Bapatla
-
కొనుగోళ్లు ఉన్నట్టా.. లేనట్టా!
పర్చూరు(చినగంజాం): బర్లీ పొగాకు కొనుగోలు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది. జిల్లాలో రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు మొత్తం కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం మళ్లీ వెనకడుగు వేస్తోంది. పర్చూరులో ఈ నెలలో అధికారిక కొనుగోళ్లు ప్రారంభిస్తామన్న కూటమి ప్రభుత్వం వాగ్దానం ఇంకా నెరవేరలేదు. బర్లీ పొగాకు రైతులను మభ్య పెట్టేందుకు జూన్ 7వ తేదీన మంచి రోజు అంటూ హడావుడిగా మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీతో కొబ్బరి కాయ కొట్టించి పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మరో 15 రోజుల్లో కొనుగోలు కేంద్రం ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు జరుపుతామన్నారు. అటు తరువాత స్థానిక శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడును కలిసి ఈనెల 17వ తేదీ పర్చూరు మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రం ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. కానీ మంగళవారం పర్చూరులో కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. పగబట్టిన పొగాకు నాలుగేళ్లుగా లాభాలు రావడంతో ఈ సీజన్లో ఎక్కువ మంది రైతులు పొగాకు సాగు చేపట్టారు. దీంతో కౌలు, కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ రైతులకు ఆశ చావక పొగాకు పంటను విస్తృతంగా చేపట్టారు. ఈ క్రమంలో గిట్టుబాటు ధర మృగ్యమైంది. దీంతో వైఎస్సార్ సీపీ, రైతు సంఘం నాయకులు పొగాకు రైతుల తరఫున ఆందోళన బాట పట్టారు. ధర్నాలు, రాస్తారోకో నిర్వహించారు. మే 24న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్లతో కూడిన బృందం పర్చూరు ప్రాంతంలో పర్యటించి రాష్ట్రంలోని 22 ప్రయివేట్ కంపెనీలు బర్లీ పొగాకును తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఆ కంపెనీలు 25 మెట్రిక్ టన్నులకు మించి కొనుగోలు చేయలేకపోయాయి. వ్యవసాయ శాఖ అందించిన లెక్కల ప్రకారం గత వారం నాటికి రైతుల వద్ద ఉన్న మొత్తం 87 మెట్రిక్ టన్నులకుగాను కేవలం 25 మెట్రిక్ టన్నులు కంపెనీలు కొనుగోలు చేశాయి. రైతు సంఘాలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో మార్క్ఫెడ్ ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఏడు మార్కెట్ యార్డుల ద్వారా.. రాష్ట్రంలో ఏడు మార్కెట్ యార్డుల ద్వారా బర్లీ పొగాకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో పంట నిల్వలకు గోడౌనులు, మార్కెటింగ్ మార్క్ఫెడ్ అధికారులు పరిశీలించారు. కంపెనీలు కొనగా మిగిలిన ఉత్పత్తి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన పర్చూరు మార్కెట్ యార్డును మార్క్ఫెడ్ ఎండీ మంజీర్ జిలానీ సామూన్ సందర్శించి రైతుల వద్ద ఉన్న బర్లీ పొగాకు నిల్వలను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయినా ఎటువంటి కదలిక రాలేదు. అయోమయంలో బర్లీ పొగాకు రైతులు పర్చూరు పొగాకు కొనుగోలు కేంద్రంలో ప్రారంభం కాని కొనుగోళ్లు నేటికీ ప్రారంభించని ప్రభుత్వ అధికారులు కంటి తుడుపు చర్యలతో సరిపెడుతున్న కూటమి ప్రభుత్వంఉన్నతాధికారుల ఆదేశాల అనంతరం కొనుగోళ్లు ప్రారంభిస్తాం గ్రేడింగ్ విషయంలో రైతులు ముందుకు రాకపోవడంతో కొనుగోళ్లు ప్రారంభించలేదు. రైతుకు మంచి ధర రావాలంటే గ్రేడింగ్ తప్పనిసరిగా చేయాల్సి ఉంది. పండిన పొగాకును మూడు గ్రేడులుగా విభజించాల్సిందిగా రైతులు సూచించి వారికి శిక్షణ ఇవ్వడం కూడా ఇచ్చాం. కానీ గ్రేడులు చేసేందుకు, ఆ విధంగా పంటను అమ్మేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక కొనుగోళ్లు మొదలు పెడతాం. – కరుణశ్రీ,, డీఎం, మార్క్ఫెడ్ -
‘వెన్నుపోటు’ పుస్తకావిష్కరణ
చీరాల అర్బన్: రాష్ట్రంలో కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో కూటమి పాలన గురించి ప్రచురించిన ‘వెన్నుపోటు’ పుస్తకాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్బాబు ఆదేశాల మేరకు పార్టీ నాయకులు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందన్నారు. పాలనపై, ఇచ్చిన హామీలపై ఎవరు మాట్లాడినా కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి అరాచకాలు, మహిళలు, యువతులు, చిన్నారులపై అకృత్యాలు పెరిగాయన్నారు. కూటమి వైఫల్యాలపై ప్రశ్నిస్తే కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత పాలనకు ప్రజలు తేడా గమనిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు హామీలు గుప్పించి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలో రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సుపరిపాలన అందిస్తున్నామంటూ ప్రగల్భాలు చెప్పుకోవడం దారుణమన్నారు. పార్టీ నాయకులు కావూరి రమణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు వాసిమళ్ల వాసు, జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడు బత్తుల అనిల్, మచ్చా సువార్త, వేటపాలెం మండల అధ్యక్షులు సాధు రాఘవ, వేటపాలెం మైనార్టీ అధ్యక్షులు ఖాదర్, డి.మార్క్, తేళ్ల రాంబాబు, రామచంద్ర, జాన్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ గారూ అంతా ఓకే అట!
జె.పంగులూరు: జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాలకే విలువ లేకుండా పోతోంది. పని చేయకుండానే చేసినట్లు ఏకంగా ఆన్లైన్లోనే అప్లోడ్ చేస్తున్న మండ ల స్థాయి అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ అంతా డొల్లేనని తేటతెల్లం చేస్తున్నారు. మండల పరిధిలో వివిధ కారణాలు వల్ల పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెళతారు. కలెక్టర్ పరిష్కరిస్తారనే నమ్మకంతో అర్జీ ఇచ్చి వారి సమస్యలను విన్నవించుకుంటారు. ఆ సమస్యను పరిష్కరించమని తిరిగి మండలాలకు కలెక్టర్ కా ర్యాలయం నుంచి వస్తాయి. కానీ మండల అధికారులు అర్జీదారునితో మాట్లాడకుండానే సమస్య పరిష్కరించినట్లు కలెక్టర్కు రిపోర్టులు పంపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పంగులూరు గ్రామానికి చెందిన పాలపర్తి ఏలియా రెండు నెలల క్రితం కలెక్టర్కు నివేశన స్థలానికి సంబంధించి కలెక్టర్కు అర్జీ పెట్టాడు. ఆ అర్జీ జె.పంగులూరు మండల తహసీల్దార్కు వచ్చింది. కానీ ఇక్కడ తహసీల్దార్ అర్జీదారునితో మాట్లాడకుండానే సమస్య పరిష్కారమైనట్లు నివేదికను పై అధికారులను పంపించారు. అర్జీదారునికి తెలియకుండా అతని ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈవిషయమై అర్జీదారుని కి సమస్య పరిష్కారం అయిందని మెసేజ్తోపాటు ఫోన్ చేశారు. దీంతో అర్జీదారుడు తనను సంప్రదించకుండా నా అర్జీని ఎలా పరిష్కరిస్తారని తహసీల్దార్ని అడగగా వారి వద్ద నుంచి సరైన సమాధానం లేదు. జె.పంగులూరు మండ లం నుంచి బాపట్ల వెళ్లాలంటే సుమారు 60 కిలోమీటర్లు. వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందించినా ఉపయోగం లేకుండా పోతోంది. -
ధర ఢమాల్... రైతు డీలా..
బల్లికురవ: వాణిజ్య, వ్యాపార పంటలు సాగుచేసి విసిగి వేసారిన రైతులు దశాబ్దం నుంచి పండ్ల తోటల సాగు వైపు మళ్లారు. సాగులో ఉద్యానశాఖ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది ధర దిగజారటంతో తోటల వద్దకు కొనేవారు కరువయ్యారు. దీంతో కాయలు పండి రాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1011 ఎకరాల్లో సాగు బల్లికురవ, సంతమాగులూరు, మార్టూరు మండలాల్లో 1011 ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి సాగు చేపట్టారు. ఖరీఫ్ ఆరంభంలో సారవంతమైన నీటి వసతి కలిగిన భూముల ఎంపికతో బల్లికురవ మండలంలోని వేమవరం, ఉప్పుమాగులూరు, కూకట్లపల్లి, వల్లాపల్లి, కొత్తూరు, రామాంజనేయపురం, వెలమవారిపాలెం, కొప్పర పాలెం, సంతమాగులూరు మండలంలోని చవిటిపాలెం, ఏల్చూరు, కుందుర్రు, కొప్పరం, మక్కెనవారిపాలెం, పాతమాగులూరు, మార్టూరు మండలంలోని జంగమహేశ్వరపురం, బొల్లాపల్లి, ఇసుకదర్శి, నాగరాజుపల్లి, తండాలో పండ్ల తోటల సాగు చేపట్టారు. ఫిబ్రవరి, ఏప్రిల్ వరకు ధరలు కొంత మేర ఆశాజనకంగానే ఉన్నాయి. బొప్పాయి కిలో రూ.15 నుంచి రూ.18 పలకగా మామిడి కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పలికింది. అకాల వర్షాలతో దిగజారిన ధరలు మే నెలలో కురిసిన అకాల వర్షాలకు తోడు ఎగుమతులు లేనందున గత నెల నుంచి బొప్పాయి కిలో రూ.3లకు, మామిడి కిలో రూ.30లకు పడిపోయింది. తీరా దిగుబడులతో ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికందే దశలో మార్కెట్ దిగజారటం, ఎగుమతులు లేనందున రైతులు చేసేది లేక తోటల వద్ద వచ్చిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దిగజారిన ధరలతో పంటల సాగుకు తెచ్చిన పెట్టుబడులు ఎలా తీర్చాలో అంతుచిక్కటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా మార్కెటింగ్ చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 1011 ఎకరాల్లో పండ్ల తోటల సాగు కొనే నాథుడు లేక తోటల్లోనే పండి రాలిపోతున్న కాయలు ఎకరాకు రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడులు ప్రభుత్వ ప్రోత్సాహం నిల్ మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని రైతుల వేడుకోలు రైతులను నట్టేట ముంచిన అకాల వర్షాలు -
క్వారీ గుంతలో పడి యువకుడు మృతి
గుంటూరు రూరల్: క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామానికి చెందిన కట్టెపోగు నాగరాజు (30) ఆటోడ్రైవర్. అతనికి భార్య రూపకోటేశ్వరి, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. మరో రెండు రోజుల్లో కోటేశ్వరి ప్రసవించనుందని వైద్యులు తెలిపారు. దీంతో నాగరాజు ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం బయటకు వెళుతున్నానని ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవటంతో స్థానికులు అంతటా వెతికారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లక్వారీ గుంత వద్ద నాగరాజు చెప్పులు, పక్కనే అతని ద్విచక్ర వాహనం కనిపించాయి. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత మేడికొండూరు, నల్లపాడు పోలీసుల మధ్య సరిహద్దు వివాదం నడిచిన అనంతరం నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల కోసం సోమవారం వేచి చూశారు. రాత్రి కావటంతో మంగళవారం ఉదయం నుంచి వెతుకులాట ప్రారంభించగా, నాగరాజు మృతదేహం లభ్యమైంది. పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. నాగరాజు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారి పడ్డాడా? ఇక్కడ ఎక్కువగా ఉన్న కోతులు దాడి చేస్తే తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని స్థానికులు కోరుతున్నారు. మృత్యుపాశాలుగా క్వారీ గుంతలు అనుమతులు లేకున్నా అక్రమంగా మైనింగ్ క్వారీలను నిర్వహిస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. ఎక్కువ లోతులో క్వారీలను తవ్వి వదిలేస్తున్నారు. ఈ గుంతల్లో నీరు నిలిచిపోతోంది. విషయం తెలియని కొందరు వ్యక్తులు ఇటువంటి ప్రమాదాలతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక పాలన
చెరుకుపల్లి: రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతుందని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ అన్నారు. మంగళవారం గుళ్లపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ అనే పేరుతో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో వైఫల్యాలపై రూపొందించిన పుస్తకాన్ని డాక్టర్ గణేష్ నియోజకవర్గ నాయకులతో కలసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత హామీలు అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడంతో పథకాలను అరకొరగా అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని డాక్టర్ గణేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు యార్లగడ్డ మదన్మోహన్, కాటూరి శివ, బొర్రా శ్రీనివాసరావు, మండల కన్వీనర్లు దుండి వెంకటరామిరెడ్డి, ఇంకొల్లు రామకృష్ణ, యార్లగడ్డ రాంబాబు, నాయకులు చదలవాడ శ్రీనివాసరావు, నిజాంపట్నం కోటేశ్వరరావు, లుక్కా బాపనయ్య, ఉల్లంగుంట శ్రీరాంమూర్తి, వంగర భాను, ప్రభు కిరణ్, ఖుద్దూస్, చౌటూరి రమేష్, డి.కొండలురెడ్డి, శొంఠి సురేష్, రాజ్పాల్, కందుల సురేష్, పిట్టు సాంబశివారెడ్డి, గాలిమోటు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ‘జగన్ అంటే నమ్మకం..చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ -
కౌన్సిలర్ హుకుం... కమిషనర్ జీ హుజూర్
చీరాల: పట్టణంలోని పొలిమేర రోడ్డులోని ఓ అపార్టుమెంట్లో కింద ఫ్లోర్లో వస్త్ర, ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కింద షాపులు, పైన నివాస సముదాయాలున్నాయి. అయితే ఇదంతా మామూలుగా ఉంది కదా అనుకుంటే పొరపాటే. మంగళవారం అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ వ్యాపారస్తుల వద్దకు వచ్చి షాపుల ముందు పెట్టిన బట్టల బేళ్లు తొలగించాలంటూ హుకుం జారీ చేశారు. సాయంత్రానికి తొలగించకుంటే బయటకు లాగేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జరిగింది ఇదీ.. చీరాల పట్టణంలోని 12వ వార్డులో పొలిమేర రోడ్డులోని ఓ అపార్టుమెంట్ కింద భాగంలో పలువురు ఎప్పటి నుంచో వస్త్రవ్యాపారాలు నిర్వహిస్తున్నారు. షాపుల బయట బట్టల బేళ్లు పెట్టుకుంటున్నారు. అయితే అదే అపార్టుమెంట్లో నివసిస్తున్న అధికార పార్టీ మహిళా కౌన్సిలర్కు మాత్రం ఇది నచ్చలేదు. బట్టల బేళ్లు బయట అడ్డంగా పెట్టవద్దంటూ వ్యాపారస్తులకు సూచించారు. సీజన్ కావడంతో బయట పెట్టుకుంటేనే వ్యాపారం జరుగుతుందని, వ్యాపారాలు సరిగా లేవు, కస్టమర్లు వెళ్లిన తర్వాత లోపల పెట్టుకుంటామని చెప్పారు. అంతే ఆమెకు కోపం వచ్చి వ్యవహారం ఇంకోలా మారింది. మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ను అక్కడకు పిలిపించారు. ఏదో తప్పు చేసినట్లుగా ఆయన అక్కడకు వచ్చి వ్యాపారస్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంప్లెక్సులో షాపుల ముందు పెట్టిన బేళ్లు, బట్టలు సాయంత్రానికి తొలగించకుంటే మా మున్సిపాలిటీ వారు వచ్చి రోడ్డు మీద పడవేస్తారు’’ అంటూ బెదిరింపు ధోరణితో చెప్పి వెళ్లారు. దీంతో వ్యాపారస్తులందరూ ఒక్కసారిగా విస్తుపోయారు. ఇదేమీ మున్సిపల్ కాంప్లెక్సు కాదని, ప్రైవేటు కాంప్లెక్సులోని వస్త్ర వ్యాపారస్తులపై కమిషనర్ వచ్చి బెదిరింపు ధోరణిగా మాట్లాడడం ఏమిటని వ్యాపారస్తులు వాపోతున్నారు. తోటి వ్యాపారస్తులకు ఏ ఇబ్బందులు లేనప్పుడు ఓ అధికార పార్టీ మహిళా కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ను పిలవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. కాగా దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేశారా అని అడుగగా సమాధానం కరవవడం గమనార్హం. ప్రైవేటు అపార్టుమెంట్ వ్యవహారంలో కమిషనర్ అత్యుత్సాహం వ్యాపారస్తులపై కమిషనర్ హడావిడి -
వాగ్దానాల అమలులో ప్రభుత్వం విఫలం
వేమూరు: గత ఎన్నికల్లో కూటమి సూపర్ సిక్స్ పథకాలు వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గం సమన్వయకర్త వరికూటి అశోక్బాబు అన్నారు. ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని చెరుకుపల్లి గ్రామంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అభివృద్ధి చేయకపోగా వారు చేసిన మోసాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమేనని అశోక్బాబు మండిపడ్డారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు, ఆధారాలతో ఈ పుస్తకం రూపొందించడం జరిగిందన్నారు. మోసపు హామీలు, అబద్దపు మాటలతో మభ్య పెట్టి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి హిమచంద్ర శ్రీనివాస్, సుజ్ణల నాగ మలేశ్వరరావు, పడమటి శ్రీనివాసరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కోగంటి లవకుమార్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షుడు ఇమామ్ హుస్సేన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి సిరాజ్, దున్నా మేరీసుబాబు, గుమ్మడి దానియేలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్బాబు ‘జగన్ అంటే నమ్మకం–చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ -
ఎగవేతదారుల నుంచి పన్నులు వసూలు చేయాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: వాణిజ్య పన్నుల ఎగవేతదారుల నుంచి పన్ను వసూలుకు అధికారులు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. వాణిజ్య పన్నులు, అనుబంధశాఖల అధికారులతో జిల్లాస్థాయి సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. చట్టబద్ధంగా వాణిజ్య పన్ను వసూలుపై యంత్రాంగం దృష్టి పెట్టాలని కలెక్టర్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.95.14 కోట్లు వాణిజ్య పన్ను వసూలు జరిగిందన్నారు. ప్రస్తుతం గణనీయంగా పన్ను వసూలు తగ్గడంపై ఆరా తీశారు. గ్రానైట్ క్వారీలు, పరిశ్రమలు, రవాణాలో బోగస్ రిజిస్ట్రేషన్ల ద్వారా పన్నులు వసూలు కావడం లేదని తాజా సర్వేలో వెలుగులోకి వచ్చిందన్నారు. పన్నుల ఎగవేతను అరికట్టడానికి ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తీర ప్రాంతాల్లోని రిసార్డ్స్ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై పర్యాటకశాఖ, వాణిజ్య పనుల శాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు. జీఎస్టీ చెల్లించకుండా గుత్తేదారులు పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయితే వారిని బ్లాక్లిస్టులో పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో వాణిజ్య పన్నులశాఖ సంయుక్త కమిషనర్ బి గీతామాధురి, డీఆర్వో జి గంగాధర్ గౌడ్, జిల్లా వాణిజ్య పనుల శాఖ అధికారిని ఆర్ శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకంతో ఉపయోగం వేటపాలెం: పీఎం సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి (పీఎంఎఫ్ఈ) పథకాన్ని అందిపుచ్చుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. వేటపాలెం మండలం కొత్తపేటలోని సూక్ష్మ ఆహార శుద్ధి జీవనోపాధి లబ్ధిదారుల యూనిట్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ప్రసాద్నగర్లోని సాయి తేజ వేరుశనగ శుద్ధి యూనిట్ను పరిశీలించారు. లాభనష్టాలను, వ్యాపారసరళి, ముడి సరుకు కొనుగోలు వివరాల ను యజమానిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి కొత్తపేట బాల ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. విద్యుత్ సమస్యల వలన ఉత్పత్తి జరగటం లేదని తెలిపారు. సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఖలీం, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, ఆర్డీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ గోపికృష్ణ పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసగించిన చంద్రబాబు
బాపట్ల: రాష్ట్ర ప్రజలను చంద్రబాబునాయుడు మళ్లీ మోసం చేసి ప్రజాగ్రహానికి గురయ్యారని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ‘జగన్ అంటే నమ్మకం...చంద్రబాబు నాయుడు అంటే మోసం’ అనే పుస్తకాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే ఏడాదిలోపే మళ్లీ బాబు తన నైజాన్ని ప్రదర్శించారని దుయ్యబట్టారు. అమ్మఒడి పథకంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి 87లక్షల మంది తల్లుల ఖాతాలోకి నగదు జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబునాయుడు ఎంతమంది తల్లులు ఉంటే అంతమంది ఖాతాలకు తల్లికి వందనం వేస్తానని చెప్పి 50లక్షల మందికి మాత్రమే అర్హుల జాబితాలో చొటు కల్పించారన్నారు. 50 సంవత్సరాల మహిళలకు పెన్షన్ ఇస్తామని చెప్పిన మాటలు అమలుకు నోచుకోలేదన్నారు. ఆడబిడ్డ నిధి, ఉద్యోగాల కల్పన విషయంలో కూడా చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలపై దాడులు పెరిగిపోయాయని చెప్పారు. మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతుంటే చోద్యం చూస్తున్నారని తెలిపారు. అయ్యో...ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు పోతుందని ఏడాదిలోపే ప్రజలు ఎదురుచూస్తున్నారని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, గవిని కృష్ణమూర్తి, చల్లా రామయ్య, నక్కా వీరారెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, జోగి రాజా, తన్నీరు అంకమ్మరావు, కత్తి సుందరరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున ‘జగన్ అంటే నమ్మకం...చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ -
పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలు పరిష్కరించండి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి బాపట్ల: పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు మా సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కలసి వినతి పత్రాల ద్వారా కోరారు. తన పరిధిలో ఉన్న వాటికి ఆయన తక్షణమే పరిష్కార మార్గం చూపగా కొన్నింటిని పరిశీలించి, మరికొన్నిటిని విచారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆక్రమణలపై చర్యలు తీసుకోండి చెరువులు, కుంటలు, సాగునీటి కాల్వల ఆక్రమణలను మూడు నెలలలో తొలగించాలని కలెక్టర్ జె.వెంకట మురళి ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 24,327 నీటి సంఘాల కమిటీలు ఉన్నాయన్నారు. 48,020 ఎకరాలు నీటి సంఘాల పరిధిలో ఉన్నాయన్నారు. 305 చెరువులు, కుంటలు ఆక్రమణకు గురయ్యాయన్నారు. 2,449 మంది ఆక్రమణదారులు 299 ఎకరాలను ఆక్రమించారని చెప్పారు. ఆక్రమణలు తొలగించే ప్రక్రియకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, ఆర్డీవో పి గ్లోరియా, డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
చేనేతలకు మంచిరోజులొచ్చాయ్
● జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి ● కలెక్టర్ను సన్మానించిన చేనేత సంఘాల నాయకులు బాపట్ల: కుప్పడం పట్టు చీరలకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంతో చేనేతలకు మంచి రోజులు వచ్చాయని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. కుప్పడం పట్టు చీరలకు జాతీయస్థాయి గుర్తింపు లభించడంపై చేనేత సహకార సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా నివేదించడంతో జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల కలలు నెరవేరాయన్నారు. చీరాల కుప్పడం పట్టు చీరలకు గుర్తింపు లభించడం ద్వారా వాటికి మంచి డిమాండ్ పెరుగుతుందని కలెక్టర్ చెప్పారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న చేనేత కార్మికుల కలలు నెరవేరుతాయన్నారు. చేనేత వృత్తికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. తద్వారా చేనేతల సమస్యలన్నీ తీరిపోతాయన్నారు. చేనేత కార్మికులందరికీ మంచి జరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, జిల్లా చేనేత చేనేత జౌళి సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె నాగమల్లేశ్వరరావు, చేనేత సహకార సంఘాల నాయకులు దివి రాంబాబు, జీవీ నాగేశ్వరరావు, కె.వి నాంచారయ్య, శ్రీనివాసరావు, పి వెంకట సుబ్బారావు, పి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. బంగారు కుటుంబాల ఆర్ధిక అభివృద్ధికి కృషి బాపట్ల: పి–4 బంగారు కుటుంబాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. పి–4 కింద డీఆర్డీఏ దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలకు చేయూతనందించే కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. బంగారు కుటుంబాల జీవన స్థితిగతులను పరిగణలోకి తీసుకున్న డీఆర్డీఏ 13 కుటుంబాలను దత్తత తీసుకుంది. వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించడం కోసం రూ.10.95 లక్షలను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు. చెక్కు రూపంలో నగదును బంగారు కుటుంబాలకు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఒకరికి బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, ముగ్గురికి వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేశారు. బాపట్ల జిల్లాలో బంగారు కుటుంబాలు 62వేలు ఉన్నాయన్నారు. వారికి చేయూతనందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు, వెలుగు అధికారులు కె రవికుమార్, జి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
అలలపై వలల వేట
● రెండు నెలల విరామం తరువాత కడలి వైపు మత్స్యకారుల పయనం ● జూన్ 14వ తేదీతో ముగిసిన వేట నిషేధం ● నిజాంపట్నం హార్బర్లో సందడి వాతావరణం ● మొగ సామర్ధ్యం పెంపుతో మత్స్యకారుల్లో ఆనందం రేపల్లె: సముద్రంలో మత్స్య సంపద అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఏటా ప్రభుత్వం మార్చి 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులపాటు సముద్రపు వేట నిషేధం అమలు చేయడం జరుగుతుంది. వేటపై నిషేధం పూర్తి అవ్వడంతో జూన్ 15వ తేదీ నుంచి మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంతమైన నిజాంపట్నం హార్బర్ నుంచి వందలాది బోట్లు సముద్ర వేటకు వెళ్లేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి. వేట నిషేధ సమయం పూర్తయిన తర్వాత తొలిసారిగా సముద్రపు వేటకు వెళ్తున్న గంగపుత్రులు మత్య్స సంపద సంవృద్ధిగా లభించాలని ఇష్టదైవంకు పూజలు చేసుకొని బయలుదేరుతున్నారు. దీంతో హార్బర్ ప్రాంగణం సందడి వాతవరణం నెలకొంది. సుదీర్ఘ విరామం తరువాత తొలి వేటలో మత్స్యసంపద అధికంగా లభిస్తుంటుంది. దీంతో ఎన్నో ఆశలతో గంగపుత్రులు కడలివైపు పయనమయ్యారు. మొగ వద్ద సాఫీగా... హార్బర్ నుంచి సముద్రంలోకి రాకపోకలు సాగించే మొగ వద్ద బోట్లు సాఫీగా సాగిపోతుండటంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.451 కోట్లతో జరుగుతున్న హార్బర్ రెండో దశ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే మొగ సామర్ధ్యం పెంపుదల పనులు పూర్తి కావడంతో మొగ వద్ద బోట్ల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంతో హార్బర్ నుంచి సముద్రంలోని రాకపోకలు సాగించాలంటే ఆటుపోట్లకు అనుగుణంగా సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో ఎన్నో గంటల సమయంలో వేచి ఉండటం, ఒక్కొక్క సమయంలో మొగ వద్ద బోట్లు అడుగు భాగం నేలకు తగిలి దెబ్బతినటం వంటి పరిణామాలతో మత్స్యకారులు వ్యయప్రయాసలకు లోను కావాల్సిన దుస్థితి ఏర్పడేది. ఈ పరిస్థితుల్లో హార్బర్ రెండో దశ అభివృద్ధి పనులు ప్రారంభించటం మరీ ముఖ్యంగా మొగ సామార్ధ్యం పెంచటంతోపాటు మొగకు ఇరువైపులా 1570 మీటర్ల బౌల్డర్స్ ఏర్పాటుతో ఆధునీకరించే పనులు వేగవంతంగా పూర్తికావటంతో హార్బర్ నుంచి సముద్రంలోకి రాకపోకలు ఏసమయంలోనైనా సులభతరమయ్యాయి. దీంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధమైన బోట్లు వేట నిషేధ సమయంలో బోట్లకు మరమ్మతులు పూర్తి చేసి రంగులు వేయించటం, వలలను రిపేరు చేయటం వంటి పనులు పూర్తి చేసుకున్నారు. వేటకు వెళ్లేందుకు ఉప్పు, ఐస్, తాగునీరు, వంట సామాగ్రి, డీజిల్ తదితరాలు సిద్ధం చేసుకుని వేటకు పయనమయ్యారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
చిలకలూరిపేట సమీపంలో విషాద ఘటన చిలకలూరిపేటటౌన్: ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...వైఎస్సార్ కాలనీకి చెందిన గాలేటి రాంబాబు, కావేరి దంపతులు, వారి మేనకోడళ్లైన పాముసాని బాలసాహితి, వెంకట శృతితో కలిసి బైక్పై కనపర్రు చర్చికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. రూరల్ మండలంలోని లింగంగుంట్ల వంతెన దాటిన తరువాత అదే మార్గంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ట్యాంక్పై కూర్చున్న వెంకట శృతి(9) బస్సు చక్రాల కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. రాంబాబు, ఆయన భార్య కావేరికి స్వల్ప గాయాలు కాగా, మరో బాలిక బాల సాహితికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే పాపను చికిత్స నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందింది. బాధితురాలు కావేరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్కు రెడీ!
● 21 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ● 25 నుంచి కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాలు ఏర్పాటు గుంటూరు ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి గానూ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 21న ప్రారంభం కానుంది. పాలిసెట్–2025లో అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 28 వరకు జరగనున్న కౌన్సెలింగ్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంది. ఇందు కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాలుగు హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకాగోరు విద్యార్థులు ఈనెల 20 నుంచి 27 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో రుసుం చెల్లించాలి. సర్టిఫికెట్ల పరిశీలనకు హజరుకాగోరు విద్యార్థులు వెంట ఫీజు రసీదు, హాల్ టికెట్, ర్యాంకు కార్డు, టెన్త్ పాస్ సర్టిఫికెట్, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఓసీ విద్యార్థులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంది. స్పోర్ట్స్, గేమ్స్, ఎన్సీసీ ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థులు విజయవాడ బెంజి సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్లో హాజరు కావాల్సి ఉంది. ● ఈనెల 21న ఒకటో ర్యాంకు నుంచి 15వేలు, 22న 15,001 నుంచి 32వేలు, 23న 32,001 నుంచి 50వేలు, 24న 50,001 నుంచి 68వేలు, 25న 68,001 నుంచి 86వేలు, 26న 86,001 నుంచి 1,04,000, 27న 1,04,001 నుంచి 1,20,000, 28న 1,20,001 నుంచి ఆపై చివరి ర్యాంకు వరకు హాజరుకావాలి. ● సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 25నుంచి 30వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్లో పాల్గొని కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్లు ఇచ్చుకోవాలి. కౌన్సెలింగ్కు సంబంధించిన పూర్తి వివరాలకు https // appolycet. ap. gov. in సైట్కు లాగిన్ అవ్వాలి. హెల్ప్లైన్ కేంద్రాలు గుంటూరు నగర శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్, నరసరావుపేట పల్నాడు బస్టాండ్ సమీపంలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ పాత క్యాంపస్, రేపల్లెలోని ప్రభుత్వ పాలిటెక్నిక్, బాపట్లలోని బాపట్ల పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ కేంద్రాల్లో ఆయా తేదీల్లో ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంది. -
హాట్సాఫ్ డాక్టర్ !
