breaking news
Bapatla
-
అమరావతిలో ఏడీబీ బృందం పర్యటన
తాడికొండ: ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) బృందం సోమవారం రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించింది. తొలుత విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లిన ఆ బృందానికి కమిషనర్ కె.కన్నబాబు, అడిషనల్ కమిషనర్లు జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్, అమిలినేని భార్గవ్ తేజలు స్వాగతం పలికారు. అనంతరం సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్)లోని ముఖ్య అధికారులతో బృందం సమావేశమైంది. అమరావతి నిర్మాణ పురోగతిని కమిషనర్ కన్నబాబు వివరించారు. తర్వాత రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పలు పనులను బృందం పరిశీలించింది. గ్రీవెన్స్ రిడ్రెస్సల్ మెకానిజం(జీఆర్ఎం) గురించి వివరాలు తెలుసుకుంది. దీనిపై సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యటనలో ఏడీబీ– వాటర్ – అర్బన్ డెవలప్మెంట్ సెక్టార్ బృందంలోని సభ్యులైన నోరియా సైటో (సీనియర్ డైరెక్టర్), మనోజ్ శర్మ (డైరెక్టర్), సంజయ్ జోషి (ప్రిన్సిపాల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్), అశ్విన్ హోసూర్ విశ్వనాథ్ (సీనియర్ ప్రాజెక్టు ఆఫీసర్)లు పాల్గొన్నారు. -
జీఎస్టీ సమావేశంలో గ్రూపు విభేదాలు బహిర్గతం
భట్టిప్రోలు(వేమూరు) : జీఎస్టీపై ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో తెలుగుదేశం పార్టీలో రెండు గ్రూపుల మధ్య కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమయ్యాయి. భట్టిప్రోలులో సోమవారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీన్ని పార్టీలోని ఒక గ్రూపు బహిష్కరించింది. భట్టిప్రోలు మండల కేంద్రంలో తూనుగుంట్ల సాయిబాబా, బట్టు మల్లికార్జునరావు మధ్య గ్రూపు విభేదాలు నెలకొన్నాయి. రథం సెంటరులో జీఎస్టీపై అవగాహన సదస్సును సోమవారం తూనుగుంట సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించారు. బట్టు మల్లికార్జునరావు వర్గానికి చెందిన పార్టీ నాయకులు హాజరు కాక పోవడంతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తల పట్టుకున్నారు. పార్టీలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత వర్గ పోరు బయట పడటంతో ఆయనకు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత శుక్రవారం కొల్లూరు మండల కేంద్రంలోని బస్స్టాండ్ సెంటరులో శుక్రవారం జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కొల్లూరు మండలంలోని మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన ప్రసాద్, పార్టీ మండల అధ్యక్షడు మైనేని మురళీ మధ్య కొనసాగుతున్న వర్గ పోరు కొట్టుకునే దిశగా వెళ్లింది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమక్షంలో ఇరు వర్గాలు కొట్టుకున్నారు. కొంత మందికి గాయాలయ్యాయి. మిగితా మండలాల్లోనూ విభేదాలు బహిర్గతమయ్యే పరిస్థితి నెలకొందని కొందరు టీడీపీ నేతలు అంటున్నారు. వర్గాల పోరుపై ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ఎమ్మెల్యే హాజరైన కనిపించని నాయకులు -
మాజీ సైనికుడు బాజీబాబాకు ఘనంగా నివాళులు
నిజాంపట్నం: మాజీ సైనికుడు షేక్ బాజీబాబా విశాఖపట్టణం జిల్లా భీమిలిలో అకాల మరణం చెందారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన నిజాంపట్నం మండలం బావాజీపాలేనికి తీసుకువచ్చారు. సోమవారం నిర్వహించిన అంతిమ యాత్రలో పలువురు సైనికులు, మాజీ సైనికులు, గ్రామస్తులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో ఆయన అంతిమయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, జిల్లా సైనిక్ వెల్పేర్ కార్యాలయ అధికారి మునిపల్లె శ్రీనివాసరావు, అసోసియేషన్ ట్రెజరర్ నిజాముద్దీన్, నిజాంపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ సుల్తాన్ మెహబూబ్, బాపట్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, పొన్నూరు అసోసియేషన్ సెక్రటరీ మాసుం అలీ, మాజీ సైనికులు షేక్ అల్లావుద్దీన్, తాడివాక రుక్మధరరావు, చినమట్లపూడి, బావాజీపాలెం, పరిసర ప్రాంతాల మాజీ సైనికులు పాల్గొన్నారు. అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ సైనికులు -
చెకుముకి సంబరాలను విజయవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సృజనాత్మకను వెలికితీసేందుకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. సోమవారం బ్రాడీపేటలో సైన్స్ సంబరాల పోస్టర్లు విడుదల చేశారు. లక్ష్మణరావు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 35 ఏళ్లుగా ఈ సంబరాలను నిర్వహిస్తోందని వివరించారు. ఈ నెల 8న పాఠశాల స్థాయి, నవంబర్ 1న మండల స్థాయి, 23న జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సంబరాల నిర్వహణకు విద్యాశాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, ఎం.ఉదయ్ భాస్కర్, టి.జాన్బాబు, జి.వెంకట్రావు, టీఆర్ రమేష్, టీఆర్ చాందిని, కె.శ్రీనివాస్, యు.రాజశేఖర్ పాల్గొన్నారు. -
సముద్ర స్నానానికి వచ్చి వివాహిత మృతి
చినగంజాం: సముద్ర స్నానం చేసేందుకు వచ్చి వివాహిత మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని మోటుపల్లి సముద్ర తీరంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శీలం రమేష్ వివరాల మేరకు.. చీరాల వాడరేవు పరిధిలోని అడవి పల్లెపాలెం గ్రామానికి చెందిన ఊసుపల్లి శాంతి (25)కి ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన సలగల వినయ్ అనే పాస్టర్తో చర్చికి వెళ్లే క్రమంలో పరిచయం ఏర్పడింది. ఆమె గడచిన కొద్ది రోజులుగా పందిళ్లపల్లి పాతరెడ్డి పాలెం గ్రామానికి వచ్చి ఆమె సోదరి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె పాస్టర్ వినయ్తో కలిసి మోటుపల్లి సముద్ర తీరానికి స్నానం చేసేందుకు వచ్చింది. ఇద్దరు స్నానం చేసే క్రమంలో ఆమెను నీటిలో వదలి పెట్టి వినయ్ బయటకు వచ్చేశాడు. ఘటనను గమనించి స్థానికంగా ఉన్న మత్స్యకారులు ఆమెను ఒడ్డుకు తీసుకొని వచ్చి 108కి సమాచారం అందించారు. ఆమె ఆ పాటికే చనిపోయినట్లు గుర్తించారు. మృతురాలికి భర్త, ఇద్దరు సంతానం ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పాస్టర్ వినయ్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
తెనాలి రూరల్: బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని మారిస్పేటలో ఉన్న సీఎం కాలనీలో ఆదివారం రాత్రి గ్యార్మీ పండుగ చేసుకున్నారు. దీనికి బాపట్ల జిల్లా అప్పికట్లకు చెందిన నాయబ్ రసూల్ (45), అతని బంధువు గౌస్బాషా, మరో చిన్నారి వసీం కుటుంబసభ్యులతో వచ్చారు. తిరిగి సోమవారం ఉదయం అప్పికట్లకు బైక్పై వెళుతున్నారు. ఈ క్రమంలో తెనాలి వైకుంఠపురం నుంచి జగ్గడిగుంటపాలెం వైపు వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నాయబ్రసూల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. ఘటనాస్థలాన్ని త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంగళగిరి టౌన్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరిలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. విజయవాడ, ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ముదిగొండ వెంకట ప్రమీల తన కుమారుడు వెంకట సురేంద్ర (18)తో కలసి ద్విచక్రవాహనంపై గుంటూరులోని బంధువుల ఇంటికి సోమవారం వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో మంగళగిరి ఆత్మకూరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. సురేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో ప్రమీలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం సురేంద్ర మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
98 డీఎస్సీ టీచర్ల సభకు తరలిరండి
గుంటూరు ఎడ్యుకేషన్: విజయవాడలోని ధర్నా చౌక్లో ఈ నెల 11వ తేదీన తలపెట్టిన 1998–డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయుల రాష్ట్రస్థాయి విజ్ఞాపన సభకు తరలిరావాలని గుంటూరు జిల్లా 98 ఎంటీఎస్ టీచర్ల మహిళా విభాగ అధ్యక్షురాలు శారద, శౌరీలమ్మ, ధనలక్ష్మి, పార్వతి, రూత్బస్లీనాలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ సేవలను క్రమబద్ధీకరించి, ఉద్యోగ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని కోరారు. రిటైర్ అయినవారికి రూ.20 వేల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో చేపడుతున్న సభకు ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.వృద్ధుడిని బలిగొన్న బైకు మోతడక(తాడికొండ): ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన తాడికొండ మండలం మోతడక గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతడక గ్రామానికి చెందిన కొమ్మినేని సాంబశివరావు (67) ఆదివారం సాయంత్రం సచివాలయం సెంటర్లో రోడ్డు దాటుతున్నాడు. అమరావతి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం వేగంగా అతడిని ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే జీజీహెచ్కు తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వాసు తెలిపారు.ఏనుగుపాలెంలో యువకుడి హత్యవినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుంటూరు శివ (35)ను గుర్తుతెలియని వ్యక్తులు గ్రామ సమీప పొలాల్లో గడ్డపారతో పొడిచి హత్య చేసినట్లు సోమవారం గుర్తించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, ఇన్చార్జి సీఐ బాలాజీ సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. హత్యపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. మృతుడికి భార్య సుధతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.జిల్లా వ్యాప్తంగా వర్షాలుకొరిటెపాడు (గుంటూరు): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల గుంటూరు జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా గుంటూరు పశ్చిమలో 49.6, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు 16.5 మి.మీ.గా కురిసింది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు.. తెనాలి మండలంలో 47.2, మంగళగిరి 42.4, గుంటూరు తూర్పు 42.2, పెదనందిపాడు 15.2, పొన్నూరు 15, దుగ్గిరాల 13.8, కాకుమాను 12.4, ఫిరంగిపురం 9.8, తుళ్ళూరు 8.4, పెదకాకాని 8, తాడేపల్లి 6.2, తాడికొండ 6.2, ప్రత్తిపాడు 6, చేబ్రోలు 5.4, కొల్లిపర 5.2, మేడికొండూరు మండలంలో 2.2 మి.మీ. చొప్పున వర్షపాతం కురిసింది. -
రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపిక
అద్దంకి: రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న స్కేటింగ్ పోటీలకు సోమవారం అద్దంకిలో క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని సిరీ వెంచర్లో నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ సీహెచ్ వెంకటేశ్వర్లు హాజరై అద్దంకి, ఒంగోలు, సింగరాయకొండకు చెందిన 24 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. ఇందులో 13 మంది అద్దంకి చెందిన వారు ఉన్నారు. వీరంతా రాష్ట్ర స్థాయిలో త్వరలో నిర్వహించనున్న అండర్– 11, అండర్ –14, అండర్– 17 విభాగాల్లో ఆడనున్నట్లు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వెల్లడించారు.బెండ తోటను పీకేసిన దుండగులుఅద్దంకి: మండలంలోని చక్రాయపాలెంలో దుండగులు ఓ కౌలు రైతు బెండ తోటను పీకేశారు. గ్రామానికి చెందిన నగేశ్ భూమిని సంతమాగులూరు మండలంలోని కొమ్మాపాడుకు చెందిన కాలేషా మీరావలి నాలుగేళ్ల క్రితం కౌలుకు తీసుకుని ఏటా సాగు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది అందులో బెండ తోట వేశాడు. ప్రస్తుతం అది కాపు దశలో ఉంది. ఈ క్రమంలో సోమవారం కౌలుదారు తోటను చూసుకునేందుకు వెళ్లగా అర ఎకరంలోని బెండ మొక్కలను గుర్తు తెలియని వ్యక్తులు పీకేశారు. దీనిపై మీరావలి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.జిల్లాకు 1620 మెట్రిక్ టన్నుల యూరియానాదెండ్ల: సాతులూరులోని రైల్వే ఎరువుల రేక్ పాయింట్ను నరసరావుపేట ఏడీఏ కేవీ శ్రీనివాసరావు పరిశీలించారు. పల్నాడు జిల్లాకు సీఐఎల్ యూరియా 1620 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు తెలిపారు. అనంతరం సాతులూరులోని ఆవాస్ గోడౌన్లు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేటాయించిన ఎరువులు సొసైటీలకు , ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసి రైతులకు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూడాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఆయనతో పాటు ఏఓ టి.శ్రీలత, ఏఈఓ జీపీ శ్రీనివాసరావు ఉన్నారు. -
గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ బలోపేతం లక్ష్యం
బాపట్ల: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శుద్ధ జలాలు సరఫరా చేసేలా ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జల సంరక్షణ ప్రణాళికపై స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నాలుగు జిల్లాల ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సోమవారం ప్రారంభించారు. ప్రారంభ సూచికగా జ్యోతిని వెలిగించారు. గాంధీజీ, అంబేడ్కర్ చిత్రపటాలకు ఆయన పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని తెలిపారు. జల వనరుల సంరక్షణ, అభివృద్ధిలోనూ ప్రజల సహకారం ఉండాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అధునాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఇంజినీర్లకు ఆయన సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పారు. ప్రభుత్వ విధులను ఇష్టంతో, సంతోషంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. జల జీవన్ మిషన్ పనులు పక్కాగా చేపట్టాలని, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణ మాట్లాడుతూ జల వనరుల సుస్థిరాభివృద్ధి, తాగునీరు నిరంతర సరఫరా లక్ష్యంతో అధికారులు పని చేయాలని తెలిపారు. జీవన్ మిషన్ పనులు 2028 సంవత్సరం వరకు పొడిగిస్తూ కేంద్రం అధికారికంగా అనుమతులు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో తాగునీటి సమస్యను అరికట్టడానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. జలజీవన్ మిషన్, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను గ్రామాల్లో విరివిగా చేపట్టాలని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత పర్యవేక్షణ ఇంజినీర్ రాఘవులు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, డీపీఓ ప్రభాకర్రావు, విస్తరణ శిక్షణ కేంద్రం ప్రధానాచార్యులు డి. వెంకటరావు పాల్గొన్నారు. పార్క్లను అభివృద్ధి చేయాలి బాపట్ల: ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించేలా పట్టణంలో పార్క్లను అభివృద్ధి చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ సూచించారు. సోమవారం రాత్రి పట్టణంలోని వివేకానంద కాలనీలో గల మున్సిపల్ పార్క్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ జి.రఘునాథరెడ్డితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్క్ను ఈ నెల 20న ప్రారంభోత్సవం చేయాలని, ఈలోగా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి ఆదివారం పిల్లలు పార్కుకు వచ్చే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు, పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. పిల్లలతో పాటు వచ్చే పెద్దలు పార్కులో వాకింగ్ చేసే విధంగా ట్రాక్ ఏర్పాటు చేయాలని తెలిపారు. యువతకు ఉపయోగపడే జిమ్ పరికరాలను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలో ప్రతి వార్డులో పార్క్ ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. దీని కోసం పట్టణ పరిధిలో ప్రభుత్వ భూములను పరిశీలించాలని ఆర్డీఓను, తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు.ఆయన వెంట ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ శాలీమా, మున్సిపల్ డీఈ సిబ్బంది ఉన్నారు. -
ఆగని మరణ మృదంగం
స్జాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్: గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో అంతుచిక్కని మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రామంలోని చల్లా కృష్ణవేణి (24) పది రోజులపాటు జ్వరంతో బాధపడి చికిత్స పొందుతూ చివరికి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆదివారం మృత్యువాతకు గురైంది. గత నెల సెప్టెంబర్ 3, 4 తేదీల్లో రెండు మరణాలు సంభవించిన అనంతరం తీరిగ్గా కూటమి ప్రభుత్వం స్పందించింది. అప్పుడు ఆరు రోజులపాటు గ్రామంలో ప్రజలకు భోజనాలు పెట్టారు. మరో నెల రోజులు మెడికల్ క్యాంప్ అంటూ హడావుడి చేశారు. అనంతరం పాలకులు చేతులు దులుపుకొన్నారు. కనీసం గ్రామంలో ప్రజల అనారోగ్యానికి కారణం.. ఏ వ్యాధితో మరణిస్తున్నారు.. దీనికి పరిష్కారం ఉందా? లేదా? అనే అంశాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వలనే ప్రాణం బలి పదిరోజులుగా జ్వరంతో ఉన్న కృష్ణవేణి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన రోజు బాగానే ఉందని, బాగానే మాట్లాడి తిరుగుతూనే ఉందని ఆమె భర్త దుర్గారావు, అత్త తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో రోజుకు రూ.30 వేలు అడిగారని చెప్పారు. కూలీనాలీ చేసుకుని బతికే తాము అంత డబ్బు కట్టలేమని చెప్పటంతో జీజీహెచ్కు తీసుకెళ్లమన్నారని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లాక కనీస స్పందన కరువైందని కుటుంబ సభ్యులు వాపోయారు. వైద్యులు పట్టించుకోలేదని తెలిపారు. చివరి నిమిషంలో కనీసం ఆక్సిజన్ అయినా పెట్టాలని తాము బతిమాలినా పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కన్నీరు మున్నీరయ్యారు. అక్కడికి వచ్చిన అధికారులను గ్రామస్తులతో కలిసి నిలదీశారు. ఆరు నెలలుగా అదే పరిస్థితి.. గ్రామంలో ఆరు నెలలుగా సుమారు 46 మందికిపైగా మృత్యువాతకు గురయ్యారు. దీంతో గ్రామంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. కొందరు గ్రామంలో బొడ్డురాయి సమస్య అని ఆందోళన చెందారు. నిపుణులు, రాజకీయపార్టీల నేతలు, అధికారులు కొందరు తాగునీరు కలుషితం కావడం వల్ల సమస్య వచ్చిందని పేర్కొన్నారు. ఈ రెండింటిలో బొడ్డురాయి సమస్యను స్థానిక పెద్దలు సంప్రదాయబద్ధంగా పరిష్కారం చూపారు. మెలియాయిడోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వ్యాధి సంక్రమించి అనారోగ్యాలకు గురవుతున్నారని వైద్యులు తెలిపారు. కానీ ఈ వ్యాధికి చికిత్స ఏంటి? ఏ మందులు వాడాలనే విషయాన్ని గ్రామస్తులకు చెప్పిన వారే లేరు. నెల రోజుల తరువాత మరో మరణం సంభవించటంతో గ్రామంలో కలకలం రేగింది. జీజీహెచ్లో చికిత్స పొందిన బాధితురాలు అదే వ్యాధితో మృతి చెందిందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. కొన్ని రోజుల హడావుడే.. గ్రామంలో ప్రజలు ఆకస్మిక మరణాల విషయం వెలుగు చూడటం, మీడియాలో సంచలన కథనాలు, వార్తలు రావడంతో ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది ఇంటింటికీ వెళ్లి రక్త నమూనాలు సేకరించారు. పరీక్షలు చేశారు. గ్రామంలో దాదాపు వెయ్యి మందికి కిడ్నీ సమస్యలున్నాయని తేలిందని, మరో 300 మందికిపైగా లివర్ సమస్యలతో బాధపడుతున్నారని గుర్తించామని వైద్యులు తెలిపారు. వారికి పరీక్ష ఫలితాలను ఇవ్వలేదు. టాబ్లెట్, ఇంజక్షన్ కూడా లేదు. ఆరు రోజులు భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత ఆ ఊసే లేదు. మరణించినవారి కుటుంబాలకు న్యాయం చేయలేదు. బాధితులు కలెక్టరేట్, తదితర అధికారులకు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా వారికి న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇంటికి ఒకరు ఇద్దరు చొప్పున జ్వరాలతో గ్రామస్తులు బాధపడుతూనే ఉన్నారు. కనీసం ఒక్కరు కూడా తమను పట్టించుకోవటంలేదని వాపోతున్నారు. గ్రామంలోనే విలేజ్ క్లినిక్లో ఒకరిద్దరు వైద్యులు ఉన్నా ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. -
క్లాప్ మిత్రల కృషితోనే జిల్లాకు అవార్డులు
కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పగలు, రాత్రీ తేడా లేకుండా క్లాప్ మిత్రలు పనిచేయడం ద్వారానే బాపట్ల జిల్లాకు విరివిగా అవార్డులు లభించాయని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం స్థానిక కమ్మ కల్యాణ మండపంలో జరిగింది.అనంతరం స్వచ్ఛ ఆంధ్ర అవార్డులకు ఎంపికై న వారికి జిల్లా కలెక్టర్ అవార్డులు ప్రదానం చేశారు. ప్రజల ఆరోగ్యం, విద్యా, వైద్య రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయయన చెప్పారు. రానున్న మూడు నెలల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. వ్యర్థాలను పద్ధతి ప్రకారం తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెత్త సంపద కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తామన్నారు. రాననున్న రోజుల్లో బాపట్ల జిల్లా అన్ని రంగాల్లో రాష్ట్రంలోనే తృతీయ స్థానంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం అధికారులు, ఉద్యోగులంతా కృషి చేయాలని చెప్పారు. చెరుకుపల్లి మండలంలోని కావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాష్ట్రస్థాయి స్వచ్ఛత అవార్డు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాలకు 49 అవార్డులు లభించడం సంతోషదాయకమని తెలిపారు. 146 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. గాంధీజీ స్ఫూర్తితో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించామని ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్ తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి.ఎస్.నారాయణభట్టు, బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్బాబు, ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎం.వెంకట రమణ, ఆర్డీఓ పి. గ్లోరియా, డీపీఓ ప్రభాకరరావు పాల్గొన్నారు. -
నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు బలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి అధికారంలోకి వచ్చాక ఏకంగా ఫ్యాక్టరీలు పెట్టి నకిలీ మద్యం ఉత్పత్తి చేసి, షాపులకు విక్రయిస్తూ పేదల ప్రాణాలను బలిగొంటోందని వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి విమర్శించారు. సోమవారం బాపట్లలోని కోన భవన్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నకిలీ మద్యం పరిశ్రమను అధికారులే కనుగొన్నారని పేర్కొన్నారు. నాసి రకం మద్యానికి ప్రజలు బలి కాకముందే దీనిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వైవీ డిమాండ్ చేశారు. కూటమి పాలన వచ్చాక పేద ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, సంక్షేమ పథకాల్లోనూ కోతలు పెట్టిందని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, కానీ కూటమి ప్రభుత్వం వాటిని వారికి అందకుండా చేస్తోందని వైవీ విమర్శించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం వైఎస్.జగన్మోహన్రెడ్డి సదుద్దేశంతో నెలకొల్పిన మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటు పరం చేసిందని విమర్శించారు. జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలను మొదలు పెట్టి, ఆరు కళాశాలలను పూర్తి చేశారన్నారు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు వాటిని ప్రైవేటీకరించడం దుర్మార్గమని ఖండించారు. లేని లిక్కర్ స్కాం అంటగట్టి వైఎస్సార్సీపీ నేతలను బదనాం చేశారని విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని, దీన్ని పార్టీ సమర్థంగా ఎదుర్కొంటుందని తెలిపారు. బాధితులకు అండగా పార్టీ లీగల్ టీం పని చేస్తుందని, పార్టీ సైతం అండగా ఉందని హామీ ఇచ్చారు. అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంస్థాగతంగా వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సమన్వయకర్తలు కరణం వెంకటేశ్, ఈవూరు గణేష్, వరికూటి అశోక్బాబు, గాదె మధుసూదన్రెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్, పుత్తా శివశంకర్రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి, కోకి రాఘవరెడ్డి పాల్గొన్నారు. -
15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపు
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి: డీఈఓ చంద్రకళనరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025 ద్వారా ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. ఉపాధ్యాయులుగా నియామకం పొందినవారికి అందిస్తున్న శిక్షణ తరగతులను సోమవారం డీఈఓ సందర్శించి, నిర్వహణ తీరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లోని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని హితవు పలికారు. కార్యక్రమంలో పల్నాడుజిల్లా విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, శిక్షణ కేంద్రాం ఇన్చార్జి సత్యనారాయణసింగ్, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్పర్సన్లు పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జుసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 588.00 అడుగులకు చేరింది. ఇది 306.1010 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 10,040, ఎడమ కాలువకు 9,076, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 33,211, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 54,427 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 54,427 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.15న కార్తికేయుని హుండీ కానుకల లెక్కింపుమోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకుల లెక్కింపు ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు సోమవారం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సమక్షంలో నిర్వహించే లెక్కింపులో పాల్గొనదలచిన భక్తులు డ్రస్కోడ్లో హాజరు కావాలని సూచించారు. కానుకల లెక్కింపు కారణంగా ఆ రోజున జరగాల్సిన స్వామివారి నిత్య శాంతి కల్యాణం ఉదయం 7 గంటలకు ప్రారంభిస్తారని తెలియజేశారు. -
ప్రతి కార్యకర్తా సైనికుడిలా పోరాడాలి !
సాక్షి ప్రతినిధి, బాపట్ల: గ్రామ స్థాయిలో ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్తా సైనికుడిలా మారాలని రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్ వై.వి. సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల కోన భవన్లో సోమవారం నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కీలకమని, గ్రామస్థాయి నుంచి తిరుగులేని శక్తిగా రూపొందించాలని తెలిపారు. ఇందు కోసం గ్రామ స్థాయి నుంచి అన్ని పార్టీ కమిటీలను నవంబర్ 20 నాటికి పూర్తి చేయాలని చెప్పారు. గ్రామ స్థాయిలో 30 మంది కార్యకర్తలు సైనికుల్లా మారాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో 1400 మంది కార్యకర్తలు క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన నియోజకవర్గ సమన్వయకర్తలను ఆదేశించారు. ఇందుకోసం గ్రామ, మండల స్థాయి నాయకులు పని చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలం చెందిందని సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ కోత పెట్టిందన్నారు. రైతల పరిస్థితి దుర్భరంగా ఉందని పేర్కొన్నారు. పొగాకు, మిర్చి, టమోటాలకు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులకు అన్ని విధాలా మేలు జరిగిందని, గిట్టుబాటు ధరలు లభించాయని గుర్తు చేశారు. ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేటు పరం చేసిందని, నకిలీ మద్యం తయారు చేసి పేదల ప్రాణాలను బలికొంటోందని విమర్శించారు. బాధిత వర్గాల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని అభయమిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నేతలు, కార్యకర్తలు గడప గడపకు తీసుకు వెళ్లాలని తెలిపారు. ఇందుకోసం గ్రామస్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలని దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున, సమన్వయకర్తలు కరణం వెంకటేశ్, ఈవూరు గణేష్, వరికూటి అశోక్బాబు, గాదె మధుసూదన్రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు చేజర్ల నారాయణరెడ్డి, మోదుగుల బసవ పున్నారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, డాక్టర్ అశోక్ కుమార్, పుత్తా శివశంకర్రెడ్డి, కారుమూరు వెంకటరెడ్డి, కోకి రాఘవరెడ్డి ,అంజనీప్రసాదరెడ్డి, చెంచయ్య, చల్లా రామయ్య, డేవిడ్, విజయకుమార్, అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పని చేయాలి
జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కొన్నింటికి తక్షణమే పరిష్కార మార్గం చూపించారు. కొన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు అందించి, తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూపర్ జీఎస్టీపై అవగాహన కల్పించాలి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామ, సచివాలయ పరిధిలో సమావేశాలు ఏర్పాటుకు షెడ్యూల్ తయారు చేయాలని ఆయన ఎంపీడీవోలను ఆదేశించారు. సెలూన్లు, యోగా సెంటర్లలో ధరల వివరాలను ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. జిల్లాస్థాయిలో వస్తు ఉత్పత్తుల, ధరలపై ఎగ్జిబిషన్ ఏర్పాటుకు షెడ్యూల్ తయారు చేయాలని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలో డిస్ట్రిబ్యూటర్లకు జీఎస్టీపై సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిబేట్లు, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వీడియోలను తయారు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ప్రదర్శించాలని ఆయన తెలిపారు. రోజువారి నిర్దేశిత ప్రచార కార్యక్రమాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. స్థలాన్ని సేకరించాలి అద్దంకి నియోజకవర్గంలోని ఏడో సబ్స్టేషన్ పరిధిలో పీఎం కుసుమ పథకానికి భూ సేకరణపై రైతులతో బుధవారం నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని శనివారం పనులు మొదలు పెట్టాలని ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ జి. గంగాధర్ గౌడ్, ఇన్చార్జి పీడీ డీఆర్డీఏ లవన్న, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మండల స్థాయిలో పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలను నూరు శాతం నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని చెప్పారు. సంబంధిత ఫోటోలు, వీడియోలను ఈ– ఆఫీస్లో అప్లోడ్ చేయాలని సూచించారు. కాల్ సెంటర్లో (1100) నమోదైన అర్జీల పరిష్కారంపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. సమస్యల పరిష్కారంలో అధికారులు వేగంగా పని చేయాలని చెప్పారు. జిల్లాలో గిరిజనులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వారి కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ను నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, ఇన్చార్జి పీడీడీఆర్ డీఏ సమన్వయంతో గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. -
చేనేత పరిశ్రమను సర్వ నాశనం చేసిన ప్రభుత్వం
సత్తెనపల్లి: చేనేతపై జీఎస్టీ వేసి పరిశ్రమను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు విమర్శించారు. సంఘం 11వ రాష్ట్ర మహాసభలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ నెల 6, 7 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, వసతి ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. మహాసభల ప్రాంగణం ఆర్చీ వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివదుర్గారావు మాట్లాడుతూ మహాసభల్లో చేనేత రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చిస్తామని తెలిపారు. చేనేత రంగాన్ని పరిరక్షించేందుకు తీసుకోవలసిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. మహాసభల ప్రారంభం రోజు 6వ తేదీన సత్తెనపల్లి పట్టణంలో చేనేత కార్మికుల భారీ ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. వసతి ఏర్పాట్లు, మహాసభ జరిగే ప్రాంగణం, ఆర్చీ అన్ని ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల వీరబ్రహ్మం, కమిటీ సభ్యులు పి. ప్రభాకర్, జి. సుసులోవ్, మల్లాల గురవయ్య, బిట్రా పానకాలు, జి. ఏసురత్నం, ఆవాజ్ సంఘం నాయకులు షేక్ మస్తాన్వలి పాల్గొన్నారు. -
బొక్కేస్తున్న పచ్చ బ్యాచ్!
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా కొనసాగుతోంది. మాముళ్లు అందుతుండడంతో కూటమి ఎమ్మెల్యేలు కొమ్ముకాస్తున్నారు. బాపట్ల జిల్లా నుంచి తరలిపోతున్న రేషన్ బియ్యం ఒక్క రోజులోనే పొన్నూరు, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో వెయ్యి బస్తాలు పట్టుబడిందంటే ఈ దందా స్థాయి అర్థం చేసుకోవచ్చు. మాఫియాలోని వర్గాల సమాచారంతో ఇవి పట్టుబడ్డాయని, లేకుంటే కృష్ణపట్నం పోర్టుకు తరలిపోయేవని తెలుస్తోంది. వేమూరు నియోజకవర్గంలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు మండలాల్లో ఎమ్మెల్యే అనుచరుల ఆధ్వర్యంలో దందా కొనసాగుతోంది. ప్రజల నుంచి రూ.10కే బియ్యం కొనుగోలు చేసి చుండూరు మండలం నడిగడ్డవారిపాలెం రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. పాలీష్ చేసి నేరుగా కృష్ణపట్నం పోర్టుకు తీసుకెళుతున్నారు. భట్టిప్రోలు నుంచి తరలిస్తున్న బియ్యాన్ని గురువారం పొన్నూరులో 300 బస్తాలు పట్టుకున్నారు. ● రేపల్లె నియోజకవర్గంలో డీలర్లు కిలో రూ.10 చొప్పున కొని కూటమి నాయకులకు రూ. 11 నుంచి రూ.12 వరకు అమ్ముతున్నారు. తర్వాత ప్రకాశం జిల్లాకు తరలిస్తున్నారు. ఆపై రూ.16కు విక్రయిస్తున్నట్లు సమాచారం. నిజాంపట్నం మండలం కొలసానివారిపాలెంకు చెందిన కూటమి నేత కీలకంగా ఉన్నాడు. ప్రతి నెలా ఎమ్మెల్యేకు పెద్ద మొత్తం అందుతున్నట్లు తెలుస్తోంది. ● బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఈనగంటి గాంధీ, వక్కలగడ్డ సుధీర్ రేషన్ ఈ వ్యాపారం చేస్తున్నారు. బాపట్ల నుంచి తరలిస్తున్న 700 బస్తాల బియ్యం శుక్రవారం నాగులుప్పలపాడులో పట్టుబడిన సంగతి తెలిసిందే. గుంటూరులోని శ్రీనగర్కు చెందిన జనసేన నేత అనిల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ఒకరు డీలర్లతో మాట్లాడి ప్రతినెల బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అధికారుల ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆర్టీసీ కాలనీకి చెందిన నాగేశ్వరరావు మిల్లర్ ద్వారా బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మోహన్, సుబ్బారావులు కీలకపాత్ర పోషిస్తున్నారు. ● పొన్నూరులో పచ్చ నేతలు ముగ్గురు హవా చాటుతున్నారు. పచ్చ జెండా మోసి అలసిపోయిన ఓ మువ్వగోపాలుడు మండలాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం ఓ ఇంట్లో 70 బస్తాల రేషన్ బియ్యం నిల్వ చేసి పోలీసు రికార్డులకు ఎక్కిన టీడీపీ సానుభూతిపరుడు రబ్బాని ప్రస్తుతం కీలకంగా మారారని సమాచారం. పెదకాకాని మండలంలోని వెనిగండ్ల కేంద్రంగా అక్రమ రవాణా సాగుతోంది. ● తాడికొండ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యే ఫిరంగిపురం మండలంలోని టీడీపీ యువ నాయకుడికి దందా అప్పగించారు. మండలాల్లో నేతలకు మామూళ్లు ఇచ్చి నడిపిస్తున్నారు. తాడికొండలో ఇద్దరు రేషన్ డీలర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రత్తిపాడులో కొని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే అల్లుడు, అనుచరులు దందా నడిపిస్తున్నారు. ● మంత్రి లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో బియ్యం నేరుగా మిల్లుల వద్దకు చేరుస్తున్నారు. పాలీష్ చేసి కిలో రూ. 50 నుంచి రూ.70కి విక్రయిస్తున్నారు. కూటమి నేతల అండతో ఓ టీవీ చానల్ రిపోర్టర్ సోదరుడు రేషన్ దుకాణాలపై పెత్తనం చేస్తున్నట్లు సమాచారం రేషన్ బియ్యం అక్రమ రవాణా పూర్తిగా అధికార పార్టీ నేతల అండదండలతో సాగుతుండటంతో రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ శాఖల అధికారులు లంచాలు తీసుకుని చోద్యం చూస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన లారీలు, ఆటోలు మాత్రమే పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. పొన్నూరులో అధికారులకు చిక్కిన రేషన్ బియ్యం బస్తాలు టీడీపీ నాయకుల కనుసన్నల్లో రేషన్ మాఫియా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న డీలర్లు అర్ధరాత్రి యథేచ్ఛగా అక్రమ రవాణా షాడో ఎమ్మెల్యేల కనుసన్నల్లో కార్యకలాపాలు బియ్యం పట్టుకుంటే ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఫోన్లు పేదల నోటి దగ్గర కూడూ లాక్కుంటున్న నేతలు ప్రేక్షక పాత్రకే పరిమితమైన అధికారులు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పొన్నూరులో మామిళ్ళపల్లి కేంద్రంగా వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పాలకులు రేషన్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. – చింతలపూడి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పొన్నూరు మండల అధ్యక్షుడు, గుంటూరు జిల్లా.పల్నాడు జిల్లాలో కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. సత్తెనపల్లిలో షాడో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. రాత్రి వేళ బొలెరో వాహనాలలో నకరికల్లుకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. -
బోధనా నైపుణ్యాలు పెంచుకోవాలి
పాఠశాల విద్య జేడీ శైలజ నరసరావుపేట ఈస్ట్: మెగా డీఎస్సీ–2025లో ఎంపికై న ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పాఠశాల విద్య జేడీ పి.శైలజ తెలిపారు. డీఎస్సీ జోన్–3 పరిధిలో పీజీటీ, టీజీటీలుగా ఎంపికై న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియామకం చేపట్టిందని తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆమె చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా కృషి చేయాలని హితవు పలికారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరిగేలా బోధన ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు విద్యాశాఖ ఏడీ బి.వి.రమణ, ఎంఈఓలు ఎండీ. ఖాసిం, పి.సుధారాణి, ప్రధానోపాధ్యాయులు ఆర్.గోవిందరాజులు, వి.వెంకట్రావు, ఏఎంఓ పూర్ణచంద్రరావు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి
చీరాల రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని వైఎస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు పేర్కొన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పీహెచ్సీల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు గత కొద్దిరోజులుగా విధులు బహిష్కరించి నిరసన తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో క్లినికల్ విభాగంలో 30 శాతం, నాన్ క్లినికల్లో 50 శాతం చొప్పున గత ప్రభుత్వంలో ఇన్ సర్వీస్ కోటా ఉండేదని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ కోటాను చంద్రబాబు ప్రభుత్వం రాగానే క్లినికల్ కోర్సుల్లో 15 శాతం, నాన్ క్లినికల్ విభాగంలో 30 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. దీంతో వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం ఇన్ సర్వీసు కోటాను యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న వైద్యులకు అలవెన్సులు, పదోన్నతులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారని గుర్తుచేశారు. పీహెచ్సీల్లో వైద్యులు ఎమర్జెన్సీ వైద్య సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వైఎస్సార్సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఇస్తర్ల బాబురావు -
అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాల్సిందే..!
