Bapatla
-
బంగారం రికవరీ పేరిట దంపతులకు పోలీసుల వేధింపులు!
తెనాలి రూరల్: బంగారు ఆభరణాల రికవరీకి తనను, తన భర్తను పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కొట్టి వేధించారని ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. బాపట్ల జిల్లా కూచిపూడికి చెందిన కటారి తిరుపతమ్మ, సాయిబాబు దంపతులు తెనాలిలో ఉంటున్నారు. కొత్తపేటలోని సువర్ణ అపార్ట్మెంట్లో సాయిబాబు వాచ్మన్. తిరుపతమ్మ అదే అపార్ట్మెంటులోని ఇళ్లలో పనులు చేసుకుంటోంది. అపార్ట్మెంట్లో ఉండే స్వర్ణలత అప్పుడప్పుడూ తిరుపతమ్మ దంపతులకు బంగారు వస్తువులను ఇచ్చి తాకట్టు పెట్టి డబ్బులు తెప్పించుకుంటూ ఉండేది.ఈ క్రమంలో తిరుపతమ్మ దంపతులు బంగారాన్ని విడిపించి ఇవ్వకుండా తనను మోసం చేశారని స్వర్ణలత వారం క్రితం పోలీస్స్టేషనులో ఫిర్యాదు చేసింది. దీనిపై తిరుపతమ్మ దంపతులను స్టేషన్కు పిలిపించి పోలీసులు ఇటీవల విచారించారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని పంపేశారు. ఆ తర్వాత తిరుపతమ్మ మారీసుపేటలో తన అత్తయ్య వాచ్మన్గా ఉంటున్న ఓ అపార్ట్మెంటుకు శనివారం వెళ్లింది. నేరం ఒప్పుకోవాలంటూ పోలీసులు తనను కొట్టి వేధించారని సెల్ఫీ వీడియో తీసుకుని గడ్డిమందు తాగింది. ఈ విషయం తెలిసిన సాయిబాబు ఆమెను తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చాడు.మెరుగైన చికిత్స కోసం ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. కాగా, పోలీసులు శనివారం రాత్రి పొద్దుపోయాక సాయిబాబు నుంచి తీసుకున్న స్టేట్మెంట్లో..స్వర్ణలతకు బంగారం ఇవ్వాల్సింది నిజమేనని అంగీకరించారు. తమను అరెస్టు చేస్తారేమోనన్న భయంతోనే తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని సాయిబాబు చెప్పారు. కాగా, తిరుపతమ్మ దంపతులను పిలిపించి మాట్లాడామని వారిని వేధించడం, కొట్టడం చేయలేదని వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు ’సాక్షి’కి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వేటపాలెం: రోడ్డుపై ఆగి ఉన్న బైక్ను వెనుక నుంచి మరో మోటార్ బైక్ ఢీకొన్న ఘటనలో వెనుక కూర్చుని ఉన్న వ్యక్తి మృతి చెందాడు. అక్కాయిపాలెం పంచాయతీ బైపాస్ రోడ్డు జక్షన్ దగ్గరలో ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. చీరాల వైపు నుంచి ఎస్.శ్రీనివాసరావు(50) తన స్నేహితుడి బైక్పై వేటపాలెం వైపు వస్తున్నాడు. అక్కాయిపాలెం వద్దకు వచ్చే సరికి రోడ్డుపై నిలిపి ఉన్న మరో బైక్ను వెనక నుంచి ఢీకొట్టారు. బైక్ వెనుక కూర్చున్న శ్రీనివాసరావు రోడ్డుపై పడి మృతి చెందాడు. మృతుడు పర్చూరులో కోర్టులో ఉద్యోగం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గౌడ సామాజిక వర్గంపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపు
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి మదన్మోహన్గౌడ్ రేపల్లె: మామిళ్లపల్లి గ్రామ మొక్క జొన్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీసీ గౌడ సామాజానికి చెందిన వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్కృష్ణపై పొన్నూరు సీఐ దాడి చేయటం బాధాకరమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి యార్లగడ్డ మదన్మోహన్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. బీసీ గౌడ సమాజానికి చెందిన నాయకులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా మామిళ్లపల్లిలో గిట్టుబాటు ధర కోసం ప్రశ్నించిన రైతులపై దాడులు చేయటమేగాక అక్రమ కేసులుపెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు సంఘీభావంగా వచ్చిన మాజీ మంత్రి జోగి రమేష్, రేపల్లె సమన్వయకర్త నాగమోహన్కృష్ణలపై ఉద్దేశపూర్వకంగా పోలీసులు దాడికి తెగబడ్డారన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్ల డైరెక్షన్లో రాష్ట్రవ్యాప్తంగా గౌడ సామాజికవర్గ నాయకులపై పోలీసులు, టీడీపీ నాయకులు దాడికి తెగబడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు భవిష్యత్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొర్రా శ్రీనివాసరావు, పట్టణ, మండల కన్వీనర్లు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, జిల్లా అధికార ప్రతినిధి కేవీ కృష్ణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిమటా బాలాజీ, మహిళా నాయకులు వీసం నాగలక్ష్మి, పద్మావతి పాల్గొన్నారు. -
ప్రభుత్వాలు రజకులను నిర్లక్ష్యం చేస్తున్నాయి
దాచేపల్లి: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రజకుల సమస్యలపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని రజక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక విజయభాస్కర్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయిలో రజకుల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ రజక సమాఖ్య సంక్షేమ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు అక్కినపల్లి బాలయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రజకుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రజకులు రాజ్యాధికారం కోసం... ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రాష్ట్రవాప్తంగా 36 లక్షల మందికి పైగా రజక జనాభా ఉందని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని బాలయ్య డిమాండ్ చేశారు. అంటు బట్టల దగ్గరనుంచి శరీరంపై ఉన్న అన్ని బట్టలను శుభ్రం చేసేది రజకులని, వారిని సైతం గ్రామాల్లో అంటరానివారిగానే చూస్తారని, మరి ఎస్సీ జాబితాలో ఎందుకు చేర్చరన్నారు. ఎస్సీ హోదానే ఏక లక్ష్యంగా రజకులందరు ఐక్య పోరాటాలు చేయాలనన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేసే ప్రతీ ఆందోళన కేంద్రప్రభుత్వం దృష్టికి వెళుతుందని తెలిపారు. ఇప్పటికే తాము చేసిన ఆందోళనలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయన్నారు. రానున్న రోజుల్లో అమరావతిలో లక్ష మందితో సభ నిర్వహించాలన్న ఆలోచన ఉందని బాలయ్య అన్నారు. ఈ సమావేశంలో రజక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు పొత్తూరు షణ్ముఖం, రజక చైతన్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు,రాజమండ్రి నారాయణ, పోకల వెంకటేశ్వర్లు, గంధం అప్పాజి, లాయర్లు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, మాస్టర్ లక్ష్మీనారాయణ, విజయలక్ష్మి, కల్లేపల్లి శైలజ, పొదిలి శ్రీనావాసరావు, భగత్, టి.భాస్కర్, సిహెచ్ రామకోటేశ్వరరావు. కె.సత్యనారాయణ, కోయ రామారావు, పిడుగురాళ్ళ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
భూములు తిరిగి ఇచ్చేంతవరకు పోరాడుదాం
చినగంజాం: వాన్పిక్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రైతుల నుంచి తీసుకున్న భూములు తిరిగి ఇచ్చేంతవరకు తాము పోరాదాం అని మండలంలోని తీరప్రాంత గ్రామాల ప్రజలు తీర్మానించారు. ఆదివారం మండలంలోని మోటుపల్లి పంచాయతీ రుద్రమాంబపురం రామాలయం ఆవరణలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నేతృత్వంలో మండలంలోని 13 తీరప్రాంత గ్రామాల కాపులు, పెద్దలు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాన్పిక్ ప్రాజెక్ట్ ఏర్పాటు కాని దృష్ట్యా స్థానికంగా రైతుల వద్ద నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. మూడు దశలలో పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులను కలిసి సమస్యను వివరించడం, తరువాత న్యాయపరమైన పోరాటం చేయటం, మూడోదశలో పోరాటాన్ని ఉధృతం చేసి నిరసనలు, ధర్నాలు చేపట్టడం వంటి చర్యలతో ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో పండ్రాజు శంకరరావు, కొండూరి గోవింద్ పాల్గొన్నారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 25 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 523.80 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. 7నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి ఆలయ నిర్మాణానికి సూరాబత్తిన సీతారామయ్య దంపతులు ఆదివారం రూ.1,11,116 విరాళంగా అందజేశారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,2126 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు. -
తెనాలిలో భారీ వర్షం
● గుంటూరు నగరంలో చిరుజల్లులతో కూడిన వర్షం ● వణికించిన ఈదురు గాలులు ● పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం తెనాలిరూరల్: తెనాలిలో ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొద్ది రోజులుగా రికార్డు స్థాయి ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం చల్లటి ఊరటనిచ్చింది. వర్షం ధాటికి పలుచోట్ల రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్కు స్వల్ప అంతరాయం కలిగింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో వీధి వ్యాపారులు, పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పేలాయి. అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. గుంటూరులో... కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు నగరాన్ని ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మారిన వాతావరణం అతలాకుతలం చేసింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతోపాటు చిరుజల్లులతో కూడిన వర్షం నగరవాసులను ఆందోళనకు గురిచేసింది. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులు బలంగా వీయడంతో రోడ్లపై దుమ్ము రేగింది. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు గంటపాటు చిరుజల్లులు కురిశాయి. ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అరండల్పేట, బ్రాడీపేట, పట్టాభిపురం, ఏటీ అగ్రహారం, బృందావన్ గార్డెన్స్, కొరిటెపాడు, అమరావతి రోడ్, కొత్తపేట, నల్లచెరువు, ఆర్టీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో గంటకుపైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో ఫీడర్లు ట్రిప్ అయ్యాయని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మరమ్మతులు చేపట్టి దశలవారీగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అరండల్పేటలో ప్రతి ఆదివారం జరిగే సండే మార్కెట్లో చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదివారం సెలవు కావడంతో బయటకు వచ్చిన ప్రజలు వర్షానికి తీవ్ర అవస్థలు పడ్డారు. నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ నెమ్మదించింది. వేసవి వేడిమితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ఈ చిన్నపాటి వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడ్డామని స్థానికులు వాపోయారు. వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. -
ఏం చేయగలవు... పోలీసు!
● రక్షకభటులపై స్టేషనులోనే టీడీపీ నేతల దాడులు ● రెడ్బుక్ రాజ్యాంగంతో నీరుగారుతున్న పోలీసు వ్యవస్థ ● టీడీపీ నేతల అండతో దర్జాగా తిరుగుతున్న అరాచక శక్తులు ● పోలీసులపై గతంలో దాడులు చేసినా చర్యలు శూన్యం ● స్టేషన్లోనే ప్రత్యర్థులపై యథేచ్ఛగా తమ్ముళ్ల ముష్టిఘాతాలు ● మాట వినని పోలీసులపై టీడీపీ నాయకుల తిట్ల దండకాలు ● ప్రజారక్షణ సంగతేమోగానీ.. స్వీయ రక్షణ కూడా చేతగాని ఖాకీలు చట్టాలను చుట్టాలుగా మార్చుకొని టీడీపీ నాయకులు చూపుతున్న పచ్చ పాత ధోరణి చివరకు పోలీసులనే చేతులు ముడుచుకొని కూర్చునేలా చేసింది. చంద్రబాబు ప్రభుత్వంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగం ఫలితంగా తమను తాము కాపాడుకోలేని పరిస్థితికి పోలీసులు దిగజారిపోయారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. కొల్లూరు పోలీసు స్టేషన్పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన దాడి ఘటన దీనికి నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తోంది. -
శిక్షణకు సిద్ధం.. సత్తా చాటుతాం
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : ఒకప్పుడు క్రికెట్ అంటే కుర్రాళ్లే ఉత్సాహంగా ఆడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బాలికలు, యువతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. మహిళా క్రికెట్లో రాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వసతులను సద్వినియోగం చేసుకుని సత్తా చాటాలని శ్రమిస్తున్నారు. అప్పట్లోనే సకల వసతులు గతంలో జాతీయ మహిళా క్రికెట్ అకాడమీ గుంటూరులోని జేకేసీ కళాశాల క్రీడా మైదానంలో ఉండేది. ఇక్కడ ఆటతోపాటు అత్యాధునిక సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేవి. అప్పట్లో జాగర్లమూడి నరేంద్రనాథ్ వంటి కొందరు మహిళా క్రికెట్ అకాడమీని ఇక్కడకు తీసుకు రావడానికి తీవ్ర కృషి చేశారు. క్రికెట్కు సేవలందించారు. ఆయన మరణంతో మహిళా క్రికెట్ అకాడమీ ఇక్కడి నుంచి వేరే రాష్ట్రానికి తరలిపోయింది. జిల్లాలో క్రికెట్ ఆడే యువతుల సంఖ్య కూడా బాగా తగ్గింది. ఒకానొక దశలో అన్ని ఫార్మెట్లలో కలిపి 15 మంది కూడా ఉండేవారు కాదంటే నమ్మాల్సిందే. గత ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు అనూహ్య రీతిలో ప్రపంచ మహిళా క్రికెట్ కప్ అందుకుంది. దీంతో మన దేశంలో యువతుల్లో క్రికెట్పై జోష్ పెరిగింది. పెరిగిన క్రీడాకారుల సంఖ్య ప్రస్తుతం జిల్లాలో అన్ని విభాగాల్లోనూ కలిపి క్రికెట్ ఆడే వారు దాదాపు 100 మంది ఉన్నారు. ఇందులో కొందరు రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్నారు. ఆదివారం స్థానిక అరండల్పేటలోని జీడీసీఏ సారథ్యంలో త్రీమెన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సెలక్షన్స్లో సుమారు 70 మంది హాజరయ్యారు. దీనికి తోడు రంజీ మాజీ క్రీడాకారులు సరస్వతి రెడ్డి, శరత్తోపాటు సీనియర్ కోచ్ ఇండ్ల భాస్కర్లు శిక్షణ, అనుభవం కలిగిన మాజీ క్రికెటర్లు త్రీమెన్ కమిటీలో ఉండడం మహిళా క్రికెట్లో జోష్ పెంచుతోంది. త్వరలో ఇక్కడకు మహిళా కోచ్ కూడా రానున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ శిక్షణ, జిమ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్లాంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ కల్పించారు. అదరగొడుతున్న మహిళా క్రికెటర్లు అవకాశాలు కల్పిసున్న ఏసీఏ జిల్లాలో వందమందికిపైగా క్రికెటర్లు జాతీయ జట్టులో స్థానమే లక్ష్యం త్వరలో మహిళా క్రికెట్ కోచ్ నియామకం ప్రస్తుతం జిల్లా స్థాయిలో ఇక్కడ క్రికెట్ అంతా బాగుంది. మాలాంటి వారికి మహిళా క్రికెట్ కోచ్ ఉంటే మరింత బాగుంటుంది. త్వరలోనే ఆ లోటు తీరుతుందని భావిస్తున్నాను. అండర్–19, 23 స్టేట్ ఆడాను. గత ఏడాది చేసిన రెండు సెంచరీలు నాలో ఆత్మ విశ్వాసం పెంచాయి. ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. – ఎం.హాసినీ చౌదరి, గుంటూరు నేను దాదాపు 9 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నా. ఒక పక్క చదువుతోపాటు క్రికెట్ సాధన చేస్తున్నా. ఈ క్రమంలో అండర్–16, 19, 23 స్టేట్తోపాటు సీనియర్ విభాగంలోనూ రాణిస్తున్నా. 2021లో జోనల్స్లో 5 వికెట్లు తీయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఆల్రౌండర్గా రాణించాలని , జాతీయస్థాయిలో ఆడాలనేదే లక్ష్యం. – ఎస్.లక్ష్మీ ప్రసర్తి, గుంటూరు -
జిల్లా ఫుట్బాల్ సంఘం అధ్యక్షుడిగా క్రాంతికుమార్
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కుమ్మర క్రాంతికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక హోటల్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి గుంజి రమేష్బాబు, అబ్జర్వర్గా చక్రవర్తి, జిల్లా ఒలింపిక్ అబ్జర్వర్లు ఎన్నికలను పర్యవేక్షించి ఫలితాలను ధ్రువీకరించారు. నూతన కమిటీలో ఉపాధ్యక్షులుగా ఎ. వెంకట చంద్రశేఖర్రావు, టి.శ్రీనివాసరావు, అంజలిదేవి, కోశాధికారిగా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులుగా దుర్గామోహన్, మానస, బ్రహ్మేష్, వి.రాజేష్, జె. రాజేష్, జి.ప్రసన్న కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసారి ఇద్దరు మహిళలను కార్యవర్గంలోకి తీసుకున్నామని క్రాంతికుమార్ తెలిపారు. తెనాలిరూరల్: ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తెనాలి ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ07జడ్0261 నంబరు గల బస్సు ఆదివారం సాయంత్రం కొల్లపర మండలం వల్లభాపురం నుంచి తెనాలి వస్తుండగా తెనాలి– విజయవాడ రహదారిలో కంచర్లపాలెం వంతెన వద్ద లారీ వేగంగా ఎదురుగా వచ్చింది. దీంతో డ్రైవరు బస్సును ఎడమ వైపును లాగాల్సి వచ్చింది. అప్పటికే వర్షం కురిసి ఉండడంతో రోడ్డు మార్జిన్లో తూర్పు కాల్వ గట్టుపై మట్టిలో ఇరుక్కుపోయింది. ఇంకొంచెం వెళ్లి ఉంటే బస్సు కాల్వలో పడి పెను ప్రమాదం జరిగి ఉండేది. బస్సును పొక్లెయిన్తో లాగాల్సి వచ్చింది. ఘటన జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గుణదల(విజయవాడ తూర్పు): వేసవి సెలవుల నేపథ్యంలో గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తజనం పోటెత్తారు. ఓ వైపు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా 43 డిగ్రీల ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా యాత్రికులు తమ భక్తి ప్రపత్తులను చాటుతున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. మరియమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కాలినడకన కొండ శిఖరాగ్రానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పెదకూరపాడు: చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మండలంలోని రామాపురం – అత్తలూరు గ్రామాల మధ్య కొత్తలూరు గ్రామానికి చెందిన పుట్టి ఆంజనేయులు ఐదు ఎకరాలలో జామాయిల్ తోటలో సాగు చేశాడు. కర్ర కొట్టించేందుకు బేరం కూడా కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు పంటకు నిప్పు పెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు. -
జనసేన కార్యకర్తపై... టీడీపీ మూకల దాడి