●మానవత్వం చాటుకున్న డాక్టర్ రాఘవ శర్మ ●నిడమానూరు బైపాస్లో రోడ్డులో ప్రమాదం ●తీవ్ర గాయాలతో పడిఉన్న వ్యక్తి ●వెంటనే భుజాలపై తీసుకుని కారులోకి తీసుకెళ్లిన డాక్టర్ ●ప్రమాదం నుంచి బయటపడిన బాధితుడు గుంటూరు మెడికల్: ఆదివారం రాత్రి ఎనిమిది గంటల సమయం.. నిడమానూరు బైపాస్.. రాత్రి పూట చిమ్మ చీకట్లో నెత్తుటి మడుగులో స్పృహ లేకుండా పడిఉన్న భర్తను చూసి ఆమె గుండెలు బాదుకుంటోంది. అయ్యా.. కాపాడండి ! అంటూ కన్నీరుమున్నీరవుతోంది. అప్పటికే కొన్ని వందల వాహనాలు అటు ఇటు పరుగులు పెడుతున్నా ఆగలేదు. ఇంతలో గుంటూరుకు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్, లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పి.వి.రాఘవశర్మ గన్న వరం నుంచి గుంటూరు వస్తున్నారు. రోడ్డు పక్కన దూరంగా పడి ఉన్న బాధితుడు, ఆర్తనాదాలు పెడుతున్న ఆయ న భార్య కనిపించారు. వెంటనే కారు ఆపి పరుగు పరుగున అక్కడకు వెళ్లారు. బాధితుడి నాడి పట్టుకున్న వెంటనే మరికొద్ది క్షణాలు మాత్రమే ఊపిరి ఉంటుందని అర్థమైంది. వెంటనే భుజాలపై వేసుకుని ఒక్క ఉదుటున కారు వద్దకు వెళ్లారు. అప్పటి వరకు గుండెల నిండా కన్నీళ్లతో.. అంతులేని దిగులు చీకట్లలో కూరుకుపోయిన ఆ ఇల్లాలు.. వణుకుతున్న తన రెండు చేతులు జోడించి.. అయ్యా దేవుడిలా వచ్చారు! అంటూ దణ్ణం పెట్టింది. వేగంగా బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు. డాక్టర్ రాఘవశర్మ మానవత్వపు వైద్య సేవలకు అక్కడ ఉన్న ప్రజలు, పోలీసులు ‘హాట్సాఫ్ డాక్టర్ !’ అంటూ సలాం కొట్టారు. -
సారా రహిత జిల్లాగా పల్నాడు
నరసరావుపేట: సారా రహిత జిల్లాగా పల్నాడు జిల్లా ఏర్పాటైందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం సాయంత్రం సమా వేశం నిర్వహించారు. తొలుత జిల్లాలో ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు నాటుసారా నిర్మూలనకు చేపట్టిన చర్యలను ఎకై ్సజ్ అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నవోదయం 2.0లో భాగంగా జిల్లాలో నాటుసారా నిర్మూలనకు ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్టు చెప్పారు. నాటుసారా నిర్మూలనలో భాగంగా మొదటి దశలో 116 అవగాహన సదస్సులు నిర్వహించి దానివలన కలిగే దుష్ప్రభావాలపై ప్రచారరథంతో ఊరురా తిరుగుతూ ప్రచారం నిర్వహించారన్నారు. రెండవ దశలో విస్తృతంగా దాడులు నిర్వహించి తయారీ విక్రయాల్లో ఉన్న వారిపై 32 కేసులు నమోదు చేసి 21 మందిని అరెస్టు చేయగా 138 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని 11,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారన్నారు. బెల్లం విక్రయించకుండా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో సారా వృత్తిగా బతుకుతున్న వారికి చైతన్యం కల్పించి ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించేందుకు కలెక్టర్ సూచనల ప్రకారం 57 మందిని గుర్తించి అందులో అర్హులుగా గుర్తించిన 23 మందికి ప్రత్యామ్నయంగా వారి కుటుంబాలకు రూ.29.40 లక్షలు మొత్తాన్ని కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధి, లోన్ రూపంలో అందజేశారు. గుంటూరు ప్రొహిబిషన్ ఎకై ్సజ్ డెప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్లు ఎం.సుధాకర్రెడ్డి, ఎం.రవికుమార్రెడ్డి, పల్నాడు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కె.మణికంఠ, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.సూర్యనారాయణ, కె.రవీంద్ర పాల్గొన్నారు. నవోదయం 2.0తో పటిష్టమైన చర్యలు ఎకై ్సజ్ అధికారులతో సమీక్షలో కలెక్టర్ రూ.29.40 లక్షల ఆర్థిక సహాయం అందజేత -
‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ
ఇంకొల్లు(చినగంజాం): చంద్రబాబు ఏడాది పాలనలో అభివృద్ధి అడ్రెస్ లేకుండా పోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు అన్నారు. పర్చూరు నియోజక వర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ గాదె మధుసూదన రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని పావులూరు గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల కన్వీనర్ల ఆధ్వర్యంలో సీనియర్ పార్టీ నాయకులు పాల్గొనగా పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గతేడాదిగా రాష్ట్రంలో చీకటి పాలన కొనసాగుతోందని, అన్యాయం, అక్రమం, వివక్ష, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప న్యాయం, పారదర్శకత, ఎక్కడా కన్పించడం లేదన్నారు. ప్రజలకు చంద్రబాబు మోసపూరిత హామీ లిచ్చి వాటిని అమలు చేయలేక వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, ఇంకొల్లు మండల కన్వీనర్ చిన్ని పూర్ణారావు, మార్టూరు మండల కన్వీనర్ జంపని వీరయ్య చౌదరి, చినగంజాం కన్వీనర్ మున్నం నాగేశ్వరరెడ్డి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అయేషా బుడే, హరిరామి రెడ్డి, చౌదరి, కోటి శ్రీరాములు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి
యువతికి తీవ్ర గాయాలు తెనాలి రూరల్: రోడ్డు ప్రమాదంలో వైద్యుడు మృతి చెందగా, యువతి తీవ్ర గాయాలపాలైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన వైద్యుడు బూదాటి వెంకటేష్(35) తెనాలి ప్రభుత్వ వైద్యశాలలోని డయాలసిస్ విభాగంలో పని చేస్తున్నాడు. విజయవాడకు చెందిన స్నేహితురాలు యామినీని తెనాలి నుంచి విజయవాడకు తీసుకెళ్లేందుకు బుల్లెట్పై బయలుదేరారు. వీఎస్సార్ కళాశాల దాటగానే తెనాలి–విజయవాడ రహదారిపై ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ట్రెయిలర్ ఢీకొని ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. తెనాలిలోని ప్రైవేటు వైద్యశాలకు ఇద్దరిని తరలించగా, వెంకటేష్ అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అపస్మారస్థితిలో ఉన్న యామినికి చికిత్స అందిస్తున్నారు. రూరల్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో రాళ్లతో దాడి
యువతికి గాయాలు వేటపాలెం: మద్యం మత్తులో రాళ్లతో దాడి చేసిన ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఈ ఘటన పందిళ్లపల్లిలోని చీరాల–ఒంగోలు రోడ్డు పక్కన పందిళ్లమ్మ దేవస్థానం అర్చి వద్ద ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. కొబ్బరిబోండాల దుకాణానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యుకుడికి అదే గ్రామానికి చెందిన మురళికి పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి సుబ్రహ్మణ్యం, మురళీ ఇద్దరూ సెల్ ఫోన్లో ఒకరినొకరు రెచ్చుగొట్టుకొనే విధంగా మాట్లాడుకున్నారు. అనంతరం మురళి మరో ఇద్దరు స్నేహితులను తీసుకొని వచ్చి ఆర్చి వద్ద మద్యం సేవించి సుబ్రహ్మణ్యంతో గొడవ పడే సమయంలో రాళ్లు రువ్వుకున్నారు. అక్కడే ఉన్న సుబ్రహ్మణ్యం అక్క తలకు రాయి తగలడంతో గాయమైంది. సమాచారం అందుకున్న ఎస్సై కె. జనార్దన్ సంఘటనా స్థలానికి వెళ్లి వారిని చెదరగొట్టారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు. గాయాలైన యువతి చీరాల ఏరియా వైద్యశాల్లో చేరి ఔట్ పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గొడవ పడిన ముగ్గురు యువకులు వేటపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఎస్సై జనార్దన్ దర్యాప్తు చేస్తున్నారు. -
నెలకు రెండుసార్లు రుణమేళా నిర్వహిస్తాం
కలెక్టర్ అరుణ్ బాబు నరసరావుపేట: జిల్లాలో నెలకు రెండు సార్లు మెగా రుణమేళా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లో బ్యాంకర్లు, రుణ దరఖాస్తుదార్లతో మెగా రుణమేళా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో ఒకసారి, నియోజకవర్గస్థాయిలో ఒకసారి రుణమేళా నిర్వహించి బ్యాంకు రుణాలు సులభంగా పొందడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. బ్యాంకులకు అందిన రుణ దరఖాస్తులను అక్కడికక్కడే పరిశీలించి రుణవితరణ చేపడతామన్నారు. మొత్తం 338 దరఖాస్తులను పరిశీలించి 50 మంది చిరువ్యాపారులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.50 లక్షలు స్వయం సిద్ధ రుణాలు మంజూరు చేశారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద మరో రూ.32 లక్షలు మంజూరు చేశారు. ఎంపీ లావుశ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రుణాలకోసం బ్యాంకులను మాత్రమే ఆశ్రయించటం శ్రేయస్కకరమని అన్నారు. రుణాలు అందించేందుకే బ్యాంకులు ఉన్నాయని, ప్రభుత్వ పథకాల ద్వారా అందజేసే రుణాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎల్డీఎం రాంప్రసాద్, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, యూనియన్ బ్యాంకు అధిపతి మాధురి, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ అధికారి సుభాష్ పాల్గొన్నారు. -
ఏపీ టాక్స్ బార్ అధ్యక్షుడిగా రామరాజు శ్రీనివాసరావు
గుంటూరు వెస్ట్ : ఏపీ టాక్స్ బార్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన ప్రముఖ ఆడిటర్ రామరాజు శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రస్తుత అధ్యక్షుడు ఎం.వి.జె.కె. కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 15న జరిగిన ఎన్నికల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. జూలై 1 నుంచి పూర్తి బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ఈ పదవిలో రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతారన్నారు. 2000 పైగా ప్రాక్టీషనర్స్, చార్డెర్డ్ అక్కౌంటెంట్స్, న్యాయవాదులు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీనివాసరావు గతంలో ఏపీ టాక్స్ ప్రాక్టీషనర్స్, కన్సల్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టీషనర్స్ ( సదరన్ ) చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారన్నారు. పలు సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక కావడం సంస్థకు ఎంతో ప్రయోజనమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు కోట సునీల్, ఏ.వి.ఎస్. కృష్ణ మోహన్, చక్ర రమణ, ఫణి కుమార్, సురేష్లతోపాటు పలువురు ఆడిటర్లు, చార్టెర్డ్ అక్కౌంటెంట్లు అభినందనలు తెలిపారు. -
కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు
లక్ష్మీపురం: తల్లికి వందనం పథకం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం. కిరణ్ ఖండించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద రూ.15 వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పడం సిగ్గుచేటని తెలిపారు. 2024–25 సంవత్సరానికి పథకాన్ని బురుడీ కొట్టించి తల్లిదండ్రుల్ని మోసం చేశారని విమర్శించారు. కరెంటు 300 యూనిట్లు వినియోగిస్తే అర్హులు కారనే నిబంధనలను గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారని, మరి ఇప్పుడు ఆయన అదే నిబంధన కొనసాగించడం శోచనీయమని పేర్కొన్నారు. ఫోర్ వీలర్ వెహికల్ నిబంధనలను తీసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నేడు ఫీజు రియింబర్స్మెంట్కి లింకు పెట్టడం సరికాదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.కవిత, ఎస్ఎఫ్ఐ నగర ఉపాధ్యక్షులు షంషీర్ సుభాని, ఎస్ఎఫ్ఐ నాయకులు గంగాధర్, సంతోష్, రవి, అర్జున్ పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ -
‘తల్లికి వందనం’లో కోతలు వద్దు
చీరాల అర్బన్: నిబంధనల పేరుతో తల్లికి వందనానికి కోతలు వద్దని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి కోరారు. సీపీఎం జిల్లా నాయకుల శిక్షణ తరగతులు రెండో రోజు ఆదివారం కొనసాగాయి. ఆమె మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా తల్లికి వందనం నగదును అర్హులైన విద్యార్ధులందరికీ నిబంధనలు సడలించి తల్లుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారందరికీ ఈ విద్యాసంవత్సరంలో అడ్మిషన్ పొందిన వారందరికీ నగదు చెల్లించాలని కోరారు. స్కీం వర్కర్లు, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలన్నారు. గత ప్రభుత్వం విధించిన షరతులను విమర్శించిన టీడీపీ ప్రస్తుతం అంతకుమించిన షరతులను విధించిందన్నారు. రూ.15 వేలలో రూ.2వేలు మినహాయించారని చెప్పారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఏడాది పాలన సుపరిపాలన అని కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. మోదీ ప్రభుత్వం ప్రజలని భాష, ప్రాంతం పేరుతో విడుగొడుతోందని.. రాష్ట్రాలు హక్కులను హరిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే ఏడాది పాలనలో కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న చంద్రబాబు, పవన్కళ్యాణ్లు నోరు మెదపకుండా మోదీ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నూతన మెడికల్ కాలేజీలు ప్రయివేటు పరం చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు కంపెనీలకు రెడ్ కార్పెట్ పరచడమే అని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, ఎన్.బాబూరావు, సీహెచ్ మణిలాల్, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, టి.వెంకటేశ్వర్లు, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి -
22న పూర్వ విప్లవ విద్యార్థి వేదిక సదస్సు
గుంటూరు ఎడ్యుకేషన్: పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఆధ్వర్యంలో ఈనెల 22న గుంటూరు మెడికల్ కళాశాల ఎదుట ఉన్న ఎన్జీవో కల్యాణ మండపంలో సదస్సు నిర్వహించనున్నట్లు వేదిక నాయకులు నవజ్యోతి, భరద్వాజ తెలిపారు. ఆదివారం బ్రాడీపేటలో కార్యక్రమ పోస్టర్లు విడుదల చేశారు. భరద్వాజ మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో జాతి పోరాటాలు చేస్తున్న విప్లవకారులతో చర్చలు జరిపిన చరిత్ర ఉన్నప్పటికీ, ప్రస్తుతం మావోయిస్టు పార్టీతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపారు. కార్పొరేట్ శక్తులు విప్లవకారులను చంపేయాలనే అనే కండిషన్ పెట్టడంతోనే ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి ఈ హత్యాకాండ జరుపుతోందని ఆరోపించారు. ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరగాలని పౌర సమాజం నుంచి ఆకాంక్ష బలంగా వ్యక్తమతోందన్నారు. అయితే, దీన్ని ప్రభుత్వం పట్టించుకోకుండా వారిని చంపేయడమే తమ లక్ష్యమని స్పష్టంగా మాట్లాడుతోందని విమర్శించారు. ఆదివాసీ, గిరిజన ప్రజలపై జరుపుతున్న యుద్ధం గురించి, మావోయిస్టు పార్టీ నాయకులను హత్య చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండ కట్టేందుకు సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎన్జీవో కల్యాణ మండపంలో జరిగే సదస్సులో విద్యార్థి ఉద్యమం నుంచి విప్లవోద్యమంలోకి వెళ్లిన మావోయిస్టు పార్టీ నాయకులు నంబాల కేశవరావు, లక్ష్మీ వెంకట నరసింహారావు, చలం తదితర విప్లవ నాయకుల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకుడు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదివాసీల ప్రాథమిక హక్కులైన జీవించే హక్కు, తామున్న ప్రాంతంలోని భూమిపై హక్కులను కాలరాసేందుకు వేలాదిమంది పోలీసు, కేంద్ర ప్రభుత్వ దళాలతో భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తోందని విమర్శించారు. ఆలోచన పరులు, మేధావులు, ప్రజా సంఘాలు, సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. -
నీట్ ఫలితాల్లో పమిడిపాడు విద్యార్థిని ప్రతిభ
బొల్లాపల్లి: జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన పమిడిపాడు గ్రామానికి చెందిన విద్యార్థిని కొత్త భవిష్యరెడ్డి ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయి లో 1649, రాష్ట్రస్థాయిలో 940 ర్యాంకు సాధించి ప్రతిభ చాటింది. విద్యార్థిని భవిష్యరెడ్డిని పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఉన్నత చదువులు చదివి పుట్టిన ప్రాంతానికి సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రయాణికుడిని దోచుకున్న కేసులో ఇద్దరు అరెస్టు నరసరావుపేట రూరల్: ఓ ప్రయాణికుడిని ఆటోలో ఎక్కించుకొని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అతడిని బెదిరించి అతని వద్దనున్న బంగారం ఉంగరం, రెండు సెల్ఫోన్లు, నగదు దొంగిలించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్ఐ డి.అశోక్ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఈనెల 9వ తేదీ రాత్రి 11గంటల సమయంలో పుల్లబొట్ల శివప్రసాద్ పిడుగురాళ్ల వెళ్లేందుకు పల్నాడు బస్టాండ్లో ఎదురుచూస్తుండగా తాము వదిలిపెడతామంటూ బొమ్మిశెట్టి వెంకయ్య, వేముల వెంకటశివ అనే ఇద్దరు వ్యక్తులు కిరాయి మాట్లాడుకొని ఆటో ఎక్కించుకున్నారు. మార్గంలోని రావిపాడు గ్రామం దాటిన తర్వాత పాలపాడు–నల్లగార్లపాడు గ్రామాల మధ్యకు తీసుకెళ్లి అతడిని కొట్టి బెదిరించి అతని వద్దనున్న సొమ్ము కాజేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఆర్కేటీ జంక్షన్లో ఇద్దరు నిందితులను అరెస్టుచేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడిగా ‘కోడూరి’ చీరాల అర్బన్: వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా కోడూ రి ప్రసాద్రెడ్డి నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంక టేష్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. -
క్రికెట్ పోటీల విన్నర్ కావూరు ప్రిన్స్ యూత్ జట్టు
చిలకలూరిపేట టౌన్: కావూరు యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. కావూరు–అప్పాపురం మార్గంలో ఈ నెల 3న ప్రారంభమైన ఈ టోర్నీలో జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 35 జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. సెమీ ఫైనల్స్లో విజేతలైన జట్లు ఫైనల్స్లో హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో కావూరు జట్టు విజేతగా నిలవగా, ఇర్లపాడు జట్టు రన్నర్గా సత్తా చాటింది. బసికాపురం జట్టు మూడో స్థానంలోనూ, డేంజర్బోయ్స్ లోకల్ కావూరు జట్టు కన్సోలేషన్ బహుమతిని సాధించింది. విజేత కావూరు ప్రిన్స్ యూత్ జట్టుకు రూ. 20,116 నగదు బహుమతిని జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యుడు జెర్రిపోతుల బుల్లిబాబు అందజేయగా, ద్వితీయ స్థానం సాధించిన ఇర్లపాడు జట్టుకు రూ. 15,116 నగదు బహుమతిని విఘ్నేశ్వర పాలకేంద్రం వాసు ప్రదానం చేశారు. మూడో స్థానంలో నిలిచిన విజేతలకు రూ.10,116, కన్సోలేషన్కు రూ.7,116 నగదు అందించారు. మాజీ ఏపీజీ దాసరి చిట్టిబాబు మాట్లాడుతూ క్రీడా పోటీల నిర్వహణతో యువతకు శారీరక, మానసిక వికాసంతో పాటు పల్లె ప్రజల మధ్య సత్సంబంధాలు, సామాజిక ఐక్యత మరింత బలపడతాయని తెలిపారు. క్రీడా నిర్వాహకులను ఆయన ప్రశంసించారు. -
ఫీజుల నియంత్రణపై చర్యలు ఏవీ?
చిలకలూరిపేట(యడ్లపాడు): ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై కూటమి ప్రభుత్వం తక్షణమే కఠిన నియంత్రణలు విధించాలంటూ ఏపీ గిరిజనసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఫీజులపై కొంత నియంత్రణ ఉండేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నేడు పాఠశాలల యజమాన్యాలు విద్యను పూర్తి వ్యాపారంగా మార్చివేశాయని ఆరోపించారు. దీంతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమా దం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకు పోతు న్నారని తెలిపారు. అలాగే విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలను రద్దు చేయాలని ఆయన కోరారు. కూటమి ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు తప్పవంటూ హెచ్చరించారు.ఏపీ గిరిజనసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.శ్రీను నాయక్ -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
చేబ్రోలు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన సంఘటన ఆదివారం జరిగింది. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలెంలోని ముట్లూరు రోడ్డులో రేషన్ బియ్యం నిల్వ చేసి, రవాణా చేయడానికి సిద్ధమవుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఐ డి. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఆటోలో ఉన్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ధీనం చేసుకొని మస్తాన్వలిపై కేసు నమోదు చేశారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు గత కొంతకాలంగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కృష్ణమ్మ హారతులకు మరింత ప్రాచుర్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పవిత్ర కృష్ణమ్మ పంచహారతులకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. దుర్గాఘాట్లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కృష్ణమ్మ హారతులకు దుర్గగుడి ఈవో శీనానాయక్ హాజరయ్యారు. తొలుత ఆలయ అర్చకులు కృష్ణానదికి పూజా కార్యక్రమాలను నిర్వహించగా, ఈవో పసుపు, కుంకుమను సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి కూర్చుని పంచహారతులను వీక్షించారు. సాయం సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే పంచహారతులకు మరింత మంది భక్తులు విచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్లో జూమ్ కౌన్సెలింగ్
గుంటూరు మెడికల్: హెల్త్ డిపార్ట్మెంట్కు చెందిన వైద్యులు, వైద్య సిబ్బందికి జూన్లో జరుగబోయే సాధారణ బదిలీలలో పేపర్ కౌన్సెలింగ్కు బదులు జూమ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారని ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. తమ అభ్యర్థన మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ఆదివారం రాష్ట్ర ,వైద్య ,ఆరోగ్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబుతో చర్చలు జరిపారని చెప్పారు. పేపర్ కౌన్సెలింగ్కు బదులుగా జూమ్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఆయన ఒప్పుకున్నట్లు తెలిపారు. ఇందులో స్టేషన్ సీనియారిటీ ప్రకారం అన్నీ ఖాళీలను ప్రకటించిన తరువాతే కౌన్సెలింగ్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. జనరల్ ట్రాన్స్ఫర్స్లో అభ్యర్థులు కోరుకున్న ఐదు ఖాళీలే కాకుండా ప్రదర్శించబడిన ఖాళీల్లో దేన్నైనా కోరుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వానికి తమ సమస్యను వివరించి, పరిష్కరించిన జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావుకు జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఏపీఎన్జీఓ జిల్లా నేతలు ధన్యవాదాలు తెలిపారు. -
19న అన్ని ఆర్టీసీ డిపోలలో కార్మికుల ధర్నాలు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో 10 గంటల పని దినం, మహిళలు రాత్రి షిఫ్ట్లలో పనిచేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 19న అన్ని డిపోలలో ధర్నాలు, గేట్ మీటింగ్ లు నిర్వహించాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్ఫోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. పాతగుంటూరులోని ఆదివారం ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్(ఎస్డబ్ల్యూఎఫ్) రాష్ట్ర కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశం గౌరవ అధ్యక్షులు షేక్ జిలానీ బాషా, అధ్యక్షులు సీహెచ్ సుందరయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.అయ్యప్పరెడ్డి తీర్మానాలను ప్రవేశపెట్టారు. లక్ష్మయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. దీనికి నిరసనగా రాష్ట్రంలో ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు జూన్ 19వ తేదీన అన్ని డిపోలలో గేట్ మీటింగ్లు, ధర్నాలు జరిపి నిరసన తెలియజేయాలని చెప్పారు. కండక్టర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి 1/2019 సర్కులర్ను యథాతథంగా అమలు చేయాలని, జీవో నెంబర్ 70లోని కార్మిక వ్యతిరేక అంశాలను రద్దు చేయాలని జూన్ 27న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిటీని వేయాలని, ఉద్యోగులు, కార్మికులకు రావలసిన అన్ని రకాల బకాయిలను చెల్లించాలని, పెండింగ్లో ఉన్న కరువు భత్యం, బకాయిలను ఇవ్వాలని, పీఆర్సీ ఒప్పందం జరిగే లోపు 30 శాతం ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులు వెయ్యాలని, డ్రైవర్, కండక్టర్, మెకానికల్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమస్యలపై ఆర్టీసీ యాజమాన్యం అన్ని సంఘాలతో చర్చించి, పరిష్కరించాలని కోరారు. ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 9,10 తేదీలలో తిరుపతిలో జరుగుతాయని తెలిపారు. ఆర్టీసీలోని ఎంపిక చేసిన కార్యకర్తలకు విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా మూడు సెంటర్లలో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జూలై నెలలో నిర్వహిస్తామని తెలియజేశారు. ఎస్డబ్ల్యూఎఫ్ పిలుపు 27 విజయవాడలో రాష్ట్ర సదస్సు అక్టోబర్ 9, 10 తేదీల్లో తిరుపతిలో రాష్ట్ర మహాసభలు -
కూటమి ఏడాది పాలనంతా మోసం
నగరంపాలెం: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఆదివారం సాయంత్రం ‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకావిష్కరణ నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ 12 నెలల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాల్లేవని, అభివృద్ధి జాడలేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషలిస్ట్లపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతోనే సరిపోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో పీడీఎఫ్ బియ్యాన్ని విపరీతంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. మట్టి, ఇసుక, గనులను ఇష్టానుసారంగా కూటమి నేతలు దండుకుంటున్నారని ఆరోపించారు.చంద్రబాబు హయాంలో ఇంటింటికీ మద్యం ఏరులై పారుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో బెల్ట్ షాప్లు లెక్కలేనన్ని ఉన్నాయని, స్వయానా టీడీపీ నాయకులే తమ బెల్ట్షాప్లను ప్రకటించుకుంటున్నారని తెలిపారు. బెల్ట్ షాప్లు నిర్వహిస్తే బెల్టు తీస్తామని చంద్రబాబు అంటున్నారని, ఆయన బెల్ట్ తీయరని, బెల్ట్షాప్లు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించామని గుర్తు చేశారు. ఏడాది చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 16న జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. పుస్తకావిష్కరణలో పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరిఫాతిమా (గుంటూరు తూర్పు), దొంతిరెడ్డి వేమారెడ్డి (మంగళగిరి), బాలవజ్రబాబు (తాడికొండ), పార్టీ నాయకులు నందేటి రాజేష్, వెంకటప్పారెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘జగన్ అంటే నమ్మకం– చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ -
వైభవంగా పునీత ఆంథోని పుణ్యక్షేత్ర వార్షికోత్సవం
నెహ్రూనగర్: నగరంపాలెంలోని పునీత ఆంథోని పుణ్యక్షేత్ర 35వ వార్షికోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా గుంటూరు మేత్రాసన పీఠాధిపతి బిషప్ డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యయ్య, నెల్లూరు పీఠాధిపతి బిషప్ రెవరెండ్ పిల్లి ఆంథోని దాస్, గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతి బిషప్ రెవరెండ్ డాక్టర్ గాలి బాలి హాజరయ్యారు. ముందుగా పుణ్యక్షేత్ర ఆవరణ నుంచి గుర్రపు బగ్గీపై ఇద్దరు పీఠాధిపతులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఆనంతరం దివ్యబలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యయ్య మాట్లాడుతూ పునీత ఆంథోని పుణ్యక్షేత్ర వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి కథోలిక విశ్వాసులు తరలివచ్చి పునీత ఆంథోని అద్భుతాలు పొందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్ర విచారణ గురువు కొచ్చెర్ల జ్యోతిరాజు, సహాయ గురువు ఎన్. రాజేష్, ఫాదర్లు దాసరి కిరణ్, పి. బాలస్వామి, రేపూడి రాయప్ప, రాజారెడ్డి, సుందరరావు, బాలస్వామి, కమిటీ సభ్యులు ఎన్.జె. ప్రకాశరావు, జొన్నలగడ్డ సుధీర్బాబు, వై. సుదర్శన్, దేవస్వామి, శాంతయ్య పాల్గొన్నారు. -
డయేరియా నివారణపై అవగాహన కల్పించండి
తెనాలి టౌన్: ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు వచ్చే డయోరియాపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, నివారణ పద్ధతులు తెలియజేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఆదివారం ఆయన తెనాలి కార్యాలయంలో డయేరియా నివారణ అవగాహన పోస్టర్ విడుదల చేశారు. జూన్ 16 నుంచి జులై 31వ తేదీ వరకు ఆరోగ్య సిబ్బంది ఇంటింటా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులకు ఓఆర్ఎస్, జింక్ ట్యాబ్లెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సమగ్రంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య మౌళిక సదుపాయాల సంస్థల చిల్లపల్లి శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ అమర్తలూరు శ్రావణ్బాబు, తెనాలి డెప్యూటీ డీఎం అండ్ హెచ్వో డాక్టర్ ఈ.అన్నపూర్ణ, డాక్టర్ వేముల ప్రియాంక, అందె బాలచంద్రమౌళి, వి.సీతారామశాస్త్రి, 104 జిల్లా మేనేజర్ ఎం.రాఘవకుమార్ పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
బీసీల హక్కుల సాధనకు అలుపెరగని పోరు
తెనాలి: బలహీనవర్గాలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు, కులగణన కోసం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రజాక్షేత్రంలో చేస్తున్న పోరాటాలు అభినందనీయమని, ఆయనకు ప్రభుత్వం తరఫున సహకారం ఉంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచారశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కులగణనకు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ అందుకోసం సుదీర్ఘకాలంగా రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఉద్యమించిన కేసన శంకరరావు అభినందన సభను ఆదివారం తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఆహ్వాన కమిటీ తరపున జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ బలహీన వర్గాల నుంచి వచ్చిన ఐఏఎస్ఎ, ఐపీఎస్, రాజకీయనేతలు తమ మూలాలను మరిచిపోతున్నారనీ, వారు కూడా వ్యవస్థలోనే కలిసిపోతున్నారని అభిప్రాయపడ్డారు. అలాంటప్పుడు రిజర్వేషన్లతో ఎలా ఎదుగుతారనేది సందేహమేనన్నారు. సంక్షేమం, రిజర్వేషన్లు కొంతమేరకు తోడ్పడతాయని చెబుతూ సమాజంలో ఆర్థిక అసమానతలు పూర్తిగా తొలగిపోతాయని భావించలేమని తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ బీసీ నాయకత్వానికి సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. బీసీలకు సంక్షేమం, పదవుల విషయంలో చిత్తశుద్ధితో కృషిచేస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార, ప్రజాసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జనాభాలో 75 శాతంగా ఉన్న దళితులు, బీసీలు పారిశ్రామిక, వ్యాపార, ఉన్నతస్థాయిలోకి రాలేకపోవడంపై చర్చ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బీసీలను సంఘటితపరుస్తూ వారి సమస్యల పరిష్కారానికి హక్కుల సాధనకు జీవితాన్ని అంకితం చేసిన కేసన శంకరరావుకు తగిన గుర్తింపు లభించాల్సి ఉందని, అందుకు తామంతా తోడ్పడతామని హామీనిచ్చారు. వేదాంతం ఫణీంద్ర స్వాగతం పలికిన సభలో తొలుత శంకరరావుపై తీసుకొచ్చిన అభినంద సంచికను మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం శంకరరావును ఘనంగా సత్కరించారు. అఖిల భారత ఓబీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి, చిల్లపల్లి శ్రీనివాసరావు, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, విన్నకోట వెంకటేశ్వర్లు, గోనుగుంట్ల బ్రహ్మానందశర్మతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్నుంచి హాజరైన బీసీ సంక్షేమ ంఘం, బీసీ సంఘాల నేతలు, అనుమోలు ఏడుకొండలు, శివరాం బాలాజీ, కోలా అశోక్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమాన్ని ఆహ్వాన కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అభినందన సభలో కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రులు మనోహర్, పార్థసారథి, సత్యకుమార్యాదవ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు కృషికి సహకారం అందిస్తాం -
కూటమి టెండర్
బాపట్లఘనంగా తిరునాళ్ల మహోత్సవం నగరం: మండలంలోని ఈదుపల్లి గ్రామదేవత ఈదులమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఆదివారం ౖనిర్వహించారు. గ్రామోత్సవం అనంతరం అమ్మవారిని ఆలయంలో పునఃప్రవేశపెట్టారు. బగళాముఖికి విశేష పూజలు చందోలు(కర్లపాలెం): చందోలులోని బగళాముఖి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ చేసి పసుపు, కుంకుమలు సమర్పించారు. ఆకట్టుకున్న కోలాట ప్రదర్శన నాదెండ్ల: గణపవరం కోదండరామాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి జరిగిన కోలాటం ఆకట్టుకుంది. మాస్టర్ వెంకటరెడ్డిని సత్కరించారు. సోమవారం శ్రీ 16 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల టెండరింగ్ ప్రక్రియలో కూటమి నేతలు హవా కొనసాగిస్తున్నారు. ఎవరు పడితే వారు పాల్గొనడానికి వీల్లేదు. ఒక వేళ ఎవరైనా టెండర్ ప్రక్రియలో పాల్గొని దక్కించుకుంటే దాన్ని ఓపెన్ కానివ్వకుండా చేస్తామని బాహాటంగానే బెదిరిస్తున్నారు. మూడు రోజుల నుంచి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశాల మీద సమావేశాలు ఏర్పాటు చేసి, వర్కులు పంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. పంచుకో...దోచుకో ! ఈ నెల 18వ తేదీ నుంచి 269 వర్కులకు టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సాధారణంగా దేశవ్యాప్తంగా ఎక్కడైనుంచైనా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. నగరపాలక సంస్థ కేటాయించిన ఒక వర్కుకి రూ.50లక్షలతో టెండర్ కాల్ ఫర్ చేస్తే కాంట్రాక్టర్లు 10 నుంచి 12శాతం లెస్కు పాడుకుని దక్కించుకుంటుంటారు. దీని ద్వారా కార్పొరేషన్కు ఆదాయం సమకూరుతుంది. అయితే, దీన్ని కూటమి నేతలు అడ్టుకున్నారు. తమ పార్టీ నాయకులే చేయాలని మూడు రోజుల నుంచి కిందట జరిగిన కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకుల సమావేశంలో తీర్మానించారు. పది వార్డుల్లో పూర్తిగా తామే చేస్తామని, మిగిలిన 47 వార్డుల్లో 20 శాతం కూడా తామే చేస్తామని, మిగిలిన 80 శాతం వర్కులను పంచిపెడతాం అంటూ అధికార పార్టీ నేత హుకుం జారీ చేశారు. అప్పటి వరకు ఈ– ప్రొక్యూర్మెంట్ కీ(టెండర్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి కాంట్రాక్టర్కు ఒక కీ ఉంటుంది..దాని సాయంతో టెండర్లో పాల్గొంటారు) ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశాడు. దీన్ని కొంతమంది కాంట్రాక్టర్లు వ్యతిరేకించారు. దీంతో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు. ఒక వేళ టెండర్లో పాల్గొన్నప్పటికీ ఓపెన్ కానివ్వకుండా చేస్తాం.. వర్క్ అయిన తరువాత బిల్లు ప్రాసెస్ కాకుండా చేస్తామంటూ అడ్డు చెప్పారు. తమకు మేయర్ అండదండలు ఉన్నాయంటూ బహిరంగంగా చెప్పడంతో కొంత మంది కాంట్రాక్టర్లు వారి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ వర్సెస్ జనసేన మేయర్ అండదండలున్న కాంట్రాక్టర్లు పెట్టిన ప్రతిపాదనలను కొంత మంది జనసేన పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు వ్యతిరేకించినట్లు సమాచారం. ‘మీకు ఎంత ప్రాధాన్యత ఉందో మాకు అంతే ఉందని’ జనసేన పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్ నిలదీస్తే టీడీపీ నేతలు ఇచ్చేది లేదని తెగేసి చెప్పినట్లు తెలిసింది. లాభాలు వచ్చే కాంట్రాక్టులు తెలుగుదేశం వారే ఉంచుకుని తక్కువ లాభాలు వచ్చేవి తమకు షేరింగ్ ఇస్తారా అంటూ జనసేన నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కే విధంగా జరుగుతున్న ఈ టెండర్ ప్రక్రియను మెజారిటీ కాంట్రాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. అయితే, దీనిపై మున్సిపల్ కమిషనర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగుతారా? లేకపోతే నిబంధనలకు కట్టుబడి కార్పొరేషన్ ఆదాయాన్ని పరిరక్షిస్తారో చూడాల్సి ఉంది. అధికారులపై ఒత్తిడి 7న్యూస్రీల్కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల టెండరింగ్ ప్రక్రియలో పచ్చ నేతలు పెత్తనం కొనసాగిస్తున్నారు. చివరకు నగరంలో జరిగే చిన్న పనులను కూడా వారే చేస్తున్నారు. బయట వారు వస్తే అవరోధాలు సృష్టిస్తున్నారు. అసలు టెండర్లను తెరవకుండా కుయుక్తులు పన్నుతున్నారు. ఇంజినీరింగ్ అధికారులు కూడా గంగిరెద్దుల్లా తలలూపుతూ ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నగరపాలక సంస్థ టెండర్లలో అధికార పార్టీ నాయకుల హవా ఈనెల 18 నుంచి 269 వర్కులకు టెండర్లు పిలవనున్న కార్పొరేషన్ ఇప్పటికే వర్కులను పంచుకున్న బడా కాంట్రాక్టర్లు వ్యతిరేకిస్తున్న చోటా కాంట్రాక్టర్లు మేయర్ పేరు చెప్పి బెదిరింపులు గత నెల ఎనిమిదో తేదీన వందల వర్కులకు టెండర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే, కూటమి నేతలు కాకుండా వేరే వారు ఉన్నారని, ఎలాగైనా ఆపాలని టీడీపీ ప్రజాప్రతినిధులు డ్రాయింగ్ బ్రాంచ్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. టెండర్ కాల్ ఫర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఓపెన్ చేయాలనే నిబంధన ఉంది. ఈ మేరకు డ్రాయింగ్ బ్రాంచ్లో పనిచేసే అధికారి 20 రోజుల తరువాత టెండర్ ఓపెన్ చేశారు. దీనిని వ్యతిరేకించిన కొంత మంది బడా కాంట్రాక్టర్లు, అధికారులను అడ్డంపెట్టుకుని టెండర్లన్నింటిని రద్దు చేయించారు. జీఎస్టీ క్లియరెన్స్ లేకుండా ఏ విధంగా ఓపెన్ చేశావంటూ ఆయన్ను మాతృశాఖకు సరెండర్ చేయించారు. ఇందులోనే టీటీడీ వార్డు అధ్యక్షుడు రెండు వర్కులు వేస్తే, వాటిని కూడా రద్దు చేయించడంపై ఆయన కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున ఆరు గంటల నుంచే అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతూ కనిపించాయి. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఘాట్రోడ్డు, మహామండపం లిప్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతూ ఉండటంతో ఉదయం 10గంటల నుంచే అంతరాలయ దర్శనం నిలిపివేయాలని ఆలయ ఈవో శీనానాయక్ సిబ్బందిని ఆదేశించారు. అంతరాలయ దర్శనం నిలిపివేయడంతో భక్తులు రూ.300 టికెట్లు కొనుగోలు చేసి బంగారు వాకిలి దర్శనం చేసుకున్నారు. రద్దీ అధికంగా ఉండటంతో రూ.300తోపాటు రూ.100 టికెటు కొనుగోలు చేసిన భక్తులకు మూడు క్యూలైన్ల ద్వారా త్వరతిగతిన అమ్మవారి దర్శనం అయ్యేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈవో తనిఖీలు భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ ఈవో శీనానాయక్, ఈఈ కోటేశ్వరరావు ఘాట్రోడ్డులోని చెప్పుల స్టాండ్, క్లోక్రూమ్, దేవస్థాన బస్సులను తనిఖీ చేశారు. చెప్పుల స్టాండ్, సెల్ఫోన్ కౌంటర్ వద్ద భక్తులు గుంపులు గుంపులుగా నిల్చోవడంతో సెక్యూరిటీ సిబ్బందిని నియమించి క్యూలైన్లను క్రమబద్ధీకరించారు. ఘాట్రోడ్డులో దేవస్థానం ఏర్పాటు చేసిన ఈ టాయిలెట్స్కు తాళాలు వేసి ఉండటంతో ఈవో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ టోల్గేట్ వద్దకు చేరుకుని కొండపైకి వచ్చే వాహనాలను పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులందరికీ ఉచిత ప్రసాదాలతోపాటు అన్న ప్రసాదం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం రద్దీ కొనసాగింది. రాత్రి 9గంటల వరకు భక్తులు పెద్దఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయ దర్శనం రద్దు -