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్ కొల్లి శారదా మార్కెట్లోని షాపుల లీజు గడువు పూర్తికావడంతో ఆగస్టు 18, 19, 20వ తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించారు. ఒక్కో షాపును రూ.లక్షల్లో పాడుకుని దక్కించుకున్నారు. పాత లీజుదారులు పొన్నూరు రోడ్డు(బైపాస్) వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్లో షాపులు నిర్వహించుకుంటున్నారు. దీంతో మార్కెట్కు వచ్చే రైతులంతా అన్నపూర్ణ కాంప్లెక్స్కు వెళ్లడంతో మార్కెట్లో వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ నెల 10లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు.. మార్కెట్లో ఉన్న 81 షాపులకు బహిరంగ వేలం పాట నిర్వహించగా కార్పొరేషన్కు రూ.ఆరు కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 81 షాపుల్లో 41 షాపులకు సంబంధించి కొత్తగా పాడుకున్న లీజుదారులు కార్పొరేషన్కు నాన్ రిఫండబుల్ గుడ్విల్ చెల్లించారు. ఈ క్రమంలో పాత లీజుదారులు కార్పొరేషన్ అధికారులు తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని హైకోర్టుకు వెళ్లడంతో కొత్త లీజుదారులు దక్కించుకున్న రేటుతో షాపులను రెండు నెలల పాటు నిర్వహించుకోవాలని ఆదేశించింది. దాని ప్రకారం అధికారులు పాత లీజుదారులకు తెలియజేసినప్పటికీ వారు దానికి కూడా అంగీకరించకుండా అన్నపూర్ణ కాంప్లెక్స్ వద్దే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కొత్త లీజుదారులు ప్రైవేట్గా మార్కెట్ను నిర్వహించకూడదని, ఇతర తగిన ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పాత లీజుదారులకు షాక్ ఇస్తూ అన్నపూర్ణ కాంప్లెక్స్ను ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో పాత లీజుదారులు డైలామాలో పడ్డారు. హైకోర్టు ఉత్తర్వులు ఫాలో అవుతారో లేదో..! అన్నపూర్ణ కాంప్లెక్స్ ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. వీరిని ఖాళీ చేయించేందుకు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత లీజుదారులకు ఎమ్మెల్యే సపోర్ట్, కొత్త లీజుదారులకు మంత్రి సపోర్ట్ ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం కావడంతో.. ఎవరికి సపోర్ట్గా వ్యవహరిస్తే రాజకీయంగా ఎటువంటి సమస్యలు వస్తాయో అని అధికారులు సందిగ్గంలో ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తాం. – డి.శ్రీనివాసరావు, డిప్యూటీ కమిషనర్–1 -
రాష్ట్ర స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎంపిక
గుంటూరు వెస్ట్ (క్రీడలు): శ్రీకాళహస్తిలో ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జరగనున్న ఏపీ స్టేట్ స్కూల్ గేమ్స్ టెన్నిస్ చాంపియన్షిప్ పోటీల్లో ఎన్టీఆర్ స్టేడియంకు చెందిన ఆరుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారని టెన్నిస్ కోచ్ జీవీఎస్ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను రేమండ్స్ షో రూమ్ అధినేత టి.అరుణ్ కుమార్, ఏపీ రెరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు, సహస్ర ఆర్థో అండ్ న్యూరో క్లినిక్ అధినేత డాక్టర్ ఎం. శివకుమార్, రక్షిత్, నాంచారయ్యలు అభినందించారన్నారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలు... అండర్ 19 బాలుర విభాగంలో కె.విన్సెంట్, ఊరుబంది లలిత్ కుమార్, బాలికల విభాగంలో... సాధుర్ల కావ్య హర్షిత, అండర్ 17 బాలుర భాగంలో.... గంటా దిశాంత్, ఇ.జి. హర్షవర్ధన్, అండర్ 14 బాలుర విభాగంలో కుంభ సాయి నాగ కళ్యాణ్. -
మహనీయుల నిత్య చరిత్రను తెలిపే ‘సదాస్మరామి’
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): తెలుగు భాషకు, సంస్కృతికి, చరిత్రకు, కళలకు, వన్నెతెచ్చిన మహనీయుల చరిత్రలను సమగ్రంగా, సంగ్రహంగా గ్రంథస్థం చేసి వర్తమాన భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం చేసిన గ్రంథకర్త మండలి బుద్ధప్రసాద్ అభినందనీయులని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రచించగా మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వెలువరించిన సదాస్మరామి పుస్తకావిష్కరణ సభ నగరంపాలెం కలెక్టర్ బంగ్లా రోడ్లోని భారతీయ విద్యాభవన్లో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రను తెలుసుకునే అవకాశం సదాస్మరామి పుస్తకం ఇస్తుందని పేర్కొన్నారు. పుస్తక రచయిత, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల గురించి రాయడం తన అదృష్టమన్నారు. దాన్ని వెలువరించిన బొమ్మిడాల కృష్ణమూర్తి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఎం.నాగేశ్వరరావు, న్యాయమూర్తి జగదీశ్వరి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు డాక్టర్ పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పలువురు రచయితలు, సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
వయోవృద్ధుల సంక్షేమానికి కృషి
గుంటూరు వెస్ట్: వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశం మందిరంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం – 2025 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారితోపాటు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ చైర్మన్ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ వయో వృద్ధుల సమస్యలను సాధ్యమైనంతవరకు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వృద్ధుల అనుభవాలు చాలా గొప్పవి జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ వయోవృద్ధుల అనుభవాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. వారి నుంచి స్పూర్తి పొందాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వయోవృద్ధులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ జి. ప్రకాష్ రెడ్డి, డీఆర్ఓ ఎన్ఎస్కే ఖాజావలి, ఏడీ దుర్గాబాయి పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ సెక్రటరీ సూర్య కుమారి -
కూటమి కుయుక్తులకు చెక్
● ఘనంగా అద్దంకి నూతన సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ ● అడ్డరోడ్డు నుంచి అద్దంకి వరకు పోలీసుల అవాంతరాలు ● బల్లికురవ మండలం వైదన వద్ద మట్టి ట్రాక్టర్ పెట్టి అడ్డుకున్న వైనం ● స్థైర్యం కోల్పోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ● భారీ జనసందోహం మధ్య వేదిక వరకు పయనం అద్దంకి: వైఎస్సార్సీపీకి ప్రజాబలం ఎంత ఉందో.. కూటమి పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో శనివారం అడుగడుగునా చోటు చేసుకున్న ఘటనలు నిరూపించాయి. వైఎస్సార్ సీపీ నూతన సమన్వయకర్త డాక్టర్ అశోక్కుమార్ బాధ్యతల స్వీకరణ, జన్మదిన వేడుకల కార్యక్రమం శనివారం అద్దంకి పట్టణంలోని కూకట్ల కన్వెన్షన్ హాల్లో నిర్వహించేందుకు ఆయనతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పిడుగురాళ్ల నుంచి బయలు దేరారు. కానీ పోలీసులు అవాంతరాలు సృష్టించారు. వాటన్నింటినీ అధిగమించి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అద్దంకి నూతన సమన్వయకర్త పిడుగురాళ్ల నుంచి బయలుదేరగా.. సంతమాగులూరు అడ్డరోడ్డు వద్ద నాయకులు ఆయనకు సంఘీభావంగా తరలివెళ్లారు. అక్కడకు పోలీసులు చేరుకుని ర్యాలీగా వెళ్లడానికి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. బల్లికురవ మండలంలోని వైదన వద్ద ఏకంగా మట్టి ట్రాక్టర్ను అడ్డుపెట్టించారు. శింగరకొండ వద్దకు చేరుకున్న తర్వాత కూడా అన్ని కార్లను అనుమతించలేదు. ఇలా అడుగడుగునా పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. తమకు అనుమతులు ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు వెళ్లనివ్వరంటూ డాక్టర్ అశోక్ కుమార్ గట్టిగా ప్రశ్నించారు. ఆయనకు అడుగడుగునా కార్యకర్తలు, నాయకులు బ్రహ్మరథం పట్టారు. వేదిక వద్ద భారీ గజమాల వేసి ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు ప్రసంగించారు. ● వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకుడు తూమాటి మాధవరావు వేదికపై మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఽఅధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేకపోయిందన్నారు. గ్రామాల్లోకి పోలీసులు లేకుండా ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ● పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ నాయకులను, కార్యకర్తలను పోలీసులతో అడ్డుకోలేరన్నారు. భయపెడదామని అనుకుంటే కుదరదన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని చెప్పారు. ● మాజీ ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకోవడంతోనే కూటమి పతనం మొదలైందని... కేసులకు భయపడేది లేదన్నారు. ● నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రమంతా మార్పు మొదలైందన్నారు. మట్టి ట్రాక్టరను అడ్డుపెట్టి అభిమానాన్ని ఆపాలని చూసినప్పుడే వారు భయపడుతున్నారని అర్థం చేసుకోవాలన్నారు. ● పార్టీ నేత గౌతం రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అరాచకాలు ప్రజలు తెలుసని.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. పచ్చ పార్టీ అబద్ధపు హామీలు ఇవ్వడమే కానీ ఎప్పుడూ అమలు చేసిన దాఖలాలు లేవని నూతన సమన్వయకర్త డాక్టర్ అశోక్కుమార్ అన్నారు. ఇక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఏం చేశాడని ప్రశ్నించారు. తాను లీడర్గా రాలేదని.. ప్రజా సేవకునిగా వచ్చానని చెప్పారు. ఇక్కడ అందరికీ విద్య, వైద్యం, ఉపాధి కల్పన, మహిళా సాధికారత సాధించేలా పనిచేస్తానన్నారు. తొలుత శింగకొండలో ప్రత్యేక పూజలు చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి ప్రసాదరెడ్డి, పలు విభాగాల నేతలు చల్లా రామయ్య, గునుపూడి రఘురామగుప్తా, ఈదా శ్రీనివాసరెడ్డి, కాకాని రాధాకృష్ణమూర్తి, జడ విజయ్ కుమార్, కేవీ ప్రసాద్, దేవినేని కృష్ణబాబు, జి.జగన్మోహన్రెడ్డి, రావూరి శ్రీనివాసరావు, పాలపర్తి శ్రీధర్, వూట్ల నాగేశ్వరరావు, మురహరి యాదవ్, చందోలు రాజకుమార్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కన్నవారిని కోల్పోయిన పిల్లలకు భరోసా
బాపట్ల: కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సోదరుడిలా ఉండి భరోసా కల్పిస్తానని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలతో ప్రధానమంత్రి కేర్ మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా శనివారం స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో జిల్లా కలెక్టర్ ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాకు సంబంధించి ఆరుగురు బాలలు ఆ విపత్తులో తల్లిదండ్రులను కోల్పోయారని చెప్పారు. వారు తిరుపతి, తెనాలి, కర్నూలు ప్రాంతాల్లో చదువుకుంటున్నారని పేర్కొన్నారు. వారికి సంబంధించిన అన్ని విషయాలను చూడాల్సిన బాధ్యత తమపైనే ఉందని చెప్పారు. లబ్ధిదారుల పేర్లు జాబితాల్లో చేరుస్తాం 19న బాపట్ల షాపింగ్ ఫెస్టివల్ బాపట్ల: ఈ నెల 19వ తేదీన బాపట్ల షాపింగ్ ఫెస్టివల్ను జిల్లాలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణతో కలసి బాపట్ల, చీరాల ట్రేడర్ల సంఘం ప్రతినిధులతో ‘సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్’పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ట్రేడర్ల సంఘాలు సహకరించాలన్నారు. 7వ తేదీన ప్రతి పాఠశాలలోని తరగతి గదిలో 40 నిమిషాలపాటు జీఎస్టీ తగ్గింపుపై విద్యార్థులకు క్లాస్ నిర్వహించాలని డీఈఓను ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి చర్యలు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృష్టితో క్యారవాన్ టూరిజం ప్రవేశపెట్టామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. శనివారం రాత్రి సూర్యలంక బీచ్లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరావుతో కలసి డ్రీమ్లైనర్స్ క్యారవాన్ సర్వీస్ లగ్జరీ బస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వాహనం వచ్చే శనివారం, ఆదివారం చీరాల బీచ్ వద్ద ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
రైతుకు విపత్తి
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం వరగానికి చెందిన నూనె గణపతికి ఎకరం భూమి ఉంది. మూడు నెలల కిందట మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. మొత్తం ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలు, పై ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరు కూడా పొలంలో రోజుల తరబడి నిలబడటంతో ఉరకెత్తి ఎర్ర తెగులు సోకింది. గులాబీ రంగు పురుగు కూడా పంటను తీవ్రంగా ఆశించింది. మూడు నెలలైనా రెండడుగులు కూడా పెరగలేదు. కౌలుకు రూ. లక్ష, వ్యవసాయం చేసేందుకు సుమారు మరో రూ.లక్ష వరకు పెట్టుబడులు అయ్యాయి. గుండె తరుక్కుపోయిన గణపతి పొలంపై ఆశలు వదులుకున్నాడు. కన్నబిడ్డలా సాగు చేసిన పైరును తన చేతులతోనే పీకేశాడు. -
నేడు 650 మందికి ఉపకార వేతనాల పంపిణీ
తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర కొరిటెపాడు(గుంటూరు): కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్, ఏపీ కాట్వా సంయుక్త ఆధ్వర్యంలో చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 650 మంది పేద విద్యార్థులకు రూ.24.50 లక్షల ఉపకార వేతనాలను పంపిణీ చేయనున్నట్లు తులసి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తులసి యోగీష్ చంద్ర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురంలోని ముక్తేశ్వరం రోడ్లోని సత్యనారాయణ గార్డెన్స్లో ఆదివారం ఉదయం 9 గంటకు కార్యక్రమం ప్రారంభమవుతోందన్నారు. తులసి గ్రూప్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు ముఖ్య అతిథిగా హాజరై ఉపకార వేతనాలు వితరణ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందులో 331 మంది విద్యార్థులకు రూ.11.84 లక్షలు తులసి సీడ్స్ ఆధ్వర్యంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ద్వారా పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
మేదరమెట్ల: బైక్ను కారు ఢీకొని భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కొరిశపాడు మండల పరిధిలోని వెంకటాపురం క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జె.పంగులూరు మండలం అలవలపాడు గ్రామానికి చెందిన కొత్తూరు వెంకటసుబ్బారావు(55), భార్య లక్ష్మి(50)తో మోటారు బైకుపై ఒంగోలు వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. వెంకటాపురం క్రాస్ వద్దకు రాగానే బైక్ను అలవలపాడు రోడ్డులోకి వెళ్లేందుకు మలుపు తిప్పుతుండగా ఇదే సమయంలో నెల్లూరు నుంచి ఏలూరు వెళ్తున్న కారు బైక్ను ఢీ కొంది. దీంతో బైక్పై ఉన్న భార్యాభర్త రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న మేదరమెట్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను సేకరించారు. అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహ్మద్ రఫీ కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులు దుర్మరణం జరుగుమల్లి(సింగరాయకొండ): దసరా పండగ పూట రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు మార్జిన్లో ఆగి ఉన్న టిప్పర్ను ప్రమాదవశాత్తు మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మండల కేంద్రమైన జరుగుమల్లిలో పాల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన కట్టా ప్రవీణ్(21), చీరాల మండలం వాడరేవు గ్రామానికి చెందిన శ్రీరాములు రాజు(20) ఇద్దరూ కలిసి చింతలపాలెం నుంచి టంగుటూరుకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోడ్డు మార్జిన్లో నిలిపి ఉంచిన టిప్పర్ వెనుక భాగాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి.మహేంద్ర తెలిపారు. -
సమాజానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులు
బాపట్ల: సమాజానికి మార్గదర్శకులుగా ఉపాధ్యాయులు ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక బాపట్ల ఫార్మసీ కాలేజీలో డీఎస్సీ 2025 లో ఎంపికై న ఉపాధ్యాయులకు ఎనిమిది రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే రెండు తరాల పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉపాధ్యాయలుగా ప్రయాణం ప్రారంభించి న మీరు ముందు శిక్షణ తీసుకొని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని చెప్పారు. తాను చిన్నప్పుడు చదువుకున్న ఉపాధ్యాయులను ఇప్పటికే నేను మర్చిపోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పిల్లలు గురువు స్థానాన్ని ఎన్నటికీ మర్చిపోలేరని ఆయన చెప్పారు. నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులు మిమ్ములను తీర్చిదిద్దుకుని పవిత్రంగా ఉద్యోగం చేయాలని అని సూచించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని కోరారు. బాపట్ల జిల్లాకు డీఎస్సీ ద్వారా 485 మంది ఉపాధ్యాయులు ఎంపిక కాబడ్డారని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, సార్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఎయిడ్స్వ్యాధిపై విస్తృత ప్రచారం చేపట్టాలి బాపట్ల: జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ఆరోగ్య ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరికీ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన వైద్య పరీక్షలు చేయించుని ఆరోగ్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజయమ్మ పాల్గొన్నారు. క్యారవాన్ బస్సుతో ప్రత్యేక అనుభూతి బాపట్ల: జిల్లాకు వచ్చే పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో క్యారవాన్ బస్సును పరిశీ లించారు. పర్యాటక అభివృద్ధి దిశగా క్యారవాన్ టూరిజం రాబోయే రోజుల్లో నూతన వరవడిని చూపుతుందని అన్నారు. జిల్లాలో క్యారవాన్ టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. క్యారవాన్ బస్ సౌకర్యాలను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. క్యారవాన్ వాహనాన్ని సూర్యులంక బీచ్లో పర్యాటకుల సందర్శన కోసం శని, ఆదివారాలలో ఉంచుతామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నాగిరెడ్డి, టూరిజం శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ -
నూజిళ్లపల్లిలో పండుగ కళ కరవు
జె.పంగులూరు: పండగ వేళ పూజలతో కళకళలాడాల్సిన ఇళ్లు బోసిపోయాయి. మేళతాళాలతో మారుమోగాల్సిన వీధులన్నీ పోలీసుల బూటు చప్పుళ్లతో ధ్వనించాయి. దసరా పర్వదినం రోజైన గురువారం నూజిళ్లపల్లి గ్రామంలో నెలకొన్న పరిస్థితి. వివరాలు.. గ్రామంలో రాజరాజేశ్వరిస్వామి వారి దేవాలయం ఉంది. గతంలో విజయదశమి రోజున గ్రామంలో స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఎంతో వైభవంగా ఊరేగించి పండగ జరుపుకునే వారు. ఇది పూజార్లు, ధర్మకర్తలు దగ్గర ఉండి నడిపించేవారు. ఇది పదేళ్ల ముందుమాట. కానీ 2017 నుంచి గ్రామంలో ఆ పరిస్థితులు లేవు. పండగ రోజు కూడా దేవాలయంలో పూజలు, ఊరేగింపులు లేవు. పూజారులంటే ధర్మకర్తలకు పడదు, ధర్మకర్తలు అంటే పూజారులకు పడదు. ఈనేపథ్యంలో గురువారం దేవాలయంలో పూజలు, ఉత్సవమూర్తులకు గ్రామోత్సవం నిర్వహణపై వివాదం నెలకొంది. వివాదానికి స్వస్తి పలికి గ్రామంలో ప్రశాంతంగా పండగ నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చీరాల డీఎస్పీ మహమ్మద్ మొయిన్, చీరాల ఆర్డీవో చంద్రశేఖర్నాయుడు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సూర్యప్రకాష్రావు, తహసీల్దార్ పి.సింగారావు, పంగులూరు గ్రూపు దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఉపలమర్తి శ్రీనివాసరావు పలుమార్లు పూజారులు, ధర్మకర్తలతో మాట్లాడారు. గురువారం రాత్రి వరకు వివాదం సర్దుమణిగే విధంగా చేయాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దేవాలయంలో ఉత్సవ విగ్రహాలు బయటకు తీయాలంటే ధర్మకర్తలే తీయాలని, పూజారుల పూజకు కూడా ధర్మకర్తలు ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారమయ్యే వరకు తాము అంగీకరించబోమని ధర్మకర్తలు దేవాలయం గడప వద్ద కూర్చున్నారు. ధర్మకర్తలు ఆలయంలో ఉత్సవ విగ్రహాలు బయటకు తీస్తేనే పూజ చేస్తామని పూజారులు భీష్మించుకొని కూర్చున్నారు. పలుమార్లు అధికారులు ఇరువురితో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు రాత్రి 9 గంటల తర్వాత దేవాలయానికి తాళాలు వేయించి వెనుతిరిగి వెళ్లిపోయారు. భారీ పోలీసు బందోబస్తు దసరా పండుగ వేళ గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఒక డీఎస్పీ, నలుగురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 130 మంది పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, దేవదాయ శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా గ్రామంలోని ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ప్రజలు ఎవరూ ఇల్లు వదిలి బయటకు రాలేదు. వివాదానికి కారణం భూములు? దేవాలయానికి 31 ఎకరాల భూమి ఉంది. వాటిలో పూజారులకు 21 ఎకరాలు, ధర్మకర్తలకు మూడు ఎకరాలు, స్వస్తి వాచకులకు నాలుగు ఎకరాలుగా ఉండేదని సమాచారం. అయితే 31 ఎకరాలు పూజారులే అనుభవిస్తున్నారనేది వివాదానికి ప్రధాన కారణం. వివాదాలతో దేవాలయంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు నిలిచిపోయాయి. గ్రామస్తుల్లో కొంత మంది పూజారుల వైపు, మరికొంత మంది ధర్మకర్తల వైపు ఉండిపోయారు. రాజకీయరంగు పూసుకుంది. -
టీడీపీలో రెండు వర్గాల ఘర్షణ
కొల్లూరు: తెలుగు తమ్ముళ్ల రెచ్చిపోయారు. టీడీపీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే సాక్షిగా తన్నులాటకు దారితీసింది. కొల్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. టీడీపీ మండలాధ్యక్షుడు మైనేని మురళీ, మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గాల నడుమ మాటల యుద్ధం జరిగింది. కొల్లూరు ఎంప్లాయీస్ రిక్రియేషన్ హోమ్లో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీకి వచ్చారు. ఆ సమయంలో మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ను లక్ష్యంగా చేసుకొని అనంతవరానికి చెందిన నాయకుడు అనుచరులు అవాకులు, చవాకులకు దిగారు. కనగాల వర్గం నాయకులు స్థానిక బస్టాండ్ సెంటర్లో ప్రభుత్వ కార్యక్రమం జీఎస్టీ సమావేశం వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సాక్షిగా జీఎస్టీ సమావేశం ప్రారంభభమవుతున్న సమయంలో ఇరువర్గాల నడుమ మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఒక వర్గంపై మరో వర్గం బాహాబాహీకి దిగి పిడి గుద్దులు, చేతి కందిన కుర్చీలు, హెల్మెట్లతో పరస్పరం దాడులకు దిగారు. సర్దుబాటు చేసేందుకు ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. టీడీపీ వర్గాల నడుమ దాడులను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్న విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే, కొట్లాట విషయం పక్కన పెట్టి వీడియోలు తీయడం ఆపించాలని పోలీసులకు హుకుం జారీ చేయడంతో వారు మీడియా ప్రతినిధుల నుంచి ఫోన్లు లాక్కొని వీడియోలను డిలీట్ చేశారు. తెలుగు తమ్ముళ్ల తన్నులాటలో టీడీపీ మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ కింద పడిపోవడంతో ఎమ్మెల్యే ఆనందబాబు పరిస్థితిని అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేయాల్సి వచ్చింది. పలువురికి గాయాలు టీడీపీ వర్గీయుల కొట్లాటను తాత్కాలికంగా సద్దుమణిచి రెండు ముక్కలలో జీఎస్టీ సమావేశాన్ని ముగించిన ఎమ్మెల్యే ఆనందబాబు అక్కడ నుంచి జారుకున్నారు. అనంతరం తిరిగి మళ్లీ ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. అనంతవరానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు కనగాల మధుసూదన్ ప్రసాద్ను దూషిస్తున్నాడన్న కారణంతో ఆయన అనుచరులు అతడిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గానికి చెందిన ఓ యువకుడు ఒంటరిగా ఓ మెడికల్ షాప్ వద్ద ఉండటాన్ని గమనించిన మైనేని మురళీకృష్ణ వర్గీయులు అతడిపై దాడికి పాల్పడ్డారు. దీనికి ప్రతిగా కనగాల మధుసూదన్ ప్రసాద్ వర్గీయులు మైనేని వర్గీయులపై దాడులకు దిగడంతో పలువురు గాయల పాలయ్యారు. వీరి మధ్య కొట్లాట నెలకొన్న పరిస్థితుల్లో వారిని అదుపు చేసేందుకు వెళ్లిన ఓ పోలీసుకి దెబ్బల బారిన పడ్డాడు. పరిస్థితిని అదుపు చేసేందుకు వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, కొల్లూరు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. -
ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఇస్సాక్
బాపట్ల: ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జి.ఇస్సాక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ జిల్లా ఎన్నికలను ఎన్నికల అధికారిగా సిహెచ్.శేషుబాబు వ్యవహరించారు. ఎన్నికల్లో జి.ఇస్సాక్, డి.రాజేష్ తరఫున 18 మంది నామినేషన్లు వేశారు. వీరిలో జి.ఇస్సాక్కు సంబంధించిన ప్యానల్ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. సహాయ ఎన్నికల అధికారులుగా కె.సాంబశివరావు, కె. కిరణ్ కుమార్, ముఖ్య అతిథులుగా బాపట్ల జిల్లా చైర్మన్ పి.నాగేశ్వరరావు, కన్వీనర్ బి.ప్రసాద్రావు హాజరై కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా అధ్యక్షుడు ఏకగ్రీవం జిల్లా ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులుగా జి.ఇస్సాక్, గౌరవ అధ్యక్షులు యు.నరసింహారావు, ఉపాధ్యక్షులుగా పి.సంధ్యారాణి, ఎ.జాషువా, షేక్.ఎం.సుభానీ, పి.అన్వేషన్, వై.శ్రీనివాసరావు, కార్యదర్శులుగా బి.రాజేష్, జాయింట్ సెక్రటరీలుగా చంద్రకాంత్, నాగూర్షరీఫ్, ఎం.శ్రీనివాసరావు, పి.వి.నవీన్, శ్యామ్యూల్రాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శేషగిరిరావు, జాయింట్సెక్రటరీ వై.సృజనకుమారి, ట్రెజరర్ ఖాదర్బాషా, కో ఆప్షన్ సభ్యులు కె.పవన్వెంకట కుమార్, రత్నశేఖర్లను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. -
స్థానిక సంస్థల అధికారాలు నిర్వీర్యం
చీరాల రూరల్: స్థానిక సంస్థల అధికారాలను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ పేర్కొన్నారు. స్థానిక బీఆర్ అంబేడ్కర్ భవన్లో గ్రామ స్వరాజ్యం, స్థానిక సంస్థలు, నిధులు, విధులు, అధికారాలు అంశాలపై గురువారం రాత్రి సమావేశం నిర్వహించారు. కొత్తపేట మాజీ సర్పంచి చుండూరి వాసు అధ్యక్షత వహించారు. విజయకుమార్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం పల్లెల్లో మచ్చుకై నా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మండల వ్యవస్థ రాక ముందు పంచాయతీలు, సమితులు, జిల్లా పరిషత్లకు చెప్పుకోదగిన అధికారాలు ఉండేవని చెప్పారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ వ్యవస్థ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉందని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో నిరక్షరాస్యులైన గిరిజనులు, ఎస్సీలకు చెందిన సర్పంచి పదవులను అగ్రవర్ణాలకు చెందినవారు దర్జాగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నాయని మండిపడ్డారు. నక్సలైట్ల ఏరివేత పేరుతో కగార్ ఆపరేషన్ చేపట్టి అడవుల్లో బతుకుతున్న గిరి పుత్రులను వెళ్లగొట్టి ఆయా భూములను బడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం యత్నిస్తోందని చెప్పారు. రామాయపట్నం వద్ద పోర్టు పరిసరాల్లోని పేదల భూములను పెత్తందారులు కారుచౌకగా కొట్టేశారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రజలు పార్టీల పేరుతో విడిపోయినంతకాలం అగ్రవర్ణాలవారు ఆధిపత్యాన్ని చెలాయిస్తునే ఉంటారని అభిప్రాయపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఐకమత్యంలో మనఓట్లు మనం వేసుకుంటూ రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సభ కన్వీనర్ చుండూరి వాసు, మాచర్ల మోహనరావు, నల్లబోతుల మోహన్కుమార్ ధర్మా, గోసాల ఆశీర్వాదం, మాచవరపు జూలియన్, గవిని శ్రీనివాసరావు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, దామర్ల శ్రీకృష్ణ, శీలం రవి, జ్యోతి రమేష్, బత్తుల శామ్యూల్, మల్లెల బుల్లిబాబు, రిటైర్డు ఏసీపీ కట్ట రాజ్వినయ్కుమార్ పాల్గొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ -
బరి తెగించిన టీడీపీ నేతలు
నగరం: టీడీపీ నాయకులు బరి తెగించారు. మండలంలోని చల్లమ్మఅగ్రహరం మామిడి తోటల్లో గురువారం జోరుగా కోడి పందేలు వేశారు. వేకువజాము నుంచే కోడిపందేలు వేయడంతో భారీ సంఖ్యలో జనసందోహం హాజరయ్యారు. నిర్వాహకులు పందేలు చేసేందుకు వచ్చిన వారి నుంచి రూ.200 వసూలు చేసినట్లు సమాచారం. ఉదయం ఆరు నుంచి 10 గంటల వరకు జోరుగా కోడిపందేలు నిర్వహించారు. లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నగరం పోలీసులు ఉదయం 10.30 గంటల సమయంలో కోడిపందేల బరి వద్దకు వెళ్లారు. నిర్వాహకులను వదిలి చూసేందుకు వచ్చి వారిపై కేసులు నమోదు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోడిపందేల శిబిరంపై దాడులు చేసి 14 మంది జూదరులు, మూడు కోడి పుంజులు, ఏడు ద్విచక్రవాహనాలతోపాటు రూ.8760 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ భార్గవ్ తెలిపారు. -
వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి
చీరాల రూరల్: వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) టి.చంద్రశేఖర నాయుడు అన్నారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్లో 23 మంది వృద్ధులను ఘనంగా సత్కరించారు. ఆర్డీఓ చంద్రశేఖర నాయుడు మాట్లాడుతూ మనకోసం– మన క్షేమం కోసం పెద్దలు వారిజీవితాలను పణంగా పెట్టి కొవ్వొత్తుల్లా కరిగిపోతారన్నారు. అటువంటి పెద్దలను మనం గౌరవించుకోవాలని, వారి సూచనలు సలహాలను పాటించి ముందుకెళ్లాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. వృద్ధులను నిర్లక్ష్యం చేసిన 40 కేసులను ట్రిబ్యునల్ జడ్జిగా పరిష్కరించానని, వృద్ధులకు పోలీసు ప్రొటెక్షన్ కూడా ఇచ్చానని వివరించారు. వారిని సక్రమంగా చూడని పక్షంలో వీలునామా, గిఫ్ట్ డీడ్లు కూడా రద్దు చేసే అధికారం తన పరిధిలో ఉందని హెచ్చరించారు. ప్రతినిత్యం వృద్ధులు వాకింగ్, వ్యాయామం చేస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. అనంతరం వాకర్స్ సభ్యులు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ, వలివేటి మురళీకృష్ణ, సీనియర్స్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి ఎ.నాగవీరభద్రాచారి, చింతా రమేష్, వీరాంజనేయులు, తిరుపతిరావు, ఎంఎస్. సుబ్బారావు, బదరీనాఽథ్, రమేష్, పూర్ణ, దరియాసాహెబ్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ టి.చంద్రశేఖర నాయుడు -
వైభవంగా చండీకల్యాణం
అమరావతి: ప్రముఖ శైవక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీబాల చాముండిక సమేత అమరేశ్వరస్వామి దేవాలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి చండీకల్యాణం వైభవంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి, స్వామివారికి ఎదుర్కోల మహోత్సవం జరిగింది. ఆలయంలోని వెంకటాద్రినాయుని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామివారిని ఉంచి ఆలయ అర్చకులు కౌశిక చంద్రశేఖరశర్మ యాజ్ఞీక పర్యవేక్షణలో అర్చకులు విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనం,పుణ్యహవాచనం, కన్యాదానం, శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. ఏటా రెండుసార్లు అనగా మహాశివరాత్రి, దసరాకు కల్యాణం నిర్వహించటం సంప్రదాయమని అర్చకులు పేర్కొన్నారు. -
ఇంకా జల దిగ్బంధంలోనే..