కొల్లూరు: పచ్చమూకల దాష్టీకానికి బాపట్ల జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ రక్తసిక్తమైంది. టీడీపీ శ్రేణుల అరాచకపర్వంతో పోలీసులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి తలెత్తింది. తమపై జరిగిన దాడిపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన జన సైనికుడు, అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లోనే టీడీపీ వర్గీయులు విచక్షణారహితంగా దాడి చేశారు. పచ్చమూకల విధ్వంసం కారణంగా పోలీసు స్టేషన్లో భీతావహ వాతావరణం నెలకొని స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఏమీ చేయలేక చేతులెత్తేసి ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కుకు వెళ్లిపోయారు. టీడీపీ నాయకుడిని విమర్శించాడన్న సాకుతో దాడి.. కొల్లూరులో నూడిల్స్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న జన సైనికుడు ఉప్పు జానకిరామయ్య టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీపీ కనగాల మధుసూధన్ ప్రసాద్ను విమర్శించి, చులకనగా మాట్లాడాడన్న సాకుతో ఆ పార్టీ శ్రేణులు దాడి చేసినట్లు రేపల్లె డీఎస్సీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. శుక్రవారం రాత్రి ఫాస్ట్ఫుడ్ సెంటర్ మూసేసి ఇంటికి వెళ్తున్న జానకిరామయ్యకు, టీడీపీ నాయకుడి అనుచరులైన కొల్లూరులోని ఓ కాలనీకి చెందిన వ్యక్తులు సమీపంలోని మద్యం దుకాణం వద్ద తారసపడ్డారు. ఈ క్రమంలో తమ నాయకుడిని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ ఆ కాలనీకి చెందిన కొండూరు సురేష్ ప్రశ్నించడంతో ఇరువురి నడుమ మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది.ఈ క్రమంంలో జానకిరామయ్య తలపై మద్యం సీసాతో సురేష్ దాడి చేయడంతో గాయమైంది. వెంటనే బంధువులు, స్నేహితుల సాయంతో ఫిర్యాదు చేసేందుకు జానకిరామయ్య కొల్లూరు పోలీసు స్టేషన్కు వెళ్లాడు. తీవ్ర రక్త స్రావమవుతున్న జానకిరామయ్యను వైద్యశాలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. అతడిని తెనాలి తరలించేందుకు 108 వాహనం వస్తున్న సమయంలో కాలనీ నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు విచక్షణారహితంగా పోలీసులతోపాటు, బాధితుడు జానకిరామయ్య, వారి బంధువులపైనా దాడి చేశారు. జానకిరామయ్య మేనల్లుడు రాము బాలశివగంగాధర్ ఆ కాలనీకి వెళ్లి తన మేనమామను కొడతారా... చూసుకుందాం రండి అనడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న కాలనీకి చెందిన వ్యక్తులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్కు దూసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారని తెలుస్తోంది.పోలీసుల జీపు దహనానికి యత్నంవేమూరు సీఐ పీవీ.ఆంజనేయులుతోపాటు, పోలీసు సిబ్బంది కూడా టీడీపీ శ్రేణుల దాడికి గురయ్యారు. స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీసు జీపును రోడ్డుపైకి నెట్టుకెళ్లిన పచ్చ మూకలు ధ్వంసం చేసి దహనం చేసేందుకు ప్రయతి్నంచారు. దాన్ని తిరిగి ఆవరణలోకి తీసుకొచ్చేందుకు వెళ్లిన హోంగార్డు నాగరాజుపై ఇష్టానుసారంగా దాడికి తెగబడి దుస్తులు చింపేశారు. ఇదే క్రమంలో వేమూరు పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రసాద్పైనా దాడి చేశారు. ఈ దాడిలో ఇరువర్గాల వారూ గాయపడడంతో గుంటూరు, తెనాలి వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉప్పు జానకిరామయ్యతోపాటు, అతని సోదరి రాము వెంకటలక్ష్మి, అతని బావ, రాము శివనారాయణ, మేనల్లుడు రాము బాల శివగంగాధర్ గాయాలతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన గొడవర్తి తేజ, దున్నా చింతయ్య, చొప్పర చింతయ్య గాయాలతో తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కొల్లూరులో పోలీసుల పహారాకొల్లూరు పోలీస్ స్టేషన్లో దాడి సమాచారంతో రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరావుతోపాటు, సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు కొల్లూరు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇరు సామాజికవర్గాల నడుమ జరిగిన వివాదం కారణంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొల్లూరులోని పలు ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు.వేమూరు, చుండూరు, రేపల్లె టౌన్, రేపల్లె రూరల్ సీఐలు పీవీ.ఆంజనేయులు, ఎం.ఆనందరావు, బి.అశోక్కుమార్, సురేష్బాబు, పలు స్టేషన్ల ఎస్ఐలు కొల్లూరులో మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు పోలీసు స్టేషన్పై చేసిన దాడి ఘటనలో ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తే లేదని రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ దాడి పోలీసు వ్యవస్థకే సవాలుగా మారిందని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అందరిపైనా కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడి వెనుక రాజకీయ నాయకుల పాత్రపైనా విచారణ చేపడతామని పేర్కొన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
క్రోసూరు: మండలంలోని నాగవరం గ్రామంలో ఈనెల 17వ తేదీన ఆస్తి కోసం వృద్ధురాలిని హత్య చేసిన హంతకులను శనివారం అరెస్ట్ చేసినట్లు సీఐ పి.సురేష్, ఎస్ఐ పి.రవిబాబు తెలిపారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాగవరం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాకు ఆరేళ్ల కిందట వివాహమైంది. వివాహం సమయంలో కట్నం ఇచ్చినప్పటికీ అదనపు కట్నంతోపాటు అత్త పేరున ఉన్న ఇంటిని రాయించుకురావాలని వేధిస్తున్నాడు. అదే సమయంలో తాకట్టులో పెట్టిన వెండి వస్తువుల గురించి అత్త అల్లాబీ, మృతురాలు ఫాతిమూన్ తరచూ అడుగుతున్నారు. దీంతో వారిని హత్య చేస్తే అడ్డు తొలగిపోతుందని పథకం వేసుకున్నారు. దీంతో సాయంత్రం భార్య కరిష్మా, అత్త అల్లాబీ, మృతురాలు ఫాతిమూన్(75), ఇర్ఫాన్లపై ఇనుపరాడ్లు, కర్రలు, కారంతో దాడిచేయగా వృద్ధురాలు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తు చేసి హత్యలో పాల్గొన్న మస్తాన్వలి, సోదరులు ఇమాంసా, షేక్ ఇబ్రహీం, తండ్రి షేక్ మస్తాన్ వలి, తల్లి షేక్ సైదాబిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు నాటు కర్రలు, రెండు ఇనుపరాడ్లు స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. -
కాపులే లక్ష్యం.. దాడులే సాక్ష్యం
బాపట్లఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026జీవితం నాశనం తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,200, గరిష్ఠ ధర రూ.6,500, మోడల్ ధర రూ.4,400 వరకు పలికింది.విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 523.90 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు నేతలు, కార్యకర్తలను తెలుగుదేశం నేతలు టార్గెట్ చేశారు. 2024 ఎన్నికల్లో వారి సహకారంతోనే గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తన అసలు రంగు బయట పెడుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీని తొక్కేయడమే లక్ష్యంగా తెలుగుదేశం నేతలు పనిచేస్తున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. జనసేనకి, కాపులకు ఎటువంటి పనులు చేయవద్దని అధికారులకు కూడా మౌఖికంగా ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు. ఇవిగో నిదర్శనాలు గతంలో అంబటిపైనా.. ఇటీవల కాపు సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి చేసి ఏడున్నర గంటలకుపైగా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడికి గురైన అంబటి రాంబాబుపైనే తప్పుడు కేసులు బనాయించారు. అనంతరం జైలులో పెట్టిన విషయం కూడా జిల్లా వాసులు మర్చిపోలేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లేకపోవడంతో ఒక గోడౌన్లో నిలవ ఉంచిన ఘటనలో తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన మామిళ్లపల్లి రైతులపై దాడి చేయించారు. దాడి చేసిందే కాక మహిళలపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. రైతులను పరామర్శించడానికి వస్తున్న నేతలను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకుంటోంది. అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. అచ్చంపేట మండలానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సహచరుడి పొలాన్ని ఆక్రమించుకుని అందులో మట్టి తవ్వేశారు. పర్చూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు ఎమ్మెల్యేను కలవడానికి వెళ్తే కలవకపోగా ‘లేబర్ వాళ్లు. తర్వాత కలుద్దాంలే’ అని అవమానించినట్లు కాపు నేతలు చెబుతున్నారు. ‘కాపులకు ఏ రకమైన పథకాలు లేవు. కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్కు రూ.రెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాపు జేఏసీ నేత దాసరి రాము ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు.7జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకు తీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, చేయడం వంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు కూడా ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని హితబోధ చేశారు. పార్టీ సిద్ధాంతాలను తాము మర్చిపోతే పోలీసు స్టేషన్లోకి దూరి మీరు జనసైనికులను, కాపు కులస్తులను కొట్టినట్టుగా, తాము ఇంటింటికి వచ్చి కొట్టడం పెద్ద విషయం కాదన్నారు. నడిపించే నాయకులు, వారి అనుచరుల విషయంలో తామూ దాడులకు దిగడానికి వెనకాడబోమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాడి ఘటనలో తమ పార్టీకి చెందిన వ్యక్తులపైన సైతం కేసులు నమోదు చేశారని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఆందోళన వద్దని సూచించారు.శనివారం కొల్లూరులో జరిగిన దాడిలో గాయపడిన ఉప్పు జానకి రామయ్య మేనల్లుడు రాము బాల శివ గంగాధర్ (బాలు) మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నానన్నారు. విదేశాలకు వెళ్లాల్సిన తాను తెలుగుదేశం పార్టీ వాళ్లు పెట్టిన కేసుల వల్ల వెళ్లలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకుతీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. -
విద్యుత్తు సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన
కారెంపూడి: స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ సెక్షన్ ఆఫీస్ వద్ద మండలంలోని పేటసన్నెగండ్ల శివారు సింగరుట్ల తండా రైతులు శుక్రవారం రాత్రి ఽఆందోళనకు దిగారు. తమ తండాకు నాలుగు రోజులుగా కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందికి అధికారులకు ఫోన్ చేసినా లిప్ట్ చేయడం లేదన్నారు. తండాకు వచ్చే జంపర్లు ఎత్తేసి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని రోజుకు అనేక సార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికి కరెంటు లోవోల్టేజీ హైలోవోల్టేజి వల్ల 10 మోటార్లు దాకా కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసుకు వచ్చినా పట్టించుకునే నాధుడు లేకుండాపోయారన్నారు. దీనివల్ల పంటలకు నీరందక ఎండిపోతున్నాయని తమ బాధలు చెప్పుకోడానికి వస్తే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదనే బాధను రైతులు వ్యక్తం చేశారు. సంబంధిత సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
విత్తన దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
రూ.6.76 లక్షల విత్తన విక్రయాలు నిలిపివేత నగరంపాలెం: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట పట్టణంలో గుంటూరు ప్రాంతీయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వ్యవసాయ అధికారులతో కలిసి శనివారం విత్తనాల దుకాణాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గుంటూరు ప్రాంతీయ అధికారి డి.సూర్యశ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు ఆయా దుకాణాల్లో స్టాక్ వివరాలను నిశితంగా పరిశీలించారు. చిలకలూరిపేట పట్టణం బోస్రోడ్డులోని వాసవి ఎంటర్ప్రైజెస్, అనంతలక్ష్మి ట్రేడర్స్ల్లో వేర్వేరుగా తనిఖీలు చేశారు. రికార్డులను నిర్వహించకపోవడం, విత్తనాలకు సంబంధించి మూల సంస్థ ధృవీకరణ పత్రాలు లేకపోవడాన్ని గుర్తించారు. ఆ రెండు దుకాణాల్లో రూ.6.76 లక్షల విలువ చేసే 889 ప్యాకెట్ల విత్తన విక్రయాలను నిలుపుదల చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయాలనే ఉద్దేశంతో తనిఖీలు నిర్వర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. బాపట్ల: సూర్యలంక సముద్ర తీరం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా మారాలన్న లక్ష్యంతో అధికారులు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన ప్లాస్టిక్ నిషేధ ప్రచారంలో భాగంగా బీచ్ వద్ద పర్యాటకులు, స్థానిక వ్యాపారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఉచితంగా జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ధనిక్ భారత్ ఎడ్యుకేషనన్ ఇన్నిస్టిట్యూట్ ఛైర్మనన్ విక్రమ్ నారాయణ ఉచితంగా జూట్ బ్యాగులను సమకూర్చారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకులు ప్లాస్టిక్ వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలివేయడం వల్ల తీర ప్రాంత పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా జనపనార (జూట్) సంచులను వినియోగించుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఇన్న్చార్జి పర్యాటక శాఖ అధికారి సత్యపాల్ ఆనంద్, బీచ్ సూపర్వైజర్ జ్ఞానరాజు తదితరులు పాల్గొన్నారు. యడ్లపాడు: కొండవీడు కోటను శనివారం పర్యాటకులు విశేషంగా సందర్శించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ చొరవతో చేపట్టిన ఈ పర్యాటక కార్యక్రమాలు శనివారం సాయంత్రం నుంచి కోట ప్రాంగణంలో ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. పచ్చని కొండల నడుమ, ప్రకృతి సోయగాల మధ్య ఏర్పాటు చేసిన నైట్ టెంటెడ్ అకామడేషన్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించింది. యువత, ప్రకృతి ప్రేమికులు, సాహస యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, సాంప్రదాయ ఆటలు, వినోదాత్మక గేమ్స్ను ఎంతో ఉత్సాహంగా ఆస్వాదించారు. పర్యాటకులకు అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు, పల్నాడు జిల్లా టూరిజం కౌన్సిల్ సభ్యులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు సాదర స్వాగతం పలికారు. పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ, కొండవీడును రాష్ట్రస్థాయి ఎకో–టూరిజం గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా సాగుతుందన్నారు.ఔట్ రైవల్ అడ్వెంచర్స్ డైరెక్టర్ దలవాయి ఆషా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పురుషోత్తం రాజు, ఏబీవో వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయులపై బోధనేతర భారాన్ని తగ్గించి, స్వేచ్ఛగా బోధన చేసే అవకాశాన్ని కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ రాష్ట్ర(ఎస్టీయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో రెండు రోజుల రాష్ట్రస్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను గుంటూరు శివారులోని విజ్ఞాన్ నిరుల ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు విద్యార్థుల అభ్యసనా సామర్ాధ్యల పెంపుదలతోపాటు, డ్రా పౌట్ల సంఖ్య తగ్గింపు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి విద్యాశాఖ పక్షాన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు. బోధనేతర విధులు అభ్యసనా సామర్ధ్యం పెంపుదల ఒక అడ్డంకిగా ఉన్నాయని, వీటిని తొలగించాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మూడేళ్ల గడువు కేటాయించాలని చెప్పారు. కార్యాచరణ ప్రణాళికల పేరుతో అకడమిక్ క్యాలెండర్ దారి తప్పకుండా, కాలనిర్ణయ పట్టికను అనుసరించి అన్ని తరగతులకు క్రమానుగతంగా బోధన జరిగేలా, అమలయ్యేలా చూడాలని కోరారు. ఉపాధ్యాయులకు శిక్షణలు, సైన్స్ ఫెయిర్ల నిర్వహణ, విద్యార్థులకు క్రీడలు, స్కూల్ కాంప్లెక్స్ల నిర్వహణ, నో బ్యాగ్ డేల అమలు ప్రణాళికాబద్ధంగా ఫలితం ఆధారిత అమలుకు చూడాలని కోరారు. ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనంపై ఉపాధ్యాయ సంఘాలు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకొని విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కోరారు. అసెస్మెంట్ రిజిస్టర్ నిర్వహణ, పాఠశాల సమయంలోనే మూల్యాంకనం, మార్కుల నమోదుపై పున: సమీక్ష అవసరమని తెలిపారు. మార్కుల నమోదు ఉపాధ్యాయుని రిజిస్టర్లో ఒకసారి, లీపు యాప్లో ఒకసారి, పాఠశాల సెంట్రల్ మార్కు రిజిస్టర్లో ఒకసారి ఇలా మూడుసార్లు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తుందని, సాంకేతికతను ఉపయోగించి పాఠశాల మొత్తానికి సమీకృత విధానాన్ని అమలుపరిచేలా చూడాలని సూచించారు. శిక్షణ శిబిరంలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సీపీఐ నాయకులు జి.ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సిహెచ్.జోసెఫ్ సుధీర్ బాబు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, ఉపాధ్యాయ వాణి ప్రధాన సంపాదకులు కె.వి.శేఖర్ పాల్గొన్నారు. -
ముస్లిం మహిళపై ఎమ్మెల్యే శ్రీధర్ వ్యాఖ్యలు సరికాదు
మార్టూరు: బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి గ్రామానికి చెందిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వ సినీ, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా శనివారం నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాలుగా నాటక, సినీ, టీవీ ఆర్టిస్టుగా, రచయితగా, దర్శకునిగా సేవలందిస్తూనే చిలకలూరిపేట కళాశాల అధ్యాపకుడిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలలో సుపరిచితునిగా పేరుగాంచారు. ముఖ్యంగా మార్టూరు కేంద్రంగా స్థానిక రోటరీ క్లబ్తో కలిసి శ్రీకారం రోటరీ కళాపరిషత్ అధ్యక్షుడిగా గత 15 సంవత్సరాలుగా మార్టూరులో ఉభయ తెలుగు రాష్ట్రాలస్థాయిలో నాటిక పోటీలు నిర్వహించటంలో ఆయన కీలక భూమిక పోషించారు. డైరెక్టర్గా నియామకం పొందడం పట్ల శ్రీకారం కళాపరిషత్ కార్యదర్శి జాష్టి అనూ రాధ, ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జేవీ మోహన్ రావు, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాదల సాంబశివరావు, కోటేశ్వరరావు, శానంపూడి లక్ష్మయ్య, ఇంటూరి ఆంజనేయులు, రావి అంకమ్మ చౌదరి, బాపట్ల, పల్నాడు జిల్లాలలోని పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ -
మహిళలపై గృహ హింస నిరోధానికి కృషి చేయాలి
బాపట్ల: మహిళలపై గృహ హింస నిరోధానికి అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. గృహహింస నిరోధక చట్టం జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు గృహ హింస నుంచి విముక్తి పొందాలంటే చైతన్యంతోనే సాధ్యమని చెప్పారు. హింస నుంచి బయటకు రావాలంటే చట్టంతో స్వేచ్ఛ లభిస్తుందన్నారు. బాపట్ల జిల్లాలో మహిళలపై వేధింపులు, దాడులు, అరాచకాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మహిళలపై జరిగిన వేధింపుల నేపథ్యంలో గత ఏడాది 485 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం కేవలం 139 కేసులు నమోదు అయ్యాయన్నారు. గృహ హింస నిరోధక చట్టం కింద గడిచిన నాలుగేళ్లలో 668 కేసులు బాపట్ల జిల్లాలో నమోదయ్యాయన్నారు. 155 కేసులు కోర్టులో పరిష్కారం కాగా, ఐదు కేసులు పోలీస్ అధికారుల ద్వారా పరిష్కారం అయ్యాయన్నారు. అందులో 408 కేసులు కోర్టు పరిశీలనలో ఉన్నాయని, మిగిలిన 101 కేసులు విచారణలో ఉన్నట్లు వివరించారు. చట్టం కింద గత ఏడాది 194 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 82 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. వరకట్న వేధింపులు నిరోధించడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలను చైతన్య పరచడంతోనే వేధింపులను నివారించగలమన్నారు. మహిళలకు చట్టం అండగా నిలుస్తున్న విషయాలపై అవగాహన పెంచాలన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో చైతన్య కార్యక్రమాలు విస్తృతం చేయాలన్నారు. విద్యార్థి దశ నుంచి ఈ ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలన్నారు. 181 కాల్ సెంటర్, సఖి కేంద్రం మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలని, మహిళలను చైతన్య పరచాలని ఆయన పలు సూచనలు చేశారు. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చాలనే అంశంపై ‘బడి పిలుస్తోంది’ అంటూ ఎస్ఎఫ్ఐఆర్డీ సంస్థ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. సమావేశంలో మహిళ శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, డీఎస్పీ పి.జగదీష్ నాయక్, సఖి కేంద్రం ప్రతినిధులు ఉషారాణి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పుష్ప, బి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పర్యాటకులకు ఉచిత వైద్య సేవలు ప్రతి రోజూ సూర్యలంక బీచ్కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నందున వారికి అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా పీహెచ్సీ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. సూర్యలంక బీచ్కు వచ్చే పర్యాటకులకు అవసరమైన సమయంలో ఉచిత వైద్య సేవలు అందించేందుకు తుఫాను రక్షిత భవనంలో ఏర్పాటు చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రంలో అవసరమైన వైద్య సిబ్బంది, ప్రాథమిక చికిత్స పరికరాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులు బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం రాత్రి జిల్లా కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి వడగాల్పులు పరిస్థితి, జనగణన, ప్రజా సానుకూలత ప్రజాభిప్రాయం, జలధార–జలహారతి కార్యక్రమాల అమలుపై ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఎల్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల నీటి వనరుల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేయాలన్నారు. మరో రెండు రోజులు వడగాడ్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
కాపు కాసినా.. కక్ష సాధింపేనా?