మోదీ ప్రభుత్వానికి ‘ప్రైవేటు’ పిచ్చి పట్టింది
లక్ష్మీపురం: మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రైవేటీకరణ పిచ్చి పట్టిందని, అందుకు రాష్ట్రంలో చంద్రబాబు వంతపాడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.నర్సింగరావు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో రెండు రోజుల పాటు జరిగిన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ముగింపు సభలో నర్సింగరావు మాట్లాడుతూ దేశంలో విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ప్రైవేటీకరణ అన్నారు. రూ.80 లక్షల కోట్ల విలువైన విద్యుత్ రంగం ఆస్తులను అంబానీ, అదానీకి అప్పగించటానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. కేంద్రం ఒత్తిడితో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థల ద్వారా అధిక ధరలకు విద్యుత్ కొంటూ, ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కును కూడా ప్రైవేటీకరించాలని ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. విమానయానం ప్రైవేటీకరణ వల్లే ఇటీవల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రైవేటీకరణ, కార్మిక చట్టాల నిర్వీర్యం తదితర విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జులై 9న జరిగే కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కోశాధికారి ఎస్.రాజేంద్రన్ మాట్లాడుతూ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ప్రమాదంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా అడ్డుకోవాలని నేతలకు సూచించారు. దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని, జేఎల్ఎం గ్రేడ్–2లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 22న నెల్లూరులో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న మూడు డీఏలు విడుదల చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ ఎరియర్లు ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని, ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ ఆప్షన్లు తిరస్కరించిన ఉద్యోగులందరికీ పెన్సన్ రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని మహాసభ తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. క్యూబా సంఘీభావ నిధికి మహాసభ ప్రతినిధులు రూ.12610 అందించారు. నూతన కమిటీ నియామకం యూనియన్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా డి.సూరిబాబు, పి.సుదర్శన్రెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. ట్రెజరర్గా ఎల్.రాజు, ఉపాధ్యక్షులుగా సీహెచ్.నాగబ్రహ్మాచారి, వి.సత్యనారాయణ, జి.వి.శివప్రసాద్, పి.ప్రసాద్, ఆర్.సత్యారావు, జాయింట్ సెక్రెటరీలుగా జాకీర్ హుస్సేన్, డి.వెంకటేశ్వరరావు, జె.శ్రీనివాసరావు, సీహెచ్.వీరాంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా కె.కిరణ్కుమార్, నాయబ్ రసూలు, పి.శివప్రసాద్రెడ్డి, కె.హజరత్తయ్య, మహిళా ప్రతినిధిగా వి.క్రాంతి సహా మొత్తం 39 మందితో నూతన కమిటీ ఎన్నికై ంది. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు -
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి
చీరాల అర్బన్: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య అన్నారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సీపీఎం బాపట్ల జిల్లా నాయకులకు రెండు రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించారు. మొదటి రోజు వర్తమాన రాజకీయ పరిణామాలుపై మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ప్రారంభమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా సుపరిపాలన అందించినట్లు చెప్పుకుంటుందని, ప్రజలు అటువంటి సంతృప్తి వ్యక్తం చేయడం లేదన్నారు. తల్లికి వందనానికి అనేక నిబంధనలు పెట్టి కోతలు పెట్టారన్నారు. పిల్లల చదువులకు ఇచ్చే డబ్బుల్లో కోత వేయడం సరికాదన్నారు. అర్హులైన అందరికీ తల్లికి వందనం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారన్నారు. రాష్ట్రానికి వనరులు రాబట్టుకోవడం, విభజన హామీలు అమలుపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రజలు భావించారన్నారు. ఆచరణలో మాత్రం ఆ ప్రయత్నం జరగలేదన్నారు. సూపర్ సిక్స్ వంటి పథకాలు ఇంటింటికీ అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తోందని తెలిపారు. జిల్లాలో రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యలపై జిల్లాలో సీపీఎం పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టి.కృష్ణమోహన్, ఎన్.బాబూరావు, మణిలాల్, జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, వి.వెంకటరామయ్య, ఎం.ఆంజనేయులు, తిరుమల, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య -
ఉరి వేసుకుని మహిళ మృతి
వేటపాలెం: ఇంట్లో ఉరి వేసుకొని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రామన్నపేట పంచాయతీ బాపయ్యనగర్లో చోటు చేసుకుంది. డొక్కా శ్రావణి (40) అనే మహిళ ఆరు నెలలుగా అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటోంది. ఇంటి ఓనర్ అద్దె అడగడానికి శనివారం వెళ్లి చూడగా.. ఉరి వేసుకొని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ జనార్దన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరికి గాయాలు నాదెండ్ల: మద్యం తాగిన ఇరువురు యువకులు ఘర్షణకు దిగటంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గణపవరం గ్రామంలో నివాసం ఉండే ఇరువురు ఒడిశా యువకులు స్థానిక స్పిన్నింగ్ మిల్లులో రోజువారీ కూలీ పనులకు వెళ్తుంటారు. శనివారం ఉదయం వారు షాపులో మద్యం తాగారు. మాటామాటా పెరగటంతో ఘర్షణకు దిగారు. వారిలో ఒకరు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. -
చైన్ స్నాచింగ్ కేసుల్లో పాత నేరస్తుడి అరెస్టు
నగరంపాలెం: ఒంటరిగా వెళ్లే వృద్ధ మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లే పాత నేరస్తుడ్ని గుంటూరు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. అతని నుంచి రూ.30 లక్షలు ఖరీదైన 300 గ్రాముల నగలు, బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలుల్లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి గత నెల 28 వరకు జిల్లాలో వరుస బంగారు గొలుసు చోరీలు జరిగాయని తెలిపారు. దీంతో సీసీఎస్ సీఐలు అనురాధ, అల్తాఫ్ హుస్సేన్, బి.శ్రీనివాస్తో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశామన్నారు. గత ఆరు నెలలుగా సుమారు 700 నిఘా కెమెరాలను నిశితంగా పరిశీలించామని చెప్పారు. సాంకేతిక ఆధారాలతో ఆనందపేట ఒకటో వీధిలో ఉంటున్న నలభై ఏళ్ల షేక్ అమీర్బేగ్ అలియాస్ జోహారీని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పేర్కొ న్నారు. గతంలో జరిగిన ఎనిమిది బంగారు గొలుసు దొంగతనాలకు ఇతడే పాల్పడినట్లు విచారణలో గుర్తించామని వివరించారు. అమీర్ బేగ్ను అరెస్ట్ చేసి బంగారు నగలు, మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మరో రెండు బైక్లను గుర్తించాలని చెప్పా రు. కేసులను త్వరితగతిన ఛేదించిన ఏఎస్పీ క్రైం సుప్రజ, డీఎస్పీ శివాజీరాజు, సీఐలు, సిబ్బందిని జిల్లాఎస్పీ అభినందించి, రివార్డులు అందించారు. 15 రోజులకు ఒకసారి చోరీ పెయింటర్గా పనిచేసే అమీర్ బేగ్ ఒంటరి మహిళల మెడల్లో బంగారు గొలుసులు తెంచుకెళ్లడంలో మంచి నేర్పరి. 2006లో మూడు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నుంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నాడు. 2014లో పాత గుంటూరు పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. అతనిపై 2016లో పాత గుంటూరు పీఎస్లో సస్పెక్ట్ షీట్ ఉంది. అప్పటికే సుమారు 22 కేసులు నమోదవ్వగా, ఇటీవల చేసిన ఎనిమిది కేసులతో 30 వరకు నమోదయ్యాయి. పదిహేను రోజులకు ఒకసారి రెక్కీ చేసేవాడని, అది కూడా గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చేసేవాడని పోలీసుల విచారణలో తేలిందని ఎస్పీ వివరించారు. బాపట్ల జిల్లా వెళ్లి అక్కడ తాళం అరిగిపోయిన బైక్లను దొంగలించి, ఇక్కడికి వచ్చేవాడని చెప్పారు. చోరీలు చేసిన తర్వాత ఎక్కడపడితే అక్కడే వాటిని వదిలేసి వెళ్లేవాడని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ (క్రైం) కె.సుప్రజ, సీసీఎస్ డీఎస్పీ శివాజీరాజు, సీఐలు జె.అనురాధ, ఎండీ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్, బి.శ్రీనివాసరావు, పట్టాభిపురం పీఎస్ సీఐ జి.వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ సరస్వతి, సిబ్బంది పాల్గొన్నారు. రూ.30 లక్షలు విలువైన బంగారు నగలు స్వాధీనం -
సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ నరసింహారెడ్డికి అవార్డు ప్రదానం
లక్ష్మీపురం: తలాసీమియా రోగుల కోసం 2023, 2024 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లోని 50కి పైగా కేంద్రాల్లో భారీ రక్తదాన శిబిరాలు నిర్వహించిన సెంట్రల్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డికి భారత రెడ్ క్రాస్ సొసైటీ ప్రతిష్టాత్మకమైన ‘కార్ల్ లాండ్స్టీనర్ ’అవార్డు అందజేసింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం గుంటూరు నగరంపాలెం లోని భారతీయ విద్యాభవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నరసింహారెడ్డి నాయకత్వ నైపుణ్యం, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. రక్తదాన కార్యక్రమాల్లో ఇతరులకు స్ఫూర్తి నింపేలా ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. అవార్డు గ్రహీత నరసింహారెడ్డి మాట్లాడుతూ తమ సిబ్బంది ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా నెలకొల్పిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాల్లో 2023లో 1,440 యూనిట్లు, 2024లో 4100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. ఈ కృషికి గానూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తనకు గుర్తింపు కల్పించాయని తెలిపారు. ఇప్పుడు ఈ అవార్డు అందుకోవడం ద్వారా రక్తదాన సేకరణలో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యదర్శి ఎ.కె.పరీద మాట్లాడుతూ రక్తదాన శిబిరాల ఏర్పాటు, సామాజిక సేవల్లో నరసింహారెడ్డి అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు, జీఎస్టీ అధికారులు నాగరాజు, రవికుమార్, ఈశ్వరరావు, గాదె శ్రీనివాసరెడ్డి, పూర్ణ సాయి, శాఖమూరి శ్రీనివాస్, బిల్లా ప్రశాంత్ కుమార్ పాల్గొన్నారు. -
యోగాతో ఆరోగ్యం, ఆనందం
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): యోగాసనాల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆరోగ్యంగా ఉండొచ్చని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. యోగాంధ్ర అవగాహన కార్యక్రమాలలో భాగంగా శనివారం పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన యోగాసనాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట మురళి ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు చేశారు. కేర్ న్యాచురోపతి వైద్య కళాశాల విద్యార్థులు నిర్వహించిన యోగాసనాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పిట్టలవానిపాలెంలో అవగాహన ర్యాలీ నిర్వహించి సెంటర్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని చెప్పారు. వికసిత్ భారత్ దిశగా కేంద్రం, స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముదుకు వెళుతున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నదని వాటి ఫలాలను ప్రజలు అందుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం యోగాతోనే సాధ్యమవుతుందని యోగాసనాల వలన కలిగే ప్రయోజనాలను ప్రజలు గుర్తించాలని కలెక్టర్ చెప్పారు. సూర్యలంకలో 10వేల మందితో యోగాంధ్ర ఈనెల 21న విశాఖపట్నంలో చరిత్రలోనే ఎన్నడూ లేనంత భారీ స్ధాయిలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని ప్రధానమంత్రి హాజరవనున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో సూర్యలంక తీరంలో 10వేల మందితో జరిగే యోగాలో ప్రజలంతా పాల్గొని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ, డ్వామా పీడీ జయలక్ష్మి, మాతా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, పశు సంవర్థ శాఖ అధికారి వేణుగోపాల్రావు, ఎకై ్సజ్శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వవెంకటేశ్వరరావు, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఎలీషాబాబు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి పిట్టలవానిపాలెంలో జిల్లా స్థాయి ‘యోగాంధ్ర’ -
అలరించిన వైద్యురాలి కూచిపూడి నృత్యం
నగరంపాలెం: స్థానిక జిల్లా కోర్టు రోడ్డులోని గుంటూరు వైద్యకళాశాల (జీఎంసీ) ఆవరణలోని జింఖానా ఆడిటోరియంలో శనివారం వైద్యురాలు కంభంపాటి అపర్ణ కూచిపూడి నాట్య ఆరంగేట్రం చేశారు. వేదాంతం కళాక్షేత్రం (యూఎస్ఏ) వ్యవస్థాపకులు వేదాంతం రాఘవ, బ్రహ్మశ్రీ కుప్పా విశ్వనాథశర్మ, బ్రహ్మశ్రీ ముప్పవరపు సింహాచలశాస్త్రి, వైద్యులు హనుమంతురావు, కంభంపాటి మహాదేవ, వరలక్ష్మి దంపతుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వేదాంతం రాఘవ శిష్యురాలైన డాక్టర్ అపర్ణ కూచిపూడి రంగప్రవేశం చేశారు. సంప్రదాయ ప్రార్థనతో మొదలై, పలు కూచిపూడి నృత్యాలకు ఆమె నాట్యం చేశారు. అమెరికాలో ఉంటున్న అపర్ణ దేశ సంస్కృతిని పరిరక్షిస్తూ, తొమ్మిదో ఏటనే నాట్యం నేర్చుకోవడం ప్రారంభించిందని వక్తలు పేర్కొన్నారు. ఒకవైపు వైద్య వృత్తిని అభ్యసిస్తూ, నాట్యంపై అభిలాష పెంపొందించుకోవడం అభినందనీయమని తెలిపారు. విద్యలో రాణిస్తూ, కూచిపూడిలో ప్రతిభ చూపడం గొప్ప విషయమని కొనియాడారు. -
డేటా సమీకరణలో ఆన్టాలజీల పాత్ర కీలకం
చేబ్రోలు: వివిధ వనరుల నుంచి వచ్చిన డేటాను ఒకే ఫార్మాట్లో సమీకరించడానికి ఆన్టాలజీలు ఉపయోగపడతాయని మద్రాస్ ఐఐటీ సీఎస్ఈ ప్రొఫెసర్ పి.శ్రీనివాసకుమార్ అన్నారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘సెకండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నెట్వర్క్స్ అండ్ సాఫ్ట్ కంప్యూటింగ్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్ను శనివారం ముగిసింది. ప్రొఫెసర్ శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ఏఐ సిస్టమ్లు ఒక నిర్దిష్ట పరిసరాన్ని అర్థం చేసుకోవడం, నిర్ణయం తీసుకోవడం లేదా సహాయపడే విధంగా రూపొందించడంలో ఆన్టాలజీలు కీలకపాత్ర పోషిస్తాయని వివరించారు. భాషను అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా తర్జుమా, ప్రశ్నల సమాధానాలు, చాట్బాట్ల అభివృద్ధిలో ఉపయోగపడతాయని తెలిపారు. వాతావరణం, ట్రాఫిక్, విద్యుత్ వినియోగం వంటి డేటాను తెలివిగా ప్రాసెస్ చేయడంలో కూడా వినియోగిస్తారని చెప్పారు. జైపూర్లోని ఎంఎన్ఐటీ– సీఎస్ఈ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ రమేష్బాబు బత్తుల మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవస్థలు బ్యాంకింగ్లో వినియోగదారుల ప్రవర్తనలను విశ్లేషించి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించగలవని తెలిపారు. పౌరుల భద్రతను పెంచేలా సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మానిటరింగ్, ఎమర్జెన్సీ సేవలను మరింత సమర్థంగా నడిపించడంలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఎన్ఐటీ– సిల్చార్ అసోసియేట్ ప్రొఫెసర్ కె.సుగన్య దేవి, ఎన్ఐటీ వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ యూ.ఎస్.ఎన్. రాజు, మెక్రోసాఫ్ట్ సీనియర్ సాఫ్టేవేర్ ఇంజినీర్ ఆదిత్య సాలాది, డీన్లు పాల్గొన్నారు. మద్రాస్ ఐఐటీ సీఎస్ఈ ప్రొఫెసర్ శ్రీనివాసకుమార్ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
యడ్లపాడు: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. హైవే పరిరక్షణ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... బాపట్ల జిల్లా వలపర్ల గ్రామస్తులు మొహమ్మద్, హసీరా దంపతులు, వారి ఇద్దరు పిల్లలు నహీరా, నసీర్లతో బైక్పై శనివారం గుంటూరు వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా, యడ్లపాడు సమీపంలోని నక్కవాగు వద్ద గుర్తుతెలియని వాహనం వీరి బైక్ను ఢీకొంది. వాహనం అదుపు తప్పి కిందపడగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. గాయపడిన వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డివైడర్ను ఢీకొన్న బైక్... నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ బాషా బైక్పై గుంటూరు వైపు ప్రయాణమయ్యాడు. మద్యం సేవించి ఆపై వేగంలో ఉన్నందున వాహనం అదుపుతప్పి యడ్లపాడు ఎన్ఎస్ఎల్ టెక్స్టైల్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టాడు. ప్రమాదంలో వాహనంతోపాటు బాషా రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హైవే అంబులెన్స్ సిబ్బంది బాధితుడిని గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్
బాపట్లటౌన్: రెప్పపాటులోనే ద్విచక్రవాహనాలను మాయం చేసే ఘరానా దొంగలను బాపట్ల పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సాయంత్రం పట్టణ పోలీస్స్టేషన్లో వివరాలను అడిషనల్ ఎస్పీ రామాంజనేయులు వెల్లడించారు. బాపట్ల పట్టణం ఉప్పరపాలేనికి చెందిన రాజు నాగార్జునరెడ్డి, శారదాపురి కాలనీకి చెందిన ఉన్నాం వంశీ, మల్లావుల ధర్మతేజ, షేక్ చందు, జాలాది జాన్, మరో మైనర్ బాలుడు కలసి బాపట్ల పట్టణంతోపాటు, చీరాల రూరల్, చీరాల టూ టౌన్, వెదుళ్లపల్లి, బాపట్ల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆరు ద్విచక్ర వాహనాలను, మోటర్, రెండు సవర్ల బంగారం గొలుసును దొంగతనం చేశారు. బాపట్ల పట్టణంలోని జగనన్న కాలనీకి చెందిన పాలతోటి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పట్టణంలోని గుంటూరు ఫ్లైఓవర్ వద్ద గల చిల్లర గొల్లపాలెం సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా తమ సిబ్బంది ఆరుగురులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. పై తెలిపిన దొంగతనాలన్నీ తామే చేశామని అంగీకరించారు. ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు రెండు సవర్ల బంగారపు గొలుసు, మోటర్ను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరిచి జైలుకు పంపిస్తామని తెలిపారు. కేసు ఛేదనలో ఎంతో కీలకంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేసిన బాపట్ల పట్టణ సీఐ రాంబాబు, ఎస్ఐ విజయ్కుమార్, ఎస్సై చంద్రావతి, సిబ్బంది ప్రభాకరరావు, మనోజ్, శ్రీనివాసరావు, పోతురాజు, కృష్ణకిషోర్లను జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ప్రత్యేకంగా అభినందించారు. రైతుల పాలిటి ‘పగా’కు ప్రత్తిపాడు: బ్లాక్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతుల పరిస్థితి దైన్యంగా ఉంది. తినీ, తినక ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. అటు ఉన్న ధరకు తెగనమ్ముకోలేక.. ఇటు నిల్వ చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చే సమయంలో ధర అమాంతంగా పడిపోయింది. కొనేందుకు కంపెనీలు ముందుకు రావడం లేదు. పొగాకును ఏమి చేసుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు. పంటను ఇంటికి తరలించలేక, ఎక్కడా నిల్వ చేయలేక ఇదిగో పొలాల్లోనే కట్టలు కట్టి, వానలకు తడవకుండా పొలాల్లోనే పట్టాలు కట్టి భద్రపరుచుకున్నారు. నల్లబర్లీకి ధర కాస్తంత పలకకపోతుందా..? ప్రభుత్వం అయినా స్పందించి కొనుగోలు చేయదా? అనే ఆశతో కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. 1,38,874 క్వింటాళ్ల నిల్వ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, పెదనందిపాడు, వట్టిచెరుకూరు, కాకుమాను, గుంటూరు రూరల్ మండలాల్లో 3,406 మంది రైతులు 11,704 ఎకరాల్లో నల్ల బర్లీ సాగు చేశారు. 1,38,874 క్వింటాళ్ల నిల్వలున్నాయి. -
చేనేత రంగాన్ని విస్మరించిన ప్రభుత్వం
దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర చీరాల: చేనేత రంగాన్ని ప్రభుత్వం విస్మరించిందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర అన్నారు. శనివారం మండలంలోని దేవాంగపురిలోని శ్రీ చౌడేశ్వరి కల్యాణ మండపంలో బీరక సురేంద్ర ఆధ్వర్యంలో చేనేత రంగంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చేనేత వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కావాల్సిన సలహాలు, సూచనలు అందించాలన్నారు. చేనేత రంగ నాయకులు అందించిన సూచనలు, సలహాలతో ఒక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వ అధికారులకు అందించి తద్వారా చేనేత రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చేనేత నాయకులు మాచర్ల మోహనరావు మాట్లాడుతూ చేనేత సమస్యల పరిష్కారం కావాలంటే చేనేత కార్మికులు సమస్యలపై గళం వినిపించాలన్నారు. గళం వినిపించకుంటే ఏ ప్రభుత్వం కూడా ఆ వర్గాలను పట్టించుకోదన్నారు. గ్రామగ్రామాన చేనేతలు చైతన్యం కావాలన్నారు. పెద్దఎత్తున చేనేతలు కార్యక్రమాలు చేసినప్పుడే ప్రభుత్వాలే మన దగ్గరకు వస్తాయని తెలిపారు. సమావేశంలో చేనేత వృత్తి పరిరక్షణకు నూలు, సిల్క్ ధరల పెరుగుదల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం త్రిఫ్ట్, హెల్త్ ఇన్సూరెన్స్, చేనేత కార్మికుల రుణాలు, ఐఏవై గృహ నిర్మాణం పథకాలు అమలు చేయాలన్నారు. నేతన్న నేస్తం పథకం అమలు కావాలన్నారు. చేనేత సహకార సంఘాల పాలకమండలి పునరుద్ధరణ లేక ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. చేనేత రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని, ఉచిత విద్యుత్ వెంటనే అమలు చేయాలన్నారు. చేనేత కులాల కార్పొరేషన్లు, పాలకమండలి నియమించాలన్నారు. సమావేశంలో రాష్ట్ర చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు దేవన వీర నాగేశ్వరరావు, చేనేత నాయకులు దామర్ల శ్రీకృష్ణ, చుండూరి వాసు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, మునగాల వెంకటేశ్వర్లు, బండ్ల వెంకటేశ్వరరావు, జి.రవిబాబు, కనగాల సూర్యనారాయణ, కందుల సురేష్, గోలి గిరి, గుంటూరు మల్లికార్జున గుత్తి సదాశివరావు, ఆదిశేషు, వెంకటరెడ్డి, గంజి సతీష్, భాస్కరరావు, దాశరధి, సంఘాల నాయకులు, చేనేతలు పాల్గొన్నారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025నీట్ ర్యాంకర్ల ‘ఎయిమ్స్’ సాక్షి ప్రతినిధి,బాపట్ల: జిల్లాలో ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైంది. సేకరించిన ధాన్యానికి పౌరసరఫరాల సంస్థ సకాలంలో డబ్బులు చెల్లించక రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మరో వైపు రైతులకంటే ఎక్కువగా మిల్లర్ల వద్దే ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి అక్రమాలకు తెరతీసిందన్న ఆరోపణలున్నాయి. గతంలో ఉన్న అధికారులు మిల్లర్లతో కుమ్మకై ్క ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ధాన్యం సేకరణ తర్వాత 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల నుంచి రెండు నెలల దాటినా డబ్బులు ఇవ్వలేదు. రబీలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఉదాహరణకు చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో మార్చినెల 28వ తేదీన రైతుల నుంచి ప్రభుత్వం దాదాపు 3 వేల బస్తాల ధాన్యం సేకరించింది. ఏప్రిల్ 1న పింఛన్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నాడని తెలిసి గ్రామానికి చెందిన 60 మంది రైతుల నుంచి ఈ ధాన్యాన్ని సేకరించారు. దీనికి సంబంధించి రైతులకు రూ.50 లక్షలు చెల్లించాల్సి వుండగా ఇప్పటికి 75 రోజులు దాటుతున్నా రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదు. ధాన్యం డబ్బుల కోసం రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఇప్పటికీ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఇదుగో ఇస్తాం అదిగోఇస్తామని అధికారులు మాట దాటవేయం మినహా డబ్బులు ఎపుడిస్తారో కూడా స్పష్టత ఇవ్వడంలేదు. రబీలో 34,953 టన్నుల ధాన్యం సేకరణ రబీలో జిల్లా వ్యాప్తంగా 5,490 మంది రైతుల నుంచి 34,953 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇందుకు సంబంధించి రూ.81.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకూ 3,847 మంది రైతులకు రూ.55.82 కోట్లు చెల్లించారు. ఇంకా 1643 మంది రైతులకు రూ. 25.27 కోట్లు ఇవ్వాల్సివుంది. రైతుల నుంచి ధాన్యం సేకరించి నెలన్నర రోజులకు పైగా అయినా వారికి ప్రభుత్వం డబ్బులు వేయకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ఇచ్చి ధాన్యం సేకరించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బస్తా ధాన్యం రూ.1740లకు కొంటామని చెప్పినా రైతులకు మద్దతు ధర ఇవ్వలేదు. ఒక్క ఖరీఫ్లోనే రైతులు జిల్లా వ్యాప్తంగా 2,16,434 ఎకరాల్లో వరిపంట సాగుచేయగా 5,62,729 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా కట్టింది. అయితే ఖరీఫ్లో ప్రభుత్వం లక్ష టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు ప్రకటించి చేతులు దులుపుకుంది. వాస్తవానికి ఇందులో సగంఽ ధాన్యాన్ని కూడా పౌరసరఫరాల సంస్థ నేరుగా రైతులనుంచి సేకరించలేదని విమర్శలున్నాయి. మిగిలిన 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులనుంచి తక్కువ ధరకు కొన్న మిల్లర్ల నుంచి కొనుగోలు చేసి దానిని కూడా రైతుల నుంచి కొన్నట్లు చూపించినట్లు ఆరోపణలున్నాయి. ఇక రబీలో దాదాపు 35 వేల టన్నుల ధాన్యం సేకరించినట్లు చెబుతున్నా ఇందులోనూ అధికారులు మిల్లర్లు కుమ్మకై ్క అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం. న్యూస్రీల్ జిల్లాలో 34,953 టన్నుల ధాన్యం సేకరణ చెల్లించాల్సిన సొమ్ము రూ.81.09 కోట్లు ఇప్పటివరకూ చెల్లించింది రూ.55.82 కోట్లు ఇంకా చెల్లించాల్సిన మొత్తం రూ.25.27 కోట్లు రెండు నెలలు దాటినా డబ్బులు ఇవ్వని ప్రభుత్వం లబోదిబోమంటున్న అన్నదాతలు నష్టపోయిన అన్నదాతలు ఆరు వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ రామాంజనేయులుప్రభుత్వం గత ఖరీఫ్, రబీ సీజన్లలో మద్దతు ధరకు ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో బయట మార్కెట్లో ధాన్యం బస్తా కేవలం రూ.1300లోపే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్లో కోతల సమయంలోనే తరచూ వర్షాలు కురవడంతో ధాన్యాన్ని ఆరబెట్టి నిలువచేసుకునే వసతి లేకపోవడంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో వర్షాల సాకుచూపి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపి వేయడంతో గత్యంతరం లేక రైతులు మిల్లర్లకు అమ్ముకొని నష్టపోవాల్సి వచ్చింది. పోనీ కొన్న ధాన్యానికై నా ప్రభుత్వం సకాలంలో డబ్బులు ఇవ్వక రైతులను ఇబ్బంధి పెట్టింది. మొత్తంగా కూటమి తొలి ఏడాది అటు ఖరీప్ ఇటు రబీలో ధాన్యం రైతులు గిట్టుబాటు లేక తీవ్రంగా నష్టపోయారు. -
వైభవంగా మల్లాది వెంకన్న శాంతి కల్యాణం
అమరావతి: మల్లాది గ్రామంలోని వట వృక్షాంతర్గత వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజల అనంతరం శాంతి కల్యాణం నిర్వహించారు. స్వామివారిని పలు రకాల పుష్పమాలలు, తులసీ మాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు తొమ్మిది మంది దంపతులచే శాంతి కల్యాణ ప్రక్రియను ఆలయ యాజ్ఞీకస్వామి పరుచూరు శ్రీనివాసాచార్యులు నిర్వహించారు. మధ్యా హ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. పునఃప్రారంభమైన శ్రీవారి ఊయల సేవ తెనాలి టౌన్: శ్రీ లక్ష్మీపద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి ఊయల సేవ శనివారం నుంచి పునఃప్రారంభమైనది. ఆలయ కార్యనిర్వహణాధికారులు వి.అనుపమ మాట్లాడుతూ దేవస్థానంలో ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీస్వామి అమ్మవార్లకు ఊయల సేవ జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని సూచించారు. ఊయల సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించారు. కొండేపి వసుంధర బృందం ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.రామలింగేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మల్లారెడ్డినగర్ విఘ్నేశ్వరస్వామి సహిత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. రామలింగేశ్వర స్వామికి ఆలయ అర్చకులు పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. సాయంత్రం రుద్రహోమం, నవగ్రహ, మండప దేవత హోమాలను చేపట్టారు. భక్తులకు తీర్ధ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను ఫౌండేషన్ చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి దంపతులు, అన్నదాన కమిటీ చైర్మన్ గుంటూరు వేమారెడ్డి, కొండారెడ్డి, కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. జిల్లా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి స్థలాల పరిశీలన బాపట్ల: జిల్లా కోర్టు భవన సముదాయం బాపట్ల పట్టణంలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. జిల్లా కోర్టు భవన సముదాయానికి అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. తూర్పు బాపట్లలో ఖాళీగా ఉన్న 7.5 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఇందిరానగర్లో ఖాళీగా ఉన్న 2.80 ఎకరాల భూమిని పరిశీలించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భూమి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలను పంపాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టర్ వెంట బాపట్ల తహసీల్దార్ సలీమా, సర్వేయర్లు వీఆర్వోలు తదితరులు ఉన్నారు. -
నాటుసారా తయారీదారులపై చర్యలు
మాచర్ల రూరల్: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా పోలీసు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని హసనాబాద్ తండాలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తండాలో ప్రతి ఇంటిని తనిఖీ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 8 మందిని అనుమానిత వ్యక్తులుగా గుర్తించారు. నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ నసీబ్ బాషా, ఎకై ్సజ్ సీఐ ఎన్.వెంకటరమణ, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నిందితులను మెజిస్ట్రేట్, తహసీల్దార్ బి.కిరణ్ కుమార్ సమక్షంలో హాజరుపరిచారు. సత్తా చాటిన జిల్లా బీచ్ కబడ్డీ క్రీడాకారులు సత్తెనపల్లి: మచిలీపట్నంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరిగిన 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ పోటీలలో పల్నాడు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. దేశంలోని 29 రాష్ట్రాల క్రీడాకారులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఇండియా జట్టుకు పల్నాడు జిల్లా క్రీడాకారులు కృష్ణారెడ్డి, గోపి, హరీష్లు ఎంపికయ్యారు. వీరిని పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మాబుహుస్సేన్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు అచ్చిరెడ్డి, రియాజు, శేషయ్య, అనిల్, సభ్యులు సందీప్, సురేష్, ఆనంద్లు శుక్రవారం సత్కరించారు. మాబుహుస్సేన్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన క్రీడాకారులను మరింతగా తీర్చిదిద్దుతానన్నారు. ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య సత్తెనపల్లి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముప్పవరపు రమణయ్య (44) గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సత్తెనపల్లి వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. రమణయ్యకు భార్య అంజలి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహమైంది. 2.70 ఎకరాలు గ్రామంలో పొలం కౌలుకు తీసుకొని పత్తి, పొగాకు సాగు చేస్తుండగా నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు పెరిగి రమణయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు తెలిపారు. కారు డ్రైవర్గా కూడా పనిచేస్తుంటాడని సమాచారం. తహసీల్దార్ కేఎస్ చక్రవర్తిని దీనిపై సంప్రదించగా.. త్రిమెన్ కమిటీ నిర్ధారించాల్సి ఉందని, కౌలు రైతు అయితే పూర్తి స్థాయిలో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వివరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. -
వృద్ధాప్యంలో తల్లిదండ్రులను ఆదరించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ గుంటూరులీగల్: క్యాలెండరు యక్టివిటీస్లో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు శుక్రవారం రామన్నపేటలోని మానవత స్వచ్ఛంద సేవా సంస్థలో ప్రపంచ వృద్ధుల వేధింపుల అవగాహన దినోత్సవంపై న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వృద్ధులు మనకు జ్ఞానాన్ని, అనుభవాన్ని అందించే వారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో వృద్ధులు ఆర్థికంగా, మానసికంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు జన్మనిచ్చి మన అభివృద్ధి కోసం కృషి చేస్తారని, కొంతమంది వారిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారని చెప్పారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే బహుమతిగా ఇచ్చిన ఆస్తులను రద్దు చేసి తిరిగి వారి సంక్రమిస్తాయనే చట్టం ఉందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఆస్తులను ఇచ్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. నల్సా న్యాయ సేవల పథకం– 2016 ప్రకారం వృద్ధులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. సదస్సులో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, డాక్టర్ ప్రత్యూష, సుబ్బారావు, పెద్దలు పాల్గొన్నారు. -
తిమ్మాపురం స్పిన్నింగ్ మిల్లులో హత్య
యడ్లపాడు: ఈ నెల 10వ తేదీన వలస కార్మికుడిపై హత్యాప్రయత్నం జరగడంతో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని తిమ్మాపురం పంచాయతీ పరిధిలోని శ్రీ మంజునాథ నూలు మిల్లులో ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్నాథ్ కుల్దీప్ పనిచేస్తున్నాడు. తన భార్య రుని కుల్దీప్, ముగ్గురు పిల్లలతో కలిసి మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. నెల రోజుల క్రితం జగన్నాథ్ భార్య, పిల్లలు స్వగ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో, జగన్నాథ్ భార్య గురించి అదే మిల్లులో పనిచేస్తున్న మంగూలు లేంక అనే వ్యక్తి ప్రశ్నించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో మంగూలు తన గదిలోంచి కత్తి తీసుకొచ్చి జగన్నాథ్ను పొత్తికడుపులో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన జగన్నాథ్ను 108 అంబులెన్స్లో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు రిఫర్ చేశారు. చికిత్స పొందుతున్న జగన్నాథ్ (38) శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య పోలీస్ స్టేషననుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ శివరామకృష్ణ కేసు నమోదు చేయగా, సీఐ సుబ్బానాయుడు దర్యాప్తు చేస్తున్నారు. వలస కార్మికుల్లో భయాందోళనలు ఉపాధి కోసం రాష్ట్రాన్నే వదిలి వచ్చిన వ్యక్తిపై మూడు రోజుల కిందట హత్యాప్రయత్నం జరిగినా, బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా.. పోలీసులకు కూడా నూలుమిల్లు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటన తాలూకు విషయాలను గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ పోలీసులకు తెలిస్తే ఎందుకు బహిర్గతం చేయలేదని పేర్కొంటున్నారు. కార్మికశాఖ అధికారులు కూడా ఇలాంటి ఘటనల సమయంలో కన్నెత్తి చూడక పోవడం, కుటుంబాలతో రాష్ట్రాలు విడిచి వచ్చిన తమ జీవితాలకు ఎలాంటి భద్రత లేకుండా పోయిందని వలస కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నూలుమిల్లు పనులు చేసుకుంటున్న వలస కార్మికులు ఈ ఘటనతో తమ కుటుంబాలతో తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి దారుణం గోప్యతపై వలస కార్మికుల అనుమానాలు -
రాష్ట్ర హోంమంత్రి వ్యాఖ్యలు చట్ట విరుద్ధం
● దళిత, ముస్లిం యువకులపై లాఠీలతో కొట్టిన సీఐలను అరెస్టు చేయాలి ● దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చీరాల రూరల్: తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై తెనాలి 2, 3 పట్టణ సీఐలు జరిపిన తాలిబన్ దాడిని ఖండిస్తున్నామని, అందుకు బాధ్యులైన ఇద్దరు సీఐలను అరెస్టు చేయాలని, పోలీసులు కొడితే తప్పేముందన్న రాష్ట్ర హోంమంత్రి అనితను పదవి నుంచి తొలగించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన దళిత మహాసభ రాష్ట్ర నాయకుడు మాచవరపు జూలియన్తో కలసి దళిత మహాసభ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రౌడీషీటర్ల పేరుతో దళిత, ముస్లిం యువకులను నడిరోడ్డుపై బహిరంగంగా అందరూ చూస్తుండగా లాఠీలతో ఇష్టానుసారంగా కొట్టి హింసించడం దారుణమన్నారు. యువకులను కొట్టే హక్కు పోలీసులకు లేదన్నారు. పోలీసులకు కేసులు నమోదుచేసి కోర్టులకు పంపే అధికారం మాత్రమే ఉందన్నారు. ఒంగోలులో తెలుగుదేశం పార్టీకి చెందిన వీరయ్య చౌదరి అనే మాజీ రౌడీషీటర్ హత్యకు గురైతే హుటాహుటిన హోంమంత్రి అనిత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు కూడా హాజరయ్యారన్నారు. తెనాలిలో దళిత యువకులను రౌడీషీటర్లు అంటున్న హోంమంత్రి అనిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలసి మాజీ రౌడీషీటర్ వీరయ్య చౌదరి అంత్యక్రియలకు ఏవిధంగా హాజరయ్యారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేరాలకు కులం, మతం ఉండదన్న హోంమంత్రి అమరావతి మహిళల అవమానం కేసులో జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను అరెస్టు చేయించటానికి ఎస్సీ, ఎస్టీ కేసు ఎందుకు పెట్టించారని ప్రశ్నించారు. న్యాయమూర్తి జిల్లా ఎస్పీని, డీఎస్పీని మందలించి ఎస్సీ, ఎస్టీ కేసును తొలిగించింది నిజమా కాదా హోంమంత్రి చెప్పాలన్నారు. కరోనా సమయంలో చీరాలలో దళిత యువకుడు కిరణ్కుమార్ను మాస్కు పెట్టుకోలేదనే నెపంతో అప్పటి టూటౌన్ ఎస్సై కొట్టగా కిరణ్కుమార్ చనిపోయాడని, అందుకు ఎస్సైను బాధ్యుడిని చేస్తూ హత్యానేరం కింద ఎస్సైను అరెస్టుచేసి రిమాండ్కు తరలించింది నిజంకాదా అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఎస్సై కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడో లేదో హోంమంత్రి సమాధానం చెప్పాలన్నారు. రేణంగివరం పోలీసు స్టేషన్లో జె.పంగులూరు మండలం కోటపాడు గ్రామానికి చెందిన మాదిగ యువకులని పోలీసుస్టేషన్లోనే కొట్టి హింసించిన కేసులో ఒంగోలు ఎస్సీ, ఎస్టీ కోర్టు ఎస్సై జగన్మోహనరావుకు రెండు సంవత్సరాలు శిక్ష విధించిందన్నారు. పోలీసులు కొట్టే హక్కు ఉంటే కోర్టులు ఎందుకు శిక్షలు విధించాయో హోం మంత్రి సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు కొట్టడం కరెక్టు అయితే పై రెండు కేసులలో నిందితులైన ఇద్దరు ఎస్సైలపై కోర్టులు విధించిన శిక్షలను హోంమంత్రి తన అధికారంతో రద్దు చేయించగలరా అని ప్రశ్నించారు. తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై దాడికి పాల్పడిన సీఐలపై అట్రాసిటీ కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని, పోలీసులు కొడితే తప్పేముందన్న హోంమంత్రి అనితను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఉదయం విజయవాడ ప్రెస్క్లబ్లో సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా అంజయ్య, కార్యదర్శి కాకుమాను రవి, దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు షేక్ జిలాని పాల్గొన్నారు. -