వరద తీవ్రత కాసత్త తగ్గినప్పటికీ లంక గ్రామాలను చుట్టుముట్టిన నీరు తొలగలేదు. మండలంలోని సుగ్గునలంక, దోనేపూడి చప్టాల పైనుంచి, ఆవులవారిపాలెం – గాజుల్లంక, పోతార్లంక – గాజుల్లంక, భట్టిప్రోలు మండలం వెల్లటూరు కరకట్ట దిగువున రోడ్లపై నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. లంక గ్రామాలు మూడు రోజులుగా చుట్టుముట్టిన వరద నీటి మధ్యనే చిక్కుకొని ఉన్నాయి. సుగ్గునలంక, దోనేపూడి, భట్టిప్రోలు మండలం వెల్లటూరు వద్ద అందుబాటులో ఉంచిన పడవలను అత్యవసర పనుల కోసం ప్రజలు వినియోగించుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. మండంలోని పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, తురకపాలెం, కిష్కిందపాలెం, తడికలపూడి, గుంటూరుగూడెం, మధ్యగూడెం, జువ్వలపాలెం, శివరామపురం, రావిలంక, గాజుల్లంక వరదలో చిక్కుకున్నాయి. -
ముంపు ప్రాంతాలలో డాక్టర్ గణేష్ పర్యటన
రేపల్లె: వరద ముంపు ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుండాలని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ కోరారు. కృష్ణానది వరద ముంపు గ్రామాలను బుధవారం ఆయన సందర్శించారు. లంకెవానిదిబ్బ, పెనుమూడి గ్రామాలలోని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న వారితో ఆయన మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పట్టణ, రూరల్, చెరుకుపల్లి కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, డుండి వెంకట రామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చిమటా బాలాజీ, నాయకులు ఉమాదేవి, చౌటు రమేష్, శొంఠి సురేష్, నాగేశ్వరరావు, సుబ్బారావు, నాగబాబు, వీరనారాయణ, గోపి, తోట శివ, ఖాదర్, ఖాదర్వలి, అబ్దుల్ ఖుద్దూష్ తదితరులున్నారు. -
కన్నీటిలోనే లంకలు
కొల్లూరు: కృష్ణమ్మ ప్రకోపానికి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. మూడు రోజులుగా లంక గ్రామాలను వరద తాకిడి వీడకపోవడంతో జలదిగ్బంధంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. స్థానికుల అత్యవసర సేవల కోసం మూడు ప్రాంతాలలో అధికారులు పడవలను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 6,53,828 క్యూసెక్కుల నీటిని దిగువకు విడదల చేయగా, సాయంత్రానికి వరద ప్రవాహం తగ్గింది. 5,93,370 క్యూసెక్కుల వద్ద కొనసాగుతోంది. వరద ఉద్ధృతి కొనసాగుతున్న కారణంగా మూడు రోజుల నుంచి వాణిజ్య పంటలు వరద ముంపులో ఉండటంతో ఎందుకూ పనికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. వేలాది ఎకరాలలో ఉద్యాన పంటలను కృష్ణమ్మ ముంచెత్తడంతో రూ. వేల కోట్లలో రైతులు పంట నష్టానికి గురికానున్నారు. ప్రాథమిక అంచనా ఇదీ.. వరదల కారణంగా వాణిజ్య పంటలతో పాటు ఇతర పంటలు 7,450 ఎకరాలలో నష్టపోయినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలకు వచ్చారు. కొల్లూరు, భట్టిప్రోలు మండలాల పరిధిలోని పసుపు, కంద, తమలపాకు, అరటి, జామ, మినుము, కూరగాయలు, పూలు, ఇతర పంటలు 2,980 హెక్టార్లలో ముంపునకు గురైనట్లు ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రూ. వేల కోట్లు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వాణిజ్య పంటలు ముంపు బారిన పడటంతో రైతాంగం కోలుకోలేని నష్టానికి గురయ్యారు. చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, తోకలవారిపాలెం, తురకపాలెం, కిష్కిందపాలెం, దోనేపూడి, కొల్లూరు, ఈపూరు, శివరామపురం గ్రామాల పరిధిలోని వాణిజ్య పంటలు ముంపులో చిక్కుకున్నాయి. -
నేటి అలంకారం
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వ శుభాలు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింప చేసే అపరాజితా దేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలం కారంలో దర్శనం ఇస్తుంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాం. సకల శుభాలు, విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారానే మనకు లభిస్తాయి. -
ఫోన్పేలో రూ. 5 లక్షల వరకు విద్యుత్ బిల్లు చెల్లింపు
ప్రత్తిపాడు: విద్యుత్ వినియోగదారులు రూ. 5 లక్షల వరకు ఫోన్పేలో తమ విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని గుంటూరు రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ బి.చంద్రశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో బిల్లులు ఆన్లైన్లో చెల్లించడం, బ్యాంక్లో చెక్కులు డిపాజిట్ చేయడంతో ఒకటి రెండు రోజులు ఆలస్యమయ్యేవని గుర్తుచేశారు. తద్వారా వినియోగదారుకు సర్చార్జీలు పడేవని తెలిపారు. సర్ఛార్జీలను బిల్లు ఇచ్చిన పదిహేను రోజుల్లోపు చెల్లిస్తే తరువాతి బిల్లులో రూ.150 వరకు కేటగిరీ–2 వినియోగదారులకు లాభం చేకూరుతుందన్నారు. ఇక నుంచి వినియోగదారులు ఫోన్పే ద్వారా ఇన్టైంలో విద్యుత్ బిల్లులను రూ.లక్ష నుంచి రూ. ఐదు లక్షల వరకు చెల్లించవచ్చన్నారు. తద్వారా వినియోగదారులకు సమయం వృథా కాకుండా ఉంటుందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రశేఖర్ పేర్కొన్నారు. జీజీహెచ్లో వృద్ధులకు ప్రత్యేక వార్డు గుంటూరు మెడికల్: ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవంలో భాగంగా బుధవారం గుంటూరు జీజీహెచ్లో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ప్రారంభించారు. ఆసుపత్రిలోని కుటుంబ నియంత్రణ విభాగంలో వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు 15 పడకలతో బేరియాట్రిక్ వార్డును ఏర్పాటు చేశారు. డెంటల్ విభాగంలో రూ.1.20 లక్షలతో ఏర్పాటు చేసిన రేడియో విజియోగ్రఫీ ఎక్స్రే యూనిట్ను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశసస్వి రమణ ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి పనులను, వార్డుల్లో అందిస్తున్న వైద్య సేవలను వివరించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నగరంపాలెం (గుంటూరు వెస్ట్): కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లా జైలులో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త వజ్రాల తారక ప్రతాప్రెడ్డిని బుధవారం ములాఖత్ ద్వారా ఆయన కలసి భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అడ్డగోలుగా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. ఎటువంటి పోస్ట్లు చేయకపోయినా పార్టీలో చురుగ్గా ఉన్న వారిపై కూడా పోలీసులతో అక్రమ కేసులు నమోదు చేయించి, రాష్ట్రవ్యాప్తంగా అనేక మందిని జైళ్లకు పంపారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదుకు స్వస్తి చెప్పాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిషాసురమర్దిని
జయ జయ హే మహిషాసుర మర్దిని అలంకారంలో హారతులందుకుంటున్న దుర్గమ్మఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ శ్రీమహిషాసురమర్దినీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. మహిషాసురమర్దినీదేవి అలంకారం నేపథ్యంలో ఆర్జిత సేవల్లోనూ ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీయాగంతో పాటు శ్రీచక్రనవార్చనలో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో రద్దీగా కనిపించాయి. బుధవారం ఇతర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు, యాత్రికులే క్యూలైన్లో అధికంగా కనిపించారు. పెరిగిన భవానీలు.. అర్ధరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు, భవానీలు తెల్లవారుజామున ఆలయం తెరవడంతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపున ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి కొండపైకి చేరుకున్నారు. రద్దీ నేపథ్యంలో అన్ని దర్శన టికెట్లు రద్దు చేస్తున్నట్లు దేవస్థానం ముందుగానే ప్రకటించడంతో రూ.100, రూ.300 టికెట్ క్యూలైన్లలోనూ భక్తులు విచ్చేసి ఆలయానికి చేరుకున్నారు. సీతమ్మవారి పాదాలు, పద్మావతి ఘాట్, పున్నమి, భవానీ ఘాట్లలో భవానీల తాకిడి కనిపించింది. భవానీల పుణ్యస్నానాలతో నదీతీరం, ఆలయ పరిసరాలు ఎరుపు వర్ణాన్ని సంతరించుకున్నాయి. అమ్మ వారిని దర్శించుకుని కొండ దిగువకు చేరుకున్న భవానీలు అన్న ప్రసాదం స్వీకరించి, లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసి తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరారు. పాదయాత్రగా ఇంద్రకీలాద్రికి... రాజమండ్రి, అనకాపల్లి, రంపచోడవరం, విశాఖ పట్నంలోని మన్యం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు పాదయాత్ర చేసుకుంటూ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి చేరుకునేందుకు 5 రోజులు పట్టినట్లు వారు తెలిపారు. వర్షాలు, ఎండలు, చలికి సైతం తట్టుకుని అమ్మవారిపై భక్తితో ఏటా ఇలా పాదయాత్రగా వస్తుంటామని భవానీలు చెప్పారు. కొంతమంది భవానీల పాదాలకు బొబ్బలు రావడం, వాపులు కనిపించడంతో వారికి వీఐపీ క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించారు. 11 గంటలకు పూర్ణాహుతి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో గత నెల 22వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ దేవీ శర న్నవరాత్రి మహోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఇంద్రకీలాద్రిపై యాగశాలలో మహా పూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తం కానున్నాయి. ఆలయ వైదిక కమిటీ పర్యవేక్షణలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. పూల పల్లకీపై ఆది దంపతులు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు పూలపల్లకీపై ఇంద్రగిరి పురవీధుల్లో విహరించారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద పూలతో అలంకరించిన పల్లకీపై శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడమ భక్తజనుల జయజయధ్వానాల మధ్య నగరోత్సవం సాగింది. ఆది దంపతుల నగరోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మహా మండపం, గోశాల, కనకదుర్గ నగర్, ఘాట్రోడ్డు మీదుగా నగరోత్సవం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. 10వ రోజు ఆదాయం రూ.62.16 లక్షలు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవాలలో 10వ రోజైన బుధవారం దేవస్థానానికి రూ.62.16 లక్షల మేర ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రానికి 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 25,533 మందికి అన్నప్రసాదం పంపిణీ చేశామని, 11,468 మంది భక్తులు అమ్మవారికి తలనీలాలు సమర్పించినట్లు అధి కారులు తెలిపారు. ఇక సింగిల్ లడ్డూ విక్రయం ద్వారా రూ.1.92 లక్షలు, ఆరు లడ్డూల ప్యాక్లను విక్రయించడం ద్వారా రూ.54.70 లక్షలు, ఆర్జిత సేవలు, ఇతర సేవల ద్వారా రూ.5.54 లక్షల మేర ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. -
ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
నరసరావుపేట టౌన్: న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించి వైద్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీహెచ్సీ వైద్యుల సంఘం అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ మమత ప్రియ అన్నారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు బుధవారం పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఇన్ సర్వీస్ వైద్యులకు పీజీ కోటా తగ్గించింటంతో వైద్యులు నైపుణ్యాన్ని పెంచుకొనే అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ జీఓ నెం. 99 ద్వారా పీజీ ప్రవేశాల్లో 20 శాతం ఉన్న కోటాను 15 శాతానికి తగ్గించటమే కాకుండా కేవలం ఏడు బ్రాంచ్లకే పరిమితం చేయటం అన్యాయమన్నారు. సంఘ నాయకులు డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక ఒకే హోదాలో సేవలందిస్తున్న వైద్యాధికారులకు న్యాయం చేయాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనం గిరిజన భత్యంగా మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. మొదట దీక్ష శిబిరం వద్ద నుంచి పట్టణ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వైద్యులు హనుమకుమార్, రమ్య, జగన్నరసింహారెడ్డి, రాధా కృష్ణణ్, ప్రదీప్, బాల అంకమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గ్రానైట్ లారీల రాకపోకలపై ఆగ్రహం
బల్లికురవ: రహదారి సక్రమంగా లేనందున అభివృద్ధి పరిచే వరకు గ్రానైట్ లారీల రాకపోకలను నిషేధిస్తున్నట్లు బుధవారం సాయంత్రం నక్కబొక్కలపాడు గ్రామస్తులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. బల్లికురవ–మార్టూరు ఆర్అండ్బీ రోడ్డు బల్లికురవ, నక్కబొక్కలపాడు, నాగరాజుపల్లి గ్రామాల మధ్య 6 కిలోమీటర్ల మేర గొతులతో అధ్వాన స్థితికి చేరింది. ఈ గోతుల్లో గ్రానైట్ లారీలు కూరుకుని రోజూ గంటల తరబడి ట్రాఫిక్ జాం అవుతోంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నక్కబొక్కలపాడు, పల్లె సమీపంలో గ్రానైట్ లారీ రోడ్డుపై కూరుకుని గంటన్నరపాటు ట్రాఫిక్ జాంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. గోతులు, దుమ్ము ప్రభావంతో అనారోగ్యం బారిన పడుతున్నా అధికారులు, పాలకులు పట్టించకోవటం లేదని గ్రామస్తులు వాపోయారు. రోడ్డు పూర్తిస్థాయిలో అభివృద్ధి పరిచే వరకు గ్రానైట్ లారీల రాకపోకలను నిషేధిస్తున్నట్లు హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు నాదెండ్ల: సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యతాలోపాలు నిజమని తేలటంతో సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. 2017–18లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు రూ.40 లక్షల పంచాయతీరాజ్ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మించారు. పనులు నాసిరకంగా ఉన్నాయంటూ 2020లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాణాలు పాటించలేదని నిర్ధారించారు. అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా వ్యవహరించిన కేశవరావుకు చార్జ్మెమో జారీ చేశారు. కాంట్రాక్టర్కు చెల్లించిన బిల్లులో కోత విధించారు. 2024లో కేశవరావు ఉద్యోగ విరమణ చేశారు. తాజాగా కేశవరావుపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పింఛను నుంచి మూడేళ్లపాటు 15 శాతం చొప్పున జరిమానాగా కోత విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పచ్చనేత ఆక్రమణలపై భగ్గుమన్న కడలి పుత్రులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి పూడ్చివేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్కట్ కాలువను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ చీరాల, బాపట్ల నియోజకవర్గాల పరిధిలోని 12 వేల కుటుంబాలకు చెందిన సుమారు 20 వేలమంది మత్స్యకారులు బుధవారం బాపట్లలో కదం తొక్కారు. వివిధ రూపాల్లో ఆందోళన తెలియజేసారు. ఎల్.ఆకారంలో ఉన్న స్ట్రెయిట్ కట్ను సీమౌత్ వద్ద పూడ్చి వేయడం వల్ల మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. పోటు సమయంలో సముద్రపు నీరు వేగంగా కాలువలోకి వచ్చి అక్కడ ఉండే 2 వేల బోట్లలో చాలావరకు దెబ్బతింటున్నాయి. దీనివల్ల పేద మత్స్యకారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. దీనిపై గతంలో ఆందోళన చేసిన సమయంలో అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట మురళి హామీ ఇచ్చినా.. అది నెరవేరలేదని, తక్షణం ఆక్రమణలు తొలగించి కాలువను పునరుద్ధరించాలని వేలాది మంది గంగపుత్రులు ఉదయం 10 గంటలకు బాపట్లకు చేరుకున్నారు. తొలుత గడియార స్తంభం సెంటర్లో గంటపాటు ధర్నా నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్కు చేరుకుని బైఠాయించారు. గంటన్నరపాటు అక్కడే నిరసన తెలిపారు. ఆ తర్వాత ర్యాలీగా చీలు రోడ్డుకు చేరుకున్న మత్స్యకారులు అక్కడ గుంటూరు, మచిలీపట్నం, చీరాల రోడ్లను దిగ్బంధించారు. రోడ్డుపై కూర్చుని టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించిన ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్ను తక్షణం పునరుద్ధరించాలని, వేలాది మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని నినదించారు.పర్యావరణ శాఖ మంత్రి స్పందించాలిపర్యావరణ శాఖామంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని, సీమౌత్ను వెంటనే తెరిపించాలని మత్స్యకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. పూర్వం నుంచి వున్న కాలువను ఆక్రమించిన టీడీపీ నేత బుర్ల వెంకట్రావుపై కేసులు నమోదు చేయాలని, తీరంలో ఆయన పొందిన డీకేటీ పట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. మత్స్యకారుల ఆందోళనతో బాపట్లలో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలవరకూ ఆందోళన విరమించకపోవడంతో డీఎస్పీ రామాంజనేయులు, సీఐ రాంబాబు వచ్చి ఆందోళన విరమించాలని పదేపదే కోరినా మత్స్యకారులు ససేమిరా అన్నారు. 2:30 గంటల సమయంలో బాపట్ల ఆర్డీవో గ్లోరియా వచ్చి ఆందోళన విరమించాలని మత్స్యకారులను కోరినా అంగీకరించలేదు. కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. కలెక్టర్ వద్దకు వచ్చి సమస్యను విన్నవించాలని ఆర్డీవో, డీఎస్పీలు కోరినా.. కలెక్టర్ ఇక్కడేకే రావాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. పండుగ నేపథ్యంలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చర్చించాలని ఆర్డీవో, డీఎస్పీలు చెప్పినా మత్స్యకారులు వినిపించుకోలేదు. డీఎస్పీ రామాంజనేయులు పదేపదే చెప్పడంతో సాయంత్రం 6 గంటలకు ఆందోళనకారులంతా కలెక్టరేట్కు వెళ్లి కలెక్టర్ వినోద్కుమార్ను కలిశారు. తాను కొత్తగా వచ్చానని, రెండు రోజుల క్రితమే ఈ సమస్య దృష్టికి వచ్చిందని చెప్పిన కలెక్టర్ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని, త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో సంతృప్తి చెందని మత్స్యకారులు ఎమ్మెల్యే నరేంద్రవర్మ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగిస్తామని.. గురువారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మత్స్యకారులు చెప్పిన మత్స్యకారులు అక్కడినుంచి వెనుదిరిగారు. నిరసన కార్యక్రమాలకు మత్స్యకార సంఘ నాయకులు బాబ్జి, రమణ, సూరిబాబు, సైకం రాజశేఖర్, శీలం రవికుమార్, తదితరులు నాయకత్వం వహించారు. -
విజయ దశమి రోజు అన్ని వీఐపీ దర్శనాలు రద్దు
● వైభవంగా దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు ● వేదపఠనంతో మార్మోగిన ఇంద్రకీలాద్రి ● అమ్మ దర్శనానికి తరలివస్తున్న భవానీలు ● నేడు మహిషాసురమర్దినిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం శ్రీదుర్గాదేవి అలంకారంలో భక్తులను కరుణించారు. లోకకంటకుడైన దుర్గమాసురుడనే రాక్షకుడిని వధించి ఇంద్ర కీలాద్రిపై దుర్గాదేవిగా కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము మూడు గంటలకు అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత క్యూలైన్లోకి చేరిన భక్తులకు తెల్లవారుజామునే దర్శనం పూర్తయింది. మధ్యాహ్నం నుంచి వర్షం పడటంతో క్యూలైన్లో ఉన్న భక్తులు, అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణమైన వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీలు, సిఫార్సులతో దర్శనానికి వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే కనిపించింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత వీఐపీల తాకిడి పెరగడంతో ఆలయ ప్రాంగణంలో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కనకదుర్గమ్మ బుధవారం శ్రీమహిషాసుర మర్దినీదేవిగా దర్శనమిస్తారు. ముగింపు దశకు ఉత్సవాలు గత నెల 22వ తేదీన ప్రారంభమైన దసరా ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం శ్రీరాజరాజేశ్వరి అలంకారం, ఉదయం పది గంటలకు యాగశాలలో మహా పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో అమ్మవారి దీక్ష స్వీకరించిన భవానీల రాక ప్రారంభమైంది. దీంతో పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భవానీమాలధారుల రాకతో ఆలయ పరిసరాలు అరుణ వర్ణాన్ని సంతరించుకున్నాయి. దుర్గమ్మ సేవలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ శీనానాయక్ సాద రంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, ఆలయ అధికారులు అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను అందించారు. పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. సినీ నటి హేమ అమ్మవారిని దర్శించుకున్నారు. -
దళితులపై దాడులు చేస్తే ఊరుకోం
పర్చూరు(చినగంజాం): దళితులపై అన్యాయంగా దాడులు.. అమానుష చర్యలకు పాల్పడితే అధికార పార్టీ అయినా.. అధికారులైనా చూస్తూ ఊరుకోబోమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున హెచ్చరించారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో ఇటీవల సీఐ శేషగిరి అమానుష చర్యలకు బాధితులైన దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్ కుమార్తో పాటు బాధితులను పరామర్శించేందుకు మంగళవారం ఆయన గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. మార్టూరు మండలం డేగర్లమూడిలో జగనన్న కాలనీ ప్రవేశంలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామ కంఠానికి సంబంధించిన భూమిలో ఏర్పాటు చేసుకునేందుకు గ్రామంలోని యువత ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. దేశంలో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టుకునేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని, రాష్ట్రంలో మహనీయులు వైఎస్ రాజశేఖర్రెడ్డి, బీఆర్ అంబేడ్కర్, వంగవీటి మోహనరంగా వంటి చరిత్ర కలిగిన నాయకుల విగ్రహాలను పెట్టుకున్నామన్నారు. కానీ డేగర్లమూడిలో గ్రామ కంఠంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు పంచాయతీ అనుమతి ఉన్నప్పటికీ గ్రామ కార్యదర్శి మీకు అనుమతి లేదంటూ విగ్రహాన్ని దొంగిలించుకు పోయారన్నారు. అదే ప్రాంతంలో విగ్రహాలు పెట్టకూడదని పోలీస్ అధికారులు ఆంక్షలు పెట్టడం, విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో యాక్టివ్గా ఉన్న ఇద్దరు యువకులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. స్థానికంగా కొందరు అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంలో పోలీస్ అధికారులను సమాయత్తం చేయడంతో వారు యువకులను పోలీస్స్టేషన్కు తీసుకొని వెళ్లి అమానుషంగా కొట్టడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. అధికారులు వారం రోజుల్లో విగ్రహాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారని.. లేని పక్షంలో 10 రోజుల్లో తామే విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహాన్ని దొంగిలించిన గ్రామ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. విగ్రహాల ఏర్పాటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రజాస్వామ్యంలో విగ్రహాల ఏర్పాటుకు స్వేచ్ఛ ఉందన్నారు. ద్రోణాదుల సర్పంచ్ కుటుంబానికి పరామర్శ మార్టూరు సీఐ శేషగిరిరావు అమానుష చర్యకు బలై తీవ్రగాయాలపాలైన ద్రోణాదుల సర్పంచ్ వంకాయలపాటి భాగ్యారావు కుటుంబాన్ని మేరుగ నాగార్జున పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ నాయకుడు పోపూరి వెంకట్రావు ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భవనం శ్రీనివాసరెడ్డి,ఎస్సీ విభాగం పర్చూరు నియోజకవర్గ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలెపోగు రాంబాబు, యువజన విభాగం కార్యదర్శి ఉప్పలపాటి అనిల్చౌదరి, మాచవరపు రవికుమార్, గర్నెపూడి రవిచంద్, బండి రాంబాబు, జంపని వీరయ్య చౌదరి, రావూరి వేముబాబు, మువ్వల రాంబాబు, పాదర్తి ప్రకాష్. పఠాన్ కాలేష వలి, కట్టా రత్నరాజు, మైలా చిన నాగేశ్వరరావు, బూరగ రాము, గోపతోటి బాబురావు, సూరవరపు వందనం, వాసుమల్లి వాసుబాబు, కూరాకుల ఇసాక్ బాబు, కుమ్మరి చందు, యాతం మేరీ బాబు, పులిపాటి అరుణ్, జంగం మహేష్, గొర్రె ముచ్చు సుబ్బారావు, వల్లపునేని లక్ష్మీనారాయణ, జి.చిన్న, సురేష్, తమ్మలూరి సురేష్ బాబు, తమ్మా అమ్మిరెడ్డి, గడ్డం మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. -
7న చలో విజయవాడకు ఫ్యాప్టో పిలుపు
గుంటూరుఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఽఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు ఈనెల 7న విజయవాడలోని ధర్నా చౌక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు నక్కా వెంకటేశ్వర్లు, గుత్తా శ్రీనివాసరావు, గుంటూ రు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు ధర్నా సన్నా హక సమావేశాన్ని మంగళవారం నగరంపాలెంలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, ఏపీటీఫ్ రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు, ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎండీ ఖాలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.కళాధర్, జి.వెళాంగిణిరాజు, జిల్లా నాయకులు దిబ్బయ్య, ఎం.కోటిరెడ్డి, షేక్ బాజి బాలాజీ, ప్రసాద్, విజయానంద్ తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన ‘మోహినీ భస్మాసుర’
తెనాలి: పురాణగాథ ‘మోహినీ భస్మాసుర’ పద్యనాటకంగా పండిత పామరులను అలరిస్తూనే ఉంది. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న వీణా అవార్డ్స్–2025 జాతీయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక/నాటికల పోటీల్లో నాలుగోరోజైన మంగళవారం తొలి ప్రదర్శనగా ఈ నాటకం అలరించింది. విజయనగరానికి చెందిన అక్కినేని సాంస్కృతిక సమాజం ప్రదర్శించగా, వీక్షకుల కరతాళధ్వనులను అందుకుంది. వృకాసురుడనే రాక్షసుడు అయిదేళ్లపాటు భీకర తపస్సు చేయటంతో శివుడు ప్రత్యక్షమై, అడిగినదే తడవుగా ఎవరి తలపైనయినా చేయి పెట్టిన వెంటనే అతడు భస్మమయేలా, ఎవరివల్ల కూడా వృకాసురుడికి మరణం లేకుండా వరాలిస్తాడు. ఈ వరాలతో జరిగే కీడు తెలిసిన నారదుడు రెచ్చగొట్టటంతో వరాన్ని పరీక్షించుకునేందున వృకాసరుడు నేరుగా శివుడు దగ్గరకు వెళతాడు. శివుడు తప్పించుకుని శ్రీవిష్ణువును శరణు వేడతాడు. విష్ణువు నారదుడిని సంప్రదించి, మోహినీరూపం దాల్చి వృకాసురుని అంతమొదించటం ఇతివృత్తం. మద్దెల పంచనాదం రచనకు గవర సత్తిబాబు దర్శకత్వం వహించారు. వృకాసురుడుగా దాసరి తిరుపతినాయుడు, మోహినిగా కేవీ పద్మావతి, లక్ష్మీదేవిగా పి.నీలవేణి, నారుదుడిగా గవర సత్తిబాబు పాత్రోచితంగా నటించారు. ఆకట్టుకున్న ఇతివృత్తాలు అనంతరం టీజీవీ కళాక్షేత్రం, కర్నూలు వారి ‘జగదేక సుందరి సామా’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. సామా అనే వేశ్య ఎందరినో బానిసలను చేసుకుంటుంది. వేలంలో కొనుగోలు చేసిన బానిస మాఘపై మనసు పడుతుంది. ఆమె దగ్గర బానిసలను విడిపించటానికి మాఘ ఆమెను ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. అతడి మాటలను నమ్మి బానిసలు విడుదల చేస్తుంది. ఆ వెంటనే సామా ఎదుటనే మాఘ విషం తీసుకుని మరణిస్తాడు. విరక్తి చెందిన సామా ఆత్మహత్యకు పూనుకోగా, పుణ్యకుడు అనే బౌద్ధగురువు హితబోధతో బౌద్ధసన్యాసినిగా మారుతుంది. సామాగా ప్రముఖ రంగస్థల, సినీనటి సురభి ప్రభావతి అద్భుతంగా నటించారు. ఇతర పాత్రల్లో జీవీ శ్రీనివాసరెడ్డి, కె.బాలవెంకటేశ్వర్లు, పి.రాజారత్నం నటించారు. పల్లేటి కులశేఖర్ రచనకు పద్యాలు/దర్శకత్వం పత్తి ఓబులయ్య. అనంతరం మానవత, యడ్లపాడు వారి ‘అంతా మంచివారే...కానీ’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం జరుగుల రామారావు. చివరగా అభ్యుదయ ఆర్ట్స్, విజయవాడ వారు ‘క్రతువు’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. కేవీవీ సత్యనారాయణ రచనకు వేంపాటి రమేష్ దర్శకత్వం వహించారు. నాటకపోటీలను కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో కొనసాగిస్తున్నారు. -
వల విసరక.. బతుకు సాగక..
తాడేపల్లి రూరల్ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానదిలో చేపలు వేటాడే మత్స్యకారుల బతుకు దయనీయంగా ఉంది. గత రెండు నెలల నుంచి కృష్ణానదికి తరచూ వరద రావడంతో వల విసరలేని పరిస్థితి నెలకొంది. పొట్ట నింపుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల్లో సుమారు 450 కుటుంబాలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీరే కాకుండా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి వలస వచ్చిన మరో 50 కుటుంబాలు కృష్ణానదిని నమ్ముకునే ఇలా బతుకుతున్నాయి. నదికి కొన్ని నెలలుగా వరద పోటెత్తుతూ ఇప్పుడు 6 లక్షల క్యూసెక్కుల వరకు చేరింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లాలంటే కృష్ణానది గేట్లు తప్పని సరిగా మూసి ఉండాలి. లేని పక్షంలో పడవ నిలిచి వల వేడయానికి కుదరదు. నాలుగైదు నావల వారు కలిసి రాత్రి సమయంలో కృష్ణానదిలో అక్కడక్కడ రంగ వలలతో బుట్టలను ఏర్పాటు చేస్తారు. వరద రావడంతో అవి కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. గత మూడు నెలలుగా అందిన చోట అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద సొసైటీలు ఉన్నాయని, వాటి ద్వారా మత్స్యశాఖ అధికారులు ఆర్థిక సహాయాన్ని అందించాలని విన్నవించారు. రేషన్ సరకులు అందజేస్తే కడుపు నింపుకొంటామన్నారు. ప్రస్తుతం తమ కుటుంబాలు అర్ధాకలితో జీవించాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. దోచుకుంటున్న వ్యాపారులు.... కృష్ణానదిలో చేపల వేట లేకపోవడంతో ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలోని సీతానగరానికి వెళ్లే మార్గంలో చేపల వ్యాపారుల తమకు ఇష్టం వచ్చిన ధరలతో విక్రయిస్తున్నారు. కేజీ చెరువు చేపలను రూ.300 – రూ.500 వరకు అమ్ముతున్నారు. అవి కూడా కృష్ణానది చేపలు అంటూ అంటగడుతున్నారు. దిగువ ప్రాంతంలో చేపల వ్యాపారులు ఏర్పాటు చేసిన కాటాల్లో సైతం భారీ వ్యత్యాసం కనబడుతోంది. కేజీ చేప తీసుకుంటే 750 గ్రాములే ఉంటోందని పలువురు వాపోతున్నారు. తూనికలు, కొలతల అధికారులకు ఫిర్యాదు అందడంతో తనిఖీ చేయగా మోసం వెలుగుచూసింది. 15 కాటాలు సీజ్ చేసి, కేసులు నమోదు చేశారు. అయినా వ్యాపారులు తమ తీరు మార్చుకోవడం లేదని పలువురు కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉత్కంఠగా కొనసాగుతున్న చెస్ పోటీలు
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో 62వ నేషనల్ చెస్ చాంపియన్షిప్ పోటీలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఆలిండియా చెస్ ఫెడరేషన్ విభాగంలోని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో ఈ పోటీలు జరుగుతున్నాయి పదో రోజైన మంగళవారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కై కలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఆట ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ చదరంగాన్ని బ్రెయిన్ గేమ్ అని కూడా అంటారన్నారు. నిజమైన విజయమంటే ప్రత్యర్థిని ఓడించడం మాత్రమే కాదని, మనలోని ఆలోచనా శక్తిని పెంచుకోవడమనిన అభిప్రాయపడ్డారు. మాస్టర్ లంకా రవి మాట్లాడుతూ చదరంగం అనేది ఒక మేధో క్రీడ మాత్రమే కాకుండా, అనేక నైపుణ్యాలను నేర్పే వేదికన్నారు. 9వ రౌండ్ ఫలితాలు తొమ్మిదో రౌండ్లో సంచలనాలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు గ్రాండ్మాస్టర్లు, మాజీ జాతీయ చాంపియన్లు కూడా ఇంటర్నేషనల్ మాస్టర్ల చేతిలో ఓటమిపాలయ్యారు. పీఎస్పీబీకి చెందిన జీఎం సశికిరణ్ కృష్ణన్ గెలుపు అవకాశాన్ని కోల్పోయినా 7.5 పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు. తమిళనాడుకు చెందిన జీఎం ఇనియన్ పి.ఎ., కేరళకు చెందిన ఐఎం గౌతమ్ కృష్ణ. హెచ్ కూడా అతనితో సమంగా లీడ్లో చేరారు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండటంతో టైటిల్ పోరు ఉత్కంఠభరితంగా మారింది. పీఎస్పీబీకి చెందిన టాప్ జీఎంలు సూర్యశేఖర్ గంగూలీ, అభిజిత్ గుప్తా, ఎస్పీ సేతురామన్ వరుసగా గోవా ఐఎం రిట్విజ్ పరాబ్, కేరళ ఐఎం గౌతమ్ కృష్ణ, తమిళనాడు ఐఎం మనిష్ ఆంటో క్రిస్టియానో చేతిలో ఓడిపోయారు. -
లోతట్టు ప్రాంతాల ప్రజలు అధైర్య పడొద్దు
బాపట్ల: ‘‘అధైర్య పడవద్దు.. జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని’’ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ లోతట్టు ప్రాంతాల ప్రజలకు భరోసా ఇచ్చారు. రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్డీఓ, భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు హెబిటేషన్, పునరావాస కేంద్రాల ఇన్చార్జిలతో వరద ప్రవాహ పరిస్థితిపై మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాక్టర్లు, బోట్లు సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో ఉన్న బాధితులకు అన్ని సౌకర్యాలు ఉండేలా ఇన్చార్జి చూసుకోవాలన్నారు. వరద ఉధృతి పెరిగినా ఎదుర్కొనడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు కేటాయించిన అధికారులు, సిబ్బంది రాత్రీపగలు అక్కడే ఉండాలన్నారు. నదిలో నీటి ప్రవాహం తగ్గే వరకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఆర్డీ కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్గా పాల్ సుధాకర్
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం డెప్యూటీ డైరెక్టర్గా (డీడీ) బండి పాల్ సుధాకర్ను నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పదోన్నతి ద్వారా డీడీగా విధుల్లో చేరనున్నారు. కడపకు చెందిన పాల్ సుధాకర్ హాకీ క్రీడలో ప్రతిభ చాటారు. పలుమార్లు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనడంతో స్పోర్ట్స్ కోటాలో 1993లో సీనియర్ అసిస్టెంట్గా ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికై , డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఆఫీస్ సూపరింటెండెంట్గా, పరిపాలనా అధికారిగా పదోన్నతులు పొంది 2014 వరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో పని చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రమోషన్ పొంది గుంటూరు జీజీహెచ్కు 2015లో బదిలీ అయ్యారు. -
తప్పిపోయిన పాప తల్లిదండ్రుల చెంతకు
చీరాల అర్బన్: తప్పిపోయిన పాపను చీరాల ఒన్టౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఒన్టౌన్ సీఐ ఎస్.సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు జె.పంగులూరు మండలానికి చెందిన నాలుగు సంవత్సరాల పాప ఆరాధ్య చీరాల ఎంజీసీ మార్కెట్ వద్ద సోమవారం తప్పిపోయింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన సిబ్బందిని, శక్తి టీం సభ్యులను అప్రమత్తం చేశారు. గంట వ్యవధిలోనే పాపను గుర్తించి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. తమ పాపను సురక్షితంగా అప్పగించిన పోలీసులకు వారు ధన్యవాదాలు తెలిపారు. జె పంగులూరు: మద్యం తాగి బైక్ మీద వస్తూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి మండలంలోని ముప్పవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై సర్వీసు రోడ్లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముప్పవరం గ్రామంలో జాతీయ రహదారిపై చిలకలూరిపేట వైపు వెళుతున్న సర్వీస్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళుతూ సైడ్ డివైడర్ని ఢీకొన్నారు. మద్యం తాగి ఉండటం వల్ల అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చిలకలూరిపేటకు చెందిన ఒక వ్యక్తి తలకు గట్టి దెబ్బ తగిలి ప్రమాద స్థలంలోనే మృతిచెందాడు. మరో వ్యక్తికి బలమైన గాయాలు అవటంతో అతన్ని అంబులెన్స్లో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు హైవే అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. వీరి వివరాలు తెలియరాలేదు. రేణింగవరం ఎస్సై వినోద్బాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యర్రబాలెం(మంగళగిరి): ప్రేమ పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన యర్రబాలెం బీసీ కాలనీలో జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగర పరిధిలోని యర్రబాలెం బీసీ కాలనీకి చెందిన మైనర్ బాలిక అదే ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యలో బాలికను వివాహం చేసుకోవాలని కుటుంబసభ్యులు కోరగా నిరాకరించాడు. దీంతో బాలిక కుటుంబసభ్యులు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు. గుంటూరు మెడికల్: అత్యవసర మందులు, వైద్య పరికరాలపై ప్రభుత్వం జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గించడం వల్ల ప్రజలకు ఖర్చులు తగ్గుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల్లో భాగంగా శిశువులకు ఉపయోగించే న్యాప్కిన్లు, ఫీడింగ్ బాటిల్స్, వ్యక్తిగత ఆరోగ్య బీమా అంశాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపును ఇచ్చారని పేర్కొన్నారు. క్యాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ 28 నుంచి 40 శాతానికి పెంచడం వల్ల వినియోగం తగ్గుతుందన్నారు. తద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని తెలిపారు. వైద్యశాఖ అధికారులు, వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు, క్యాలెండరు యాక్టివిటీస్లో భాగంగా అక్టోబర్ 1న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా న్యాయ విజ్ఞాన సంస్థలో సదస్సు నిర్వహించారు. ఇన్చార్జి కార్యదర్శి ఎం.కుముదిని సదస్సును ప్రారంభించారు. వృద్ధులకు న్యాయపరంగా ఉన్న సెక్షన్లు, హక్కులు, పిల్లల ద్వారా మోసపోయిన వారికి తిరిగి ఆస్తిని పొందే చట్టాల గురించి ఆమె వివరించారు. వృద్ధులు ఎదుర్కొనే పలు సమస్యలు, వాటి పరిష్కారాల గురించి స్టేట్ సీనియర్ సిటిజన్స్ అసోసి యేషన్ సెక్రటరీ ఉమామహేశ్వరరావు తెలియజేశారు. సీహెచ్.పరమేశ్వరరావు, పారా లీగల్ వలంటీర్స్, వృద్ధులు పాల్గొన్నారు. -
దళిత నాయకుల నినాదాలు..
