breaking news
Bapatla
-
సమానత్వంతో కూడిన స్వేచ్ఛ అవసరం
ఏఎన్యూ(పెదకాకాని): సమానత్వం లేని స్వేచ్ఛ ద్వారా కేవలం ధనవంతులు, శక్తివంతులు మాత్రమే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం న్యాయ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జస్టిస్ లావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న న్యాయ కళాశాలు విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించుకుని రాణించాలని పిలుపునిచ్చా రు. సుమారు 80 సంవత్సరాల స్వతంత్య్ర భారతంలో ఇప్పటికీ కులాలు, మతాలపరంగా దేశం విడిపోయి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో అంబేడ్కర్ పేర్కొన్న సౌభ్రాతృత్వాన్ని సాధించగలిగిన నాడే రాజ్యాంగంలో పేర్కొన్న పీఠికకు పరమార్థం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సభకు న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన హైకోర్టు పూర్వ న్యాయ మూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులుగా తాము విద్యార్థుల అవసరం నిమిత్తం తమ అనుభవాన్ని పంచేందుకు అవసరమైన సెమినార్లకు వీలైతే సెమిస్టర్ తరగతులకు కూడా హాజరు కావాలని సూచించారు. వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధర్ రావు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్న్స్ అన్ని రంగాలతో పాటు న్యాయ రంగంలో కూడా తీసుకువస్తున్న పరిణామ క్రమాన్ని అలాగే విద్యార్థులకు దాని యొక్క భవిష్యత్ ప్రయోజనాలను వివరించారు. విశ్రాంత వీసీ ప్రొఫెసర్ హరిగోపాల్రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుమారు 6 సంవత్సరాల పాటు ఎన్నో కేసులలో సాహసోపేతమైన ధైర్యవంతమైన తీర్పులను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావును ఏఎన్యూ గౌరవ విశిష్ట న్యాయశాస్త్ర ఆచార్యులుగా నియమిస్తున్నట్లు వీసీ ప్రకటించారు. కార్యక్రమంలో న్యాయవిభాగంలో ఏర్పాటు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సురేష్ కుమార్ తన వంతు సహాయంగా 25 వేల రూపాయలని ప్రకటించి విభాగంలో న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టార్ ఆర్.శివరామ ప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ ఎస్.ప్రభాకరన్, తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్ సభ్యులు జి.మోహన్ కృష్ణణ్, పూర్వ విద్యార్థి విభాగం అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదులు ఎర్రగొర్ల ఠాగూర్ యాదవ్, ఏఎన్యూ న్యాయ దిన్ ఫ్యాకల్టీ సిహెచ్ సుధాకర్ బాబు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ ఎ.గురవయ్య పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
రొంపిచర్ల: పొలానికి వెళుతూ అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని గోగులపాడు గ్రామంలో శనివారం జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలో గోగులపాడు గ్రామానికి చెందిన దావులూరి భాస్కరరావు(43) ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో బొగ్గరం రోడ్ వద్ద అలవాల మేజర్ కాలువ సమీపంలో గల తన పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్ నడుపుకొంటూ వెళుతున్నారు. పొలం దగ్గరకు రాగానే ఎత్తుగా ఉన్న రోడ్ నుంచి లోతులో ఉన్న పొలంలోకి ట్రాక్టర్ దించుతుండగా అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న భాస్కరరావు (43) దాని కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తిరగపడి ఉన్న ట్రాక్టర్ను పైకి లేపి, అక్కడ ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేశ్వరరావు తెలిపారు. ఈవీఎం గోదాముల పరిశీలన బాపట్ల: ఈవీఎం గోదాములను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదామును త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ శనివారం పరిశీలించారు. వీవీ ప్యాడ్, ఈవీఎం స్ట్రాంగ్ రూములను వివిధ రాజకీయపార్టీల నాయకుల సమక్షంలో గతంలో వేసిన సీల్ తొలగించి గోదాములను పరిశీలించారు. ఆ గోదాములకు సీలు వేయించి వాటిని పరిశీలించారు. ఈవీఎం తనిఖీ వివరాలను ఈ ఎంఎస్ పోర్టల్లో నమోదును ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను భద్రపరచాలన్నారు. సీసీ కెమెరాలను, ఈవీఎం గోదాములను జాగ్రత్తగా పర్యవేక్షించాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట ఇన్చార్జి డీఆర్ఓ లవన్న, బాపట్ల ఆర్డీఓ హరికుమార్, తహసీల్దార్ సలీమా, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మహిళల టీ–20 క్రికెట్ ప్రారంభం మంగళగిరి రూరల్: మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఎపిఎల్) టీ–20 క్రికెట్ తొలి సీజన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకలకు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారా బ్రాహ్మణి, డబ్ల్యూఏపీఎల్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న భారత మహిళా క్రికెటర్ మిథాలిరాజ్ సంయుక్తంగా డబ్ల్యూఎపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. రాయలసీమ జెన్స్టార్ విజేత శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్ జుట్టు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుకు మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాయలసీమ జెన్ స్టార్ జట్టు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయలసీమ జెన్ స్టార్ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి గోదావరి గోల్డెన్ ఈగల్ జట్టును 116 పరుగులు చేశారు. వీరిలో కెప్టెన్ హెన్రీట్టా పెరీరా 63 పరుగులు, గుండుపల్లి ఉద్విత 30 పరుగులతో రాణించారు. రాయలసీమ జెన్ స్టార్లో బి అనూష మూడు వికెట్లు పద్మజ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన రాయలసీమ జెన్ స్టార్ జట్టు మూడు వికెట్లు నష్టానికి 120 పరుగులు చేసి విజయం సాధించింది రాయలసీమ జెన్ స్టార్ లో ఓపెనర్లు సీత సాయి 33 పరుగులు శుభశ్రీ 23 పరుగులు చేశారు. బౌలింగ్లోను బ్యాటింగ్లోను పద్మజా రాణించింది. రెండవ మ్యాచ్ అమరావతి చాంపియన్స్కు వైజాగ్ ఫైర్ బర్డ్స్కు మధ్య మ్యాచ్ జరిగింది. ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్బాబు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా రాధాష్టమి వేడుకలు
తాడేపల్లి రూరల్: ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి ఉన్న రాధా శ్యాంసుందర్ మందిరంలో శనివారం రాధాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున 4.30 గంటల నుంచి స్వామి వారికి ధూప, దీప, హారతులు, విశేష కీర్తనలు నిర్వహించారు. 9 గంటలకు భజనలు, కీర్తలు, అనంతరం శ్రీమాన్ పవనపుత్ర ప్రభు, శ్రీమాన్ చక్రధారి ప్రభు ప్రవచనం చేశారు. సాయంత్రం 5 గంటలకు మహాకీర్తనలు, 6 గంటలకు పంచామృతాలతో రాధాకృష్ణులకు మహా శంఖాభిషేకం నిర్వహించారు. చిన్నారుల భరతనాట్యం, కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకున్నాయి. 7 గంటలకు ఇస్కాన్ బాలికలచే బృందావనంలో కృష్ణుడు గోప బాలురు, గోప బాలికలతో చేసిన లీలలను నాటక రూపంలో ప్రదర్శించారు. రాత్రి 8 గంటలకు శ్రీమాన్ బలరాం ప్రభు ప్రత్యేక ప్రవచనం జరిగింది. 108 రకాల పిండివంటలతో భోగా అర్పించి, భక్తులకు మహా ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను శ్యామసుందర్ అచ్యుత దాస పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎలిమెంటరీ స్కూల్ కాంప్లెక్స్ తరగతులను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య కమిషనర్ తమీమ్ అన్సారియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో శిక్షణ అంశాలపై చర్చించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి సూచనలు చేశారు. హాజరు శాతాన్ని పెంచాలని సూచించారు. విద్యార్థులతో కలసి భోజనం చేశారు. తాడేపల్లి ఎంఈవో డి. నాగేశ్వరరావు, హెచ్ఎం భీమిరెడ్డి తాతిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నగరంపాలెం: వినాయక చవితిని పురస్కరించుకుని గుంటూరు నగరం కొరిటెపాడులో ఉన్న కల్యాణ రామాలయంలో వాయుపుత్ర కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన మండపంలో శనివారం లడ్డూ వేలం నిర్వహించారు. వేలంలో లడ్డూను రూ.6,66,666లకు భక్తుడు రెడ్డిబత్తుల శ్రీనివాసరెడ్డి దక్కించుకున్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వంగల పున్నారెడ్డి, వంగల సతీష్రెడ్డి, కత్తి సందీప్రెడ్డి, యేటిగడ్డ వెంకటరెడ్డి. కారసాని శ్రీనివాసరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: తాము 2016 నుంచి చేసిన పనికి న్యాయంగా రావాల్సిన జీతం బకాయిలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ స్వరూప్కాంత్ డిమాండ్ చేశారు. గుంటూరు జీజీహెచ్లో గత నెల నుంచి అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ వైద్యులు ప్రతిరోజూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టుకుని నినాదాలు చేశారు. డాక్టర్ స్వరూప్కాంత్ మాట్లాడుతూ తమకు న్యాయంగా ఇవ్వాల్సిన జీతం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర సమస్యలను కూడా పరిష్కరించడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఉషారాణి, డాక్టర్ కమల, డాక్టర్ సునీత, డాక్టర్ సుధా రాణి, డాక్టర్ దేవకుమార్, డాక్టర్ అజయ్, డాక్టర్ రామకృష్ణ గాజుల, డాక్టర్ రాజా, డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు ఓటరుగా నమోదు కావాలి
గుంటూరు వెస్ట్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి ఉపాధ్యాయులకు సూచించారు. గతంలో తయారు చేసిన ఓటరు జాబితాను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. రాజకీయపార్టీల ప్రతినిధులతో స్థానిక కలెక్టరేట్లోని వీసీ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుని పదవీ కాలం 2027 మార్చి 29వ తేదీన ముగుస్తుందన్నారు. ఈనెల 28న ఉపాధ్యాయ ఓటరు నమోదు కార్యక్రమానికి బహిరంగ నోటీస్ విడుదల చేస్తామన్నారు. నవంబరు 6వ తేదీ వరకు ఓటరు నమోదుకు ఫారం–19 స్వీకరణ జరుగుతుందని చెప్పారు. నవంబరు 25న ముసాయిదా ఓటరు జాబితా విడుదల, డిసెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 25వ తేదీ నాటికి అభ్యంతరాల పరిష్కారం జరుగుతుందని వివరించారు. డిసెంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల జరుగుతుందని చెప్పారు. సర్లో పెండింగ్ చాలా తక్కువ డీఆర్వో మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (సర్) కింద 1,68,220 నోటీసులు జారీ చేయగా, 1,094 మాత్రమే విచారణ పెండింగ్లో ఉందన్నారు. ఫారం–6 12,044, ఫారం–7 2,047, ఫారం–8 9,085 దరఖాస్తులు అందాయన్నారు. బుక్ ఏ కాల్ కింద రాష్ట్రంలో అత్యధికంగా వచ్చిన కాల్స్లో గుంటూరు జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. సమావేశంలో ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, తెనాలి ఆర్డీఓ కె.శ్రీరమణి, ఈఆర్ఓలు ఐ.కిషోర్, పద్మావతి, గంగరాజు, ముఖ్య టౌన్ ప్లానింగ్ అధికారి రాంబాబు, వైఎస్సార్ సీపీ ప్రతినిధి వై.పిచ్చిరెడ్డి, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి వాసు తదితరులు పాల్గొన్నారు. డీఆర్వో షేక్ ఖాజావలి -
ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్కు జట్టు ఎంపిక
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి లోని కెవికె గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో హాకీ ఇండియా 10వ ఎస్ఎన్బీపీ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్–2026 (అండర్ 16) బాలుర కోసం సామ్రాట్ హాకీ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఎంపిక ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఎంపిక ట్రయల్స్కు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 75 మంది యువ హాకీక్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించి సామ్రాట్ హాకీ అకాడమీ జట్టులో స్థానం పొందారు. రిటైర్డ్ పీడీ దాసరి కోటేశ్వరరావు,ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్స్ జి.రవి, పి.పవన్ కుమార్, నేషనల్ హాకీ అంపైర్ డి సురేష్, నేషనల్ హాకీ ప్లేయర్ పి ప్రసన్నకుమార్లు ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు అక్టోబర్ 1 నుంచి 7 వరకు మహారాష్ట్రలోని పూణేలో జరగనున్న హాకీ ఇండియా 10వ ఎస్ఎన్బీపీ ఆల్ ఇండియా హాకీ టోర్నమెంట్–2026 లో సామ్రాట్ హాకీ అకాడమీ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపిక ట్రయల్స్ అనంతరం మొత్తం 40 మంది క్రీడాకారులను కోచింగ్ క్యాంపునకు ఎంపిక చేశారు. జాతీయస్థాయి టోర్నమెంట్కు క్రీడాకారులను సన్నద్ధం చేయడానికి ఈనెల 20 నుంచి 30 వరకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈసందర్భంగా సామ్రాట్ హాకీ అకాడమీ ఫౌండర్, చైర్మన్ చెన్నం మల్లికార్జునరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో హాకీ క్రీడాభివృద్ధికి, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించడానికి అందిస్తున్న విలువైన సహకారం, ప్రోత్సాహం, మార్గదర్శకత్వానికి హాకీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరీ జి.హర్ష వర్ధన్కు సామ్రాట్ అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే గోవర్ధనరెడ్డి సతీమణి మృతి
కర్లపాలెం(బాపట్లటౌన్): మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి భార్య వెంకటేశ్వరమ్మ(74) శనివారం మృతిచెందారు. మృతురాలికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని కర్లపాలెంలోని కుమారుడు ఇంటివద్దనే అభిమానుల సందర్శనార్ధం ఉంచారు. ఆదివారం ఉదయం స్వగ్రామమైన ఏట్రవారిపాలెంలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు మాజీ ఎమ్మెల్యే గోవర్ధనరెడ్డిని పరామర్శించి తమ సంతాపాన్ని తెలియజేశారు. సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు బాపట్ల : మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్దన్రెడ్డి సతీమణి వెంకటేశ్వరమ్మ మృతదేహానికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పూలమాల వేసి నివాళులర్పించారు. గోవర్దన్రెడ్డిని పరామర్శించి సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శులు మోదుగుల బసవపున్నారెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు యల్లావుల ఏడుకొండలు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, భార్గవి సురేష్,ఆట్ల నాగేశ్వరరెడ్డి, అయ్యప్పరెడ్డి, కావూరి శ్రీనివాసరెడ్డి, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, బుల్లిరెడ్డి,జాలిరామిరెడ్డి తదితరులు ఉన్నారు. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు
తెనాలిరూరల్: తెనాలి–విజయవాడ ప్రధాన రహదారిపై నందివెలుగు సమీపంలో శనివారం ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం.. తెనాలి నుంచి మంగళగిరి వైపు కారు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసున్న మహిళ కారు నడుపుతూ వస్తుండగా వేగం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి కారు దూసుకెళ్లి బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, 108 అంబులెన్న్స్కు సమాచారం అందించారు. అనంతరం మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లుడికి ప్రమాదం.. ఆగిన మామ గుండె
ఆప్యాయంగా చూసుకునే అల్లుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న వార్త ఆ మామ గుండె తట్టుకోలేకపోయింది. అల్లుడికి ఏం జరిగిందోనన్న ఆందోళనలో ఉండగానే మామ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఒకవైపు ఆసుపత్రిలో అల్లుడు వెంటిలేటర్పై మృత్యువుతో పోరాడుతుండగా.. ఇంటివద్ద మామ మృతిచెందాడు. ఒకే కుటుంబంలో చోటు చేసుకున్న ఈ రెండు విషాదాలు బంధువులను, కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచాయి. నరసరావుపేట టౌన్: రోడ్డు ప్రమాదంలో అల్లుడు తీవ్రంగా గాయపడ్డాడన్నా విషయం తెలుసుకొని మామ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు. నరసరావుపేట పట్టణంలో శనివారం చోటుచేసుకున్న విషాద సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బాబాపేటకు చెందిన షేక్ మహబూబ్ సుభాని(48) టైలరింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రెండవ కుమార్తె చాంద్బీకి సయ్యద్ ఇబ్రహీం ఖలీల్ తో 12 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి 10 ఏళ్ల బాలుడు ఉన్నాడు. చాంద్బీ తండ్రి ఇంటిపక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని నివశిస్తూ ఉండటంతో అల్లుడు, మనవడితో సుభానికి ఎంతో అనుబంధం ఉండేది. ఇబ్రహీం ఖలీల్ ఎస్ఆర్కేటీ కాలనీ వద్ద దుకాణం ఏర్పాటు చేసుకొని లారీ మెకానిక్ పనులు చేస్తూ ఉండేవాడు. శుక్రవారం రాత్రి ఎస్ఆర్కేటీ కాలనీ సమీపంలో కర్నూలు – గుంటూరు జాతీయ రహదారి రోడ్డు దాటుతుండగా స్కూటీపై వచ్చిన వ్యక్తి ఢీకొన్నాడు. సంఘటనలో ఖలీల్ తల భాగానికి బలమైన గాయమైంది. దీంతో క్షతగాత్రుడిని స్థానికులు నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని మరో ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. అల్లుడి ప్రమాద వార్త తెలుసుకున్న మహబూబ్ సుభాని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. అతన్ని కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తండ్రి మరణం, భర్త మృత్యువుతో పోరాటం ఒకవైపు భర్త ఖలీల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. తండ్రి మృతిచెందడంతో చాంద్బీ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. భర్తకు ఏమవుతుందోనన్నా ఆందోళన.. అప్పటికే తండ్రిని కోల్పోయిన విషాదం.. ఈ రెండు ఘటనలతో చాంద్బీ కుటుంబం తీవ్ర విషాదంలోకి మునిగిపోయింది. 10 ఏళ్ల బాలుడికి తాతను కోల్పోయిన బాధతో పాటు తండ్రి పరిస్థితి తెలియని వేధన మిగిల్చింది. అల్లుడి ప్రమాద వార్త విని మామ ప్రాణాలను విడవటం స్థానికులను సైతం కలిచివేసింది. సమాచారం అందుకున్న నరసరావుపేట రూరల్ ఎస్ఐ కిశోర్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల వినూత్న నిరసన
బాపట్లటౌన్: ఎందరో ప్రాణాలు కాపాడుతున్నాం...మా బతుకులు రోడ్డున పడకుండా కాపాడండి అంటూ ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు. ఏరియా వైద్యశాలలోని పెరట్లో ప్లకార్డులు చేబూని మొక్కలకు నీరు పోస్తూ వినూత్న రీతిలో శనివారం నిరసన తెలిపారు. సత్యంరాజు మాట్లాడుతూ పర్యావరణానికి ఆక్సిజన్ అందిద్దామనే ఉద్దేశంతో మొక్కలు నాటుతున్నాం, కానీ మా బతుకులకే ఊపిరి అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా జీవితాలకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించాలన్నారు.సృష్టిలో ప్రతి మనిషి సమానమే. ఒకరు ఎక్కువ కాదు... మరొకరు తక్కువ కాదు. అలాంటప్పుడు మాకెందుకు ఈ వివక్ష? మాకెందుకు తక్కువ జీతాలు? మేము చేస్తున్న సేవకు తగిన గుర్తింపు, భద్రత, గౌరవం ఎందుకు దక్కడం లేదు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించేటప్పుడు మా కష్టాలను మేము మర్చిపోతాం. వారి ప్రాణాలు కాపాడటమే మా బాధ్యతగా భావిస్తాం. ప్రజలకు ఆరోగ్యం అందించే మేము మాత్రం మా కుటుంబాల భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులు నళిని, బి.నీలిమ, సుధా పరిమళ తదితరులు పాల్గొన్నారు. -
ఎగవేతకే ఐపీ టోపీ!
బాపట్లఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● 14 రోజుల గడువుతో రూ.కోట్ల వ్యాపారం ● డబ్బులు రాకపోతే దిక్కేది? ● వరుస ఐపీలతో దిగుమతి వ్యాపారుల్లో గుబులు ● అడ్డగోలుగా ఎగుమతి, దిగుమతి లైసెన్స్లు ● రెండున్నరేళ్లలో రూ.వంద కోట్లకుపైగా ఐపీలు ● చివరకు రైతుపైనా ప్రభావం పడే ప్రమాదం 7రైతులను తక్షణమే ఆదుకోవాలి విజయపురి సౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 534.90 అడుగులకు చేరింది. ఇది 177.8698 టీఎంసీలకు సమానం. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.8 వేలు, గరిష్ఠ ధర రూ.11,300, మోడల్ ధర రూ.9,500 వరకు పలికింది. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,506 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. గుంటూరు మిర్చి యార్డులో కోట్లాది రూపాయల విలువైన మిర్చి సరుకు రోజూ చేతులు మారుతోంది. రైతులు తీసుకొచ్చిన సరుకును ఎగుమతి వ్యాపారులకు దిగుమతి వ్యాపారులు విక్రయించడం ద్వారా వ్యాపార లావాదేవీలు సాగుతున్నాయి. అయితే రూ.కోట్ల విలువైన సరుకు చేతులు మారుతున్నా.. దానికి తగిన ఆర్థిక భద్రత మాత్రం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సరుకు తీసుకున్న ఎగుమతి వ్యాపారికి తర్వాత చెల్లింపులకు 14 రోజుల వరకు గడువు ఉండటం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. -
సాయం చేయబోతే ప్రాణమే పోయింది
మిర్యాలగూడ అర్బన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు మానవత్వంతో స్పందించిన ఒక వ్యక్తిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అద్దంకి–నార్కట్పల్లి బైపాస్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దుప్పలపూడికి చెందిన పొలినేని శ్రీనివాసరావు(36), ఆయన భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలతో కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో మిర్యాలగూడలోని అద్దంకి– నార్కట్పల్లి బైపాస్ నందిపాడు క్రాస్ రోడ్డు వద్ద హనుమాన్పేటకు చెందిన బొల్లెపల్లి వెంకటేశ్వర్లు బైక్ స్కిడ్ అయి రోడ్డుపై పడిపోయాడు. అతడిని గమనించిన శ్రీనివాసరావు తన కారును రోడ్డు పక్కకు నిలిపి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్లోకి క్షతగాత్రుడిని ఎక్కిస్తున్న క్రమంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎల్పీజీ గ్యాస్ లారీ అతివేగంగా వచ్చి అప్పటికే రోడ్డుపై ఆగి ఉన్న మూడు కార్లను ఢీకొట్టడంతో పాటు అంబులెన్స్ను ఢీ కొట్టింది. ఈక్రమంలో శ్రీనివాసరావుపై నుంచి లారీ వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అంబులెన్స్లో ఉన్న మహిళా సిబ్బంది చిట్యాల స్వప్నకు గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ చెన్నకేశవులును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ సోమనర్సయ్య తెలిపారు. మనకెందుకు నాన్న.. వెళ్లిపోదామని చెప్పినా వినలేదు ‘రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని చూసి మా నాన్న కారు ఆపారు. మనకెందుకు నాన్న, ఎవరైనా హెల్ప్ చేస్తారులే అని చెప్పినా వినలేదు’ అని శ్రీనివాసరావు 12 ఏళ్ల కుమారుడు కన్నీరుమున్నీరుగా రోధించాడు. మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు వెళ్లి కళ్లముందే లారీ కిందపడి మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నామని మృతుడి భార్య బోరున విలపించింది. -
తీరప్రాంత పరిశుభ్రత అందరి బాధ్యత
జిల్లా మత్స్యకార సంఘం ప్రెసిడెంట్ కన్నా భూశంకర్రావు బాపట్లటౌన్: తీరప్రాంత పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా ప్రెసిడెంట్ కన్నా భూ శంకర్రావు తెలిపారు. సూర్యలంక తీరంలో శనివారం జరగనున్న స్వచ్ఛ సాగర్..సురక్షిత సాగర్ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత పరిశుభ్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం సూర్యలంక బీచ్ వద్ద తలపెట్టిన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని పర్యావరణాన్ని పరిరక్షించేందుకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. భూమండలం చుట్టూ మన కోసం కలిగి ఉన్న ముఖ్యమైన వనరులు సముద్రం ఒకటి. కాలుష్యం నుంచి కోట్లాది జల జీవరాశులను కాపాడేందుకు దానిని శుభ్రంగా ఉంచడానికి అందరం కలిసి పని చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, ప్రజలు ఉద్యోగస్తులు పాల్గొని పర్యావరణాన్ని కాపాడాలని, సముద్ర జీవుల సంరక్షణకు తోడ్పడాలని మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి జిల్లా సెక్రెటరీ కోకిలగడ్డ చంద్రబాబు, జిల్లా ఇన్చార్జి మోపిదేవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ నగరంపాలెం: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కోరుకుంటున్న మధ్యంతర భృతి, కరువు భత్యం బకాయిలు ఇతరత్రా సమస్యల పరిష్కారానికై దశల వారీగా కృషి చేస్తానని ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్ అన్నారు. శుక్రవారం గుంటూరు తాలుకా కార్యాలయ ఆవరణలోని పెన్షన్ హోమ్లో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి ఆధ్వర్యంలో ఏపీజేఏసీ రాష్ట్ర నాయకుల అభినందన సభ, రాష్ట్ర విస్తృత కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అసోసియేషన్ సుదీర్ఘకాలంగా కోరుతున్న అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణకు సీఎం అంగీకరించడంపై ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. దీనికై సహకరించిన ఏపీజేఏసీ రాష్ట్ర నాయకత్వంలో ఏపీజేఏసీ చైర్మన్ విద్యాసాగర్, ఏపీజేఎసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణను సత్కరించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగ్గా, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపుతో ఈనెల 29, 30 తేదీల్లో అన్ని జిల్లాల్లో జరిగే ధర్నా విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర అదనపు కార్యదర్శిగా ఎన్.కుమార్రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్టేట్ సెక్రటరీ జనరల్ జి.ప్రభుదాస్, రాష్ట్ర కోశాధికారి ఎన్వీ.సుబ్బరాయుడు, సీనియర్ రాష్ట్ర నాయకులు అబ్దుల్కరీం, దాలి నాయుడు, పెద్దన్న గౌడ్ పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: ఏపీ ఎన్జీవో హోంలో ఏపీఎన్జీ జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డి.వి.రమణలను సన్మానించారు. అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
గణనాథుడికి కలెక్టర్ప్రత్యేక పూజలు
బాపట్లటౌన్: పేదల ఆరోగ్యం కోసం పరితపించే మాపై కనికరం చూపండంటూ ఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు. శుక్రవారం భోజన విరామ సమయంలో ఏరియా వైద్యశాలలో ప్రతిజ్ఞచేస్తూ నిరసన తెలియజేశారు. సత్యంరాజు మాట్లాడుతూ సేవ చేయడంలో వెనకడుగు వేయం మా విన్నపాలను కనికరించి మన్నించండంటూ ప్రాధేయపడ్డారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేవ చేయడానికి వెనకడుగు వేయబోమని, విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం మేము ముందుంటాంం మా జీవితాల కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. ఖాళీ కడుపులతోనైనా విధులకు వస్తాం కానీ మా విన్నపాలు ఖాళీగా మిగలకూడదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సు అనూష, ఫార్మాసిస్టులు నళిని కుమారి, శాంతి, మనోజ, సుధా కుమారి, బయో మెడికల్ ఇంజనీర్ నళిని కుమారి, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనిల్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు బహటం నీలిమ పాల్గొన్నారు. -
ప్రొబేషన్ ప్రకటించాలని డిమాండ్
నరసరావుపేట: గత ప్రభుత్వం విడుదల చేసిన 2023 నోటిఫికేషన్ ద్వారా పశుసంవర్ధక శాఖలో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ (ఏహెచ్ఏ)లుగా నియమితులైన తమకు ప్రొబేషన్ ప్రకటించి, ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఏహెచ్ఏలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. పల్నాడుకు చెందిన సుమారు వంద మంది ఏహెచ్ఏలు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాను కలిసి వినతిపత్రం సమర్పించారు. పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ, 2024 మార్చి 1 నాటికి విధుల్లో చేరామని, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం శాఖాపరమైన డిపార్ట్మెంట్ పరీక్షలు, యాంటిసెడెంట్స్ తనిఖీలను ఫిబ్రవరి 2026 నాటికే విజయవంతంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. తాము పల్నాడు జిల్లాలో 169 మంది ఉండగా, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 219 మంది ఉన్నారని పేర్కొన్నారు. అర్హతలన్నీ పూర్తయినా గత ఏడు నెలలుగా తమకు ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నామని అన్నారు. నేటికీ రూ.15 వేలు మాత్రమే కన్సాలిడేటెడ్ పే ఇస్తుండటంతో, కుటుంబాలను పోషించుకోవడం అత్యంత భారంగా మారిందన్నారు. సుమారు 60 మందికి పైగా నాన్–లోకల్ సిబ్బంది సొంత జిల్లాలకు దూరంగా నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. తమ సమస్యలపై కలెక్టర్తో పాటు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పి. రామారావుకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఏహెచ్ఏల ఆందోళన -
వాట్సాప్ స్టేటస్పై వివాదం
రేపల్లె: రేపల్లె పట్టణంలో శుక్రవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని 21వ వార్డుకు చెందిన ఓ యువకుడు అమీద్ తన మొబైల్ ఫోన్ వాట్సాప్ స్టేటస్లో మాజీ ముఖ్యమంత్రి జగన్న్మోహన్రెడ్డి ఫొటోను ఉంచినందుకు అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకులు అతనిపై దాడికి దిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడిలో యువకుడు అమీద్ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు కరిముల్లా, గౌసియా దాడి ఎందుకు చేశారని ప్రశ్నించేందుకు వెళ్లగా వారిపై కూడా దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ముగ్గురిని రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ నేతలు చిత్రాల ఓబేదు, చిమట బాలాజీ, కరేటి శేషగిరిరావు, కృష్ణారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నాగలక్ష్మి, వార్డు ఇన్న్చార్జి ఖాదర్ తదితరులు ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి అండగా నిలిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదుగురు నిందితుల అరెస్టు
కిలో గంజాయితో పాటు ఆటో స్వాధీనం మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణ శివార్లలో గంజాయి కలిగి ఉన్న ఐదుగురిని అరెస్టు చేసి వారి నుంచి కిలో గంజాయి, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డాక్టర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మార్కాపురం సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో సీఐ అల్తాఫ్ హుస్సేన్తో కలిసి ఆయన కేసు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. పట్టణంలోని సాయిబాలాజీ థియేటర్ సమీపంలోని కంపచెట్లలో ఐదుగురు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం వారి వద్ద కిలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. గంజాయితో పాటు ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో పట్టణంలోని మల్లారెడ్డి కాలనీకి చెందిన మురికిపూడి విజయ్, తాళ్లపల్లి నరేంద్ర, జంకె రామిరెడ్డి నగర్కు చెందిన గొట్టెముక్కల మహానంది, మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన షేక్ జాన్బాషా, పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం సిద్దార్ధనగర్కు చెందిన దూదేకుల లాల్చాంద్బాషా ఉన్నారు. త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామానికి చెందిన దమ్ము నాసరయ్య పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. వీరిలో విజయ్, షేక్ జాన్బాషా, చాంద్బాషాలపై సస్పెక్ట్ షీట్లు, పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. గంజాయి విక్రయం, వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు పేర్కొన్నారు. పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మా భూములు తీసుకోవాలనుకోవడం దారుణం
మార్టూరు(చినగంజాం): నాగరాజుపల్లి గ్రామ గిరిజనులు కుటుంబాలు ( సుగాలీలు) తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని మా భూములు మాకే దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తండా వాసులు కలెక్టర్ వి. వినోద్కుమార్కు విన్నవించుకున్నారు. మార్టూరు రెవెన్యూ కార్యాలయం వద్ద కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో నాగరాజుపల్లి గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలకు చెందిన రమావత్ శ్రీను నాయక్, కళ్యాణ్ నాయక్, పర్ష్యానాయక్ తదితరులు కలెక్టర్ కలిసి తమ సమస్యను విన్నవించుకొని అర్జీ అందజేశారు. నాగరాజుపల్లి గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాలు గత 70 సంవత్సరాలుగా గ్రామ సర్వే నంబర్ 516,517,528,529,530లలో భూములను సాగు చేసుకుంటూ మెరకలు, గుంటలు ఉన్న భూమిని బాగు చేసుకొని జీవనం చేస్తున్నామని తెలిపారు. ఆ భూమిపై ఆధారపడి భార్యభర్తలు, పిల్లలతో కూడిన కుటుంబాలు జీవిస్తున్నామని తమకు వేరే జీవనాధారం లేదని చెప్పారు. ప్రభుత్వం వారు సదరు భూమికి సంబంధించి పాస్పుస్తకాలు, పట్టాలు ఇచ్చారని కలెక్టర్కు తెలియజేశారు. అయితే ఆ భూములను ఆన్లైన్ చేయక పోవడంతో పలు మార్లు కలెక్టర్ దృష్టికి సమస్యను కూడా తీసుకెళ్ళామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇటీవల ఆ భూములను ఎంఎస్ఎంఈ ఫుడ్ పార్క్ నిర్మాణం చేసేందుకు ఇస్తున్నట్లు తెలిపి వాటిని స్వాధీనం చేయాల్సిందిగా తమపై ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూములను కోల్పోతే 70 గిరిజన కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందని వాపోయారు. దీనికి సంబంధించి కేంద్ర ఎస్టీ కమిషన్కు కూడా ఫిర్యాదు చేశామని, వారి దగ్గరు నుంచి తమకు ఉత్తర్వులు అందాయని తెలిపారు. వాటిని పరిశీలించి తమ భూములు తమకు ఉండేలా న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. అనంతరం భూముల పరిశీలన చేసే నిమిత్తం కలెక్టర్ సందర్శిస్తారని తెలుసుకున్న ఆయా కుటుంబాలు సభ్యులు భూముల వద్ద వేచి చూసారు. కలెక్టర్ కార్యాలయ పనుల నిమిత్తం రాకపోవడంతో గిరిజన కుటుంబాలు వెనుదిరిగి వెళ్లిపోయాయి. -
ఏఎన్యూలో ఫీజుల గోల్మాల్
నకిలీ చలానాలు, రసీదులతో సిబ్బంది చేతివాటం ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, చలానాల్లో సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు సమాచారం. పరీక్షల విభాగం, వసతి గృహాలు, ప్రిన్సిపాల్స్ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొంత మంది సిబ్బంది అనధికారిక, నకిలీ చలానాలు, రశీదులు సృష్టించి జేబులు నింపుకుంటున్నారు. పలువురు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి ఆ నగదుకు నకిలీ చలానాలు, రశీసులు చూపిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నగదు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారిక బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఉద్యోగులను అక్కడి నుంచి తొలగించకపోగా విచారణకు చర్యలు కూడా చేపట్టలేదు. బాలుర వసతి గృహంలోనూ విద్యార్థులకు అనధికార రశీదులు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల వర్సిటీలో నకిలీ చలానాలు, నకిలీ రశీసులతో కొందరు కింది స్థాయి సిబ్బంది ఆర్థికంగా లబ్ధిపొందుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గెస్ట్హౌస్లో రూముల పేరుతో వసూళ్లు వర్సిటీ లెక్కల్లో రావడం లేదనేది చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దూరవిద్యకేంద్రం కోడింగ్ విభాగం, పరీక్షా భవన్లోని సీఈ కార్యాలయంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొందరు రోజువారీ వేతన కార్మికులు, అవుట్ సోర్సింగ్, క్యాజువల్ లేబర్ సిబ్బంది వసూళ్లు లక్షలు దాటినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి వసూలు చేసిన నగదుపై ప్రత్యేక ఆడిట్ చేపట్టాల్సిన అవసరం ఉంది. కీలక విభాగాల్లో చలానాలు, రసీదు పుస్తకాలు, నగదు రిజిస్టర్లు, ఖాతాలు, ఆర్థిక లెక్కలపై స్వతంత్ర సంస్థ ద్వారా ప్రత్యేక ఆడిట్ చేయించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై పరీక్ష భవన్ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ రెడ్డి ప్రకాశ్ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలైన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లను రవాణా కేసులో నిందితుడైన వెంకట రామాంజనేయులును కృష్ణలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ జె.మురళీకృష్ణ తెలిపారు. భవనాలు కూల్చేవే.. మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని రాజుపాలెంకు చెందిన అలుగు లక్ష్మీనారాయణ పాత భవనాలు కూల్చడం, స్లాబులు పగలగొట్టడం, పునాదులు తీయడం వంటి పనులు చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని తమ్ముడు సాయి, మేనల్లుడు గుంజా వెంకట రామాంజనేయులు అతని వద్దే పనిచేస్తుంటారు. రామాంజనేయులు వడ్డేశ్వరంలో ఉంటుండగా, సాయి పెనమలూరు మండలం కానూరులోని మురళీనగర్లో ఉంటున్నాడు. భవనాల తొలగింపు పనుల్లో అవసరమైనప్పుడు జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు వాడుతుంటారు. వినాయక చవితి పండుగ పురస్కరించుకుని లక్ష్మీనారాయణ, రామాంజనేయులు స్వగ్రామానికి వెళ్లారు. కుంట గ్రామంలో లక్ష్మీనారాయణ జెలిటిన్ స్టిక్స్, డిటోనేటర్లు కొనుగోలు చేశాడు. వాటిని బ్యాగ్లో పెట్టి సాయికి ఇవ్వాలని వీరాంజనేయులుకు ఇచ్చి వేరే పని మీద వెళ్లిపోయాడు. ఈ నెల 14వ తేదీన అతను శ్రీశైలం నుంచి విజయవాడ బస్సు ఎక్కాడు. అదేరోజు రాత్రి 10గంటల సమయంలో వారధి వద్ద దిగే తొందరలో మరో బ్యాగ్ తీసుకుని బస్సు దిగాడు. అంతటా అతను మురళీనగర్లో ఉంటున్న సాయి వద్దకు చేరుకుని బ్యాగ్ తెరిచి చూడగా దుస్తులు ఉన్నాయి. బ్యాగ్ మారిపోయిందని నిర్ధారించుకుని వడ్డేశ్వరంలోని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఆర్టీసీ బస్సులో పేలుడు పదార్థాలు ఉన్న ఒక్క బ్యాగ్ లభించిందని కలకలం రేగింది. పోలీసులు బస్సులో పేలుడు పదార్థాలు రవాణా చేస్తున్న వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న రామాంజనేయులు బుధవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి కృష్ణలంక పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో తన మేనమామలు లక్ష్మీనారాయణ, సాయి కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు చెప్పాడు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రామాంజనేయులును అరెస్ట్ చూపించి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు లక్ష్మీనారాయణ, సాయిలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
అమర్తలూరు (వేమూరు): వినాయక నిమజ్జనంలో యువకుడు విద్యుత్ షాక్కు గురైన ఘటన అమర్తలూరు మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమర్తలూరు మహాత్మాగాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన వినాయకుడి ఊరేగింపు జరిగింది. ఊరేగింపు సమయంలో అడ్డు వచ్చిన విద్యుత్ వైర్లు తప్పిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు హర్షవర్ధనకు విద్యుత్ షాక్కు గురై కింద పడ్డాడు. 108 సహాయంతో తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్కు మెరుగైన వైద్యం కోసం తరలించారు. -
21లోపు దరఖాస్తు చేసుకోవాలి
నగరం: మద్యం షాపుల లైసెన్స్ పునరుద్ధరణకు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయ చెప్పారు. స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్లో గురువారం స్టేషన్ పరిధిలోని నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల పరిధిలోని మద్యం దుకాణాల లైసెన్స్దారులతో సమావేశం నిర్వహించారు. విజయ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని 12 ఓపెన్ కేటగిరి, ఒక గీత కులాల రిజర్వుడ్ కేటగిరి మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. 01–10–2026నుంచి 30–09–2027 వరకు లైసెన్స్ పునరుద్ధరణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్దారులు పాత లాగిన్ వివరాలతో ఎకై ్సజ్శాఖ పోర్టల్లో లాగిన్ అయి రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. రెన్యూవల్ దరఖాస్తులు ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు చేయాలన్నారు. పునరుద్ధరణ కాని మద్యం దుకాణాలను ఎకై ్సజ్ పాలసీ 2024 ప్రకారం లాటరీ ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ అధికారి నరేష్కుమార్, సీఐ హర్షవర్దనరెడ్డి పాల్గొన్నారు. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ విజయ -
నేడు వీఆర్ఏల సమస్యలపై సామూహిక రాయబార కార్యక్రమం
● అప్పటికీ పరిష్కరించకపోతే సమ్మె చేయటానికి సిద్ధం.. ● సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బందకి సాహెబ్ మంగళగిరి రూరల్: వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి సాముహిక రాయబార కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నుట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం(సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు బందకి సాహెబ్ తెలిపారు. మండల పరిధి చినకాకాని గ్రామం నేతన్న సర్కిల్ వద్ద గురువారం వీఆర్ఏలు నిరాహార దీక్ష చేపట్టారు. బందకి సాహెబ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. నెలకు రూ.11 వేల నుంచి రూ.11,500 మాత్రమే వేతనం అందుతోందని చెప్పారు. తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడో మదనపల్లిలో రెవెన్యూ ఆఫీస్లో ఫైల్స్ తగలబడితే అప్పటి నుంచి మమల్ని నిబంధనలకు విరుద్ధంగా రాత్రి విధులు నిర్వహింపజేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అదనపు టీఏ, డీఏ, రక్షణ సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15–16 ఏళ్లుగా ప్రమోషన్లు లేక వీఆర్ఏలు ఇబ్బందులు పడుతున్నారని, అర్హులందరికీ వన్న్టైమ్ సెటిల్మెంట్ ద్వారా ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం సీసీఎల్ఏ అధికారితో సామూహికంగా రాయబారం నిర్వహించి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. -
22న ఓటర్ల జాబితా.. రిజర్వేషన్లపై ఉత్కంఠ
76కు చేరిన డివిజన్లు స్పష్టమైన సరిహద్దులు నగరంలో 57 నుంచి 76కు పెరిగిన డివిజన్లు సరిహద్దులు, డోర్ నంబర్లతో తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఈ నెల 22న ఫొటో ఎలక్టోరల్ జాబితాల ప్రచురణ మేయర్, కార్పొరేటర్ల స్థానాల రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠ -
అక్టోబర్ 11 నుంచి ఉత్సవాలు
లక్ష్మీపురం(గుంటూరుఈస్ట్): ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యులను, పొరుగు వారిని స్వచ్ఛతా ప్రచారంలో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాలని, తద్వారా వారు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పరిసరాలను నిర్వహించడానికి దోహదపడాలని డీఆర్ఎం సుధేష్ణ సేన్ అన్నారు. రైల్వే బోర్డు ఆదేశాల మేరకు ‘స్వచ్ఛతా హి సేవ–స్వచ్ఛతా పక్షోత్సవం–2026’ ప్రచారంలో భాగంగా గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హి సేవ–స్వచ్ఛతా పక్షత్సవం కార్యక్రమంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యాలయ ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది శ్రమదానం చేసి సుమారు ఆరు టన్నుల చెత్తను తొలగించారు. డీఆర్ఎం మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవా–స్వచ్ఛతా పక్షోత్సవం–2026 ప్రచారం అక్టోబర్ 10వ తేదీ వరకు డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో డివిజన్ సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్లు కూల్చడం సరికాదు
–––––––––––––––––––––––––– బాపట్లటౌన్: పేదల ఇళ్లు కూల్చడం సరికాదని సీపీఎం జిల్లా నాయకులు ఎన్.బాబురావు తెలిపారు. బాపట్ల 7వ వార్డు శారదాపురి కాలనీలోని శ్మశానవాటిక ప్రహరీ పక్కన పోరంబోకు స్థలంలో 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న సుమారు 20 నిరుపేద కుటుంబాలను ఖాళీ చేయించాలని కొందరు ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం దుర్మార్గమన్నారు. గురువారం బాధితుల పక్షాన ఆందోళనకు దిగారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ వృద్ధులు, వితంతువులు, నిరుపేద కుటుంబాలు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా అక్కడ నివాసం ఉంటున్నారన్నారు. ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు పేదలను భయపెట్టే విధంగా వ్యవహరించడం తగదన్నారు. బాపట్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేని అనేక కట్టడాలు ఉన్నప్పటికీ వాటి జోలికి అధికారులు వెళ్లడం లేదని, ప్రభుత్వ స్థలాలను బడాబాబులు ఆక్రమించుకున్నా నోటీసులు ఇచ్చే ధైర్యం చేయడం లేదన్నారు. నిరుపేదలు నివాసం ఉండేందుకు చిన్న గూడు నిర్మించుకుంటే మాత్రం అధికారాన్ని ఉపయోగించి వారిపై జులుం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు వెంటనే నోటీసులు, తొలగింపు చర్యలను నిలిపివేసి, సంబంధిత కుటుంబాలతో చర్చించి సమస్యకు మానవతా దృక్పథంతో పరిష్కారం చూపాలన్నారు. పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నాలు కొనసాగితే సీపీఎం ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం బాపట్ల పట్టణ నాయకులు కె.శరత్, బాధితులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా నాయకుడు ఎన్.బాబురావు -
దళితులంటే అంత చిన్న చూపా!