లారీని ఢీకొట్టిన బస్సు..నలుగురికి గాయాలు
అద్దంకి: ముందు వెళ్తున్న లారీని బస్సు ఢీకొని బస్సులోని నలుగురికి గాయాలైన సంఘటన మండలంలోని చిన్నకొత్తపల్లి డొంక వద్ద అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారిలో గురువారం అర్థరాత్రి దాటిన తరువాత జరిగింది. అందిన సమాచారం మేరకు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు కందుకూరు నుంచి హైదరాబాద్ బయలుదేరింది. ఆ బస్సు మండలంలోని చిన్నకొత్తపల్లి డొంక వద్దకు రాగానే, అదే మార్గంలో చిన్నకొత్తపల్లి మిల్లు వద్దకు వెళ్లే క్రమంలో మలుపు తిరుగుతున్న లారీని వెనుకగా ఢీ కొట్టింది. దాంతో బస్సులో కుదుపు రావడంతో అందులో ప్రయాణిస్తున్న షేక్ యాకోబ్బాషాతోపాటు ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, 108 సిబ్బంది అక్కిడికి చేరుకున్నారు. సంఘటన వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. క్షతగాత్రుడు షేక్ యాకోబ్ బాషాను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందించారు. ఈ ఘటనలో బస్సు మందు భాగం నుజ్జు నుజ్జయింది. తరచూ ప్రమాదం..డెడ్ స్పాట్ ఈ స్థలంలో గ్రామానికి వెళ్లే రోడ్ క్రాసింగ్ ఉండటంతో పలుమార్లు కార్లు బోల్తా కొట్టడం, ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలసి పోయిన సంఘటనలు కోకోల్లలు. ఇక్కడ ప్రమాద నివారణకు సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
అంతర్ జిల్లా దొంగను పట్టుకున్న పోలీసులు
జె.పంగులూరు: అంతర్ జిల్లా దొంగ పబ్బరాజు వెంకట యుగంధర్ను పట్టుకున్నట్లు శుక్రవారం ఎస్సై వినోద్బాబు తెలిపారు. బూదవాడ గ్రామానికి చెందిన వజ్రాల కృష్ణారెడ్డిని వెంకటయుగంధర్ గత నెలలో ఇల్లు అద్దెకు కావాలని అడిగాడు. మంచి వ్యక్తి అని నమ్మి బూదవాడ గ్రామానికి చెందిన హనుమారెడ్డి ఇల్లును అద్దెకు ఇప్పించాడు. ఎంతో నమ్మకంగా ఉంటూ గత నెల 18న రాత్రి 7 గంటల సమయంలో నిందితుడు అన్నవరం ప్రసాదం అని మత్తు మందు కలిపి హనుమారెడ్డి, అతని భార్యకు ఇచ్చాడు. కొద్ది సేపటికే సృహ కోల్పోగా హనుమారెడ్డి భార్య మెడలోని బంగారు గొలుసును దొంగిలించి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ విషయమై బాధితులు రేణింగవరం పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఎస్సై వినోద్బాబు తన సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని మంగళగిరి బస్టాండ్ వద్ద పట్టుకున్నట్లు, అతని వద్ద బంగారు రికవరీ చేసినట్లు ఎస్సై వినోద్బాబు తెలిపారు. నిందితుడు గుంటూరు జిల్లా తాడేపల్లి లోని వడ్డేశ్వరం గ్రామానికి చెందిన వ్యక్తిగా తెలిపారు. -
బాపట్ల జిల్లా యువజన విభాగం కమిటీ ఎంపిక
బాపట్ల: బాపట్ల జిల్లా యువజన విభాగ కమిటీ ఎంపిక చేస్తూ వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యక్షులుగా వేమూరుకు చెందిన వై.రవిశంకర్రెడ్డి, చీరాలకు చెందిన కె.ప్రసాదరెడ్డి, జనరల్ సెక్రటరీలుగా అద్దంకి చెందిన జి.బ్రహ్మరెడ్డి, రేపల్లెకు చెందిన కె.రామ్గోపాల్, పర్చూరుకు చెందిన వై.శ్రీకాంత్బాబు, బాపట్లకు చెందిన మల్లెల పవన్కుమార్, బాపట్లకు చెందిన యల్లావుల సురేష్ రాఘవ, సెక్రటరీలుగా బాపట్లకు చెందిన ఎన్.నాగరాజు, రేపల్లెకు చెందిన కె.శ్రీనివాసరావు, పర్చూరుకు చెందిన కె.అనంతకుమార్రెడ్డి, వేమూరుకు చెందిన పేకా సన్నీ, చీరాలకు చెందిన మొగిలి సారధి, చీరాలకు చెందిన రామకృష్ణ, అద్దంకి చెందిన వై.ఆరోను, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా బాపట్లకు చెందిన వై.కొండా, చీరాలకు చెందిన జి.భాగ్యరాజు, చీరాలకు చెందిన బాలకోటిరెడ్డి, వేమూరుకు చెందిన ఏ.కొండారెడ్డి, వి.రవితేజ, మేగానంద సాయితేజ, పర్చూరుకు చెందిన పి.ప్రసాదబాబు, షేక్.మస్తాన్వలి, జి.రామకృష్ణ, రేపల్లెకు చెందిన జి.ప్రసన్నతేజ, టి.శివ వెంకటకృష్ణ, పి.నాగేశ్వరరావు, అద్దంకి చెందిన డి.శ్రీను, ఎం.సురేంద్రరెడ్డి, జి.వెంకటేష్లను నియమించారు. ఈమేరకు పలువురు అభినందించారు. -
నిబంధనలకు లోబడి విత్తనాలు అమ్మాలి
కొరిటెపాడు(గుంటూరు): విత్తన డీలర్లు, వ్యాపారులు విత్తన నియంత్రణ చట్టం–1983కు లోబడి వ్యాపారం నిర్వహించాలని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (డీఏఓ)యు.నరసింహారావు స్పష్టం చేశారు. స్థానిక కృషీ భవన్లో విత్తన డీలర్లు, వ్యాపారులతో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ విత్తన లైసెన్స్ను దుకాణాల వద్ద విధిగా ప్రదర్శించాలని తెలిపారు. విత్తన నిల్వలను తప్పకకుండా ధరల సూచిక బోర్డు నందు విధిగా ప్రదర్శించాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్లు, డెలివరీ చలానాలు, బిల్లు పుస్తకాలు తప్పకుండా స్థానిక వ్యవసాయ అధికారి ద్వారా ధ్రువీకరణ చేయించుకొని ఉపయోగించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. గడువు తీరిన విత్తనాలను నిల్వ చేయడం, విక్రయించడం నేరమని తెలిపారు. మిరప, పత్తి విత్తనాల వివరాలను సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి తెలిపి, వారి ఆమోదంతో మాత్రమే విక్రయం చేయాలని ఆదేశించారు. రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని, అందులో పంట రకం, లాట్ నంబరు వివరాలు తప్పకుండా నమోదు చేయాలని ఆదేశించారు. హెటీ(గ్లైసెల్) పత్తి విత్తనాల అమ్మకం, సాగుకు దేశంలో ఆమోదం లేదన్నారు. ఈ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా పరిధిలోని విత్తన డీలర్లు విధిగా ఫారం–డీని ప్రతి నెలా 5వ తేదీలోపు సమర్పించాలని తెలిపారు. సమావేశంలో విత్తన ఏఓ ఓ.సునీల్, డీలర్లు పాల్గొన్నారు. -
సిద్ధం కావాలి
‘కూటమి’పై పోరుకు న్యాయవాదులుపట్నంబజారు: ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే సామాజిక బాధ్యతగా న్యాయవాదులు పోరాటానికి సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్ ఇన్ ఫంక్షన్ హాలులో శుక్రవారం న్యాయవాదుల సమావేశం పార్టీ జిల్లా విభాగం, లీగల్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం మనోహర్రెడ్డి మాట్లాడుతూ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో, పార్టీ అభ్యర్థులు ఓటమి పాలై బాధతో బయకు రాలేని పరిస్థితుల్లో న్యాయవాదులు కార్యకర్తలకు భరోసా కల్పించి అండగా నిలిచారని తెలిపారు. వైఎస్సార్ సీపీ హయాంలో 300 మందికి అనేక పదవులు ఇచ్చారని పేర్కొన్నారు. వై.ఎస్.జగన్ చెప్పిన విధంగా పార్టీని రాష్ట్రం, దేశంలో అతిపెద్ద శక్తిగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. రాష్ట్రంలో న్యాయవాదులు ఒక మోడల్గా తీసుకునే విధంగా గుంటూరు న్యాయవాదులు పనిచేశారని కొనియాడారు. కార్యకర్తలు, నేతలకు అండగా నిలవాలి సభకు అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఐదేళ్లపాటు కార్యకర్తలు, నేతలకు అండగా నిలవాల్సిన బాధ్యత లీగల్ విభాగంపై ఉందని తెలిపారు. పరిపాలన కన్నా, కక్షసాధింపు చర్యలకు కూటమి సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులు ఏడాది కాలంలో ఇచ్చిన ధైర్యం అద్భుతమని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన సూచించారు. న్యాయవాదుల పోరాటం అద్భుతం ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ న్యాయవాదులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మహిళా న్యాయవాదులు స్పందించాలి పార్టీ గుంటూరు జిల్లా పరిశీలకుడు పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని తెలిపారు. వై.ఎస్.జగన్ హయాంలో చట్టానికి లోబడి పరిపాలన కొనసాగిందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై మహిళ న్యాయవాదులు స్పందించాలని ఆయన సూచించారు. తప్పుడు కేసులతో వేధింపులు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ మీడియాపై ఆంక్షలు పెట్టడం సరికాదని హితవు పలికారు. ‘సాక్షి’ని మూసివేయించేందుకు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని మండి పడ్డారు. -
రైలు ఢీకొని ముగ్గురు మృతి
చీరాల రూరల్: రైలు ఢీకొన్న ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చీరాల రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు.. మధ్యాహ్నం సుమా రు మూడు గంటల సమయంలో దిగువ లైన్పై వృద్ధుడు మృతి చెందాడనే సమాచారంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై చెప్పారు. మృతుని వయస్సు సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయ, తెలుపు తల వెంట్రుకలు, ఛాతీ ఎడమవైపు ఒక పుట్టుమచ్చ, కుడితొడపై మరో పుట్టుమచ్చ కలిగి ఉన్నాడని తెలిపారు. శరీరంపై తెలుపురంగు అరచేతుల చొక్కా, నీలం, తెలుపు రంగుల చారలు కలిగిన లుంగీ ఉందని, మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే 9440627646 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. రైలు నుంచి జారిపడి.. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని యువకుడు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై కొండ య్య శుక్రవారం తెలిపారు. సుమారు 30 సంవత్సరాలు కలిగిన గుర్తు తెలియని యువకుడు ఎగువకు వెళ్లే గుర్తు తెలియని రైల్లో ప్రయాణిస్తూ చినగంజాంలోని సోపిరాల రైల్వేగేటు వద్ద ప్రమాదవశాత్తు జారిపడి బలమైన రక్త గాయాలు కావడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుడిచేతి షోల్డర్ మీద విజయలక్ష్మి అనే పచ్చబొట్టు ఉందని చెప్పారు. మృతుడి ఆచూకీ తెలిస్తే జీఆర్పీ ఎస్సై 9440627646 నంబర్కుసమాచారం అందించాలని సూచించారు. చినగంజాంలో... చినగంజాం: రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చినగంజాం రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. చినగంజాం రైల్వేస్టేషన్కు ఉత్తరం వైపు సుమారు అరకిలోమీటరు దూరంలో విజయవాడ నుంచి చైన్నె వెళ్లే లైన్లో రైలు నుంచి జారిపడి తీవ్రగాయాల పాలై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయస్సు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని రైల్వే ఎస్ఐ కొండయ్య వివరించారు. -
కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు
బాపట్ల: చీరాల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుంది. ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 14వ తేదీన న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరుగునుందని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. చీరాల కుప్పడం పట్టు చీరకు ప్రకటించిన జాతీయ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి న్యూ ఢిల్లీలో అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గాలపై నేతన్నలు నేసిన చీరాల కుప్పడం చీరలకు మార్కెట్ లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుంది. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుంది. జాతీయ మార్కెట్ లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరాల కుప్పడంకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. చేనేత వృత్తినే నమ్ముకుని వందలాది చేనేత కుటుంబాలు బాపట్ల జిల్లా చీరాల పేరాలలో కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాయి. సంప్రదాయ మగ్గాలపై చేనేత కార్మికులు కష్టపడి నేసిన కుప్పడం చీరలకు ఒకప్పుడు ఎంతో డిమాండ్ ఉండేది. యంత్రాల చొరబాటుతో కుప్పడం చీరల ఉత్పత్తి సన్నగిల్లిందని కార్మికులు ఆందోళన చెందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చేనేతల ఆశలు పునర్జీవం పోసుకున్నాయి. అలనాటి స్వాతంత్య్ర ఉద్యమంలో మహాత్మాగాంధీజీ ఇచ్చిన పిలుపు అందుకున్న చీరాల పేరాల చేనేత కార్మికులు విదేశీ వస్త్రాలను వ్యతిరేకించడంలో ప్రధానపాత్ర పోషించారు. నేత వస్త్రాల ఉత్పత్తులకు చీరాల క్షీరపురిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏడాది జనవరి 9వ తేదీన కేంద్ర బృందం సభ్యులు ఇష్ దీప్, డాక్టర్ దివ్యడింగ్రా క్షేత్రస్థాయి పరిశీలనపై బాపట్ల చీరాలలో పర్యటించారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కుప్పడం చీరల ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు, జిల్లా కలెక్టర్ కలిసి పరిశీలించారు. ఆ సమయంలోనే చీరాలలో చేనేత వస్త్రాలైన కుప్పడం చీరల ఉత్పత్తులు, అమ్మకాలు, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై కేంద్ర బృందానికి కలెక్టర్ నివేదిక అందజేశారు. పూర్తిస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం చీరాల కుప్పడం చీరలకు ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి (ఒడిఒపి)కింద గుర్తింపునిస్తూ జాతీయస్థాయి అవార్డును ప్రకటించింది. జాతీయస్థాయి అవార్డును జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి జూలై 14వ తేదీన అవార్డు అందుకోనున్నారు. ఓడీఓపీ కింద అవార్డు ప్రదానం ఢిల్లీలో అవార్డు అందుకోనున్న బాపట్ల కలెక్టర్ జె.వెంకట మురళి చీరాల కుప్పడం చీరకు ప్రాచుర్యం -
తల్లికి ఆంక్షల పోటు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని గత సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఇప్పటివరకూ చెబుతూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఇప్పడు మాట తప్పింది. తల్లికి వందనం జాబితాకు కోతలు పెట్టేందుకు సిద్ధమైంది. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇవ్వక కొందరికే పథకాన్ని పరిమితం చేయబోతోంది. ఇందుకోసం సరికొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి ఆంక్షలు అమలుచేస్తోంది. ఒకే ఇంట్లో ఫీజురీయింబర్స్మెంట్ పొందితే ఆ ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం ఇవ్వరట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపకార వేతనాలు పొందే వారికి ఈ పథకం వర్తించదట. బియ్యంకార్డు లేకపోతే పథకం రాదట. కుటుంబం నెలవారీ ఆదాయం గ్రామీణులకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం ఇవ్వరు. మాగాణి మూడెకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించి ఉండకూడదు. పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ప్రతి కుటుంబానికి ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం రాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారికి పథకం వర్తించదు. ప్రభుత్వ తీరుపై విమర్శలు ఇన్ని రకాల ఆంక్షలు విధించి చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి గురువారం నుంచే పథకాన్ని అమలు చేస్తున్నామని, తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పడు ఆంక్షల జాబితాను సచివాలయాలకు అప్పగించి ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ఆంక్షలతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం వర్తించే అవకాశం కనిపించడంలేదు. ప్రభుత్వం వద్ద ఉన్న జాబితా ప్రకారం జిల్లాలో 1,64,124 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాను ఆంక్షలకనుగుణంగా పరిశీలన జిరిపి వడపోత పోయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. మొత్తం బాధ్యతలను సచివాలయాలకు కట్టబెట్టింది. ఈ నెలాఖరు లోగా సచివాలయ ఉద్యోగులు ఆ బాధ్యతలను నెరవేర్చి వీలైనంతగా జాబితాలను తగ్గించాల్సి వుంది. అదే జరిగితే ఇంటిలో ఉన్న పిల్లలందరి సంగతి దేవుడెరుగు ఇంటికొక్కరికి కూడా పథకం వర్తించేలా కనిపించడంలేదు. ఆంక్షలు ఎత్తివేయాలి ఎన్నికల సమయంలో కూటమి నేతలు, అధికారం వచ్చాక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రులు చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేయాల్సివుంది. ఇచ్చిన మాటప్రకారం చిత్తశుద్దితో పథకాన్ని చదువుకునే పిల్లలందరికీ వర్తింపు చేయక జాబితా తగ్గించుకునేందుకు పలు రకాల ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వాస్తవానికి పేద, మధ్యతరగతి ప్రజలు కూటమి నేతలు చెప్పిన మాటలు నమ్మి వారికి ఓట్లు వేశారు. ఇప్పుడేమో ఏరుదాటాక బోడి మల్లన్న చందంగా చంద్రబాబు ప్రభుత్వం పథకంలో కోతలు పెట్టి జనానికి వెన్నుపోటుపొడవడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మనసు మార్చుకొని ఆంక్షలు పక్కనబెట్టి చదువుకున్న పిల్లలందరికీ తల్లికి వందనం అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జాబితాలో కోతల కోసం ఆంక్షలు ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ వస్తే తల్లికి వందనం ఇవ్వరట 300 యూనిట్లకు మించి విద్యుత్ వాడితే కట్ కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి వంచన గతంలో ఎంతమంది ఉన్నా ఇస్తామంటూ బూటకపు మాటలు ఆచరణ కొచ్చేసరికి జాబితా కుదింపునకు కుట్రలు ఇంటికొక్కరికి కూడా ఇచ్చే పరిస్థితి కానరాని వైనం వైఎస్.జగన్ పాలనలో జిల్లాలో 1.20 లక్షల మందికి అమ్మ ఒడి వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో జిల్లాలో ఇంటి కొకరు చొప్పున ఇస్తామని చెప్పి మొత్తం 1,19,953 మంది విద్యార్థులకు అమ్మ ఒడి ఇచ్చారు. ఈ మేరకు గడచిన నాలుగేళ్లలో దాదాపు రూ. 700 కోట్లు అమ్మ ఒడి కింద చెల్లించారు. ఈ లెక్కన ఇంటికి ఇద్దరు అనుకుంటే ఈ సంఖ్య రెండింతలు కానుంది. అలా కాకున్నా గతంలో మొత్తం విద్యార్థుల సంఖ్య రెండు లక్షల వరకూ వుంది. ఆ ప్రకారం అనుకున్నా విద్యార్థులు అందరికీ తల్లికి వందనం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పడు 1.64 లక్షల మందిలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిశీలన జరిపితే ఈ సంఖ్య మరింతగా తగ్గుతుందని విద్యాశాఖ అధికారులతోపాటు సచివాలయ సిబ్బంది పేర్కొంటున్నారు. అదే జరిగితే గత ప్రభుత్వం ఇంటికొకరికి చొప్పున ఇచ్చిన అమ్మ ఒడి జాబితాకు అటు ఇటుగానే తల్లికి వందనం జాబితా ఉండే అవకాశముంది. ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం ఓట్లేయించుకొని తల్లులను వంచించినట్లే. -
రుణాలు పంపిణీ వేగవంతం చేయాలి
బాపట్ల: ప్రాధాన్యత, ప్రాధాన్యత లేని రంగాలకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో విస్తృతంగా రుణాలు ఇవ్వాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి చెప్పారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు నూరు శాతం చేరుకోవాలని అన్నారు. గతేడాది రైతులకు ఒక లక్ష సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా, అందులో 23 వేల మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారని అన్నారు. ఈ సంవత్సరం లక్ష సీసీఆర్సీ కార్డుల మంజూరుకు లక్ష్యాలను నిర్దేశించారని, అందులో ఇప్పటివరకు 3,800 కార్డులు జారీ చేసినట్లు తెలిపారు. పాత సీసీఆర్సీ కార్డులను రెన్యువల్ చేయాలని జిల్లా కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారికి సూచించారు. సీసీఆర్సీ కార్డుదారులకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల రుణాలు ఇవ్వాలని, బ్యాంకు బ్రాంచీల ప్రకారం లక్ష్యాలను నిర్దేశించాలని ఎల్డీఎంకు సూచించారు. జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పథకంలో స్వయం సహాయక గ్రూపు సభ్యులను చేర్చడమైనదని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా రుణాల కోసం బ్యాంకులకు లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు. బ్యాంకుల వారీగా లక్ష్యాలను పూర్తి చేయకపోవడానికి గల కారణాలను ఆరా తీశారు. జిల్లాకు 36 కిసాన్ డ్రోన్ యూనిట్లను లక్ష్యంగా ఇచ్చారని తెలిపారు. జిల్లాలో ఒక లక్ష 60 వేల మంది రైతులు ఉన్నారన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం కింద కౌలు రైతులను పంట బీమా చేయించాలని, బీమా వలన కలిగే ప్రయోజనాలను వివరించి వారికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. ఉత్పత్తి రంగాలకు రుణాలు ఇవ్వాలి ఉత్పత్తి రంగాల అభివృద్ధికి అధిక రుణాలు ఇవ్వాలని కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా ప్రాధాన్యత, ప్రాధాన్యత లేని రంగాలను కలిపి 7.51 లక్షల మందికి రుణాలు ఇచ్చి ఆయా ఉత్పత్తులు పెంచుకోవడానికి రూ.15 వేల 820 కోట్లు రుణాలు ఇవ్వాలని వార్షిక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో రూ.13 వేల 444 కోట్ల వార్షిక లక్ష్యానికి రూ.16 వేల 603 కోట్ల రుణం మంజూరు చేసినట్లు బ్యాంకర్లు జిల్లా కలెక్టర్కు వివరించారు. సమావేశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, డీఆర్డిఏ పీడీ శ్రీనివాసరావు, నాబార్డ్ డీడీఎం రవికుమార్, ఆర్బీఐ ఎల్డిఓ నవీన్ బాబు, యూనియన్ బ్యాంక్ రీజనల్ అధికారి మాధురి, ఎల్డీఎం శివకృష్ణ, వివిధ బ్రాంచీల బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి -
ఫ్రైట్ డిపో కార్యాలయం ప్రారంభం
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నల్లపాడులో ఫ్రైట్ డిపో (వ్యాగన్లను మరమ్మతు చేసే కార్యాలయం)ను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్, డివిజన్ డీఆఎర్ం సుధేష్ఠ సేన్ శుక్రవారం ప్రారంభించారు. ఆయన వ్యాగన్లను మరమ్మతులు చేసే సమయంలో సిబ్బందికి వెయిటింగ్ చేసేందుకు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయ డం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఫ్రైట్ డిపో కార్యాలయ ప్రాంగణంలో చెట్లు నాటారు. అక్కడ నుంచి పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రమాద ఘంటికను ఆవిష్కరించారు. డివిజన్ అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో రైల్వే జీఎం మాట్లాడుతూ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు అన్ని వసతు లు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం సైమన్, సీపీఎం గతిశక్తి మనోహర్రెడ్డి, సీనియర్ డీఈఎన్ కో–ఆర్డినేషన్ జె.వి.అనూష, సీనియర్ డీఎంఈ ఎం.రవికిరణ్, సీనియర్ డీసీఎం సీహెచ్.ప్రదీప్కుమార్, సీనియర్ డీఎం జె.శ్రీనాథ్, సీనియర్ డీఎస్టీఈ జి.రత్నాకర్, సీనియర్ డీఈఈ జి.సూర్యనారాయణ, సీనియర్ డీఈఈ పి.రవితేజ, డీఎస్సీ మధుసూదనరావు పాల్గొన్నారు. ఆర్ఓబీల నిర్మాణానికి రూ.572.47 కోట్లు మంజూరు గుంటూరులోని శ్యామలానగర్, సంజీవయ్యనగర్లలో రెండు ఆర్ఓబీలకుగాను రైల్వే శాఖ రూ.159.59కోట్లు మంజూరు చేయడంపై రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, తూర్పు ఎమ్మె ల్యే నసీర్ అహ్మద్ మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. శంకర్ విలాస్ ఆర్ఓబీతోపాటు గడ్డిపాడు, పెద పలకలూరు, నందివెలుగు, మంగళగిరిల్లో ఆర్ఓబీల నిర్మాణాలకు నిధులు విడుదలపై హర్షం వ్యక్తం చేశారు. -
ఉపాధి హామీ పనులు పెంచండి
జె.పంగులూరు: ఉపాధి హామీ పనులు నియోజకవర్గంలో విస్తృతంగా చేపట్టాలని, కూలీలందరికీ ఉపాధి చూపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని ముప్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. నియోజక వర్గంలో ప్రతి గ్రామానికి రూ. 30 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేయనున్నట్లు తెలిపారు. ముప్పవరం గ్రామంలోని బీసీ కాలనీలో ఉపాధి హామీ నిధుల ద్వారా రూ. 20 లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు, సైడు డ్రైన్ నిర్మించామన్నారు. జిల్లా పరిషత్ నిధులు రూ. 15 లక్షలతో మరో రోడ్డు కూడా నిర్మించినట్లు తెలిపారు. ముప్పవరం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు రూ. 3 కోట్లతో బైపాస్ నిర్మించేందుకు అనుమతి లభించిందని తెలిపారు. మరో రెండు నెలల్లో ఈ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ముప్పవరం గ్రామంలో 16 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు అందించామని తెలిపారు. పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థికం సాయాన్ని చెక్కుల రూపంలో అందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ పి.సింగారావు, విద్యుత్ ఏఈ గోరంట్ల అనిల్ కుమార్, ఏపీఓ సంతోషం, పంచాయతీ కార్యదర్శి జానీబేగం తదితరులు పాల్గొన్నారు. ముప్పవరం సభలో మంత్రి గొట్టిపాటి -
ప్రభుత్వ విద్య బలోపేతమే ధ్యేయం
తెనాలిటౌన్: ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ధ్యేయమని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ పేర్కొన్నారు. గురువారం తెనాలి మారీసుపేటలోని ఎన్సీఆర్ హైస్కూల్ను ఆయన సందర్శించారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రుచి, శుచితో కూడిన ఆహార పదార్థాలను విద్యార్థులకు అందించాలని ఉపాధ్యాయులు, నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాలలో మొత్తం 674 మంది విద్యార్థులు చదువుతుండగా మొదటి రోజున 274 మంది విద్యార్థులు హాజరైనట్లు పాఠశాల హెచ్ఎం కరిముల్లా మంత్రి మనోహర్కు తెలిపారు. ఎంఈఓలు వి.జయంతిబాబు, మేకల లక్ష్మీనారాయణ, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మంత్రి నాదెండ్ల మనోహర్ -
డాక్టర్ వెలగా సేవలు చిరస్మరణీయం
కాంస్య విగ్రహావిష్కరణలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి: గ్రంథాలయ రంగ ఉన్నతికి, డాక్టర్ వెలగా వెంకటప్పయ్య చేసిన కృషి నేటితరానికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలికి చెందిన సాహితీ ప్రముఖుడు, గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి రోజైన గురువారం తెనాలి బండ్పై ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. డాక్టర్ వెలగాతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తెనాలి మున్సిపాలిటీ శతాబ్ది ఉత్సవాల్లో సావనీరు రూపకల్పనలో ఆయన కీలకంగా వ్యవహరించారన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ వెలగాను ‘నడిచే గ్రంథాలయ విజ్ఞాన సర్వస్వం’గా అభివర్ణించారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్ వెలగా కాంస్య విగ్రహం ఏర్పాటు, భావితరాలకు స్ఫూర్తి కాగలదన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక డాక్టర్ వెలగా సేవలను కొనియాడారు. కాంస్య విగ్రహాన్ని రూపొందించిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా సత్కరించారు. డాక్టర్ వెలగా కుమారులు సర్వోత్తమరావు, నాగార్జున, వెంకట్రావు, మానవేంద్ర, సోదరుడు వెలగా వీరయ్యతోపాటు గ్రంథాలయ రంగ ప్రముఖుడు లంకా సూర్యనారాయణ, ఈదర పూర్ణచంద్, మాదిరాజు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ●అనంతరం హోటల్ గౌతమ్ గ్రాండ్లో డాక్టర్ వెలగా విగ్రహావిష్కరణ సభను నిర్వహించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, ప్రముఖ రచయిత, పరిశోధకుడు ముత్తేవి రవీంద్రనాధ్, డాక్టర్ నన్నపనేని ప్రతాప్, పార్వతీపురంకు చెందిన పారినాయుడు, ప్రొఫెసర్లు లక్ష్మి, అయినాల మల్లేశ్వరరావు, షేక్ అబ్దుల్ హకీంజాని పాల్గొన్నారు. పావులూరి శ్రీనివాసరావు రచన ‘ఆరు దశాబ్దాల అలుపెరగని డాక్టర్ వెలగా కృషి’ అనే పుస్తకం, విశ్రాంత ప్రొఫెసర్ జి.రామేశ్వర్ రచన ‘ప్రకృతి వైద్యం గ్రంథ సూచి’ ప్రతిని ఆవిష్కరించారు. -
అయ్యో.. గాంధ్ర!
ప్రత్తిపాడు: యోగాంధ్ర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సచివాలయ ఉద్యోగులకు తిప్పలు తెచ్చి పెట్టింది. కచ్చితంగా వారి పరిధిలోని హౌస్ హోల్డ్స్కు రిజిస్ట్రేషన్ చెయ్యాల్సిందేనని మండల స్థాయి అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హౌస్ హోల్డ్స్ డేటా తీసుకుని, సచివాలయాల్లో కూర్చుని సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేస్తున్నారు. దీంతో మృతిచెందిన వారికి, బతికి ఉన్నవారికి తేడా లేకుండా అందరికీ యోగాంధ్ర రిజిస్ట్రేషన్ మెసేజ్లు వస్తున్నాయి. ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అయ్యి లేని వారికి మాత్రమే ఓటీపీలు వస్తున్నాయి. లింక్ అయిన వారికి ఓటీపీలు రాకుండా నేరుగా ప్రాసెస్ అవుతుండటంతో, జనం ఇష్టాయిష్టాలు, ఆసక్తిలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా ప్రజలకు తెలియకుండానే యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. ఒక్కో సచివాలయానికి 1500 రిజిస్ట్రేషన్ల చొప్పున టార్గెట్లు విధించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారికి యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారంటూ వారి కుటుంబ సభ్యుల ఫోన్లకు సందేశాలు బిత్తరపోతున్న కుటుంబీకులు ప్రత్తిపాడు అధికారులు, సచివాలయ ఉద్యోగుల నిర్వాకం విచారిస్తాం..చనిపోయిన వారి పేర్లుతో యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు చేయడం సరికాదు. దీనిపై వెంటనే విచారిస్తాను. చర్యలు తీసుకుంటాను. పక్కాగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు వారితో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. – కె.శివపార్వతి, ఎంపీడీఓ, ప్రత్తిపాడు ఆది నుంచి ఇదే తీరు.. యోగాంధ్ర అమలులో అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడంతో మండలంలో ఆది నుంచి అభాసుపాలే అవుతుంది. మొక్కుబడి తంతుగా నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారు. నాలుగు రోజుల కిందట ర్యాలీ పేరుతో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చి, ర్యాలీ చేయకుండానే చేసినట్లుగా షో చేశారు. అధికారుల షో పై పత్రికల్లో కథనాలు రావడంతో మర్నాడు మరోమారు ఫొటో షూట్ ఏర్పాటు చేశారు. పక్కనే సచివాలయంలో కుట్టు శిక్షణ నేర్చుకునేందుకు వచ్చిన మహిళలను పిలిపించి, వారిని మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిలబెట్టి, లోపల నుంచి ఫ్లెక్సీ తెప్పించి మూడు నిమిషాల్లో మూడు యోగాసనాలు మూకుమ్మడిగా వేస్తున్నట్లు స్టిల్స్ ఇచ్చి, ఫొటోలు దిగి ఫొటోషూట్ ను క్లోజ్ చేశారు. క్రమశిక్షణ పేరుతో తొలిరోజు యోగాపై నిర్వహించిన శిక్షణకు ఆలస్యంగా హాజరైన సచివాలయం సిబ్బందిని బయటే నిలబెట్టి పనిష్మెంట్ ఇవ్వడం అప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఆ హడావిడి కూడా ఒకటి రెండు రోజులకే పరిమితం అయ్యింది. ప్రత్తిపాడు రామానగర్ కాలనీకి చెందిన గొరిజవోలు సామ్రాజ్యం 2023 ఆగస్టు 18న చనిపోయారు. కానీ ఆమె ఈ నెల 7వ తేదీన యోగాంధ్రకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు, యోగాసనాలకు వచ్చినప్పుడు అధికారులకు ఈ క్యూఆర్ కోడ్ చూపించమని ఆధార్ నంబర్ లింక్ అయ్యి ఉన్న కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్కు సందేశం వచ్చింది. దీంతో బిత్తరపోయిన ఆమె కుమారుడు వారి బంధువులు, తెలిసిన వారికి చూపిస్తూ మా అమ్మ యోగాకు వస్తుందంట.. అంటూ వ్యంగ్యాస్త్రాలతో అధికారుల నిర్వాకాన్ని ఎండగడుతున్నాడు. ప్రత్తిపాడుకు చెందిన ఎన్.రమాదేవి 2022లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈమె కూడా ఈ నెల 11వ తేదీన యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కుమారుని మొబైల్కు మెసేజ్ వచ్చింది. ‘మీరు యోగాంధ్ర– 2025 కార్యక్రమంలో పాల్గొనాలన్న మీ ఆసక్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం’ అంటూ క్యూర్ కోడ్, ఐడీ నంబరుతో వచ్చిన సందేశం చూసి ఆమె కుమారుడు షాక్కు గురయ్యాడు. -
కొనసాగుతున్న బదిలీల కౌన్సెలింగ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీ (తెలుగు)లకు మాన్యువల్ విధానంలో బదిలీల కౌన్సెలింగ్ కొనసాగుతోంది. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం సీనియార్టీ జాబితాలోని వరుస క్రమంలో 751 నుంచి 1750 వరకూ పేర్లు ఉన్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ కె.సుబ్బారెడ్డి పరిశీలించారు. కాగా శుక్రవారం ఉదయం 8 గంటలకు జెడ్పీ యాజమాన్యంలోని ఎస్జీటీలు(తెలుగు) 1751 నుంచి 2400 నంబరు వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని డీఈఓ సీవీ రేణుక తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి మున్సి పాల్టీల్లో పని చేస్తున్న ఎస్జీటీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో జిల్లా పరిశీలకురాలు పి.శైలజ, పల్నాడు డీఈఓ చంద్రకళ, డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్లు రమణ, శైలజ, ఏపీఎస్డీఎంఏ డీపీఎం ఎ.లక్ష్మీకుమారి పాల్గొన్నారు. -
ములకలూరులో మట్టి అక్రమ తవ్వకాలు
నరసరావుపేట రూరల్: ములకలూరులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. డీకే పట్టా భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి అక్రమార్కులు తవ్వకాలు జరుపుతున్నారు. అధికారపార్టీ నాయకులే మట్టిమాఫియా నిర్వహిస్తుండటంతో అధికారులు అటువైపు కన్నైత్తి చూడటం లేదు. పగులు, రాత్రి తేడా లేకుండా భారీ మిషన్లతో గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు. లారీలతో గ్రావెల్ను నరసరావుపేటకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ గ్రావెల్ వ్యాపారంలో ప్రజాప్రతినిధికి వాటాలు అందుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దాదాపు 20 అడుగుల మేర తవ్వకాలు జరుపుతుండటంతో సమీపంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గ్రామానికి చెందిన రైతులు అక్రమ తవ్వకాలపై నూనె కోటేశ్వరమ్మ అనే మహిళ జిల్లా కలెక్టర్కు పిర్యాదు చేశారు. ఎస్సీలకు 2008లో డీకే పట్టాలను ప్రభుత్వం పంపిణీచేసిందని, ఇందులో భాగంగా మాకు ఎకరం భూమిపై పట్టా అందజేసినట్టు తెలిపారు. ఈ భూమికి ఇరువైపులా ఉన్న డీకే పట్టాలను మట్టి మాఫియా కొనుగోలు చేసి పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. -
జిల్లా యువజన విభాగం నాయకులు ఎంపిక
వేమూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా యువజన విభాగం సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ మెంబరుల పేర్లు పార్టీ కేంద్రం కార్యాలయం విడుదల చేసింది. వేమూరు నియోజకవర్గంలోని వేమూరు మండలంలోని చంపాడు గ్రామానికి చెందిన పీకా సన్నీడియోలు జిల్లా యువజన విభాగ సెక్రటరీగా, కొల్లూరు మండలంలోని విప్పర్ల రవితేజను జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబరుగా నియమించారు. ఈ నియామకానికి సహకరించిన పార్టీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. నేడు న్యాయవాదుల సమావేశం పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదుల ముఖ్య సమావేశం జరగనుంది. నగరంలోని జేకేసీ కళాశాల రోడ్డులోని వికాస్ ఇన్ హోటల్లో న్యాయవాదుల సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పార్టీ లీగల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సి.డి.భగవాన్ తెలిపారు. పలు కీలక అంశాలపై చర్చించడంతోపాటు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికపై చర్చిస్తామన్నారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి, లీగల్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి, మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, మురుగుడు హనుమంతరావు, పార్టీ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, విజయవాడ పార్లమెంట్ జిల్లా పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డితోపాటు, ముఖ్య నేతలు, సమన్వయకర్తలు హాజరు కానున్నారు. పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేయనున్నారు. కార్యక్రమానిక పెద్ద ఎత్తున న్యాయవాదులు హాజరు కావాలని సి.డి.భగవాన్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి తెనాలిరూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కోపల్లెకె చెందిన కారుమంచి దేవదానం(70) గురువారం పట్టణంలో జరిగిన ఓ దుకాణ ప్రారంభోత్సవానికి తన మోపెడ్పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో సుల్తానాబాద్కు రాగా వెనుక నుంచి వచ్చిన సిమెంటు లోడు లారీ ఢీ కొట్టడంతో లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోపల్లె వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ కారుమంచి కిషోర్బాబుకు దేవదానం స్వయానా సోదరుడు. -
మాజీ సైనికుల కార్పొరేషన్ నెలకొల్పాలి
మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు నగరంపాలెం: మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ మాజీ సైనికుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు అన్నారు. గురువారం నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ నెలకొల్పే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణను రూపొందించాలని అన్నారు. దేశ రక్షణలో విధులు నిర్వర్తించి, మిలటరీ నుంచి బయటకు వచ్చిన కొందరు సైనికులు అనారోగ్యాలతో మరణించారన్నారు. తద్వారా మాజీ సైనికుల కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉన్నారని వాపోయారు. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఐనంపూడి రత్నప్రసాద్ మాట్లాడుతూ కొందరి సైనికుల కుటుంబ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. మాజీ సైనికుడు వాకా ఆదినారాయణ, పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు. -
బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలను తొలగించాలి
నగరంపాలెం: సెన్సార్ బోర్డ్ను కేంద్రం నియంత్రించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్శర్మ అన్నారు. గురువారం నగరంలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, భాజపా రాష్ట్ర నాయకులకు బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం, సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ, హిందూ దేవాలయాల ధర్మ పరిరక్షణ సమితి సంయుక్తంగా వినతిపత్రం అందించాయి. నటుడు మంచు మోహన్బాబు నిర్మించిన కన్నప్ప చిత్రంలో సనాతన ధర్మాన్ని కించపరిచారని శ్రీధర్శర్మ వారికి వివరించారు. గతంలో ‘దేనికై నా రెడీ’ చిత్రంలో ఇలాగే మనోభావాలకు కించపరిచేలా ప్రవర్తించారని గుర్తుచేశారు. ఏపీ అర్చక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వరశాస్త్రి మాట్లాడుతూ కన్నప్ప చిత్రంలో బ్రాహ్మణ జాతి మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయని వాపోయారు. చిత్రంలో ఆ సన్నివేశాలు తొలగించేలా అధికారులకు ఆదేశించాలని వారు కోరారు. దర్శనపు శ్రీనివాస్, ఐలూరు శ్రీనివాస్, యనమదల ఆంజనేయులు, ఎండపల్లి శబరి, చిలుమూరు ఫణి, వేదాంతం లక్ష్మణ్, అర్చక, పురోహిత బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
చెరువులో పడిన కారు