ఈ సందర్భంగా సమావేశంలో ఒకానొదశలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దళిత యువకులపై అక్రమ కేసులు బనాయించి లాఠీచార్జికి పాల్పడిన సీఐను సస్పెండ్ చేయాలని దళిత సంఘాల నాయకులు చార్వాక, నీలం నాగేంద్రరావు తదితరులు నినాదాలు చేశారు. డేగరమూడి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఏకపక్ష నిర్ణయాలపై అధికారులు విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ రామాంజనేయులు జోక్యం చేసుకొని దళిత నాయకులను శాంతపరిచారు. గ్రామాల్లోని ఇరువర్గాలు అంబేడ్కర్ విగ్రహ స్థాపన కోసం కమిటీ వేసుకొని అనుమతులు వచ్చాక ప్రశాంత వాతావరణంలో విగ్రహ స్థాపన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ టి. ప్రశాంతి, సీఐ శేషగిరి, డేగర మూడి గ్రామప్రజలు, నాయకులు వైఎస్సార్ సీపీ మార్టూరు మండల కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను వెంటనే పరిష్కరించండి
బాపట్ల: ప్రజలు తమ సమస్యలపై ప్రజా సమస్యల పరిస్కార వేదికలో అందజేసిన అర్జీలను అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, పలువురు జిల్లా అధికారులతో అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజునే వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో పింఛన్ తీసుకోలేకపోతే కారణాలు గుర్తించాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో, ఆర్డీఓలు, ప్రతి మండల కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి నెలా 28 కల్లా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యంతోపాటుగా మిగిలిన వస్తువులు పంపిణీ చేయాలన్నారు. రెవెన్యూ భూ సమస్యలకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిషేధిత జాబితా, 22ఏకి సంబంధించి ప్రతి శుక్రవారం సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ఫైల్స్ను పరిష్కరిస్తామన్నారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి (ఏఓ) మల్లి కార్జునరావు, డీఆర్డీఏ ఇన్చార్జి పీడీ లవన్న, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాదవి, డీఎఫ్ఓ రవిశంకర్, డీపీఓ ప్రభాకరరావు, సీపీఓ ఏ.ఎస్.రాజు, డీఈఓ పురుషోత్తం, డ్వామా పీడీ విజయలక్ష్మి, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ విజయమ్మ, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం దూరం
బాపట్ల: పేదవాడికి అనునిత్యం వైద్యం అందుబాటులో ఉండాలంటే మెడికల్ విద్య ప్రభుత్వంలోనే ఉండాలని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు వాసుమల్ల వాసు పేర్కొన్నారు. ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టనున్న నిరసన పోస్టర్లను సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలను నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమవుతోందని, దీన్ని అంతా వ్యతిరేకించాలని ఆయన కోరారు. మంగళవారం ఉదయం 10గంటలకు స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ భవనం వరకు ప్రదర్శన ఉంటుందని, పట్టణ ప్రజలంతా పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎస్సీ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు బడుగు ప్రకాశ్, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి మండే విజయకుమార్, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు అడే చందు, జమ్మలపాలెం సర్పంచ్ కటికల యోహోషువా, బాపట్ల నియోజకవర్గం ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలపర్తి గోపి, నాయకులు నర్రావుల వెంకట్రావు పాల్గొన్నారు. -
బిక్కుబిక్కుమంటూ చెట్టు నీడన..
‘సాక్షి’ చొరవతో పునరావాస కేంద్రానికి తరలింపు కొల్లూరు: పనుల కోసం సొంత ఊళ్లను విడిచి ఏళ్ల తరబడి ఇక్కడే నివాసాలు ఏర్పరుచుకొని జీవిస్తున్న కుటుంబాలకు చెట్టు నీడే పునరావాసంగా మారింది. కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా కొల్లూరు కరకట్ట దిగువన నివసిస్తున్న నిరుపేదల తాటాకుల పాకలలోకి వరద నీరు ప్రవేశించింది. పాకలను వదిలి సమీపంలో ఏడుగురు పసిపిల్లలతో నలుగురు మహిళలు చెట్టు నీడన తలదాచుకున్నారు. సోమవారం వరద నీటి పక్కనే చెట్టు నీడన చిన్నారులతో ఉన్న కుటుంబాలను గమనించిన ‘సాక్షి’ వారి పరిస్థితి గురించి ఆరా తీయడంతో గోడు వెళ్లబోసుకున్నారు. కొల్లూరులో రోజువారీ హోటళ్లతోపాటు, ఇతర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించే వీరు ఏరోజుకు ఆరోజు వచ్చే సంపాదనతోనే జీవనం వెళ్లబుచ్చుతున్నారు. వీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలివెళితే అధికారులు పనులుకు వెళ్లేందుకు అనుమతించకపోతే చేసే పని పోతుందన్న భయంతో చెట్టు నీడనే ఉన్నారు. దీంతో ‘సాక్షి’ వారి పరిస్థితిని తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకువెళ్లింది. తక్షణం స్పందించిన ఆయన.. రెవెన్యూ సిబ్బందిని వారి వద్దకు పంపించారు. పనులకు వెళ్లడానికి అభ్యంతరం ఉండదని భరోసా కల్పించి, వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. -
తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ
యడ్లపాడు: మండలంలోని జగ్గాపురం గ్రామంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు పగులగొట్టి విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు షేక్ బాజీవలి, మీరాబీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరికి వివాహాలు కావడంతో కుమారుడు, కోడలు ఉద్యోగం నిమిత్తం దుబాయ్లోనూ, కుమార్తె, అల్లుడు వట్టి చెరుకూరు మండలం కుర్నూతల అడ్డరోడ్డు వద్ద చిల్లర కూల్డ్రింక్ షాపును ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం బాజీవలి దంపతులు కుమార్తె ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటలకు జగ్గాపురంలోని ఇంటికి తిరిగి రాగా, రేకుల షెడ్డు తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోపలకు వెళ్లి చూడగా, బీరువా, కప్ బోర్డులో ఉన్న వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దుండగులు కప్బోర్డులో దుస్తుల మధ్యలో దాచి ఉంచిన వెండి, బంగారం ఆభరణాలు, నగదు అపహరించుకుపోయినట్లు బాజీవలి గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో యడ్లపాడు ఎస్సై టి.శివరామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 130 గ్రాముల బంగారం, 20గ్రామలు వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు చోరీకి గురైనట్లు ఎస్సై శివరామ కృష్ణ తెలిపారు. -
8వ రౌండ్కు చేరిన జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ పోటీలు సోమవారం ఆసక్తికరంగా జరిగాయి. ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి, పీఎస్పీబీకి చెందిన నాలుగు సార్లు జాతీయ విజేత జీఎం కృష్ణన్ శశికిరణ్ తన జట్టు సహచరుడు జీఎం దీప్సెం గుప్తాపై గెలిచాడు. అదే జట్టుకు చెందిన మరో గ్రాండ్మాస్టర్ అభిజీత్ గుప్తా యూపీకి చెందిన ఐఎం ఎలెక్ట్ అజయ్ సంతోష్ పర్వతరెడ్డిపై విజయం సాధించారు. దీంతో శశికిరణ్, అభిజీత్లు చెరో ఏడు పాయింట్లతో టాప్లో నిలిచారు. వీరికి సగం పాయింట్ వెనుక ఆరుగురు ఆటగాళ్లు (తమిళనాడు జీఎం ఇనియన్, రైల్వేస్ జీఎం దీపన్ చక్రవర్తి, నలుగురు ఐఎంలు) ఉన్నారు. -
విచారణ తర్వాత సీఐపై తగిన చర్యలు
మార్టూరు: అంబేడ్కర్ విగ్రహ స్థాపనకు అన్ని విధాలా సహకరిస్తామని జిల్లా అధికారులు స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ హాలులో సోమవారం సాయంత్రం డేగరమూడి గ్రామంలోని ఇరువర్గాలతో నిర్వహించిన సమావేశంలో అధికారులు మాట్లాడారు. ఆర్డీవో గ్లోరియా మాట్లాడుతూ.. విగ్రహ స్థాపనకు ఎన్నుకున్న స్థలం తాలూకు పూర్వాపరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రామ, మండల కమిటీల ఆమోదం అనంతరం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. అనుమతులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. అప్పటివరకు గ్రామాల్లోని ఇరువర్గాలు ఎలాంటి విభేదాలు తలెత్తకుండా సంయమనంతో వ్యవహరించాలని కోరారు. సీఐపై చట్టప్రకారం చర్యలు డీఎస్పీ గోగినేని రామాంజనేయులు మాట్లాడుతూ దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్ కుమార్లపై సీఐ శేషగిరి లాఠీచార్జి చేశారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ ఆదేశాలతో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. బాధిత యువకుల వైద్య పరీక్షల రిపోర్టులు, ఇతర వివరాలను పరిశీలించి ఎస్పీకి నివేదిక పంపనున్నట్లు చెప్పారు. నిజ నిర్ధారణ అనంతరం సీఐ ప్రమేయం రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. సోషల్ వెల్ఫేర్ డీడీ రాజా దిబోరా మాట్లాడుతూ విగ్రహ స్థాపనకు సంబంధించిన అంశాన్ని జిల్లా పరిషత్ అధికారులతో చర్చించి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
కౌలు రైతుల సమస్యలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో ఆందోళన
లక్ష్మీపురం: కౌలు రైతుల సమస్యలపై అక్టోబర్ 13, 14 తేదీల్లో మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు చెప్పారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతులందరికీ భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులిచ్చి పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని కోరారు. ఈ క్రాప్ నమోదు చేసి ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర నష్ట పరిహారాలు వర్తింప చేయాలని విజ్ఞపి చేశారు. కౌలు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో సుమారు లక్ష మంది కౌలు రైతులున్నారని, 70 శాతం వారే సాగు చేస్తున్నారని పేర్కొ న్నారు.రైతు సేవా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యూరి యా అందుబాటులో ఉంచాలని కోరారు. సమా వేశంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రామకృష్ణ, నాగమల్లేశ్వరరావు, సాంబిరెడ్డి, కృష్ణ, అమ్మిరెడ్డి, నీలాంబరం పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతున్న కౌలు రైతు సంఘ నేతలు -
ఆకట్టుకున్న వీణా సింఫనీ
తెనాలి: శ్రీదేవీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజైన సోమవారం సాయంత్రం తెనాలిలో 108 వీణల ఘన సప్తస్వర సమ్మేళనం (వీణా సింఫనీ) నిర్వహించారు. పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాల స్వామీజీ) ఆధ్వర్యంలో 108 మంది వైణికుల వాద్య స్వర తరంగాలు ఒకే సమయాన ఆడిటోరియంలో ఆవహించాయి. దివ్యానంద సుడిగాలిలా భక్తులను చుట్టుముట్టాయి. స్థానిక చెంచుపేటలోని పద్మావతి కల్యాణ మండపంలో ఈ ఆధ్యాత్మిక సంగీత యజ్ఞాన్ని వేడుకగా చేశారు. బాలస్వామీజీ స్వయంగా వీణావాదన చేశారు. సరస్వతీ దేవికి ప్రీతిపాత్రం వీణ అని తెలిసిందే. వీణ ధ్వనిని వేదమంత్రాల నాదంతో సమానంగా పరిగణిస్తారు. ఇక 108 సంఖ్య హిందూ సంప్రదాయంలో పవిత్రమైనది. జపమాలలో ఉండే గింజల సంఖ్య 108. అంతమంది వైణికులు ఒకేసారి వీణ వాయించటమంటే జపమాల గింజల్లా ప్రతి స్వరం ఒక మంత్రధ్వనిగా మారటం అన్నమాట! శ్రోతలలో భక్తి, శాంతి, ఆనందం, ఆత్మశుద్ధిని కలిగించే ఆధ్యాత్మిక యజ్ఞంలా జరిగింది. పట్టణానికి చెందిన శ్రీ విద్యా పీఠం, సాలిగ్రామ మఠం, జయలక్ష్మి మాతృమండలి ఆధ్వ ర్యంలో నిర్వహించారు. ఆయా సంస్థల బాధ్యులు నంబూరి వెంకటకృష్ణమూర్తి, పెనుగొండ వెంకటేశ్వరరావు, రావూరి సుబ్బారావు, ముద్దాభక్తుని రమణయ్య, పల్లపోతు మురళీ మనోహర్, కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రమణ్యం, గోపు రామకృష్ణ, రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు, జయలక్ష్మి మాతృమండలి సభ్యులు పాల్గొన్నారు. -
ప్రజల ఫిర్యాదులపై సత్వర చర్యలు
బాపట్ల: ప్రజల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను జిల్లా ఎస్పీ స్వయంగా స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. అర్జీలలోని వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అర్జీలను పరిష్కరించడంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని ఎస్పీ పోలీస్ అధికారులను హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు, ఇతర పలు సమస్యలపై 56 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీశ్ నాయక్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
సెపక్ తక్రాలో జోత్స్న ప్రతిభ
చెరుకుపల్లి: జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు తుమ్మ వెంకట జోత్స్న ఎంపికై నట్లు ఎంఈఓ పులి లాజర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 27, 28 తేదీలలో డాక్టర్ పి. ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించిన ఏపీ సీనియర్ సెపక్ తక్రా చాంపియన్షిప్లో ప్రతిభ కనబరచి అక్టోబర్లో గోవాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. మండలంలోని పొన్నపల్లి గ్రామానికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు తుమ్మ శ్రీనివాసరెడ్డి కుమార్తె, క్రీడాకారిణి జోత్స్నను ఉపాధ్యాయులు మాదావత్ సాంబయ్య నాయక్, ఈమని సాంబశివరావు, రమేష్, కిరణ్ అభినందించారు. దసరా సెలవుల్లో పిల్లలపై నిఘా ఉంచాలి ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: దసరా సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల కదలికలపై నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. వర్షాలకు చెరువులు, గుంతలు నిండిపోయి, నదులు, వాగులు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సెలవుల్లో సరదాగా కాలక్షేపం కోసం పిల్లలు, యువకులు చెరువులు, కాలువలు, వాగులు, నదీ తీరాలు, సముద్రతీరాలకు వెళ్లి ఈతకు దిగే ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా సూర్యలంక, వాడరేవు, రామాపురం వంటి సముద్రతీరాలకు యాత్రికులు భారీగా తరలివస్తున్నారన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. యాత్రికులు తప్పనిసరిగా పోలీసు సూచనలు పాటించాలన్నారు. ఎరుపు రంగు జెండాలను దాటి లోతు ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదన్నారు. ‘క్లెసా’ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీకాంత్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు నరసరావుపేట: కాన్ఫిడరేషన్ ఆఫ్ లైసెన్స్డు ఇంజినీర్స్, సర్వేయర్స్, అండ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏపీ (క్లెసా–ఏపీ) పల్నాడు జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఆదివారం స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) భవనంలో క్లెసా ఏపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్నాడు చాప్టర్ నూతన కమిటీ ఆవిష్కరణకు గౌరవ చైర్మన్ వేల్పుల రాము, చైర్మన్ ముని శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ కొమ్మసాని కమలాకరరెడ్డి, జనరల్ సెక్రటరీ ఎన్.ఎన్.వి.ఎస్.ఎస్.మూర్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రేజేటి సతీష్కుమార్ ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ చైర్మన్గా కె.కమలాకరరెడ్డి, చైర్మన్గా ఎం.మురళీకృష్ణ, ప్రెసిడెంట్గా ఎస్.లక్ష్మీకాంత్, కోశాధికారిగా డి.రాజశేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులుగా మీసా శ్రీనివాసరావు, బి.నరేంద్ర, ప్రధాన కార్యదర్శిగా డేవిడ్ కృపానందం, సంయుక్త కార్యదర్శులుగా మారెళ్ల రామాంజనేయులు, తోట సాంబశివరావు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి.వెంకటనారాయణరావు, ఈసీ సభ్యులుగా పి.నిర్మల్కుమార్, డీవీ కృష్ణారావు, పి.శ్యాంప్రసాద్, వి.శ్రీనివాసరావు, నుసి నాగఫణింద్రారెడ్డి, పి.కోటిరెడ్డి, అమర్లను ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు సిరివేరి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ సంఘం సంక్షేమం, టెక్నికల్ సెమినార్లు, సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల ఇంజినీర్లు పెద్దఎత్తున పాల్గొన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో శ్రీకారం చుట్టారు. మ్యాక్స్ విజన్ కంటి హాస్పిటల్ డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. అలాగే ఇంజినీర్స్ వృత్తిలో ఎదురవుతున్న పలు సమస్యలపై చర్చించారు. -
రంగస్థలంపై మరో ‘చింతామణి’
ఆకట్టుకున్న ‘వీణా అవార్డ్స్’ ప్రదర్శనలు తెనాలి: సుదీర్ఘరాగం.. హోరెత్తే సంగీతం.. అర్థం కాని పద్యం... తెలుగువారికే సొంతమైన పద్యనాటకంపై సాధారణ ప్రేక్షకుడి అభిప్రాయం. ఒకప్పుడు పామరులను సైతం ఉర్రూతలూగించిన పద్యనాటకం, రానురాను ఆదరణ కోల్పోతుండటానికి ఇదే కారణం. భాష, భావం అర్థంకాని పద్యగానంపై మక్కువ తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో తెనాలిలో జరుగుతున్న వీణా అవార్డ్స్ నాటకోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ప్రదర్శించిన ‘కస్తూరి తిలకం’ పద్యనాటకం ఆద్యంతం ప్రేక్షకులను కూర్చోబెట్టింది. కల్పిత కథో, చారిత్రక ఆధారాలున్నాయో తెలీదుగాని, బిల్వమంగళుడు, చింతామణి పేర్లతో ప్రధాన పాత్రల చుట్టూ శారదా ప్రసన్న అల్లిన నాటకాన్ని చందాల కేశవదాసు కళారిషత్, మధిర వారు ప్రదర్శించారు. రంగస్థల కళలో ఆరితేరిన డాక్టర్ నిభానుపూడి సుబ్బరాజు దర్శకత్వం వహించారు. పాత్రల మధ్య సంభాషణలు సందర్భోచితంగా వచ్చే పద్యాలు స్పష్టంగా వినిపిస్తూ, హృద్యమైన గానాలాపనతో నాటకం నడిచింది. చాలాకాలానికి ప్రేక్షకులు చక్కటి పద్యనాటకాన్ని ఆస్వాదించారు. ప్రధాన పాత్రల్లో చిలువేరు శాంతయ్య, బి.విజయరాణి నటించారు. ఇతర పాత్రల్లో సరిత, జి.శివకుమారి, ఎన్.సాంబశివారెడ్డి, నిభానుపూడి సుబ్బరాజు నటించారు. సంగీతం సీహెచ్ నాగేశ్వరరావు. ●తదుపరి మిర్యాలగూడ సాంస్కృతిక సమాఖ్య, మిర్యాలగూడవారి ‘బ్రహ్మరథం’ పద్య నాటకాన్ని ప్రదర్శించారు. బ్రహ్మహత్యాపాతకానికి భయపడి ఇంద్రుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఇంద్రపీఠం ఎక్కిన నహుషుడుకు పదవీ వ్యామోహంతో చేసిన అరాచకాలకు శాపానికి గురై, పశ్చాత్తాపానికి లోనైన ఇతివృత్తమిది. సూలూరి శివసుబ్రహ్మణ్యం రచనకు తడికమళ్ల రామచంద్రరావు దర్శకత్వం వహించారు. తదుపరి కళాంజలి, హైదరాబాద్ వారి ‘యాగం’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. శ్రీశైలమూర్తి రచనకు కొల్లా రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. చివరగా హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘భువి కోరని భ్రమణం’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఆచళ్ల ఉమామహేష్ మూలకథకు తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరించగా, కత్తి శ్యాంప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. -
ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ ప్రకటించాలి
ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ బాపట్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం దసరా కానుకగానైనా డీఏ ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ కోరారు. పట్టణంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ 2024 నుంచి ఇప్పటి వరకు 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పీఆర్సీ బకాయిలు, డీఏ, సరెండర్ లీవ్ బకాయిలు, పీఎఫ్ లోన్లు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ బకాయిలు దాదాపు రూ.25 వేల కోట్లు ఉన్నాయని చెప్పారు. ఆ బకాయిల విడుదలకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలకు పింఛన్లు, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలని అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం, వైద్య సదుపాయాలు కల్పించమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదని కుంటి సాకులు చెప్పడం సరికాదన్నారు. డీఎస్సీ నియామకాల ద్వారా కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలకు వస్తున్నందున ఎంటీఎస్ ఉపాధ్యాయులను ఏకోపాధ్యాయ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడివాడ అమర్నాథ్, ఉపాధ్యాయ వాణి కన్వీనర్ పీవీ నాగరాజు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి నూర్ బాషా సుభాని, జిల్లా ఆర్థిక కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిలర్ ఎ.ఉదయశంకర్, ఏవీ నరసింహారావు, గవిని శ్రీనివాస్, పి.శివాంజనేయులు, ఏవీ నారాయణ, తోట శివయ్య, కోటేశ్వరరావు, నారాయణమూర్తి, ప్రభాకర్ పాల్గొన్నారు. ఆగిఉన్న లారీని ఢీకొన్న ఆటో.. వృద్ధుడు మృతి -
ఆదర్శంగా నిలిచిన కుటుంబం
కారంచేడు: తాను చనిపోయిన తరువాత మరొకరికి చూపునివ్వాలని గ్రామానికి చెందిన యార్లగడ్డ బుల్లెయ్య నిర్ణయించుకున్నారు. ఆయన ఆగస్టు 29వ తేదీన మృతి చెందాడు. అప్పుడు ఆయన నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. కాగా ఆయన భార్య యార్లగడ్డ నాగేంద్రం (80) ఆదివారం ఉదయం మృతి చెందగా ఆమె కూడా భర్త అడుగుజాడల్లో నిలిచి నేత్రాలను దానం చేయగా.. పెదకాకానిలోని శంకర నేత్రాలయం వారు ఆదివారం నేత్రాలను సేకరించారు. కాగా తమ తల్లి కోరిక ప్రకారం కుమారుడు వెంకటేశ్వర్లు, కుమార్తె అనంతలక్ష్మి కూడా నేత్రాలను దానం చేయడానికి అంగీకరించడం విశేషం. -
కృష్ణమ్మ ఉగ్రరూపం
కృష్ణమ్మ మరోసారి కన్నెరజేసింది. ప్రకాశం బ్యారేజి నుంచి సముద్రంలోకి ఆరు లక్షల క్యూసెక్కులకుపైగా విడుదల చేశారు. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద నీరు లంక గ్రామాల్లోకి చొచ్చుకు వచ్చింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలు నీట మునిగాయి. అధికారులు అప్రమత్తమయ్యారు. లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా నదిలో పోటెత్తుతున్న వరద రెండో ప్రమాద హెచ్చరిక జారీ వరద ముంపులో ఉద్యాన పంటలు పల్లపు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు రహదారులపై ప్రవహిస్తున్న వరద నీరు ఆందోళనలో లంక గామాల ప్రజలు -
చతికిల పడిన మార్కెట్ కమిటీలు
● గుంటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.115 కోట్లు కాగా, ఆగస్టు నాటికి 29.58 శాతంతో రూ.34.02 కోట్లు సాధించారు. ● తెనాలి మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.7.65 కోట్లు కాగా 35.06 శాతంతో రూ.2.68 కోట్లు వసూలు చేసింది. ● పొన్నూరు మార్కెట్ కమిటీ రూ.8.38 కోట్లు కాగా, 32.66 శాతంతో రూ.2.74 కోట్లు. ● దుగ్గిరాల మార్కెట్ కమిటీ రూ.3.75 కోట్లకు 34.67 శాతంతో రూ.1.30 కోట్లు. ● తాడికొండ మార్కెట్ కమిటీ రూ.2.17 కోట్లకు కేవలం 3.27 శాతంతో రూ.7 లక్షలు. ● మంగళగిరి మార్కెట్ కమిటీ రూ.3.03 కోట్లకు 24.72 శాతంతో రూ.75 లక్షలు. ● ఫిరంగిపురం మార్కెట్ కమిటీ రూ.1.88 కోట్లకు 15.73 శాతంతో రూ.30 లక్షలు. ● ప్రత్తిపాడు మార్కెట్ కమిటీ రూ.4.45 కోట్లకు 28.41 శాతంతో రూ.1.26 కోట్లు వసూలు చేశాయి. ఫీజు వసూళ్లలో మందగమనం గుంటూరు జిల్లాలోని 8 మార్కెట్ కమిటీల్లో రాబడి అంతంత మాత్రం ఈ ఏడాది లక్ష్యం రూ.146.31 కోట్లు.. ఆగస్టు చివరి నాటికి వసూలైంది రూ.43.12 కోట్లు -
దళితులంటే అంత చులకనా
● మార్టూరు సీఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ● డిజిటల్ బుక్లో మొదటి వ్యక్తి సీఐ శేషగిరే.. ●వైఎస్సార్ సీపీ నేతలు కొమ్మూరి, టీజేఆర్ మార్టూరు:దళిత యువకులపై అమానుషంగా ప్రవర్తించిన మార్టూరు సీఐ ఎం.శేషగిరిరావుపై అట్రాసి టీ కేసు నమోదు చేయాలని, గ్రామంలో తొలగించి న అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వైఎస్సార్ సీపీ నేత కొమ్మూరి కనకారావు మాదిగ, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు డిమాండ్చేశా రు. మార్టూరు మండలం డేగరమూడి గ్రామానికి చెందిన దళిత యువకులు జ్యోతి పోతులూరి, అల్లడి ప్రమోద్కుమార్లపై తప్పుడు కేసు బనా యించి లాఠీచార్జి చేసిన సీఐ వైఖరిని ఆదివారం పార్టీ నాయకులు ఖండించారు. పోలీసుల దెబ్బలకు గాయపడిన ఇద్దరు యువకులను గ్రామంలో పరామర్శించి ధైర్యం చెప్పారు. ● కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ సీఐ శేషగిరి అగ్రవర్ణాలకు కొమ్ముకాస్తూ ఇతర కులాల పట్ల వివక్షతో వ్యవహరిస్తున్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు. అతని వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. సీఐతోపాటు అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించిన పంచాయతీ కార్యదర్శి, అధికార పార్టీ గ్రామ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తగిన మూల్యం చెల్లించక తప్పదు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు మాట్లాడు తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన డిజిటల్ బుక్లో మొదటి వ్యక్తిగా మార్టూరు సీఐ శేషగిరి చోటు సంపాదించి.. అరుదైన ఘనత సాధించారని ఎద్దేవాచేశారు. ద్రోణాదుల సర్పంచ్ వంకాయలపాటి భాగ్యరావు, ఎంఎల్ఏ బాలకృష్ణపై పోస్టింగ్ పెట్టినందుకు అక్రమంగా కేసు పెట్టారన్నారు. దళితులతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తొలగించిన ప్రదేశంలోనే త్వరలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ద్రోణాదుల వెళ్లి సర్పంచ్ భాగ్యరావుని పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బండ్రేవు వెంకట నారాయణరెడ్డి, రాష్ట్ర లీగల్సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శనరెడ్డి, గ్రీవె న్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నాగ నారాయణ మూర్తి, బొందిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రసింగ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాలెపోగు రాంబాబు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమల్ల వాసు, మండల కన్వీనర్ వీరయ్యచౌదరి పాల్గొన్నారు. -
సాగర్ కాల్వలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
కారెంపూడి: సాగర్ కుడి కాల్వలో సరదాగా ఈత కొడదామని యత్నించిన ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు మునిగి మృతి చెందిన ఘటన స్థానిక వినుకొండ రోడ్డు బ్రిడ్జి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ వాసు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సరావుపేటకు చెందిన సయ్యద్ సత్తార్, ఖాదర్ వలి, నాగుల్ మీరాలు పదవ తరగతి చదువుతున్నారు. దసరా సెలవలు కావడంతో సయ్యద్ సత్తార్ ఇద్దరు మిత్రులతో కలసి కారెంపూడిలో ఉంటున్న పెద్దమ్మ జహీరా ఇంటికి వచ్చారు. బట్టలు ఉతికేందుకు వెళ్తున్న పెద్దమ్మ జహీరాతో పాటు వారు కూడా సాగర్ కాల్వ వద్దకు వచ్చారు. ఈత కొడదామని సరదా పడి ముగ్గురు కాల్వలో దిగారు. ప్రవాహ వేగానికి ముగ్గురు మునిగి కొట్టుకుపోతుండగా జహీరా పెద్ద పెట్టున ఏడుస్తూ కేకలు వేయడంతో ఆ సమీపంలో ఉన్న స్థానికులు గమనించి ఇద్దర్ని కాపాడి ఒడ్డుకు చేర్చారు. సయ్యద్ సత్తార్ను ఒడ్డుకు చేర్చేసరికే (15) ప్రాణాలు విడిచాడు, ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు బంధువులు తల్లడిల్లిపోతున్నారు. నర్సరావుపేటకు చెందిన సయ్యద్ రహీమ్ వ్యవసాయదారుడు, ఆయనకు కుమారుడు కుమార్తె ఉన్నారు. కుమారుడు సత్తార్ కారెంపూడిలో ఉన్న తన అక్క దగ్గరకు సెలవుల్లో సరదాగా గడిపేందుకు వచ్చి ఇలా తనువు చాలించడంతో అందరు శోకసంద్రంలో మునిగిపోయారు. గురజాలలో పోస్టుమార్టం అనంతరం సయ్యద్ సత్తార్ మృతదేహాన్ని ఎస్ఐ వాసు బంధువులకు అప్పగించారు. వారిలో ఒకరు మృతి, ఇద్దరిని కాపాడిన స్థానికులు -
ఆట్యాపాట్యా రాష్ట్ర క్రీడల్లో గుంటూరుకు తృతీయ స్థానం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆట్యాపాట్యా క్రీడా పోటీల్లో గుంటూరు జిల్లా బాలబాలికల జట్లు తృతీయ స్థానాలు దక్కించుకున్నాయని గుంటూరు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ కార్యదర్శి దావులూరి సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పల్నాడు జిల్లా ఆట్యా–పాట్యా అసోసియేషన్ ఆధ్వర్యంలో నకరికల్లులోని వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించిన 12వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఆట్యా–పాట్యా చాంపియన్ షిప్–2025 పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఈ విజయాలు నమోదు చేశారన్నారు. క్రీడాకారులను ఏపీ ఆట్యా–పాట్యా సీఈవో రంభ ప్రసాద్, కార్యదర్శి శ్రీ చరణ్, గుంటూరు జిల్లా అధ్యక్షులు కాళ్ల విజయ్కుమార్ తదితరులు అభినందించారని తెలిపారు. -
మొబైల్ బుక్ కీపింగ్ సకాలంలో పూర్తి కాకపోతే చర్యలు
బాపట్ల టౌన్: మొబైల్ బుక్ కీపింగ్ నూరు శాతం పూర్తిచేయని వీఓఏలకు గౌరవ వేతనాలు నిలుపుదల చేస్తామని సెర్ఫ్ అడిషనల్ సీఈవో ఆర్. శ్రీరాములు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వెలుగు సిబ్బందితో కలిసి శనివారం కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఈటీసీ కార్యాలయంలో జిల్లాలోని 25 మండలాల ఏపీఎం, డీపీఎం అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 30 నాటికి మొబైల్ బుక్ కీపింగ్ని 100% పూర్తి చేయాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. లవన్న మాట్లాడుతూ జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు గురించి గ్రూపు సంఘ సభ్యులకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో సెర్ఫ్ అధికారి ఎల్.వాల్మీకి, డీపీఎంలు, ఏపీఎంలు, సీ్త్ర నిధి సభ్యులు పాల్గొన్నారు. సెర్ఫ్ అడిషనల్ సీఈవో ఆర్. శ్రీరాములు -
భక్తి రసానందం పద్యనాటకాలు
తెనాలి: కళల కాణాచి, తెనాలి, ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జాతీయస్థాయ పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, నాటికల పోటీలు ‘వీణా అవార్డ్స్–2025’ శనివారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ప్రముఖ నటీమణి, పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షురాలు, బుర్రా జయలక్ష్మి జ్యోతిప్రజ్వలనతో పోటీలను ఆరంభించారు. తొలిగా టీజీవీ కల్చరల్ అకాడమీ, కర్నూలు వారి ‘శ్రీవెంకటేశ్వర మహా త్మ్యం’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. శ్రీవెంకటేశ్వరుడిపై అమిత భక్తిభావం కలిగిన అనంతాచార్యుడు స్వామివారి కై ంకర్యాలు కోసం నియమితుడవటం, అందుకోసం ఆయన పడే కష్టాలు, చివరకు శ్రీవేంకటేశ్వరుడే మారురూపంలో వచ్చి సాయం చేయటం కథాంశం. శ్రీవెంకటేశ్వరుడుగా టి.రాజశేఖరరావు, అనంతాచార్యులుగా జె.మోహన్ నాయర్, మహాలక్ష్మిగా సురభి హారిక కార్తిక్, అలిమేలు మంగమ్మగా సురభి వెంగమాంబ నటించారు. సంగీతం పీజీ వెంకటేశ్వర్లు, శారదా ప్రసన్న రచనకు వీవీ రమణారెడ్డి దర్శకత్వం వహించారు. రెండో ప్రదర్శనగా పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు అండ్ లలిత కళాపరిషత్, అనంతపురం వారి ‘కాలభైరవ సంహారం’ పద్యనాటకాన్ని ప్రదర్శించారు. కీ.శే పోతులయ్య రచనకు రామగోంద్సాగర్ దర్శకత్వం వహించారు. శ్రీకృష్ణుడుగా గంటా శివశంకర్, కాలభైరవుడుగా దాసరి దయానంద్, దుర్యోధనుడుగా సోమర లక్ష్మీనారాయణ, నారదుడుగా సి.శ్రీరాములు, ద్రౌపదిగా ఎస్.విజయశారద నటించారు. రాత్రి చివరి ప్రదర్శనగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్, వెలగలేరు వారి ‘నల్లత్రాచు నీడలో’ సాంఘిక నాటకాన్ని ప్రదర్శించారు. రచన, దర్శకత్వం శ్రీనివాసరావు పోలుదాసు, ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీనివాసరావు, సురభి లలిత, పవన్కళ్యాణ్, షణ్ముఖి నాగుమంత్ర, గోవర్ధనరెడ్డి, చైతన్య నటించారు. -
తల్లిని హత్య చేసిన తనయుడి అరెస్ట్
బాపట్ల టౌన్: మండల పరిధిలోని పూండ్ల గ్రామంలో తల్లిని హత్య చేసిన తనయుడిని బాపట్ల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను శనివారం బాపట్ల రూరల్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి. రామాంజనేయులు వివరించారు. పూండ్ల గ్రామానికి చెందిన పెనిమిటి రమణమ్మ పారిశుద్ధ్య ఎస్డబ్ల్యూ షెడ్లో రెండో భర్త శ్రీనివాసరావుతో కలిసి పని చేస్తోంది. మొదటి భర్త చనిపోవడంతో ఆమె రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తకు ఇద్దరు సంతానం ఉన్నారు. షెడ్లో పనిచేస్తున్న వారికి గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదు. అయితే, ఇటీవల జీతం ఒక్కసారిగా రూ. 42,000 రావడంతో అదే షెడ్డు వద్ద రెండవ భర్తతో కలిసి మృతురాలు, కొడుకు మద్యం తాగుతున్నారు. మృతురాలి కొడుకు జాలయ్య మందు తాగడానికి డబ్బులు అడగడంతో నిరాకరించింది. దీంతో పక్కనే ఉన్న ఇనప రాడ్డుతో తలపై కొట్టి హత్య చేశాడు. మృత్యురాలి భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని అన్ని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జాలయ్య హత్య చేసి పారిపోగా చుండూరుపల్లిలో శనివారం అదువులోకి తీసుకుని కోర్టుకు హాజరు పరుస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు, రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పనులు సకాలంలో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బాపట్ల: జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన వివిధ పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. గుంటూరు సర్కిల్ పరిధిలోని పనులకు సంబంధించి శనివారం జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరు సర్కిల్ పరిధిలోని బాపట్ల జిల్లాలో సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని భూములకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 716 పనులు చేపట్టినట్లు, వాటిలో 148 పూర్తి అయ్యాయని, మిగతా పనులు పలు దశలలో ఉన్నాయని జిల్లా వాటర్ రీసోర్సెస్ అధికారి అబా అబుతలీమ్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. ‘జీఎస్టీ తగ్గింపు’ ప్రయోజనాలపై హెల్ప్ డెస్క్ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్పై జిల్లా కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జీఎస్టీ కమిషనర్ మురళీకృష్ణతో కలసి శనివారం జిల్లా కలెక్టరేట్లో హెల్ప్ డెస్కును ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు, జీఎస్టీ కమిషనర్ మురళికృష్ణ, డ్వామా పీడీ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జున రావులతో కలసి కరపత్రాలను విడుదల చేశారు. వసతుల కల్పనకు చర్యలు జిల్లాలో పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములయ్యే సంస్థలకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం పర్యాటక శాఖ అధికారులు, పలు సంబంధిత సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. చెత్త తరలించాలి బాపట్ల డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలను నిర్దిష్ట కాలపరిమితిలోపు నిర్దేశిత ప్రాంతానికి తరలించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం బాపట్ల జమ్ములపాలెం రోడ్డులోని డంపింగ్ యార్డ్ను ఆయన పరిశీలించారు. -
ఇంట్లో అర కిలో బంగారం, వెండి చోరీ
మార్టూరు: మండలంలోని వలపర్ల గ్రామంలో అరకిలో బంగారం, వెండి వస్తువులు చోరీకి గురైన ఘటన శనివారం వెలుగు చూసింది. బాధితుల వివరాల మేరకు.. వలపర్లకు చెందిన కారంపూడి కొండలు, నాగిని దంపతులు వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరు స్థానిక సినిమా హాల్ సెంటర్ సమీపంలో గ్రామానికి దూరంగా ఇటీవల కొత్తగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. దసరా సెలవులు ప్రారంభం కాగానే గత ఆదివారం ఇద్దరు కలిసి కర్ణాటక రాష్ట్రంలో ఉంటున్న తమ కుమార్తెను చూడటం కోసం వెళ్లారు. శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కొండలు దంపతులు ఇంటి తలుపులకు వేసిన తాళం ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. లోపల వైపు తలుపులు బీరువాలు ధ్వంసం చేసి ఉండటానికి గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, సంతమాగులూరు సీఐ, బల్లి కురవ ఎస్సైలతో కలిసి ఘటనా స్థలిని పరిశీలించారు. -
కరుణించవమ్మా...