కొల్లూరు: ‘కాపు’ కాసి కుర్చీలో కూర్చోపెట్టిన విశ్వాసం మరచి ఆ వర్గం వారిపైనే టీడీపీ వారు కక్షకట్టి దాడులుకు తెగబడుతున్నారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వద్ద ఈ మేరకు మొర పెట్టుకున్నారు. కొల్లూరుకు చెందిన జనసైనికుడు ఉప్పు జానకిరామయ్య, అతని కుటుంబసభ్యులపై పోలీసు స్టేషన్లో జరిగిన దాడి సంఘటనపై డీఎస్పీతో చర్చించేందుకు వచ్చిన జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు శనివారం కొల్లూరు పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. ఆయన వద్ద కాపులపై జరుగుతున్న దాడులను శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. వివాదంతో సంబంధం లేకున్నా.. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దెబ్బలు తగిలిన జానకిరామయ్య వెంట తోడుగా వచ్చిన పాపానికి ‘కాపు నా కొడుకులు కనిపిస్తే కొట్టండరా’ అంటూ పోలీసు స్టేషన్లోనే తమపై దాడికి దిగితే ఎలా బతకాలని ప్రశ్నించారు. వివాదానికి సంబంధం లేని వ్యక్తులను సైతం కాపు కులం అనే ఒక్క సాకుతో చితకబాదారని, మహిళ అనే విచక్షణ సైతం లేకుండా జనకిరామయ్య సోదరిపై సైతం దాడి చేయడం టీడీపీ శ్రేణుల పైశాచికత్వానికి నిదర్శనంగా నిలుస్తోందని వాపోయారు. టీడీపీ వర్గీయులు దాడి చేస్తుంటే పోలీసు స్టేషన్ బాత్రూమ్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఓ జన సైనికుడు చెప్పుకొన్నారు. అనంతరం రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావుతో దాడి సంఘటన గురించి గాదె చర్చించారు. జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకు తీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, చేయడం వంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు కూడా ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని హితబోధ చేశారు. పార్టీ సిద్ధాంతాలను తాము మర్చిపోతే పోలీసు స్టేషన్లోకి దూరి మీరు జనసైనికులను, కాపు కులస్తులను కొట్టినట్టుగా, తాము ఇంటింటికి వచ్చి కొట్టడం పెద్ద విషయం కాదన్నారు. నడిపించే నాయకులు, వారి అనుచరుల విషయంలో తామూ దాడులకు దిగడానికి వెనకాడబోమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాడి ఘటనలో తమ పార్టీకి చెందిన వ్యక్తులపైన సైతం కేసులు నమోదు చేశారని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఆందోళన వద్దని సూచించారు. -
పలు రైళ్లు తాత్కాలిక రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ఉన్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్కాంత్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ – గుంటూరు(రైలు నంబర్ 57201), గుంటూరు – మాచర్ల (57203), మాచర్ల – నడికుడి (57206), నడికుడి–మాచర్ల (57205), మాచర్ల –గుంటూరు (57204), గుంటూరు – విజయవాడ (57202), విజయవాడ – గుంటూరు (67229), గుంటూరు–రేపల్లె (67223), రేపల్లె–తెనాలి (67224), తెనాలి– విజయవాడ (67222), తెనాలి–రేపల్లె (67231), రేపల్లె– తెనాలి (67232), తెనాలి–రేపల్లె (67233), రేపల్లె–గుంటూరు (67234), గుంటూరు– రేపల్లె (67235), మార్కాపురం రోడ్ – తెనాలి (67239), తెనాలి – గుంటూరు (67236), గుంతకల్లు–మార్కాపురం రోడ్ (57407) రైళ్లు ఈనెల 23, 24, 30, 31 తేదీలలో రద్దు చేసినట్లు తెలిపారు. మార్కాపురం రోడ్డు– గుంతకల్లు (నంబర్ 57408) రైలు ఈ నెల 24, 25, 30, జూన్ 01వ తేదీల్లో రద్దు చేసినట్లు తెలిపారు. రేపల్లె –మార్కాపురం రోడ్డు (67238) రైలు గుంటూరు, మార్కాపురం రోడ్డు మీదుగా ఈనెల 23, 24, 30, 31 తేదీల్లో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు. వినుకొండ: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని వేక్షిత్ జ్యూయలర్స్లో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉన్న వెండి, బంగారు ఆభరణాలను, నగదును అపహరించారు. చోరీకి గురైన బంగారం, నగదు విలువ రూ.20 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. షాపు లోపల డిజిటల్ వీడియో రికార్డు బాక్స్ని, సీసీ కెమెరాలను ఎత్తుకెళ్లారు. షాపులో పోలీస్ కుక్కలు పసికట్టకుండా కారం చల్లినట్లు గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే దొంగలు పక్కా పథకం ప్రకారం చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ప్రధాన గోల్డ్ షాపులో ఇలాంటి భారీ చోరీ జరగడంతో స్థానిక వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గుంటూరు రూరల్: మండలంలోని చిన్నపలకలూరు రైల్వే గేట్ వద్ద నల్లపాడు–బండారుపల్లి స్టేషన్ల మధ్య రైల్వే గేట్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) నిర్మాణానికి శుక్రవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీక్రిస్టీనా పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని, మెరుగైన కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా భద్రతను పెంపొందించడం అవసరమన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ జి.శోభారాణికి అడిషనల్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. గతేడాది ఆగస్టు నుంచి ఇన్చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు, పల్నాడుజిల్లా డీఎంహెచ్ఓగా గతంలో విధులు నిర్వహించారు. రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియాలజిస్టుగా పనిచేస్తూ ఇన్చార్జి ఆర్డీగా విధులు నిర్వహిస్తున్నారు. జి.శోభరాణిని ఆర్టీ కార్యాలయం డీడీ పాల్ సుధాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్లు సత్యం, విజయకుమార్, సీనియర్ అసిస్టెంట్లు శ్రీక్రాంత్, బి.శ్యామ్అనిల్ అభినందించారు. -
వేతన వెతలు
బాపట్లశనివారం శ్రీ 23 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2126 టీఎంసీలు. విజయపురి సౌత్: నాగార్జునసాగర్ నీటిమట్టం శుక్రవారం 523.90 అడుగులకు చేరింది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,000, గరిష్ఠ ధర రూ.6,200, మోడల్ ధర రూ.4,300 వరకు పలికింది. ఉద్యోగుల డేటా బదిలీలో జాప్యమా.. పట్టించుకోని పాలకులు – బయ్యా శంకర్, అధ్యక్షుడు, ఏపీ ఎల్టీ అసోసియేషన్, బాపట్ల జిల్లా – మల్లేశ్వరి, స్టాఫ్ నర్సు, స్వర్ణ పీహెచ్సీ – షేక్ అబ్దుల్ హఫీజ్, కాంట్రాక్టు ఉద్యోగి, చీరాల ప్రభుత్వ ఆసుపత్రి 7 -
‘డిజిటల్’ మోసగాళ్ల అరెస్టు
చీరాల: డిజిటల్ అరెస్ట్ పేరుతో విశ్రాంత ఉద్యోగిని మోసం చేసి నగదు అపహరించిన కేసులో విశాఖపట్నంకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు బాపట్ల జిల్లా చీరాల డీఎస్పీ ఎండి మొయిన్ తెలిపారు. స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చీరాల టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఏడాది మార్చి 30న కొత్తపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.మోహనరావుకు సోషల్ మీడియా ద్వారా పోలీసులమని చెప్పి అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని బెదిరించారు. ఈ కేసు నుంచి బయటపడాలంటే డబ్బు ఖర్చవుతుందని బెదిరించి రూ.26.50 లక్షల నగదును అకౌంట్లలో వేయించుకొని మోసం చేశారు. ఈ కేసులో సీబీఐ, ఈడీ అధికారులు ఉన్నారని, క్లీన్ చిట్ రావాలంటే నగదు ఇవ్వాలని నమ్మబలికారు. అయితే రోజులు గడుస్తున్నా ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆయన టూటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో టెక్నికల్ బృందం సహాయంతో దర్యాప్తును ప్రారంభించారు. టూటౌన్ సీఐ శశికుమార్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఖాతాల్లో వేసిన నగదును మూడు బ్యాంకు అకౌంట్ల నుంచి వేరు వేరు అకౌంట్లకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. టెక్నికల్ బృందం సమాచారం మేరకు టూటౌన్ సీఐ శశికుమార్ నేతృత్వంలో ఒక బృందం విశాఖపట్నం వెళ్లి విచారణ చేపట్టారు. విశాఖపట్నంలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఏ1 బొందలపు గోవిందు పీఓపీ వర్క్స్ చేస్తుండగా అతని వద్ద ఏ2 నాగ ప్రదీప్, ఏ3 నీల్కుమార్లు పనిచేస్తున్నారు. అయితే నాగ ప్రదీప్, నీల్కుమార్లు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకునేందుకు కంబోడియా దేశానికి వెళ్లి అక్కడ స్కామర్ల వద్ద తర్ఫీదు పొందిన తర్వాత ఇండియాకు వచ్చారు. ఈ ఏడాది జనవరి నుంచి సైబర్ నేరాలు చేయడం ప్రారంభించారు. నాగప్రదీప్ వద్ద రూ.8 లక్షలు, నీల్కుమార్ వద్ద రూ.2 లక్షలు, గోవిందు అకౌంట్కు రూ.14 లక్షలు మొత్తం రూ.26.50 లక్షలు వారి అకౌంట్లుకు డబ్బులు వేయించుకున్నట్లు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకుని ఐటీ కోర్ బృందం, చీరాల టూటౌన్ పోలీసుల నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల వద్ద నుంచి రూ.10 లక్షల నగదు, రెండు ల్యాప్టాప్లు, సిమ్కార్డులు, మెమొరీ కార్డు, పాస్పోర్టులు రికవరీ చేశామని డీఎస్పీ ఎండీ మొయిన్ చెప్పారు. అలానే ఈ కేసులో మరికొంతమంది నిందితులు ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది లేదని, ప్రజలు భయభ్రాంతులకు గురై అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్ నేరస్తుల ఉచ్చులో చదువుకున్న వారే ఇరుక్కుంటున్నారన్నారు. సైబర్ నేరాలకు గురైతే 1930 కు కాల్ చేసి సహాయం పొందాలని సూచించారు. ఈ కేసు ఛేదించేందుకు కృషి చేసిన టూటౌన్ సీఐ ఎ.శశికుమార్, ఎస్ఐ ఎం.వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ కె.మురళి, హెడ్కానిస్టేబుల్ రాజేష్, కానిస్టేబుళ్లు ఎస్కే నాగూర్, ఎం.శ్రీనివాస్, టి.బాలాజీ, సీహెచ్ రమేష్, ఎస్.ఆంజనేయులు, వి.శివకృష్ణ, మహిళా కానిస్టేబుల్ శివపార్వతి, హోంగార్డు ఎం.ప్రభాకర్, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, ఎస్ఐ నజిమాలను డీఎస్పీ అభినందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
పాలువాయిలో విషాదం రెంటచింతల: మా ఇంటి దీపాలు ఆరిపోయాయి...మేం ఎవరి కోసం బతకాలి అంటూ ఆ కన్నతల్లులు గురజాల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద రోధిస్తున్న తీరు అక్కడినున్న వారిని కంటితడి పెట్టించింది. మృతి చెందిన బంగారి, భాస్కర్లు వరుసకు అన్నదమ్ములు. వెంకయ్య వారికి వరసకు బావమరిది. ముగ్గురూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్తుంటారని వారి బంధువులు తెలిపారు. కోటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాలకు ఒక్కొక్కరే కుమారులు. వీరు ఈ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ‘మేం ఏ పాపం చేశామయ్యా... 20 సంవత్సరాలుగా మా కంటి పాపలా చూసుకుంటే ఎదిగిన కుమారులు మా కళ్లముందు రక్తపు మడుగులో పడిపోయారు... దేవుడు మాకు ఎందుకు ఈ శిక్ష వేశాడు...’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరుకు అక్కడివారు చలించిపోయారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు చనిపోవడంతోపాటు మరో యువకుడు మృత్యువుతో పోరాడుతుండటంతో పాలువాయి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. చూపరులు సైతం కంటతడి పెట్టుకున్నారు. -
అటవీ భూముల్లో కబ్జాపర్వం
తాడేపల్లి రూరల్: మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని డోలాస్నగర్ శ్మశాన వాటిక వెనుక భాగంలో ఉన్న అటవీ భూముల్లో కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా భారీ వృక్షాలను యంత్రాంల సహాయంతో నేలకూలుస్తున్నారు. ఈ భూముల్లో సుమారు 30–40 సంవత్సరాల వయస్సు ఉన్న తుమ్మ, వేప, గానుక తదితర చెట్లు ఉన్నాయి. సుమారు 5 సెంట్లలో ఈ చెట్లను తొలగించారు. మరోపక్క ఫారెస్ట్ భూముల్లో రాజధాని గ్రామాల్లో చెరువుల తవ్వకం నుంచి వచ్చిన నల్లమట్టితో గుంతలు పూడుస్తున్నారు. అంతేకాకుండా చిన్న నిర్మాణాలు చేపట్టారు. ఉండవల్లి ఫైరింగ్ రేంజ్ నుంచి యర్రబాలెం రోడ్డు వరకు పలు ప్రాంతాల్లో ఫారెస్ట్లో ఉన్న మొక్కలను తొలగించారు. అందులో నల్లమట్టి పోసి ప్లాట్లుగా చేసి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. గతంలో ఫారెస్ట్ అధికారులు ఉన్న ఇళ్లను లెక్కించి నంబర్లు కేటాయించారు. తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో కొంతమంది ఇదే అదునుగా భారీ వృక్షాలను తొలగించి రెండు మూడు సెంట్లుగా చేసి ఒక్కో సెంట్ రూ.2 లక్షల చొప్పున అమ్మేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మేం చూసుకుంటాం... ఉపాధి కోసం మార్కాపురం, ప్రకాశం జిల్లాల నుంచి వలస వచ్చినవారు ఈ ప్రాంతాల్లో అద్దెలు చెల్లించలేక భూములను కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ కొనుక్కునే వారికి ఫారెస్ట్ భూమి అని తెలిసినా అమ్మిన వ్యక్తిని ప్రశ్నిస్తే ‘‘మీరు ఇళ్లు వేసుకోండి, వచ్చిన వారితో మేం మాట్లాడి సెటిల్ చేస్తాం. రూ.10 – రూ.20 వేలు ఇస్తే వారేమీ అనరంటూ’’ భరోసా ఇస్తున్నాడు. యథేచ్ఛగా భూములను అమ్మేస్తున్నారు. ఇప్పటికై నా ఫారెస్ట్ అధికారులు దృష్టి సారించి పర్యావరణానికి హాని కలిగిస్తూ చెట్లను నరికేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ కూర్మనాథ్ ఇంకొల్లు(చినగంజాం): రీ సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. శుక్రవారం కారంచేడు, ఇంకొల్లు మండలాల్లోని గ్రామాలలో గ్రౌండ్ ట్రూతింగ్, క్షేత్రస్థాయిలో రీ సర్వే పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఆయన అక్కడ ఉన్న రైతులు, రెవెన్యూ సర్వే సిబ్బందితో మాట్లాడారు. డైరెక్టర్ కూర్మనాథ్ మాట్లాడుతూ ప్రజలు, రైతుల సమక్షంలో పనులు చేపట్టి పూర్తి చేస్తేనే అత్యుత్తమ ఫలితాలు వస్తాయని.. భూ రికార్డులు ప్రక్షాళన రైతులకు కచ్చితమైన భూ హక్కులు కల్పించడమే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న రెవెన్యూ సర్వే సిబ్బంది సేవలు అభినందనీయం అని అధికారులను కొనియాడారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న పలు సాంకేతిక భూ సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని కారంచేడు, ఇంకొల్లు, చెరువు గ్రామాల్లో డైరెక్టర్ సమక్షంలో సిబ్బంది, రైతుల భూ కమతాలను సర్వే చేసి డేటాను సేకరించారు. కార్యక్రమంలో చీరాల ఆర్డీవో ఎస్ లవన్న, మల్టీ జోన్ 2 ఆర్జేడీ వెంకటేశ్వరరావు, జిల్లా సర్వే సహాయ సంచాలకులు శేషగిరిరావు, జిల్లా సర్వే ఇన్స్పెక్టర్ అల్తాఫ్, కారంచేడు, ఇంకొల్లు తహసీల్దార్ నాగరాజు, శ్రీనివాస్లతో స్థానిక మండల రెవెన్యూ సర్వే సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
పేలిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్
వినుకొండ: పట్టణంలోని పాత ఎల్ఐసి బిల్డింగ్ సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ ప్రమాదం తప్పింది. అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్న్స్ఫార్మర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రాన్న్స్ఫార్మర్ పేలిన వెంటనే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు అప్రమత్తమై, వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు. -
కారు, ద్విచక్రవాహనం ఢీ
నలుగురికి గాయాలు మాచర్ల రూరల్: కారు, ద్విచక్ర వాహనం ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన పట్టణ పరిధిలోని శ్రీశైలం రోడ్డులో శుక్రవారం చోటుచేసుకుంది. మాచర్ల నుంచి వెల్దుర్తి వైపు వెళ్తున్న కారు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయటానికి ప్రయత్నించే సమయంలో గొట్టిపాళ్ల నుంచి మాచర్ల వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు పులిమెల కోటయ్య తలకు తీవ్ర గాయాలై, ఎడమ కాలు విరిగింది. మరొక వ్యక్తి పులిమెల అశోక్కు కారు గ్లాసు ముఖం పై గుచ్చుకుంది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఈ మేరకు పట్టణ ఎస్ఐ వెంకట్రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. -
అమెరికాలో ఫాదర్ వేళంగిణిరెడ్డి మృతి
అచ్చంపేట: మండలంలోని తాళ్లచెరువుకు చెందిన విచారణకర్త రెవ.ఫాదర్ తుమ్మా వేళంగిణిరెడ్డి (45) సువార్త ప్రచారం కోసం అమెరికాలోని కాలిఫోర్నియా వెళ్లి గుండెపోటుతో గురువారం మృతి చెందారు. వీరి స్వగ్రామం తాళ్లచెరువు కాగా ఇదే గ్రామంలోని బాలయేసు చర్చిలో విచారణకర్తగా పనిచేశారు. ప్రస్తుతం పెదనందిపాడు మండలం అబ్బినేనిగుంటవారిపాలెంలో విచారణకర్తగా పనిచేస్తున్నారు. ఆయన ప్రతి యేటా మే నెలలో సువార్త ప్రచారం కోసం అమెరికా వెళుతుంటారు. ఈ ఏడాది కూడా వెళ్లి గుండెపోటుతో మృతి చెందినట్లు బంధవులు తెలిపారు. వీరు దివ్యవాణి టీవీ ఛానల్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పనిచేశారు. ఆయన సోదరుడు సాగర్థామస్రెడ్డి సినిమా డైరెక్టర్ కాగా, తల్లి నిర్మలామేరి విశ్వాసురాలు. తండ్రి పీటర్రెడ్డి దైవసేవకులుగా పనిచేస్తూ క్యాన్సర్ వ్యాధితో మృతిచెందారు. ఆయన విచారణ గురువులుగా ఫిరంగిపురం, రెంటచింతల, పాటిబండ్ల, యనమదల, పెద్దపలకలూరు తదితర ప్రాంతాలలో పనిచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తాళ్లచెరువు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