మేదరమెట్ల: విజయవాడ నుంచి శింగరాయకొండకు వెళుతున్న కారు గురువారం ఉదయం కొరిశపాడు జాతీయ రహదారి రొయ్యల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న రహదారి వద్దకు కారు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పిన కారు డివైడర్ కోసం ఉంచిన సిమెంట్ దిమ్మెను ఢీ కొని పక్కనే ఉన్న చెరువులోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణికులు లేకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి చెరువులో పడిన కారును బయటకు తీసే ప్రయత్నాలు చేపట్టారు. -
తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
నరసరావుపేట ఈస్ట్: విశాఖ ఉక్కు కర్మాగారంలో అన్యాయంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా గురువారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసే దానిలో భాగంగా కార్మికుల తొలగింపును చేపట్టడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. విశాఖ ఉక్కు –ఆంధ్రుల హక్కు నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను నేడు పథకం ప్రకారం నష్టాలు వస్తున్నాయనే సాకుతో ప్రైవేటుపరం చేయాలని చూడటం దారుణమన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధులు, గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఏఐటీయూసీ కార్యనిర్వహణ అధ్యక్షుడు ఉప్పలపాటి రంగయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సత్యనారాయణరాజు, అంజిరెడ్డి, ఎం.నాగేశ్వరరావు, లక్ష్మారెడ్డి, ఎస్.దేవి, దీనమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయాం
జె.పంగులూరు: అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన పచ్చాకు ముఠా కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు సీపీఎం ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులు ఉబ్బా వెంకటేశ్వర్లు కోరారు. గురువారం ముప్పవరం గ్రామంలోని బహిరంగ సభ వద్ద మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి వెంకటేశ్వర్లు వినతిపత్రం ఆందజేశారు. కొరిశపాడు మండలం ప్రాసంగలపాడు గ్రామానికి చెందిన పంది కుటుంబాలు పచ్చాకు కార్మికులు నెల్లూరు జిల్లా మర్రిపూడి మండలం డీజీపేట గ్రామంలో పొగాకు పనికి వెళ్లారని, గత మార్చి నెల 31 వ తేదిన ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో, కూలీలు నివాసం ఉంటున్న గుడిసెలు తగలబడిపోయి, అందులో గ్యాస్ సిలిండర్లు పొయ్యిలు, బట్టలు, డబ్బులు, సరుకులు, వంట పాత్రలు మొత్తం తగలబడిపోయి కట్టుబట్టతో మిగిలి పోయారన్నారు. రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నష్టపోయిన పచ్చాకు కార్మికులకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఈ విషయమై ఈ పాటికే కలెక్టర్తో మాట్లాడానని, తప్పకుండా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాకళాకారుడు నందవరపు జాన్ సాహెబ్ ఉన్నారు. పచ్చాకు ముఠా కార్మికులను ఆదుకోండి మంత్రి గొట్టిపాటికి సీపీఎం నేత ఉబ్బా వెంకటేశ్వర్లు నేతృత్వంలో వినతి -
నాణ్యత, మన్నికకు భారతి సిమెంట్
తెనాలిరూరల్: భవన నిర్మాణాలు శాశ్వతమైనవని, నిర్మాణం కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారైన నాణ్యమైన సిమెంటును వినియోగదారులు ఎంచుకోవాలని భారతి సిమెంట్స్ అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్) పూల సురేష్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఎన్.భవానీశంకర్ సూచించారు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామంలోని శ్రీ సాంబశివ ట్రేడర్స్ సహకారంతో భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ మేస్త్రిలు, కార్మికులకు అవగాహన సదస్సును గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ అధునాతన పరిజ్ఞానంతో భారతి సిమెంట్ తయారవుతుందని తెలిపారు. కట్టడాలు పూర్తి నాణ్యతతో దీర్ఘకాలం మన్నేందుకు దోహదపడుతుందన్నారు. సిమెంటు తయారీకి నాణ్యమైన ముడి పదార్థాలనే తమ కంపెనీ ఎంచుకుంటుందని తెలిపారు. భవానీశంకర్ మాట్లాడుతూ భారతి సిమెంట్ వినియోగించిన కాంక్రీట్తో వేసిన శ్లాబులను ఏడు రోజుల అనంతరం తమ కంపెనీ ప్రతినిధులు వచ్చి నాణ్యతా పరీక్షలను చేసి, సిమెంట్ నాణ్యతను భవన నిర్మాణ మేస్త్రిలు, యజమానులకు వివరిస్తామని చెప్పారు. ఇందుకు సంబంధిత డీలరు ద్వారా వివరాలు తెలుసుకుని తమకు సమాచారం అందిస్తే సరిపోతుందన్నారు. మేసీ్త్రల సందేహాలను నివృత్తి చేశారు. సదస్సుకు హాజరైన మేసీ్త్రలు, కార్మికులకు రూ.లక్ష చొప్పున ఉచిత బీమా సదుపాయం కల్పించి బాండ్లను అందజేశారు. శ్రీ సాంబశివ ట్రేడర్స్ యజమాని విష్ణుమొలకల పరమేశ్వరరావు, ఇతర డీలర్లు, భవన నిర్మాణ మేసీ్త్రలు, కార్మికులు పాల్గొన్నారు. -
71 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
పొన్నూరు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే ముఠా గుట్టురట్టయింది. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఓ ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యంను పట్టణ పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ శ్రీహరి తెలిపిన వివరాల ప్రకారం 29వ వార్డులోని ఓ ఇంట్లో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 71 బస్తాల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ వీరానాయక్ బియ్యం నిల్వలను పరిశీలించారు. వినియోగదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు నిల్వ చేసిన 29వ వార్డుకు చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు స్వాధీన పరిచినట్లు ఎస్ఐ తెలిపారు. తెనాలిలో 35 బస్తాలు... తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి నుంచి బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు గురువారం తెల్లవారుజామున అంగలకుదురు వద్ద తనిఖీ చేయగా పట్టణానికి చెందిన రమావత్ లోకేష్ అలియాస్ సూర్యనాయక్ టాటా దోస్త్ వాహనంలో 50 కిలోల చొప్పున ఉన్న 35 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని పెదరావూరుకు చెందిన అశోక్, బాపట్ల జిల్లా కొల్లూరుకు చెందిన కార్తీక్ రేషన్ బియ్యాన్ని వట్టిచెరుకూరులోని రౌస్ మిల్లుకు తరలిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రైస్ మిల్లు ఓనరు లోకేష్, అశోక్, కార్తీక్లపై కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
బాపట్ల టౌన్: భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసిన కేసులో నిందితుడిని బుధవారం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను డీఎస్పీ రామాంజనేయులు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం సాయంత్రం వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ... మండలంలోని చెరువు జమ్ములపాలెం గ్రామం, ఆనంద్నగర్కు చెందిన దాసరి హరీష్ అలియాస్ దాసు ఈ నెల 9న తన భార్య సుభాషిణి(27) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పటించాడు. తీవ్ర గాయాలతో బయటకు వచ్చేసరికి ఆమెను కాపాడేందుకు ఇంటిపక్కనే ఉన్న కొప్పుల సుధారాణి ప్రయత్నించిందన్నారు. కాపాడితే తనను కూడా చంపుతానని బెదిరించాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. బాధితురాలి కేకలు విని గ్రామస్తులు గుమికూడటంతో నిందితుడు అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పారిపోయాడు. సుభాషిణిని చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలిస్తుండగా మృతి చెందింది. హరీష్ అలియాస్ దాసును బుధవారం పట్టణంలోని కమ్మ కల్యాణ మండపం సమీపంలో అరెస్ట్ చేశామన్నారు. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా త్వరితగతిన చార్జిషీట్ తయారు చేసి కోర్టుకు సమర్పిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్ఐ ఐ. శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
తడ‘బడి’న చదువులు
బాపట్ల టౌన్ :పిల్లలను బడికి పంపించాలంటేనే తల్లిదండ్రులు నెల రోజుల ముందు నుంచే కలవరానికి గురవుతున్నారు. రూ.వేలకు వేలు ఫీజులు కట్టాల్సి వస్తోంది. పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, యూనిఫాం, స్కూల్ బస్సు ఫీజులు వెరసి తల్లిదండ్రులకు రూ. 20 నుంచి రూ.30 వేలు కూడా సరిపోని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వాపోతున్నారు. వేసవి సెలవులు అయిపోతున్నాయంటేనే వారిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బడి తెరిస్తే ఫీజులు ఎలా కట్టాలా...? అంటూ మధ్యతరగతి, పేద కుటుంబాలు సతమతం అవుతున్నాయి. ఎల్కేజీ నుంచే భారీగా.. ఎల్కేజీలో పిల్లలకు అంతగా ఏమీ నేర్పరు. అయినప్పటికీ ఓ మోస్తరు ప్రైవేటు స్కూల్లోనూ విద్యార్థికి రూ. 10 వేల నుంచి రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. అదే కార్పొరేట్ స్కూళ్లయితే సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పి రూ. 20 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక పదో తరగతి వరకు అయితే గ్రామీణ, మండల స్థాయి బడుల్లో రూ. 20 వేల నుంచి రూ.30 వేలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో రూ. 50 నుంచి రూ.70 వేలు పైనే వసూలు చేస్తున్నారు. వీటికి యూనిఫామ్ పేరిట మరో రూ. 5 వేలు, బస్సు ఫీజు దూరాన్ని బట్టి నెలకు రూ. 1500 నుంచి రూ.2500 వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇక పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు ఆయా స్కూళ్లలోనే తప్పనిసరిగా కొనాలని నిబంధన పెట్టి రూ. పది వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇదంతా పాఠశాల మొదలయ్యేటప్పుడు పెట్టాల్సిన ఖర్చు కావడంతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. రకరకాల పేర్లతో వసూలు ఇక తరగతులు జరిగే కొద్దీ ఏడాది చివరకు వచ్చేసరికి గైడ్లు, క్వశ్చన్ బ్యాంక్లు, స్టడీ మెటీరియల్, పరీక్షల ఫీజులు, ఐడీ కార్డులు, డైరీలు, వెల్కం, ఫేర్వేల్ పార్టీలు, వార్షికోత్సవాలు.. ఇలా వివిధ పేర్లతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.వేలల్లో వసూలు చేస్తున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించాలంటే మధ్య తరగతి కుటుంబాలు అప్పు చేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఆయా కార్పొరేట్ స్కూళ్లు ఐఐటీ, ఒలింపియాడ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ. 4 వేల నుంచి రూ. 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖాధికారులు స్పందించి ప్రైవేటు పాఠశాలల్లో యూనిఫాం, నోట్పుస్తకాలు, బస్సుల ఫీజులు, పాఠశాల ఫీజు వసూళ్ల విషయంలో చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాఠశాలలకు పూర్వవైభవం తీసుకువచ్చేలా నాడు–నేడుతో వాటి రూపురేఖలనే మార్చేశారు. డిజిటల్ తరగతి గదులు, తరగతి గదిలో ఫ్యాన్లు, బల్లలు, ఆకర్షణీయమైన బ్లాక్బోర్డులు, మరుగుదొడ్లు వంటి సకల వసతులతో బడులు పిల్లలకు స్వాగతం పలికేవి. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది ముగిసినా నేటివరకు ఒక్క పాఠశాలలో కూడా అభివృద్ధి పని చేసిన దాఖలాలు లేవు. కనీసం నాడు–నేడు పనుల్లో మిగిలిన వాటిని కూడా పూర్తి చేయలేదు. నిధులు ఇవ్వకుండా అర్ధాంతరంగా నిలుపుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై కూటమి సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఫీజులపైనా నియంత్రణ ఉండేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కూటమి పాలనలో బడుగు కుటుంబాల్లోని పిల్లలకు విద్యా అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో నూతన విద్యాసంవత్సరానికి స్వాగతం పలకనున్నాయి. ప్రైవేటు బడుల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో కన్నవారికి పెద్ద కష్టమే వచ్చి పడింది. అటు సర్కారు పాఠశాలకు పంపలేక.. ఇటు ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీని తట్టుకోలేక సతమతం అవుతున్నారు. ప్రభుత్వం తల్లికి వందనం కింద ఇస్తానన్న సాయం కూడా అందక విలవిల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో కొరవడిన నియంత్రణ విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పని ఆర్థిక కష్టాలు బడులు తెరుస్తుండటంతో కన్నవారిలో మొదలైన కలవరం ప్రభుత్వ పాఠశాలల్లో అస్తవ్యస్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పూర్తికాని అభివృద్ధి పనులతో విద్యార్థులకు అవస్థలు పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల ఫీజులపై నియంత్రణ ఉండాలంటున్న నిపుణులు నేటి నుంచి తెరుచుకోనున్న ప్రభుత్వ పాఠశాలలు -
ముగిసిన ఫుట్బాల్ వేసవి శిక్షణ శిబిరం
చీరాల రూరల్: చదువుతో పాటు క్రీడలు ముఖ్యమని వైఎస్సార్ సీసీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు అన్నారు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్యాంప్ ఇన్చార్జ్ బొనిగల ప్రేమయ్య ఆధ్వర్యంలో ఎన్ఆర్అండ్పీఎం హైస్కూలు క్రీడామైదానంలో గత 45 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి ఉచిత ఫుట్బాల్ శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న 100 మంది క్రీడాకారులకు సర్టిఫికెట్లతో పాటు ఉచితంగా క్రీడాదుస్తులు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా జైసన్బాబు పాల్గొని మాట్లాడారు. అకుంఠిత దీక్షతో చిన్నారులను చేరదీసి ప్రతిరోజూ సొంత ఖర్చులతో పౌష్టికాహారం అందిస్తూ వారికి ఫుట్బాల్ క్రీడలో మెళకువలు నేర్పించి మంచి నిష్ణాతులుగా తీర్చిదిద్దిన క్యాంప్ ఇన్చార్జ్ ప్రేమయ్యను, క్రీడాకారులకు మంచిగా శిక్షణనిచ్చిన కోచ్లను ఆయన అభినందించారు. శిక్షణ తీసుకున్న చిన్నారులు మంచి క్రీడాకారులుగా మనగలిగి తల్లి దండ్రులకు మంచి పేరుప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. నాలుగు జిల్లాల ప్రాంతీయ ఫుట్బాల్ కోఆర్డినేటర్ నూతలపాటి దేవదాసు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పోలుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, డాక్టర్ అబ్రహం బ్లెస్సీ, బొనిగల క్రాంతి, ఎరిచర్ల సాల్మన్రాజు, ఎన్. నరేష్, ఎన్. బాలశౌరి, కోచ్ ప్రసన్నకుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
విద్యుత్ అదనపు లోడు క్రమబద్ధీకరణ
పర్చూరు(చినగంజాం): పర్చూరు మండలంలో చీరాల విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జాన్ థామస్ ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ ఈఈ ఎం. భాస్కరరావు, డీఈఈ విజయ్ శ్రీనివాసరావు, సిబ్బంది 35 బృందాలుగా ఏర్పడి 287 గృహ సర్వీసులు తనిఖీ చేశారు. అనంతరం పర్చూరు అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. అదనపు లోడు వినియోగిస్తున్న 287 సర్వీసులకు రూ.8,10,600 జరిమానా విధించామని తెలిపారు. పర్చూరు డీఈఈ జె. శ్రీనివాసులు, చీరాల డీఈఈ హరిప్రసాద్రావు, వేటపాలెం డీఈఈ శ్రీనివాసులు, పర్చూరు ఏఈ రమేష్నాయక్, చీరాల డివిజన్ పరిధిలోని ఏఈలు, జేఈలు, లైన్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి లక్ష్మీపురం: అమరావతి రోడ్డులోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా పాఠ్య పుస్తకాలను వేల రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బండారపు యశ్వంత్ డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల వద్ద నేతలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ నారాయణ పాఠశాల యాజమాన్యం అధిక ఫీజులతో దోపిడీలకు పాల్పడుతోందని విమర్శించారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న నారాయణ యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు గండు శివ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నారాయణ, చైతన్య స్కూల్లో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లను, ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రణీత్, ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యదర్శి అమర్నాథ్, నగర సహాయ కార్యదర్శి వెంకట్, నగర నాయకులు అజయ్, భాస్కర్, చందు, సాయి గణేష్, సాయి, టి. అజయ్, సతీష్ పాల్గొన్నారు. రాష్ట్ర పోటీలకు జిల్లా అథ్లెటిక్ జట్టు ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న ఏపీ సీనియర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఎంపిక చేశామని జిల్లా అథ్లెటిక్ సంఘం కార్యదర్శి జీవిఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 14వ తేదీ ఉదయం 6 గంటలకు పోటీలు జరిగే ప్రాంతంలో కోచ్ రవికుమార్కు వయస్సు ధ్రువీకరణ పత్రంతోపాటు ఆధార్ కార్డును అందించాలని సూచించారు. పురుషులు: కృష్ణం నాయుడు, మొహిద్దీన్, రోషన్, వెంకట్ గురు శంకర్, ముజ్బర్, మదన్మోహన్, యుగంధర్, ప్రసన్న కుమార్, ప్రవీణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, మణికంఠ నాయక్, అబ్దుల్లా, అశోక్, ప్రేమ్చంద్, తిరుపతిరావు, రాజమోహన్, ఎస్.శంకర్, దీపు, భరత్ కుమార్, డి.మణికంఠ మహిళలు: ఎస్కే ఆషా, కె.అంకమ్మ, డి.వైష్ణవి, కె.రేష్మి, కృష్ణ రచన. -
నాటు సారా నిర్మూలన అందరి బాధ్యత
చీరాల: నాటు సారా నిర్మూలనకు అందరు సహకరించి నాటుసారా రహిత గ్రామంగా చేసేందుకు కృషి చేయాలని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ దయాసాగర్ అన్నారు. బుధవారం కలెక్టర్ ఆదేశాల మేరకు ఒంగోలు ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు జనార్దన్, బి.వెంకటేశ్వర్లు, ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలు చీరాల మండలం రామ్నగర్ గ్రామాన్ని సందర్శించారు. ప్రజలతో మాట్లాడి నాటుసారా నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అలానే పలు నాటుసారా కేసులతో పాటు, పీడీ యాక్ట్ ఉన్న ముద్దాయిలతో మాట్లాడారు. నాటుసారా వదలాలని, నూతన జీవనోపాఽధికి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చి వారి వివరాలను సేకరించారు. చీరాల ఎకై ్సజ్ సీఐ పి.నాగేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. -
శిడి మహోత్సవం ఆదాయం రూ.4.37 లక్షలు
వేటపాలెం: రామన్నపేట శివారులో వేంచేసియున్న కనక నాగవరపమ్మ అమ్మవారి శిడిమహోత్సవం సందర్భంగా ఆలయానికి రూ. 4.37 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఈఓ పోతిన శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. విరాళాల ద్వారా రూ. 49,700, సాధారణ దర్శనం రూ.33,600, ప్రత్యేక దర్శనాలు రూ. 48,260, షాపులు రూ.81,800, కానుకల హుండీ ద్వారా రూ. 2,24,012 ఆదాయం సమకూరినట్లు తెలిపారు. మొత్తం రూ.4,37,372 లక్షలు ఆదాయం వచ్చినట్లు చెప్పారు. డ్రెయిన్లో పడి మృతి చెందిన వ్యక్తి ఆచూకీ లభ్యం పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు వద్ద కొద్ది రోజుల క్రితం డ్రెయిన్లో పడి మృతి చెందిన వ్యక్తి ఆచూకీని పోలీసులు బుధవారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన తుమ్మిడిపాటి శివ (44) పెళ్లి పనుల కోసం ఈ నెల ఆరో తేదీన విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు వచ్చాడు. అదే రోజు రాత్రి అతను మద్యం మత్తులో నడుచుకుంటూ కానూరు పీవీఆర్ఐకాన్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నాక డ్రెయిన్లో పడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలతో ‘సాక్షి’లో మృతుడి ఫొటోతో ఈ నెల ఎనిమిదో తేదీన వార్త ప్రచురితమైంది. ఈ సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్స్టేషన్కు వచ్చారు. వారి నుంచి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారికి అప్పగించారు. వృద్ధురాలి నేత్రదానం ప్రత్తిపాడు: తాను మరణించినా నేత్రాలు మూతపడకూడదని భావించిన ఓ వృద్ధురాలు వాటిని దానం చేశారు. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు గ్రామానికి చెందిన వృద్ధురాలు మండెపూడి హేమలత (66) నేత్ర దానం చేసి మరణానంతరం మరరొకరికి ఈ లోకాన్ని చూసే అవకాశాన్ని కల్పించారు. హేమలత బుధవారం గొట్టిపాడులోని స్వగృహంలో మధ్యాహ్నం కన్నుమూశారు. ఆమె కోరిక మేరకు నేత్రాలను శంకర కంటి ఆస్పత్రి డాక్టర్ శ్రీనిజ బృందం సేకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారికి గ్రామస్తులు, పెద్దలు అభినందనలు తెలిపారు. -
ముగిసిన చెన్నమల్లేశ్వరుని కల్యాణ వేడుకలు
రేపల్లె: ఇసుకపల్లిలోని భ్రమరాంబ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న త్రైమాసిక కల్యాణ వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూర్ణాహుతి హోమం నిర్వహించారు. అనంతరం వసంతోత్సవం, ధాన్యకుట్టునోత్సవం, త్రిశూల స్నానాలు, పవళింపు సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.81 కలశాలతో వేంకటేశ్వర స్వామికి అభిషేకంతాడేపల్లి రూరల్ : సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి బుధవారం 81 కలశాలతో అభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళశాసనాలతో జ్యేష్ట నక్షత్రం సందర్భంగా ఉదయం 9 గంటలకు స్వామి వారికి 81 కలశాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం హయగీవ్ర హోమం, అష్టోత్తర శతనామార్చన, పూర్ణాహుతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.జీజీహెచ్లో నీటి సరఫరాకు అంతరాయం – తక్షణమే పునరుద్ధరణగుంటూరు మెడికల్: గుంటూరు మున్సిపాలిటీకి చెందిన ప్రధాన ‘ఎ’ లైన్లో నీటి వాల్వ్ మరమ్మతులకు గురైంది. ఈ పైపులైన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లోని ఏడు భవనాలను నీరు సరఫరా అవుతోంది. ఈ సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఆరు భవనాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండగా, ఒక భవనానికి మాత్రమే తాత్కాలికంగా నీటి సరఫరా నిలిచిపోయిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశశ్వి బుధవారం తెలిపారు. విషయం మున్సిపాలిటీ అధికారులకు తెలియజేయగా 90 నిమిషాల్లోనే వాటర్ ట్యాంకర్ను పంపించి ఆ భవనానికి నీటిని అందించారన్నారు. నీటి సమస్య కేవలం మంగళవారం ఒక్కరోజే మాత్రమే తలెత్తిందని తెలిపారు. గత నాలుగు రోజులుగా ఎటువంటి అంతరాయం లేదన్నారు.కొండవీడు కోటలో యోగా కార్యక్రమం రద్దుయడ్లపాడు: కొండవీడు కోటలో బుధవారం ఉదయం జరగాల్సిన ప్రత్యేక యోగా కార్యక్రమం అకాల వర్షం కారణంగా రద్దయింది. జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు ఆధ్వర్యంలో టూరిజం, అటవీ శాఖల పర్యవేక్షణలో వివిధ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ఘాట్రోడ్డులోని చెక్పోస్టు వద్ద ఉదయం 6 గంటల నుంచి గంటన్నరపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. వర్షం కారణంగా చివరి క్షణంలో రద్దు చేశారు. ఈ నెల 18న అమరావతిలోని జ్ఞాన బుద్ధ ప్రాంతంలో చివరి యోగా కార్యక్రమం జరగనుంది. -
ఇంజినీరింగ్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలి
అద్దంకి: ఇంజినీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకుడు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ ఇంజినీరింగ్ కార్మికులు డిమాండ్ల పరిష్కారం కోసం బుధవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీఐటీయూ అనుబంధం ఆధ్వర్యంలో అద్దంకి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తంగిరాల వెంకటేశ్వర్లు సీఐటీయూ అద్దంకి మండల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు జీఓ నెంబర్ 36 ప్రకారం స్కిల్ కార్మికులకు రూ. 24000 ఇవ్వాలని.. అన్ స్కిల్ కార్మికులకు రూ. 21000, రూ. 24500 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతం సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చనిపోయిన కార్మికులకు మట్టి ఖర్చులు కింద రూ. 20,000 ఇవ్వాలని కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని.. సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ కల్పించాలని, ఆప్కాస్ రద్దు చేస్తే కార్మికులను పర్మినెంట్ చేయాలని, రిస్క్ అల్వెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాబోవు కాలంలో కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుందని తెలియజేస్తూ అనంతరం మున్సిపల్ కమిషనర్ డి. రవీంద్రకు సమ్మె నోటీసు ఇచ్చారు. అలాగే జూలై 9 దేశవ్యాప్త ఒక రోజు సమ్మె నోటీసు కూడా ఇచ్చామని తెలిపారు. ఇంజినీర్ విభాగం యూనియన్ నాయకులు ఉసురుపాటి సామేలు, వి, జాన్, మారుతి, కోటేశ్వరరావు, మున్సిపల్ వర్కర్ యూనియన్ నాయకులు పి. ఆదాం, జి. భీష్మ, డైలీ కార్మికులు, నాయకులు, రాఘవయ్య, శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని బుధవారం బాపట్లకు విచ్చేసిన ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డికి బాపట్ల ఆర్టీసీ డిపో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మున్నంగి కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న పాత బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలన్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడిన బాపట్లకు అన్ని ప్రాంతాలను అనుసంధానిస్తూ కొత్త సర్వీసులు అందుబాటులోకి తేవాలని కోరారు. జిల్లా కేంద్రం స్థాయికి తగ్గట్టు ఆర్టీసీ బస్టాండ్ను అభివృద్ధి చేయాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, అద్దె బస్సుల కార్మికులకు చట్ట ప్రకారం వేతన సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యుత్ బస్సులు కేటాయించాలన్నారు. పీఆర్సీ, డీఏలను వెంటనే మంజూరు చేసేందుకు కృషి చేయాలన్నారు. చీరాల– బాపట్ల డిపోలలో సెక్యూరిటీ సిబ్బందిని అదనంగా నియమించాలన్నారు. బాపట్ల గ్యారేజీ, కొత్త బస్టాండులో గుంతలను పూడ్చివేయించాలని కోరారు. యూనియన్ నాయకులు భోగిరెడ్డి తిరుమలరెడ్డి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త బస్టాండ్ను సురేష్ రెడ్డి పరిశీలించారు. మినరల్ వాటర్ ప్లాంట్ వద్దకు వెళ్లి సిబ్బందికి సూచనలు చేశారు. ఆర్టీసీ డిపో, కొత్త బస్టాండు, పాత బస్టాండులో సమస్యలను డిపో మేనేజర్ను అడిగి తెలుసుకున్నారు. కొత్త బస్టాండ్ ఆవరణలో నిలిచిన వర్షపు నీటిలోనే ఆయన పర్యటిస్తూ గుంతలమయమైన ప్రాంగణం చూసి అసహనం వ్యక్తం చేశారు. మరమ్మతులకు తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. -
నారాకయాతనే!
అరచేతిలో ప్రజలకు వైకుంఠం చూపిన కూటమి నేతలు అధికారం చేజిక్కించుకుని ఏడాదైంది. అన్ని వర్గాల ప్రజలను సీఎం నారా చంద్రబాబు నరకయాతనే పెడుతున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, వ్యాపారులు.. ఇలా అన్నివర్గాలను నట్టేట ముంచారు. నిలువునా మోసం చేసి బూటకపు మాటలతో పూటపూటకు మాయ చేస్తూ పబ్బం గడుపుతున్నారు. ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకం అమలుకాలేదు. అభివృద్ధి ఆనవాలు అసలే కనిపించడం లేదు. రెడ్ బుక్ పేరిట అరాచక పాలన మాత్రమే పాలకులకు చేతనైంది. అడ్డగోలుగా కూటమి నేతలు రూ.కోట్లకు పడగలెత్తేలా పరిపాలన సాగుతోంది.సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి వంచన పాలనకు ఏడాది పూర్తయింది. ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ పేరిట ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ చంద్రబాబు సర్కారు నెరవేర్చలేదు. నమ్మించి మోసగించిన సర్కార్పై పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో ఓట్లేయించుకొని గద్దెనెక్కాక వంచిచడంపై మండి పడుతున్నారు. ఇచ్చిన మాట సంగతి దేవుడెరుగు చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు పతాక స్థాయికి చేరాయి. ఇసుక, బుసక, గ్రానైట్, గ్రావెల్ను ట్రిప్పుల లెక్కన విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. పేదల కడుపుకొట్టి చౌక బియ్యాన్ని ఒక్కో ప్రజాప్రతినిధి నెలకు రూ. 25 లక్షలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెడ్బుక్ పాలనను తెరపైకి తెచ్చి హత్యలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఏ ఒక్కవర్గం సంతృప్తిగా లేదు. మొత్తంగా కూటమి ఏడాది పాలన ప్రజాకంఠకంగా మారడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అడ్డగోలుగా ‘పచ్చ’ దోపిడీపర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు, అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ ప్రాంతాల నుంచి రోజూ రూ.కోట్ల విలువైన గ్రానైట్ పలకలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిపోతున్నాయి. పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల నుంచి నిత్యం గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది, చినగంజాం, కడవకుదురు ప్రాంతాల నుంచి జిల్లాతోపాటు తెలంగాణకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ప్రభుత్వ, అసైన్డ్, అటవీ శాఖ భూముల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సముద్ర తీర ప్రాంతాన్ని కూడా వదలడం లేదు. టోల్గేట్లు పెట్టి పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అసైన్డ్ భూములను ఆక్రమించి లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారు.పేదల బియ్యాన్నీ వదల్లేదు...జిల్లాలో రేషన్ మాఫియా విజృంభిస్తోంది. ఒక్కొక్క పచ్చ ప్రజాప్రతినిధి పేదలకడుపు గొట్టి చౌక బియ్యాన్ని నెలకు రూ. 25 లక్షలకు విక్రయిస్తున్నారు. రేషన్ డీలర్లకు చేరకుండానే బియ్యం ప్రభుత్వ గోదాముల నుంచి నేరుగా మాఫియాకు చేరుతోంది. బియ్యం కావాలని అడిగితే రేషన్ కార్డులు రద్దు చేయిస్తామని పచ్చ నేతలు బెదిరిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.అడ్డగోలుగా వసూలుబాపట్ల నియోజకవర్గంలో తీరప్రాంతాన్ని అడ్డు పెట్టి పచ్చ నేతలు తాజాగా టోల్గేట్లు ఏర్పాటు చేశారు. పర్యాటకుల నుంచి వసూళ్లకు దిగారు. వెదుళ్లపల్లి ప్రాంతం నుంచి నిత్యం ఇసుక తరలించి అమ్ముకుంటున్నారు. చీరాల, బాపట్ల నియోజకవర్గాల్లో అక్రమ రిసార్టులు కుప్పలుతెప్పలుగా వెలుస్తున్నాయి. పర్యాటక శాఖ అనుమతులతో పనిలేకుండా పచ్చనేతలు మామూళ్లు పుచ్చుకొని అనధికార అనుమతులు ఇస్తున్నారు. అక్రమ లేఅవుట్ల వ్యాపారం ఇక్కడి పచ్చనేతలకు ఆదాయ వనరుగా మారింది. పిట్టలవానిపాలెం, కర్లపాలెం ప్రాంతాల్లో పేకాట, కోడిపందేలు జోరుగా నడుస్తున్నాయి.వేమూరు నియోజకవర్గంలో కృష్ణానది నుంచి నిత్యం అక్రమంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. పేకాట, కోడిపందేలు అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి. ఇక్కడ మట్టి వ్యాపారం పచ్చ నేతలకు కాసులు కురిపిస్తోంది. రేపల్లె నియోజకవర్గంలో పేకాట, కోడిపందేలు జోరుగా నడుస్తున్నాయి.సూపర్సిక్స్ పేరుతో వంచనఅన్నదాత సుఖీభవ పేరుతో రైతుకు ఏడాదికి రూ. 20 వేలు ఇస్తామన్నారు. రెండో ఖరీఫ్ సీజన్ వచ్చినా జిల్లాలోని 1,92,037 మంది రైతులకు ఇవ్వాల్సిన రూ. 384,06 కోట్లలో పైసా ఇవ్వలేదు.తల్లికి వందన పేరుతో ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామన్నారు. జిల్లాలోని 2,35,654 మందికి రూ. 353.48 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా విదల్చలేదు.నెలకు రూ. 3 వేలు నిరుద్యోగభృతి అన్నారు. జిల్లాలో 4,77,557 కుటుంబాల పరిధిలో ఇంటికొక్కరు అనుకున్నా వారందరికీ చెల్లించాల్సిన రూ. 143. 26 కోట్లలో పైసా రాలేదు.మహిళలకు ప్రతినెల రూ. 1500 ఇస్తామన్నారు. జిల్లాలో 19 నుంచి 59 ఏళ్ల వయస్సున్న వారు 6,61,841 మంది. వీరందరికీ ఏడాదికి రూ. 11,913 కోట్లు ఇవ్వాలి. ఇప్పటికీ ఆ ఊసే మరిచారు.ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పారు. జిల్లాలో మొత్తం 4,60,836 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. మూడు ఉచిత సిలిండర్లకు ఒక్కొక్కరికి రూ. 2,700 చొప్పున ఇవ్వాలి. ప్రభుత్వం 3 లక్షల మందిని మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. మిగతా వారికి ఎగనామం పెట్టింది.మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణమన్నారు. జిల్లాలో ఉన్న ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల గణాంకాల ప్రకారం రోజూ 90 వేల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదు.ఊరూరా బెల్ట్ షాపులుజిల్లా వ్యాప్తంగా బెల్టు షాపులు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. గ్రామగ్రామాన ఇప్పటికే షాపులు పెట్టారు. బెల్టు షాపులకు రూ. 50 వేల నుంచి రూ.లక్ష వరకు డిపాజిట్లు కూడా తమ్ముళ్లు వసూలు చేస్తున్నారు. మద్యం డోర్ డెలివరీ సదుపాయం కూడా కల్పించారు. పేదల బలహీనతను ఆసరా చేసుకుని వారిని నిత్యం మత్తులో ముంచెత్తి అందినకాడికి దోచుకుంటున్నారు.రెడ్ బుక్ పేరిట అరాచకాలురెడ్ బుక్ పాలనను జిల్లాలో అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసిన సామాన్యా ప్రజలను సైతనం టార్గెట్ చేస్తున్నారు. పలుచోట్ల హత్యలు చేస్తున్నారు. దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అక్రమ కేసులు బనాయించి జైళ్ల చుట్టూ తిప్పుతూ రాక్షసానందం పొందుతున్నారు. వేమూరు, రేపల్లె, అద్దంకి, పర్చూరు ప్రాంతాలకు చెందిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేయడమే కాకుండా.. వారిపైనే అక్రమ కేసులు బనాయించారు. ఇలా పలువుర్ని జైళ్లకు పంపారు. వారి ఇళ్లను కూడా వదిలిపెట్టకుండా కూలగొట్టారు.● నగరం మండలం దాసరిపాలెంకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు నున్నా భూషయ్యను పచ్చ పార్టీ నాయకులు ఏకంగా హత్య చేశారు. రెడ్ బుక్ పాలన పేరిట ఇప్పటికే ఎనిమిదికిపైగా హత్యలు జరిగాయి.● బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయనపై వరుస కేసులు బనాయించి హింసిస్తోంది.● వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు మండలం అద్దేపల్లి ఎస్సీ కాలనీలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని పచ్చ పార్టీ వారు పెట్రోల్ పోసి తగులబెట్టగా నిరసనకు దిగిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు.● పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి మండలానికి చెందిన పలువురు ఎస్సీ నేతలపై పచ్చ ప్రభుత్వం రౌడీషీట్లు ఓపెన్ చేసి కక్షపూరితంగా వ్యవహరించింది.● రేపల్లె నియోజకవర్గం చెరకుపల్లి మండలం రాంబొట్లవారిపాలెంకు చెందిన దళిత నాయకుడు రాజ్కుమార్ ఇంటిపై దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు.● ఇదే మండలం గుళ్లపల్లికి చెందిన మాజీ ఎంపీపీ చెన్ను కోటేశ్వరరావుపై పలుమార్లు దాడులకు యత్నించారు. ఆయన డ్రైవర్ గాలి సంపత్కుమార్ అనే దళితుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.● అద్దంకి మండలం ధర్మవరానికి చెందిన వైఎస్సార్సీపీ మండల నేత ప్రభాకరరెడ్డి, ఆయన అనుచరులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. ఆయన పెట్రోల్ బంకుకు నిప్పు పెట్టారు. జేసీబీలను తగులబెట్టారు. -
రమణీయం వేణుగోపాలుని రథోత్సవం
యద్దనపూడి: మండలంలోని పూనూరు గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి రథోత్సవం బుధవారం నేత్రశోభితంగా జరిగింది. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం అనంతరం రథోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. గత సంవత్సరం రూ.1.80 లక్షలతో నూతన రథనిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది రథాన్ని భద్రపరిచేందుకు రథశాల నిర్మాణం చేపట్టి బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు దీవి భావనాచార్యులు వేదపండితుల ఆధ్వర్యంలో స్వామికి విశేష పూజలు చేశారు. ఉదయం గరుడవాహనంపై స్వామి వారికి గ్రామోత్సవం జరిగింది. 11 గంటలకు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు ఏరువాక ఉత్సవాల్లో భాగంగా రైతులు తమ ఎద్దులను, ట్రాక్టర్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా రథం వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో రథాంగ హోమం, రథాంగబలి, దృష్టికుంభం, మంచి రాచగుమ్మడికాయలతో రథానికి దిష్టితీసి కొబ్బరికాయలతో సాత్వికబలి సమర్పించారు. అనంతరం స్వామి వార్లను రథంపై అధిష్టింపచేశారు. స్వామి వారిని చూసేందుకు భక్తులు రహదారులకు ఇరువైపులా బారులుతీరారు. ఈ రథయాత్ర ఆలయం నుంచి 2 కిలోమీటర్ల మేర సాగి, తిరిగి ఆలయానికి చేరుకోవటంతో ఘట్టం ముగిసింది. భక్తులు రథాన్ని లాగుతూ గోవింద నామస్మరణ చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అడుగడుగునా స్వామి వారికి మంగళహారతులతో నీరాజనాలు సమర్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రత్నకుమారి తమ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీఎల్ కుమార్ భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. -
పొలిమేరను పరిశీలించిన ఆర్డీఓ
జె.పంగులూరు: మండల పరిధిలోని చందలూరు, ఇంకొల్లు మండలంలోని కొణికి గ్రామాల సరిహద్దులోని పొలిమేరను చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మంగళవారం పరిశీలించారు. కొణికి గ్రామానికి చెందిన రైతులు వారి సరిహద్దులో చందలూరు వైపు నుంచి పారుతున్న వర్షపు నీరు అడ్డుకునేందుకు మట్టితో కట్టలు వేశారు. దీనివల్ల చందలూరు గ్రామంలోనే వర్షపు నీరు నిల్వ ఉంటూ పంట పొలాలు దెబ్బతింటున్నాయి. దీంతో చందలూరు రైతులు అధికారులను ఆశ్రయించారు. ఈ విషయమై గతంలో తహసీల్దార్ ఇతర అధికారులు పరిశీలించారు. కొణికి గ్రామ రైతులకు నోటీసులు కూడా పంపారు. ఈ విషయమై మళ్లీ పరిశీలించేందుకు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు వెళ్లారు. సమస్య పరిష్కారానికి ఇరిగేషన్ అధికారులు మార్గం చూపాలని వర్షపు నీటి పారుదల కోసం తూములు ఏర్పాటు చేసి ఇరువర్గాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పంగులూరు మండల తహసీల్దార్ పి. సింగారావు, మండల సర్వేయర్ సురేష్, వీఆర్వోలు, ఇరు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
15 లోపు దరఖాస్తు చేసుకోవాలి
రెంటచింతల: స్థానిక ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో వివిధ తరగతులలో ఇంగ్లీష్ మీడియంలో 2025–26 విద్యాసంవత్సరం ప్రవేశం కోరు బాలురు ఈ నెల 15వ తేదీలోపు పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సింహాద్రి మోహన్ కోరారు. మంగళవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రిన్సిపాల్ మోహన్ మాట్లాడుతూ ఖాళీలను తరగతుల వారీగా రోస్టర్ విధానంలో భర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఎస్టీలకు 78 శాతం, ఎస్సీలకు 12 శాతం, బీసీలకు 5 శాతం, ఓసీలకు 2 శాతం, పీహెచ్సీలకు 3 శాతం చొప్పున రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. 5 వ తరగతిలో 40 ఖాళీలు, 6వ తరగతిలో 10 ఖాళీలు, 9వ తరగతి లో 9 ఖాళీలు ఉన్నాయన్నారు. బ్లాక్లాగ్ సీట్లకు ఎస్టీలు మాత్రమే అర్హులన్నారు. ప్రవేశ పరీక్ష జూన్ 16వ తేదీన పాఠశాలలో తరగతుల వారీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుతో పాటు స్టడీ సర్టిఫికెట్, ఆధార్ నకలు, రెండు పాస్పోర్టు ఫొటోలు, తల్లిదండ్రుల రేషన్కార్డును జత చేసి పాఠశాలలో అందజేయాలన్నారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచితంగా విద్య బోధించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 8333925177 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
ముగిసిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్
క్రోసూరు: క్రోసూరులోని జెడ్పీపాఠశాల ఆవరణలో గత నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన రాష్ట్రస్థాయి టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్ మంగళవారం ముగిసింది. మొత్తం 40 జట్లు పాల్గొన్న టోర్నమెంట్లో వైఎంసీఏ, క్రోసూరు జట్టు విజేతగా నిలిచి, ట్రోఫీతోపాటు ప్రథమ బహుమతి కింద రూ.50,116లు అందుకుంది. అదేవిధంగా రన్నర్స్గా సాయిసీసీ, క్రోసూరు జట్టు నిలిచింది. ఆ జట్టుకు రూ.25,116లు అందజేశారు. తృతీయ స్థానంలో నిలిచిన పిడుగురాళ్ల జట్టుకు రూ.10,116లు అందజేశారు. బెస్ట్ బ్యాట్స్మెన్ పిడుగురాళ్లకు చెందిన ప్రకాష్కు రూ.2,116, బెస్ట్ బౌలర్ క్రోసూరుకు చెందిన కోటి రూ 2,116లు నిర్వాహకులు అందజేశారు. పలువురు సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానుల, మాజీ యార్డు చైర్మన్ యేపూరి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
బాల్యవివాహాలతో జీవితాలు చిన్నాభిన్నం
రేపల్లె: బాల్యవివాహాలతో బాలల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని, బాలికలపై లింగవివక్షతను వీడాలని సీడీపీఓ సుచిత్ర పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని 24వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కిశోరి వికాసం సమ్మర్ ప్రత్యేక క్యాంపులో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాలలో రాణిస్తున్నారని చెప్పారు. లింగవివక్ష చూపేవారు చట్టరీత్య శిక్షర్హులన్నారు. బాల్య వివాహాల కట్టడికి ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రస్తుత సమాజంలో సైబర్నేరాలు అధికంగా ఉన్నాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం తమ అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలని, తమ వ్యక్తిగత సమాచారంను ఎవరితోనూ పంచుకోరాదని సూచించారు. కిశోర బాలికలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా తల్లిదండ్రులకుగాని, ఉపాధ్యాయులకుగాని తెలియజేయాలని సూచించారు. అనంతరం బాల్యవివాహాలపై అవగాహన ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శి హిమబిందు, సూపర్వైజర్ శివజ్యోతి పాల్గొన్నారు. సీడీపీఓ సుచిత్ర -
వ్యవసాయ శాఖలో బదిలీలు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు నంద్యాల జిల్లాకు, కృష్ణా జిల్లాలో పని చేస్తున్న యు.నరసింహారావును గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారిగా బదిలీ చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.● గుంటూరు ఏడీఏగా పని చేస్తున్న తోటకూర శ్రీనివాసరావును మంగళగిరికి, మంగళగిరి ఏడీఏగా పనిచేస్తున్న గాయం శ్రీనివాసరెడ్డిని బాపట్లలోని రీజనల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కి, బాపట్ల జిల్లా పర్చూరులో ఏడీఏగా పనిచేస్తున్న ఎన్.మోహనరావును గుంటూరు, గుంటూరులోని భూసార పరీక్ష కేంద్రంలో ఏడీఏగా పనిచేస్తున్న కె.అన్నపూర్ణమ్మను బాపట్ల ఏడీఏగా బదిలీ చేశారు.● గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారిగా యు.నరసింహారావు బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. అయితే, ఆయన ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత కడప జిల్లాలో డీడీఏగా పనిచేస్తున్న ఎ.నాగేశ్వరరావు గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరించేలా ఢిల్లీరావు ఉత్తర్వులు జారీ చేశారు.పలు రైళ్ల రద్దులక్ష్మీపురం: సికింద్రాబాద్–కాకినాడ టౌన్ వయా గుంటూరు రైలును తాత్కాలికంగా రద్దు చేసినట్లు డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్ (07401) సికింద్రాబాద్–కాకినాడ టౌన్ రైలు ఈనెల 12న, రైలు నంబర్ (07402) కాకినాడ టౌన్–సికింద్రాబాద్ రైలు ఈనెల 13న తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.చెరువులో పడి వ్యక్తి మృతిప్రత్తిపాడు: ప్రమాదవశాత్తూ చెరువులో పడి వ్యక్తి మరణించిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ప్రత్తిపాడు మండలం చినకొండ్రుపాడు గ్రామానికి చెందిన షేక్ బుజ్జి(64) హుస్సేన్ స్థానిక పోలిశెట్టి టొబాకో కంపెనీలో క్లినిక్ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఎప్పటిలానే విధులకు హాజరైన ఆయన కంపెనీ ఆవరణలో ఉన్న దేవుని విగ్రహాలకు పూజ చేసేందుకు గాను వాటిని శుభ్రపరిచేందుకు ప్రాంగణంలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదశాత్తూ చెరువులో పడిపోయాడు. గమనించిన కోటయ్య అతని చేతిని అందించి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. కంపెనీ సిబ్బంది సమాచారాన్ని హుస్సేన్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా శ్రమించి మృతదేహాన్ని వెలికి తీయాల్సి వచ్చింది. గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు మృతుని భార్య షేక్ అఫ్జలున్బి ఫిర్యాదు మేరకు ఎస్ఐ కె. నాగేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక యువతి ఆత్మహత్యతెనాలి రూరల్: తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మహిళ అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణ గంగానమ్మపేటకు చెందిన చీమకుర్తి సుబ్రహ్మణ్యం(60) మంగళవారం మధ్యాహ్నం గుండెల్లో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందాడని వైద్యశాల సిబ్బంది చెప్పడంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికే సుబ్రహ్మణ్యం పెద్ద కుమార్తె లక్ష్మీశ్రావణి(23) వారి ఇంటి సమీపంలోని అపార్ట్మెంట్ పైకి ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి ఏడాది కిందట విజయవాడకు చెందిన వ్యక్తితో వివాహమైంది. మనస్పర్ధల కారణంగా పుట్టింట్లో ఉంటూ ఎంబీఏ చదువుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొగాకు రైతులను ఆదుకోవాలి
లక్ష్మీపురం: పొగాకు కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య కోరారు. నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ బృందంతో కలసి ఇద్దరూ మంగళవారం గుంటూరులోని ఎలైన్స్ కేర్ అధినేత చేబ్రోలు రవీంద్ర, పోలిశెట్టి ఇండస్ట్రీ అధినేత పోలిశెట్టి శ్యాంలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది పొగాకుకు ధర ఉండటంతో రైతులు ఈ ఏడాది భారీగా సాగు చేశారని తెలిపారు. కొనుగోలు చేయడానికి కంపెనీలు ముందుకు రాకపోవడంతో అప్పుల్లో కూరుకు పోయి, తీవ్ర ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని వారికి వివరించారు. ఇప్పటికే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన రైతులు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంఘాల ఆందోళనతో ప్రభుత్వం కూడా మార్క్ఫెడ్తో కొనుగోలు ప్రారంభించిదని చెప్పారు. ప్రైవేట్ కంపెనీలు కూడా కొనుగోలు త్వరగా చేస్తే రైతులకు రేటు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇతర కంపెనీలతో కూడా త్వరలో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో తూర్పు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మొహమ్మద్ ముస్తఫా, పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు. కంపెనీలతో చర్చలు జరిపిన రైతు సంఘ నాయకులు -
ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తున్న అధికారులు: ఏపీటీఎఫ్
గుంటూరు ఎడ్యుకేషన్: బదిలీల కౌన్సెలింగ్ పేరుతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తున్నారని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.బసవ లింగారావు, మొహమ్మద్ ఖాలీద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్కు రమ్మని పిలిచిన అధికారులు రాత్రి 8 వరకు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాఠశాలల్లో ఖాళీలను తారుమారు చేశారని, వెబ్ వద్దని పట్టుబట్టి మాన్యువల్ బదిలీలు కోరిన ఉపాధ్యాయులపై విద్యాశాఖ డైరెక్టర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫిరంగిపురం మండలం మొత్తాన్ని ప్రిఫరెన్షియల్ కేటగిరీగా చూపారని పేర్కొన్నారు. నరసరావుపేట మండలం లింగంగుంట్లలో ఉన్న నలుగురిలో ఇద్దరు ప్రిఫిరెన్షియల్ కేటగిరీల్లో పని చేస్తుండగా, మరో రెండూ ఆ కేటగిరీలోనే చూపారని పేర్కొన్నారు. వెబ్ కౌన్సెలింగ్కు సిద్ధం చేసిన జాబితాలు, ఖాళీలు మాన్యువల్ కౌన్సెలింగ్లో ఏ విధంగా మారుతాయని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేషన్ బియ్యం పట్టివేత మేదరమెట్ల: కొరిశపాడు మండలం మేదరమెట్ల హైవే సమీపంలోని యాదవ్ కూల్ డ్రింక్స్ దుకాణం వద్ద పీడీఎస్ బియ్యం బస్తాలు 325 గుంటూరు నుంచి కృష్ణపట్నానికి అక్రమంగా కంటైనర్లో తరలిస్తున్నారు. మేదరమెట్ల ఎస్ఐ మహ్మద్ రఫీ తన సిబ్బందితో దాడి చేసి బియ్యం బస్తాలను కంటైనర్ వాహనాన్ని, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాపట్ల డీఎస్ఓగా జమీర్బాషా బాపట్లటౌన్: బాపట్ల జిల్లా సివిల్ సప్లయిస్ అధికారి(డీఎస్ఓ)గా జమీర్బాషాను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ విభాగంలో జిల్లా అధికారిగా విధులు నిర్వర్తిస్తూ ఇక్కడకు వచ్చారు. ఇక్కడ డీఎస్ఓగా పనిచేస్తున్న విలియమ్స్ను బదిలీపై ఏలూరు జిల్లా డీఎస్ఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం డీఎస్ఓ జమీర్బాషా బాధ్యతలు చేపట్టారు. -
జిల్లా సీనియర్ ఫుట్బాల్ జట్ల ఎంపిక
సత్తెనపల్లి: జిల్లాస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఫుట్బాల్ జట్లకు ఎంపికై న క్రీడాకారులు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి పల్నాడు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఐఎస్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లాస్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఫుట్బాల్ సెలక్షన్ ట్రయల్స్ సత్తెనపల్లి సుగాలి కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగాయి. ఈ ఎంపికల్లో ఐఎస్ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. సెలక్షన్కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 50 మంది మెన్, 40 మంది ఉమెన్ ఫుట్బాల్ క్రీడాకారులు హజరయ్యారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామ్రెడ్డి, అచ్చిరెడ్డి, మహబూబ్ సుభాని, నరసింహారావు, షేక్ మస్తాన్వలి, పీడీ శ్రీనివాసరావు, పీడీ రియాజు పాల్గొన్నారు. రిటైర్డ్ పీడీ ఐఎస్ నాగిరెడ్డిని, అతిథులను పల్నాడు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సుబ్రహ్మణ్యేశ్వరరావు ఘనంగా సత్కరించారు. జిల్లాకు సెలెక్ట్ అయిన ఫుట్బాల్ క్రీడాకారులు త్వరలో జరిగే స్టేట్ మీట్లో పాల్గొంటారన్నారు. -
వక్ఫ్ ఆస్తులను కాపాడుకుందాం
లక్ష్మీపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు పేర్కొన్నారు. పాత గుంటూరులోని ిసీఐటీయూ కార్యాలయంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభాని ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ సుప్రీం కోర్టు పూర్తి ఆమోదం ఇవ్వనప్పటికీ, దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం – 2025 త్వరితరగతిన అమలు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. గుంటూరులోని పెద్ద మసీదు, ప్రతిపాడు మండలం కొత్త మల్లాయపాలెం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 232–1, 2లో 233.18 ఎకరాలు, అంజుమనే ఇస్లామియా సంస్థకు సంబంధించిన చిన్న కాకానిలోని ఎన్నారై ఆసుపత్రి వెనుక ఉన్న 78 ఎకరాలను ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి పేరుతో ఏపీఐఐసీకి బదలాయించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ఖండించారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. చిష్టి మాట్లాడుతూ రూ. 600 కోట్ల విలువ కలిగిన ఆస్తులను బదలాయించడం వక్ఫ్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఆస్తులు నిర్వహణ పారదర్శకంగా జరగాలని, అవి కేవలం పేద ముస్లిం ప్రజల సంక్షేమం కోసమే వినియోగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ కలీం, ముస్లిం హక్కుల పోరాట సమితి నాయకుడు ఖాజావలి, ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బషీర్ అహ్మద్, డీఎంఎస్ జాతీయ నాయకుడు కె.వినయ్ కుమార్, జన చైతన్య వేదిక రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్ రెడ్డి, హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ నాయకుడు ఎండీ జబ్బార్, సీఐటీయూ నాయకుడు కె.నళినీకాంత్, కౌలు రైతు సంఘం నాయకుడు బి.శ్రీనివాసరావు, ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు ఎస్.కె. బాజీ, టోపీ బాబు, ఆవాజ్ నాయకులు ఖాసీం వలి, ఎస్.కె.సైదా పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం -
బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపుదలే లక్ష్యం
సత్తెనపల్లి: బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడమే లక్ష్యంగా కిశోరి వికాసం పేరుతో అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పి.ప్రశాంత్ అన్నారు. కిశోరి వికాసంలో భాగంగా పట్టణంలోని 18వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం నిర్వ హించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కౌమార దశలో బాలికల్లో అనారోగ్య సమస్యలు, ఇతర ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు కిశోర వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. గత నెల 2వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం మంగళవారంతో ముగిసిందన్నారు. ప్రధానంగా మహిళా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బాలల హక్కులు, చట్టాల మీద వీడియో క్లిప్పింగ్ చూపిస్తూ పిల్లలకు, తల్లులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఐసీడీఎస్ సత్తెనపల్లి ప్రాజెక్టు సూపర్వైజర్ ప్రమీల, అంగన్వాడీ కార్యకర్తలు టి.వరలక్ష్మి, జోజికుమారి, ఆయాలు ఎన్.భారతి, కుమారి, కౌమార బాలికలు, తల్లులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ -
సైనిక నియామకాల్లో పారదర్శకత
వేటపాలెం: సైనిక నియామకాల్లో పారదర్శకత పాటిస్తామని గుంటూరు ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ అనుదీప్ కుమార్ పేర్కొన్నారు. చీరాల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఎన్సీసీ క్యాంపులో ఎన్సీసీ క్యాడెట్లకు సైనిక నియామకాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైన్యంలో జవాన్లు, నాన్ కమీషన్డ్ అధికారులు, టెక్నికల్ ఎంట్రీ, ఆర్మీ నర్స్లు, లాజిస్టిక్స్ తదితర విభాగాల ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. సైనిక నియామకాలపై నేరుగా అధికారిక వెబ్సైట్ లేదా సైనిక రిక్రూట్మెంట్ కార్యాలయాల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా యువతకు శారీరక, మానసిక తయారీ కోసం పలు సూచనలు ఇచ్చారు. సైనికాధికారిని ఘనంగా సన్మానించారు. కెప్టెన్ పోతూరి శ్రీనివాస్, లెఫ్ట్నెంట్ హరీష్, రాజేష్బాబు, దివ్య, శ్రీమన్నారాయణ, శేషగిరిరావు, ఫాతిమా, గోపీనాథ్, సుబేదార్ ముకేశ్కుమార్, సబూర్, అవతార్సింగ్ పాల్గొన్నారు. అర్మీ రిక్రూట్మెంట్ అధికారి మేజర్ అనుదీప్ కుమార్ -
ఫలించిన గురువుల పోరాటం
గుంటూరుఎడ్యుకేషన్:ఎస్జీటీల బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేసి, మాన్యువల్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆందోళనలు ఫలించాయి. డీఈవో కార్యాలయాల ముట్టడి, నిరాహార దీక్షలతో ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ప్రభు త్వం దిగి వచ్చింది. ఎట్టకేలకు మాన్యువల్ కౌన్సెలింగ్కు అంగీకరించింది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో మాన్యువల్ విధానంలో జరగనున్న కౌన్సెలింగ్కు హాజరుకావాలంటూ విద్యాశాఖాధికారులు సోమవారం రాత్రి ఉపాధ్యాయులకు సమాచారాన్ని చేరవేశారు. తొలుత 350 మందికి పిలుపు సీనియార్టీ జాబితాలో పేర్లు ఉన్న మొదటి 350 మంది ఉపాధ్యాయులను పిలవడంతో ఉమ్మడి గుంటూరు జిల్లావ్యాప్తంగా వారంతా జెడ్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభించాలి. విద్యా శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి సీనియార్టీ జాబితాలతో పాటు కౌన్సెలింగ్కు సంబంధించి విధి, విధానాలు రావాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులను వేచి ఉండమని చెప్పారు. రాత్రి 8.30 గంటలకు కూడా పిలవక పోవడంతో ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు జెడ్పీ ప్రాంగణంలోని చెట్ల కింద గడిపారు. రాత్రి 8.30 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రారంభించని అధికారులు సాంకేతిక కారణాలతో బుధవారం ఉదయానికి వాయిదా వేశారు. -
సాక్షి కార్యాలయంపై టీడీపీ నేతల దాడిపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: మంగళగిరి ఆత్మకూరులోని సాక్షి యూనిట్ కార్యాలయంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం దాడి చేసిన సంఘటనపై మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో పత్రిక ప్రతినిధులు, పాత్రికేయులు మంగళవారం ఫిర్యాదు చేశారు. మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ను సాక్షి మంగళగిరి ఆత్మకూరు బ్రాంచ్ మేనేజర్ గోపి, బ్యూరోలు రమేష్, అశోక్, ఇతర మీడియా మిత్రులతో కలసి ఫిర్యాదు చేశారు. ఇటువంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాక్షి కార్యాలయంపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను గుర్తించి కేసు నమోదు చేయాలని ఎస్ఐ వెంకట్ను వారు కోరారు.అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రిఅద్దంకి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం మండలంలో పర్యటించారు. దానిలో భాగంగా పట్టణంలోని గరటయ్య కాలనీకి సమీపంలో నూతనంగా రూ.1.46 కోట్లతో నిర్మించిన యూపీహెచ్సీ భవనాన్ని ప్రారంభించారు. తరువాత గోవాడ గ్రామంలో బీటీ రోడ్డును, కొటికలపూడి గ్రామంలో నిర్మించిన అంతర్గత సీసీ రహదారులను, పార్వతీపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొటికలపూడి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని క్లస్టర్ హైరింగ్ సెంటర్కు రాయితీపై డ్రోన్ను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళీ, అధికారులు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించిన జోన్ చైర్మన్పట్నంబజారు: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ను మంగళవారం ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ ఎస్.సురేష్రెడ్డి సందర్శించారు. గుంటూరు–1, 2 డిపోల పరిధిలోని గ్యారేజీలను తనిఖీ చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో తిరుగుతూ ప్రయాణికులను బస్సులో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ పరిధిలో స్టాల్స్ను స్వయంగా తనిఖీ చేశారు. ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ ఆర్ఎం రవికాంత్తో కలిసి రికార్డులు పరిశీలించారు.రవాణా శాఖలో బదిలీలుపట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖలో బదిలీలు జరిగాయి. గుంటూరులో మోటార్ వాహనం తనిఖీ అధికారులు గోపాల్ను చిలకలూరిపేటకు, సంధ్య నెల్లూరుకు, అనిల్ కందుకూరుకు, బాలకృష్ణ మంగళగిరికి బదిలీ అయ్యారు. వారి స్థానంలో నరసరావుపేట మంగళగిరిలో విధులు నిర్వహిస్తున్న శ్రావ్య, విజయ సారథి గుంటూరుకు బదిలీ అయ్యారు. మంగళగిరిలో అసిస్టెంట్ మోటర్ వాహన తనిఖీ అధికారిగా పనిచేస్తున్న పవన్ నరసరావుపేటకు బదిలీ అయ్యారు. నెల్లూరులో విధులు నిర్వహించే సాయి ధరమ్ తేజ్ తెనాలికి బదిలీ అయ్యారు.భక్తులతో పోటెత్తిన కార్తికేయుని ఆలయంమోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం మంగళవారం భక్త సంద్రంగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. స్వామివారి నిత్యకల్యాణంలో 73 జంటలు పాల్గొన్నాయి. ఒక్క రోజునే రూ.9,07,678ఆదాయంవచ్చిందని తెలిపారు. -
ప్రభుత్వంలో స్పందన కరవు
రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడపటం కూటమి సర్కార్కు పరిపాటిగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే పదుల సంఖ్యలో మహళలపై దాడులు, అత్యాచారాలు జరిగితే ఏ ఒక్క కేసులో దానికి బాధ్యులను కఠినంగా శిక్షించిన దాఖలాలు లేవు. వాస్తవాలను పక్కనపెట్టి వక్రీకరణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. –షేక్ అప్సర, మండల ఉపాధ్యక్షురాలు, బాపట్ల మండలం -
యోగా మహోత్సవం
నేడు కొండవీడులో యడ్లపాడు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకుని యోగా ప్రాధాన్యత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికీ తెలిసేలా జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు యోగాపై అవగాహన కల్పిస్తూ..జిల్లా వ్యాప్తంగా యోగాపై వివిధ రకాల పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రం నరసరావుపేటలో మంగళవారం ప్రతి మండలానికి ముగ్గురు చొప్పున విద్యార్థులకు జిల్లాస్థాయిలో యోగా సాధనపై పోటీలు జరిగాయి. కొండవీడుకోట వేదికగా బుధవారం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. కొండవీడు కోట ఘాట్రోడ్డు ప్రారంభంలోని చెక్పోస్టు వద్ద ఉదయం 6 గంటల నుంచి గంటన్నరపాటు యోగా ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. దీంతో ఘాట్రోడ్డు ప్రాంతంలో యోగాభ్యాసానికి వేదిక, కార్యక్రమానికి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను శుభ్రం చేయించి సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో చివరిగా ఈనెల 18వ తేదీన అమరావతిలోని జ్ఞానబుద్ధ ప్రాంతంలో నిర్వహించనున్నారు. ఘాట్రోడ్డు వేదికగా ‘యోగాంధ్ర 2025’ ప్రత్యేక కార్యక్రమం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాట్లు -
కమనీయం వేణుగోపాలుని కల్యాణం
యద్దనపూడి: వేదమంత్రాలు, సుమంగళ వాయిద్యాలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. మండలంలోని పూనూరు గ్రామంలో కొలువై ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. అర్చకులు దీవి భావనాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజాపక ఆరాధన, ధ్వజారోహణం, ధ్వజపూజ, భేరిపూజ, సంప్రోక్షణ హోమాలు నిర్వహించారు. తదుపరి స్వామివారి మూలవిరాట్లకు సుప్రభాతసేవలు, పంచామృతాభిషేకాలు, విశ్వక్ష్సేణపూజ, పుణ్యాహవచనం, రక్షబంధనం, వేద్యాయనం, హోమాలు, నిర్వహించి స్వామివారి మూలవరులకు సువర్ణ, రత్న ఆభరణ అలంకారం, విశేషపూలంగి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు ఉత్సవమూర్తులను పసిడి, రజిత వజ్రాభరణాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం 7 గంటలకు ముమ్మారు గర్భగుడి ప్రదక్షిణ చేయించారు. తదుపరి విద్యుత్ కాంతుల ధగధగలతో వెలుగులీనుతున్న ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణవేదికపై స్వామివారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేశారు. కల్యాణ వేదికపై స్వామివారు తన ఉభయదేవేరులతో కలిసి ముగ్దమనోహరంగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు సంప్రదాయంగా పట్టుపంచె ధరించి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కల్యాణ క్రతువును నారాయణం పవన్కుమార్, నారాయణం శ్రీనివాసాచార్యులు, నారాయణం మనోజ్ ఆధ్వర్యంలో కల్యాణ వేడుకను నేత్రపర్వంగా నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం ఆలయ ఈఓ జీవీఎల్ కుమార్, కల్యాణ ఉభయదాత రాటకొండ హనుమంతరావు, రాధిక దంపతులు స్వామివార్లకు తలంబ్రాలు, తాళిబొట్టు, కల్యాణ వస్త్రాలు సమర్పించారు. ఆలయాన్ని విద్యుత్దీపాలతో అలంకరించారు. కల్యాణం అనంతరం స్వామివారి తలంబ్రాలను, తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో స్వామివారి కల్యాణాన్ని తిలకించి తరించారు. -
మహిళా సాధికారిత జగన్తోనే సాధ్యం
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు మహిళా సాధికారిత కోసం చిత్తశుద్ధితో పనిచేసింది. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ను పక్కగా అమలుచేస్తూ చట్టం చేసిన ఘనత జగన్కే దక్కింది. సంక్షేమ పథకాల సొమ్మును నేరుగా మహిళల ఖాతాల్లో జమచేసి మహిళల అభ్యున్నతికి కృషిచేశారు. నిరుపేదలైన మహిళలను సొంతింటి వారిని చేయాలనే లక్ష్యంతో వారి పేరుతో నివేశన పట్టాలు అందజేశారు. –వేల్పుల మీరాబీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు -
ఉన్మాదిని ఉరితీయండి
బాపట్లటౌన్: ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి కాల్చిచంపిన ఉన్మాది భర్తను ఉరితీయాలంటూ మృతురాలి బంధువులు ముక్తకంఠంతో నినదించారు. మండలంలోని చెరువుజమ్ములపాలెంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న దాసరి సుభాషిణి(28)పై ఆమె భర్త హరీష్ (టీడీపీ నాయకుడు) పెట్రోలు పోసి నిప్పంటించాడు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. సుభాషిణి మృతికి కారకుడైన కిరాతక భర్తను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మంగళవారం ఉదయం 8 గంటలకు జమ్ములపాలెం గ్రామ సమీపంలోని బాపట్ల–పెదనందిపాడు రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఆందోళన కొనసాగింది. మండుటెండను కూడా లెక్కచేయక మహిళలంతా ఆందోళనలో పాల్గొన్నారు. మృతురాలి తల్లి మేరిమ్మ మాట్లాడుతూ చెప్పుడు మాటలు విని, అనుమానంతో అతి కిరాతకంగా చంపిన వాడిని వెంటనే ఉరితీయండి...నడిరోడ్డుపై కాల్చి చంపండి...నా కూతురుతోపాటే వాడిని కూడా పూడ్చేయాలంటూ డిమాండ్ చేసింది. గుండెలు పగిలేలా రోదించిన ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. మృతురాలి మేనత్త సునీత మాట్లాడుతూ సుభాషిణిను అతి కిరాతకంగా చంపిన వాడిని పెట్రోలు పోసి తగలపెట్టేవరకు ధర్నా విరమించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మృతురాలి చెల్లి హారిక మాట్లాడుతూ మా అక్క పెళ్లి అయి 13 సంవత్సరాలైంది, నేను, మా అక్క ఇద్దరం ఒకే ఊరిలో ఉంటామని చెప్పింది. అయినా ఏరోజు కూడా మా అక్కను మా ఇంటికి పంపలేదు, బంధువులతో మాట్లాడినా కొట్టేవాడని చెప్పింది. అప్పటి నుంచి కూడా నరకం అనుభవిస్తూనే ఉందని, మా గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు చెప్పిన తప్పుడు మాటలు విని ఇంట్లో నిద్రిస్తున్న మా అక్కపై పెట్రోలుపోసి నిప్పంటించాడని పేర్కొంది. మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుపైనే కూర్చున్నా ఏ ఒక్క అధికారికానీ, నాయకుడు కానీ మా మొర ఆలకించిన దాఖలాలు లేవంటూ వాపోయింది. కఠినంగా శిక్షించేవరకు రాస్తారోకో విరమించేది లేదు బాపట్ల–పెదనందిపాడు రోడ్డుపై బైఠాయించిన మృతురాలి బంధువులు పాలకుల తీరుపై మండిపడిన గ్రామస్తులు టీడీపీకి చెందిన కొందరు నాయకులు, మహిళలు ధర్నా చేస్తున్న ప్రదేశానికి వెళ్లి ధర్నా విరమించాలంటూ సూచించారు. అధికారం ఉందనే ఆహంతో భార్యను అతి కిరాతకంగా పెట్రోలు పోసి చంపిన భర్తపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా న్యాయంకోసం పోరాడుతున్న మమ్ములను ఇక్కడి లేవమంటారా.. అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామంటూ పోలీసులు ఇచ్చిన హామీ మేరకు రాస్తారోకో విరమించారు. -
ప్రభుత్వ తీరుపై నినదించిన మహిళలు
బాపట్లటౌన్: కూటమి పాలన తీరుపై మహిళలు గర్జించారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలను నిరసిస్తూ మంగళవారం వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బాపట్లలోని పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రం రావణకాష్టం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం రావణకాష్టంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో చంద్రబాబునాయుడు విఫలమయ్యారని అన్నారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేసినా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈనెల 3న తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమెను రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తున్నాయన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్న బాబు రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారన్నారు. పేరుకు మహిళ హోం మినిస్టర్ అయినా, పెత్తనం అంతా చంద్రబాబుదేనని అన్నారు. గతంలో కాల్మనీ, సెక్స్రాకెట్లను పెంచిపోషించిన ఘనుడు కూడా చంద్రబాబే అన్నారు. మహిళలకు ఒక్క పథకం కూడా అమలుచేయకపోవడం వలన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ సర్కార్లో 11 పథకాలు మహిళలకే ప్రత్యేకంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు అంజని ప్రసాద్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నక్కా వీరారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మల్లెల పవన్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరి జి. పుష్పరాజ్యం, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వేల్పుల మీరాబీ, బాపట్ల ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, కర్లపాలెం ఎంపీపీ యారం వనజ, బాపట్ల మండల ఉపాధ్యక్షురాలు షేక్ అప్సర, పట్టణ వైఎస్సార్సీపీ అధ్యక్షులు కాగిత సుధీర్బాబు, మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలురెడ్డి మహిళా ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. బాపట్లలో నిరసన ప్రదర్శన భారీగా తరలివచ్చిన మహిళలు మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి సర్కారు విఫలం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున -
ఏపీ ఈఏపీసెట్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపారని ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. లక్ష్మీపురంలోని సంస్థ కార్యాలయంలో సోమవారం జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల వారీగా వి. రూపశ్రీ (40)వ ర్యాంకు, ఎన్. రక్షిత్ ఇన్నా (72), షేక్ నిహాల్ పర్వేజ్ (74), ఓ. సుష్మ కౌస్తుభరాణి (96), జి. శ్రీలేఖ (110), ఎండీ గబీష్ ఐమన్ (298)వ ర్యాంకు సాధించారని తెలిపారు. వెయ్యిలోపు (96), రెండువేల లోపు (147), ఐదువేల లోపు (358) ర్యాంకులతో పాటు 10వేల లోపు (763) ర్యాంకులు సాధించామని చెప్పారు. ఆయా ర్యాంకులతో 98 శాతం మంది విద్యార్థులు ఈఏపీ సెట్లో అర్హత సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా డీన్లు కిశోర్, సురేష్, చంద్రశేఖర్, కృష్ణ, ఏజీఎం ఎల్టీసీ శ్రీనివాస్, అన్ని క్యాంపస్ల ప్రిన్సిపాల్స్, ర్యాంకర్లకు, తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. -
ప్రభుత్వం దిగొచ్చే వరకూ పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: సెకండరీ గ్రేడ్ టీచర్ బదిలీల్లో వెబ్ కౌన్సెలింగ్ను రద్దు చేసి మాన్యువల్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళనను ఉధృతం చేశారు. ఉమ్మడి గుంటూరుజిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నాయకులు, ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక ఉమ్మడి గుంటూరు జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకుడు కె.బసవలింగారావు మాట్లాడుతూ ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖాధికారులు మోసపూరితంగా వెబ్ ఆప్షన్లకు దిగారన్నారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తేవడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా డీఈవో కార్యాలయాల ముట్టడి ద్వారా ప్రభుత్వానికి నిరసన తెలియజేసినప్పటికీ, ప్రభుత్వంలో చలనం రాలేదని విమర్శించారు. పుండుమీద కారం చల్లినట్లు విద్యాశాఖా మంత్రి లోకేష్ మాన్యువల్ కౌన్సెలింగ్కు చట్టం అడ్డం వస్తుందని చెప్పడం, నమ్మిన ఉపాధ్యాయులను మోసం చేయడమేనని తెలిపారు. జీఓ117 రద్దు, తెలుగు మాధ్యమ పునరుద్ధరణ, పని ఒత్తిడ తగ్గింపుపై ఇచ్చిన మూడు హామీలు అమలు చేయకుండా మోసగించారని ఆరోపించారు. ఐక్యవేదిక నాయకులు ఎం.కళాధర్, డి.పెదబాబు, జీవీ రామకృష్ణ , సోషలిజం మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ వద్దని ఒక పక్క ఉద్యమం చేస్తుంటే మరొక పక్క డీఈఓ, ఎంఈవో కార్యాలయాల నుంచి ఉపాధ్యాయులకు ఫోన్లు చేస్తూ వెబ్ఆప్షన్స్ ఇచ్చుకోవాలాని బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ అనుభవం లేని మహిళా ఉపాధ్యాయులను ఏడిపించడం ఈ ప్రభుత్వానికి, మంత్రికి మంచిది కాదని హితవు పలికారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. నిరాహార దీక్ష శిబిరాన్ని సీనియర్ మహిళా నాయకురాలు కుసుకుమారి ప్రారంభించారు. శిబిరంలో ఐక్యవేదిక నాయకులు ఎం.హనుమంతరావు, ఎస్. రామచంద్రయ్య, మహమ్మద్ ఖాలీద్, డీకే సుబ్బారెడ్డి, వినయ్, సంపత్, షకీలా బేగం, జి.దాస్, కె.కృష్ణారావు, సుభాని, ప్రసాద్, సుబ్బారావు పాల్గొన్నారు. మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పట్టు నిరాహార దీక్ష చేపట్టిన సంఘాల నాయకులు -
ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలి
బాపట్లటౌన్: విద్యార్థి దశనుంచే ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. పట్టణంలోని సాయిరాం గార్డెన్స్ కన్వెక్షన్ హాల్లో సోమవారం షైనింగ్ స్టార్ 2025 అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఇంటర్మీడియట్, పదో తరగతి విద్యలో అత్యధిక మార్కులు సాధించిన జిల్లా, మండల స్థాయిలోని విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందించారు. పదో తరగతిలో 164 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్లో 36 మంది విద్యార్థులను అధికారులు సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమూల్యమైన విద్యార్థి జీవితం చెడు వ్యసనాలతో పెడదోవపట్టరాదన్నారు. భావి జీవితంలో ఉన్నత స్థానాలను అలంకరించే స్థాయికి ఎదగాలన్నారు. నేటి సమాజానికి దిక్సూచిలా మారాలని, ఆత్మాభిమానంతో ముందుకు వెళ్లాలన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని విద్యార్థులు గుర్తించాలి, క్రమశిక్షణతో కష్టపడి చదివితే మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవచ్చన్నారు. మాదకద్రవ్యాలు, గంజాయి వంటి చెడు వ్యసనాలతో ప్రలోభాలకు దరికావద్దన్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ ఇష్టంతో కష్టపడి చదవండి, మీకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడుతూ ప్రతిభావంతులను వెలికి తీసి, సమాజం కోసం ప్రయోజకులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి గ్లోరియా, డీఈవో పురుషోత్తమ్, ఆర్ఐఓ ఆంజనేయులు, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి -
చదరంగంతో పెరగనున్న మేధాశక్తి
గుంటూరు ఎడ్యుకేషన్: భారతదేశంలో పురాతన ఆటగా మొదలైన చదరంగం అంతర్జాతీయ స్థాయిలో నేడు ప్రముఖ క్రీడగా గుర్తింపు పొందిందని గుంటూరు జిల్లా ఇన్టాక్ కన్వీనర్ ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కలెక్టర్ బంగ్లా రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో సోమవారం జిల్లా స్థాయి చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బాలబాలికలకు చిన్న వయసు నుంచే చదరంగంలో మెళకువలను నేర్పాలని తెలిపారు. ఆట ద్వారా వ్యూహాత్మక ఎత్తుగడల నైపుణ్యత, మేధో పరిజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం ఏర్పడి ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఎదిగేందుకు దోహదం చేస్తుందని వివరించారు. భారతీయ విద్యా భవన్స్ కార్యదర్శి పి.రామచంద్రరాజు మాట్లాడుతూ భవన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీల్లో జిల్లావ్యాప్తంగా 150 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని నైపుణ్యాలను ప్రదర్శించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ కోశాధికారి కేతరాజు సుభాష్, ప్రిన్సిపాల్ హేమాంబ, ఆనంద్ చెస్ అకాడమీ నిర్వాహకుడు గోపి పాల్గొన్నారు. -
శ్రీవారి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న దేవదాయ శాఖ అధికారులు
గుంటూరు రూరల్: గోరంట్లలోని శ్రీలక్ష్మీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని దేవదాయ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. స్వామి వారి రూ.9 కోట్లు విలువచేసే బంగారం, వెండి ఆభరణాలను ఈఓ వెంకటేశ్వరరావుకు ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు యర్రంశెట్టి వేణుగోపాల్ అందజేశారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు, నల్లపాడు సీఐ వంశీధర్, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో వేణుగోపాల్ వాటిని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 22 సంవత్సరాల కిందట దేవాలయాన్ని ప్రతిష్టించామని, అప్పటి నుంచి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ కొంతమంది పనిగట్టుకొని కావాలనే వేణుగోపాల్ పైన అభాండాలు వేయడం వల్ల దేవదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయన హయాంలోనే భక్తులు ఇచ్చిన కానుకలతో స్వామికి ఆభరణాలు చేయించారని చెప్పారు. లాకర్లో ఉన్న ఆభరణాలను తీసి అందరి సమక్షంలో ఆయన అధికారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. గోరంట్లలో తొమ్మిది దేవాలయాలను నిర్మించిన వేణుగోపాల్ సేవలు ఇంకా కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ పెద్దలు కంచర్ల ఆంజనేయులు, ఆల శివారెడ్డి, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, నాగేశ్వరరావు, మహేందర్, ఆంజనేయులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో కూటమి ప్రభుత్వం బంతాట
తాడేపల్లి రూరల్ : కృష్ణాజిల్లా ఈడుపుగల్లులోని అంబేడ్కర్ ఐఐటీ నీట్ మహిళా అకాడమీ(గురుకుల పాఠశాల)ని మైలవరానికి తరలించ వద్దంటూ విద్యార్థినులు సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నీట్, ఐఐటీ శిక్షణకు అద్దె భవనాలలో అకాడమీని స్థాపించారని తెలిపారు. 2014–15, 2015–16 సంవత్సరాల్లో శిక్షణకు గాను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 100 మంది విద్యార్థులను ఎంపిక చేసుకుని, ఒక్కొక్కరికీ రూ. 75 వేలు ఫీజుగా చెల్లించి కార్పొరేట్ కళాశాలల్లో చేర్చే వారని తెలిపారు. దీంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలం కావడంతో ర్యాంకులు సాధించే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 2017లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చీఫ్ సెక్రటరీ రావత్, సెక్రటరీ రాములు, చైర్మన్, అధికారులు బోర్డు మీటింగ్ నిర్వహించి విద్యార్థులకు కార్పొరేట్ విద్యకు దీటుగా ఐఐటి, నీట్ అకాడమీలు స్థాపించడానికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో ఈడుపుగల్లులో అంబేడ్కర్ ఐఐటీ నీట్ మహిళా అకాడమీ ఏర్పాటు చేశారని వివరించారు. అధికారులు అలసత్వం వహించి విద్యార్థుల సంఖ్యను తగ్గించడం, నిర్ణీత సమయానికి అడ్మిషన్లు ఇవ్వకపోవడంతో ఆశయం పూర్తిగా నెరవేరలేదని విమర్శించారు. ఈ స్థితిలో విద్యార్థులు, భావితరం వారి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈడుపుగల్లు నుంచి విద్యార్థులను తరలించే కార్యక్రమాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. -