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. దసరా సందర్భంగా ఉత్సవాలు శనివారంతో ఆరో రోజుకు చేరాయి. జిల్లాలోని వివిధ దేవస్థానాలలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కరుణించవమ్మా.. అంటూ భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామంలో అమ్మవారిని రూ.1.41 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించి, పూజలు నిర్వహించారు. చెరుకుపల్లి మండలంలోని గుళ్లపల్లి ఆనందీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీమహంకాళి అమ్మవారు, చెరుకుపల్లిలోని ఆర్యవైశ్య సత్రంలో, బాలకోటేశ్వర స్వామి ఆలయంలో కనగాల పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో కరెన్సీ నోట్లతో అమ్మవారు శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని కనులారా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, భక్తి గీతాలు ఆలపించారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన నిర్వాహకులు.. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. – మార్టూరు/చెరుకుపల్లికనగాల పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ జొన్నతాళి గ్రామంలో కరెన్సీ నోట్ల అలంకరణలో అమ్మవారు గుళ్లపల్లి ఆనందీశ్వర స్వామి దేవస్థానంలో లలితాత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు -
నిండుకుండలా కృష్ణమ్మ
కొల్లూరు: కృష్ణమ్మ నిండుకుండలా ప్రవహిస్తోంది. పంటలు ముంపు బారిన పడతాయన్న ఆందోళన రైతాంగాన్ని పట్టి పీడిస్తోంది. శనివారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ నుంచి 2,26,293 క్యూసెక్కులకు నీటి విడుదల పరిమితం కావడంతో వరద ప్రభావం తగ్గిందని ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మధ్యాహ్నం నుంచి వరద తీవ్రత గణనీయంగా పెరుగుతూ వచ్చింది. సాయంత్రానికి 1,58,232 క్యూసెక్కులు... తర్వాత 3,84,525 క్యూసెక్కులకు చేరింది. ప్రకాశం బ్యారేజ్కు శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటికి తోడు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మూసీ నది, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతం నుంచి ప్రవహించే మున్నేరు వరద కూడా ఉద్ధృత రూపం దాల్చడంతో నదిలో వరద క్రమంగా అధికమైంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.75 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడం కారణంగా మండలంలోని పెసర్లంక, గాజుల్లంక, ఆవులవారిపాలెం గ్రామాల చుట్టూ నీరు చుట్టుముట్టింది. దోనేపూడి లోలెవల్ చప్టాపై వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పది లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు చుట్టు మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. ఆదివారానికి 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు నీటి విడుదల చేరవచ్చునని ఆర్సీ, నీటిపారుదల శాఖాధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నీటి విడుదల పరిమాణం పెరిగిన పక్షంలో శనివారం అర్ధరాత్రి నుంచి బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఆదివారం రెండో ప్రమాద హెచ్చరిక సైతం వెలువడవచ్చునని అధికారులు పేర్కొన్నారు. -
ట్రాక్టర్ కింద నలిగిన రెండు ప్రాణాలు
అద్దంకి: డ్రైవర్ మద్యం మత్తు కారణంగా రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ట్రాక్టరు కింద పడి కూలీలు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని తిమ్మాయపాలెంలోని దర్శి–అద్దంకి రహదారిలో శనివారం చోటుచేసుకుంది. మృతుల బంధువుల కథనం మేరకు.. తిమ్మాయపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన వేము నరసమ్మ (60), కొప్పోలు స్వరూపారాణి (47)లు ప్రకాశం జిల్లా పోలవరం గ్రామంలో కూలీ పనుల కోసం వెళ్తున్నారు. గ్రామంలోని బట్టీ వద్ద ఇటుకలు లోడు చేసుకుని ఓ ట్రాక్టర్ దర్శి వైపు వెళ్తోంది. ఇటుక ఎత్తిన కూలీలను గ్రామంలో దించాక దర్శి రహదారిలో ట్రాక్టర్ను డ్రైవర్ రవి నడుపుతున్నాడు. అటుగా వెళ్తున్న నలుగురు కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లిన తరువాత అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. ఒక వైపు బానెట్పై కూర్చుని ఉన్న నర్సమ్మ, స్వరూపారాణి జారి ట్రాక్టర్ కింద పడి అక్కడిక్కడే మృతి చెందారు. అదే సమయంలో రోడ్డుపక్కన ఇంటి ముందు పని చేసుకుంటున్న టి. శ్రీనివాసరావు ఇంకుడు గుంతలో కూర్చోవడంతో గాయాలు మాత్రమే అయ్యాయి. ఆయన్ను వైద్యశాలకు తరలించారు. మద్యం మత్తులో డ్రైవర్.. నర్సమ్మకు ముగ్గురు పిల్లలు. ఐదు సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. స్వరూపారాణికి భర్త రవి, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కాలనీకి చెందిన ఇరువురు మృతి చెందడంతో బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. అదే ట్రాక్టర్పై ఉన్న మరో ఇరువురు కూలీలు తెలిపిన వివరాల మేరకు.. బస్సు కోసం వేచి చూస్తున్న కూలీలను ట్రాక్టర్ డ్రైవర్ పిలిచాడన్నారు. మద్యం మత్తుగా ఉన్నాడని, దాంతోనే ప్రమాదం జరిగిందని చెప్పారు. తాము రెండో వైపు ఉండడంతో బతికామని పేర్కొన్నారు. ఇరువురు కిందపడ్డారని కేకలు వేసినా డ్రైవర్ పట్టించుకోలేదని వాపోయారు. రోజూ తమతో కూలీ పనులు చేసుకునే ఇద్దరు తమ కళ్లముందే మృత్యువాత పడడంతో నోట మాట రాలేదని కన్నీటిపర్యంతం అయ్యారు. డ్రైవర్కు మృతుల బంధువులు దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నష్టపరిహారం చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు, దళిత సంఘాల నేతలు శనివారం రాత్రి ఆందోళన చేశారు. -
పార్టీ శ్రేణులకు భరోసా.. ‘డిజిటల్ బుక్’
బాపట్ల: వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ భరోసాగా ఉంటుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం ఆరాచకాలు చేస్తోందని పేర్కొన్నారు. పరిపాలనకు పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు వైఎస్సార్సీపీ వారిని వేధిస్తోందన్నారు. డిజిటల్ బుక్లో తమ సమస్యలను నమోదు చేసుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కారిస్తామని మాజీ సీఎం, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వటం గొప్ప విషయమన్నారు. శ్రేణులు ఇబ్బందులు ఎదురైతే ఈ యాప్లో సమగ్ర వివరాలు నమోదు చేయాలని కోరారు. భయపడొద్దు... అండగా పార్టీ ఉంది.. కూటమి ప్రభుత్వ అరాచకాలకు భయపడొద్దని, వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అండగా ఉంటుందని జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి పేర్కొన్నారు. దుర్మార్గమైన పాలన రాష్ట్రంలో నడుస్తోందన్నారు. లోకేష్ రెడ్బుక్ పాలన చూస్తున్న మనకు త్వరలో డిజిటల్ బుక్ పాలన అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాబోతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా వీరారెడ్డి, జిల్లా అధ్యక్షులు కొక్కిలిగడ్డ చెంచయ్య, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, ఇనగలూరి మాల్యాద్రి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, ఎస్సీ సెల్ నాయకులు వడ్డిముక్కల డేవిడ్ , జోగి రాజా, అడే చందు, మోర్ల సముద్రాలగౌడ్, బడుగు ప్రకాశ్, కటికల యోహోషువా తదితరులు ఉన్నారు. -
బాధితులకు అండగా ఉంటాం
మార్టూరు: బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని.. ఎవరూ అధైర్యపడొద్దని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డి అన్నారు. శనివారం మార్టూరు మండలంలోని డేగరమూడి గ్రామానికి చెందిన దళిత యువకులు ప్రమాద్, పోతులూరిలను పరామర్శించారు. మార్టూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి చెందిన దళిత యువకులను మార్టూరు సీఐ మద్దినేని శేషగిరిరావు అత్యంత క్రూరంగా పోలీస్ స్టేషన్కు పిలిపించి చిత్రహింసలకు గురిచేసిన ఘటనకు స్పందించిన ఆయన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు కోసం యాక్టివ్గా ఉన్న వారిపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి అక్రమ కేసులు బనాయించారన్నారు. వారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో టీడీపీ ఫ్లెక్సీని చించివేశారంటూ పోలీసే స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదు.. నిజంగా తప్పు చేస్తే కేసు ఫైల్ చేసి శిక్షించాలిగానీ, వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన అధికారులను ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చిపోతుంటాయని చెప్పారు. దానిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు నడుచుకోవాలని పేర్కొన్నారు. ఈ ఘటనను ఇంతటితో వదలిపెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసికట్టుగా పోరాడి బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ పార్టీ నాయకులతో మాట్లాడి చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వాసు, మార్టూరు మండల పార్టీ కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి ఉప్పలపాటి అనిల్ చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, మార్టూరు టౌన్ అధ్యక్షుడు అడకా గంగయ్య, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి అట్లూరి వెంకయ్య, మండల ఉపాధ్యక్షులు షేక్ ఖాదర్ బాషా, మైలా నాగేశ్వరరావు, బూరగ రాము, తమ్మలూరి సురేష్, రాజుపాలెం అంజిబాబు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిన్న నాయక్, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
దళిత యువకులపై సీఐ దాష్టీకం
మార్టూరు: బాపట్ల జిల్లాలో ఇద్దరు దళిత యువకుల్ని పోలీస్ స్టేషన్లో దారుణంగా హింసించారు. టీడీపీ నేతలు చేయించిన తప్పుడు ఫిర్యాదుతో శుక్రవారం వారిని స్టేషన్కు పిలిపించి బూటుకాళ్లతో సీఐ తొక్కిపట్టి ఇద్దరు పోలీసులతో అరికాళ్లపై లాఠీలతో కొట్టించారు. తరువాత మరింత అమానుషంగా గులకరాళ్లపై నడిపించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరించారు. మార్టూరు మండలం డేగరమూడికి చెందిన బాధిత యువకులు శుక్రవారం డేగరమూడిలో ఈ దారుణం గురించి వివరించారు. సీఐ మీద చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరారు. బాధితుల కథనం మేరకు.. డేగరమూడిలో నెలరోజులుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహస్థాపన విషయమై వివాదం నెలకొంది. సర్పంచ్ భర్త, వైఎస్సార్సీపీ మండల కన్వినర్ జంపని వీరయ్యచౌదరి సహాయంతో స్థానిక ఎస్సీ కాలనీ యువకులు అల్లడి ప్రమోద్కుమార్, జ్యోతి పోతులూరి ఈ విగ్రహస్థాపనలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిమీద కక్షగట్టిన స్థానిక అధికారపార్టీ నాయకులు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయించారు. గ్రామానికి చెందిన అన్నం హనుమంతరావుతో టీడీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించారు. తరువాత హనుమంతరావును పోలీస్ స్టేషన్కు పంపించి.. దళిత యువకులు ప్రమోద్కుమార్, పోతులూరి ఫ్లెక్సీలు తొలగించారంటూ తప్పుడు ఫిర్యాదు చేయించారు. రంగంలోకి దిగిన సీఐ శేషగిరి శుక్రవారం ఉదయం ప్రమోద్కుమార్, పోతులూరిలను స్టేషన్కు పిలిపించారు. వాళ్లు వచ్చీరాగానే రాజకీయాలు మీకు అవసరమంట్రా అంటూ నానా దుర్భాషలాడుతూ విరుచుకుపడ్డారు. వారిని గదిలో గోడపక్కన కూర్చోబెట్టి వారి కాళ్లను సీఐ శేషగిరి బూటుకాళ్లతో తొక్కిపట్టారు. ఇద్దరు సిబ్బంది లాఠీలతో ఆ యువకుల అరికాళ్లపై తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలతో వారి అరికాళ్లపై బొబ్బలొచ్చాయి. తరువాత సీఐ ఆ ఇద్దరిని బొబ్బలు తగ్గేవరకు కంకరరాళ్లపై నడిపించారు. తరువాత వారిద్దరితో తెల్లకాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే మళ్లీ ఇదేగతి పడుతుందని హెచ్చరించి మధ్యాహ్నం వదిలిపెట్టారు. తప్పుడు ఫిర్యాదు చేయించారు స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన బాధిత యువకులు తమపై తప్పుడు ఫిర్యాదు చేసిన అన్నం హనుమంతరావును ఇలా ఎందుకు చేశావని నిలదీశారు. గ్రామ నాయకులు మద్యం పోయించి, కొట్టి, తనచేత ఫ్లెక్సీలు తొలగింపజేశారని, తరువాత డబ్బిస్తామని ఆశచూపి ఫిర్యాదు చేయమంటే చేశానని హనుమంతరావు చెప్పాడు. హనుమంతరావు చెప్పిన ఈ విషయాన్ని బాధిత యువకులు వీడియో రికార్డు చేశారు. తమను హింసించిన సీఐపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు జిల్లా ఎస్పీని కోరారు. -
ఇద్దరు విద్యార్థుల ఉసురు తీసిన కాలేజీ బస్సు
పొదిలి: దసరా పండగను స్వగ్రామంలో జరుపుకొనేందుకు బయల్దేరిన ఇద్దరు బీటెక్ విద్యార్థులను ఓ కాలేజీ బస్సు పొట్టన పెట్టుకుంది. వరుసకు అన్నదమ్ములైన వీరు బైకుపై విజయవాడ నుంచి స్వగ్రామం హనుమంతునిపాడుకు బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం పోతవరం వద్ద ఓ కాలేజీ బస్సు ఢీకొనటంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాలు.. మచ్చా బ్రహ్మయ్య (19), బండ్లమూడి గురువిష్ణు (22) అక్కాచెల్లెళ్ల కుమారులు. విజయవాడలో బీటెక్ చదువుతున్నారు. గురువిష్ణు కుటుంబం విజయవాడలో, బ్రహ్మయ్య కుటుంబం హనుమంతునిపాడులో ఉంటోంది. దసరా పండగకు హనుమంతునిపాడులో గడిపేందుకు బైకుపై శుక్రవారం ఉదయం బయల్దేరారు. వేగంగా వస్తున్న కాలేజీ బస్సు యువకులను ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడే కిందపడి ప్రాణాలు కోల్పోయారు. మోటారు సైకిల్ దూరంగా పడి ఉంది. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న కాలేజీ బస్సును పోలీసుస్టేషన్కు తరలించారు. భీతావహంగా సంఘటన స్థలం ప్రమాద స్థలం భీతావహంగా మారింది. ఒక యువకుడి మెదడు చిదిరి రోడ్డంతా పడింది. వర్షం కురుస్తుండటంతో రక్తంతో రోడ్డంతా ఎరుపెక్కింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శరీర భాగాలు దూరంగా ఎగిరిపడ్డాయి. బ్యాగ్లు, పిండి ప్యాకెట్ సంఘటన స్థలంలో పడి ఉన్నాయి. తొలుత గుర్తు తెలియని వాహనంగా అనుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఓ ప్రైవేటు కాలేజీ బస్సు సంఘటనకు కారణంగా అనుమానించిన పోలీసులు ఆ దిశగా విచారణ చేయడంతో బస్సు వివరాలు తేలాయి. కంభాలపాడు వైపు నుంచి పిల్లలను ఎక్కించుకుని విశ్వనాథపురానికి వస్తున్న బస్సు మధ్యలో పోతవరం విద్యార్థులు చేయెత్తినా ఆపకుండా వెళ్లింది. ఈ క్రమంలో విద్యార్థులను విచారించగా... ఆ బస్సే ప్రమాదానికి కారణమని తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పండగకు వస్తూ పరలోకాలకు.. మృతుల తల్లులు తిరుపతమ్మ, రమణమ్మలు అక్కాచెల్లెళ్లు. వీరిది వెలిగండ్ల మండలం పూలికుంట్ల. బ్రహ్మయ్య తల్లిదండ్రులు హనుమంతునిపాడులో నివాసం ఉంటున్నారు. ఇంటర్ వరకు కనిగిరిలో చదివిన బ్రహ్మయ్య.. బీటెక్ చదివేందుకు విజయవాడలో చేరి హాస్టల్లో ఉంటున్నాడు. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న బండ్లమూడి రాజా, రమణమ్మల కుమారుడైన విష్ణు విజయవాడలోనే బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. సెలవులు ఇవ్వడంతో విష్ణు, బ్రహ్మయ్యలు పండగ ఆనందంగా గడిపేందుకు వస్తుండగా బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ప్రభుత్వ వైద్యశాలకు చేరిన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి
పట్నంబజారు: అసెంబ్లీ సాక్షిగా నటుడు చిరంజీవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిలపై ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి ధ్వజమెత్తారు. బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో యువజన విభాగం నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కనీస విజ్ఞత లేకుండా సభా మర్యాద తెలియని బాలకృష్ణ తాను బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మద్యాన్ని తాగి వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తోందని విమర్శించారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్ ద్వారా ఎంతో లబ్ధి పొందిన విషయాన్ని గుర్తించాలన్నారు. బసవతారకం హాస్పిటల్కు సంబంధించి పెండింగ్ బిల్లులను టీడీపీ హయాంలో ఇవ్వకపోతే, స్వయంగా వై.ఎస్.జగన్ వాటిని విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి వెంటనే రాజకీయం చేయకుండా బాలకృష్ణ జీవితాన్ని కాపాడిన విషయాన్ని గుర్తుచేశారు. తండ్రిపై చెప్పులు వేయించిన వ్యక్తితో పయనిస్తున్న బాలకృష్ణకు, తండ్రి ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వై.ఎస్.జగన్ను విమర్శించే స్థాయి లేదన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు యేటి కోటేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ సినిమా వాళ్లను అవమానించారంటూ పిచ్చిబట్టిన వ్యాఖ్యలు చేస్తూ వై.ఎస్.జగన్పై కూటమి నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రజా సమస్యలు చర్చించిన పాపాన పోలేదని మండిపడ్డారు. సినిమా డైలాగులు చెప్పడం తప్ప, కనీసం మాట్లాడలేని బాలకృష్ణ ఒక సైకో అని మండి పడ్డారు సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం నేతలు వేలూరి అనిల్రెడ్డి, కానూరి శశిధర్, వెంకటేష్రెడ్డి, దానం వినోద్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్రెడ్డి -
డిజిటల్ అరెస్ట్ను ఛేదించిన పోలీసులు
బాపట్ల టౌన్: డిజిటల్ అరెస్ట్ అంటూ రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడిని బెదిరించి రూ.1.10 కోట్లు కొల్లగొట్టిన కేసును బాపట్ల పోలీసులు ఛేదించారు. కర్ణాటకకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.55 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ కేసు వివరాలను బాపట్ల జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ శుక్రవారం వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు.. చీరాల పట్టణానికి చెందిన విశ్రాంత వైద్యుడికి ఈ నెల 9న తొలుత ట్రాయ్ (టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి మాట్లాడుతున్నామని అంటూ కాల్ వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం ఇన్కంట్యాక్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నామని అంటూ మరో కాల్ వచ్చింది. ఈ నెల 10న మీపై ట్రాయ్, ఇన్కంట్యాక్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా దర్యాప్తు చేస్తున్నాం.. సీబీఐ అధికారులమంటూ యూనిఫాంలో ఉన్న నకిలీ పోలీసులు వీడియో కాల్ చేశారు. ఈ కేసులో భాగంగా మీ ఇంట్లో సోదాలు నిర్వహించాలంటూ బెదిరించారు. అలా జరగకుండా ఉండాలంటే ముందు రూ.1.10 కోట్లు చెల్లించాలని, దర్యాప్తులో నిర్దోషి అయితే డబ్బు బ్యాంకు ఖాతాకు వాపసు చేస్తామని చెప్పారు. ఇది నిజమని నమ్మిన ఆయన ఈనెల 11న వారు పంపించిన ఎస్ బ్యాంక్ అకౌంట్కు రూ.50 లక్షలు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్కు రూ.50 లక్షలు జమ చేశారు. ఈ నెల 17న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అకౌంట్కు మరో రూ.10 లక్షలు జమ చేశారు. తరువాత వారి నుంచి ఫోన్ రాకపోవడంతో అనుమానించిన ఆయన ఈ నెల 19న చీరాల వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇది కర్ణాటకకు చెందిన వ్యక్తుల మోసమని గుర్తించారు. చీరాల వన్టౌన్ సీఐ, జిల్లా ఐటీ కోర్ సిబ్బంది కొందరు కర్ణాటక వెళ్లి ఇద్దరిని అరెస్టు చేసి తీసుకొచ్చి శుక్రవారం బాపట్ల కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తమతోపాటు తమిళనాడు, ఇతర దేశాలకు చెందినవారు ఈ ముఠాలో ఉన్నట్లు నిందితులు తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి రూ.2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లోని ఖాతాల్లో ఉన్న రూ.55 లక్షల్ని ఫ్రీజ్ చేయించారు. కేసును త్వరితగతిన ఛేదించిన చీరాల వన్టౌన్ సీఐ, చీరాల డీఎస్పీ, జిల్లా ఐటీ కోర్ బృందాన్ని ఎస్పీ అభినందించారు. -
డీఎస్సీ ఉపాధ్యాయులకు తప్పిన ప్రమాదం
ప్రత్తిపాడు: హైవేపై పెను ప్రమాదం తప్పింది. మార్జిన్లో నిలిపి ఉంచిన ఫర్నీచర్ లోడ్ ఆటోను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు ప్రమాదం తప్పిపోవడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా అచంట మండలం కొండమంచిలి గ్రామానికి చెందిన మానూరి త్రినాథ్ గత కొంతకాలంగా విజయవాడలో నివాసం ఉంటూ డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 25వ తేదీ రాత్రి త్రినాథ్ తన మేనల్లుడు పొదిలి మోషేకుతో కలసి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నుంచి ట్రాలీ ఆటోలో కుర్చీల లోడుతో తిరుపతికి బయల్దేరాడు. మార్గమధ్యలో అర్ధరాత్రి సమయంలో ఆటో నడుపుతున్న మహేష్ కాలకృత్యాల కోసం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం సమీపంలో పదహారో నంబరు జాతీయ రహదారిపై మార్జిన్లో ఆటో నిలిపాడు. తర్వాత కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఇటీవల డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన సుమారు 40 మంది ఉపాధ్యాయులతో గుంటూరు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళుతున్న కనిగిరి డిపో ఆర్టీసీ బస్సు వేగంగా ఆ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆటోలో ఉన్న త్రినాథ్తోపాటు ఆటో కూడా సైడు కాలువలోనికి దూసుకుపోయింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా దెబ్బతినగా, త్రినాథ్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న 40 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు ఎలాంటి నష్టం జరగలేదు. వీరంతా గురువారం రాజధానిలో జరిగిన సీఎం సభకు హాజరై రాత్రికి తిరుగు పయనమయ్యారు. త్రినాథ్ను చిలకలూరిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇచ్చిన పిర్యాదు మేరకు ప్రత్తిపాడు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్. నరహరి తెలిపారు. -
97 రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు
తాడికొండ: అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం(ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామాల రైతులకు శుక్రవారం విజయవాడలోని ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ– లాటరీ విధానంలో 97 రిటర్నబుల్ ప్లాట్లను కేటాయించారు. వీటిలో 41 నివాస ప్లాట్లు కాగా, 36 వాణిజ్య ప్లాట్లు, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నాయి. మొత్తంగా 56 మంది రైతులు, భూయజమానులకు ప్లాట్లను కేటాయించారు. అధికారులు ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేశారు. డైరెక్టర్(ల్యాండ్స్)/స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్– క్యాపిటల్ సిటీ) ఎన్వీఎస్బీ వసంతరాయుడు మాట్లాడుతూ రైతులకు భౌగోళికంగా ప్లాట్లు ఎక్కడ కేటాయించబడ్డాయో వివరించడానికి ప్రత్యేకంగా జి.ఐ.ఎస్. సిబ్బంది, గ్రామ సర్వేయర్లను నియమించామన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. రుసుము వసూలు చేయబడదని రైతులు గమనించాలని కోరారు. -
మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి
చినగంజాం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో వంద మంది తెలుగు మహనీయుల విగ్రహాలతో హైదరాబాద్ ట్యాంక్ బండ్ తరహా నిర్మాణం చేయాలని ఊరూర జన విజ్ఞానం రాష్ట్ర అధ్యక్షుడు కోట వెంకటేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నవ్యాంధ్ర రాష్ట్ర సాంస్కృతిక చైతన్య ప్రచార కార్యక్రమంలో భాగంగా కడవకుదురులో నవ్యాంధ్ర సాంస్కృతిక కళాయాత్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు విజ్ఞప్తులపై స్థానిక ప్రజా చైతన్య కళావేదిక సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఇనేళ్లయినా సరైన అభివృద్ధి జరగలేదన్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఆహ్వాన కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ఐదు విజ్ఞప్తులపై కార్యక్రమంలో వివరించారు. ఆరిగ వెంకట్రావు, కాళిదాస్, పల్లపోలు నాగమనోహర లోహియా, సుంకర కోటేశ్వరరావు, వారు ముసలారెడ్డి, దైవాల తిరుపతిరెడ్డి, ఎం. గోపాల్, ఏడుకొండలు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఎంఎంఎస్ నమోదుకు 30 తుది గడువు
డీఈఓ చంద్రకళ నరసరావుపేట ఈస్ట్: నేషనల్ మీన్స్ కం మెరిట్స్ స్కాలర్షిప్ పరీక్ష రాసేందుకు ఈనెల 30వ తేది వరకు విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష డిసెంబర్ 7వ తేదీన నిర్వహిస్తారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, మండల ప్రాథమికోన్నత, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులని తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా చెల్లించాలని తెలిపారు. వివరాలకు డీఈఓ కార్యాలయంలో పి.శంకరరాజు (9963192487)ను సంప్రదించాలని సూచించారు. యడ్లపాడు: విద్యార్థులకు చేతిరాతలో ఉచిత శిక్షణ ఇస్తూ తనదైన శైలిలో గుర్తింపు పొందిన కొండవీడు జెడ్పీ హైస్కూల్ ఎస్జీటీ ఉపాధ్యాయుడు డాక్టర్ షేక్ జున్నుసాహెబ్కు మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లో బిర్లా ప్లానెటోరియం వద్ద ఉన్న భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు నేషనల్ టీచర్స్ ఎక్స్లెన్స్ అవార్డు–2025ను ప్రదానం చేశారు. ఒకే నెలలో మూడు అవార్డులు విద్యారంగానికి జున్ను సాహెబ్ చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ నెలలో ఇది మూడో అవార్డు రావడం విశేషం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆయనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈనెల 7న విశాఖపట్నంకు చెందిన సెయింట్ మదర్థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి గురుబ్రహ్మ రాష్ట్రస్థాయి అవార్డు, తాజాగా జాతీయస్థాయి అవార్డు తెలంగాణ రాష్ట్రంలో అందుకున్నారు. -
నేడు ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్
బాపట్ల: జిల్లాలోని ఎస్టీల సమస్యలపై ప్రతి నెలలో నాలుగో శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.అందులో భాగంగా ఉదయం 10.30గంటల నుంచి కలెక్టరేట్ సముదాయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక హాలులో వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఎస్టీలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఏఎంఆర్ కంటైనర్ ధ్వంసం బల్లికురవ: గ్రానైట్, మెటల్, గ్రావెల్, ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన ఏఎంఆర్ కంటైనర్ అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం పగులగొట్టి ధ్వంసం చేశారు. అక్టోబర్ 1 నుంచి అక్రమ రవాణాకు అడ్డుకట్టతో సీనరేజ్ వసూలు బాధ్యతలను ప్రభుత్వం ఏఎంఆర్ సంస్థకు కట్టబెట్టింది. ఇందుకోసం ఆ సంస్థ నెలకు రూ.47 కోట్లు రాయల్టీ రూపంలో చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. బల్లికురవ, సంతమాగులూరు, అద్దంకి మండలాల లోని ప్రధాన గ్రామాల్లో కంటైనర్లను తెచ్చి ఇప్పటికే అమర్చారు. అక్రమ రవాణాతో కోట్ల రూపాయలు వెనకేసుకున్న వారంతా కంటైనర్ల ఏర్పాటుతో హడలెతుత్తుతున్నారు. ధర్మవరం కొండ సమీపంలో ఏర్పాటు చేసిన కంటైనర్ను ధ్వంసం చేశారు.జీఎస్టీ రేట్ల తగ్గింపుపై అవగాహన పెంచాలిబాపట్ల: జీఎస్టీ రేట్ల తగ్గింపుపై వ్యాపారస్తులు ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించాలని తూనికలు కొలతల శాఖ రీజినల్ ఆఫీసర్ ఐజాక్ పేర్కొన్నారు. బాపట్ల రిటైల్ కిరణా అండ్ జనరల్ మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో గురువారం వ్యాపారస్తులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0లో భాగంగా మార్పులు చేసినట్లు తెలిపారు. దీనిపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో బాపట్ల జిల్లా అధికారి లిల్లీ, ఇన్స్పెక్టర్ రామదాసు పాల్గొన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటుబాపట్ల టౌన్: భారీ వర్షసూచన నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనటానికి జిల్లా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఏదైనా సహాయం అవసరమైతే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 112 (లేదా) 8333813228కి ఫోన్ చేయాలని సూచించారు. ఇప్పటికే 26 పునరావాస కేంద్రాలను కొల్లూరు, రేపల్లె, భట్టిప్రోలు మండలాల్లో ఏర్పాటు చేశారని వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలు వాటిల్లో రక్షణ పొందాలని ఆయన సూచించారు.రిటర్నబుల్ ప్లాట్లకు నేడు ‘ఈ – లాటరీ‘తాడికొండ: రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీఏ పరిధిలో భూములిచ్చిన పెనుమాక (జరీబు, మెట్ట), మల్కాపురం (ప్రత్యామ్నాయ ప్లాట్లు) గ్రామ రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపునకు ఈ – లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ లెనిన్ సెంటరులోని ఏపీ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి లాటరీ తీయనున్నట్లు పేర్కొన్నారు. 56 మంది రైతులకు 104 ప్లాట్లను ఆన్న్లైన్ ర్యాండమ్ సిస్టం ద్వారా కేటాయిస్తామని వెల్లడించారు. వీటిలో 43 రెసిడెన్షియల్, 41 కమర్షియల్, 20 ప్రత్యామ్నాయ ప్లాట్లు ఉన్నట్లు వివరించారు. ఈ– లాటరీ కార్యక్రమానికి రైతులు హాజరు కావాలని వారు ఒక ప్రకటనలో తెలిపారు. -