వడదెబ్బతో వృద్ధురాలి మృతి
మంగళగిరిలో వృద్ధుడి..మంగళగిరి టౌన్: వడదెబ్బకు గురై ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన యర్రబాలెంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండల పరిధి యర్రబాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధుడు బత్తిని నరసింహారావు(78) గత రెండు రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యం పాలయ్యాడు. ఎండ వేడి తట్టుకోలేక వృద్ధుడు శుక్రవారం వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఆయనకు భార్య ఉంది. భట్టిప్రోలు: హైవే జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భట్టిప్రోలు మండలం సూరేపల్లికి చెందిన చిత్రలేఖనోపాధ్యాయులు పాలాటి నరసింహారావు (60) పడమటివారిపాలెంకు చెందిన విద్యార్థి మట్టా విఘ్నేష్ను బైక్పై ఎక్కించుకుని వెళుతున్నాడు. భట్టిప్రోలు వేమవరం మధ్యలో ఎన్హెచ్ 216 రహదారిపై టిప్పర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ నరసింహారావును 108 వాహనంలో తెనాలి ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. స్వల్ప గాయాలైన విఘ్నేష్ను సంగంజాగర్లమూడిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సమాచారం మేరకు ఎస్ఐ ఎం.శివయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చీరాల: మండలం వాడరేవులోని సముద్రతీరానికి శుక్రవారం ఉదయం ఓ వృద్ధుడి మృతదేహం కొట్టుకువచ్చిందని రూరల్ ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ తెలి పారు. మృతుడి వయస్సు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని, ఎడమచేతి ఉంగరం వేలుకు ఎరుపు రాయి కలిగిన బంగారపు ఉంగరం ఉందన్నారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు చీరాల రూరల్ ఎస్ఐ 9121102144, చీరాల రూరల్ సర్కిల్ సీఐ 9121102143 నంబర్లుకు సంప్రదించాలన్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కేవీలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
బాపట్ల: బాపట్ల మండలం సూర్యలంక ఎయిర్ ఫోర్సు స్టేషన్ పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు మిగులున్న తరగతుల సీట్ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మృదుల శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల వారు కేంద్రియ విద్యాలయంలో సంప్రదించి ఈనెల 27వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆమె తెలిపారు. బాపట్ల: అనంతపురం జిల్లాలో సర్వేలు చేయలేదని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులలో పని చేసే డిజిటల్ అసిస్టెంట్లు,వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీల జీతాలు నిలుపుదల చేయటం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బాపట్ల జిల్లా చైర్మన్ జీవీవీ రాఘవరెడ్డి ఖండించారు. ఆధార్ కిట్ల వినియోగం, ఎల్ఎంఎస్ కోర్సులు పూర్తి చేయలేదని జీతాలు నిలుపుదల చేయటం మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. వెంటనే అనంతపురం జిల్లా అధికారులు జోక్యం చేసుకుని జీతాల సమస్యను పరిష్కారించకపోతే రాష్ట్రవ్యాప్తతంగా ప్రత్యక్ష ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చీరాల: చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో బాలనేరస్తుడిపై నేరం రుజువు కావడంతో ఒంగోలు జువనైల్ జస్టిస్ బోర్డు కమ్–2 అదనపు మెజిస్ట్రేట్ శిక్ష ఖరారు చేశారు. ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో శుక్రవారం ఒంగోలు కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో బాధితురాలి తరఫున ఏపీపీ కె.కళావతి వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు బాల నేరస్తుడికి పునరావాసం, సత్ప్రవర్తన నిమిత్తం ఒక సంవత్సరం పాటు తిరుపతిలోని ప్రభుత్వ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్లోని ప్లేస్ ఆఫ్ సేఫ్టీకి పంపాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలానే బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో బాలనేరస్తుడికి శిక్ష ఖరారు చేయడంతో పాటు బాధితురాలికి త్వరితగతిన న్యాయం చేయడంలో ప్రతిభ కనబరచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ అభినందించారు. ఆందోళనలో బాఽధితులు మాదల(ముప్పాళ్ల): మండలంలోని మాదల గ్రామానికి చెందిన మందుల దుకాణం వ్యాపారి సుమారు రూ.20లక్షల వరకు అప్పులు తీసుకొని అదృశ్యమవటంతో అప్పులిచ్చిన వారంతా లబోదిబోమంటున్నారు. సదరు వ్యాపారి మాదల గ్రామంలోని ప్రదాన కూడలిలో అద్దె ఇంట్లో ఉంటూ మందుల దుకాణం నిర్వహిస్తూ గ్రామంలోను, సత్తెనపల్లిలోను పలువురి వద్ద వడ్డీకి నగదు తీసుకున్నాడు. అప్పులు ఇచ్చిన వారంతా ఒత్తిడి చేస్తుండటంతో కాలయాపన చేస్తూ మాదల గ్రామంలో తనకున్న 147 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని ఈ ఏడాది మార్చి 23, 2026న విజయవాడకు చెందిన వారికి అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే గ్రామం విడిచివెళ్లిపోయాడు. వ్యాపారి నుంచి అప్పలు ఇచ్చిన వారందరికీ ఈ నెల 18 వ తేదీన ఐ.పీ నోటీసులు అందటంతో ఖంగుతిన్నారు. వడ్డీకి ఆశపడి కష్టపడి సంపాదించుకున్న సొమ్మును ఇచ్చింది కాక నోటీసులు రావటంతో గ్రామంలో కలకలం నెలకొంది. కోర్టు నుంచి నోటీసులు అందుకోవటంతో బాఽధితులు లబోదిబో మంటున్నారు. బాఽధితుల్లో ఒకరైన యర్రంశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి సదరు వ్యాపారి 2024 ఏప్రిల్ 4వ తేదీన రూ.రెండు లక్షలు మద్యవర్తి ద్వారా తీసుకున్నాడని, న్యాయం చేయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్లోను ఫిర్యాదు చేశారు. నరసరావుపేట టౌన్: గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. విజేత థియేటర్ సమీపంలో గుర్తుతెలియని యువకుడు మృతి చెంది ఉన్నాడన్నా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించామన్నారు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు టూటౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ కోరారు. బాపట్ల: వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కోళ్ల భువనేశ్వరిని నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కోళ్ల భువనేశ్వరిని పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా నియమించటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. -
గంజాయి కేసులో నిందితుడి అరెస్టు
పట్నంబజారు: గంజాయి కేసులో నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కొత్తపేట పోలీసు స్టేషన్లో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొత్తపేట పోలీసు స్టేషన్ సీఐ ఎం.వీరయ్యచౌదరి వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా అప్పిఆలూరు గ్రామానికి చెందిన హిరేకాంక్షి నిషార్ అహ్మద్ అలియాస్ ఆరీఫ్ అనే యువకుడు విశాఖపట్నం వెళ్లి ఆరు కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. తిరిగి వస్తూ గుంటూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి కర్ణాటక రాష్ట్రం వెళ్లేందుకు వివరాలు అడుగుతున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన పోలీసులు పక్కా సమాచారంతో దాడిచేశారు. నిషార్ అహ్మద్ వద్ద ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. -
నేరస్తులపై నిరంతర నిఘా
బాపట్లటౌన్: ప్రాపర్టీ నేరాలకు పాల్పడిన వారిపై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలోని సీసీఎస్ పోలీస్స్టేషన్ గురువారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ ఆవరణలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను పరిశీలించి వాటికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేసి, అసలైన బాధితులకు త్వరితగతిన అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నమోదైన దొంగతనం కేసుల రికవరీ పురోగతిపై ఆరా తీసిన ఆయన, రికవరీ శాతాన్ని మరింత పెంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలోని మొక్కలకు నీటిని అందించడానికి ఏర్పాటు చేసిన మోటార్, నీటి పంపింగ్ సిస్టంను ప్రారంభించి, ఆ పరిసరాలలో కొబ్బరి మొక్కను నాటారు. జిల్లాలో రానున్న నాలుగు రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుంన్నందున ప్రజలు, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఇన్స్పెక్టర్ పి.ప్రేమయ్య, ఎస్బీ సీఐ జి.నారాయణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ -
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు అరెస్ట్
భట్టిప్రోలు: భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లి దళితవాడలో 15 మంది దళితులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ దాసరి కిరణ్ బాబును పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కిరణ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును వినియోగించుకున్నందుకు అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. కిరణ్ అరెస్టును వైఎస్సార్ సీపీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం దళితుల పక్షాన లేదని.. దళితుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని...ఈ ఘటన రుజువు చేస్తుందని మండిపడ్డారు. -
బాపట్ల
శుక్రవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026● పోలీసు జీపు డ్రైవర్ కొట్టడంతో పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి యత్నం ● అప్రమత్తతతో అడ్డుకున్న వ్యక్తి బంధువులు, పోలీసు సిబ్బంది కారంచేడులో 45 డిగ్రీల మోత.. ఇదేమి టెన్షన్ గురు..!నిర్మానుష్యంగా చినవంతెన సెంటర్అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.2542 టీఎంసీలు. -
గాలుల బీభత్సం
ప్రత్తిపాడు: అప్పటి వరకూ నిప్పులు చిమ్మిన సూరీడుని ఒక్కసారిగా కారుమబ్బులు చుట్టేసి, చీకట్లు కమ్ముకున్నాయి. గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై భారీ ఈదురుగాలులు భీభత్సం సృష్టించాయి. నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడుతో పాటు కోయవారిపాలెం, వట్టిచెరుకూరు మండలం ఐదవ మైలు, పుల్లడిగుంట, ఏటుకూరు.. ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి గుంటూరు–పర్చూరు పాతమద్రాసు రోడ్డులో ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగాయి. గ్రామాల్లోని విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. అప్రమత్తమైన విద్యుత్శాఖ అధికారులు గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రోడ్డుపై భారీ వృక్షాలు అడ్డుగా పడిపోవడంతో గుంటూరు– బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల మధ్య కొంత సేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఈదురుగాలుల ధాటికి గుంటూరు – పర్చూరు పాతమద్రాసు రోడ్డులో నేలకొరిగిన భారీ వృక్షం -
డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మికి ఉద్యోగోన్నతి
గుంటూరు మెడికల్: గుంటూరు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్గా ఉద్యోగోన్నతి పొందారు. గురువారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో డాక్టర్ కొర్రా విజయలక్ష్మిని వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు. డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు సివిల్ సర్జన్గా పదోన్నతి పొందారని, త్వరలో స్థల కేటాయింపు జరుగుతోందని డాక్టర్ విజయలక్ష్మి వెల్లడించారు. కార్యక్రమంలో ప్రొగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అమర్తలూరి శ్రావణ్బాబు, డాక్టర్ సుజాత, డాక్టర్ ప్రియాంక, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధతో బోధన చేయాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ–సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గురువారం అమరావతిరోడ్డులోని నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలులో గుంటూరు జోన్ పరిధిలోని ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవో–2లకు ఒక్కరోజు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి పర్సనల్ ఎడాప్టివ్ లెర్నింగ్ (పల్), టీచ్ టూల్, మధ్యాహ్న భోజన పథక అమలుపై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో పాఠ్యాంశాల ఆధారిత విజ్ఞానాన్ని అభివృద్ధి పర్చి, సంబంధిత సబ్జెక్టులపై పట్టు సాధించేలా తీర్చిదిద్దాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ చూపించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో పల్ రాష్ట్ర నోడల్ అధికారి బి.కిఫోర్బాబు పాల్గొన్నారు. చేబ్రోలు: చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలోని క్వారీ ప్రాంతాన్ని గురువారం విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ అధికారుల బృందం పరిశీలించింది. వివిధ అంశాలలో సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. వీరనాయకునిపాలెం గ్రామానికి చెందిన మెండెం ప్రభుదాసు 2024లో అక్రమ మైనింగ్పై గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిపై రెండు రోజులుగా విజిలెన్స్ అండ్ ఎన్పోర్సుమెంట్ అసిస్టెంట్ జియాలజిస్ట్ జి అనీల్, మైనింగ్ ఆర్ఐ సీహెచ్ ఆంజనేయులు, తహసీల్దారు కె శ్రీనివాసశర్మ, సర్వేయర్లు వీరనాయకునిపాలెం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించి వారికి అవసరమైన సమాచారాన్ని సేకరించారు. రెండు రోజులపాటు ఆధునిక యంత్ర పరికరాలతో ప్రభుత్వ స్థలాలు, సర్వే నెంబర్లు, క్వారీలోని లోతు, ఎన్ని మెట్రిక్ టన్నుల గ్రావెల్ తరలించారు. అనే విషయాలపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేయటం కోసం అధికారుల బృందం పరిశీలించింది. -
అమెరికాలో బాపట్ల యువకుడి మృతి
బాపట్లటౌన్: అమెరికాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల యువకుడు మృతిచెందగా, అతని కుటుంబ సభ్యులు తీవ్రగాయాల పాలయ్యారు. వివరాలు ఇలా.. బాపట్ల పట్టణం యాదవపాలేనికి చెందిన ఆవుల పూర్ణగోపి (35) పదేళ్ల క్రితం అమెరికా వెళ్లి ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. అతని తమ్ముడు మురళి కూడా మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే చదువుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఆవుల శ్రీనివాసరావు, నళిని దంపతులు నెల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ కుటుంబ సభ్యులంతా విహార యాత్రకు వెళ్లి ఇంటికి వెళ్తుండగా కారు డ్రైవ్ చేస్తున్న ఆవుల మురళి నిద్ర వస్తుండడంతో అన్న గోపిని డ్రైవ్ చేయమని కోరాడు. దీంతో అతను కారు దిగి డ్రైవర్ సీటులో కూర్చునేందుకు యత్నిస్తుండగా వేగంగా వెనుక నుంచి వచ్చి బొలెరో వాహనం వీరిని కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణగోపి అక్కడికక్కడే మృతిచెందగా, అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, నళిని, తమ్ముడు మురళికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బొలెరోతో ఢీకొట్టిన మహిళ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు పూర్ణగోపి తండ్రి శ్రీనివాసరావు ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. బాపట్ల ఏరియా ఆస్పత్రిలో 108 డ్రైవర్గా కూడా చాలాకాలం సేవలు అందించారు. -
ఆంధ్రకేసరి జీవితం అందరికీ ఆదర్శం
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిగుంటూరు ఎడ్యుకేషన్: టంగుటూరి ప్రకాశం పంతులు మార్గదర్శకత్వం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్సీ, ఆంధ్రకేసరి అభిమాన సంఘ గౌరవాధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆంధ్రకేసరి అభిమాన సంఘ ఆధ్వర్యంలో శంకర్విలాస్ సెంటర్లోని ప్రకాశం చౌక్లో నిర్వహించారు. తొలుత ఆయన విగ్రహానికి లేళ్ల అప్పిరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, పార్టీ సీఈసీ సభ్యులు మందపాటి శేషగిరిరావు, మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ, పాపతోటి అంబేడ్కర్, షేక్ రోషన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్, గీతా మందిరం చైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, రాష్ట్ర యువజన నేత నూనె ఉమామహేశ్వరరెడ్డి, బందా శశి, పార్టీ నేతలు ఓర్చు శ్రీనివాసరావు, బైరెడ్డి రవీంద్రారెడ్డి, ఆలా కిరణ్, అరవ తిమ్మరాజు, చింతపల్లి రమణ, మన్నేపల్లి హనుమంతరావు, రెడ్డి కోటేశ్వరరావు, సింగు నరసింహారావు, సుందరరావు, సమీర్, శంకర్, వెంకటరెడ్డి, చిన్నా, వెంకటరమణ, సుశీలరావు, నీలి, ప్రసన్న, నారాయణ, విజయమాధవి, విజయమ్మ, రత్నకుమారి, దుర్గ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
స్క్రాప్కు పక్కాగా లెక్క..