‘కలం’ ఎత్తిన సాక్షి ఉద్యోగులు
జిల్లావ్యాప్తంగా సాక్షి కార్యాలయాలు, యూనిట్ ఆఫీస్లపై దాడులు చేస్తున్న తెలుగుదేశం పార్టీ మహిళలు, రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం సాక్షి ప్రతినిధులు గుంటూరులో స్పెషల్ బ్రాంచ్ సీఐ అళహరి శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ కార్యాలయాలపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దౌర్జన్యాన్ని ఖండిస్తూ మంగళగిరిలోని సాక్షి కార్యాలయం ఉద్యోగులు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నేతల దురాగతాన్ని ఖండించారు. – లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) -
మూడు బైకులు ఢీ
రాజంపేట: కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని రాజంపేట గుండ్లూరు క్రాస్ రోడ్డులో మూడు బైక్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బోయనపల్లిలో ఇంజినీరింగ్ చదువుతున్న గుంటూరుకు చెందిన మోహనకృష్ణ(20) మృతి చెందాడు. రామాపురానికి చెందిన ఇద్దరు, చొప్పావారిపల్లికి చెందిన ఇద్దరు, సమీప తోటలో పనిచేసే మరో వ్యక్తి గాయపడ్డారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ ఇవ్వాలి లక్ష్మీపురం: కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వాలని, భూ యజమాని సంతకం తొలిగించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌలు రైతుల సమస్యలపై ఈనెల 11న నిర్వహిస్తున్న ‘చలో మంగళగిరి’ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఎన్నికల ముందు కూటమి నేతలు పాత కౌలు చట్టాన్ని రద్దు చేస్తామని, భూ యజమాని సంతకం తొలగించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కొత్త చట్టం తీసుకొస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అన్నదాత సుఖీభవ కిందట రూ. 20 వేలు ప్రతి కౌలు రైతుకు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా పథకాలు ఊసే లేదని విమర్శించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ, జిల్లా అధ్యక్షులు బి.రామకృష్ణ, సహాయ కార్యదర్శి పాశం రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు పాల్గొన్నారు. జిల్లా ఏడీఎంగా సత్యనారాయణ చౌదరి కొరిటెపాడు: గుంటూరు జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులుగా అనంతపురం జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న సత్యనారాయణ చౌదరి నియమితులయ్యారు. ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన బదిలీల ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లా ఏడీఎంగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేస్తున్న బి.రాజబాబు తిరువూరు మార్కెట్ యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శిగా నియమితులయ్యారు. మరో రెండు రోజుల్లో ఏడీఎంగా సత్యనారాయణ చౌదరి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పలువురికి గాయాలు -
పత్రికా కార్యాలయాలపై దాడి హేయమైన చర్య
బాపట్లటౌన్: పత్రికల్లో వార్తలు ప్రచురించారనే అక్కసుతో పత్రికా కార్యాలయాలపై దాడులు చేయటం హేయమైన చర్యని బాపట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ సలహాదారుడు ఉప్పాల శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం సాక్షి కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా బాపట్ల జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ సీఐకు వినతిపత్రం అందజేశారు. ఉప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పత్రికా కార్యాలయాల గేట్లు ధ్వంసం చేయటం, కార్యాలయాలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేయటం, సాక్షి నేమ్ బోర్డులు ధ్వంసం చేసి తగలపెట్టడం సమంజసం కాదన్నారు. దీనికి కారణమైన వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు బిజివేముల రమణారెడ్డి, జి.రాఘవేంద్రరావు, మురికిపూడి అంజయ్య, అంగిరేకుల కోటేశ్వరరావు, శీలం సాగర్, తోటకృష్ణమూర్తి, షేక్ మస్తాన్వలి, చిన్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ సంఘం సభ్యులు పట్టణ సీఐకు వినతిపత్రం అందజేత -
నిలువు‘దోపిడీ’
దేవుడి సన్నిధిలో ఆధ్యాత్మికత వెల్లివిరియాల్సిన ఆలయాల్లో అవినీతి తాండవిస్తోంది. భక్తుల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని దుకాణదారులు దోపిడీ చేస్తున్నారు. గుడిలో అడుగు పెట్టింది మొదలు చదివించుకోవాల్సిందే. దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన ఆలయ అధికారులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఆలయాల నిర్వహణ అధ్వానంగా మారింది. పట్టించుకోవాల్సిన దేవదాయ శాఖ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పట్నంబజారు: పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో అవినీతి అడ్డూ అదుపు లేకుండా పోయింది. భక్తులకు సిబ్బంది కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. కొద్ది రోజుల కిందట గుంటూరుకు చెందిన ఒక కుటుంబం ఆలయానికి వచ్చింది. రూ. 400తో అభిషేకం టికెట్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలో పూజ సామగ్రి కిట్ కొనుగోలుకు వెళ్లింది. రూ. 300 అని చెప్పడంతో కంగుతిన్నారు. చిన్న సైజు రెండు కొబ్బరికాయలు, నాలుగు గులాబి పువ్వులు, ఐదు రూపాయలు విలువ చేసే సాంబ్రాణి కడ్డీల ప్యాకెట్, పది రూపాయల పాల ప్యాకెట్ ఉన్న కిట్టుకు రూ. 300 వసూలు చేయడంతో భక్తులు ప్రశ్నించారు. ఇష్టముంటే కొనుక్కో..లేకపోతే లేదంటూ దుకాణదారుడు మండిపడ్డాడు. కనీసం ఆలయంలో కూడా రేట్ల పట్టిక బోర్డులు లేకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. పొంగలికి విచిత్రమైన రేట్లు పొంగలి విషయంలోనూ వ్యాపారులకు వత్తాసుగా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారు. తడి బియ్యం అర కిలో లోపు రూ. 70, కిలో లోపు రూ. 100, కిలో దాటి రూ. 150 అంటూ.. విచిత్ర రేట్లు ఫిక్స్ చేశారు. గ్యాస్ సిలిండర్, స్టౌ, పలు సామాన్లు అందించాల్సిన కాంట్రాక్టర్ కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. అధికార పార్టీ వ్యక్తి హల్చల్ తీరా టికెట్ కొనుగోలు చేసి వెళితే క్యూలైన్ దగ్గర ఉండే ఒక వ్యక్తి ‘‘అడపా’’ దడపా ‘‘లక్ష్మణ’’ రేఖ గీస్తుంటాడు. ఆలయంలో అంత తాను చెప్పిన విధంగానే జరగాలంటూ.. అధికార పార్టీకి చెందిన వ్యక్తినంటూ హల్చల్ సృష్టిస్తున్నాడు. అభిషేకాలు, ప్రత్యేక దర్శనాలకు సంబంధించి కొంత మంది సిబ్బంది నేరుగా డబ్బులు వారి జేబుల్లో వేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఔట్ సోర్సింగ్ సిబ్బంది మద్యం తాగి అర్ధరాత్రులు విధుల్లోకి వస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ అర్చకులు, సిబ్బంది కై ంకర్యం ● పొన్నూరు ఆంజనేయస్వామి దేవస్థానంలో సైతం ఇదే పరిస్థితి నెలకొని ఉంది. దేవదాయ శాఖకు చెందాల్సిన సొమ్మును ఆలయ అర్చకులు, సిబ్బంది కలిసి కై ంకర్యం చేస్తున్నారు. నేరుగా అర్చకుడి వద్దకు వచ్చి ఇవ్వాళ్ల టోకెన్ల వాటా ఏదీ అంటూ.. భక్తుల ముందే అటెండర్లు తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనపడుతోంది. భక్తులు క్యూలో నిలబడి ఉన్న సమయంలో అర్చకులు వారి డబ్బులు లెక్క వేసుకుని, అటెండర్లకు ఇచ్చే పని తప్పా భక్తులను పట్టించుకోకపోవడం దారుణం. టికెట్ కొనుగోలు చేసి వచ్చిన వారికి కనీసం గోత్ర, నామాలు కూడా చెప్పకుండా, అటెండర్లు తీసుకునివచ్చిన వారికి, అర్చకులు విజిటింగ్ కార్డులు ఇచ్చి పిలిపించుకున్న వారికి మాత్రమే అధిక ప్రాధాన్యం లభిస్తోంది. ● గుంటూరు వేంకటేశ్వరస్వామి ఆలయం, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కంఠంరాజు కొండూరు, వైకుంఠపురంతో పాటు అనేక ప్రధాన ఆలయాల్లో వేలం పాటల్లో దుకాణాలు దక్కించుకున్న వారు కనీసం రేట్ల పట్టికలు కూడా పెట్టడం లేదు. ఇష్టానుసారంగా అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల ఉన్న పరిస్థితిని బట్టి రూ. 100 నుంచి రూ. 300పైగానే పూజా కిట్లను అమ్ముతున్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాల్లో దుకాణదారుల దందా పూజ సామగ్రి అధిక ధరలకు అమ్మకం చోద్యం చూస్తున్న అధికారులు చర్యలు తీసుకుంటాం ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం. కచ్చితంగా సిబ్బంది నిబంధనలకు లోబడే విధులు నిర్వర్తించాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రత్యేక విజిలెన్స్ సిబ్బందిని ఏర్పాటు చేసి, షాపులు, పొంగలి షెడ్డులో అధిక రేట్లు వసూళ్లకు పాల్పడకుండా చర్యలు చేపడతాం. – లీలాకుమార్, కాకాని శివాలయం, కార్యనిర్వాహణధికారి -
విద్యార్థులు లక్ష్యంతో ముందుకెళ్లాలి
గుంటూరు ఎడ్యుకేషన్: చదువులో ప్రతిభ చూపి, ప్రతిభావంతులుగా నిలిచిన విద్యార్థులు జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకునేందుకు స్థిరమైన లక్ష్యంతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. గత విద్యా సంవత్సరంలో గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల నుంచి టెన్త్, ఇంటర్మీడియెట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 150 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతిభా పురస్కారాలు అందించారు. పొన్నూరు రోడ్డులోని బీ కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడారు. పాఠశాల విద్యలో మండలాల వారీగా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల నుంచి టెన్త్లో 112 మంది, ఇంటర్మీడియెట్లో 38 మంది చొప్పున 150 మంది విద్యార్థినీ, విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థికీ రూ.20 వేలు నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందిస్తున్నట్లు వివరించారు. మండలానికి ఆరుగురు చొప్పున టెన్త్లో 600 మార్కులకు 500కు పైబడిన విద్యార్థులతో పాటు ఇంటర్మీడియెట్లో 830కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపిక చేశామని తెలిపారు. షైనింగ్ స్టార్ అవార్డులు పొందిన విద్యార్థులతో పాటు కృషి చేసిన ఉపాధ్యాయులు, ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రైవేటు రంగానికి మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ షేక్ సజీల, పాఠశాల విద్య, ఇంటర్ విద్య ఆర్జేడీలు లింగేశ్వరరెడ్డి, జె.పద్మ, డీఈవో సీవీ రేణుక, ఆర్ఐవో జీకే జుబేర్, ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ కె.వెంకట్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి ఏ. తిరుమలేష్, సమగ్ర శిక్ష ఏపీసీ పద్మావతి, డీవైఈవోలు సీహెచ్. ఏసురత్నం, నిర్మలకుమారి, ఎంఈవోలు పాల్గొన్నారు. సీఎం, లోకేష్లపై పొగడ్తలు ప్రతిభా పురస్కారాలు అందుకున్న విద్యార్థులతో విద్యాశాఖాధికారులు సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను తెగ పొగిడించారు. రాష్ట్రంలో విద్యారంగం కొత్తగా ఏడాది వ్యవధిలోనే అభివృద్ధి చెందినట్లు, వీరిద్దరే కారకులన్నట్లుగా పొగడ్తలతో ముంచెత్తడం తల్లిదండ్రులను విస్మయానికి గురి చేసింది. ప్రైవేటు విద్యార్థులే అధికం జిల్లాలో షైనింగ్ స్టార్ అవార్డులకు ఎంపిక చేసిన 150 మంది విద్యార్థుల్లో 116 మంది ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివిన వారే ఉన్నారు. ప్రభుత్వ రంగంలో చదివిన పేద కుటుంబాలకు చెందిన కేవలం 34 మందిని మాత్రమే ఎంపిక చేసింది. ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం, విద్యాశాఖ ప్రైవేటు, కార్పొరేట్కే పట్టం కట్టింది. అవార్డులు అందుకున్న 112 మంది టెన్త్ విద్యార్థుల్లో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 85 మంది ఉండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 27 మంది మాత్రమే ఉన్నారు. అదే విధంగా 38 మంది ఇంటర్ విద్యార్థుల్లో 31 మంది ప్రైవేటు, ఏడుగురు ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి -
పోరాటాలతోనే హక్కుల పరిరక్షణ
గుంటూరు ఎడ్యుకేషన్: నిరంతర పోరాటాలతోనే హక్కులను పరిరక్షించుకోగలమని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు పేర్కొన్నారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్ వద్ద సోమవారం 79వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వమే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన సమరంలో బానిస సంకెళ్లను బద్దలు కొట్టి, 1946 మే 1న ఎస్టీయూ ఆవిర్భవించిందని తెలిపారు. 1947 జూన్ 9వ తేదీ నుంచి అధికారిక గుర్తింపు పొందిన తొలి ఉపాధ్యాయ సంఘం అని వివరించారు. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కలిగిన ఎస్టీయూ 78 ఏళ్లుగా నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ప్రగతి పథంలో పయనిస్తోందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటు వివిధ సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వాలతో పోరాడి, సాధించడంలో విశేష కృషి చేసిందని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉద్యమాలకు పుట్టినిల్లు ఎస్టీయూ అని చెప్పారు. సంఘ ఉద్యమ నేతలు మగ్దుం మొహిద్దీన్, పీవీ రాఘవాచారి, వీణా విజయ రామరాజు, పి. శ్రీరామమూర్తి వంటి నాయకల త్యాగం మరువలేనిదని కొనియాడారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేస్తూ సంఘ పురోభివృద్ధికి పాటుపడాలని పెదబాబు సూచించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ మొహబూబ్ సుభాని, నాయకులు పి. దిబ్బయ్య, వై. శ్యాంబాబు, యు. మహంకాళరావు, ఎంపీ సుబ్బారావు పాల్గొన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పెదబాబు -
రైతు కుటుంబానికి పరామర్శ
జె.పంగులూరు: అప్పుల పాలై గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువ రైతు తల్లపనేని శ్రీనాథ్ కుటుంబాన్ని ఆదివారం డీఎస్పీ మహ్మద్ మొయిన్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు పరామర్శించారు. మృతికి గల కారణాలు అధికారులను, స్థానికుల నుంచి తెలుసుకున్నారు. గత సంవత్సరం 2.10 ఎకరాల పొగాకు, 2.50 ఎకరాల మిర్చి, 4.80 ఎకరాల మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు. పంటలు సరిగా పండక, దిగుబడులు రాక రూ. 18,68,437 వరకు శ్రీనాథ్ అప్పుల పాలైనట్లు చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.6.50 లక్షలు, బ్యాంకుల నుంచి రూ. 11 లక్షలు అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ గ్రామంలో ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు రుణాన్ని మంజూరు చేయించాల్సిందిగా అధికారులకు సూచించారు. వివరాలు ప్రభుత్వానికి పంపించి న్యాయం జరిగే విధంగా చూస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సింగారావు, ఎస్ఐ వినోద్బాబు, ఏఓ సుబ్బారెడ్డి, ఆర్ఐ శ్వేత, వీఆర్ఓలు పావని, చింపారావు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు రైతు తల్లపనేని శ్రీనాఽథ్ మృతికి గల కారణాలపై ఆరా ప్రభుత్వానికి ప్రతిపాదనలు -
ప్రపంచ శాంతే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి
చిలకలూరిపేట టౌన్: ప్రపంచ ప్రార్థనల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో భక్తి శోభ అలముకున్నది. ప్రతిరోజూ ఉదయాన్నే గత 49 రోజులుగా నిరంతరాయంగా ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం 50వ రోజుతో ఘనమైన ముగింపు పలికారు. ప్రత్యేక ప్రార్థనలతో ప్రపంచ ప్రార్థనల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు పాస్టర్ ఎంఎన్ మూర్తి (సూరిబాబు) అధ్యక్షతన జరిగిన ఈ ప్రార్థనల్లో నియోజకవర్గానికి చెందిన వివిధ క్రైస్తవ సంఘాల పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వశాంతి నెలకొనాలని, భారతదేశం ఐక్యంగా వర్ధిల్లాలని, శాంతి, భద్ర తల వాతావరణం నిరంతరం కొనసాగాలని వారు ప్రార్థించారు. దేశాభివృద్ధికి మానవీయ విలువలు అనుసరణీయమవ్వాలన్న ఆకాంక్షను ప్రార్థనల ద్వారా వెలిబుచ్చారు. ప్రార్థనలు ముగిశాక సంఘీభావానికి ప్రతీకగా ప్రేమవిందు ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాస్టర్లు ఎం.ఎన్. మూర్తి, ఎన్.థామస్, జి. బుజ్జి, బసికాపురం అబ్రహం, టి. క్రీస్తురాజు, ఎం. మోషే, ఎన్. అబ్రహం, బి. సుబ్బారావు, డి. జీవరత్నం, ఎన్. వసురాజు, పాల్సారఽథి, ఎస్. డేవిడ్, ఎస్. దావీదురాజు, విజయమేరీ నక్షత్రం, ఎం. జ్ఞానయ్య, సతీష్ కుమార్, ఎం. సంసోను, కె. శాంతిసాగర్, కోటి వీరయ్య, అన్నామణి, శారా, విజయ అనసూయ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ప్రపంచ ప్రార్థన దినోత్సవం నియోజకవర్గ దైవసేవకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన గత 50 రోజులుగా ఉదయకాల ప్రార్థనలు -
ఘనంగా నటుడు గిరిబాబు జన్మదిన వేడుకలు
మేదరమెట్ల: ప్రముఖ సినీ నటుడు యర్రా గిరిబాబు 83వ జన్మదిన వేడుకలను ఆయన స్వగ్రామం రావినూతలలో కుమారుడు, ప్రముఖ సినీనటుడు రఘుబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రఘుబాబు మాట్లాడుతూ సొంత గ్రామం అంటే తన తండ్రికి ఎంతో ఇష్టం అని చెప్పారు. గ్రామంలో చిన్న కార్యక్రమం చేస్తున్నా ఆయన తప్పక హాజరయ్యేవారని తెలిపారు. ప్రస్తుతం అనారోగ్య కారణాలవల్ల రాలేక పోయారని.. ఈనెలలో గ్రామానికి తప్పక వస్తారని రఘుబాబు తెలిపారు. పలువురు మాట్లాడుతూ మరెన్నో పుట్టిన రోజు వేడుకలను గిరిబాబు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పుట్టిన రోజు కేక్ను రఘుబాబు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో డాక్టర్ హృదయనాథ్, సీఐ మల్లికార్జునరావు, కొరిశపాడు ఎస్ఐ సురేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి
లక్ష్మీపురం: పొగాకు పండించి కొనేవారు లేక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు శివశంకర్ వరప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, వారి కుటుంబానికి నివాస స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఏ ఆధారం లేని ఆ కుటుంబానికి స్వయం ఉపాధి కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద మృతుడు శివశంకర్ వరప్రసాద్ కుటుంబాన్ని నేతాజీ, జిల్లా కమిటీ సభ్యులు వై.కృష్ణకాంత్లు కలిసి పరామర్శించి ఆత్మహత్యకుగల కారణాలు అడిగి తెలుసుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో పంట మీద వచ్చిన ఆదాయంతో స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మాణం చేసుకోవాలని కౌలు రైతు శివశంకర్ అనుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.20వేలు కౌలు చొప్పున 11 ఎకరాలు కౌలుకి తీసుకుని పొగాకు పంట వేశారన్నారు. బ్యాంకులు అప్పు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుని పంట వేశారన్నారు. పండించిన పొగాకు కొనేవారు లేక అప్పులు తీర్చే పరిస్థితి కనబడకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతు అత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబంలో ఒకరికి స్వయం ఉపాధికి అవకాశం కల్పించాలని, నివాసం కోసం స్థలం కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి : కౌలు రైతు సంఘం డిమాండ్ అప్పుల బాధ తాళలేక, గిట్టుబాటు ధరలేక ప్రత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు చెందిన పొగాకు కౌలు రైతు కావూరి శివశంకర వరప్రసాద్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రామకృష్ణ, కె.నాగమల్లేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావులు ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే పొగాకు కొనుగోలు చేయాలని, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన కౌలు రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు కౌలు రైతు మృతదేహానికి నివాళి -
బాపట్ల క్రీడాకారులకు బహుమతులు
బాపట్ల: రాష్ట్రస్థాయి 12వ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బాపట్లకు చెందిన క్రీడాకారులకు బహుతులు దక్కాయి. మే 31 నుంచి జూన్ రెండో తేదీ వరకు జరిగిన పోటీల్లో 74 కేజీల విభాగంలో షేక్ నజీర్ 260కేజీల బరువును ఎత్తి ద్వితీయ స్థానంతో సిల్వర్ మెడల్ సాధించారు. 65కేజీల విభాగంలో బత్తుల సాంబశివరావు 265కేజీల బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఇద్దరూ కర్ణాటకలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బాపట్లలో పలువురు క్రీడాకారులను అభినందించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి పట్నంబజారు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌత్రా సెంటర్లో నివాసం ఉండే కొనగండ్ల మోహన వెంకటకృష్ణ (56) ఈనెల 7వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఉన్న పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగ తగలడంతో షాక్కు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పదస్థితిలోవ్యక్తి మృతి నకరికల్లు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నకరికల్లులోని ఇనిమెట్ల రోడ్డులో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన చందా మీరావలి(38) నకరికల్లులోని ఇనిమెట్ల రోడ్డులో గల మద్యం దుకాణం వద్ద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ చల్లా సురేష్, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు కొన్నిరోజులుగా మద్యం మత్తులో తిరుగుతున్నాడని, ఆదివారం కూడా తాగేందుకు నకరికల్లు వచ్చినట్లు సమాచారం. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
మెకానిక్ ముసుగులో ద్విచక్ర వాహనాలు చోరీ
గుంటూరు రూరల్: చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించేదుకు చోరీలను పాల్పడుతున్న ఇరువురిని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అడవి తక్కెళ్ళపాడులోని నల్లపాడు పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశఽంలో సౌత్ జోన్ డీఎస్పీ భానోదయ తెలిపిన వివరాల ప్రకారం గోరంట్ల గ్రామానికి చెందిన పరిమిశెట్టి లక్ష్మణ్ ఆటోడ్రైవర్గా పనిచేస్తుంటాడు. అతనికి పాతగుంటూరుకు చెందిన పాత నేరస్తుడు బైక్ మెకానిక్గా పనిచేసే చల్లా అంజిబాబు పరిచయమయ్యాడు. దీంతో ఇరువురు కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం ప్రారంభించారు. ఇరువురు పాత నేరస్తులే.. గుట్టు చప్పుడు కాకుండా ఆసుపత్రులు, పార్కులు, ఇతర రద్దీగా ఉండే ప్రదేశాల్లో పార్కింగ్ చేసే వాహనాలను, తాళాలు వేయని వాహనాలను గుర్తించి చోరీలకు పాల్పడేవారు. ఈక్రమంలో ఈనెల 1వ తేదీన గోరంట్ల ఇన్నర్ రింగ్రోడ్డులోని విజయశ్రీ ఆసుపత్రి సమీపంలో రోడ్డుపై పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని ఇరువురు చోరీ చేశారు. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు నల్లపాడు సీఐ వంశీధర్ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను ఆదవారం నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరాలను ఒప్పకున్నారు. నిందితులు 2012 నుంచి నేర ప్రవృత్తిని కలిగి ఉన్నారని విచారణలో తేలిందన్నారు. నిందితుల వద్దనుంచి రూ.13లక్షల విలువ చేసే 22 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు ఛేదించటంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ జనార్దన్, సిబ్బంది సుబ్బారావు, మస్తాన్వలి, నూరుల్ల, బిక్షునాయక్, సాంబశివరావులను జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితులను కోర్టుకు అప్పగించారు. బెక్ చోరీల కేసులో ఇద్దరు అరెస్టు 22 వాహనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ భానోదయ -
తాడేపల్లిలో రామ్రాజ్ షోరూం ప్రారంభం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఆదివారం రామ్రాజ్ కాటన్ షోరూంను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ జాతీయ ధర్మకర్త, పారిశ్రామికవేత్త డాక్టర్ పుట్టగుంట వెంకట సతీష్కుమార్ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ రామ్రాజ్ కాటన్ దుస్తులు ఉత్పత్తి చేయడం చాలా ఆనందించ దగ్గ విషయమని, నాణ్యతా ప్రమాణాల్లో ఎంతో శ్రద్ధ తీసుకుంటుందని, మన తాడేపల్లిలో ఇలాంటి షోరూం ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయ దొంతిరెడ్డి వేమారెడ్డి (డీవీఆర్), శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.ఎస్.రామారావు, బక్షి మోటార్స్ ల్యాండ్ లార్డ్ సత్ప్రీత్ సింగ్ లాంబా, రామ్రాజ్ కాటన్ వ్యవస్థాపకులు కె.ఆర్.నాగరాజన్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు ఢీ : వ్యక్తి మృతి ముగ్గురికి గాయాలు దుగ్గిరాల: ఎదురెదురుగా వస్తున్న ద్వి చక్రవాహనాలు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం చిలువూరు దగ్గర సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమర్తలూరు మండలం, ప్యాపర్రు గ్రామానికి చెందిన కొల్లూరి వీరాంజనేయులు(35) గుంటూరులో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గుంటూరు వెళ్లి తిరిగి వస్తుండగా దుగ్గిరాల మండలం చిలువూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొంది. ఘటనలో వీరాంజనేయులు తలకు తీవ్ర గాయమై, రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో బైక్పై తీవ్రంగా గాయపడిన రాయపూడి డేవిడ్ను చికిత్స నిమిత్తం ఎయిమ్స్కు, మరో ఇద్దరు క్షతగాత్రులను విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని మంగళగిరి ఎయిమ్స్కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శ్రష్టి వర్మపై ‘మా’ అధ్యక్షుడికి ఫిర్యాదు లక్ష్మీపురం: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేసిన దేశ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. గుంటూరు నగరంలోని శనివారం జరిగిన కన్నప్ప ప్రీ రిలీజ్ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి విచ్చేసిన మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణును కలిసిన కరీం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ సినీ కొరియోగ్రాఫర్గా ఉన్న శ్రష్టి వర్మ జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూలను కించపరుస్తూ మాట్లాడారన్నారు. స్టార్ హీరోలను సైతం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయన పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన మంచు విష్ణు విచారించి, ఏడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. -
ప్రహరీ కూలి మహిళ దుర్మరణం
చీరాల రూరల్: ప్రహరీ కూలి మహిళ మృతి చెందిన సంఘటన ఆదివారం చీరాల మరియమ్మపేటలో చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు.. ఆండ్ర ఆనందరావు, రోజ్మేరీ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆదివారం సుమారు 11:30 గంటల సమయంలో మేళం హనుమంతరావు తన ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నాడు. పక్కనే నివాసముంటున్న ఆండ్ర ఆనందరావు, రోజ్మేరీలు ప్రహరీ పక్కన ఉన్న తమ సామాన్లు సర్దుకుంటున్నారు. ఇంతలోనే పక్కనే ఉన్న ప్రహరీ అకస్మాత్తుగా భారీ శబ్దంతో కూలిపోయింది. పక్కనే ఉన్న రోజ్మేరీ గోడకింద పడటంతో మృతి చెందింది. ఆమె భర్త ఆనందరావుకు తల పగిలి, కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు శిథిలాలను తొలగించి ఇద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోజ్మేరీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ నాగభూషణం తెలిపారు. రోజ్ మేరీ మృతితో మరియమ్మపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అందరితో ఎంతో కలివిడిగా ఉండే ఆమె మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు -
దుర్గమ్మ సన్నిధిలో భారీ రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల సన్నిధికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున తరలివచ్చి ఆదిదంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారుజాము ఆరు గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఆలయంలోని అన్ని క్యూలైన్లలో రద్దీ కనిపించింది. ఆదిదంపతులైన దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10–30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ.300 టికెట్ల ద్వారా బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మరో వైపున రూ.100, సర్వ దర్శనం క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ కనిపించింది. సర్వదర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. అమ్మవారి సన్నిధిలో సూర్యోపాసన సేవ లోక కళ్యాణార్థం సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ భక్తులు సూర్యభగవానుడికి విశేష పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు రూ. 300 క్యూలైన్ ద్వారా ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆలయ సిబ్బందిపై భక్తుడి దాడి గాలిగోపురం వద్ద ఉన్న స్కానింగ్ పాయింట్ వద్ద ఓ భక్తుడు ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం రూ. 500 టికెట్లు, వీఐపీ దర్శనాలు నిలిపివేసింది. అయితే, ఓ భక్తుడు ఘాట్రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకునే సమయంలో రూ. 500 టికెట్లు కావాలని అడిగాడు. అయితే ఈవో ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలు నిలిపి వేసినట్లు సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో గాలిగోపురం వద్దకు చేరుకున్న భక్తుడు అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగడమే కాకుండా ఆలయ అధికారులు, సిబ్బందిని నోటికి వచ్చినట్లు దూషించసాగాడు. ఇదేమిటని అడిగిన వన్టౌన్ కానిస్టేబుల్ను సైతం నెట్టి వేయడంతో వివాదం మరింత పెరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు భక్తుడు సెక్యూరిటీ గార్డు, ఆలయ సిబ్బందిపై దాడి చేయడంతో వారు వెంటనే అతన్ని అవుట్పోస్ట్కు తరలించారు. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు సదరు భక్తుడిని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆదివారం రికార్డు స్థాయిలో దర్శనాలు -
నమ్మించి నయవంచన
● మాన్యువల్ కౌన్సెలింగ్పై మాట తప్పిన విద్యాశాఖామంత్రి లోకేష్ ● వెబ్ కౌన్సెలింగ్ వద్దు.. ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తాం ● ఉపాధ్యాయుల ముట్టడితో దద్దరిల్లిన ప్రకాశం భవన్ ● వందలాదిగా తరలివచ్చిన ఉపాధ్యాయులు ● రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఒంగోలు సిటీ: ఎస్జీటీ, పండిట్లు, పీఈటీల బదిలీలను మాన్యువల్ విధానంలో నిర్వహిస్తామని మాట ఇచ్చిన విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ నమ్మించి మోసం చేశారని, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. వెబ్ కౌన్సెలింగ్కు వ్యతిరేకంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఆదివారం ప్రకాశం జిల్లా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉపాధ్యాయులు కలెక్టరేట్ లోపలికి వెళ్లకుండా గేట్లు వేశారు. ఉపాధ్యాయులను లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకా జనార్దనరెడ్డి అధ్యక్షత వహించారు. కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పెట్టుకుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తామని హెచ్చరించారు. ఇది చరిత్రలో రుజువైన సత్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 13,777 ఎస్జీటీలకుగాను 177 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. వారు కూడా అధికారుల ఒత్తిడి వల్లే దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం అత్యంత హేయంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖామంత్రి నారా లోకేష్ జరిపిన చర్చల్లో ఎస్జీటీలకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నమ్మించి మాట తప్పిన ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ఎప్పటికీ మాన్యువల్ కౌన్సెలింగే కావాలని, వెబ్ కౌన్సెలింగ్ వద్దని తేల్చి చెప్పారు. అయితే మాన్యువల్ కౌన్సెలింగ్ సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారని, జిల్లా స్థాయిలో డీఈఓ, ఎంఈఓలకు వెబ్ కౌన్సెలింగ్కు సంబంధించిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్జేడీ చెబుతున్నారని తెలిపారు. ఒక్కొక్కరూ ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చని నమ్మబలుకుతున్నారని, దీనిని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు ఎవరూ వెబ్ ఆప్షన్ పెట్టుకోవద్దని సూచించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్జీటీ, పీఈటీ, పండిట్లకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని సీనియారిటీ జాబితాలో ఉన్న లోపాలను సరిచేసి ఫైనల్ జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ప్రతినిధి చల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ వెబ్ కౌన్సెలింగ్ వల్ల ఉపాధ్యాయులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారానే బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏపీయూఎస్ రాష్ట్ర ప్రతినిధి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ నాయకులతో చర్చించాలని కోరారు. ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి.కీర్తి మాట్లాడుతూ ఉద్యమం బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. బీటీఏ రాష్ట్ర ప్రతినిధి పర్రె వెంకటరావు మాట్లాడుతూ ఉన్నతాధికారుల సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు షేక్ అబ్దుల్ హై, వీరాంజనేయులు, రవి, కె.ఎర్రయ్య, బి.వెంకటరావు, లక్ష్మీనారాయణ, డి.శ్రీనివాసులు, దిలీప్కుమార్, మాధవరావు, వై.వెంకటరావు, హిమజ, పులి శ్రీను, ఎన్. అంజిరెడ్డి, పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం డీఈఓ కిరణ్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025
అద్దంకి నియోజకవర్గం జె.పంగులూరు మండలం జనకవరానికి చెందిన రైతు తల్లపనేని శ్రీనాథ్ అప్పుల బాధతో మే నెల 23వ తేదీ రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీనాథ్ కరోనా ముందువరకు బళ్లారిలో కౌలు వ్యవసాయం చేశారు. అక్కడ అప్పులు అధికమై సొంత గ్రామం జనకవరం వచ్చారు. పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గత ఏడాది 7 ఎకరాల్లో నల్లబర్లీ, జూట్, శనగ సాగు చేశారు. మూడు పంటలను కొనేవారు లేకుండా పోయారు. రూ. 30 లక్షల వరకు అప్పులయ్యాయి. రుణాలు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక తనకున్న 2.14 ఎకరాల భూమిని అమ్మేశారు. అయినా అప్పులు తీరే పరిస్థితి లేకపోవడంతో మే నెల 23వ తేదీ రాత్రి పొలానికి వెళ్లిన శ్రీనాథ్ అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంతో కుటుంబం రోడ్డున పడింది. ఇంకొల్లు మండలం దుద్దుకూరు అంబేడ్కర్ నగర్కు చెందిన రైతు బిల్లా శాంసన్ 30 ఎకరాలకుపైగా కౌలుకు తీసుకొని బ్లాక్ బర్లీ, మిర్చి, శనగ పంటలు సాగు చేశారు. ఇందుకోసం బ్యాంకుల్లో బంగారం తాకట్టుపెట్టి కొంత, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద మరికొంత అప్పులు తెచ్చారు. ఈ సంవత్సరం పండించిన పంటలు కొనేవారు లేకుండా పోయారు. అప్పులు తీర్చలేనన్న ఆందోళనతో శాంసన్ మే నెల 9 వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సమయానికి బంధువులు చూసి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. పర్చూరు మండలం వీరన్నపాలెంకు చెందిన ఉప్పుటూరు సాంబశివరావు ఎకరా రూ.40 వేలు చొప్పున 5 ఎకరాలు కౌలుకు తీసుకొని పొగాకు సాగు చేశారు. సుమారు రూ. 8 లక్షలు అప్పులు తెచ్చారు. పంట చేతికొచ్చి నెల దాటుతున్నా కొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. పైగా క్వింటాల్ రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఈ ధరతో పొగాకు అమ్మినా ఖర్చులు కూడా రావు. ఇప్పటికే రూ. 15 లక్షలకుపైగా ఉన్న అప్పులు తీర్చే పరిస్థితి కాన రాలేదు. నిస్సహాయ స్థితిలో సాంబశివరావు మే నెల 6 వ తేదీన ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. భార్య యశోద, ఇంటర్ చదివే కూతురు, పది చదివిన కుమారుడు దిక్కులేని వారయ్యారు. కుటుంబం రోడ్డున పడింది. న్యూస్రీల్ -
ఏపీ ఈఏపీసెట్లో విద్యార్థుల ప్రతిభ
గుంటూరు ఎడ్యుకేషన్: కాకినాడ జేఎన్టీయూ ఆదివారం ప్రకటించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఫలితాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత నెల 18 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్) ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో గుంటూరు నగరానికి చెందిన తెలగతోటి విక్రమ్ లెవీ 6వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. గుంటూరులోని భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీలో చదివిన విక్రమ్ లెవీ టెన్త్, ఇంటర్మీడియెట్ స్థానికంగానే చదివాడు. విద్యార్థి తండ్రి పిచ్చయ్య విజ్ఞాన్ యూనివర్సిటీలో సీఎస్ఈ విభాగ ప్రొఫెసర్ కాగా.. తల్లి ఇవాంజిలిన్ విజయవాడలోని మేరీ స్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలు. విక్రమ్ లెవీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ను ఎంపిక చేసుకున్నాడు. ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్డ్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 146వ ర్యాంకు కై వసం చేసుకున్న విక్రమ్ లెవీ ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో చేరేందుకు ఆప్షన్ నమోదు చేసుకున్నాడు. స్టార్టప్ కంపెనీ ప్రారంభించడమే లక్ష్యం అని కోరిక వెలిబుచ్చాడు. ఇంజినీరింగ్ టాప్–100లోపు ర్యాంకర్లు వీరే గుంటూరులోని వేంకటేశ్వరకాలనీకి చెందిన అంబటి నోషిక్ సాయి 25వ ర్యాంకు, నరసరావుపేట విద్యార్థి కల్లూరి శ్రీరాఘవ – 46, గుంటూరు ముత్యాలరెడ్డి నగర్కు చెందిన విన్నకోట మహేష్ చంద్ర – 56, తెనాలికి చెందిన నల్లా శాన్వి సాయి వీర – 67, తాడేపల్లికి చెందిన గుమ్మడిదల హేమంత్ సాయిరామ్ – 76, గుంటూరుకు చెందిన గుత్తికొండ సాయి మనోజ్ఞ – 98, చందులూరి నాగవెంకట నీరజ్ – 99, గుంటూరు రూరల్ గొర్లవారిపాలెంకు చెందిన నల్లపనేని సుజిత్ 100వ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో... అగ్రికల్చర్, ఫార్మసీ టాప్–100 ర్యాంకర్లలో గుంటూరు కొత్తపేటకు చెందిన పసుపులేటి రుద్ర శ్రీ గణేష్ 15వ ర్యాంకు, సత్తెనపల్లికి చెందిన కటకం ఏకేఎన్ హరి కిరణ్ –16, గుంటూరు కొరిటెపాడుకు చెందిన ఉమా శంకర్ తారిక శ్రీ – 28, అమరావతి రోడ్డుకు చెందిన కారుమంచి విక్రాంత్ –32, గుజ్జనగుండ్లకు చెందిన ఉప్పాల రూపశ్రీ – 40, కొలకలూరుకు చెందిన గుమ్మడిదల తేజాస్ – 54, చంద్రమౌళీనగర్కు చెందిన వేముల అన్విత్ చేతన్ – 67, శ్రీనగర్కు చెందిన ఓగిబెయిన సుష్మ కౌస్తుభరాణి – 96, పొన్నూరుకు చెందిన కూరాకుల శ్రీరామ్ యాదవ్ – 97, గుంటూరు విజయపురికాలనీకి చెందిన గుంటుపల్లి శ్రీలేఖ 110వ ర్యాంకు సాధించారు. -