లిఫ్టులో ఇరుక్కున్న ప్రయాణికులు
దాచేపల్లి: నడికుడి రైల్వే జంక్షన్లో ఉన్న లిఫ్ట్లో ప్రయాణికులు గురువారం ఇరుక్కుపోయారు. నడికుడి రైల్వేస్టేషన్ నుంచి గుంటూరు వెళ్లేందుకు ప్రయాణికులు నడికుడి రైల్వేస్టేషన్కి చేరుకున్నారు. ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం నుంచి రెండో నెంబర్ ప్లాట్ ఫారం పైకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ ఎక్కి కిందకు దిగుతుండగా ఆకస్మాత్తుగా లిఫ్టు మధ్యలో ఆగిపోయింది. దీంతో లిఫ్ట్లో ప్రయాణికులు ఇరుక్కుపోయి తీవ్ర భయాందోళన చెందారు. ఈ విషయం అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు గమనించి రైల్వేస్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లోకి వచ్చి ఆగింది. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ఈ రైలులోనే వెళ్లాల్సి ఉంది. రైల్వే సిబ్బంది అతి కష్టం మీద లిఫ్ట్ ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటకు తీశారు. లిఫ్ట్లో ఇరుక్కుపోయిన వీరిని బయటకు తీసేంతవరకు జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలుని స్టేషన్లోనే ఆపేశారు. సుమారు పది నిమిషాలపాటు రైలు ఆగింది. తర్వాత లిఫ్ట్లో ఇరుక్కున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కి వెళ్లారు. ఇటీవల కాలంలో నడికుడిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్లు తరచూ ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. -
సమర్థంగా ప్రభుత్వ పథకాల అమలు
అధికారులకు కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశం బాపట్ల: జిల్లాలో సూపర్ సిక్స్ పథకాలను సమర్థంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో గురువారం పథకాల అమలుపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాలను పారదర్శకంగా ప్రజలకు చేరువు చేయడానికి కృషి చేయాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకాలను అర్హులందరికీ అందజేయాలని చెప్పారు. జిల్లాలో సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, డిపోల్లో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా మరుగు దొడ్లు నిర్మించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆ శాఖ అధికారులకు చెప్పారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం రుచిగా, సుచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని హాస్టళ్లలో మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆయన చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ లవన్న, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం పాల్గొన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్య సమాజం చీరాల అర్బన్: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. గురువారం చీరాల పట్టణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు కలెక్టర్ అధికారులతో కలిసి చీపురు చేతపట్టి, రోడ్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారు స్వయంగా చీపుర్లు చేత పట్టాలన్నారు. పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా పరిశుభ్రత ప్రాధాన్యాన్ని ఇతరులకు తెలియచెప్పే ప్రయత్నం చేయాలని తెలిపారు. రోడ్లుపై చెత్తను నిల్వ ఉంచకుండా షాపుల నిర్వాహకులు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చెత్త పేరుకుపోవడం వల్ల నీరు నిలిచి దోమల వ్యాప్తి చెంది, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛ బాపట్ల.. స్వచ్ఛ చీరాలలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. బాపట్ల జిల్లాలో త్వరలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించనున్నామని వెల్లడించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, ప్రజలు కూడా వినియోగాన్ని తగ్గించి వస్త్రాలతో తయారు చేసిన సంచులను వాడాలని ఆయన సూచించారు. చీరాల మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, వినియోగిస్తే జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, తహసీల్దార్ గోపీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ ఎం. సాంబశివరావు, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల: జిల్లాలోని రైతులందరికీ వారి అవసరాల మేరకు యూరియాను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారని కలెక్టర్ వి.వినోద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలోని 26 రైతు భరోసా కేంద్రాలు, పరపతి సంఘాల ద్వారా 318 మెట్రిక్ టన్నుల యూరియాను 3,452 మంది రైతులకు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇంకా 112 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని కలెక్టర్ తెలిపారు. -
● భక్తుల పాలిట కల్పవల్లి కాత్యాయని దేవి
జిల్లావ్యాప్తంగా దేవీ శరన్నవరాత్య్రుత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. గురువారం పలు ఆలయాల్లో కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనమించారు. భక్తులు పెద్దఎత్తున దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాత్యాయని దేవిని పూజిస్తే చదుర్విద పురుషార్థాలు సిద్ధిస్తాయని, రోగాల భయాలు నశిస్తాయని, ఆయురారోగ్యాలు, సుఖఃసంతోషాలు వర్ధిల్లుతాయని భక్తుల నమ్మకం. – సాక్షి, నెట్వర్క్ పెదపులిపర్రులో ప్రత్యేక అలంకరణలో గోగులాంబ అమ్మవారుఅన్నపూర్ణాదేవిగా జిల్లేళ్లమూడి అమ్మ బాపట్ల రాజీవ్గాంధీ కాలనీలో శ్రీ కాత్యాయని దేవిగా.. చందోలులో నృసింహ, వారాహి అవతారంలో బగళాముఖి అమ్మవారు -
జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
బాపట్ల: స్వచ్ఛతా ిహీ సేవల్లో బాపట్ల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. 461 గ్రామాల్లో మురికి కూపాలుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లాకు 342 సామాజిక మరుగుదొడ్లు మంజూరు కాగా, నేటి వరకు 223 మొదలు పెట్టకపోవడం ఏమిటని ఆరా తీశారు. ముఖ్యంగా పురపాలక సంఘాలలోని ప్రధాన కాల్వలన్నిటీలో పూడికతీత పనులు చేపట్టాలని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని తాగునీటి చెరువులని క్లోరినేషన్ చేయాలన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ వారంలో మూడు రోజులు సంబంధిత గ్రామాల్లో క్షేత్ర పరిశీలన చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్ జి.గంగాధర్ గౌడ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, డీపీఓ ప్రభాకర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పాల్గొన్నారు. చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు చీరాల టౌన్: పర్యావరణ పరిరక్షణ, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చీరాల మున్సిపాలిటీలో అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచి పూర్తిగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు ప్రకటించారు. గురువారం తన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, చీరాల తహసీల్దార్ సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2 నుంచి మున్సిపల్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్తో పాటుగా కవర్లు వినియోగం, అమ్మకం, నిల్వలు, తయారీ, పంపిణీలను పూర్తిగా నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వాడకం, అమ్మకాలు, పంపిణీ చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులంతా ఆదేశాలను తప్పక పాటించాలని ఆయన ఆదేశించారు. గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చీరాల మున్సిపాలిటీలో గోవుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యజమానులు వాటిని పబ్లిక్ స్థలాల్లో వదలకూడదని చెప్పారు. గోవుల సమస్యలను పరిష్కరించేందుకు వాటికి పునరావాసంతో పాటు గుర్తింపు కూడా చేస్తున్నామని వివరించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో గోవులను సంరక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ పాల్గొన్నారు. -
గతాన్ని మరిచిన బాలకృష్ణ
తాడికొండ: మెంటల్ సర్టిఫికెట్తో హత్యకేసు నుంచి బయటపడిన బాలకృష్ణ గతాన్ని మరిచి మాట్లాడటం దుర్మార్గమని, ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బెల్లంకొండ సురేష్పై బాలకృష్ణ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నాడు దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోతే నీ గతి ఏమై ఉండేదో ఆలోచించుకోవాలని, అప్పుడే నువ్వు జైలు పాలు అయ్యేవాడివనే గతాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదన్నారు. అప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాళ్లు పట్టుకొనే నువ్వు కేసు నుంచి తప్పించుకున్నావని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదని, కక్షపూరిత రాజకీయాలు, అబద్ధపు హామీలు, మాటలు వైఎస్సార్ కుటుంబానికి లేవు, రావనే నిజం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని బాలకృష్ణ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. గతాన్ని మర్చిపోయి బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై సినీనటుడు చిరంజీవి సైతం హుందాగా స్పందించారని, ప్రజా ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకొని క్షమాపణ చెపితే మంచిదని లేదంటే నీకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులు అసెంబ్లీకి అనర్హులని, బాలకృష్ణ ముందు ఆ సంగతి తేల్చుకొని చట్టసభల్లో మాట్లాడాలని హెచ్చరించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ -
‘డీఈఓ పూల్’ ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతి కల్పించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్సీ–2025 నియామకాల కంటే ముందుగానే డీఈఓ పూల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు కె.బసవలింగారావు పేర్కొన్నారు. గురువారం జిల్లాకోర్టు ఎదుట ఉన్న ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో బసవ లింగారావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1236 మంది డీఈఓ పూల్లో ఉన్నారని, 2016లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నిలకడగా ఏ ఒక్క పాఠశాలలో పనిచేయలేక పోయారన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 50 మందికి పైగా ఉన్నారని తెలిపారు. వీరికి ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు ద్వారా కేడర్లో జూనియర్లుగా మిగిలిపోతారన్నారు. న్యాయపరమైన అంశాలతో వీరికి ఉద్యోగోన్నతులు అడ్డుకోవడం సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ అర్హత గల సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పీఈటీ ఉద్యోగోన్నతుల్లో అన్యాయం జరిగిందని తెలిపారు. డీఎస్సీ మాదిరిగానే జూనియర్ కాలేజీ, డైట్లలో నియామకాలు చేపట్టాలని కోరారు. ప్లస్ 2 పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు సబ్జెక్ట్ టీచర్స్ కొరతో ఇబ్బంది పడుతున్నారని, ఖాళీలను అర్హత గల స్కూల్ అసిస్టెంట్స్ తో భర్తీ చేసి విద్యా ప్రమాణాలు కాపాడలన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ దసరా పండుగకు పెండింగ్ నాలుగు డీఏ లలో ఒక్క డీఏ ఐనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు గత 15 నెలల నుంచి ఒక్క బకాయి విడుదల కాలేదన్నారు. సమావేశంలో జిల్లా శాఖ నాయకులు పి.లక్ష్మినారాయణ, జి.దాస్, ముని నాయక్, టి.రామారావు, పి.వేణుగోపాలరావు, కిరణ్, శివరామ కృష్ణ, మూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరులో 21 వాటర్ ప్లాంట్లు సీజ్
నెహ్రూనగర్: నగరంలో కలుషిత తాగు నీటిని సరఫరా చేస్తూ ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న 21 మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రజారోగ్యం దృష్ట్యా వైద్యారోగ్య శాఖ సూచనల మేరకు సీజ్ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలియజేశారు. నగరంలో కొన్ని ప్రాంతాలలో కలుషిత తాగు నీటి వలన డయేరియా కేసులు నమోదవుతున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్, నగర కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలో ఉన్న 120 మినరల్ వాటర్ ప్లాంట్లు సరఫరా చేసే తాగు నీటి శాంపిల్స్ను మంగళగిరిలోని ఐపీఎం పీహెచ్ ల్యాబ్, గుంటూరు మెడికల్ కాలేజీ ఆవరణలోని రీజినల్ పీహెట్ ల్యాబరేటరీలో పరీక్షించగా అందులో 21 ప్లాంట్ల నుంచి విక్రయించే నీటిలో హానికారక బ్యాక్టీరియాను గుర్తించడం జరిగిందన్నారు. సదరు ల్యాబ్ రిపోర్టులను నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపామని, ప్రభుత్వం తక్షణమే ప్రజారోగ్యానికి భంగం కలిగించే హానికారిక బ్యాక్టీరియాలను కలిగియున్న నీటిని విక్రయిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లను వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిందన్నారు. సీజ్ చేసిన ప్లాంట్లు ఇవీ.. నగరంలోని ఐపీడీ కాలనీలోని పెరల్స్ ఎంటర్ ప్రైజేస్, నల్లచెరువులోని నీల్ డ్రాప్, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డులోని మై ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, చరణ్ వాటర్ ప్లాంట్, రెడ్ల బజార్లోని కేపీ రావు ప్లాంట్, అంబేడ్కర్ నగర్లోని జేఎస్ వాటర్ ప్లాంట్, పాత గుంటూరు బాలాజీనగర్లోని ఏకా వారి వీధి వాటర్ ప్లాంట్, మల్లిఖార్జున పేటలోని గురుశ్రీ మినరల్ వాటర్ ప్లాంట్, ఏటీ అగ్రహారంలోని బాషా కూల్డ్రింక్, శివనగారాజు కాలనీలోని వాసవి వాటర్ ప్లాంట్, నెహ్రూనగర్లోని ఆర్కే వాటర్ ప్లాంట్, నగరాలలోని స్వాతి ఫుడ్ అండ్ వాటర్ ప్లాంట్, స్థంభాలగరువులోని ఎలైన్ ఫ్రెష్ వాటర్, మద్దిరాల కాలనీలోని పరమేష్ హోల్ సేల్, సంపత్ నగర్లోని నరేష్ షాప్, కోబాల్ట్ పేటలోని ఉమర్ బాషా ఫ్లేవర్డ్ వాటర్, పలకలూరులోని ఎన్టీఆర్ సుజల ప్లాంట్, హిమని నగర్లోని సరస్వతి కృష్ణ స్టోర్, బుడంపాడులోని స్టెయిన్ లెస్ స్టీల్ స్టోరేజ్ ట్యాంక్, ఏటుకూరులోని మేఘన షాప్, లాలుపురం రోడ్డులోని 76వ సచివాలయం దగ్గరలోని ప్లాంట్లను నగర పాలక సంస్థ ప్రజారోగ్య అధికారులు సీజ్ చేశారు. -
ఖాతాదారులకు బురిడీ
బాపట్ల టౌన్: బాపట్ల పట్టణంలోని ఏజీ కళాశాల రోడ్డులో ఏర్పాటు చేసిన హెచ్ఎంఎఫ్ఎల్ (హిందూస్థాన్ మైక్రోఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెట్) పరిధిలో బాపట్ల జిల్లాలోని సుమారు 350 మందికిపైగా ఖాతాదారులు వివిధ రూపాలలో రూ. కోట్లలో రుణాలు తీసుకున్నట్లు సమాచారం. విడతలవారీగా ఈఎంఐలు చెల్లించినప్పటికీ అవి సంస్థ ఖాతాలో జమ చేయటం లేదనే ఆరోపణలు వచ్చాయి. ఖాతాదారులు వారం రోజులుగా కార్యాలయం చుట్టూ తిరిగి తమ అకౌంట్లకు సంబంధించిన స్టేట్మెంట్లు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో తిరుగు పయనమవుతున్నారు. ఉన్నతాధికారులను కలిసినా ఫలితం శూన్యం ఈఎంఐలు చెల్లించినప్పటికీ తమ అప్పు యథావిధిగా ఉందనే విషయం తెలుసుకున్న ఖాతాదారులు సదరు మేనేజర్ తీరుపై విజయవాడ రీజినల్ మేనేజరు షేక్ సైదులుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆడిటర్ సమక్షంలో బాపట్ల బ్రాంచ్ను సందర్శించి సదరు మేనేజర్ తీరుపై ఆయన విచారించారు. వారి విచారణలో ఈ ఏడాది ఆగస్టు 31న జమ చేయాల్సిన రూ. 5,06,384, సెప్టెంబర్ 20లోపు జమ చేయాల్సిన రూ. 5,22,212లు జమ చేయలేదని తేలినట్లు సమాచారం. రూ.2.23 లక్షలు చెల్లించినా రూ.40,400కే రసీదులు కర్లపాలెం మండలంలోని గణపవరం పంచాయతీ కేసరపూడి కాలనీకి చెందిన తాడిశెట్టి లక్ష్మితిరుపతమ్మ గ్రామంలో రేకుల ఇల్లు నిర్మించుకున్నారు. అప్పట్లో రూ. 7 లక్షల అప్పు అయ్యింది. దానిని తీర్చేందుకు ఇంటిని హెచ్ఎంఎఫ్ఎల్లో తనఖా పెట్టి రూ. 7.50 లక్షల రుణం తీసుకున్నారు. నెలకు రూ. 20,200 చొప్పున చెల్లించారు. ఇప్పటివరకు 11 నెలలకు రూ. 2.23 లక్షలు చెల్లించినా కేవలం రూ. 40,400 చెల్లించినట్లు రసీదులు ఇచ్చారని ఆమె వాపోయారు. ఇదేమని సిబ్బంది రామకృష్ణ, నూరేళ్ళను అడిగితే తమ మేనేజర్ రాజశేఖర్ జమ చేయడం లేదని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. గురువారం మేనేజర్పై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రకృతి వ్యవసాయంలో రైతులు భాగస్వాములు కావాలి
నరసరావుపేటరూరల్: ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క రైతు భాగస్వామి కావాలని ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ జిల్లా మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. బృందావనంలోని ప్రకృతి వ్యవసాయం జిల్లా కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమలకమారి మాట్లాడుతూ నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ఉద్యమంలా ముందుకు వెళ్తుందని తెలిపారు. 2025–26 సంవత్సరంలో జిల్లాలో 82,619 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటల సాగు చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. రైతులు రసాయనాలు విడిచి కషాయాలు వాడటం వలన భూమి ఆరోగ్యంగా ఉంటుందన్నారు. పంట ఉత్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటంతోపాటు రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందని తెలిపారు. -
రసవత్తరంగా జాతీయ చెస్ చాంపియన్ షిప్
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ బుధవారం నాలుగోరౌండ్ ముగిసే సరికి ముగ్గురు గ్రాండ్మాస్టర్లు, నలుగురు ఇంటర్నేషనల్ మాస్టర్లు చెరో నాలుగు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. టాప్ బోర్డులపై జీఎంలు, ఐఎంల మధ్య ఉత్కంఠభరితంగా పోటీలు జరిగాయి. మాజీ ఆసియా చాంపియన్, రెండో సీడ్ జీఎం సూర్యశేఖర్ గంగూలీ అలాగే భారత 2700 రేటింగ్ దాటిన రెండో ఆటగాడు జీఎం కృష్ణన్ శశికిరణ్లు ప్రతిభ చూపించారు. తమిళనాడు ఆటగాడు ఐఎం మనీష్ ఆంటో క్రిస్టియానోపై పీఎస్పీబీ ఆటగాడు గంగూలీ ఎక్సేంజ్ సాక్రిఫైస్ తర్వాత రూక్ త్యాగంతో ఆధిపత్యం సాధించాడు. ఆంధ్ర ఆటగాడు జీఎం ఎం.ఆర్. లలిత్ బాబు ఫ్రెంచ్ డిఫెన్స్లో స్థిరమైన ఆట ఆడి, అలేఖ్య ముఖర్జీపై విజయం సాధించాడు. మూడో సీడ్ జీఎం ఎస్.పి.సేతురామన్, హరియాణా ఆటగాడు ఐఎం ఆదిత్య దింగ్రా తప్పిదం వల్ల ఓటమి నుంచి తప్పించుకున్నాడు. గేమ్ డ్రాగా ముగిసింది. కేరళ ఐఎం హెచ్.గౌతమ్ కృష్ణ, గుజరాత్ ఆటగాడు ఘాదవి వీరభద్రసింగ్పై అద్భుతంగా ఆడాడు. రూక్ త్యాగం చేసి బ్యాక్ ర్యాంక్ చెక్మేట్తో విజయం సాధించాడు. ఇప్పటివరకు టోర్నమెంట్లో పొడవైన గేమ్ ఆంధ్ర ఆటగాడు ఐఎం ఎస్. రవితేజ (రైల్వేలు), గుజరాత్ ఆటగాడు జిహాన్ తేజస్ షా మధ్య సాగింది. రవితేజ 140 మూవ్ల తర్వాత బిషప్, నైట్ కాంబినేషన్తో చెక్మేట్ చేశాడు. -
జమ్మూ కశ్మీర్లో బాపట్ల సైనికుడి మృతి
బాపట్ల టౌన్: జమ్మూ కశ్మీర్లో ఆర్మీ హవల్దార్గా విధులు నిర్వర్తిస్తూ బాపట్లకు చెందిన సైనికుడు మృతి చెందారు. బాపట్ల మండలం, కంకటపాలేనికి చెందిన మద్దసాని గోపికృష్ణ(33) బుధవారం రాత్రి సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా, తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సైనికుడి మృతిపై విచారణ జరుగుతుందని ఆర్మీ అధికారులు తెలిపారు. అతని పార్థివ దేహాన్ని గురువారం స్వగ్రామానికి తరలించారు. జిల్లా పోలీస్ అధికారులు, సూర్యలంక ఎయిర్ ఫోర్స్, ఉమ్మడి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారులు, ఎన్సీసీ అధికారులు, ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం నాయకులు కంకటపాలేనికి చేరుకొని సైనికుడి పార్థివ దేహానికి పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, మృతునికి భార్య హేమలత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ట్యాంకులు ఇలా.. ఆరోగ్యం ఎలా?
నెహ్రూనగర్: గుంటూరు నగరానికి తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి నగరంలోని పలు వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా అయి అక్కడ నుంచి పైపులు ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా జరుగుతుంది. అయితే నగరంలో ఉన్న పలు వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరడంతో పాటు పై కప్పులు ఊడిపోవడంతో అధ్వానంగా మారాయి. వీటి ద్వారానే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో నగర వాసులు అనారోగ్యం బారిన పడుతున్నారు. శిథిలావస్థలో ఏడు ట్యాంకులు.. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 62 వాటర్ ట్యాంకులు ఉన్నాయి (వీటిల్లో 42 ట్యాంకులు నగర పరిధిలో, మిగిలిన విలీన గ్రామాలకు చెందినవి). అయితే ఈ 42 వాటర్ ట్యాంకుల్లో 7 ప్రాంతాల్లోని 9 వాటర్ ట్యాంకులకు పై కప్పులు ఊడిపోయి అధ్వానంగా మారాయి. బీఆర్ స్టేడియం, నల్లచెరువు, ఏటీ అగ్రహారం, స్థంభాలగరువు, శారదాకాలనీ, వసంతరాయపురం, నెహ్రూనగర్ రిజార్వయర్లలో ఉన్న వాటర్ ట్యాంకులకు ఉన్న పై కప్పులు సక్రమంగా లేకపోవడంతో వాటిలో పక్షుల వ్యర్థాలు పడుతున్నాయి. ఈ నీటినే అధికారులు నగరంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. 2018లో బీఆర్ స్టేడియం పరిధిలోని ఆనంద్పేటలో 30కి మందికిపైగా డయేరియా బారిన పడి మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పుడు హడావుడిగా పాడైపోయిన వాటర్ ట్యాంకులను కవర్ చేస్తూ మరమ్మతులు చేపట్టారు. కాలక్రమేనా అవి కూడా పాడైపోవడంతో వాటిని పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. తీరా ఇప్పుడు అదే ప్రాంతంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్గా 80 కేసులు.. గుంటూరు నగర పరిధిలో ఇప్పటివరకు 160 మంది జీజీహెచ్లో డయేరియాతో బారిన చికిత్స పొందుతున్నారు. వీరిలో 80 మంది డిశార్జి అవ్వగా..ఇంకా 80 మంది చికిత్స పొందుతున్నారు. అదే విధంగా ఈకోలి బ్యాక్టరీయా కారణంగా కలరా వ్యాప్తి చెంది 3 కేసులు నమోదవగా.. వారు చికిత్స తీసుకుని డిచార్జ్ అయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో జిల్లాస్థాయి అధికారులను ఒక్కో వార్డుకు ఒక్కో అధికారిని నియమించి, వారికి డయేరియాపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. గుంటూరు నగరంలో ఉన్న 42 వాటర్ ట్యాంకులను నెలకొక సారి శుభ్రం చేయాల్సి ఉంది. కాఠీ ఇందులో చాలా ట్యాంకులను సకాలంలో శుభ్రం చేయడం లేదని గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికి ఇంకా ఈ నెలలో 10 ట్యాంకులను శుభ్రం చేయలేదని వారు చెబుతున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యజఆరించడంపై నగర వాసులు పాలకులు, అధికారుల తీరుపై మండిపడుతున్నారు. గుంటూరు నగరంలో 7 ప్రాంతాల్లో ఉన్న వాటర్ ట్యాంకులు శిథిలావస్థలో పై కప్పులు ఊడిపోయి ఉన్నా యి. 42 వాటర్ ట్యాంకులు నగర పరిధిలో ఉంటే వీటిల్లో 10 ట్యాంకులను ఇంకా శుభ్రం చేయలేదు. డయేరియా ప్రభావిత ప్రాంతాలకు ఆయా పాడైన వాటర్ ట్యాంకుల నుంచే వాటర్ సప్లయి చేస్తే ప్రయోజనం ఏం ఉండదు. తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుంచితాగునీరు సరఫరా చేయాలి. – నారాయణరెడ్డి, గుంటూరు సిటీ మున్సిపల్ రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఇకపై రోబోటిక్ తుంటిమార్పిడి సర్జరీలు
స్ట్రైకర్ సంస్థతో సాయిభాస్కర్ ఆస్పత్రి ఒప్పందం గుంటూరు మెడికల్: ఇప్పటివరకు మోకీలు మార్పిడి సర్జరీలకు మాత్రమే రోబోటిక్ వ్యవస్థను వినియోగిస్తుండగా, ఇకపై తుంటి మార్పిడిలకు కూడా రోబోటిక్ సర్జరీలు చేయనున్నట్లు సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి చెప్పారు. అందుకోసం వరల్డ్ క్లాస్ రోబోటిక్ సంస్థ స్ట్రైకర్తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడలోని తమ ఆస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ తర్వాత తుంటి కీలు అరుగుదలపై తీవ్ర ప్రభావం చూపి, చిన్న వయస్సులోనే తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తుందన్నారు. రోబోటిక్ వ్యవస్థతో రోగికి మరింత మెరుగైన వైద్యసేవలు అందిస్తామని స్పష్టం చేశారు. ఏపీలోనే మొదటిసారిగా తుంటి మార్పిడి ఆపరేషన్లలో మాకొ హిప్ అండ్ నీ రోబోటిక్ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అక్టోబర్ నుంచి తమ ఆస్పత్రిలో రోబోటిక్ తుండి మార్పిడి ఆపరేషన్లు అందుబాటులోకి వస్తాయన్నారు. -
ముగిసిన చేతిరాత శిక్షణ శిబిరం
గుంటూరు రూరల్: అందమైన చేతిరాత అదృష్టమని, అది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు మున్నంగి సంజీవరెడ్డి తెలిపారు. శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చేతిరాత శిక్షణ శిబిరం బుధవారంతో ముగసింది. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంజీవరెడ్డి మాట్లాడుతూ అందమైన చేతిరాత వలన విద్యార్థులు పరీక్షల్లో అదనంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. జాతీయ అవార్డు గ్రహీత వి.రామమోహనరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల మంది విద్యార్థులు, 15 వేల మంది ఉపాధ్యాయులు చేతిరాతలో శిక్షణ పొందారన్నారు. వీర గంగాధరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. చైల్డ్ లైన్ వెల్ఫేర్ బోర్డు రిటైర్డ్ అధికారి ప్రసాదలింగం మాట్లాడుతూ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా శిక్షణ పొందటం అమూల్యమైనదని ప్రశంసించారు. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి, విద్యార్థులకు అందిస్తున్న సేవలు గొప్పవని కొనియాడారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారిని సత్కరించిన అనంతరం చేతిరాతలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. -
అతివృష్టితో అపర నష్టం!
తాడికొండ: అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు అన్నదాతలు కుదేలవుతున్నారు. మబ్బుకు చిల్లుపడిందా అన్న చందంగా ప్రతి రోజు వాన కురుస్తుండటంతో రైతన్నలు పంట పొలాల్లో అడుగు పెట్టేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అరకొరగా సాగుచేసిన అపరాల పంటలు వర్షార్పణం కాగా పత్తి పంట ఎదుగుదల లేక ఎర్రబారుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జ్యూట్ పంట పరిస్థితి కూడా ఇదేవిధంగా మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా పొలంలోకి అడుగు పెట్టి అంతర కృషి చేసే పరిస్థితి కూడా లేని కారణంగా పై పాటుగా మందుల పిచికారీ కలుపు ఏరివేత కూడా చేయలేని పరిస్థితితో పొలాలు పిచ్చి కంపల్లా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండె ‘చెరువు’ అయింది! ఈ ఏడాది నెలకొన్న అతివృషి పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు పెట్టుబడుల రూపంలో పెట్టిన సొమ్ము అయినా తిరిగొస్తుందా లేదా అనే బెంగ అన్నదాతల్లో పట్టుకుంది. కొండవీటి వాగు ఉధృతికి తాడికొండ, తుళ్ళూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలు గత రెండు నెలలుగా నానుతున్నాయి. పంటనష్టం పరిహారం అంచనాలు రూపొందించి అన్నదాతకు అండగా నిలవాల్సిన వ్యవసాయాధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా యత్నించిన దాఖలాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు యూరియా సరఫరా లేక ప్రభుత్వం చేతులెత్తేయగా.. అధిక ధరలు వెచ్చించి కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టామని, తీరా ఇప్పుడు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కొండవీటి వాగు ముంపునకు గురైన రైతులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆపదలను కొని తెచ్చుకోవద్దు !