● కమ్మ, కాపుల కోసమే కూటమి ప్రభుత్వం ఉందా! ● దళిత యువకుడు చీకటి గోపి మృతిపై సిట్ ఏర్పాటు చేయాలి ● సీఐ, ఎస్ఐ, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి ● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగలక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): దళితులంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు, కూటమి ప్రభుత్వం ఉన్నది కేవలం కమ్మ, కాపుల కోసమేనా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. దళిత యువకుడు చీకటి గోపి మృతిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన సీఐ, ఎస్ఐ, స్టేషన్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎమ్మార్పీఎస్, వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ, దళిత, గిరిజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కమ్మ, కాపులకు ఉన్న విలువ దళితులకు లేదని విమర్శించారు. పోలీసుల దారుణాలకు సాయికృష్ణ, చీకటి గోపి బలయ్యారని అన్నారు. సాయికృష్ణపై 22 కేసులు ఉన్నాయని రౌడీషీట్, హత్య కేసు, గంజాయి, పోక్సా వంటి కేసులు ఉన్నాయని, చీకటి గోపిపై ఎలాంటి కేసులు లేవన్నారు. కానీ కాపు సామాజిక వర్గానికి చెందిన సాయికృష్ణ కోసం చంద్రబాబు ఆగమేఘాల మీద సిట్ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. సాయికృష్ణ సిట్ వ్యవహారంలో దళిత బిడ్డ హోం మంత్రి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కాపులు, కమ్మ సామాజిక వర్గాల ఓట్లతోనే అధికారంలోకి రాలేదని, మాల, మాదిగల ఓట్లతో గద్దెనెక్కారన్న విషయాన్ని మరిచారన్నారు. చీకటీ గోపి నిజానికి జనసేన పార్టీ గ్రామ కార్యదర్శిగా ఉన్నాడన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ మరిచారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు సుమారు 25 మంది దళిత యువకులు మృతి చెందారని కనీసం వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. కమ్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు వర్గ పోరులో హత్యలు చేసుకుంటే వారిని పరామర్శించేందుకు మంత్రులు, చంద్రబాబు పార్టీ నాయకులు అధికారులు వెళ్లి వారికి పొలాలు, స్థలాలు ఇచ్చారని గుర్తు చేశారు. చీకటి గోపి వ్యవహరంలో తక్షణమే సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఆలస్యం చేస్తే ఉద్యమం రాజధానినే అతలాకుతలం చేసే స్థాయికి చేరుతుందన్న విషయం చంద్రబాబు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపాలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు) మాట్లాడుతూ చీకటి గోపి మృతి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఏం జరిగిందనే విషయాల్ని తేటతెల్లం చేయలేకపోయారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. గోపి మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటి వరకు పోలీస్ అధికారులు హోం మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణం అన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, కాంగ్రెస్ పార్టీ, పలు దళిత ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
చోరీ సొత్తు స్వాధీనం చీరాల: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను గురువారం చీరాల జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక జీఆర్పీ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఆర్పీ ఎస్ఐ సీహెచ్ కొండయ్య వివరాలను వెల్లడించారు. ఈనెల 7వ తేదీ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఏ–1 కోచ్లో ప్రయాణిస్తున్న అసోంకు చెందిన చాణిక్య మెక్కు చెందిన ల్యాప్ టాప్ బ్యాగ్ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ సంఘటనపై అతడు చీరాల రైల్వే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జీఆర్పీ డీఎస్పీ జి.మురళీధర్ ఆదేశాల మేరకు జీఆర్పీ సీఐ ఎస్కే మౌలా షరీఫ్ ఆధ్వర్యంలో చీరాల జీఆర్పీ ఎస్ఐ సీహెచ్ కొండయ్య దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ హనుమంత్ నాయక్ నిందితునిగా గుర్తించారు. గురువారం చీరాల రైల్వేస్టేషన్లోని ప్లాట్ఫాం 4 వద్ద అనుమానాస్పదంగా ఉన్న అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి లెనివో ల్యాప్టాప్, సామ్సంగ్ గెలాక్సీ ఎస్8 –2023 వైఫై ట్యాబ్, ఆధార్, పాన్కార్డు, ఓటర్ ఐడీ తదితర కార్డులు ఉన్న చిన్న జిప్ పర్సును స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. ప్రజలు రైలు ప్రయాణ సమయంలో విలువైన వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తుల కదలికల గురించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాలని జీఆర్పీ సీఐ షేక్ మౌలా షరీఫ్ సూచించారు. -
సేవా సంకల్ప్ అభియాన్లో భాగస్వాములు కావాలి
చెరుకుపల్లి: ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా జీవించాలంటే తప్పనిసరిగా బలవర్ధక ఆహారం తీసుకోవాలని జిల్లా వైద్యాధికారిణి ఎస్ విజయమ్మ అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మండలంలోని కనగాల పీహెచ్సీలో సేవా సంకల్ప్ అభియాన్ 2026 కార్యక్రమాన్ని ఆమె గురువారం ప్రారంబించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, డిజిటల్ అక్షరాస్యత, యువతకు ఉపాధి కల్పించాలని ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంపై వైద్యాధికారులు ప్రత్యేక ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం అక్టోబర్ 17వ తేదీ వరకు జరుగుతుందని, ప్రతి రోజూ సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో కనగాల వైద్యాధికారులు భావన, డాక్టర్ జీవనలత, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ విజయమ్మ -
ఉద్యోగం దైవాధీనం!
జీజీహెచ్లో ఉద్యోగాలకు ఏడాదిగా ఎదురు చూపులు ● ఉద్యోగ నియామకాలపై కిమ్మనని జీజీహెచ్ అధికారులు ● ‘సాక్షి’ కథనంతో ఈ ఏడాది ఏప్రిల్లో మెరిట్ లిస్టు ప్రకటన ● అప్పటి నుంచి పోస్టింగులు ఇవ్వని వైనం ● ఏడాది దాటితే నోటిఫికేషన్ మారిపోతుందని దరఖాస్తుదారుల ఆందోళన ● గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్ అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం సుమారు రూ.6 కోట్ల ఐపీతో దిగుమతి వ్యాపారులకు నోటీసులు కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డులోని వ్యాపార వర్గాల్లో ఐపీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మిర్చి వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొన్నట్లు చెబుతున్న ఓ ఎగుమతి వ్యాపారి తాజాగా రూ.6 కోట్ల మేర ఐపీ దాఖలు చేసినట్లు సమాచారం. ఐపీ ప్రక్రియలో భాగంగా తనతో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సుమారు 64 మంది మిర్చి దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీంతో సంబంధిత వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. యార్డులో మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారం నిత్యం కోట్ల రూపాయల్లోనే లావాదేవీలు జరుగుతుంటాయి. దిగుమతి వ్యాపారుల నుంచి ఎగుమతి వ్యాపారులు మిర్చిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ అనంతరం విదేశీ మార్కెట్లకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య సరుకు సరఫరా, చెల్లింపులు, బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి ఐపీ దాఖలు చేసి సంబంధిత దిగుమతి వ్యాపారులకు నోటీసులు పంపడం బాధితుల్లో ఆందోళన రేపుతోంది. తమ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని పలువురు భయపడుతున్నారు. రెండున్నర ఏళ్లుగా యార్డులో పలువురు కోట్ల రూపాయల్లో ఐపీలు పెట్టడం గమనార్హం. తాజాగా మరొకరు అదే బాటలో వెళ్లడం మిర్చి వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఏడాదిలో ఐదో ఐపీ.. ఈ ఏడాది అన్ సీజన్ జూన్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూసుకొంటే ప్రస్తుతం ఐపీ దాఖలు చేసిన వ్యాపారి ఐదవ వ్యక్తి. గతంలో నలుగురు ఎగుమతి వ్యాపారులు ఇదే రీతిన దివాళా తీశారు. ఈ ఏడాది సుమారు రూ.27 కోట్లకు పైగా ఐపీ దాఖలు చేశారు. ఇటీవల మిర్చి ఎగుమతిదారులు ఐపీ దాఖలు చేస్తున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై మిర్చి రైతులు, దిగుమతి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల అధికారుల తీరుతో ఎంతో మంది నిరుద్యోగులు నష్టపోతున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. కానీ రిక్రూట్మెంట్ చేయడం లేదు. గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారుల తీరుతో అభ్యర్థులు ఉద్యోగాలు రాక మనోవేదనకు గురవుతున్నారు. అధికారులు నత్తకు పోటీగా పనిచేస్తూ విమర్శలు మూటకట్టుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశించినా... గుంటూరు వైద్య కళాశాలలో ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ అధికారులు సెప్టెంబర్ 9, 2025న నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 61 పోస్టులు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే ఏడాది నవంబరులో ఫైనల్ మెరిట్ లిస్టు పెట్టి ఉద్యోగాలు ఇస్తామని రిక్రూట్మెంట్ షెడ్యూల్లో ప్రకటించారు. దీంతో గుంటూరు జీజీహెచ్, జీజీహెచ్ నాట్కో క్యాన్సర్సెంటర్, గుంటూరు వైద్య కళాశాల, గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పలు రకాల టెక్నీషియన్ పోస్టులు, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంతో మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఏడాదిగా ఉద్యోగపు నియామకపు ఉత్తర్వులు అభ్యర్థులకు అందించలేదు. కనీసం ప్రొవిజన్ మెరిట్ లిస్టు కూడా ప్రకటించలేదు. దీనిపై ‘నో.. టిఫికేషన్!’ శీర్షికన ఈ ఏడాది ఏప్రిల్ 15న ‘సాక్షి’లో కథనం వెలువడడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ త్వరితగతిన ఉద్యోగ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య కళాశాల అధికారులు ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ప్రకటించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సైతం పూర్తి చేశారు. ఆప్రక్రియ పూర్తయి నాలుగు నెలలు గడుస్తున్నా నేటికీ అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ నియామకపు ఉత్తర్వులు ఇవ్వకుండా గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఏడాదిన్నరగా జీతాలు లేవు.. 2025 మార్చిలో గుంటూరు జీజీహెచ్ నాట్కో సెంటర్లో 27 మంది ఉద్యోగులు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు పొందారు. నేటికి ఉద్యోగులు విధుల్లో చేరి ఏడాదిన్నర అయింది. అయినప్పటికీ ఇప్పటికీ ఒక్క నయాపైసా జీతం చెల్లించలేదు. ఏడాదిన్నరగా వేతనాలు లేకుండానే ఉసూరు మంటూ క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాల అధికారులు ఒకరిపై ఒకరు నెపాలు వేసుకుంటూ ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమన్వయ లోపమే శాపం వైద్య కళాశాల, జీజీహెచ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. వారికి నచ్చిన ఫైల్స్ మాత్రం పరస్పర ఒప్పందంతో త్వరితగతిన పూర్తి చేసుకుంటున్నారు. ఎంతో మందికి ఉపయోగపడే పనులు మాత్రం పక్కన పడేస్తుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా జీజీహెచ్ చైర్మన్గా వ్యవహరించే జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ఈ సమస్యపై దృష్టి సారించి, త్వరితగతిన రిక్రూట్మెంట్ జరిగేలా, జీతాలు త్వరగా మంజూరయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. పురపోరుకు సిద్ధం ఉద్యోగాలు సకాలంలో భర్తీ చేయని పక్షంలో గత ఏడాది విడుదల చేసిన నోటిఫికేషన్ కూడా రద్దయ్యే అవకాశం ఉందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాది లోపు రిక్రూట్మెంట్ చేయకపోతే ఆటోమ్యాటిక్గా నోటిఫికేషన్ రద్దవుతుంది. ఈనేపథ్యంలో నెల, రెండు నెలల్లో చేయాల్సిన నియామకాలు ఏడాది గడిచినా జరగకపోవడంతో ఉద్యోగాలు వస్తాయా.. రావా అన్న.. డైలమాలో దరఖాస్తుదారులు కొట్టుమిట్టాడుతున్నారు. -
మా మొర ఆలకించండి మహాప్రభో..
కాంట్రాక్ట్ ఉద్యోగులు బాపట్లటౌన్: ఆందోళన చేయడం మా అభిమతం కాదు..ఆవేదనతో గళం విప్పుతున్నాం.మా మొరపై ఆలోచించండి మహాప్రభో అంటూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం ఏరియా వైద్యశాల ఆవరణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు ప్లేకార్డులు చేభూని ఆందోళన వ్యక్తం చేశారు. కూరపాటి సత్యంరాజు మాట్లాడుతూ ఖాళీ కడుపులతో ఆందోళన చేయడం మాకు ఇష్టం లేదు.. ప్రజల ప్రాణాలు కాపాడే సేవకులం మేము. మా బాధను అర్థం చేసుకోండి.. మా డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచించండి అంటూ దీన స్థితిలో ప్రాదేయపడి అడుగుతూ ఆందోళన చేస్తున్న పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. చేతుల్లో తమ డిమాండ్లను ప్రతిబింబించే ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లాలన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నాం. మా సేవలను గుర్తించండి.. మా జీవితాలను కూడా ఆలోచించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్సులు తబిత, కల్పన, అనూష, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ అనిల్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్లు సునీత, నీలిమ, బహటం తదితర కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. -
కొత్త జోరు... పాత గుర్రు!
బాపట్లగురువారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026గుంటూరు జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. ఎందరో సీనియర్ రాజకీయ నాయకులు టీడీపీలో ఉన్నారు. మొదటి నుంచీ ఈ జిల్లాలో వారే పెత్తనం చెలాయిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికల తరువాత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. జిల్లాలో చినబాబు వర్గంగా ఉన్న జూనియర్ నాయకుల హవా పెరిగింది. స్థానిక ఎన్నికల వేళ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి ఈ ఎన్నికల్లో బుద్ధి వచ్చేలా చేయాలని వారి అనుచరులు, అభిమానులు తేల్చి చెప్పేస్తున్నారు. 7తెనాలి: స్థానిక మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.8,500, గరిష్ఠ ధర రూ.12 వేలు, మోడల్ ధర రూ.10 వేల వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.6029 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది. విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 534.20 అడుగులకు చేరింది. ఇది 176.4614 టీఎంసీలకు సమానం.జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ బాపట్ల టౌన్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా జిల్లాలో గణేష్ నిమజ్జనాలు ప్రారంభం కావడంతో జిల్లాలోని ఆయా ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలోని క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాలోని సిబ్బందికి నిమజ్జన ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో వేడుకలను జరుపుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నిమజ్జనాలు జరిగే ప్రదేశాల్లో అధిక సంఖ్యలో సిబ్బందిని ఏర్పాటు చేశామని తెలిపారు. స్థానిక పోలీసు అధికారులు ఆయా ఉత్సవ కమిటీ సభ్యులతో రోజూ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యల గురించి సూచించాలన్నారు. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఇసుక బకెట్లు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన విధానం తదితర ప్రతి విషయాన్ని పరిశీలించాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి సమయంలో బీట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. మండపాల కార్యనిర్వాహక సభ్యులు సహకరించాలని సూచించారు. లక్ష్మీపురం: జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంకర్ల సమావేశం ఆ రోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరుగుతుందని అన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కందుల దుర్గేష్ హాజరు కానున్నారని తెలిపారు. అనంతరం డీఆర్సీ సమావేశం ఉంటుందన్నారు.సాక్షి ప్రతినిధి, గుంటూరు: అధికారిక పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు జిల్లాలో రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులు ఏది ఇవ్వాలన్నా గతంలో సీనియర్ల సిఫార్సుల మేరకే ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం జూనియర్ల హవా నడుస్తోంది. ఆ నాయకులు చెప్పిన వారికే పదవులు, అధికారులకు ఉన్నతస్థాయి పోస్టింగ్లు దక్కుతున్నాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదవులే కాకుండా జిల్లాలో ఇసుక, మట్టి, పేకాట క్లబ్బులు వంటి అక్రమ దందాలు సైతం జూనియర్ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్న పరిస్థితి. దీంతో సీనియర్లు చినబాబుకు ఎదురు తిరగలేక, పార్టీలో ప్రాధాన్యత కోల్పోయి తలెత్తుకు తిరగలేక అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తూతూ మంత్రంగా వారంలో రెండు రోజులు నియోజకవర్గాల్లో తిరుగుతూ, అనంతరం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో వ్యాపారాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది సీనియర్లు అయితే వాళ్ల పరిధిలో ఉన్న మట్టి, గ్రానైట్, ఇతర మైనింగ్ వ్యవహారాల్లో నెలవారీగా ఫిక్స్డ్ ఆదాయం వచ్చేలా సెట్ చేసుకుని పార్టీకి దూరంగా తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. తీవ్ర అసంతృప్తిలో సీనియర్లు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్లు పార్టీకి దూరంగా ఉండటంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇదే కొనసాగితే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం కూడా ఉందనే భయంతో ఉన్నట్లు సమాచారం. జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి గుంటూరు ఎంపీగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడంపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయలుకు లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా పదవి కట్టబెట్టడంపై కూడా సీనియర్లు గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి పార్టీలో ఉన్నా... జిల్లాలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్కుమార్, రాజకీయాల్లో సీనియర్ అయిన కన్నా లక్ష్మీనారాయణ వంటి వారికి సరైన ప్రాధాన్యం లేకపోవడంపై వారి వర్గీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీనియర్లలో ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వకపోగా, జిల్లాలో వారు చెప్పిన వారికి నామినేటెడ్ పోస్టులు దక్కకపోవడం తీవ్ర అవమానకరంగా ఉందని అనుయాయుల వద్ద సీనియర్లు వాపోతున్నట్లు సమాచారం. జిల్లాలో ఇచ్చిన ప్రధాన పోస్టుల్లో జీడీసీసీ బ్యాంకు చైర్మన్, జీడీఎంఎస్ పోస్టులు ఎంపీలు చెప్పిన వారికి ఇవ్వడం, ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ యార్డుగా పేరొందిన గుంటూరు మిర్చి యార్డు చైర్మన్గా జూనియర్ ఎమ్మెల్యే అనుచరుడికి ఇవ్వడంపై సీనియర్లు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా పార్టీలో సీనియర్గా ఉన్న కొమ్మాలపాటి శ్రీధర్ను పక్కనపెట్టి, మండల స్థాయి లీడర్కు పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కేటాయించడంపై సీనియర్ ఎమ్మెల్యేలంతా గుర్రుగా ఉన్నారు. నాలుగైదుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన తమపై పార్టీలో పెత్తనం చేసేందుకు మండల స్థాయి లీడర్ను పెట్టి అవమానిస్తారా అంటూ మండిపడుతున్నట్లు సమాచారం. సీనియర్ల నియోజకవర్గాల్లో సైతం వారికి తెలియకుండా రాష్ట్ర స్థాయి పదవులు చినబాబు వర్గానికి చెందిన వారికి ఇవ్వడంతో ఏమీ మాట్లాడలేక తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులతోపాటు, వారి వర్గంగా ఉన్న అనుయాయులంతా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి బుద్ధి చెబుదామంటూ ద్వితీయ శ్రేణి నాయకులంతా సీనియర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పైకి అంతా బాగానే ఉన్నట్లు కనిపించినా, సీనియర్లలో పార్టీ పట్ల అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందనేది మాత్రం అక్షర సత్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తమ మాట వినకుండా జూనియర్ల పెత్తనం నడిస్తే మాత్రం వారిని ఓడించి పార్టీకి బుద్ధి చెప్పాలనే తలంపుతో ఉన్నట్లు సమాచారం. -
‘స్వచ్ఛతా హీ సేవ’కు ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ లక్ష్మీపురం: జిల్లాలో పెద్ద ఎత్తున ‘స్వచ్ఛతా హీ సేవ 2026’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. కార్యక్రమంపై రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. పౌరులు, సంస్థలు, నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చే విధంగా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. పరిశుభ్రత లక్ష్యంగా ఉన్న ప్రాంతాల్లో మార్పు తీసుకురావడం, పరిశుభ్రమైన బహిరంగ ప్రదేశాలు, స్వచ్ఛ పాఠశాల–యువత భాగస్వామ్యం, సఫాయి మిత్ర సురక్ష ఏవం సమ్మాన్ శిబిరాలు వంటి అంశాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, గృహ కంపోస్టింగ్ను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 1వ తేదీన ఉదయం 8 గంటలకు దేశవ్యాప్తంగా ‘ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్’ పేరుతో సామూహిక శ్రమదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు బొక్కా అగస్టీన్ లక్ష్మీపురం: రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల నమోదు చేసుకునేందుకు కాలపరిమితిని అక్టోబరు 25వ తేదీ వరకు పొడిగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు బొక్కా అగస్టీన్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం డీఆర్ఓ ఖాజావలికి ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానించినా తక్కువ గడువు పెట్టిందన్నారు. దీంతో అర్హులైన దివ్యాంగులు తహసీల్దార్ కార్యాలయాలు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సర్వర్లు పనిచేయకపోవడం, తహసీల్దార్ కార్యాలయాల్లో కులం, ఆదాయం, ఇతర సర్టిఫికెట్లు సమయానికి వచ్చే పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వీటిని పరిశీలించి గడువును పొడిగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొరిటెపాడు (గుంటూరు): సహకార సొసైటీల్లోని ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు తెలిపారు. బ్రాడీపేటలోని బ్యాంకు పరిపాలనా భవనంలో బుధవారం డీఎల్ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల అభ్యర్థనలను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులకు పదోన్నతులపై చర్చించారు. సీఈఓ వి.వి.ఎస్. ఫణికుమార్, గుంటూరు జిల్లా సహకార శాఖ అధికారి రత్నకుమారి, పల్నాడు జిల్లా సహకార శాఖ అధికారి నాగరాజు, ఆప్కాబ్ అధికారులు ఎం. శామ్యూల్ ధీరజ్, సీహెచ్. ధనాంజనేయులు పాల్గొన్నారు.నగరంపాలెం: జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో బుధవారం విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. పలు ప్రాంతాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, రద్దీ ప్రాంతాలు, ఆసుపత్రులు, బ్యాంక్లు, బస్టాండ్లు, విద్యాసంస్థలు, సున్నిత ప్రాంతాల్లో విజిబుల్ పోలీసింగ్ కొనసాగించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించి, గణేష్ ఊరేగింపుల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పెట్రోలింగ్ నిర్వహించారు. అనుమానిత వ్యక్తుల కదలికలు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాల తనిఖీలు చేపట్టారు. -
సగం కాలిన మహిళ మృతదేహం లభ్యం
తాడేపల్లి రూరల్(మంగళగిరి): తాడేపల్లి పట్టణ పరిధిలోని ఆశ్రమం రోడ్డులో రెడ్ల సత్రం వద్ద సగం కాలిన స్థితిలో ఓ మహిళ మృతదేహాన్ని బుధవారం పోలీసులు గుర్తించారు. తాడేపల్లి సీఐ వీరేంద్ర, ఎస్ఐ ఖాజావలి మృతదేహాన్ని పరిశీలించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతకగా మృతిచెందిన మహిళ ఫోన్తో పాటు బంగారు ఆభరణాలు లభించాయి. మృతిచెందిన మహిళ విజయవాడ కండ్రికకు చెందిన మాలకొండ మహేశ్వరి (44)గా గుర్తించారు. బంధువులు పోలీసులకు అందించిన సమాచారం మేరకు.. గత శనివారం సింగ్నగర్లో తను పనిచేస్తున్న కూరగాయల మార్కెట్ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయింది. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని కుమార్తె సింధూర లక్ష్మికి ఫోన్ చేసి స్విచ్చాఫ్ చేసింది. వెంటనే కుమార్తె బంధువుల సహాయంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో నున్న పోలీస్స్టేషన్తో తన తల్లి కనిపించడం లేదంటూ కుమార్తె ఫిర్యాదు చేసింది. పోలీసులు మాలకొండ సింధూర లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. మహిళ మృతదేహం విషయాన్ని తాడేపల్లి పోలీసులు డీఎస్పీ మురళీకృష్ణకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పదంగానే.. ఇదిలా ఉండగా మృతదేహం తీరు.. ఘటనా స్థలం పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. మృతిచెందిన మల్లేశ్వరి ఆశ్రమం రోడ్డులోకి ఎలా వచ్చింది.. పెట్రోల్ ఎక్కడ కొన్నది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆశ్రమం రోడ్డులో క్రిస్టియన్ శ్మశాన వాటిక గోడపక్కనే కంకర గుట్టపై తగలబడినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆమె వేసుకున్న చెప్పులు అదే ప్రాంతంలో విడివిడిగా దూరంగా పడి ఉన్నాయి. మహిళ ఒంటిపై ఉన్న మంగళసూత్రం, తాడు, చెవి దుద్దులు, ఫోన్ ఒక కవరులో పక్కన పెట్టిన ఉన్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా.. లేదా ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే ఎవరైనా మహిళను వేధించి పెట్రోల్ పోసి తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తగలబడిన ప్రాంతం నుంచి సుమారు 50 అడుగుల దూరంలో మృతదేహం వెల్లికిలా పడి ఉంది. పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ మృతిచెంది ఉంటే తగలబడినట్లు ఆనవాళ్లు అయినా ఉండాలి. అలాంటి గుర్తులు ఏమి కనిపించడం లేదు. మృతదేహం పూర్తిగా పురుగులు పట్టి ఉండడంతో స్పష్టంగా ఏం జరిగిందనేది పోలీసులు కూడా నిర్ధారించలేకపోతున్నారు. పైకి ఆత్మహత్య అని చెబుతున్నా వారికి పలు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం వద్ద పెట్రోల్ బాటిల్ కానీ, అగ్గిపెట్టె కానీ లభించలేదు. తన కుమార్తెతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా శరీరం అంతా మంటగా ఉందని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేసిందని నున్న పోలీసులు తెలిపారు. పెట్రోల్ పోసుకుని తగలపెట్టుకున్న తరువాత కుమార్తెకు ఫోన్ చేస్తే ఆ మంటలకు ఆమె ఫోన్, ఆభరణాలు క్యారీ బ్యాగ్లోకి ఎలా వచ్చాయి? కనీసం ఆ వస్తువులు కాలినట్లు కూడా కనిపించడం లేదు. సదరు మహిళ ఆత్మహత్య చేసుకుందామని అక్కడకు వస్తే మద్యం మత్తులో ఉన్న వారు ఏమైనా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 50 శాతం తగలబడిన మృతదేహం ఆనవాళ్లు కూడా అక్కడ పెద్దగా కనిపించడం లేదు. చిన్నచిన్న కాలిపోయిన గుడ్డముక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఘటనా స్థలం వద్ద పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఆ మహిళ ఆత్మహత్యా లేదా హత్యా అన్నది నిర్ధారించాల్సి ఉంది. జరిగిన ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే తప్ప ఏం జరిగిందనే వివరాలు బయటకు వస్తాయి. -
ఏఎన్యూ దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ఉమ్మడి ప్రవేశ పరీక్ష
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేష న్స్ (ఎంసీఏ) కోర్సుల ప్రవేశ పరీక్ష ఈనెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలలో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత పత్రాలను పరీక్ష కేంద్రంలో చూపించాలని తెలిపారు. ఒకవేళ దరఖాస్తులు అందించని అభ్యర్థులు నేరుగా అభ్యర్థి ఆధార్ కార్డు, ఫొటోతోపాటు రూ.500 తత్కాల్ ఫీజు చెల్లించి పరీక్ష కేంద్రాల్లో నేరుగా హాజరు కావచ్చన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు కేటాయించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కేంద్రంతో పాటు దగ్గరలో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్లి కూడా పరీక్షకు హాజరు కావచ్చని తెలిపారు. అభ్యర్థులు అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని సూచించారు ప్రవేశ పరీక్ష కేంద్రాలు సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు), ఆదిత్య డిగ్రీ కాలేజ్ (కాకినాడ), ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ (విశాఖపట్నం), గీతం డిగ్రీ కాలేజ్ (ఒంగోలు), గేట్ డిగ్రీ కాలేజ్ (తిరుపతి), శ్రీ కృష్ణవేణి ఐటీఐ కాలేజ్ (కర్నూలు), ఇంటెల్ ఇంజినీరింగ్ కాలేజ్ (అనంతపురం), విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ (కై కలూరు), చక్రధర్ డిగ్రీ కాలేజ్ (మాచర్ల), ఎిస్బీఎస్వైఎం డిగ్రీ కాలేజ్ (మైదుకూరు), ప్రభాస్ డిగ్రీ కాలేజీ (విజయవాడ), శాంతినికేతన్ డిగ్రీ కాలేజీ (శ్రీకాకుళం), గీతాంజలి డిగ్రీ కళాశాల (భీమడోలు), శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల సంఘం (నెల్లూరు) కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని వివరించారు. ఈ నెల 20న జరగనున్న ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల18 నుంచి అభ్యర్థులతు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఉపాధ్యాయ హక్కుల కోసం పోరాటం
రేపల్లె: ఉపాధ్యాయ హక్కుల కోసం నిరంతర పోరాటాలు చేస్తానని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఎం.హనుమంతరావు అన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ అభ్యర్థి ఎం.హనుమంతరావు పరిచయ కార్యక్రమం పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు చేసినట్లు గుర్తుచేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యలపై శాసనమండలిలో బలంగా గళమెత్తేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం కేటాయించిన శాసనమండలి స్థానాల్లో రాజకీయ ప్రభావం పెరిగిపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి హనుమంతరావును గెలిపించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సీహెచ్.మణిలాల్, యుటీఎఫ్ జిల్లా కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు వినయ్ కుమార్, నాయకులు జీ.శాంతారావు, సాయిప్రసాద్, గాదె సుబ్రమణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావు -
విద్యార్థినిని బెదిరించిన యువకుడు అరెస్ట్
తెనాలిరూరల్: ఇన్స్ట్రాగామ్లో పరిచయమై బీటెక్ విద్యార్థినిని నమ్మించి మోసం చేయడమే కాకుండా నగలను అపహరించి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ డి.రవీంద్రబాబు వివరాలను వెల్లడించారు. స్థానిక గంగానమ్మపేటకు చెందిన బీటెక్ విద్యార్థినికి ఇన్స్టాగ్రామ్లో కఠెవరం గ్రామానికి చెందిన కమాధుల సాయి అలియాస్ పవన్ సాయి పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు చెబుతూ నమ్మించి ఆమె నుంచి బంగారపు వస్తువులు, రూ. 40,700 నగదు, వెండి పట్టీలు తీసుకున్నాడు. వాటిపై ఉమా కీర్తన పలుమార్లు ప్రశ్నించడంతో ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను చంపుతానని, ఆమె వ్యక్తిగత ఫొటోలు బయటపెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాయిని అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1.30 లక్షల విలువైన బంగారపు గొలుసు, రెండు ఉంగరాలు, వెండి పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ సిహెచ్. రాజ్యలక్ష్మి నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించారని, ఆమెను డీఎస్పీ అభినందించారని తెలిపారు. సమావేశంలో ఎస్ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. చుట్టంలా వచ్చి చోరీలు.. చుట్టంలా వచ్చి కొద్ది రోజులు ఇంట్లో ఉండి విడతల వారీగా వస్తువులు దొంగిలించి పరారైన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ టు టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీఐ డి. రవీంద్రబాబు వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక ఐతానగర్కు చెందిన నిమ్మగడ్డ జితేంద్ర శ్రీనివాస ప్రసాద్ ఇంటికి తాడికొండ మండలం దామర్లపల్లి గ్రామానికి చెందిన బంధువు జాగర్లమూడి భరత్ వచ్చాడు. ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్న భరత్ తనకు ఇంటర్వ్యూ ఉందంటూ చెప్పి నమ్మించాడు. దాదాపు నెల రోజులపాటు ఉన్న భరత్, ఇంటిలో ఒక్కొక్కటిగా వస్తువులు దొంగిలించాడు. వెళుతూ శ్రీనివాస ప్రసాద్కు చెందిన వాహనాన్ని కూడా తీసుకెళ్ళాడు. ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.7.50 లక్షల విలువైన 40 గ్రాముల బంగారు గొలుసు, 15 గ్రాముల బంగారు పూసల గొలుసు, 18 గ్రాముల బంగారు గొలుసు(తాకట్టు), నిందితుడు అపహరించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసును చేధించిన ఎస్ఐ పి. సురేష్, సిబ్బంది ఆర్. రామకృష్ణ, పి. నరేంద్రబాబు కే. బాబురావు, జి.గణేష్ను డీఎస్పీ అభినందించినట్లు సీఐ చెప్పారు. సమావేశంలో ఎస్ఐ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల వేగం పెంచాలి
బాపట్ల: అభివృద్ధి కోసం అధికారులంతా వేగంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, డీఎంఎఫ్ నిధుల వినియోగంపై అనుబంధ శాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. అధికారులు సమయాన్ని వృథా చేయకుండా, నిబద్ధతతో పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. నిజాంపట్నం బొర్రవారిపాలెంలో రూ.30 లక్షలతో నిర్మించిన చెరువు కట్టను, రూ.10 లక్షలతో పాఠశాలలో ఏర్పాటు చేసిన తాగునీటి పథకాన్ని ప్రారంభించాలన్నారు. నగరం మండలం దిండి, అలపర్రు గ్రామంలో రూ.28 లక్షలతో నిర్మించిన సీపీడబ్ల్యూఎస్ పథకాన్ని ప్రారంభించాలని కలెక్టర్ చెప్పారు. ఏలేటిపాలెంలో సీపీడబ్ల్యూఎస్ పథకం కింద రూ.19 లక్షలతో చేపట్టిన నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. రేపల్లె తుమ్మల గ్రామంలో సీపీడబ్ల్యూఎస్ పథకం కింద రూ.24 లక్షలతో చేపట్టిన పనులు పూర్తికాగా, ఇంకొల్లు మండలం ఇంకొల్లు గ్రామంలో రూ.21 లక్షలతో పీడబ్ల్యూసీ, మరో రూ.8 లక్షలతో పీడబ్ల్యూసీ స్కీం కింద చేపట్టిన పనులు పూర్తయ్యాయన్నారు. పర్చూరులో పూర్తయిన డబ్ల్యూసీ స్కీమ్ నాలుగు పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. వేటపాలెం మండలం రామాపురం బీచ్ వద్ద తాగునీటి పథకం నిర్మాణానికి రూ.40 లక్షలు మంజూరు చేసినా ఇంతవరకు పూర్తి చేయకపోవడం, పనులు నిలిచిపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సదరు ఏఈకి షోకాజ్ నోటీస్ ఇవ్వాలన్నారు. అక్కయ్యపాలెం బీచ్ వద్ద రూ.30 లక్షలతో చేపట్టిన డ్రెస్ చేంజింగ్ రూమ్ పూర్తి కాకపోవడంపై, రూ.10 లక్షలతో షవర్, బాత్రూమ్ పనులు పూర్తి చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మైన్స్ ఏడీ శ్రీనివాసరావు, పీఆర్ ఎస్ఈ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంతరాజు, సీపీఓ షాలేము రాజు, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 24న జాబ్మేళా వినియోగించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన చీరాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించిన గోడపత్రాలను బుధవారం స్థానిక కలెక్టరేట్లో విడుదల చేశారు. చీరాల వైఏ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే జాబ్మేళాలో 20 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. వివరాలకు 79814 43777, 85559 01198, 90522 02833 ఫోను నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ షాలేము రాజు, జిల్లా నైపుణ్యాల అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ మాధవి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్కుమార్ -
అర్ధరాత్రి యువకుడిపై అమానుషం!