గుంటూరు రైల్వేస్టేషన్లో తనిఖీలు
లక్ష్మీపురం: రైళ్లలో గంజాయి, మద్యం అక్రమంగా సరఫరా చేస్తే చట్ట పరమైన చర్యలు తీవ్రతరంగా ఉంటాయని రైల్వే జీఆర్పీ సీఐ అంజిబాబు, ఆర్పీఎఫ్ సీఐ వీరాబాబు అన్నారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఆదివారం గుంటూరు రైల్వే డీఎస్పీ అక్కేశ్వరరావు ఆదేశాల మేరకు జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ముందుగా రైల్వే స్టేషన్లోని ప్రయాణికుల సామగ్రిని డాగ్ స్క్వాడ్ ద్వారా తనిఖీ చేశారు. ప్రయాణికులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ గంజాయి, మద్యం అక్రమంగా సరఫరా చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైలులో ప్రయాణించే సమయంలో రైల్వే స్టేషన్లలో అనుమానితులు ఉన్నట్లు ఉంటే జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం తెలియజేయాలని కోరారు. సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. తనిఖీలు చేసిన వారిలో జీఆర్పీ ఎస్ఐలు లక్ష్మీనారాయణరెడ్డి, మహిళా ఎస్ఐ దీపికా, జ్యోతి, ఆర్పీఎఫ్ సిబ్బంది శంకరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శివాలయం ఉద్యోగి సస్పెన్షన్ పెదకాకాని: శివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్ధానంలో కొన్ని సంవత్సరాలుగా ఇల్లా ప్రదీప్కుమార్ ఎన్ఎంఆర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. నాలుగు రోజుల కిందట మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె ఆలయ అధికారికి ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ప్రదీప్ కుమార్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ కావడంతో ఆదివారం అతడ్ని శాశ్వతంగా విధుల నుంచి తొలగించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. నిత్య అన్నదానానికి విరాళాలు ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. హైదరాబాద్వాసి వి.బాలాజి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ఇ.ఏడుకొండలు కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. బాలాత్రిపురసుందరికి బంగారు ఆభరణాలు కూచిపూడి(మొవ్వ): కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, కేంద్రీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యుడు డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి, పద్మ దంపతులు (హైదరాబాద్–కూచిపూడి) నాట్యాచార్యుల ఇలవేల్పైన శ్రీ బాలాత్రిపురసుందరి అమ్మవారికి బంగారు ఆభరణాలను ఆదివారం అందజేశారు. దేవాలయ పాలకమండలి ఉపాధ్యక్షుడు పసుమర్తి నారాయణమూర్తి.. అర్చకులు పెనుమూడి సుబ్రహ్మణ్యశాస్త్రికి ఎనిమిది లక్షల రూపాయలు విలువైన రెండు హారాలను, శ్రీ దాసాంజనేయ స్వామికి రూ. 38 వేల విలువైన 108 వెండి తమలపాకుల మాలను అందజేశారు. ఈ సందర్భంగా హారాలను అమ్మవారికి అలంకరింపజేసి పూజా కార్యక్రమాలు చేశారు. -
రైతుల పాలిట పాషాణ కూటమి
● కూటమి ప్రభుత్వం వచ్చాక పంటలకు మద్దతు ధర కరువు ● వరి పండినా గిట్టుబాటు ధరకు కొనని కూటమి సర్కారు ● మిర్చి, పొగాకు, శనగ, మినుము, కంది పంటలకూ అదే పరిస్థితి ● లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పెట్టుబడి కూడా రాని దుస్థితి ● అప్పులు అధికమై బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలు ● పాలకులు స్పందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటున్న రైతులుసాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో రైతులకు ఇబ్బంది ఉండేది కాదు. కూటమి సర్కారు వచ్చాక అన్నదాతలకు కష్టాలు పెరిగాయి. అప్పులు చేసి పంటలు పండించినా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిన పాపాన పోలేదు. కొనే పరిస్థితి లేకుండా పోయింది. బయట మార్కెట్లో ధరలు ఉన్నాయా అంటే అదీ లేదు. దళారులకు తక్కువ ధరకే పంటలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో పెట్టుబడుల సంగతి దేవుడెరుగు ఖర్చులు కూడా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వాటి నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతులు ప్రాణాలు తీసుకుంటున్నా కూటమి పాలకులకు చీమకుట్టినట్లుగా కూడా లేదు. వారిని ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు. వరి పంటకూ దక్కని మద్దతు ఈ ఏడాది జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చిందని అంచనా. ఇందులో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనలేదు. దీంతో రైతులు బస్తా ధాన్యం రూ. 1300 లోపే దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. పెట్టుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారు. మిర్చి రైతులకూ మిగిలింది కన్నీరే ఇక నగరం, సంతమాగులూరు, బల్లికురవ, మార్టూరు, యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, జె.పంగులూరు, అద్దంకి, కొరిశపాడు మండలాల్లో 9,330 ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో క్వింటా మిర్చి రూ. 22 వేల వరకు ధర పలికింది. ఎకరాకు 20 కింటాళ్ల దిగుబడి వచ్చింది. దీంతో రైతులు లాభాలు చూశారు. ఈ ఏడాది ఎకరాకు 5 నుంచి 10 క్వింటాళ్లలోపే దిగుబడులు రాగా రూ. 8 వేల నుంచి 10 వేల లోపు మాత్రమే ధర ఉంది. ఈ ధరతో రైతులకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేక అప్పులు మిగిలాయి. పొగాకుకూ అదే దుస్థితి.. జిల్లాలోని అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలలో 64,165 ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. దాదాపు 53 వేల ఎకరాల్లో బ్లాక్ బర్లీ సాగైంది. గత ప్రభుత్వంలో క్వింటా పొగాకు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలికింది. పెట్టుబడి పోను రైతులకు మంచి లాభాలు వచ్చాయి. ఈ సంవత్సరం రూ. 5 వేల నుంచి రూ.10 వేల లోపే ధర ఉంది. ఎకరా సాగుకు రూ. 1.60 లక్షల వరకు రైతులు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఉన్న ధరతో కూలీల ఖర్చులు కూడా రావని వాపోతున్నారు. భారీ విస్తీర్ణంలో పొగాకు సాగు చేసిన రైతులు పెట్టుబడులు అధికమై అప్పుల నుంచి బయటపడలేక ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొంది. ఇవి కాకుండా రైతులు పండించిన కంది, మినుము, శనగ, పెసర తదితర పంటలకు గిట్టుబాటు ధర లేదు. పేరుకు మార్క్ఫెడ్ ద్వారా కొంటామని ప్రభుత్వం చెబుతున్నా మొక్కుబడిగా కూడా కొనుగోలు చేయలేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతుల వరుస ఆత్మహత్యలు ఊసే లేని పెట్టుబడి సాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా సకాలంలో నిరాటంకంగా ఇచ్చారు. ఆ స్థానంలో అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు రూ. 20 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా కూటమి నేతలు ఆర్భాటంగా ప్రకటించారు. గద్దెనెక్కి ఏడాది దాటుతున్నా ఇప్పటికీ రైతులకు ఈ పథకం కింద పైసా ఇవ్వలేదు. గత ప్రభుత్వ పాలనలో జిల్లాలో 1,92,039 మంది రైతులకు రూ. 13,500 చొప్పున సాయం అందించారు. కూటమి నేతలు చెప్పిన హామీ ప్రకారం రైతుకు రూ. 20 వేల చొప్పున జిల్లాలో ఏటా రూ. 385 కోట్లు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు పాలనలో రెండో ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా ఇప్పటికీ అన్నదాత సుఖీభవ ఇవ్వక రైతులను వంచించారు. -
ఎనిమిదేళ్ల కష్టమే కన్నప్ప
నగరంపాలెం(గుంటూరువెస్ట్):ఎనిమిదేళ్ల కష్టమే కన్నప్ప చిత్రమని సినీనటుడు మంచు మోహన్బాబు అన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం సాయంత్రం కన్నప్ప చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ సంయుక్త ఆధ్వర్యంలో జరగ్గా, ఏసీ కళాశాల నుంచి ఈవెంట్ వరకు ర్యాలీ కొనసాగింది. నటుడు మోహన్బాబు మాట్లాడుతూ కన్నప్పను పరమేశ్వరుడు ఆశ్వీరదించారని అన్నారు. ఈ చిత్రంలో నటుడు మంచు విష్ణు రెండు పాత్రలు పోషించారని, చాలా అద్భుతంగా నటించాడని చెప్పారు. మళయాళం, తమిళం, హిందీ, తెలుగు భాషల్లోని అగ్రనటులు పలు పాత్రల్లో పోషించారని, ఆయా పాత్రలకు వారిని అడిగిన వెంటనే ఒప్పుకున్నారన్నారు. అగ్రనటుడు ప్రభాస్, నేను బావ అని అప్యాయంగా పిలుచుకుంటామని, పాత్ర గురించి చెప్పగానే అందులో నటించేందుకు అంగీకరించాడని అన్నారు. వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతిలో ఈవెంట్ చేద్దామని భావించామని, అయితే గుంటూరులో చేయడం ఆనందంగా ఉందన్నారు. చాన్నాళ్ల తర్వాత గుంటూరు వచ్చానని పేర్కొన్నారు. 1991 నుంచి తాడిశెట్టి వెంకట్రావుతో పరిచయం ఉందన్నారు. కన్నప్ప నాలో మార్పు తీసుకొచ్చింది: విష్ణు నటుడు మంచు విష్ణు మాట్లాడుతూ నా దేవుడు నాన్న అని, ఆయన లేకపోతే నేను లేనన్నారు. నటుడు ప్రభాస్కు ఎంతగానో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. కన్నప్ప చిత్ర ప్రయాణం నాలో ఎంతగానో మార్పు తీసుకువచ్చిందన్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ మోహన్బాబు తమపై ఉన్న వాత్సల్యంతో ఈ చిత్రంలో పాత్ర ఇచ్చారన్నారు. పది కాలలపాటు కన్నప్పగా మంచు విష్ణు నిలిచిపోతాడని పేర్కొన్నారు. గుంటూరు బాగా పరిచయమైన స్థలమని, ఇక్కడ చదువుకున్నానని తెలిపారు. గతంలో ఈ ఊరు వచ్చి లారీలకు రంగులేశానని గుర్తుచేసుకున్నారు. దర్శకుడు ముకేష్ కుమార్సింగ్, నృత్యదర్శకుడు ప్రభుదేవా, నటులు రఘుబాబు, శివబాలాజీ, సప్తగిరి, ముకేష్రుషి చిత్ర బృందం పాల్గొన్నారు. అనంతరం మోహన్బాబును వెండి కిరిటీంతో సత్కరించగా, తాడిశెట్టి సోదరులను మోహన్బాబు సత్కరించారు. హీరో విష్ణు పది కాలాలపాటు కన్నప్పగా నిలిచిపోతాడు ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు గుంటూరులో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మోహన్బాబు -
నిత్యాన్నదానం, బంగారు తాపడం పనులకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి, బంగారు తాపడం పనులకు విజయవాడకు చెందిన భక్తులు శనివారం రూ. 2.52 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోని రామచంద్రనగర్కు చెందిన బట్టు నాగేశ్వరరావు కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. నాగేశ్వరరావు పేరిట రూ. 1,51,116 విరాళాన్ని, జిష్ణురావు పేరిట బంగారు తాపడం పనులకు రూ. 1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. నేడు ఏపీసీబీఈఏ రాష్ట్ర మహాసభలు చిలకలపూడి(మచిలీపట్నం): ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్(ఏపీసీబీఈఏ) పదో రాష్ట్ర మహాసభలు మచిలీపట్నంలో ఆదివారం నిర్వహించనున్నట్లు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోపీనాథ్ శనివారం తెలిపారు. జిల్లా కోర్టు సెంటర్లోని రెవెన్యూ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతాయని పేర్కొన్నారు. మహాసభలకు 13 జిల్లాల డీసీసీబీ ఉద్యోగులు హాజరుకానున్నారని తెలిపారు. సమావేశానికి జిల్లాలోని సహకార బ్యాంకుల ఉద్యోగులు తప్పని సరిగా హాజరుకావాలని ఆయన కోరారు. వైభవంగా శోభాయాత్ర విజయవాడ కల్చరల్: వేంకటేశ్వరుడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణ మండప ప్రాంగణంలోని పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శనివారం దేవాలయంలో నిర్వహించిన వైదిక కార్యక్రమాలు భక్తిగా సాగాయి. ఉదయం వేంకటేశ్వర స్వామికి దేవాలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వివిధ రకాల పూలతో అలంకరించిన పల్లకీపై పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామిని దేవాలయ ప్రాంగణంలో ఊరేగించారు. దేవాలయన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రైతులకు సక్రమంగా విద్యుత్ అందించాలి
చీరాల టౌన్: నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇసుక నేలల్లో పంటలు పండించే రైతులకు సకాలంలో విద్యుత్ అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. సకాలంలో విద్యుత్ అందక పైర్లు ఎండిపోవడంతో రైతులు నష్ట పోతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కె.రమణారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పండిస్తున్న వేరుశనగ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలను రైతు విభాగం అధ్యక్షుడు ఆయా గ్రామాల రైతులతో కలిసి పరిశీలించారు. వేరుశనగ పంటలకు సకాలంలో నీరు అందక పంట ఎండిపోతోందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిందని ఫలితంగా ప్రజలు, రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉదయం 6 గంటలకల్లా విద్యుత్ను అందించి పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఉదయం 9 గంటలకు కూడా సక్రమంగా రైతులకు విద్యుత్ను అందించలేకపోతుందన్నారు. చీరాల నియోజకవర్గంలోని కావూరివారిపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఇసుక భూముల్లో రైతులు పండిస్తున్న పంటలకు సాగునీరును విద్యుత్ పైపుల ద్వారా అందిస్తూ పంటలు పండిస్తున్నారన్నారు. పంటల సాగుకు కావాల్సిన నీరు సకాలంలో అందక పంటలు తెగుళ్ల బారిన పడుతున్నాయని రైతుల దీనగాథలను అర్థం చేసుకోవాలన్నారు. రైతుల పంటలకు కావాల్సిన నీటిని నిర్ణీత వేళల్లోనే అందించి అన్నదాతలను ఆదుకోవాలన్నారు. అన్నదాతలను ఇబ్బందులు పెడితే తగు రీతిలో బుద్ధి చెబుతారని, రైతులకు పంటల సాగుకు కావాల్సిన నీటి సరఫరాకు విద్యుత్ ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే అందించి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు గ్రామాల్లోని రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కె.రమణారెడ్డి -
ఆటోవాలకు మిత్ర ద్రోహం
కూటమి ఏడాది పాలనపై ఆటో డ్రైవర్ల ఆగ్రహం చదువు లేని వారు...చదుకున్నా ఉద్యోగం రాని అనేక మంది ఆటోలనే నమ్ముకుని జీవితాలను గడుపుతున్నారు. పెరిగిన డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరలు..పోలీసుల వేధింపుల కారణంగా రోజంతా కష్టపడినా వచ్చే కొద్ది సంపాదనతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారు. ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వాహన మిత్ర పేరుతో ఏడాదికి రూ.10వేలు చొప్పున ఐదేళ్లూ ఒక్కొక్క డ్రైవర్కు రూ.50 వేలు అందించారు. ఆటో డ్రైవర్లు కొంత మేర ఊపిరి పీల్చుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్లటౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అటకెక్కించింది. ఇచ్చిన హామీలను అమలుచేయకుండా సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఊసూరుమనిపిస్తోంది. అదే కోవలో బతుకుబండికి భరోసా లేకుండా చేసింది. ఆటో, మ్యాక్సీ, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు నిరాశే మిగిలింది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి ఏడాదీ వాహనమిత్ర పథకం కింద ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ మొత్తాన్ని వాహనాల ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్, చిన్నపాటి మరమ్మతులకు ఉపయోగపడేది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి సర్కార్ వాహనమిత్ర పథకాన్ని అమలు చేయకపోవడంతో డ్రైవర్లపైనే ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు తనిఖీల పేరుతో అధిక మొత్తంలో రుసుములు విధిస్తుండటంతో రోడ్లపై వాహనాలు నడపాలంటేనే హడలిపోతున్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి గతంలో వరుసగా ఐదేళ్లపాటు వాహనమిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.10 వేల చొప్పున ఆటోలు నడిపే మాలాంటి పేదలకు ప్రతి ఒక్కరికీ రూ.50 వేలు లబ్ధి చేకూరుంది. ఈ సొమ్మును ఆటో మరమ్మతులు, పిట్నెస్కు ఉపయోగించుకునేవారం. ప్రస్తుతం అధికారంలోఉన్న కూటమి సర్కార్ ఆర్థికసాయం అందించడం లేదు. మాలాంటి పేదలకు సంక్షేమ పథకాలు అందజేస్తే బాగుంటుంది. –నూకబత్తుని రమేష్, కంకటపాలెం పథకాలన్నీ అమలుచేయాలి గతంలో మాకు ఏడాదికి వాహనమిత్ర పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ఐదేళ్లపాటు రూ. 50 వేలు ఆర్థికసాయం అందజేశారు. వీటితోపాటు అమ్మఒడి, మహిళలకు డ్వాక్రా రుణాలు, రైతుభరోసా లాంటి పథకాల రూపంలో ప్రతి ఏడాదీ మా అకౌంట్లో నగదు జమ అయ్యేవి. ప్రస్తుతం ఏ పథకాలు అమలుకాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పథకాలన్నీ అమలుచేస్తే మాలాంటి పేదలకు మేలు జరుగుతుంది. –గోరిపర్తి గోపి, రేపల్లె ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఓ వైపు భగభగ మండుతున్న భానుడు...పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్ ధరలతో ఆటోలు నడపాలంటేనే సతమతమవుతున్నాం. కనీసం రోజంతా కష్టపడినా ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. గతంలో ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో వాహనాల మరమ్మతులు, ఇన్స్యూరెన్స్, ట్యాక్స్లు కట్టుకునేవాళ్లం. ప్రస్తుతం చాలా ఇబ్బందిగా ఉంది. –మాదాసు సుబ్బారావు, బాపట్ల వాహనమిత్ర ఊసే ఎత్తని కూటమి సర్కార్ నాడు వాహనమిత్రతో ఆటో డ్రైవర్లకు భరోసా వరుసగా ఐదేళ్లు పథకాన్ని అమలుచేసిన జగన్ సర్కార్ జిల్లాలోని లబ్ధిదారులకు రూ.31.80 కోట్లు అందజేత కూటమి సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆటో డ్రైవర్లు నాడు కేసులంటే తెలియని వైనం..నేడు రోడ్డెక్కాలంటేనే భయం ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్ చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ సోషలిజం రేపల్లె: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పీడీ సోషలిజం డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం తాలూకా సెంటరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన చర్చలలో ఎస్జీటీ టీచర్లకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీ విభాగంలో సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సెలింగ్ విధానాన్ని ఎంఆర్సీల ద్వారా స్క్రోల్ చేస్తూ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిందన్నారు. ఇది మోసపూరిత చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్ కౌన్సెల్ విధానంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, మాన్యవల్ కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేయటంతో సమస్య ఉండదని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గలాబా శ్రీనివాసరావు, తేలప్రోలు శ్రీనివాసరావు, గద్దె రవీంద్ర, దోవా రవి, కె.వెంకటరత్నం, చెన్ను నరేంద్ర, బి.పావనకుమారి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్గా నిర్వహించాలి –ఉపాధ్యాయ సంఘాల ఆందోళన బాపట్లటౌన్: ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్ పద్ధతిలోనే నిర్వహించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎంఈవో ఎస్.నిరంజన్కు వినతిపత్రం అందజేశారు. టీచర్లు బదిలీ విషయంలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ పెడతామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ది.07.06.25 నుంచి 10.06.25 వరకు మ్యానువల్ కౌన్సెలింగ్ జరుగుతుందని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేక ద్వంద వైఖరిని అవలంభిస్తుందన్నారు. సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయులు మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ జరపలేం, వెబ్ కౌన్సెలింగ్ జరుపుతామని ప్రకటించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ మండల విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సోమవారం అన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్బి సుభాని, ఉపాధ్యాయవాణి కన్వీనర్ పి.వి. నాగరాజు, ఎ.వి.నారాయణ, పి.శివాంజనేయులు, జి.ఉదయ్ శంకర్, సీహెచ్. శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు ఎం.సురేష్, డి.నన్నూరయ్య, ఏపీటీఎఫ్ నాయకులు రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అపార్టుమెంట్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ వడ్డేశ్వరంలో జాతీయ రహదారి వెంబడి సర్వీసు రోడ్డులో నిర్మాణంలో వున్న ఒక అపార్టుమెంట్ పై నుంచి శనివారం సాయంత్రం ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న తాడేపల్లి పట్టణ సీఐ కల్యాణ్రాజు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు సప్తపదిలోని విద్యానగర్కు చెందిన గండు జగదీష్ (35) గుర్తించారు. ఇతను తన ద్విచక్రవాహనంపై గుంటూరు నుంచి వచ్చి ఐదు అంతస్తుల భవనం పైకి ఎక్కి కిందకు దూకాడని, తలకు తీవ్రమైన గాయం ఏర్పడిందని, కొన ఊపిరితో ఉండడంతో భవనంలో పనిచేస్తున్న పనివారు ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా జగదీష్ మృతి చెందినట్లు సీఐ కల్యాణ్రాజు తెలిపారు. జగదీష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఇదిలా ఉండగా జగదీష్ బంధువులు మాత్రం గత ఐదు సంవత్సరాల నుంచి జగదీష్తో సన్నిహితంగా ఉండే బంధువులు హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కారణం చేతే ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారే హత్య చేసిఉంటారేమోననే దిశలో దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం బిల్డింగ్పై నుంచి దూకినట్లు తెలిపారు. జగదీష్ తమ్ముడిని వివరాలు అడిగేందుకు ప్రయత్నించగా ఇప్పడు ఏమీ చెప్పలేనని, మా అన్నయ్యది ముమ్మాటికీ హత్యేనని, పోలీస్స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. చనిపోయేటట్లు ప్రేరేపించారని ఆరోపిస్తున్న బంధువులు -
ధర్మోరక్షతి రక్షితః ట్రస్ట్ భవనం ప్రారంభం
తాడికొండ: హైందవ ధర్మ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పడంలో శివస్వామి కృషి ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రంలో ధర్మోరక్షతి రక్షితః ట్రస్ట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రస్ట్ నూతన భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ దాతలు సతీష్ ఉమరాణి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. శివస్వామి ఈ ట్రస్ట్లో 64 సేవా విభాగాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. గో సంరక్షణ ద్వారా ఆరు వేల గోవులను రక్షించి వాటి పోషణ చూసుకోవడం అభినందనీయమన్నారు. మానసారా–మన సారె అనే కార్యక్రమం ద్వారా అనేక రాష్ట్రాల్లో అమ్మవారికి కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్కృతి పట్ల యువతకు అనేక ప్రయోజకర కార్యక్రమాలు అందిస్తున్నారన్నారు. భక్తునిగా శివస్వామికి తాను శిరస్సు వచ్చి పాదాభివందనలు చేస్తున్నారన్నారు. శివస్వామి మాట్లాడుతూ ధర్మోరక్షతి రక్షితహ భవనాన్ని ధార్మిక సేవా భావాలతో 2009 నుంచి నిర్వహిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది వేల మంది ఈట్రస్ట్ కేంద్రంగా పనిచేస్తున్నారన్నారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నేడు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారం వేమూరు: మార్కెట్ యార్డు చైర్మన్గా గొట్టిపాటి పూర్ణకుమారి ప్రమాణ స్వీకారం చేస్తారని యార్డు సెక్రటరీ అంజిబాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థ సారధి, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి నరసరావుపేటటౌన్: ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్నగర్కు చెందిన ఇల్లూరి వీరాంజనేయరెడ్డి(38) మొదటి రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రగాయాలైన వీరాంజనేయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇన్చార్జి ఎస్ఐ దీపిక సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. విద్యుత్ షాక్తో వృద్ధుడు మృతి చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం, చెన్నారెడ్డి కాలనీ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధుడు శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. కొత్త రెడ్డిపాలెంకు చెందిన కారుమూరి ధనంబాబు (60) ఇంట్లోని విద్యుత్ మోటారుకు సంబంధించిన వైర్లు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మృతుని కుమారుడు అనారోగ్యానికి గురవడంతో వారి కుటుంబ పోషణ, ఆలనా పాలన కూడా ధనంబాబే చూడాల్సిన పరిస్థితి ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన ధనం బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. జరిగిన సంఘటనపై స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించి నివేదికను తయా రుచేసి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు. -
స్నేహమేరా జీవితం.. శాశ్వతం!
శావల్యాపురం: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలో 2004–2005 పదో తరగతి పూర్వ విద్యార్థులు బ్యాచ్ అత్మీయ సమ్మేళనం కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత తమ గురువులను పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికిన అనంతరం తాము చదువుకున్న స్కూల్లో 20 సంవత్సరాల తర్వాత అందరిని కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు అత్మీయంగా పలకరించుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను తరగతి గదుల్లో తీపి గుర్తులు మాట్లాడుకున్నారు. తమ గురువులు నేర్పిన విద్య ద్వారా ఈస్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు యర్రం హనుమంతరావు మాట్లాడుతూ తమ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఎదిగి ఐక్యంగా గురువులను గౌరవించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు యర్రం హనుమంతరావు, సి.హెచ్. చంద్రశేఖర్, కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, కె.జె.రమేష్, ఆర్కె.రమేష్ తదితరులను ఘనంగా పూలమాలలు దుశ్శాలువాలతో సత్కరించారు. ఈకార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గుత్తా వెంకటరావు, పాలడుగు శ్రీను, తులబందుల రమ్య, చిలంకూరి నాగలక్ష్మి, జవంగుల నాగరాజు, పరమేశ్వరరావు, యలవర్తి శిరీషా, పాలడుగు సాయి. 45 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. శావల్యాపురం జడ్పీ హైస్కూల్ 2003–2004 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం -
అంబేడ్కర్ స్ఫూర్తితో దళితుల అభ్యున్నతి
విగ్రహావిష్కరణ సభలో వివిధ రంగాల ప్రముఖులు తెనాలి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ స్ఫూర్తిగా దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఉందని కొల్లిపర మండల గ్రామం తూములూరు శివారు క్రిస్టియన్పాలెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు. గ్రామంలో ఏర్పాటుచేసిన నిలువెత్తు విగ్రహాన్ని శనివారం రాత్రి సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్కుమార్ ఆవిష్కరించారు. సభకు విగ్రహ కమిటీ అధ్యక్షుడు కనపర్తి మోహనరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్ మాట్లాడుతూ, విద్యకు ప్రాముఖ్యత నివ్వాలని సూచించారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యపడుతుందనీ, ప్రతిఒక్కరు చదువుకోగలిగినప్పుడు సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జే విద్యాసాగర్ తన ప్రసంగంలో దళితులు కుర్చీల్లో కూర్చోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో రాజ్యాధికారం సాధించుకోవాల్సి ఉందన్నారు. అందుకు అంబేడ్కర్ విగ్రహం స్ఫూర్తి కావాలన్న ఆకాంక్షను వ్యక్తంచేశారు. విశ్రాంత వాణిజ్య పన్నుల అధికారి బొనిగల రామారావు మాట్లాడుతూ దళితులు, బలహీనవర్గాల ప్రజలే చరిత్రను నిర్మించినవారని గుర్తుచేశారు. భాషను కనుగొన్నది కూడా వాళ్లేనని చెప్పారు. దళితవాడల నుంచి ఎందరో మేధావులు, విద్యావంతులు వెలుగులోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కులవివక్ష పోరాట కమిటీ నాయకుడు ఉన్నవ వినయ్కుమార్ మాట్లాడుతూ సమాజంలో రుగ్మతలను సోదాహరణంగా వివరించారు. వివక్షత నుంచి విముక్తులు కావాల్సి ఉందన్నారు. కనపర్తి బెనహర్ తన ప్రసంగంలో, కొల్లిపర ప్రాంతానికి చెందిన దళిత ఉద్యమనేత కనపర్తి ఏసురత్నం బాటలో దళితుల అభివృద్ధికి కృషిచేయాలని కోరారు. విగ్రహ కమిటీ కన్వీనర్ తెనాలి మోహనరావు, కనపర్తి అబ్రహాం లింకన్, మన్నవ ప్రభాకర్, అక్కిదాసు కిరణ్, బేతాళ భూషణం, యండ్రపాటి సాంబయ్య, సిద్దెల అబ్రహం, యండ్రపాటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
భావన్నారాయణ బహుముఖ ప్రజ్ఞాశాలి
బాపట్ల:బీఎంఎస్ ఆలిండియా వ్యవస్థాపక అధ్యక్షులు, స్వయం సేవకులు స్థానం భావనారాయణ వివిధ క్షేత్రాలలో విశేష సేవలు అందించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు. బాపట్ల రోటరీ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం స్థానం భావనారాయణ సంస్మరణ సభ నిర్వహించారు. తొలుత స్థానం భావనారాయణ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు ప్రముఖ స్వయంసేవక్ నేత శ్యాం ప్రసాద్ అధ్యక్షత వహించి స్థానం భావనారాయణతో నాలుగు దశాబ్దాలపాటు కలిసి పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. బీజేపీ నాయకుడు ఆర్ లక్ష్మీపతి మాట్లాడుతూ బాపట్ల పట్టణంలో పుట్టి భావనారాయణ స్వామి దేవాలయ చైర్మన్గా, వంశపారంపర్య ధర్మకర్తగా, స్వయంసేవకుగా, శిశుమందిర్ నిర్వహకులుగా వివిధ క్షేత్రాలను పనిచేసే లక్షలాదిమందికి మార్గదర్శకులుగా నిలిచారని కొనియాడారు. బావన్నారాయణ సోదరుడు ఎస్బీఎస్ తిలక్ మాట్లాడుతూ బావన్నారాయణ బాల్యం నుండి అంతర్జాతీయ వేదికలలో చేసిన ప్రసంగాల వరకు ఆయన జీవిత ప్రస్థానాన్ని వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బి బంగారు బాబు మాట్లాడుతూ స్వయంసేవకునిగా జీవితాన్ని ప్రారంభించి జేనీవాలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సదస్సులో భారతదేశ గళాన్ని అద్భుతంగా వినిపించిన కార్యసాధకుడు భావన్నారాయణ అని కొనియాడారు. సీబీఐ న్యాయవాది మన్నవ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ బాపట్ల ఖ్యాతిని దేశ వేదికలపైనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా వినిపించి ఎందరికో ప్రేరణగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో వల్లూరి భావనారాయణ, పార్థసారథి, బొమ్మిశెట్టి బాలాజీ, బూరెల రత్తయ్య, మన్నవ బాలాజీ, జగన్నాధశాస్త్రి, డాక్టర్ శ్రీనివాస్, లేల సుధాకర్, లేళ్ల వెంకటప్పయ్య, మెండు రజిని, ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. సంస్మరణ సభలో మాజీ ఎమ్మెల్సీ మాధవ్ -
పుష్కర ఘాట్ వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్లో గుర్తుతెలియని మృతదేహం చెట్టుకు వేలాడుతూ మెట్లపై పడిపోయి వున్న స్థితిలో స్థానికులు గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వెళ్లి మెడకు ఉరి వేసుకుని వున్న లుంగీ, కండువాను తొలగించి మృతదేహాన్ని పరిశీలించగా ఎటువంటి ఆధారాలు లభించలేదు. లుంగీ, కండువా కలిపి కట్టుకుని ఉరి వేసుకుని ఉంటాడని ఎస్ఐ శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మాత్రం కృష్ణానది తీరంలోని పుష్కర ఘాట్లలో, ఇసుక తిన్నెల్లో అనేక అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని, చాలా మందిని కొట్టి డబ్బులు, వస్తువులు లాక్కుని పారిపోయిన సంఘటనలు ఉన్నాయని, ఇక్కడ నిద్ర చేయడానికి వచ్చిన వ్యక్తిని ఎవరో కొట్టి చంపి చెట్టుకు వేలాడి తీసి ఉంటారని అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. -
ఎన్ఎంఎంఎస్లో కొప్పరపాడు విద్యార్థుల ప్రతిభ
జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం బల్లికురవ:. ఎన్ఎంఎంఎస్ ఫలితాల్లో బల్లికురవ మండలం కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నట్లు ఎంఈవో–2 కె. రమేశ్బాబు శుక్రవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఈ పరీక్షలకు 15 మంది విద్యార్థులు హాజరు కాగా పది మంది ఉపకార వేతనాలకు ఎంపికై నట్లు తెలిపారు. వీరిలో బొంతు భగత్ 149 మార్కులతో మొదటి స్థానం, పి.లక్ష్మీ అమూల్య 148 మార్కులుతో రెండో స్థానం, ఎస్కే మస్తాన్ 147 మార్కులుతో మూడో స్థానం కై వం చేసుకున్నారని తెలిపారు. వీరితోపాటు మరో ఏడుమంది స్కాలర్షిప్కు ఎంపికై నట్టు ఎంఈవో తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా కొప్పరపాడు పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఎన్ఎంఎంఎస్కు ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, హెచ్ఎం పి. శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు. ఉపకార వేతనాలకు ఎంపిక అమర్తలూరు(వేమూరు): స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్కు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు కనపర్తి నిరీక్షణరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు జనవరి నెలలో పరీక్షలు నిర్వహించింది. అధిక మార్కులు సాధించిన వారికి నాలుగేళ్లు స్కాలర్షిప్లు అందించనుంది. పాఠశాలకు చెందిన విద్యార్థులు పెనుకొండ ఎందీవర్ 128 మార్కులు, షేక్ చాందిని 121 మార్కులు, జొన్నా భూమిక 102 మార్కులు సాధించారు. ఏటా రూ.12,000 చొప్పన ఇంటర్ వరకు అందనున్నాయి. విద్యార్థులను ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ వినయ్ అభినందించారు. -
అవగాహనతో మలేరియా కట్టడి చేయవచ్చు
గుంటూరు మెడికల్ : అవగాహనతో మలేరియాను కట్టడి చేయవచ్చని జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం అన్నారు. జాతీయ మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక గుండారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుబ్బరాయణం మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు కలుగజేస్తాయన్నారు. దోమలు పెరగకుండా ప్రతి ఒక్కరు తమ చుట్టు పక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి దోమలు పెరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దోమకాటు నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరు దోమ తెరలు వాడాలని సూచించారు.10న జిల్లా సీనియర్ అథ్లెటిక్ పోటీలు గుంటూరు వెస్ట్ (క్రీడలు) : అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్పైన జిల్లా సీనియర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి జీవిఎస్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 9వ తేదీన ఏఎన్యూలోని ఇండోర్ స్టేడియంలో వయస్సు ధృవీకరణ పత్రంతోపాటు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టును ఇదే ప్రాంతంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు.చికిత్స పొందుతూ వ్యక్తి మృతిక్రోసూరు: మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసరావు(35)పై కొంతమంది వ్యక్తులు దాడి చేయగా తీవ్రగాయాలతో గుంటూరు ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు ఎస్ఐ పి.రవిబాబు తెలిపారు. ఈనెల 3వ తేదీ అమరావతి మండలంలోని తురకవారిపాలెం ఇటుకబట్టీలలో పనిచేసుకుంటుండగా మునుగోడు గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తితో గొడవ జరిగింది. అనంతరం సాయంత్రం గోపి, మరి కొందరు కలిసి వచ్చి బయ్యవరంలోని శ్రీనివాసరావు ఇంటి పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు కాగా గుంటూరు ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్రడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
పవర్ లిఫ్టింగ్లో జిల్లాకు చాంపియన్షిప్
సత్తెనపల్లి: రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పల్నాడు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపి జూనియర్ మెన్ టీం ఛాంపియన్షిప్ సాధించింది. ఒంగోలు లోని డాక్టర్ పి.ఆనంద్ స్టేడియంలో 12వ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు గత నెల 31 నుంచి ఈ నెల 2 వరకు మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్– బెంచ్ ప్రెస్ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ మెన్, ఉమెన్ పోటీలు ప్రతిష్టాత్మకంగా జరిగాయి. ఈ పోటీలలో పల్నాడు జిల్లాకు చెందిన 8 మంది క్రీడాకారులు 10 బంగారం, 3 రజత, 2 బ్రొంజ్ పతకాలను మొత్తంగా 15 పతకాలను కై వసం చేసుకొన్నారు. జిల్లా ప్రతిష్టను చాటడమేగాక జిల్లా జూనియర్ మెన్ టీం చాంపియన్ షిప్ మొదటి స్థానం సాధించింది. సబ్ జూనియర్స్లో 47 కేజీల విభాగంలో గురజాలకు చెందిన కె.పల్లవి (సిల్వర్ మెడల్), 66 కేజీల విభాగంలో సత్తెనపల్లికి చెందిన ఎం.వినయ్ వెంకట శివ (సిల్వర్ మెడల్), జూనియర్–సీనియర్ మెన్ విభాగంలో 74 కేజీల విభాగంలో వెన్నా దేవీకి చెందిన శరత్ 2 బంగారు పతకాలు, 74 కేజీ విభాగంలో కంకణాలపల్లికి చెందిన రమేష్ చౌదరి బ్రాంచ్ మెడల్, 83 కిలోల విభాగంలో సత్తెనపల్లికి చెందిన పసుపులేటి వంశీ కృష్ణ 3 బంగారు పతకాలు, ఒక రజిత పతకం, 120 కేజీల విభాగంలో గుడిపూడికి చెందిన లింగిసెట్టి శివ నాగేశ్వర రావు నాలుగు బంగారు పతకాలు, సబ్ జూనియర్ మెన్ బెంచ్ ప్రెస్ విభాగంలో 53 కిలోల విభాగంలో గురజాలకు చెందిన కె కార్తీక్ సిల్వర్ పతకం,74 కిలోల విభాగంలో సత్తెనపల్లికి చెందిన షేక్ మొహిద్దీన్ బంగారు పతకం సాధించారు. శరత్ (వెన్నాదేవీ), పసుపులేటి వంశీకృష్ణ రెండు, మూడవ స్థానాల్లో రాష్ట్రస్థాయిలో జూనియర్ స్ట్రాంగ్ మెన్టైటిల్ సంపాదించారు. ప్రతిభ చూపిన క్రీడాకారులను పల్నాడు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ, అంతర్జాతీయ క్రీడాకారుడైన పసుపులేటి సురేష్, పల్నాడు జిల్లా పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ జిమ్రాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాతంగి సాంబశివ రావు, కత్తి పవన్, మాతంగి రాహూల్ గౌతమ్, జి రమేష్, శాంతయ్య శుక్రవారం క్రీడాకారులను అభినందించారు. ప్రతిభ చూపిన జూనియర్ మెన్ క్రీడాకారులు -
అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్యాయత్నం
బల్లికురవ: బడుగు బలహీన వర్గాలపై అధికారులు, కూటమి నాయకులు వేధింపులకు పాల్పడుతున్నారని రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. శుక్రవారం మండలంలోని రామాంజనేయపురం గ్రామానికి చెందిన నాగిపోగు ఏసురత్నం తనకు ఇచ్చిన ఇంటి స్థలంలో కొంత భాగానిన మరొకరికి పట్టా ఇవ్వడం పట్ల, కలెక్టర్, రెవెన్యూ అధికారులకు విన్నవించినా.. సమస్య పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారనే మనస్థాపంతో గురువారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తొలుత అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు, అనంతరం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతున్న ఏసురత్నాన్ని ఒంగోలులోని వైద్యశాలలో కొమ్మూరి కనకరావు పరామర్శించి ధైర్యం చెప్పారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, స్థానిక నేతలు ఉన్నారు. అలాగే మాదిగ సంక్షేమ పోరాట సమితి ప్రతినిధులు సుజన్ మాదిగ పరామర్శించారు.