కొల్లూరు: కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు వరద ప్రభావాన్ని తక్కువ అంచనా వేసి, ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవద్దని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ హెచ్చరించారు. నదికి వరద తీవ్రత పెరిగిన నేపథ్యంలో ముంపు గ్రామాలైన చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, పెసర్లంక గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. వరద తీవ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, స్థానిక రేషన్ దుకాణాలను పరిశీలించారు. పునరావాస కేంద్రాల తనిఖీ తొలుత కలెక్టర్ కొల్లూరులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. నదికి వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. వరద అధికమయ్యే పక్షంలో సురక్షిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు రావాలని తెలిపారు. తమ గ్రామాలకు ప్రమాదం ఉండదన్న భరోసా ప్రజలు వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వరద ముప్పును తక్కువ అంచనా వేయడం సమంజసం కాదని సూచించారు. అకస్మాత్తుగా వరద ప్రవాహం అధికమమైతే ముంపు గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ముందుగానే అప్రమత్తమవ్వాలని ఆయన సూచించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి వరద ప్రభావానికి గురయ్యే లంక గ్రామాల్లోని ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను తక్షణం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉండాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి వరద బాధితుల కోసం ఏర్పాటు చేస్తున్న పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాల కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో కేంద్రానికి మండలస్థాయి అధికారిని, వారికి మరొక అధికారిని సహాయకులుగా నియమించి వరద బాధితులకు సేవలందించేలా చూడాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, కరెంట్, టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. నిర్ణీత వేళల్లో ఆహారం అందించాలని, అందుకు అవసరమైన నిల్వల్ని తక్షణం పునరావాస కేంద్రాలకు చేర్చాలని సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ బి. వెంకటేశ్వర్లు, ఆర్సీ ఏఈ విజయరాజు, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.లంక గ్రామాల్లో ప్రాణ నష్టం లేకుండా చూడాలి బాపట్ల: కృష్ణా నది వరదల నేపథ్యంలో లంక గ్రామాల్లో మనుష్యులు, పశువులకు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు. ఆయన బుధవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫ్రెన్స్ హాలు నుంచి మత్స్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదిలో నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉందని, ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉందని ఆయన తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రెండవ ప్రమాద హెచ్చరిక రాబోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. వరద ముంపునకు గురయ్యే కొల్లూరు లాక్ల వద్ద నుంచి ఎనిమిది గ్రామాలు, దోనేపూడి చప్టా నుంచి మూడు గ్రామాలు, వెల్లటూరు నుంచి ఏడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, భోజన సదుపాయాలు, వైద్య సేవల కోసం 73 బోట్లను అందుబాటులో ఉంచాలని ఆయన మత్స్య శాఖ అధికారులకు సూచించారు. -
సాగర్ కాలువకు గండి
కొల్లూరు: కృష్ణమ్మ ఉగ్రరూపంతో నదీ పరీవాహక లంక గ్రామాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. వరద తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో పంట పొలాల్లోకి నీరు వచ్చి చేరుతోంది. వాణిజ్య పంటలు ముంపు బారిన పడుతున్నాయి. బుధవారం ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.44 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడంతో నదిలో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్ని వరద నీరు ముంచెత్తింది. మండలంలోని పెసర్లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాల చుట్టూ ఇటుకరాయి తయారీకి అవసరమైన మట్టి కోసం తవ్విన భారీ గుంతల్లోకి నీరు చేరింది. చింతర్లంక, గాజుల్లంక, పోతార్లంక, దోనేపూడి కరకట్ట దిగువు ప్రాంతాల్లో వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. పంట భూములలోకి వరద నీరు ప్రవేశించింది. అరటి, కంద, కూరగాయలు, పసుపు, మినుము పంటలు ముంపు బారిన పడ్డాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని దిగువుకు విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇంచుమించు ఇంచుమించు 6.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వదిలే అవకాశాలున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరికలు చేస్తూ ప్రజలను ఆప్రమత్తం చేశారు. వరద తీవ్రత పెరిగిన పక్షంలో ప్రజలను తరలించడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు మండలంలో 13 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతుల గుండెల్లో రైళ్లు భట్టిప్రోలు: కృష్ణమ్మ బిరబిరమంటూ పరవళ్లు తొక్కుకుంటూ ప్రవహిస్తుంటే లంక గ్రామాల రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత ఆరేళ్లుగా ఏటా వరదలు పంటల్ని ముంచెత్తుతున్నాయి. బిక్కుబిక్కుమంటూ దేవునిపై భారం వేసి సాగుకు సమాయత్తమవుతున్నారు. వరదల సమయంలో ఓలేరు పల్లెపాలెం పక్కనే ఉన్న రేవులో నీరు పారుతోంది. దీంతో పంట భూములు కోతకు గురవుతున్నాయి. ఏటా భూములు రేవులో కలిసిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో లోతట్టు ప్రాంతాలైన చింతమోటు, పెదలంక, పెసర్లంక, ఓలేరు లంక గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కారంచేడు: మండలంలోని దగ్గుబాడు సమీపంలో సాగర్ కాలువ కట్ట కోతకు గురైంది. గండి పడిన సమయంలో 130 క్యూసెక్కులు నీరు ప్రవహిస్తోంది. గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరద నీరు కూడా వచ్చి చేరింది. దీంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది. కట్టలు పటిష్టంగా లేకపోవడంతో ఈ ప్రమాదం తలెత్తింది. 50 ఎకరాలు మునక కాలువలోని నీరు సుమారు 50 ఎకరాల్లోకి చేరింది. ప్రస్తుతం పంటలు ఇంకా సాగు చేయక పోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. కాలువలను శుభ్రం చేయించి, అవసరమైన మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సాగర్ ఆయకట్టుతో పాటు, కొమ్మమూరు కాలువ ఆయకట్టే ఆధారం. గత ఏడాది సాగర్ కాలువ కట్టల పైన జంగిల్ క్లియరెన్స్ సమయంలో వాటిని పటిష్ట పరచాలని రైతులు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదు. ప్రమాదం గురించి ఎన్ఎస్పీ జేఈ రాజేష్ను వివరరణ కోరగా, ప్రస్తుతం నీటి ప్రవాహానికి ఓవర్ ఫ్లో అయిందని, దీంతో బలహీనంగా ఉన్న కట్ట కోతకు గురైందని వివరణ ఇచ్చారు. వెంటనే చిమ్మిరిబండ లాకుల వద్ద నీటి ప్రవాహం నిలుపుదల చేశామని తెలిపారు. ప్రవాహం పూర్తిగా తగ్గిన తరువాత తాత్కాలిక మరమ్మతులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వేసవిలో శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు చేస్తామని వివరించారు. -
కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బాపట్ల టౌన్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని జిల్లేళ్లమూడిలో గల అనసూయాదేవి అమ్మవారు బుధవారం గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పట్టణంలోని రాజీవ్గాంధీ కాలనీలో సనాతన హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాత్యాయనిగా బగళాముఖి చందోలు(కర్లపాలెం): భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న చందోలు బగళాముఖి అమ్మవారు శరన్నవ రాత్రుల్లో మూడవ రోజు కాత్యాయనీ దేవిగా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పసుపుకుంకుమలు సమర్పించి పూజలు చేశారు. తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. -
ప్రజలకు కట్టుదిట్ట రక్షణ
కొల్లూరు: కృష్ణా నదికి వరద తాకిడి అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలను ఆపద నుంచి రక్షించడానికి కట్టుదిట్టమైన రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. మండలంలోని పెసర్లంక అరవిందవారధి వద్ద నదిలో బుధవారం వరద ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద సమయంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ముంపు ప్రాంత ప్రజల్ని కాపాడటానికి పోలీసు యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేపడతామని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరిస్తూ అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ప్రవాహంలోకి పిల్లలను వెళ్లనివ్వ వద్దని తెలిపారు. వరద ముంపు గ్రామాల ప్రజలు ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలిరావాలని సూచించారు. వరద నీరు చేరిన రోడ్లపై రాకపోకలు సాగించ వద్దని, నీటిలో మునిగిన ప్రాంతాల్లో ప్రజల్ని నియంత్రించేందుకు పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆపదలో ఉంటే తక్షణం కంట్రోల్ రూమ్లకు, డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. ఆయన వెంట రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, వేమూరు సీఐ పి.వి. ఆంజనేయులు, ఎస్బీ సీఐ జి. నారాయణ పాల్గొన్నారు. -
పొన్నల కాలువపై చప్టా పరిశీలన
కర్లపాలెం: పొన్నల కాలువ చప్టాపై వరద నీరు ఉన్నప్పుడు ప్రజలు రాకపోకలు కొనసాగించవద్దని తహసీల్దార్ షాకీర్ పాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. మండల పరిధిలోని తుమ్మలపల్లి, నర్రావారిపాలెం గ్రామాల మధ్యనున్న కాలువను ఎస్ఐ రవీంద్రతో కలసి బుధవారం వారు పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు చప్టా పైకి రావడంతో స్థానికుల సమాచారం మేరకు అధికారులు పరిశీలించారు. చప్టాపైకి వరద నీరు వచ్చినప్పుడు స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి రాకపోకలను నిలిపివేయాలని చెప్పారు.గాయత్రీ దేవిగా బాలచాముండేశ్వరి దర్శనంఅమరావతి: ప్రముఖ శైవక్షేత్రం అమరావతి బాలచాముండిక సమేత అమరేశ్వరాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్య్రుత్సవాలలో భాగంగా బుధవారం బాలచాముండేశ్వరి అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. దసరా వేడుకల్లో మూడో రోజు సహస్ర కుంకుమార్చన, దేవీ ఖడ్గమాల, త్రిశల, లలితా సహస్రనామార్చన, శ్రీ చక్రార్చనతోపాటు గాయత్రీదేవికి సంధ్యా సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని జ్వాలాముఖి, మహిషాసురమర్దిని అమ్మవార్లకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.పల్నాడు జిల్లా మత్స్యశాఖ అధికారిగా వెంకట్రావునరసరావుపేటరూరల్: జిల్లా మత్స్యశాఖ అధికారిగా ఐ.వెంకట్రావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వెంకట్రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాలు జారీ చేశారు. గతంలో మత్స్యశాఖ జిల్లా అధికారిగా పనిచేసిన సంజీవరావుపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఈనెల 11న అప్పటి జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుత కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశాల మేరకు వెంకట్రావు అదనపు బాధ్యతలు స్వీకరించారు.శింగరకొండ ఆలయ పాలక మండలి నియామకంఅద్దంకి రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నూతన పాల మండలిని నియమించారు. అధ్యక్షుడుగా చుండూరి మురళీ సుధాకరరావుతో పాటు సభ్యులుగా ఆకుల కోటేశ్వరరావు, బత్తుల చంద్రశేఖర్, నూతి లక్ష్మీ ప్రసాద్, మందా సునీత, ఏల్చూరి వెంకట నారాయణమ్మ, ధూళిపాళ్ల వెంకటరత్నం, గొర్రెపాటి పద్మజ, హరబోలు నాగమ్మ, దేవరపల్లి సురేష్బాబు, కొనంకి సుబ్బారావు నియమితులయ్యారు. -
రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మందికి గాయాలు
బల్లికురవ: మినీ వ్యాన్ను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో వ్యాన్లో ఉన్న 9 మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం నార్కెట్పల్లి– మేదరమెట్ల నామ్ రహదారిలో కొప్పరపాడు గ్రామ శివాలయం సమీపాన జరిగింది. అద్దంకి మండలం చినకొత్తపల్లి గ్రామానికి చెందిన చింతంరెడ్డి అంకిరెడ్డి తన కుమారుడి పుట్టెంట్రుకలు తీయించేందుకు పల్నాడు జిల్లా అడిగొప్పుల అమ్మవారి సన్నిధానానికి 20 మందితో కలిసి వాహనంలో వెళ్లారు. తిరిగి వస్తుండగా కొప్పరపాడు గ్రామ సమీపంలోని చేపల చెరువుల నుంచి వస్తున్న లారీ రోడ్డు క్రాస్ చేస్తూ వ్యాన్ను ఢీకొట్టింది. జయరామిరెడ్డి, వెంకటరెడ్డి, ప్రభాకరరెడ్డి, పేరమ్మ, వెంకటేశ్వరరెడ్డి, అంజిరెడ్డి, మాగంటి రామాంజనేయులు, మిర్యాల సీతారామయ్య తదితరులు గాయాలపాలయ్యారు. స్థానికులు క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. -
మిత్రుడిని హతమార్చిన నిందితుల అరెస్ట్
చిలకలూరిపేట: స్నేహితుడిని తలపై రాడ్తో కొట్టి, గొంతును తాడుతో బిగించి క్రూరంగా హత్య చేసిన ముగ్గురు నిందితులను చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన తాడిబోయిన గోపి(32) గతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేసేవాడు. అతను దక్షిణామూర్తి సేలిస్టియాన్ క్రియేషన్స్ బ్యానర్పై షార్ట్ఫిలింలు, మిషన్ మంగళాద్రి పేరుమీద వెబ్సిరీస్లు తీయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 25వ తేదీన గుర్తుతెలియని మృతదేహం యడ్లపాడు సర్వీస్ రోడ్డు కాల్వలో కాలిపోతున్న స్థితిలో కనిపించింది. పోలీసుల విచారణలో అది తాడిబోయిన గోపిదిగా గుర్తించారు. చనిపోయిన గోపికి గుంటూరుకు చెందిన ఆఫ్రిన్ అనే ఆమె ద్వారా వాళ్ల తమ్ముడు, గుంటూరులోని సుద్దపల్లిడొంకలో నివాసం ఉండే షేక్ ఇమ్రాన్ పరిచయమయ్యారు. కొంతకాలానికి గోపి, ఇమ్రాన్ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గోపిని హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. ఇమ్రాన్కు స్నేహితులైన గుంటూరు రామిరెడ్డిపేటకు చెందిన షేక్ రియాజ్, నల్లచెరువు ప్రాంతానికి చెందిన షేక్ ఖాజామొహిద్దీన్లను కలుపుకొని పథకం ప్రకారం గుంటూరులోని ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ఇమ్రాన్ అద్దె గదికి గోపిని జూన్ 24న ఫోన్ చేసి రప్పించారు. ముగ్గురు కలసి ఇనుపరాడ్డుతో గోపి తలపై కొట్టి ఆపై తాడుతో మెడకు ఉరివేసి హత్యచేశారు. మృతుడు గోపికి చెందిన కారు డిక్కీలో శవాన్ని చిలకలూరిపేటకు తీసుకువచ్చి ఇక్కడ పెట్రోల్ బంకులో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి గుంటూరు రోడ్డులో తిమ్మాపురం దాటిన తర్వాత యడ్లపాడు సమీపంలో సర్వీస్ రోడ్డు పక్కన సిమెంట్ కాల్వలో గోపీ మృతదేహాన్ని వేసి పెట్రోలు పోసి తగలబెట్టి పరారయ్యారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి గోపికి చెందిన కారు, కీ పాడ్ ఫోన్, సెల్ఫోన్, ఏటీఎం కార్డులు, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
గ్రామాల్లో ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులు
●దాడులకు భయపడేది లేదు ●అధికారంలోకి రాగానే బదులు తీర్చుకుంటాం ●మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పిడుగురాళ్ల: కొంత మంది వ్యక్తులకు డబ్బులు ఇచ్చి గ్రామాల్లో ఫ్యాక్షన్ పెంచాలని టీడీపీ నాయకులు చూస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి విమర్శించారు. ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడి పట్టణంలోని పల్నాడు హాస్పటల్లో చికిత్స పొందుతున్న చల్లా అంజిరెడ్డిని మహేష్రెడ్డి, వైఎస్సార్ సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్కుమార్లు మంగళవారం పరామర్శించారు. మహేష్రెడ్డి మాట్లాడుతూ జూలకల్లు గ్రామంలో పటిష్టంగా ఉన్న వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని, అలజడి సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. ఏడాదిన్నరలో అంజిరెడ్డి, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డిలపై దాడులు చేశారని తెలిపారు. నారు తీసుకొని వచ్చేందుకు వెళ్తే దారి కాచి అంజిరెడ్డిపై దాడి చేశారని తెలిపారు. గ్రామంలో కొంతమంది అలగా జనం చేస్తున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, ప్రభుత్వం మారగానే ఎవరికి సంబంధం ఉందో తెలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను నాలుగు, ఐదుసార్లు ఆసుపత్రి చుట్టూ తిప్పుదామని అనుకుంటే రేపు ప్రభుత్వం మారితే 40సార్లు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నేడు 20 ఎకరాలు బీడులుగా పెడితే రేపు 200, 300 ఎకరాలు బీడు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, గ్రామాల్లో మళ్లీ ఫ్యాక్షన్ తెవాలని చూస్తే అది మీ కర్మ అని అన్నారు. పోలీసు ఇప్పటికై నా శాంతియుతంగా ఉండేలా చూడాలని, కొట్టిన వారే గ్రామాల్లో గొడ్డళ్లు పట్టుకొని తిరుగుతున్నారని అన్నారు. దాడులకు భయపడేది లేదని జూలకల్లు గ్రామంలో పార్టీని మరింత పటిష్ట పరుస్తామని కాసు అన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చింతా సుబ్బారెడ్డి, పట్టణ కన్వీనర్ మాదాల కిరణ్కుమార్, ఎంపీపీ గార్లపాటి వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ అల్లు పిచ్చిరెడ్డి, ఎన్డీఎల్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా కో ఆర్డినేటర్ మట్టారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికత జోడింపుతో ఉత్తమ ఫలితాలు
పెదకాకాని(ఏఎన్యు): రాష్ట్రంలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో 36వ దక్షిణ మండల జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు, ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి రాంప్రసాద్రెడ్డి మాట్లాడుతూ క్రీడల విధానంలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు. ఆధునిక సాంకేతికతను క్రీడల రంగానికి జోడించడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పలు అథ్లెటిక్ అసోసియేషన్లు, మల్టీ నేషనల్ కంపెనీలు క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమన్నారు. తొలుత అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పతాకాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ పతాకాన్ని శాప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.భరణి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. -
వైద్యుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె
బాపట్ల: ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 25వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డాక్టరు ఎం.గోపీనాథ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టరు వి.వినోధ్కుమార్ను, జిల్లా వైద్యాధికారిణి డాక్టరు విజయమ్మను మంగళవారం కలిసి సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్–సర్వీస్ కోటాను పునరుద్ధరించాలని, టైమ్ బౌండ్ ప్రమోషన్లు ఇవ్వాలని, గిరిజన ప్రాంతాల్లో పని చేసే వారికి అలవెన్సు మంజూరు చేయాలని, నోషనల్ ఇన్క్రిమెంట్స్ మంజూరు చేయాలని కోరారు. చంద్రన్న సంచార చికిత్స ప్రోగ్రాం కింద వైద్యులకు రూ.5 వేలు ఇవ్వాలన్నారు. వైద్యులకు కచ్చితమైన పనిగంటలు, స్థిరమైన వారాంతపు సెలవులు ఇవ్వాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో డాక్టరు పవన్చైతన్య తదితరులు ఉన్నారు. -
వేదమాతా నమోనమః
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేదమాత గాయత్రీదేవిగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం దుర్గమ్మను శ్రీగాయత్రీదేవిగా అలంకరించారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. వేకువజాము నుంచి ఉదయం ఆరు గంటల వరకు భక్తులతో అన్ని క్యూలైన్లు కిక్కిరిశాయి. అమ్మవారికి నిర్వహించే పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు, ఉభయదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు కొండపైకి చేరుకోవడం ఇబ్బందికరంగా ఉందని పలువురు ఉభయదాతలు నేరుగా కలెక్టర్ లక్ష్మీశకు ఫిర్యాదు చేశారు. ఉదయం ఆరు గంటల తర్వాత సర్వ దర్శనం క్యూలైన్లలో భక్తుల రద్దీ కొనసాగింది. అయితే రూ.100, రూ.300 టికెట్ల క్యూలైన్లు ఖాళీగానే దర్శనమిచ్చాయి. రద్దీని కట్టడి చేసేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు భక్తులను రూ.100 క్యూలోకి అనుమతించారు. ఇక అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీయాగం, కుంకుమార్చనలో ఉభయదాతలు పాల్గొన్నారు. ప్రత్యేక కుంకుమార్చనను మొదటి షిఫ్టునకే పరిమితం చేశారు. వీఐపీ దర్శనాలకు బ్రేక్ తొలి రోజున ఆలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా వీఐపీల పేరిట జరిగిన దర్శనాలకు మంగళవారం బ్రేక్ పడింది. ప్రొటోకాల్ ఉన్న వారికి మాత్రమే సీఎం గేటు, వీఐపీల పేరుతో వచ్చే వారిని గాలిగోపురం వద్ద ఉన్న క్యూలైన్ ద్వారానే ఆలయంలో అనుమతించారు. కలెక్టర్ లక్ష్మీశ మంగళవారం ఉదయం లడ్డూ తయారీ పోటులను తనిఖీ చేశారు. ప్రసాదాల తయారీకి వినియోగిస్తున్న పిండి పర్థారాలు, పంచదార, నూనె, నెయ్యి, జీడిపప్పు నాణ్యతను పరిశీలించారు. రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారు? మొదటి రోజు ఎన్ని విక్రయించారు? ఇంకా ఎన్ని నిల్వ ఉన్నాయన్న వివరాలను ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్యం 2.50 లక్షల లడ్డూలను తయారీ చేసేలా దేవస్థానం మూడు లడ్డూ పోటులను సిద్ధం చేసిందని, ఉత్సవాల్లో 36 లక్షల లడ్డూలు అవసరమయవుతాయని అంచనా వేశామని తెలిపారు. లడ్డూ విక్రయ కేంద్రాలను మంగళవారం నుంచి మరి కొన్నింటిని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పలుచోట్ల ఈ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. వించిపేట(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో రెండో రోజు మంగళవారం శ్రీగాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎస్.సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, బండారు శ్రావణి, గల్లా మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు వేద పండితులు వేదాశీర్వచనం, ఆలయ ఈఓ శీనా నాయక్ అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. గాయత్రీదేవిగా దుర్గమ్మ దర్శనం -
క్రీడాపోటీల బ్రోచర్ ఆవిష్కరణ
చీరాల టౌన్: రెవెన్యూ అసోసియేషన్ బాపట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 10, 11వ తేదీల్లో బాపట్లలో జిల్లా స్థాయి రెవెన్యూ ఉద్యోగుల క్రీడాపోటీలు, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. క్రీడల్లో చీరాల డివిజన్ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని జయప్రదం చేయాలని ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం తమ కార్యాలయంలో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ చీరాల డివిజన్ అధ్యక్షుడు, తహసీల్దార్ కుర్రా గోపీకృష్ణతో కలసి ఆయన బ్రోచర్ ఆవిష్కరించారు. నిత్యం పని ఒత్తిడి ఉండే రెవెన్యూ ఉద్యోగులకు కాస్త ఉపశమనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పోటీలను కలెక్టర్ ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సురేష్బాబు, డివిజన్ కార్యదర్శి పీకా సురేష్, జిల్లా క్రీడల కార్యదర్శి డి.అర్జున్, ప్రతినిధులు సత్యనారాయణ, ఆదినారాయణ, సీహెచ్ రమేష్, తేజ, నారాయణమ్మ, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
నమ్మించి.. నట్టేట ముంచేసి..
నాగులుప్పలపాడు: యాప్లో నగదు జమ చేస్తే భారీగా లాభం వస్తుందని నమ్మించి ఆ ఊరి ప్రజలను నట్టేట ముంచాడో ప్రబుద్ధుడు. సుమారు 500 మందికిపైగానే రూ.5 కోట్లకుపైగా చెల్లించి మోసపోయారు. ఆ వ్యక్తి ఊరిలో కనిపించకపోవడంతో విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నాగులుప్పలపాడు మండలంలోని తిమ్మసముద్రం గ్రామానికి చెందిన తూతిక నాగాంజనేయులు అనే వ్యక్తి ఎల్ఎఫ్ వర్క్ మనీ పేరుతో ఉన్న యాప్లో పెట్టుబడి పెడితే రూ.లక్షల్లో లాభాలు వస్తాయని ఆశ చూపించాడు. గ్రామంలోని సుమారు 500 మంది నుంచి రూ.5 కోట్లకుపైగా వసూలు చేసి అందులో చేర్పించాడు. యాప్ను ఈ ఏడాది జనవరిలో నాగాంజనేయులుకు ఒడిశాకు చెందిన కొందరు వ్యక్తులు పరిచయం చేశారు. ఎవరైనా డిపాజిట్ చేస్తే నగదును బట్టి రోజువారీగా కొంత మొత్తం తొమ్మిది నెలలపాటు ఇస్తారని నాగాంజనేయులు నమ్మించాడు. రూ.2,400 డిపాజిట్ చేస్తే రోజుకి రూ.72 చొప్పున, రూ.6,000 చెల్లిస్తే రోజుకి రూ.350 చొప్పున, రూ.12,000 చెల్లిస్తే రోజుకి రూ.725 చొప్పున ఇస్తామని చెప్పి ప్రజలకు అలవాటు చేసి మొదట్లో తిరిగి చెల్లింపులు కూడా చేశారు. ఆశావాహులు పెరిగారని నమ్మకం కుదిరిన తరువాత రూ.24 వేలు, రూ.51,100 వంటి పెద్ద మొత్తాలను కూడా డిపాజిట్ చేయొచ్చని నమ్మబలికారు. ఎల్ఎఫ్ వర్కు పేరుతో చీరాల, ఇంకొల్లు ప్రాంతాల్లో కార్యాలయాలు కూడా తెరిచారు. ఈ మధ్య కాలంలో చీరాలలోని ఓ రిసార్టులో ఆర్భాటంగా పెద్ద అవగాహన సభ ఏర్పాటు చేశారు. వచ్చిన క్లైంట్లకు భారీ విందు కూడా ఇచ్చారు. దీంతో నమ్మిన జనం ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్ మొదటి వారాల్లో అందిన కాడికి అప్పులు తెచ్చి రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టారు. నాగాంజనేయులు ఈ సంస్థకు చీరాల ఏరియా మేనేజర్గా పరిచయం చేసుకోవడంతో తిమ్మసముద్రం గ్రామంతో పాటు చీరాల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు ప్రాంతాల ప్రజలు తమ బంగారాలను సైతం తాకట్టు పెట్టి ఈ యాప్లో పెద్ద మొత్తంలో జమ చేశారు. ఈ నెల 13వ తేదీ నుంచి యాప్ ద్వారా డబ్బులు విత్డ్రా కావడం లేదు. నాగాంజనేయులు ఊరి విడిచి వెళ్లిపోవడంతోపాటు 2 రోజుల నుంచి అతని ఫోన్ పనిచేయడం లేదు. ఒక్కసారిగా గ్రామంలో అలజడి మొదలైంది. పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం గ్రామంలో విచారణ చేపట్టారు. రూ.వేలల్లో పెట్టుబడి పెడితే లక్షాధికారులు అవుతారంటూ ప్రచారం ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ పేరుతో రూ.5 కోట్ల వరకు వసూలు నిర్వాహకుడు ఊరు విడిచి వెళ్లడంతో వెలుగులోకి భారీ మోసం -
కనుల పండువగా శరన్నవరాత్రి ఉత్సవాలు
దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారు మంగళవారం భక్తులకు మాంగల్య గౌరి అలంకరణలో దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పసుపుకుంకుమలు సమర్పించారు. వివాహ దోష నివారణ పూజలలో బాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా గౌరి, మహా చండీ హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. – కర్లపాలెంప్రముఖ పుణ్యక్షేత్రమైన జిల్లెళ్ళమూడి గ్రామంలోని అనసూయ దేవి (జిల్లెళ్ళమూడి అమ్మ వారు) దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బాల త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పరిసర గ్రామాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఏర్పాట్లను కమిటీ నిర్వాహకులు పర్యవేక్షించారు. – బాపట్ల టౌన్ -
కృష్ణానదికి వరద ఉద్ధృతి
కొల్లూరులో ఓ ప్రయివేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో సౌకర్యాలను పరిశీలిస్తున్న తహసీల్దార్ వెంకటేశ్వర్లు కొల్లూరు కరకట్టపై వాహనం ఎదురు రావడంతో అతికష్టంపై వెళుతున్న కలెక్టర్ ప్రయాణిస్తున్న కారు నదిలో క్రమక్రమంగా పెరుగుతున్న నీటి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు లోతట్టు ప్రాంతాలలోకి భారీగా చేరిన వరద నీరు ముంపు ప్రాంత ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ సహాయక చర్యలపై అధికారులు, సర్పంచ్లతో సమావేశం -
ఏఎన్యూ లా బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యునిగా నర్రా
నాదెండ్ల: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లాబోర్డు ఆఫ్ స్టడీస్ (అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్) సభ్యునిగా సాతులూరు గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఎన్యూ డిప్యూటీ రిజిస్ట్రార్ కె రంగారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన న్యాయశాస్త్రంలో డిగ్రీ, పోస్ట్గ్రాడ్యుయేషన్ విభాగంలో సిలబస్, ఇతర అంశాల నిర్ణయాలకుగాను తొమ్మిది మంది సభ్యులతో వైస్ఛాన్సలర్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఏర్పాటు చేశారు. ఈయన ఏఎన్యూ పూర్వవిద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా, హైకోర్టు న్యాయవాదిగా, అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. న్యాయ విద్యార్థులు, న్యాయవాదులకు తరచూ అనేక అంశాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది న్యాయమూర్తులుగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా, ప్రభుత్వ విభాగాల్లో న్యాయసలహాదారులుగా సేవలందిస్తున్నారు. ఇప్పటికే ఏఎన్యూ న్యాయసలహాదారుగా వ్యవహరిస్తున్నారు. -
రసవత్తరంగా విజ్ఞాన్ జాతీయ చెస్ చాంపియన్షిప్
చేబ్రోలు: ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో మంగళవారం రెండో రౌండ్ ముగిసేసరికి 68 మంది క్రీడాకారులు తలో రెండు పాయింట్లతో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. ఎక్కువమంది అగ్ర క్రీడాకారులు మూడో రౌండ్కి సులభంగా అడుగుపెట్టారు. మాజీ జాతీయ చాంపియన్ గ్రాండ్ మాస్టర్ సూర్యశేఖర్ గంగూలీ (పీఎస్పీబీ) టాప్ బోర్డులపై తొలి విజయాన్ని నమోదు చేశారు. గియూకో పియానో ఆరంభంలో, 19వ మూవ్లో యషద్ బంబేశ్వర్ (ఛత్తీస్గఢ్) చేసిన తప్పిదాన్ని గంగూలీ సద్వినియోగం చేసుకున్నారు. వరుసగా బిషప్, నైట్ త్యాగాలు చేసి పూర్తిగా ఆధిపత్యం సాధించిన గంగూలీ, 30వ మూవ్లో ప్రత్యర్థిని రాజీనామా చేయించారు. – టాప్ సీడ్ జీఎం ఇనియన్.పి (తమిళనాడు), అధిరాజ్ మిత్రా(ఝార్ఖండ్)పై గెలుపొందాడు. వెటరన్ జీఎం కృష్ణన్ శశికిరణ్, హృషికేశ్ బానిక్ (పశ్చిమ బెంగాల్)పై గెలుపొందాడు. కొత్తగా గ్రాండ్మాస్టర్ బిరుదు పొందిన ఎస్.రోహిత్ కృష్ణ (తమిళనాడు), దేవర్ష భోర్కటేరియా (గుజరాత్)పై గెలుపొందాడు. జీఎం.ఎం.ఆర్.లలిత్ బాబు (ఆంధ్రప్రదేశ్), అయుష్ రవికుమార్ (తమిళనాడు)పై ఆసక్తికర పోరులో గెలిచారు. కర్ణాటక ఐఎం వియాని ఆంటోనియో డి కున్హాను ఆంధ్ర యువకుడు అందమాల హేమల్ వర్షన్ డ్రాలో కట్టేశారు. మూడో రౌండ్లో టాప్ బోర్డులపై మరింత రసవత్తర పోటీలు జరగనున్నాయి. -
పాఠశాలల్లో స్కౌట్స్, గైడ్స్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సమానత్వ భావాలతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్న భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్ష భవన్లో గుంటూరు జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వార్షిక సమావేశాన్ని జిల్లా కార్యదర్శి ఎం. ఏడుకొండలు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరసింహారావు గుంటూరు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ రిజిస్ట్రేషన్, బిగినర్స్ కోర్స్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 955 పీఎంశ్రీ పాఠశాలలకు రూ. 50 వేలు చొప్పున విడుదల చేసిన నిధులతో విద్యార్థులకు యూనిఫామ్తో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ను అభివృద్ధి చేయాలని సూచించారు. ఉన్నతమైన సంస్థగా గుర్తింపు పొందిన స్కౌట్స్, గైడ్స్ ఆశయాలకు అనుగుణంగా సేవా భావంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని 111 పాఠశాల నుంచి 136 యూనిట్స్ రిజిస్ట్రేషన్ చేశారని వివరించారు. సమావేశంలో ఎస్ఓసీ పి. శ్రీనివాసరావు, చేబ్రోలు ఎంఈవో రాయ సుబ్బారావు, పెదకాకాని ఎంఈఓ బీవీ రమణయ్య, డీటీసీ టి. నరేష్, డీఓసీ ఎం.శ్రీ హరి, ఘంటా కిరణ్, కామాక్షి, అనిల్, నాగేశ్వరరావు, రమేష్ పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఆర్.నరసింహారావు -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
బాపట్లటౌన్: అర్జీదారుల సమస్యలు పరిష్కరించడంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 65 మంది బాధితులు వచ్చి నేరుగా తమ సమస్యలను ఎస్పీకు వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ అర్జీల స్వీకరణ అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ మానవీయ కోణంతో వ్యవహరిస్తూ అర్జీలను చట్టపరిధిలో పరిష్కరించాలని చెప్పారు. పదేపదే బాధితులను స్టేషన్ చుట్టూ తిప్పుకోరాదని సూచించారు. స్టేషన్కు వచ్చిన బాధితులకు తగిన గౌరవం ఇచ్చి వారితో ఫ్రెండ్లీగా మెలగాలని కోరారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని పరిష్కరించినప్పుడే పోలీస్శాఖపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ యు.శ్రీనివాసులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై అవగాహన ఉండాలి బాపట్లటౌన్: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సైబర్ నేరాలపై ఎస్పీ ప్రచార పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్(ఆన్లైన్ వీడియో కాల్లో అరెస్ట్) అనేది లేదని, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు చేసే వీడియో కాల్స్కు స్పందించవద్దని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినుట్లు వివరించారు. డిజిటల్ అరెస్ట్, పీఎం కిసాన్ యాప్ ఏపీకే ఫైల్స్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, నకిలీ లోన్ యాప్స్, పార్ట్ టైం జాబ్స్, నకిలీ వెబ్సైట్లు, బ్యాంకింగ్, ఈ కామర్స్, సోషల్ మీడియా వంటి పలు రకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతూ బాధితుల నుంచి రూ.లక్షల్లో నగదు కొల్లగొడుతున్నారని పేర్కొన్నారు. ఎస్పీ ఉమామహేశ్వర్ -
నయనానందకరం.. నగరోత్సవం..
