీడీ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయ లక్ష్మి, డీఎంహెచ్ఓ విజయమ్మ, ఎకై ్సజ్ శాఖ ఈఎస్ వెంకటేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పీడీ వెంకటేశ్వరరావు, బాపట్ల ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్లలో తిరంగా ర్యాలీ -
భావపురిలో బాపు అడుగుజాడలు
బాపట్ల అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ సంబరాన మువ్వన్నెల జెండా దేశభక్తిని నింపుకొని రెపరెపలాడుతోంది. బ్రిటిష్ దొరల నిరంకుశత్వాన్ని ఎందరో మహనీయులు ధిక్కరించారు. బతుకుదెరువుకు వచ్చి తమపైనే మీ పెత్తనమేంటంటూ నిలదీశారు. తుపాకీ గుళ్లకు గుండెలను అడ్డుపెట్టి తెల్లదొరల గుండెల్లో వణుకు పుట్టించారు. అహింసే ఆయుధంగా చేసుకుని భరతమాతను స్వేచ్ఛా విహంగంగా మార్చారు. ఇంతటి స్వాతంత్య్ర పోరాటంలో బాపట్ల జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. బాపట్లకు విచ్చేసిన మహనీయులు 1929 ఏప్రిల్ 17న మహాత్మా గాంధీజీ ఖద్దరు ఉద్యమ వ్యాప్తికోసం మంతెనవారిపాలెం వచ్చారు. అక్కడ కనుమూరి వెంకట రాజు ఇంట్లో బస చేశారు. స్వాతంత్య్రం కోసం ఎటువంటి త్యాగాలకై నా సిద్ధంకండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అక్కడ నుంచి ఏప్రిల్ 18న బాపట్లకు విచ్చేశారు. 1933 డిసెంబర్లో పెను తుపాను సందర్భంగా బాధితుల సహాయార్థం విరాళాల సేకరణకు రెండోసారి గాంధీజీ బాపట్ల వచ్చారు. 1934లో బాపట్లలో నిర్వహించిన బహిరంగ సభలో నెహ్రూ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రసంగించి ప్రజలను చైతన్యవంతులను చేశారు. మహాత్మా గాంధీజీ బాపట్ల ప్రాంత పర్యటనకు రాగా తిలక్ స్వరాజ్య నిధికి నగదుతోపాటు బంగారు ఆభరణాలను దేశభక్తులు సమర్పించారు. మహాత్మా గాంధీ రోడ్డుగా నామకరణం 1931 సంవత్సరంలో గాంధీ బాపట్లలో నడయాడిన రహదారికి మహాత్మాగాంధీ రోడ్డుగా నామకరణం చేశారు. బాపట్ల తాలూకా ఆఫీస్ నుంచి భావన్నారాయణ స్వామి గుడికి వెళ్లే రోడ్డును మహాత్మా గాంధీ రోడ్డు అని పిలుస్తున్నారు. సహాయ నిరాకరణోద్యమంలో.. 1920లో సహాయ నిరాకరణోద్యమం జరగ్గా బాపట్ల తాలూకాలోని 64 గ్రామాల్లో సంఘాలను ఏర్పరచి ఉద్యమాలను నడిపారు. కొందరు రెవెన్యూ ఇన్్స్పెక్టర్లు, గుమస్తాలు తమ ఉద్యోగాలకు స్వస్తి చెప్పి న్యాయవాదులతోపాటు ఉద్యమంలో చేరారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందున బాపట్ల ప్రాంతానికి చెందిన ఆంధ్రరత్న దుగ్గిరాలతోపాటు మంతెన క్రిష్ణంరాజు, బూదరాజు లక్ష్మీనారాయణ, బూదరాజు లక్ష్మీనరసింహారావు, పిల్లుట్ల హనుమంత రావు, అడుసుమల్లి శ్రీనివాసరావు పంతులు వంటి వారు జైలు పాలయ్యారు. ఉద్యమంలో భాగంగా 1921 డిసెంబర్ 31న 48 మంది గ్రామోద్యోగులు రాజీనామాలు సమర్పించారు. విదేశీ వస్తు బహిష్కరణ పన్నుల నిరాకరణోద్యమంలో భాగంగా నాటి బాపట్ల తాలూకాలోని పెదనందిపాడులో ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్ మిలిటరీ క్యాంపును ఏర్పాటు చేశారు. సంకా సీతారామయ్య, దాసరి శ్రీరాములును పెదనందిపాడు నుంచి చిలకలూరిపేట వరకు 8 మైళ్లు గుర్రం వెంట శిక్షగా పరుగెత్తించారు. 1930లో సాగిన ఉద్యమంలో పాల్గొన్నందుకు బాపట్ల తాలూకాలోని 124 మందిని నాటి ప్రభుత్వం జైలుకు పంపింది. విదేశీ వస్తు బహిష్కరణలలో పాలుగొన్నందుకు 44 మందికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు శిక్ష విధించారు. బాపట్లలో ఖద్దరు ఉద్యమవ్యాప్తికి పిలుపునిచ్చిన గాంధీజీ కదిలివచ్చిన బాపట్ల ప్రజలు బాపు నడయాడిన రహదారికి మహాత్మాగాంధీ రోడ్డుగా నామకరణం స్వాతంత్య్ర సంబరాల్లో స్మరించుకుంటున్న జిల్లా వాసులు -
స్ట్రయిట్కట్ కాలువ మలుపునకు అనుమతి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ మలుపునకు అనుమతిస్తూ, రెండు వర్గాల ఆమోదంతో పనులు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. ఈమేరకు మత్స్య శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ మలుపు పరిష్కారం దిశగా లైన్ డిపార్టుమెంటు రైతు, మత్స్యశాఖ సంఘ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు, చీరాల ఎమ్మెల్యే ఎంఎం మాలకొండయ్య, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈపురుపాలెం స్రైట్ కట్ కాలువ పై అడవి పాలెంలోని 7 గ్రామాలు, వాడరేవులోని 6 గ్రామాలు, 593 బోట్లతో 1126 మంది సొసైటీ సభ్యులు, 13 గ్రామాలు, 1303 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. రైతులు, మత్స్యకాలను దృష్టిలో పెట్టుకొని జెట్టి నిర్మాణానికి అనుమతి ఇస్తానని కలెక్టర్ తెలిపారు. రాటిఫికేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతామన్నారు. మత్స్యకారులను దష్టిలో పెట్టుకొని సమస్య పరిష్కారం కోసం రైతులకు, మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా కొంతమేరకు ఈపుపాలెం స్ట్రైట్ కట్ కాలువను మలుపు తిప్పాలని ఆయన అన్నారు. భూములు కోల్పోయే వారికి నష్టపరిహారం ఇస్తామన్నారు. కాలువ శాశ్వత పరిష్కారం కోసం నిజాంపట్నంలో మాదిరిగా పెద్ద పెద్ద సిమెంటు దిమ్మెలను వేస్తూ, రెండు వైపులా రిటైనింగ్ చేయడం జరుగుతుందన్నారు. సర్వే శాఖ ఏడీ కనకరాజు, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాఘవరెడ్డి, బాపట్ల, చీరాల ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం బాపట్ల: కృష్ణా నది వరద విపత్తును సమర్థంగా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నామని కలెక్టర్ జె.వెంకట మురళి చెప్పారు. పర్యావరణ విపత్తుల నిర్వహణపై హోం శాఖ మంత్రి అనిత, సీసీఎల్ఏ కమిషనర్ జయలక్ష్మి బుధవారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లాలో తీసుకున్న రక్షణచర్యలపై జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి వివరించారు. -
పంటలు వర్షార్పణం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో రెండురోజులుగా భారీవర్షం కురుస్తోంది. మంగళవారం ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో బుదవారం ఉదయంనాటికి జిల్లాలో సగటున 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రేపల్లె, వేమూరు, బాపట్ల, నియోజకవర్గాల్లో వేలాది హెక్టార్లలో వరినాట్లు నీటమునిగాయి. బుధవారం సాయంత్రం నాటికి జిల్లాలో పై మూడు నియోజకవర్గాల పరిధిలో వెద పద్ధతిలో 32 వేలు, నాట్లు పద్ధతిలో 8 వేల హెక్టార్ల చొప్పున మొత్తం 40 వేల హెక్టార్లలో వరిపంట సాగైంది. వర్షాల కారణంగా కర్లపాలెం మండలంలో 2,512 హెక్టార్లు, అమృతలూరులో 4,978, చుండూరు మండలంలో 4,500, బాపట్ల మండలంలో 2,320, రేపల్లెలో 150, చెరుకుపల్లిలో 230 హెక్టార్ల చొప్పున మొత్తం 15,187 హెక్టార్లలో వరిపంట నీట మునిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా. వాస్తవానికి సుమారు 20 వేల హెక్టార్లలో వరి నీట మునిగినట్లు తెలుస్తోంది. ఇదే తరహాలో మరో రెండు రోజులు వర్షాలు కురిస్తే మరింతగా వరి నీటమునిగి కుళ్లిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగువకు 3.15 లక్షల క్యూసెక్కులు బుధవారం ప్రకాశం బ్యారేజీవద్ద 3.15 లక్షల నీటిని దిగువకు విడుదల చేశారు. సాయంత్రానికి వరద నీరు పెరిగే అవకాశముంది. దీంతో కొల్లూరు మండలంలోని లంక గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశాల మేరకు రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి అధికారులను మరింత అప్రమత్తం చేశారు. వరద సమాచారాన్ని లంక గ్రామాల ప్రజలకు అందించారు. వరద పెరిగితే అన్నిరకాల చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికార యంత్రాగం సన్నద్దమైంది. వర్షం, వరద పరిస్థితులను కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాలో వర్షపాతం ఇలా మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో అత్యధికంగా 27 సెంటీమీటర్ల వర్షం కురవగా పర్చూరు నియోజకవర్గం కారంచేడులో 15 సెం.మీ, కొల్లూరులో 13, చీరాలలో 12, కర్లపాలెంలో 12, వేమరులో 11,అమృతలూరు, బాపట్లల్లో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఇంకొల్లులో 9 సెంటీమీటర్లు, రేపల్లెలో 6.5, కొరిశపాడులో 8, భట్టిప్రోలు, నిజాంపట్నంలలో, చినగంజాంలలో 6, అద్దంకిలో 5, జె.పంగులూరులో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లోనూ ఒక మోస్తరు వర్షం కురిసింది. బాపట్ల మండలం ముత్తాయిపాలెం ప్రాంతంలో వర్షానికి నీట మునిగిన వరి పొలాలు చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లో ఒక మోస్తరుగా వర్షాలు కురిశాయి. పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలంలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కృష్ణా చివరి ఆయకట్టు కావడంతో ఇక్కడ ఆలస్యంగా వరినాట్లు వేస్తారు. భారీ వర్షాలకు ఇక్కడి బీడు పొలాలు నీటమునిగి చెరువులను తలపిస్తున్నాయి. ఇంకొల్లు ప్రాంతంలో కురిసిన వర్షం ఇప్పటికే సాగులో వున్న పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు మంచిదని రైతులు పేర్కొంటున్నారు. అద్దంకి ప్రాంతంలో కొద్దిపాటి వర్షం కురిసింది. ఈ వర్షంతో పొలాలు పదునెక్కుతాయని రైతులు చెబుతున్నారు. చీరాల ప్రాంతంలో భారీ వర్షం కురిసినా పంటలు లేకపోవడంతో నష్టంలేదు. అరకొరగా వేసిన వేరుశనగ పంటకు వర్షం అనుకూలమని రైతులు పేర్కొంటున్నారు. వర్షంవల్ల బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం, పిట్టలవానిపాలెం, బాపట్ల రూరల్ మండలాల్లో సాగుచేసిన వరిపంట నీటమునిగింది. వరిపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పొలాలనుంచి నీరు బయటకు వెళ్లేదారిలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులు పొలాల్లో నీళ్లువుంటే వరి కుళ్లి పోతుందని, తిరిగి ఎద పద్దతిలో వరిసాగు చేయడం కష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో 87 హెక్టార్లలో వేరుశనగ పంట నీటమునిగింది.రైతులు అప్రమత్తం కావాలి.. జిల్లాలో వర్షాలు కురుస్తున్నందువల్ల రైతులు అప్రమత్తం కావాలి. వర్షం వల్ల నీటమునిగిన వరి పంటలో నీటిని తొలగించి ఎకరాకు 20 కిలోల యూరియా, 20 కిలోల ఎంఓపీ చల్లుకోవాలి. పొలం తడి ఆరగానే ఎక్సాకోనజెల్ 400 ఎంఎల్, బావిస్టీన్ ఎకరాకు 400 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలి. రేపల్లె నియోజకవర్గంలో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులో ఉన్నాయి. మార్క్ఫెడ్ ద్వారా 20 టన్నుల యూరియా, 20 టన్నుల డీఏపీలను సిద్ధంగా ఉంచాం. అవసరమైన రైతులు వాటిని వినియోగించుకోవాలి. – ఎం.సుబ్రమణ్యేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి -
చైతన్య ఝురి.. క్షీరపురి
చీరాల: బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పన్నులు చెల్లించకుండా చేసిన సహాయ నిరాకరణ ఉద్యమం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. భయపెట్టినా జైలుకు పంపినా మహనీయుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడిపిన చీరాల–పేరాల ఉద్యమం నేటికీ సంచలనమే. భారత స్వాతంత్య్ర పోరాటంలో చీరాల–పేరాల ఉద్యమం పేరెన్నిక పొందింది. దీనికి సారథ్యం వహించిన దుగ్గిరాల గోపాలకష్ణయ్య అకుంటిత దీక్షతో వాక్చాతుర్యంతో పోరాటం చేసి ‘ఆంధ్రరత్న’ బిరుదుతో ప్రజల హృదయాల్లో నిలిచారు. కాంగ్రెస్ ఉద్యమంలో చేరి దేశమాత సేవలో భాగంగా దుగ్గిరాల జాతీయోద్యమంలో పాల్గొంటూ 1919లో చీరాల వచ్చారు. అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం చీరాలను మున్సిపాలిటీగా చేసి అధిక పన్నుల భారాన్ని మోపింది. దీంతో ప్రజలు మున్సిపాలిటీ రద్దును కోరుతూ అప్పటి ఒంగోలు కలెక్టర్ శొంఠి రామ్మూర్తి పంతులు వద్దకు చర్చకు వెళ్లారు. అయితే సబ్ కలెక్టర్ అభిప్రాయాలు దుగ్గిరాలకు నచ్చలేదు. దీంతో గోపాలకృష్ణయ్య ప్రజల్లో జాతీయ భావాలను పెంచేందుకు మున్సిపల్ రద్దుకు శాంతియుతంగా ప్రజల ఉద్యమాన్ని నడిపేందుకు నిర్ణయించారు. ఇందుకోసం శ్రమదాంధ్ర విద్యాపీఠ గోష్టిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని దుగ్గిరాల భావించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించింది. రామదండుతో ఉద్యమం ఉధృతం.. ఈ క్రమంలోనే జాతీయోధ్యమాన్ని శాంతియుతంగా నడిపేందుకు దుగ్గిరాల రామదండును ఏర్పాటు చేశారు. రామదండులోని సభ్యులందరూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. ఈ సమయంలోనే జరిగిన చీరాల మున్సిపల్ ఉద్యమంలో దుగ్గిరాల చురుగ్గా పాల్గొన్నారు. 1921లో మహాత్మాగాంధీ చీరాల వచ్చిన సందర్భంగా తాటాకుపై స్వాగతాన్ని రాసి ఆహ్వానం పలికారు. మున్సిపల్ రద్దుకు గాంధీ సహాయ నిరాకరణ, పుర బహిష్కరణ మార్గాలను సూచించగా దుగ్గిరాల పుర బహిష్కరణానికి పిలుపునిచ్చారు. దుగ్గిరాల నేతృత్వంలో చీరాల–పేరాల ప్రజలు మున్సిపాలిటీని వదిలి దూరంగా పాకలు వేసుకొని జీవనం సాగించారు. చీరాల రామ్నగర్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న దుగ్గిరాల అనేక ప్రాంతాలలో పర్యటించి, కాంగ్రెస్ కార్యాలయాలను స్థాపించి జాతీయోద్యమంలో ప్రజలు ఉద్యమించేలా కృషి చేశారు. దుగ్గిరాల వాక్ పటిమను, పోరాటాన్ని గుర్తించిన నాయకులు జాతీయ కాంగ్రెస్ కార్యదర్శిగా దుగ్గిరాలను ఎన్నుకున్నారు. ప్లేగు వ్యాధి కారణంగా 1928 జూన్ 10వ తేదిన దుగ్గిరాల మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని చీరాలలో ఊరేగించి రామ్నగర్లో దహన సంస్కారం చేశారు. అనంతరం దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కాంస్య విగ్రహాన్ని పట్టణ నడిబొడ్డున ఏర్పాటు చేశారు. చీరాల నుంచే ఎన్నో ఉద్యమాలకు పునాది దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న ‘చీరాల – పేరాల’ ఉద్యమం బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం నడిపిన ‘దుగ్గిరాల’ -
నేడు పాఠశాలలకు సెలవు
డీఈఓ పురుషోత్తమ్ బాపట్లటౌన్: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో పురుషోత్తమ్ తెలిపారు. జిల్లాలోని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు మొత్తం సెలవు అమలు చేయాలన్నారు. శుక్రవారం బాపట్ల పట్టణంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొనాలన్నారు. మండలాల్లోని విద్యార్థులు ఆయా పాఠశాలలకు హాజరై ఆగష్టు 15 దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా ఎస్పీ తుషార్డూడీ బాపట్లటౌన్: అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపధ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ తుషార్డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ తుషార్డూడీ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా చప్టాలు, కల్వర్టులపై నుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుంటే వాటిని దాటి వెళ్లే ప్రయత్నం చేయరాదన్నారు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీవర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, జిల్లా ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి కారణంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు భారీగా వరద నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. కాలువలు దాటకుండా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వరద ముంపునకు గురయ్యే అవకాశమున్న ప్రదేశాలలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు పోలీస్ శాఖ సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. తక్షణం పోలీస్ సహాయం అవసరమైతే డయల్ 100/112, స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలన్నారు. గుంటూరు ఆర్డీగా డాక్టర్ శోభారాణి గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా డాక్టర్ జి.శోభారాణిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి. హోస్మణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్ఏసీ) ఆర్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డీవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.సుచిత్రను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు సరెండర్ చేసి, అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డాక్టర్ జి.శోభరాణి గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియలిస్టుగా పనిచేస్తున్నారు. గతంలో డాక్టర్ శోభరాణి గుంటూరు ఆర్డీగా పనిచేశారు. మూడు రోజుల పాటు మార్కెట్ షాపుల బహిరంగ వేలం నెహ్రూనగర్ (గుంటూరుఈస్ట్): గుంటూరు నగరపాలక సంస్థ కొల్లి శారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ షాపుల బహిరంగ వేలం ఈ నెల 18, 19, 20 తేదీలలో నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటల నుంచి నిర్వహిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగరంలో రాష్ట్ర గవర్నర్ పర్యటన, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల వల్ల వాయిదా పడిన షాపుల వేలాన్ని నిబంధనల మేరకు నిర్వహిస్తామన్నారు. అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలి రోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈఓ రేఖ తెలిపారు. -
‘క్విట్ ఇండియా’ అమరవీరులకు ఘన నివాళి
తెనాలి: క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలిలో 1942 ఆగస్టు 12న జరిగిన నిరసనలో పోలీసుల కాల్పుల్లో కన్నుమూసిన ఏడుగురు అమరవీరులకు మంగళవారం ఘన నివాళి అర్పించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన వీర సంస్మరణ దినోత్సవంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్, తెనాలి సబ్కలెక్టర్ వి.సంజనా సింహ, మున్సిపల్ చైర్ పర్సన్ తాడిబోయిన రాధిక, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు రణరంగచౌక్లోని అమరవీరుల స్తూపాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరులకు జోహార్లు అర్పించారు. ముందుగా అన్నాబత్తుని పురవేదిక నుంచి ర్యాలీగా బయలుదేరి రణరంగ్ చౌక్కు చేరుకున్నారు. ఎన్సీసీ క్యాడెట్లు, పోలీసులు కవాతుగా తరలి వచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అక్కడి తెలుగు తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. తదుపరి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షత వహించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. విశేష సేవలందించిన ప్రముఖులకు, స్వాతంత్య్రోద్యమంలో అసువులుబాసిన వారి కుటుంబ సభ్యులకు సత్కరించారు. సత్కారం అందుకున్నవారిలో సమరయోధుడు షేక్ అబ్దుల్ వహాబ్ కోడలు షేక్ నూర్జహాన్, మరో సమర యోధుడి కుమారుడు షేక్ కరిముల్లా, డీ3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి.శారద, మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవాసమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ, హెల్పింగ్ సోల్జర్స్ ఇనయతుల్లా, ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు, తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, మాజీ సైనికోద్యోగి అనంతగిరి ఏడుకొండలరావులు ఉన్నారు. నృత్యగురువులు ఎ.వెంకటలక్ష్మి, ఆరాధ్యుల తేజస్విప్రఖ్యల శిష్యబృందం వివిధ నృత్యాంశాలను, ‘మా తెలుగు తల్లి’ నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. స్తూపాల వద్ద నివాళులర్పించిన మంత్రి మనోహర్ బహిరంగ సభలో పలు రంగాల ప్రముఖులకు సత్కారం -
అట్రాసిటీ కేసుపై విచారణ
మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామం ఆర్టీసీ బస్టాండ్లో బాత్రూమ్లు కడిగే మహిళలను సోమవరప్పాడుకు చెందిన గోలి అజయ్ కులంపేరుతో తిట్టాడని, ప్లాస్టిక్ పైపులతో వాతలు పొంగేలా కొట్టాడని గతవారంపోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. దీనిపై మంగళవారం చీరాల డీఎస్పీ ఎస్డీ మోయిన్ బాధితులు ఉండే బస్టాండ్ ఆవరణకు వచ్చి వారిని విచారించారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహ్మద్ రఫీ, సిబ్బది ఉన్నారు. సిమెంట్ దిమ్మెనుఢీకొన్న కారు మేదరమెట్ల: లారీని తప్పించబోయిన కారు డివైడర్ కోసం ఉంచిన సిమెంట్ దిమ్మెను ఢీకొన్న ఘటన పీ.గుడిపాడు జాతీయరహదారిపై మంగళవారం జరిగింది. అందిన వివరాల మేరకు.. తెనాలి నుంచి శ్రీకాళహస్తి వెళ్తున్న కారు పీ.గుడిపాడు జాతీయ రహదారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రాంతానికి రాగానే ఆదే దారిలో వెళ్తున్న లారీ కారు పైకి వస్తుందని కారు డ్రైవర్ కారును పక్కకు తిప్పాడు. అదుపు తప్పిన కారు సిమెంట్ దిమ్మెను ఢీ కొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు ఉన్నారు. ఎవరికి గాయాలు కాలేదు. కాలువలోకి దూసుకెళ్లిన లారీ చీరాల: జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు లారీ అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్ళిన సంఘటన మంగళవారం జాతీయ రహదారిలోని మన్నం అపార్ట్మెంట్ వద్ద జరిగింది. అందిన వివరాల మేరకు పైపుల లోడుతో కోల్కతా నుంచి చైన్నె వెళుతున్న హెవీ లారీ అదుపుతప్పింది. ఒక్కసారిగా బోల్తా పడి రహదారి వెంట ఉన్న కాలువలోకి దూసుకెళ్ళింది. అయితే ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతోప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. దూర ప్రాంతం నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. రూ. 1,40,520 నగదు సీజ్ అదుపులో 10 మంది పేకాట జూదరులు చినగంజాం: మండలంలోని మోటుపల్లి పంచాయతీ పరిధిలోని కుంకుడు చెట్లపాలెం గ్రామంలో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఇంకొల్లు సీఐ వైవీ రమణయ్య ఆధ్వర్యంలోని పోలీసులు బృందం పేకాట శిబిరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,40,520 నగదు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్ఐ శీలం రమేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సెప్టెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ గుంటూరు లీగల్: సెప్టెంబరు 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరగనుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ చక్రవర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలో ఆర్థిక సంస్థలు, బీమా సంస్థల అధికారులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అదాలత్లో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్, సివిల్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. స్టేక్ హోల్డర్స్, ప్రతినిధులు సహకరించాలన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి ఆర్.శరత్ బాబు, మూడవ అదనపు జిల్లా జడ్జి సి.హెచ్. వెంకట నాగ శ్రీనివాసరావు , రెండవ అదనపు జిల్లా జడ్జి వై.నాగరాజా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్, బార్ ప్రెసిడెంట్ వై.సూర్యనారాయణ సూచనలు చేశారు. -
కార్మికుల సంక్షేమ బాధ్యత అధికారులదే..!
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: కార్మికుల సంక్షేమం, వారి హక్కుల సంరక్షణ బాధ్యత అధికారులదేనని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలపై పరిశ్రమల యాజమాన్యం, అనుబంధశాఖల అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కార్మికుల కోసం ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలను కార్మికులందరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అసంఘటిత రంగ కార్మికులందరిని ఈ–శ్రమ పోర్టల్లో చేర్చాలన్నారు. ప్రతి కార్మికుడికి యాజమాన్యాలు పీఎఫ్, ఈఎస్ఐలో రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. కార్మికులు శ్రమ దోపిడీకి గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రోజుకు ఎనిమిది గంటలే పనిచేయాలని, వారానికి ఒక సెలవు తప్పనిసరిగా ఉండాలన్నారు. పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలను కార్మికులకు వర్తింపచేయాలన్నారు. వీటిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ త్రినాథ్, డిప్యూటీ కమిషనర్ గాయత్రిదేవి, సహాయ కార్మిక శాఖ కమిషనర్ వెంకట శివప్రసాద్, సహాయ కార్మిక శాఖ అధికారి వి.సాయిజ్యోతి, పరిశ్రమలశాఖ జిల్లా మేనేజర్ రామకృష్ణ, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. ఉపాధి పనులు వేగవంతం చేయాలి.. బాపట్ల: ఉపాధి హామీ పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. వెంకట మురళి అధికారులకు సూచనలు చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో సమావేశ మందిరంలో ‘ఉపాధి’ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద మండలాల్లో మిగిలి ఉన్న 46 పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఎంపీడీఓలకు సూచించారు. జాబ్ కార్డుల జారీపై ఆరా తీశారు. దిగువస్థాయి కుటుంబాలను గుర్తించి వారికి జాబ్ కార్డులు ఇవ్వాలన్నారు. జిల్లాలో డెంగీ జ్వరాల వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గడిచిన రెండు రోజుల్లో కొల్లూరు మండలంలో పెద్దలంక, చింతలలంక గ్రామాల్లో రెండు కేసులు, ఈదుపల్లి, యాజలిలో ఒక్కో కేసు నమోదయిందని వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పీడీ డ్వామా విజయలక్ష్మి, డీపీఓ ప్రభాకర్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, పంచాయతీరాజ్ ఈఈ వేణుగోపాల్రెడ్డి, బాపట్ల, చీరాల డీఎల్డీఓలు విజయలక్ష్మి, పద్మావతి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ పీఎం మాధవి పాల్గొన్నారు. పరిశుభ్రతతోనే విద్యార్థులకు ఆరోగ్యం బాపట్ల: పరిశుభ్రతతోనే విద్యార్థుల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. మంగళవారం స్థానిక డాక్టర్ అంబేడ్కర్ గురుకులం పాఠశాలలో జరిగిన నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.భారీ వర్షాల హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండండి... బాపట్ల: భారీ వర్షాల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. విపత్తు నిర్వహణ, పర్యవేక్షణపై ఆర్డీఓలతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో ఆయన సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి 2.50 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నందున్న అధికారులు అప్రమత్తం కావాలన్నారు. ఇన్చార్జి జేసీ జి.గంగాధర్ గౌడ్, రివర్ కన్సర్వేటర్ కార్యనిర్వాహక ఇంజినీర్ రవికిరణ్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి పాల్గొన్నారు. -
రొయ్య రైతుకు ధరాభారం
రొయ్య రైతులను ఎగుమతి వ్యాపారులు, కంపెనీలు ట్రంప్ సుంకాల పేరుతో వంచిస్తున్నా కూటమి సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఆది నుంచి రైతులంటే గిట్టని బాబు సర్కార్ రొయ్య రైతులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ధరలు స్థిరంగా ఉండేలా చూసి నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు. వారికి సబ్సిడీతో విద్యుత్ అందించారు. ఇప్పడు కూటమి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపి రొయ్య రైతులను ఇబ్బందులను గురిచేస్తోంది. సాక్షి ప్రతినిధి, బాపట్ల: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకం బూచి చూపి ఎగుమతి దారులు, కంపెనీలు రొయ్యల ధరలను అమాంతం తగ్గించడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ధరలు పతనం కావడంతో జిల్లాలో 60 శాతానికి పైగావున్న కౌలు రైతులు మరింతగా నష్టపోతున్నారు. పెట్టుబడి రాని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం వనామీ 100 కౌంట్ ధర రూ. 270 ఉండగా ప్రస్తుతం రూ.225కు తగ్గింది. టైగర్ రొయ్య 20 కౌంట్ ధర నెల రోజుల క్రితం రూ. 680 ఉండగా ప్రస్తుతం 570కి తగ్గింది. ఈ లెక్కన నెలరోజుల్లో వనామీ ధర రూ. 45, టైగర్ ధర రూ. 100 తగ్గింది. దీనివల్ల లాభాల సంగతి దేవుడెరుగు పెట్టు బడులు కూడా రావని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు రొయ్యల సాగు పెట్టుబడులు ఏడాది కేడాదికి పెరుగుతున్నాయి. విద్యుత్ బిల్లులు రెట్టింపవగా, జీవ రసాయన మందుల ధరలు అయాంతం పెరిగాయి. పెరిగిన వర్కర్స్ జీతాలు దీనికి తోడయ్యాయి. దీంతో ఎకరం రొయ్యల సాగుకు రూ.4లక్షల నుంచి 5 లక్షల ఖర్చవుతోంది. ఈ లెక్కన పెట్టుబడులు రావాలంటే వనామీ 100 కౌంట్ కౌలు రైతు అయితే రూ. 250 అమ్మాలి. సొంత రైతు అయితే రూ.225 అమ్మాలి. కానీ ప్రస్తుతం ధరలు అంతకు మించి తగ్గాయి. దీంతో లాభాల సంగతి దేవుడెరుగు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కానరావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో సాగు ఇలా.. జిల్లాలో రేపల్లె, నగరం, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో 12 వేల మంది రైతులు 21 వేల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు. ఇందులో 70 శాతం వనామీ సాగులో ఉండగా 30 శాతం టైగర్ రొయ్యను సాగుచేస్తున్నారు. ట్రంప్ సుంకాల బూచి చూపి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల బూచి చూపి ఎగుమతి దారులు, కంపెనీలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. వాస్తవానికి 100 కౌంట్ రొయ్య అమెరికాకు వెళ్లదు. కేవలం 20, 30, 40, 50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో వనామీలో అధికంగా 100 కౌంట్ రొయ్యల విక్రయాలు మాత్రమే సాగుతున్నాయి. వనామీ 100 కౌంట్ రొయ్య చైనా, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. అమెరికాకు రొయ్య ఎగుమతి కాకుండానే ఎగుమతి దారులు, వ్యాపారులు ట్రంప్ సుంకాల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ధరలు తగ్గించి రొయ్య రైతును దోపిడీ చేస్తున్నారు. ఒక్క కిలోకు రూ. 45 తగ్గితే ఎకరాలో వచ్చే దిగుబడి 1.50 టన్నులు అనుకున్నా రూ. 70 వేలకు పైగా నష్టం వస్తుండగా కౌలు రైతుకు రూ. 1.20 లక్షల నుంచి 1.70 లక్షల నష్టం వస్తోంది. టైగర్ ధర రూ.570 (20 కౌంట్) తగ్గిన ధర రూ. 100వనామీ ధర: 225 (వంద కౌంట్) నెలలో తగ్గిన ధర: రూ. 50 రూ.లక్ష (ఎకరాకు) పట్టించుకోని ట్రంప్ సుంకాల బూచి చూపి ధరల తగ్గింపు అమెరికాకు 100 కౌంట్ రొయ్యల ఎగుమతి లేకపోయినా ధర తగ్గింపు జిల్లాలో 21 వేల ఎకరాల్లో రొయ్యల సాగు 70 శాతం వనామీ, 30 శాతం టైగర్ సాగు సాగు దారుల్లో 60 శాతం మంది కౌలు రైతులే.. ఎగుమతి కంపెనీలు, వ్యాపారులు కలిసి వంచిస్తున్నారంటూ రైతుల గగ్గోలు ఎకరాకు రూ.లక్షపైనే నష్టం రొయ్యల ఉత్పత్తి బాగా ఉంటే ఎకరానికి 2 టన్నులు దిగుబడి ఉంటుంది. ప్రస్తుతం సగటున ఎకరానికి 1.50 టన్నులకు మించి దిగుబడి రావడంలేదు. ఈ లెక్కన వున్న ధరతో ఎకరాకు రూ. 3.50 లక్షలకు మించి రాబడి వుండడంలేదు. దీంతో ఎకరాకు సొంత రైతుకు రూ.లక్షకు తగ్గకుండా, కౌలు రైతు రూ. 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఎకరం కౌలు చెరువులనుబట్టి రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష ఉంది. కౌలు రైతులకు వడ్డీలు అదనపు భారంగా మారనున్నాయి. దీంతో రొయ్య రైతులు లబోదిబోమంటున్నారు. -
వైఎస్సార్ సీపీని బలహీనపరిచేందుకు కూటమి కుట్ర
వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ఉపాధ్యక్షుడు భవనం శ్రీనివాసరెడ్డి పర్చూరు (చినగంజాం): రాష్ట్రంలో వైఎస్సార్సీపీని బలహీనపరచాలన్నదే ప్రధాన ఎజెండాగా కూటమి ప్రభుత్వంలోని టీడీపీ కుట్ర చేస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ఉపాధ్యక్షుడు భవనం శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుమారు 50కి పైగా జెడ్పీటీసీ స్థానాలు ఖాళీలుంటే కేవలం వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్టలో మాత్రమే ఉప ఎన్నికలు నిర్వహించడం కూటమి ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల పర్వం ముగిసి మరో రెండు రోజుల్లో పోలింగ్ జరుగుతుందన్న పరిస్థితుల్లో పోలింగ్ బూత్ల మార్పు చేయడమనేది రాష్ట్ర చరిత్రలోనే ఎన్నికల కమిషన్ తీసుకున్న దురదృష్టకరమైన చర్య అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థకు తూట్లు పొడిచేలా ఎన్నికలు నిర్వహించడమే కాక పోలింగ్ బూత్లలోకి ఏజెంట్లను పోనివ్వకుండా నిలుపుదల చేయడం, పోటీ చేసిన అభ్యర్థిని కనీసం ఓటువేసేందుకు కూడా రానివ్వకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని టీడీపీ గూండాలు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం అన్నారు. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తాను పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఇంతటి దారుణమైన ఎన్నికల ప్రక్రియను చూడలేదని అన్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల జరుగుతున్న తీరు ఎన్నికల కమిషన్కు సిగ్గు చేటు అన్నారు. -
ఉప ఎన్నికల తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు వేమూరు: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు పేర్కొన్నారు. మంగళవారం వేమూరులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలు జరిగిన తీరు చూస్తుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో పని చేస్తుందని తేటతెల్లం అవుతుందన్నారు. టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ఎన్నికల ఎజెంట్లను బూత్ల్లోకి రాకుండా అడ్డుకున్న తీరును ప్రజలు చూశారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులను ఓట్లు వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారన్నారు. పోలీసులు కొమ్ముకాయడంతో టీడీపీ నేతలు బహిరంగంగా రిగ్గింగ్ పాల్పడ్డారన్నారు. పులివెందులలో బలం లేదని తెలిసీ, చంద్రబాబు రిగ్గింగ్లు, బూత్ల ఆక్రమణలకు తెరలేపాడన్నారు. ఇప్పటికై నా ఎన్నికల కమిషన్ కలుగజేసుకుని రిగ్గింగ్ జరిగిన బూత్ల్లో రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మెటల్ క్వారీలో కార్మికుడు మృతి బల్లికురవ: క్వారీల్లో నిబంధనలు భద్రతా చర్యలు పాటించనందున ప్రమాదాలు పునరావృతం అవుతున్నాయి. మొన్న గ్రానైట్ క్వారీలో రాయి డ్రిల్లింగ్ చేస్తుండగా జరిగిన ఘోర ప్రమాదాన్ని మరవక ముందే మంగళవారం మెటల్ క్వారీలో డ్రిల్లింగ్ చేస్తుండగా రాళ్లుపడి వలస కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అందిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం మదలీబదర్ గ్రామానికి చెందిన సాధురామ్ కశ్యప్ (32) మండలంలోని నక్కబొక్కలపాడు గ్రామ సమీపంలోని సనకొండ వెంకటసాయి మెటల్ క్వారీలో పనిచేస్తున్నాడు. మంగళవారం క్వారీ ఎగువ భాగంలో జాకితో రాయి డ్రిల్లింగ్ చేస్తున్నాడు. పైనున్న రాళ్లు కశ్యప్పై పడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. బతుకుదెరువుకు ఇక్కడ మెటల్ క్వారీలో పనిచేస్తున్నాడు. వీఆర్ఓ ముసలయ్య ఫిర్యాదుతో బల్లికురవ ఎస్ఐ వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టౌన్ హాల్ @120
ప్రథమాంధ్ర మహా సభలకు వేదిక బాపట్ల అర్బన్: ఘనమైన చరిత్రకు సజీవ సాక్ష్యం బాపట్ల టౌన్ హాల్. స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో మరుపురాని ఘట్టాలకు ఈ టౌన్హాల్ వేదికగా నిలిచింది. ఈ భవనం నిర్మించి 120 సంవత్సరాలు పూర్తయింది. 1905 సంవత్సరం జూలై 17న అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ బ్రాడీ ఈ టౌన్ హాలును ప్రారంభించారు. మహాత్మా గాంధీ, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ఎందరో జాతీయ నాయకులు వివిధ సందర్భాలలో ఈ టౌన్ హాల్ సందర్శించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 1913 మేలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలకు టౌన్హాల్ వేదికగా నిలిచింది. ఇంగ్లాండులో పట్టాభిషిక్తుడు అవుతున్న చక్రవర్తి ఎడ్వర్డ్ గౌరవార్థం ఎడ్వర్డ్ పట్టాభిషేక స్మారక టౌన్హాల్గా దీనికి నామకరణం చేశారు. ఆయన పట్టాభిషేకం రోజునే ఈ టౌన్హాల్ నిర్మాణం జరిగింది. 1908లో బాపట్లకు వచ్చిన జిల్లా మున్సిఫ్ మెజిస్ట్రేట్ న్యాపతి సుబ్బారావు పంతులు చొరవతో టౌన్ హాల్లో టెన్నిస్ కోర్టు ప్రారంభమైంది. నిత్యం సాహిత్య, సాంస్కతిక కార్యక్రమాలతో టౌన్ హాల్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ టౌన్ హాల్లో న్యూస్ పేపర్ క్లబ్ నిరంతరం పాఠకులకు అందుబాటులో ఉంది. -
‘జీరో’ దందాలో అక్రమ ‘వసూళ్లు’
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా కొందరు జీరో వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. అధికారులు, వ్యాపారాలు కుమ్మకై ్క లాభాలను అందినకాడికి జేబుల్లో వేసుకుంటున్నారు. చీరాల కేంద్రంగా జీరో వ్యాపారం జోరుగా సాగుతోంది. కింది స్థాయి సిబ్బంది వసూళ్లతో కనీస చర్యలు లేవు. చీరాల: ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులను ఎగవేస్తూ కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. జీరో వ్యాపారం సాగించడంతో ఖజానాకు పన్నుల రూపంలో అందాల్సిన నగదు తాయిలాలుగా మారుతోంది. తక్కువ చేసినట్లుగా చూపించి.. ఇంత జరుగుతున్నా జీఎస్టీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. వాణిజ్య సంస్థలు నడుపుతున్న వ్యాపారాలు వారు చేసే లావాదేవీలకు సంబంధించి ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో పన్నులను సక్రమంగా చెల్లించాలి. వ్యాపారం అధిక మొత్తంలో చేస్తూ తక్కువ చేసినట్లుగా చూపించి జీఎస్టీని ఎగవేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారస్తులు సకాలంలో పన్నులు చెల్లిస్తేనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకున్నా జీఎస్టీ వసూళ్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. చీరాల ప్రాంతంలో వేరుశనగ పప్పు మిల్లులు, వస్త్ర వ్యాపారం, జీడిపప్పు, ధనియాలు ఎక్కువ మొత్తంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. వేరుశనగ పప్పు మిల్లుల యజమానులు సరైన బిల్లులు లేకుండానే రూ.లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలకు, చెల్లించే పన్నులకు పొంతన ఉండదు. అంతా జీరో వ్యాపారమే. జీఎస్టీ లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నా అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెడీమేడ్ వస్త్రాలదీ అదే దుస్థితి.. చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం ప్రాంతంలో ఎక్కువగా జీడిపప్పు పరిశ్రమలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు జీడిపప్పును నామమాత్రపు బిల్లులతో తరలించేస్తున్నారు. చెల్లించే నగదుకు రాసే బిల్లుకు పొంతన లేకుండా ఉంది. వస్త్ర వ్యాపారానికి సంబంధించి రెడీమేడ్ వస్త్రాలకై తే అసలు కాగితాలే ఉండవు. పండుగ సీజన్లలో ముంబయి, కోల్కత్తా ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో వస్త్రాలను దిగుమతి చేసుకుంటారు. అధికారుల కళ్లుగప్పి రైల్వే పార్శిల్స్లో, ట్రాన్స్పోర్టు వాహనాలలో చీరాలకు తరలిస్తున్నారు. గతంలో రైల్వే పార్శిల్లో దిగుమతి చేసుకున్న రెడీమేడ్ వస్త్రాలను ఆదాయ పన్ను అధికారులు పట్టుకున్నారు. పేరుకు మాత్రమే వ్యాపార సంస్థగా చలామణి అవుతూ సరైన బిల్లులు, రబ్బర్ స్టాంపులు లేకపోవడంతో పార్శిల్ కార్యాలయాల్లో ఉండిపోతున్నాయి. ఎక్కువ మొత్తంలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ జీఎస్టీలు లేకుండా ఎక్కువగా సరుకులు దిగుమతి చేసుకుంటున్నారు. సరైన పత్రాలు లేకుండా దిగుమతి అయిన మూటలు పార్శిల్ కార్యాలయాల్లో నిల్వ ఉండి పోతున్నాయి. బిల్లు కావాలంటే ఎక్కువ ధర అవుతుందని కొనుగోలుదారులను మభ్యపెడుతున్నారు. అధికారుల ఉదాసీనత.. జీరో వ్యాపారంలో జరిగే అక్రమాలు గురించి జీఎస్టీ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. జీరో బిజినెస్కు ఒక్క రూపాయి కూడా జీఎస్టీ రాదు. జీఎస్టీ అధికారులు, ఆడిటర్లు కూడా పన్నులు తగ్గించేందుకు వ్యాపారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టీలు నుంచి ప్లాస్టిక్ సామాన్లు వరకు ఏ వస్తువు తీసుకున్న జీఎస్టీ బిల్లు ఉండదు. మొబైల్ షాపుల బిజినెస్ కూడా జీరో వ్యాపారమే. జీఎస్టీ అధికారులను దీనిపై అడిగితే ‘మాకు తనిఖీ చేసే అధికారం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులు ఆదేశిస్తారంటూ’ చెబుతున్నారు. ఇదే అదనుగా కొందరు దిగువ స్థాయి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పార్శిల్ కార్యాలయాలలో తనిఖీలు చేస్తూ అపరాధ రుసుము విధిస్తున్నారు. చీరాలలో కొత్తగా బాధ్యతలు చేపట్టాను. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే. త్వరలో వేరుశనగ పప్పు మిల్లులు, జీడిపప్పు పరిశ్రమలు, రెడీమెడ్ వస్త్రాలతోపాటు చీరాల కేంద్రంగా జరుగుతున్న వ్యాపార లావాదేవీలపై దృష్టి పెడతాం. తనిఖీలు చేపట్టి జరిమానాలు విధిస్తాం. అవసరాన్ని బట్టి జీఎస్టీ వసూలు చేస్తాం. – శ్రీనివాస్, జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్, చీరాల