లక్ష్మీపురం: యువకుల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసిన ఘటనలో పోలీసులు స్థానిక టీడీపీ నేతల ప్రోదల్బంతో బాధితుడినే చితకబాదిన ఘటన జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక చవితి పండుగ సందర్భంగా స్నేహితులు ఏర్పాటు చేసిన వినాయక పందిరి వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో అరండల్పేటలోని ఓ బడ్డీ కొట్టు వద్దకు తూర్పు నియోజక వర్గానికి చెందిన కొందరు యువకులు ఆగారు. ఆ బడ్డీ కొట్టులో ఉండే వ్యక్తితో ముచ్చటిస్తున్న సమయంలో కొంతమంది మద్యం మత్తులో ఉన్న యువకులు వచ్చి వారితో అసభ్య పదజాలంతో మాట్లాడారు. ఇది సరికాదని చెప్పడంతో ఒక యువకుడిని మద్యం సేవించి ఉన్న వారు తీవ్రంగా కొట్టడంతో గాయాలపాలయ్యాడు. దీంతో బాధిత యువకుడు అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్దకు ఫిర్యాదు నిమిత్తం వెళ్లాడు. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న యువకులు పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారు. సదరు యువకులు ఓ టీడీపీ నేతకు చెందిన అనుచరులం అని తెలపడంతో అరండల్పేట పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ డ్రైవర్గా పని చేసే వ్యక్తి ఫైబర్ స్టిక్ తీసుకుని స్టేషన్లోపల బాధిత యువకుడిని లాఠీతో కొట్టి ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం ప్రారంభించాడని బాధితులు వాపోయారు. గాయపడి స్టేషన్కు వస్తే ఫిర్యాదు తీసుకోకుండా తనను ఇలా కొట్టడం సరికాదని చెప్పడంతో స్టేషన్లో ప్రైవేట్ డ్రైవర్తో పాటు కానిస్టేబుల్ సైతం ఇద్దరు కలిసి కింద పడేసి లాఠీలతో తీవ్రంగా కొట్టారని బాధితుడు తెలిపాడు. ఇదంతా ఒక ఎత్తయితే మద్యం మత్తులో ఉన్న యువకులకు మద్దతుగా తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ కార్పొరేషన్ చైర్మన్ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) స్టేషన్ వద్దకు నేరుగా వచ్చి మద్యం తాగి దాడి చేసిన వారికి వత్తాసు పలికారు. ఆ పీఏని మళ్లీ మచ్చిక చేసుకునే క్రమంలో ఆ ప్రైవేట్ డ్రైవర్, కానిస్టేబుల్ ఇద్దరు కలిసి మళ్లీ బాధితుడిని సెల్లో పడేసి లాఠీతో కొట్టారు. బాధితుడి స్నేహితులు వచ్చి ఎంత ప్రాధేయపడినా ప్రైవేట్ డ్రైవర్ వదల్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే స్టేషన్ బయట కాచుకుని ఉన్న తెలుగు దేశం పార్టీకి చెందిన కొందరు యువకులు సదరు టీడీపీ నేత అండ చూసుకుని సినిమా స్టయిల్లో ఆ యువకుడిపై మళ్లీ స్టేషన్ బయట దాడి చేసి తీవ్రంగా గాయపరచి ఇప్పుడు పెట్టుకోరా కేసు అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారని బాధితులు వాపోయారు. బాధిత యువకులు పోలీసులకు ఎంత చెప్పినా వినకపోగా గాయపడిన వారిని తెల్లవారు జామున 4 గంటల వరకు స్టేషన్లో ఉంచారు. వదిలేందుకు డబ్బులు డిమాండ్! ఇదిలా ఉండగా.. బాధితుడితో పాటు అతని స్నేహితులను బయటకు పంపించేందుకు ఓ పోలీస్ అధికారి డబ్బులు డిమాండ్ చేసి, తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాయాలపాలైన సదరు యువకుడు అక్కడ నుంచి స్నేహితుల సహాయంతో జీజీహెచ్లో చికిత్స కోసం చేరాడు. పోలీస్ స్టేషన్లో ప్రైవేట్ డ్రైవర్ చేస్తున్న అరాచకంపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని స్టేషన్ బయటకు వచ్చిన తరువాత కూడా తమవారిపై దాడి చేసిన వారి పై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని బాధిత యువకుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహరం అంతా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకు వెళ్లేందుకు బాధితులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. -
● ఈనెల 12న వృద్ధురాలి హత్య ఉదంతంలో వీడిన మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు
మంగళగిరిలో మహిళా క్రికెట్ సందడి ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ మంగళగిరి టౌన్: మహిళా క్రికెట్కు ప్రోత్సాహం కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రీడాకారిణులకు వేదిక కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఏపీఎల్) 2026 సీజన్–1కు మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు ఏసీఏ మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మొత్తం 13 మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్ ప్రారంభోత్సవానికి నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 19వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయలసీమ జెన్స్టార్స్, గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్తో టోర్నీ ప్రారంభం కానుంది. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో మహిళా క్రికెట్ లీగ్ నిర్వహించడంతో నగరానికి మరోసారి క్రీడావేదికగా గుర్తింపు లభించనుంది. కన్న కూతురే హంతకురాలు పొన్నూరు: ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని కూలి పనులతో జీవనం భారమై.. భర్తతో సహా తల్లి పంచన చేరి, డబ్బు, నగల కోసం ఆమెనే హత్య చేసిన కసాయి కూతురి ఉదంతమిది. పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి. జనార్థనరావు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని క్యాబిన్ పేటలో ఈ నెల 12వ తేదీన తల్లిని హతమార్చిన కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. క్యాబిన్ పేటలో నివాసం ఉంటున్న మృతురాలు ఈవూరు లక్ష్మీకి కూతురు, కొడుకు ఉన్నారు. కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తన మనవడు జాషువాతో కలిసి జీవనం సాగిస్తున్నారు. కుమారుడు మరణించినప్పుడు వచ్చిన ఇన్య్సూరెన్స్ డబ్బులతో లక్ష్మీ బంగారం నగలు చేయించుకున్నారు. ఆమె కూతురు పుష్పలత మొదటి భర్తతో విడిపోయి, రెండో భర్త చనిపోవడంతో, ఇన్స్ర్ట్రాగామ్లో పరిచయమైన సఖినేటిపల్లికి చెందిన రాకేష్ కుమార్ను మూడో పెళ్లి చేసుకొని తిరుపతిలో కూలి పనులు చేసుకుంటూ జీవన సాగిస్తోంది. కూలి పనులతో జీవనం భారంగా మారడంతో ఆర్థిక సహాయం కోసం పొన్నూరులో ఉంటున్న తల్లి లక్ష్మిని వారు ఆశ్రయించారు. అయితే రెండు నెలల పాటు కూతురు, అల్లుడు ఇంట్లోనే ఉంటూ ఏ పని చేయకుండా ఉండడంతో తల్లి వారిద్దరిని తిరుపతికి వెళ్లిపోవాలంటూ మందలించింది. అయితే ఎలాగైనా తల్లి మెడలోని బంగారం, బీరువాలోని డబ్బులు కాజేయాలని కూతురు, అల్లుడు పన్నాగం వేశారు. 12వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో లక్ష్మి నిద్రలో ఉండగా గొంతుకు చున్నీ బిగించి హత్యకు పాల్పడ్డారు. ఆమె మెడలోని బంగారం తాడుతోపాటు బీరువాలోని డబ్బులు అపహరించి పరారయ్యారు. హత్య చేయడాన్ని చూసిన మనవడు జాషువా వివరాలను పోలీసులకు తెలిపాడు. మృతురాలి సోదరుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. ఈ కేసులో నిందితులైన పుష్పలత, రాకేష్కుమార్ను అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి బంగారం ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు. కుంభకర్ణ రెస్టారెంట్ తాత్కాలిక మూసివేత మంగళగిరి రూరల్: పాడైన ఆహార పదార్థాలు, నిల్వ ఉన్న మాంసం అపరిశుభ్రంగా ఉన్న వంటగది మొదలగు లోపాలు రెస్టారెంట్లో బయటపడటంతో మండల పరిధి కాజా గ్రామం టోల్ప్లాజా సమీపంలోని కుంభకర్ణ మల్టీ క్యూజియన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఐపీఎం డైరెక్టర్ అరుణ్బాబు స్వయంగా తనిఖీ చేసి పాడైన మాంసం, అపరిశుభ్ర వంటగది గుర్తించారు. వంటగది కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత అధికారులు బి.నరసింహుడు, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేతన్న సేవలో అక్రమాలపై విచారణ జరపాలి
మంగళగిరి టౌన్: నేతన్న సేవా పథకంలో నిజంగా చేనేత వృత్తిపై ఆధారపడిన పలువురు కార్మికులకు అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఏడాదికి రూ. 25 వేల ఆర్తిక సహాయం అందించే నేతన్న సేవా పథకాన్ని ఆగస్టు 7 నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల సంఖ్య 51,952 ఉండగా, సుమారు 71 వేల మందికి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయినట్లు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పథకం అమలుకు ముందే కొందరు అధికార పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన పేర్లను జాబితాలో చేర్పించారని, చేనేత వృత్తితో సంబంధం లేని వారి పేర్లు కూడా నమోదు అయ్యాయని ఆరోపించారు. నిజంగా మగ్గం నేస్తున్న అర్హులైన కార్మికులకు పథకం అందలేదని, దీనిపై విచారణ కోరుతూ అధికారులకు జాబితాలు ఇచ్చినా నేటికీ చర్యలు తీసుకోలేదన్నారు. రాయలసీమ జిల్లాల్లో పథకం అమలుపై ఆగస్టు 7కు ముందే పత్రికల్లో పలు ఆరోపణలు వెలువడ్డాయని తెలిపారు. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి పథకం అందేలా ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టాలని కోరారు. మరో 30 వేల మంది చేనేత కార్మికులకు రూ. 25 వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని, ఆగస్టు 30 నాటికి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తామని చేనేత మంత్రి ప్రకటించినప్పటికీ సెప్టెంబర్ 15 నాటికి కూడా నగదు జమ కాలేదని అన్నారు. దీంతో పథకం అమలుపై చేనేత కార్మికుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే మిగిలిన అర్హులైన చేనేత కార్మికుల ఖాతాల్లో నగదు జమ చేసి న్యాయం చేయాలని ఆయన ప్రకటనలో కోరారు. ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ -
రాష్ట్రస్థాయి ఫ్లాగ్ ఫుట్బాల్లో తృతీయస్థానం
చుండూరు(వేమూరు): చుండూరు గురుకుల పాఠశాలకు చెందిన క్రీడాకారులు ఫ్లాగ్ ఫుట్బాల్లో రాష్ట్రస్థాయిలో మూడోస్థానం సాధించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిర ప్రయదర్శిని బుధవారం తెలిపారు. ఈ నెల 12,13, తేదీల్లో పిఠాపురం మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన రాష్ట్రస్థాయి ఫ్లాగ్ ఫుట్బాల్ పోటీల్లో గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు మూడోస్థానం సాధించడం జరిగిందని ఆమె తెలిపారు. పాఠశాలకు చెందిన జి.వెంకట మోహన్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగిన సబ్ జూనియర్ క్రీడల్లో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆమె చెప్పారు. వైస్ ప్రిన్సిపాల్ బాబురావు, పీడీ, ఆర్.ఆదిశేషు, వ్యాయామ ఉపాధ్యాయుడు హరిబాబు పాల్గొన్నారు. తాళం వేసిఉన్న ఇంట్లో చోరీ అమృతలూరు(వేమూరు): తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన అమృతలూరు మండలంలోని మూల్పూరులో బుధవారం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మూల్పూరు గ్రామానికి చెందిన మండూరు సాంబశివరావు కుటుంబంతో సహా గుంటూరు జిల్లా తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు. సాంబశివరావు రెండు, మూడు రోజులకు ఒక సారి వచ్చి గ్రామంలోని తన ఇల్లు, పొలాలు చూసుకుని వెళుతుంటాడు. ఈక్రమంలో ఈ నెల 13వ తేదీన గ్రామానికి రాగా.. తన ఇంటి తాళం పగలగొట్టి ఉండడం, తలుపులు తెరిచి ఉండటం చూసి, లోపలికి వెళ్లగా.. బీరువా పగలు కొట్టి దుండగులు రూ. లక్షలు విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు మాయం చేసినట్లు గుర్తించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రేపల్లె కెనాల్లో గుర్తుతెలియని మృతదేహం కొల్లిపర: కొల్లిపర మండలం పిడ పర్తి పాలెం గ్రామం వద్ద రేపల్లె కెనాల్లో(కాల్వలో) గుర్తుతెలియని వ్యక్తి సుమారు 30 నుంచి 40 సంవత్సరాలు వయసు కలిగిన మృతదేహం ఉందని పిడపర్తి పాలెం వీఆర్వో బుధవారం ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎస్ఐ మాట్లాడుతూ కాల్వలో దొరికిన మృత దేహం గుర్తుపట్టలేనట్టు ఉన్ననట్లు, అతని ఎడమ చేతి మీద హిందీలో పచ్చబొట్టు ఉండటం, మెడలో రుద్రాక్షమాల, ఒంటిపై నలుపు రంగు నిక్కరు, డిక్సీ స్కాట్ బ్రాండ్ ఇన్నర్వేర్ ధరించి ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. గుర్తించినవారు కొల్లిపర పోలీస్ స్టేషన్కు 9440900863 నెంబరులో సమాచారం ఇవ్వాలని కోరారు. అమరావతిలో ఘంటసాల విగ్రహం ఏర్పాటు చేయాలి మంగళగిరి టౌన్: రాజధాని అమరావతిలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 25 అడుగుల భారీ విగ్రహంతో పాటు ఘంటసాల కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర చైతన్య వేదిక, ఘంటసాల చైతన్యవేదిక అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరి పట్టణంలోని ప్రెస్క్లబ్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. నవ్యాంధ్ర చైతన్య వేదిక 17వ జాతీయ మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని భావితరాలకు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. ఆదిలీలా ఫౌండేషన్ న్యూఢిల్లీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ, వేదిక గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు, కార్యదర్శి ఆంజనేయ రాజు, సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలన తాడికొండ: రాజధాని అమరావతి ప్రముఖ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి శంకుస్థాపన నేపథ్యంలో ఏర్పాట్లను బుధవారం అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)– మేనేజింగ్ డైరెక్టర్ డి.లక్షీ పార్థసారథి పరిశీలించారు. ముఖ్యంగా ఈ–3, ఎన్న్–14 కూడలి నుంచి వేదిక వద్దకు చేరుకునే మార్గాన్ని ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. సీడ్యాక్సెస్ రోడ్డు నుంచి సీఎం కాన్వాయ్ నేరుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి కేటాయించిన స్థలానికి సౌకర్యవంతంగా చేరుకునేలా రోడ్డు మ్యాప్ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజినీరు టి.మోజెస్ కుమార్ను ఆదేశించారు. పర్యటనలో ఏడీసీ చీఫ్ ఇంజినీర్లు బి.నరసింహమూర్తి, సీహెచ్ ధనుంజయ పాల్గొన్నారు. -
దళిత యువకుల మృతిపై న్యాయవిచారణ చేయండి
లక్ష్మీపురం: రాష్ట్రంలో గత ఆరు నెలల కాలంలో దళితులపై దాడులు గణనీయంగా పెరిగాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. దొంగతనం నెపంతో మంగళగిరిలో హత్య గురైన మేకల రమేష్ కుటుంబ సభ్యులను తుళ్లూరు మండలం దొండపాడు గ్రామంలో వి.శ్రీనివాసరావుతో పాటు కేవీపీఎస్ నాయకులు బుధవారం పరామర్శించారు. అలాగే పోలీసు దెబ్బలకు తాళలేక మృతిచెందిన దళిత యువకుడు చీకటి గోపి కుటుంబ సభ్యులను కూడా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామంలో వారు పరామర్శించారు. అనంతరం గుంటూరులోని బ్రాడిపేట సీపీఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో దళితులు పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందన్నారు. పేదలు బడుగు వర్గాలు, దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు. దళితుల కేటాయించిన తాడికొండ నియోజకవర్గంలో ఈ ఘటనలపై ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించలేదన్నారు. దొంగతనం నెపంతో మేకల రమేష్ పెత్తందారులు కొట్టగా చనిపోగా, చీకటి గోపి పోలీసులు కొట్టడంతో చనిపోయాడని తెలిపారు. ఈ రెండు ఘటనలో పోలీసు అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా ఉందన్నారు. తాడికొండ సీఐపై ఆరోపణలు వస్తే మేడికొండూరు సీఐని విచారణ అధికారిగా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే స్థాయి అధికారిని విచారణ అధికారిగా ఇలా నియమిస్తారా అని ప్రశ్నించారు. విచారణ పూర్తికాకుండానే పోస్టుమార్టం రిపోర్టు రాకుండానే జ్వరంతో చీకటి గోపి మృతి చెందాడని డీఎస్పీ ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనలో బాధితులను ఇంతవరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ పరామర్శించలేదన్నారు. కొద్దిరోజుల క్రితం తాడేపల్లి లో ఎస్టి యువకుడు కూడా దొంగతనం కేసులో మృతి చెందాడని ఆరోపించారు. ఈ ఘటనలపై న్యాయవిచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా కాకినాడలో నిరుద్యోగుల ఆందోళనలను బూచిగా చూపి కోచింగ్ సెంటర్ల పై దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 20 వేల పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మాట మార్చడం ఏంటని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. యూనిఫాం సివిల్ కోడ్ ను 16 రాష్ట్రాలలో అమలు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ దళితుల పై దుర్మార్గమైన దాడులు చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్లో అభివద్ధి కన్నా పేదలపై దాడులు పెరిగాయన్నారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద గురువారం దళిత సంఘాలు చేయనున్న ఆందోళనకు మద్దతు తెలుపుతున్నామన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ, జిల్లా నాయకులు బి.లక్ష్మణరావు, జె.నవీన్ప్రకాష్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా గుట్టురట్టు
దర్శి: పంట పొలాల్లోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్జిల్లా ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. గత కొన్ని నెలలుగా ముండ్లమూరుతో పాటు పలు మండలాల్లో ట్రాన్స్ఫార్మర్ల చోరీలతో కరెంట్ సరఫరా నిలిచి పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఎస్పీ హర్షవర్ధన్రాజు ఆదేశాల మేరకు డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ పర్యవేక్షణలో సీఐ రామారావు, ముండ్లమూరు ఎస్సై కోటేశ్వరరావు సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టి 9 కేసుల్లో 12 మంది నిందితులను గుర్తించారు. స్థానిక సీఐ కార్యాలయంలో మంగళవారం కేసు వివరాలను వెల్లడించారు. వరుస చోరీలకు పాల్పడుతున్న వారిలో ఒంగోలులో నివాసముంటున్న పులి నాగరాజు (విప్పర్ల, రొంపిచర్ల మండలం), షేక్ రజాక్, పామూరి శ్రీకాంత్ (సంతమాగులూరు), పోలా మంగ (తూర్పుగంగవరం, తాళ్లూరు మండలం), రావూరి సురేష్ (ఉదయ్నగర్ తండా, నకరికల్ మండలం)లను అరెస్ట్ చేశారు. అలాగే వీరి వద్ద నుంచి రాగితీగను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు జనపాటి బ్రహ్మయ్య (రాజుపాలెం, మార్టూరు మండలం), షేక్ మదర్షా (బోయపాలెం, యడ్లపాడు మండలం)లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముండ్లమూరు మండలంలో 26, దర్శి పరిధిలో 10, దొనకొండలో 4, సంతమాగులూరులో ఒకటి చొప్పున మొత్తం 41 ట్రాన్స్ఫార్మర్లకు చెందిన 255 కిలోల కాపర్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముండ్లమూరులోని ఓ ఇంట్లో దివాన్కాట్ కింద దాచిన రూ.లక్షతో పాటు పర్సులోని వెయ్యి కలిపి మొత్తం రూ.1,01,000 నగదును కూడా ఈ ఐదుగురే చోరీ చేసినట్లు గుర్తించి, వారి వద్ద నుంచి రూ.40 వేలను రికవరీ చేశారు. ఇదే ముఠాకు చెందిన పొట్లూరి ప్రభుదాస్ అలియాస్ నాని, అల్లంసెట్టి భాగ్యరాజు, రావూరి కలగయ్య, చేవూరి వంశీకళ్యాణ్, రావూరి గోపి, చేవూరి వెంకటేష్, తిరువీధుల లోకేష్లు గతంలో కృష్ణా జిల్లా అట్కూరు పరిధిలో చేసిన దొంగతనాల కేసుల్లో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులు, సిబ్బందిని ఎస్పీ, డీఎస్పీ అభినందించారు. -
విశేషాలంకారంలో గణనాథుడు
అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరాలయంలో సోమవారం వేకువజామునే స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణనాథునికి పత్రితో సహస్రనామ పూజ చేశారు. విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. పెదకాకాని: శివాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మహా గణపతిని ప్రతిష్ఠించారు. ప్రత్యేక పూలతో అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు. పూజ అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గణపతి నవరాత్రులలో భాగంగా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం విశేష అర్చనలు జరుగుతాయన్నారు. ఈ నెల 23వ తేదీన విఘ్నేశ్వరుని నిమజ్జనం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది వినూత్న రీతిలో సర్కారుకు తమ నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గత నెల నుంచి గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది రోజూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని గణపతి విగ్రహానికి తమ వినతి పత్రం అందజేశారు. ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలని, బదిలీ అవకాశం కల్పించాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విగ్రహానికి అందజేశారు. తమ కోరికలు నెరవేరేలా అనుగ్రహం చూపాలని స్వామి వారిని మొక్కుకున్నారు. చవితి రోజు సైతం ఆసుపత్రిలో రంగోలి కార్యక్రమం నిర్వహించారు. కాంట్రాక్టు నర్సింగ్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. బంగారం, నగదు కాజేత గుంటూరు రూరల్: హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో చోరీకి పాల్పడిన సంఘటన నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతి కాలనీలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సరస్వతి కాలనీ ఏడో లైనుకు చెందిన కె.వీరాంజనేయులు ఇబ్రహీంపట్నం స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంటారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లారు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. 26 గ్రాముల బంగారం చైను, 12 గ్రాముల బ్రాస్లెట్, 17 గ్రాముల చెవి రింగులు, రూ. 2.96 లక్షల నగదు చోరీకి గురైనట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
గెజిట్ నోటిఫికేషన్ విడుదల
గుంటూరు కార్పొరేషన్లో 76 డి విజన్లు ఖరారు నెహ్రూనగర్: గుంటూరు నగర పాలక సంస్థ (జీఎంసీ) పరిధిలోని డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. నగరంలో డివిజన్ల సంఖ్యను 57 నుంచి 76కు పెంచుతూ ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆదేశాల మేరకు కార్పొరేషన్ కమిషనర్ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ ఆధారంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి సేకరించిన వినతులు, అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఈ తుది నోటిఫికేషన్ ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పునర్విభజన జరిగిన 76 డివిజన్ల పరిధిలోని నాలుగు వైపులా సరిహద్దులు (ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమం), విస్తరించిన కాలనీలు, డోర్ నంబర్ల వివరాలను గెజిట్లో స్పష్టంగా పొందుపరిచారు. నగర శివారు ప్రాంతాలు, కొత్తగా విలీనమైన గ్రామాలు, ప్రధాన రహదారుల విస్తరణకు అనుగుణంగా వార్డుల రూపురేఖలను నిర్దేశించారు. పెరిగిన జనాభాకు తగినట్లుగా పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికే డివిజన్ల సంఖ్యను పెంచినట్లు అధికారులు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ సరిహద్దుల విభజనే ప్రామాణికం కానుండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలు నయా డివిజన్ల లెక్కలపై దృష్టి సారించాయి. పూర్తి వివరాలు అధికారిక గెజిట్ ద్వారా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. -
బస్సు కింద పడి యువకుడు మృత్యువాత
కారంచేడు: యువకుడి మృతితో పండగ పూట మరో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఎస్ఐ షేక్ ఖాదర్బాషా కథనం మేరకు.. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని లింగంగుంట్ల ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ద్విచక్రవాహనాలపై చీరాల సమీపంలోని వాడరేవు బీచ్కు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బీచ్లో సరదాగా గడిపి తిరుగు ప్రయాణమయ్యారు. వారిలో ఒకడైన బొజ్జా బాలకోటయ్య (27) తన బైక్పై వెళ్తూ... చీరాల నుంచి షాపూర్ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. బస్సుకు ద్విచక్రవాహనం హ్యాండిల్ తగలడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. బండితోపాటు, బాలకోటయ్య బస్సు కింద పడిపోయాడు. తల మీదుగా బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఆసుపత్రికి పంపించారు. -
ఇరువర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్రగాయాలు
కొల్లూరు: పోలీసుల కళ్లెదుటే ఓ యువకుడిపై వేరే గ్రామస్తులు దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పెసర్లంక, గాజుల్లంక గ్రామాలకు చెందిన యువకులు డీజేలతో తెనాలి నుంచి ఆదివారం రాత్రి స్వస్థలాలకు విగ్రహాలు తీసుకువెళుతున్నారు. పెసర్లంక రామన్నపేటకు చెందిన గౌతమ్కి, అదే గ్రామానికి చెందిన సోమరౌతు హరికి నడుమ గతంలో ఇసుక క్వారీ విషయంలో ఘర్షణ జరిగింది. దీనికి సంబంధించి కొల్లూరు గౌడపాలెం వద్ద వివాదం తలెత్తింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ విషయాన్ని గౌతమ్ గాజుల్లంకలోని తమ వారికి చెప్పాడు. కొల్లూరు జమ్మిచెట్టు ప్రాంతంలో పరస్పరం దాడులు చేసుకున్నారు. తర్వాత పెసర్లంక అడ్డరోడ్డు వద్దకు చేరుకునే సమయానికి గాజుల్లంకకు చెందిన మోటుపల్లి దుర్గాప్రసాద్పై పెసర్లంకకు చెందిన వ్యక్తులు కర్రలతో విరుచుకుపడ్డారు. సింగం కృష్ణప్రసాద్, జొన్నకూటి దుర్గాశంకర్ (ఏకాంబరం), కోన మోహన్, కోన విక్రమ్లతో పాటు మరికొందరు విచక్షణరహితంగా ఈ దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు పక్కనే నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కు కిందకు దూరి ప్రాణాలను కాపాడుకోగలిగాడు. అడ్డుకునేందుకు వెళ్లిన పలువురిపైనా దాడి చేయడంతో వారు తమ వాహనాలను వదిలి పారిపోయారు. వారి ద్విచక్ర వాహనాలను కూడా ధ్వంసం చేశారు. క్షతగాత్రుడిని కొల్లూరు పోలీసులు తమ వాహనంలో కొల్లూరు పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం తెనాలి జీజీహెచ్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కిశోర్బాబు తెలిపారు. కొల్లూరులో సోమరౌతు హరిపై ప్రత్యర్థి వర్గం వారు దాడికి పాల్పడ్డారు. హరి ఫిర్యాదు మేరకు గాజుల్లంకకు చెందిన మోటుపల్లి దుర్గాప్రసాద్, సనకా శ్రీను, సనకా సాయి, గౌతమ్, మహేష్, తేజ, నాగరాజులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. గొడవ సమయంలో నలుగురు పోలీసులు విగ్రహాల తరలింపు సజావుగా సాగేందుకు విధులు నిర్వహిస్తున్నారు. వారి కళ్లెదుటే పెసర్లంకకు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడుతున్నా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
కొమ్మమూరు చానల్ బ్రిడ్జి వద్ద ప్రమాదం
చేబ్రోలుః చేబ్రోలు సమీపంలోని బ్రిటీషు కాలం నాటి పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరటంతో అక్కడ ప్రయాణం వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. తెనాలి రూరల్ మండలం మల్లెపాడు ప్రాంతానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి కొమ్మమూరు బ్రిడ్జికి చేబ్రోలు వైపు ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తెనాలి నుంచి పొన్నూరు వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తాడిబోయిన గోపి కొమ్మమూరు బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే ప్రయత్నంలో రోడ్డు పక్కన తవ్వకాలు చేయటంతో గుంతలుగా ఉన్న ప్రాంతంలో పడిపోయాడు. ముఖానికి, కాళ్లు, చేతులకు గాయాలైన బాదితుడిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
ఏఎన్యూ స్వర్ణోత్సవాలు విజయవంతం
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు వర్సిటీ వీసీ కె గంగాధరరావు అన్నారు. స్వర్ణోత్సవాలు విజయవంతం కావడంతో మంగళవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని థాంక్స్ గివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల ప్రస్థానంలో చరిత్రాత్మక ఘట్టంగా నిలిచేలా స్వర్ణోత్సవాలు నిర్వహించామన్నారు. వేడుకల నిర్వహణలో బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు, వివిధ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేశారన్నారు. దశల వారీగా నిర్వహించిన కార్యక్రమాలతో వర్సిటీ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ, విదేశాలలో ఏఎన్యూ కీర్తి ప్రతిష్టలు పెరిగాయన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం మాట్లాడుతూ స్వర్ణోత్సవాల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వర్సిటీ పాలకమండలి సభ్యులు ఎం.త్రిమూర్తిరావు, ప్రొఫెసర్ ఎస్.మురళీమోహన్, డాక్టర్ పి.సుధాకర్, వర్సిటీలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, ప్రొఫెసర్ సిహెచ్.లింగరాజు, ప్రొఫెసర్ పీపీఎస్ పాల్ కుమార్, ప్రొఫెసర్ తేజోమూర్తి, ప్రొఫెసర్ నిరూపమా, దూరవిద్య కేంద్రం పరీక్షల కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డి.రామచంద్రన్ పాల్గొన్నారు. -
ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు పోటీలు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా నందమూరి తారక రామారావు మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చండ్రాకోల్ చేతబట్టి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టచ్ పళ్ల పోటీలను ఆరంభించారు. ఆయా జిల్లాల నుండి వచ్చిన ఒంగోలు జాతి గిత్తలు పోటీల్లో పాల్గొన్నాయి. ప్రారంభించిన ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే బూర్ల -
అప్రమత్తమైన పేట పోలీసులు
నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్సులోని లగేజ్లో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటనతో నరసరావుపేట పోలీసులు అప్రమత్తం అయ్యారు. బ్యాగ్లో దొరికిన గిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల మూలాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ వ్యవహారానికి నరసరావుపేటతో సంబంధం ఉండటంతో స్థానిక పోలీసులు మంగళవారం దర్యాప్తు చేపట్టారు. వివరాలు.... ఉత్తరప్రదేశ్కు చెందిన ఆషిక్ అలీ కొంతకాలంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మాహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్లోని మున్నా మగ్గమ్ వర్క్స్లో పనిచేస్తున్నాడు. స్వగ్రామానికి వెళ్లేందుకు నరసరావుపేట బస్టాండ్లో బస్కు ఎక్కి విజయవాడలో దిగాడు. అనంతరం బ్యాగ్ చూసుకోగా లగేజ్ మారినట్లు గుర్తించాడు. బ్యాగ్ను బస్టాండ్లో అవుట్పోస్టు పోలీసులకు అప్పగించాడు. పరిశీలించగా 46 గిలెటిన్ స్టిక్స్, 50 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని బ్యాగ్ అప్పగించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నరసరావుపేట టూటౌన్ పోలీసులు కూడా అతడు పనిచేసే దుకాణం వద్దకు చేరుకొని అతని ఉద్యోగం, నివాసం, గత కదలికలపై ఆరా తీశారు. ఆర్టీసీ బస్టాండ్లో సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. కాగా ఇద్దరు మావోయిస్టులు సోమవారం పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఎదుట లొంగిపోయారు. అదే సమయంలో లగేజీలో పేలుడు పదార్థాలు బయట పడటం చర్చనీయాంశంగా మారింది. రెండు ఘటనలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు విచారిస్తున్నట్లు సమాచారం. -
108లో కవలల జననం
నరసరావుపేట టౌన్/మాచర్ల: కవలపిల్లలు 108 వాహనంలో జన్మించిన సంఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఎం. అనురాధ పురిటి నొప్పులతో బాధపడుతూ సోమవారం రాత్రి 108 అంబులెన్స్ను అశ్రయించింది. అక్కడకు చేరుకున్న సిబ్బంది ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి గర్భంలో కవలలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి కాన్పు కావటంతో హైరిస్క్ కేసుగా నిర్థారించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రిఫర్ చేశారు. దీంతో మాచర్ల 108 అంబులెన్స్లో ఆమెను అర్థరాత్రి తీసుకొని బయలుదేరారు. మార్గమధ్యంలో గర్భిణికి నొప్పులు తీవ్రం కావటంతో వాహనం పక్కకు నిలిపి పరిస్థితిని 108 ఈఆర్సీపీ డాక్టర్ సుప్రియ, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లుకు వివరించారు. వారి సూచనల మేరకు ఈఎంటీ హుస్సేనమ్మ, పైలెట్ అర్జున్ కుమార్, ఓఈ మారుతి ప్రసవ ప్రక్రియను నిర్వహించారు. మొదట మగ శిశువు జన్మించాడు. కొద్ది సేపటి తరువాత మరో మగ శిశువు పుట్టాడు. ప్రసవం అనంతరం తల్లితో పాటు ఇద్దరు శిశువులకు అవసరమైన ఆక్సిజన్, ప్లూయిడ్స్ అందించారు. ప్రథమ వైద్యసహాయం అనంతరం నరసరావుపేట వైద్యశాలలో చేర్పించారు. ఆపదసమయంలో సకాలంలో స్పందించి తల్లితో పాటు ఇద్దరు శిశువులను రక్షించిన 108 సిబ్బందిని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ఈ సందర్భంగా దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన 108 పథకం గురించి బాధిత కుటుంబం గుర్తుచేసుకున్నారు. –తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు సురక్షితం -
గణపతి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
రేపల్లె: గణపతి నవరాత్రులను పురస్కరించుకుని విగ్రహాల నిమజ్జనానికి పెనుమూడి–పులిగడ్డ వారధిపై రెవెన్యూ, పోలీసులు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రేపల్లె పట్టణంతో పాటు మండలం, నగరం, నిజాంపట్నం మండలాల్లో నెలకొల్పిన గణనాథ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో భక్తులు పెనుమూడి ఘాట్కు తరలివస్తారు. గతంలో నిమజ్జన సమయంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి అధికారులు ముందస్తు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నాలుగేళ్ల కిందట విగ్రహ నిమజ్జన సమయంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో భక్తులు నదిలోకి దిగకుండా చర్యలు చేపట్టారు. పెనుమూడి–పులిగడ్డ వారధిపై బారికేడ్లను ఏర్పాటు చేసి వారధి పైనుంచే విగ్రహాలను సురక్షితంగా నదిలో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేశారు. అదనంగా భద్రతా సిబ్బందిని మోహరించి, ఎటువంటి అవాంఛనీయ జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. విగ్రహాలను సకాలంలో, శాంతియుతంగా నిమజ్జనం చేసుకోవాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. -
విద్యుత్ సబ్స్టేషన్లో ఘోరం
● కార్మికుడు దుర్మరణం.. మరో ఇద్దరికి గాయాలు ● విద్యుత్ సరఫరా నిలపకుండా పనులు చేయించడమే కారణం! పెద్దదోర్నాల: మండల కేంద్రమైన పెద్దదోర్నాలలోని విద్యుత్ సబ్స్టేషన్లో మంగళవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యూ పీటీఆర్ ఎరక్షన్ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అందిన సమాచారం మేరకు.. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన కాంట్రాక్టు మేస్త్రి నన్నెం దుర్గారావు (55) మరో ఇద్దరితో కలిసి పనుల నిమిత్తం సోమవారం పెద్దదోర్నాలకు చేరుకున్నారు. మంగళవారం సబ్స్టేషన్లో పనులు చేస్తుండగా దుర్గారావు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదాన్ని గమనించిన మిగతా సిబ్బంది భయంతో పైనుంచి కిందికి దూకడంతో వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు 24 గంటల ముందే అధికారులు సోషల్ మీడియాలో ప్రకటించినప్పటికీ, సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండానే నిర్లక్ష్యంగా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. -
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
చీరాల: ఈపూరుపాలెంలోనిలని మీసేవ కేంద్రం సమీపంలో మంగళవారం యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పుండరీ వెంకటేష్ (25) ఒంగోలు కలెక్టరేట్లో సబార్డినేట్గా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఈపురుపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. నెహ్రూనగర్: రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల దాడులు, అక్రమ నిర్బంధాలను నిరసిస్తూ గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు దళిత, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. మంగళవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు సంబంధించిన పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, డీబీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్కుమార్, వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ఎమ్మార్పీస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ తదితరులు మాట్లాడారు. నగరంపాలెం: గుంటూరు నగరంలోని ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం ఎన్నిక ప్రక్రియ మొదలైంది. ఈనెల 26న జరగనున్న ఎన్నికలకు బుధవారం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. ఏడాదికి ఒకసారి జరిగే ఈ ఎన్నికలు ఈసారి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష పీఠం ఎవర్ని వరిస్తుందనే ఉత్కంఠ వ్యాపార వర్గాల్లో నెలకొంది. ఏళ్ల క్రితమే గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో ది ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఉంది. అందులో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలోని వ్యాపార వర్గాలకు సభ్యత్వాలు ఉన్నాయి. సుమారు 3,200 మంది ఓటర్లు ఉండగా, ఈనెల 26న ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈనెల 16న చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో అధ్యక్ష పదవితోపాటు పలు పదవులకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏడాదికి ఒకసారి జరగనున్న ఈ ఎన్నికలల్లో అధ్యక్ష పదవికి ఐదారు మంది అభ్యర్థులుగా పోటీపడుతున్నారు. మూడు దశాబ్ధాలకుపైగా అధ్యక్షుడిగా ఆతుకూరి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే గత రెండేళ్లుగా అధ్యక్ష పదవికి పోటీపడటం అనివార్యమైంది. దీంతో అప్పటి నుంచి చాంబర్ ఎన్నికలు వేడెక్కాయి. దీంతో గత రెండేళ్లు ఏల్చూరి వెంకటేశ్వర్లు అధ్యక్షునిగా కొనసాగారు. ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీపడేందుకు వ్యాపార ఓటర్ల వర్గాల్లో ఆశావాహులు ఎక్కువయ్యారు. ఈసారైనా అధ్యక్ష పదవి చేజిక్కించుకునేందుకు గతంలో పోటీ చేసిన అభ్యర్థులు, కొత్తగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నూతన అభ్యర్థులు బరిలో పోటీపడనున్నారు. రెండేళ్లుగా అధ్యక్షునిగా కొనసాగిన ఏల్చూరి వెంకటేశ్వర్లు మూడోసారి హాట్రిక్ సాధించేందుకు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్ల స్వీకరణ ముగిసిన రోజే నూతన అధ్యక్షుడు ఎవరనేది తెలుస్తోందని చాంబర్లో బాహాటంగానే వినిపిస్తోంది. -
పర్యావరణ పరిరక్షణ ఎంతో కీలకం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. ఆదివారం రథం బజార్లోని శ్రీమత్సందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీక్షీర భవనారాయణస్వామి దేవస్థానం ఎదురు అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భక్తులకు ప్రతిమలను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా నదులు, చెరువులు, కాలువలు వంటి నీటి వనరులు కాలుష్యానికి గురికాకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాలు, రసాయనిక రంగుల వినియోగం వల్ల నిమజ్జనం అనంతరం నీటి వనరులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. అనంతరం ఆలయాన్ని జిల్లా కలెక్టర్ సతీసమేతంగా సందర్శించారు. వారికి వేద పండితులు స్వాగతం పలికారు. దేవాలయంలో కొలువైన వివిధ దేవతామూర్తులను దర్శించారు. భవనారాయణస్వామి వారిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ, గోత్రనామాలతో పూజలు జరిపించారు. కలెక్టర్ దంపతులకు వేద పండితులు ఆశీర్వచనాలు, దైవ ప్రసాదం అందించారు. ఆలయానికి అవసరమైన మౌలిక వసతులు, సమస్యలపై కలెక్టర్ వేద పండితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బాపట్ల తహసీల్దార్ సలీమా, జిల్లా అఖండ ఫౌండేషన్ చైర్మన్ విన్నకోట సురేష్, దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ దేశిరాజు వెంకటరమణబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల్లో వసతులకు చర్యలు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసుతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో పాఠశాలల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో డ్రాప్ అవుట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల హాజరును పరిశీలించారు. హాజరు తక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని ఎస్జీఎస్డబ్ల్యూ కోఆర్డినేటర్ యశ్వంత్ను ఆదేశించారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ప్రతిభ చాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక నివేదికలు సకాలంలో సమర్పించాలి కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ నివేదికల సమర్పణలో పురోగతి కనిపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నివేదికల సమర్పణలో జాప్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర సగటు కంటే తక్కువ ప్రగతి ఉన్న శాఖలు వచ్చే నెల నాటికి మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులను ఆదేశించారు.ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంపుతోపాటు పోషకాలు కలిగిన పంటల సాగును ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత, పోషకాహార మిషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులకు మెరుగైన సాంకేతికత, నిర్వహణ పద్ధతులు తెలిపి ఆదాయాన్ని పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి లక్ష్మి, పశు సంవర్ధక శాఖ అధికారి వేణుగోపాల్, ఉద్యాన శాఖ అధికారి ఖలీం తదితరులు పాల్గొన్నారు. -
రద్దీ మాటున ప్రైవేట్ దోపిడీ!
పట్నంబజారు: పండుగ వచ్చిందంటే చాటు.. ప్రైవేట్ యాజమాన్యాల దోపిడీకి అంతే లేకుండా పోతోంది. ప్రయాణికులను ప్రైవేట్ ఆపరేటర్లు దోచుకుతింటున్నారు. వినాయక చవితి.. వరుస సెలవులు.. స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికుల తాకిడి.. ఇదే అదనుగా చార్జీలు పెంచేశారు. ఆర్టీసీ విఫలం ఈ నెల 12, 13, 14 తేదీలు వరుసగా సెలవులు రావటంతో సుదూర ప్రాంతాల నుంచి గుంటూరుకు భారీగా ప్రయాణికులు తరలివచ్చారు. సెలవులు, పండుగ అయిపోవడంతో తిరుగు పయనమయ్యారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు తదితర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరగడంతో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్ల దోపిడీ మొదలైంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఆర్టీసీ అధికారుల తీరు ఉంది. సుదూర ప్రాంతాలకు బస్సులు నడపటంలో పూర్తిగా విఫలం అయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రజల నుంచి యజమానులు పండుగ పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. గుంటూరు నుంచి ప్రధాన నగరాలకు వెళ్లే బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. సాధారణ రోజుల్లో ఉండే చార్జీలతో పోలిస్తే పండుగ సమయంలో టికెట్ ధరలను గణనీయంగా పెంచుతున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. చివరి నిమిషంలో ప్రయాణం చేయాల్సిన వారు అడిగిన మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అన్ని మార్గాల్లో తగినన్ని బస్సులు లేవు. రాత్రి వేళల్లో హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విశాఖపట్నం నగరాలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయాలు తగ్గిపోతున్నాయి. భారీగా వసూలు కుటుంబాలతో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ ఆపరేటర్లు అదనపు చార్జీల మోత మోగిస్తున్నారు. పండుగ సమయంలో భారీగా వసూలు చేస్తున్నారు. చివరి నిమిషంలో మరింత భారం పడుతోంది. కుటుంబ ప్రయాణికులు, మహిళలు, వృద్ధులు అధిక ధర చెల్లించక తప్పడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం ఆన్లైన్లో ఆర్టీసీ బస్సుల టికెట్ ధరలు పరిశీలిస్తే.. గుంటూరు–హైదరాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సు చార్జీలు సర్వీసును బట్టి సుమారు రూ.451 నుంచి రూ.767 వరకు కనిపిస్తున్నాయి. గుంటూరు – చైన్నె మార్గంలో సుమారు రూ.670 నుంచి రూ 900 వరకు ఉండగా, విశాఖపట్నంకు రూ.626 నుంచి రూ.796 వరకు ఉన్నాయి. బెంగళూరుకు రూ.1,033 నుంచి రూ.1,818 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీలకు అనుగుణంగా ప్రైవేట్ చార్జీలు ఉండాలనే నిబంధనలు చెబుతున్నాయి. హైదరాబాద్కు రూ. 2 వేలు, స్లీపర్కు రూ.3 వేలు, బెంగళూరుకు రూ.4 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. ఆన్లైన్లోనే భారీ చార్జీలు చూపుతున్నారు.. ఇక ఆఫ్లైన్ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పండుగ రద్దీ ముందుగానే తెలిసినా ఆర్టీఏ అధికారులు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయలేదు. ప్రధాన రహదారులు, బస్టాండ్లు, ప్రైవేట్ బస్సులు బయలుదేరే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పర్మిట్ ఉల్లంఘన, అధిక ప్రయాణికుల తరలింపు, నిబంధనలకు విరుద్ధంగా చార్జీలు వసూలు చేయడం, ఫిట్నెస్, ఇతర పత్రాల్లో లోపాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కనీసం ఒక్కటంటే ఒక్క తనిఖీ కూడా చేయకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధిక చార్జీలు వసూలు చేస్తున్నా అధికారులు ఇలా నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టీడీపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఓటీపీ నిబంధనతో ఆరోగ్య సర్వేలకు ఆటంకం
● క్షేత్రస్థాయి సిబ్బందిపై పెరుగుతున్న పనిభారం ● ప్రత్యామ్నాయ ధ్రువీకరణ విధానం కల్పించాలని వినతి మంగళగిరి టౌన్: ఎన్ఎల్ఈపీ, ఎల్సీడీసీ (ఎన్సీడీ–సీడీ) ఆరోగ్య సర్వేల్లో ప్రతి వ్యక్తికి ఏబీహెచ్ఏ రూపొందించి, ఓటీపీ ద్వారా ధ్రువీకరణ తప్పనిసరి చేయడం క్షేత్రస్థాయి సిబ్బందికి ఇబ్బందికరంగా మారిందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య, ఏపీ సచివాలయ హెల్త్ సెక్రటరీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎం.రమేష్బాబు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి పట్టణ పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్ర కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ జి.వీర పాండియన్ను కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ఓటీపీ కోసం ప్రజలను ఒప్పించేందుకు అదనపు సమయం వెచ్చించాల్సి రావడంతో సర్వే సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని వారు తెలిపారు. మొబైల్ ఫోన్లు అందుబాటులో లేకపోవడం, నెట్వర్క్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం, వ్యక్తిగత గోప్యత కారణంగా కొందరు ఓటీపీ చెప్పేందుకు నిరాకరించడం వంటి సమస్యలతో సర్వే ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. నిర్ణీత 14 రోజుల్లో ఎన్ఎల్ఈపీ సర్వే పూర్తి చేయాల్సి ఉండగా, ప్రతి వ్యక్తికి ఏబీహెచ్ఏ–ఓటీపీ ప్రక్రియను పునరావృతం చేయడం వల్ల రోజువారీ సర్వే లక్ష్యాలు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఓటీపీ సాధ్యం కాని సందర్భాల్లో ప్రత్యామ్నాయ ధ్రువీకరణకు అవకాశం కల్పించాలని, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సరళమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎల్సీడీసీ ప్రక్రియకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, సిబ్బందిపై అదనపు భారం పడకుండా విధానాన్ని సరళీకరించాల్సిన అవసరం ఉందని వెంకటసుబ్బయ్య, రమేష్బాబు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయ హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ నాయకులు సుజాత, స్పందనలతో పాటు సెక్రటరిలు వనిత జ్యోతి, నాగమణి, అరుణ, దుర్గ, సుకన్య, అంజలమ్మ, ఉషారాణి, ప్రతిభ, విజయకుమారి, కిరణ్కుమారి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జై గణేశా.. జైజై గణేశా..
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026వినాయక చవితిని జిల్లాలోని వాడవాడలా ఘనంగా నిర్వహించారు. సోమవారం భక్తిశ్రద్ధలతో గణనాథుడిని ఇంటింటా కొలిచారు. ఆనందంగా వేడుకలను జరుపుకొన్నారు. ఊరూవాడా మండపాలు ఏర్పాటు చేసి వైవిధ్య రూపాల్లో గణపయ్యను కొలువుదీర్చారు. పూజలు, భజనలు, నైవేద్యాలతో అంతటా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ భక్తులు ‘‘జై గణేశా.. జై జై గణేశా’’ అంటూ ఎంతో ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ -
విద్యాభివృద్ధికి ఆవోపా కృషి ప్రశంసనీయం
గుంటూరు ఎడ్యుకేషన్: సమాజంలో విద్యాభివృద్ధికి ఉపకార వేతనాలను పంపిణీ చేయడం ద్వారా ఆవోపా చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఏపీ ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. ఆదివారం మార్కెట్ సెంటర్లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆర్యవైశ్య అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(ఆవోపా) ఏపీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 220 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రూ.45 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షుడు తడవర్తి రాంబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆకే రవికృష్ణ మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం చేసే ప్రయత్నం ఎంతో గొప్పదని అన్నారు. క్రేన్ గ్రూప్ అధినేత జీవీఎస్ఎల్ కాంతారావు మాట్లాడుతూ చదువుతో జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాన్ని నేర్చుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో తల్లిదండ్రులను అనాథలుగా మార్చడం తగదని, సంస్కారం లేని విద్య వ్యర్థం అన్నారు. తెనాలి డబుల్ హార్స్ సీఎండీ మునగాల మోహన్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. ఆవోపా నగర అధ్యక్షుడు కేవీ బ్రహ్మం, కృష్ణ సాయి గ్రానైట్స్ ఎండీ ఎస్.హనుమంతరావు, ఆవోపా జాతీయ అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ మాట్లాడారు. కార్యక్రమంలో ఆవోపా రాష్ట్ర అధ్యక్షుడు పి.కనకరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచపూడి సుబ్బారావు, గార్లపాటి సత్యనారాయణ, నంబూరు శివనాగేశ్వరరావు, చింతా కృష్ణారావు, చిట్టం రమేష్, మలిపెద్ది నాగేశ్వరరావు, ఆరవేటి నిర్మల, కూరపాటి సత్యనారాయణ, ఒలివేటి కృష్ణ పాల్గొన్నారు. -
ముగిసిన ఏపీ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు
తణుకు అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న 44వ ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు హాజరుకాగా 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హై జంప్, షాట్పుట్, డిస్కస్త్రో, జావలిన్ త్రో అంశాల్లో పోటీలు నిర్వహించారు. వీరిలో 115 మంది క్రీడాకారులు విజేతలుగా నిలిచి తమిళనాడులో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పోటీల ఆర్గనైజర్ సంకు సూర్యనారాయణ తెలిపారు. రెండు రోజులపాటు జరిగినల టోర్నమెంట్లో ఓవరాల్ చాంపియన్స్గా పార్వతీపురం మన్యం జిల్లా, మెన్స్ చాంపియన్స్గా గుంటూరు జిల్లా, ఉమెన్స్ చాంపియన్స్గా పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచాయాన్నరు. విజేతలకు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చేతులమీదుగా బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్ తణుకు ప్రాంతంలో నిర్వహించడం శుభ పరిణామమని పితాని కొనియాడారు. నాయకులు బసవ రామకృష్ణ, వావి లాల సరళాదేవి, బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర సెక్రటరీ సీహెచ్ జగదీష్, జిల్లా అధ్యక్షుడు బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ అందిస్తున్న ఆధునిక వైద్యసేవలకు గుర్తింపుగా ఇటి హెల్త్కేర్ అవార్డ్స్–2026లో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నట్లు హాస్పిటల్ డైరెక్టర్ శ్రీరామాంజనేయరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలో నైపుణ్యం, వివిధ వైద్య విభాగాల సమన్వయంతో అందించే క్లినికల్ కేర్, అత్యాధునిక చికిత్సా విధానాలు, సమగ్ర వైద్యసేవలు అందించడంలో చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా ‘హాస్పిటల్ ఆఫ్ ది ఇయర్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సౌత్’ అవార్డు లభించిందని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ వైద్యులు డాక్టర్ జీవీ రెడ్డికి ‘ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ది ఇయర్–సౌత్’ అవార్డు వచ్చినట్టు వివరించారు. ఈ రెండు అవార్డులు తమ హాస్పిటల్కు ప్రత్యేకమైన గుర్తింపుగా నిలుస్తాయని ఆయన తెలిపారు. బాపట్లటౌన్: విద్యార్థుల భవిష్యత్తు చేతిరాతపైనే ఆధారపడి ఉందని క్వాలిగ్రఫీ టీం లీడర్ వి.రామ్మోహన్రావు అన్నారు. రెండు రోజులుగా బాపట్ల సరస్వతి మెమోరియల్ గవర్నమెంట్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందమైన చేతి రాతకు సంబంధించి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 152 శిక్షణ తరగతుల ద్వారా సుమారు 94వేల మంది ప్రభుత్వ విద్యార్థులకు 7,350 ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారన్నారు. సెలవు రోజుల్లో సైతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వారి యొక్క పాఠశాలలోని విద్యార్థుల చేతిరాతను మెరుగుపర్చాలన్నారు. విద్యార్థుల చేతిరాతను అందంగా మలిచిన ఉపాధ్యాయులు వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. శిక్షణకు ముందు ఫ్రీ టెస్ట్, శిక్షణ అనంతరం పోస్టు టెస్టు నిర్వహించి, ఈ రెండు రోజుల చేతిరాత శిక్షణలో మంచి ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ఉచితంగా 10లూసిడా హ్యాండ్ రైటింగ్ శిక్షణా పుస్తకాలను అందజేశారు. ’నుదుటి రాత రాసేది బ్రహ్మ – చేతి రాత మార్చేది గురుబ్రహ్మ’, ’చేతి రాతే –విద్యార్థి భవిత’ అంటూ ప్రభుత్వ బడులను బలోపేతం కోసం క్యాలిగ్రఫీ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకు వెళ్తామన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట టౌన్: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలు సమీపంలోని ఈతముక్కల ప్రాంతానికి చెందిన వూట్ల రాజేశ్వరి (24) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను ప్రతివారం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చికిత్స పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులతో ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. చిలకలూరిపేట సమీపంలోని పోలిరెడ్డిపాలెం బైపాస్ వంతెన వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో రాజేశ్వరితో పాటు మరో భర్త అశోక్, వృద్ధురాలు మర్రిపూడి సుశీలకు గాయాలయ్యాయి. వీరిలో సుశీల తీవ్రంగా గాయపడింది. డ్రైవర్కు నిద్రమత్తుతో ఇబ్బంది పడుతుండగా అశోక్ తనకు డ్రైవింగ్ వచ్చని చెప్పి కొద్దిదూరం ఆటో నడిపేందుకు ప్రయత్నించాడు. పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో బైపాస్పై కొనసాగాలా.. సర్వీసు రోడ్డులోకి దిగాలా అనే విషయంలో అశోక్ అయోమయానికి గురయ్యాడు. అప్పుడే వాహనంపై నియంత్రణ కోల్పోయి వెంటనే బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా పడింది. 108 సిబ్బంది వెళ్లి గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కస్సుబస్సు ప్రయాణం అ
రెండో శనివారం, ఆదివారం, అనంతరం వినాయక చవితి అని ఏడాది ప్రారంభంలోనే అందరికీ తెలుసు.. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండడంతో ప్రయాణికుల రద్దీ దాదాపుగా రెట్టింపవుతుందని ముందే తెలుసు.. అయినా ఆర్టీసీ ప్రత్యామ్నాయ చర్యలు మాత్రం శూన్యం. తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండి అన్నరీతిలో ఉచిత బస్సులిచ్చాం.. నిలబడతారో.. కలబడతారో.. మీ ఇష్టం అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉన్న అరకొర బస్సుల్లో కాలు నిలిపేందుకు సైతం చోటు లేకపోవడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారి ఆశలు అడియాశలుగా మారాయి. భారీమొత్తం వెచ్చించి, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. పండుగ ప్రయాణం.. నరకం ● వినాయకచవితి నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల తీవ్ర రద్దీ ● ముందస్తు ఏర్పాట్లు చేయని అధికారులు ● మూడు రోజులు సెలవులు రావటంతో గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్కు పోటెత్తిన ప్రయాణికులు ● రద్దీకి తగ్గట్లు సర్వీసులు ఏర్పాటు చేయని అధికారులు ● అరకొర బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికుల కొట్లాట ● కొన్ని బస్సుల్లో కాలు నిలిపే చోటు లేక ఇక్కట్లు పట్నంబజారు: పండుగలకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని తెలిసినా.. అందుకు తగ్గట్టుగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో పండుగ పూట సొంతూళ్లకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 14న వినాయక చవితి పండగ జరగనుండగా.. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలతో సహా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఆర్టీసీ గుంటూరు రీజియన్ బస్సులన్ని కిక్కిరిసిపోయాయి. మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు, ఇతర బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. 400 బస్సులు ఏమూలకు..? గుంటూరు రీజియన్ పరిధిలో గుంటూరు–1, గుంటూరు–2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి తదితర డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలో సుమారు 400 వరకు బస్సులు ఉన్నప్పటికీ.. పండుగ సమయంలో ఒక్కసారిగా పెరిగిన రద్దీకి అవి సరిపోని పరిస్థితి ఏర్పడింది. గుంటూరు కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ బస్స్టేషన్ నుంచి నిత్యం 80వేల మందికిపైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. పండుగల సమయంలో సుమారు 1.25లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తారనేది అధికారుల అంచనా. ఇప్పటికే అత్యంత ప్రా ధాన్యం కలిగిన డిపో –2 ప రిధిలో సుమారు 80 బస్సులకుపైగా ఇతర డిపోలకు, విద్యుత్ బస్సుల ఏర్పాటు క్రమంలో భాగంగా తరలించేశారు. ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు అందు బాటులో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారింది. సీట్ల కోసం పోటీ బస్సు బస్టాండ్లోకి రాగానే సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో కూర్చునే అవకాశం లేక నిల్చునే ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, రీజియన్ పరిధిలోని ఆయా డిపోల్లోనే బస్సులు నిండిపోవటంతో బస్సులు ఇక మార్గమధ్యంలో ఆపలేని దుస్థితి ఏర్పడింది. వినాయక చవితి తేదీ, వరుస సెలవుల విషయం ముందుగానే అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేయడంలో ఆర్టీసీ అధికారులు పూర్తి వైఫల్యం చెందారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలులో ఉన్న నేపథ్యంలో పండగ రద్దీ సమయంలో అదనపు బస్సుల ఏర్పాటుకు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించని పరిస్థితులు కనపడ్డాయి. పండగకు ముందు గుంటూరు నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే రద్దీ ఒకవైపు అయితే.. పండుగ ముగిసిన తరువాత తిరిగి గుంటూరుకు చేరుకునే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. మహిళల ఉచిత ప్రయాణం, వరుస సెలవులు, పండగ అనంతరం ఉద్యోగులు, విద్యార్థులు తిరుగు ప్రయాణాలు కలిస్తే రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు రద్దీ మార్గాలను గుర్తించి అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని, మహిళలు అధికంగా ప్రయాణించే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో చోటు దొరకకపోవడంతో అనేక మంది ప్రయాణికులు ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు వాహనదారులు అధిక చార్జీలు వసూళ్లు చేస్తున్నారు. గుంటూరు నుంచి తెనాలికి నలుగురితో కూడిన కుటుంబ సభ్యులు వెళ్ళేందుకు ఆటోవాలాలు ఏకంగా రూ.1200 డిమాండ్ చేస్తుండగా, కార్ల బాడుగ అయితే రూ.1800 వరకు అడుగుతున్నారు. ఇక హైదరాబాద్, చైన్నె, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు వేలాది రూపాయలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
గుంటూరు యువకుడికిక్రౌన్ ఆఫ్ ఏపీ 2026 టైటిల్
లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): గుంటూరు జిల్లాకు చెందిన కె.వరుణ్ చౌదరి ప్రతిష్టాత్మక క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 పోటీలో మిస్టర్ కేటగిరీలో విజేతగా నిలిచి టైటిల్ను కై వసం చేసుకున్నారు. విశాఖపట్నంలోని గదిరాజు ప్యాలెస్లో ఈనెల 12న జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని టాలీవుడ్ అసోసియేట్ డైరెక్టర్ సతీష్ అడ్డాల ఆధ్వర్యంలో నిర్వహించారు. సతీష్ అడ్డాల ఇప్పటికే 50కి పైగా షోలను నిర్వహించిన అనుభవంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ సహకారం అందించింది. పోటీల్లో మొత్తం 200 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, ప్రతిభ ఆధారంగా ప్రతి కేటగిరీలో 20 మంది చొప్పున ఎంపిక చేశారు. అనంతరం పోటీని మూడు ప్రధాన రౌండ్లుగా నిర్వహించారు. టాలెంట్ రౌండ్, వెస్ట్రన్ రౌండ్, ట్రెడిషనల్ రౌండ్లో కె.వరుణ్ చౌదరి తన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. మూడు రౌండ్లలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, తుది ఫలితాల్లో క్రౌన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 మిస్టర్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. -
సమస్యలు పరిష్కరించాలని మోకాళ్లపై నిరసన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది ఆదివారం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి తమ నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యేవరకు నూరుశాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, బదిలీ అవకాశం కల్పించాలని కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన వారిలో లక్ష్మీకుమారి, మేరీ కుమారి సోఫియా, ఫాతిమా, బాలాజీ తదితరులు ఉన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువకు ఆదివారం నీటిని నిలిపివేశారు. తాగు నీటి అవసరాల నిమిత్తం గత నెల 26వ తేదీన కుడికాలువకు నీటిని విడుదల చేశారు. సుమారు ఆరు వేల క్యూసెక్కుల చొప్పున సుమారు 10టీఎంసీల నీటిని విడుదల చేయటంతో కుడికాలువ పరిధిలోని ప్రధాన తాగునీటి చెరువులు నిండాయి. దీంతో కుడికాలువకు ఇరిగేషన్ అధికారులు నీటిని నిలుపుదల చేశారు. మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్త జనంతో పోటెత్తింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో క్యూలు భక్తులతో బారులుతీరాయి. ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తులతో రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
ప్రత్యేక ఫీట్లు.. కార్మికుల పాట్లు
వేటపాలెం: ఆదాయం కోసం ఆరాటమో.. పంతం కోసమో తెలియదు కాని ప్రత్యేకాధికారి పోస్టింగు కోసం ఓ డిప్యూటీ ఎంపీడీఓ పట్టు పట్టడం పారిశుద్ధ్య కార్మికుల పాలిట శాపంగా మారింది. ప్రతి నెలా జీతాలు అందితేగాని పోషణ జరగని కుటుంబాలు.. మూడు నెలలుగా పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. వేటపాలెం మండలం పరిధిలో తొమ్మిది పంచాయతీలకు ఐదేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఐదు పంచాయతీలకు ఎంపీడీఓ, మరో నాలుగు పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓ రెండేళ్లుగా ప్రత్యేక అధికారులుగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం ఎంపీడీఓ పదోన్నతితో బదిలీపై వెళ్లిపోయాడు. అలాగే డిప్యూటీ ఎంపీడీఓ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న నాలుగు పంచాయతీలు కలిపి మొత్తం తొమ్మిది పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ప్రత్యేక అధికారులు లేకపోవడంతో ఈ తొమ్మిది పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు, వీధి దీపాలు, తాగునీటి సిబ్బంది, వంటి వారి వేతనాలు గత మూడు నెలలుగా నిలిచిపోయాయి. ఆదాయం ఉన్న పంచాయతీలపైనే గురి ? మండల పరిధిలో ఆదాయ వనరులు అధికంగా ఉన్న కొత్తపేట, దేశాయిపేట, పర్యాటకంగా అభివృద్ధి చెందిన తీరప్రాంత గ్రామ పంచాయతీలైన అక్కాయిపాలెం, చల్లారెడ్డిపాలెం వంటి వాటికి ప్రత్యేక అధికారిగా వ్యవహరించేందుకు ఓ డిప్యూటీ ఎంపీడీఓ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఈ మేరకు ఆ అధికారి ముఖ్య నేత ద్వారా జిల్లా పంచాయతీ అధికారికి సిఫార్సు చేయించినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యేక అధికారుల నియామకానికి నెల రోజుల క్రితం వేటపాలెం ఎంపీడీఓ కార్యాలయం నుంచి జిల్లా అధికారికి ఫైల్ పంపించారు. అయితే పైరవీలు జరుపుతున్న సదరు అధికారికి అనుకూలంగా లేని పంచాయతీలు కేటాయించడంతో ఆయన ఓ ముఖ్య నేతతో జిల్లా అధికారికి సిఫార్సు చేయించి తిరిగి ఆయనకు అనుకూలంగా ఉండే పంచాయతీలు వచ్చేలా సదరు ఫైల్ను తిప్పిపంపినట్లు సమాచారం. ఎట్టకేలకు తాజాగా అదే అధికారి కోరుకున్న పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా నియమించాలని వారం రోజుల క్రితం తిరిగి ప్రతిపాదిస్తూ ఫైలు జిల్లా అధికారికి చేరినట్లు తెలిసింది. వేతనాల కోసం ఎదురుచూపులు వేతనాలు అందక వినాయక చవితి సమయంలోనూ చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర అభివృద్ధి పనులు కూడా ప్రభావిత మవుతున్నాయి. ఒక అధికారి పోస్టింగ్ వ్యవహారం కారణంగా ప్రత్యేక అధికారుల నియామకం ఆలస్యం అవుతుంటే, దాని భారాన్ని వందలాది మంది కార్మికులు మోయాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కార్మికులు, ఉద్యోగ వర్గాలు కోరుతున్నారు. వేటపాలెం మండల పరిధిలోని తొమ్మిది గ్రామాలకు ప్రత్యేక అధికారుల నియామకం కోసం వారం రోజుల కిందటే నావద్దకు ఫైల్ వచ్చింది. త్వరలోనే దానికి ఆమోదం తెలిపి ప్రత్యేక అధికారుల నియామకానికి అనుమతులు పంపిస్తాం. – కె.ప్రభాకర్రావు, జిల్లా పంచాయతీ అధికారి, బాపట్ల -
కొమ్మమూరు బ్రిడ్జిపై ప్రయాణం నరకం
చేబ్రోలు: చేబ్రోలు సమీపంలోని కొమ్మమూరు ఛానల్ బ్రిడ్జివద్ద వాహనదారుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. చేబ్రోలు – మంచాల గ్రామాల మధ్య ఉన్న పురాతన వారధి వద్ద ఆదివారం లారీ నిలిచిపోవటంతో పొన్నూరు, గుంటూరు మార్గాల వైపు కి.మీల పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. కొద్దిరోజుల క్రితం బ్రిడ్జికి ఒకవైపు కొంతభాగం కూలిపోయింది. అప్పటినుంచి వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రెండు రోజుల క్రితం పొన్నూరు వైపు వెళ్లే లారీ బ్రిడ్జిపై భాగంలో ఎదురుగా మరో వాహనం రావటంతో నిలిచిపోయింది. దీనిని సర్దుబాటు చేయటానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. బ్రిడ్జి దాటడానికి ఆరుగంటలు సమయం పట్టినట్లు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు వైపుల సుమారు నాలుగు కి.మీ పొడవునా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిలిచిన వాహనాలు ఆదివారం కొమ్మమూరు బ్రిడ్జి వద్ద వినాయక చవితి పండుగ నేపథ్యంలో రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. వంతెన బలహీనపడటంతో పోలీసులు రాకపోకలను క్రమబద్ధీకరిస్తూ ప్రత్యామ్నాయంగా ఒకే వరుసలో వాహనాలను అనుమతించారు. పొన్నూరు వైపు కొద్దిసేపు, గుంటూరు వైపు కొద్ది సేపు వాహనాలను పంపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇరువైపులా వాహనాలు భారీ స్థాయిలో నిలిచిపోయి సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అంగుళం కూడా ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది.లారీ నిలిచిపోవడంతో రెండువైపులా 4 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్ -
సివిల్ కేసుల పరిష్కారంలో గుంటూరుకు ప్రథమస్థానం
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ మార్గదర్శకత్వంలో, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బి.సాయి కల్యాణ చక్రవర్తి నాయకత్వంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన జిల్లా కోర్టు ప్రాంగణంలో కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 46 బెంచ్లను, జిల్లా కోర్ట్లో 16 బెంచ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 14,587 కేసులను పరిష్కరించారు. వీటిలో సివిల్ కేసులు 954, క్రిమినల్ కేసులు 13594, ప్రీ– లిటిగేషన్ కేసులు 39 ఉన్నాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ చాలాకాలంగా పెండింగ్లో ఉన్న అధిక విలువ కలిగిన అనేక కేసులు పరస్పర అంగీకారంతో పరిష్కరించబడ్డాయని తెలిపారు. గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్రంలో సివిల్ కేసుల పరిష్కారంలో వరుసగా ఆరుసార్లు ప్రథమ స్థానాన్ని సాధించిందని పేర్కొన్నారు. అదనపు జిల్లా జడ్జిలు, అదనపు సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్), జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అదనపు సివిల్ జడ్జిలు (జూనియర్ డివిజన్), న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్ సభ్యులు, ఇన్స్యూరెన్స్ కంపెనీ, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న 24 భూ సేకరణ అప్పీళ్లకు లోక్అదాలత్లో పరిష్కారం లభించింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దేవరపల్లి జయంత్ కుటుంబసభ్యులకు రూ.96 లక్షల పరిహారం చెల్లించేందుకు ఇన్స్యూరెన్స్ కంపెనీ అంగీకరించింది. సోదరీమణులు తమ ఆస్తి హక్కును వదులుకుని రూ.రెండు కోట్లు స్వీకరించేందుకు అంగీకరించారు. -
శివ శక్తి.. వీక్షణతో సంతృప్తి
తెనాలి: తెనాలికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు రాయన గిరిధరగౌడ్ తాజా చిత్రాలు దేశ రాజధాని ఢిల్లీలో కళాప్రియులను ముగ్ధులను చేయనున్నాయి. ఆరుగురు చిత్రకళాకారులతో కలిసి అక్కడి బికనీర్ హౌస్లోని సెంట్రల్ హాలులో ఈ బృంద ప్రదర్శన ఏర్పాటు కానుంది. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలో గిరిధర్గౌడ్వి ఐదు పెయింటింగ్స్, పది రేఖాచిత్రాలు కొలువుదీరనున్నాయి. విభిన్న శైలులు... మైసూర్లో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ, బరోడాలో పీజీ చేసిన గిరిధరగౌడ్ అక్కడే కొంతకాలం ఫ్యాకల్టీగా పనిచేశారు. ఉద్యోగ జీవితం సంతృప్తిగా అనిపించక తెనాలి సమీపంలోని స్వస్థలం గరువుపాలెంలో స్థిరపడ్డారు. అక్కడే చిత్రకళా రచనలో ప్రయోగాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రభావంతో తొలిదశలో పౌరాణిక చిత్రాలను గీస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వ సీనియర్ ఫెలోషిప్తో లేపాక్షి చిత్రకళపై చేసిన పరిశోధన అనంతరం చిత్రకళా రీతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఐదు శతాబ్దాల నాటి లేపాక్షి కళలోని మంచి లక్షణాలను, శైలిని దృష్టిలో ఉంచుకొని నవ్యధోరణితో, రంగుల మేళవింపుతో ఆధునికతను మేళవిస్తున్నారు. చిత్రకళా రచనలో ‘దశావతారాలు’ నుంచి రకరకాల సిరీస్లను తీసుకొచ్చారు. ఆ క్రమంలో చిత్రీకరించిన కళాఖండాలను ‘శివ శక్తి’ సిరీస్గా గతేడాది హైదరాబాద్ కళాకృతిలో ప్రదర్శించారు. గత మూడు దశాబ్దాల్లో వివిధ రాష్ట్రాల్లోని గ్యాలరీల్లో 10 సోలో ఎగ్జిబిషన్లు చేశారు గిరిధరగౌడ్. దేశవ్యాప్తంగా జరిగిన 37 గ్రూప్ ఎగ్జిబిషన్లలోనూ చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో లండన్, న్యూయార్క్, సింగపూర్, చైనా తదితర ఎగ్జిబిషన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతోపాటు అనేక కళాసంస్థల నుంచి గౌరవాన్ని అందుకున్నారు. -
అందుబాటులో మెరుగైన వైద్యసేవలు
చీరాల రూరల్: స్థానిక చీరాల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అన్నారు. చీరాల ప్రభుత్వ వైద్యశాలలో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటేడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీ సేవలను శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర కుటుంబ సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని విజయవాడ నుంచి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్, ఎమ్మెల్యే ఎంఎం.కొండయ్య కలిసి నూతనంగా ఆవిష్కరించిన ఐపీహెచ్ఎల్ కేంద్రాన్ని పరిశీలించారు. ఒక్కొక్క విభాగాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ల్యాబ్ సేవలను చీరాలలో ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆస్పత్రి సూపరింటెండెండ్ డాక్టర్ సుభాషిణి, ఏఎంసీ చైర్మన్ కె. జనార్దన్, వైద్యులు డాక్టర్ పి.శ్రీకాంత్, ఈ. హరిబాబు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాత దుకాణాలకే కొత్త కిక్కు
మళ్లీ వారికే... చీరాల: సర్కారు గల్లా పెట్టెకు కిక్కు సరిపోవడం లేదు... ఇంకో ఏడాది పెంచితే అదనంగా మరింతగా ఆర్జించవచ్చనే ఆలోచనతో కూటమి సర్కారు మద్యం షాపుల లైసెన్స్లను మరో ఏడాది పాటు పొడిగించింది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రజల సొమ్మును లూటీ చేసే రీతిలో మద్యం వ్యాపారం సాగుతోంది. మద్యం షాపుల లీజు గడువు అక్టోబర్ 2వ తేదీతో ముగియనుంది. అయితే కొత్త మద్యం పాలసీ తీసుకురాకుండా పాత వాటినే రెన్యువల్ చేస్తోంది. మద్యం వ్యాపారం నష్టాల్లోనే ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మళ్లీ పాత వారికే ఏడాది పాటు లైసెన్స్లు రెన్యూవల్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో మొత్తం 128 మద్యం షాపులున్నాయి. అలాగే గీత కార్మికులకు 12 షాపులు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో షాపు పొందేందుకు రూ.2 లక్షల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ విధానాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఎక్కువ మొత్తంలో డీడీలు తీశారు. చీరాల ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని 32 షాపులకు గాను ఒక్కో షాపునకు దాదాపు 20 డీడీల వరకు తీశారు. రెండేళ్లకు గాను ఈ షాపులన్నీ లాటరీ విధానంలో లీజుకు ఇచ్చారు. వీటిలో గీత కార్మికులకు కూడా కొన్ని అప్పగించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మద్యం షాపుల్లో మద్యం అమ్మకాల ద్వారా రూ.844 కోట్ల ఆదాయం వచ్చింది. షాపులు దక్కించుకున్న వారు పక్కా ప్రణాళికతో షాపునకు కొన్ని బెల్టు షాపులు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. 20 శాతం కమీషన్ పేరుతో ఆశ మద్యం అమ్మకాలను రాష్ట్రంలో పెంచేందుకు ప్రభుత్వం మద్యం వ్యాపారులకు మొదట్లో ఆశలు కల్పించింది. దుకాణదారులకు 20 శాతం కమీషన్ ఇస్తామని చెప్పింది. తొలుత 9 శాతం చొప్పున ఇచ్చారు. తర్వాత 10 శాతం చేశారు. అనంతరం 14 శాతానికి పెంచారు. ప్రభుత్వం ముందు చెప్పిన కమీషన్ ఇవ్వకపోవడంతో అధిక పెట్టుబడి పెట్టి తాము నష్టపోయామని వ్యాపారులు వాదనలు తెరపైకి తెచ్చారు. అయితే ఎమ్మార్పీ కన్నా క్వార్టర్ బాటిల్పై రూ.10 అదనంగా వసూలు చేయడం జరుగుతూనే ఉంది. బెల్టు షాపుల్లో రూ.20 నుంచి రూ.30 వరకు బాదేస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీలో భాగంగా 2024లో లాటరీలో షాపులు దక్కించుకున్న వారు రెండేళ్లకు లీజు నిమిత్తం రూ.71 లక్షల చలానా, రూ.7.50 లక్షలు పర్మిట్ ఫీజును మొత్తం విడతల వారీగా చెల్లించాలని ఆదేశించారు. అక్టోబర్ 2వ తేదీతో లైసెన్స్ల గడువు తీరడంతో మరో ఏడాది గడువు పెంచారు. గత ఏడాది చెల్లించిన వార్షిక ఎకై ్సజ్ రుసుంపై 38 శాతం రెన్యూవల్ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో చలానా ఖర్చు, పర్మిట్ రూమ్ల ఖర్చు వెరసి మొత్తం రూ.1.8 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని నాలుగు, ఐదు విడతల్లో నగదును జమ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో షాపు రోజుకు రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అమ్మకాలు సాగిస్తేనే చెల్లించిన నగదుకు సర్దుబాటు అవుతుంది. మద్యం పాలసీని ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుని ఆదాయం గడిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా లేని ఫీజులు ఆంధ్రప్రదేశ్లో వసూలు చేస్తూ ఖజానాను నింపుకొనే ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
చెలరేగుతున్న చోరులు
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోరులు చెలరేగిపోతున్నారు. దొంగతనానికి వచ్చి ఇంట్లోని వారిని సైతం చంపేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. భారీ దొంగతనాలు, దోపిడీలతో హడలిపోతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా నేరాల నియంత్రణకు చంద్రబాబు సర్కారు కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చే దోపిడీ ముఠాలు కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఆధారాలు దొరక్కుండా వ్యూహాత్మకంగా దోపిడీలకు పాల్పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడడంతో బయట రాష్ట్రాల వారితోపాటు జిల్లాకు చెందిన కొంతమంది కూడా ముఠాలుగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడులో హత్యలు.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతున్న దొంగతనాలు, దోపిడీల పరంపరను పరిశీలిస్తే.. అధిక శాతం దొంగతనాలు తాళాలు వేసి ఊరికి వెళ్లిన వారి ఇళ్లల్లోనే జరుగుతున్నాయి. ఒంటరిగా నివసించే మహిళలు, వృద్ధులు ఉండే ఇళ్లను ముందుగానే రెక్కీ వేసి ఎంచుకుని మరీ దోపిడీలకు పాల్పడుతున్నారు. 80 శాతం దొంగతనాలు ఇలాంటివే కావడం గమనార్హం. గుంటూరు జిల్లాలో... బాపట్ల జిల్లాలో... బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల, మార్టూరు వంటి ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో భారీ మొత్తంలో సొత్తు చోరీకి గురైనట్లు కేసులు నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో సొత్తు మాత్రం రికవరీ చేయని పరిస్థితి నెలకొంది. వినుకొండ పట్టణంలో వరుస దొంగతనాలు అక్కడి ప్రజలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టపగలే చోరీలకు పాల్పడుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా దృష్టి సారించి రాత్రిపూట గస్తీలు ముమ్మరం చేసి దొంగతనాలు జరుగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. లక్ష్మీపురం: క్రికెట్ అండర్–19 వన్డే ఆంధ్రా జట్టుకు గుంటూరు నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఎ.దేవ ప్రమోద్ వికెట్ కీపర్ కం బ్యాటర్, ఎం. శ్రీ సమన్విదత్త ఓపెనింగ్ బ్యాటర్గా, కె.వి.కౌశిక్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా, ఎస్.కె. అబ్దుల్ జబ్బర్ లెగ్ స్పిన్నర్గా జిల్లా, జోనల్ స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఆంధ్రా జట్టుకు ఎంపికయ్యారు. ఈ మేరకు త్రీ మెన్ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు. త్వరలో జరగబోయే అంతర్రాష్ట్ర పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా శిక్షణ ఇచ్చిన కోచ్కి, సెలక్షన్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. గంటల కొద్దీ ట్రాఫిక్కు అంతరాయం చేబ్రోలు: చేబ్రోలు – మంచాల గ్రామాల మధ్య ఉన్న కొమ్మమూరు బ్రిడ్జిపై శనివారం రాత్రి లారీ నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొన్నూరు, గుంటూరు మార్గాల వైపు కి.మీ.ల పొడువున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎనిమిది రోజుల కిందట కొమ్మమూరు బ్రిడ్జికి ఒకవైపు కొంతభాగం కూలిపోయింది. అప్పటి నుంచి పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. పెద్ద వాహనాలు బ్రిడ్జిపైనుంచి రాకపోకలు సాగకుండా చర్యలు తీసుకున్నారు. శనివారం సాయంత్రం సమయంలో కొద్దిపాటి వర్షం కురిసింది. పొన్నూరు వైపు లారీ వెళుతుండగా బ్రిడ్జిపైభాగంలో ఎదురుగా మరో వాహనం వచ్చింది. లారీ ఆగిపోవటంతో దీనిని సర్దుబాటు చేయటానికి పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. రెండు వైపులా సుమారు ఐదు కి.మీ. మేరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. బ్రిడ్జి దాటడానికి వాహనదారులకు గంటలకొద్దీ సమయం పట్టడంతో అవస్థలు తప్పలేదు. మరోవైపు వర్షం పడటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి అయినప్పటికీ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో క్లియర్ కాకపోవడంతో పోలీసులకు కూడా కష్టాలు తప్పలేదు. ఈపూరు: తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ జలాలను విడుదల చేసిన క్రమంలో 85వ మైలు సమీపంలో కుడి ప్రధాన కాలువను ఎస్ఈ టి. రమేష్ శనివారం పరిశీలించారు. కాలువలో నీటి ప్రవాహ కొలతలను తెలుసుకున్నారు. నీటి వృథా జరగకుండా కాలువలపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులను పరిగణనలో తీసుకుని తాగునీటి చెరువులను సకాలంలో నింపాలని ఆదేశించారు. వెంట ఈఈ ఆర్.మల్లికార్జున, డీఈఈ షేక్ ఖాదర్, ఏఈ ఎం యుగంధర్ ఉన్నారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,535 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజ్ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హై లెవెల్కి 96 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 604, తూర్పు కాలువకు 403, పశ్చిమ కాలువకు 150, నిజాంపట్నం కాలువకు 250, కొమ్మమూరు కాలువకు 915 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. దొంగతనాలు జరిగిన వెంటనే పోలీసులు స్పందించకపోవడంతో పాటు, దొంగలు దొరికినా బాధితులు పోగొట్టుకున్న సొత్తు మాత్రం పూర్తి స్థాయిలో వారి చేతికి అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఐ ప్రతీకాత్మక చిత్రం -
కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం
మూడు రోజుల కిందటే మృతి చెంది ఉండొచ్చని అనుమానం వేటపాలెం: రావూరిపేట మార్కెట్ సమీపంలోని వినాయక దేవస్థానం పక్కన ఉన్న రొయ్యల మే త దుకాణం వెనుక ఓ వ్యకి మృతదేహం కుళ్లిన స్థితిలో శనివారం అసల్యంగా లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు వేటపాలెం ఆర్టీసీ బస్టాంట్ సమీపంలో నివాసం ఉంటున్న జిడుగు ప్రకాస్ (37)గా గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి శనివారం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుకాణం వెనుక మృతదేహం కనిపించింది. ము ఖం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కనీసం మూడు రోజుల కితమే మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు మద్యానికి బానిసై తరచూ తిరుగుతుండేవాడని స్థానికులు తెలిపారు. అయితే మృతికి కారణా లు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు. -
బాపట్ల ఫొటోగ్రాఫర్కు జాతీయస్థాయి అవార్డు
బాపట్లటౌన్: బాపట్ల ఫొటోగ్రాఫర్కు జాతీయస్థాయి అవార్డు వరించింది. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటో కాంఫిటేషన్ ఆగష్టు 15 సందర్భంగా విద్యార్థులు ఆడిన ఫుడ్బాల్ గేమ్ ఫొటో జాతీయస్థాయిలో ఎక్స్లెన్స్ అవార్డు ఆఫ్ది ఇయర్ 2026 అవార్డు అందుకున్నారన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా పీఏఐ ఛైర్మన్ తుమ్మా శ్రీనివాసరెడ్డి, అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ గోలి వెంకట శివకుమార్లు అభినందించారు. గుంటూరు రూరల్: కారు డ్రైవర్ ఓవర్ స్పీడుకు బొలెరో డ్రైవర్ మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ భాస్కర్ తెలిపిన వివరాలు.. ఎన్హెచ్ 16లో బుడంపాడు వద్ద ప్రకాశం జిల్లాకు చెందిన పాలకుర్తి వెంకటేశ్వర్లు బొలెరో ట్రక్ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈక్రమంలో శుక్రవారం విజయవాడ వైపు నుంచి బొలెరో ట్రక్లో బాతుల లోడుతో వెళుతూ బుడంపాడు వద్ద హైవే నుంచి కిందకు దిగుతున్నాడు. అదే క్రమంలో తెనాలి బాలాజీరావుపేటకు చెందిన జల్లి సతీష్ హైవే సమీపంలోని ఆస్పత్రిలోలో ఆరోగ్యం చూపించుకుని హైవే ఎక్కేందుకు తన కారులో వెళుతున్నాడు. కారులో వెళుతూ మితిమీరిన వేగంతో హైవే నుంచి సర్వీస్ రోడ్డులోకి దిగుతున్న బొలెరో ట్రక్ను ఢీకొన్నాడు. బొలెరో ట్రక్ బోల్తాపడగా డ్రైవర్ వెంకటేశ్వర్లు(45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురికి తరలించి మృతుడి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
కొల్లూరు: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం.. మండలంలోని పెదలంక అరవింద వారధి సమీపంలో నివసిస్తున్న ఉప్పు శివవెంకటగోపయ్యకు 2020లో చీరాల, గోపాలకృష్ణపురానికి చెందిన శివ (25)తో వివాహం జరిగింది. శివ తల్లి వారం రోజుల క్రితం మృతి చెందడంతో సంప్రదాయం ప్రకారం గురువారం తన తల్లి గృహానికి స్వీట్లు తీసుకొని వెళ్లాల్చి ఉంది. మృతురాలు శివ రాకపోవడంతో మారు తండ్రి ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె వస్తున్నదీ లేనిదీ తెలుకునేందుకు ఫోన్లో ఆమెను సంప్రదించేందుకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది. పదేపదే ఫోన్లు చేస్తూ ఉన్నా శివ ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె బంధువులు సాయంత్రం చీరాల నుంచి మండలంలోని పెదలంకలో ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చారు. అప్పటికే ఆమె చనిపోయి ఉండటం గమనించి మృతురాలి భర్త శివవెంకటగోపయ్యను ప్రశ్నించారు. తాను బయటకు వెళ్లి వచ్చే సమయానికి ఆమె కింద పడిపోయి ఉందని, ఆమైపె తమ మూడేళ్ల కూతురు పడుకొని ఉందని బదులిచ్చాడు. ఆమె మృతిపై అనుమానంతో మృతదేహాన్ని పరిశీలించిన బంధువులు మెడ చుట్టూ గాయం ఉండడం గమనించారు. మృతురాలి బంధువులు వచ్చే సమయానికి మృతదేహాన్ని ఇంటిలో ఉంచి మృతురాలి భర్త, మరిది, తోటికోడళ్లు మాత్రమే ఉండటంతో శివ మరణించడంపై వారిని నిలదీశారు. తాము చూసేప్పటికే ఆమె చలనం లేకుండా ఉండటంతో కొల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించామని, అప్పటికే చనిపోయినట్లు వైద్యుడు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చామని ఆమె బంధువులకు బదులిచ్చారు. వారు నివసిస్తున్న రేకుల ఇంటిలో ఉరి పెట్టుకున్న ఆనవాళ్లు లేకపోవడంతో ఆమె మృతిపై అనుమానంతో కొల్లూరు పోలీసులకు శివ బంధువులు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ కిశోర్బాబు మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి మారు తండ్రి చెన్నుపల్లి వీరసాయిబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శుక్రవారం తహసీల్దార్, ఎస్ఐల సమక్షంలో శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలికి ఐదు, మూడేళ్ల కుమార్తెలున్నారు. మృతురాలి భర్త పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
రైతులపై టీడీపీ సర్కార్ నిర్లక్ష్యం
బాపట్ల: రాష్ట్రంలో రైతులు వర్షాలు లేక పంట ఎండిపోయి విలవిల్లాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మండిపడ్డారు. బాపట్ల నియోజకవర్గంలో రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ చేపట్టిన రైతు భరోసా పాదయాత్ర శుక్రవారం రెండో రోజు కర్లపాలెం మండలంలో సాగింది. రైతులను పరామర్శిస్తూ ఆయన ముందుకు సాగారు. తొలుత మహిళలు హారతులు ఇచ్చి కోనకు స్వాగతం పలికారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులను పట్టించుకోవడం చేతకాని అధికార పార్టీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మరాజు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట కాలువలు, మురుగు కాలువల అభివృద్ధిని పట్టించుకోలేదంటూ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను కోన ఖండించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు ఎదురైన సమయంలో తాను సొంత నిధులతో మోటార్లు ఏర్పాటు చేసి నల్లమడ, తుంగభద్ర కాలువల నుంచి నీటిని తరలించినట్లు గుర్తుచేశారు. సంవత్సరంలో రెండు మూడు సార్లు నాటితే గానీ పంట పండని మూలపాలెం లాంటి పొలాలకు కూడా నీరు అందిందన్నారు. ఎమ్మెల్యే కూడా సొంత నిధులు వెచ్చించి రైతులకు సాగునీరు అందించేందుకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. విమర్శలు చేయడం కంటే రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపాలని సూచించారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో రైతుల తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పంట బీమాను చెల్లించారని, ఇప్పుడు ప్రతి రైతు ఎకరాకు రైతులే చెల్లించి పంట బీమా చేయించుకోవలసిన దుస్థితి నెలకొందన్నారు. సంపద సృష్టి పేరుతో రాష్ట్ర ప్రజలను పాలకులు మోసం చేశారన్నారు. సాగునీరు కూడా అందించకపోవడంతో రైతన్నలు ఆవేదనలో కూరుకుపోయారని చెప్పారు. పింఛన్ల పేరుతో హడావుడి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రజలను మళ్లీ మభ్యపెట్టడానికి పింఛన్ల పేరుతో ఈ కూటమి ప్రభుత్వం హడావుడి చేస్తుందని పేర్కొన్నారు. 50 ఏళ్లకు పింఛన్ పేరుతో అందరినీ మోసం చేసి, ఇప్పుడు దరఖాస్తుదారులను మీ సేవా కేంద్రాలకు, సచివాలయాలకు తిప్పుతున్నారన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం కర్లపాలెం మండలంలోని సత్యవతిపేట వద్ద నుంచి రెడ్డిపాలెం వరకు రైతు భరోసా పాదయాత్ర జరిగింది. 20 పంచాయతీల నుంచి రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రైతులు సంఘీభావం తెలియజేస్తూ ఆయన వెంట నడిచారు. ఈ పాదయాత్రలో ఆయన వెంట పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు జి. సురేంద్రబాబు, మండల పార్టీ కన్వీనర్లు యల్లావుల ఏడుకొండలు, కాగిత సుధీర్బాబు, లీలా శ్రీనివాస్రెడ్డి, మరుప్రోలు ఏడుకొండలురెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దొంతిబోయిన జయభరత్రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త పేరాల వెంకట సురేష్, మందపాటి పరమానంద కుమార్, యువజన అధ్యక్షులు సాగర్ బెనర్జీ, కోకి రాఘవరెడ్డి, వడ్డీముక్కల డేవిడ్, చల్లా రామయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చెంచయ్య, ట్రేడ్ యూనియన్ నాయకులు ఆట్ల నాగేశ్వరరెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పదవుల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. -
ఏకపక్ష నిర్ణయాలతో మమ్ములను నష్టాలపాలు చేయొద్దు
బాపట్లటౌన్: ఏకపక్ష నిర్ణయాలతో మమ్ములను నష్టాలపాలు చేయొద్దని మద్యం లైసెన్స్దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న 38 శాతం రెన్యూవల్ ఫీజు నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం బాపట్ల నియోజకవర్గంలోని లైసెన్స్దారులు బాపట్ల ఎకై ్సజ్శాఖ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. లైసెన్స్దారులు మాట్లాడుతూ ఇప్పటికే నష్టాల్లో ఉన్న మాకు ఊరట కల్పించకపోగా మమ్ములను ఇబ్బందులకు గురిచేయటం సరికాదన్నారు. గత ఏడాది చెల్లించిన వార్షిక ఎకై ్సజ్ రుసుంపై అదనంగా 38 శాతం రెన్యువల్ ఫీజు చెల్లించాలనే ప్రతిపాదన తమకు తీవ్ర ఆర్థిక భారంగా మారుతుందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో జనాభాకు అనుగుణంగా కాకుండా అధిక సంఖ్యలో మద్యం షాపులు ఉండటంతో గత రెండు సంవత్సరాలుగా తీవ్ర పోటీ నెలకొని తీవ్ర నష్టాలను చవిచూశామన్నారు. గత పాలసీలో 20 శాతం మార్జిన్ వస్తుందనే ఆశతో లాటరీ ద్వారా షాపులను దక్కించుకున్న వ్యాపారులు, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారన్నారు. లాటరీలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని కూడా తిరిగి రాబట్టలేకపోగా కనీసం లైసెనన్స్ ఫీజును కూడా పూర్తిగా రాబట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యాపారాన్ని కొనసాగించలేమనే స్థాయికి మేమంతా చేరుకున్నామని వారు స్పష్టం చేశారు. ఎకై ్సజ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన లైసెన్స్దారులు -
పేకాటలో తమ్ముళ్ల కాసుల వేట
రేపల్లె: ప్రశాంతతకు మారుపేరైన రేపల్లె నియోజకవర్గం జూద క్రీడలకు కేరాఫ్ అడ్రస్గా మారుతుందన్న విమర్శలు రోజురోజుకీ తీవ్రం అవుతున్నాయి. స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ అండదండలతో నియోజకవర్గం పేకాట మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా నది తీరం వెంబడి రావి అనంతవరం సమీపంలో నది మధ్యలోనే దీవులలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలలో పగలు, రాత్రి తేడా లేకుండా జూద శిబిరాలు కొనసాగుతుండటం పరిస్థితి ఎంత దారుణంగా మారిందో స్పష్టం చేస్తోంది. రోజుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నాయి. టీడీపీ నేతల ధనార్జన పట్టణంలోని డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఉప్పూడి గ్రామ సమీపంలో మరో పేకాట శిబిరం జోరుగా సాగుతోందని ప్రజలు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గంలోని నిజాంపట్నం మండలం కొత్తపాలెం, నగరం మండలం వెలమవారిపాలెం గ్రామాలలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట దందా కొనసాగుతోంది. ఈ వ్యవహారాలు టీడీపీ నాయకుల అక్రమార్జనకు ఉదాహరణగా నిలుస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. క్యాసినో స్థాయిలో కేంద్రాలు కృష్ణా నది మధ్యలో ఏర్పాటు చేసిన ఈ జూద శిబిరాల్లో టోకెన్ వ్యవస్థ, కట్టుదిట్టమైన భద్రత, బయటి వ్యక్తులకు ప్రవేశం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. కొన్ని చోట్ల క్యాసినో తరహాలో ఫుల్ సౌకర్యాలతో జూదం నిర్వహిస్తున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇతర జిల్లాల నుంచి సైతం పెద్ద ఎత్తున జూదరులు వస్తున్నారని సమాచారం. జూదరులను ఆకట్టుకునేలా శిబిరాల వద్దనే మందు, విందు, వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా టీడీపీ నేతలు తమ జేబులు నింపుకొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పేకాట మాఫియా వల్ల ఎన్నో కుటుంబాలు అప్పుల బారిన పడి కుదేలవుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ‘ఇంకెంతకాలం ఈ దందా?’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆయన సోదరుడు అనగాని శివప్రసాద్ ప్రోద్బలంతోనే ఈ పేకాట శిబిరాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు మారుమోగుతున్నాయి. శిబిరాల నుంచి అనగాని సోదరులకు రోజూ భారీగా కమీషన్లు చేరుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
కర్లపాలెం (బాపట్లటౌన్): రాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఎ.లక్ష్మి తెలిపారు. మండలంలోని దుండివారిపాలెంలో శుక్రవారం వ్యవసాయశాస్త్రవేత్తలు, అధికారుల బృందం పర్యటించింది. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ వేరుశెనగ పంటలో జింక్, ఇనుము ధాతువుల లోపాలు ఉన్నాయన్నారు. వాటి నివారణకు ఫార్ములా–4, ఫార్ములా–6 సూక్ష్మ పోషకాలను ఎకరాకు 0.5 కిలో చప్పున పిచికారీ చేయాలన్నారు. దీనివల్ల పోషకాల లోపం తగ్గి, పంట ఏపుగా పెరుగుతుందన్నారు. నీటి ఎద్దడి కారణంగా వరిపంట ఎదుగుదల తగ్గిందన్నారు. బెట్ట పరిస్థితులను తట్టుకుని నిలబడేలా పొటాషియం నైట్రేట్ (13:0:45) మందును ఎకరాకు కిలో సాయంత్రం వేళలో పిచికారీ చేయాలన్నారు. ఇప్పటివరకు ఎలాంటి పంటలు వేయకుండా ఖాళీగా ఉన్న భూముల్లో ఆరుతడి పంటలైన మినుము, పెసర, రాగి, కొర్ర వంటి పంటలను సాగు చేయాలన్నారు. ప్రభుత్వం ఆరుతడి పంటల విత్తనాలపై 80శాతం రాయితీ ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయం మేనేజర్ మధుమోహన్, లాంఫాం శాస్త్రవేత్త డాక్టర్ గంగాదేవి, మండల వ్యవసాయ అధికారి సుమంత్ కుమార్, విస్తరణ అధికారి భాగ్యలక్ష్మి, రైతులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి ఎ.లక్ష్మి -
నేడు జాతీయ లోక్ అదాలత్
గుంటూరు లీగల్: జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టు ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 44 బెంచెస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సివిల్, చెక్కు బౌన్స్ కేసులు ఎక్కువగా రాజీ చేసే దిశగా న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు. శుక్రవారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కమ్యూనిటీ మీడియేటర్స్కు వర్చువల్ పద్ధతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రైనీ ఆర్. విజయ కమల మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి వీఎస్వీ హిమబిందు, సీనియర్ సివిల్ జడ్జి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అదనపు కార్యదర్శి హెచ్. అమరలింగేశ్వరరావు, గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: అమావాస్యను పురస్కరించుకుని మంగళగిరి కొండపై కొలువైన గండాలయ స్వామికి భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు కొండపై దీపాలు వెలిగించారు. మంగళగిరితోపాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీపాలు వెలిగించిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున గండాలయ స్వామికి దీపాలు వెలిగిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రతి అమావాస్యకు కొండపై స్వామి సన్నిధికి చేరుకుంటారు. దీపాలు వెలిగించడం వల్ల చీకటి దూరమై వెలుగులు నిండుతాయని, జీవితాల్లో కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మంగళగిరి కొండపై ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మిర్చి యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సోమవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా సెలవు ప్రకటించారు. దీంతో మిర్చి యార్డులో క్రయవిక్రయాలు, ఇతర మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెలవు రోజుల్లో మిర్చి పంటను యార్డుకు తీసుకురావద్దని యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎ.చంద్రిక శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి యార్డులో యథావిథిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆమె వెల్లడించారు. యడ్లపాడు: చిలకలూరిపేట పట్టణంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీఎల్ఎన్ మూర్తి, సీఆర్డీఏ పర్యవేక్షక ఇంజినీర్ బీవీ సుధాకర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట టౌన్ సెక్షన్ పరిధిలో ఈ తనిఖీలు చేశారు. 34 బృందాలు, 34 మంది అధికారులు, 85 మంది సిబ్బంది పాల్గొన్నారు. 1,885 విద్యుత్ సర్వీసులను పరిశీలించారు. ప్రత్యేక తనిఖీల్లో 115 కేసుల్లో వినియోగదారులకు రూ.8.79 లక్షల అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ ఇంజినీర్ డీపీఈ సీహెచ్ వెంకటేశ్వరరావు, గుంటూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ ఆఫీసర్ వై. ఏడుకొండలు వివరాలను వెల్లడించారు. విద్యుత్ అక్రమ వినియోగంపై 94408 12263, 94408 12360 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తనిఖీల్లో పలు విభాగాల డీఈఈలు పి. భార్గవి, కె.రవికుమార్, ఎన్. మల్లికార్జున ప్రసాద్, ఏఈఈలు ఎన్. కరుణాకర్, ఎం.సతీష్కుమార్, యు. శివశంకర్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
రొయ్యల చెరువుల తవ్వకాలపై ఆగ్రహం
చినగంజాం: మండలంలోని కడవకుదురు గ్రామం రొంపేరు కాలువ సమీపంలో రొయ్యల చెరువులు తవ్వకాలను జరపడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో కొందరు రైతులు చెరువుల తవ్వేందుకు సన్నాహాలు చేపట్టడంతో గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. చెరువులు తవ్వకాలు జరుపుతున్న రైతులు, గ్రామస్తుల మధ్య వివాదం చెలరేగడంతో సమాచారం అందుకున్న తహసీల్దార్ జీవిగుంట ప్రబాకరరావు, ఎస్ఐ శీలం రమేష్లు సంఘటనా స్థలానికి వెళ్ళి వివాదాలకు కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రొయ్యల చెరువులు తవ్వకం జరపడం వలన భూగర్భజలాలు కలుషితం అయ్యే ప్రమాదముందని, తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా చెరువు తవ్వకాలను నిలిపి వేయాలని వారు అధికారుల ముందు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తహసీల్దార్ ప్రభాకరరావు.. చీరాల ఎఫ్డీఓ రవీంద్రకు గ్రామంలో శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా చెరువుల తవ్వకాలకు అనుమతులు నిలిపివేయాలని సూచించారు. దాంతో గ్రామస్తులు శాంతించి సంఘటనా స్థలం నుంచి తిరిగి వెళ్ళారు. అధికారుల జోక్యంతో శాంతించిన గ్రామ ప్రజలు -
వాడిపోతున్న రైతన్నల ఆశలు
ఎల్నినో ప్రభావం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు.. మరోవైపు రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు అన్నదాతల ఆశలు వాడిపోతున్నాయి. ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసంలో పుడమికి పచ్చని రంగు అద్దినట్లు పైర్లతో కళకళలాడే పొలాలు నేడు నెర్రెలిస్తున్నాయి. ఆగస్టులో కురిసిన అరకొర వర్షాలకు వరుణుడు కరుణిస్తాడేమోనన్న ఆశతో సాగు చేసిన రైతుల కళ్లముందే ఇప్పుడు పైర్లు ఎండిపోతున్నాయి. పంట ఎలా కాపాడుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు అడవుల్లో.. పొలాల్లో పచ్చిమేత లేకపోవడంతో మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. బాపట్ల జిల్లాలో ఎన్నడూ చూడని కరువు తరుముకొస్తోంది. బాపట్ల టౌన్: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతుల పరిస్థితి దినదినగండంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా విపరీతమైన ఖర్చులు పెట్టాల్సి వస్తోంది. ఆగస్టు మొదటి వారంలో కురిసిన అరకొర వర్షాలతో రైతులు వరిసాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వర్షాలు లేకపోవడం, కాలువల ద్వారా సరిపడా సాగునీరు సరఫరా కాకపోవడంతో ఎండిపోతున్న పైర్లను కాపాడేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఆయిల్ ఇంజిన్లు, పైపులు అద్దెకు తీసుకొని పొలాలు తడుపుతున్నారు. ఒక్కో ఎకరం తడిపేందుకు రెండు రోజులు పడుతోందని వాపోతున్నారు. గంటకు ఇంజిన్కు రూ. 150, పైపుల అద్దె, ఆయిల్ ఖర్చులతో కలిసి గంటకు రూ. 350 చొప్పున చెల్లించాల్సి వస్తోందన్నారు. ఒక్క ఎకరానికి ఒక నీటి తడి అందించేందుకు దాదాపు రూ. 3,500 వరకు ఖర్చవుతోందని వాపోతున్నారు. ఇప్పటికే నాట్లు, కలుపుమందులు, ఎరువులు చల్లినా నీరు లేక పైరు మొత్తం ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మోటార్ల సహాయంతో కూడా నీరు పెట్టే అవకాశం లేని రైతులు కళ్లముందే మాడిపోతున్న పైర్లను ఎలా కాపాడుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పెరిగిన ఖర్చులతో విలవిల ప్రతి ఏడాది జూన్, జూలై మాసాలలో వచ్చిన తొలకరి వర్షాల తర్వాత కాలువలకు సాగునీరు విడుదల అయ్యేది. సకాలంలో నాట్లు వేసుకొని పొలాలకు నీరు అందించేవాళ్లు. నీరు లేకపోవడంతో వెద పద్ధతిలో సాగు చేసిన పైర్లు ఎండిపోయి పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటి స్థానంలో ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో నీళ్లు పడటంతో అధిక ధరలు వెచ్చించి నార్లు కొనుగోలు చేసి నాట్లు వేయిస్తున్నారు. ఎకరాకు నాటు వేసేందుకు రూ. 4 వేలు, నారు పీకినందుకు రూ. 3 వేలు, నారు కొనుగోలుకు రూ. 3 వేలు చొప్పున మొత్తం రూ. 10 వేలు ఖర్చయింది. ఇవి కాక ట్రాక్టర్ బాడుగ అదనంగా పెట్టుకోవాల్సి వస్తోంది. రూ. వేలు ఖర్చు చేసి పెట్టిన నీళ్లు ఒక్కరోజునే భూమిలో ఇంకిపోవడంతో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా తరహాలోనే కాలువల ద్వారా సాగునీరు వస్తుందన్న ఆశతో ఆగస్టు మొదటి వారంలో కురిసిన వర్షాలకు నాలుగు ఎకరాల పొలానికి 20 సెంట్ల నారుమడి పోశా. నెలరోజుల పాటు నారుమడికి రెండుపూటలా నీటి తడులు పెట్టుకుంటూ కాపాడుకుంటూ వచ్చాను. ఎంత ప్రయత్నించినా చినుకు పడకపోవడం.. కాలువల ద్వారా నీరు రాకపోవడంతో ఆ నారుమడిని పశువులకు వదిలేశా. 30 ఏళ్ల నా వ్యవసాయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. గేదెలకు గడ్డి కూడా లేని కారణంగా రెండింటిని అమ్ముకున్నాను. ప్రభుత్వం మాలాంటి వారిని ఆదుకోవాలి. – కొసనాటి సుబ్బయ్య, ఇమ్మడిశెట్టివారిపాలెం జిల్లా వ్యాప్తంగా గతేడాది సాగు విస్తీర్ణం 1,13,902 హెక్టార్లు కాగా, ప్రస్తుతం 53,774 హెక్టార్లే సాగైంది. అందులోనూ 30 శాతానికిపైగా పంట ఎండిపోతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుకు భరోసా కరువైంది. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు చెల్లించాల్సిన క్రాప్ ఇన్సూరెన్స్ను ప్రభుత్వమే చెల్లించేది. ప్రస్తుతం రైతులు ఎకరాకు రూ. 760 చొప్పున చెల్లించుకోవాలని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, అసలు సాగు జరుగుతుందో.. లేదోనన్న సందిగ్ధంలో సగానికిపైగా రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పంటలు మొత్తం ఎండిపోతున్నా, కనీసం రైతులకు భరోసా కల్పించిన దాఖలాలు లేవు. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని 92,119 మంది రైతుల తరఫున రూ. 174.18 కోట్ల క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. -
డిమాండ్లు తీరే వరకు నిరసన కొనసాగిస్తాం
బాపట్లటౌన్: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంతవరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామని ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఏరియా వైద్యశాలలో నల్లబెలూన్లతో నిరసన తెలిపారు. సత్యంరాజు మాట్లాడుతూ తమను రెగ్యులరైజ్ చేయాలని, రెగ్యులరైజ్ చేసేంతవరకు 100 శాతం గ్రాస్ జీతం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు బదిలీ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగి మరణిస్తే 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తుందనే నమ్మకం ఉందని, మరోసారి చర్చలకు కూడా ఆహ్వానిస్తుందనే విశ్వాసం ప్రభుత్వం పైన తమకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ అనూష, ల్యాబ్ టెక్నీషియన్లు నీలిమ, సునీత, బయో మెడికల్ ఇంజనీర్ నళిని కుమారి, ఫార్మసిస్టులు నళిని, సుధ, శాంతి మనోజ పాల్గొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ సభ్యుడు సత్యంరాజు -
ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణా రహితంగా దాడి
తాడేపల్లి రూరల్: రాజధాని పరిధిలోని పెనుమాక అమరావతి రోడ్డులో కృష్ణాయపాలెం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్పై అమానుషంగా దాడిచేసిన ఘటనపై తాడేపల్లి పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఘటనపై తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 3వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమరావతి నుంచి విజయవాడ బస్సు వెళ్తోంది. ఆ డ్రైవర్ను తలమల ఏసురాజు నడుపుతున్నాడు. బస్సు ముందు బైక్పై వెళ్తున్న పెనుమాకకు చెందిన దుర్గాప్రసాద్, బస్సు డ్రైవర్తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం డ్రైవర్పై దాడిచేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 3వ తేదీన డ్రైవర్ తలమల ఏసురాజు బస్సులో ఉన్న ప్రయాణికులతో కలసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. డ్రైవర్ ఏసురాజును కొట్టిన దుర్గాప్రసాద్ వీడియో ఫేస్బుక్ల్లో, ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలస్యంగా ఇప్పుడు కేసు నమోదు చేసి దుర్గాప్రసాద్ను అరెస్ట్ చేసి, నోటీసులు జారీ చేశారు. -
ఎస్సీ రైతులకు శిక్షణ
బాపట్ల: నేటి జీవన విధానంలో చిరు ధాన్యాల ప్రాధాన్యత పెరుగుతుందని, పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలతో పాటు సుస్థిర వ్యవసాయానికి చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని జెనిటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ విభాగాధిపతి డాక్టర్ లాల్ అహమ్మద్ మొహమ్మద్ అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనరాణి ఆదేశాల మేరకు ఐ.సి.ఏ.ఆర్.–ఐ.ఐ.ఎం.ఆర్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎస్.సి. ఎస్.పి. పథకంలో భాగంగా నల్లమోతువారిపాలెం ఎస్సీ రైతుల కోసం చిరుధాన్యాల సాగు విలువ జోడింపు ఉత్పత్తుల తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ లాల్ అహమ్మద్ మొహమ్మద్ మాట్లాడుతూ ఆదాయాభివృద్ధికి చిరుధాన్యాల సాగు దోహదపడుతుందన్నారు. డాక్టర్ ఎం.తుషార వివిధ రకాల చిరుధాన్యాల సాగు పద్ధతులను, అందుబాటులో ఉన్న రకాల గురించి వివరించగా డాక్టర్ ఎన్.రత్నకుమారి చిరుధాన్యాలతో తయారుచేయగల విలువ జోడింపు ఉత్పత్తులను వివరించారు. వాటి ద్వారా స్వయం ఉపాధి పొందగల అవకాశాలను రైతులు, మహిళా పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ విజయ్ప్రకాష్, డాక్టర్ జి.నెహ్రు తదితరులు పాల్గొన్నారు. రైతులకు చిరుధాన్యాలను అందించారు. -
పొగాకు నిల్వలపై కలెక్టర్కు నివేదిక
మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ పర్చూరు(చినగంజాం): నియోజకవర్గ పరిధిలోని పర్చూరు, కారంచేడు, యద్దనపూడి మండలాల్లో రైతుల వద్ద మిగిలిపోయిన నల్లబర్లీ పొగాకు నిల్వలకు సంబంధించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే విధంగా నివేదికను తయారుచేసి కలెక్టర్కు అందజేస్తానని మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ చెప్పారు. రైతుల వద్ద మిగిలిపోయిన పొగాకు నిల్వలను పరిశీలించే నిమిత్తం డీఎం శుక్రవారం పర్చూరు, నాగులపాలెంలో పర్యటించారు. పర్చూరు నియోజకవర్గంలోని మండలాల్లో రైతుల వద్ద మిగిలిపోయి నిల్వ ఉన్న పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం చేస్తున్న ఆందోళనలో భాగంగా సోమవారం గ్రీవెన్స్లో వివిధ గ్రామాల రైతులు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మేరకు రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు మండెలను పరిశీలించారు. పొగాకు ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా నివేదిక పంపడానికి అన్ని గ్రామాల వీఏఓలను రైతుల వారీగా పొగాకు నిల్వలను నివేదిక పంపాల్సిందిగా ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతుల వద్ద గత సంవత్సరం నిల్వ ఉన్న పొగాకును కొనాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆందోళన చేస్తున్న క్రమంలో డీఎం పరిశీలించారు. నాగులపాలెంలోని కౌలు రైతులు తమ వద్ద పొగాకు కొనుగోలు చేయలేదని పలుకుబడి గల రైతుల వద్ద నిల్వ ఉన్న పొగాకు మాత్రమే మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం ద్వారా అమ్ముడు పోయిందని తమ వద్ద పొగాకు మిగిలిపోయిందని, ఎండ, వానల నుంచి పొగాకు మండెలను కాపాడటం కష్టతరంగా ఉందని నాగులపాలెం కౌలు రైతులు డీఎంకి వివరించారు. పర్చూరు మండలంలో పొగాకు రైతుల వద్ద 53,110 క్వింటాళ్ల పొగాకు మిగులు ఉన్నట్లు వారు గుర్తించారు. నియోజక వర్గంలోని మిగతా మండలాల్లోని పొగాకు నిల్వలను సైతం గుర్తించి ప్రభుత్వానికి పొగాకు నిల్వల వివరాలను పంపి ప్రభుత్వం కొనుగోలు చేయడానికి కలెక్టర్ ద్వారా ప్రయత్నం చేస్తామని డీఎం కరుణశ్రీ అన్నారు. డీఎం వెంట మండల వ్యవసాయాధికారి భాస్కరరావు, ఏఈఓ శ్రీకాంత్, వ్యవసాయ సహాయకులు అగర్త, రైతు సంఘం సీనియర్ నాయకులు బండి శంకరయ్య, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.కొండయ్య, ఎం.మాణిక్యరావు, కూరాకుల రాజేష్, జొన్నలగడ్డ రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే సహించం
లక్ష్మీపురం: ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులను మానసికంగా హింసిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందారపు యశ్వంత్ రఘువీర్ డిమాండ్ చేశారు. గుంటూరు నాజ్ సెంటర్లోని ఆర్జేడీ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ఐఓ సునీత, ఆర్జేడీ లింగేశ్వరరెడ్డిలకు వినతిపత్రం అందజేశారు. విద్యార్థులకు ప్రత్యే క తరగతులు నిర్వహిస్తున్న యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే నోటీసులు ఇచ్చి సెలవు రోజుల్లో తరగతులు నిర్వహించకుండా చూస్తామని ఆర్ఐఓ, ఆర్జేడీ హామీచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అమర్నాథ్, నగర నాయకులు మహేష్, సతీష్, సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
గంగపుత్రులకు కష్టాలు
● నాడు సంక్షేమం... నేడు సంక్షోభం ● పలు హామీలు నెరవేర్చని చంద్రబాబు సర్కార్ ● సబ్సిడీపై బోట్లు.. వలలు ఇస్తామని దగా ● వేట నిషేధం సమయంలో దిక్కులేని సాయం గంగపుత్రుల కష్టాలు వినేవారే కరువయ్యారు. తీరంలో ఎగిసిపడే కెరటాలకు ఎదురొడ్డి జీవనం సాగించే మత్స్యకారులకు రోజంతా పనిచేసినా పూట గడవని దుర్భర పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపించగా, నేడు ఆదుకునేవారే లేరు. రోజంతా వేట సాగించినప్పటికీ ఇల్లు గడవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు మరిచిపోయిందని వాపోతున్నారు. అడగాలంటే వేట నిషేధం సమయంలో ఇచ్చే భత్యం ఎక్కడ నిలిచిపోతుందోననే భయంతో మౌనంగా ఉండిపోతున్నారు. కనీసం పక్కా గృహాలు కూడా లేక గుడిసెల్లోనే మగ్గిపోతున్నారు. ఇకనైనా పాలకులు తమ సమస్యలు తీర్చాలని వేడుకుంటున్నారు. -
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు
డిప్యూటీ డీఈఓ డి.గంగాధర్ బాపట్లటౌన్ : క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని డిప్యూటీ డీఈవో డి.గంగాధర్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో జిల్లా మానసిక ఆరోగ్య కౌన్సిలర్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ డీఈవో విద్యార్థులకు మానసిక ఆరోగ్యం ప్రాధాన్యత, భావోద్వేగాలను ఆరోగ్యకరంగా వ్యక్తీకరించడం, ఒత్తిడి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడం, సహాయం కోరడంలో సంకోచించకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థుల్లో కనిపించే మానసిక ఒత్తిడి, నిరాశ, ఒంటరితనం వంటి సంకేతాలను గుర్తించి, అవసరమైన సమయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కౌన్సెలర్లు మరియు ఇతర విశ్వసనీయ వ్యక్తుల సహాయం పొందాలని సూచించారు. ‘ఒకరి మాట వినడం, ఒకరిని అర్థం చేసుకోవడం, అవసరమైన సమయంలో తోడుగా నిలవడం ఒక ప్రాణాన్ని కాపాడగలదు’ అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు. మానసిక ఆరోగ్యంపై ఉన్న అపోహలను తొలగించి, సహాయం కోరే సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కౌన్సిలర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం.చారులత, బాపట్ల మున్సిపల్ హైస్కూల్ హెచ్ఎం బి.రాజశ్రీ, జిల్లా కౌన్సెలర్ బృందం నుంచి టి.కళ్యాణ్, కె.రామకృష్ణా రెడ్డి, బి.వేణుగోపాలరావు, సౌజన్య, కె.ఇందిర, నాగలక్ష్మి, రాగల జవహర్ పాల్గొన్నారు. -
కేజీబీవీ ఉపాధ్యాయినులకు నియామక పత్రాలు అందజేత
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు గురువారం నియామక పత్రాలను అందచేశారు. ఎంపికై న అభ్యర్థుల మెరిట్ ఆధారంగా పాఠశాలలను కేటాయించి నియామక పత్రాలు అందించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్ప్రసాద్, బాలికా శిశు సంక్షేమాభివృద్ధి అధికారి ఎన్.పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఎంపికై న ఉపాధ్యాయినులు నాణ్యమైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. విద్యార్థినుల తల్లిదండ్రులు, సహ ఉపాధ్యాయినులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఫలితాల సాధనలో పల్నాడు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని కోరారు. తాడికొండ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతోపాటు మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సచివాలయం పరిసరాల్లో చేపట్టిన భద్రతా చర్యలను సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్, స్పెషల్ బ్రాంచ్ డీస్పీ అలహరి శ్రీనివాస్, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణతోపాటు ట్రాఫిక్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. దీంతో ఖాతాదారులకు కష్టాలు తప్పేలా లేవు. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు శుక్రవారం దేశ వ్యాప్తంగా బంద్కు పిలుపునివ్వడంతోపాటు ఆ తర్వాత వరుసగా రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి సెలవు కావడంతో బ్యాంకు శాఖలు వరుసగా మూతపడనున్నాయి. దీంతో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, రుణాలకు సంబంధించిన పనులు, ఇతర బ్యాంకు సేవల కోసం బ్రాంచీలకు వెళ్లే ఖాతాదారులు ముందుగానే తమ పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల బంద్తో ప్రారంభం యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ఉద్యోగులు బంద్ పాటించనున్నారు. ఐదు రోజుల పని విధానం అమలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు తదితర అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను వినిపిస్తున్నాయి. బంద్ కారణంగా బ్యాంకు శాఖల్లో సాధారణ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి డిజిటల్ సేవలు యథాతథంగానే ఖాతాదారులకు అందుబాటులో ఉండనున్నాయి.గుంటూరు మెడికల్: పారామెడికల్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ – ఏపీ ఆధ్వర్యాన ఈ నెల 13న గుంటూరులో రణభేరి ప్రాంతీయ సదస్సు నిర్వహించనన్నట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.రమేష్బాబు చెప్పారు. గురువారం గుంటూరు జీజీహెచ్లో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు వేలల్లో ఉన్నారని చెప్పారు. మూడు జిల్లాల ఉద్యోగులతో రణభేరి ప్రాంతీయ సదస్సు గుంటూరులో నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో టీబీ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్యామ్, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. -
పారా మెడికల్ విద్యార్థుల నిరసన ర్యాలీ
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాలో బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గుంటూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీ గురువారం రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి బీఆర్ స్టేడియం, టీడీపీ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ కార్యాలయం వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నాలుగేళ్లలో పూర్తికావాల్సిన బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులు అనేక కారణాల వల్ల ఆరు సంవత్సరాలకు పొడిగించ బడుతున్నాయన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు తమ విద్యా సంవత్సరం కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా కన్వీనర్ షేక్ సమీర్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం, సంబంధిత విశ్వవిద్యాలయాలు, కళాశాల యాజమాన్యాలు చెలగాటం ఆడటం సరికాదన్నారు. వీసీ హామీతో రిలే నిరాహార దీక్షలు విరమణ మాచర్ల రూరల్ వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని జమ్మలమడక గ్రామ సమీపంలో గురువారం జరిగింది. వివరాలలోకి వెళితే.. జమ్మలమడక గ్రామానికి చెందిన కూరాకుల చిన మల్లయ్య (53) మాచర్ల వెళ్తుండగా తుమృకోట గ్రామానికి చెందిన మద్దిపట్ల సైదయ్య మాచర్ల నుంచి తుమృకోటకు వెళ్తుండగా జమ్మలమడక గ్రామ సమీపంకు రాగానే రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో కూరాకుల చిన మల్లయ్య తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలో మృతిచెందాడు. చంద్రయ్యకు తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కాగా ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. -
కలెక్టర్ల సదస్సులో బాపట్ల కలెక్టర్
బాపట్ల: రాష్ట్ర సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పాల్గొన్నారు. గ్యాస్ లీకై గృహోపకరణాలు దగ్ధం ఈపూరు: గ్యాస్ లీకై మంటలు వ్యాపించి ఇంట్లోని గృహపకరణాలు పూర్తిగా దగ్ధమైన సంఘటన మండలంలోని కొచ్చర్ల గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన గోరంట్ల అంజయ్య భార్య వెంకాయమ్మ ఇంట్లో వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించడంతో భయంతో బయటకి పరుగులు తీశారు. మంటలు వేగంగా వ్యాపించి ఫ్రిడ్జ్, టీవీ, కూలర్, ఇతర వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. సుమారు రూ.60 వేలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. -
మార్కెట్ ఆధారిత పంటల దిశగా దృష్టి సారించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: రైతులు సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్ ఆధారిత పంటల దిశగా దృష్టి సారించాలని నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ గోవింద రాజులు పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ 2047– వ్యవసాయ ఆధారిత పారిశ్రామికత ద్వారా ఆంధ్రప్రదేశ్ సాధికారత’ అనే అంశంపై గురువారం జాతీయ సదస్సు నిర్వహించారు. గోవిందరాజులు మాట్లాడుతూ సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్ ఆధారిత రైతులుగా అంతర్జాతీయ మార్కెట్ స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర కాలం నుంచి ఇప్పటి వరకు దేశంలో వ్యవసాయం అభివృద్ధి సాధించిన తీరును వివరించారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు రైతుల శ్రేయస్సుకోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను గురించి వివరించారు. పొగాకు బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ యువత తమ తెలివితేటలతో పాటు సాంకేతికతపై తమకున్న పట్టుతో వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన వ్యాపారంగా మార్చాలన్నారు. సదస్సు కన్వీనర్, మేనేజ్మెంట్ స్టడీస్ విభాగాధిపతి డాక్టర్ యు.రవి కుమార్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 60కి పైగా పరిశోధన పత్రాలు వచ్చాయని, వాటిలో 30 ఉత్తమ పరిశోధన పత్రాలను ఎంపిక చేశామని చెప్పారు. ఆయా పరిశోధనాంశాలతో అంతర్జాతీయ జర్నల్లో ప్రచురించిన ప్రత్యేక సంచికను సదస్సులో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, పీజీ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఎస్.అనితాదేవి, డాక్టర్ కామేశ్వర శాస్త్రి, వీఎస్టీ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వెంకట నర్సయ్య, అధ్యాపకులు డాక్టర్ నిర్మలా రాణి, డాక్టర్ ఎస్. శ్రీనివాసరావు, డాక్టర్ జేవీ సుధీర్ కుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాబార్డు మాజీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ గోవింద రాజులు -
విజ్ఞాన్–ఎన్ఐటీ ఢిల్లీ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ–న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఎన్ఐటీ ఢిల్లీ) మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు విద్యా, పరిశోధనా రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగనున్నాయని తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా విద్యార్థులు, అధ్యాపకుల కోసం ప్రయోగశాల సందర్శనలు, శాసీ్త్రయ సమాచారం, పరిశోధనా సామగ్రి మార్పిడి, సంయుక్త సదస్సులు, సెమినార్లు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లు (ఎఫ్డీపీ), వర్క్షాప్ల నిర్వహణ చేపట్టనున్నారు. వర్చువల్ తరగతుల ద్వారా అతిథి అధ్యాపకుల ఉపన్యాసాలతో పాటు, ఫ్యాకల్టీ ఇమర్షన్ ప్రోగ్రామ్ (ఎఫ్ఐపీ) కింద అధ్యాపకుల పరస్పర మార్పిడికి అవకాశం కల్పించనున్నారు. ఈ అవగాహన ఒప్పందం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. పరస్పర అంగీకారంతో మరో ఐదేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ఈ భాగస్వామ్యం ద్వారా విద్య, పరిశోధన, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు మరింత బలమైన వేదిక ఏర్పడనుందని వైస్ చాన్స్లర్ తెలిపారు. ఎన్ఐటీ ఢిల్లీ అధ్యాపకులు, విజ్ఞాన్ డీన్లు, అధిపతులు పాల్గొన్నారు. -
కళ్లకు గంతలు కట్టుకుని కాంట్రాక్టు వైద్య సిబ్బంది నిరసన
గుంటూరు మెడికల్: కాంట్రాక్టు వైద్య సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం గుంటూరు జీజీహెచ్లో కళ్లకు నల్లరిబ్బన్లతో గంతలు కట్టుకుని వినూత్న తరహాలో నిరసన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జీజీహెచ్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్య సిబ్బంది గతనెల 20 నుంచి వినూత్న తరహాలో నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా గురువారం నల్లరిబ్బన్లతో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి, ఉద్యోగాలు రెగ్యులరయ్యేంత వరకు నూరు శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలని, కాంట్రాక్టు వైద్య సిబ్బందికి బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్టాఫ్నర్సులు రేణుక, బి.వి.ఆర్.లక్ష్మి, మేరి, శ్రీలక్ష్మి, లక్ష్మీకుమారి, పద్మావతి, ఫార్మాసిస్టులు చంద్రకళ, అశ్విని, పావని, శ్రీలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్లు చారి, ఖాశిం, బాషా, సుభశ్రీ, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు
బాపట్ల: విద్యార్థి దశ ఎంతో కీలకమైనదని, ఆ దశలో విద్య పట్ల ఏకాగ్రతను కలిగివుండి, క్రమశిక్షణతో మెలగాలని, డ్రగ్స్కు లోనై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని బాపట్ల వ్యవసాయ కళాశాల ఇన్చార్జి అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో జరిగిన నశా విముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత మాత్రమేనని, యువతకు అసాధ్యం కానిదేది లేదని, తమ ప్రతిభా పాటవాలను వారు తమ విద్యాభివృద్ధికి అంకితం చేస్తే అది వారి అభివృద్ధికి తద్వారా దేశ పురోభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఆ క్రమంలో వారు మాదకద్రవ్యాలకు అలవాటుపడకుండా జాగ్రత్త వహించాలన్నారు. డాక్టర్ కె.ఎస్.ఆర్.పాల్ మాదకద్రవ్యాలు వద్దు, జీవితమే ముద్దు అనే నినాదాన్ని చాటి విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ కె.సుశీల, డాక్టర్ జి.విజయ్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ వై.అంకమ్మ, ఏ.ఈ.ఎల్.పి. విద్యార్థులు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాల ఇన్చార్జి అసోసియేట్ డీన్ డాక్టర్ కోటేశ్వరరావు -
మహిళ హత్యకేసులో ముగ్గురు అరెస్టు
పెదకాకాని: మహిళను దారుణంగా హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నార్త్ డిఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ అన్నారు. ఈనెల 7వ తేదీన పెదకాకాని మండలం, వెనిగండ్లలో దాది కోటేశ్వరమ్మ(48)ను గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో ఉన్న చాకుతో గొంతు కోసి హతమార్చిన సంగతి విధితమే. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని గురువారం పెదకాకాని పోలీసుస్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మృతురాలు కోటేశ్వరమ్మ కుమారుడు సాధిక్ గుంటూరు ఆటోనగర్లోని మెకానిక్ షోరూంలో నాలుగేళ్లుగా మెకానిక్గా పనిచేస్తున్నారు. అదే షోరూంలో పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం, ముత్యాలంపాడు గ్రామానికి చెందిన యద్దనపూడి మరియకుమారి ఆమె భర్త పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మరియకుమారితో సాధిక్కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. దీంతో సాధిక్ వారి కాపురాన్ని కూడా వెనిగండ్లలోనే పెట్టాడు. కొద్దికాలానికి సాధిక్ మరియకుమారి కుమార్తెను ప్రేమిస్తున్నానంటూ.. ఆ యువతినే పెళ్లి చేసుకుంటానని తల్లితో చెప్పాడు. అంతేకాకుండా మరియకుమారి కుటుంబ అవసరాలకు డబ్బులు ఇవ్వడం, వారి బాకీలు తీర్చడం, కులాలు వేరు కావడంతో ఇష్టం లేని కోటేశ్వరమ్మ మరియకుమారి కుటుంబంతో గొడవ పడుతూ వస్తుంది. తన కుమార్తె వివాహానికి అడ్డుగా ఉన్న ఆమెను ఎలాగైనా హతమార్చాలని మరియకుమారి నిర్ణయించుకుంది. పిడుగురాళ్ల ప్రాంతంలో నివశిస్తున్న తన సోదరితో పరిచయం ఉన్న పల్నాడు జిల్లా, మాచవరం మండలం, రుక్మిణీపురం గ్రామానికి చెందిన అన్నంగి శ్రీకాంత్ను సంప్రదించింది. అందుకు అంగీకరించిన శ్రీకాంత్ అప్పటికే భార్యపై దాడి చేసి కేసులో నిందితుడిగా ఉన్నాడు. శ్రీకాంత్ తనకు తోడుగా తన మేనమామ కొడుకు బత్తుల మహేష్కు ఈ విషయం తెలియజేశాడు. మహేష్ పల్నాడు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతూ ఏడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పథకం ప్రకారం హత్య... మరియకుమారి కోటేశ్వరమ్మను ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. గత కొద్ది రోజులుగా మృతురాలితో సన్నిహితంగా ఉన్నట్లు నటిస్తూ వస్తుంది. గతంలో బిర్యానీలో విషప్రయోగం చేసినా సఫలీకృతం కాలేదు. గత 15 రోజుల కిందట కోటేశ్వరమ్మకు కూల్డ్రింక్లో గడ్డిమందు కలిపి నమ్మించి తాగించింది. దీంతో అనారోగ్యానికి గురైన ఆమె కొద్ది రోజులుగా గేదెలు మేపేందుకు కూడా వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటుంది. ఇదే అదునుగా చూసిన నిందితురాలు ఈనెల 7వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో మృతురాలి ఇంటికి వెళ్ళింది. మంచితనంగా పలకరించి స్టౌ వెలిగించి దోసె వేసి ఇచ్చింది. అప్పటికే బత్తుల మహేష్, అన్నంగి శ్రీకాంత్లు నెంబర్ ప్లేట్లు తొలగించిన బైక్ను సమీపంలోని చెట్టు కింద పెట్టి ఎదురు చూస్తున్నారు. నిందితురాలు ఇచ్చిన ఫోన్ సిగ్నల్తో ఇరువురూ ఇంటిలోకి ప్రవేశించారు. మీరు ఎవరంటూ మృతురాలు అడగడం, మన పిల్లలే అని చెప్పడం, ఇరువురూ ఒక్కసారిగా కోటేశ్వరమ్మపై దాడి చేసి పక్కనే ఉన్న చాకుతో గొంతు కోయడం నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ఇరువురు పక్కనే ఉన్న నీటితో రక్తపు మరకలు కడుక్కుంటుండగా ఒక్కసారిగా పైకి లేచి గోడను పట్టుకోవబోవడంతో మరోసారి చాకుతో బలంగా గొంతు కోసి, బీరువాలో ఉన్న బంగారం, డబ్బులు దోచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్థానికంగా సేకరించిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రోజుల వ్యవధిలోనే నిందితులను అదుపులోకి తీసుకుని వారి దొంగిలించిన బంగారు ఆభరణాలు, రూ.70,260 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ వివరించారు. ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ నారాయణస్వామి, ఎస్ఐలు సురేష్, డి.రామకృష్ణ, క్రైం సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఐసీడీఎస్ పీడీగా సువర్ణ బాధ్యతల స్వీకారం
బాపట్లటౌన్: మహిళ శిశు అభివృద్ధి, సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎస్.సువర్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ను గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి బదిలీపై బాపట్ల జిల్లాకు వచ్చిన సువర్ణ బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆ శాఖ కార్యాలయం అధికారులు, సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పటివరకు ఇక్కడ పీడీగా పనిచేసిన రాధా మాధవి ఏఎస్ఆర్ జిల్లాకు బదిలీపై వెళ్లారు. ఎన్ఎంఎంఎస్ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు జాతీయ ప్రతిభా ఉపకార వేతన (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ షేక్ సలీమ్ బాషా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, మండల పరిషత్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు అక్టోబర్ 12లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు. వార్షికాదాయం రూ.3.50 లక్షల లోపు ఉండాలని, నవంబర్ 15 పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చొప్పున ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రమాదంలో విద్యార్థి మృతి పట్నంబజారు: పాఠశాల విద్యార్థి బస్సు కింద పడి మృతిచెందిన సంఘటనపై కేసు నమోదైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతీనగర్లో నివాసం ఉండే షేక్ సయిద్ గురువారం తన సోదరులైన సౌద్ (14) తొమ్మిది తరగతి చదువుతున్నాడు. అసద్తో కలిసి కేఎల్పీ పాఠశాలలో దింపేందుకు వెళుతున్నాడు. మారుతీనగర్ నుంచి గుజ్జనగుండ్ల వెళుతున్న సమయంలో కుడి చేతిపక్క ఆటో, ఎడమ చేతి వైపు పాఠశాల బస్సు మధ్యలో ఉన్న క్రమంలో ద్విచక్రవాహనానికి ఢీకొంది. ఈక్రమంలో ముగ్గురు కిందపడ్డారు. 9వ తరగతి చదువుతున్న సౌద్ (14)పై పాఠశాల బస్సు ఎక్కడంతో గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళుతున్న సమయంలో మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అసద్కు చెయ్యి విరిగింది. సయిద్కు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేపు జాతీయ లోక్ అదాలత్ గుంటూరు వెస్ట్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన జరుగుతుందని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ పై గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. లోక్ అదాలత్ సేవలను పొందేందుకు కోర్టు ఫీజు లేదని, పరస్పర అంగీకారంతో పరిష్కారం అవుతుందని, త్వరగా న్యాయం లభిస్తుందని చెప్పారు. అన్ని కోర్టుల పరిధిలో జరుగుతుందన్నారు. అనంతరం జేసి జాతీయ లోక్ అదాలత్ పోస్టర్ను విడుదల చేశారు. డీఆర్ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు అత్తోట(కొల్లిపర): మండల పరిధిలోని అత్తోట గ్రామశివారు డొంక రోడ్డులో మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లిన సంఘటన బుధవారం రాత్రి చోటుచోసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తోట గ్రామానికి చెందిన కొంతమంది కారులో తెనాలి వెళుతున్నారు. గ్రామ శివారులోని డొంక రోడ్డులో మలుపు గమనించకపోవటంతో కారు ఒక్కసారిగా పంట కాలువలోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న కొంత మంది వెంటనే కారులోని వ్యక్తులను బయటకు తీసుకువచ్చారు. స్కూటీ దొంగలు అరెస్ట్ పెదనందిపాడు: ఇళ్ల ముందు తాళాలు వేసి ఉంచిన స్కూటీలను మాయం చేసే దొంగలను అరెస్ట్ చేసినట్లు ప్రత్తిపాడు సీఐ సుబ్బారావు తెలిపారు. గురువారం పెదనందిపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడారు. గతంలో పలు స్కూటీ లు దొంగతనం చేసి వాటిని తక్కువ ధరలను అమ్ముకుని జల్సాలు చేస్తున్న యువకులను అరెస్ట్ చేసినట్లు సీఐ సుబ్బారావు చెప్పారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన షేక్ జమీర్, షేక్ అబ్దుల్లా, షేక్ యాసిన్ లను చిలకలూరిపేట అడ్డ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని వారిని విచారించి వారి అధీనంలో ఉన్న ఐదు స్కూటీ లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. వాటి విలువ రూ.2.30లక్షలు ఉంటుందని తెలిపారు. -
ముగిసిన బాలికల సబ్ జూనియర్ కోచింగ్ క్యాంప్
నగరం: ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈనెల 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బాలయేసు ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నిర్వహించిన సబ్ జూనియర్ బాలికల కోచింగ్ క్యాంప్ గురువారంతో ముగిసింది. స్థానిక పాఠశాల ఆవరణంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సజీవ క్రీడాకారిణిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మార్కాపురంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ క్యాంప్లో శిక్షణ పొందిన క్రీడాకారిణులు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలలో రాణించాలని కోరారు. క్యాంప్ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలు చందనం శ్రీనివాసరావు, సీహెచ్.గోపి, శ్రీకాంత్, వేపూరి కిరణ్, జి.ఎరగోపిలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ సూనా, వ్యాయామ ఉపాధ్యాయుడు వై.వి.గోపయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిరంతర విద్యుత్ సరఫరా ప్రధాన లక్ష్యం
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్– మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి అధ్యక్షతన సీఆర్డీయే అమరావతి సర్కిల్ పనితీరుపై రాయపూడిలోని సర్కిల్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ చౌర్యం నియంత్రణ, విద్యుత్ భద్రత, లైన్న్లు, ట్రాన్న్స్ఫార్మర్ల నిర్వహణ, వర్షాకాల అత్యవసర సన్నద్ధత, సబ్స్టేషన్లు, ఫీడర్ల పనితీరు, విద్యుత్ అంతరాయాల నియంత్రణ, పీక్ డిమాండ్ నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎండీ పి.పుల్లారెడ్డి మాట్లాడుతూ, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పుడు అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులు కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ కోసం ఇకపై ఈ–సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గౌరవ అధికారిక వెబ్సైట్ www.a pcpdc.in లేదా ఏపీసీపీడీసీఎల్ మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్న్కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ రంగానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు తలెత్తకుండా ఫీడర్ల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని సీఎండీ సూచించారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించిన సమస్యలను స్థానిక అధికారులు వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
చేనేత పింఛన్లకు నిబంధనలు సడలించాలి
మంగళగిరి టౌన్: చేనేత కార్మికులకు కొత్తగా మంజూరు చేయనున్న పెన్షన్లకు విధించిన నిబంధనలను సడలించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ విన్నవించింది. ఈ మేరకు మంగళగిరి పట్టణంలోని రాష్ట్ర హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కార్యాలయంలో బుధవారం జాయింట్ డైరెక్టర్ రాజారావుకు కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్ద నుంచి పొందుతున్న కూలి మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో తీసుకుంటున్నట్లుగా ఆధారం చూపాలన్న నిబంధనను తొలగించాలని కోరారు. నూలు, ఇతర ముడి సరుకులు కొనుగోలు చేసినప్పుడు జీఎస్టీ బిల్లులు సమర్పించాలనే నిబంధనను కూడా తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన జాయింట్ డైరెక్టర్ రాజారావు మాట్లాడుతూ వినతులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్లు పిల్లలమర్రి నాగేశ్వరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, పూర్ణచంద్రరావు, మోహనరావు, రామారావు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం సుదర్శన హోమం నిర్వహించనున్నట్లు జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి మంగళాశాసనాలతో ఉదయం 9 గంటల నుంచి దృష్టిదోష నివారణ, గ్రహదోష నివారణ, ఆయురారోగ్య అభివృద్ధి నిమిత్తం సర్వరక్షాకర శ్రీ సుదర్శన హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు ఉదయం 8.30 గంటలకు ఆలయానికి చేరుకోవాలని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నెహ్రూనగర్: సాంఘిక సంక్షేమ శాఖ(ఎస్సీ వెల్ఫేర్) జిల్లా ఇన్చార్జిగా డి.దుర్గాబాయి నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా అధికారిగా పనిచేస్తున్న హర్షిత 45 రోజుల పాటు హెచ్ఆర్డీ (హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్) ట్రైనింగ్ నిమిత్తం వెళ్లారు. ఆమె స్థానంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పనిచేస్తున్న దుర్గాబాయిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయపురిసౌత్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతం వద్ద జిప్ రైడ్, జిప్ సైక్లింగ్ను కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. వీటిని ఏపీ టూరిజం, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. గ్రామీణ బ్యాంకు సౌజన్యంతో నాగార్జునకొండ మ్యూజియానికి సుమారు రూ.16 లక్షల విలువైన రెండు బ్యాటరీ వాహనాలను అందజేయగా ఆ వాహనాలను వారు ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ రూ.1.71 కోట్లతో చేపట్టిన జిప్రైడ్, జిప్ సైక్లింగ్ను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురజాల ఆర్డీఓ మురళి, తహసీల్దార్ కిరణ్ కుమార్, టూరిజం డీవీఎం కృష్ణచైతన్య, డీటీఓ నాయుడమ్మ, యూనిట్ మేనేజర్ బ్రహ్మయ్య, రెయిన్బో ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులు ఖాజా మొయిద్దీన్, జెస్టిన్ జోసఫ్, నాగార్జున కొండ మ్యూజియం క్యూరేటర్ కమల్ హాసన్ పాల్గొన్నారు. తెనాలి: డివిజన్ సబ్ కలెక్టర్గా సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. ఆయన స్వస్థలం మధ్యప్రదేశ్. 1992లో జన్మించారు. సివిల్స్ పరీక్షలు రాసి, 259వ ర్యాంక్తో ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఆయన్ను తీసుకున్నారు. శిక్షణ అనంతరం గతేడాది ఏప్రిల్ 28న తిరుపతిలో అసిస్టెంట్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. తెనాలి సబ్కలెక్టర్గా తొలి పోస్టింగ్ చేపట్టనున్నారు. ప్రస్తుతం కె.శ్రీరమణి ఆర్డీఓగా పనిచేస్తుండగా.. ఆమె స్థానంలో సందీప్ రఘువంశీ నియమితులయ్యారు. -
రైతుల కోసం నేటి నుంచి పాదయాత్ర
బాపట్ల: రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ పని చేస్తే... వారి సంక్షోభానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వ విధానాలు దారితీసినట్లు మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఒక పక్క క్రాప్ హాలీడే అంటూ, మరోపక్కన విత్తనాలు ఇస్తాం.. ఎరువులు ఇస్తామని చెప్పి రైతులను చంద్రబాబు మరోవైపు మోసం చేస్తున్నారని కోన తెలిపారు. ఈ నేపథ్యంలో గురు, శుక్ర, శనివారాల్లో బాపట్ల నియోజకవర్గంలో రైతుల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. రైతులకు అండగా వెఎస్సార్ సీపీ అనునిత్యం ఉంటుందని తెలిపారు. రైతుల దగ్గర పంట ఉంటే రూ.1,200, రూ.1,400లకు ధాన్యం ధరలు పలికాయని, ఇప్పుడు వ్యాపారుల వద్ద ధాన్యం రూ.2,400కు అమ్ముతున్నారని కోన సూచించారు. రైతులు నష్టపోవాలి, దళారులు, వ్యాపారస్తులు బాగుపడాలనే తలంపుతో ప్రభుత్వం పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతులకు బీమా సొమ్మును జగనన్న హయాంలో ప్రభుత్వం చెల్లిస్తే.. ఇప్పుడు రైతులే బీమా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. జగనన్న కాలనీలు ఇప్పుడు ఎన్టీఆర్ కాలనీలుగా మారిపోయాయని చెప్పారు. పింఛన్లకు కూడా లేని పోని నిబంధనలు పెట్టి వృద్ధులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆయన దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవాలి.. సకాలంలో నీళ్లు లేకపోయినా పంటలు వేసుకుని రైతులు నష్టపోయారని, సంబంధిత ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపడతామని కోన చెప్పారు. ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గురువారం భావన్నారాయణ స్వామి దేవాలయం వద్ద ఉదయం 8 గంటలకు ప్రత్యేక పూజలు, పాత బస్టాండ్లోని మసీదు వద్ద, సీబీజెడ్ చర్చి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపడతామన్నారు. తర్వాత పాదయాత్ర ప్రారంభం అవుతుందని వివరించారు. తొలిరోజు బాపట్ల మండలంలో మొదలయ్యే ఈ యాత్ర శుక్రవారం కర్లపాలెం, శనివారం పిట్టలవానిపాలెంలోని అల్లూరు వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ పాదయాత్రలో అందరూ పాల్గొని రైతులకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి, యల్లావుల ఏడుకొండలు, కాగిత సుధీర్బాబు, పార్టీ నాయకులు వడ్డిముక్కల డేవిడ్, కొక్కిలిగడ్డ చెంచయ్య, చల్లా రామయ్య, పిన్నిబోయిన ప్రసాద్, ఇనగలూరి మాల్యాద్రి తదితరులున్నారు. -
జీజీహెచ్లో ఉచితంగా వైద్యసేవలు
గుంటూరు జీజీహెచ్లో ఆత్మహత్యాయత్నం చేసిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి వారు సాధారణ జీవితం గడిపేలా చేస్తున్నాం. ఆర్థికపరమైన సమస్యలు, సంసార జీవిత సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, ప్రయోజకులు కాకపోవడం, ఉద్యోగపరమైన ఒత్తిడులు, తాగుడు అలవాటు ఉండటం, కుటుంబంలో ఎవరైనా ఆత్మహత్య పాల్పడిఉండటం తదితర కారణాల వల్ల పలువురు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి వారిని ఓ కంట కనిపెట్టాలి. ఆత్మహత్యలకు పాల్పడే ఆలోచన ఉన్నవారిని సంప్రదించటం, వారితో చర్చించటం, వారికి వనరులు కల్పించటం ద్వారా నివారించవచ్చు. – డాక్టర్ నీలి ఉమాజ్యోతి, మానసిక వైద్య విభాగాధిపతి, జీజీహెచ్ -
కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన
బాపట్ల టౌన్: ప్రభుత్వం ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై ఎందుకింత మొండి వైఖరి అవలంబిస్తుందో అర్థం కావడం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సభ్యుడు కూరపాటి సత్యంరాజు పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఉద్యోగులు బైఠాయించారు. కళ్లు, చెవులు, నోరు మూసుకొని నల్లబ్యాడ్జీలతో వినూత్నంగా నిరసన తెలియజేశారు. సత్యంరాజు మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు తమ శాంతియుత నిరసనలు కొనసాగుతాయన్నారు. ఈ క్రమంలో ఆరోగ్య కేంద్రాలలో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వైద్య సేవలను పూర్తిస్థాయిలో నిరాటంకంగా కొనసాగిస్తామని చెప్పారు. రోజూ డ్యూటీలో నల్ల బ్యాడ్జ్లు పెట్టుకుని, భోజన విరామంలో శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు ఆన్లైన్, నెలవారీ రిపోర్టులు ప్రభుత్వానికి అందచేయకుండా కార్యాచరణ కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్లు అనూష, తబిత, ఫార్మసిస్ట్లు నళిని, శాంతి మనోజ, ల్యాబ్ టెక్నీషియన్లు నీలిమ, సునీత, బయో మెడికల్ ఇంజినీర్ నళిని కుమారి తదితరులు పాల్గొన్నారు. -
కారుమూరి కోటిరెడ్డికి ఘననివాళి
అంతిమయాత్రలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు రూరల్: మండలంలోని అంకిరెడ్డిపాలెం గ్రామంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి బావ కారుమూరి కోటిరెడ్డి మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా బుధవారం గ్రామంలోని కోటిరెడ్డి నివాసంలో ఆయన పార్థివ దేహానికి వైఎస్సార్ సీపీ నేతలు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్ర, దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కోటిరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, మేకతోటి సుచరిత, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అన్నాబత్తిని శివకుమార్, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు నూరిఫాతిమా, బలసాని కిరణ్కుమార్, అంబటి మురళి, డైమండ్ బాబు, గజ్జల సుధీర్భార్గవరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి నాగార్జునయాదవ్, మాజీ ఇన్కంటాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకుడు షేక్ గులాంరసూల్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్శాఖ ఆకస్మిక తనిఖీలు అమృతలూరు(వేమూరు): అక్రమంగా విద్యుత్ వాడుకునేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ బాపట్ల జిల్లా పర్యవేక్షణ ఇంజినీర్ జి.ఆంజనేయులు అన్నారు. ఆంజనేయులు ఆధ్వర్యంలో 60 బృందాలు బుధవారం అమృతలూరు మండలంలోని అన్ని గ్రామాల్లో విద్యుత్ మీటర్ల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా అధిక లోడు వాడుతున్న, డైరెక్ట్ ట్యాపింగ్ 287 సర్వీసులను గుర్తించి, వారి నుంచి రూ 11,86,500 అపరాధ రుసుము విధించడం జరిగిందని ఆయన తెలిపారు. బాపట్ల ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు జి.భాస్కరరావు, డీపీఈ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎం.భాస్కరరావు, డిప్యూటీ ఎగ్జక్యూటివ్ ఇంజినీరు, ఆర్.విజయశ్రీనివాస్, డి.శ్యామ్ సుధాకర్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల పరిశీలన
రాజుపాలెం: ప్రకృతి వ్యవసాయంలో అమలు చేస్తున్న పంటల వైవిధ్యం, నేల ఆరోగ్య పరిరక్షణ, జీవ వైవిధ్యం పెంపు విధానాలు ఆదర్శంగా నిలుస్తాయని యూకేకు చెందిన గ్రోయింగ్ రియల్ ఫుడ్ ఫర్ న్యూట్రీషన్ సంస్థ కో ఫౌండర్ మాథ్యూ పేర్కొన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో రైతు గుర్రాల మల్లికార్జురావు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మాథ్యూ, పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారిలు బుధవారం పరిశీలించారు. క్షేత్రంలో పది రకాల పండ్ల మొక్కలతోపాటు పీఎండీఎస్ విధానంలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాథ్యూ.. పొలంలోని నేల పరిస్థితి, వానపాముల ఉనికి, నేలలో సూక్మజీవుల చురుకుదనం, పంటల వైవిధ్యం, ఎరువుల తయారీ తదితర అంశాలను ఆసక్తిగా గమనించారు. -
జాతీయ రహదారిపై ‘తెనాలి డబుల్హార్స్’ అవుట్లెట్
తెనాలి: విదేశాలకు తమ ఉత్పత్తులను పంపుతున్న తెనాలి డబుల్హార్స్ గ్రూప్ (టీడీహెచ్) కొంతకాలంగా దేశీయ రిటైల్ మార్కెట్పై దృష్టిని సారించింది. ఇందులో భాగంగా విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్హెచ్–65)పై సూర్యాపేట మండలం, రాయన్గూడెం గ్రామంలోని సూర్యాపేట హోటల్–7 ప్రాంగణంలో తమ ఆరవ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ను బుధవారం ఘనంగా ప్రారంభించింది. మధ్యాహ్నం జరిగిన ప్రారంభ వేడుకలో తెనాలి డబుల్హార్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ప్రసాద్ మాట్లాడారు. జాతీయ రహదారిపై ప్రయాణీకులకు నాణ్యమైన, పోషకాలతో కూడిన ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ అవుట్లెట్ను ఏర్పాటు చేశామన్నారు. విజయవాడ–హైదరాబాద్ మార్గంలో ప్రయాణించే ప్రయాణీకులకు ఇకపై వందకు పైగా నాణ్యమైన ఉత్పత్తులు, 130పైగా రకాలను (ఎస్కేయూ) ఒకేచోట నేరుగా కొనుగోలు చేయొచ్చని తెలిపారు. వీటిలో తమ బ్రాండ్కు చెందిన పప్పుధాన్యాలు, ఫుడ్ ప్రోడక్ట్స్, డ్రై ఫ్రూట్స్, మిల్లెట్స్ (చిరుధాన్యాలు)తో పాటు ప్రీమియం చాకెట్లు, టీడీహెచ్ ఫుడ్స్, మిల్లెట్ మార్వెల్ కౌమ, గోపురం బ్రాండ్ల ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయని వివరించారు. విమాన ప్రయాణికులకు విజయవాడ ఎయిర్పోర్టులో, రోడ్డుమార్గాన వెళ్లేవారికి సూర్యాపేట హోటల్–7వద్ద తెనాలి డబుల్ హార్స్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని మోహన్ శ్యాంప్రసాద్ తెలిపారు. దళితుల హత్యలను పట్టించుకోని ప్రభుత్వం ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గుంటూరు రూరల్: రాష్ట్రంలో ఇప్పటి వరకూ 25 మంది దళితులను హత్యలు చేసి తగలబెట్టినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేదని ఏపీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు ధ్వజమెత్తారు. బుధవారం పెదపలకలూరు గ్రామంలో ఇటీవల అమానుషంగా హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టబడిన దావులూరి ప్రసన్న కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దావులూరి ప్రసన్నపై ఆగస్టు 13 తేదీన పెట్రోలు పోసి దహనం చేసిన ఘటనలో మరణించిన మాదిగ బిడ్డ ప్రసన్న కుటుంబానికి ఎమ్మార్పీఎస్ అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో వరుస హత్యలు జరుగుతున్నా పాలకుల స్పందన శూన్యమన్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పెదపలకలూరూకు చెందిన నిరుపేద టైల్స్ కార్మికుడు దావులూరి ప్రసన్న హత్యతో కలిపి ఇప్పటివరకు ఏకంగా 25 హత్యలు జరిగినా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం దారుణమని మండిపడ్డాడు. ఈ మారణహోమం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. లక్ష్మీనాయుడు హత్య బాధాకరమే కానీ ఆ కేసులో ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం ప్రకటించినట్టే అదే రీతిలో ప్రసన్న కుటుంబానికి కూడా రూ.కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి హంతకులను కఠినంగా శిక్షించాలని కోరారు. లేదంటే రాబోయే రోజుల్లో దళితుల తీవ్ర ఆగ్రహాన్ని ఈ ప్రభుత్వం చవిచూడక తప్పదని సువర్ణ రాజు హెచ్చరించారు. ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు రావూరి శ్యామ్, ఇంజుమూరి విజయ్కుమార్, తలారి నాని, కేశవరపు దానియేలు, జె.విజయ్, వి.బుజ్జి, ఎన్.రాంబాబు, బాబు, బి.సత్యనారాయణ, పి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు. పెదకాకానిలో 35.2 మి.మీ. వర్షం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 14 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా పెదకాకాని మండలంలో 35.2 మిల్లీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా పెదనందిపాడు మండలంలో 1.2 మి.మీ వర్షం పడింది. సగటున 8.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వివరాలు.. చేబ్రోలు మండలంలో 21 మి.మీ., పొన్నూరు 19.8, తాడేపల్లి 19.6, ప్రత్తిపాడు 14.8, ఫిరంగిపురం 12.2, వట్టిచెరుకూరు 10.2, మంగళగిరి 3.8, గుంటూరు పశ్చిమ 2.8, తెనాలి 2.6, కాకుమాను 2.6, గుంటూరు తూర్పు 1.8, తుళ్ళూరు మండలంలో 1.4 మి.మీ చొప్పున వర్షం పడింది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 43.6 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 40.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. సూర్యాపేట హోటల్–7లో 6వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ప్రారంభించిన చైర్మన్ అండ్ ఎండీ మోహన్ శ్యామ్ప్రసాద్ -
నిమిషంలో 60 ఆరోగ్య పరీక్షలు
మంగళగిరి టౌన్: అత్యాధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతతో వైద్యరంగంలో సరికొత్త మార్పులకు మంగళగిరి వేదికగా నిలుస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలకు వేగవంతమైన, అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించే లక్ష్యంతో మంగళగిరి పట్టణ పరిధిలోని గణపతి నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్సీ)లో ఎరోస్ వెల్నెస్ ఆధ్వర్యంలో వినూత్న ఏఐ ఆధారిత ఆరోగ్య పరీక్షల విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం ఏఐ ఆధారిత ముఖ స్కానింగ్ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నోడల్ అధికారి శ్యామల మాట్లాడుతూ సాధారణంగా ఆరోగ్య పరీక్షలకు రక్త నమూనాలు సేకరించి ప్రయోగశాల నివేదకల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ కొత్త విధానంలో రక్తనమూనా సేకరించడకుండానే కేవలం 60 సెకండ్లలో 60 రకాల ఆరోగ్య సూచికలను అంచనా వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సాంకేతికతలో భాగంగా వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా రక్తప్రసరణ, చర్మకణాల కదలిక తదితర అంశాల ఆధారంగా సుమారు 28 రకాల శారీరక కొలమానాలను గుర్తించవచ్చని పేర్కొన్నారు. అదనంగా ఇంటర్నెర్ ఆధారిత జీవ సంవేదకాలు, ఆధునిక స్క్రీనింగ్ పరికరాలతో మరో 32 కీలక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని వివరించారు. ఈ వినూత్న ప్రాజెక్ట్ను విజయవంతంగా అమలు చేసేందుకు యూపీహెచ్సీకి చెందిన సాంకేతిక నిపుణులు, వైద్య సిబ్బందికి రెండు రోజులు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. శిక్షణ పూర్తి అయిన అనంతరం పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎరోస్ వెల్నెస్ సీఈవో శిల్పాదేశాయ్, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూష, వైద్యసిబ్బంది, ప్రయోగశాల సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 27.7565 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది. -
దరఖాస్తుకే దడదడ
బాపట్లగురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 534.90 అడుగులకు చేరింది. ఇది 177.8698 టీఎంసీలకు సమానం. బాపట్ల టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. మొన్నటివరకు కొత్త పింఛన్ల ఊసేలేదు. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో హడావుడిగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దరఖాస్తులకు సవాలక్ష ఆంక్షలు విధించారు. తక్కువ గడువు ఇచ్చి, వాటిని అప్లోడ్ చేయడానికి సర్టిఫికెట్లను ముడిపెట్టారు. కొందరు అన్ని పత్రాలు తీసుకొని సచివాలయానికి వెళితే సర్వర్లు పనిచేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు, దరఖాస్తుదారుల మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఇలా కార్యాలయాల చుట్టూ తిప్పడమేంటంటూ వృద్ధులు, దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి అవస్థలు కొత్త పింఛన్ దరఖాస్తుకు ఈ నెల 16వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఇందులోనే శని, ఆది, సోమవారాలు వరుస సెలవులు ఉన్నాయి. మిగిలిన అతికొద్ది రోజుల్లోనైనా దరఖాస్తు చేసుకుందామంటే సచివాలయాల్లో సర్వర్లు పూర్తిగా మొరాయిస్తున్నాయి. బుధవారం ఉదయాన్నే సచివాలయాల వద్దకు చేరుకున్న వృద్ధులు, దివ్యాంగులు గంటల తరబడి నిరీక్షించారు. ఆన్లైన్ ప్రక్రియపై అవగాహన లేని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, దీర్ఘకాలిక రోగులు వేరే సహాయకులను తోడుగా తెచ్చుకుంటున్నారు. అందరూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దరఖాస్తు ప్రక్రియలో ఓటరుకార్డుకు మొబైల్ నంబర్ అనుసంధానం, ఓటీపీ వంటి ప్రక్రియలు దరఖాస్తుదారులకు మరో సమస్యగా మారాయి. మొబైల్ నంబర్ అనుసంధానం లేకపోవడం, ఓటీపీ ఆలస్యంగా రావడం, అసలు రాకపోవడంతో పలువురు దరఖాస్తుదారులు ప్రక్రియను పూర్తిచేయలేకపోయారు. చిన్న సాంకేతిక సమస్యలకే గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఎన్నికల కోసమే ఈ తతంగం ఎన్నికల హామీలో భాగంగా సూపర్ సిక్స్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామంటూ ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చి 27 నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తుండటంతో కనీసం దరఖాస్తులనైనా స్వీకరించకపోతే గట్టెక్కే పరిస్థితులు ఉండవని భావించి హడావుడిగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ పింఛన్ల పెత్తనం జన్మభూమి కమిటీల చేతుల్లో ఉండేది. అర్హులకు పింఛన్ అందాలంటే జన్మభూమి కమిటీలోని సభ్యులను ప్రసన్నం చేసుకుంటేనే సాధ్యమయ్యేది. ఇప్పుడైనా పారదర్శకంగా అందజేస్తారో... లేదో వేచి చూడాలి. వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ రాజకీయాలు, కులమతాలకు అతీతంగా పింఛన్లు అందజేశారు. అప్పట్లో క్షేత్రస్థాయిలో వలంటీర్లు దరఖాస్తులు సేకరించి సచివాలయంలో అందజేయడం, సచివాలయ సిబ్బంది ఆన్లైన్ చేయడంవంటివి చకచకా జరిగిపోయేవి. అర్హులకు పింఛన్లు మంజూరయ్యేవి. ప్రతి ఏడాది జనవరి, జూలై మాసాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పింఛన్లు అందించేవారు. -
మండపాలకు అనుమతులు తప్పనిసరి
బాపట్ల టౌన్: వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వినాయక విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు, కమిటీ సభ్యులు వ్యవహరించాలన్నారు. సంబంధిత శాఖలు, పోలీస్ అధికారుల అనుమతి పొందిన తర్వాతే మండపాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. అనుమతి పత్రాన్ని మండపం వద్ద ప్రదర్శించాలని తెలిపారు. ట్రాఫిక్, ప్రజల రాకపోకలకు ఆటంకం కలగని ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఫైర్, అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు ప్రయాణించే విధంగా మార్గం ఉండాలని సూచించారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, తీగలు, స్తంభాల వద్ద మండపాలను ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల వద్ద ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, నీటి డ్రమ్ములు, ఇసుక బకెట్లు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. సిలిండర్లు, వంట సామగ్రి, బాణసంచా ఉంచరాదన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు, తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద మద్యం, జూదం, అసభ్య ప్రవర్తనకు తావు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతినేలా నినాదాలు, బ్యానర్లు, పాటలు ప్రదర్శించరాదని హెచ్చరించారు. పోలీసులు అనుమతించిన మార్గాల్లోనే ఊరేగింపు సాగాలన్నారు. ఫిట్నెస్ అనుమతులు పొందిన వాహనాలనే ఊరేగింపునకు ఉపయోగించాలని పేర్కొన్నారు. లైసెన్స్, అనుభవం కలిగిన వ్యక్తినే వాహన డ్రైవర్గా నియమించాలని సూచించారు. మద్యం సేవించిన వారు ఊరేగింపు వాహనాన్ని నడపడం గానీ, వాహనంలో ఎక్కడం గానీ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యుత్ వసతిపై దృష్టి పెట్టండి రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దంతో కూడిన డీజేలు, సౌండ్ సిస్టమ్ల వినియోగం పూర్తిగా నిషేధమని చెప్పారు. మండపాల వద్ద ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ప్రమాదకరమైన వైరింగ్, వేలాడే తీగలను సరిచేయాలన్నారు. ఊరేగింపు మార్గాల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను తొలగించి, నిమజ్జన ఘాట్ల వద్ద సురక్షిత విద్యుత్, లైటింగ్ సౌకర్యం కల్పించాలని విద్యుత్శాఖ అధికారులకు సూచించారు. రౌడీషీటర్లు, గతంలో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపులు, పార్కింగ్ స్థలాలను ముందుగానే ప్రకటించాలన్నారు. అంబులెన్స్, అత్యవసర వాహనాలకు నిరంతరాయంగా మార్గం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గణనాథుని పండుగను ప్రతిఒక్కరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు, అధికారులు, జిల్లాలోని వివిధ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ముందస్తుగా గుర్తిస్తే నివారించవచ్చు
ఆత్మహత్య చేసుకోవాలని మనసులో నిశ్చయించుకున్న వారు ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఇంట్లో తమపై ఉన్న బరువు బాధ్యతల్ని ఇతర కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడి చేసి జీవితంలో ఎదగాలంటే ఎలా ఉండాలో జాగ్రత్తలు సైతం పిల్లలకు, కుటుంబ సభ్యులకు వివరిస్తారు. ఇలాంటివారిని తక్షణమే మానసిక వైద్యులకు చూపించడం ద్వారా ఆత్మహత్యకు పాల్పడకుండా నివారించవచ్చు. కుటుంబ సభ్యులు ఎవరైనా అడిగిన వస్తువు కొనిపించకపోతే చనిపోతామని బెదిరిస్తే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తక్షణమే స్పందించి వారిని మానసిక వైద్యులకు చూపించాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం మానసిక రుగ్మత. దీన్ని పూర్తిగా నయం చేయవచ్చు. – డాక్టర్ వడ్డాది వెంకటకిరణ్, మానసికవ్యాధుల వైద్య నిపుణుల సంఘం, జిల్లా అధ్యక్షుడు -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
కర్లపాలెం(బాపట్ల టౌన్): పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డివిజనల్ డెవలప్మెంట్ అధికారి విజయలక్ష్మి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం రెండురోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నిలచిన వర్షపు నీటిని బయటకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కాలువల ద్వారా నీటితో సకాలంలో చెరువులు నింపుకోవాలన్నారు. రానున్న రోజుల్లో ఎండతీవ్రత పెరిగే అవకాశం ఉందని ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా చెరువులను నింపుకోవాలని ఆదేశించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియకు సంబందించిన ఓటర్ల జాబితా, పోలింగ్బూత్ల పరిశీలన పనులు త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో డెప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మంజూర్ బాషా, ఏపీవో శ్యామ్ పాల్గొన్నారు. డివిజనల్ డెవలప్మెంట్ అధికారి విజయలక్ష్మి -
నిషేధిత జాబితా నుంచి పట్టా భూములు తొలగించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్బాపట్ల: జిల్లాలో 22ఏ నిషేధిత జాబితా నుంచి పట్టా భూములను తొలగించే ప్రక్రియలో అధికారులు నిబంధనల మేరకు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం 22ఏ కేసుల పరిష్కారంపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లోని వీక్షణ సమావేశ మందిరంలో నిర్వహించారు. అర్హత ఉన్న పట్టా భూములన్నింటినీ నిషేధిత జాబితా నుంచి చట్టబద్ధంగా తొలగించాలని కలెక్టర్ చెప్పారు. ఇలా తొలగించడానికి చీరాల డివిజన్లోని 4 దరఖాస్తులపై సుదీర్ఘంగా చర్చించారు. తదుపరి వెబ్ ల్యాండ్, భూమి రికార్డులు, తదితరమైన రెవెన్యూ దస్త్రాలను పరిశీలించారు. విచారణ జరిపిన వాటిని తొలగించడానికి చర్యలు తీసుకున్నారు. దస్త్రాలు సరిగా లేనివి, సమగ్ర సమాచారం వివరాలు లేని దరఖాస్తులను తిరస్కరించారు. చిన్నగంజాం మండలంలోని పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో పనిచేయాలని సూచనలు చేశారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ, ఇన్చార్జ్ డీఆర్ఓ లవన్న, జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి శ్రీనివాస్, జిల్లా భూమి రికార్డుల శాఖ సహాయ సంచాలకులు శేషగిరిరావు, చీరాల ఆర్డీవో, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. -
ఒకే ఒక్క జీవితం..!
గుంటూరు మెడికల్: యువత క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఏడాదికి 7లక్షల మంది ఆత్మహత్యలతో మరణిస్తున్నారు. భారతీయులు 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 15నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సువారే ఎక్కువ. కేవలం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతూ నిండు జీవితాలను బలి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ సంయుక్తంగా 2003 నుంచి ప్రతి ఏడాది సెప్టెంబరు 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. డేంజర్ బెల్స్.. వ్యక్తులు డల్గా ఉండటం, ఎవరితో కలవకుండా మూలన ఒంటరిగా కూర్చోవడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం, బరువు తగ్గిపోవడం, ముఖం దిగాలుగా ఉండటం, ఆహారం మానివేయడం, తదితర లక్షణాలు వ్యక్తుల్లో కనిపిస్తే తక్షణమే అప్రమత్తమై వారికి మానసిక వైద్యులచేత కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఈలక్షణాలు కనిపించేవారు హైరిస్క్ గ్రూపునకు చెందిన వారు. కారణాలు.... భారతదేశంలో ఆత్మహత్యకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ఆల్కహాలు, మాదకద్రవ్యాలకు బానిసలవ్వటం, వైవాహిక సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, పరీక్షల్లో అపజయాలు, ఒత్తిడి, కుంగుబాటు, ఆర్ధిక సమ్యలు, నిరుద్యోగం, ఆస్తి తగాదాలు, పేదరికం, అక్రమ సంబంధాలు, కుల,వర్గ వివక్షలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జీజీహెచ్లో బాధితుల వివరాలు... గుంటూరు జీజీహెచ్లో ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి చికిత్స పొందినవారు ప్రతినెలా 30 మందికిపైగా ఉంటున్నారు. జీజీహెచ్ వైద్యులు, మానసిక వైద్య నిపుణులు వీరిలో పలువురికి కౌన్సెలింగ్ చేసి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు పోకుండా కాపాడగలుగుతున్నారు. ప్రతిఏడాది 200 నుంచి 300 మంది ఆత్మహత్య ప్రయత్నాలు చేసిన వారు జీజీహెచ్కు వస్తుండగా, కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సామాజిక మాధ్యమాలలో, వార్తా పత్రికల్లో, ఆత్మహత్యలు జరిగే విధానాన్ని అన్వేషించేవారిని, విచారం, దిగులు, దుఃఖం, ఎక్కువ కాలం ఉంటే అది ఆత్మహత్యకు దారి తీసే అవకాశముంది. సాధారణ ప్రవర్తనకు భిన్నంగా సడన్గా శాంతంగా ఉండడం, నిరుత్సాహంగా గడపడం చేస్తుంటే తేడాను గమనించాలి. గతంలో లాగా స్నేహితులతో కలవకుండా, ఆట పాటల్లో పాల్గొనకుండా, దైనందిన కార్యక్రమంలో నిరాసక్తతతో ఒంటరి తనంగా వుండడానికి ఇష్టపడుతుంటే ఆ మార్పును ఆత్మహత్యకు సంకేతంగా పరిగణించాలి. మాటల్లో, సంభాషణల్లో నైరాశ్యం కనబరుస్తూ, వస్త్రధారణలో, వ్యక్తిగత శుభ్రతలో, ఆకర్షణలో నిరాసక్తత, వ్యక్తపరుస్తుంటే వారితో తప్పనిసరిగా వారితో మాట్లాడి వారి బాధను ఆలకించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి. -
ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలి
బాపట్ల: ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఉన్న చట్టాలను అమలు చేయటంతోపాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను గౌరవించాలని ఎస్టీ, ఎస్సీ హక్కుల సంక్షేమ సంఘం, సమరత సేవా ఫౌండేషన్ నాయకులు కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం రిజర్వేషన్లును అమలు చేయాలని సూచించారు. వినతి పత్రం ఇచ్చినవారిలో జిల్లా కన్వీనర్ పొన్నపల్లి సత్యనారాయణ, మహిళా కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి, ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, ప్రభుత్వ సంబంధాల ప్రముఖ్ బొలగాని వెంకటేశ్వర్లు, చిల్లా సత్యనారాయణ, మోదడుగు సూరిబాబు, దండుప్రోలు వెంకట్రావు, తులసి రాజేష్ పాల్గొన్నారు. వేర్వేరు ఘటనల్లో ఇరువురు ఆత్మహత్య రేపల్లె: వేర్వేరు ఘటనల్లో ఇరువురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్యాన్సర్ వ్యాధితో ఒక మహిళ ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు ఉరిపెట్టుకుని మృతి చెందాడు.. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని నల్లూరు సౌత్ గ్రామానికి చెందిన నల్లూరు అరుణకుమారి (45)కి బుధవారం ఇంట్లో ఉరి పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు అరుణకుమారిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న అరుణకుమారి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి రావులపు సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్కుమార్ తెలిపారు. అదేవిధంగా గుడ్డికాయలంక గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (30) కుటుంబ కలహాల నేపథ్యంలో గృహ సమీపంలోని మామిడి చెట్టుకు ఉరిపెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాశీనాగరాజును ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే అతని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నేడు దశాబ్ది ఉత్సవాలు నెహ్రూనగర్: గుంటూరు కథోలిక పీఠాధిపతులుగా డాక్టర్ చిన్నాబత్తిని భాగ్యయ్య బాధ్యతలు స్వీకరించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గుంటూరు నగరంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు, సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫాదర్లు మోన్సిగ్నోర్ అల్లం శౌరెడ్డి, మోన్సిగ్నోర్ పామిశెట్టి బాలస్వామి, మోన్సిగ్నోర్ చాట్ల మరియదాసు, పూదోట దానయ్య, దాసరి కిరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు రింగ్ రోడ్డులోని బిషప్ హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 గంటలకు లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద నుంచి బిషప్ హౌస్ వరకు ప్రదక్షిణ (ఊరేగింపు) ప్రారంభం ఉంటుందన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు డాన్బాస్కో మైదానంలో ప్రత్యేక దివ్యబలి పూజ సమర్పించనున్నట్లు వివరించారు. అనంతరం బిషప్ భాగ్యయ్యకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా హైదరాబాద్ అగ్రపీఠాధిపతి, భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షుడు కార్డినల్ పూల ఆంథోని హాజరుకానున్నారు. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు బిషప్లు, గురువులు, కన్యాసీ్త్రలు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొంటారని వివరించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే పీడీఎఫ్ లక్ష్యం మంగళగిరి టౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే పిడిఎఫ్ లక్ష్యమని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో కృష్ణా – గుంటూరు ఉమ్మడి జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి 2027 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో వివిధ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపర్చిన పీడీఎఫ్ అభ్యర్ధిగా ఎం.హనుమంతరావు పరిచయ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులతో సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా పీడీఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నికై నిజాయితీగా పనిచేశారని గుర్తుచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పిడిఎఫ్ నిరంతరం పోరాడుతుందన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావుకు వివిధ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించి ఆయన విజయానికి సమష్టిగా కృషిచేస్తామని వెల్లడించారు. -
రైలు ఢీకొని వంట మాస్టర్ మృతి
తెనాలి రూరల్: రైలు ఢీకొని వంట మాస్టర్ మృతి చెందిన ఘటన తెనాలి రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం జరిగింది. రైల్వే స్టేషన్ దక్షిణ క్యాబిన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో పట్టణ పాండురంగపేటకు చెందిన వంట మాస్టర్ ఎమ్మిటిశెట్టి నాగేశ్వరరావు(67) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎర్ర రంగు చేతి సంచి ఉంది. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించగా, రాత్రికి మృతుడి వివరాలు తెలిశాయి. ఎస్ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంపాలెం: యూకే బ్రైటన్లో స్థిరపడిన ప్రముఖ తెలుగు సెలబ్రిటీ చెఫ్ కాంతికిరణ్ తమ్మా అరుదైన గౌరవా న్ని సొంతం చేసుకున్నా రు. గుంటూరు కొత్తపేటలో జన్మించారు. యూకే లో స్థిరపడ్డారు. బ్రైటన్న్లో ది స్పైస్ సర్క్యూట్ లిమిటెడ్ చెఫ్ డైరెక్టర్గా ఉన్న ఆయన్ను ప్రతిష్టాత్మక బీఐహెచ్ స్పాట్లైట్ అవార్డ్స్ (2026)లో చెఫ్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ఫైనలిస్ట్గా ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 3 వేలకుపైగా నామినేషన్లు వచ్చాయి. యూకేలో దక్షిణ భారత, ముఖ్యంగా తెలుగు వంటకాలు, ఆహార సంస్కృతికి అందిస్తున్న విశిష్ట సేవలకు లభించిన అరుదైన గుర్తింపుగా ఈ గౌరవాన్ని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12న బీఐహెచ్ స్పాట్లైట్ అవార్డ్స్– 2026 విజేతలను లండన్న్లోని క్వాగ్లినోస్లో ప్రకటించనున్నారు. తెలుగు వంటకాల ఘుమఘుమలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న కాంతికిరణ్ తమ్మా చెఫ్ ఆఫ్ ది ఇయర్ ఫైనలిస్ట్గా నిలవడం తెలుగు వారి గర్వకారణంగా మారింది. నగరంపాలెం: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లోని తిక్కన సమావేశ మందిరంలో ఐదు డిపోల డ్రైవర్లు, కండక్టర్లకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణాధికారి డి.సామ్రాజ్యం మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని అన్నారు. సంస్థ ప్రతిష్ట డ్రైవర్లు, కండక్టర్లల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీ్త్ర శక్తి పథకం విజయవంతమైందని అన్నారు. తద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు విధి నిర్వహణలో ఓర్పు, సహనంతో ఉండాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణం ప్రయాణికులకు కల్పించాలని తెలిపారు. మంగళగిరి రూరల్: యువ ఇంజినీర్ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన కళికవాయి వెంకట శ్యామ్ (22) రాజధానిలో ఈ– 14 రోడ్డు నిర్మాణం చేస్తున్న ఓ కంపెనీలో ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో ఈ–5 క్యాంప్ నుంచి రోజు విధుల కు హాజరవుతున్నాడు. మంగళవారం మంగళగిరి మండలం నవులూరులో క్రికెట్ స్టేడియం సమీపంలో నిర్మిస్తున్న ఈ–14 రోడ్డు నిర్మాణంలో భాగంగా డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో కాంక్రీట్ మిక్సర్ వేయాల్సిన ప్రదేశం కాకుండా ముందుకు వెళ్లడంతో డ్యూటీలో ఉన్న ఇంజినీర్ శ్యామ్ వాహనాన్ని వెనక్కి పిలవడంతో డ్రైవర్ రివర్స్ గేర్లో వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అతను డైరెక్షన్ మార్చుకో అని డ్రైవర్కి చెప్పేలోపు వాహనం శ్యామ్కు తగలడంతో అతను కింద పడిపోవడం అతడిపై టైర్ ఎక్కటం క్షణాల్లో జరిగిపోయింది. తోటి ఉద్యోగులు ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని అచ్చంపేటరోడ్లో పట్టణ శివారులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ఆదిమూలపు దివ్య, భర్త రాంబాబు ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో పట్టణంలోని అంబేడ్కర్నగర్కు చెందిన షేక్ సిద్ధిక్ స్కూటీపై పాకాలపాడు వైపు వెళుతుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆదిమూలపు దివ్య(35) తలకు బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. భర్త ఆదిమూలపు రాంబాబుకు తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అలాగే షేక్ సిద్ధిక్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఇరువురు క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సిద్ధిక్కు 15 కుట్లు పడగా పరిస్థితి విషమంగా మారింది.పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. -
విద్యుత్ బస్లను ఆర్టీసీ పర్యవేక్షించాలి
నగరంపాలెం: ఆర్టీసీలోకి ప్రవేశపెట్టే విద్యుత్ బస్లను ఆర్టీసీ ద్వారానే నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్ బస్ల డిపోల ఏర్పాటు పేరుతో మూసివేసిన అలిపిరి, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు– 2, గుంటూరు– 2, విద్యాధరపురం డిపోలను పునఃప్రారంభించాలని కోరారు. పెరుగుతున్న మహిళల ఉచిత ప్రయాణికుల దృష్ట్యా బస్లు, సిబ్బందిని పెంపొందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్ల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. మూతపడిన డిపోలను వెంటనే పునః ప్రారంభించాలని అన్నారు. శిబిరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.హనుమంతరావు, ముత్యాలరావు, చింతల శ్రీనివాసరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులు కె.గంగాధర్రావు, జె.నాంచారయ్య, కె.పాములు మద్దతు ప్రకటించగా, ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎంవీఎస్.రామకృష్ణ, కార్యకర్తలు వి.మధుసూదన్రావు, సిహెచ్.శ్రీను, టి.శ్రీను, రవిచంద్, జయశ్రీ, బి.రామాంజనేయులు, ఎల్.వి.ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: పన్నులు చెల్లించకుండా రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి, నిర్బంధంలో ఉన్న వాహనాలు ఈనెల 26 వేలం నిర్వహించనున్నట్లు గుంటూరు ఉపరవాణా కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయ ఆవరణలోని 33, తెనాలి కార్యాలయంలోని 33 వాహనాలు (హెచ్జీవీలు, ఎంజీవీలు, ఎల్జీవీలు, మోటార్ సైకిల్స్, మోటార్కార్, మ్యాక్సిక్యాబ్లు) ఈ వేలంలో విక్రయిస్తామని తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు చెల్లించాల్సిన పన్నులు, అపరాధ రుసుం ఈనెల 25లోగా చెల్లించాలని అన్నారు. లేనిచో ఈనెల 26 మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు డీటీఓ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నగరంపాలెం: గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తూ, అలవాటైన నేరస్తుడిపై పీఐటీ–ఎన్డీపీఎస్ చట్టం ప్రయోగించి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. దుగ్గిరాల, తెనాలి, మంగళగిరి ప్రాంతాల్లో యువత, విద్యార్థులు లక్ష్యంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తూ, అలవాటైన తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మల్లవరుపు పృధ్వీపై ప్రభుత్వం నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పృధ్వీని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. అతనిపై మంగళగిరి పట్టణ పీఎస్, తాడేపల్లి పీఎస్, దుగ్గిరాల పీఎస్, ఎన్టీఆర్ జిల్లా సూర్యారావుపేట పీఎస్, గుడూరు పీఎస్లో కేసులు ఉన్నాయని తెలిపారు. -
కాలుష్య విషం!
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కడలి గర్భంలోకి ఆహ్లాదాన్ని పంచాల్సిన సముద్ర తీరం రోగాలకు నిలయంగా మారింది. బాపట్ల జిల్లా తీరంలో వదులుతున్న కుళ్లిన వ్యర్థాలు, రొయ్యల ఫ్యాక్టరీలు, హేచరీల నుంచి వచ్చే రసాయన నీటితో తీరం విషమయం అవుతోంది. కళ్లెదుటే సముద్ర గర్భం కాలుష్య విషపు కోరల్లో చిక్కుకుంటున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చీరాల టౌన్: జిల్లాలోని పర్యాటక తీర ప్రాంతాలైన వాడరేవు, రామాపురంతో పాటు బాపట్ల సూర్యలంక, నిజాంపట్నం, చినగంజాం తీర ప్రాంతాలకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. జిల్లాలో 76 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ తీరం ఒడ్డునే మత్స్య సంపదను ఎగుమతి చేసేందుకు పలురకాల ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వీటితో పాటు రొయ్యలు, చేపల ప్రాసెసింగ్ కంపెనీలతో పాటు హేచరీలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.లక్షల్లో సంపాదించే బడా వ్యాపారస్తులు రోజుకు 1.5 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. చేపలు శుభ్రం చేయడానికి, రొయ్యల నుంచి మాంసం తయారీకి నీరు కావాల్సిందే. ఇలా వ్యర్థ నీటిని ట్యాంకర్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. రోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజాము వరకు ట్యాంకర్ల ద్వారా కుళ్లిన వ్యర్థాలు, క్రిమిసంహారక నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇలా రోజుకు 50 వేల లీటర్ల నీరు కడలిని కలుషితం చేస్తున్నట్లు అంచనా. చేపలు కూడా లభ్యం కావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనే ఉండే మత్స్యశాఖ ఉద్యోగులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు కళ్లు మూసుకుని విధులు నిర్వహిస్తున్నారా...? అని పర్యాటకులు విమర్శిస్తున్నారు. ప్రజల ప్రాణాలకే ముప్పు.. ఏడాదికి ఒక్కో ప్లాంట్ సగటున రూ.10 కోట్లు నుంచి రూ.20 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు చేస్తుంటాయి. వ్యాపారులు మాత్రం కనీసం ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం లేదు. రోజుకు ఒక్కో ప్లాంట్ లక్షల లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ నీటిని రీసైక్లింగ్ చేసుకునేందుకు విధిగా ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఎనిమిది పరిశ్రమల్లో ఎక్కడా కనిపించలేదు. కార్మికశాఖ నుంచి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు లేవు. వ్యర్థాలు, రసాయనాలను సముద్రంలోకి వదలడం వలన మత్స్య ఉత్పత్తి తగ్గడం, ఈ నీటిలో స్నానాలు చేస్తే చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. -
రిజిస్ట్రేషన్ రద్దుతో కథ కంచికేనా?
యడ్లపాడు: పట్టణ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన మున్సిపల్ రిజర్వు స్థలానికి సంబంధించి సాగిన రిజిస్ట్రేషన్ వ్యవహారం చివరకు రద్దుతో ముగిసింది. అయితే రిజిస్ట్రేషన్లు రద్దయినంత మాత్రాన అసలు ప్రశ్నలు మాత్రం సమసిపోలేదు. ప్రభుత్వ స్థలానికి ప్రైవేటు సంస్థ పేరుతో పన్ను రశీదు ఎలా జారీ అయింది? సర్వే నంబర్ మార్పుతో ఎండార్స్మెంట్ ఎవరి ఆదేశాలతో వచ్చింది? ఆ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లకు మార్గం ఎవరు సుగమం చేశారు? అనేది అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రిజిస్ట్రేషన్తో వెలుగులోకి... స్థానిక ఫైర్స్టేషన్ రోడ్డులోని హెచ్.హెచ్. డైక్మెన్ నగర్లో ఉన్న 27 సెంట్ల మున్సిపల్ రిజర్వు స్థలంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఆ స్థలంలో ఎన్నో ఏళ్లుగా ఏఎంజీ డేకేర్ సెంటర్ ఏర్పాటుతో అనేక సేవలు అందించింది. ఆ సేవలు నిలిచిపోయాక సదరు స్థలాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న ఏడుగురి పేర్లతో దాన దస్తావేజుల ద్వారా రిజిస్టర్ చేసినట్లు రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో అధికారపార్టీ నేతలు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 7వ తేదీన ‘‘ప్రజా ఆస్తి.. ‘పచ్చ’నేతల పరం’’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పట్టణంలోని కీలక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పేర్లకు బదలాయింపునకు దస్తావేజులు సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. వివాదం ముదరడంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు సోమవారం రాత్రి చిలకలూరిపేట సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరుకుని దాన దస్తావేజులను రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. స్థలం మున్సిపాలిటీదే...! ఇదే విషయమై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును వివరణ కోరగా.. సర్వే నంబర్ 88/1లో ఉన్న స్థలం వివాదంలోకి రాగానే సదరు స్థలం తమ శాఖదేనని అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. రిజిస్టర్ చేసుకున్న వారు వాటిని స్వచ్ఛందంగా సోమవారం రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇక స్థలంపై ఎలాంటి వివాదం లేదని, పూర్తిగా తమ స్వాధీనంలో ఉందని వెల్లడించారు. -
అక్షరాస్యతతోనే ఆర్థికాభివృద్ధి
బాపట్లటౌన్: అక్షరాస్యతతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని జిల్లా విద్యాశాఖాధికారి డి.శ్రీనివాససింగ్ అన్నారు. 60వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం మండలంలోని మరుప్రోలువారిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ రాష్ట్రాన్ని త్వరలో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నారు. వయోజన విద్యాశాఖ నోడల్ అధికారి దేవరకొండ కృష్ణ మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్య సాధనకు ప్రభుత్వంతోపాటు ప్రతి ఒక్కరూ భాగస్వాములై సమష్టి కృషితో అక్షర సమాజ స్థాపనకు కృషిచేయాలన్నారు. అనంతరం అక్షరాస్యతపై డిబేటు చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో ఎస్.నిరంజన్, పాఠశాల హెచ్ఎం ఎ.రమాదేవి, ముత్తాయపాలెం హెచ్ఎం గురజాల శ్రీనివాసరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి, వయోజన విద్యాశాఖ సూపర్వైజర్లు షేక్ బజుల్లా ఆర్ శివప్రసాద్, రవితేజ, సిఫార్డు సంస్థ డైరెక్టర్ కోఆర్డినేటర్ బి కిషోర్, పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎస్టీ వృద్ధురాలి పట్ల సీఐ ప్రవర్తన దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పద్మావతి ● సీఐని ఉద్యోగం నుంచి తొలగించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి రేపల్లె: చీరాల పట్టణంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వృద్ధురాలిపై సీఐ ప్రవర్తించిన తీరు అత్యంత బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సజ్జ పద్మావతి పేర్కొన్నారు. సమన్వయకర్త నాగమోహన్కృష్ణ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. వృద్ధురాలు అని కూడా చూడకుండా సీఐ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ అమానుషంగా ప్రవర్తించడం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి నెలకొందన్నారు. పోలీస్ అధికారులే ఇలా ప్రవర్తించడం శాఖకు మాయని మచ్చగా మారిందని అన్నారు.‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానమని చెబుతూనే సామాన్యులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం బాధాకరమని పేర్కొన్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, పోలీస్ వ్యవస్థలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. తన తల్లి వయసు ఉన్న వృద్ధురాలిపై సీఐ ప్రవర్తించిన తీరు మాటల్లో వర్ణించలేనిదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సీఐను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడాలంటే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ఆమె కోరారు. -
ఆర్టీసీ పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాలి
బాపట్ల టౌన్: ఆర్టీసీని కాపాడుకోవడానికి ఉద్యోగులు కార్మికులు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా నెల్లూరు–2 డిపో పరిధిలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతుగా మంగళవారం బాపట్ల కొత్త బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కార్యదర్శి తిరుమలరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని కోరుతూ ప్రజాప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా బాపట్లలో ఈ దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించేందుకు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో జిల్లా కార్యదర్శి తిరుమలరెడ్డితోపాటు జిల్లా అధ్యక్షులు నారాయణ, జిల్లా కోశాధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్.యోగానంద్, సీఐటీయూ బాపట్ల నాయకులు కె.శరత్ కూర్చున్నారు. దీక్ష శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ గంగయ్య, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వై. భాస్కరరావు, సీఐటీయూ సీనియర్ నాయకులు కె.నాగేశ్వరరావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు సత్యనారాయణలు ప్రారంభించారు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వసంతరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేఖ ఎలిజిబెత్, ఎల్ఐసీ జిల్లా నాయకులు రవికిరణ్, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు శ్రీనివాస్, చారి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్ష శిబిరంలో పాల్గొన్న వారికి నిమ్మరసం అందించి దీక్షను విరమింప చేశారు. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా కార్యదర్శి బి.తిరుమలరెడ్డి -
గంజాయి తాగి, విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
● 1.3 కిలోల గంజాయి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు తెనాలిరూరల్: గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను డీఎస్పీ బి.జనార్ధనరావు వెల్లడించారు. నందివెలుగు జంక్షన్ వద్ద బ్రిడ్జి కింద గంజాయి విక్రయాలు, తాగుతున్నట్లు అందిన సమాచారంతో సోమవారం సాయంత్రం తెనాలి రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, డెప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్, వీఆర్వోలు గుంపెన నాగరాజు, కొత్త జార్జి థామస్ సమక్షంలో దాడులు చేశారు. అబ్దుల్ కరీమ్(కొల్లిపర), అమిరె ఆనంద్ కిషోర్ అలియాస్ చోటు(కొల్లిపర), షేక్ సాధిక్(తెనాలి), కోలా రత్నరాజు(తెనాలి), దేవరకొండ మను శివశంకర్ అలియాస్ బబ్లూ(తెనాలి), బత్తెన అజయ్కుమార్(తెనాలి), రెడ్డి సాయికుమార్(తెనాలి) గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా గంజాయిని గుంటూరుకు చెందిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వీరి సమాచారంతో మంగళవారం ఉదయం గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో దాడి చేసి ప్రధాన సప్లయర్లుగా పేర్కొన్న ఆరేటి నవీన్న్, షేక్ షఫీలను అరెస్టు చేశారు. తెనాలి ప్రాంతానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠా లింక్ను ఛేదించారు. అరెస్టయిన వారిలో పలువురిపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కొందరిపై దొంగతనాలు, ఎన్డీపీఎస్ కేసులు ఉండగా, షేక్ షఫీపై ఎన్న్డీపీఎస్, ఆయుధాల చట్టం, హత్య, దాడి తదితర కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచగా రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె. ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్తో పాటు సిబ్బందిని డీఎస్పీ జనార్ధనరావు అభినందించారు. సమావేశంలో తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్, కొల్లిపర ఎస్ఐ ప్రసాద్ ఉన్నారు. -
మద్యానికి బానిసై భార్యకు వేధింపులు
● ఆత్మహత్య చేసుకున్న వివాహిత ● తల్లిని కోల్పోయిన ఐదు నెలల చిన్నారి మర్రిపాడు: ఆ చిన్నారికి లోకం ఇంకా తెలియదు.. అమ్మే తన ప్రపంచం. ఐదునెలల వయసులోనే తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటంతో మండలంలోని డీసీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన చాంద్ బాషాకు చీరాలకు చెందిన షేక్ హనీ (22)తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఐదునెలల బాబు ఉన్నాడు. హనీ తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటున్నారు. చాంద్ బాషా డీసీపల్లిలో దుకాణాన్ని అద్దెకు తీసుకుని పవర్ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తున్నాడు. అదే ఊరిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. హనీ భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి యజమాని తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి హనీ మృతిచెందినట్లు గుర్తించారు. ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సైలు జంపాని కుమార్, శ్రీనివాసులురెడ్డి, మర్రిపాడు ఏఎస్సై శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య మృతి విషయం తెలియగానే చాంద్ బాషా పరారయ్యాడు. అతడిని నెల్లూరు రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
కమీషన్లతో కరిగిపోతున్న అభివృద్ధి
నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కమీషన్లకు బలి అవుతున్నాయి. భారీ నిధులు మంజూరు అవుతున్నప్పటికీ, పనుల నాణ్యత మాత్రం పూర్తిగా డొల్లతనంగా ఉంటోంది. కేవలం పది నెలల క్రితం రూ.9.70 కోట్ల వ్యయంతో ఇసుకపల్లి నుంచి నిజాంపట్నం వరకు నిర్మించిన రహదారి పూర్తిగా నాసిరకంగా మారింది. నెలలు గడవకముందే గుంతలమయం కావడం పనుల దారుణ పరిస్థితికి నిదర్శనం. ప్రజలకు ఉపశమనం కలిగించాల్సిన రహదారులు ఇబ్బందులకు కారణమవుతున్నాయి. నియోజకవర్గంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి పనిలో మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్ భారీగా కమీషన్లు వసూలు చేస్తున్నారు. ఈ అవినీతి కారణంగానే పనులు నాణ్యత కోల్పోతున్నాయి. దీంతో ప్రజాధనం వృథా అవుతోంది. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి – పీటా నాగమోహన్కృష్ణ, వైఎస్సార్సీపీ రేపల్లె సమన్వయకర్త -
నాణ్యత నాస్తి.. కమీషన్లు జాస్తి
రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వం నుంచి రూ.కోట్లు నిధులు మంజూరు చేయించుకుని, కాంట్రాక్టరుగా తామే అవతారం ఎత్తుతున్నారని టీడీపీ నాయకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ కాంట్రాక్టర్లకు అప్పగించినా భారీగా కమీషన్లు దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కనుసన్నల్లోనే సాగుతోందన్న ఆరోపణలు ముదురుతున్నాయి. అభివృద్ధి పేరుతో నిధులు తెచ్చి నాణ్యత లేని పనులు చేయించడం ద్వారా ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధ్వానంగా పరిస్థితి తాజాగా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇసుకపల్లి నుంచి నిజాంపట్నం వరకు రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి నెలలు గడవకముందే గుంతలమయంగా మారడం తీవ్ర చర్చకు దారితీసింది. నూతనంగా వేసిన రోడ్డు ఇలా త్వరగా దెబ్బతినడం నాణ్యత ప్రమాణాలను పాటించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది నెలల క్రితం ప్రారంభించి హడావుడిగా పల్లపట్ల గ్రామం వరకు పూర్తి చేశారు. పూర్తయిన రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కిలేరు నుంచి సజ్జవారిపాలెం వరకు రహదారి ఒక్క వర్షానికే ఛిద్రమైపోవడం నిర్మాణ లోపాలను బట్టబయలు చేస్తోంది. ఈ రహదారి పనుల వెనుక భారీ స్థాయిలో కమీషన్ వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు స్థానికంగా హాట్టాపిక్గా మారాయి. కాంట్రాక్టర్ నుంచి రాజకీయంగా ప్రభావశీలుల పేరుతో భారీ వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ల ఒత్తిడితోనే నాణ్యతను పూర్తిగా తాకట్టు పెట్టి పనులు చేపట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాగితాలకే పరిమితమైన తనిఖీలు, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేయడం కలిపి ఈ దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన రహదారి నెలల వ్యవధిల్లోనే శిథిలమవడంపై ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు. గోతులమయం ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్లు పనులు ఇలా గోతుల పాలవుతున్నా బాధ్యులపై చర్యలు లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రేపల్లె ప్రాంతంలో జరుగుతున్న పనుల నాణ్యతపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ప్రజల డబ్బుతో జరిగే అభివృద్ధి ఇలాగే నాసిరకంగా ఉంటే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పనులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
క్రీడాకారులకు కలెక్టర్ అభినందనలు
బాపట్ల: అమరావతి చాంపియనన్ షిప్–2026 పోటీలలో బాపట్ల జిల్లా క్రీడాకారులు పలు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. గత నెల 24 నుంచి 29వ తేదీ వరకు తిరుపతిలో జరిగిన చాంపియన్షిప్ పోటీలలో పలు విభాగాల్లో జిల్లా క్రీడాకారులు ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ మంగళవారం స్థానిక కలెక్టరేట్లో అభినందించారు. క్రీడాకారులు తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటూ అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి శ్రీనివాస్, కోచ్లు, రాధాకృష్ణ, వెంకట్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
చెరువును పరిశీలించిన ఇరిగేషన్ ఎస్ఈ
సత్తెనపల్లి: పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే లక్కరాజుగార్లపాడు రోడ్లోని చెరువును ఇరిగేషన్ ఎస్ఈ టీ రమేష్ మంగళవారం పరిశీలించారు. కాలువల నుంచి విడుదలైన నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెరువు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును ఆయన పరిశీలించి ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఇరిగేషన్ ఈఈ మురళీధర్, ఏఈ సుందర్రావు, మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ బి.మధుసూదనరావు, ఏఈ సాగర్మరియరాజు, సిబ్బంది ఉన్నారు. గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న రెండు నెలలపాటు తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారిత, ఉత్పత్తుల తయారీ వంటి కోర్సులు నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించి కోర్సుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ సదుపాయం కంప్యూటర్, ఆండ్రాయిడ్ సెల్ఫోన్, ఐపాడ్ కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీగా నిర్ణయించారన్నారు. ఆసక్తి కలిగినవారు మరిన్ని వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్ను గానీ, 70366 89346, 91822 45693 ఫోన్ నంబర్లనుగానీ ఉదయం 9–సాయంత్రం 7 గంటల వరకు సంప్రదించాలన్నారు. గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్లో కాంట్రాక్టు ఉద్యోగులు ఆగస్టు 21 వ తేదీ నుంచి పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జీజీహెచ్లో నల్లమాస్క్లు ధరించి నిరసన తెలియజేశారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలన్నారు. బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్నర్సులు రమాదేవి, సుజిత, హైమావతి, శైలజ, భార్గవి, అంజలి, ల్యాబ్ టెక్నీషియన్లు ఖాసీం, రమేష్, వాణి, ఆదిలక్ష్మి, శైలజ, ఫార్మాసిస్టులు శ్రీలక్ష్మి, సుజాత, అశ్విని తదితరులు పాల్గొన్నారు. గుంటూరు లీగల్: అక్షరాలు జీవితాన్ని మార్చగలవని, చదువుకున్న సమాజం దేశ భవిష్యత్తును మార్చగలదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం కాదన్నారు. హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకోవడం అన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఒకరినైనా అక్షరాస్యులుగా మార్చేందుకు మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఎం.వెంకట రమణప్ప, జిల్లా బాలల పరిరక్షణ సంస్థ అధికారి సీహెచ్ విజయ్కుమార్, డీపీఓ పి.వి.నాగసాయికుమార్, సోషల్ వెల్ఫేర్ శాఖ సూపరింటెండెంట్ కె.మధుసూదన్, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎ.పద్మావతి, ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపండి
బాపట్లటౌన్ : ప్రభుత్వం ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ సభ్యులు కూరపాటి సత్యంరాజు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బాపట్ల ఏరియావైద్యశాల ప్రాంగణంలోని అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహం ముందు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని మోకాళ్లపై నిరసన తెలిపారు. సత్యంరాజు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ సంఘంతో ప్రభుత్వం చర్చలు జరిపి నెల రోజుల సమయం ఇవ్వాలని కోరగా ప్రధాన డిమాండ్లు రెగ్యులరైజేషన్, రెగ్యులర్ అయ్యేంతవరకు 100 శాతం గ్రాస్ జీతాన్ని పొందెంతవరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో స్టాఫ్నర్స్లు అనూష, తబిత, ఫార్మాసిస్ట్లు నళిని, శాంతి మనోజ, ల్యాబ్ టెక్నీషియన్లు నీలిమ, సునీత, బయో మెడికల్ ఇంజినీర్ నళిని కుమారి పాల్గొన్నారు. -
శక్తి టీం గ్రామస్థాయిలో సేవలు అందించాలి
డీఎస్పీ పి.జగదీష్ బాపట్ల టౌన్: ఇప్పటివరకు శక్తి బృందాల సేవలు పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయని, ఇకపై వీరి సేవలను గ్రామీణ స్థాయికి కూడా విస్తరించి, పోలీస్ శాఖ అందిస్తున్న సేవలపై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ సూచించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్ ఆధ్వర్యంలో జిల్లాలోని శక్తి బృందాలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహిళలు, చిన్నారులు, గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులకు శక్తి బృందాల ద్వారా అందించాల్సిన సేవల గురించి తెలిపారు. డీఎస్పీ పి.జగదీష్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న నాలుగు శక్తి బృందాల విధుల గురించి దిశా నిర్దేశం చేశారు. పాఠశాల విద్యార్థులకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ గురించి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.సుబ్బారావు, ఎస్ఐ చెన్నకేశవులు, ఉమెన్ ఎస్ఐ చంద్రావతి, శక్తి టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సర్వే
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో మంగళవారం కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానిత కేసులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపి వైద్యులచే వ్యాధి నిర్ధారణ చేసి వెంటనే ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. అనంతరం పోస్టర్, కరపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ వి సోమ్లానాయక్, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదిక్, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వర్ణ భవిత పాఠశాల చిన్నారులకు యూడీఐడీ ఇవ్వాలి స్వర్ణ భవిత పాఠశాలలోని చిన్నారులకు యునిక్ డిజేబుల్ ఐడీ కార్డులు(యు.డి.ఐ.డి.) ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. స్వర్ణ భవిత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని గదులను పరిశీలించారు. ఆధునికీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్వర్ణ భవిత పాఠశాలలోని చిన్నారులకు ఐడీ కార్డులు నమోదు ప్రక్రియ తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్సింగ్, జోత్స్న, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల కోఆర్డినేటర్ యశ్వంత్, ఆధార్ జిల్లా కోఆర్డినేటర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది రోజుల్లోపు భూ సమస్య పరిష్కరించాలి భూమి సమస్యను ఎనిమిది రోజుల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తహసీల్దార్ను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్ ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ప్రజాప్రతినిధులకు వచ్చిన దరఖాస్తులను స్వయంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ శ్రీకారం చుట్టారు. చెంచు రామారావు దరఖాస్తు పరిశీలించారు. ఏ ప్రాంతంలో సమస్య, దరఖాస్తు చేసుకున్న తేదీ, ఇప్పటివరకు జరిగిన పురోగతి, పరిష్కరించాల్సిన గడువుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి నేరుగా దరఖాస్తుదారుడికి కలెక్టర్ ఫోన్ చేసి మాట్లాడారు. అదే క్రమంలో తహసీల్దార్తోనూ ఆయన మాట్లాడారు. ఆక్రమణలు తొలగించి భూమి యజమానికి భూమిపై హక్కు కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నిజాంపట్నం మండలం దిండి గ్రామం సర్వే నంబర్ 426 లో పిన్ని బోయిన చెంచు రామారావు 3.12 ఎకరాల భూమిని మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారు. సదరు భూమిని రామారావు సాగు చేసుకుంటుండగా ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 96 సెంట్ల భూమిని ఆక్రమించారని తొలుత వీఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారుడ్ని తొలగించలేకపోవడంతో చెంచు రామారావు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆక్రమణలు తొలగించి నా భూమి నాకు ఇప్పించాలని కలెక్టర్కు విన్నవించారు. ఆక్రమణదారునికి నోటీసులు ఇవ్వడం, ఏడు రోజుల్లో క్షేత్రస్థాయిలో విచారించి, ఎనిమిదో రోజున పరిష్కరిష్కరించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు–మన బాధ్యత ప్రకృతి వైపరీత్యాలు–మన బాధ్యత, బీచ్ల పరిశుభ్రత అంశాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రూపొందించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ మంగళవారం విడుదల చేశారు. ఎల్ నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో రిసోర్స్ సెంటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ హేమలత, ఏరియా కోఆర్డినేటర్లు వి.భగవాన్దాస్, ఎన్ శ్రీలత, టి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
‘రేపల్లె’ కరువు ప్రాంతంగా ప్రకటించాలి
బాపట్ల: రేపల్లె నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ రేపల్లె సమన్వయకర్త పీటా నాగ మోహన్కృష్ణ కోరారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ను సోమవారం కలిసి వినతి పత్రం అందించారు. పీటా నాగ మోహన్కృష్ణ మాట్లాడుతూ వరి ప్రధాన పంటగా ఉన్న రేపల్లె ప్రాంతంలో 70 వేల ఎకరాలు సాగు భూమి ఉండగా ఇప్పటి వరకు కనీసం 20 వేల ఎకరాలలో కూడా నాట్లు పడలేదని వివరించారు. నాట్లు వేసుకున్న పైరు కూడా ఎండిపోయిందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వాతావరణ పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రైతుకు నష్టపరిహారం అందించాలని కోరారు. రైతులకు ప్రత్యామ్నాం చూపిన తరువాతనే క్రాఫ్హాలిడే ప్రకటించాల్సి ఉండగా కొంత సేద్యం ప్రారంభమై తరువాత క్రాఫ్హాలీడే ఏవిధంగా నిర్ణయిస్తారో చెప్పాలని ఆయన కోరారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో మండల కన్వీనర్లు ఇంకొల్లు రామకృష్ణ, మేడికొండ అనిల్, దుండి వెంకటరామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్ మోహన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిలు చిత్రాల ఓబెదు, చిమటా బాలాజీ, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కొక్కిలిగడ్డ రవి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి సన్నీ, రాష్ట్ర ఎస్టీ సెల్ అధికార ప్రతినిధి చౌటురి రమేష్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొర్రా వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి లుక్కా బాపనయ్య ఉన్నారు. -
నగర ఖాళీల సంస్థ!
సిబ్బంది నిల్.. ఒత్తిడి ఫుల్.. అవినీతి హల్చల్ అవినీతికి ‘ఇన్చార్జ్’లునెహ్రూనగర్: రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ)ను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రచారం తప్ప క్షేత్రస్థాయిలో పాలనను పట్టించుకోని సర్కారు వైఖరితో నగరంలో పౌరసేవలు అటకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం సేవలందించాల్సిన స్థానిక సంస్థను ఖాళీల సమస్య దారుణంగా వేధిస్తోంది. మొత్తం 110 మంజూరైన క్యాడర్ పోస్టుల్లో ప్రస్తుతం కేవలం 46 మంది మాత్రమే విధుల్లో ఉండగా, ఏకంగా 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 58 శాతానికి పైగా పోస్టులను భర్తీ చేయకుండా గాలికొదిలేయడంతో పరిపాలన పూర్తిగా గాడి తప్పింది. ఎన్నికల నిర్వహణ ఎలా? ఒకపక్క స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్ చివరినాటికి నిర్వహించాలని ప్రభుత్వం ముమ్మరంగా యోచిస్తోంది. అయితే కార్పొరేషన్లో సిబ్బంది కొరతతో ఈ ఎన్నికల నిర్వహణ ఏ విధంగా సాధ్యమనేది ఇప్పుడు ‘మిలియన్ డాలర్ల ప్రశ్న’గా మారింది. ఉన్న సిబ్బందిని ప్రభుత్వం ఎడాపెడా అదనపు బాధ్యతలతో ముంచెత్తుతోంది. ఓటర్ల జాబితా తయారీ కోసం, బీఎల్ఓ డ్యూటీలు, రోజుకో సర్వే చేయమంటూ ప్రభుత్వ ఆదేశాలు, వీటికితోడు నగర ప్రజల రోజువారీ దరఖాస్తులు, రెగ్యులర్ డ్యూటీలతో ఉద్యోగులు ఊపిరిసలపక నానా తంటాలు పడుతున్నారు. ఎస్ఈ విధుల్లోకి.. వస్తారా.. రారా? ఇంజినీరింగ్ సూపరింటెండెంట్ జి.వెంకటేశ్వర్లు గత రెండు నెలల క్రితం సెలవుపై విదేశాలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఈఈ సుందరామిరెడ్డి ఇన్ఛార్జ్ ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఇంజినీరింగ్ సెక్షన్లో దొంగ టెండర్లు, ‘లెస్’ మాయాజాలం సృష్టించి ప్రభుత్వ ఖజానాకు, కార్పొరేషన్కు కోట్ల రూపాయల నష్టం చేకూర్చిన వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టింది. ఈ వ్యవహారం నగరంలో తీవ్ర దుమారం రేపింది. ఏసీబీ తనిఖీలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం సెలవుపై వెళ్లిన ఎస్ఈ తిరిగి విధుల్లోకి చేరతారా లేదా? అన్న అనుమానాలను సిబ్బందే బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 18 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు గాను 13 ఖాళీగా ఉన్నాయి. కేవలం ఐదుగురితో ఇంత పెద్ద నగరంలో రోడ్లు, కాలువల పనులను పర్యవేక్షించడం అసాధ్యంగా మారింది. ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ పోస్టు కూడా ఖాళీగానే ఉంది. చేరిన నెలరోజుల్లోనే లీవ్లోకి ఏసీ.. కార్పొరేషన్లో కీలకమైన అదనపు కమిషనర్ పోస్టు కూడా నిలకడలేకుండా పోయింది. కమిషనర్ తర్వాత కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన అదనపు కమిషనర్ ఐ.కిషోర్ విధుల్లో చేరిన కొద్దిరోజులకే అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిపోయారు. అడిషనల్ కమిషనర్ (జీఎస్డబ్ల్యూఎస్) పోస్టు ఇప్పటికే ఖాళీగా ఉంది. డిప్యూటీ డైరెక్టర్ వంటి ఉన్నత స్థానాల్లోనూ ఎవరూ లేరు. కీలక అధికారులంతా సెలవులపై వెళ్లడం, పోస్టులు భర్తీ కాకపోవడంతో కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చే దరఖాస్తులు ఫైళ్ల రూపంలో మూలనపడుతున్నాయి. సంతకాలు పెట్టే దిక్కులేక పాలనాపరమైన అనుమతులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. టౌన్ ప్లానింగ్ బేజారు.. అక్రమ నిర్మాణాల జోరు అక్రమ కట్టడాలను నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం ఖాళీల అడ్డాగా మారింది. ఏకై క టౌన్ప్లానింగ్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది. 13 టీపీ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టులు ఉండగా ఒక్కరూ విధుల్లో లేరు. తొమ్మిది టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ పోస్టుల్లో ఏకంగా ఏడు ఖాళీలే. నాలుగు అసిస్టెంట్ సిటీ ప్లానర్ పోస్టుల్లో రెండు ఖాళీగా ఉన్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడి, ఇన్ఛార్జ్ల అండదండలతో నగరంలో అక్రమ లేఅవుట్లు, నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం గుంటూరు నగర పాలనను మాత్రం పూర్తిగా గాలికొదిలేసింది. నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వైద్య విభాగంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్పొరేషన్లో మంజూరైన ఐదు మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో ఒక్కరూ పనిచేయడం లేదు. మొత్తం ఐదు పోస్టులూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. పారిశుద్ధ్య విభాగంలో ముగ్గురు శానిటరీ సూపర్వైజర్ పోస్టుల్లో ఒక్కరూ లేరు. 24 శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను కేవలం ఎనిమిది మంది మాత్రమే పనిచేస్తుండగా, 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న కీలక స్థానాల్లో రెగ్యులర్ అధికారులను నియమించకుండా, ఉన్న అరాకొర సిబ్బందికే ప్రభుత్వం ఇన్ఛార్జ్ బాధ్యతలను కట్టబెడుతోంది. అయితే ఈ తాత్కాలిక పాలన నగరంలో అవినీతి దందాలకు రాచబాటగా మారింది. అదనపు పోస్టులను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం,ఫైళ్ల క్లియరెన్స్ పేరుతో సామాన్యులను, వ్యాపారులను నిలువునా పిండుకుంటున్నారు. ఎవరిపై నిఘా లేకపోవడం, రేపోమాపో ఇంకొకరు వస్తారనే ధీమాతో విచ్చలవిడిగా ‘ముడుపుల’ దందా నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
దురుసుగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలి
వృద్ధురాలికి ప్రజాసంఘాల నాయకుల పరామర్శ చీరాల: వృద్ధురాలిపై టూటౌన్ సీఐ శశికుమార్ దురుసుగా ప్రవర్తించి అసభ్యపదజాలంతో దూషించిన ఘటనపై ఎరుకుల హక్కుల పోరాట సమితి నాయకులు, ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల నాయకులు స్పందించారు. సోమవారం ఆమె ఇంటికి వెళ్లి ఘటనకు సంబంధించి వివరాలను ఆమెను అడిగి తెలుసుకున్నారు.వారు మాట్లాడుతూ.. వృద్ధురాలిని అసభ్యంగా దూషించిన సీఐపై చర్యలు తీసుకోకుంటే ప్రజాసంఘాలతో కలిసి దశలవారీగా ఉద్యమిస్తామన్నారు. ఈ ఘటనతో వృద్ధురాలు తీవ్ర భయాందోళనకు గురైందని, పోలీస్ అధికారి ఇలా ప్రవర్తించడం అత్యంత ఆందోళనకరమన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే సంయమనం పాటించకుండా దూషణలకు దిగడం సరికాదన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. పోలీసులు చట్టాలకు అతీతులు కారని, టూటౌన్ సీఐపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే విచారణ జరిపి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్.మోహన్కుమార్ ధర్మా, బలహీనవర్గాల సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శవనం శామ్యూల్, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు బి.లక్ష్మీనరసయ్య, డి.వందనం, వైహెచ్పిఎస్ నాయకులు మొగిలి ప్రతాప్, కె.ఉమాదేవి, మొగిలి శబరి, బ్రహ్మయ్య, పి.పోలయ్య, ప్రవీణ్ పాల్గొన్నారు. డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు డిమాండ్ గుంటూరు మెడికల్: డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య ప్రవేశాలకు 2020 డిసెంబరు 4న విడుదల చేసిన జీఓఎంఎస్ నంబరు 151ని అమలు కొనసాగించాలని, 2026 జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 102ను పునః పరిశీలించాలని మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం అమరావతి రోడ్డులోని ఆలా ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. జీవో ఎంఎస్ నంబరు 102తో నిబంధనలు డబ్ల్యూపీ నంబరు 11018/2019లో ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయన్నారు. నిపుణుల కమిటీ సిఫార్సు ఆధారంగా 2020 డిసెంబరు 4న ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబరు 151ని జారీ చేసిందన్నారు. జీఓ నంబరు 102 రిజర్వు కేటగిరికి చెందిన విద్యార్థులకు నష్టం కలిగించడమే కాకుండా సుప్రీం కోర్టు నిర్దేశించిన సూత్రాలను ఉల్లంఘించినట్లు కనిపిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే జూలై 30న విడుదల చేసిన జీఓ ఎంఎస్ నంబరు 102లోని నిబంధనలను పునః పరిశీలించాలని, కౌన్సెలింగ్ ప్రక్రియలో అన్ని ఎంపికల విధానాన్ని కొనసాగించాలని, జీఓ 151ని మార్పులు చేయకుండా అమలు చేయాలని కోరారు. -
వైభవంగా వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవం
నగరంపాలెం: స్థానిక నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కొలువైన శ్రీవీరభద్రస్వామి ఆలయ 25వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కు పోలీస్ అధికార, సిబ్బంది ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఏఆర్ డీఎస్పీ శంకరయ్య దంపతులతోపాటు జిల్లా ఎస్పీ స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఆలయ పూజారి వంశీ బృందంలోని ఐదుగురు వేద పండితులు ప్రత్యేక హోమం, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమం, కుటుంబాల శ్రేయస్సు, జిల్లా ప్రజల శాంతి భద్రతలు సక్రమంగా కొనసాగాలని స్వామి వారిని కోరుకున్నట్లు చెప్పారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం వందలాది మందికి అన్నదానం చేశారు. డీఎస్పీలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), శంకరయ్య (ఏఆర్) దంపతులు, ఏఆర్ ఆర్ఐలు శ్రీనివాస్రెడ్డి, కృష్ణయ్య, ఆర్ఎస్ఐలు, ఏఆర్ ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, పీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
251 మందికి ఫోన్లు అందజేసిన ఎస్పీ
బాపట్లటౌన్: మొబైల్ ఫోన్ల వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వరరావు సూచించారు. మొబైల్ఫోన్లను పోగొట్టుకున్న 251 మంది బాధితులకు సోమవారం ఫోన్లను అందజేశారు. వాటి విలువ రూ.50.20 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు ఏడు విడతల్లో ఫోన్లను అందజేసినట్లు తెలిపారు. ఏడు విడతల్లో రూ.3,14,40,000 విలువైన 1572 మంది ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. ఫోన్ పోయినా, దొంగిలించబడినా ఆ సమాచారాన్ని తిరిగి పొందడం చాలా కష్టసాధ్యమవుతుందన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోన్లు రికవరీ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లలో ఇచ్చే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోయిన ఫోన్లను వేగంగా రికవరీ చేస్తున్నామన్నారు. ప్రతి నెలా ‘మొబైల్ రికవరీ మేళా‘ నిర్వహించి బాధితులకు ఫోన్లను అందజేస్తున్నామన్నారు. గతంలో మొబైల్ రికవరీ శాతం 30 ఉండగా ప్రస్తుతం 72 శాతానికి పెంచడం జరిగిందన్నారు. 100 శాతం మొబైల్ ఫోన్ లను రికవరీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్.సుధాకర్, బాపట్ల డీఎస్పీ సిహెచ్.చంద్రమౌళి, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్నాయక్, సోషల్మీడియా సెల్ ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ, ఎస్బీ సీఐ నారాయణ, ఐటీకోర్ టీమ్ ఎస్ఐలు నాగేశ్వరరావు, అనూషా, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
పాఠశాల కోసం రూ.80 లక్షల భూదానం
మార్టూరు: ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం మండలంలోని నాగరాజుపల్లి గ్రామానికి చెందిన దాత దాసం సత్యనారాయణ సుమారు రూ.80 లక్షల విలువైన 65 సెంట్ల సొంత భూమిని జిల్లా పరిషత్కు విరాళంగా అందజేశారు. గ్రామంలో దశాబ్ద కాలంగా హైస్కూలుకు సరైన స్థలం లేకపోవడంతో విద్యార్థులు ప్రాథమిక పాఠశాల భవనంలోనే సర్దుకుంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన సత్యనారాయణ ముందుకొచ్చి, పాఠశాల కోసం తన విలువైన భూమిని గత శనివారం జిల్లా పరిషత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను సోమవారం జిల్లా పరిషత్ సీఈవో బి.చిరంజీవికి అందజేశారు. విద్యార్థుల భవిష్యత్ కోసం స్థలాన్ని విరాళంగా అందించిన దాత సత్యనారాయణను సీఈఓ చిరంజీవి ఘనంగా సన్మానించి అభినందించారు. బాపట్ల: బాపట్ల జిల్లా పరిషత్ కార్యాలయానికి టీటీడీ కళ్యాణ మండపాన్ని ఇవ్వటానికి ప్రతిపాదనలు సిద్ధం చేయటం సరికాదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పేరంగరుడాచలం నాయుడు దాతృత్వంతో ఇచ్చిన స్థలంలో పేదలు తక్కువ ఖర్చుతో వివాహాలు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన కళ్యాణమండపాన్ని జిల్లా పరిషత్ కార్యాలయానికి కేటాయించటం సరికాదన్నారు. దాతల స్థలాలను ఇష్టమొచ్చినట్లు కార్యాలయాలు ఏర్పాటు చేయటం వలన ఆయన కోర్కెలకు విఘాతం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులు ఇప్పటికై న ఈవిషయంపై పునరాలోచన చేయాలని సూచించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, బల్లిరెడ్డి ఉన్నారు. నగరం: నగరం పోలీస్స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన స్నేహితుడి హత్య కేసులో నిందితుడు కంచర్ల శశికుమార్కు గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్న్స్ కోర్టు సోమవారం జీవిత ఖైదు ,రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. మండలంలోని ఉల్లిపాలెం గ్రామానికి చెందిన మేకల ప్రేమ్కుమార్ తన స్నేహితులు చెరుకుపల్లికి చెందిన కంచర్ల శశికుమార్, మహమ్మద్ షాహూల్ అఫ్రిదిలతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో నిందితులు ఇనుప రాడ్డుతో ప్రేమ్కుమార్ తల, వీపుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకునేందుకు వచ్చిన భార్య ఎస్తేరురాణిపై కూడా దాడి చేశారు. చికిత్స పొందుతూ బాధితుడు 04.12.2021న మృతి చెందాడు. భార్య ఎస్తేరురాణి ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి బాపట్ల డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. సాకా్ష్య్లు సేకరించి 28.02.2022న కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో ప్రస్తుత రేపల్లె డీఎస్పీ అజీజ్ పర్యవేక్షణలో పోలీసులు సాక్షులను హాజరుపరచి బలమైన ఆధారాలు సమర్పించగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ మోబీనా బేగం సమర్థంగా వాదనలు వినిపించారు. దీంతో నిందితుడిపై నేరం రుజువై శిక్ష ఖరారైంది. ఈ కేసులో దర్యాప్తు, ట్రయల్ పర్యవేక్షణలో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు. మరో నిందితుడు మహమ్మద్ షాహూల్ అఫ్రిది ఇప్పటికే మృతి చెందాడు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
అర్జీలను సత్వరం పరిష్కరించండి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో అర్జీదారులు అందజేసిన అర్జీలు పరిశీలించి పెండింగ్ లేకుండా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చుండూరు, భట్టిప్రోలు మండలంలో అర్జీదారులు అందజేసిన సమస్యలను పరిష్కారం చేయకపోవడానికి గల కారణాలను తహసీల్దార్, ఎంపీడీఓలను ప్రశ్నించారు. యద్దనపూడి మండలంలో గత సోమవారం న ఎందుకు అర్జీలను రిజిస్ట్రేషన్ చేయలేదని ప్రశ్నించారు. ప్రతి సోమవారం మండల కార్యాలయాల్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యల అర్జీలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్లో ప్రజలు అందజేసే సమస్యలకు సంబంధించి అర్జీదారులతో సంబంధిత అధికారులు మాట్లాడి వారి సమస్యలను పరిష్కారం చేయాలన్నారు. అర్జీదారులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు సూచించారు. గత వారంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్ను జిల్లా కలెక్టర్, ఇన్చార్జి ఆర్డీఓ సత్కరించి, అభినందించారు. వచ్చిన ప్రతి అర్జీని నిశితంగా తానే పరిశీలించిన తదుపరి నాణ్యతతో పరిష్కరిస్తున్నామని పీడీ కలెక్టర్కు వివరించారు. పరిష్కార మార్గంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం ద్వారా అవార్డు దక్కిందన్నారు. అధికారులు, సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమైందని పీడీ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లవన్న, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ఎల్.ప్రభాకరరావు, సీపీఓ ఏ.ఎస్.రాజు, డీఆర్డీఏ, డ్వామా, మెప్మా, గృహ నిర్మాణ సంస్థ పీడీలు బి.సింగయ్య, విజయలక్ష్మి, ఆనంద్ సత్య పాల్, వెంకటేశ్వరరావు, డీఈ ఓ.శ్రీనివాస్, మార్క్ఫెడ్ డీఎం కరుణశ్రీ, డీసీహెచ్ ఎస్.పద్మావతి, డీటీసీ పరంథామరెడ్డి, జీఎండీఐ సి.రామకృష్ణ, జిల్లా ఖజానా అధికారిణి పద్మావతి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జగన్మోహన్ పాల్గొన్నారు. -
చిరకాల స్వప్నం సాకారం
పిడుగురాళ్ల రూరల్: పల్నాడు చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కతమైంది. దశాబ్దాలుగా వైద్య విద్యకు అందనంత దూరంగా ఉన్న ఈ ప్రాంతవాసుల చిరకాల స్వప్నం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి, గురజాల నియోజవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డిల కృషితో నేడు వాస్తవరూపం దాల్చింది. పిడుగురాళ్ల మండలం కామేపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాల పర్వం అధికారికంగా ప్రారంభమైంది. వైఎస్ జగన్ కృషితోనే సాకారం వైద్య సేవల కోసం, వైద్య విద్య కోసం పల్నాడు ప్రజలు గుంటూరు, విజయవాడ, బెంగళూరు, చైన్నె, విశాఖపట్నం, హైదరాబాదు వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా పల్నాడు ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పిడుగురాళ్ల మండలం, కామేపల్లి గ్రామంలో అత్యాధునిక వసతులతో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఈ ప్రాజెక్ట్ సాధనలో అప్పటి గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. కామేపల్లిలో కాలేజీ ఏర్పాటు కోసం భూసేకరణ నుంచి ప్రభుత్వ అనుమతులు, నిధుల మంజూరు వరకు ప్రతి అడుగులోనూ ఆయన పట్టుదలగా శ్రమించారు. స్థానికంగా భవన నిర్మాణాలు వేగవంతం కావడంలోనూ, ఈ ప్రాజెక్ట్ను పల్నాడు గడ్డపై సాకారం చేయడంలోనూ ఆయన చూపిన నాయకత్వ పటిమ మరువలేనిది. ముగిసిన కౌన్సెలింగ్ జాతీయ వైద్య కమిషన్ అనుమతులతో కౌన్సెలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కౌన్సెలింగ్ ద్వారా తొలి విడతలో భాగంగా 22 మంది విద్యార్థులు పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ప్రవేశాలు పొందారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి క్లాసులు మొదలవుతాయి. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్ పొందడం ద్వారా వినుకొండ ప్రాంతానికి చెందిన విద్యార్థిని ఎస్.సన్నీ సరికొత్త చరిత్ర సృష్టించారు. వెనుకబడిన ప్రాంతంగా పేరున్న పల్నాడు గడ్డపైనే స్థానికంగా వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కడంతో విద్యార్థిని కుటుంబంలోనూ, పల్నాడు ప్రాంతంలోను హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో గ్రీన్ వాక్
గుంటూరు మెడికల్: స్వచ్ఛ వాయువు దివస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు నగరంలో గ్రీన్ వాక్ నిర్వహించారు. స్థానిక బృందావన్గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం నుంచి గుజ్జనగుండ్ల వరకు గ్రీన్వాక్ నిర్వహించారు. రవాణా శాఖ, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది, పరిశ్రమల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు గ్రీన్వాక్లో పాల్గొన్నారు. స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ, వాయువు కాలుష్య నియంత్రణకు తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. గ్రీన్వాక్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మానవ హారం నిర్వహించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు నిలిపిన వేసిన సమయంలో ఇంజన్లను ఆన్లైన్లో ఉంచకుండా ఆఫ్ చేసి ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజినీర్ నజీనా బేగం అన్నారు. వాహనాల ఇంజిన్లు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఆఫ్ చయడం వల్ల వాయువు కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలన్నారు. కాలుష్య నియంత్రణ ప్రభుత్వ శాఖల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు, వాహనదారులు, పరిశ్రమల నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సమష్టి కృషితోనే స్వచ్ఛమైన గాలి లక్ష్యాన్ని సాధించగలమన్నారు. విజయపురిసౌత్/నరసరావుపేట: జలవనరుల శాఖ ఫుల్ అడిషనల్ ఎస్ఈగా టి.రమేష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎస్ఈగా పనిచేసిన వెంకటరత్నం గుంటూరుకు బదిలీ కావడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఈఈ గా విధులు నిర్వర్తిస్తున్న టి రమేష్ అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జలవనరుల శాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అడిషనల్ ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన టి రమేష్ను ఇరిగేషన్ ఈఈ లు, డీఈలు, జేఈలు, ఉద్యోగులు అభినందించారు. మ్యూజికల్ నైట్కు హాజరుకానున్న దర్శకుడు బోయపాటి ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం 5కె రన్, వాక్ నిర్వహించనున్నారు. అందుకుగాను వర్సిటీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు కలిపి సుమారు 6 వేల మంది ఉత్సాహంగా పాల్గొననున్నారు. క్రీడా మైదానంలో సాయంత్రం 4 గంటలకు నుంచి ప్రారంభమయ్యే 5కే రన్–వాక్ క్యాంటీన, రవీంద్రనాథ్ ఠాగూర్ పరిపాలనా కార్యాలయం, అబ్దుల్ కలాం విగ్రహం, బాలికల హాస్టల్ గేట్ మీదుగా సాగుతుంది. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకూ జరిగే మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాసరావు హాజరు కానున్నారు. అలానే పాడుతా తీయగా ఫైనలిస్ట్ సూర్య కార్తీక్, శ్రీలత బృందం సంగీత విభావరి అందించనున్నారు. పాటలు, నృత్యాలతో పాటు వర్సిటీ విద్యార్థుల కళా ప్రదర్శనలు అలరించనున్నాయి. ప్రత్తిపాడు: ప్రమాదవశాత్తూ కారు అగ్నికి ఆహుతైన ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... ప్రత్తిపాడుకు చెందిన చేరెడ్డి శ్రీనివాసరరావు తన కుమార్తెను హైదరాబాద్కు చెందిన పుసులూరి దిలీప్కు ఇచ్చి వివాహం చేశాడు. వారిద్దరూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. పిల్లలకు పాఠశాల సెలవులు కావడంతో కుమార్తె ప్రత్తిపాడుకు వచ్చి తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అల్లుడు తన టయోటా కారును ఇంటి వద్ద నిలిపి ఉంచిన సమయంలో ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతై పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన కారును ఎస్ఐ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాఫ్ట్బాల్ జూనియర్ బాలబాలికల జట్లు ఎంపిక
పెదకాకాని: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెదకాకాని ఏకలవ్య నగర్లోని రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు శనివారం రాత్రి తనిఖీలు చేసిన పోలీసులు సుమారు పది క్వింటాళ్ల బరువు కలిగిన 23 రేషన్ బియ్యం బస్తాలను సీజ్ చేశారు. స్థానికంగా నివసించే మేడా కుమారి ఇళ్ల వెంట తిరిగి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలిని పోలీసు స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో పోలీసులు నాగేశ్వరరావు, మల్లేశ్వరరావు, ఇర్ఫాన్లు పాల్గొన్నారు. 15లోపు పేరు నమోదుకు అవకాశం మధురానగర్(విజయవాడ సెంట్రల్): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఈనెల 27వ తేదీ నిర్వహించనున్న శతాధిక వృద్ధుల సన్మానోత్సవానికి అర్హులు ఈ నెల 15వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్, వైస్ చైర్మన్ తేజ్రాజ్ సోలంకి కోరారు. విజయవాడ దుర్గాపురం విజయ్ నర్సింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన మీడిమా సమావేశంలో వారు మాట్లాడారు. తాము ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన శతాధిక వృద్ధులను గుర్తించి సత్కారం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు 93475 72766, 98481 11138 ఫోన్ నంబర్లలో సంప్రదించాల్సిందిగా వారు కోరారు. ఎంపిక చేసిన శతాధిక వృద్ధులను ట్రస్ట్ ఖర్చులతో విజయవాడ తీసుకువచ్చి సత్కారం చేస్తామన్నారు. తిరిగి వారి ఇంటి వద్ద దింపివేయనున్నట్లు తెలిపారు. -
‘ఉత్త మా’ పురస్కారాలు
● అవార్డు పొందిన ముగ్గురు అధ్యాపకులూ సీఎం సామాజిక వర్గమే ● రాష్ట్ర స్థాయి ఎంపిక తీరు చూసి విస్తుపోతున్న విద్యావేత్తలు ● ఇతర సామాజిక వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : అధ్యాపకుల విద్యాపరమైన రికార్డుతోపాటు విద్య, పరిశోధన అంశాలనూ లెక్కలోనికి తీసుకోలేదు. వారు వ్యక్తిగతంగా కనబరిచిన ప్రతిభ, అందుకున్న పురస్కారాలు పట్టించుకున్న పాపాన పోలేదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వారు సమర్పించిన పరిశోధనా పత్రాలు, వాటి ప్రమాణాలు తదితర అంశాలను పరిశీలించలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికై న వారి జాబితా చూస్తే ఇవేమీ కనిపించవు. దీంతో విద్యావేత్తలు విస్తుపోతున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిపాలన, వ్యవస్థాపరమైన అన్ని పదవులు, నియామకాలన్నింటిలోనూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు సామాజిక వర్గానికే అగ్రతాంబూలం అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలో భాగస్వాములమైనప్పటికీ తమకు కనీస ప్రాధాన్యత కూడా ఉండటం లేదని కొన్ని సామాజిక వర్గాలు గతంలో అసంతృప్తి కూడా వ్యక్తం చేశాయి. కానీ అవేమీ పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ, ఏఎన్యూ నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ముగ్గురూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంపిక చేయడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. ఆదర్శంగా నిలవాల్సిన అవార్డుల ప్రక్రియను కూడా ఒక సామాజిక వర్గానికే పరిమితం చేయడం, ముగ్గురూ సైన్స్ కళాశాలకు చెందిన వారే కావడం టీడీపీ ప్రభుత్వ విపరీత ధోరణికి అద్దం పడుతోందని విద్యావంతులు మండిపడుతున్నారు. ఆరోపణలున్నా పట్టింపేదీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనివర్సిటీలో కీలకమైన పరీక్షల నిర్వహణ పదవిని ‘ఉత్తమ’ అవార్డుకు ఎంపికై న ఓ అధ్యాపకుడు నిర్వర్తించేవారు. ఆయన హయాంలో యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది పరీక్ష ప్రారంభానికి ముందే బీఈడీ ప్రశ్నపత్రం లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ లీకేజీ ఘటనపై అప్పట్లో పెదకాకాని పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. ఓ బీఈడీ కళాశాల క్లర్క్ను, కొందరు ఒడిశా విద్యార్థులను నామమాత్రంగా బాధ్యులను చేసి చేతులు దులుపుకొన్నారు. పేపర్ లీకేజీ వంటి ఘటనలు చోటుచేసుకుంటే గతంలో ఆ పదవిలో ఉన్న వారిని యూనివర్సిటీ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అధికారికి మరింత అగ్రపీఠం వేసినట్లు వ్యవహరించారు. ఆ తరువాత కూడా పీజీ ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు తప్పుగా రావడం, చేతిరాతతో ఉన్న ప్రశ్నపత్రాలను జిరాక్స్ తీసి విద్యార్థులకు ఇవ్వడం వంటి అనేక ఘటనలు ఈ అధికారి హయాంలో చోటుచేసుకున్నాయి. ఇక బోధన, పరిశోధన అంశాల్లో ఈ అధ్యాపకుడు కనబరిచిన ప్రత్యేక ప్రతిభ ఏంటని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఈడీ పేపర్ లీక్ జరిగిన సమయంలో విద్యాశాఖ మంత్రి కార్యాలయం చాలా సీరియస్ అయ్యిందని, ఏఎన్యూ ఉన్నతాధికారులను నివేదిక కూడా అడిగిందని అప్పట్లో ప్రచారం చేశారు. కానీ ఆ ఘటన చోటుచేసుకున్న విభాగానికి చెందిన అధికారికి ఇప్పుడు అదే శాఖ నుంచి ఉత్తమ అవార్డును ప్రదానం చేయడం.. లోకేశ్, చంద్రబాబులకు ఉన్న సామాజిక ప్రేమను చాటి చెబుతోందని పలువురు పేర్కొంటున్నారు. -
లలిత పీవీఎస్లో వైద్య విద్యకు ప్రాధాన్యం
గుంటూరు మెడికల్: లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రారంభమైన నాటి నుంచి అకాడమిక్స్, వైద్య వృత్తిపరమైన విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తుందని సంస్థ చైర్మన్, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీవీ రాఘవ శర్మ అన్నారు. ఆదివారం గుంటూరు తక్కెళ్లపాడులోని లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో లలిత సీఎంఈ సిరీస్ లో తొలి కార్యక్రమంలో పెరిఫెరల్ న్యూరోపతిలో ఆధునిక పరిణామాలు అనే అంశంపై సైంటిఫిక్ సీఎంఈ నిర్వహించారు. లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ముంబై బాంబే హాస్పిటల్కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాదిల్కర్ గౌరవ అతిథిగా , లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ డాక్టర్ ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు. డాక్టర్ రాఘవ శర్మ మాట్లాడుతూ వైద్యులు పీజీ వైద్య విద్యార్థుల కోసం లలిత పీవీఎస్ ఇనిస్టిట్యూట్లో క్రమం తప్పకుండా అకాడమిక్ సెషన్లు, క్లినికల్ మీటింగ్స్, నిరంతర వైద్య విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, న్యూరో సైన్సెస్ విభాగాధిపతి డాక్టర్ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ పెరిఫెరల్ న్యూరోపతి వ్యాధుల ప్రాబల్యం నానాటికి పెరిగిపోతుందని చెప్పారు. వ్యాధులను ఏవిధంగా గుర్తించి చికిత్స అందించే విషయాలను వివరించారు. సంస్థ డైరెక్టర్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పోలవరపు నరేన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. బాంబే హాస్పిటల్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ ఖాదిల్కర్ ‘ఎమర్జింగ్ ల్యాండ్ స్కేప్ ఆఫ్ ఇమ్యూనో– మీడియేటెడ్ న్యూరోపతిస్’ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఆర్ మురళీధర్ రెడ్డి ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ డయాబెటిక్ న్యూరోపతిస్ అనే అంశంపై ప్రసంగించారు. హైదరాబాద్ నిమ్స్కు చెందిన డాక్టర్ వై.శిరీష ప్రాక్టికల్ అప్రోచ్ టు పెరిఫెరల్ న్యూరోపతి అనే అంశంపై ప్రసంగించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ మధు నాగప్ప ఇన్ఫెక్షయస్ న్యూరోపతిస్ అనే అంశంపై మాట్లాడారు. ముంబైకి చెందిన డాక్టర్ విన్నీ విల్సన్ ఆధ్వర్యంలో పెరిఫెరల్ న్యూరోపతి పై క్విజ్ నిర్వహించారు. సీఎం ఈ కార్యక్రమానికి 200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. డాక్టర్ తారక్నాథ్, డాక్టర్ యు.వీరమ్మ, డాక్టర్ బి.సాయికృష్ణ, డాక్టర్ గాజుల రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన వైద్యులు, న్యూరాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు, వివిధ మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్కి చెందిన పి.జి వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. -
తుళ్లూరు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ప్రమాదం
తాడికొండ: తుళ్లూరు మండలం రాయపూడి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై భార్యను ఎక్కించుకొని వెళుతున్న సొంగా కృష్ణ (40)ని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడి నలిగి ప్రాణాలొదిలాడు. భార్య పక్కకు పడటంతో ప్రమాదం తప్పింది, కళ్లేదుటే భర్త లారీ చక్రాల కింద నలిగి మృతి చెందడంతో భార్య రోదన మిన్నంటింది. కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు, బంధువులు వాహనాలు అడ్డుగా పెట్టి లారీలను నిలిపివేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుభవం లేని డ్రైవర్లు, యువకులను పెట్టి పరిమితికి మించిన లోడుతో రాజధాని నిర్మాణ పనులకు గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తుండటంతో ప్రమాదాలకు నిలయంగా మారుతుందని, ఇకనైనా సంబంధిత పోలీసు, రవాణా శాఖాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
11న బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
కొరిటెపాడు(గుంటూరు): గ్రామీణ బ్యాంకుల బలోపేతానికి ఐక్య పోరాటం నిర్వహించనున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) అధ్యక్షుడు బీఎస్ రాంబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ అనుబంధ సంస్థగా ఏర్పడిన అనంతరం తొలి జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజ్మెంట్లతో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 11వ తేదీన దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందన లేకుంటే అక్టోబర్ 26వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టే అన్ని పోరాటాలకు ఏఐబీఈఏ సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రుణాల ఎగవేతపై ఆందోళన.. కొన్ని కార్పొరేట్ సంస్థలు తీసుకున్న భారీ రుణాలను ఎగవేయడం వలన ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభనష్టాల ఒడిదుడుకులకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న సంస్థలకు తక్కువ మొత్తానికి సెటిల్మెంట్లు చేయడం వలన బ్యాంకులపై ఆర్థిక భారం పడుతోందని వెల్లడించారు. ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రయత్నాలను బ్యాంకు ఉద్యోగులంతా ఐక్యంగా ఉద్యమాల ద్వారా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నాయని, వాటిని ప్రైవేటు సంస్థలకు అప్పగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపారు. సమావేశంలో మూర్తి, రాధాకృష్ణమూర్తి, నాగపావని, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, వెంకటేష్ తదితర నాయకులు ప్రసంగించారు. నూతన కార్యవర్గం.. అనంతరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం గుంటూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా చైర్మన్గా పీవీ రాఘవరావు, అధ్యక్షుడుగా టి.హరనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డి.షణ్ముఖరావు, కోశాధికారిగా ఎం.నరహరి ఎన్నికయ్యారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, గ్రామీణ బ్యాంకుల బలోపేతం లక్ష్యంగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని నూతన కార్యవర్గం నిర్ణయించింది. -
ప్రజా ఆస్తి.. పచ్చ నేతల పరం
● ఏకంగా 27 సెంట్ల మున్సిపల్ స్థలం రిజిస్ట్రేషన్ ● ఆక్రమిత భూమి విలువల దాదాపు రూ.పది కోట్లపైనే ● ఏఎంజీకి అప్పగించిన స్థలం ఏడుగురి పేరిట రిజిస్ట్రేషన్ యడ్లపాడు: చిలకలూరిపేట పురపాలక సంఘానికి ఆనుకుని ఉన్న పరిధిలోని ప్రజాప్రయోజనాల కోసం నిర్దేశించిన రిజర్వ్డ్ స్థలం అది. కార్మికుల కుటుంబాల పిల్లల విద్య, మధ్యాహ్న భోజనం కోసం ఏఎంజీ స్వచ్ఛంద సంస్థకు అధికారులు అప్పగించారు. కొంతకాలం డే–కేర్ సెంటర్గా కొనసాగిన రూ. పది కోట్ల విలువైన ఆ భూమి ఇప్పుడు యాజమాన్య హక్కుల వివాదంలో చిక్కుకుంది. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న ఈ స్థలం ఏడుగురు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ అయినట్లు పత్రాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలదే ఇందులో కీలక పాత్రగా ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఏంఎజీకి అప్పగించిన ఈ భూమిలోని భవనాన్ని తొలగించి స్థలాన్ని చదును చేయడంతో విషయం మున్సిపల్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సెప్టెంబర్ 4న అధికారికంగా అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టి, స్థలం రక్షణ గేటుకు తాళంతో పాటు మున్సిపల్ అధికారులు సీల్ వేశారు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతోనే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ స్థలాన్ని తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక నిర్ధారణ రావాల్సి ఉన్నప్పటికీ.. మున్సిపల్ ఆస్తిగా అధికారులు స్పష్టం చేస్తున్న భూమికి ప్రైవేటు హక్కులు ఎలా వచ్చాయన్న ప్రశ్నకు రాజకీయ కోణం కూడా తోడవుతోంది. అయితే ఈ స్థలం వాస్తవంగా ఎవరిది? మున్సిపల్ ఆస్తి అయితే ప్రైవేటు వ్యక్తుల పేర్లతో రిజిస్ట్రేషన్ ఎలా జరిగింది? ఒకవేళ స్వచ్ఛంద సంస్థకు గుత్తాధిపత్యం ఉంటే మున్సిపల్ అధికారులు సీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రూ.కోట్ల విలువైన ఈ ఆస్తి వివాదంలో చిక్కుకోవడంపై బాధ్యులెవరనే విషయంపైనే ఇప్పుడు ప్రజల్లో హాట్టాపిక్గా మారింది. ఏఎంజీకి స్థలం అప్పగింత ఇలా... హెచ్హెచ్ డైక్మెన్ నగర్ నివాసితుల కమ్యూనిటీ అవసరాల కోసం ఉద్దేశించిన ఈ రిజర్వ్డ్ స్థలాన్ని 1998లో పురపాలకశాఖ ఏఎంజీ సంస్థకు అప్పగించింది. పారిశుధ్య కార్మికుల పిల్లలకు విద్య, మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్కడ డే–కేర్ సెంటర్ నిర్వహించారు. ఏఎంజీ ప్రధాన దాత జర్మనీకి చెందిన డాక్టర్ హెచ్హెచ్ డైక్మెన్ మరణం తర్వాత ఆ కేంద్రం కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మున్సిపాలిటీ ఆ స్థలాన్ని ఏ ప్రాతిపదికన ఏఎంజీకి అప్పగించింది? లీజా.. వినియోగానికి అనుమతా.. లేక ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారమా? అనే వివరాలను నిర్ధారించే పాత రికార్డులేవీ దొరకలేదని, వాటి కోసం వెతుకుతున్నట్లు అధికారులు చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. డోర్ నంబర్ 80/1, సర్వే నంబర్ 138/1గా పేర్కొంటూ ఈ ఏడాది ఆగస్టు 11న స్థలం ఏడుగురి పేర్లతో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. మున్సిపల్ పన్ను అసెస్మెంట్ నంబర్ 1020025573 కూడా పత్రాల్లో ఉన్నట్లు సమాచారం. ఏఎంజీ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థకు అందించిన సేవలకు ప్రతిఫలంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ అరుణ్కుమార్ కంటి మహంతి తరఫున వారికి స్థలాన్ని కానుకగా ఇచ్చినట్లు దస్తావేజుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక, రిజిస్ట్రేషన్ సమయంలో అక్కడ డే–కేర్ భవనం ఉన్నప్పటికీ ఖాళీ స్థలంగా చూపించినట్లు సమాచారం. మున్సిపల్ ఆస్తిగా అధికారులు చెబుతున్న భూమి విషయంలోనే యాజమాన్య హక్కులపై ఇంతటి వివాదం తలెత్తడం ఇప్పుడు అధికారుల పాత్రపైనా అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబును దీనిపై ‘సాక్షి’ వివరణ కోరగా.. వివాదాస్పద స్థలం సర్వే నంబర్ 88లోని 27 సెంట్లు మున్సిపల్ ఆస్తిగా స్పష్టం చేశారు. పన్ను అసెస్మెంట్ ఇటీవలే ఇచ్చారన్న ప్రచారం అవాస్తవమని తెలిపారు. గతం నుంచే అసెస్మెంట్ నంబర్ ఉందన్నారు. సదరు స్థలం ఏఎంజీకి ఏ ప్రాతిపదికన అప్పట్లో ఇచ్చారనే విషయంపై రికార్డులు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. తమ స్థలంలోని భవనం తొలగించారని తెలిసి స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారు ఎలా రిజిస్ట్రేషన్లు చేసుకున్నా అది పక్కా మున్సిపల్ ఆస్తి అని, ఆ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో చెల్లదని పేర్కొన్నారు. వారికి ఆ ఆస్తిపై ఎలాంటి హక్కూ లభించదని తేల్చి చెప్పారు. -
చీకటి గోపిది ముమ్మాటికి పోలీసు హత్యే
లక్ష్మీపురం: చీకటి గోపిది ముమ్మాటికి పోలీసుల హత్యేనని, బాధ్యులపై చర్య తీసుకోవాలని దళిత ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో బహుజన ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, న్యాయవాదులతో కలిసి పోలీసులపై చర్య తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జొన్నకూటి నవీన్కుమార్ మాట్లాడుతూ పోలీసుల చర్యల వలనే గోపి మృతి చెందాడనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపాలని కోరారు. పోలీసులపై ఆరోపణలు ఉన్న ఘటనలో అదే పోలీసు శాఖకు చెందిన అధికారులు విచారణ చేయడం వల్ల విచారణ నిష్పక్షపాతంపై అనుమానాలు ఏర్పడే అవకాశం ఉందని అందువల్ల ఈ ఘటనపై స్వతంత్ర, నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. చీకటి గోపి ఘటన ఒక్కటే కాదు రాష్ట్రంలో గత కొంతకాలంగా పోలీసుల కస్టడీ, విచారణ లేదా పోలీసుల చర్యల అనంతరం వ్యక్తులు మృతి చెందిన ఘటనలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయని ఆరోపించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ ఇది ఒక్క గోపి కుటుంబం సమస్య కాదని, చీకటి గోపి మరణాన్ని ఒక కుటుంబానికి జరిగిన విషాదంగా మాత్రమే చూడకూడదన్నారు. పోలీసు స్టేషన్కు విచారణ కోసం పిలిపించిన వ్యక్తి సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో హింస, అక్రమ నిర్బంధం, బెదిరింపులు, మానవ హక్కుల ఉల్లంఘనలకు ఎలాంటి అవకాశం ఉండకూడదన్నారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ అని ప్రభుత్వం చెబుతున్న సమయంలో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ఈ అంశాలపై రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న దళిత, గిరిజన, బహుజన, ప్రజా సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలియచేస్తూ పోలీసుల దుర్మార్గంపై, సీఐడీ ఎస్పీ చెప్పే అబద్ధాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను ప్రత్యేకంగా కలిసి సమస్య తీవ్రతను వివరించాలని, డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించాలని, సమస్య పరిష్కారం కాకపోతే చలో గుంటూరు నిర్వహించాలని నిర్ణయించినట్లు నేతలు ప్రకటించారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● లారీని ఢీకొన్న కారు ● మంటలు చెలరేగి కారు దగ్ధం ● ప్రయాణికులు సురక్షితంపిడుగురాళ్ల: ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో కారులో మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ సమీపంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ ఎం.మోహన్ తెలిపిన వివరాల మేరకు.. నరసరావుపేట వైపు నుంచి కారంపూడి వైపునకు ఓ లారీ వెళుతోంది. ఇంతలో కారంపూడి వైపు నుంచి గుత్తికొండ వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొంది. గుత్తికొండ గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న నలుగురు వ్యక్తులను క్షేమంగా కాపాడారు. అదృష్టశాత్తు వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
బల్కర్ డ్రైవర్ నిర్లక్ష్యం
ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి నెల్లూరు(క్రైమ్): నెల్లూరు జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మినీ ఐచర్ వ్యాన్ డ్రైవర్ మృతిచెందాడు. ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా నగరం మండలం వెనిగల్లవారిపాళేనికి చెందిన వి.నాగమల్లీశ్వరరావు (41) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం మినీ ఐచర్ వ్యాన్లో రొయ్యల లోడుతో చైన్నెకి బయలుదేరాడు. అర్ధరాత్రి నెల్లూరు జాతీయ రహదారిపై మయూరి రెస్టారెంట్ సమీపంలోకి రాగానే రోడ్డుపక్కన నిలిపి ఉంచిన బల్కర్ వాహనం ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ఒక్కసారిగా రహదారిపైకి వచ్చి కుడివైపునకు మళ్లింది. నాగమల్లీశ్వరరావు వ్యాన్ను అదుపు చేయలేక బల్కర్ వాహనం వెనుక భాగాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో వ్యాన్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసంకాగా, తీవ్రగాయాలతో నాగమల్లీశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాకి చేరుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుడికి వరుసకు సోదరుడైన సుధీర్కుమార్ ఫిర్యాదు మేరకు ఆదివారం నార్త్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై అబ్దుల్ రహీమ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉమ్మడి జెడ్పీ
మూడుగా మారిన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు ● 25 నుంచి మొదలుకానున్న కార్యకలాపాలు ● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో జెడ్పీ ● ఇప్పుడు 17 మండలాలకు గుంటూరు పరిమితం ● పల్నాడులో 28, బాపట్ల పరిధిలో 20 మండలాలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉండేవి. కొత్తగా పల్నాడు, బాపట్ల జెడ్పీలు ఏర్పడనుండగా.. మిగిలిన గుంటూరు జిల్లాకు ప్రస్తుతమున్న జెడ్పీ పరిమితం కానుంది. ప్రస్తుత పాలకవర్గ పదవీ కాలం సెప్టెంబర్ 24న ముగియనుంది. మరుసటి రోజు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లా పరిషత్ల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఆయా జిల్లాల్లోని జెడ్పీలకు అవసరమైన ఉద్యోగుల విభజనపైనా కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాల జెడ్పీలకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 57 మండలాలతో కొనసాగిన జిల్లా ప్రజా పరిషత్ రాష్ట్రంలోని పెద్ద జిల్లాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయిన నేపథ్యంలో గుంటూరు జిల్లా 17 మండలాలకు పరిమితం కానుంది. అదే విధంగా పల్నాడులో 28, బాపట్లలో కొత్తగా కలిసిన వాటితో కలిపి 20 మండలాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే పల్నాడు జిల్లాలోనే అధికంగా మండలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 57 మండలాల నుంచి 57 మంది జెడ్పీటీసీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తుండగా, కొత్త జిల్లాల ప్రాతిపదికగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఆయా జిల్లాల పరిధిలోని మండలాల వారీగా కొత్తగా జెడ్పీటీసీలను, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేయాలంటే పాలకవర్గాలు తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 24న ముగియనున్న దృష్ట్యా, త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. 1959లో అమల్లోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ పంచాయత్ సమితి, జిల్లా ప్రజా పరిషత్ చట్టం ప్రకారం జిల్లా ప్రజా పరిషత్ ఏర్పడింది. అంతకు ముందు బ్రిటిష్ కాలంలో ఏర్పాటు చేసిన జిల్లా బోర్డు వ్యవస్థలో 1921 నుంచి 1959 వరకు పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా కొనసాగారు. 1921 నుంచి 1927 వరకు మొదటి జిల్లా బోర్డు అధ్యక్షుడిగా పీజీఎన్ యతిరాజుల నాయుడు పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ విధంగా 1921 నుంచి 1959 వరకు తొమ్మిది మంది జిల్లా బోర్డు అధ్యక్షులుగా పదవిలో కొనసాగారు. మూడు సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. 1959లో అమల్లోకి వచ్చిన చట్టం ఆధారంగా డిసెంబర్ ఒకటో తేదీన మేడూరి నాగేశ్వరరావు ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ప్రస్తుత చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా వరకు గత 66 ఏళ్ల కాలంలో 36 మంది చైర్మన్లుగా వ్యవహరించారు. వీరిలో నాలుగు సార్లు ఇన్చార్జ్ చైర్మన్లు, 18 సార్లు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకాధికారులుగా కొనసాగారు. జెడ్పీకి 16 మంది చైర్మన్లు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు. చైర్మన్లుగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన వారిలో కాసు వెంగళరెడ్డి, రాయపాటి శ్రీనివాస్, మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు తదితర ప్రముఖులు ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన మోహన్ కందా గుంటూరు జిల్లా కలెక్టర్గా పని చేసిన కాలంలో జెడ్పీ ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతమున్న జెడ్పీ పరిపాలన భవనాన్ని 1964 జూలై 15న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. గుంటూరు జిల్లాలో చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు, కాకుమాను, కొల్లిపర, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని, పెదనందిపాడు, ఫిరంగిపురం, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడేపల్లి, తాడికొండ, తెనాలి, తుళ్లూరు, వట్టిచెరుకూరు ఉన్నాయి. బాపట్ల జిల్లాలో అమృతలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చెరుకుపల్లి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, కారంచేడు, కర్లపాలెం, కొల్లూరు, మార్టూరు, నగరం, నిజాంపట్నం, పర్చూరు, పిట్టలవానిపాలెం, రేపల్లె, చుండూరు, వేమూరు, వేటపాలెం, యద్దనపూడి మండలాలు ఉన్నాయి. పల్నాడు జిల్లాలో అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, బొల్లాపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, దుర్గి, యడ్లపాడు, గురజాల, ఈపూరు, కారంపూడి, క్రోసూరు, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ల, నాదెండ్ల, నరసరావుపేట, నకరికల్లు, నూజెండ్ల, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, రెంటచింతల, రొంపిచర్ల, సత్తెనపల్లి, శావల్యాపురం, వెల్దుర్తి, వినుకొండ ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ స్వరూపం మారింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల వారీగా జెడ్పీలు ఏర్పడనున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లాల వారీగా పరిషత్లను ఏర్పాటు చేస్తూ జీవో 114 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. దశాబ్దాల తరబడి ఉమ్మడి గుంటూరుగా కొనసాగుతున్న జెడ్పీ ఇక నుంచి మూడు జిల్లాల వారీగా విడిపోనుంది. -
పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం
బాపట్ల: బాపట్ల ఆర్ట్స్ అండ్ సైనన్స్ కళాశాలలో బీకాం 1973–76 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం బాపట్లలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సుదీర్ఘ విరామం అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు కలుసుకుని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించి, వారి ఆశీస్సులు పొందారు. అనంతరం అలనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ స్నేహితులతో ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆనందంగా గడిపారు. ఉపాధ్యాయులు వీవీ సుబ్బారావు, పీఎం రాజు, జి. శాంతారావు, పి.సాంబశివరావు, ఏ.మధుసూదన్రావు, శ్రీనివాసరావు, డబ్ల్యూజీకే మూర్తి, బీసీ సాయిబాబు, జీవీ సుబ్రహ్మణ్యం తదితరులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. కార్యక్రమానికి బందా బాబు అధ్యక్షత వహించగా, పూర్వ విద్యార్థులు గోపాలం శ్రీహరి, నూరుభాష ప్రసాద్, ఎం.రాఘవరావు, భుజేగేంద్ర మౌళి, గోపాలరావు, లక్ష్మణ్రెడ్డి, డి. పుండరీకాక్షయ్య, వి.చంద్రశేఖరరావు పాల్గొన్నారు.