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం దేవీశరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున ప్రధాన ఆలయంలో అమ్మవారి మూలవిరాట్కు స్నపనాభిషేకం, అలంకరణ, నిత్య పూజల అనంతరం దర్శనాలకు అనుమతించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి అనిత, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనాచౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్లతో పాటు పలువురు జిల్లా అధికారులు తొలి దర్శనం చేసుకున్నారు. ఉదయం 8 గంటలకు అన్ని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి ఉత్సవ మూర్తిని మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా మహా మండపం ఆరో అంతస్తుకు తీసుకువెళ్లి ప్రతిష్టించారు. ఆరో అంతస్తులో అమ్మవారి ఉత్సవ మూర్తికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం సమీపంలోని యాగశాలలో కలశస్థాపన, పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. జన హృది బాలా.. నిత్యకల్యాణశీలా.. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ప్రత్యేక కుంకుమార్చనలో 104 మంది ఉభయదాతలు ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రనవార్చనలో 13 మంది, చండీయాగంలో 29మంది ఉభయదాతలు పాల్గొన్నారు. పూజల్లో పాల్గొన్న వారికి రూ.300 క్యూలైన్లో బంగారు వాకిలి దర్శనం కల్పించారు. ఇక పరోక్ష చండీ హోమానికి 57మంది, కుంకుమార్చనకు 18మంది రుసుం చెల్లించి ఆన్లైన్లో పూజను వీక్షించారు. మహా మండపం ఆరో అంతస్తులో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏర్పాట్ల పరిశీలన..ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. తొలుత కలెక్టర్, కమిషనర్ క్యూలైన్లో ఉన్న భక్తులతో ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో చర్చించారు. అనంతరం నూతన అన్నదాన భవనంలో జరుగుతున్న అన్న ప్రసాద వితరణను పరిశీలించారు. ఆలయ ఈవో శీనానాయక్తో కలిసి అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఆహార పదార్థాల నాణ్యత, ఆలయ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఆది దంపతుల నగరోత్సవ సేవ సోమవారం సాయంత్రం కనుల పండువగా సాగింది. శ్రీగంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై ఊరేగింపు నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలతో పాటు కేరళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కావడి నృత్యా లతో పలువురు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. మహా మండపం నుంచి ప్రారంభమైన నగరోత్సవం కనకదుర్గనగర్, రథం సెంటర్, దుర్గాఘాట్, దుర్గగుడి ఘాట్రోడ్డు మీదగా అమ్మవారి ఆలయానికి చేరుకుంది. -
ఉత్కంఠభరితంగా జాతీయ చెస్ పోటీలు
చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్లో నిర్వహిస్తున్న 62వ జాతీయ చెస్ చాంపియన్షిప్–2025 పోటీలు సోమవారం రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. 14 మంది గ్రాండ్మాస్టర్లు, 30 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు సహా మొత్తం 394 మంది పోటీ బరిలో నిలిచారు. తొలి రౌండ్లో ఎక్కువ మంది గ్రాండ్ మాస్టర్లు, ఇంటర్నేషనల్ మాస్టర్లు సునాయాస రెండో రౌండ్కి చేరుకున్నారు. ● రెండో సీడ్ సూర్యశేఖర్ గంగూలీ మొదటి రోజు సుదీర్ఘమైన గేమ్ను ఆడి, చివరికి తనదైన స్టైల్లో విజయం సాధించారు. ● రైల్వే జట్టుకు చెందిన గ్రాండ్మాస్టర్ దీపన్ చక్రవర్తి, ఐఎం సిద్ధాంత్ మోహాపాత్రా ప్రత్యర్థులతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ● పీఎస్పీబీకి చెందిన ఐఎం నిషా మొహోటా, తెలంగాణ ఆటగాడు మోక్షిత్ పసుపులేటి చేతిలో ఓటమి పాలయ్యారు. ● ఆంధ్రప్రదేశ్ అభిమాన ఆటగాడు, 2017 జాతీయ చాంపియన్ లలిత్ బాబు, ఛత్తీస్గఢ్కు చెందిన గగన్ సహూను చాకచక్యంగా ఓడించారు. -
ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం
చీరాల అర్బన్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని చీరాల, పేరాలలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయాలతో పాటు, భావనారుషి దేవాలయం, పేరాల శివాలయంలో, ఎంజీసీ మార్కెట్లోని అమ్మవారి దేవాలయం, కామాక్షి అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. దేవాలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంతబజారులోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారి చిత్రపటంతో నగరోత్సవాన్ని నిర్వహించారు. దేవాలయం నుంచి 1116 మంది మహిళలు కలశ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విశేష అలంకరణలు చేశారు. కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షుడు గుంటూరు మాధవరావు పాల్గొన్నారు. అలానే పేరాలలోని వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో, బెస్తపాలెంలోని సాయిబాబా మందిరంలో, పాపరాజుతోటలోని కామాక్షి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లెళ్లమూడిలో..బాపట్లటౌన్: జిల్లెళ్ళమూడిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం అమ్మవారికి పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో విశ్వజనని పరిషత్ ట్రస్ట్ ట్రెజరర్ జె.ఎల్.పి.సుబ్రహ్మణ్యం, అలయ అర్చకులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అమృతలూరు(వేమూరు): మండలంలోని గోవాడ బాల కోటేశ్వర స్వామి దేవస్ధానంలో దేవి శరన్నవ రాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. విగ్నేశ్వర పూజ, అఖండ దీపారాధన, కులశస్థాపన చేసి మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించినట్లు అర్చకులు స్వర్ణ వెంకట శ్రీనివాస శర్మ తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు పిట్టలవానిపాలెం(కర్లపాలెం): చందోలు శ్రీ బండ్లమ్మ ఆలయం అల్లూరు రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మంతెనవారిపాలెం రామలింగేశ్వరస్వామి ఆలయం, ఖాజీపాలెం కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాలతో పాటు మండలంలోని పలు గ్రామాలలో కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. -
ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి
బాపట్ల: జాతీయ ఉపాధి హామీ పథకం కింద ముమ్మరంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఉపాధి హామీ పథకం, జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ సేవలు, స్వామిత్వ, స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం క్రింద లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలని కోరారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో పనులు చేపట్టాలని సూచించారు. జిల్లాలో స్వామిత్వ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో జి.ఎస్. డబ్ల్యూ.ఎస్ సేవలను పెండింగ్ లేకుండా సత్వరమే ప్రజలకు అందించాలని ఆయన చెప్పారు. మనమిత్ర క్యాంపు మరియు ఆధార్ సీడింగ్ వాహనాల లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన అధికారులకు చెప్పారు. కర్లపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అభివృద్ధి పనుల అమలులో వెనుకబడి ఉన్నారని పద్ధతి మార్చుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలెక్టర్ హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, జి.ఎస్ బ్ల్యూ.ఎస్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. పరిపాలనలో పారదర్శకంగా ఉండాలి బాపట్ల: జిల్లా యంత్రాంగం పరిపాలనలో పారదర్శకంగా, నాణ్యతతో పని చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ కోరారు. స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో కలెక్టర్ కార్యాలయ పీజీఆర్ఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా పరిపాలనలో అన్ని విభాగాలలో ర్యాంకింగ్లో మొదటి మూడు వరుసలలో ఉండే విధంగా సిబ్బంది పని చేయాలని చెప్పారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఏమైనా సమస్యలు ఉంటే సత్వర పరిష్కార చర్యల కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, డీఆర్ఓను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి సంయుక్త కలెక్టర్ గంగాధర్ గౌడ్, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి నాగిరెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లికార్జున రావు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టరు వినోద్కుమార్ -
కరకట్ట గండిని పరిశీలించిన కలెక్టర్
ఓలేరు(భట్టిప్రోలు): కృష్ణా నది పరీవాహక లంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సోమవారం పరిశీలించారు. బాపట్ల జిల్లా పరిధిలోని భట్టిప్రోలు, కొల్లూరు, రేపల్లె మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై స్థానికులతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో మళ్లీ కరకట్ట దెబ్బ తినకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట రేపల్లె ఆర్డీఓ ఎన్.రామలక్ష్మి, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, భట్టిప్రోలు తహసీల్దార్ మేకా శ్రీనివాసరావు, పీఏసీఎస్ చైర్పర్సన్ పరుచూరి రమేష్ ఉన్నారు. -
సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై అవగాహన
కొల్లూరు: కృష్ణా నదికి వరద పెరగనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం పోతార్లంక శివారు రావిలంక వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, ఎస్ఐ జానిక అమరవర్ధన్ సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని సూచించారు. అక్కడ నివసిస్తున్న కుటుంబాలు తమ వద్ద అందుబాటులో ఉన్న పడవల సాయంతో కృష్ణా జిల్లా వెలివోలు, నడకుదురు ప్రాంతాలకు వెళ్తామని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జీవాలు, పశువులను తమ వద్ద ఉన్న పడవల ద్వారా నదిని దాటించడం కష్టమని అధికారుల దృష్టికి తీసుకురావడంతో మంగళవారం పెద్ద బోట్లను ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. -
అద్దె బస్సులకు మైలేజీ తిప్పలు
చీరాల అర్బన్: సీ్త్రశక్తి పథకంతో అద్దె బస్సుల యజమానులు కష్టాలపాలవుతున్నారు. పథకాన్ని పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే అమలు చేస్తున్నారు. జిల్లాలో అధిక శాతం బస్సులు హయర్ బస్సులే. కూటమి సర్కారు దెబ్బకు చితికిపోతున్నారు. నిర్వహణ భారం మోయలేకపోతున్నామని యజమానులు వాపోతున్నారు. ఆందోళనలో అద్దె బస్సుల యజమానులు.. –జిల్లాలో చీరాల, బాపట్ల, రేపల్లె, అద్దంకి ఆర్టీసీ డిపోలున్నాయి. మొత్తం 253 బస్సులు సేవలందిస్తున్నాయి. సీ్త్రశక్తి పథకం 212 బస్సుల్లో అమలవుతోంది. అందులో వంద వరకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. 56 సీటింగ్ కెపాసిటీతో నడిపేందుకు యజమానులతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. రద్దీ పెరగడంతో మైలెజ్ పడిపోయింది. మెయింట్నెన్స్పై ఆందోళన చెందుతున్నారు. అద్దె బస్సుల టెండర్ల సమయంలో ఫ్రీ బస్ ప్రస్తావనే లేదని, తక్కువ కోడ్ చేసిన వారికే టెండర్లు దక్కడంతో ఇప్పుడే ఏమి చేయలేని స్థితిలో ఉన్నామంటూ ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ కంటే అద్దె బస్సులే అదనం.. జిల్లాలో మొత్తం 212 బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతుంటే వీటిలో వంద బస్సుల వరకు అద్దె బస్సులున్నాయి. వీటిలో ఎక్స్ప్రెస్ 20, పల్లెవెలుగు 70 ఉన్నాయి. హయర్ బస్సులకు 56 సీటింగ్ కెపాసిటీ ఉండాలి. సర్వీసు రూట్ను బట్టి టెండర్లలో కోడ్ చేసిన విధంగా పల్లెవెలుగు బస్సుకు రూ.8 నుంచి రూ.12 వరకు, ఎక్స్ప్రెస్కు రూ.9 నుంచి రూ.14 చొప్పున కిలో మీటరుకు ఇస్తున్నారు. పల్లె వెలుగు బస్సుకు లీటర్ డీజిల్కు రూ.5.5 కిలోమీటర్లు ప్రయాణించాలి. మైలేజ్ షార్టేజ్ వస్తే ఆ భారాన్ని యజమానులే భరించాలి. ఫ్రీ బస్సు వలన ప్రయాణికుల రద్దీ పెరుగింది. కెపాసిటికి మించి బస్సులో ప్రయాణికులు ఎక్కితే ఓవర్ లోడ్ వలన టైర్లు అరుగుదల, ఇంజన్ సంబంధిత సమస్యలు తలెత్తి మెయింట్నెన్స్ పెరిగిపోతుంది. ప్రస్తుతం ఆయిల్ షార్టేజ్ వలన నెలకు అదనపు భారం పడుతుంది. అలానే రవాణా శాఖ నిబంధనల మేరకు సీటింగ్ కెపాసిటి 56 మందికే ప్రీమియం చెల్లిస్తారు. ఓవర్ లోడ్తో అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే బీమా కొందరికే వస్తుంది. ఆర్టీసీలో అద్దె బస్సులు నడపడం ద్వారా కిలోమీటరుకు ఇచ్చే డబ్బులు బస్సుల మెయింట్నెన్స్కే సరిపోతున్నాయి. నెలకు లక్షన్నర రూపాయలు వస్తే అందులో ఈఎంఐ, డ్రైవర్లు, క్లీనర్ల జీతాలు, డీజిల్, మెయింట్నెన్స్కే సరిపోతుంది. నిర్వహణ భారం పెరగడంతో వచ్చిన ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి. తమ సమస్యలపై రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలుమార్లు యాజమాన్యానికి విన్నవించాం. కిలోమీటర్కు మైలేజ్ తగ్గించాలని, మెయింట్నెన్స్ చార్జీలు కిలోమీటర్కు పెంచాలని కోరుతున్నాం. – ఎన్.శ్యామ్ప్రసాద్, స్టేట్ జనరల్ సెక్రటరీ, హయర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళనలో యజమానులు -
అతుకులకట్ట.. భద్రత ఎట్టా!
ప్రతి వర్షాకాలం క్షణక్షణం.. భయం భయంగా లంకగ్రామాలు కొల్లూరు: కృష్ణా కరకట్ట భయపెడుతోంది.. వరదొస్తే క్షణక్షణం భయం.. పరీవాహక గ్రామాలకు రక్షణ కవచంగా ఉండాల్చిన కరకట్ట భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో 67 కిలోమీటర్లు పొడవునా అతుకుల బొంతను తలపించేలా కరకట్ట మారింది. కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. అభివృద్ధికి నిధులు లేవు.. కృష్ణా నదికి వరదలు వచ్చే సమయంలో ప్రభుత్వం హడావిడి చేస్తుంది. శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. జిల్లాలో కొల్లూరు మండలం చిలుమూరు శివారు కొత్త చిలుమూరు నుంచి రేపల్లె మండలం లంకేవానిదిబ్బ వరకు 67 కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉంది. 55 ప్రాంతాలలో బలహీనంగా మారినట్లు అధికారులు గతంలోనే గుర్తించారు. మరో 20 వరకు పెరుగుతాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కానీ కరకట్ట పటిష్టతకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. డేంజర్ స్పాట్లు ఇలా... కొల్లూరు ఆర్సీ సెక్షన్ (రివర్ అండ్ కన్జర్వేషన్) పరిధిలో ఈపూరు, దోనేపూడి– కోటిపల్లి ప్రాంతాలలో అధిక చోట్ల కరకట్ట బలహీనంగా మారింది. గతంలో తాత్కాలిక మరమ్మతులలో భాగంగా వేచిన ఇసుక మూటలు ధ్వంసమై వరద తీవ్రత పెరిగిన పక్షంలో తట్టుకొని నిలవడం కష్టంగా తయారైంది. వీటికి తోడు సాగు నీటి కోసం ఏర్పాటు చేసిన పైప్లైన్లతో ముప్పు పొంచిలేకపోలేదు. పెనుమూడి ఆర్సీ సెక్షన్ పరిధిలో 51 ప్రాంతాలలో కరకట్ట బలహీనంగా మారి ప్రమాదకరంగా మారడం కరకట్ట దుస్థితికి అద్దం పడుతుంది. అనుభవాల నుంచి నేర్వని గుణపాఠాలు 2024లో 11.43 లక్షల క్యూసెక్కులు వరద ముంచెత్తడంతో జిల్లాలోని కరకట్ట పొడవునా ప్రజలు నిద్రాహారాలు మాని స్వచ్ఛందంగా కదలి కట్ట తెగకుండా అడ్డుకట్టలు వేస్తూ కంటికి రెప్పలా కాపాడుకొని గ్రామాలపై వరద విరుచుకుపడకుండా అడ్డుకున్నారు. చివరి నిమషంలో కృష్ణమ్మ తగ్గుముఖం పట్టడంతో గండం గట్టెక్కి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పట్నుంచి కరకట్ట బలహీనంగా ఉండి కోతలకు అవకాశాలున్న ప్రాంతాలను అభివృద్ధి చేయకపోవడంతో ప్రస్తుత ఏడాది కృష్ణా నది వరదలు ఉదృతరూపం దాల్చితే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థ్ధకంగా మారింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కృష్ణా నదిలో పెరుగుతున్న వరద కొల్లూరు: కృష్ణా నదికి వరద ఉధృతి పెరగింది. నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలలోకి నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.75 లక్షల క్యూసెక్కులు సోమవారం విడుదల చేస్తున్నారు. మండలంలోని పెసర్లంక– పెదలంక అరవింద వారధి సమీపంలోని నక్కపాయ గండి, గాజుల్లంక చినరేవు, పోతార్లంక – గాజుల్లంక నడుమ కృష్ణా నది గట్లకు ఏర్పడిన గండ్లు ద్వారా వరద నీరు ఉధృతంగా పల్లపు ప్రాంతాలలోకి ప్రవహిస్తున్న కారణంగా గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. దోనేపూడి కరకట్ట దిగువును పోతార్లంక– దోనేపూడి లోలెవల్ వంతెన(చప్టా) పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోతార్లంక, తిప్పలకట్ట, తోకలవారిపాలెం, కిష్కిందపాలెం, జువ్వలపాలెం, తడికలపూడి ప్రజలు చుట్టు మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. బాపట్ల: బంగాళాఖాతంలో అల్ప పీడనంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 24 గంటలపాటు కంట్రోల్ రూమ్ నెంబర్ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.కంట్రోల్ రూమ్ 9711077372 టోల్–ఫ్రీ నంబర్ 1077, 1070 -
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా మహోత్సవాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం శ్రీ దేవీ శరన్నవరాత్రి (దసరా) మహోత్సవాలకు ముస్తాబైంది. ఉత్సవాల తొలి రోజైన సోమవారం శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. తొలుత అమ్మవారి ప్రధాన ఆలయంలోని ఉత్సవమూర్తిని మహా మండపం ఆరో అంతస్తుకు ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ ఉత్సవమూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాల నిర్వహణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చనలు, చండీయాగం, శ్రీచక్ర నవార్చనలు మొదలవుతాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో సాయంత్రం వేళ అమ్మవారికి పంచహారతుల సేవ సమయంలో క్యూలైన్లు యథావిధిగా నడిపించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశతో పాటు దేవదాయ శాఖ అధికారులు నిర్ణయించారు. అంతరాలయంలో పంచహారతులు జరుగుతుండగానే రూ.300, రూ.100 క్యూలైన్తో పాటు సర్వ దర్శనం క్యూలైన్లు నడుస్తూ ఉంటాయి. ఏర్పాట్లను దేవదాయ శాఖ, దుర్గగుడి అధికారులు, పోలీసు, రెవెన్యూ అధికారులు ఆదివారం మరో మారు తనిఖీ చేశారు. -
108 వాహనం, బైక్ ఢీ : ఒకరు మృతి
కొల్లూరు : జోరు వానలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాల బారినపడిన సంఘటన కొల్లూరు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం నిజాంపట్నానికి చెందిన 108 వాహనంలో రేపల్లె వైద్యశాల నుంచి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు రోగులను తరలిస్తున్నారు. వేమూరు వైపు నుంచి ద్విచక్ర వాహనంపై కొల్లూరుకు ముగ్గురు యువకులు వస్తున్నారు. స్థానిక స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న షేక్ నరేష్, పాలపర్తి కోటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరినీ హుటాహుటిన కొల్లూరు ఎస్ఐ, స్థానికులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నరేష్ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. కోటేశ్వరరావు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనం పైనే ఉన్న మరో యువకుడు అక్షయ్ అభిజిత్ స్వల్ప గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం కారణంగా 108 వాహనం అదుపుకోల్పోయి రోడ్డు పక్కనున్న ముళ్ల పొదల్లోకి దూసుకుపోయింది. డ్రైవర్ ముద్రబోయిన సుబ్బారావు పంట కాలువలోకి వాహనం పల్టీ కొట్టకుండా నిలువరించగలగడంతో రేపల్లె నుంచి తరలిస్తున్న రోగులు సురక్షితంగా ప్రమాదం నుంచి బయట పడగలిగారు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని కొల్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు. రోగులను మరో 108 వాహనంలో పోలీసులు తెనాలి వైద్యశాలకు తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు ఎస్ఐ జానకీ అమరవర్ధన్ తెలిపారు. -
11 అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ 11 విశేష అలంకారాల్లో భక్తులను కరుణించనున్నారు. తిథుల హెచ్చుతగ్గుల కారణంగా అలంకారాల్లో మార్పులు వస్తుంటాయని ఆలయ వైదిక కమిటీ పేర్కొంది. మొదటిగా శ్రీబాలా త్రిపుర సుందరీదేవి, రెండో అలంకారంగా శ్రీగాయత్రిదేవి, మూడో అలంకారంగా శ్రీఅన్నపూర్ణాదేవి, నాల్గో అలంకారంగా శ్రీకాత్యాయనిదేవి, ఐదో అలంకారంగా శ్రీమహాలక్ష్మీదేవి, ఆరో అలంకారంగా శ్రీ లలితా త్రిపురసుందరీదేవి, ఏడో అలంకారంగా శ్రీమహాచండీదేవి, ఎనిమిదో అలంకారంగా శ్రీసరస్వతిదేవి, తొమ్మిదో అలంకారంలో శ్రీదుర్గాదేవి, పదో అలంకారంలో శ్రీ మహిషాసుర మర్దినీదేవి, పదకొండో అలంకారంలో శ్రీరాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ ఏడాది కాత్యాయని దేవి అలంకారం అదనం కావడంతో పండుగ 11 రోజులకు వచ్చింది. నిరంతరం ప్రసాద వితరణ.. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని కొండ దిగువన మహా మండపం ఎదుట నూతన అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే ఉదయం, సాయంత్రం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని భక్తులకు అందజేస్తారు. ఒకే దఫా వెయ్యి మంది అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించేలా ఏర్పాట్లు చేశారు. ఇక క్యూలైన్లో చిన్నారుల కోసం పాలు, పెద్దల కోసం బిస్కెట్లు, మంచినీటి బాటిళ్లను అందజేయనున్నారు. -
ఎస్సీ కాలనీలో పంచాయతీ రహదారి మూసివేత
చెరుకుపల్లి: అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వందలాది మంది రాకపోకలు సాగించే పంచాయతీ రహదారిని ఆక్రమించి ఎస్సీ కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సంఘటన మండలంలోని కావూరులో జరిగింది. నివాసితుల వివరాల మేరకు.. ఎస్సీ కాలనీ నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు 50 సంవత్సరాల కిందట రోడ్డు ఏర్పాటు చేశారు. అనంతరం కాలనీ వాసుల సహకారంతో పంచాయతీకి రాశారు. విద్యుత్ స్తంభాలు, మంచినీటి కుళాయిలు కూడా పంచాయతీ అనుమతితోనే ఏర్పాటు చేశారు. ఇన్ని సౌకర్యాలతో రాకపోకలు సాగిస్తున్న ఈ రోడ్డును అదే గ్రామం కూటమి ప్రభుత్వానికి చెందిన కొల్లు సుధీర్ సిమెంటు తూములు, ఇనుప కంచె వేసి మూసి వేశాడని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్ప్లాన్ ప్రత్యేక గ్రాంటుతో రోడ్డు నిర్మాణం మాజీ సర్పంచ్ నన్నపనేని వెంకటరావు మాట్లాడుతూ తాను గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు సమయంలో 2010–11లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ ప్రత్యేక గ్రాంటు ద్వారా కొంత దూరం సీసీ రోడ్డును నిర్మించినట్లు తెలిపారు. ఈ రోడ్డులో నూతన భవనాలు నిర్మించుకునే వారికి, నీటి కుళాయిలు, విద్యుత్ మీటర్లకు పంచాయతీ ద్వారానే ఇప్పటి వరకు అనుమతులు కొనసాగుతున్నాయని తెలిపారు. పట్టించుకోని అధికారులు దౌర్జన్యంగా రోడ్డు ఆక్రమించిన వ్యక్తిపై పంచాయతీ అధికారులకు, స్థానిక పోలీసులు, రెవెన్యూ వారికి పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఎస్సీ కాలనీవాసులు వాపోతున్నారు. వందలాది మంది నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తూ, పంచాయతీకి అన్ని పన్నులు చెల్లిస్తున్నా రోడ్డుకు సంబంధించి అసలు రికార్డే లేకపోవడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కుట్రే అని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా వేసిన సిమెంటు తూములు తొలగించి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. రోడ్డు సమస్యపై పంచాయతీ కార్యదర్శి ఎం. డోగేంద్ర కుమార్ను వివరణ కోరగా గ్రామానికి చెందిన కొల్లు సుధీర్ కోర్టును ఆశ్రయించాడని తెలిపాడు. ఈ రోడ్డుకు సంబంధించి అసలు ఏ రికారుర్డు పంచాయతీలో లేదని వివరణ ఇచ్చారు. నివాసితులను భయభ్రాంతులకు గురి చేస్తున్న గ్రామానికి చెందిన వ్యక్తి -
కీలకంగా మారనున్న కుమ్మరిపాలెం క్యూలైన్లు
ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో కుమ్మరిపాలెం క్యూలైన్లు కీలకం కానున్నాయి. గతంలో భవానీపురం వైపు నుంచి వచ్చే భక్తుల కోసం హెడ్ వాటర్ వర్కు నుంచి క్యూలైన్లు ప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది ఈ క్యూలైన్లలను కుమ్మరిపాలెం సెంటర్ వరకు ఏర్పాటు చేశారు. తెలంగాణ వైపు నుంచి వచ్చే భక్తులతో పాటు భవానీపురం, గట్టు వెనుక ప్రాంతం, సింగ్నగర్, వాంబే కాలనీ పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కుమ్మరిపాలెం క్యూలైన్లే కొండపైకి చేరుకునేందుకు దగ్గర మార్గం అవుతాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులందరూ మహా మండపం, గోశాల, కనకదుర్గనగర్ మీదగానే బయటకు వెళ్లేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
కృష్ణా నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కొల్లూరు : కృష్ణా నదీ వరద ప్రవాహంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చి, నది అంచుల వద్ద పొదల్లో తేలింది. ఆదివారం ఉదయం మండలంలోని ఈపూరులంకలో పంట పొలాల వద్దకు వెళ్లిన రైతులు నది ఒడ్డు వెంబడి 60 సంవత్సరాల వరకు ఉన్న ఓ పురుషుడి మృతదేహం తేలి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో రెవెన్యూ సిబ్బందితో కలసి అక్కడకు వెళ్లారు. రెండు రోజుల కిందట విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నదిలోకి దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహం అయి ఉండవచ్చన్న అనుమానంతో కొల్లూరు పోలీసులు తాడేపల్లి, విజయవాడ పోలీసులకు సమాచారం అందించారు. అయితే, మృతదేహం విజయవాడ వద్ద నదిలో దూకిన వ్యక్తిది కాదని అతని బంధువులు నిర్ధారించారు. నది ఒడ్డున పొదల్లో ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లభించలేదు. బట్టతలతో, లేత గోధుమ రంగు చొక్కా, బ్లూ ప్యాంట్ ధరించి, చేతికి ఎర్రని దారంతో ఆంజనేయ స్వామి లాకెట్ కట్టి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోస్టుమార్టం అనంతరం శవాగారంలో భద్రపరచనున్నట్లు ఎస్ఐ జానకీ అమర్వర్ధన్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు చెప్పారు. -
అన్నీ ఉచితమే..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ. 45 కోట్లతో ప్రభుత్వ సహకారంతో గుంటూరు జీజీహెచ్లో నాట్కో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటైంది. ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో వ్యాధిగ్రస్తులకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నాం. రూ. కోట్లు ఖరీదు చేసే అత్యాధునిక లీనియర్ యాక్సిలేటర్, ట్రాకీథెరపీ, సీటీ స్టిమ్యులేటర్, పెట్స్కాన్ వైద్య పరికరాలు ప్రభుత్వం అందజేసింది. క్యాన్సర్ చివరి దశలో ఉన్నవారికి సైతం ప్యాలేటీవ్ కేర్ చికిత్సలు అందిస్తున్నాం. మందులు కూడా ఉచితంగా అందించి రోగుల్లో మనోధైర్యం కల్పిస్తున్నాం. మరో వంద పడకలతో క్యాన్సర్ సెంటర్ను నిర్మాణం చేస్తున్నాం. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్చైర్మన్ -
2 హోల్డింగ్లు.. 5 క్యూలైన్లు
వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావిస్తున్న అధికార యంత్రాంగం సీతమ్మవారి పాదాల వద్ద, వీఎంసీ కార్యాలయం సమీపంలో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ రెండు హోల్డింగ్ పాయింట్లలో సుమారు 12వేల మంది భక్తులు వేచి ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇక వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్లకు చైనా వాల్ వద్ద మరో క్యూలైన్, ఓం టర్నింగ్ వద్ద మరో క్యూలైన్ కలిసి మొత్తంగా ఐదు క్యూలైన్లు అలయం వరకు కొనసాగుతాయి. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఉన్న ఈ క్యూలైన్లలో అత్యవసరమైన సేవలతో పాటు అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని మెట్ల మార్గం ద్వారా కొండ దిగువకు చేరుకుంటారు. -
స్క్రీనింగ్ పరీక్షలతో చెక్
స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలు 45 సంవత్సరాలు దాటాక ప్రతి ఏడాది మ్యామో గ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన వారు సీ టీ స్కాన్, కొలనోస్కోపి చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలకు, 45 సంవత్సరాల్లోపు మహిళలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. హెపటైటీస్ బీని కూడా వ్యాక్సిన్ వేయించుకుని రాకుండా నిరోధించవచ్చు. – డాక్టర్ బైరపనేని స్రవంతి, మెడికల్ అంకాలజిస్ట్ -
న్యాయం చేస్తారా... నిందితుడిని అప్పగిస్తారా?
ప్రత్తిపాడు: పసి పిల్లలపై నీచంగా, అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడిని కఠినంగా శిక్షించి ‘మాకు న్యాయం చేస్తారా.. లేదా నిందితుడిని అప్పగిస్తారా ?’ అంటూ మహిళలు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రత్తిపాడు మండలం రావిపాటివారిపాలెం ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్ భర్త 72 ఏళ్ల వృద్ధుడు సామియేలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. అతడి అరెస్టు విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ఆదివారం రాత్రి రావిపాటివారిపాలెం గ్రామస్తులు పెద్ద ఎత్తున స్థానిక పోలీస్ స్టేషను వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. పాఠశాలకు సంబంధం లేని వ్యక్తిని నెలల తరబడి పాఠశాలలోనికి హెచ్ఎం, ఉపాధ్యాయులు ఎలా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, తప్పు చేసిన వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఎంఈవోతోపాటు హెచ్ఎం, ఉపాధ్యాయులపైనా వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. ఎస్ఐ నరహరి మాట్లాడుతూ నిందితుడిని ఆదివారం అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశామని, చట్టప్రకారం అతడిని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు. మరలా రెండు నెలల్లో బయటకు వచ్చి తిరుగుతాడని, ఒక్కసారి మాకు అప్పగించాలని పట్టుబట్టారు. దీంతో ఎస్ఐ చట్టాన్ని చేతుల్లోనికి తీసుకోవడం సరికాదని తెలిపారు. బాధిత పిల్లల తల్లిదండ్రులు స్టేషనుకు వచ్చిన వెంటనే కేసు నమోదు చేశామని, ఎలాంటి తాత్సారం చేయలేదని ఎస్ఐ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు గుంటూరు ఎడ్యుకేషన్: నాగమ్మ భర్త విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
‘బీచ్ ఫెస్టివల్’పై ముమ్మర ప్రచారం
బాపట్ల: బీచ్ ఫెస్టివల్కు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చేలా ప్రచార ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టరు వి.వినోద్ కుమార్ ఆదివారం పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి 28 వ తేదీ వరకు సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్కు సంబంధించి సామాజిక మాధ్యమాలలో, ఇతర ప్రచార విధానాల గురించి ఆరా తీశారు. బాపట్ల జిల్లాలోని కాజు ప్రాసెసింగ్, ఆక్వా ఉత్పత్తులు, చీరాల చేనేత వస్త్ర తయారీ గురించి ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని చెప్పారు. బీచ్ అందాలను, ఫెస్టివల్లో నిర్వహించే కార్యక్రమాల గురించి నిమిషం నిడివి కలిగిన వీడియోలు రూపొందించాలని సూచించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేయాలన్నారు. రద్దీ ప్రాంతాలు, ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రచార స్టిక్కర్లను అతికించాలని తెలిపారు. ప్రచార కరపత్రాలను ముద్రించాలన్నారు. ఏర్పాట్లపై టూరిజం శాఖ సాంకేతిక అధికారులను అడిగి కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పలు సూచనలు చేశారు. ప్రముఖులకు, అధికారులకు, మీడియా వారికి పాసులు అందజేయాలన్నారు. హరిత రిసార్టును సుందరంగా తీర్చిదిద్దాలని మేనేజరును ఆదేశించారు. కార్యక్రమంలో టూరిజం అధికారి పద్మారాణి, ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్ ఎస్ఈ ఈశ్వరయ్య, డీఈలు, ఏఈలు, ఏపీ టూరిజం అథారిటీ బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పనులు త్వరగా పూర్తి చేయండి సూర్యలంక బీచ్ ఫెస్టివల్ నిర్వహణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఇన్చార్జి జేసీ గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఫెస్టివల్ నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులతో కలిసి ఆదివారం ఉదయం ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ.. కేటాయించిన పనులను దగ్గర ఉండి సంబంధిత అధికారులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డీపీఓ ప్రభాకరరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, బాపట్ల, చీరాల ఆర్డీఓలు పి.గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు, డీఆర్డీఏ ఇన్ చార్జి పీడీ లవన్న, వివిధ శాఖల అధికారులు, మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం -
25న విజయవాడలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాఽధితుల రక్షణపై ధర్నా
లక్ష్మీపురం: దళితులపై దాడులు, అత్యాచారాలు ఆగాలంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరగదని కుల వివక్ష వ్యతిరేక సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి అన్నారు. దళితులు, బహుజనులపై జరుగుతున్న అత్యాచారాలు, అట్రాసిటీ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ గుంటూరు బ్రాడీపేటలోని పీఎల్ రావు భవన్లోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాల్యాద్రి మాట్లాడుతూ దళితులపై అణచివేత కొనసాగుతున్న పరిస్థితుల్లో బహుజన సమాజం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు వెంటనే కేసులు నమోదు చేయకపోవడం, ఆలస్యం చేయ డం, లేదా ఎఫ్ఐఆర్లు బలహీనంగా నమోదు చేయడం వల్ల న్యాయం జరగడం లేదని అన్నారు. డీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కరవది సుబ్బారావు మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలబడే మానవ హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలను ప్రభుత్వం అడ్డుకోవడం మానుకోవాలన్నారు. న్యాయవాది శిఖా సురేష్ మాట్లాడుతూ కేసులను తేలికగా తీసుకుంటే న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటుందన్నారు. నేరస్తులను కఠినంగా శిక్షించడమే సమాజంలో మార్పు తీసుకొస్తుందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి. లక్ష్మణరావు మాట్లాడుతూ దళితులు గిరిజనుల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా అన్ని దళిత గిరిజన సంఘాలతో పాటు వర్గ సంఘాలు కూడా తోడై ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సెప్టెంబర్ 25న విజయవాడలో జరగబోయే ధర్నాలో పాల్గొని ప్రభుత్వాన్ని కదిలించేలా పోరాటం చేస్తామని తీర్మానం చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
క్యాన్సర్కూ ఉంది ఆన్సర్
కెనడా దేశానికి చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అనే బాలిక 1994లో క్యాన్సర్ వ్యాధికి గురైంది. అది కూడా చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్. కొన్ని వారాల్లోనే చనిపోతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కాని రోజ్ భయపడకుండా ఆస్పత్రిలో ఉన్న రోగులకు రోజూ పువ్వులు అందించేది. వారికి కవితలు వినిపించి రోగుల్లో మనో ఉల్లాసాన్ని కలిగించేది. ఇలా ఆరునెలల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోగులను చిరునవ్వుతో పలుకరిస్తూ ఉండేది. ఉత్తరాలు రాస్తూ వారిలో ఆనందం, ఉత్సాహాన్ని నింపుతూ సెప్టెంబరు 22న మరణించింది. ఆ బాలిక జ్ఞాపకార్థం ప్రతి ఏడాది రోజ్ డేను నిర్వహిస్తున్నారు. గుంటూరు మెడికల్: క్యాన్సర్ .. ఈ వ్యాధి పేరు చెబితేనే చాలా మందికి ఒంట్లో వణుకు పుడుతుంది. వస్తే చనిపోవటమే అనే అపోహల్లో ప్రజలు ఉన్నారు. పూర్వ రాచపుండుగా పిలువబడే క్యాన్సర్ వ్యాధికి చికిత్స ఉండేది కాదు. వ్యాధిగ్రస్తులు మరణానికి రోజులు లెక్క బెట్టుకుంటూ గడిపేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. బాధితుల్లో భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 22న రోజ్ డే వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. క్యాన్సర్కు కారణాలు క్యాన్సర్ రావటానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పుత్తుల వినియోగమే. సిగిరెట్, బీడీ, చుట్ట , పాన్పరాగ్, ఖైనీ, గుట్కా.. ఇలా ఏ రూపంలో పొగాకును తీసుకున్నా వస్తుంది. మద్యపానం, వ్యాయామం చేయకపోవడం, ఆకు కూరలు తినకపోవడం, ఊరగాయ పచ్చళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం, అధిక బరువు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సేవలు గుంటూరు జీజీహెచ్లో 2020 జులైలో అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలు అందించేందుకు నాట్కో క్యాన్సర్ సెంటర్ను మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. కోట్ల రూపాయలతో పెట్ స్కాన్ను ఏర్పాటు చేశారు. 100 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. జీజీహెచ్లో చికిత్స పొందిన వారి వివరాలు క్యాన్సర్కు నేడు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ, టార్గెట్థెరపీ ద్వారా త్వరగా కోలుకుంటున్నారు. నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్ ద్వారా చాలా త్వరగా గుర్తించవచ్చు. ఏ జీన్లో తేడా వల్ల సోకుతుందనే విషయం తేటతెల్లమవుతుంది. కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంటే ఇతరులకు వచ్చే అవకాశం ఉందా లేదా నిర్ధారించే బీఆర్సీఏ–1, 2 పరీక్షలు ఉన్నాయి. లాప్రోస్కోపిక్, రొబోటిక్ సర్జరీలు అందుబాటులో ఉన్నాయి. –డాక్టర్ ఎం.జి.నాగకిశోర్, సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్, గుంటూరు ఆపరేషన్లు సంవత్సరం రోగుల సంఖ్య 2020 2067 – 2021 5,865 114 2022 13,107 395 2023 14,647 753 2024 ఆగస్టు వరకు 9,376 542 -
రేవేంద్రపాడులో వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలు
దుగ్గిరాల: విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కూడా ముఖ్యమని అని హెచ్.ఎం బి.వి.కృష్ణారావు చెప్పారు. మండలంలోని రేవేంద్రపాడు జెడ్పీ హైస్కూలులో ఆదివారం జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ జట్టు ఎంపికలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గేమ్స్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో 17 నుంచి 19 సంవత్సరాల బాలబాలికల విభాగంలో ఎంపికలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థులు చురుగ్గా ఉండటానికి ఆటలు ఆడాలని, దేహ దారుఢ్యం కూడా పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు నాగ శిరీష, రాంబాబు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: తమలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుని డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారని జిల్లా ఎస్పీకి కళాకారులు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడు, శ్లోక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంట స్వామి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్లోని శ్రీ చైతన్య కళాశాల గ్రౌండ్ 99 అడుగుల మట్టి మహాగణపతిని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న వివిధ సాంస్కృతిక సంస్థలతో కలసి శ్లోకా ఫౌండేషన్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు నిత్యం శాసీ్త్రయ నృత్యాలతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఉత్సవాల అనంతరం కళాకారులకు సొమ్మును ఇవ్వకుండా కమిటీ ప్రెసిడెంట్ నరేంద్రరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మీరెడ్డిలు అందుబాటులో లేరని ఫిర్యాదు చేశారు. ఫోన్ ద్వారా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని వెళ్లి పోయారని ఆరోపించారు. కళాకారులు, చిన్నారులు, మహిళలు, మేకప్ మేన్కు రూ 1,75,000 ఇవ్వాలని తెలిపారు. వెంటనే నగదు ఇప్పించాలని స్వామి ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. -
పులిచింతలకు 3,37,264 క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 16 క్రస్ట్ గేట్లు ద్వారా 3,37,264 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 16 క్రస్ట్ గేట్లు నాలుగు మీటర్లు ఎత్తి 3,37,264 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటిమట్టం 75.50 మీటర్లకుగాను 74.78 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట నీటిసామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.593 టీఎంసీలు నిల్వ ఉందన్నారు. రెండు విద్యుత్ యూనిట్ల ద్వారా ఉత్పాదన నిలిపివేసినట్లు వెల్లడించారు. టీఆర్సీ లెవల్ 62.43 మీటర్లకు చేరుకుందని తెలిపారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి 3,09,545 క్యూసెక్కుల నీరు వస్తుందన్నారు. సాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు.