Bapatla
-
ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి!
తెనాలిరూరల్: అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల లీలలు విచిత్రంగా ఉన్నాయి. అధునాతన వాహనాన్ని వెనక్కి తీసుకుని పాత వాహనాన్ని తెనాలికి పంపారు. ఏప్రిల్ 14వ తేదీన తెనాలి అగ్నిమాపక కార్యాలయానికి ప్రత్యేక అగ్నిమాపక శకటాన్ని కేటాయించి పంపారు. పంపిన రెండు రోజులకే వెనక్కి పిలిపించి రాష్ట్ర సచివాలయంలో ఉంచారు. పరిధి పెద్దదైన తెనాలి కార్యాలయం కింద తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల, చేబ్రోలు, బాపట్ల జిల్లా చుండూరు, వేమూరు, అమృతలూరు, కొల్లూరు మొత్తం ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇక్కడ దశాద్దాల క్రితమే రెండు వాహనాలు అవసరముందని భావించిన అధికారులు రెండు వాహనాలను కేటాయించారు. ఒక వాహనం దశాబ్దంన్నర క్రితం శిథిలావస్థకు చేరుకోగా అప్పటి నుంచి కేవలం ఒక్క వాహనంతోనే నెట్టుకువస్తున్నారు. ఇటీవల రెండో వాహనం కేటాయించి పంపడంతో అగ్నిప్రమాదాల్లో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అందరూ భావించారు. ఈ ఆనందం కేవలం రెండు రోజుల్లోనే ఆవిరైపోయింది. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
కర్లపాలెం: క్రీడలతో క్రీడాకారులకు, ప్రేక్షకులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. పేరలి గ్రామంలో ఏర్పాటు చేసిన కోన ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేయటం వలన గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించటంతో పాటు వారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు దోహదపడతాయన్నారు. క్రీడాకారులందరూ సమయస్ఫూర్తితో ఆడాలని సూచించారు. తొలుత రిబ్బను కత్తిరించి పోటీలను ప్రారంభించిన కోన రఘుపతి సరదాగా బ్యాటింగ్ చేశారు. పిట్టలవానిపాలెం(కర్లపాలెం): యోగాతో ఆరోగ్యం మెరుగుపడుతుందని డీఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ హరికుమార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని కేర్ యోగా నాచురోపతి కాలేజీలో జిల్లా యోగాంధ్ర నోడల్ ఆఫీసర్ డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలసి యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగా చేయటం వలన ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. డీఎంహెచ్ఓ డాక్టర్ విజయమ్మ మాట్లాడుతూ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని కోరారు. జిల్లా యోగేంద్ర నోడల్ ఆఫీసర్ దాసరి చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. -
వాన్పిక్ భూములు తిరిగి సాధించే వరకు పోరాటం
చినగంజాం: వాన్పిక్ ప్రాజెక్ట్ పనులు ఆగిపోయిన దృష్ట్యా భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని.. వాటిని పొందేంత వరకు తమ పోరాటం ఆగదని చీరాల మాజీ శాసన సభ్యుడు ఆమంచి కృష్ణమోహన్, మండలంలోని 13 గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని మోటుపల్లి పంచాయతీ అడివీధిపాలెం గ్రామంలో వాన్పిక్ భూముల 13 గ్రామాల రైతులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశానికి పెదప్రోలు సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. వాన్పిక్కు సంబంధించి విదేశీ కంపెనీ రసల్ఖైమా, రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం ఆపి వేసి వెనక్కు వెళ్లిన దృష్ట్యా ప్రభుత్వం తమకు సంబంధించిన భూములను వెనక్కి తిరిగి ఇచ్చేయాలని వారు సమావేశంలో కోరారు. రైతుల న్యాయపరమైన డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని చట్టపరంగా చర్యలు తీసుకొని భూములను రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందుకు రాని పక్షంలో న్యాయపరమైన హక్కులు సాధించుకునేందుకు చట్టపరమైన పోరాటం సాగిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో పండ్రాజు శంకర్రావు, 13 గ్రామాల పెద్దలు, కాపులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
పట్నంబజారు: లిక్విడ్ గంజాయిని తరలిస్తూ.. బీటెక్ విద్యార్థితో పాటు ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి పోలీసులు కోర్టుకు హాజరుపరిచారు. లాలాపేట పోలీసు స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ సబ్ డివిజన్ ఇన్చార్జి, మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ డి.శ్రీనివాసరెడ్డి, లాలాపేట పోలీసు స్టేషన్ సీఐ ఏవీ శివప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గుంటూరు నగరంలోని పాతగుంటూరు, సంగడిగుంట ప్రాంతాలకు చెందిన రామిశెట్టి మహవీర్, అబ్బు సాయిమణికంఠతేజ, షేక్ రెహ్మాతుల్లాలు స్నేహితులు. వీరిలో ప్రధాన నిందితుడైన రామిశెట్టి మహావీర్ గంజాయికి అలవాటుపడి, డబ్బులు కోసం ఒడిశా ప్రాంతం నుంచి లిక్విడ్ గంజాయిని తీసుకుని వచ్చి గుంటూరులో విక్రయిస్తున్నాడు. శనివారం ఐపీడీ కాలనీలో సమీపంలోని సత్యసాయి బాబా ట్రస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ ఎస్యూవీ కారులో ముగ్గురు అనుమానాస్పదంగా ఉండటాన్ని గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించటంతో పాటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి దొరికింది. వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న రామిశెట్టి మహావీర్ ఒక కళాశాలలో బీటెక్ అభ్యసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 2కిలోల 110 గ్రాముల గంజాయి లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
వందేళ్ల బళ్లబాటకు పరిశ్రమ నిర్మాణంతో సమస్య
వందేళ్ల నుంచి రైతుల రాకపోకలకు ఉపయోగించే బళ్లబాటకు ప్రస్తుతం నిర్మించిన ప్లాస్టిక్ పరిశ్రమ వల్ల సమస్య వచ్చింది. నిర్మాణ సమయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – అడుసుమల్లి నరసింహారావు, రైతు, చేబ్రోలు పరిశ్రమ నిర్మాణంతో రాకపోకల కోసం ఉన్న బళ్లబాట మూసుకునిపోయి ఇబ్బందులు పడుతున్నామని రైతులు మా దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. కంపెనీ ప్రతినిధులు, రైతులతో మాట్లాడి పొలాల్లో బళ్లబాటకు ఇబ్బందులు లేకుండా అందరితో మాట్లాడి పరిష్కరిస్తాం. – కె.శ్రీనివాసశర్మ, తహసీల్దార్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ వల్ల బళ్లబాట సమస్య, సాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. నేను రైతును తోటి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హమీ ఇచ్చిన కంపెనీ యజమాని నిర్మాణం పూర్తి దశలో మీకు చేతనైంది చేసుకోండి అంటూ అహకారంతో చిన్న చూపుతో మాట్లాడుతున్నాడు. కంపెనీ ముందు ఉన్న సాగునీటి కాలువ మీద సిమెంటు తూము వేసి పూడ్చివేయటంతో సాగునీటి సమస్య ఏర్పడింది. రైతుల వాహనాలు, పంట ఉత్పత్తులు రాకపోకలు సాగించే బళ్లబాటకు ఆటంకం కలిగించే విధంగా ప్రహరీ నిర్మిస్తుండటంతో సుమారు 600ఎకరాల్లోని రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. – శరణం మల్లికార్జునరావు, రైతు, చేబ్రోలు -
అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణం
గుంటూరు మెడికల్: అతిసార నివారణకు ఓఆర్ఎస్ ద్రావణమే ప్రాణాధారమని జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొర్రా విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో చంటి బిడ్డల్లో అతిసారం ప్రధాన ప్రజారోగ్య సమస్యగా పరిణమించిందన్నారు. ప్రతి సంవత్సరం అతిసారం వల్ల ఐదు సంవత్సరాల పిల్లల్లో 4.3% మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. డయేరియా నివారణకు ముందస్తు గుర్తింపు, ఓఆర్ఎస్ ద్రావణం, జింక్ మాత్రల వినియోగం ద్వారా ఈ మరణాలను నిరోధించవచ్చన్నారు. అతిసార వ్యాధి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం స్టాప్ – డయేరియా క్యాంపెయిన్ చేపట్టిందన్నారు. డయేరియా నివారణకు పరిశుభ్రత ఓఆర్ఎస్ పాకెట్స్ వినియోగంపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి 15 వ తేదీ వరకు సన్నద్ధత దశ అని పేర్కొన్నారు. జూన్ 16 నుంచి 31 వ తేదీ వరకు కార్యాచరణ దశ అన్నారు. జూన్ 16 వ తేదీ నుంచి జరిగే కార్యాచరణ దశలో భాగంగా చంటి బిడ్డలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించుట, రోటా వైరస్ వ్యాక్సిన్ అందజేయుట, చేతుల పరిశుభ్రత, రక్షిత తాగునీరు అందజేయుట, ఇంటింటికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందజేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా ఓఆర్ఎస్, జింకు కార్నర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 1,45,000 మంది ఐదేళ్లలోపు చంటిబిడ్డలకు అందజేయుటకు 2,14,630 ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 1,07,450 జింక్ టాబ్లెట్లు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచామని వెల్లడించారు. -
కాసుల కోసం చెత్త పనులు
చీరాల అర్బన్: చీరాల పురపాలక సంఘం పరిధిలో కాసుల కోసం చెత్త పనులు చేస్తున్నారు. నెలకు రూ.లక్షల్లో ఖర్చవుతుంటే, ఆదాయం రూ.వేలల్లో కూడా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో రామాపురంలో ఉన్నది డంపింగ్ యార్డా, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్నా? అనే విషయంలో స్పష్టత రావడం లేదు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి దానిపై పడింది. చుట్టు పక్కల భూములకు విలువ రావాలంటే ఆ యూనిట్ లేకుండా చేయాలని కొందరు పచ్చ నేతలతో కలసి వారు రంగంలోకి దిగారు. దానిని కార్యరూపంలోకి తెచ్చేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. అందుకు కీలక నేత, యువనేతలు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆదిలోనే ఆటంకాలు.. సుమారు 15 సంవత్సరాల క్రితం చీరాల మున్సిపల్ పరిధిలో రోజువారీ వచ్చే చెత్తను శుద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. ఆ క్రమంలో మున్సిపల్ పరిధిలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సమీపంలో, సెయింట్ ఆన్స్ స్కూల్ రోడ్డులో శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించేవారు. తడి చెత్త నుంచి కంపోస్ట్ ఎరువును... పశువుల వ్యర్థాలు, ఆహార వ్యర్థాల నుంచి బయో గ్యాస్.. ప్లాస్టిక్, పేపర్ తదితరాలను రీ సైక్లింగ్ చేసి ఆదాయం పొందేందుకు నిర్దేశించారు. కొంత కాలం బాగానే ఇవన్నీ నడిచాయి. వర్మీ కంపోస్టును కూడా తయారు చేసి విక్రయించారు. ఆ తర్వాత మూలన పడ్డాయి. ఈ క్రమంలో చీరాల మున్సిపల్ పరిధిలో చెత్త శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు స్థలం కోసం ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో వేటపాలెం మండలం రామాపురం పరిధిలో 15 ఎకరాల భూమిని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్కు సేకరించారు. అయితే కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఇవన్నీ దాటి పనులు ప్రారంభించారు. 2017లో యూనిట్ ప్రారంభం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ను రూ.5.79 కోట్ల వ్యయంతో 2017 మార్చి నెలలో ప్రారంభించారు. కొంత కాలం కూరగాయలు, ఆకు కూరలు కూడా పండించారు. పలు మిషన్లతో కొబ్బరిబొండాలు పీచు తీయటం, వర్మీ కంపోస్టు తయారీ తదితర పనులు చేపట్టారు. వాటిని విక్రయిస్తుండటంతో మున్సిపాలిటీకి కొంత ఆదాయం కూడా జమ అయింది. 2024లో కూటమి పాలన వచ్చాక యూనిట్ నిర్వహణ తీరు మారిపోయింది. ప్రస్తుతం అక్కడ చెత్త కుప్పలుగా పేరుకుపోతోంది. వ్యాపారుల కన్ను తీర ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో సాలిడ్ వేస్ట్ మేనేజ్ యూనిట్ చుట్టూ స్థలాలు, పొలాలకు మంచి మార్కెట్ వచ్చింది. అక్కడ యూనిట్ను లేకుండా చేస్తే ఎకరా రూ.లక్షల్లో ఉన్న ధర రూ.కోట్లకు చేరుతుందని కొందరు పచ్చ నేతలు, స్థిరాస్తి వ్యాపారులు స్కెచ్ వేశారు. అందుకు కీలకనేత, యువనేత ఆశీస్సులు పొందారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సుమారు 30 ఎకరాలకుగాను ఎకరా ధర రూ.లక్షల్లో కొని వేరొకరికి రూ.కోట్లలో చేతులు మార్చేందుకు టోకెన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చెత్త యూనిట్ను మార్పిస్తామని నమ్మబలికినట్లు చెబుతున్నారు. రోజుకు 25 టన్నుల వ్యర్థాలు మున్సిపల్ పరిధిలో రోజుకు సుమారు 25 టన్నుల చెత్త వస్తోంది. దాన్ని రామాపురం యూనిట్కు తరలిస్తున్నారు. అయితే అక్కడ చెత్తను ఆదాయ వనరుగా మార్చే ఎలాంటి పనులు జరగటం లేదు. దీంతో యంత్రాలన్నీ తుప్పు పడుతున్నాయి. కొండలుగా పేరుకు పోయిన చెత్తతో దుర్గంధం వెదజల్లుతోంది. నిర్దిష్ట ప్రణాళిక, కార్యాచరణ లేకుండా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ మూలనపడటంతో రూ.కోట్ల ప్రజాధనం వృఽథా అవుతోంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
దర్జాగా బళ్లబాట కబ్జా
చేబ్రోలు: చేబ్రోలు గ్రామంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సాంప్రదాయ ‘బళ్ల బాట’ మూసివేతపై స్థానిక రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన చేబ్రోలు గ్రామ పరిధిలోని కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో జీబీసీ రహదారి పక్కన సర్వే నెంబర్ 963–1బి లో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన అధికార పార్టీ పొన్నూరు నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడు పరుచూరి సత్య కిషోర్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమను కొంతకాలం క్రితం నిర్మించాడు. వ్యవసాయ భూమిలో నిర్మాణాలు చేపట్టే సమయంలో బళ్లదారికి ఇరువైపులా ఉన్న రైతులందరితో సదరు యజమాని అనుకూలంగా మాట్లాడాడు. ప్రధాన రహదారి రోడ్డు నుంచి రైతులకు అనుకూలంగా ‘బళ్ల బాట’ (రైతుల రాకపోకలకు దారి) వదులుతానని నమ్మబలికాడు. అయితే కంపెనీ నిర్మాణం పూర్తయిన తర్వాత మాట మార్చడమే కాకుండా, ప్రస్తుతం రైతులకు ఉన్న ఏకై క దారిని సైతం మూసివేస్తూ అక్కడ శాశ్వత రక్షణ గోడను నిర్మించారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ‘నేను దారి ఇచ్చేది లేదు, మీకు చేతనైంది చేసుకోండి, నాకు అన్ని అనుమతులు ఉన్నాయి’ అంటూ సదరు అధికార పార్టీ ముఖ్యనేత అనుచరుడు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 600 ఎకరాలపై ప్రభావం.. రైతుల పంట పొలాలకు ట్రాక్టర్లు, పంట ఉత్పత్తులు తరలించటానికి రాకపోకలకు ఉపయోగించే బళ్ల బాట మూసుకుపోవడం వల్ల దాదాపు 600 వందల ఎకరాలకు పైగా ఉన్న పంట పొలాలకు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. పొలాల్లో పండిన పంటను ఇంటికి లేదా మార్కెట్కు తరలించడానికి, వ్యవసాయ సామగ్రిని పొలాల్లోకి తీసుకెళ్లడానికి ఈ దారి తప్ప రైతులకు ప్రత్యామ్నాయ మార్గం లేదు. కంపెనీ యాజమాన్యం నిర్మాణ పనులను వేగవంతం చేస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. తూర్పు వైపు ప్రహారీ నిర్మాణం, ఉత్తరం వైపున ప్రహరీ నిర్మాణాలను కొంత భూమి బళ్లబాట కోసం రైతులకు ఉపయోగపడే విధంగా వదలకుండా పనులు పూర్తి చేస్తుండటంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో ముప్పు మాగాణి భూమిలో నిర్మాణం జరిగిన ప్లాస్టిక్ బకెట్లు, వస్తువుల తయారీ కంపెనీ వలన చుట్టుపక్కల భూములకు ముప్పు ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల భవిష్యత్తులో చుట్టుపక్కల భూములన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం పొంచి ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బళ్లబాట సమస్యపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అక్కడ న్యాయం జరగకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కంపెనీ ముందు భాగంలో ఉన్న సాగునీటి కాలువ పూడ్చివేతపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిమెంటు తూము వేసి పరిశ్రమలోకి రాకపోకలు చేస్తున్నారు. కాలువలోకి గ్రావెల్ జారిపోవటంతో కాలువ పూడిపోయింది. సిమెంటు తూమును తీసివేసి వంతెన కల్వర్టు నిర్మాణం చేసుకోవాలని రైతులు సూచిస్తున్నారు. -
మద్యం ఇండెంట్లో గోల్మాల్
నరసరావుపేట టౌన్: మద్యం ఇండెంట్ల వ్యవహారంలో భారీ మోసం వెలుగు చూసింది. మద్యం కంపెనీ ప్రతినిధిగా చెలామణి అవుతున్న యువకుడు వ్యాపారుల నుంచి వసూలు చేసిన రూ.1.5 కోట్లతో పరారీ అయిన ఘటన పల్నాడు జిల్లాలో సంచలనం కలిగించింది. వివరాలు.. ప్రముఖ మద్యం కంపెనీ తరుఫున రిప్రజెంటేటివ్గా గురజాలకు చెందిన యువకుడు పనిచేస్తున్నాడు. దీంతో పాటు మద్యం కంపెనీ తరుపున నరసరావుపేట మద్యం డిపోలో అందుబాటులో ఉంటూ మద్యం సిండికేట్లకు డిపో నుంచి దుకాణాలకు కావాల్సిన మద్యం సరఫరా ఇండెంట్ వ్యవహారాలు చక్కదిద్దేవాడు. వ్యాపారులతో సన్నిహిత సంబందాలు ఏర్పాటు చేసుకున్నాడు. అతను చేసే సేవలకు గాను ప్రతి దుకాణం నుంచి నెలకు రూ.1500 జీతం తీసుకునేవాడు. గురజాల, మాచర్ల నియోజకవర్గాలలోని మద్యం దుకాణాలకు రోజూ వారి మద్యం సరఫరా ఇండెంట్ల లావాదేవీలు చూస్తుంటాడు. కొన్ని నెలలుగా మద్యం ఇండెంట్ కోసం వ్యాపారుల నుంచి తీసుకున్న డబ్బుల్లో సగం మాత్రమే బ్యాంక్లో జమ చేశాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న వ్యాపారులు రెండు రోజుల క్రితం యువకుడిని నిలదీశారు. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. శనివారం గురజాల, మాచర్ల, వినుకొండలకు చెందిన వ్యాపారులు మద్యం డిపో వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న అధికారులను కలిసి తమకు జరిగిన మోసాన్ని వివరించారు. అయితే డిపోకు సదరు ప్రైవేటు ఉద్యోగికి ఎటువంటి అధికారిక సంబంధం లేదని అధికారులు తేల్చిచెప్పారు. -
కృష్ణమ్మ ఒడిలో పెను విషాదం
● అందరిదీ ఒకే కుటుంబం● నదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి అచ్చంపేట: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కృష్ణానదిలో మృతి చెందడంతో కోనూరు విషాదంలో మునిగిపోయింది. మండలంలోని కోనూరులో గంధం గంగయ్య ఇద్దరు మనమరాళ్లు, మనవడు, తమ్ముని కుమారుడు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ గ్రామంలో ఇలా జరగడం ఇది రెండవసారి. 2017 జనవరి 14వ తేదీన సంక్రాంతి నాడు ఒకే కుటుంబంలో అన్నదమ్ముల పిల్లలు నలుగురు కృష్ణానదిలో ఈత కొట్టడానికి వెళ్లి మృతి చెందిన ఘటనను గుర్తుకుతెచ్చుకుని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరదాగా బయలుదేరి... కోనూరు గ్రామానికి చెందిన గంధం గంగయ్య వ్యవసాయ కూలీ. బతుకుదెరువు కోసం గంగయ్య గ్రామం వదలి నకరికల్లు మండలం కుంకులగుంట గ్రామానికి వలసవెళ్లారు. కొన్ని సంవత్సరాలపాటు అక్కడ ఉన్నా నిలదొక్కుకోలేక పోవడంతో తిరిగొచ్చారు. గంగయ్య కుమారుడైన సత్యానందం– రాజ్యలక్ష్మి దంపతులకు కుమార్తెలు సంధ్య (11), షైని(9) ఉన్నారు. పిడుగురాళ్లలోని సున్నపుబట్టీలలో పనిచేసుకునేందుకు వీరు వలస వెళ్లారు. రొంపిచర్ల మండలం మర్రిచెట్టుపాలెంలో ఉంటున్న కుమార్తె బత్తుల అరుణ కుమారుడు కార్తిక్ (11), చిలకలూరిపేటలో ఉంటున్న తమ్ముడు శ్రీనివాసరావు కుమారుడు చైతన్య (20). ఈ నలుగురు తమ తల్లిదండ్రులు, బంధువులతో గంగయ్య ఇంట్లో శనివారం రాత్రి జరిగిన ప్రార్థనలో పాల్గొనేందుకు వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి బంధువులంతా కృష్ణానది వద్దకు సరదాగా వెళ్లారు. సమీపంలో చేపల పడవలు కనిపించడంతో పడవలో నదిలో తిరగాలని ఉత్సాహపడ్డారు. పడవ ఎక్కిన పది మంది... వారిలో ముత్యాలు అనే వ్యక్తి పది మందిని పడవలో ఎక్కించుకుని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఉన్న లంక భూములకు వెళ్లాలని బయలుదేరారు. నది మధ్యలోకి వెళ్లేసరిగా పడవ అటు, ఇటు ఊగడం మొదలుపెట్టింది. పడవను నియంత్రించలేకపోయారు. అది కాస్తా తలకిందులైంది. అందరూ నీటలో పడిపోయారు. ముత్యాలు సాహసం చేసి ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలిగారు. మిగిలిన నలుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పడవలతో వచ్చి ముమ్మరంగా గాలించారు. సంధ్య, షైని, కార్తిక్, చైతన్య మృతదేహాలు బయటపడటంతో తాత గంగయ్య తల్లడిల్లిపోయారు. సరదాగా వచ్చిన తమకు ఇలా పుత్రశోకంతో అల్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదేం కర్మ దేవుడా... అంటూ తలలు బాదుకున్నారు. ఆడుతూపాడుతూ తమ కళ్లెదుటే చిందులు వేస్తూ తిరిగిన పిల్లల మృతదేహాలను బంధువులు భుజాన వేసుకుని ఒడ్డుకు చేరుస్తుంటే తట్టుకోలేకపోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆటోలు వేసుకుని తీసుకెళుతుంటే తమ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయినట్లుగా శోకంతో అల్లాడిపోయారు. వారిని ఓదార్చడం గ్రామస్తులు, బంధువుల వల్ల కాలేదు. కోనూరు ఇసుక రీచ్లకు సమీపంలో గతంలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. -
టెట్పై ప్రభుత్వం స్పందించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ను రద్దు చేయించే దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యు. రాజశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం టెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యాహక్కు చట్టంలో మార్పులు చేయించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్ మాట్లాడుతూ 50 ఏళ్లుపైబడి బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, పాఠశాలలో అననుకూల పరిస్థితుల మధ్య ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయులకు ఏ ఇతర ఏ ప్రభుత్వశాఖలోనూ లేని విధంగా ఇన్ సర్వీస్ పరీక్ష పెట్టడం తగదన్నారు. ఉపాధ్యాయులు టెట్లో అర్హత సాధించడంపై ధ్యాసపెడితే బోధనకు విఘాతం కలుగుతుందన్నారు. రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమ కుమారి మాట్లాడుతూ టెట్ రద్దు కోసం యూటీఎఫ్ చేపట్టే కార్యాచరణలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన టెట్లో ఉన్న అసంబద్ధ నిర్ణయాలు ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు ఇబ్బందికరమన్నారు. సమావేశంలో సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పీవీ శ్రీనివాసరావు, జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ గయాసుద్దౌలా, జిల్లా కార్యదర్శి ఆదినారాయణ, సాంబశివరావు, ఆంజనేయులు, అడవి శ్రీను, కె. కేదార్నాథ్, బి.ప్రసాదు, ఎం.కోటిరెడ్డి, కె.కామాక్షి పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు -
చెత్తను గుంటూరుకు తరలిస్తున్నాం
రామాపురం యూనిట్లో ఉన్న చెత్త తరలింపు ప్రక్రియ మధ్యలో ఆగింది. తాజాగా శుక్రవారం నుంచి గుంటూరు జిందాల్ యూనిట్కు తరలిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు రూ.3.50 కోట్లు మంజూరు అయ్యాయి. మొత్తం చెత్త అంతా తరలించిన తరువాత ప్రభుత్వ నూతన విధివిధానాల్లో అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నిర్వహణ కొనసాగుతుంది. ఆ డబ్బు మాకు ఇవ్వరు. నిర్ణీత పనులకు సంబంధించి వారే వెచ్చిస్తారు. వెలుపల వినిపించే అపోహలతో మాకు సంబంధం లేదు. – డానియల్ జోసెఫ్, కమిషనర్, చీరాల మున్సిపాలిటీ -
కంభంపాడులో రోడ్డు ప్రమాదం
మాచర్ల రూరల్: రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కంభంపాడులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎం.బ్రహ్మారెడ్డి కంభంపాడు గ్రామంలో తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా గుంటూరు నుంచి మాచర్ల వస్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీ కొట్టింది. దీంతో అతడికి రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మాచర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై గ్రామస్తుల నిరసన నేషనల్ హై వే రోడ్డు గ్రామం మీదుగా ఏర్పాటు చేసి వీధి లైట్లు మాత్రం వెలిగించకపోవటంతో గ్రామంలోకి వెళ్లాలన్నా, రావాలన్నా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికే ప్రమాదాలు చాలా జరిగినా అధికారులు పట్టించుకోవటం లేదంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకు చేరి ఎద్దుల బండ్లు, నీళ్ల ట్యాంకులను అడ్డుగా పెట్టి ధర్నాకు దిగారు. గ్రామంలో హైవేపై లైట్లు వెలగటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ఎక్స్ప్రెస్లను గ్రామంలో ఆపాలని ఆర్టీసీ అధికారులకు కోరుతున్నా స్పందించటం లేదని వాపోయారు. అతి పెద్ద జనాభా కలిగిన గ్రామ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవటంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువైపులా సుమారు కిలో మీటర్ దూరం వాహనాలు నిలిచిపోయాయి. రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్పష్టమైన హామీ లభించేంత వరకు కదిలే ప్రసక్తే లేదంటూ ఆందోళన కొనసాగించారు. ఎట్టకేలకు విజయపురిసౌత్, రూరల్ ఎస్ఐలు అశోక్కుమార్, సంధ్యారాణి ఉన్నతాధికారులకు తెలిపి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలి
ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెనాలి: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచించారు. పట్టణానికి చెందిన రజక వలంటరీ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో తొమ్మిదో వార్షికోత్సవాన్ని ఆదివారం స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ అధ్యక్షుడు పోతార్లంక ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన సంఘీయులైన వందమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. ప్రొఫెసర్ నిరంజన్, పులిగడ్డ నారాయణరావు, కొండేటి సురేష్, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, విశ్రాంత మున్సిపల్ కమిషనర్ వల్లూరు మహాలక్ష్మీపతి, ఏపీ ట్రాన్స్కో డీఈఈ పాగోలు భవాని తదితరులు మా ట్లాడారు. విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.2 వేల ఉపకార వేతనం, నోట్ పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్ మెటీరియల్ తదితరాలు పంపిణీ చేశారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి పేటేటి శ్రీనివాస్, శివనాగేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాస్, నాంచారయ్య, పెసర్లంక రమణ తదితరులు పాల్గొన్నారు. ‘పంచాయతీరాజ్ మినిస్టీరియల్’ అసోసియేషన్ సమావేశం గుంటూరు రూరల్: నగరంలోని మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర కమిటీకి నిర్వహించాల్సిన ఎన్నికలను జూలై 31లోగా పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయించారు. గత కొంతకాలంగా రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరగకపోవడం వల్ల అసోసియేషన్ కార్యక్రమాలు సరైన రీతిలో జరగలేదని దానివల్ల పంచాయతీరాజ్శాఖలో జరిగిన పరిపాలన సంస్కరణలో పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్కు సరైన న్యాయం జరగలేదని పలువురు జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవోల పదోన్నతులలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కు అన్యాయం జరిగిందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. దశాబ్దాలు గా పదోన్నతులు లేక అన్యాయానికి గురైన రికార్డు ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించాలని సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 30 సంవత్సరాల పైన ఒకే క్యాడర్లో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లకు ఒక్క ప్రమోషన్ కూడా లభించకపోవడం చాలా బాధాకరమన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న జిల్లా పరిషత్ నాన్ టెక్నికల్ సిబ్బందిని నిబంధనలకు విరుద్ధంగా సరెండర్ చేస్తున్నారని, ఈ ప్రక్రియను వెంటనే ని లుపుదల చేయకపోతే ప్రత్యక్ష కార్యచరణకు వెళ్లా లని కార్యవర్గంలో తీర్మానించారు. సంఘం రాష్ట్ర ట్రెజరర్ పి.దస్తగిరిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మోహన్రావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రా ఘవులు, సంఘం వివిధ జిల్లాల అధ్యక్షులు ముర ళి, సత్తిబాబు, శ్రీధర్రాజు, ప్రసాద్, నిర్మలభారతి, పెంచలయ్య, మురళీధర్రెడ్డి, శశిధర్, గుంటూరు జిల్లా కార్యదర్శి శామ్యూల్ పాల్,ఉద్యోగులు పాల్గొన్నారు. పైపుల వ్యాపారి బలవన్మరణం గుంటూరు రూరల్: ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో పైపుల వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లపాడు పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఏటుకూరుకు చెందిన ఎ.రాంబాబు(60) గ్రామంలోని బొంతపాడు రోడ్డులో పైపుల వ్యాపారం చేస్తూ జీవిస్తుంటాడు. ఇటీవల వ్యాపార లావాదేవీలు ఇబ్బందికరంగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో తన ఆఫీసులో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
తెనాలిరూరల్: పట్టణ సుల్తానాబాద్లోని గాయత్రి వే బ్రిడ్జి సమీపంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. కూలి పనులకు వెళ్లే మరియమ్మ ఒంటరిగా నివసిస్తోంది. గురువారం ఆమె బంధువుల ఇంటికి వెళ్లి.. శనివారం సాయంత్రం తిరిగి వచ్చింది. ఆదివారం ఉదయం చూసుకోగా ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు రూ. 4 లక్షల నగదు, 25 గ్రాముల బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా త్రీ టౌన్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు.. తెనాలి ప్రాంతంలో ఇటీవల చోరీలు పెరుగుతున్నాయి. మండలంలోని కఠెవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఈ నెల 4వ తేదీన ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. తిరిగి 7వ తేదీ అర్ధరాత్రి వచ్చారు. చోరీ జరిగిందని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. రూ. లక్ష నగదు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు ఫిర్యాదు చేశారు. -
జాతీయ ఈత పోటీలకు టెక్నికల్ అధికారిగా సురేష్
నరసరావుపేట ఈస్ట్: శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల స్విమ్మింగ్ పూల్ కోచ్ జి.సురేష్ 79వ సీనియర్ జాతీయ ఆక్వాటిక్ చాంపియన్షిప్ పోటీలకు టెక్నికల్ అధికారిగా నియమితులయ్యారు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. స్విమ్మింగ్ కోచ్గా కొనసాగుతున్న సురేష్ గతంలోనూ పలు అంతర్జాతీయ, జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు పర్యవేక్షకునిగా వ్యవహరించారు. ఆక్వాటిక్స్లో సురేష్కు ఉన్న నైపుణ్యానికి, నిబద్ధతకు ఈ ఎంపిక నిదర్శనమని పలువురు పేర్కొన్నారు. సురేష్కు కళాశాల యాజమాన్య ప్రతినిధులు, పల్నాడు జిల్లా సిమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్ వద్ద సముద్రంలో నీటిలో గల్లంతైన బాలుడిని సాహసోపేతంగా పోలీసులు, మైరెన్ సిబ్బంది ఆదివారం కాపాడారు. మధ్యాహ్నం సమయంలో కర్లపాలెంకు చెందిన కంబం కమల్ దాస్ (17) తన నలుగురు స్నేహితులతో సూర్యలంక బీచ్లో సముద్ర స్నానానికి వెళ్లాడు. అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రవాహానికి లోతైన నీటిలోకి కొట్టుకుపోయాడు. విధుల్లో ఉన్న మైరెన్, బాపట్ల రూరల్ పోలీసులు బాలుడిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. మరో ఘటనలో.. చీరాల: చీరాల మండలం తోటవారిపాలేనికి చెందిన అఖిలేష్ (17) కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాడరేవు సముద్రతీరానికి వచ్చాడు. అలల తాకిడికి కొట్టుకుపోతుండటంతో పోలీసులు రక్షించి ఒడ్డుకు చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. తెనాలి: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జనగణనను శాసీ్త్రయంగా పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాకు సంబంధించి వివిధ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలు, వినతులను స్వీకరించేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తెనాలి రానున్న సందర్భంగా బీసీ సంఘాలు కమిషన్కు విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని కోరారు. సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ సంతృప్తికరంగా అమలు జరిపేలా, బీసీ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలని, రాష్ట్రంలో బీసీల కుల గణన ద్వారా సరైన డేటా సేకరించి రిజర్వేషన్ల పెంపునకు కమిషన్ సహకరించాలన్నారు. జనగణన వివరాలను బీసీ కులగణన సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలన్నారు. బీసీల ప్రధాన డిమాండ్లతో కూడిన విజ్ఞాపనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యంగా చట్టసభలలో రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా, స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు జనాభా దామాషాలో దక్కేలా తోడ్పడాలన్నారు. బీసీ నాయకులు పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల వెంకటసాయి, జొన్నాదుల మణికంఠ, జె.నాగమోహన్, జె.మురళి, ములికి జయకృష్ణ, జె.రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కరవేదిక(పీజీఆర్ఎస్) సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడవలేని, మంచాలకు పరిమితం అయిన, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తీసుకురావద్దని సూచించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పని సరిగా హెల్మెట్ పెట్టుకొని రావాలి కోరారు. ‘మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1100’ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. -
ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్లో ఉచిత ఉర్దూ శిక్షణ
పెదకాకాని: విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేయడంపై కేసు నమోదు చేసినట్లు పెదకాకాని పోలీసులు శనివారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన ఒక విద్యార్థిని గుంటూరు నగర శివారులోని ప్రైవేట్ కళాశాలలో డెంటల్ కోర్స్ చదువుతుంది. ఆ విద్యార్థిని విశాఖపట్నంలో ఉన్న సమయంలో సోషల్ మీడియా ద్వారా ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఆ యువకుడు ప్రేమిస్తున్నానని, తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నాడు. తన నెంబర్ బ్లాక్ చేయగా తన స్నేహితుల ద్వారా ఫోన్ చేసి యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. బాధితురాలు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ టిపి నారాయణస్వామి తెలిపారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ తాడికొండ: అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, నిర్మాణ వ్యయాలపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. శనివారం అమరావతిలో పర్యటించిన మంత్రి కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న బ్రిడ్జిల నిర్మాణ పనులను పరిశీలించారు. వర్షాకాలంలో ఆయా బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. -
రక్తదాత.. సుఖీభవ
నేటి కాలంలో రక్తసంబంధాలు కూడా భారంగా మారాయి. కానీ ఏ బంధం లేకపోయినా మానవత్వం రక్తదాతల రూపంలో ఇంకా ఇతరులకు సాయం చేస్తోంది. ఇలాంటి వారు ప్రాణదాతలుగా మారుతున్నారు. అర్ధరాత్రి... అపరాత్రి... అని తేడా చూసుకోకుండా ఫోన్ చేయగానే సొంత ఖర్చులతో ఆస్పత్రికి తక్షణమే వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు. ఆ క్షణంలో వారు చేసే రక్తదానం నిండు ప్రాణాన్ని కాపాడుతోంది. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనమిదీ..గుంటూరు మెడికల్ : జిల్లాలో పలువురు యువత సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రక్తం కావాల్సిన వారి కోసం ప్రత్యేకంగా వెబ్సైట్లు రూపొందించి సేవ చేస్తున్నారు. మరికొంత మంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. దానిని కృత్రిమంగా తయారు చేయలేం. మనిషి జీవించటానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో రక్తం కూడా అంతే ముఖ్యం. మానవ శరీరంలోని ప్రతి అవయవం రక్తసరఫరాతోనే పనిచేస్తుంది. కొన్ని ఆపరేషన్లు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా రక్తం అవసరం అవుతుంది. రోడ్డు ప్రమాద బాధితులు కొన్ని సందర్భాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు రక్తం దొరక్క ఆపరేషన్లు సైతం వాయిదాలు పడుతుంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కో రక్తం గ్రూపు ఉంటుంది. ఏ మనిషిలో ఏ రక్తం ఉంది, రక్తంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయి అనే విషయాలను కనిపెట్టిన ఆస్ట్రేలియా దేశానికి చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ 1868 జూన్ 14న జన్మించారు. ఆయన జయంతి నాడే ఏటా ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క చుక్క మానత్వం అనే నినాదంతో ఈ దినోత్సవం జరుగుతోంది. రక్తంలో గ్రూపులు... రక్తంలో ఏ, బీ, ఓ, ఏబీ పేరిట పాజిటివ్, నెగిటివ్ గ్రూపులు ఉంటాయి. ఏబీ నెగిటివ్ రక్తం చాలా అరుదుగా లభిస్తుంది. ఏబీ పాజిటివ్ రక్తం గ్రూప్ వారు యూనివర్సల్ రిసీవర్స్. ఎవరి రక్తమైనా వీరికి ఎక్కించవచ్చు. ఓ నెగిటివ్ గ్రూప్ వారు యూనివర్సల్ డోనార్స్. వీరు ఎవరికై నా రక్తం ఇవొచ్చు. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా రక్తంలో ఉంటాయి. ఒక్క వ్యక్తి రక్తదానం వల్ల నలుగురికి ప్రాణదానం చేయవచ్చు. రక్తదానం చేసేందుకు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, కనీసం 45 కిలోల బరువు ఉండాలి. షుగర్, బీపీ, గుండెకు సంబంధించిన జబ్బులు, కంటి రోగాలు ఉండకూడదు. సుఖవ్యాధులు ఉన్న వారు, ఆపరేషన్ చేయించుకున్న వారు, రక్తహీనతతో బాధపడుతున్న వారు రక్తం ఇవ్వరాదు. ప్రతి మనిషి ఏడాదిలో నాలుగుసార్లు రక్తదానం చేయవచ్చు. శరీరం నుంచి 350 మిల్లీగ్రాముల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. రక్తదానం చేసేందుకు 10 నుంచి 15 నిమిషాల వ్యవధి చాలు. రక్తదానం చేయటం వల్ల మళ్లీ తాజా రక్తం శరీరంలోకి వస్తుంది. తద్వారా చాలా ఆరోగ్యంగా ఉంటారు. రక్తాన్ని తీసుకునే ముందు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తారు. రక్తం ఇచ్చిన అరగంట సేపు విశ్రాంతి తీసుకోవాలి. ఆ రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ మోతాదులో ద్రవపానీయాలు ఉండేలా చూసుకోవాలి. రక్తదానం చేసిన ఆ ఒక్క రోజు బరువు ఉన్న వస్తువులు ఎత్తకూడదు. అవగాహన కల్పిస్తున్నారు.... జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రక్తదానంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఇంజినీరింగ్ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, యువతలో స్వచ్ఛంద రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తూ వారు ముందుకు వచ్చి రక్తదానం చేసేలా వైద్య అధికారులు పనిచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 17 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా హెచ్ఐవీ వంటి ఇన్ఫెక్షన్లను ముందస్తుగానే గుర్తించి కట్టడి చేయవచ్చు. -
44 సార్లు రక్తదానం చేశా
నేను కేఎల్ యూనివర్సిటీలో 2007లో బీటెక్ చదువుతున్న సమయంలో ఎవరైనా రోగులు, రోడ్డు ప్రమాద బాధితులు ఆపరేషన్ కోసం రక్తం కావాలని అడిగితే స్వచ్ఛందంగా ఇవ్వడం ప్రారంభించాను. గుంటూరు జీజీహెచ్లో స్టేట్బ్యాంక్ ఇఫ్ ఇండియా (ఎస్బీఐ)లో పనిచేస్తున్న సమయంలో ఆస్పత్రిలో రక్తం కొరత ఉందని, రక్తం సకాలంలో లభించక పలువురు చనిపోతున్న విషయం తెలుసుకున్నా. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది రక్తం ప్రాధాన్యత గురించి వివరించారు. దాంతో ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తున్నాను. ఒడిశాలో రెండు రైళ్లు ఢీకొని పలువురు మరణించటం, అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని వార్తలలో చూసి ఆ రాష్ట్రం వెళ్లా. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రక్తదానం చేశా. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశాను. రక్తదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం, మంచి ఆరోగ్యం కలుగుతుందని నా నమ్మకం. – జంగం అనుదీప్ సత్యప్రకాష్, ఎస్బీఐ సీనియర్ అసోసియేట్, గుంటూరు -
దుర్గమ్మకు విరాళాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. కడప చిన్న చౌక్కు చెందిన కె.గోపిరెడ్డి కుటుంబం అయ్య వరమ్మ పేరిట నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళం అందజేశారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడుకు చెందిన వై.కనకదుర్గ కుటుంబం అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు, అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. -
ఆరోగ్యంగా ఉండాలంటే యోగా తప్పనిసరి
జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పర్చూరు(చినగంజాం): మనం ఆరోగ్యం ఉండాలంటే ప్రతి ఒక్కరికి యోగా తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వీ వినోద్కుమార్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా యోగాంధ్ర నోడల్ అధికారి, ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం పర్చూరులోని అద్దంకి నాంచారమ్మ కల్యాణ మండపంలో నిర్వహించి యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరోగ్య పరమైన ఇబ్బందులు భవిష్యత్లో రాకూడదనుకుంటే యోగా చేయాలని, వ్యాధులు దరి చేరకుండా అరోగ్యాన్ని కాపాడే శక్తి యోగాకు ఉందనిన్నారు. అనంతరం ఆయన డాక్టర్ దాసరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పలు ఆసనాలు, ప్రాణామాయం వంటి పలు అంశాలను స్థానిక అధికారులు, ప్రభుత్వ సిబ్బందితో కలిసి స్వయంగా వేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కార్యక్రమంలో తహసీల్దార్ పీ బ్రహ్మయ్యతోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడు అరెస్ట్
రూ. ఐదు వేల నగదు, కారు స్వాధీనం తెనాలిరూరల్: పట్టపగలు ఇంట్లో చోరీకి పాల్పడిన పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం నిందితుడు కారులో పరారయ్యాడన్న ఆధారంతో సాంకేతికతను వినియోగించి నిందితుడిని అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంతో సీఐ నాయబ్ రసూల్ శనివారం వివరాలు వెల్లడించారు. మండలంలోని హాఫ్ఫేట గ్రామానికి చెందిన రెడ్డి వెంకటరవికిరణ్ తన తల్లి లక్ష్మీసామ్రాజ్యంను ఈ నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు బ్యాంకుకు తీసుకువెళ్లాడు. 11.50 గంటల సమయంలో అతని రెండో అక్క తోటకూర సామ్రాజ్యం ఫోన్ చేసి ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బయటకు వచ్చాడని, తనను చూసి వేగంగా వెళ్లి సమీపంలో ఉన్న తెల్ల కారులో పరారయ్యాడని చెప్పింది. రవికిరణ్ వెంటనే ఇంటికి వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపల బీరువా తాళాలూ పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని రూ. 25 వేలు అపహరించుకెళ్లాడు. ఇదే విషయాన్ని రవికిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేశారు. నిందితుడు పరారైన సమయంలో ఆ మార్గంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించి కారు నంబరును గుర్తించగలిగారు. సాంకేతికతను వినియోగించి కారు కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు. కారు విజయవాడ నుంచి తెనాలి వైపు వస్తున్నట్టు గుర్తించి నందివెలుగు ప్రధాన జంక్షన్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని ఖమ్మం జిల్లా మధిర మండలం మదుపల్లి గ్రామానికి చెందిన బండి గోపిగా గుర్తించారు. నిందితుడి నుండి రూ.ఐదు వేల నగదు, కారును స్వాధీనపర్చుకున్నారు. నిందితుడిపై తెలంగాణలో తొమ్మిది, ఆంధ్రప్రదేశ్లో రెండు కేసులు ఉన్నాయని, మరో 20 కేసులు కోర్టు కొట్టివేసిందని సీఐ తెలిపారు. సాంకేతికతను వినియోగించి నిందితుడిని అతి త్వరగా అరెస్ట్ చేసిన ఎస్ఐ ఆనంద్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
లారీ యజమానుల నిరసన
టోల్గేట్ నిర్వాహకుల అరాచకాలపై పోలీసులకు ఫిర్యాదుమార్టూరు: స్థానిక జాతీయ రహదారిపై మండల పరిధిలోని బొల్లాపల్లి టోల్గేట్ అధికారుల అరాచకాలపై లారీ యజమానులు శనివారం రాత్రి నిరసనకు దిగారు. అందిన వివరాల మేరకు.. మండల పరిధిలోని గ్రానైట్ సరుకు, సుబాబుల్ కర్రల లోడ్లు నిత్యం ఈ టోల్గేట్ పరిధిలో ప్రయాణిస్తుంటాయి. ఏ లోడు అయినా సరే లారీలోకి ఎక్కించాక వే బ్రిడ్జిల వద్ద యాజమాన్యం తూకం వేయించి బిల్లులను లారీ డ్రైవర్ల ద్వారా పంపిస్తుంటారు. ఈ విధంగా కాటా వేసిన వాహనాలు టోల్గేట్ బిల్ వసూళ్ల కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వే బ్రిడ్జిలలో గతంలో తూకం వేసిన వే బిల్లులోని బరువు కంటే ఏమాత్రం అధికంగా కనిపించినా టోల్ గేట్ సిబ్బంది వాహనాలను ముందుకు వెళ్లనివ్వకుండా కొంతకాలంగా ఆపివేస్తున్నారు. దీనివలన వరుసలో వెనుక ప్రయాణించే వాహనాల ప్రయాణికులు గంటల కొద్ది జాప్యం జరుగుతూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల నిత్యం టోల్గేట్ వద్ద ఏదో ఒక సమయంలో గొడవలు జరుగుతున్నా టోల్గేట్ మేనేజర్ కానీ ఆపై అధికారులు కానీ సమస్యపై దృష్టి పెట్టకపోవడంతో వాహనాల యజమానులు, డ్రైవర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. టోల్గేట్ సిబ్బది నిర్వాకం.. ఈ క్రమంలో గత శుక్రవారం అర్ధరాత్రి ఓ గ్రానైట్ లారీని అధిక బరువు ఉన్నది కనుక బరువుకు అదనంగా టోల్ ఫీజు చెల్లిస్తేనే కానీ వాహనాన్ని వెళ్లనీయమని లారీని ఆపారు. లారీ యజమాని ఇచ్చిన వే బిల్లు ప్రకారం తాము వెళతామే కానీ అదనపు బరువుకు సంబంధించిన అదనపు రుసుం చెల్లించటానికి తమ వద్ద నగదు ఉండదని ఆ లారీ డ్రైవర్ చెప్పినప్పటికీ సిబ్బంది వినిపించు కోలేదు. కొంత వాదోపవాదాల అనంతరం టోల్గేట్ సిబ్బంది వాహనాన్ని ముందుకు వెళ్లకుండా వెనుకకు రప్పించి ఆ ప్రాంతంలోనే పక్కన పెట్టించారు. లారీ డ్రైవర్ వద్ద నుంచి వాహనానికి సంబంధించిన తాళాలతోపాటు అతని సెల్ ఫోన్ సైతం బలవంతంగా లాక్కున్నారు. డ్రైవర్ను వెనక్కి పంపించారు. ఈ క్రమంలో సహనం నశించిన వాహనాల యజమానులు శనివారం రాత్రి టోల్గేట్ వద్ద సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. సీఐ వై శ్రీనివాసరావు, ఎస్ఐ బాబురావులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలతో మంతనాలు జరిపారు. లారీ యజమానులు టోల్ గేట్ మేనేజరు సిబ్బంది వలన తాము పడుతున్న మానసిక సంఘర్షణ గురించి అధికారుల వద్ద ఏకరువు పెట్టారు. చివరగా సీఐ మాట్లాడుతూ సోమవారం టోల్గేట్ కు సంబంధించిన ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడతామని సర్దిచెప్పడంతో వాహన యజమానులు తాత్కాలికంగా నిరసన విరమించారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32.92 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో ‘పాల’ నురగ వెనుక కూడా విషం దాగి ఉంటోంది. కొందరి స్వార్థం కోసం పాలను విషతుల్యం చేస్తున్నారు. వారి నిర్వాకానికి పశువులు కూడా వ్యాధుల బారిన పడి కబేళాలకు వెళ్తున్నాయి. వాటి పాలు తాగిన వారు అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. పశుపోషకులు, పాల ఉత్పత్తిదారులు, గేదెల ఫాం యజమానులు పాల దిగుబడుల కోసం అర్రులు చాస్తున్నారు. దీనికోసం ఆక్సిటోసిన్ అనే ఇన్జెక్షన్ ఇస్తున్నారు. అది పశుసంపదను నాశనం చేస్తోంది... ప్రజారోగ్యాన్నీ దెబ్బతీస్తోంది. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం స్వాధీనం
తెనాలిరూరల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పోలీసులు మండలంలోని అంగలకుదురు గ్రామం సమీపంలోని తెనాలి–గుంటూరు ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున వాహన తనిఖీలు నిర్వహించారు. తెనాలి నుంచి గుంటూరు వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను గమనించిన వాహనంలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా, తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం గ్రామానికి చెందిన డ్రైవర్ కలవకొల్లు మధుబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి గొంది అశోక్ పరారయ్యాడు. మొత్తం 79 బస్తాలలో సుమారు 3,950 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. ఐతానగర్ ప్రాంతంలోని ఎస్బీఐ బ్యాంకు వెనుక గల రేషన్ షాపు నుంచి లోడ్ చేసి, వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోని హరీష్ రైస్ మిల్లుకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గొంది అశోక్, కలవకొల్లు మధుబాబు, ఐతానగర్ రేషన్ డీలర్ కుటుంబ సభ్యుడు, అనంతవరప్పాడు ప్రాంతానికి చెందిన రైస్ మిల్ నిర్వాహకుడు హరీష్లను నిందితులుగా గుర్తించినట్టు రూలర్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు. బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని రూరల్ సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. -
ప్రాణదానంతో సమానం
ఒకరు చేసే రక్తదానంతో నలుగురి ప్రాణాలు కాపాడవచ్చు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ప్రాణదాతలుగా నిలిచిపోవాలి. జిల్లా జనాభాలో ఒక శాతం రక్తం సేకరణ చేయాల్సి ఉంది. జిల్లాలో 17 బ్లడ్ బ్యాంకుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అందిస్తున్నారు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు వైద్య కళాశాల జింఖానా ఆడిటోరియంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు, సంస్థలను ఘనంగా సన్మానిస్తున్నాం. – డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ, గుంటూరు. ● -
ఉపాధి కోసం వచ్చి తిరిగిరాని లోకాలకు
మార్టూరు: ఉపాధి కోసం వచ్చి మార్టూరులో విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన వివరాలు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం గ్రామానికి చెందిన దాసరి అశోక్ కుమార్(46) వెల్డింగ్ పనుల నిమిత్తం మార్టూరు వచ్చాడు. స్థానిక మద్ది సీతాదేవి కాలనీ సమీపంలో ఓ ఇంటి వద్ద పనిచేస్తున్న అశోక్ కుమార్ తాను పట్టుకున్న ఇనుప నిచ్చెన విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతడిని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అశోక్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు అశోక్ కుమార్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా సంతనూతలపాడు నియోజకవర్గానికి చెందిన అశోక్ కుమార్ హఠాన్మరణం విషయం తెలిసిన వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. మృతికి గల కారణాలు తెలుసుకొని అశోక్ కుమార్ మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ నాయకులు ఉప్పలపాటి అనిల్చౌదరి, గర్నె పూడి రవిచంద్, అట్లూరి సుకుందరావు, మైలా చిన్న నాగేశ్వరరావు, గొట్టిపాటి ఆనంద్, మోషే నాయక్, అట్లూరి జైపాల్, అట్లూరి వెంకయ్య, పేరం దానియేలు తదితరులు ఉన్నారు. నివాళులర్పించిన జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు నాగార్జున -
అగ్రిగోల్డ్ మోసానికి మరో బాధితురాలు మృతి
గుంటూరు రూరల్: అగ్రిగోల్డ్ మోసానికి మరో వృద్ధురాలు బలైంది. భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్లో ఫిక్సిడ్ డిపాజిట్గా దాచుకున్న రూ.25,000 కోసం ఎదురుచూసి చివరికి తుదిశ్వాస విడిచింది. వివరాలు.. వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన తన్నీరు పోలేరమ్మ(70) కూలి పనులు చేసుకుని జీవించేది. ఆమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరందరికి వివాహాలు జరిపించింది. పిల్లలంతా తమ కుటుంబ సభ్యులతో ఎవరి కుటుంబాలు వారు చూసుకుంటుండగా, భర్తలేని తనకు వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని అప్పట్లో అగ్రిగోల్డ్ను నమ్మి రూ.25,000 కడితే చివరికి రూ.50,000 వస్తాయని ఆశతో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకుంది. 2012లో కడితే 2018లో తనకు డబ్బు వస్తుందని ఆశ పడింది. 2015లో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడిన దగ్గర నుంచి, అవసర పడతాయి అనుకున్నా డబ్బులు ఇక రావని దిగులుతో నిత్యం మదనపడుతూ ఉండేది. అప్పట్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలు, దీక్షలు చూసి కొంత ధైర్యంగా ఉన్నా, వృద్ధాప్యంలో డబ్బులు లేక అనేక బాధలు పడుతూ ఉండేది. ఇప్పటికే 12 సంవత్సరాలు దాటి, ప్రభుత్వాలు మారుతున్న ఇచ్చిన హామీలు నెరవేర్చటంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అగ్రిగోల్డ్ డబ్బులు తిరిగి బాదితులకు అందించే దిశగా కృషిచేస్తామని కూటమి ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి వచ్చి, రెండు సంవత్సరాలు అవుతున్న మాటలు చెబుతున్నారని, చేతల్లో డబ్బులు వస్తాయన్న నమ్మకం లేకపోయిందని, మానసికంగా ఆలోచించి, గుండెనొప్పితో శనివారం మృత్యువాతకు గురైంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం స్పెషల్ కోర్టు పెట్టడంతో పాటు కంపెనీ డేటా ప్రకారం వడ్డీతో సహా ప్రతి బాధితునికి త్వరలో డబ్బులు ఇచ్చి న్యాయం చేసి మరో ప్రాణహాని జరగకుండా చూడాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కుంచాల అంకమ్మరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అమరజవాన్ల కుటుంబాలకు ఉచితంగా సిమెంట్
శ్రీ సిమెంట్ పాన్ ఇండియా హెడ్ భారతి నరసరావుపేట రూరల్: దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా సిమెంట్ అందజేస్తున్నట్టు శ్రీ సిమెంట్ పాన్ ఇండియా హెడ్ భారతి తెలిపారు. పట్టణంలోని హెచ్–6 హోటల్లో శుక్రవారం దాచేపల్లి శ్రీ సిమెంట్ ప్లాంట్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్లాంట్ జీఎంలు శ్రీనివాస్, శ్రీధర్ రాజు, ఏజీఎం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలకు శ్రీ సిమెంట్ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రాజెక్ట్ నమాన్ పేరుతో వీరమరణం పొందిన అమరవీరుల కుటుంబాల వారసులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. అమరవీరుల కుటుంబం తమ సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు అవసరమైన సిమెంట్ను పూర్తిగా ఉచితంగా సరఫరా చేస్తామని వివరించారు. బాధిత కుటుంబాలు దేశంలోని శ్రీ సిమెంట్ ప్లాంట్ల నుంచి సిమెంట్ను సేకరించవచ్చని స్పష్టం చేశారు. ప్లాంట్ జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ దాచేపల్లి ప్లాంట్లో 180 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, అత్యధిక శాతం స్ధానికులకే అవకాశం కల్పించినట్టు తెలిపారు. సామాజిక బాధ్యతగా ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాల్లో మౌళిక వసతుల కల్పన, విద్యా వలంటీటర్ల నియామకం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు. -
పీసపాడు వద్ద కారు, ఇసుక ట్రాక్టర్ ఢీ
క్రోసూరు: మండలంలోని పీసపాడు గ్రామ ప్రధాన రహదారిపై భారత్ పెట్రోల్ బంక్ దగ్గరలో శుక్రవారం ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. పెదకాకానికి చెందిన మాజీ ఎంపీపీ నల్లిమల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ బద్దిపూడి రమేష్, మరో ఇద్దరు వ్యక్తిగత పనులపై కారులో సత్తెనపల్లి మీదగా మండలంలోని పీసపాడు వస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ క్రోసూరు వైపు నుంచి సత్తెనపల్లి వెళ్తుంది. ఇసుక ట్రాక్టర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురుకి గాయాలయ్యాయి. ఒకరు గుంటూరు ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా మరో ముగ్గురు దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది. నలుగురు క్షేమంగా ఉన్నట్లు తెలిసింది. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్కు స్వల్పగాయాలైనట్లు సమాచారం. ఇసుక ట్రాక్టర్ ముప్పాళ్ల మండలం కు చెందినదిగా తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. -
తుమృకోట కేసులో నలుగురికి రిమాండ్
రెంటచింతల: మండలంలోని తుమృకోట గ్రామంలో ఈ నెల 9వ తేదీ మంగళవారం రాత్రి ఇంటిపై నిద్రిస్తున్న ఆలేటి కోటేశ్వరరావుపై కర్రలు, రాడ్లతో దాడి చేసి గాయపరిచిన కేసుకు సంబంధించి 4 గ్గురిని గురజాల కోర్టులో హాజరుపెట్టగా వారికి జడ్జి ఆలేఖ్య రిమాండ్ విధించినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున శుక్రవారం తెలిపారు. కేసులో మొత్తం 11 మంది నిందితులు కాగా వారిలో ఆలేటి శిలువరాజు, ఆలేటి చిన లక్ష్మయ్య, ఆలేటి సత్యం, ఆలేటి దానంను హాజరుపెట్టడం జరిగిందన్నారు. పల్టీలు కొట్టిన కారు ఇరువురికి గాయాలు యడ్లపాడు: అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడిన సంఘటన జాతీయ రహదారిపై యడ్లపాడు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నంద్యాలకు చెందిన కిరణ్ తన స్నేహితుడితో కలిసి గుంటూరు నుంచి ఒంగోలు వైపు కారులో వెళ్తున్నారు. యడ్లపాడు వద్దకు రాగానే కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీకొట్టింది. కిరణ్, అతని స్నేహితుడికి గాయాలుకాగా, కారు ధ్వంసమైంది. స్థానికులు క్షతగాత్రులను కారు నుండి బయటకు తీశారు. సంఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
రైతుల శ్రమను తగ్గించే పరిశోధనలు అవసరం
గుంటూరు రూరల్: రైతుల శ్రమను తగ్గించి ఆదాయం పెంచే విధంగా పరిశోధనలు చేయాలని నాబార్డు మాజీ చైర్మన్, ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫైనాన్స్ బోర్డు చైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. శుక్రవారం నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. డాక్టర్ గోవిందరాజులు మాట్లాడుతూ భారత వ్యవసాయం ఇప్పటికీ వర్షాకాలంపై ఆధారపడి ఉందన్నారు. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా, సాంకేతికత ఆధారితంగా, పర్యావరణ హితంగా, తక్కువ వ్యయంతో సాగుచేసే విధంగా రైతుల శ్రమను తగ్గించేలా తీర్చిదిద్దడంపై ప్రముఖ విద్యాసంస్థలు దృష్టి సారించాలన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఏఐ ఆధారిత వ్యవసాయ సాంకేతికతలు ఉత్పత్తి ఖర్చులు తగ్గించే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించడంపై దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఈ దిశగా త్వరలో ఎంటెక్ అగ్రి–ఇంజినీరింగ్లో ఏఐపై కోర్స్ను ప్రవేశ పెట్టబోతున్నామని, అలాగే అగ్రి స్కిల్ సెంటర్లు, ప్రతి జిల్లాలో ఫార్మ్ మెకనైజేషన్ ట్రైనింగ్ సెంటర్లు, ఫార్మ్ మెకనైజేషన్ టెక్నీషియన్ కోర్సులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్వర్మ మాట్లాడుతూ జిల్లాలోని రైతుల ఆదాయం పెంచడంలో, ఆహారభద్రత కల్పించడంలో, పురుగుమందుల అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆహారం అందించడంలో పరిశోధనలు జరగాలని కోరారు. ఎల్నినో ప్రభావిత ప్రాంతాలలో రైతుల ఆదాయం పడిపోకుండా, ఈ పరిస్థుతులని తట్టుకొనే సాంకేతికతను అందించడం లో యూనివర్సిటీ సహకరించాలని కోరారు. ప్రాంతీయ పరిశోధన స్థానం లాం ప్రచురించిన పుస్తకాలను ఆవిష్కరించారు. -
ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గుండె మార్పిడి ఆపరేషన్
గుంటూరు మెడికల్: గుండెజబ్బుతో మూడేళ్లుగా బాధపడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడికి గుండె మార్పిడి ఆపరేషన్ చేసి వైద్యులు పునర్జన్మిచ్చారు. గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన గుండె మార్పిడి ఆపరేషన్ చేసి యువకుడికి నూతన జీవితం ప్రసాదించారు. వివరాలు.. గుంటూరు శారదాకాలనీ 25వలైనుకు చెందిన గుండిమెడ వేద ప్రకాష్, ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి మూడేళ్ల కిందట గుండె జబ్బు సోకింది. 2023 మార్చిలో తీవ్రమైన ఛాతీనొప్పి, స్పృహ కోల్పోవడం, సడన్ కార్డియాక్ట్కు అరెస్టు సంభవించింది. వైద్యులు తక్షణమే కార్డియో పల్మనరీ రీసెర్చ్స్టేషన్ (సీపీఆర్) చేసి ప్రాణాలు కాపాడారు. కార్డియాక్ట్ ఎమ్మారై పరీక్షలో గుండె ఎడమ జటరిక తీవ్రంగా బలహీన పడినట్లు, గుండె పంపింగ్ సామర్ధ్యం 30 నుంచి 35 మాత్రమే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రక్త ప్రవాహం మందగించినట్లు గుర్తించి 2024 మే నెలలో ఆటోమ్యాటెడ్ ఇంప్లాంట్బుల్ కార్డియో వర్కర్ ట్యూబ్లర్ (ఏఐసీడీ) పరికరాన్ని వేద ప్రకాష్కు అమర్చామన్నారు. ఎన్ని చికిత్సలు చేసినా గుండె పనితీరు మెరుగు పడలేదని, గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని నిర్ధారించామని వివరించారు. విజయవాడ మాచవరానికి చెందిన 17 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదంలో చనిపోతూ అవయవదానం చేయగా ఆ యువకుడి గుండెను వేద ప్రకాష్కు మే 26న అమర్చి విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేశామన్నారు. వేద ప్రకాష్ మాట్లాడుతూ తనకు ఆసుపత్రి వైద్యులు పునర్జన్మిచ్చారని, మూడేళ్లుగా ఆసుపత్రులు తిరిగి గుండె సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ హార్ట్ ఫెల్యూర్తో బాధపడేవారికి నేడు అత్యాధునిక వైద్య చికిత్సలు వచ్చాయన్నారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ రాయపాటి మమత, హాస్పిటల్ చైర్మన్ రామోహన్రావు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రవికాంత్, డాక్టర్ నవీన్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ రామారావు, డాక్టర్ మృత్యుంజయకుమార్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ అశోక్కుమార్, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ జయరామ్పాయ్ తదితరులు పాల్గొన్నారు. -
అర్హత పరీక్ష లేకుండా ఉపాధ్యాయ నియామకాలు న్యాయమా!
నెహ్రూ నగర్: డీఎస్సీ రాత పరీక్ష లేకుండానే క్రీడల సర్టిఫికెట్ల ఆధారంగా 382 మంది ఉపాధ్యాయులను నియమించడం విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. ధనుంజయ రెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక జన చైతన్య వేదిక హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీఓ నంబరు 4, 47 ద్వారా రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడల ప్రతిభ ఆధారంగా 421 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపిక చేపట్టిందని తెలిపారు. అస్మదీయులకు దొడ్డిదారిన 382 మందికి క్రీడల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా నియామకాలు ఇవ్వడం మంచిది కాదన్నారు. 2012లో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు 74 ప్రకారం క్రీడా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ నియామకాలు పొందాలంటే సంబంధిత రాత పరీక్షలు తప్పనిసరి అని, మెరిట్ ఆధారంగానే నియామకాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం రాత పరీక్ష లేకుండానే నియామకాలు చేపట్టడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లకు ఇచ్చిన వెయిటేజీపై అభ్యర్థుల్లో సందేహాలు ఉన్నాయని, నకిలీ లేదా వివాదస్పద సర్టిఫికెట్లపై పూర్తి పరిశీలన జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. అన్ని క్రీడలకు సమాన అవకాశాలు లభించాయా అనేది ప్రశ్నార్థకమన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగానికి బోధనా నైపుణ్యం కూడా అవసరమని, కేవలం ఆటల్లో పాల్గొన్న సర్టిఫికెట్ల ఆధారంగా 270 మందికి నియామకాలు ఇవ్వడం వల్ల విద్యా వ్యవస్థకు నష్టం కలుగుతుందని తెలిపారు. స్పోర్ట్స్ కోటా నియామకాల్లో పారదర్శకత కరువైందని, ఇది వ్యవస్థాకత కుంభకోణమని అభివర్ణించారు. రాత పరీక్ష లేకుండా 382 ఉపాధ్యాయ పోస్టుల నియామకం జరిగిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, క్రీడల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ స్పష్టం చేశారని తెలిపారు. నియామకాలు పూర్తయిన వెంటనే భవిష్యత్లో రాత పరీక్షల ఆధారంగానే స్పోర్ట్స్ కోటా నియామకాలు జరపాలని ఉత్తర్వులు ఇవ్వడం తమ తప్పులను సరిదిద్దుకోవడానికేనా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పోర్ట్స్ కోటా నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణ నిర్వహించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు. -
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి
● కాసు కన్వెన్షన్ హాలులో ఆశా, ఏఎన్ఎంలతో యోగాంధ్ర ● పాల్గొన్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులు నరసరావుపేట: యోగాను జీవితంలో ప్రతి ఒక్కరూ భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆశా, ఏఎన్ఎమ్లతో యోగాంధ్ర కార్యక్రమం పెద్దచెరువులోని కాసు కన్వెన్షన్ హాలులో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం యోగా శిక్షకులు ఆధ్వర్యంలో దాదాపు ఒక గంట పాటు నిర్వహించిన యోగా కార్యక్రమంలో అందరూ యోగాసనాలు వేశారు. అనంతరం యోగా మంత్రంతో కార్యక్రమాన్ని ముగించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగాను జీవితాంతం ఆచరించే ఆరోగ్యకరమైన జీవన విధానంగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలని సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. యోగా, నడక, సరైన ఆహార నియమాలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ప్రతి రోజు యోగ చేయాలి అన్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడులు ఉన్నప్పటికీ ఆరోగ్యం కోసం యోగాను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల ఏడవ తేదీ నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలోని ప్రతి గ్రామం, మండలంలో యోగా ట్రైనర్, మాస్టర్లచే యోగ నిర్వహించడం జరుగుతున్నదన్నారు. జాయింట్ కలెక్టర్ సంజన సింహ మాట్లాడుతూ యోగాని విద్యార్థి దశ నుంచే ప్రారంభించాలని అన్నారు. యోగ వలన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
బాల్యం ఓ వరం
ఏఎన్యూ (పెదకాకాని): పరీక్ష ఫలితాలను ఏఎన్యూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఏ హిస్టరీ, సంస్కృతం, ఎంహెచ్ఆర్ఎం 1,2,3,4 సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, డిప్లమా ఇన్ సైకాలజీ పరీక్ష ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా రీవాల్యుషన్ దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రతి పేపర్కు రూ.1400 చొప్పున చెల్లించాలని చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
నిందితుడికి మూడేళ్ల జైలు గుంటూరు లీగల్: నాగార్జునసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో మాచర్ల మండలం కొప్పునూరు గ్రామానికి చెందిన నిందితుడు యరసాని ఇమ్మానియేల్కు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 30 రోజుల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడికి అప్పీల్ చేసుకునే హక్కు, ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉన్నట్లు కూడా న్యాయస్థానం తెలియజేసింది. ఏపీఎం సోమశేఖర్కు రిమాండ్ కాకుమాను: పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన ఏపీఎం సోమేశేఖర్ను కాకుమాను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాలు.. ఏపీఎం సోమశేఖర్ గతంలో కాకుమానులో పనిచేశారు. ఈ క్రమంలో గరికపాడు గ్రామానికి చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యుల డబ్బులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుతో 2023లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పొన్నూరు అడిషనల్ జూనియర్ సివిల్జడ్జి కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే వాయిదాలకు హాజరు కాకపోవడంతో ఏపీఎం సోమశేఖర్, అతడితోపాటు సీసీ సుబ్బారావుకు నాన్ బెయిల్ బుల్ అరెస్ట్ వారెంట్ను కోర్టు జారీ చేసింది. ఈక్రమంలో ఏపీఎం, సీసీలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా కోర్టు 24వ తేదీ వరకు రిమాండ్ విధించారు. గుంటూరు సబ్ జైలుకు తరలించారు. -
ఎస్సీలకు భూహక్కు పత్రాల పంపిణీకి చర్యలు
బాపట్ల: ఎస్సీలకు సంపూర్ణ భూహక్కు పత్రాలు ఇచ్చేందుకు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. భూముల సమస్యలపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు పంపిణీ చేసిన భూములకు సంపూర్ణ హక్కు కల్పిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అనుసరించి జిల్లాలో 512 మంది ఎస్సీ లబ్ధిదారులకు భూమి కొనుగోలు పథకం కింద కేటాయించినట్లు వివరించారు. ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఆ మేరకు 28.7 ఎకరాల భూమిని పరిశీలించి అర్హులకు అందిస్తామని తెలిపారు. అధికారులు బెదిరింపులకు భయపడవద్దన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఆర్డీవోలు హరికుమార్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలు సామాజిక హీరోలు రక్తదాతలు సామాజిక హీరోలు అని బాపట్ల జిల్లా కలెక్టర్, రెడ్క్రాస్ అధ్యక్షుడు డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. జూన్ 14వ తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక సార్లు రక్తదానం చేసిన వారికి ‘రక్తదాత సుఖీభవ ‘అవార్డు ప్రదానం, రక్త పరీక్షల క్యాంపుల నిర్వహణ, కళాశాలల్లో విద్యార్థులకు రక్తదాన ఆవశ్యకతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని రెడ్ క్రాస్ జిల్లా కో ఆర్డినేటర్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ చెప్పారు. అనంతరం ప్రపంచ రక్త దాతల పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ జిల్లా ట్రెజరర్ ప్రసాద్ రెడ్డి, సభ్యులు అల్లాడి రవికుమార్, జాషువా, నవనీతం పాల్గొన్నారు. ఉద్యోగులకు సురక్షిత తాగునీరు కలెక్టరేట్లో పని చేస్తున్న ఉద్యోగులు, సందర్శకులకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.3 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ రిబ్బన్ కత్తిరించి శుక్రవారం ప్రారంభించారు. కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం ఉన్న పథకాలను ఉపయోగపడే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. బాల కార్మిక నిర్మూలన జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో కార్మికుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. పథకాలను సద్వినియోగం చేసుకునేలా కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. బాల కార్మిక నిర్మూలనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ విస్తృతంగా తనిఖీలు చేయాలన్నారు. ఈనెల 30వ తేదీ వరకు బాల కార్మికుల నిర్మూలనపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డీఆర్వో జి.గంగాధర్గౌడ్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ వెంకట శివప్రసాద్, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
జిల్లా కలెక్టర్ని కలసిన చీరాల ఆర్డీఓ
నిష్పక్షపాతంగా ఓటర్ల జాబితా తయారు చేయాలి డీఆర్వో షేఖ్ ఖాజావలి గుంటూరు వెస్ట్: భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఓటర్ల జాబితాను సమూలంగా ప్రక్షాళన చేయడానికి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టినట్లు జిల్లా రెవెన్యు అధికారి షేఖ్ ఖాజావలి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లు అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి సిబ్బందిగా పనిచేస్తారన్నారు. బూత్ స్థాయి అధికారులు(బీఎల్వో ) లు ఒక పోలింగ్ కేంద్రం పరిధిలోని ఓటర్ల జాబితా నిర్వహణ బాధ్యత పూర్తిగా బీఎల్ ఓ లదే అన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ సమయంలో బీల్వో ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు , తెనాలి ఆర్డీఓ రమణి, డెప్యూటీ కలెక్టర్ లక్ష్మీకుమారి పాల్గొన్నారు. ఏఆర్ ఆర్ఐగా కృష్ణయ్య నగరంపాలెం: జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగపు రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా కె.కృష్ణయ్య శుక్రవారం నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని ఏఆర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. 2013 బ్యాచ్కు చెందిన కె.కృష్ణయ్య గతంలో గుంటూరు హోంగార్డ్స్ విభాగం, బీడీ టీమ్, ఆక్టోపస్ మంగళగిరి, ఆర్ఎస్ఐగా విధులు నిర్వహించారు. ఈ ఏడాదిలో ఆర్ఐగా ఉద్యోగోన్నతి పొంది, రిపోర్ట్ చేశారు. -
పిల్లి కూతలు కూస్తే .. నాలుక కోస్తాం..
గుంటూరు ఎడ్యుకేషన్ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు పాటిబండ్ల కిరణ్కుమార్ హెచ్చరించారు. గురువారం బృందావన్గార్డెన్స్లోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్కుమార్ మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా ఐదేళ్లపాటు సంక్షేమ పాలన అందించిన వైఎస్ జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మాణిక్యరావుకు తగదని, వైఎస్ జగన్కు విమర్శించే స్థాయి అతనికి లేదన్నారు. టీడీపీలోని అగ్రవర్ణ నేతలు మాణిక్యరావును ముందు ఉంచి, విమర్శలు చేస్తున్నారని, టీడీపీలో మాణిక్యరావు బలిపశువేనని అన్నారు. హామీలు అమలు చేయడంలో విఫలమైన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై చవకబారు మాటలు, ఎదురుదాడికి దిగడం సిగ్గు చేటన్నారు. ఎంఆర్పీఎస్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన మాణిక్యరావు ఉద్యమాన్ని వదిలేసి, డబ్బు కోసం టీడీపీలో చేరాడని ధ్వజమెత్తారు. సొంత సామాజిక వర్గానికి నష్టం చేసి జగన్ పై విమర్శలు చేస్తున్నారని, పిల్లి కూతలు కూస్తే, నాలుక కోస్తామని హెచ్చరించారు. వైఎస్ జగన్ను తిడితేనే టీడీపీలో పదవి అని, చంద్రబాబు, లోకేష్ దిగువస్థాయి నాయకులతో పదే, పదే నోటికొచ్చిన విధంగా ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. డబ్బు కోసం, పదవుల కోసం దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్న మాణిక్యరావు టీడీపీకి అధికారం మరో మూడేళ్లే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జి.ప్రభు మాట్లాడుతూ డీఎస్సీలో తమకు నష్టం జరిగిందని 200 మందు అభ్యర్థులు కోర్టుకు వెళ్లారనీ, మెరిట్జాబితాలను కలెక్టరేట్లలో ఎందుకు ప్రచురించలేదన్నారు. డీఎస్సీలో అవినీతి జరిగిందనే విషయం విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడకపోవడంతోనే అర్ధమవుతోందన్నారు. తూర్పు నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డి.అంకాలరాజు మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు మనోజ్, వెంకట్రావు బత్తుల, కూచిపూడి కిరణ్, బాబు, సందీప్, దుర్గారావు, పాలపర్తి గోవర్ధన్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా తయారీ
బాపట్ల ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీపై రాజకీయపార్టీల నాయకులతో కలెక్టర్ గురువారం స్థానిక కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ వరకు ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీ విధానం కొనసాగుతుందని చెప్పారు. జూలై 21న డ్రాఫ్ట్ రోల్ ప్రకటిస్తామని, నంబర్ 18వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 22న తుది జాబితాకు చర్యలు తీసుకుంటామన్నారు. రానున్న మూడు నెలలు సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సమర్థంగా నిర్వహించడానికి యంత్రాంగం ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 65.5శాతం పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ఓటు హక్కుకు ఆధార్ కార్డు ఒకటే ప్రామాణికం కాదని, 13 రకాల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయన్నారు. ఓటర్ల విచారణ ప్రక్రియకు బీఎల్వోలు వస్తే మీ ధృవీకరణ పత్రాలు చూపాలన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియపరచాలన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి సంయుక్త కలెక్టర్, డీఆర్వో జి.గంగాధర్గౌడ్, రాజకీయ పార్టీల నాయకులు రామకృష్ణ, గంగయ్య, రవి, మాల్యాద్రి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
హత్య కేసులో దంపతుల అరెస్టు
చిలకలూరిపేట: వ్యక్తిని దారుణంగా హతమార్చిన దంపతులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని ఎస్ఎంఎస్ షాదీఖానా సమీపంలో షేక్ కాలేషావలి, షేక్ మనీషా దంపతులు నివాసం ఉంటారు. మనీషాకు చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన షేక్ జాకీర్ హుస్సేన్తో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పడ్డాయి. కాలేషావలి రెడ్ల బజారులో వేరే ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. అయినప్పటికీ మనీషా, జాకీర్హుస్సేన్ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతూనే ఉంది. జాకీర్ హుస్సేన్ జీవించి ఉన్నంత కాలం తమ మధ్య గొడవలు తప్పవని, అతనిని అడ్డు తొలగించుకొని సంతోషంగా ఉందామని భార్యకు నచ్చ చెప్పాడు. దీనికి అంగీకరించిన మనీషా తన భర్త చెప్పిన ప్రకారం జాకీర్ హుస్సేన్ను ఈ నెల ఒకటో తేదీన ఫోన్ చేసి పిలిపించింది. జాకీర్ హుస్సేన్ వచ్చాక దంపతులు ఇద్దరూ కలసి తీవ్రంగా కొట్టి, తాడుతో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని వాహనం ద్వారా తీసుకువెళ్లి వేలూరు– జాలాది రోడ్డులో పడవేశారు. రెండో తేదీన మృతదేహాన్ని గుర్తించిన జాకీర్హుస్సేన్ భార్య షేక్ షఫియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఇరువురు సెల్ఫోన్లతోపాటు మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన వాహనం, మృతుడి స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. సీఐ బి సుబ్బానాయుడు, రూరల్ ఎస్ఐ జి అనిల్కుమార్ను డీఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్ఐ లేఖా ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడిగా నాగరాజు
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) గా డాక్టర్ కోనేటి నాగరాజును నియమిస్తూ గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డాక్టర్ నాగరాజు వైఎస్సార్ కడప జిల్లా డీఎంహెచ్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు పదోన్నతి కల్పించి గుంటూరు ఆర్డీగా బదిలీ చేశారు. డాక్టర్ నాగరాజు తిరుపతిలో 1983లో ఎంబీబీఎస్ అభ్యసించారు. కడప జిల్లా కదిరిలో 1993లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీసులోకి ప్రవేశించారు. డెప్యూటీ సివిల్ సర్జన్గా 2010లో, సివిల్ సర్జన్గా 2021లో పదోన్నతి పొందారు. రాజంపేట డెప్యూటీ డీఎంహెచ్ఓగా, వైఎస్సార్ కడప జిల్లా జిల్లా ఆసుపత్రిలో 13 సంవత్సరాల పాటు, వైఎస్సార్ కడప రిమ్స్లో ఐదు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఫుల్ అడిషనల్ చార్జి ఆర్డీగా డాక్టర్ జి.శోభారాణి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె జులై 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. డీఈఓ షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వ తీరుపై మార్కెట్లోకి రాని పాఠ్య పుస్తకాలు శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా స్పందించారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాల కొరత ఉన్న వాస్తవేమనని, త్వరలోనే అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం 30.4 మి.మీ. కొరిటెపాడు (గుంటూరు): గుంటూరు జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు అత్యధికంగా మంగళగిరి మండలంలో 81.8 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా మేడికొండూరు మండలంలో 6.4 మి.మీ వర్షం కురిసింది. సగటున 30.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. తాడేపల్లి మండలంలో 77.6 మి.మీ., దుగ్గిరాల 70.8, తెనాలి 67.8, కొల్లిపర 47.4, చేబ్రోలు 45, తుళ్లూరు 28.8, పెదకాకాని 27.2, గుంటూరు పశ్చిమ 26.4, గుంటూరు తూర్పు 18.4, వట్టిచెరుకూరు 16.6, ఫిరంగిపురం 8.6, పొన్నూరు 8.6, తాడికొండ 8.2, ప్రత్తిపాడు మండలంలో 7.2 మి.మీ చొప్పున వర్షం కురిసింది. కొరిటెపాడు(గుంటూరు): సబ్ జూనియర్ బాలబాలికల అంతర్జాతీయ బాక్సింగ్ పోటీలకు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు బాక్సర్లు ఎంపికై నట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు, వేద సీడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తులసి ధర్మ చరణ్ తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయనగరంలో శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు సబ్ జూనియర్ బాలబాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయన్నారు. బాలికల విభాగంలో 40 కిలోల కేటగిరిలో ప్రజ్ణ దియా జోష్లిన్ ఎంపికై ందన్నారు. బాలుర విభాగంలో 70 కిలోల కేటగిరిలో శ్రీ కార్తికేయ, 55 కిలోల విభాగంలో జ్ఞాన సాయి, 35 కిలోల విభాగంలో చంద్రహౌస్ ఎంపికై నట్లు వివరించారు. ఈ క్రీడాకారులతో పాటు బాక్సింగ్ కోచ్ ఇమ్మానియేల్ రాజు కూడా పోటీలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న గుంటూరు జిల్లా బాక్సర్లు విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ కోలా చిరంజీవి మాట్లాడుతూ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు అసోసియేషన్ తరపున ఆర్తిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రిమాండ్
బాపట్ల: బైండోవర్ బాండ్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 30 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. స్టూవర్టుపురం గ్రామానికి చెందిన అంగడి చంద్రబాబుపై 11 కేసులు ఉన్నాయి. 30 రోజులు రిమాండ్, రూ. రెండు లక్షలు జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ... బైండోవర్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి జిల్లా బహిష్కరణ విధించడానికి కూడా వెనుకడబోమని హెచ్చరించారు. టోల్ ఫ్రీ నెంబర్ 112కు కాల్ చేసి అందరూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ఆక్వా రంగంపై సర్కారు కక్ష
చంద్రబాబు ప్రభుత్వం తీరుపై రైతుల ఆగ్రహం సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఫీడ్, కెమికల్, మెటీరియల్ (రొయ్యలు) ధరలు తరచూ పెంచి రైతులకు ఇబ్బంది కలిగిస్తున్న కంపెనీలకు ముకుతాడు వేసేందుకు 2020లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘అప్సడా’ను తీసుకొచ్చింది. అప్పటి వరకూ ఫీడ్, కెమికల్తోపాటు రొయ్యల కొనుగోళ్లలో ఏపీ ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. దీంతో కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరించాయి. దేశం మొత్తం రొయ్యలసాగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటా 70 శాతంగా ఉంది. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ‘అప్సడా’ సంస్థ పనిచేస్తుంది. కమిటీలో రైతు నాయకులు ఉంటారు. అందరితో చర్చించి కమిటీ రొయ్య రైతుల ప్రయోజనాల కోసమే పనిచేసేలా చట్టం రూపొందించారు. ఫీడ్, మెటీరియల్, కెమికల్ కంపెనీలతోపాటు రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలు, యాచరీస్లను అప్సడా పరిధిలోకి తెచ్చారు. కంపెనీలు అడ్డగోలుగా ధరలు పెంచడానికి వీల్లేకుండా చర్యలు చేపట్టారు. యాచరీస్ నకిలీ సీడ్ విక్రయించకూడదు. ప్రాసెసింగ్ కంపెనీలు రైతులకు తక్కువ ధరలు ఇచ్చినా అప్సడా జోక్యం చేసుకుంటుంది. 2022లో థాయిలాండ్కు చెందిన సీపీ కంపెనీ ఫీడు ధరలను రూ. 5 పెంచితే స్పందించిన అప్సడా.. చైర్మన్ను పిలిపించి పెంచిన ధరను వెనక్కి తీసుకునేలా చేశారు. అదే సంవత్సరం డిసెంబర్లో.. పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరులలో ఎగుమతి దారులు రొయ్యలు కొనకపోవడంతో అప్సడా జోక్యం చేసుకుని కొనిపించింది. ప్రకాశం, నెల్లూరు, భీమవరం ప్రాంతాల్లో రొయ్యల సీడు దెబ్బతినగా యాచరీస్ల మెడలు వంచి తిరిగి రైతులకు సీడ్ ఇప్పించింది. చేతులెత్తేసిన పాలకులు చంద్రబాబు పాలనలో ఫీడు కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచుకున్నా, రైతులకు ఇచ్చే రొయ్యల ధరలు తగ్గించినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఫిబ్రవరి నెలలో కిలోకు రూ.4 చొప్పున ఫీడ్ ధరలను పెంచిన కంపెనీలు మే నెల 11న వెనామీ ఫీడ్కు రూ.8, టైగర్ ఫీడ్కు రూ.10 చొప్పున పెంచాయి. ఈ విషయం అటు ప్రభుత్వం, అప్సడాతోపాటు రైతులకు చెప్పలేదు. మంత్రిని ముందుపెట్టి కథ నడిపిస్తూ.. మంత్రి అచ్చెన్నాయుడిని ముందు పెట్టి ప్రభుత్వం ఫీడ్ కంపెనీల ప్రయోజనాల కోసం తంటాలు పడుతున్నట్లు విమర్శలున్నాయి. మూడు రోజుల క్రితం మంత్రి నిర్వహించిన సమావేశం భీమవరం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఫీడ్ ధరలు పెంచుకోనివ్వకపోతే..ప్లాంట్లు మూసివేస్తామని కంపెనీలు బెదిరిస్తున్నాయని కొందరు రైతు ప్రతినిధులను మంత్రి హెచ్చరించినట్లు ప్రచారం ఉంది. దీనిపై రైతు ప్రతినిధులు మండిపడుతున్నారు. అమలాపురం ప్రాంతానికి చెందిన రైస్ మిల్లర్స్ అసోషియేషన్ నాయకుడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన టీడీపీ, జనసేన నేతలను ఏపీ అప్సడా ప్రతినిధులుగా ఎంపిక చేశారని, వారికి రొయ్యల చెరువులతో సంబంధం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రొయ్య రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ (ఏపీ సడా)ను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. ఈ చట్టాన్ని పక్కన పెట్టి రొయ్య రైతుల ప్రయోజనాలకు గండి కొడుతోంది. చట్టాన్ని ఖాతరు చేయకుండా ఫీడ్ కంపెనీలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. సర్కారు రొయ్య రైతుల ప్రయోజనాల కోసం కాకుండా ఫీడ్ కంపెనీల లబ్ధి కోసం పని చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఓటర్ల జాబితా తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
బాపట్ల: ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా, ఎరువుల విక్రయాలపై అన్ని నియోజకవర్గాలు, మండల స్థాయి అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో 2002 ఓటర్ల జాబితాకు 2019 ఓటర్ల జాబితాను సరిపోల్చి చూడాలని ఆదేశించారు. బుధవారం 8,316 ఓట్లను పరిశీలించి విచారించినట్లు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 151 మంది బీఎల్వోలు పనితీరులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఏమిటని నిలదీశారు. నిర్లిప్తంగా వ్యవహరించరాదని హెచ్చరించారు. ఇప్పటివరకు ఓటర్ల నుంచి 453 ఫోన్ కాల్స్ రాగా 418 పరిష్కరించామన్నారు. బీఎల్ఓలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జనగణన నమోదు ప్రక్రియలో సవరణలకు ఈనెల 15వ తేదీ వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్ చెప్పారు. జనగణన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులంతా పరిశీలించి తప్పులు, పొరపాట్లు లేకుండా జనగణ నమోదు చేయాలన్నారు. పారదర్శకంగా ఎరువుల విక్రయాలు ఎరువుల విక్రయాలు ఎంతో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. జిల్లాలో 14,896 టన్నుల ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లావ్యాప్తంగా 1,62,366 మంది రైతులు ఉన్నారన్నారు. ఎరువుల విక్రయాలు పక్కదారి పట్టకుండా, సమర్థంగా నిర్వహించడానికి రైతుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఇప్పటివరకు 91,115 మంది పేర్లు నమోదు చేసినట్లు వివరించారు. ఆన్లైన్లో ఉన్న నిల్వలు ఫిజికల్గా ఉన్న నిల్వలు సమానంగా ఉండాలని, అలా లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో డీఆర్వో జి.గంగాధర్గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి ఎ.లక్ష్మి, ఆర్డీవోలు, మండలాల నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలు, నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులు, బీఎల్ఓలు, తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు చిక్కిన రిమాండ్ ఖైదీ
నగరంపాలెం: గుంటూరు జీజీహెచ్ నుంచి పరారైన రిమాండ్ ఖైదీ దాదాపు 70 రోజుల తర్వాత తమిళనాడు పోలీసులకు చిక్కాడు. వివరాలు.. ఏలూరు జిల్లా పెద్దయోగి మండలం కొప్పలవారిగూడెం గ్రామం నాగన్నగూడెంకు చెందిన భీముడు అజిత్కుమార్ (29) ఓ కేసులో ఒంగోలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2024లో గుంటూరు జిల్లా తెనాలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో వారెంట్ ముద్దాయి అయిన అతన్ని తెనాలి ఒకటో పట్టణ పోలీసులు ఈ ఏడాది మార్చి 24న ఒంగోలు జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చారు. రిమాండ్ నిమిత్తం రేపల్లె సబ్ జైలుకి తరలించారు. పరారయ్యేందుకు జైల్లోనే పథకం రూపొందించాడు. మార్చి 25న ఆస్తమా ఉందని, గతంలో ఎడమ కాలికి శస్త్రచికిత్స చేయగా నొప్పిగా ఉందని సబ్ జైలు అధికారి దృష్టికి తీసుకెళ్లడంతో ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరు జీజీహెచ్కి తరలించారు. చికిత్స పొందే క్రమంలో 28న అజిత్కుమార్ మూత్రవిసర్జనకి వెళ్తున్నానని పరారైన విషయం విదితమే. రేపల్లె సబ్ జైలు అధికారికి ఆన్లైన్లో నగదు చెల్లించారనేది విచారణలో బహిర్గతమైంది. మొబైల్ ఫోన్ వాడకపోవడం, ఎప్పటికప్పుడు ప్రదేశాలు మారుస్తూ జాగ్రత్త పడటంతో నెలలు గడిచాయి. తమిళనాడులోని తిరుపూర్లో క్రైం విభాగం పోలీసులు సుమారు వారం క్రితం ఓ కేసులో అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అతను రిమాండ్ ఖైదీగా ఉన్నట్లు సమాచారం. అతన్ని గుంటూరు తీసుకొచ్చేందుకు పోలీస్ బృందం వెళ్లినట్లు తెలిసింది. పరారీ ఘటపై ఇప్పటి వరకు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు. మరికొందరిపై ఇప్పటికి విచారణ చేస్తున్నారు. -
అటవీ శాఖ విజిలెన్స్ అధికారుల తనిఖీలు
బొల్లాపల్లి: అటవీ శాఖ విజిలెన్స్ విభాగం అధికారులు బుధవారం వినుకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తనిఖీ నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి చెందిన టీ శ్రీసాయి, ఎఫ్ఆర్ఓ శంకరయ్యలు తొలుత వినుకొండ పట్టణ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన నగర వనాన్ని సందర్శించారు. ఈపూరు మండలం భద్రుపాలెం సమీపంలో ఆ శాఖ పరిధిలో నిర్వహిస్తున్న నర్సరీని సందర్శించారు. బొల్లాపల్లి మండలం జయంతి రామాపురం, మర్రిపాలెం గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ పరిశీలించారు. రేమిడిచర్ల బీట్ పరిధిలో ఇటీవల వన్యప్రాణుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన 5 సాసర్ ఫిట్స్ను తనిఖీ చేసి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం అదే బీట్ పరిధిలో పలకల క్వారీని తనిఖీ చేశారు. విజిలెన్స్ విభాగం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారని రేంజర్ సి.మాధవరావు తెలిపారు. అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో ఆయుష్ సేవలను బలోపేతం చేస్తామని, భవిష్యత్తులో యోగ, సిద్ధ వైద్య విధానాలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డాక్టర్ అహంతం శాంతాసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో బుధవారం ఆయుష్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. డాక్టర్ అహంతం శాంతాసింగ్ మాట్లాడుతూ త్వరలోనే ఆయుష్ విభాగంలో మరో ఇద్దరు వైద్యాధికారులు చేరనున్నట్లు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఆయుష్ విభాగంతోపాటు ఎయిమ్స్లో 44 క్రియాశీలక విభాగాలు ఉన్నాయని వెల్లడించారు. క్రీడాకారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలకు స్పోర్ట్స్ మెడిసిన్ విభాగాన్ని మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వృద్ధుల ఆరోగ్య సంరక్షణకు జెరియాట్రిక్ మెడిసిన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు పుష్పాంజలి, దేసు రామమోహన్, రాజశేఖర్ మోహన్, కల్నల్ శశికాంత్, సన్యాల్, ఆర్థిక సలహాదారులు డి.గోవిందరావు, అధికారులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): హైదరాబాద్ కొంపల్లిలో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న సౌత్ జోన్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీలకు గుంటూరు నుంచి 14 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సౌత్ జోన్లో పాల్గొనే క్రీడాకారులకు ఆపిల్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్యలు క్రీడాకారులకు టీ–షర్ట్స్ అందజేశారు. సౌత్ జోన్ పోటీలలో కూడా మెడల్స్ సాధించి జిల్లా కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుముడింప చేయాలని కోరారు. సౌత్ జోన్ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వివరాలు పి.ఆనంద్కుమార్, కె.అరుణ్కుమార్, డి.అభిరామ్, నల్లబోతు త్రిలోక్య (సంజు), నిహాల్, ఆకాష్, చరణ్, జీవీఎస్ ప్రసాద్, టీ నేహా, టి.నిహిత, ఏ.ఆరాధ్య, ఎన్. హవిష్మ్, పి.అమృత, కే.కళ్యాణ్. రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): ముస్తాబాద్–గన్నవరం సెక్షన్లలో పనుల కారణంగా పలు రైళ్లను దారి మళ్ల్లించినట్లు రైల్వే విజయవాడ పీఆర్ఓ నుస్రత్ మండ్రుప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యర్నాకులం –పాట్నా (22643) ఈ నెల 15, 16, 22, 23, 29, 30, జూలై 6, 7 తేదీల్లో వయా విజయవాడ, గుడివాడ, నిడదవోలు మీదుగా నడపనున్నారు. ఎస్ఎంవీటీ బెంగళూరు – గౌహతి (12509) 10, 17, 24, జూలై ఒకటో తేదీ, భవ్నగర్ టెర్నినస్ – కాకినాడ పోర్టు (12756) రైలు 13, 20, 27, జూలై 4 తేదీల్లో దారి మళ్లించారు. -
మట్టి మాయం
బాపట్లగురువారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2026తమ్ముళ్ల దోపిడీకి అక్రమార్జనకే మట్టి తవ్వకాలు అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,7952 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. తెనాలి రూరల్: మండలంలోని సంగం జాగర్లమూడి పీహెచ్సీని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గవర్నమెంట్ జనరల్ హాస్పటల్లో 106 మంది కాంట్రాక్టు స్టాఫ్నర్సులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు బుధవారం అందజేశారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) 150 కాంట్రాక్టు స్టాఫ్నర్సు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించగా, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 7వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఆర్డీ కార్యాలయం అధికారులు దరఖాస్తులు పరిశీలించి సీనియార్టీ, ప్రతిభ ఆధారంగా 150 మంది అభ్యర్థులను ఎంపిక చేసి గురువారం కౌన్సెలింగ్కు పిలిచారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, గతంలో పనిచేసిన నియామకపు ఉత్తర్వుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు పరిశీలించి 106 మందికి ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు అందజేశారు. కౌన్సెలింగ్కు పిలిచిన వారిలో 26 మంది గైర్హాజరు కాగా, ఆరుగురు డిజేబుల్డ్ కోటాలో దరఖాస్తు చేయడంతో వారి సర్టిఫికెట్ల పునః పరిశీలన కోసం సంబంధిత ఆసుపత్రులకు పంపించారు. స్పోర్ట్స్ కోటాలో ఐదు పోస్టులకు ఎవరూ అభ్యర్థులు హాజరు కాలేదు. నూతనంగా నియామకపు ఉత్తర్వులు అందుకున్న కాంట్రాక్టు స్టాఫ్నర్సులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి, నూతనంగా ప్రారంభమవుతున్న పిడుగురాళ్ల జీజీహెచ్కు మంచి పేరు తీసుకు రావాలని రోగుల మన్ననలు పొందాలని ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి సూచించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో డెప్యూటీ డైరెక్టర్ బండి పాల్సుధాకర్, సూపరింటెండెంట్లు విజయకుమార్, సత్యం, సీనియర్ అసిస్టెంట్లు శ్రీకాంత్, సురేష్, శ్యామ్అనిల్, గ్రాబియేల్, తదితరులు పాల్గొన్నారు. కర్లపాలెం: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు జేబులు నింపుకొనేందుకు మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. కర్లపాలెం మండల పరిధిలోని సమ్మెటవారిపాలెం తాగునీటి చెరువుపై కన్నేసిన కొందరు నాయకులు మట్టి తవ్వి విక్రయించుకునేందుకు పథకం రచించారు. ఈ నేపథ్యంలో అధికారులపై ఒత్తిడి తెచ్చి తాగునీటి చెరువుకు మరమ్మతులు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. ప్రభుత్వ అనుమతులు రాకముందే చెరువులోని మట్టిని తవ్వి విక్రయించేందుకు పూనుకోవటంతో గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరెడ్డి, గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి మట్టి తవ్వకాలను అడ్డుకున్నారు. మూడు వేల మందికి తాగునీటి వనరు సమ్మెటవారిపాలెం గ్రామంలో సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణం పరిధిలో తాగునీటి చెరువు ఉంది. ఈ చెరువు పరిధిలో సమ్మెటవారిపాలెం, శీలంవారిపాలెం, పేరలి కొత్తపాలెం గ్రామాలలోని సుమారు 3 వేల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. గత 15 ఏళ్లుగా ముగ్గురు సర్పంచ్లు తాగునీటి చెరువును కాలువ నీటితో నింపి గ్రామప్రజలకు నీరందిస్తున్నారు. తాగునీటి చెరువులోని మట్టిని తవ్వి విక్రయించుకుని జేబులు నింపుకొనేందుకు టీడీపీ నాయకులు అధికారులపై మరమ్మతులకు అనుమతులివ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉపాధి హామీ కూలీలతో మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. యంత్రాలతో తవ్వకాలు చెరువులో మట్టి తవ్వి విక్రయించుకునేందుకు కర్లపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు ఎస్కే బాజీ జేసీబీతో పనులు చేపట్టారు. సుమారు పది టిప్పర్ల వరకు మట్టి తరలించినట్లు సమ్మెటవారిపాలెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరమ్మతుల కోసం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఈ పనులు చేపట్టటంతో మాజీ సర్పంచ్ సమ్మెట వెంకటేశ్వరరెడ్డి ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెరువు వద్దకు వచ్చి మట్టి తవ్వకాలను నిలిపివేశారు. అనుమతులు లేవు తాగునీటి చెరువుకు యంత్రాలతో మరమ్మతులు చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఎం.అనంతరాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈఈ సమ్మెటవారిపాలెం చెరువును పరిశీలించారు. యంత్రాలతో తవ్వేందుకు అనుమతి ఎవరు ఇచ్చారని అక్కడే ఉన్న టీడీపీ మండల అధ్యక్షుడు ఎస్కే బాజీని ఆయన ప్రశ్నించారు. తక్షణం తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఏఈ మంజూర్ బాషా మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలతో చెరువులో జమ్ము తొలగించి కట్టలపై ఉన్న పిచ్చి మొక్కలను తీసివేసి పటిష్ట పరిచేందుకు ప్రతిపాదనలు రూపొందించామని చెప్పారు. ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని ఆయన తెలిపారు. అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఈ పేర్కొన్నారు. టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి అనంతరాజు 7 -
చేనేతల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మంగళగిరి టౌన్: చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చేనేత సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ ఆరోపించింది. మంగళగిరి పట్టణం మార్కండేయ కళ్యాణ మండపంలో బుధవారం కమిటీ సమావేశం నిర్వహించారు. పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ చేనేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. గత ఫిబ్రవరి 22న చేనేత కార్మికులతో మంగళగిరిలో నిర్వహించిన చేనేత గర్జన, ప్రదర్శన, బహిరంగ సభ అనంతరం కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 22న 48 గంటల నిరాహార దీక్ష చేపట్టినా పాలకుల వైఖరిలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మగ్గాలు ఉన్న చేనేత కార్మికులకే ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ, మగ్గాలు లేని షెడ్ల కార్మికులు, అనుబంధ వృత్తులపై ఆధారపడిన వారిని విస్మరించిందని ఆరోపించారు. నేతన్న భరోసా పథకం కింద ఏడాదికి అందించాల్సిన 25 వేల ఆర్థిక సహాయాన్ని విడుదల చేయకపోవడం వలన చేనేత కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సహకార చేనేత సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద భారీ ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. చేనేత రంగ పరిరక్షణ కోసం చేపట్టనున్న ఉద్యమాలకు ప్రజలు మద్దతునివ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మంగళగిరి హ్యాండ్లూమ్ కమిషనర్ కార్యాలయం వద్ద జూన్ 22వ తేదీన ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్ పిల్లలమర్రి నాగేశ్వరరావు, సభ్యులు రామనాథం పూర్ణచంద్రరావు, పి.బాలకృష్ణ, రామారావు, కోటేశ్వరరావు, రవి పాల్గొన్నారు. -
పొగాకు బాధితులకు చేదు వార్త
గుంటూరు మెడికల్: యవ్వనంలో సరదా కోసం స్మోకింగ్కు అలవాటు పడినవారు ఆ అలవాటు మానాలనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి వారికి గుంటూరు జీజీహెచ్ మానసిక వ్యాధుల విభాగంలో డీ అడిక్షిన్ సెంటర్, పొగాకు మాన్పించే కేంద్రం ఉన్నాయి. వీటిలో చికిత్స కోసం ప్రతి రోగి పది నుంచి 15 మంది పొగతాగే అలవాటు ఉన్నవారు, ఖైనీ, గుట్కా, పాన్పరాగ్లాంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులు నమిలే అలవాటు ఉన్నవారు సైతం జీజీహెచ్కు వస్తున్నారు. వీరికి ఆ అలవాటును మాన్పించేందుకు శరీర భాగంలో ఛాతీకి లేదా భుజానికి లేదా తొడకు వెంట్రుకలు లేని ప్రాంతంలో నికోటిన్ ట్రాన్స్థర్మల్ ప్యాచ్ను అంటించి కౌన్సెలింగ్ చేస్తారు. ఇలా ప్రతినెలా బాధితులు పొగాకు ఉత్పత్తులు విడనాడుతున్నారు. మందులు మింగే పనిలేకుండా కేవలం ఒక స్టిక్కర్ మాదిరిగా నికోటిన్ ప్యాచ్ను అంటించుకోవడం ద్వారా పొగాకు వినియోగాన్ని సునాయాసనంగా విడిచి పెట్టడంతో రోజూ జీజీహెచ్కు బాధితులు క్యూ కడుతున్నారు. కానీ ప్యాచ్లు ఆరు నెలలుగా జీజీహెచ్లో స్టాక్ లేవు. వాస్తవానికి ఈ ప్యాచ్లను ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల పాటు వినియోగించాల్సి ఉంటుంది. బహిరంగ మార్కెట్లో వీటి ఖరీదు నెలకు రూ.3 వేలకుపైగా ఉంటుంది. పలువురు బాధితులు వాటిని కొనుగోలు చేసే స్థోమత లేక కౌన్సిలింగ్ చేయించుకున్నప్పటికీ ప్యాచ్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువగా రోజువారి కూలీలు, దిగువ మధ్యతరగతి వారు బాధితులుగా ఉన్నారు. ఆరు నెలలుగా స్టాకు లేక బయట కొనుగోలు చేసే స్థోమత లేక పొగరాయుళ్లు సతమతం అవుతున్నారు. గుంటూరు జీజీహెచ్కు కేవలం గుంటూరు జిల్లాకు చెందిన వారే కాకుండా పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లాలకు చెందిన వారు సైతం నికోటిన్ ప్యాచ్ల కోసం పొగ అలవాటును మానాలనే ఉద్దేశంతో వచ్చి ఇబ్బంది పడుతున్నారు. జీతాలకు కూడా దిక్కులేదు... డీ అడిక్షన్ సెంటర్, పొగాకు మాన్పించే కేంద్రంలో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు కూడా విడుదల కాలేదు. ఇరువురు కౌన్సిలర్లు, ఇరువురు నర్సింగ్ సిబ్బంది, ఇరువురు నాలుగో తరగతి ఉద్యోగులు, మెడికల్ ఆఫీసర్ ఈ కేంద్రంలో విధులు నిర్వహిస్తూ పొగరాయుళ్లుకు చెడు అలవాట్లు మాన్పించటంలో సహాయపడుతున్నారు. ఒక పక్క నికోటిన్ ప్యాచ్లు లేక, మరోపక్క పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు విడుదల కాక డీ అడిక్షన్ సెంటర్ పనితీరు దిగజారుతోంది. సంబంధిత అధికారులు ఇప్పటికై నా స్పందించి పొగాకు వినియోగంలాంటి చెడు అలవాట్లు విడనాడాలనుకునే వారికి నికోటిన్ ప్యాచ్లు అందుబాటులో ఉండేలా చూడాలని, కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి వేతనాలు విడుదల అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి
గుంటూరు ఎస్పీ వకుల్జిందాల్ నగరంపాలెం: జిల్లాలోని పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని హాలులో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన నేరాలు, దర్యాప్తు, పురోగతి, కేసు ఛేదించిన శాతం, నేరస్తుల అరెస్టులపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ చట్టప్రకారం బాధితుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కొందరు పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా గ్రామాలు, వార్డుల వారీగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బైండోవర్ కేసులు నమోదు చేయాల్నారు. అంతేకాక వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ జి.వి.రమణమూర్తి, ఏటీవీ రవికుమార్, డీఎస్పీలు అళహరిశ్రీనివాస్, సంతూరయ్య పాల్గొన్నారు. డీలర్ల సమావేశంలో జేడీఏ పద్మావతి కొరిటెపాడు: ఏపీ ఏఐఎంఎస్ ద్వారా ఎరువుల విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్స్ కళ్యాణమండపంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రిటైల్ డీలర్లు ఇకపై ఏపీఏఐఎంఎస్ 2.ఓ పోర్టల్ ద్వారా మాత్రమే యూరియా, డీఏపీ ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ ఆత్మ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సమతుల్య ఎరువుల వాడకం ఆవశ్యకతను వివరించారు. రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమికి, పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను డీలర్లకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎన్. మోహనరావు, వి.రమాకోటేశ్వరి, ఆర్.విజయబాబు, పి.సంధ్యారాణి పాల్గొన్నారు. పుల్లలచెరువు మండలం శతకోడులో ఘటన పుల్లలచెరువు: భూముల క్రయవిక్రయాలు సాగించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవికుమార్(42) అనే వ్యక్తి పొలాలు విక్రయిస్తూ, కొలుగోలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా శతకోడు గ్రామానికి చెందిన వరికూటి పోలిరెడ్డితో కలిసి చుట్టపక్కల ప్రాంతాల్లో తిరిగాడు. బుధవారం సాయంత్రం గ్రామ శివారు ప్రాంతంలో శివాలయం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని రవికుమార్గా గుర్తించారు. గ్రామంలో ఇటీవల కాలంలో పోలిరెడ్డితో కలిసి రవికుమార్ తిరగడం చూశామని గ్రామస్తులు కొందరు చెప్పారు. హత్యకు పురిగొల్పిన కారణాలు తెలియాల్సి ఉంది. -
మంత్రి లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ మిగిలిపోయిన అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి తాడేపల్లి రూరల్: మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ భైరవకోన సభ్యులు డిమాండ్ చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని ప్రెస్క్లబ్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కడుగు శ్రీనివాసరావు, చింతా శ్రీనివాసరావు, పొన్నగంటి లక్ష్మి, వి.ఎం.సుహాసిని మాట్లాడుతూ తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని, ఇప్పటికే వయోభారంతో కొంతమంది అభ్యర్థులు చనిపోయారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయ్యిందని, ఇప్పటి వరకు నారా లోకేష్ ఎన్నికల హామీని నెరవేర్చలేదని విమర్శించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 4,072 మందికి ఉద్యోగాలు ఇచ్చారని, ప్రస్తుతం అందులో పనిచేస్తున్న ఎంటీఎస్ టీచర్లు 1500 మంది రిటైర్ అయ్యారని, ఈ పోస్టులను గత డీఎస్సీలో కలపలేదని, వారి స్థానంలో మిగిలిన వారికి ఇస్తే మిగిలిపోయిన 1,369 మందికి ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బిల్లా చంద్రయ్య, డి.ఆదినారాయణ, డి.నాగేశ్వరరావు, టి.ఏసుబాబు, సీహెచ్ఎల్వీ తులసి, ఆర్.రామారావు పాల్గొన్నారు. -
పాత నేరస్తుల కదలికలపై నిఘా
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్ల: మహిళలు, చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగా మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, నేరాలకు పాల్పడిన 301 మందిపై షీట్లను తెరిచినట్లు తెలిపారు. గతంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై, పాత నేరస్తులపై, చెడు నడత కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచామన్నారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారు ఎటువంటి వ్యక్తులను కలుస్తున్నారు. ఏదైనా నేరానికి పాల్పడే అవకాశం ఉందా అనే కోణంలో ఎప్పటికప్పుడు నిఘా ఉంచి పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు ‘ఆపరేషన్ దండాయన‘ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ప్రధాన ఉద్దేశం మహిళలకు భద్రత కల్పించడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలకు పాల్పడినా, వారికి న్యాయస్థానాలలో కఠినమైన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మహిళా సంబంధిత కేసులను వేగవంతంగా దర్యాప్తు నిర్వహించి 60 రోజులలోపే ఛార్జిషీట్ దాఖలు చేయడంతో పాటు, కేసు తీవ్రతను బట్టి ఫాస్ట్ట్రాక్ కోర్టుల ద్వారా వేగవంతంగా విచారణ జరిపించి నేరస్తులకు కఠినమైన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ‘ఆపరేషన్ దండాయన‘ కార్యక్రమంలో భాగంగా గత వారంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 26 మందిపై సస్పెక్ట్ షీట్లు తెరిచినట్లు తెలిపారు. జిల్లాలో ఎవరైనా మహిళల పట్ల, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించబోమని హెచ్చరించారు. మహిళలకు అండగా జిల్లాలో ఐదు శక్తి టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శక్తి టీమ్ లో ఒక్కొక్క టీంకు ఎస్సై స్థాయి అధికారిని ఇన్చార్జీగా నియమించామన్నారు. వీరు కాలేజీలు, పాఠశాలలు బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఆకతాయిల వేధింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటూ, మహిళ భద్రత, దానికి సంబంధించిన చట్టాల గురించి మహిళల భద్రతకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, శక్తి యాప్ వినియోగం గురించి మహిళలు, విద్యార్థినులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారన్నారు. అంతేకాకుండా నిర్మానుష్యమైన ప్రదేశాలలో, నేరాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, తక్షణ పోలీస్ సహాయం కావాలన్నా వెంటనే శక్తి యాప్ వినియోగించుకోవాలని లేదా టోల్ ఫ్రీ నెంబర్ 112 కు కాల్ చేసి తక్షణం పోలీస్ సహాయం పొందాలన్నారు. మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు జిల్లాలోని శక్తి బృందాలు, స్థానిక పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు. -
మార్కెట్లోకి రాని పాఠ్యపుస్తకాలు
ఎస్సీఈఆర్టీ నిర్లక్ష్యం వల్లే... గుంటూరు ఎడ్యుకేషన్: ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన విక్రయ పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడంలో టీడీపీ సర్కారు విఫలమైంది. 2026–27 నూతన విద్యాసంవత్సరం శుక్రవారం ప్రారంభం కానుండగా, అదే రోజు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 637 ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న మూడు లక్షల మంది విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా రూపొందించిన పాఠ్య పుస్తకాలను ప్రైవేటు కేంద్రాల్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం అరకొరగా పంపిణీ చేసింది. దీంతో శుక్రవారం పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో పాఠ్య పుస్తకాలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు పుస్తకాలు ఇంకా రాలేదని దుకాణదారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠ్యాంశాల బోధన తప్పనిసరి ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వం ముద్రించిన పాఠ్య పుస్తకాలతో పూర్తిస్థాయిలో బోధన చేసేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన పాఠ్య పుస్తకాలను విధిగా కొనుగోలు చేసేలా తీసుకున్న చర్యలతో వ్యవస్థను గాడిలో పెట్టారు. వైఎస్సార్ సీపీ పాలనకు ముందు టీడీపీ హయాంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులతో యాజమాన్యాలు రూ.వేల ఖర్చుతో ప్రైవేటు పబ్లిషర్ల నుంచి పుస్తకాలను కొనుగోలు చేయిస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలండర్కు విరుద్ధంగా సొంత సిలబస్ను బోధించి, పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలతో ప్రైవేటు పాఠశాలల్లోనూ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలతో బోధన జరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సేల్ టెక్ట్స్బుక్స్కు ఇండెంట్ తీసుకుంటున్న విద్యాశాఖ ప్రభుత్వ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన పాఠ్య పుస్తకాలకు అదనంగా సేల్ టెక్ట్స్బుక్స్ను ముద్రించి, విక్రయాలు జరిపింది. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను బహిరంగ మార్కెట్లో సిద్ధం చేయడంలో ఎస్సీఈఆర్టీ విఫలమైందని ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకునేందుకు పాఠ్య పుస్తకాలను అందించలేని దుస్థితి నెలకొందని, పాఠశాలలు తెరిచిన తరువాత పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థులకు బోధన ఏ విధంగా చేయాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో పాఠశాలలవారీగా హెచ్ఎం లాగిన్ ద్వారా అవసరమైన పాఠ్య పుస్తకాలకు ఆన్లైన్లో ఇండెంట్ పెట్టి, నేరుగా ముద్రణదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం కల్పించారన్నారు. టీడీపీ పాలనలో పరిస్థితులు అధ్వానంగా మారాయని అంటున్నారు. పాఠశాలలు రీ ఓపెన్ చేసేందుకు వ్యవధి దగ్గర పడినప్పటికీ పాఠ్య పుస్తకాలు సైతం అందించలేని దుస్థితి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఇంత చెత్త ప్రభుత్వాన్ని తాము ఎన్నడూ చూడలేదని ఆరోపణలు చేస్తున్నారు. -
చిత్తశుద్ధితో పనిచేయాలి
రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు బాపట్లటౌన్: రహదారుల ప్రమాదాలు 20 శాతానికి తగ్గించేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. రహదారి భద్రత జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద సంరక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధితశాఖల అధికారులను ఆదేశించారు. గడిచిన నాలుగు నెలల్లో 116 ప్రమాదాలు జాతీయ రహదారులపై నమోదయ్యాయన్నారు. ప్రధానంగా ఎన్హెచ్ఏ 16లో మార్టూరు–రాజుపాలెం వద్ద, ఎన్హెచ్ఏ 216లో చిన్నగంజాం సాయిబాబా విగ్రహం వద్ద, ఎన్హెచ్ఏ 167ఏ చీరాల–ఓడరేవు, పర్చూరు ఏబీవారిపాలెం వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద వేగ నియంత్రణకు డ్రమ్ములు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాలు కలిసేచోట సూచిక, హెచ్చరిక బోర్డులు, ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఐమాక్స్ లైట్ల నిర్వహణ బాధ్యత స్థానిక పంచాయతీలు, జాతీయ రహదారులదేనన్నారు. రహదారుల వెంబడి విద్యుత్ దీపాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఎన్హెచ్ 167ఎ ఓడరేవు వద్ద 200 మీటర్ల వరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, కూడలి, రహదారి వంపులలో కాంకే మిర్రర్ ఏర్పాటు చేయాలన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపే వారిని అడ్డుకోడానికి 16 బ్రీత్ ఎనలైజర్స్ యంత్రాలు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయాలన్నారు. కుంకులమర్రు వద్ద జాతీయ రహదారిపైకి గేదెలు రాకుండా బ్యారికెట్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు, పెట్రోల్ బంకులు, ఇతర కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పర్యవేక్షణ బాధ్యత పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలన్నారు. తద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రమాదాల నివారణకు ఎంతగానో సహకరిస్తుందన్నారు.‘శిరో రక్ష – ప్రాణరక్ష’ కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని, ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం వల్ల ప్రజలలో చైతన్యం వస్తుందన్నారు. కమిటీలోని ప్రతి విభాగం సమర్థంగా పనిచేయడం ద్వారా ప్రస్తుతం ఎనిమిది శాతం ప్రమాదాలు తగ్గాయన్నారు. సమావేశంలో రవాణా శాఖ అధికారి పరంథామరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం వనజ, ఎన్హెచ్ఏ అధికారి ఖాదర్, బాపట్ల మున్సిపల్ కమిషనర్ ఎం.హాసిని, డీఎస్పీలు పి.జగదీష్ నాయక్, ఏ.శ్రీనివాసరావు, సీహెచ్.చంద్రమౌళి, ఎండీ.మొయిన్ పాల్గొన్నారు. పంట నమోదు చేసుకున్న రైతులకు సకాలంలో యూరియా, డీఏపీ అందజేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. 2026 – 2027 సంవత్సరానికి రైతులకు యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే యూరియా, డీఏపీ ఎరువులపై అతి పెద్ద రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూరియా, డీఏపీ వ్యవసాయేతర అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టడానికి డిజిటల్ విధానం అమలుచేయడానికి సిద్ధమైందన్నారు. రైతులు తమ ఆధార్ నంబర్లను రైతుసేవా కేంద్రం, పీఏసిఎస్లు, అధీకృత రిటైల్ డీలర్లకు అందించి ఓటీపీ చెప్పటం, వేలిముద్ర వేయటం ద్వారా యూరియా, డీఏపీలను కొనుగోలు చేయవచ్చన్నారు. రైతులు తమకు దగ్గరలో ఉన్న రైతు సేవ కేంద్రాల నుంచి ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా కల్పించడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లాకు కేటాయించిన యూరియా డిఏపి ఎరువులను జిల్లా పరిధిలోనే అమ్మకాలు జరగాలన్నారు. జిల్లా హోల్సేల్ గోడౌన్లు, గోడౌన్ సామర్ాధ్యన్ని బట్టి రైతుసేవా కేంద్రాలు, పి.ఎ.సి.ఎస్.లు, డీసీఎంఎస్ల దగ్గర బఫర్ స్టాక్ నిల్వ ఉంచడమైందన్నారు. బాపట్ల జిల్లాకి ఖరీఫ్ 2026–27 సంవత్సరంకు యూరియా 27165, డీఏపీ 13977 అవసరం కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా 13557, డీఏపీ 5145 మెట్రిక్ టన్నులు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి ఎ.లక్ష్మి, ఏడీఏ అన్నపూర్ణ వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
వేమూరు నియోజకవర్గంలో మట్టి దందా
వేమూరు: వేమూరు నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. చుండూరు మండలం ఆలపాడు గ్రామంలోని చెరువులో మట్టి తవ్వి అక్రమంగా అమ్ముకుంటున్నారు. తెరవెనుక స్థానిక ప్రజాప్రతినిధి హస్తం ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆలపాడు చెరువులో తవ్విన మట్టిని పెదపూడి, కూచిపూడి, పెరవలిపాలెం, వలివేరు, అమృతలూరు, మూల్పూరు గ్రామాలకు తరలిస్తున్నారు. మట్టి రవాణాను అడ్డుకుంటే బదిలీ వేటు పడుతుందని అధికారులు భయపడుతున్నారు. చుండూరు మండలం పెదగాదెవలర్రు గ్రామంలో కూడా ఇష్టారాజ్యంగా గుంతలు పెట్టి మట్టి తవ్వకాలు చేయడంతో తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం అడ్డుకుంది. దీంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని తవ్వకాలు నిలిపి వేశారు. అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో చెరువు తవ్వకాల్లో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య విబేధాలు రావడంతో ఒక వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఇరువర్గాలకు చెందిన నాయకులను పిలిచి పంచాయితీ చేశారు. దీంతో మోపర్రులో చెరువు మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఆలపాడులో జనసేన పార్టీకి చెందిన ఓట్లు అధికంగా ఉండటం వల్ల ఆ పార్టీ నాయకులే అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీనిపై స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ప్రతి చెరువు తవ్వకంలో ఎమ్మెల్యేకు వాటా ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు. మండల అధికారులు అక్రమ మట్టి తవ్వకాలు నిలిపి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సిరాజ్కు జాతీయ స్థాయి పురస్కారం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థలకు డిజిటల్ వ్యూహాలు రూపొందిస్తూ సోషల్ మీడియా రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సిరాజ్ సేవలను గుర్తిస్తూ ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఐకాన్ ఆఫ్ పొలిటికల్ సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్– 2026‘ పురస్కారం ప్రకటించారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ ఐకాన్ అవార్డ్స్–2026 కార్యక్రమంలో సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా సిరాజ్ పురస్కారాన్ని అందుకున్నారు. మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ టి.ఎన్. సురేష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులు ప్రదానం చేశారు. -
వ్యవసాయ పనిముట్లు దగ్ధం
ఇంకొల్లు(చినగంజాం): చెత్తకు పెట్టిన నిప్పు అంటుకుని ఓ రైతుకు సంబంధించిన వ్యవసాయ పనిముట్లు దగ్ధమై ఆస్తి నష్టం సంభవించిన సంఘటన మండలంలోని గొల్లపాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన వెనిగండ్ల చంద్రశేఖర్కు చెందిన వ్యవసాయ పనిముట్లు నూతనంగా నిర్మిస్తున్న వైద్యశాల పక్కన ఉంచాడు. అక్కడ ఉన్న చెత్తను శుభ్రం చేసిన పారిశుధ్య కార్మికుడు తగలబెట్టేందుకు నిప్పు అంటించాడు. తీవ్రమైన గాలి ధాటికి మంటలు చెలరేగి చంద్రశేఖర్కు చెందిన 200 స్ప్రింక్లర్ పైపులు, నీళ్ల ట్యాంకు, 2 ఫుట్ వాల్వ్లు కాలి బూడిదయ్యాయి. ప్రమాదం కారణంగా రూ.2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పారు. మృతదేహంతో ఇంటి ముందు నిరసన గుంటూరు రూరల్: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్ మెంట్లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు. ఇరువర్గాలు అంగీకరించడంతో వివాదం సర్దుమణిగింది. జాతీయస్థాయి పోటీలకు పలువురు ఎంపిక గుంటూరు వెస్ట్ (క్రీడలు): ప్రాచీన యుద్ధకళ కర్రసాము పోటీల్లో నగరానికి చెందిన కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారని చీఫ్ కోచ్ కాశీనాఽథ్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 7న స్థానిక బీఆర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి కర్ర సాము పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు బంగారు పతకాలు సాధించి మరోసారి అకాడమీ పేరు నిలబెట్టారన్నారు. ఐదుగురు సిల్వర్, ఒకరు బ్రాంజ్ మెడల్స్ సాధించారన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈనెల 21న తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో జరిగే జాతీయస్థాయి కరస్రాము పోటీలకు అర్హత సాధించారన్నారు. క్రీడాకారులను ఎస్ఐ విజయ్కుమార్, సక్సెస్ స్కూల్ డైరెక్టర్ బి.సాయి మల్లికార్జున్, అకాడమీ అధ్యక్షులు వెంకట రమణతోపాటు పలువురు అభినందించారన్నారు. విద్యుత్శాఖ విజిలెన్స్ తనిఖీలు గుంటూరు రూరల్: విద్యుత్శాఖ విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ విభాగం గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో డీ 7 గుంటూరు సెక్షన్ గోరంట్ల, జొన్నలగడ్డ, రెడ్డిపాలెం గ్రామాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డీపీఈ వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ ఇంజినీర్ ఖాన్ల నేతృత్వంలో 52 మంది అధికారులు, 156 మంది సిబ్బంది 52 బృందాలుగా ఏర్పడి 3941 సర్వీసులను తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా మీటరు ఉన్నప్పటికీ విద్యుత్ అక్రమ చౌర్యానికి పాల్పడుతున్న ఇద్దరికి రూ.50 వేలు, అనుమతించిన కేటగిరికంటే ఇతర కేటగిరిలో విద్యుత్ వినియోగిస్తున్న ఆరుగురికి రూ.50 వేలు, అనుమతించిన లోడు కంటే అధికంగా విద్యుత్ వినియోగిస్తున్న 361 మందికి రూ 20.2 లక్షలు, అసలైన వినియోగం కంటే తక్కువగా బిల్లులు ఇవ్వబడిన ఒక సర్వీసుకు రూ.5 వేలు వంతున మొత్తం రూ 21.7 లక్షల అపరాధ రుసుం విధించటం జరిగిందని తెలిపారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ చౌర్యంపై ఎవరైనా 9440812263, 94408112361 నంబర్లకు నేరుగా కానీ వాట్సప్ ద్వారా కానీ సమాచారం అందించవచ్చని అటువంటివారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కార్యక్రమంలో ఆపరేషన్స్ విభాగం డీఈఈ గురవయ్య, విజిలెన్స్ డీఈఈలు మల్లికార్జునప్రసాద్, రవికుమార్, ఆపరేషన్స్ ఏఈ వెంకటేశ్వర్లు, విజిలెన్స్ ఏఈఈలు శివశంకర్, సతీష్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గణపవరం యువకుడు మృతి
హైదరాబాద్లో ఘటన నాదెండ్ల: డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ కోసం హైదరాబాద్ వెళ్ళిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో గణపవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గణపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్ ఇన్స్పెక్టర్ పురాణం బాలాజీశర్మ, శ్రీదేవి (అంగన్వాడీ టీచర్) దంపతులకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు సాయిసుబ్రహ్మణ్యేశ్వర శర్మ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు పురాణం లక్ష్మీనాగేశ్వర సాయిమోహన్ (23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్లో సోదరుడి వద్ద ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. గ్రామానికి చెందిన యువకుడు బాలమురళీకృష్ణ వీరితో పాటూ ఉంటూ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 8న అర్ధరాత్రి సమయంలో టిఫిన్ చేసేందుకు లక్ష్మీనాగేశ్వరసాయిమోహన్, బాలమురళీకృష్ణ ఇరువురూ కూకట్పల్లి సెంటర్కు వెళ్లి తిరిగి రూమ్కు వస్తుండగా టిప్పర్ వాహనం ఢీకొంది. దీంతో సంఘటనాస్థలంలోనే లక్ష్మీనాగేశ్వరసాయిమోహన్ అక్కడికక్కడే మృతి చెందగా, బాలమురళీకృష్ణ గాయాలపాలయ్యాడు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామమైన గణపవరం తరలించారు. ఉద్యోగాన్వేషణకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దీంతో శాంతినగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
12, 14 తేదీల్లో డాక్టర్ వెంకటప్పయ్య జయంతి వేడుకలు
తెనాలి: పట్టణానికి చెందిన గ్రంథాలయ ఉద్యమ ప్రముఖుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య జయంతి వేడుకలను ఈనెల 12, 14 తేదీల్లో తెనాలి, గుంటూరులో నిర్వహించనున్నారు. ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో జరిగే వేడుకల ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో ఆవిష్కరించారు. రవీంద్రపీఠం అధ్యక్షులు అయినాల మల్లేశ్వరరావు వివరాలను తెలియజేశారు. 12వ తేదీ ఉదయం 9 గంటలకు తెనాలి బండ్పై గల డాక్టర్ వెలగా వెంకప్పయ్య కాంస్య విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం 10 గంటలకు శాఖాగ్రంథాలయంలో జయంతి సభ జరుగుతుందని తెలిపారు. అదేరోజు సాయంత్రం గుంటూరులోని బృందావన్ గార్డెన్స్లో గల అన్నమయ్య వేదికపై వెలగా–అయ్యంకి సభలో అయినాల మల్లేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, పావులూరి శ్రీనివాసరావుకు పురస్కారాలను ప్రదానం చేస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు తెనాలి ఇండస్ట్రియల్ ఏస్టేట్లోని కుమార్పంప్స్ సత్సంగ్ హాలులో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్, మానవత సంస్థ, తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్చంద్కు డాక్టర్ వెలగా పేరిట జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేస్తారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఆహ్వానపత్రిక ఆవిష్కరణలో మొవ్వా సత్యనారాయణ, ఓంకార్ ప్రసాద్, వెంపటి సత్యనారాయణ, పాపోలు వెంకట్, ఈఎల్వీ అప్పారావు, వెలగా వీరయ్య, గ్రంథాలయం ప్రతినిధులు ఎస్.లావణ్యసుధ, కె.పద్మావతి పాల్గొన్నారు. 14న డాక్టర్ కె.రామ్చంద్కు జీవనసాఫల్య పురస్కారం -
న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి
చేబ్రోలు: న్యాయవాద వృత్తిలో విజయాన్ని సాధించాలంటే కఠోర శ్రమ, నిరంతర అధ్యయనం, పరిశోధనతోపాటు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం అత్యవసరమని విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఏఐఎల్యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రొఫెషనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ లాయర్స్’ మంగళవారం కూడా కొనసాగాయి. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థ దేశంలో సమర్థంగా పనిచేస్తోందని, దానిలో భాగస్వాములైన యువ న్యాయవాదులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. న్యాయ విద్యార్థులకు ప్రధానంగా రెండు అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకటి న్యాయమూర్తులుగా ఎదగడం, మరొకటి కార్పొరేట్ రంగంలో న్యాయ నిపుణులుగా సేవలందించడం అని చెప్పారు. న్యాయమూర్తిగా ఎదగడం కష్టసాధ్యమైన మార్గమైనప్పటికీ, విజయవంతమైతే వందలాది మందికి న్యాయం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ) న్యాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు స్థాయిలో ఇప్పటికే కొద్దిమంది ప్రముఖ న్యాయవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఏఐ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వారికి మరింత ప్రయోజనం కలుగుతుందన్నారు. ఏఐఎల్యూ నాయకులు సుంకర రాజేంద్రప్రసాద్, నల్లూరి మాధవరావు, కె.కుమార్, నర్రా శ్రీనివాసరావు, విశ్రాంత జిల్లా జడ్జి జీవీ క్రిష్ణయ్య, జనవిజ్ఞాన వేదిక నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
పురుగు మందుల పరీక్షల్లో నాణ్యతకు పెద్దపీట
అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు రామ్మోహన్ కొరిటెపాడు(గుంటూరు): రైతులకు నాణ్యమైన పురుగు మందులు అందించేందుకు పరీక్ష విధానాలను మరింత పటిష్టం చేయాలని అమరావతి ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం ఉప వ్యవసాయ సంచాలకులు శనగల రామ్మోహన్ సూచించారు. గుంటూరులోని పురుగు మందుల పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, వివిధ యంత్రాలపై పరీక్ష ప్రక్రియను పరిశీలించారు. పురుగు మందుల పరీక్ష కేంద్రం ఏడీఏ సీహెచ్ తిరుమలాదేవి మాట్లాడుతూ పురుగు మందుల పరీక్షలకు అవసరమైన వివిధ రకాల మూల పదార్థాలను(టెక్నికల్స్) సరఫరా చేయాలని కోరారు. కొత్త జీఎల్సీ ఎక్విప్మెంట్ వచ్చిన వెంటనే ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. రామ్మోహన్ మాట్లాడుతూ పురుగు మందుల పరీక్ష కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యం పరీక్షించుకోవడంతోపాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో నూతన అనాలసిస్ చేసే పరికరాలు అందించడం జరుగుతోందన్నారు. ఎన్ఏబీఎల్ అక్రిడేషన్ ప్రాసెస్ను త్వరితగతిన పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రాంతీయ కోడింగ్ కార్యాలయం వ్యవసాయ అధికారి విశ్వేశ్వరప్ప, ఏఓలు బి.సురేంద్రబాబు, ఏ.శ్రీనివాసులు, ఎన్.ప్రసన్న, బి.భారతి, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
గళమెత్తిన న్యాయవాదులు
చీరాల రూరల్: చినగంజాం మండలంలోని అన్ని సివిల్, క్రిమినల్ కేసులను చీరాల కోర్టుల నుంచి పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ బార్ అసోసియేషన్, అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. చినగంజాం మండల సివిల్, క్రిమినల్ కేసులను పర్చూరు కోర్టుకు బదలాయించడాన్ని నిరసిస్తూ మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల–వాడరేవుపై ధర్నా నిర్వహించారు. న్యాయవాదులు చీరాల కోర్టుల్లోని చినగంజాం కేసులను పర్చూరు కోర్టుకు తరలించవద్దంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీనియర్ న్యాయవాదులు శ్రీకాంత్ ఠాకూర్, మిక్కిలి పుల్లయ్య, ఆకిశెట్టి పుల్లయ్య నాయుడు, పింజల ప్రసాద్, గౌరవ రమేష్బాబు మాట్లాడారు. చినగంజాం మండల కేసులను పర్చూరు కోర్టుకు మార్చినట్లయితే ఆయా మండలానికి చెందిన అనేక గ్రామాల కక్షిదారులు తీవ్రంగా ఇబ్బందులు పడతాయని చెప్పారు. చినగంజాం పరిసర గ్రామాలకు చెందిన కక్షిదారులు పర్చూరు కోర్టుకు వెళ్లాలంటే అనేక వ్యయ ప్రయాసలకోర్చి వెళ్లాలన్నారు. పర్చూరుకు నిరంతరాయంగా బస్సు సౌకర్యం కూడా లేదని, కక్షిదారులు సుమారుగా 60 కిలో మీటర్లు దూరం ప్రయాణించాల్సి ఉంటుందని తద్వారా వారికి సమయంతో పాటు డబ్బు అధికంగా ఖర్చు అవుతాయని తెలిపారు. చినగంజాం పరిసర గ్రామాల కక్షిదారులు చీరాల చేరుకోవాలంటే అనేక రవాణా సదుపాయాలున్నాయని ముఖ్యంగా రైలుబండ్లు, బస్సులు నిరంతరాయంగా ఉంటాయని దూరం కూడా 20 కిలో మీటర్లులోపే ఉంటుందని వారు తెలిపారు. ఉన్నత న్యాయ స్థానాలు న్యాయం మన ఇంటి ముంగిటకే వస్తుందని చెప్పే మాటలన్నీ నీటి మూటలని ఈ సంఘటనను బట్టి అర్థమవుతుందని వారు పేర్కొన్నారు. గతంలో కూడా ఒకసారి ఇదే విధంగా జరిగితే అప్పుడు కూడా ఉద్యమాలు చేపట్టి చీరాల కేసులు పర్చూరు కోర్టులకు వెళ్లకుండా ఆపగలిగామని చెప్పారు. పర్చూరు కోర్టులో కేసులు తక్కువగా ఉండడం కారణంగానే చినగంజాం మండల కేసులన్నింటిని చీరాల నుంచి పర్చూరు కోర్టుకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారని వారు విమర్శించారు. చీరాల కోర్టులోని చినగంజాం కేసులను పర్చూరు కోర్టుకు బదలాయింపును తక్షణమే ఉన్నత న్యాయస్థానాలు నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేసి కోర్టు విధులను కూడా బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కరవది భానుప్రకాష్, అనిశెట్టి రాంబాబు, కేఎస్ఎస్ ప్రసాద్, చెల్లా సురేష్, కాజా సుబ్రహ్మణ్యం, కొటిక ఉదయ భాస్కర్, మల్లారపు రామకృష్ణ, ఆసాది రామకృష్ణా రెడ్డి, పల్లగొర్ల సుబ్రహ్మణ్యం, గోదావరి సురేష్, బిళ్లా ఆరోగ్యరావు, దర్శి చైతన్య, ఎం.మధుబాబు, సీహెచ్.రామారావు, వెంకటేష్, మహిళా న్యాయవాదులు స్నేహ, కల్పన, రాధ, జాస్మిన్ పాల్గొన్నారు. -
కరుణ మరచి కాసుల కక్కుర్తి
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాకు పెద్దాసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ఏరియా వైద్యశాలలో ప్రైవేటు అంబులెన్స్ల దందా కొనసాగుతోంది. రోజూ వేలాది మంది రోగులు ఇక్కడికి వైద్య సేవల కోసం వస్తుంటారు. వారిలో అధిక శాతం నిరుపేదలే. చికిత్స పొందుతూ రోగి మృతి చెందితే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు గుమికూడి దందాకు తెరలేపుతున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువుల నిస్సహాయ పరిస్థితులను ఆసరా చేసుకొని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రైవేటు అంబులెన్స్లే దిక్కు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మహాప్రస్థానం వంటి వాహనాలు ఉన్నప్పటికీ పల్నాడు జిల్లాకు కేటాయించకపోవటంతో పేదలకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో ఏరియా ఆసుపత్రిని అడ్డాగా చేసుకొని అంబులెన్స్ దందా కొనసాగిస్తున్నారు. దుఃఖంలో ఉన్నా వదిలేదే లేదు.. ప్రభుత్వ వైద్యశాల నుంచి మృతదేహాలను స్వగ్రామానికి తరలించాలంటే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు రూ.వేలల్లో డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేట పట్టణంలో అయితే రూ.3,500 నుంచి రూ.4,000 వరకు తీసుకుంటున్నారు. ఇతర గ్రామాలకై తే పరిధిని బట్టి రూ.10,000 వరకు అడుగుతున్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యుల నిస్సహాయతను లక్ష్యంగా చేసుకొని స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు ఇలా డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉచిత సేవలు లేకపోవటంతో గత్యంతరం లేక అడిగిన మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని బాధిత కుటుంబసభ్యులు వాపోతున్నారు. సిబ్బంది పాత్రపై ఆరోపణలు ఈ వ్యవహారం వెనుక ఆసుపత్రి సిబ్బంది సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగి వివరాలు, పరిస్థితి, బంధువుల వివరాల సమాచారం ముందుగానే అంబులెన్స్ నిర్వాహకులకు చేరుతోందని సమాచారం. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన సేవలకు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించాల్సి ఉంది. అయితే ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు, వైద్యశాల సిబ్బంది సలహాల మేరకు నరసరావుపేటలోని పలు ప్రైవేటు వైద్యశాలలకు పేదలు వెళుతున్నారు. దీంతో వారిపై పెను ఆర్థికభారం పడుతోంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా జిల్లాస్థాయి అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు కూడా ఈ దందాకు అతీతం కావటం లేదు. ప్రమాదాలు, గుండెపోటు వంటి ఇతర అత్యవసర సమస్యలతో వైద్యశాలకు వచ్చిన వారి చుట్టూ ప్రైవేటు అంబులెన్స్ సిబ్బంది చేరుతున్నారు. ఇక్కడ సరైన వైద్యం అందదని భయపెడుతున్నారు. మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేటు వైద్యశాల్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. కొంత మంది ఇప్పటికే చేరిన రోగులను సైతం ప్రైవేటు ఆసుపత్రుల వైపు మళ్లిస్తున్నారు. రోగుల భయాలను, అవసరాలను వీరు సొమ్ము చేసుకుంటున్నారు. పేషెంట్ను ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లడానికి కొంత మొత్తం తీసుకుని, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినందుకు కమీషను దండుకోవటం వారికి నిత్యకృత్యంగా మారింది. క్షతగాత్రులను అర్హత లేని వైద్యశాలలకు తరలించి ప్రాణాలమీదకు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
వంటింట్లో గ్యాస్ మంట!
కూటమి ప్రభుత్వం ప్రజలపై రోజురోజుకూ పెనుభారం మోపుతోంది. గ్యాస్ బండను సామాన్య కుటుంబాలకు గుదిబండగా మార్చేసింది. పెట్రోల్, డీజిల్ తరహాలోనే గ్యాస్ ధర పెరుగుతూనే ఉంది. గతేడాది సిలిండర్ పై రూ. 50 పెంచిన ప్రభుత్వం మార్చి నెల 7న ఏకంగా రూ. 60 బాదింది. ప్రస్తుతం మరో రూ. 29 పెంచి సామాన్యుల నడ్డివిరుస్తోంది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి పండుగను పురస్కరించుకొని చంద్రబాబు సర్కారు అమల్లోకి తెచ్చిన ఉచిత గ్యాస్ అంతా బోగస్గా మారింది. వేలాది మంది ఎల్పీజీ వినియోగదారులు నేటికీ ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత ధర పెంపుతో జిల్లా ప్రజలపై నెలకు ఏకంగా రూ.2.28 కోట్లకుపైగానే అదనపు భారం పడుతోంది. సత్తెనపల్లి: పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ గడిచిన రెండు మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వాతలు పెడుతూనే ఉంది. ప్రజల ఇబ్బందులు ఏమాత్రం పట్టించుకోకుండా విడతలవారీగా పెంచుకుంటూ పోతోంది. దీనికి కొనసాగింపుగా ఈ వారం ఆరంభంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిన కూటమి ప్రభుత్వం తాజాగా గృహావసరాల వంట గ్యాస్ సిలిండర్ ధరనూ భారీగా పెంచింది. దీంతో సామాన్యులు, మధ్యతరగతి, పేద ప్రజలకు మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది. జిల్లాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,019.50 ఉండేది. కూటమి ప్రభుత్వం గత నెలలో సిలిండర్పై ఒకేసారి ఏకంగా రూ. 993.50 ధర పెంచింది. పెరిగిన ధరలతో జిల్లాలో ఆ గ్యాస్ ధర రూ. 3,184 కు చేరింది. ఇక ఈ నెల మొదటి వారంలో మరోసారి వాణిజ్య సిలిండర్ ధర రూ.40 వరకూ పెరిగింది. దీంతో సిలిండర్ ధర రూ. 3,236 కు చేరింది. ఈ ధరల పెంపు చూసి చిరు వ్యాపారుల నుంచి హోటల్ నిర్వాహకుల వరకు బెంబేలెత్తిపోయారు. తాజాగా సిలిండర్ మీద రూ. 40 పెంచారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో సిలిండర్పై రూ. 1,051 పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన ధర చూసి తాము వ్యాపారాలు చేయలేమని ఆహార ఉత్పత్తులు తయారు చేసేవారు వాపోతున్నారు. పెరిగిన ధరతో వాణిజ్య సిలిండర్లు ఇక పూర్తిగా బ్లాక్ కానున్నాయి. జిల్లాలో వాణిజ్య అవసరాలకు సంబంధించి 4 వేల కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. ఇదే సమయంలో హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ వంటి వ్యాపార కేంద్రాలు వేల సంఖ్యలో ఉండటం గమనార్హం. వాణిజ్య సిలిండర్ ధర అధికంగా ఉండడంతో 90 శాతం హోటళ్లలో గృహ అవసరాల సిలిండర్లు వినియోగిస్తున్నారు. గృహ అవసరాల సిలిండర్లలోని గ్యాస్ను వాణిజ్య అవసరాల సిలిండర్లోకి డంప్ చేస్తున్నారు. ఈ కనెక్షన్ లేకుండా హోటళ్లు నడుపుతున్న వారు నేరుగా గృహ అవసరాల గ్యాస్నే వాడుతున్నారు. గ్యాస్ కొరతతో, ధర పెంచడంతో చాలా హోటళ్ల వారు కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. పెను భారం... జిల్లా వ్యాప్తంగా 51 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల వంటింటి గ్యాస్ రూ. 954.50 ఉండేది. తాజాగా రూ. 29 పెంచిన ధర ఆదివారం నుంచి అమల్లోకి రావడంతో వినియోగదారులు రూ. 983.50 చెల్లించాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్ కనెక్షన్లు 6,02,997 ఉన్నాయి. దీపం కనెక్షన్లు 1,85,316 కలిపి మొత్తం 7,88,313 కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన వినియోగదారుడు నెలకు కనీసం ఒక సిలిండర్ వాడినా వాటిపై జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. 2,28,61,077 అదనంగా భారం పడుతోంది. అడ్డగోలుగా పెంపు ఎన్నికల హామీల్లో భాగంగా వంట గ్యాస్ ధరలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచబోమని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే 24 నెలల్లో మూడుసార్లు ధరలు పెంచేశారు. మొదటి 10 నెలలకు రూ. 50, ఈ ఏడాది మార్చి 7న సిలిండర్పై ఏకంగా రూ. 60, ప్రస్తుతం మరో రూ. 29 పెంచి ధరల వడ్డింపు మొదలెట్టారు. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు అర్హత కలిగిన వారికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీ పథకం ఆదిలోనే అటకెక్కింది. బడ్జెట్ తారుమారు... గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరల పెంపుతో ఆ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార ఉత్పత్తుల సంస్థలపై పడుతోంది. ఈ మూడు, నాలుగు నెలల కాలంలోనే ఆహార పదార్థాల ధరలను హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు పెంచేశాయి. తిరిగి వచ్చి ఈ భారం కూడా ప్రజల మీదే పడుతోంది. ఇలా పెరుగుతున్న చమురు ధరల కారణంగా తమ నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడంతో ఏం చేయాలని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. -
పవర్ లిఫ్టింగ్లో షబీనాకు రజతం
తెనాలి: అఖిల భారత అంతర విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ 2025–26లో తెనాలికి చెందిన పవర్ లిఫ్టర్ షేక్ షబీనా అద్భుత ప్రతిభతో రజత పతకం సాధించింది. చైన్నెలోని హిందుస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (హిట్స్) బే రేంజ్ క్యాంపస్లో ఈ నెల జూన్ 3 నుంచి 8 వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. కేఎల్ యూనివర్సిటీలో చదువుతున్న షబీనా ఈ పోటీల్లో 84 కిలోల కేటగిరీలో తలపడి స్క్వాట్ 210 కిలోలు, బెంచ్ ప్రెస్ 110 కిలోలు, డెడ్ లిఫ్ట్ 207.5 కిలోలతో మొత్తం 527.5 కిలోల బరువులను ఎత్తి రజత పతకం గెలుచుకుంది. ప్రముఖ కోచ్ ఎం.అశోక్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందిన షబీనా, క్రమశిక్షణతో కూడిన కఠిన సాధనతో పలు జాతీయ, అంతర్జాతీయ పతకాలను సాధిస్తుండటం విశేషం. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమాన్కు 3000 మామిడిపండ్లతో మంగళవారం అర్చన నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనములతో విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు 3వేల మామడి పండ్లతో అర్చన కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారన్నారు. హనుమంతుడి అనుగ్రహాన్ని పొందారని ఆయన తెలిపారు. గుంటూరు వెస్ట్: ప్రభుత్వ ఉద్యోగమంటే ఉపాధి మార్గం మాత్రమే కాదని, సామాజిక బాధ్యతగా స్వీకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో ఆరుగురు అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. కార్మిక శాఖ, పోలీస్, ఎన్సీసీ తదితర శాఖలలో వీరికి నియామక ఉత్తర్వులను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి పాల్గొన్నారు. ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పొన్నూరు: గణితం, ఆంగ్లం సబ్జెక్టులు విద్యార్థులు ఇష్టపడి చదివే విధంగా ఉపాధ్యాయులు బోధన చేయాలని గుంటూరు ప్రాంతీయ ఉప సంచాలకుడు బి.లింగేశ్వరరెడ్డి అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ హైస్కూల్లో జి.ఎఫ్.ఎల్.ఎన్. శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఒకటి, రెండు తరగతులు బాగా చదివితే పై తరగతుల్లో విద్యార్థులు రాణిస్తారన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు జీఎఫ్ఎల్ఎన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు డి. రాజు, కె.విజయ భాస్కర్, ప్రధానోపాధ్యాయురాలు వి.తులసిరాణి, డీఆర్పీలు శ్రీనివాసమూర్తి, కోటేశ్వరరావు, సద్గుణరావు, లక్ష్మీనారాయణ, పద్మజ, కళ్యాణి, రాంబాబు, దీక్ష కోఆర్డినేటర్లు బి.హనుమంత ప్రసాద్, పి.రవికుమార్ సీఆర్ఎంటీలు, పీటీఐలు తదితరులు పాల్గొన్నారు. -
జీవితంలో యోగా భాగం కావాలి
బాపట్లటౌన్: ప్రతి రోజూ యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉదయం సూర్యలంక రోడ్డులోని నగర వనంలో డీఆర్ఓ.జి.గంగాధర్గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ, నోడల్ ఆఫీసర్ చంద్రశేఖర్, డి ఎఫ్ఓ రవిశంకర్లతో కలసి యోగా గురువు చిత్ర పటానికి పూలమాలలు వేసి యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నగర వనంలో మంచి వాతావరణంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎక్కువ మంది యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళనలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగా వ్యాయామం మాత్రమే కాకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నిర్వహిస్తున్న యోగాంద్ర కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా పట్ల అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని అన్నారు. యోగా దినోత్సవం కార్యక్రమాలలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
దూరవిద్య పీజీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్ష ఫలితాలను మంగళవారం వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు, రెక్టార్ ఆచార్య ఆర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం మంగళవారం విడుదల చేశారు. దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంఏ సోషియాలజీ, సోషల్ వర్క్, ఎకనామిక్స్, మాస్టర్ ఆఫ్ కామర్స్ ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారన్నారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, సైకాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్న్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్న్స్ మొదటి, రెండవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వైబ్సెట్ నుండి పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగం డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, వై వెంకటప్పారెడ్డి, సూపరింటెండెంట్ జవ్వాజి శ్రీనివాస్, ఉద్యోగులు, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
మంగళవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 518.60 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్కి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.5,200, మోడల్ ధర రూ.4,200 వరకు పలికింది. 7 -
ఆగస్టులో ప్రత్యేక అదాలత్
గుంటూరు లీగల్: సమాధన్ సమరో–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ఆగష్టు 21, 22, 23 తేదీలలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి చైర్మన్ షేక్ సికిందర్ బాషా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్ సుప్రీంకోర్టులోనే నిర్వహిస్తారని, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో సెటిల్ చేసుకోవాలని తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో పరిశీలన కోసం, అంగీకార పత్రాలను సమర్పించడానికి గడువును 2026 జూలై 31వరకు పొడిగించారని తెలిపారు. లోక్ అదాలత్ ఫారాలు, హెచ్టీటీఎస్://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీఐ.జీవోవి.ఇన్ సుప్రీంకోర్టు వెబ్ సైట్లోను, జిల్లా కోర్టు వెబ్సైట్లోను అందుబాటులో ఉంచామన్నారు. ఫిర్యాదుదారులు, కక్షిదారులు సుప్రీంకోర్టు అంగీకారంతో వారి న్యాయవాదులతో జిల్లాలోనే హాజరు కావచ్చునని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించే సెటిల్మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 0863–2224886లలో సంప్రదించవచ్చునని తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఏపీ పీ సెట్–2026 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు 499 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 333 మంది హాజరయ్యారని ఏపీ పీ సెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. ఆరు రోజులుగా జరుగుతున్న ఏపీ పీ సెట్ పరీక్షలకు 2858 మంది పురుష అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 2147 మంది హాజరయ్యారు. అలానే 1179 మంది మహిళా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 813 మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల్లో అభ్యర్థులకు రన్నింగ్, లాంగ్జంప్, షాట్పుట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, సెటిల్ వంటి క్రీడల్లో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): విజయవాడలోని నైట్రో పికిల్ బాల్ కోర్టులో ఆదివారం జరిగిన మూడవ ఏపీ స్టేట్ పికిల్ బాల్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 17 మెడల్స్ సాధించినట్లు గుంటూరు జిల్లా పికిల్ బాల్ సంఘం కార్యదర్శి జీఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా పికిల్ బాల్ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ తోట హను, తోట ప్రగతి, అలపర్తి అలేఖ్య, కార్యదర్శి జీఎస్ ప్రసాదులు అభినందించారు. ఈనెల 13 నుంచి 15 వరకు హైదరాబాదులో జరిగే సౌత్ జోన్ పికిల్ బాల్ పోటీల్లో మెడల్ సాధించి జిల్లాకు కీర్తి ప్రతిష్టను సాధించాలని కోరారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో సోమవారం రాత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎమర్జెన్సీ వార్డులో ఏవిధంగా వైద్య సేవలు అందిస్తున్నారనే విషయంపై ఆరా తీశారు. రోగు లు, ప్రమాద బాధితులకు ఎమర్జెన్సీ వార్డులో అందిస్తున్న వైద్య సేవల గురించి కేస్ షీట్లు పరిశీలించి, రోగులు, వారి సహాయకులను అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో తనిఖీలు చేశారు. గర్భిణులు, చిన్నా రులకు వైద్యసేవలు అందుతున్న తీరును పరిశీలించారు. మార్చురీని సైతం తనిఖీ చేసి మార్చురీలో ఏసీలు ఏ విధంగా పనిచేస్తున్నాయనే విషయాలు పరిశీలించారు. తనిఖీల్లో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.సతీష్కుమార్ ఉన్నారు. -
అన్నివర్గాలకు వెన్నుపోటు
పేదలను వంచించిన ఘనుడు చంద్రబాబు బాపట్లటౌన్: అన్నివర్గాల ప్రజలను వంచనకు గురిచేసిన ఘనుడు చంద్రబాబు అని మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన రఘుపతి తెలిపారు. పట్టణంలోని సూర్యకాళి ఫంక్షన్ హాల్లో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంపై రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పుర ప్రముఖులు, మేధావులు రిటైర్డ్ టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అడ్వకేట్లు, ఇంజినీర్లు, డాక్టర్లు, వాణిజ్య, వ్యాపార రంగాల ప్రముఖులు, ఆడిటర్లు, మహిళలు, రైతులు పాల్గొని కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంభిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత కోన రఘుపతి ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఏ విధంగా వంచనకు గురిచేసిందనే విషయాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు. సంక్షేమాన్ని ఇంటికి చేర్చిన ఘనత వైఎస్ జగన్దే.. కోనరఘుపతి మాట్లాడుతూ 2019–24 లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, అప్పటిముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డీబీటీ విధానం ద్వారా ప్రతి రూపాయి ప్రజలకే అందే విధంగా చేశారన్నారు. సుమారు 8.7 కోట్ల లబ్ధిదారులకు రూ.2.73 లక్షల కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి చేర్చిన ఘనత వైఎస్ జగన్దేనన్నారు. రాష్ట్రంలో 17 నూతన మెడికల్ కాలేజీలు 56వేల స్కూల్స్, ఆసుపత్రులను నాడు–నేడు విప్లవం ద్వారా తీర్చిదిద్దడం ఉన్నత విద్యకి 100 శాతం ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వటం వంటి విప్లవాత్మకమైన మార్పులు చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కిందన్నారు. రాష్ట్రంలో 15 వేల సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు 10,000 విలేజ్ క్లినిక్లు, 542 అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటుచేసి ప్రజల ముంగిటకే అభివృద్ధి ఫలాలు చేర్చిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వాటితోపాటు పేదలందరికీ 30 లక్షల ఇళ్ల పట్టాల ద్వారా 22 లక్షల పక్కా ఇళ్ల నిర్మాణంలో ఉంచడం ద్వారా ఒక చరిత్ర సృష్టించారన్నారు. కరోనా లాంటి ఉపద్రవం సంభవించినా ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలుగకుండా ఉత్తమసేవలు అందించిన ఘనత జగన్కే దక్కిందన్నారు.ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి అందరినీ వంచించిన ఘనుడు చంద్రబాబు అన్నారు. బాపట్లను అన్నివిధాల అభివృద్ధి పథంలో నడిపించేందుకు నాడు కష్టపడి జిల్లా సాధనకు కృషిచేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో జిల్లాను సాధించుకొని అన్నివనరులు సమకూర్చుకుంటూనే బాపట్ల పట్టణంలో రోడ్లు, పర్యాటకంగా సూర్యలంక తీరం, మెడికల్ కళాశాల పనులు జరుగుతున్న తరుణంలో అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చిందన్నారు. సూర్యలంక బీచ్ దగ్గర చేస్తున్న అభివృద్ధి పనులు అస్తవ్యస్తంగా ఒక ప్రణాళిక లేకుండా ఉన్నాయన్నారు. బాపట్ల మెడికల్ కళాశాల, సూర్యలంక అభివృద్ధి పనులకు ఏ విధమైన ప్రణాళికలు సిద్ధం చేశామనే అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. -
అధికార అండతోనే దుడుకు చర్యలు
మోహనరావుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార అండ లేకుండా ఇలాంటి దుడుకు చర్యలు జరగవని భావిస్తున్నాం. అది చేనేతలకు చెందిన ఆస్తి. వాస్తవాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలి. నిందితులపై చట్టపరంగా చర్యలు చేపట్టాలి. – బీరక సురేంద్ర, దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చీరాలలో జరిగే అన్ని అరాచకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణం. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. స్థానికంగా జరిగే పరిణామాలపై ఎస్పీ, కలెక్టర్ ఏం చేస్తున్నట్లు?. ప్రస్తుతం సరిదిద్దుకునే దశలో పరిస్థితి ఉంది. మోహనరావుకు న్యాయం జరిగే వరకు చేపట్టే కార్యాచరణలో మా వంతు సహకారం అందిస్తాం. – డాక్టర్ పాలేటి రామారావు, మాజీ మంత్రి, చీరాల టీడీపీ నేత వివాదాస్పద భూమి చేనేత ఉమ్మడి అవసరాలకు కేటాయించింది. సిధూర్ కాలనీ ఆవిర్భావంలో చేనేతలతో పాటు, 40 మంది ఎస్సీ, ఎస్టీలకు కూడా అక్కడ స్థానం కల్పించారు. మోహనరావుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. వాస్తవాలను పరిశీలించి వెంటనే అఽధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. – జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్, చీరాలమోహనరావు అత్యంత సహనశీలి. దేశస్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి. చేనేతల వాణి. అలాంటి వ్యక్తిపై దాడి చేయడం అంటే ప్రజా స్వామ్యం ఖూనీ అయినట్లే. ఎమ్మెల్యేకు తెలీకుండా దాడి జరుగుతుందా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు విషయంలో ఏం జరిగిందో మననం చేసుకోవాలి. అలానే ఇక్కడ జరిగిన పరిణామాలకు తమకు ఎలాంటి సంబంధం లేదంటే నిందితులను వెంటనే అరెస్ట్ చేయించి వారి పారదర్శకతను నిరూపించుకోవాలి. – మోహన్ కుమార్ధర్మా, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆ ప్రాంతంలో టీడీపీకి చెందిన వారే ఎక్కువ. కానీ వారికే అన్యాయం జరుగుతోంది. పరిస్థితి కంచే చేను మేసిందన్న చందంగా తయారయ్యిందని అక్కడి వారు వాపోతున్నారు. మోహనరావుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. అధికార అండ లేకుండా అలాంటి చర్యలకు తెగబడరు. మూడు దశాబ్దాలుగా లేని కొత్త కోణాలు వెలుగులోకి రావడం అందుకు నిదర్శనం. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – సాధు రాఘవ, వైఎస్సార్సీపీ వేటపాలెం మండల అధ్యక్షుడు మోహనరావుపై దాడి వెనుక ల్యాండ్ మాఫియా కుట్ర ఉంది. అందుకు పరోక్షంగా అధికార అండే కారణం. దాడిని ఖండిస్తున్నాం. మోహనరావును అక్కడ లేకుండా చేస్తే ఆ స్థలాన్ని కబ్జా చేయవచ్చనే కోణంలో వ్యవహారం నడిచింది. ఆయనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తి వేయాలి. – చుండూరు వాసు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోహనరావుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలి. ఆయనపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలి. మోహనరావు ఒక కులానికో, మతానికో చెందినవాడు కాదు. అందరి వాడు. పేదల కోసం పనిచేసే సామాజిక కార్యకర్త. అలాంటి వ్యక్తిపై జరిడిన దాడిని తీవ్రంగా పరిగణించాలి. చేనేతలంతా ఐక్యంగా ఉద్యమించాలి. సంఘటితంగా నినదిస్తేనే న్యాయం జరిగేది. – అవ్వారు ముసలయ్య, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు -
ప్రజలను మభ్యపెట్టే ప్రభుత్వాలు నిలబడవు
రాజకీయాల్లో ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగించాలనే ధోరణిలో పనిచేసే ఏ ప్రభుత్వాలు నిలబడవు. క్షేత్రస్థాయిలో రైతులు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న రైతుభరోసాకేంద్రం (ఆర్బీకే) ద్వారా అందించిన అన్నిరకాల సేవలు యథావిధిగా కొనసాగిస్తే బాగుంటుంది. రైతులు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. రైతులను ఇబ్బందులకు గురిచేయటం సరికాదు. ముఖ్యంగా రాజకీయాల్లో మన ప్రాంతంపై అవగాహన, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులనే ఎంపికచేసుకోవాలి. – పి.వి.కృష్ణయ్య, రిటైర్డ్ అసోసియేట్ డీన్, బాపట్ల వ్యవసాయ కళాశాల -
వెంకటరెడ్డి
అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన ఇంకొల్లు(చినగంజాం): రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తన జీవిత ప్రస్థానాన్ని కొనసాగించిన ప్రజల మనిషి గాదె వెంకటరెడ్డి అని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి దశదిన కర్మ, సంస్మరణ కార్యక్రమం సోమవారం ఆయన స్వగృహంలో కుమారుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి, గాదె మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గాదె వెంకటరెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటని ఆయన జీవితం.. రాజకీయ ప్రస్థానం అంతా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కొనసాగిందన్నారు. వెంకటరెడ్డి సతీమణి, ఆయన కుమారులు ఇతర కుటుంబ సభ్యులను ఆయన స్వయంగా కలిసి పరామర్శించారు. కార్యక్రమానికి పులఖండం వెంకారెడ్డి అధ్యక్షత వహించగా దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పార్టీ శ్రేణులు, పలువురు రాష్ట్ర మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించిన అనంతరం ఆయనతో ఉన్న ఆయన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితం, ఆయనతో వారికి ఉన్న అనుబంధ బాంధవ్యాల గురించి మాట్లాడారు. వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానానికి చెందిన ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వెంకటరెడ్డితో సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న మాజీ మంత్రులు సంస్మరణ సభలో రాష్ట్ర మాజీ మంత్రులు కనుమూరి బాపిరాజు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి గాదె వెంకటరెడ్డితో తమకున్న అనుబంధాన్ని సభలోగుర్తు చేసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. జిల్లా టాస్క్ఫోర్స్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు బసవపున్నారెడ్డి, బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, పార్టీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఆరే శ్యామల, బాచిన చెంచు గరటయ్య, కృష్ణచైతన్య, సంతనూతలపాడు బీఎన్ విజయ్కుమార్, రేపల్లె ఇన్చార్జి పీతా నాగమోహన్, పలువురు సీనియర్ నాయకులు, నియోజక వర్గంలోని ఆరు మండలాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, వెంకటరెడ్డి అభిమానులు, బంధువులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్లటౌన్: ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 193 మంది బాధితులు జిల్లా కలెక్టర్ను కలిసి అర్జీలు అందజేశారు. బాధితులకు సత్వరమే న్యాయం చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పీజీఆర్ఎస్లో నమోదైన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, తదుపరి పరిష్కరించాలన్నారు. ఇన్చార్జ్ జేసీ, డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ప్రభాకర్ రావు పాల్గొన్నారు. -
చీరాలలో ప్రజాస్వామ్యం ఖూనీ
చీరాల అర్బన్: చీరాలలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, పేద, బడుగు, బలహీన వర్గాల పక్షపాతిగా గుర్తింపు పొందిన రాష్ట్ర చేనేత జన సమాఖ్య వ్యవస్థాపకుడు మాచర్ల మోహనరావుపై ఇటీవల సిధూర్ కాలనీలో జరిగిన దాడి అందుకు నిదర్శనమని పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. సిధూర్ కాలనీలో భూ వివాదానికి సంబంధించి మోహనరావు, సుమతి అనే ఇరువురు పరస్పర ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. మోహనరావుకు మద్దతుగా చీరాల మండలం జాండ్రపేటలోని కల్యాణ మండపంలో సోమవారం రాత్రి పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మోహనరావుపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఆయనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం, మోహనరావుపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయకపోవడంపై పోలీసుల తీరును శంఖించారు. అందుకు పరోక్షంగా అధికార పార్టీయే కారణమని ఉద్ఘాటించారు. జాండ్రపేటలో రాస్తారోకో చేపట్టి మోహసరావుకు మద్దతుగా నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి జరిగే ప్రజా ఉద్యమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు
భట్టిప్రోలు: ప్రభుత్వ ఉద్యోగులను పరుషపదజాలంతో ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం వారి అహంకారానికి నిదర్శనమని విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అసోసియేట్ అధ్యక్షులు పరిశ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అసభ్య పదజాలంతో అధికారుల పట్ల ప్రవర్తించవద్దని సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం కొణిదల పవన్కల్యాణ్ ప్రజా ప్రతినిధులకు సీరియస్గా చెప్పాలని కోరారు. కొన్ని నిబంధనలు ఉంటాయని వాటికి అనుగుణంగానే పనులు చేస్తారని, క్రింది స్ధాయి నుండి పైస్థాయి వరకు అధికారులు ఉంటారని వారి అనుమతితోనే ఏ పనులైన చేస్తారనే విషయం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గమనించాలని అన్నారు. 2025 ఏడాదికి రావాల్సిన రెండు డీఏ బకాయిలు, 2026 సంవత్సరానికి రావాల్సిన ఒక డీఏ బకాయి విడుదల చేయలేదని పేర్కొన్నారు. అవి వెంటనే అమలు చేస్తే పిల్లల చదువులకు, గృహ లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐలు తగ్గించుకోవచ్చునని, కొత్త లోన్లు తీసుకునే వారికి ఎక్కువ లోను వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీలు స్పందించి సీఎం, విద్యుత్ మంత్రి దృష్టికి వెంటనే తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కారం చేయగలరని అన్నారు. పెన్షనర్స్ను వారి ఆర్థిక ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే పీఆర్సీ జరిపించి మూడు డీఏ బకాయిలు చేయగలరని కోరారు. విశ్రాంత విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు పరిశ వెంకటేశ్వరరావు -
పన్నుల వసూళ్లలో ఉన్న శ్రద్ధ వసతుల కల్పనలో లేదు
ప్రస్తుతం మున్సిపాల్టీలో పన్నుల వసూళ్లలో చూపించిన శ్రద్ధ, చొరవ ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో చూపించడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటిపన్నులను ఆస్తివిలువతో ముడిపెట్టి విధించడం సరికాదు. ఇంటిపన్నులు ఎప్పుడూ రెంటల్ విధానంలోనే ఉండాలి. ప్రతి ఆరు నెలలకు పన్నులు పెంచడం సరికాదు. పట్టణంలో 12 కి.మీ మేరా ఉన్న డ్రైనేజిను కనీసం క్లీనింగ్ చేసే నాధుడే లేడు. ఏ వీధిలో చూసినా చెత్తాచెదారం నిల్వలు పేరుకుపోతున్నాయి. – డి. చంద్రయ్యశర్మ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ -
నిరుద్యోగుల జీవితాలతో ఆటలు
బాపట్లటౌన్: నిరుద్యోగుల జీవితాలతో కూటమి సర్కార్ ఆటలాడుతోందని మాజీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోనరఘుపతి తెలిపారు. బాపట్ల జిల్లా దళిత సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన దగా డీఎస్సీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని కోనరఘుపతి ప్రారంభించారు. బాపట్ల రైల్వేస్టేషన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ పాతబస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, చీలురోడ్డు మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. కోన రఘుపతి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన డేటా ఎందుకు డీలీట్ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మెరిట్ లిస్టు ఎందుకు దాచారు, జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకోష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరిట దగా.. వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు మాట్లాడుతూ లక్షాలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, మెరిట్ జాబితాలో పారదర్శకత లేక పోవడం, ఎంపిక ప్రక్రియపై సందేహాలు నెలకొన్నాయన్నారు. యువత దీనిపై తీవ్ర ఆందోళలో ఉన్నారన్నారు. వీటన్నింటిపై సీబీఐ, సిట్టింగ్ జడ్జిచే తక్షణమే న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహణలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారన్నారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెరిట్ జాబితా ఎందుకు ప్రదర్శించలేదని.. మేసేజ్లు పంపి ఆ తరువాత డీలీట్ చేసి అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించారన్నారు. బోగస్ సర్టిఫికెట్లతో స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను రూ.లక్షలకు అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరండీఎస్సీపై విచారణ చేయాలంటూ జిల్లా డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ సెక్రటరీ గోపి, ఎస్సీసెల్ కార్యదర్శి మండే విజయ్కుమార్, బాపట్ల నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుడు ప్రకాష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి విప్పర్ల వెంకటేశ్వర్లు, వేమూరు ఎస్సీసెల్ అధ్యక్షులు సురేష్, చీరాల మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు మహేష్, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య, ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి కటికల యెహోషువా పాల్గొన్నారు. -
ఎస్ఐ కారు ఢీకొని యువకుడు మృతి
చిలకలూరిపేట టౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సంతరోడ్డు ప్రాంతంలో నివాసం ఉండే వీసా సురేష్ (34) కేటగిరింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. తండ్రి పది సంవత్సరాల కిందట మృతిచెందడంతో తల్లితో కలిసి జీవిస్తున్నాడు. ఈనెల 6వ తేదీ సాయంత్రం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో జాతీయ రహదారి దాటుతున్న సమయంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వైపు వెళుతున్న రూరల్ ఎస్సై చెల్లి రమేష్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో సురేష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని పట్టణంలోని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగై చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం జీజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని సోదరుడు సురేంద్ర ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి వివాహం కాలేదు. -
ఇద్దరు యువకులు మృతి
బాపట్ల టౌన్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన సోమవారం బాపట్లలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే బాపట్ల మండలంలోని రామానగర్కు చెందిన కొక్కిలిగడ్డ సుబ్బారావు రామానగర్ నుంచి బాపట్ల వెళ్తుండగా అదే సమయంలో అటువైపుగా వస్తున్న ట్రాక్టర్ సూర్యలంక రోడ్డులోని ప్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఢీకొట్టింది. ఈ ఘటన కిందపడిపోయిన సుబ్బారావు(28) పై ట్రాక్ టైరు ఎక్కింది. కొన ఊపిరితో ఉన్న సుబ్బారావును వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లిదండ్రులకు సుబ్బారావు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మండలంలోని సుబ్బారెడ్డిపాలెంకు చెందిన బోగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సుబ్బారెడ్డి పాలెం నుంచి కంకటపాలెం వైపు వెళ్తుండగా పట్టణంలోని దరివాదకొత్తపాలెం సమీపంలో సోమవారం సాయంత్రం చీరాల నుంచి బాపట్ల వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్వరరెడ్డి (32) అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి తండ్రిలేరు. తల్లి, ఒక సోదరుడు ఉన్నారు. కుటుంబం అంతా వెంకటేశ్వరరెడ్డిపైనే ఆధారపడి ఉంది. కొడుకు మృతిచెందడంతో కుటుంబానికి ఆధారం ఇంకెవరయ్యా అంటూ తల్లి రోధిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి పట్టణ సీఐ రాంబాబు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుంటూరు జిల్లాలో సగటు వర్షపాతం 11 మి.మీ
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా మేడికొండూరు మండలంలో 36.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా కొల్లిపర మండలంలో 1.6 మి.మీ వర్షం కురిసింది. సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిరంగిపురం మండలంలో 19.2 మి.మీ., పెదకాకాని 16.2, మంగళగిరి 14.8, గుంటూరు పశ్చిమ 14.6, వట్టిచెరుకూరు 12.4, తాడికొండ 11.6, గుంటూరు తూర్పు 11.4, చేబ్రోలు 10.2, తాడేపల్లి 9.2, కాకుమాను 8.2, దుగ్గిరాల 7.4, పెదనందిపాడు 6.2, తెనాలి 5.6, ప్రత్తిపాడు 4.6, పొన్నూరు 4.6, తుళ్లూరు మండలంలో 4 మి.మీ చొప్పున వర్షం కురిసింది. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల వృద్ధుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం బంగారు దుకాణాల సముదాయం గంటాలమ్మ చెట్టు ఏరియాలో ఉంటున్న పశ్చిమ బెంగాల్ మిద్నాపూర్ జిల్లా దాస్పూర్ గ్రామ వాసి బవానందదాస్ (72) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తలనొప్పితో బాధపడుతున్న అతను కొత్తపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం మధ్యాహ్నాం అతను ఇంటి పైభాగంలోని స్టోర్లో ఫ్యాన్కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడి కుమార్తె రూపాలి దాసు ఫిర్యాదుతో లాలాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి రూరల్: అత్యంత క్లిష్టమైన ఊపిరితిత్తుల సమస్యలు, ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడే ఎక్ట్స్రా కార్బొరియల్ మోంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఏక్మో) సేవలు తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చినట్లు కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ పల్మనాలజీ డాక్టర్ లోకేష్ గుప్తా తెలిపారు. సోమవారం మణిపాల్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. డాక్టర్ లోకేష్ గుప్తా మాట్లాడుతూ అమరావతి ప్రాంతం తుళ్లూరుకి చెందిన గుమ్మా వెంకటరావు అత్యంత విషమ పరిస్థితుల్లో మణిపాల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని తెలిపారు. రోగికి ఆక్సిజన్ స్థాయి 60 శాతానికి పడిపోయిందని, వివిధ రకాల పరీక్షల అనంతరం రోగికి హార్డ్స్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారని పేర్కొన్నారు. వెంటిలేటర్ సహాయం, ప్రోన్ పొజిషనింగ్, యాంటీ బయాటిక్స్, అన్ని రకాల అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోగా మరింత దిగజారిందని వివరించారు. రోగికి సాధారణ చికిత్సలు ఫలితం ఇవ్వకపోడంతో ‘ఏక్మో’ సపోర్ట్తో వైద్యం ప్రారంభించారని, తాత్కాలికంగా ఊపిరితిత్తులు పనిని నిర్వహిస్తూ అవి కోలుకొనే సమయాన్ని కల్పించినట్లు తెలిపారు. 27 రోజులు రోగికి ఐసీయూలో చికిత్స అందించామని, చికిత్స సమయంలో భారీగా రక్తస్రావం జరిగిందని, వెంటనే రిజిడ్ బ్రోంకోస్కోపి నిర్వహించామని పేర్కొన్నారు. శ్వాసనాళానికి అడ్డుగా ఉన్న పెద్ద రక్తపు గడ్డలను తొలగించామని, రెండు వారాల పాటు ఏక్మో సపోర్ట్, నిరంతర పర్యవేక్షణ, రెస్పిరేటరీ రిహాబిలిటేషన్, ఫిజియోథెరపి వివిధ విభాగాల వైద్యుల సమన్వయంతో సమగ్ర చికిత్స అందించామని వివరించారు. ప్రస్తుతం రోగి స్పృహలో ఉండి ఆరోగ్యంగా కోలుకుంటున్నారని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. డాక్టర్ ఉదయ్ కిరణ్, డాక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉండడం వలన ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. డాక్టర్ దినేష్కుమార్ గొంట్ల, టి.శ్రీనివాస్, దిలీప్ రట్టి, వరుణ్ పమ్మిడి తదితరులు పాల్గొన్నారు. -
రైతులు బాధపడితే రాష్ట్రానికే అరిష్టం
ప్రస్తుతం రాష్ట్రంలో అన్నదాత సంతోషంగా లేడు. మనకు మూడు పూట్ల తిండిపెట్టే అన్నదాత బాధపడుతుంటే అది రాష్ట్రానికే అరిష్టం. అన్నదాతలను అన్నివిధాల అదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఎరువులు, పురుగుమందుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ధరల నియంత్రణ లేదు. గతేడాది ఖరీఫ్ సీజన్లో సకాలంలో యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్షేత్రస్థాయిలో రైతులు ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు ఎప్పుడు సుభిక్షంగా ఉండాలి. రైతులను ఇబ్బందులకు గురిచేయటం సరికాదు. – ఎన్. సిద్ధయ్య, రిటైర్ట్ తహసీల్దార్, బాపట్ల తాలుకా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
ఏపీఏఐఎంఎస్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ పెదకాకాని: రైతులు ఏపీ ఏఐఎంఎస్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ అన్నారు. పెదకాకాని మండలంలోని నంబూరు మన గ్రోమోర్, వెనిగండ్ల దనీత్ ఎంటర్ప్రైజెస్ ఎరువులు, పురుగుమందులు షాపుల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ రైతులకు సౌకర్యవంతంగా ఏపీ ఏఐఎంఎస్(వ్యవసాయ సమాచార నిర్వహణ విధానం) యాప్ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్ ద్వారానే రైతులకు యూరియా, డీఏపీ విక్రయాలు జరుగుతాయని వెల్లడించారు. పంటలు సాగు చేసే రైతులు తమ పంట నమోదు చేసుకోవడం ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా ఉండేందుకు ఈ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది రైతుల అవసరాల మేరకు ఎరువుల లభ్యత ఉంటుందని చెప్పారు. రైతులు తమకు ఇష్టమైన ప్రాంతంలోని డీలర్ల ఎరువులు తీసుకునే వెసులుబాటు ఈ యాప్ ద్వారా ఉంటుందని తెలిపారు. వర్షం పడితే పొలాలకు ఎరువులు చేరడం ఇబ్బందిగా ఉంటుందని ముందుగానే ఎరువులు ఇవ్వాలని పలువురు రైతులు కమిషనర్ దృష్టికి తీసుకు రావడంతో సానుకూలంగా స్పందించారు. ఈ యాప్ ద్వారా ఆరుగురు రైతులకు 15 బస్తాలు యూరియా ఇచ్చారు. కార్యక్రమంలో కమిషనర్ కార్యాలయం ఎస్ఈఐటీ సెల్ బాల సుబ్రహ్మణ్యం, ఏడీఏ ఫర్టిలైజర్స్ రాజన్, డీడీ ఫర్టిలైజర్ ఎం.ఆనంద్రావు, వ్యాసర్ ల్యాబ్ హరి, మండల వ్యవసాయ అధికారి రమణకుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆత్మ పీడీ ఎ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కేత్ బాచావో అభియాన్ కార్యక్రమం పెదకాకాని సచివాలయంలో నిర్వహించారు. ఏడీఏ ఎన్ రామ్మోహన్రావు పాల్గొన్నారు. తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో జరుగుతున్న 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన సోమవారం కొనసాగాయి. తొలి ప్రదర్శనగా ఆరభి యూత్ అండ్ కల్చరల్ అసోసియేషన్, రాప్తాడు వారి ‘డొక్కా సీతమ్మ’ నాటికను ప్రదర్శించారు. ఆముదాల సుబ్రమణ్యం రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మగా భావిక, పెద్ద సీతమ్మగా యశోదమ్మ, ఇతర పాత్రల్లో బాషా, అరుణ్బాబు తదితర 30 మందికి పైగా నటీనటులు నటించారు. తదుపరి గర్తపురి థియేటర్ ఆర్ట్స్, గుంటూరు వారి ‘5జీ కపుల్స్’ నాటికను ప్రదర్శించారు. ఎస్కేడీ హస్సన్ రచించిన ఈ నాటికకు ఆయనే దర్శకత్వం వహించారు. చివరగా ఎన్ఎంఆర్ క్రియేషన్స్, అనకాపల్లి వారి ‘వేదాంతం’ నాటికను ప్రదర్శించారు. ప్రఖ్యాత సాహితీవేత్త గుడిపాటి వెంకటాచలం మూలకథకు మార్గశీర్ష నాటకీకరించగా, ముత్యాలరావు పొన్నాడ దర్శకత్వం వహించారు. తొలినాటిక ప్రఖ్యాత సామాజిక సేవకురాలు డొక్కా సీతమ్మ జీవితానికి సంబంధించినది కాగా, ఇతర నాటికలు సందేశాత్మక ఇతివృత్తంతో సాగాయి. ప్రఖ్య చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్, తెనాలి కళాకారుల సంఘం–తెనాలి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలను పరిషత్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, ప్రధాన కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణరావు, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు పర్యవేక్షించారు. -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బాపట్ల చైర్మన్ జీవీవీ రాఘవరెడ్డి బాపట్లటౌన్: ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాపట్ల చైర్మన్ జీవీవీ రాఘవరెడ్డి కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్లోని పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. జీవీవీ రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, పరిష్కారానికి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, పలు క్యాడర్ల సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, జాయింట్ స్టాప్ కౌన్సిల్ మీటింగ్లో వివరించామన్నారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సర్వీసు సమస్యలు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర అంశాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గతనెల 22న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1032ప్రకారం జూన్ 1 నుంచి 15 మధ్య ఒక తేదీ, సమయాన్ని నిర్ణయించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలన్నారు. లిటరసీ న్యూమరసీ రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ శివలక్ష్మి పర్చూరు(చినగంజాం): ప్రాథమిక తరగతుల్లో ఉపాధ్యాయులు నేర్పిన విద్య విద్యార్థికి జీవితాంతం ఉపయోగ పడుతుందని ఎస్సీఈఆర్టీ ప్రొఫెసర్, జ్ఞాన ప్రకాష్ 3 ఫౌండేషన్ లిట్రసీ న్యూమరసీ రాష్ట్ర పరిశీలకురాలు డాక్టర్ వి. శివలక్ష్మి అన్నారు. పర్చూరులో నిర్వహిస్తున్న లిటరసీ న్యూమరసీ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా శివలక్ష్మి మాట్లాడుతూ.. 1, 2 తరగతులు పిల్లలకు అక్షరాలు, అంకెలు తప్పనిసరిగా నేర్పించాలని, ప్రాథమిక తరగతులలో నేర్పిన విద్య జీవితాంతం ఉపయోగ పడుతుందన్నారు. ఏఎంవో మోజస్ మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ శిక్షణ అనేది అన్ని శిక్షణల మాదిరిగా కాదని, అన్నింటికన్నా మిన్న అని చెప్పారు. దీనిని అందరూ బాగా వినియోగించుకోవాలని పిల్లల బంగారు భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో పర్చూరు ఎంఈవోలు ఎ. శివకోటేశ్వరరావు, పి. వెంకటరామయ్య, యద్దనపూడి ఎంఈవో పుల్లెల సుబ్రహ్మణ్యేశ్వరరావు, సీఆర్పీలు, డీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బబ్బేపల్లిలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
మార్టూరు: మండలంలోని బబ్బేపల్లి గ్రామంలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. అందుకు రెవెన్యూ అధికారులు సహకరించడంతో అక్రమ గ్రావెల్ తవ్వకాలు గత వారం రోజులుగా జోరందుకున్నాయి. గ్రామ రెవెన్యూ పరిధిలో వ్యర్థాల నుంచి సంపద తయారీ కేంద్రాన్ని గత ప్రభుత్వ హయాంలో స్థానిక ప్రజాప్రతినిధులు నిర్మించారు. ఆ కేంద్రానికి చుట్టుపక్కల సుమారు 15 అడుగుల లోతులో గత వారం రోజులుగా గ్రామానికి చెందిన ఇద్దరు అధికార టీడీపీ నాయకులు అక్రమంగా గ్రావెల్ తవ్వుతూ యద్దనపూడి తదితర ప్రాంతాలకు విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇద్దరిలో ఓ నాయకుడు తనకు గ్రావెల్ తవ్వకాల కోసం తహసీల్దార్ మౌఖిక అనుమతులు ఇచ్చారని చెప్పుకోవడం విశేషం. నేనెవరో తెలుసా అంటూ.. విషయం తెలిసిన కూకట్లపల్లి రేంజ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేశ్బాబు ఆదివారం మధ్యాహ్నం గ్రావెల్ తవ్వుతున్న ప్రాంతాన్ని పరిశీలించి అక్కడివారిని ప్రశ్నించారు. మొదట ఇది తమ పట్టా భూమి అని అనంతరం తహసీల్దార్ అనుమతులు ఉన్నాయని దబాయించే ప్రయత్నం చేశారు. పట్టా చూపమని రమేశ్బాబు, అడగ్గా వారి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. అంతటితో ఆగక సదరు చోటా నాయకుడు నేనెవరో తెలుసా ఇప్పుడే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తున్నా, మమ్మల్ని అడ్డుకుంటావా అంటూ ఫారెస్ట్ ఆఫీసర్ రమేష్ బాబుతో వివాదానికి దిగాడు. మరో వర్గం నాయకుల ఒత్తిడితో దాడులు అధికార పార్టీలోని ఆధిపత్య పోరులో భాగంగా వీరిద్దరిని వ్యతిరేకించే మరో వర్గం నాయకులు తహసీల్దార్, వీఆర్వో, ఏఆర్ఏలను గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవాల్సిందిగా ఆదివారం ఆదేశించడం విశేషం. దీంతో తహసీల్దార్ ఆదేశాలతో ఇరువురు సిబ్బంది గ్రావెల్ తవ్వకాల వద్దకు వెళ్లి అడ్డుకున్నారు. గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతం గ్రామ రెవెన్యూ పరిధిలోని ఎర్ర చెరువు భూమి అని తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ తమను అక్కడికి పంపినట్లుగా వీఆర్వో తెలిపారు. అక్కడికి సమీపంలోనే ఉన్న ఫారెస్ట్ భూమిలో తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హెచ్చరించారు. తవ్వకాల కోసం ఒక పొక్లెయిన్, సుమారు 20 కి పైగా ట్రాక్టర్లు అక్కడ సిద్ధంగా ఉండటం చూస్తుంటే దీని వెనుక రెవెన్యూ అధికారుల పాత్ర లేకుండా అంత బహిరంగంగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహించే ప్రయత్నం జరగదని అర్థమవుతుంది. వారం రోజులుగా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపి విక్రయించిన స్థానిక టీడీపీ నాయకుడు పల్నాడు జిల్లా గణపవరంలోని ఎంఎల్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ట్రాక్టర్లకు సీరియల్ నంబర్లతో టోకెన్లు ముద్రించి అడ్డగోలుగా వ్యాపారం సాగించాడు. టీడీపీలోని వర్గపోరుతో అధికారుల దాడులు అప్పటివరకు మిన్నకుండిపోయిన అధికారులు -
అధిక బరువు శిశువు జననం
మాచవరం: మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధిక బరువుతో శిశువు జన్మించినట్లు వైద్యాధికారి ఎస్.ప్రసాద్ తెలిపారు. మండలంలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన డి దివ్యకు 4.6 కిలోల బరువు గల ఆడ శిశువు సాధారణ కాన్పు ద్వారా జన్మించినట్లు తెలిపారు. పీహెచ్సీ సిబ్బంది చాకచక్యంగా వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు అయ్యేలా కృషి చేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరుకు చెందిన సీనియర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ కొమ్మినేని రంజిత్ కుమార్ ది ఆంధ్రప్రదేశ్ కో–ఆపరేటివ్ బ్యాంక్(ఆప్కాబ్) బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నందు ప్రొఫెషనల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు నుంచి ఉత్తర్వులు అందినట్లు రంజిత్ కుమార్ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రొఫెషనల్ డైరెక్టర్గా మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు. -
కొండవీడులో బయల్పడిన శిలా శాసనం
యడ్లపాడు: చారిత్రాత్మక కొండవీడు కోటలో మరో శాసనం బయటపడినట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి తెలిపారు. 42 కొండల సమాహారమైన కొండలలో అతి ఎత్తైన రుద్రపాద శిఖరం సమీపంలో ఈ శాసనం బయటపడిందన్నారు. ముస్లిం రాజుల పాలన కాలంలో ఈ శిఖరాన్ని ఆదం షఫీ బోడు అని పిలిచేవారన్నారు. ఈ శిఖరంపై రెడ్డిరాజులు 14, 15 శతాబ్దాల్లో నిర్మించిన రెండు శివాలయాలు, ఆ తర్వాతి ముస్లిం రాజుల కాలంలో నిర్మించిన దర్గా ఉండటంతో హిందువులతో పాటూ ముస్లింలు కూడా వెళ్లి అక్కడ పూజలు, ప్రార్థనలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో పలు శాసనాలు బయటపడ్డాయన్నారు. తాజాగా బయటపడిన శాసనాన్ని మైసూర్లోని పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం పరిశీలనకు పంపగా, ఇది దాన శాసనంగా గుర్తించారు. శాసనంలో వివరాల మేరకు, భట్లకు నాలుగు వృత్తులు, విరుపాక్ష దీక్షితులకు రెండు వృత్తులు ధారబోసినట్లు రాసి ఉంది. శ్రీ కై లాస శివాయ నమః అని రాసి ఉంది. ఈ శాసనాన్ని పర్వతం ఔభళ పంచారామలు రాసినట్లు ఉంది. కొండవీడు చరిత్ర తెలుసుకునేందుకు ఎన్నో శాసనాలు ఉన్నాయని, భవిష్యత్ తరాలకు రెడ్డి రాజుల చరిత్ర తెలుసుకునేందుకు ఇవి ఉపకరిస్తాయని పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
మంగళగిరి టౌన్: తాళం వేసిన ఇంట్లో దొంగలు చొరబడి భారీ సొత్తును అపహరించుకుపోయిన ఘటన మంగళగిరి మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామ పరిధిలోని రామాలయం సమీపంలో సుబ్బారావు, వెంకటేశ్వరమ్మ దంపతులు తమ కుమారుడు, కోడలితో కలసి నివాసముంటున్నారు. సుబ్బారావు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు నవీన్ ఓ ప్రభుత్వరంగ సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుబ్బారావు తన భార్య వెంకటేశ్వరమ్మతో కలసి పెనుగంచి ప్రోలులోని ఓ కార్యక్రమానికి వెళ్లాడు. కుమారుడు నవీన్ కూడా అదే గ్రామంలోని అత్తగారింటికి వెళ్లాడు. అదునుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల విలువైన వెండి వస్తువులతో పాటు, రూ.లక్ష నగదు దోచుకు వెళ్లినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో కుమారుడు నవీన్ ఇంటికి వచ్చి, లోపల డోర్కు వేసిన తాళాలు పగలకొట్టి ఉండడంతో గదిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉండడం గమనించాడు. మరో గదిలో గడ్డపలుగు ఉండడంతో గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక గోడ దూకి వచ్చి గడ్డపలుగు సాయంతో తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడినట్లు భావించి, పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. మంగళగిరి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్టీమ్ను పిలిపించి ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. రూ.7 లక్షల విలువైన ఆభరణాలు, రూ.లక్ష నగదు మాయం -
సముద్రానికి హాని కలిగిస్తే మానవ మనుగడకే ముప్పు
బాపట్లటౌన్: సముద్రానికి హానికలిగిస్తే మానవ మనుగడకే ముప్పని ఫోరంఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పీసీ సాయిబాబు తెలిపారు. ఈనెల 8వ తేదీన ప్రపంచ సాగర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని ఎస్ఎంజీ ఉన్నత పాఠశాలలో సాగర దినోత్సవ కర పత్రాలను ఆవిష్కరించారు. డాక్టర్ పీసీ సాయిబాబు మాట్లాడుతూ సముద్రాల పట్ల మన ధృక్పథం మారాలన్నారు. ఇప్పటివరకు వాటిని మనం దోచుకోవడానికి ఒక అంతులేని నిల్వగా, మన వ్యర్థాల కోసం ఒక అంతులేని మురుగు కాలువగా పరిగణించామన్నారు. సముద్రాలపై మన జీవితాలు ఎంతగా ఆధారపడి ఉన్నాయో ముందుగా గుర్తించాలన్నారు. మనం పీల్చే ప్రతి రెండవ శ్వాస సముద్రం నుంచే ఉత్పత్తి అవుతుందన్నారు. సముద్ర జీవులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ప్రపంచంలోని ఆక్సిజన్లో సుమారు 50 నుంచి 80 శాతం వరకు ఉత్పత్తి చేస్తాయన్నారు. కోట్లాది మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నారన్నారు. మనం సముద్రానికి హాని చేసినప్పుడు, మనం పీల్చే గాలిని, మన సమాజాలను స్థిరపరిచే వాతావరణాన్ని, మనకు ఆహారం అందించే వ్యవస్థలను సముద్రం నేరుగా దెబ్బతీస్తాయన్నారు. మానవాళి మనుగడ కోసం సముద్రాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎంఈఓ దేవరకొండ ప్రసాదరావు, సమగ్ర శిక్ష ఏపీఎం బిల్లా మోజస్, నాయకులు గురజాల శ్రీనివాసరావు, బడుగు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఎదురెదురుగా రెండు బైకులు ఢీ
బొల్లాపల్లి: ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బొల్లాపల్లి మండలం బండ్లమోటు – రేమిడిచర్ల గ్రామాల మధ్య ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో కొండబోయిన నాగేశ్వరరావు (45) మృతి చెందాడు. భార్య గోవిందమ్మ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంది. బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సరికొండపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. రావులాపురం గ్రామానికి చెందిన గొంగటి హుస్సేన్రెడ్డి ద్విచక్రవాహనంపై వినుకొండ నుంచి స్వగ్రామం వెళుతున్నాడు. మార్గంమధ్యలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొండెబోయిన నాగేశ్వరరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన గోవిందమ్మను చికిత్స నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బండ్ల మోటు ఎస్సై ఎస్డీ సమీర్ బాషా తెలిపారు. భర్త మృతి– భార్యకు తీవ్ర గాయాలు -
ఆర్టీసీ బస్సులో ఆగిన ప్రయాణికుడి గుండె
చీరాల: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి గుండె ఆగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఆ వివరాల్లోకి వెళితే... ఆదివారం తెనాలి నుంచి చీరాల మీదుగా ఒంగోలు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులో సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బాపట్లలో బస్సు ఎక్కాడు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకున్నాడు. బస్సు చీరాల ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి తిరిగి ఒంగోలు వెళ్తోంది. టికెట్లు ఇచ్చే క్రమంలో కండక్టర్కు అనుమానం వచ్చి నిద్రపోతున్నాడనుకుని పలు మార్లు లేపినా ఎటువంటి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చి బస్సును చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్ పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి సంబంధించిన వివరాలేమీ లభించలేదు. తెలుపు గళ్ల నలుపు చొక్కా, జీన్స్ నిక్కర్ ధరించి ఉన్నాడు. మెడలో నల్లని దారం కట్టుకుని ఉన్నాడు. చిల్లర డబ్బులు, ఈనో ప్యాకెట్ తప్ప మరే గుర్తింపు కార్డులు అతని వద్ద లభించలేదు. అలానే మృతుడి వద్ద రెండు టికెట్లు లభించాయి. గుంటూరు నుంచి చీరాలకు ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు ఒకటి, బాపట్ల నుంచి చీరాలకు తీసుకున్న టికెట్ ఒకటి లభించాయి. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ తీసుకోవడంతో అతడు బాపట్లకు చెందిన వ్యక్తా, చీరాలకు చెందిన వ్యక్తా అనేది తెలియడంలేదు. ఔట్ పోస్టు పోలీసులు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ వద్ద నుంచి వివరాలు నమోదు చేశారు. చీరాల వన్టౌన్ పోలీసుస్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి పంపించి వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడు కర్నూలు వాసి మృతి విషయం మీడియా మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో హల్చల్ కాగా ఆదివారం సాయంత్రం వివరాలు లభించాయి. ఈ మేరకు ఒన్టౌన్ పోలీసులు వివరాలు వెల్లడించారు. మృతుడి పేరు కుమ్మరి కిరణ్ (38) కర్నూలులోని ప్రకాష్నగర్ వాసిగా గుర్తించారు. కొద్ది రోజుల కిందట కూలి పనుల నిమిత్తం వేటపాలెం మండలానికి ఐదుగురు వచ్చారు. గతంలోనే ఆరోగ్య సమస్యలు ఉండడంతో శనివారం గుంటూరు హాస్పిటల్లో చికిత్స చేయించుకుని ఆదివారం తిరుగు ప్రయాణంలో చీరాల వస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నుంచి వస్తూ బాపట్లలో దిగి మరో బస్సు ఎక్కినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏరియా వైద్యశాలకు వచ్చి పరిశీలించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. బాపట్ల నుంచి చీరాలకు టికెట్ లభించని మృతుడి వివరాలు -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
బాపట్లటౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని డీఆర్ఓ జి.గంగాధర్గౌడ్ తెలిపారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 7వ తేదీ నుంచి 21 వరకు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. దానిలో భాగంగా ఆదివారం జిల్లా కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాలు ప్రారంభించారు. డీఆర్ఓ గంగాధర్గౌడ్ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పొందవచ్చన్నారు. భారతదేశం యోగాను ప్రపంచానికి అందించిన అమూల్యమైన సంపదన్నారు. ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. అనంతరం యోగా శిక్షకుల ఆధ్వర్యంలో వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించగా, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, నోడల్ ఆఫీసర్ చంద్ర శేఖర్, డీపీఓ ప్రభాకరరావు, డీఎస్డీఓ శ్రీనివాసులు, పశు సంవర్ధక శాఖ జె డి.వేణుగోపాల్, గృహ నిర్మాణ సంస్థ పీడీ వెంకటేశ్వరరావు, సమాచార శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ పి.వెంకట్రమణ, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మావతి, బి.సి సంక్షేమ, సాధికారత అధికారిణి శివలీల పాల్గొన్నారు. డీఆర్ఓ జి. గంగాధర్గౌడ్ -
కౌలు రైతు ఆత్మహత్య
కొల్లూరు: పంట నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కొల్లూరు మండలంలోని దోనేపూడిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. దోనేపూడికి చెందిన నిమ్మగడ్డ దుర్గారావు (60) మూడెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రకృతి విపత్తుల కారణంగా ఏర్పడిన పంట నష్టానికి తోడు, పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించకపోవడంతో అప్పుల పాలయ్యాడు. అప్పులతో సతమతమవుతూనే చేసిన అప్పులు తీర్చి, ఆర్ధికంగా నిలదొక్కుకోవాలన్న ఉద్ధేశ్యంతో లారీ కొనుగోలు చేసి ఇసుక, ఇటుక, మెటల్ చిప్స్ రవాణా ద్వారా బ్రోకరేజ్ చేస్తూ వచ్చాడు. వ్యవసాయంలో వస్తున్న నష్టాలకు తోడు బ్రోకరేజ్లో సైతం నష్టాలు ఎదురవడంతో అప్పులు అధికమయ్యాయి. కొద్ది రోజులుగా తన భార్య వద్ద బాధను వెళ్లగక్కుతున్నాడు. ఎలాగోల కష్టపడి అప్పులు తీర్చుకుందామని భార్య సర్ధిచెప్పింది. దుర్గారావు ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి కలుపు నివారణ మందును సేవించాడు. ఇది గమనించిన భార్య స్థానికులు, బంధువుల సాయంతో వైద్యశాలకు తరలించింది. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మృతి చెందాడు. వైద్యశాల నుంచి కొల్లూరు పోలీసులకు ఆదివారం అందిన మరణ నివేదిక మేరకు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు శవ పంచనామా నిర్వహించి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నరసరావుపేట: జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కలెక్టరేట్లో ’ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలని సూచించారు. గతంలో ఫిర్యాదు చేసిన వారు తప్పనిసరిగా పాత అర్జీ రసీదు తీసుకురావాలని సూచించారు. అర్జీలో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. సమస్య పరిష్కారమైన వెంటనే అర్జీదారుని ఫోన్ నంబర్కు మెసేజ్ వస్తుందని, నోటీసులు, ఎండార్స్మెంట్లు, వాట్సాప్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇంటి చిరునామాకు కూడా పంపిస్తారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా పీజీఆర్ఎస్ జరుగుతుందని, ప్రజలు తమ సమీప కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చునని వెల్లడించారు. అర్జీదారులు కలెక్టరేట్కు రాకుండానే తమ సమస్యలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన 1100 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చునని, గతంలో ఇచ్చిన అర్జీల స్టేటస్ తెలుసుకోవడానికి కూడా ఈ నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. నరసరావుపేట రూరల్: ఆర్టీసీ బస్సు డివైడర్ను ఢీకొనడంతో పలువురు గాయపడిన ఘటన శనివారం రాత్రి వినుకొండ రోడ్డులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇల్లా ఉన్నాయి... విజయవాడ నుంచి ఉరవకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినుకొండ రోడ్డులో డివైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని నలుగురికి గాయాలయ్యాయి. బస్సు ముందు భాగంతోపాటు కుడివైపున దెబ్బతింది. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు. నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామం సమీపంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పొనుగుపాడు గ్రామానికి చెందిన గద్దె కోటేశ్వరరావు(55) అడిగొప్పుల వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో గుండ్లపల్లి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలు కాగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.సతీష్ చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యడ్లపాడు: విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందిన సంఘటన యడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మేడిద అరుణ (45) తన పశువుల పాక వద్ద విద్యుత్ మోటారు ద్వారా నీటిని పట్టుకుంటుండగా విద్యుత్షాక్కు గురైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త దావీదు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పిడుగురాళ్ల: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చి టిప్పర్ ఢీకొని వ్యక్తి మతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలో ఆదివారం జరిగింది. పట్టణ ఎస్ఐ డి శివనామరాజు తెలిపిన వివరాల మేరకు... మృతుడు ఇరగదిండ్ల బాలస్వామి (53) మారుతీనగర్ 5వ లైన్లో నివాసం ఉంటున్నాడు. జీవనోపాధి కోసం చికెన్ పకోడీ బండి నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం చికెన్ పకోడీ తయారీకి కావలసిన సామగ్రి కొనుగోలు చేసేందుకు తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరాడు. ఐలాండ్ సెంటర్ మెయిన్ రోడ్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళుతున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా వాహనం నడుపుతూ బాలస్వామి ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలస్వామి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే క్షతగాత్రుని పట్టడంలోనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలస్వామి మృతి చెందాడు. మృతుడి భార్య ఇరగదిండ్ల అలేఖ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి–నార్కెట్పల్లి రాష్ట్ర రహదారిపై నకరికల్లు సమీపంలో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. నకరికల్లుకు చెందిన వాకాటి నాగరాజు(18) అతని మిత్రుడు ద్విచక్రవాహనంపై నకరికల్లు నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్తున్నారు. వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఇదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ వాకాటి నాగరాజును వేగంగా ఢీకొంది. తీవ్రగాయాలైన నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ కె.సతీష్ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పచ్చ దందా.. అధికారమే అండ
తొలిసారిగా బరులు పెట్టి కోడి పందేలు, పేకాట నిర్వహణ ● యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా ● వేలం పాటలు పెట్టి మరీ బెల్ట్ షాపుల కేటాయింపు ● రిసార్ట్స్ నిర్వహణలోనూ అక్రమాలు ● రామాపురం తీరంలో తాజాగా మరో ఇరువురు మృతి ● పుట్టగొడుగుల్లా అనుమతులు లేని లేఅవుట్లు ● కప్పం కట్టిన వారికి యువనేత అండ .. కీలక నేత ఆశీస్సులు డ్రైయిన్, రోడ్డు నిర్మించకుండా హెచ్చరిక బోర్డులు పెట్టిన దృశ్యం -
రొంపేరు కరకట్టలు ధ్వంసం
● అడ్డగోలుగా మట్టి తరలింపు ● పొంచి ఉన్న వరద ముప్పు వేటపాలెం: రొంపేరు కరకట్టల మట్టిని జేసీబీలను ఉపయోగించి ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా తరలిస్తున్నారు. వేటపాలెం నుంచి సంతరావూరు వెళ్లే మార్గంలో రొంపేరు డ్రైనేజీ కాలువ గట్టు మట్టిని భారీ స్థాయిలో తరలిస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రొంపేరు మురుగు కాలువ మధ్యలో వరద ప్రవాహానికి అడ్డుగా మేటలు వేసిన ప్రాంతంలోని మట్టి తరలింపు కోసం అనుమతి కోరారు. ఆ మేరకు అధికారులు కాలువ మధ్యలో మెరక ప్రాంతంలో 200 క్యూబిక్ మీటర్ల మేర తరలించుకోవడానికి అనుమతిచ్చారు. ఆ అనుమతి పత్రాన్ని అడ్డం పెట్టుకుని శనివారం, ఆదివారం రెండు రోజులపాటు వందల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. తప్పని ఆందోళన రాబోయే వర్షాకాలంలో రొంపేరు కరకట్టల పక్కనే ఉన్న పొలాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ గట్టు బలహీనపడితే వరద నీరు గ్రామాలు, వ్యవసాయ భూములను ముంపునకు గురిచేసి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శమని మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కరకట్టలు ధ్వంసం చేసిన వారికి జరిమానాలు విధించాలని ప్రజలు కోరుతున్నారు. మెరక మట్టి తరలించేందుకే అనుమతి రొంపేరు డ్రైనేజీ కాలువ మధ్యలో మెరక మట్టి తరలించుకోవడానికి మాత్రమే నిబంధనల మేరకు అనుమతిచ్చాం. కరకట్ట మట్టి తరలింపునకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం – కానియోలు, డ్రైనేజీ శాఖ ఏఈ, చీరాల -
బాపట్ల
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ఆదివారం నాటికి ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. 7నరసరావుపేట రూరల్: ఇస్సపాలం మహంకాళి ఆలయ నిర్మాణానికి సత్తెనపల్లికి చెందిన శాత్రసుపల్లి బాబురావు, పద్మావతి దంపతులు రూ 1,11,116 విరాళం ఇచ్చారు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 518.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 3,305 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
గుండె చెరువు
బాపట్లఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026చెరువుల గర్భానికి యథేచ్ఛగా తూట్లుబ్యాంకర్లు సహకరించాలితెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,200, గరిష్ట ధర రూ.3,000, మోడల్ ధర రూ.2,000 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. చెరుకుపల్లి: మండలంలో చెరువుల్లో ఇంజిన్లు పెట్టి మరీ నీటిని తోడేసి చెరువును ఖాళీ చేసి, మట్టిని యథేచ్ఛగా తరలించుకుకెళుతూ రూ.లక్షలు వెనుకేసుకుంటున్నారు అక్రమార్కులు. ముఖ్యంగా చెరుకుపల్లి మండలంలోని ఆరుంబాక గ్రామంలో ఉన్న చావలివారి చెరువులో ఎటువంటి అనుమతులు లేకుండా అమృతలూరు మండలం గోవాడకు చెందిన అధికార పార్టీ నేత, ఇంటూరుకు చెందిన మరో వ్యక్తి, అదేవిధంగా మండలంలో ప్రతి గ్రామానికి ఇద్దరు, ముగ్గురు చొప్పున అధికార పార్టీ నేతలు సిండికేటై అక్రమంగా మట్టి తవ్వి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలోనూ మండలంలోని చావల వారి చెరువులో వందల సంఖ్యలో డంపర్ల దారా మట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అమ్ముకుని రూ.లక్షలు గడించారు. అదే గ్రామ పంచాయతీ పరిధిలోనే ఏమినేని వారి పాలెం గ్రామం వద్ద ఉన్న సుమారు 10 ఎకరాలు విస్తీర్ణం ఉన్న దేవర చెరువులో మట్టిని తరలించేందుకు రంగం సిద్ధం చేసి ప్రస్తుతం రెండు భారీ పొక్లెయిన్ల సాయంతో డంపర్లు, ట్రాక్టర్ ల ద్వారా రాత్రి పగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ దూరాన్ని బట్టి ట్రాక్టర్ కు రూ.2వేల నుంచి రూ3వేలు, ట్రక్కుకు రూ.10వేల నుంచి రూ15వేల వరకు వసూలు చేస్తున్నారు. పట్టీపట్టనట్లు అధికారులు మట్టి తవ్వకాలకు గనుల శాఖతోపాటు రెవెన్యూ, పంచాయతీ అనుమతి తీసుకోవాలి అయితే అవేమి మాకు అవసరం లేదంటూ మండలంలో అక్రమార్కులు యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. ఆరుంబాక దేవర చెరువులో మట్టిని తీసేందుకు ఏకంగా 20అడుగుల లోతు పెట్టి అక్రమంగా మట్టిని తరలిస్తున్నా పంచాయతీ అధికారులు గానీ రెవెన్యూ, పోలీస్, చివరకు మైనింగ్ అధికారులు కూడా తొంగి చూడకుండా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రమాదభరితంగా... మండలంలో కొన్ని చెరువుల్లో యంత్రాల సాయంతో మట్టి తీయటంలో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. వాటిని కనీసం సరిచేయకుండా అందిన వరకు మట్టి తీసుకొని వదిలేస్తున్నారు. వర్షాకాలం చెరువులు నిండి, గుంతల్లో మనుషులు గానీ, పశువులు గానీ పడితే ప్రాణాలు పోయే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బాపట్లటౌన్: జిల్లా అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలన్నారు. జిల్లాలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి రంగాలకు బ్యాంకులు అధిక ప్రాధాన్యతనిస్తూ రుణాల పంపిణీ చేపట్టాలన్నారు. ప్రాధాన్యతా రంగాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. రైతులకు పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు అనుసంధానం, మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాల మంజూరులో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. బ్యాంకుల వారీగా పనితీరును నివేదికల మేరకు సమీక్షించి, లక్ష్యాల సాధనలో వెనుకబడిన బ్యాంకు మేనేజర్లకు పలు సూచనలు చేశారు. రుణ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో టూరిజం దినదినాభివృద్ధి చెందుతుందని టూరిజంలో బ్యాంకులు పెట్టుబడులకు ఇది సరైన సమయమన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన క్రెడిట్ ప్లాన్, వివిధ రంగాలకు అందించిన రుణాలు, డిపాజిట్లు, రుణాల, డిపాజిట్ల నిష్పత్తి, ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలు పురోగతి తదితర అంశాలను వివరించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సింగయ్య, వ్యవసాయ శాఖ జేడీ ఈ లక్ష్మి, జిల్లా పశుసంవర్ధక అధికారి వేణుగోపాల్, పరిశ్రమలు మేనేజర్ రామకృష్ణ, మత్స్యశాఖ ఉపసంచాలకులు గాలి దేవుడు, మెప్మా పీడీ ఆనంద పాల్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకృష్ణ, యూనియన్ బ్యాంక్ రీజనల్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, ఆర్బీఐ ఎండీఓ ఎలమంద, నాబార్డ్ డీడీఎం రవికుమార్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల జిల్లా సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. శనివారం కలెక్టర్ బంగ్లా నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఓటర్ల జాబితా సవరణపై ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు, బీఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్వైజర్లు, బీఎల్ఓలు సమన్వయం చేసుకొని ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వేగవంతగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఈఆర్వోలు, ఏఈ ఆర్వోలు, సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు. మలేరియా రహిత సమాజస్థాపనకు కృషిచేయాలి మలేరియా రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. మలేరియా వ్యతిరేక మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం పోస్టర్లు, ఫ్లెక్సీలను జిల్లా కలెక్టర్ శనివారం స్థానిక కలెక్టరేట్లోని తన ఛాంబర్లో విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని చెప్పారు. మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు. మండలంలో ఎక్కడా జలధార పథకం ద్వారా ఎవరికీ ఎలువంటి అనుమతులు ఇవ్వలేదు. ఎక్కడైనా జలధార పథకం ద్వారా మట్టి తవ్వకాలు జరిపితే వెంటనే ఉన్నతాధికారుల ద్వారా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా ఆరుంబాక దేవర చెరువులో తవ్వేందుకు ఎటువంటి అనుమతులు లేవు. – కళ్యాణ్, ఏఈ, కూచిపూడి చానల్ డ్రైనేజ్ చెరువులో మట్టిని జలధార పథకం ద్వారానే ఇరిగేషన్, డ్రైనేజ్ అధికారులు అనుమతులు ఇస్తారు. మైనింగ్శాఖకు సంబంధం లేదు. అయితే ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలిస్తే వారిపై శాఖా పరంగా చర్యలు తీసుకొని యంత్రాలు, వాహనాలు సీజ్ చేస్తాం. – శ్రీనివాస్, మైనింగ్ ఏడీ, బాపట్ల జిల్లాచేనేత నాయకుడిపై దాడి9జిల్లా అభివృద్ధికి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ -
కేటాయించిన స్థలంలో నిర్మాణాన్ని పడగొట్టారు
సిధూర్ కాలనీకి సంబంధించి మాచర్ల మోహనరావు అందించిన చేయూత అందరికి తెలుసు. సిధూర్ సంస్థ, విదేశీ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆ కాలనీ ఏర్పడింది. కాలనీ ఉమ్మడి అవసరాల కోసం కేటాయించిన స్థలంలో నిర్మాణాన్ని పడగొట్టారు. విషయం కోర్టులో ఉంది. ఈ లోపు కోర్టు నియమించిన కమిషన్ వస్తుందని అక్కడి వారికి ధైర్యం చెప్పేందుకు మేం వెళ్లాం. ఈ లోపు మోహనరావుపై దాడి చేశారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. – మోహన్ కుమార్ ధర్మా, ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ● -
నేటి నుంచి జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు
తెనాలి: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ 5వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగురోజులపాటు నిర్వహించనున్న పోటీల బ్రోచర్ను శనివారం గంగానమ్మపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆవిష్కరించారు. నాలుగురోజులపాటు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల్నుంచి 10.30 గంటల వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 7వ తేదీ సాయంత్రం ప్రారంభసభలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, సభాధ్యక్షులుగా అజో విభో కందాళం ఫౌండేషన్ ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ పాల్గొంటారని తెలిపారు. ఇదే సభలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవన సాఫల్య పురస్కారాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ రంగస్థల దర్శకులు, నటుడు ఎన్.రవీంద్రరెడ్డికి ప్రదానం చేయనున్నారు. తొలిరోజున ఆరు గంటలకు కళాహారతి తరుమాలి వారి ‘ప్రియమైన శత్రువు’ నాటికను ప్రదర్శించనున్నారు. ఉమా రచించిన ఈ నాటికకు నాట్యాచార్య ఎంవీ రమణ దర్శకత్వం వహించారు. సభానంతరం మైత్రి కళానిలయం, విజయవాడ వారి ‘వాస్తవం’ నాటిక ఉంటుంది. స్నిగ్ధ రచించిన ఈ నాటకానికి టీవీ పురుషోత్తం దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. రాత్రి 9.15 గంటలకు ఆరాధనా ఆర్ట్స్, గుంటూరు వారి ‘సరిగమ పాపా’ నాటికను ప్రదర్శిస్తారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచించిన ఈ నాటికకు నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహిస్తారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, కార్యదర్శి అద్దేపల్లి లక్ష్మణ్, కోశాధికారి పిట్టు వెంకట కోటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు జి.వేణుగోపాలరెడ్డి, అక్కిదాసు కిరణ్కుమార్, మైలా విజయ్నాయుడు, చుక్కా ఆనంద్ పాల్గొన్నారు. -
సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
చెరుకుపల్లి: పంట నమోదు చేసుకున్న ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి ఎరువులు, విత్తనాలు, పంటనష్ట పరిహారం అందుతుందని బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి లక్ష్మి తెలిపారు. శనివారం మండలంలోని కావూరు గ్రామంలో కేత్ బచావో అభియాన్ పొలం సంరక్షణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి ఎండీ ఫరూఖ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సేంద్రియ ఎరువులు వినియోగించటం ద్వారా భూమిలో పోషకాలు పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వి.రమేష్, బీడీ రామకృష్ణ, పృథ్వీరాజ్, మండల కోఆర్డినేటర్ రాహేల్రావు, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.నాదెండ్ల: నాదెండ్ల పోలీస్స్టేషన్లో మూడు నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె. నిరంజన్ శుక్రవారం రిలీవ్ అయ్యారు. ఆయన్ను నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ సుబ్బనాయుడు, ఎస్ఐలు ఆర్.వెంకటేశ్వరరావు, అనిల్కుమార్, శివరామకృష్ణ సత్కరించారు. డీఎస్పీ మాట్లాడుతూ, పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యల పరిష్కారంపై అంకితభావం ఉండాలన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం (ఏపీ ఏఓ) గుంటూరు, పల్నాడు జిల్లాల సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కోసం గుంటూరు కిమ్స్– శిఖర హాస్పిటల్లో శనివారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ మనజీర్ జిలాని సమూన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ సంఘం సభ్యులు, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ వైద్య శిబిరంలో ప్రతి వ్యక్తికి 26 అంశాలలో పరీక్షలు నిర్వహించారు. రెండు జిల్లాలకు చెందిన మొత్తం 150 మంది సభ్యులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.బాల భాస్కర్, జనరల్ సెక్రటరీ డాక్టర్ డి.ప్రవీణ్, ట్రెజరర్ డాక్టర్ బి.మురళి కిశోర్, సెక్రటరీ డాక్టర్ కె.అమల కుమారి, గుంటూరు, పల్నాడు జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. -
నేడు శివాలయం తలుపులు మూసివేత
పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకవర్గం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయం ఎదురుగా రోడ్డులో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి మృతి చెందడంతో శైవాగమ పద్ధతి ప్రకారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకస్వాముల సూచన మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి రాహుకేతుల పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు. నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు పెదకాకాని: ఏపీ పీసెట్–2026లో భాగంగా పురుష అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆరు రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. నాల్గవ రోజు శనివారం 714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 557 మంది హాజరయ్యారు. ఆదివారం నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్టికెట్ నెంబరు 30001 నుంచి 30680 వరకూ మొత్తం 680 మంది మహిళా అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్కుమార్ తెలిపారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన త్రీమెన్ కమిటీ సారధ్యంలో నెల రోజుల నుంచి స్థానిక అరండల్పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. త్రీమెన్ కమిటీ సభ్యుడు శివరామకృష్ణ మాట్లాడుతూ సుమారు 400 మంది చిన్నారులు ఈ క్యాంప్లో పాల్గొన్నారన్నారు. అనుభవజ్జులైన కోచ్ల పర్యవేక్షణలో చిన్నారులు ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్ టీంకు కో ఓనర్ ఓ.సాయికృష్ణ తేజ, హిందూ కళాశాల విద్యా సంస్థల సెక్రటరీ రామకృష్ణమూర్తి, త్రీమెన్ కమిటీ సభ్యులు నాగరాజు, శరత్బాబు, రామకృష్ణ పరమహంస, చిన్నారులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న 111 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి పి.శామ్యూల్ పర్యవేక్షణలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలనాధికారి ఎన్. నిర్మల భారతి, సీహెచ్ శ్రీనివాసరావు, జె.శోభారాణి, రాజారత్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.20 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 7,033, ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 7,483 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
మాజీ ఎమ్మెల్యే బొల్లా అరెస్టు అన్యాయం
బొల్లా అరెస్టు అక్రమం బాధితులను నిందితులుగా చిత్రీకరిస్తున్నారు పిడుగురాళ్ల రూరల్: బాధితులనే నిందితులుగా చిత్రీకరించి చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఐటీ వింగ్ రీజనల్ కో ఆర్డినేటర్ పాలూరి అంజిరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో భూమి కొనుగోలు వ్యవహారానికి సంబంధించి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు. ఈ వ్యవహారంలో బ్రహ్మనాయుడికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బొల్లా రమేష్ రియల్ ఎస్టేట్ దళారుల మాటలు నమ్మి భూమి కొనుగోలు కోసం కేవలం అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నారని తెలిపారు. ఆ అగ్రిమెంట్ కూడా పూర్తిగా బొల్లా రమేష్ పేరుమీదనే ఉందని, ఎక్కడా బొల్లా బ్రహ్మనాయుడు పేరు లేదని ఆయన స్పష్టం చేశారు. భూములకు సంబంధించి అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారణ తర్వాతే కొనుగోలు చేయాలని రమేష్ నిర్ణయించుకున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులతో వెరిఫికేషన్ చేయించగా సంబంధించి జీవోలు అధికారులు గుర్తించినట్లు తెలిపారు. భూమి యజమానులుగా చెప్పుకొన్న వ్యక్తులు, దళారులపై తాము కేసులు నమోదు చేశామన్నారు. మోసాలను బయట పెట్టిన బొల్లా రమేష్ను నిందితుడిగా చిత్రీకరించటం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. డబ్బు సహాయం చేసిన బొల్లా బ్రహ్మనాయుడును కూడా దీనిలోకి లాగటం రాజకీయ కక్ష సాధింపేనని తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు బ్రహ్మనాయుడు పేరుతో కథనాలను ప్రచురించడం తగదన్నారు. -
హద్దులు మీరితే సమాధానం చెప్తాం
ఎస్సీలమని చెప్పుకుంటూ హద్దులు మీరితే ఉపేక్షించం. తగిన రీతిలో సమాధానం చెప్తాం. నేను నా స్కూటీ మీద మోహనరావును తీసుకెళితే అక్కడ దాడి చేశారు. మరో బండి మీద నా కుమారుడు వచ్చాడు. మోహన్రావును హతమార్చాలని చూశారు. నేను, నా కుమారుడు మోహనరావును తీసుకుని ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చాం. కులాలకు, మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారి కోసం అలుపెరగని ఉద్యమాలు చేసిన మోహనరావుపై దాడిని క్షమించం. – విజయ్సుందర్, సామాజిక కార్యకర్త ● -
ట్రాఫిక్ విధులు సమర్థంగా నిర్వహించాలి
●జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ●ట్రాఫిక్ పోలీసులకు ప్రత్యేక కిట్లు పంపిణీ బాపట్లటౌన్: ట్రాఫిక్ విధులు సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలోని ట్రాఫిక్ పోలీసులతో శనివారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత ట్రాఫిక్ సిబ్బందికి ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వారికి ప్రత్యేక కిట్లు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ సిబ్బంది కీలకమన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే 20 శాతం తగ్గింపే లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదం వల్ల సంభవించే ప్రతి ఒక్క మరణం ఆ వ్యక్తితో ముగిసిపోదు, ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందన్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక టోపీ, కళ్లకు కూలింగ్ గ్లాసెస్, ధూళి నుంచి రక్షణకు మాస్కులు, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశామన్నారు. సామాన్య ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ సిబ్బంది ఎండను, ధూళిని లెక్కచేయకుండా విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ కిట్ ట్రాఫిక్ సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా ‘శిరో రక్ష – ప్రాణ రక్ష‘ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజూ విధుల్లో ఉండే ట్రాఫిక్ సిబ్బంది ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ సీహెచ్.చంద్రమౌళి, ఎస్బీ–2 ఇన్స్పెక్టర్న ఎం.రాంబాబు, బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ ఆర్.రాంబాబు, ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ బాలనాగిరెడ్డి, అడ్మిన్ ఆర్ఐ షేక్.మౌలుద్దీన్ పాల్గొన్నారు. -
భవిష్యత్తు తరాలకు మంచి నేల అందించాలి
బాపట్ల టౌన్: భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన నేల అందించాల్సిన బాధ్యత ప్రతి వ్యవసాయ విద్యార్థిపై ఉందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.వి. సత్యనారాయణ తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాల బి.వి.నాథ్ ఆడిటోరియంలో శనివారం ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా విచక్షణరహితంగా ఎరువులను, పురుగుమందులను వాడటం వలన నేలసారం గణనీయంగా తగ్గిందన్నారు. ఈ పరిస్థితిని నివారించకపోతే భవిష్యత్ తరాలకు సారవంతమైన నేలను అందించడం సాధ్యం కాదన్నారు. భారతీయ నేలలు ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని పేర్కొన్నారు. ఇది నేల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు. మట్టిలో పోషక విలువలు తగ్గిపోవటం ఆందోళన కలిగించే విషయమన్నారు. యాభై ఏళ్ల క్రితం ఎటువంటి రసాయనాలను వినియోగించకుండానే ఆరోగ్యవంతమైన చక్కని దిగుబడులు పొందామని, నేడు ఎరువులు, పురుగుమందులను తప్పనిసరిగా వాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ప్రమాదం నుండి బయటపడేందుకు కృషి చేయాలని, సాగు భూమిని పరిరక్షించుకోవాలన్నారు. అందుకు జీవ ఎరువులను, సేంద్రియ పోషక పదార్థాలను వాడాలన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు వ్యవహరించాలని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, నేల కోతను నివారిస్తూ పర్యావరణ పరిరక్షణ పట్ల జాగ్రత్తలు పాటిస్తే సుస్థిర వ్యవసాయం సాధ్యపడుతుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో తమ విద్యను సద్వినియోగం చేయాలని తెలిపారు. రైతుల చెంతకు స్వయంగా వెళ్లి, వారికి అవగాహన కల్పించాలన్నారు. సమీకృత పోషకాహార నిర్వహణ, సాయిల్ హెల్త్ కార్డులను ఉపయోగించుకునే విధానం, నేలను సారవంతం చేసే పంట వైవిధ్యం గురించి వివరించాలన్నారు. అనంతరం బాపట్ల వ్యవసాయ కళాశాల నుంచి పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్ వరకు వ్యవసాయ కళాశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా. సి.హెచ్.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డా. మణి, ఎన్టీఆర్ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ అసోసియేట్ డీన్ ఇన్చార్జి డా. జి.రవి బాబు, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డా.ఎం.సర్దార్ బేగ్, డా. కె.ఎస్.ఆర్.పాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఆహార భద్రతపై అవగాహన అవసరం
గుంటూరు లీగల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి, నాలుగో అదనపు సివిల్ జడ్జి(సీనియర్ డివిజన్) సి.రమణా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను నివారించటతోపాటు మనం తినే ఆహారం కలుషితం కాకుండా సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఆహారం విషయంలో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి.ఆర్. రాజీవ్ మాట్లాడుతూ ఆహారపు అలవాట్ల వలన జీవితంలో మార్పులు వివరించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆవరణలో ఫుడ్ స్టాల్ను ప్రారంభించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బి.నరసింహుడు, గవర్నమెంట్ ప్లీడర్ ఎం.సురేష్ బాబు, సి.డబ్ల్యూ.సి. శాఖ శ్రీవాణి, డిస్ట్రిక్ట్ సప్లయి ఆఫీసర్ కోమలి పద్మ పాల్గొన్నారు. -
ఫిజియోస్ క్రికెట్ లీగ్–2026 విజేత ‘హంగ్రీ చీతాస్’
గుంటూరు మెడికల్: ఆంధ్ర ఫిజియోస్ స్పోర్ట్స్ క్లబ్ అమరావతి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు డాక్టర్స్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, ఎంఎస్కే క్రికెట్ గ్రౌండ్స్లలో నిర్వహించిన ‘ఫిజియోస్ క్రికెట్ లీగ్–2026’ టీ–20 క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. పది టీములు డే అండ్ నైట్ మ్యాచ్లో పాల్గొనగా హంగ్రీ చీతాస్ గుంటూరు టీం విన్నర్స్గా నిలిచి రూ.లక్ష నగదు రోలింగ్ షీల్డ్, వైజాగ్ మార్వెల్ ఫిజియో క్రికెట్ క్లబ్ రన్నర్స్గా రన్నర్స్ షీల్డ్ రూ.50 వేల నగదు పారితోషికం అందుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ యార్లగడ్డ రవితేజ మాట్లాడుతూ క్రీడలు దేశభక్తి, జాతీయ సమైక్యత, విశాలమైన ఆలోచనలకు ప్రతిబింబంగా ఉండాలన్నారు. ఆంధ్ర ఫిజియోస్ క్లబ్ అమరావతి అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి.నాగ సతీష్ కుమార్, మహమ్మద్ ఇమ్రాన్ మాట్లాడుతూ టీ20 క్రికెట్ టోర్నమెంట్స్ విజయవంతం కావటంలో స్పోర్ట్స్ క్లబ్ కమిటీ కార్యవర్గ సభ్యులు, స్పాన్సర్స్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రిత్వేద లైఫ్ సైన్సెస్ సీఈఓ, విన్నర్స్ ప్రైస్ షీల్డ్ స్పాన్సర్ ముప్పరాజు వెంకట్రావు, తులసి సర్జికల్స్ అధినేత సంజీవ్ కుమార్, క్లబ్ గౌరవ సలహాదారు పొందూరి శివరాం ప్రసాద్, ఉపాధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ విజయ సాగర్ సంయుక్త కార్య దర్శులు డాక్టర్ బాజీ, డాక్టర్ నాగేంద్ర బాబు, సభ్యులు డాక్టర్ కిరణ్ డాక్టర్ ఉస్మాన్ షరీఫ్ పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
చీరాల రూరల్: పర్యావరణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అది అందరి బాధ్యతని సీనియర్ సివిల్ జడ్జి బి. బేబిరాణి అన్నారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కోర్టు భవన సముదాయంలో న్యాయమూర్తులు సీనియర్ సివిల్ జడ్జి బి.బేబిరాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.వెంకట వాహిని ముఖ్య అతిథులుగా పాల్గొని న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. న్యాయమూర్తులు మాట్లాడారు. పర్యావరణం పదికాలాల పాటు పదిలంగా ఉండాలన్నా మనుగడ సాగించాలన్నా ప్రతి ఒక్కరూ ఉద్యమంలా ఇంటికొక మొక్క చొప్పున నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. భవిష్యత్ తరాలకు మన మిచ్చే కానుక అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందుగా న్యాయమూర్తులు కోర్టు ప్రాంగణంలోని న్యాయదేవత విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు గౌరవ రమేష్బాబు, నాదెండ్ల రాజు, ఆసాది రామకృష్ణా రెడ్డి, మల్లారపు రామకృష్ణ, బిళ్లా ఆరోగ్యరావు, చిక్కాల రామారావు, మహిళా న్యాయవాదులు స్నేహ, జాస్మిన్, పిఎల్సి కృష్ణ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్ఆర్అండ్పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు. హైస్కూలు ఆవరణలో వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కలు నాటారు. క్రీడాకారులకు, వాకర్స్కు, విద్యార్థులకు మంచి వాతావరణంతో పాటు చెట్లు చల్లని నీడనిస్తాయని వారు పేర్కొన్నారు. చారుగుళ్ల గురుప్రసాద్, దోగుపర్తి సురేష్, కొత్తమాసు శ్రీనివాసరావు, రమేష్, ఉమా మహేశ్వరరావు, డి.నారాయణ, శివాంజనేయప్రసాద్, ఎంఎస్. సుబ్బారావు, ఎం. సత్యనారాయణ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ యువత బాధ్యత బాపట్ల: అనూహ్యమైన వాతావరణ మార్పుల వలన పర్యావరణం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని, దానిని పరిరక్షించుకోకపోతే మానవాళి మనుగడకే ముప్పు సంభవిస్తుందని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఇన్చార్జి డాక్టర్ కె.చంద్రశేఖర్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు కళాశాలలో పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మనకు రక్షక కవచంగా నిలిచే ప్రకృతిని కాపాడుకునేందుకు వ్యక్తిగత, సామాజిక స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. మొక్కలు పెంపకం, పరిశుభ్రత, వాతావరణ కాలుష్యాన్ని నిరోధించేందుకు దోహదపడతాయని, అందువలన భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరముందన్నారు. వ్యర్థాల రీసైక్లింగ్ వంటి సామాజిక కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించడం ద్వారా అందమైన ఆరోగ్యవంతమైన పర్యావరణాన్ని సృష్టించుకోవచ్చని తెలిపారు. డాక్టర్ యం.శ్రీరేఖ, డాక్టర్ పార్ధసారధి పర్యావరణ పరిరక్షణకు యువత చేపట్టాల్సిన బాధ్యతలను వివరించారు. బాల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాల్ సంస్థ కళాశాలకు నాలుగు పొడి చెత్త డస్ట్ బిన్లను అందించింది. బాలుర వసతి గృహాలను శుభ్రపరిచారు. పర్యావరణ అంశంపై విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. -
ఎంఎస్ఎంఈ పార్కుపై వివాదం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల గ్రామం గోవాడలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీబాలకోటేశ్వరస్వామి దేవస్థానంలో ఏటా మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే డొంక రోడ్డు ప్రదేశంలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం మరోసారి చర్చకు వచ్చింది. ప్రజావ్యతిరేకత, విజిలెన్స్కు ఫిర్యాదుతో నిర్మాణ పనులు నిలిచిపోయిన నేపథ్యంలో శుక్రవారం గోవాడ ఆలయానికి వచ్చిన బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఈ అంశాన్ని ప్రస్తావించటం వివాదానికి దారితీసింది. మండల కేంద్రం అమృతలూరులోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మండల స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జిల్లా కలెక్టర్ వినోద్కుమార్, రేపల్లె ఆర్డీవో శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం గోవాడ ఆలయానికి సంబంధించి మహాశివరాత్రి తిరునాళ్ల జరిగే డొంక ప్రదేశానికి జిల్లా కలెక్టరు చేరుకున్నారు. గ్రామ సర్పంచ్ భర్త మండవ రమేష్, ఇతర గ్రామస్తులు అక్కడకు వచ్చారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణాన్ని మొత్తం డొంక ప్రదేశంలో కాకుండా మూడు ఎకరాల్లో నిర్మిస్తే ఏమైనా అభ్యంతరం ఉందా అని ప్రశ్నించారు. గ్రామస్తుల్లో కలకలం రేగింది. తిరునాళ్ల ప్రదేశంలో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం తగదని చెప్పాం కదా... పంచాయతీలో తీర్మానం ఏంటని సర్పంచ్ భర్తను ప్రశ్నించారు. అదే తీర్మానాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. ఇప్పుడు ప్రతిపాదన ఏంటన్నారు. క్షమాపణ చెప్పాల్సిందే... గ్రామ రైతు వేమూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ తన పొలం ఎదుట మూడు ఎకరాల డొంకలో పార్కు నిర్మాణానికి ససేమిరా అన్నారు. పంటల నూర్పిడికి తనకు అవకాశం ఉండదన్నారు. ఈ వాగ్వాదంలో ఇద్దరు ఆ రైతును పక్కకు తోశారు. అక్కణ్నుంచి జిల్లా కలెక్టర్ దేవాలయానికి వెళ్లి, అక్కడ స్థానికులతో మాట్లాడుతుండగా చంద్రశేఖర్ అక్కడకు వెళ్లి గుడి ముందు ధర్నా చేశారు. తనను నెట్టినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతసేపు వాదప్రతివాదనల అనంతరం అతడికి క్షమాపణ చెప్పటంతో వివాదం ముగిసింది. డొంకరోడ్డులో పార్కు నిర్మాణానికి నిబంధనలు అంగీకరించవని తెలిసినా, అధికారులు బంజరు భూమిగా చూపి, నిర్మాణానికి పూనుకోవటం తెలిసిందే. దీనిపై తెనాలి, అమృతలూరు మండలాలకు చెందిన వారు విజిలెన్స్కు ఫిర్యాదు చేశారు. కోర్టులో కూడా పిటిషను దాఖలు చేశారు. దీనితో నిర్మాణ పనులు ఆపేసి, సామగ్రిని కూడా సదరు కాంట్రాక్టు సంస్థ తీసుకెళ్లిపోయింది. కలెక్టర్ వ్యాఖ్యలతో మళ్లీ చర్చనీయాంశమైంది. -
ప్రణాళికాబద్ధ్దంగా నేరాలను నియంత్రించాలి
ఎస్పీ బి.ఉమామహేశ్వర్బాపట్లటౌన్: ప్రణాళికాబద్ధంగా నేరాలను నియంత్రించాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. శుక్రవారం బాపట్ల డీఎస్పీ కార్యాలయాన్ని ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ప్రాంతాలవారీగా జరుగుతున్న నేరాల సరళిని, వాటిని పూర్తిగా కట్టడి చేయడానికి తీసుకుంటున్న ముందస్తు చర్యల గురించి ఆరాతీశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని, రాత్రి సమయాల్లో గస్తీ మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. శిరోరక్ష ప్రాణ రక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వాడకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. హెల్మెట్ ధరించడం వలన కలిగే ఉపయోగాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. పోలీసులు చలానాలు విధిస్తారనే భయంతో కాకుండా, స్వతహాగా వారే బాధ్యతతో హెల్మెట్ ధరించే విధంగా ప్రజల్లో మార్పు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ సీహెచ్.చంద్రమౌళి, బాపట్ల పట్టణ సీఐ రాంబాబు, రూరల్ సీఐ ప్రభాకర్ ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అలల ధాటికి ఒకరు మృతి
చీరాల: తీరంలో విషాదం నెలకొంది. గుంటూరు నుంచి 30 మంది రామాపురం సముద్రతీరానికి శుక్రవారం వచ్చారు. కిషోర్, భరత్ ఇద్దరు అలల తాకిడికి కొట్టుకుపోగా గమనించిన అడ్వైంచర్ స్పోర్ట్స్ సిబ్బంది భరత్ను బయటకు తీసుకువచ్చారు. అలానే కిషోర్ను గాలించి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ప్రాణాపాయంతో ఉన్న అతడిని చికిత్స నిమిత్తం చీరాల హాస్పిటల్కు తీసుకువెళ్లేలోపే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఈపూరుపాలెం ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. -
ప్రకృతితో కలసి జీవించాలి
గుంటూరు లీగల్: భూమీద అన్ని జీవ రాశులతో కలిసి జీవించే విధంగా మానవాళి మనుగడ ఉండాలని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్ సికిందర్బాషా అన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలని తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సమన్యయంతో ఫ్యామిలీ కోర్టు జడ్జి, ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. నాల్గవ అదనపు సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) గుంటూరు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్చార్జి సెక్రటరీ సి.రమణారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై పిల్లలకు అవగాహన పెంచాలన్నారు. ముందు తరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ పి.ఆర్.రాజీవ్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇన్చార్జి పీపీ ఎం.సురేష్బాబు, ప్యానల్ అడ్వకేట్ కట్టా కాళిదాస్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఇంటికొక చెట్టు పెంచితే పర్యావరణ కాలుషాన్ని తగ్గించవచని అన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్స్ స్టాఫ్, ప్యానెల్ అడ్వకేట్స్, పారా లీగల్ వాలంటీర్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ప్రభుత్వ న్యాయవాది ఎం.సురేష్బాబు, మొహమద్ నజీనా బేగం పాల్గొన్నారు. లీగల్ వాలంటీర్లు, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్, ఏ.పి.పొల్యూషన్ బోర్డు, ఉద్యోగులు కోర్ట్ ప్రాగణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. నగరంపాలెం: విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలనతో ప్రజలకు ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ గ్రీవెన్న్స్ డే నిర్వహించారు. జిల్లాలోని పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, సర్వీస్, బదిలీలు, ఉద్యోగోన్నతులు, సెలవులపై వినతులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు అందించారు. జిల్లా ఎస్పీ ప్రతి వినతిపత్రాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రీవెన్స్కి సంబంధించి అర్జీలను పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఖాళీలు, పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ఒక కుటుంబమని, పరస్పర గౌరవం, సహకారంతో విధులు నిర్వర్తించాలని అన్నారు. పోలీస్ సంక్షేమానికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. పాఠశాలలను నెట్ జీరోలుగా తీర్చిదిద్దాలి నరసరావుపేట రూరల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో, శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పెద్దతురకపాలెంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో సంజనా సింహ మాట్లాడుతూ నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్దీకరించుకోవాలన్నారు. హరిత ఇంధన వినియోగ పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. -
మద్యంలో ముంచేస్తారా?
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బీచ్ షాక్స్ అంటే.. చిన్నపాటి కుటీరాలు ఏర్పాటు చేసి వాటిల్లో మద్యం, బీరు, ఇతర మత్తు పానీయాలు, ఆహార పదార్థాలు విక్రయిస్తారు. ఈ లెక్కన బీచ్లలో కుటీరాలను మద్యం షాపులుగా, బార్లుగా మార్చనున్నారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహకం ముసుగులో మద్యం విక్రయాలు పెంచుకునేందుకు ప్రయత్నిన్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు వీటిని నిర్వహించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ రాత్రంతా ఇవి కొనసాగేందుకే అవకాశాలు ఉన్నాయి. యువత ప్రాణాలకు ముప్పు బీచ్లలో మద్యం, బీర్లు అమ్మకాలు సాగితే వాటిని తాగి పర్యాటకులు ముఖ్యంగా యువత సముద్ర జలాల్లోకి దిగే అవకాశముంది. మద్యం మత్తులో వారు సముద్రం లోతుల్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే ఏటా బాపట్ల సూర్యలంక, చీరాల ప్రాంతంలోని ఓడరేవు, రామాపురం బీచ్లలో మద్యం తాగి సముద్రంలోకి దిగి పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఇప్పటివరకూ సూర్యలంకతోపాటు చీరాల తీరప్రాంతంలోని బీచ్లలో మద్యం అమ్మకాలకు అనుమతులు లేవు. సూర్యలంక హరిత రిసార్ట్లో బార్ నడుపుతున్నా.. బయట మద్యం దుకాణాల కంటే ఇక్కడ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండవు. పైగా రిసార్ట్లో మద్యం తాగిన తరువాత వారిని బీచ్లోకి అనుమతించరు. ఇక్కడ ఆ మేరకు ఏర్పాట్లు ఉన్నాయి. కానీ అనధికారికంగా అన్ని బీచ్లలో మద్యంతోపాటు బీర్లు అమ్మకాలు సాగిస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక బయట నుంచి తెచ్చుకొని బీచ్లలో మద్యం తాగేవారు కోకొల్లలు. సూర్యలంకలో ‘బీచ్ షాక్స్’కు అధికారికంగా ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో బీచ్లలో మద్యం ఏరులై పారనుంది. సూర్యలంక బీచ్ పక్కనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగం ఉండటంతో ఇక్కడ రక్షణ పరంగానే కాక చేపలవేట లేక బీచ్ పరిశుభ్రంగా ఉంటుంది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా అటు తెలంగాణ నుంచి పర్యాటకులు కుటుంబాలతో వస్తున్నారు. ఇక్కడే వారాంతాలు గడిపి తిరిగి వెళుతున్నారు. బీచ్లో ఇప్పటివరకూ మద్యం అమ్మకాలు పెద్దగా లేకపోవడంతో పర్యాటలకుల తాకిడి పెరిగింది. ఇక నుంచి సూర్యలంక బీచ్లో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం సిద్ధమవడంతో పర్యాటకుల్లో ఆందోళన నెలకొంది. మద్యం విక్రయాలు జరిగితే బీచ్లో ప్రశాంత వాతావరణం పాడై అసాంఘిక కార్యకలాపాలు పెరగనున్నాయి. దీంతో బీచ్లో అలజడులు పెట్రేగుతాయి. ప్రమాద మరణాలు పెరిగే అవకాశముంది. అందుబాటులో గోవా మద్యం ఇప్పటికే బాపట్ల సూర్యలంకతోపాటు చీరాల ప్రాంతంలోని రిసార్ట్లలో రకరకాల మద్యం అందుబాటులో ఉంది. ప్రధానంగా కొందరు అక్రమ వ్యాపారులు గోవా నుంచి మద్యం తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రిసార్ట్లలో మద్యం విక్రయాలతోపాటు పేకాట ఇతర జూదం పెద్ద ఎత్తున సాగుతున్నట్లు సమాచారం. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి చాలా మంది చీరాల, బాపట్ల రిసార్ట్లకు వచ్చి పేకాట ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో మద్యం తాగడానికి, జూదం ఆడడానికి రిసార్ట్లు మేలని జూదరులు, మద్యం ప్రియులు భావిస్తున్నారు. రిసార్ట్లు కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు కూడా పెరిగినట్లు ఆరోపణలున్నాయి. పోలీసు లేదా రెవెన్యూ ఇతర ఉన్నతాధికారులు బీచ్లు సందర్శించినప్పుడు వారి కోసం రిసార్ట్ల యజమానులను రూములు అడగాల్సి వస్తుండడంతో.. రిసార్ట్లలో తనిఖీలకు వెళ్లే పరిస్థితి లేదని ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. రెవెన్యూ అధికారులదీ ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు. తనిఖీలు ఉండవన్న ధైర్యంతోనే కొన్ని రిసార్ట్లలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. ఇటీవల చీరాల బీచ్లలో రేవ్ పార్టీల జోరు పెరిగింది. పలు రిసార్ట్లు గుట్టు చప్పుడు కాకుండా ఈ పార్టీలు నిర్వహిస్తున్నాయి. కొందరు సినిమా నటీమణులు, టీవీ సీరియళ్ల యాక్టర్లను సైతం పిలిపించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల రామాపురం బీచ్లో మద్యం అమ్మకాల సందర్భంగా హైదరాబాద్ నుంచి వచ్చిన పర్యాటకులపై స్థానిక మద్యం విక్రయదారులు దాడులు చేసి కొట్టారు. రామాపురం మొదలు పొట్టిసుబ్బయ్యపాలెం వరకూ బీచ్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఎటువంటి చర్యలు ఉండడం లేదు. మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు బీచ్లను వదలని చంద్రబాబు సర్కార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రశాంతంగా ఉండే సూర్యలంక బీచ్లో ఇక నుంచి అలల అలజడి కంటే మద్యం సీసాల గలల పెరగనుంది. సూర్యలంక బీచ్లో ‘బీచ్ షాక్స్’కు గురువారం రాష్ట్ర మంత్రి మండలి ఓకే చెప్పడం పర్యాటకుల్లో ఆందోళన రేపుతోంది. పర్యాటకుల ప్రాణాలు, వారి ఆహ్లాదం, భద్రత కంటే ఆదాయంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. సూర్యలంక బీచ్లో బీచ్ షాక్స్కు మంత్రి మండలి ఆమోదం తెలపడంతో బీచ్లో మద్యం అమ్మకాల కోసం నియోజకవర్గంలోని పచ్చ నేతలు ఎగబడుతున్నట్లు సమాచారం. మద్యం అమ్మకాల హక్కుల కోసం కొందరు నేతలు శుక్రవారం నియోజకవర్గ ముఖ్య నేత ఇంటి వద్ద క్యూ కట్టినట్లు తెలిసింది. అయితే ఇప్పటికే మద్యం సిండికేట్ నిర్వహిస్తున్న పచ్చ నేత... బీచ్లో మద్యం అమ్మకాల వ్యవహారాన్ని మద్యం సిండికేట్కు అప్పగించడమా? ఆదాయం వస్తుందనుకుంటే.. తామే మనుషులను పెట్టి సొంతంగా నిర్వహించడమా? అనే దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. -
గంజాయి విక్రయిస్తున్న యువకుల అరెస్ట్
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణ పరిధిలో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు యువకులను మంగళగిరి పట్టణ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి సుమారు 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, మంగళగిరి పట్టణానికి చెందిన వీరాంజనేయులు ఇద్దరూ స్నేహితులు. ఇరువురూ చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో బీహార్ నుంచి వచ్చే వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా గంజాయి సేవించేవారికి అమ్మేవారు. ముందస్తు సమాచారం మేరకు పట్టణ సీఐ వీరాస్వామి సిబ్బందితో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న కవర్లను తనిఖీ చేయగా గంజాయి ఆకులు, పూలు, కాయలు ఉన్నట్లు గుర్తించారు. గంజాయిగా నిర్ధారించి లక్ష్మీనారాయణ, వీరాంజనేయులులను పట్టణ పోలీస్స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి శుక్రవారం కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ద్వారా శాంపిల్ను గంజాయి కెమికల్ పరీక్ష నిమిత్తం మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ పంపుతారని కోర్టు వారు తెలియపర్చినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను రిమాండ్కు పంపినట్లు పేర్కొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలి
వ్యవసాయశాఖ జిల్లా అధికారి లక్ష్మి బాపట్ల: కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎ.లక్ష్మి పేర్కొన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానం పరిధిలో రైతులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే వరి రకాలను సాగు చేయడం ద్వారా ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ పంటల అనువైన రకాలను ఎంపిక చేసుకొని విత్తన శుద్ధి, సమతుల్య ఎరువుల యాజమాన్యం అనుసరించాలని సూచించారు. ప్రధానశాస్త్రవేత్త డాక్టర్ బి.కృష్ణవేణి మాట్లాడుతూ నేల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. రైతు విత్తన ఉత్పత్తి దారులు సంఘాలుగా ఏర్పడి సామజిక మాధ్యమాలను ఉపయోగించుకొని వారు ఉత్పత్తి చేసిన వరి విత్తనాలను అవసరం ఉన్న రైతులకు సరఫరా చేయాలని కోరారు. సమావేశంలో డాక్టర్ టి.కిరణ్కుమార్, డాక్టర్ కె.అచ్యుతరాజు, టి.హరిత, ఏడుకొండలు, వీరప్రసాద్ ఉన్నారు. -
ఎన్జీరంగా వర్శిటీలో ఖేత్ బచావో అభియాన్
గుంటూరురూరల్: సమతుల్య ఎరువుల వినియోగం ద్వారా నేల ఆరోగ్యం పరిరక్షించబడటమే కాకుండా పంటల నాణ్యత, దిగుబడులు, రైతుల ఆదాయం పెరుగుతుందని విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.రామచంద్రరావు అన్నారు. నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం విశ్వవిద్యాలయం, వ్యవసాయ సాంకేతికత అనువర్తన పరిశోధనా సంస్థ (అటారీ) జోన్–పది సంయుక్తంగా ఖేత్ బచావో అభియాన్ (పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం) నిర్వహించారు. ఎరువుల సమతుల్య వినియోగంపై అవగాహన సదస్సును విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.రామచంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతులకు నేల పరీక్షలు, పోషక నిర్వహణ పద్ధతులు, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. రైతులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని నేల ఆరోగ్య కార్డుల ఆధారంగా ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులు కోరారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ వి.సుమతి మాట్లాడుతూ ఒక్క అంగుళం నేల ఏర్పడటానికి 500 సంవత్సరాలు సమయం పడుతుంటే, మనం విచక్షణ రహితంతంగా రసాయనాలు వాడటం వలన 5 నిముషాలలో దీనిని నాశనం చేస్తున్నామన్నారు. దీనిని మానుకొని భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడకోవాలని సూచించారు. లాం పరిశోధన స్థానం మృత్తికాశాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శైలజ విన్నకోట, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము పంటలు తొలకరిలో వేసుకొని భూమిలో కలియ దున్నడం ద్వారా నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి, నేల నీటి నిల్వ సామర్థ్యం సూక్ష్మజీవుల కార్యకలాపాలు మెరుగుపడతాయన్నారు. రసాయన ఎరువుల అవసరం కొంత మేర తగ్గి, సాగు వ్యయాలు కూడా నియంత్రణలో ఉంటాయని తెలిపారు. యడ్లపాడుకు చెందిన ప్రగతిశీల రైతు శివరామకృష్ణ మాట్లాడుతూ ఎరువుల వాడకంలో సమన్వయం పాటించి సమతుల్యతను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో అటారీ జోన్–పది శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రసాద్, డాక్టర్ భాస్కరన్, ఏడీఆర్ డాక్టర్ ఎన్.వి.వి.ఎస్.దుర్గాప్రసాద్, బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై నివేదిక ఇవ్వాలి
బాపట్ల: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లాలో అధికారులు నిర్వహిస్తున్న పనులను నివేదికల ద్వారా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్కుమార్ పరిశీలించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వీక్ష సమావేశం మందిరం నుంచి ఓటర్ల జాబితా సవరణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో చీరాల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో చివరి స్థానంలో ఉన్నదని అన్నారు. ప్రతి బీఎల్ఓ రోజుకు 15 మందిని మ్యాపింగ్ చేసేందుకు లక్ష్యాలను నిర్దేశించినప్పటికీ వాటిని పూర్తి చేయడంలో వెనుకబడి ఉన్నారని అన్నారు. ఎనామలిస్ ఎస్ఐఆర్తోపాటు ఎన్యుమరేషన్ కూడా చేయాలన్నారు. రేపల్లెలో ఎనామలిస్ పెరుగుతున్నాయని, వాటికి గల కారణాలపై ఆయన ఆర్డీఓను ఆరా తీశారు. జిల్లాలో గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు 10943 చేయగా, అందులో నిజాంపట్నం 1091 ఎక్కువగా చేశారని, కారంచేడు 34 మాత్రమే చేశారని అందుకు కారణాలపై ఆయన సంబంధిత అధికారులను ఆరా తీశారు. కొన్ని మండలాలలో చాలామంది ఒక్కటి కూడా చేయలేదన్నారు. 2002లో ఓటు హక్కు లేకుండా ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు కోసం వచ్చిన వారి దరఖాస్తుల వివరాలను అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బీఎల్ఓ లను మార్చకూడదని చెప్పినప్పటికీ బాపట్ల మున్సిపల్ కమిషనర్ బీఎల్ఓలను మార్చారని, కారణాలపై బాపట్ల మున్సిపల్ కమిషనర్ను వివరణ కోరారు. వారిపై క్రమశిక్షణ చర్యలకు ఈ ఫైల్ పెట్టాలన్నారు. వేటపాలెంలోని పోలింగ్ స్టేషన్ నెం.174 బీఎల్ఓ సత్తెనపల్లి పద్మ ఒక్క రోజులో 318 మందిని మ్యాపింగ్ చేశారని, ఇది ఏ విధంగా సాధ్యమైందో వివరణ కోరుతూ షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండల తహసీల్దార్లు అటవీ భూమి, మడ అడవులు, జంగిల్ భూమి వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో చీరాల ఇన్చార్జి ఆర్డీఓ లవన్న, చీరాల తహసీల్దార్ గోపికృష్ణ, వీక్షణ సమావేశం ద్వారా రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి, అన్ని మండలాల తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, వీఆర్వోలు, ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు, బీఎల్వోలు పాల్గొన్నారు. ప్లాస్టిక్ను నివారిద్దాం పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ నివారిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్( సిఫార్డ్), మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రికలను, గుడ్డ సంచులను శుక్రవారం ఆవిష్కరించారు. –జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
సహాయకులకు సమస్యలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో గర్భిణులు, బాలింతల కోసం వచ్చిన సహాయకులకు కనీస వసతులు లేకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు. జీజీహెచ్లో గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు రూ. 100 కోట్లు విరాళంగా అందించడంతో కానూరి రామచంద్రరావు జింకానా మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మించారు. ప్రభుత్వం రూ. 26 కోట్ల వైద్య పరికరాలు అందజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది జనవరిలో ఎంసీహెచ్ భవనం ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఐదంతస్తుల భవనంలో 600 పడకలతో మాతా శిశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వైద్య సేవలు కార్పొరేట్ ఆసుపత్రులకు మించి ఉన్నప్పటికీ రోగుల సహాయకులకు కనీస సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది. జీజీహెచ్కు పలు జిల్లాలకు చెందిన గర్భిణులు కాన్పు కోసం వస్తున్నారు. ప్రసవం అనంతరం అత్యవసర చికిత్సల కోసం పలు జిల్లాలకు చెందిన చిన్నారులను జీజీహెచ్కు తీసుకొస్తున్నారు. భవనం మెట్లపైనే ద్వారాల వద్ద రోగుల సహాయకులు రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. వానాకాలం వస్తే మరిన్ని కష్టాలు గుంటూరు జీజీహెచ్లో కాన్పుల కోసం వచ్చే గర్భిణులు, బాలింతల కోసం, చిన్నారుల చికిత్స కోసం వచ్చే రోగుల సహాయకుల సంఖ్య అధికంగానే ఉంటుంది. కాన్పు సమయంలో ఆందోళన, అత్యవసర చికిత్సకు కావాల్సిన మందులు, ఇతర వస్తువులు తెచ్చుకునేందుకు గర్భిణికి ఇరువురు సహాయకులు తప్పనిసరి. అలాంటి వారికి ఎంసీహెచ్ భవనం లోపల వేచి ఉండేలా ప్రత్యేక వసతి కల్పించాల్సి ఉంది. ఒకపక్క ఎండలు మండుతున్నా సహాయకులు పగడిగాపులు కాస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే మరింత ఇక్కట్లు తప్పవు. ఎంసీహెచ్ భవనంలో సౌకర్యాలు కల్పించలేని పక్షంలో ఎదుట ఖాళీగా ఉన్న స్థలంలో వసతి ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉండి, వైద్యులు పిలిచినప్పుడు లోపలకు వస్తుంటారు. రూ. 100 కోట్లకుపైగా దాతలు విరాళాలు అందజేసినప్పటికీ గతంలో పాత కాన్పుల విభాగంలో మాదిరిగానే నేటికీ సహాయకులకు వేచి ఉండే గదులు లేక అవస్థలు పడుతున్నారు. సిబ్బంది కొరతతో కష్టాలు నూతన ఎంసీహెచ్ భవనంలో విశాల గదులు ఉన్నప్పటికీ వాటి నిర్వహణకు తగిన సిబ్బంది లేరు. ప్రభుత్వం వైద్య పరికరాలకు రూ. 26 కోట్లు మంజూరు చేసింది. సరిపడా నర్సింగ్ సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగుల నియామకాలు చేపట్టలేదు. గత ప్రభుత్వం నాట్కో క్యాన్సర్ సెంటర్ను నాట్కో ట్రస్టు వారు నిర్వహిస్తే, అందులో నర్సింగ్ సిబ్బంది, వైద్య సిబ్బంది, కింది స్థాయి ఉద్యోగులను 110 మందికిపైగా ప్రత్యేక రిక్రూట్మెంట్ చేసి భర్తీ చేసింది. తద్వారా నాట్కో క్యాన్సర్ సెంటర్లో నేడు అంతర్జాతీయ వైద్య సేవలు లభిస్తున్నాయి. ఎంసీహెచ్ భవనంలో అదే స్థాయిలో వైద్య సేవలు అందాలంటే ప్రత్యేక రిక్రూట్మెంట్ ప్రభుత్వం తక్షణమే చేపట్టాల్సి ఉంటుంది. సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది ప్రత్యేక నియామకాలు చేపట్టకపోతే భవన నిర్వహణ దెబ్బతినే ప్రమాదం ఉంది. డాక్టర్ పొదిల ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ భవనంలో అలాంటి ప్రత్యేక రిక్రూట్మెంట్ లేకపోవడం వల్లే నిర్వహణ సామర్థ్యం సక్రమంగా లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని జింకానా వారు కొన్నేళ్లపాటు భవన నిర్వహణ పనులకు ముందుకు వచ్చారు. వారికి తోడ్పాటుగా ప్రభుత్వం ప్రత్యేక రిక్రూట్మెంట్ చేపట్టి ప్రత్యేక వైద్య సిబ్బంది, వైద్యులను నియమించాల్సి ఉంది. గతంలో గైనిక్, పీడియాట్రిక్స్ విభాగాల్లో 100 నుంచి 200 వరకు మాత్రమే పడకలు ఉండేవి. నూతన ఎంసీహెచ్ భవనంలో 600 పడకలు వచ్చాయి. అదనంగా వచ్చిన పడకల్లో వైద్య సేవలు అందాలంటే ప్రభుత్వం తక్షణమే రిక్రూట్మెంట్ చేపట్టాల్సి ఉంది. -
అంతర్జాతీయ చెస్ టోర్నీని పరిశీలించిన శాప్ చైర్మన్
తాడికొండ: వీఐటీ ఏపీలో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ను గురువారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) గౌరవ చైర్మన్ అనిమిని రవి నాయుడు సందర్శించారు. అమరావతి అంతర్జాతీయ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ నాలుగో రోజు సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ను పరిశీలించిన ఆయన వీఐటీ– ఏపీ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి అరుళ్మొళివర్మన్తో కలిసి చెస్ ఆడి క్రీడాకారులకు పలు సూచనలిచ్చారు. శాప్ డైరెక్టర్ ఎస్.సంతోష్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీశ్ చంద్ర ముదిగంటి, విద్యార్థి సంక్షేమ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖదీర్ పాషా, ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కె.వి.వి.శర్మ, అధ్యక్షుడు డాక్టర్ సురేష్, కార్యదర్శి జగదీశ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎగ్ కార్ట్ యూనిట్ల అభివృద్ధికి శిక్షణ
మెప్మా జిల్లా పీడీ విజయలక్ష్మి లక్ష్మీపురం: మెప్మా జీవనోపాధి ప్రోత్సాహక కార్యక్రమాల కింద, ఎన్ఈసీసీ (నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ) సహకారంతో పట్టణ ఎస్హెచ్జీ మహిళా లబ్ధిదారులకు ఎగ్ కార్ట్స్ ఉచితంగా అందజేస్తామని జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లా మెప్మా కార్యాలయంలో గురువారం ఎగ్ కార్ట్ యూనిట్ల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ఎగ్ కార్ట్ వ్యాపారం ప్రారంభించిన లబ్ధిదారుల వ్యాపార నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ, మార్కెటింగ్ వ్యూహాలు బలోపేతం చేయడం ఈ శిక్షణా కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. మెప్మా కార్యాలయ సిబ్బంది, ఎన్ఈసీసీ కో–ఆర్డినేటర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా పరిశీలన
జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ రేపల్లె: ఓటరు జాబితా తుది ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు జాబితా అత్యంత కీలకమని, ఇందులో ఏ చిన్న నిర్లక్ష్యం జరిగినా సంబంధిత అధికారులపై బాధ్యత ఉంటుందని హెచ్చరించారు. గురువారం రేపల్లె మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో పట్టణంలోని బూత్ లెవెల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా చూడాలని, అనర్హుల పేర్లను తొలగించడంలో నిర్లక్ష్యం చూపరాదని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి సమగ్రంగా పరిశీలన చేపట్టి కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పు వంటి ప్రక్రియలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడంతోపాటు పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్రతి బూత్ లెవెల్ అధికారి తన పరిధిలో పూర్తి బాధ్యతతో పనిచేయాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబెట్టేలా కృషి చేయాలని పేర్కొన్నారు. నిజాంపట్నం మండలంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీఎల్ఓ మేడికొండ భాగ్యరాజుపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం 33.25 శాతం మాత్రమే పరిశీలన పూర్తి చేసినట్లు గుర్తించినట్లు చెప్పారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓ ఇంటికి వెళ్లి పరిశీలించారు. సాయిబాబా ఆలయ సమీపంలోని సచివాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆర్డీవో భూసి శ్రీదేవి, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, మున్సిపల్ డీఈ మధుసూదనరావు, ఎన్నికల విభాగం అధికారులు, మున్సిపల్ సిబ్బంది, బూత్ లెవెల్ అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత బాపట్ల: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. 2006 జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీక్షణ సమావేశ మందిరంలో వాల్ పోస్టర్, బ్యానర్ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలందరూ మొక్కలు నాటి సంరక్షించడం, ఇంట్లో తడి, పొడి చెత్తగా వేరు చేసి సంబంధిత మున్సిపల్ సిబ్బందికి అందజేయడం, మురుగు నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నారాయణభట్టు, రెడ్ క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: సూర్యలంక, రామాపురం, ఓడరేవు బీచ్లలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని బీచ్లలో నిర్వహించాల్సిన అంశాలపై గురువారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని మినీ వీసీ హాల్ నుంచి ఇన్చార్జి పర్యాటక శాఖ అధికారి, బీచ్ సూపర్వైజర్లతో వీసీ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... బీచ్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. పర్యాటకుల భద్రత ముఖ్యమని చెప్పారు. గజ ఈతగాళ్లు, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. బీచ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఇన్చార్జి పర్యాటక అధికారి ఆనంద్ సత్యపాల్, గ్రామ / వార్డు సచివాలయాల జిల్లా కో ఆర్డినేటర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
చదివింది ఒకటి.. సర్టిఫికెట్ మరొకటి!
గుంటూరు మెడికల్: చదివింది జీఎన్ఎం నర్సింగ్ కోర్సు.. కానీ ఉద్యోగం పొందేందుకు బీఎస్సీ నర్సింగ్తో పనిచేసినట్లు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్లో 150 కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేసేందుకు గుంటూరు ప్రాంతీయ వైద్య, ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన సుమారు 7 వేల మందికిపైగా అభ్యర్థులు జీఎన్ఎం నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్ చదివిన వారు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను ఆర్డీ కార్యాలయం అధికారులు స్క్రూట్నీ చేసి మే 14 నుంచి 19వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు గడువు ఇచ్చి, ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారు. పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మే 29న విడుదల చేసి 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అభ్యంతరాలు వ్యక్తం చేయాలని అధికారులు ప్రకటన విడుదల చేయడమేంటని అన్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు సమయం సరిపోదని, మామూళ్లు ఇచ్చి నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన వారికి ఉద్యోగాలు వచ్చేలా ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఫైనల్ మెరిట్ జాబితాలో తొలి 500 మంది అభ్యర్థుల్లో 50 మంది వరకు నకిలీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టినట్లు ఆరోపిస్తున్నారు. ఆరోపణలకు ఆధారాలు ఇవే కరోనా సమయంలో ఉద్యోగాలు చేసేందుకు 2020 ఆగస్టులో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల చేశారు. అయితే ప్రస్తుతం పిడుగురాళ్ల జీజీహెచ్ నోటిఫికేషన్కు దరఖాస్తు చేసిన వారిలో పలువురు ఆగస్టుకు ముందే అంటే నోటిఫికేషన్ విడుదలకు ముందే ఉద్యోగాల్లో చేరి పనిచేసినట్లు 2020 ఏప్రిల్, మే నుంచి పనిచేస్తున్నట్లు సర్టిఫికెట్లు పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎస్సీ నర్సింగ్ చదివిన వారు ఎంఎల్హెచ్పీగా ఉద్యోగం చేస్తూ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టారు. ఎంఎల్హెచ్పీలను ప్రస్తుతం సీహెచ్ఓలుగా పిలుస్తున్నారు. అయితే జీఎన్ఎం కోర్సు చదివిన అభ్యర్థులకు ఎంఎల్హెచ్పీ విధులు నిర్వహించినట్లు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు జత చేసి, వారి పేర్లు సీనియార్టీ జాబితాలో ముందు వచ్చేలా చేయడం తగదని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. -
కాలువల మరమ్మతులకు రూ.42.19 కోట్లు
నరసరావుపేట: నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలోని కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026–27 ఏడాదిలో 578 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. కాలువ కట్టల బలోపేతం, పూడిక తీత, నీటి నియంత్రణ వ్యవస్థల మెరుగుదల, గేట్లు, షట్టర్ల మరమ్మతులు వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలో సుమారు 290 పనులను గుర్తించి ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. దీనిపై గురువారం సంబంధిత అధికారులతో సాగర్ ఎస్ఈ కృష్ణమోహన్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏపీ పీసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలకు సకాలంలో హాజరవ్వాలని రెక్టార్ ఆర్. శివరాంప్రసాద్ అన్నారు. ఏఎన్యూలో ఎనిమిది రోజులపాటు జరిగే ఏపీ పీసెట్ పరీక్షలకు రెండవ రోజు గురువారం 715 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 517 మంది హాజరయ్యారని ఏపీ పీసెట్ కన్వీనర్ ఆచార్య పాల్కుమార్ తెలిపారు. 5వ తేదీన హాల్టికెట్ నెంబరు 11431 నుంచి 12144 వరకూ మొత్తం 713 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మాచర్ల రూరల్: గృహ అవసరాల కోసం వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 48 సిలెండర్లను స్వాధీనపరుచుకున్న సంఘటన పట్టణంలోని శ్రీశైలం రోడ్డు, బ్రహ్మ బోర్వెల్స్లో చోటుచేసుకుంది. తహసీల్దార్ బి.కిరణ్కుమార్ నేతృత్వంలో గురువారం పట్టణంలోని పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు. శ్రీశైలం రోడ్డులోని బ్రహ్మ బోర్వెల్స్, కృష్ణ బలిజ కాలనీ, ఆర్చీ పక్కన గల షాపులలో తనిఖీ చేసి చిన్ని శ్రీనివాసరావు వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 48 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ నుంచి వివిధ పేర్లతో డెలివరీ తీసుకొని తన షాపులో నిల్వ ఉంచుకొని బ్లాకులో ఒక్కొక్కటి రూ. వేల చొప్పున విక్రయిస్త్తున్నట్లు ఆరోపణలు రావటంతో తహసీల్దార్ అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. శ్రీనివాసరావుపై 6 ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. దాడుల్లో సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ షేక్ బాషా, ఆర్ఐ అనిల్కుమార్, వీఆర్ఓ, వీఆర్ఏలు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 519.60 అడుగులకు చేరింది. ఇది మొత్తం 148.5482 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 7,033, ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 7,933 క్యూసెక్కులు విడుదల అవుతోంది. -
వెన్నుపోటు పాలనపై నిరసన గళం
సాక్షిప్రతినిధి, బాపట్ల: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైఎస్సార్ సీపీ వారం రోజులపాటు తలపెట్టిన నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ఆ పార్టీ శ్రేణులనుంచే కాకుండా ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఇందులో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ‘ఈ కార్యక్రమాలు జరిగాయి. పలు మండలాల్లో పార్టీ నేతలు టీడీపీ ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. కొన్నిచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. అన్ని మండలాల్లోనూ నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను వంచించిందని నేతలు ఆరోపించారు. తక్షణం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు ఎక్కడికక్కడ వినతిపత్రాలు సమర్పించారు. ఆందోళనలో పాల్గొన్న సమన్వయకర్తలు ప్రభుత్వం మోసపూరిత విధానాలను ప్రసంగాల ద్వారా ఎండగట్టారు. చంద్రబాబు వంచనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పార్టీ బాపట్ల మండల అధ్యక్షుడు ఏడుకొండలురెడ్డి, ప్రచార కమిటీ నాయకుడు డేవిడ్, జిల్లా యూత్ అధ్యక్షుడు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాలవారీగా ఇలా... -
టీడీపీ మండల అధ్యక్షుడి దౌర్జన్యం
కొల్లూరు: అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతూ యథేచ్ఛగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపెట్టేందుకు ప్రజా క్షేత్రంలో బాహాబాహీకి దిగిన టీడీపీ, జనసేన నాయకులు బరితెగించి వైఎస్సార్ సీపీ శ్రేణులపై దౌర్జన్యం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. వారిని దీటుగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎదుర్కొన్నాయి. టీడీపీ మండల నాయకుడి సవాలుకు ప్రతి సవాలు విసరడంతో గురువారం కొల్లూరు బస్టాండ్ సెంటర్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా కొల్లూరు బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన ఆరంభించాయి. ఇంతలో టీడీపీ మండల అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, జనసేన కార్యకర్త, మరో టీడీపీ నాయకుడితో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నాయకులను ఉద్దేశించి అభ్యంతరకర రీతిలో సంబోధిస్తూ నిరసన కార్యక్రమాన్ని దౌర్జన్యంగా అడ్డుకునే ప్రయత్నానికి పూనుకున్నాడు. అప్పటికే అక్కడున్న ఎస్ఐ పి. కోటేశ్వరరావు ఆయనను నిలువరించి పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయన వెంట వచ్చిన జనసేన, టీడీపీ కార్యకర్తలు ఇరువురు వైఎస్సార్ సీపీ శ్రేణులపై వ్యాఖ్యలు చేస్తూ దూసుకురావడం ఉద్రిక్తతకు దారితీసింది. అంతవరకు సహనం వహించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు... హామీల అమలులో వైఫల్యం, టీడీపీ అవినీతిపై చర్చకు సిద్ధమేనని తేల్చి చెప్పాయి. వేమూరు సీఐ పీవీ ఆంజనేయులు, ఎస్ఐ కోటేశ్వరరావు, సిబ్బంది ఇరు వర్గాలకు నచ్చ చెప్పి పంపేందుకు అష్టకష్టాలు పడ్డారు. బస్టాండ్ సెంటర్లో పరిస్థితి అదుపులోకి వచ్చేవరకు బందోబస్తు నిర్వహించారు. -
భూమి మ్యుటేషన్పై అధికారుల నిర్లక్ష్యం
వేమూరు: న్యాయపరమైన భూమికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను అధికారులు కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. వేమూరు మండలంలోని చంపాడు గ్రామానికి చెందిన కాకాని కన్యాకుమారి, ఆమె కుమార్తె తహసీల్దారు కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.... 4.75 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు చట్ట విరుద్ధంగా అక్రమ మ్యుటేషన్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై బాపట్ల జిల్లా కలెక్టరుకు పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చామని చెప్పారు. ఇంత వరకు పరిష్కారం కాలేదని తెలిపారు. గత నెల 29వ తేదీన జిల్లా కలెక్టరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చి అర్జీకి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడంతో మండల సర్వేయరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. అప్పటివరకు నిరసన కొనసాగుతుందని ఆమె హెచ్చరించారు. -
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సందర్శన
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని భారత వాతావరణ శాఖ చైన్నె రీజనల్ హెడ్ డాక్టర్ డి.శివానంద బుధవారం సందర్శించారు. స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ఉపయోగించే అత్యాధునిక సాంకేతికతను పరిశీలించారు. అనంతరం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విపత్తుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. కౌసర్ బానో మాట్లాడుతూ తుఫాన్లు, భారీ వర్షాలు, పిడిగుపాటు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు భారత వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ, ఆర్జీజీఎస్ అవేర్ సంయుక్తంగా పనిచేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా, ఎస్డీఎంఏ పరిపాలనా అధికారి కొడారి రవిబాబు, ఎస్ఈఓసీ ఇన్చార్జి పీటర్, ఐఎండీ శాస్త్రవేత్త సాగర్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: సెక్యూరిటీ గార్డుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7వ తేదీన రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముజఫర్ అహ్మద్ తెలిపారు. మంగళగిరి పట్టణం సీఐటీయూ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముజఫర్ మాట్లాడుతూ మంగళగిరి పట్టణ పరిధిలోని రత్నాల చెరువు వద్ద ఉన్న సింహాద్రి శివారెడ్డి భవనంలో సదస్సు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు, యూనియన్ మంగళగిరి కార్యదర్శి బుచ్చిబాబు, నాయకులు సునీత, బాలాజీ పాల్గొన్నారు. చందోలు(కర్లపాలెం): ప్రముఖ నేపథ్య గాయకుడు మనో దంపతులు బుధవారం చందోలు బగళాముఖి అమ్మ వారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మనో దంపతులకు ఆలయ ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. చందోలు ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన కె.మాధవరావు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. మడకసిర మాజీ ఎమ్మెల్సీ తిప్పె స్వామి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
ఓటర్ల జాబితాపై విచారణ ముఖ్యం
జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్ చీరాల: ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా తయారీలో తప్పుగా నమోదైన వివరాలను క్షేత్రస్థాయిలో సరిచేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా ప్రక్రియపై చీరాల ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని గంజిపాలెంలోని ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఆయన స్వయంగా విచారించారు. చీరాల నియోజకవర్గంలో 2,03,641 మంది ఓటర్లున్నారని చెప్పారు. వీరిలో 1,16,283 ఓట్లను మ్యాపింగ్ చేశామన్నారు. ఇప్పటి వరకు 57 శాతం ఓట్లు మ్యాపింగ్ జరగ్గా, 87,358 ఓట్లను మ్యాపింగ్ జరగకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. 21,188 ఓట్లు తప్పుడుగాను, డబుల్ ఎంట్రీలుగాను, సవరణలు, చిరునామాలు స్పష్టత లేదన్నారు. మ్యాపింగ్ జరిగిన ఓట్లన్నింటినీ ప్రింట్ చేసి పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. లాగిన్ వివరాలపై అసహనం ఓటర్ల జాబితా తయారీ, విచారణలో చీరాల, వేటపాలెం ఎంపీడీఓలకు, చీరాల మున్సిపల్ కమిషనర్కు లాగిన్ ఇచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. చీరాల నియోజకవర్గంలో 218 పోలింగ్ కేంద్రాలున్నాయని, ఆ కేంద్రాల పరిధిలో 218 మంది బీఎల్ఓలు ఉన్నారన్నారు. వారి లాగిన్ నుంచి ఎప్పటికప్పుడు విచారణ ప్రక్రియ కొనసాగించాలన్నారు. చీరాల నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఆ రెండు మండలాల ఎంపీడీఓలకు, చీరాల మున్సిపల్ కమిషనర్కు లాగిన్ ఇచ్చామన్నారు. విచారణ చేయాల్సి ఉండగా నేటికీ ఆ ప్రక్రియ జరగకపోవడంపై ఆరా తీశారు. ఆన్లైన్లో దరఖాస్తులు నేటికీ పరిశీలించకపోవడం, లాగిన్ వినియోగించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. అనంతరం చీరాల పట్టణంలోని గంజిపాలెంలో కలెక్టర్ పర్యటించారు. 91 సంవత్సరాల ఓటరు సయ్యద్ మస్తాన్తో ఆయన మాట్లాడారు. 50 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో సొంత ఇంటిలో నివసిస్తున్నప్పటికీ 2002 ఓటరు జాబితాలో ఆయన పేరు కనిపించకపోవడంపై విచారించారు. 15 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం అద్దంకిలో నివాసం ఉన్నట్లు ఆయన కలెక్టర్కు వివరించారు. ముందుగా పర్చూరు, కారంచేడు మండలాల్లో ఉన్నట్లు చెప్పడంతో విచారించారు. ఆయన కుమారుడిని పిలిపించి కలెక్టర్ విచారణ చేశారు. అద్దంకిలో ఉండి ఓటు వేసినట్లు చెప్పడంతో సంబంధిత యాప్లో గుర్తించి ఓటు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్చార్జి ఆర్డీఓ లవన్న, మున్సిపల్ కమిషనర్ డానియేల్ జోసఫ్, తహసీల్దార్లు గోపీకృష్ణ, గీతావాణి, చీరాల, వేటపాలెం ఎంపీడీఓలు విజయ, రాజేష్, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
బాపట్ల
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026వైభవంగా షిరిడి సాయినాథ బ్రహ్మోత్సవాలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,500, గరిష్ట ధర రూ.2,500, మోడల్ ధర రూ.1,900 వరకు పలికింది.అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.గుంటూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో నూతన విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరిచిన రోజున విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన విద్యార్థి మిత్ర కిట్లు సిద్ధం కాలేదు. టీడీపీ సర్కారు ముందు చూపు లేని పనులతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు నిరాశే మిగలనుంది. వేసవి సెలవుల అనంతరం ఈ నెల 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం రోజున ఆనందంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఈ కిట్లు అందే పరిస్థితులు కనిపించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో భేష్.. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 89,157 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు అంచనా వేశారు. కానీ పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మరో నెలకుపైగా పట్టే పరిస్థితులు నెలకొన్నాయి. పాఠ్య పుస్తకాలు మినహా జిల్లాకు పూర్తిస్థాయిలో సామగ్రి చేరుకోలేదు. కానీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు, వారి చదువులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. నాణ్యమైన సామగ్రితో కూడిన విద్యాకానుక స్టూడెంట్ కిట్లను వ్యక్తిగత పర్యవేక్షణతో సిద్ధం చేయించారు. ఏటా పాఠశాలలు తెరిచిన మొదటి రోజున ఒక పండుగగా విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారుల సమక్షంలో విద్యార్థులకు ఈ కిట్లు పంపిణీ చేయించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని కల్పించారు. ఈ విధంగా ఐదేళ్లపాటు పాఠశాలలు తెరిచిన మొదటి రోజునే విద్యార్థుల చేతుల్లో కిట్లను ఉంచారు. నగరంపాలెం: స్థానిక హౌసింగ్ బోర్డుకాలనీ షిరిడి సాయినాథ మందిరంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం సుప్రభాత సేవ, కాకడ హారతి, బాబా వారికి పంచామృతాలతో అభిషేకం, 108 కళాశాలతో జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అలంకార పూజ, ప్రత్యేక హారతులు నిర్వహించారు. సాయంత్రం వేళ సంధ్యా హారతి అనంతరం శ్రీరామ భక్త వీరాంజనేయ బృందం భజన జరగ్గా, భక్తులను కార్యక్రమం అలరించింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అధ్యక్షుడే మామిడి సీతారామయ్య, గౌరవాధ్యక్షుడు మామిడి రామారావు, సభ్యులు పాల్గొన్నారు. సంక్షోభంలో ఆక్వా రంగం 7ప్రస్తుత టీడీపీ పాలనలో విద్యార్థులకు ఆ భరోసా కరువైంది. పాఠశాల తెరిచేందుకు మరో 10 రోజుల వ్యవధి సైతం లేని పరిస్థితుల్లో జిల్లాకు పాఠ్య పుస్తకాలు మినహా మిగిలిన సామగ్రి చేరుకోలేదు. విద్యార్థి మిత్ర కిట్లో భాగంగా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన బ్యాగు, రెండేసి జతల చొప్పున యూనిఫాం, బూట్లు, నోటు పుస్తకాలు, సాక్సులు, టై, బెల్టు అరకొరగా వచ్చాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన 15,26,181 పాఠ్యపుస్తకాల్లో ఇప్పటి వరకు 14,64,850 .... అదే విధంగా నోటు పుస్తకాలు 5,32,451 వచ్చాయి. ఇలా అరకొరగా వచ్చిన సామగ్రితో కిట్లు సిద్ధం చేసి, పాఠశాలలు తెరిచిన రోజున విద్యార్థులకు పంపిణీ చేయడం సాధ్యమయ్యే విషయం కాదని తెలుస్తోంది. -
నిలిచిన నిధులు.. కదలని పనులు
వేటపాలెం: జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 25 మండలాల పరిధిలో 489 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రభుత్వం మార్చి నుంచి మూడు నెలలుగా గ్రామ పంచాయతీల సాధారణ నిధులు బ్యాంకు ఖాతాల నుంచి నగదు డ్రా చేసుకునే అవకాశాన్ని నిలిపివేడంతో అభివృద్ధి పనులు పూర్తిగా కుంటుపడ్డాయి. మరో వైపు పంచాయతీలకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ వాటా కూడా టీడీపీ ప్రభుత్వ అధికారం చేపట్టిన తరువాత విడదల కాకపోవడంతో స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి స్టాంప్ డ్యూటీ నిధులు పంచాయతీల ఖాతాలకు జమ చేసేవారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, చిన్నపాటి మరుమ్మతుల వంటి రోజువారీ అవసరాల కోసం వినియోగించే నిధులు అందుబాటులో లేకపోవడంతో కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యానికి వినియోగించే మెటీరియల్ కొనుగోలు, గ్రామాల నుంచి చెత్తను తరలించే ట్రాక్టర్లు డీజిల్, మరమ్మతులు, చెత్త సేకరణ వాహన ఖర్చులు, విద్యుత్ బిల్లులు చెల్లింపులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభావం... నిధుల కొరత కారణంగా అనేక గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించలేక పోతున్నారు. బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్, ఇతర పారిశుద్ధ్య సామగ్రి కొనుగోలు చేయడానికి కూడా నిధులు లేకపోవడంతో గ్రామాల్లో పరిశుభ్రత దెబ్బతింది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల నివారణ చర్యలు చేపట్టడం కూడా కష్టసాధ్యంగా మారిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం.. గ్రామాల్లో వీధి దీపాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించలేక పంచాయతీలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కొన్ని పంచాయతీలకు బకాయిలు పెరిగిపోయాయని, ఇదే పరిస్థితి కొనసాగితే విద్యుత్ సరఫరాపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీల ఆదాయ వనరుల్లో ప్రధానమైన స్టాంప్ డ్యూటీ వాటా టీడీపీ ప్రభుత్వ అధికారం చేపట్టిన నాటి నుంచి విడుదల కాకపోవడంతో మరో సమస్యగా మారింది. ఈ నిధులు అందితే గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి, రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ఉపయోగపడతాయని కార్యదర్శులు చెబుతున్నారు. అయితే బకాయిలు పేరుకుపోవడంతో అభివృద్ధి నిలిచిపోయింది. -
ఇంధన పొదుపునకు అందరూ సహకరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: ఇంధన పొదుపు అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం ఉదయం కలెక్టర్ బంగ్లా నుంచి మున్సిపాలిటీ పరిధిలో పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి పాల్గొనేందుకు హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనంపై వెళ్లారు. హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవు ఎస్పీ బి.ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతమైతే చర్యలు తప్పవని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 44 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను ఎస్పీకి వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. కార్యక్రమంలో బాపట్ల సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చినగంజాం: మండలంలోని కొత్తపాలెం పంచాయతీ మూలగానివారిపాలెం గ్రామానికి చెందిన అక్కల అజిత్రెడ్డి జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. అడ్వాన్స్ పరీక్షలో మొత్తం 221 మార్కులు రాగా పాజిటివ్ మార్కులు 226 సాధించాడు. ఆల్ ఇండియా (ఐఐటీ) 738వ ర్యాంక్ సాధించాడు. అజిత్రెడ్డి స్థానిక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు నాగరాజురెడ్డి కుమారుడు. పదో తరగతి స్థానిక సత్యం హైస్కూల్లో చదివాడు. అజిత్రెడ్డి ర్యాంక్ సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యంగా సాగిన పింఛన్ల పంపిణీ కారంచేడు: నెల ప్రారంభం రోజే పంపిణీ చేయాల్సిన పింఛన్లు సర్వర్లు మొరాయించడంతో లబ్ధిదారులు సోమవారం ఇబ్బందులు పడ్డారు. మండల వ్యాప్తంగా వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆలస్యంగా సాగింది. ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభమైనప్పటికీ సర్వర్లు మొరాయిండంతో ఒక్కో పింఛన్ పంపిణీకి సుమారు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టినట్లు సిబ్బంది తెలిపారు. -
బాపట్ల
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026సీబీఐ విచారణ చేపట్టాలి అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1294 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 520.40 అడుగులకు చేరింది. జలాశయం నుంచి కుడికాలువకు 7,033 క్యూసెక్కులు విడుదలవుతోంది. తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,500, గరిష్ట ధర రూ.4,200, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది. దగా డీఎస్సీపై సత్వరం సీబీఐ విచారణ చేపట్టాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ కోసం నోటిఫికేషన్ వేస్తే దానిని అడ్డుకునేందుకు టీడీపీ, కూటమి నేతలు ఆందోళన చేశారని గుర్తు చేశారు. కూటమి సర్కారు వచ్చాకా మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను దగా చేశారని కోన రఘుపతి పేర్కొన్నారు. కనీసం నిబంధనలు పాటించని ఈ డీఎస్సీ విధానంపై సీబీఐ విచారణ చేపట్టాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోన రఘుపతి డిమాండ్ చేశారు. – కోన రఘుపతి, మాజీ డెప్యూటీ స్పీకర్ 6 -
అర్జీలు పునరావృతం కాకుండా చర్యలు
బాపట్ల: పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందజేసే సమస్యల అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, డీఆర్వో జి.గంగాధర్గౌడ్లతో కలసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 132 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో నమోదైన అర్జీలను క్షేత్రస్థాయికి వెళ్లి అర్జీదారులతో మాట్లాడి పరిష్కారం చేయాలన్నారు. మండల స్థాయిలో అత్యధికంగా అర్జీలు పెండింగ్లో ఉన్న వాటిని పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై వ్యక్తిగతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అర్జీలపై ఆడిట్ చేయాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. ఫారం 6,7,8 పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంతరాజు, సీపీఓ.ఏ.ఎస్.రాజు, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖల పీడీలు విజయలక్ష్మి, పాల్, వెంకటేశ్వరరావు, రాధామాధవి, ఆనంద సత్యపల్, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్ఎస్ పద్మావతి, డీటీసీ పరంథామరెడ్డి, జీఎండీఐ సి.రామకృష్ణ, పంచాయతీరాజ్ ఎస్ఈ రాజన్బాబు, జిల్లా వ్యవసాయ అధికారి ఏ.లక్ష్మి, డీఎస్ఓ ఆర్.జమీర్ బాషా, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీలక్ష్మి, డీఎల్డీఓ.విజయలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు జయరాములు, రాజాదేబోరా, డీఎఫ్ఓ రవిశంకర్, డీఈఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
దివ్యాంగులశాఖ కార్యాలయాన్ని తెరిపించాలి
వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య బాపట్ల: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాల్సిన దివ్యాంగుల శాఖ కార్యాలయం ఎప్పుడు మూసివేసి ఉండటాన్ని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం తీవ్రంగా ఖండించింది. సోమవారం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. చల్లా రామయ్య మాట్లాడుతూ కూటమి పాలనలో దివ్యాంగుల శాఖ కార్యాలయం ఎప్పడు మూసివేసే ఉంటుందన్నారు. కనీసం సమస్యలు చెప్పుకునేందుకు కూడా ఎవరు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని స్పందన కార్యక్రమంలో అర్జీ రూపంలో ఏవో మల్లికార్జునరావుకు వినతి పత్రం అందించారు. నిరసనలో వైఎస్సార్సీపీ దివ్యాంగుల నాయకులు ఎం శ్యాం ప్రకాష్, చల్లపల్లి గోపి, ఆసోది రామిరెడ్డి, ఆట్ల శ్రీనివాస్ రెడ్డి, బాబు, కొండమ్మ, వెంకటేశ్వరమ్మ, బాలాజీ, కళ్యాణ్, నాని పి.జి.ఆర్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. చికిత్సకని వెళుతూ తిరిగిరాని లోకాలకు.. వెల్దుర్తి: మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్న ఘటన జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన రెంటాల ఆదిలక్ష్మమ్మ (60)కు మోకాళ్ల నొప్పులు అధికం కావడంతో కొడుకు పాలంకయ్యతో కలిసి మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యశాలకు బయల్దేరింది. వీరిని మాచర్లలో గుంటూరు వెళ్లే ఫస్టు బస్సు ఎక్కించేందుకు ఆదిలక్ష్మమ్మ కుమార్తె కుమారుడు (మనవడు) ఐతంరాజు మారుతి(18) తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని మాచర్ల బస్టాండ్కు బయలుదేరాడు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుఝామున 3.30గంటలకు వస్తున్న సమయంలో మాచర్ల నుంచి యర్రగొండపాలెం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం మాచర్ల – శ్రీశైలం జాతీయ రహదారిలోని మండాది బోడు వద్ద బలంగా ఢీ కొట్టడంతో బండి పై ప్రయాణిస్తున్న వారు ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం సుమారు 60 అడుగుల దూరం లాక్కెల్లింది. ద్విచక్ర వాహనం పై ప్రయాణిస్తున్న రెంటాల ఆదిలక్ష్మమ్మ, ఐతంరాజు మారుతిలు అక్కడికక్కడే మృతిచెందారు. రెంటాల పాలంకయ్య తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లాడు. మండాది నుంచి మాచర్లకు వస్తున్న వారు గమనించి క్షతగాత్రుడు పాలంకయ్య మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పాలంకయ్యకు ప్రథమ చికిత్స చేయగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నర్సరావుపేటకు తరలించారు. మారుతి తండ్రి అంజి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దగా డీఎస్సీపై యువాగ్రహం
బాపట్ల: నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన దగా డీఎస్సీపై వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. యువత చేపట్టిన నిరసన ప్రదర్శనతో బాపట్ల హోరెత్తిపోయింది. భారీగా యువత, నిరుద్యోగులు, పార్టీ శ్రేణులు తరలివస్తారనే సమాచారం మేరకు పోలీసులు భారీగా మోహరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నుంచి పట్టణంలోని యువతను రాకుండా పలుచోట్ల అడ్డంకులు కల్పించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ యువత రెట్టించిన ఉత్సాహంతో నిరసనలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జెండాలతో చేపట్టిన నిరసన బాపట్ల భారీగా సోమవారం కొనసాగింది. భారీగా మోహరించిన పోలీసులు వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాలతో భారీ ప్రదర్శన చేపట్టేందుకు నిర్ణయించారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్రేట్ వరకు ప్రదర్శనకు భారీగా చేరుకున్నారు. అయితే గడియార స్తంభం సెంటర్ వద్ద భారీగా పోలీసులు మెహరించి ద్విచక్రవాహన ప్రదర్శనను అనుమతి నిరాకరించారు. దీంతో పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్వద్ద కూడా పోలీసులు నాయకులు, కార్యకర్తలను ముందుకుపోకుండా అడ్డుకున్నారు. శాంతియుత ప్రదర్శనను అడ్డుకోవటంపై మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆగ్రహం వ్యక్తం చేయటంతో కొద్దిమంది నాయకులను కలెక్టర్ను కలిసేందుకు అనుమతి ఇచ్చారు. సీబీఐ విచారణ చేపట్టాలని వినతి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్కు నాయకులు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ కొనసాగేవిధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా యువజన విభాగం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగత సుధీర్బాబు, మరుప్రోలు ఏడుకొండలురెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మేరుగ చందన్ నాగ్, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్ మోహన్గౌడ్, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నక్కా వీరారెడ్డి, మండే విజయ్కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దొంతిబోయిన జయ భారత్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జోషికాంత్, రేపల్లె అధికార ప్రతినిధి వీరేంద్ర, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు శీలం చంటి, రవి శంకర్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు యల్లావుల సోహిత్, అడే చందు, శాయిల మురళి,ఉరబిండి గోపినాధ్ తదితరులు ఉన్నారు. డీఎస్సీలో కొన్ని పోస్టులను అంగట్లో సరుకుల టీడీపీ ప్రభుత్వం అమ్ముకుందని వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు జి.సురేంద్ర పేర్కొన్నారు. దగా డీఎస్సీపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేసే చంద్రబాబుకు సరైన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. – జి.సురేంద్ర, వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ పరిశీలకులు -
ఇదేనా మర్యాద!
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని జిందాల్ ఫ్యాక్టరీ పరిశీలన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అధికారులతో శనివారం వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫ్యాక్టరీ పనితీరుపై వాకబు చేస్తున్న సమయంలో పవన్కళ్యాణ్ కాలు మీద కాలు పెట్టుకుని ఊగుతూ అహంకార ధోరణిలో సమీక్ష నిర్వహిస్తున్న వీడియో, మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ, జిందాల్ ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు చేతులు కట్టుకుని నిలుచున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సినిమాటిక్ హీరోయిజం పండించేందుకు ఇలా చేశారా... లేదా పవన్ ఆసలు స్వభావం అధికారం వచ్చిన తరువాత ఇలా బయటపడిందా అనే చర్చ మొదలైంది. ఏదైతేనేం ఉన్నతవిద్యావంతులైన ఐఏఎస్లు, ఇంజినీర్లు, ఇతర ఉన్నతాఽధికారులు నిలబడి పరిశ్రమ పనితీరు, పర్యావరణానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తుంటే కాలు మీద కాలు వేసుకుని నిర్లక్ష్యంగా, అధికారులను అవమానించే విధంగా ప్రవర్తించిన వ్యవహార శైలిని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అధికారులు ప్రభుత్వ పాలకులకు జవాబుదారీగా మాత్రమే ఉంటారని.. బానిసలు కాదని, వారి చదువుకై నా గౌరవం ఇవ్వాలని సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు. పదవీ వచ్చాక అహంకారంతో సభ్యసమాజంలో ఇలాంటి పోకడలు సరికాదని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సి ఉండగా.. తాజా దృశ్యాలు అందుకు భిన్నంగా ఉన్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
రైతుల నోట్లో ‘మట్టి’
శావల్యాపురం: శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామంలో మట్టి, ఇసుక మాఫియా పడమటి వాగును పిండేస్తోంది. అధికార పార్టీ ముఖ్యనేతల అండదండలతో కొందరు నేతలు యథేచ్ఛగా ఇసుక అక్రమ దందాకు తెరలేపారు. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు, మండల స్థాయి అధికార పార్టీ నేత ఒకరు ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, ఇసుక, మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇసుక దోపిడీకే బ్రిడ్జి నిర్మాణం! ఇటీవల కాలంలో ప్రభుత్వం సుమారు రూ. 50 లక్షలతో పడమటి వాగుపై ఒక బ్రిడ్జిని నిర్మించింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినప్పటి నుంచే సదరు నేత కన్ను ఇక్కడి ఇసుక నిల్వలపై పడింది. బ్రిడ్జి నిర్మాణాన్ని ఆసరాగా చేసుకుని, ఆఘమేఘాల మీద పొక్లెయిన్లను రంగంలోకి దించారు. చుట్టుపక్కల రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాగు అంచుల్లో భారీగా తవ్వకాలు జరుపుతూ ఇసుకను తరలిస్తున్నారు. కన్నెత్తి చూడని అధికారులు ఇంత బహిరంగంగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక దోపిడీ జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు అధికార పార్టీ నేత అధికారులను మభ్యపెట్టారా, లేక తన రాజకీయ బలంతో భయపెట్టారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పొంచి ఉన్న భారీ ముంపు పడమటి వాగు అంచున ఉన్న పొలాలకు ఈ అక్రమ తవ్వకాల వల్ల భారీ వరద ముప్పు పొంచి ఉంది. గతంలో పలుమార్లు ఈ వాగు పొంగిపొర్లడం వల్ల చుట్టుపక్కల రైతులు తీవ్రంగా పంట నష్టపోయారు. ఇప్పుడు వాగు అంచులను ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండటంతో, రాబోయే వర్షాకాలంలో వాగు గట్టు తెగి పొలాలు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురుదాడి.. దౌర్జన్యం ‘ఇలా అక్రమంగా ఇసుక తవ్వడం వల్ల మా పొలాలు మునిగిపోతాయి, ఇది పద్ధతి కాదు’ అని ప్రశ్నించిన రైతులపై సదరు నేత దౌర్జన్యానికి దిగుతున్నాడు. ‘నా ఇష్టం.. నన్ను అడిగేదెవడు?‘ అంటూ ఎదురుదాడికి పాల్పడుతూ, రైతులను నానా దుర్భాషలాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నాడని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా ఇక్కడ యథేచ్ఛగా పొక్లెయిన్లతో తవ్వకాలు సాగాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, వయ్యకల్లు పడమటి వాగులో జరుగుతున్న అక్రమ మైనింగ్పై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముంపు ముప్పు నుంచి తమ పొలాలను కాపాడాలని రైతులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
మాజీ మంత్రి వెంకటరెడ్డికి కన్నీటి వీడ్కోలు
పావులూరు(చినగంజాం): మాజీ మంత్రి, రాష్ట్ర సీనియర్ నాయకుడు గాదె వెంకటరెడ్డి అంతిమ యాత్ర కార్యక్రమం ఆదివారం ఆయన స్వగ్రామం అయిన ఇంకొల్లు మండలం పావులూరులో నిర్వహించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల తరువాత ప్రముఖులు, అభిమానుల సందర్శన అనంతరం ప్రత్యేకంగా పూలతో అలంకరించిన అంతిమ యాత్ర(ఆఖరి మజిలీ యాత్ర) రథంపై ఆయన భౌతికకాయం ఉంచారు. బ్యాండు మేళం, బాణసంచాతో భారీ జనసందోహం, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధువులు అనుసరించారు. గాదె వెంకటరెడ్డి పెద్ద కుమారుడు, పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి గాదె మధుసూదనరెడ్డితో పాటు సోదరులు సుధాకరరెడ్డి, శ్రీకాంత్రెడ్డితో కలిసి వారి సొంత ఫార్మింగ్ స్థలం వరకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లారు. అనంతరం శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు, బాపట్ల జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గవిని శ్రీనివాస్, గాదె శివరామకృష్ణారెడ్డి, బొల్లెద్దు ప్రతాప్, బి.నరేంద్రరెడ్డి, బొర్రెపాటి శ్రీనివాసరెడ్డి, వారి చంద్రశేఖర్, దాసరి కిరణ్బాబు, పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవభక్తుని చక్రవర్తి, పర్చూరు నియోజకవర్గ మాజీ ఇన్చార్జి యడం బాలాజీ, వారి సోదరుడు లక్ష్మీదీపక్, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, రాయపాటి అరుణ నివాళులర్పించారు. అంతియాత్రలో బాపట్ల శాసనసభ్యుడు వేగేశన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఒక గొప్ప నాయకుడు, ప్రజా సేవకుడు, నిరంతర ప్రజా సేవా తత్పరుడు వెంకటరెడ్డిని కోల్పోవడం బాధాకరం అన్నారు. -
పేషెంట్ కేర్ కోసం ఏదైనా చేస్తా..
జీజీహెచ్ నూతన సూపరింటెండెంట్ డాక్టర్ సుందరాచారి గుంటూరు మెడికల్: పేషెంట్ కేర్ కోసం ఏదైనా చేస్తానని గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నా రు. అవసరమైతే రోగిని వీల్చైర్లో తానే తీసుకెళ్లి చికిత్స అందిస్తానని చెప్పారు. ఆదివారం డాక్టర్ యశస్వి రమణ నుంచి డాక్టర్ సుందరాచారి సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ సుందరా చారి మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్ క్యాజువాల్టీ వైద్యసేవలు మెరుగుపరుస్తామని తెలిపారు. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వచ్చి అత్యవసర వైద్యసేవలు కావాలనుకుంటే వారు మొట్టమొదటగా జీజీహెచ్ క్యాజువాల్టీకి వెళ్లి వైద్యసేవలు పొందాలనే తరహాలో క్యాజువాల్టీ సేవలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. గుంటూరు వైద్య కళాశాలలో చదువుకుని కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ నేడు అదనంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ బాధ్యతలు కూడా చేపట్టినట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాల, ఆస్పత్రిలో 45 సంవత్సరాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎన్.వి. సుందరాచారికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్, డెప్యూటీ కలెక్టర్ చిన్నం సుధారాణి, అసిస్టెంట్ డైరక్టర్ పూసల శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటర్ బచ్చు ప్రవీణ్కుమార్, సీనియర్ అసిస్టెంట్లు జమ్ముల అరుణ్, నూతక్కి శ్రీకాంత్, వేణు, లంకపల్లి శ్రీనివాస్,జీవీ కోటేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్స్ వాసిరెడ్డి కార్తిక్, తిరుపతిరావు, ఆనంద్, పలువురు నర్శింగ్ సిబ్బంది తదితరులు శాలువా కప్పి, బొకే అందజేసి అభినందనలు తెలిపారు. -
విద్యతోనే సామాజిక అసమానతలు దూరం
గుంటూరు మెడికల్: మహాత్మ జ్యోతి రావు పూలే, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డు నగరాల్లో శ్రీకష్ణ యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందజేత, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు జిల్లా వ్యాప్తంగా 1500 మంది పాల్గొన్నారు. శ్రీకష్ణ యాదవ సేవా సమితి గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం నేటి యువతకు ఉందన్నారు. హేతువాద దక్పథం, పరిశీలన శక్తి శాసీ్త్రయ అవగాహన అవసరమని పేర్కొన్నారు. విమర్శనాత్మక దృష్టి విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. 2004లో ప్రారంభమై నేటికీ ప్రతి ఏడాది పదోతరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్న్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లను ఆమె అభినందించారు. సభాధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదలకు అందకుండా చేశారన్నారు. విద్యారంగం అభివృద్ధి పూర్తిగా మర్చిపోయిందని చెప్పారు. టీటీడీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జంగా కష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలంటే విద్య ఒక్కటే ఆయుధమని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకష్ణ యాదవ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎన్వీ శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వీవీ శ్రీనివాసరావు, కోశాధికారి టి.రామకృష్ణ ,ఉపాధ్యక్షులు పెరుగు ఏడుకొండలు, ఎ.రాంబాబు, ఎ.మధు కుమార్, సాంబశివరావు, డొక్కా శ్రీనివాస్ రావు, దర్శి హరినాథ బాబు, దాసరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు రూ.8 లక్షల నగదు అందించారు. ఆర్జేడీ అధికార ప్రతినిధి డాక్టర్ కాంచన యాదవ్ -
వైభవంగా ఇంద్ర‘గిరి ప్రదక్షిణ’
పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అధిక జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఆదివారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున 5.55 గంటలకు దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు, ఈవో దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ప్రత్యేకంగా అలంకరించిన పూల వాహనాన్ని ఆదిదంపతులు అధిరోహించగా, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. ఆదిదంపతులతో పాటు దేవస్థాన ప్రచార రథం ముందుకు సాగగా మేళతాళాలు, మంగళవాయిద్యాలు, కోలాట నృత్యాలు, డప్పు కళాకారుల విన్యాసాల మధ్య గిరిప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఓకే నెలలో రెండు పర్యాయాలు గిరి ప్రదక్షిణ జరగడం విశేషం. మే 1వ తేదీ వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ జరగగా, మే 31వ తేదీ అధిఖ జ్యేష్ఠ పౌర్ణమి రావడంతో మరోమారు ఆదివారం గిరిప్రదక్షిణ జరగింది. ప్రదక్షిణ ఇలా.. దుర్గగుడి నుంచి ప్రారంభమైన గిరిప్రదక్షిణ ఊరేగింపు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా, కబేళా, పాల ప్రాజెక్టు, కేఎల్రావునగర్, చిట్టినగర్, కేటీరోడ్డు, బ్రహ్మణ వీధి మీదగా ఆలయానికి చేరుకుంది. పెద్ద ఎత్తున భక్తులు, ఉభయదాతలు, సేవా సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. తమ ఇంటి ముంగిటకు విచ్చేసిన ఆది దంపతులకు భక్తులు పూజా సామగ్రి సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దేవస్థానం కుంకుమతో పాటు పులిహోర ప్రసాదాలను పంపిణీ చేసింది. -
నేటి నుంచి ఆన్లైన్లో ప్రాథమిక ఉర్దూ శిక్షణ తరగతులు
గుంటూరు ఎడ్యుకేషన్: ఉర్దూ భాష నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన విద్యార్థులు, యువతకు ఉర్దూ ప్రాథమిక శిక్షణ తరగతులను సోమవారం నుంచి 30 రోజుల పాటు ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు ఉర్దూ ప్రత్యేకాధికారి షేక్ నాగూర్వలీ ఆదివారం ఓప్రకటనలో పేర్కొన్నారు. ఉర్దూ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రాథమిక అంశాలు సులభంగా బోధిస్తామని తెలిపారు. ఉర్దూ మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని, ఉర్దూ భాషను నేర్చుకోవడం ద్వారా విద్యార్థులకు విద్యా, ఉపాధి రంగాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ స్థాయి లో ఉర్దూను చదవడంద్వారా విద్యార్థులు తమ మాతృభాషను పరిరక్షించుకోవడంతో పాటు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల్లో ముందుకు వెళ్లగలరని, వివరాలకు 98851 39827 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో పాఠశాల కరస్పాండెంట్ మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపా లెం చప్టా వద్ద శనివారం రాత్రి జరిగింది. గాడిపర్తి మురళీమోహన్ (52)దాచేపల్లిలో శారదా పాఠశాలకు కరస్పాండెంట్గా వ్యవహరిస్తూ పాఠశాల నడుపుతున్నాడు. మురళీమోహన్ శనివారం ఉదయం తన వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై గుంటూరు వెళ్లి పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అనుపాలెం చప్టా వద్ద రోడు పనులు నిమిత్తం ఏర్పాటు చేసిన రమ్మును ఢీకొనగా అక్కడికక్కడే రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి మృతి చెందినట్లు నిర్థారించారు. బంధువులు మృతదేహాన్ని రాత్రే దాచేపల్లికి తీసుకెళ్లారు. రోడ్డు ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని రాజుపాలెం ఎస్ఐ మణికృష్ణ తెలిపారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు విజయవాడకు చెందిన భక్తులు ఆదివారం అరకిలో వెండిని కానుకగా సమర్పించారు. విజయవాడకు పేరువీటి స్వరూప రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. రూ. 1.36 లక్షల విలువైన అరకిలో వెండిని చైర్మన్ బొర్రా రాధాకృష్ణకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసా దాలు, శేషవస్త్రాలను బహూకరించారు. పటమట(విజయవాడతూర్పు): ‘సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా’ ముగింపు సదస్సు జూన్ 1, 2 తేదీల్లో విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో నిర్వహించనున్నట్లు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యునిడో), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (జీఈఎఫ్), కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోయూహెచ్ఏ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఊయూఏ) సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. పట్టణ సుస్థిరత, వాతావరణ చర్యల పురోగతి అనే అంశంపై నిర్వహించనున్న ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మున్సిపల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, పట్టణాభివద్ధి నిపుణులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛ భారత్ మిషన్, జీరో వేస్ట్ కార్యక్రమాల ప్రతినిధులు పాల్గొననున్నారన్నారు. ఈ సందర్భంగా యునిడో నిర్వహిస్తున్న జెమ్ అవార్డు – 2026 ను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కు ప్రదానం చేయనున్నారని తెలిపారు. జూన్ 2న భాగస్వామ్య ప్రతినిధుల కోసం గుంటూరు జిల్లా జాగర్లమూడి వద్ద ఏర్పాటు చేసిన 500 కిలోవాట్ల తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్, ఇంటింటి చెత్త సేకరణకు వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాల చార్జింగ్ కేంద్రాలను సందర్శించే ప్రత్యేక ఫీల్డ్ విజిట్ కూడా నిర్వహించనున్నారని చెప్పారు. -
పచ్చ నేతల సేవలో...!
బాపట్లసోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026‘మత్స్యకార సేవలో’ మితిమీరిన టీడీపీ నేతల జోక్యం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,1710 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. వినుకొండ: పట్టణంలోని శ్రీనివాసనగర్లోగల అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం 108 కలశాలతో విశేష జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు. చీరాల అర్బన్: సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే భత్యం అర్హులందరికీ దరిచేరలేదు. ఇదిలా ఉంటే సముద్రంలో మత్స్య సంపదను వేటాడటం తెలియని పలువురి పేర్లు అర్హుల జాబితాలో చేరాయి. దీంతో పలువురు అర్హులైన మత్స్యకారులు నష్టపోయారు. కొందరు సారంగులు(బోటు యజమానులు)కు భత్యం సొమ్ము రాలేదు. ఇదేమని అడిగిన వారికి స్థానిక అధికారుల నుంచి రుసరుసలు, కప్పదాటు సమాధానాలు వస్తున్నాయి. ఇదెక్కడి పచ్చపాతమని అర్హులు వాపోతున్నారు. మితిమీరిన పచ్చ రాజకీయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి కోసం మత్స్యకార సేవ.. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేటకు విరామం. మత్స్యసంపద పునరుత్పతి జరిగే కాలం. ఆ సమయంలో మత్స్యకారుల జీవన భృతికి ప్రభుత్వ పరంగా సాయం అందిస్తుంది. అర్హులైన ప్రతి మత్స్యకారుడు, సారంగు (బోటు యజమాని)లకు సంధికాలపు భత్యంగా రూ.20వేలు అందించాలి. అందుకు సంబంధించి ఈ నెల 19వ తేదీన మత్స్యకార సేవలో.. పేరుతో ఆ నగదును వారి, వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే అందులో అర్హులైన పలువురు మత్స్యకారులకు ఆ సాయం దరిచేరలేదు. మితిమీరిన ‘పచ్చ’ పాతం మత్స్యకార సేవలో పథకానికి అర్హులైన ప్రతి ఒక్క మత్స్యకారుని పేరు జాబితాలో ఉండాలి. అయితే అర్హులైన పలువురి మత్స్యకారుల పేర్లు జాబితాలో లేవు. పలువురు అనర్హుల పేర్లు జాబితాలో చేరాయి. ఇదెక్కడి న్యాయమని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. మితి మీరిన పచ్చ రాజకీయమే అందుకు కారణమనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదని, అర్హులందరికీ భత్యం సొమ్ము అందాలని కోరుతున్నారు. 7నాకు బోటు ఉంది. బోటు రిజిస్ట్రేషన్ కాగితం ఉంది. డీజిల్ రాయితీ కాగితం ఉంది. మా పెద్దల నుంచి బోటు ఉంది. ఇప్పుడు భత్యం సొమ్ము నా బ్యాంకు ఖాతాలో జమ కాలేదు. ఇదేమని అడిగితే పై నుంచి వచ్చిన జాబితాలో నీ పేరు లేదని చెబుతున్నారు. అదేమంటే కోప్పడుతున్నారు. మత్స్యకారులు కాకుండా కొందరు ఇతర కులాల వాళ్లు వేట చేస్తారు. అలాంటి వారి పేర్లు ఉండాలి. తప్పు లేదు. అసలు వేటంటే తెలీనోళ్లు పేర్లు కూడా ఉన్నాయి. – రాజారావు, సారంగు, వాడరేవుమా కుటుంబంలో నా పేరు ఒక్కటే పెట్టుకున్నాం. కళాసీగా పని చేస్తుంటా. మేం ఇక్కడ కాగితం పెట్టుకున్నా, తరువాత అవి మారిపోతుంటాయి. అందుకే వాటి మీద ఆశలు వదులుకున్నాం. ఎవరిని అడిగి ప్రయోజనం ఏముంది? – శివ, మత్స్యకారుడు, వాడరేవుమామూలుగా కాగితాలు పెట్టుకుని పేర్లు రాసేపుడు బోటు దగ్గర నిలుచోబెట్టి ఫొటోలు తీస్తారు. కొందరు అలా బోటు దగ్గరకు వచ్చి ఫొటోలు తీపించుకో లేదు. కానీ థంబ్ వేయటానికి వచ్చినపుడు చూశాం. వారికి సముద్రంలో వేట గురించి ఏ మాత్రం తెలీదు. మరి వారి పేర్లు అర్హుల లిస్టులోకి ఎలా వచ్చాయనేది పెద్ద ప్రశ్న. నాకు డబ్బులు పడ్డాయి. మా బోటు యజమానికి డబ్బు పడలేదు. వేరేవాళ్లకు ఇచ్చుకుంటారో, మానుకుంటారో మాకు అనవసరం. కానీ నిజంగా వేట చేసేవారి పేర్లు లేకపోవటం సరికాదు. దీనిపై మళ్లీ విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – రమణ, మత్స్యకారుడు, వాడరేవు -
పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు చిలకలూరిపేటటౌన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ పథకానికి విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎం. నరేంద్ర జ్యోతి రూ. 1,00,116ల విరాళాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి నిత్యాన్నదానానికి సికింద్రాబాద్ సికింద్రాబాద్ వెంకటాపురానికి చెందిన వి. కల్కి చరణ్, శివానిల పేరిట కుటుంబ సభ్యులు రూ. లక్ష విరాళాన్ని అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో దర్శనం కల్పించి ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటం అందచేశారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరు లీగల్: రైతులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆదివారం ఒక ప్రకనటలో డిమాండ్ చేశారు. పొన్నూరు మండలంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ వారికి అండగా నిలిచిన వారితో పాటు నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దారుణమని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించడంలో విఫలమైందని మండిపడ్డారు. గిట్టుబాటు ధర లేక గోదాముల్లో దాచుకున్న మొక్కజొన్న బస్తాలను అక్రమ నిల్వలంటూ టీడీపీ నాయకులు దాడి చేసిన నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రైతుల పక్షాన నిలవడం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అనుచరులు చేసిన దుర్మార్గ చర్యను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులు, నాయకులపై వరసగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన యంత్రాంగం, పాలకులు పట్టించుకోకుండా సంఘీభావ కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు, రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన్ కృష్ణ, అంబటి వెంకటేశ్వరరావు, ఆకుల వెంకటేశ్వరరావు, షేక్ మీరజ్, షేక్ గౌస్, ఖాదర్ బాషా, మమత, అంబటి పార్వతితో పాటు మరి కొంతమంది నాయకులపై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లలో నమోదైన రెండు కేసులలో రైతులు, కూలీలు, నాయకులపై నమోదైన కేసులను పరిశీలిస్తే ఎమ్మె ల్యే ధూళిపాళ్ల నరేంద్ర కక్ష పూరితంగా వ్యవహరించినట్లు స్పష్టమవుతుందని వెల్లడించారు. కేసులను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. -
జాతీయ అథ్లెటిక్స్లో రవీంద్రకు బంగారు పతకం
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మండలంలోని గురవాయిపాలెం గ్రామానికి చెందిన జొన్నలగడ్డ నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. పంజాబ్ రాష్ట్రం ఆధ్వర్యంలో జమ్మూ, కశ్మీర్లో నిర్వహించిన 6వ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ (వైఎస్పిఏ) నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్ పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో 23.04 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకొని నాగరవీంద్ర బంగారు పతకం సాధించాడు. రవీంద్ర గతంలోనూ 2025 జూలైలో నేపాల్లో నిర్వహించిన 5 దేశాల అంతర్జాతీయ చాంపియన్షిప్ పోటీలో రాణించి 200 మీటర్లలో గోల్డ్ మెడల్ సాధించాడు. రవీంద్ర ఇప్పటికే పలు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. రవీంద్ర మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ ఇస్తున్న కోచ్ నెల్లూరుకు చెందిన ప్రవీణ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్న బంధువులు, స్నేహితులు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రోత్సాహంతో 2028లో జరగనున్న ఒలంపిక్స్లో భారత్ తరపున పాల్గొని 200 మీటర్లు పరుగు పందెంలో బంగారు పతకం సాధించగలనని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరువెస్ట్(క్రీడలు): నైట్ క్యాజిల్స్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన అండర్–15 బాలబాలికల చెస్ పోటీలు విజయవంతంగా ముగిశాయని పోటీల నిర్వాహకుడు వైవీకే చక్రవర్తి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాలుర విజేతలుగా పునీత్, శ్రీ లక్ష్మీ కార్తికేయ, చేతన్ ముక్కపాటి, మర్రెడ్డి తేజ్ భరత్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కట్టెపోగు నిలిచారన్నారు. బాలికల విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, ధార్మిక నూతి, కావ్య ఏఎన్ఎస్ఎస్ లు నిలిచారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సీహెచ్ రవీంద్ర రాజు, సీనియర్ కోచ్ మురళీకృష్ణ, వై.హరిహరరాయులు, ఇంటర్నేషనల్ మాస్టర్ బాలచంద్ర ప్రసాద్లు బహుమతులు ప్రదానం చేశారన్నారు. పోటీల్లో మొత్తం 120 మంది చిన్నారులు పాల్గొన్నారని తెలిపారు. ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్లో 50 జట్లు తలపడగా ఆదివారం సులోచన, మొబిన్ సీసీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువతలో ఆరోగ్యకరమైన జీవని శైలిని ప్రోత్సహించే లక్ష్యంతో డ్రగ్స్ వద్దు బ్రో నినాదాన్ని తీసుకువచ్చారని, అదే స్ఫూర్తితో ఈగల్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఆడు బ్రో కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి యువకుడు కనీసం రెండు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మొబైల్ఫోన్లు, ఇంటర్నెట్లో గడపడం వల్ల శారీరక ధారుడ్యం తగ్గిపోతుందని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే ఏపీ ఈగల్ టోల్ఫ్రీ నెంబర్ 1972కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం గెలుపొందిన మొబిన్ సీసీ జట్టుకు కప్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ నగేష్బాబు, డీఎస్పీ శాంతరాజ్, ధనంజయ, వెంకటరావు, పెంచలయ్య, వినోద్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
యువతి బలవన్మరణం కేసులో హైడ్రామా
యద్దనపూడి: మండలంలోని అనంతవరంలో శనివారం ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆదివారం యద్దనపూడి పోలీస్స్టేషన్ వద్ద, అనంతవరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివరాలు.. అనంతవరంలోని బీసీ కాలనీకి చెందిన కుంచాల వీరకుమారి (27) తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని మరణించిన విషయం విధితమే. మృతురాలి తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేని వివాహం చేయటానికి ప్రయత్నం చేశారని ఎస్ఐ రత్నకుమారి ఇచ్చిన స్టేట్మెంట్తో ఆదివారం పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. కాగా ఎస్ఐ రత్నకుమారి నిరక్షరాస్యులైన తాము చెప్పిన స్టేట్మెంట్ను వక్రీకరించి స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఆమె ఇష్టానుసారం ఫిర్యాదు నమోదు చేసుకోవటం దారుణమంటూ యద్దనపూడి పోలీస్స్టేషన్ వద్ద ఆదివారం మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు మీడియా ముందు వాపోయారు. తమ కుమార్తె బలవన్మరణానికి బీసీ కాలనీకి చెందిన తన్నీరు అశోక్ కారణమని, వీరకుమారి ఆత్మహత్య అనంతరం అతడు కుటుంబంతో సహా గ్రామం వదిలి పరారయ్యాడని అతని వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డ మృతికి అశోక్ కారణమని ఫిర్యాదు చేసినప్పటికీ ఎస్ఐ రత్నకుమారి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహంతో ధర్నా పోస్టుమార్టం నిర్వహించిన వీరకుమారి మృతదేహాన్ని ఆమె మరణానికి కారణమని చెబుతున్న నిందితుడు అశోక్ ఇంటిముందు ఉంచారు. తమకు న్యాయం జరిగే వరకు తమ కుమార్తె మృతదేహనికి అంత్యక్రియలు నిర్వహించబోమని తెగేసి చెప్పారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు.. నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్ఐ రత్నకుమారిని ప్రశ్నించగా దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడు ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని చెప్పటం గమనార్హం. ఈ క్రమంలో స్టేషన్కు వెళ్లిన మీడియా సిబ్బందిని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు ఇక్కడ మీడియాకు ఏం పని అంటూ ప్రశ్నించారు. నిందితుడు తమ కుమార్తెను లోబరచుకొని ఆత్మహత్యకు ప్రేరేపించి ఆమె మరణానికి కారకుడయ్యాడని, సెల్ఫోన్లో ఉన్న ఆధారాలతో అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే తామే అతనిపై చర్యలు తీసుకోవాల్సి వస్తోందని, అప్పటి వరకు తమ కుమార్తె మృతదేహన్ని నిందితుడి ఇంటిముందు నుంచి తొలగించబోమని, అంత్యక్రియలు కూడా నిర్వహించబోమని బాధిత కుటుంబ సభ్యులు తెగేసి చెబుతున్నారు.