పట్నంబజారు: డబ్బులు పడేసిన లెక్కవేసి పడేయాలంటారు.. అలాగే వాహనాల విషయంలో పక్కాగా లెక్క ఉండాల్సిందే. వాహనం వయసు అయిపోయిందిలే.. సెంకడ్ హ్యాండ్ అమ్మేద్దాం.. లేదా స్క్రాప్కు పంపుదాం అనుకుంటే పొరపాటే. ప్రతి వాహనం కొనుగోలు చేసిన తరువాత దాని కాల పరిమితి 15 సంవత్సరాలు. ఆ తరువాత వాహన ఇంజన్ పరిస్థితిని బట్టి ఐదేళ్ల నుంచి మరింత పైగా వాహనాలకు కాలపరిమితిని పెంచే అవకాశం రవాణాశాఖ అధికారులకు ఉంది. కేవలం నూతన వాహనం కొనుగోలు చేసే క్రమంలో ప్రతి ధ్రువీకరణ పత్రాన్ని చూస్తాం. అలాగే వాహనం అది ద్విచక్రమైన, కారైనా, అంబులెన్స్, ఆటో మరేదైనా.. కచ్చితంగా వాహనం స్క్రాప్(తుక్కు) చేసే ముందుకు అధికారులకు ధరఖాస్తు ఎంతో అవసరం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. లేకుంటే ఆ వాహనంతో ఏదైనా ప్రమాదం జరిగినా.. ఏదైనా ఘటన చోటు చేసుకున్నా.. ఆ వాహన యజమాని కచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. జిల్లాలో వాహనాలు ఇలా... జిల్లాలో మొత్తం సుమారు 2 లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వాటిలో 26,515 లారీలు, 1,603 మ్యాక్సీ క్యాబ్లు, 6,452 మోటార్ క్యాబ్లు, 16,800 కమర్షియల్ ట్రాక్టర్లు, 29,905 ఆటోలు, 2800పైగా స్కూల్ బస్సులతో పాటు ఇతరత్రా ట్రాన్స్పోర్ట్ వాహనాలు కలుపుకుని మొత్తం 2లక్షకుపైగా వాహనాలు ఉన్నాయి. అయితే వాటీలో అనేక సంవత్సరాలుగా త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు ఉన్నాయి. అధికారుల గణంకాల ప్రకారం ఇప్పటి వరకు 8,000పైగా ఉన్నట్లు గుర్తించారు. వాటిలో ఒక త్రైమాసికం చెల్లించనవి 750, రెండుకుపైగా చెల్లించనవి 376, మూడు త్రైమాసికాలు 293, నాలుగు చెల్లించనవి 400పైగా, ఐదు త్రైమాసికాలవి 220పైగా, ఐదుకు పైగా ఉన్నవి సుమారుగా ఐదు వేలకు పైగానే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మూలన పడ్డవి ఎన్నో.... జిల్లాలో త్రైమాసిక పన్నులు చెల్లించాల్సిన వాహనాలు 8,000 ఉండగా వాటిలో అసలు ఎన్ని మూలన పడ్డాయో.. ఎన్ని వాహనాలు కేసుల్లో ఉన్నాయో.. ప్రమాదాల్లో గురై ఆయా స్టేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో వదిలేసినవి, ఇతరత్రా కారణాలతో వదిలేసినవి వేలల్లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు వేయటం, ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు తీసుకుని వెళ్లిన వాహనాల గురించి పట్టించుకోకపోవటం, విక్రయించిన వాహనాల గురించి సమాచారం ఇవ్వకపోవటం వంటివి ప్రధానంగా గుర్తించారు. సుమారు 3వేలకుపైగా వాహనాలు స్క్రాప్తోపాటు, ఇతర అంశాల్లో సంబంధిత యజమానుల వద్ద లేనట్లు గుర్తించారు. పన్ను పడుతూనే ఉంది... వాహనాలకు సంబంధించి యజమానుల దగ్గర వాహనం లేనప్పటికీ త్రైమాసిక పన్నులు మాత్రం పడుతూనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాహనదారులు వాహనాలు స్క్రాప్కు వేసినా, ఇతరత్రా అంశాల్లో కోల్పోయినా.. కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకపోవటంతోనే వాటికి పన్నులు పడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు వాహనాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తున్నారు. వాహనాన్ని స్క్రాప్ కింద తీసివేసినా, ఫైనాన్స్ వారు తీసుకుపోయినా, ప్రమాదం జరిగి ఎక్కడైనా వాహనం నిలిచిపోయినా.. తప్పని సరిగా తెలియజేయాల్సి ఉందని నిబంధనలు చెబుతున్నాయి. ఈ మూడేళ్ల వ్యవధిలో కేవలం రెండు వేల వాహనాలు మాత్రమే స్క్రాప్కు ధరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సుమారు 1400పైగా బైక్లు ఉన్నాయి. ముఖ్యంగా వాహనాలను స్క్రాప్కు పంపే విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై ప్రజల్లో అవగాహన లేకపోవటమే ఇందుకు ప్రధాన కారణం. ఫైనాన్స్ కంపెనీల వారు తీసుకుని వెళ్లటం, వాటికి సంబంధించి యజమానులు దరఖాస్తు చేసుకోవటంపోవటం వలన పన్నులు పెరిగిపోతున్నాయని అధికారులు గుర్తించారు. స్క్రాప్కు వేసిన వాహనంకు సంబందించి ఛాయిస్ నంబర్లు దుర్వినియోగానికి పాల్పడితే.. దానికి సంబందించి వాహన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
అన్నదాతలకు కన్నీళ్లు
దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతులు చీరాల అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఎన్నికల వేళ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తామన్నారు. అది జరగకపోగా నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు కొనసాగుతోంది. ఈ క్రమంలో వ్యవసాయ రంగానికి సంబంధించి వరి సాగు తగ్గించాలని పదే పదే చెప్పారు. అయితే మాగాణి సాగు తగ్గిస్తే, ప్రత్యామ్నాయం ఏంటని సాగుదారులకు సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఖరీఫ్ పంట కాలం ముంచుకొస్తోంది. విత్తనాల కొరత వెంటాడుతోంది. ఇప్పటికే పలు రకాల ఎరువుల ధరలను పెంచారు. గత ఏడాది అక్టోబర్లో వచ్చిన మోంథా తుపాను పంట నష్టపరిహారం ఇప్పటికీ అందలేదు. బ్యాంకర్లు రుణగ్రహీతల్లో స్థితిమంతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సన్న, చిన్నకారు రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నారు. దీంతో సాగు సంకటంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాటి పరిస్థితి తలకిందులు.. కొమ్ముమూరు ఆయకట్టుకు జిల్లా ధాన్యాగారంగా పేరు. మాగాణికి పుట్టిల్లు. ఇది ఒకప్పటి మాట. ముఖ్యమంత్రి చంద్రబాబు వరి సాగు తగ్గించాలని చెబుతున్నారు. తాను వరన్నం తినడం లేదంటారు. మిల్లెట్స్ వైపు దృష్టి సారించాలని సూచించారు. మాగాణి రైతులకు వరి సాగుకు ప్రత్యామ్నాయం ఏంటనేది మాత్రం ఆయన చెప్పలేరని విమర్శలు ఉన్నాయి. దీంతో జిల్లా ధాన్యాగారంగా గొప్పగా చెప్పుకున్న రైతులే నేడు తమ పరిస్థితి దిక్కుతోచని విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ‘బరువు’ జిల్లాలో గత ఏడాది ఖరీఫ్లో 1.27 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. రబీలో 1.78 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. గత ఏడాది యూరియా కొరత వెంటాడింది. రైతులకు అవసరమైన మేర సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాగాణి రైతులు యూరియా వాడకం తగ్గించాలని చెప్పుకొచ్చారు. ఈ ఏడాది పంట కాలానికి ముందే పలు రకాల ఎరువుల ధరలను పెంచారు. ఇది రైతులకు అదనపు భారం. ఖరీఫ్ పెట్టుబడులు కష్టమే.. ఽగిట్టుబాటు ధరలు అటుంచి మద్దతు ధరలు కూడా పూర్తి స్థాయిలో అందక ఉత్పత్తులను అరకొరగానే విక్రయించారు. అయితే ఖరీఫ్ సాగుకు సన్నద్ధం కావాలంటే పెట్టుబడులకు రైతులు అరువు బాట పట్టాల్సి వస్తోంది. గత ఏడాది అక్టోబర్ మాసంలో మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగాయి. భారీగా నష్టపోయారు. జిల్లాలో 18,609 మంది రైతులకు గాను 12,700 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నమోదు చేశారు. పరిహారంగా రూ.2,395 లక్షలు అందాల్సి ఉంది. సన్న, చిన్నకారు రైతులకు దక్కని బ్యాంకు రుణాలు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. కొత్తగా బాధ్యతలు స్వీకరించా. జిల్లాలో ఎక్కడా రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా మా పరిధిలో మేం పూర్తి స్థాయిలో పని చేస్తాం. ఇండెంట్ ప్రకారం విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపడతాం. ప్రభుత్వానికి నివేదిస్తాం. లక్ష్మి, డీఏఓ, బాపట్ల గత ఏడాది మొక్కజొన్న, వేరుశనగకు సంబంధించి సాగుదారులు కొంత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. దీంతో ఈ ఏడాది కొంతమేర వరి సాగు పెరిగే అవకాశం ఉంది. జూన్ 15 నుంచి ఖరీఫ్ పంట కాలం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం సబ్సిడీపై యంత్రపరికరాల పంపిణీ జరుగుతోంది. తరువాత ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలు, ఇతర విత్తనాలు ప్రాధాన్యత క్రమంలో పంపిణీ చేస్తాం. పచ్చి రొట్ట విత్తనాలకు 50 శాతం సబ్సిడీ ఉంటుంది. ఒక్కో రైతుకు విస్తీర్ణం ఎంత ఉన్నా హెక్టారుకు మాత్రమే సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతోంది. – నిర్మలాదేవి, ఏఓ, చీరాల జూన్ 15వ తేదీ నుంచి ఖరీఫ్ పంట కాలం మొదలవుతుంది. అందుకు ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలను చేలలో ఎద పెడతారు. మొక్క పెరిగాక భూమిలో కలియదున్నుతారు. దీంతో భూమికి పోషకాలు లభించి భూసారం పెరుగుతుంది. అయితే ఈ ఏడాది ఇంతవరకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ జరగలేదు. సబ్సిడీపై ఇచ్చే విత్తనాలు కూడా అరకొరగానే ఉన్నాయి. జిల్లాలో ఖరీఫ్లో 1.20 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి ఉంది. అందుకుగాను వ్యవసాయ శాఖ పరంగా పచ్చిరొట్ట విత్తనాలు 2,957 క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఒక్కో రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక హెక్టారుకు మాత్రమే 50 శాతం సబ్సిడీపై ఆ విత్తనాలు ఇస్తారు. అంతకన్నా అవసరమైతే ప్రయివేటు మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందే. వరికి సంబంధించి బీపీటీ 5204 రకం 800 క్వింటాళ్లు, ఎంటీయూ 1224 రకం 350 క్వింటాళ్లు, ఎంటీయూ 1061రకం 219 క్వింటాళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. చీరాల డివిజన్లోని మాగాణి రైతుల్లో ఎక్కువ మంది ఎంటీయూ 1262 రకం వరి విత్తనాలను అడుగుతున్నారు. దీంతో వారు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. శనగలు జె.జి. 11 రకం 2176 క్వింటాళ్లు, కాక్ 2 రకం 2,200 క్వింటాళ్లు, ఎన్బీఈజీ 452 రకం 42 క్వింటాళ్లు పంపిణీకి సిద్ధం చేశారు. ఇవి కూడా సాగయ్యే విస్తీర్ణానికి పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు. ఇక ఇతర విత్తనాల పరిస్థితి అదే విధంగా ఉంది. -
విద్యా వ్యవస్థపై శ్రద్ధ లేదు
ఏబీవీపీ నాయకుల ఆగ్రహంమంగళగిరి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇతర రంగాలపై పెట్టే దృష్టి విద్యావ్యవస్థపై పెట్టడం లేదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నాయకులు ఆరోపించారు. ఉన్నత విద్యావ్యవస్ధను సంస్కరించాలంటూ మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యాకార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏబీవిపి నాయకులు మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నత విద్యామండలి నుండే కామన్ ఎంట్రన్స్ పరీక్షలను సకాలంలో నిర్వహించినా అడ్మిషన్లు మాత్రం జాప్యం జరుగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ మధుమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవిపి రాష్ట్ర కార్యదర్శి వెంకట గోపి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అఖిల్, సాయి, సురేంద్ర, జాతీయ కార్యవర్గ సభ్యురాలు వేదశ్రీ, కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసుల అత్యుత్సాహం.... ఉన్నత విద్యామండలి కార్యాలయం ఎదుట ధర్నా చేసే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు నాయకులు ఆరోపించారు. ఒక్కసారిగా నాయకులంతా కార్యాలయం లోపలికి వెళ్లడంతో పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య తోపులాటలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కార్యాలయం లోపలే నినాదాలు చేస్తున్నారని అక్కడి నుంచి వారిని బయటకు పంపించామంటూ పోలీసులు చెబుతున్నారు. -
ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
కాలువలోకి దూసుకెళ్లిన కారు చీరాల: వేగంగా వెళుతున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి చీరాల– కారంచేడు రోడ్డులోని లారీ యూనియన్ ఆఫీస్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు... చీరాలలోని జవహర్నగర్కు చెందిన మనోజ్, వరుణ్, హేమంత్ కారులో చీరాల నుంచి కారంచేడు వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో చీరాల సమీపంలోని లారీ యూనియన్ కార్యాలయం వద్ద కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మనోజ్(16) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనోజ్ ఇటీవల పదో తరగతి పూర్తి చేశాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు క్షతగాత్రుల వద్ద నుంచి అవుటుపోస్టు పోలీసులు వివరాలను నమోదు చేసుకున్నారు. -
మహిళలు, చిన్నారులభద్రతపై అవగాహన
వినుకొండ: మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన సదస్సు పల్నాడు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పీ కృష్ణారావు హాజరయ్యారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గృహ హింస బాధితులు 181, అత్యవసర సేవల కోసం 112, మహిళలపై వేధింపులు, అక్రమ రవాణాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 1091, చైల్డ్ సేఫ్టీ కోసం 1098 నంబర్ల వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ హనుమంతరావు, రూరల్ సీఐ బ్రహ్మయ్య, సీఐ సుభాషిణి, పట్టణ కమిషనర్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతిభ పురస్కారాలకు దరఖాస్తులు గుంటూరు ఎడ్యుకేషన్: ఏకలవ్య ట్రైబల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పది, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు సొసైటీ రాష్ట్ర కన్వీనర్ డి.శ్రీనివాసరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ఎరుకల సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పదో తరగతిలో 540, జూనియర్ ఇంటర్లో 420, సీనియర్ ఇంటర్లో 900 మార్కులకు పైబడి మార్కులు సాధించిన వారు అర్హులని తెలిపారు. జూన్ 15వ తేదీలోగా దరఖాస్తులను ‘133–8–1878, హిమనీనగర్ 3వ లైన్, నగరాలు, అమరావతిరోడ్డు, గుంటూరు–522035’ చిరునామాకు పంపాలన్నారు. ఇతర వివరాలకు 99594 14333, 79894 78961, 63043 57686 ఫోను నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
క్వింటా పసుపునకు రూ.7 వేలు చెల్లించాలి
దుగ్గిరాల బాధిత పసుపు రైతుల వినతి కొరిటెపాడు(గుంటూరు): దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్నిప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు రూ.7,000 చొప్పున పరిహారం చెల్లించాలని బాధిత రైతులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఇన్సూరెన్న్స్ సొమ్ము కలిపి క్వింటాకు రూ.5,000 చొప్పున ఇస్తామని ఫైనల్ సెటిల్మెంట్గా భావించి తమతో సంతకాలు చేయించారని వెల్లడించారు. అయితే దానికి తాము అభ్యంతరం తెలిపామని, 2024 జూలైలో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వద్ద రూ.7,000 చొప్పున ఇస్తామని కోల్డ్స్టోరేజీ యాజమాన్యం ఒప్పందానికి వచ్చిందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంబంధించి ఇచ్చిన మార్పు లేఖను అంగీకరించి, తాము తయారుచేసిన పత్రాన్ని యాజమాన్యం అంగీకరించే వరకు నగదు పంపిణీ నిలిపివేయాలని అధికారులను కోరడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ రూ.5,000 పరిమితం చేసి ఫైనల్ సెటిల్మెంట్గా రసీదులు ఇవ్వడం అన్యాయమని బాధిత రైతులు ఎల్.భాస్కరరెడ్డి, రాజేష్, కళ్లం సీతారామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపురం: బక్రీద్ రోజున అనధికార జంతు వధ నిషేధమని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. గోవులను వధించరాదని, అధికారికంగా ఽధ్రువీకరించిన గొర్రెలు, మేకలను మాత్రమే వధింపుటకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అనధికార జంతు వధపై సమాచారం అందించాలని కోరారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్– 8688831391, పశు సంవర్ధక శాఖ– 8333086999, గుంటూరు మునిసిపాల్ కార్పొరేషన్ – 9849908363, పొన్నూరు మునిసిపాలిటీ – 9849905834, తెనాలి మునిసిపాలిటీ – 9849905830, ఎంటీఎంసీ– 7093320018, తెనాలి సబ్కలెక్టర్– 9849904008, రెవెన్యూ డివిజినల్ అధికారి, గుంటూరు – 9849904006, జిల్లా పంచాయతీ అధికారి– 9492758041. గుంటూరు రూరల్: ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు.. తాడికొండ మండలం పాములపాడుకు చెందిన దొడ్డా పవన్కుమార్(35) నగరంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి వెళుతున్నాడు. అదే సమయంలో నగర శివారుల్లోని ఎన్హెచ్ 16లో ఉన్న ఒక ప్రైవేటు కళాశాల బస్సు డ్రైవర్ అమరావతి రోడ్డు గోరంట్ల చిల్లీస్ సెంటర్ సమీపంలో విద్యార్థులను దింపి కళాశాలకు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్నాడు. అదే రోడ్డులో వస్తున్న పవన్కుమార్ యూటర్న్ తీసుకుంటున్న బస్సుకు ఢీకొన్నాడు. ప్రమాదంలో పవన్కుమార్ తీవ్రగాయాలు కాగా అతడిని స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో 2026 ఫిబ్రవరిలో జరిగిన ఎంబీఏ(హెచ్ఎ) ఇంటిగ్రేటెడ్, ఎంఏ పబ్లిక్ పాలసీ 1వ సెమిస్టర్ ఫలితాలను బుధవారం పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాద్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఎంబీఏ(హెచ్ఎ) ఇంటిగ్రేటెడ్ పరీక్షకు 87 మంది హాజరు కాగా 54 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఎంఏ పబ్లిక్ పాలసీ పరీక్ష 52 మంది రాయగా 50 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 28 వరకు రీవ్యాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకుని, అనంతరం ఆ దరఖాస్తులను 29వ తేదీలోపు పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కో సబ్జెక్ట్కు రూ.1,860 చెల్లించాలని, పర్సనల్ వెరిఫికేషన్కు రూ.2,190 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. బాపట్ల: తేనెటీగలు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, పంటల పరాగసంపర్కంలో తేనెటీగల సేవలు వ్యవసాయ దిగుబడులను పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయని బాపట్ల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూన రాణి అన్నారు. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాపట్ల వ్యవసాయ కళాశాల కీటక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తేనె ఉత్పత్తితో పాటు తేనెటీగల పెంపకం గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉత్తమ వాణిజ్య రంగమని వివరించారు. కీటక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎస్.ఆర్.కోటేశ్వరరావు మాట్లాడుతూ తేనెటీగల పెంపకంలో ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. తేనె ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ అంశాలలో శిక్షణ పొందితే స్వయం ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని చెప్పారు. రైతులు, యువత తేనెటీగల పెంపకాన్ని అనుబంధ వ్యవసాయ వృత్తిగా స్వీకరించాలని సూచించారు. తేనెటీగలపై పరిశోధన చేస్తున్న ఎం.సాయికుమార్ తన పరిశోధనలోని పలు ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
కేసీపీకి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ అవార్డు
మాచర్ల రూరల్: కార్మికుల సంక్షేమ, కర్మాగారంలో భద్రత, పరిశుభ్రతతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటిస్తున్న కేసీపీ సిమెంట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ కర్మాగారం, శ్రమశక్తి అవార్డును అందజేసింది. బుధవారం విజయవాడలోని తుమ్మలపల్లి కలక్షేత్రంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా అవార్డును సీనియర్ మేనేజర్ కె.వెంకటరమణ అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ దశాబ్దాలుగా కేసీపీ సిమెంట్స్ నాణ్యతలో రాజీ పడకుండా, కార్మికుల భద్రత, వారి కుటుంబ సంక్షేమలో యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి బెస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ, శ్రమశక్తి అవార్డును అందించిందన్నారు. ఇదే స్ఫూర్తితో ఉత్పత్తిలో నాణ్యత, ఉద్యోగుల భద్రతలో మరింత ప్రమాణాలు పాటిస్తూ ముందుకు పోతామన్నారు. రాష్ట్రస్థాయిలో కేసీపీ సంస్థకు బెస్ట్ అవార్డు రావడంపై ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆనంద వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. నరసరావుపేట: జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్ దండే నిర్వహించిన వీడియా కాన్ఫరెన్స్కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతి లాల్ దండే మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి, పూర్తి చేసిన పథకాలను గ్రామ పంచాయతీలకు అప్పగించే ప్రక్రియను త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ 2.0 కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పీఎం పథకాలతో గ్రామాలకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి కనెక్షన్లను అందిస్తున్నామన్నారు. నీటి నాణ్యత పర్యవేక్షణ, గ్రామస్థాయి ఎఫ్టీకే పరీక్షలు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. గ్రామీణ పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షించి పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు. నరసరావుపేట: రీసర్వేలో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై అచ్చంపేట మండలం కోనూరు గ్రామ సర్వేయర్ కిరణ్ కుమార్, వీఆర్ఓ వెంకయ్యలను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహా బుధవారం సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో కోనూరు గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదరు అధికారులు ఇద్దరూ భూమి కొలతలు, రెవెన్యూ రికార్డుల మార్పులు, ఇతర ప్రభుత్వ సేవల కోసం పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారని, తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. బాధితుల ఫిర్యాదులపై ప్రాథమిక విచారణ ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసర్వే విషయంలో అధికారుల నిర్లక్ష్యం, అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. నరసరావుపేట రూరల్: రూ.3వేలు చెల్లిస్తే రూ.3లక్షలు, ఆతర్వాత రూ.కోటి వస్తాయంటూ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేసినట్లు రూరల్ సీఐ ఎం.వి.సుబ్బారావు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు, ఒక ల్యాప్టాప్, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. బుధవారం సాయంత్రం రూరల్పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగండ్ల వెంకటరావు, నాగండ్ల వంశి, అదే మండలం కావూరు గ్రామానికి చెందిన దేవళ్ల నరసింహారావు, తెలంగాణ రాష్ట్రం మంచీర్యాల జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన పెండ్యాల నీరజలను అరెస్టు చేశామన్నారు. కేశానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో ధూళిపాళ్ల సైదావలి ఇంటివద్ద నిందితులు ఓ కార్యాలయం ఏర్పాటుచేసి నరసరావుపేట మండలం చుట్టుపక్కల ప్రజలకు మాయమాటలు చెప్పి రూ.3వేలు డిపాజిట్ చేస్తే తొలుత రూ.3లక్షలు అకౌంట్లో వేస్తారని, ఆ తర్వాత రూ.కోటి, ఆ తర్వాత రూ.25కోట్లు అకౌంట్లో వేస్తారంటూ నమ్మబలుకుతూ వ్యవస్థీకృత నేరానికి పాల్పడుతున్నారన్నారు. దీనిపై మండలంలోని కేసానుపల్లి గ్రామ వీఆర్ఓ పామిశెట్టి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టుచేశామన్నారు. -
అంబటి మురళీకృష్ణపై పోలీసుల జులుం
పొన్నూరు / చేబ్రోలు: గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో పోలీసులు మరోసారి జులుం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి జరుగుతున్న మొక్కజొన్న రైతుల పరామర్శను అడ్డుకోవడమే లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం రైతులను పరామర్శించేందుకు గ్రామానికి వచ్చిన రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, పార్టీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణలను అరెస్టు చేసేందుకు దౌర్జన్యానికి దిగారు. మురళీకృష్ణ నివాసంలో ఉన్న ప్రభాకర్ను తమ వెంట పంపించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఎందుకు పంపించాలో కారణం చూపించాలని మురళీకృష్ణ ప్రశ్నించారు. దీంతో పొన్నూరు రూరల్ ఎస్ఐ శ్రీహరి, సీఐ కృష్ణయ్య వాగ్వాదానికి దిగారు. రైతులపై దాడి చేసిన ఆ 31 మంది ఎమ్మెల్యే ధూళిపాళ్ల అనుచరులను అరెస్టు చేస్తే పోలీసులకు ఈ కష్టాలు ఉండవు కదా అన్నారు. రైతులకు అండగా నిలిచి శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్న వైఎస్సార్ సీపీపై దాడి చేయడమేంటని మండిపడ్డారు. ఇంటి మొదటి అంతస్తులో ఉన్న ప్రభాకర్ను అదుపులోకి తీసుకునేందుకు వెళుతున్న పోలీసులను మురళీకృష్ణ అడ్డుకున్నారు. ఆగ్రహించిన పోలీసులు ఆయన్ను బలవంతంగా నెట్టుకుంటూ పోలీసు వాహనం ఎక్కించారు. తర్వాత మళ్లీ ఇంట్లోకి ప్రవేశించి మురళీకృష్ణ సోదరితోపాటు అనేక మంది మహిళలు ఉన్నప్పటికీ తోసుకుంటూ మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు పగలగొట్టి జూపూడి ప్రభాకర్ను బలవంతంగా తీసుకువచ్చి పోలీసు జీపు ఎక్కించారు. వాహనానికి అడ్డుపడిన పార్టీ కార్యకర్తలు, రైతులపై లాఠీచార్జ్ చేశారు. మహిళలను సైతం మగ పోలీసులు దౌర్జన్యం చేస్తూ లాగిపడేశారు. పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య, ఎస్ఐ శ్రీహరి, పట్టణ సీఐ వీరా నాయక్, తెనాలి సీఐ, చేబ్రోలు ఎస్ఐలతోపాటు పోలీసులు రైతుల పట్ల దారుణంగా వ్యవహరించడాన్ని గ్రామస్తులు, రైతులు ఖండించారు. వారిద్దరినీ చేబ్రోలు పోలీసు స్టేషన్కు తరలించి రెండు గంటల పాటు ఉంచి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఇద్దరిని పంపించేశారు. ఈ సందర్భంగా అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీసులను అడ్డుపెట్టుకుని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మామిళ్లపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యంలో నష్టపోయి, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న రైతులను వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు పరామర్శించి సంఘీభావం ప్రకటించడం తప్పా అని ప్రశ్నించారు.దౌర్జన్యం చేసిన పోలీసులపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు. అరాచకం సృష్టిస్తున్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల పొన్నూరు ఏమైనా పాకిస్థాన్లో ఉందా.. కష్టంపై ఆధారపడి జీవనం సాగించే రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా చంద్రబాబుకు కనిపించడం లేదా అని వైఎస్సాఆర్ సీపీ గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన వెంకట మహేష్ నిలదీశారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ చేసింది నేరమా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి జోగి రమేష్, పార్టీ రాష్ట్ర నాయకుడు జూపూడి ప్రభాకర్ను పోలీసులతో అక్రమ అరెస్టులు చేయించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని ధ్వజమెత్తారు. కాపు రైతులకు అండగా నిలుస్తున్న మురళీకృష్ణను వేధించడం ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేయడమేనని విమర్శించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
తెనాలిరూరల్: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కంచర్లపాలెంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కోపల్లె కార్తీక్(18) ఐటీఐ పూర్తి చేశాడు. ఆటోనగర్ నుండి సోమసుందరపాలేం వెళ్లే మార్గంలో కంచర్లపాలెం గ్రామ శ్రీవారు ప్రాంతంలో కార్తిక్ మృతిచెంది ఉండడాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాలీబాల్ కోర్టు వద్ద నెట్ వైరు గొంతుకు బిగించిన స్థితిలో పోల్కు వేలాడుతూ కనిపించాడు. డీఎస్పీ బి.జనార్ధనరావు, రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్ఐ కె.ఆనంద్ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. గుంటూరు నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వచ్చి ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నించింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడితో పాటు మరి కొందరు యువకులు మంగళవారం రాత్రి మద్యం తాగి, ఇంటికి వెళ్లే క్రమంలో బైక్లో పెట్రోలు అయిపోవడంతో నెట్టుకుంటూ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన కార్తిక్ బయటకు ఎందుకు వచ్చాడు? ఏం జరిగిందన్న విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. ఒంటిపై/లోపల గాయాలు లేవని పోస్ట్ మార్టం సందర్భంగా వైద్యులు గుర్తించినట్టు తెలిసింది. మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలనున్నాయని సీఐ తెలిపారు. -
అడ్డగోలుగా తూకమేస్తున్నారు!
తూనికలు, కొలతల మోసాలతో సామాన్యుడికి నష్టంచంద్రబాబు పాలనలో ఇప్పటికే అన్ని నిత్యావసరాలు, కూరగాయల ధరలూ మండుతున్నాయి. సగటు మనిషి కుటుంబ సభ్యులతో కలిసి మూడు పూటలా పట్టెడన్నం తినలేకపోతున్నాడు. సంపాదన కన్నా రోజురోజుకు చుక్కలు చూపిస్తున్న సరుకుల ధరలే అందుకు కారణం. ఈ క్రమంలో వెచ్చాల నుంచి పాలు, కూరగాయలు, పండ్లు, మాంసం.. ఇలా కొనుగోలు చేసే క్రమంలో విక్రయదారుల చేతివాటంతో ఇంకొంత కుంగిపోతున్నారు. పలు రేషన్ దుకాణాలకు సంబంధించిన కాటాల విషయంలో కూడా విమర్శలున్నాయి. చెల్లించిన మొత్తానికి సరిపడా సరుకులు రావడం లేదు. కాటాలో చేతివాటమే అందుకు కారణం. వీటిపై చర్యలు చేపట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ శీతకన్ను వేసింది. దీంతో సగటు జీవులు నష్టపోతున్నారు. చీరాల అర్బన్: తూనికలు, కొలతలు.. ఇవి ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో అవసరం అవుతుంటాయి. అది బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి పాలు, నూనె వరకు ఏదైనా కావచ్చు. అందుకు సంబంధించి వినియోగదారులు నష్టపోకుండా నియంత్రించేందుకు ఉండేదే తూనికలు, కొలతల శాఖ. ఆ శాఖకు సంబంధించిన కార్యాలయాలు ఎక్కడ ఉంటాయో కూడా ప్రజల్లో ఎక్కువ మందికి తెలీదు. ఆ శాఖ విధుల నిర్వహణకు సంబంధించిన పరిధి ఎక్కువ. సంబంధిత అధికారుల పర్యవేక్షణ తక్కువనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించిన డిప్యూటీ కంట్రోలర్ నెల్లూరులో ఉంటారు. బాపట్ల జిల్లాకు సంబంధించి అసిస్టెంట్ కంట్రోలర్ బాపట్లలో ఉంటారు. బాపట్ల, చీరాల డివిజన్లకు సంబంధించి ఇద్దరు ఇన్స్పెక్టర్లు ఒకరు బాపట్లలో, ఒకరు చీరాలలో ఉంటారు. అయితే వీరికి పరిధి ఎక్కువ కావడంతో పర్యవేక్షణ తక్కువగా ఉంటోందన్న విమర్శలున్నాయి. అసిస్టెంట్ కంట్రోలర్ జిల్లా పర్యవేక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తారు. తూనికలు, కొలతల శాఖకు సంబంధించి అద్దంకి నియోజకవర్గం ఇప్పటికీ బాపట్ల జిల్లా పరిధిలోనే ఉంది. దీంతో పర్యవేక్షణ పరిధి 25 మండలాలుగా ఉంది. బాపట్ల ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో 12 మండలాలు, చీరాల ఇన్స్పెక్టర్ కార్యాలయం పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వారి పరిధిలో పెద్దపెద్ద కంపెనీల నుంచి తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వరకు కాటాలు, కొలతల పరికరాలు ఎక్కడెక్కడ వినియోగిస్తారో నిఘా ఉంచాలి. నిబంధనల మేరకు చిన్న కాటాలకు, ఎలక్ట్రానిక్ కాటాలకు, మిల్లీ లీటర్ల కొలతలకు సంబంధించి ఏడాదికి ఒకసారి, అడ్డ కాటాలు (ఇనుప రాళ్లవి)కు సంబంధించి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆయా కాటాలపై శాఖాపరమైన ముద్రలు వేయాలి. అలా ముద్రలు వేయించుకోని వారిని గుర్తించి అధికారులు కేసులు నమోదు చేయాలి. అపరాధ రుసుం వసూలు చేయాలి. కొందరు విక్రయదారులు కాటాల్లో కనికట్టు చేస్తున్నారు. తూకాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మరికొందరైతే ఏకంగా కాటాలకు నిబంధనల మేరకు ముద్రలు వేయించుకోకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ఇవేమీ అధికారులు పట్టించుకోవడం లేదు. ముద్ర వేసినప్పుడు మామూళ్లు... సంబంధిత వ్యక్తులు నిబంధనల మేరకు ముద్రలు వేసేందుకు ప్రభుత్వానికి రుసుం కాకుండా అదనంగా మామూళ్లు చెల్లించాల్సి వస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారుల స్థాయిని బట్టి మొత్తాలు అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో వారు తిరిగి కొనుగోలుదారుల వద్ద చేతివాటం చూపుతున్నారు. బార్లలో మద్యం విక్రయాల కొలతల పరికరాలలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా నిబ్ (క్వార్టర్), ఔన్స్(30 ఎంఎల్) కొనుగోలుదారులకు ఇచ్చే సమయంలో కౌంటర్లోని వ్యక్తులు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. తొలుత ఒకింత సక్రమంగా ఇచ్చినా.. ఆ తర్వాత ఆర్డర్ చేసిన వారు మద్యం మత్తులో పట్టించుకోరనే ఉద్దేశంతో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో పలు బార్ల వద్ద వాదనలు, ఘర్షణలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక, కొన్ని చోట్లయితే కొలతల పరికరాన్ని ఒకింత పైభాగం అరిగే విధంగా రుద్దుతారు. సంబంధిత అధికారులకు తెలిసే ఇది జరుగుతోందని, అందుకు తగిన ప్రతిఫలం వారికి ఉంటుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
పూడికతీతలోనూ నిర్లక్ష్యమే
రేపల్లె: ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నలను మురుగు కాలువల సమస్య వెంటాడుతోంది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ ఖరీఫ్లో వరి పంటకు ముంపు బెడద తప్పేలా లేదు. తీరంలో నెలల తరబడి కష్టించిన రైతులకు పంట చేతికొచ్చే సమయంలో వర్షం కురిసిందంటే కాల్వల్లోని గుర్రపుడెక్క, తూటికాడ సమస్య వేధిస్తోంది. పంట చేతికొచ్చే సమయంలో ఆకస్మికంగా కురిసే వానలతో పొలాల్లో చేరిన వర్షపు నీరు బయటకు పోయే పరిస్థితులు కనిపించడం లేదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వంగా వారి కష్ట సుఖాలనెరిగి ఖరీఫ్కు ముందే అవసరమైన డ్రెయిన్లలో తూటికాడ, గుర్రపు డెక్కలను తొలగించి సమస్యను పరిష్కరించేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేపల్లె డివిజన్లోని డ్రెయిన్లలో పూడిక తీయించిన దాఖలాలు లేవు. ఈ వేసవిలోనైనా పూడికలు తీయించి ఖరీఫ్కు ముంపు బెడద నుంచి రక్షించాలని రైతులు కోరుతున్నారు. ప్రధాన డ్రెయిన్లు ఇవే... రేపల్లె సబ్ డివిజన్లో ప్రధానంగా ఉన్న ఆర్ఎం డ్రెయిన్, బీఏం డ్రెయిన్, జగజ్జెరువు కాలువ, రేపల్లె మురుగు కాలువ, వాడమురుగు డ్రెయిన్, రేపల్లె న్యూకోర్స్, ఓల్డ్ కోర్స్ కాలువలలో తూటి కాడ, గుర్రపు డెక్క, జన్నే కాలువ, బడే కాలువ, సౌత్మీడియం డ్రెయిన్, పిల్లివాగు డ్రెయిన్, తగడాల డ్రెయిన్ తదితర చోట్ల ప్లాస్టిక్, చెత్త చెదారాలు పేరుకుపోయాయి. వీటి ద్వారానే పంట పొలాల్లో వర్షపు నీరు బయటకు పోవాల్సి ఉంది. రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె మండలం, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల్లో 34,060 హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగు అవుతోంది. ఈ భూమిలో వృథా నీరుతోపాటు అధిక వర్షాలు కురిసిన సమయంలో వదర ఈ ప్రధాన మురుగు కాల్వల ద్వారానే పారుదల కావాల్సి ఉంది. కాలువలు పూడుకుపోయి ఉండటంతో నీటి పారుదల ప్రశ్నార్థకంగా ఉందని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. పంట చివరి దశ నవంబర్, డిసెంబర్ మాసాలలో ఈ ప్రాంతాలలో అధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఆ సమయంలో సకాలంలో నీరు పారుదల కాకుంటే పంట ముంపునకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతన్నలు భయాందోళనలకు గురవుతున్నారు. త్వరగా పనులు చేపట్టాలి వర్షాలు పడే సమయంలో కాలువల ద్వారా నీరు బయటకు పోయేలా అధికారులు డ్రెయిన్ల పూడికతీత పనులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. వేసవి ప్రారంభమై నెల గడుస్తున్నా అటు పాలకులు, ఇటు అధికారులు పూడికతీత పనుల ఊసెత్తకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు. రేపల్లె వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో ప్రధాన మురుగు కాల్వలలో పూడికతీతకు ప్రభుత్వం నుంచి రూ.1.50 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. టెండర్ల ప్రక్రియ ముగిసింది. పనులు త్వరలో ప్రారంభించి ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేస్తాం. – పి.వీరయ్య, డ్రైనేజీ డీఈఈ, రేపల్లె -
సొసైటీలో రూ.50 లక్షల గోల్మాల్
మార్టూరు: ‘ఒక్కరి కోసం అందరు.. అందరి కోసం ఒక్కరు‘ అనే సూత్రాన్ని ప్రాతిపదికగా చేసుకొని ఏర్పడిందే సహకార బ్యాంకింగ్ వ్యవస్థ. కానీ నేడు కొందరు స్వార్థం కోసం ఆ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు. అధికారులు, సంబంధిత ప్రజాప్రతినిధుల తీరే దీనికి కారణం. బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామ సొసైటీలో దాదాపు రూ.50 లక్షల మేరకు గోల్మాల్ జరిగిందని సొసైటీ గేటు వద్ద రైతులు మంగళవారం నిరసనకు దిగారు. సొసైటీలో వందలాదిమంది రైతులు రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లించడానికి ఇటీవల కొందరు వెళ్లారు. మధ్యలో తాము చెల్లించిన మొత్తం జమ కాకపోవడం, తీసుకున్న రుణం కన్నా అధిక మొత్తాలు తమ పేరిట కనిపించడంతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక పోలీస్ స్టేషనుకు పంచాయితీ చేరింది. సొసైటీ మాజీ సీఈవో పెంట్యాల అనిల్ కుమార్ పోలీసులు ఎదుట తాను వాడుకున్న నిధులను తిరిగి చెల్లిస్తానని ఒప్పుకొని తర్వాత కనిపించకుండా తిరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. దాదాపు రూ.50 లక్షలకుపైగా అనిల్ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. గత ఖరీఫ్ సీజన్లో రైతుల కోసం సొసైటీకి కేటాయించిన నాలుగు లారీ లోడుల కాంప్లెక్స్ ఎరువులను అనిల్ కుమార్ బయట గ్రామాల్లో విక్రయించినట్లు ఆరోపణల నేపథ్యంలో అతడిని ఇటీవల ద్రోణాదుల నుంచి కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామ సొసైటీకి బదిలీ చేశారు. అధికారులు ఇలా చేతులు దులుపుకోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దల ప్రమేయంపై అనుమానాలు తమ కష్టార్జితాన్ని అనిల్ కుమార్ ఒక్కడే కాజేయలేదని,. కొందరు పెద్దల ప్రమేయం కూడా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. విచారణ జరిపించి వారి బండారం కూడా బయటపెట్టి కేసులు నమోదు చేసేంతవరకు సొసైటీ గేటు ముందు నిరసన ఆపబోమని రైతులు భీష్మించుకున్నారు. పరిమితికి మించి లోన్లు మంజూరు చేయటం, రుణాలలో దాదాపు నాలుగో వంతు అధికారులు, సిబ్బంది స్వాహా చేయడం, విపరీతంగా కమీషన్లు వసూలు చేయటం, దశలవారీగా చెల్లించిన రుణాలు సంబంధిత రైతుల ఖాతాలలో జమ కాకపోవటం వంటి సమస్యలతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతుల కష్టార్జితాన్ని స్వాహా చేసి ఆస్తులు కూడబెట్టిన మాజీ సీఈవో అనిల్ కుమార్ను పోలీస్ స్టేషన్కు పిలిపించాలని, అతని ఆస్తులు అమ్మి తమను రుణ విముక్తులుగా చేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితమే డీసీవోగా బాధ్యతలు తీసుకున్నాను. ద్రోణాదుల సొసైటీలో నిధుల గోల్మాల్ గురించి తెలిసింది. సంబంధిత వ్యక్తులపై శాఖాపరమైన విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటాం. – యల్లమందరావు, డీసీవో -
బగళాముఖి సన్నిధిలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): స్థానిక బగళాముఖి అమ్మవారిని ఏపీ హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద మాజీ న్యాయమూర్తి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకొచ్చారు. శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం వారికి పండితులు వేదాశీర్వచనాలను అందించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కె.చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తిలు జడ్జికి అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలను అందజేశారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు పొన్నూరు: పట్టణంలోని సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానాన్ని మంగళవారం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు కుటుంబ సమేతంగా సందర్శించారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని మాజీ జడ్జి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొల్లాపల్లి: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ట్రాన్స్కో పల్నాడు జిల్లా ఎస్ఈ డాక్టర్ పి.విజయకుమార్ సిబ్బందికి సూచించారు. బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సెక్షన్ పరిధిలో 33/11 కేవీ, గుమ్మనంపాడు, అయ్యన్నపాలెం, రావులాపురం, గండి గనుముల సబ్స్టేషన్లను ఎస్ఈ మంగళవారం తనిఖీ చేశారు. సబ్స్టేషన్ సిబ్బందికి, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు. కరెంటు కోతలు, లో వోల్టేజ్ సమస్య లేకుండా చూడాలన్నారు. తనిఖీల్లో వినుకొండ డీఈఈ తన్నీరు శ్రీనివాసరావు, రేమిడిచర్ల సెక్షన్ ఏఈ బాణావత్ రామాంజనేయులు నాయక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): సెంట్రల్ జీఎస్టీ గుంటూరు కమిషనరేట్ నూతన కమిషనర్గా అరుణ్ రిచర్డ్ మంగళవారం గుంటూరు కన్నావారితోటలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2007 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కి చెందిన అరుణ్ రిచర్డ్ విశాఖపట్నం జీఎస్టీ, కస్టమ్స్ జోన్లోని ఐదు కమిషనరేట్లకు అప్పిలేట్ అథారిటీగా, సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ అప్పీల్స్ కమిషనర్గా పనిచేస్తూ గుంటూరు జీఎస్టీకి బదిలీపై వచ్చారు. కమిషనర్ మాతృబాష తెలుగు అయినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో పనిచేయడం ఆయనకు ఇదే మొదటిసారి. అరుణ్ రిచర్డ్ను అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కమిషనర్కు అడిషనల్ కమిషనర్ బి.లక్ష్మీనారాయణ, జాయింట్ కమిషనర్ దేవ్కుమార్, పీఆర్ఓ ఆర్.పి.పి. కుమార్లు స్వాగతం పలికారు. సిబ్బంది మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ తిక్కన కాన్ఫరెన్సు హాలులో మంగళవారం గుంటూరు రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెకానిక్ ఇన్చార్జులతో ఆర్ఎం డి.సాంబ్రాజ్యం సమీక్ష సమావేశం నిర్వహించారు. డిపో అధికారుల పనితీరు, ఆదాయ మార్గాలు పెంపొందించేలా కేఎంపీఎల్ విధానాలపై సమీక్షించారు. బస్సులు మార్గంమధ్యలో ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీకి తగ్గట్టు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో పలువురు డిపో మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ ఆఫీసుకోసం చెరువునే ఎండబెట్టారు
● పార్టీ కార్యాలయం పేరుతో యథేచ్ఛగా మట్టి తరలింపు ● చెరువులోని నీటిని బయటకు తరలించి మరీ తవ్వకాలు ● చెరువులో పెద్ద ఎత్తున గోతులు.. వందలాది ట్రిప్పులు ● పట్టించుకోని అధికారులు ముప్పాళ్ళ: మట్టి కోసం ఏకంగా నిండుకుండలా ఉండే ముప్పాళ్ళ చెరువునే ఎండబెట్టారు తెలుగుదేశం పార్టీ ముప్పాళ్ల నాయకులు. ముప్పాళ్ళలోని పెదనందిపాడు బ్రాంచి కాలువ సమీపంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం పేరుతో ముప్పాళ్ళ చెరువును ఖాళీ చేశారు. ఎల్నినో ప్రభావంతో ప్రమాదం పొంచి ఉందని, వర్షాలు కురిసే అవకాశం లేదని, నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని, చెరువుల్లో ఉన్న నీటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటిని బయటకు వెళ్లబెట్టకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ.. ఇక్కడ అధికారులకు చీమకుట్టినట్లుగా కూడా లేకుండా పోయింది. జలధార పేరుతో చెరువులను బలోపేతం చేయాల్సింది పోయి చెరువులోని నీటిని బయటకు పంపి మట్టి అమ్ముకుంటున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు గాలికొదిలేశారు. చెరువులో పెద్ద ఎత్తున గోతులు పెట్టి వందలాది ట్రిప్పులు మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు, పోలీస్స్టేషన్ ఎదురు గుండా మట్టి ట్రాక్టర్లు తరలివెళుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రైతులు పొలాల్లో మట్టిని తరలించుకోవాలంటే సవాలక్ష అనుమతులు కావాలంటూ ఇబ్బందులు పెట్టే అధికారులు ఏమీ తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చెరువులో నీటిని వెళ్లబెట్టడమే కాకుండా, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం పై ఆ పార్టీలోని వారే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి భూమిలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణపనులు చేపట్టారు. అప్పట్లోనే సాగర్ ఆయకట్టు పరిధిలో దిగువ భూములకు నీటి తరలింపు కోసం నిర్మించిన కాలువలకు ఇరువైపులా 100 అడుగుల మేర ఖాళీ స్థలాన్ని వదిలి పెట్టి కాలువలు తవ్వారు. ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రమాదం సంభవించి కాల్వలకు గండి పడితే పక్కనే ఉన్న ఎన్ఎస్పీ స్థలంలోని మట్టిని కట్టలకు వినియోగించుకోవాల్సి ఉండేందుకు వినియోగించుకోవాల్సి ఉంది. రైల్వే, ఎన్ఎస్పీ స్థలాలు ఆక్రమించటం చట్టరీత్యా నేరం. అలాంటి స్థలాల్లో అనుమతులు లభించటం కూడా అరుదు. అయితే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు చట్టాలు వర్తించకుండా పోయాయి. ఏకంగా ఎన్ఎస్పీ కాలువకు సంబంధించిన 0.20 సెంట్ల భూమినే కబ్జా చేస్తున్నారు. అందులో ఏకంగా నిర్మాణాలకు తెర లేపారు. ఎన్ఎస్పీ అధికారులు కూడా ఏమీ తెలియనట్లుగానే మౌనముద్ర వహిస్తుండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాల్లోను, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్థలాల్లోను రాజకీయ పార్టీలకు చెందిన భవనాల నిర్మాణాలు జరిగే ఆస్కారం లేక పోలేదనే అనుమనాలు పెద్దలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఎన్ఎస్పీ స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతున్నారు. -
ఏపీ నాల్గో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం కార్యవర్గం ఎన్నిక
గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలోని ఎన్న్జీవో హోంలో ఆల్ ఆంధ్రప్రదేశ్ నాల్గవ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం గుంటూరు జిల్లా ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. ఎన్నికల అధికారిగా ఏపీ ఎన్జీజీవో గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బి.కృష్ణకిషోర్, సహా ఎన్నికల అధికారిగా గుంటూరు సిటీ కార్యదర్శి జీవీ కోటేశ్వరరావు, పరిశీలకునిగా జిల్లా కోశాధికారి ఎల్.శ్రీధర్ రెడ్డి వ్యవహరించారు. సింగిల్ సెట్ నామినేషన్లు దాఖలు కావడంతో పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి ప్రకటించి, వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా పి.కోటేశ్వరరావు (రెవెన్యూ), సహాధ్యక్షుడి వి రమేష్కుమార్ (వాణిజ్య పన్నుల శాఖ), ఉపాధ్యక్షులు బి వినోద్ చౌదరి (పశు సంవర్ధక శాఖ ), ఎం వెంకటేశ్వర్లు(డీఎస్ఓ ఆఫీస్ ), కార్యదర్శి ఎం సుధాకర్(వ్యవసాయ శాఖ), కార్యనిర్వాహక కార్యదర్శి ఎం రాణి (జలవనురుల శాఖ), సంయుక్త కార్యదర్శులు పి.వెంకటేశ్వరరావు (రహదారులు భవనాల శాఖ), వి.విజయ్ప్రసాద్ (జిల్లా కోర్టు), కోశాధికారిగా ఎం మల్లికార్జున నాయక్ (జల వనరుల శాఖ) ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా జేఏసీ చైర్మన్, ఏపీఎన్జిజీవో జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో నాల్గవ తరగతి ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. జిల్లా జేఏసీ అధ్యక్షుడిగా, ఏపీ ఎన్జీజివో సంఘం తరఫున నాల్గవ తరగతి ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీజిఓ జిల్లా కార్యదర్శి ఏ. శ్యాంసుందర్ శ్రీనివాస్, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్, కార్యదర్శి జి సుబ్బనారాయణ, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కుళ్లాయప్ప, ఏపీ ఎన్జీజీవో గుంటూరు సిటీ అధ్యక్షుడు సిహెచ్.కళ్యాణ్కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శి నరసింహారావు, నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సభ్యులను అభినందించారు. -
నేడు జూపుడి ప్రభాకరరావు మామిళ్లపల్లి రాక
పొన్నూరు: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులు చేసిన దాడిలో నష్టపోయి, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న మొక్కజొన్న రైతులను పరామర్శించి సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకరరావు బుధవారం మామిళ్లపల్లి గ్రామానికి వస్తున్నారని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు. మంగళగిరి టౌన్: ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. విశాఖపట్నం అగనంపూడికి చెందిన వరసాల ప్రవీణ్కుమార్(32) మంగళగిరి మండలంలోని నీరుకొండలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నాలుగు సంవత్సరాల నుంచి ప్లేస్మెంట్ సెల్లో పనిచేస్తున్నాడు. ఈనెల 15వ తేదీ కుటుంబ సభ్యులందరూ కాకినాడ వెళ్లడంతో ప్రవీణ్కుమార్ కూడా కాకినాడ వెళ్లాడు. 17వ తేదీ కాకినాడ నుంచి తిరుగు ప్రయాణంలో బస్సులో బయలుదేరి 18వ తేదీన మంగళగిరికి చేరాడు. మంగళగిరి పట్టణ పరిధిలోని తెనాలి ఫ్లై ఓవర్ వద్ద బస్సుదిగి రాజీవ్ సెంటర్కు వచ్చే క్రమంలో ప్రవీణ్కుమార్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సహ ఉద్యోగి సునీల్ మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. చికిత్స పొందుతూ ప్రవీణ్కుమార్ మృతి చెందాడు. మృతుడు తండ్రి జేమ్స్రాజ్ ఫిర్యాదు మేరకు మంగళగిరి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 112 దొంగతనాల కేసులు నమోదు నగరంపాలెం: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడే చిల్లర సురేష్ అలియాస్ చల్లా సురేష్పై పీడీ యాక్ట్ను గుంటూరు జిల్లా పోలీసులు ప్రయోగించారు. ఈ మేరకు అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 112 దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పారు. అతను అనేకమార్లు జైళ్లకు వెళ్లినా నేర ప్రవత్తి మారలేదన్నారు. ప్రజల్లో భయాందోళనలు స్పష్టిస్తున్న చిల్లర సురేష్పై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నల్లపాడు పీఎస్ పోలీసులు నిరంతర నిఘా ఏర్పాటు చేశారన్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు నిఘాలో వెల్లడైందని అన్నారు. దీంతో అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్వర్మకు సిఫార్సు చేశారని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సిఫార్స్తో ముద్దాయిపై పీడీ యాక్ట్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు. 38 ఏళ్ల వయసున్న చిల్లర సురేష్ పై తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో 2024 –26 వరకు సుమారు 112 చోరీల కేసులు నమోదైనట్లు జిల్లా పోలీసులు తెలిపారు. -
25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవగుంటూరు వెస్ట్: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తెలిపారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలకు రెగ్యులర్ పదవ తరగతి విద్యార్థులతోపాటు, ఓపెన్ స్కూలింగ్ పదవ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. జిల్లాలో మొత్తం 18 పరీక్ష కేంద్రాలలో మొత్తం కలిపి మూడు వేల మంది విద్యార్థులు రాస్తారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి కాకుండా బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్తో పాటు అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. వేసవి తీవ్రత రీత్యా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించడం జరుగుతుందని, పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి డాక్టర్ షేక్ సలీంబాషా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షల నిర్వహణకు అధికారులందరు సహకరించాలని కోరారు. డీఆర్వో షేక్ ఖాజావలి, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ● ప్రజా సమస్యలపై నిత్యం పోరుడుతాంభట్టిప్రోలు: భట్టిప్రోలు గ్రామంలోని ఓ దేవాలయం, బడి పక్కన మద్యం షాపులు పెట్టి మైనర్ బాలురకు మద్యం విక్రయించడాన్ని ప్రశ్నించినందుకు తనపై రెండు అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు ఆరోపించారు. ఈ అక్రమ మద్యం కేసులో మంగళవారం రేపల్లె పట్టణ కోర్టుకు అశోక్బాబు పార్టీ నేతలతో కలసి హాజరయ్యారు. అశోక్బాబు మాట్లాడుతూ పవిత్రమైన దేవాలయం, చిన్నారులు చదువుకునే బడి పక్కన మద్యం షాపు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. తనతో పాటు మరో 17 మందిపై రెండు అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. మైనర్ బాలురకు మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. సమాజాన్ని నాశనం చేసేలాంటి పనులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అవినీతిపై తన పోరాటం ఆగదని...న్యాయం గెలుస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని విమర్శించారు. కోర్టుకు భారీ సంఖ్యలో వేమూరుతో పాటు రేపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చి అశోక్బాబుకు సంఘీభావం తెలియ చేశారు. కార్యక్రమంలో డి.ప్రతాప్, డి.కిరణ్బాబు, ఎం.కోటేశ్వరరావు, యలమంద, సయ్యద్ నబీ, వి. నాగేశ్వరరావు, సిరాజుద్ధీన్, తదితరులు ఉన్నారు. -
జనగణనలో వివరాలు నమోదు చేసుకున్న కలెక్టర్
బాపట్ల: జన గణన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తన కుటుంబం వివరాలు నమోదు చేయించారు. మంగళవారం కలెక్టర్ బంగ్లాకు జనాభా లెక్కల సేకరణకు వచ్చిన సిబ్బందికి వివరాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జన గణన ప్రక్రియను ప్రతి కుటుంబం బాధ్యతగా తీసుకుని సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు జనగణన సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. జనాభా లెక్కల సేకరణలో పాల్గొనే సిబ్బంది నిబంధనలకు అనుగుణంగా ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని, ప్రజలు కూడా సహకరించాలని కలెక్టర్ సూచించారు. చిలకలూరిపేట టౌన్: పోలీసులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. మంగళవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండల పరిధిలోని తాతపూడి జాతీయ రహదారిపై రూరల్ ఎస్ఐ జి.అనిల్కుమార్ తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి చైన్నె వైపు వెళ్తున్న ఐరా ట్రావెల్స్ బస్సును ఆపి సోదా చేశారు. ఎటువంటి పత్రాలు లేని రూ.45.30 లక్షల నగదు వెలుగుచూసింది. పోలీసులు నగదును స్వాధీనం చేసుకుని, నరసరావుపేటకు చెందిన షేక్ మొహమ్మద్ హనీఫ్ను విచారించారు. చైన్నెలో బంగారం కొనుగోలుకు వెళ్తున్నట్లు అతను తెలిపాడు. ఆధారాలు చూపలేకపోవడంతో ఎస్ఐ నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం విజయవాడలోని ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగించారు. -
పెట్రో ధరల పెంపుతో సామాన్యులపై భారం
బాపట్ల: పెట్రో ధరలు పెంపుతో సామాన్యుడిపై పెనుభారం పడుతుందని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య మండిపడ్డారు. మంగళవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చల్లా రామయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచేదిలేదని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఉకదంపుడు ఉపన్యాలు చేసి గద్దెనెక్కారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా కనీసం పన్నుల భారాన్ని కూడా అరికట్టలేకపోయ్యారని దుయ్యబట్టారు. ప్రజల వ్యతిరేకతను చవిచూడకముందే పెంచిన పెట్రో ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మార్కెట్యార్డు మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి, నాయకులు ఉరబిండి గోపినాధ్,శాయిల మురళి, తన్నీరు అంకమ్మరావు,కటికల యోహోషువా, వడ్డిముక్కల శామ్యూల్, దర్శి కళ్యాణ్,సన్నీ మహేంద్ర, పులి శ్రీనివాసరావు, ఆది వంశీ తదితరులు ఉన్నారు. వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్య -
పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఆటో కార్మికుల నిరసన
బాపట్ల: పెట్రో ధరలు పెంచి సామాన్యుడిపై పెనుభారాన్ని మోపటం సరికాదని బాపట్ల కార్మిక శక్తి ఆటో యూనియన్ నాయకులు కె.శ్యామ్బాబు పేర్కొన్నారు. బాపట్ల కార్మిక శక్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్ సర్కిల్లో నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు ఆటో కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపు తున్నాయని అన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బాపట్ల ఆటో కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ సభ్యులు డి.సాంబశివరావు, జె.కోటయ్య, ఎం. నాగరాజు, షేక్ ఖాసిం పాల్గొన్నారు. బాపట్ల: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పి.వి. సత్యనారాయణను బాపట్ల వ్యవసాయ కళాశాలతో పాటు ఇతర అనుబంధ కళాశాలల టైమ్ స్కేల్ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా మంగళవారం కలిసి అభినందించారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉద్యోగులు తమ సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి తప్పకుండా పరిష్కరిస్తానని డాక్టర్ పి.వి. సత్యనారాయణ హామీ ఇచ్చారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా.ఏ.మణి, టైమ్ స్కేల్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి ప్రతినిధులు పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్: తన సర్టిఫికెట్లు అక్రమంగా వినియోగించిన డీమార్టు యాజమాన్యంతో పాటు సహకరించిన వ్యవసాయ అధికారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో వన్టౌన్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురజాల మండలం అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి స్వర్ణలత ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివింది. 2021లో గుంటూరు గుజ్జనగుండ్ల డీమార్టులో స్టాప్గా చేరింది. ప్రస్తుతం ఆమె నూజివీడు డీమార్టులో పనిచేస్తోంది. గత నెల 24వ తేదీ సరుకులు కొనుగోలు చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నరసరావుపేట డీమార్టుకు వచ్చింది. అక్కడ తన పేరిట ఉన్న ఫెస్టిసైడ్ లైసెన్స్ను చూసి అవాక్కయింది. ఉద్యోగంలో చేరే సమయంలో ఆమె అందజేసిన సర్టిఫికెట్లతో అక్రమంగా డీమార్టు యాజమాన్యం లైసెన్స్ పొంది క్రిమిసంహారక మందులను విక్రయిస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో వన్టౌన్ పోలీసులను ఆశ్రయించింది. తన ప్రమేయం లేకుండా లైసెన్న్స్ తీసుకొని వ్యాపారం నిర్వహిస్తున్న డీమార్టు హెచ్ఆర్ నక్కరాజుతో పాటు అప్పటి వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తన సంతకాన్ని పోర్జరీ చేసి దుర్వినియోగనికి పాల్పడినట్లు వివరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. -
ఘరానా దొంగలముఠా అరెస్ట్
బాపట్లటౌన్: బ్యాంక్లో ఉన్న బంగారం విడిపించి ఇస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి నుంచి రూ. 17 లక్షలు లాక్కొని పరారైన ఘరానా దొంగల ముఠాను వెదుళ్లపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈమేరకు బాపట్ల డీఎస్పీ సిహెచ్ చంద్రమౌళి సోమవారం వివరాలు వెల్లడించారు. బాపట్ల మండలం, స్టువార్టుపురం గ్రామానికి చెందిన అంగడి గౌతమ్ అలియాస్ బ్రూస్లీ తన బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టానని, వాటిని విడిపించకపోతే వేలం వేస్తారని, వాటిని విడిపించేందుకు రూ. 17 లక్షలు నగదు కావాలని, విడిపించిన బంగారం మీకు అప్పగిస్తానంటూ చీరాల మండలం, గవినివారిపాలెం గ్రామానికి చెందిన దబ్బకూటి నానిని నమ్మబలికారు. గౌతమ్ మాటలు నమ్మిన దబ్బకూటి నాని ఈనెల 8వ తేదీన రూ. 17 లక్షలు తీసుకొని వెదుళ్ళపల్లి సెంటర్కు చేరుకున్నారు. ముందస్తు పథకం పన్నిన అంగడి గౌతమ్ బాపట్ల మండలం, వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన దేవర నరసింహారావు అలియాస్ చింటూ, పరసా శివప్రసాద్లతో కలిసి దబ్బకూటి నాని దగ్గర నుంచి రూ. 17 లక్షల నగదు లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈనెల 9వ తేదీన వెదుళ్లపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు సోమవారం చీరాల మండలం, తోటవారిపాలెం సమీపంలోని వైన్షాపు దగ్గర ఉన్న విషయం తెలుసుకొని వారిని అరెస్ట్చేశారు. వారిలో అంగడి గౌతమ్ దగ్గర నుంచి రూ. 1000, దేవర నరశింహరావు నుంచి రూ. 14,21,100, పరసా శివప్రసాద్ వద్ద నుంచి రూ. 1200 చొప్పున మొత్తం రూ. 14,22,300 రికవరీ చేశారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన బాపట్ల రూరల్ సర్కిల్ సీఐ బి.హరికృష్ణ, వెదుళ్ళపల్లి ఇన్ఛార్జి ఎస్ఐ ఎస్.రవీంద్ర, వెదుళ్ళపల్లి ఏఎస్ఐ డి.పుష్పారావు, చీరాల క్రైంపార్టీ హెడ్ కానిస్టేబుల్ బి.అచ్చియ్య, చీరాల క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ తన్నీరు శ్రీను, క్రైం పార్టీ కానిస్టేబుల్ బి.బాలచంద్ర, కర్లపాలెం కానిస్టేబుల్ శ్రీనవీన్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ప్రైవేటీకరణ విధానాలను విడనాడండి
నరసరావుపేట: విద్యుత్ బస్సుల పేరుతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో దశలవారీగా ప్రైవేటీకరణ జరుగుతోందని, ఇది సంస్థ భవిష్యత్తు, వేలాది మంది కార్మికుల ఉపాధికి తీవ్ర ముప్పుగా మారుతోందని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు అన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, పీజీఆర్ఎస్లో ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహకు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. దీని వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతిని, ప్రజలకు అందుతున్న చౌక, నాణ్యమైన రవాణా సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. 26వ తేదీన నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, సంస్థను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ నాగమల్లేశ్వరరావు, జిల్లా కార్యదర్శి తిరుపతిరావు పాల్గొన్నారు. -
అర్జీలను నాణ్యతతో పరిష్కరించండి
జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట బాపట్ల: పీజీఆర్ఎస్లో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలకు సంబంధిత శాఖల పరిధిలోని వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపగా, కొన్నిటిని పరిశీలన, మరికొన్నిటిని విచారణకు ఆదేశిస్తూ ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు. మొత్తం 197 అర్జీలు వచ్చాయని తెలిపారు. ఇకనుంచి ప్రతిరోజు, వారానికి, నెల రోజులకు దశలవారీగా పర్యవేక్షణ, సమీక్ష సమావేశాలు జరుగుతాయన్నారు. మండల స్థాయి అధికారులంతా ప్రతి సోమవారం మండలాలలో జరిగే పీజిఆర్ఎస్ లో హాజరుకావాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియ నేటికీ మొదలుకాని ప్రాంతాలలో వేగంగా ప్రారంభించాలని సూచించారు. డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, డీపీఓ ఎల్.ప్రభాకరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ.3.35 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడులు, ముడుపుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ప్రాంగణంలో హుండీల ద్వారా రూ.3,35,87,555 నగదు, 232 గ్రాముల బంగారం, 4.200 కిలోల వెండి లభించాయని ఆలయ ఈఓ శీనానాయక్ తెలిపారు. 1,174 యూఎస్ఏ డాలర్లు, 53 ఖతార్ రియాల్స్, 117 మలేషియా రింగట్స్, 175 యూఏఈ దిర్హమ్స్, 300 ఓమన్ బైంసాలు, 1000 ఉగాండా షిలింగ్స్తో పాటు పలు దేశాల కరెన్సీ లభించింది. కానుకల లెక్కింపును ఈఓ శీనానాయక్, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. -
బాపట్ల
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 20267అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.3374 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 524.00 అడుగులకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం. తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.6,000, మోడల్ ధర రూ.4,500 వరకు పలికింది. 7 -
ఇంధన ధరలపై ఆగ్రహం
ఇబ్బడిముబ్బడిగా పెరిగిన బియ్యం, కందిపప్పు, వంట నూనెలు వంటి నిత్యావసర ధరలు సామాన్యుల జేబులు ఖాళీ చేయగా.. దొరకడమే గగనమైన గ్యాస్ బండ నెత్తిన పిడుగులా మారగా.. ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో కుదేలై కుటుంబ పోషణ కష్టంగా మారి, ఏం తినేటట్లు లేం.. ఏం కొనేటట్లు లేమంటూ.. చస్తూ, బతుకుతూ, బతుకీడుస్తున్న సామాన్యుడిపై తాజాగా కూటమి ప్రభుత్వం ‘పెట్రో’ ధరల బాంబు వేసింది. దీనిపై వైఎస్సార్ సీపీ సామాన్యుడి తరఫున గళం వినిపించింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దెబ్బకు పెరిగిన నిత్యావసరాలతో సామాన్యుడి బతుకు దుర్భరం అయిందని, పెరిగిన ‘పెట్రో’ ధరలతో వారు మరింత కుదేలయ్యారని, వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇంధన ధరల రూపంలో సామాన్యులపై కూటమి ప్రభుత్వం పెనుభారం మోపడంపై వైఎస్సార్ సీపీ భగ్గుమంది. అధిష్టానం పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సోమవారం బాపట్ల జిల్లావ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఇంధన ధరలు ఎక్కువని నాయకులు మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కదంతొక్కిన శ్రేణులు బాపట్ల పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్న పెన్షన్లు ఎత్తివేస్తూ, కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కోటి రాఘవరెడ్డి, కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎం.ఏడుకొండలురెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. తహసీల్దారు సలీమను కలిసి వినతిపత్రం అందజేశారు. పర్చూరు బొమ్మల సెంటర్ వద్ద నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు రేపల్లెలో ఎడ్ల బండిపై ద్విచక్రవాహనాన్ని ప్రదర్శిస్తూ నిరసన తెలియజేస్తున్న సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ, పార్టీ శ్రేణులుచీరాల ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు బసవ పున్నారెడ్డి, నాయకులు, కార్యకర్తలు బాపట్లలో రిక్షా తొక్కి నిరసన తెలుపుతున్న వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్బాబు, నాయకులు -
తెనాలి జిల్లా వైద్యశాలలో విజిలెన్స్ తనిఖీలు
తెనాలిఅర్బన్: సెకండరీ హెల్త్ విభాగ విజిలెన్స్ ఉన్నతాధికారి బి.చిన్నకోటయ్య నాయక్ ఆధ్వర్యంలోని బృందం సోమవారం జిల్లా వైద్యశాలలో తనిఖీ చేసింది. పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తున్న ఎంఆర్ఐ, డయాలసిస్ విభాగాలను వారు పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం వైద్యశాల ఆవరణలోని అన్ని విభాగాలను, ఆపరేషన్ థియేటర్లను పరిశీలించి వివరాలు సేకరించారు. సమయానికి వైద్యులు, సిబ్బంది విధులకు హాజరు కావాలని సూచించారు. అవసరం లేకపోయిన రోగికి ఎంఆర్ఐ స్కాన్లు రాయవద్దని, దీనిపై పలు ఫిర్యాదలు అందుతున్నాయని చెప్పినట్లు సమాచారం. డయాలసిస్ విభాగంలో అనాధికారికంగా నగదు డ్రా చేశారనే ఫిర్యాదులు రావడంతో వీటిని పరిశీలించేందుకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. బృంద సభ్యుల్లో బయోమెడికల్ ఇంజినీర్ సందీప్, డాక్టర్ స్వప్న సింధు, డాక్టర్ స్వప్నలు ఉన్నారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ టి.సౌభాగ్యవాణి, ఆర్ఎంవో డాక్టర్ మల్లిఖార్జునరావు, డాక్టర్ మజీద బేగం, పలువురు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కొరిటెపాడు(గుంటూరు): ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా ఆలిండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్(ఏఐఎస్బీఐఎస్ఎఫ్) పిలుపు మేరకు గుంటూరులోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ఉన్న ధర్నాచౌక్ వద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్–గుంటూరు మాడ్యూల్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 వరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం కోసం చేపడుతున్న పోరాట ఆవశ్యకతను వారు వివరించారు. కార్యక్రమంలో ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ వీఎస్ఆర్ సుధాకరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీలు వి.నరేంద్ర కుమార్, పీఎస్ రంగసాయి, షేక్ ఇబ్రహీం, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యూఎఫ్బీయూ) నాయకులు కిషోర్, రవిచంద్రారెడ్డి, రామకృష్ణ, పావని, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీ జనరల్ సెక్రటరీ ఎస్.రాజేష్ ఖన్నా, వీరితో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియెట్ విద్య ఆర్జేడీ జె.పద్మ పేర్కొన్నారు. సోమవారం ఏసీ కళాశాల సమవేశ మందిరంలో ఈనెల 21 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జేడీ పద్మ మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తాగునీటి వసతితోపాటు పరీక్ష కేంద్రాల్లోని గదుల్లో గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా చూడటంతోపాటు ప్రతి గదిలో ఫ్యాన్లు పని చేయాలని స్పష్టం చేశారు. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా ఉండరాదని, ఎటువంటి పొరపాట్లు జరిగినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రంజిత్బాషా వర్ుచ్యవల్ విధానంలో పలు సూచనలు చేశారు. సమావేశంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సైమన్ విక్టర్, ఓఎస్డీ రమేష్, ఆర్ఐవో జి.సునీత, డీఈసీ సభ్యులు కె.సుచరిత, శిరిల్ పాల్, బీజే రామారావు పాల్గొన్నారు. -
నెలముందే మ్యాపు వేశారు!
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని 57 డివిజన్లను 76 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మారిందనే చెప్పుకోవచ్చు. డివిజన్ల/వార్డులు పునర్విభజన ప్రక్రియ గత నెల రోజులపై నుంచి జరుగుతున్నప్పటికీ దీనిని ప్రభుత్వం రెండుసార్లు వాయిదా వేసింది. ఈ క్రమంలో మూడోసారి డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదా సోమవారం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు విడుదల చేశారు. అయితే ఈ ప్రతిపాదిత ముసాయిదాలో అధికార పార్టీ నేతలకు అనుకూలంగానే ఉందే తప్ప.. ప్రజలకు ఉపయోగకరంగా లేదని నగర వాసులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల ముందే ఎమ్మెల్యేల దగ్గరకు మ్యాపు! వార్డుల పునర్విభజనకు సంబంధించిన మ్యాపు నెల రోజుల క్రితమే ఎమ్మెల్యేల వద్దకు, టీడీపీ లోని ముఖ్య నాయకులకు వద్దకు చేరింది. దీని ఆధారంగా వార్డుల పునర్విభజనకు తమకు అను కూలంగా ఉండేవిధంగా రోజుకు ఒక డివిజన్ నాయకులను ఎమ్మెల్యేల కార్యాలయాలకు పిలిపించుకుని అక్కడే పెద్ద స్క్రీన్లలో మ్యాపు క్షుణ్ణంగా చూపిస్తూ మీకు అనుకూలంగా ఉందా.. లేదా అని అడిగి తెలుసుకుని మరి వారి అభిప్రాయాలను సేకరించారని అధికారులపై ఆరోపణ. ఆ మ్యాపు అనధికారికంగా బయటకు రావడంపై వివిధ రాజకీయ పార్టీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు నగర కమిషనర్ మయూర్ అశోక్ని కలిసి అనధికార మ్యాపుపై ఫిర్యాదు కూడా చేశారు. సదరు మ్యాపు అధికారికంగా రాలేదని.. వార్డుల పునర్విభజన ప్రక్రియ శాసీ్త్రయంగా చేపడతామని చెప్పినప్పటికీ పట్టణ ప్రణాళిక అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి గతంలో అనధికారికంగా బయటకు వచ్చిన మ్యాపునకు ఇప్పుడు కొంచెం అటు ఇటు మార్పులు చేసి తామోదో కొత్తగా వార్డుల మ్యాపును ఇచ్చామని ప్రగల్భాలు పలకుతున్నారని రాజకీయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. నగరంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే వార్డులను కూడా అధికార పార్టీ నేతలు కావాలనే అధికారులను అడ్డంపెట్టుకుని చీల్చారని కాపు నేతలు ఆరోపిస్తున్నారు. కాపులు ఎక్కువగా ఉన్న డివిజన్లను అడ్డగోలుగా చీల్చి అక్కడ వారి ప్రాధాన్యతను తగ్గించడంతో పాటు టీడీపీలో ఉన్న ఇతర సామాజిక వర్గాల వారికి అగ్రతాంబూ లం కల్పించేందుకు అడ్డగోలుగా చీల్చారాని కాపు నాయకులు మండిపడుతున్నారు. ఈ నెల 24వ తేదీవరకు అభ్యంతరాల స్వీకరణ ఉండటంతో కాపు నాయకులతో పాటు.. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలను లేవనెత్తేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నగరంలో అశాసీ్త్రయంగా డివిజన్ల విభజన -
ఆహారం తిన్నవెంటనే నిద్రించకూడదు
ఐబీడీ సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిరోజూ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వ్యాయామం, ధ్యానం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమీకృత ఆహారాన్ని సక్రమంగా నమిలి మింగాలి. సరైన వేళల్లో ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే నిద్రించకూడదు. రాత్రివేళల్లో త్వరితగతిన ఆహారం తినాలి. పాల ఉత్పత్తులు పరిమితి మోతాదులో తీసుకోవాలి. కాఫీ, టీలు, శీతలపానీయాలకు దూరంగా ఉండాలి. –డాక్టర్ షేక్ నాగూర్బాషా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, గుంటూరు ● -
కాపురం సరిదిద్దేందుకు వచ్చిన వారిపై దాడి
నాగవరం(క్రోసూరు): కాపురం సరిదిద్దేందుకు వచ్చి భార్య తరపు వారిపై భర్త కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి దాడి చేశారు. దాడిలో వృద్ధురాలు మృతి చెందింది. దీంతో నాగవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఐ రవిబాబు తెలిపిన వివరాలు.. మండలంలోని నాగవరం గ్రామానికి చెందిన మస్తాన్వలికి సత్తెనపల్లికి చెందిన కరిష్మాతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. అత్తమామలకు చెందిన ఎకరన్న పొలం రాయించుకు రావాలని భార్యను ఇటీవల పుట్టింటికి పంపాడు. కుమార్తె కాపురాన్ని సరిదిద్దేందుకు కరిష్మా తల్లి అల్లాబీ, అమ్మమ్మ ఫాతిమా(75)లు ఆదివారం నాగవరం చేరుకున్నారు. అక్కడ మాటామాట పెరిగింది. దీంతో మస్తాన్వలి తండ్రి వలి, తల్లి సైదాబీ, సోదరులు ఇమాంసా, ఇబ్రహీంలు వారిపై దాడి తీవ్రంగా కొట్టారు. తీవ్ర గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం ఆటోలో సత్తెనపల్లి బయలు దేరుతుండగా మార్గంమధ్యలో ఫాతిమా మృతి చెందింది. తీవ్రగాయాలైన అల్లాబీ, కరిష్మాలు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వృద్ధురాలు మృతి నాగవరంలో ఉద్రిక్తత -
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
బాపట్లటౌన్ ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో ప్రజలు అందించిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 45 మంది బాధితులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలు వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ తక్షణమే పరిష్కరించేలా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితుల సమస్యలను చట్టపరిధిలో విచారించి సత్వరమే పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్ఎస్లో ప్రధానంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలకు సంబందించిన కేసులే అధికంగా వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
వీఆర్ఓకు జేసీ అభినందన
బాపట్ల: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి షాట్పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించడం గర్వాంగా ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట తెలిపారు. జిల్లాలోని మార్టూరు మండలంలో వి.ఆర్.ఓగా పని చేస్తున్న కుమార్ ఏప్రిల్ 17 నుంచి 20 వరకు థాయిలాండ్లోని శ్రీరాచా స్టేడియంలో జరిగిన పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించటంపై హర్షం వ్యక్తం చేశారు. షాట్పుట్, డిస్కస్త్రో విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి బాపట్ల జిల్లా పేరు ప్రతిష్టలను దేశ విదేశాల్లో చాటిన కుమార్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మెరిట్కు అన్యాయం చేస్తున్న డీఈఓపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట: నిబంధనలు అతిక్రమించి మెరిట్కు అన్యాయం చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు కోరారు. సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా డీఆర్ఓ నారదమునికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా కన్వీనర్ కోట సాయికుమార్ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమగ్ర శిక్షకు చెందిన జీసీడీఓ, ఏఎల్ఎస్సీఓ పోస్టుల డిప్యుటేషన్పై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. సదరు పోస్టులకు సంబంధించి మెరిట్ లిస్టులు మే ఒకటిన సిద్ధమైనప్పటికీ డీఈఓ నిబంధనలకు విరుద్ధంగా అర్హతలేని అభ్యర్థులకు అదనపు మార్పులు కలపాలనే దుర్బుద్ధితో మెరిట్ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపకుండా ఆపేశారన్నారు. 10రోజుల జాప్యం తరువాత తాను నిర్ణయించుకున్న అభ్యర్థులకు అర్హత లేకున్నా కమిటీపై ఒత్తిడి తెచ్చి అదనపు మార్కులు కలిపారన్నారు. డిస్ట్రిక్ రిసోర్స్పర్సన్ ట్రైనింగ్ ఇచ్చిన అభ్యర్థులకు మాత్రమే అదనపు మార్కులు కలపాల్సిన అవసరం ఉండగా డీఈఓ తాను ఎంచుకున్న అభ్యర్థులకు డీఆర్పీ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేకున్నా అదనపు మార్పులను కలిపి ఆ లిస్టులను కలెక్టర్ కార్యాలయానికి పంపారన్నారు. ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ నాయకులు మస్తాన్, విశ్వనాథ్ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించిన ఎస్ఎఫ్ఐ నాయకులు -
ఆధునిక జీవన శైలితో ముప్పు
గుంటూరు మెడికల్: ● గుంటూరుకు చెందిన సాగర్ కొంతకాలంగా తీవ్ర కడుపు మంటతో బాధపడుతున్నాడు. ఉద్యోగ రీత్యా రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మేల్కోని ఉండటం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో ఈ మధ్యకాలంలో సమస్య తీవ్రవై గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్ష చేసి సాగర్ ఇన్ఫ్లామేటరీ బోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఇన్ఫ్లామేటరీబోవెల్ డిసీజ్ (ఐబీడీ) సమస్యతో బాధపడుతున్న వారి సమస్య రోజురోజుకు ఎక్కువతోందని, సకాలంలో చికిత్స తీసుకోని పక్షంలో దీర్ఘకాలం వ్యాధి వేధిస్తుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు తెలియజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పదివేల మిలియన్లకంటే ఎక్కువ మంది వ్యాధి బాధితులు ఉన్నట్లు ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ క్రోన్స్ అండ్ ఆల్సరేటీవ్ కొలిటీస్ అసోసియేషన్ పేర్కొంది. ఈ వ్యాధిని నియంత్రణలో పెట్టడం తప్ప పూర్తిగా నయం చేయలేరు. ఐబీడీ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు 2010 నుంచి మే 19న ప్రపంచ వ్యాప్తంగా ఐబీడీ డే నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. కారణాలు ఐబీడీ వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, జన్యుపరమైన కారణాలు, జీవన విధానం, కొన్ని రకాలమందులు మింగడం ద్వారా, పాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ధూమపానం, మద్యపానం, ఒత్తిడి వ్యాధి కారణాలు. బాధితులు 15 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఈవ్యాధిబారిన పడుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈవ్యాధి బాధితులే. కొంత మంది 50 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సులో వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడు వారంలో నలుగురు లేదా, ఐదుగురు ఐబీడీ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రతిరోజూ ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే ఎక్కువగా ఈ వ్యాధి భారతదేశంలో కూడా నేడు పెరిగిపోతుంది. ప్రతి ఏడాది వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు సూచిస్తున్నారు. నిర్ధారణ ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎమ్మారై, రక్త పరీక్షలు, సిటీస్కాన్, మలహర్ష ద్వారా ఐబీడీ వ్యాధినిన ఇర్ధారిస్తారు. ఐబీడీ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి పాథమిక దశలో గుర్తించి చికిత్స అందిస్తే కట్టడి చేయవచ్చు నేడు వరల్డ్ ఐబీడీ డే క్రాన్స్ వ్యాధి, అల్సరేటీవ్ కొలిటీస్ వ్యాధులనే ఐబీడీ వ్యాధిగా పిలుస్తారు.వాంతులు, విరోచనాలు, కొన్ని సార్లురక్తపు విరోచనాలు, కడుపులో నొప్పి, అకస్మాత్తుగా శరీరం బరువును కోల్పోవడం, కడుపులో మంట, కడుపులో తిమ్మిరి, అత్యవసరంగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, జ్వరం ఈ వ్యాధి లక్షణాలు. వ్యక్తులను బట్టి వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి. -
23,24 తేదీల్లో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు
పోస్టర్ ఆవిష్కరించిన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీపురం(గుంటూరువెస్ట్): ప్రగతి శీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ)రాష్ట్ర 9వ మహాసభలు ఈనెల 23.24 తేదీల్లో గుంటూరు నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు ఎం.లక్ష్మి ప్రధాన కార్యదర్శి బి.పద్మ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ మహిళలపై ఇంటా, బయట చూపుతున్న వివక్ష, అణిచివేత, పీడన, హింసలకు వ్యతిరేకంగా ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) దేశవ్యాప్తంగా పనిచేస్తుందన్నారు. మహిళా దృక్పథంతో పోరాడి సాధించిన హక్కుల్ని, చట్టాల్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం మహిళా సంస్కరణ పేరుతో వాటిని నిర్జీవం చేస్తుందని విమర్శించారు. ఉన్న హక్కులు నిలబెట్టుకొని, లేని హక్కులు సాధించుకునేందుకు (పీవోడబ్ల్యూ) భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రాష్ట్ర మహాసభల్లో రూపొందిస్తామని చెప్పారు. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో ప్రగతిశీల మహిళా సంఘ ఉపాధ్యక్షులు ఎన్.విష్ణు ఆర్. గంగాభవాని రాష్ట్ర నాయకులు కె.దుర్గ, శివపార్వతి, బాజీ, గీత తదితరులు పాల్గొన్నారు. లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు తెనాలిరూరల్: బాలికను మాయ మాటలతో ప్రలోభ పెట్టి లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.... మండలంలోని హాఫ్పేట గ్రామానికి చెందిన బాలస్వామి ఓ బాలికతో తరచూ మాట్లాడుతూ మాయ మాటలతో ప్రలోభ పెట్టాడు. బాలికపై లైంగికదాడి చేయడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా బాలస్వామిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తెనాలి వైద్యశాలకు తరలించారు. -
సీనియారిటీ ప్రకారం కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలి
పర్చూరు(చినగంజాం): జోన్3 (గుంటూరు, ప్రకాశం, నెల్లూరు) పరిధిలోని గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శులకు సీనియార్టీ ప్రకారం గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రధాన కార్యదర్శి మెరుగోలు బెన్హర్ ప్రభుత్వాన్ని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం సీనియార్టీ జాబితాను ప్రకటించకుండా తమను పక్కన పెట్టి తమ కంటే జూనియర్లకు పదోన్నతులు కల్పించారని ఆయన మండిపడ్డారు. అక్రమ పద్ధతిలో ఇటీవల ఇచ్చిన పదోన్నతులను వెంటనే రద్దు చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద పలుమార్లు ధర్నాలు నిర్వహించి గ్రీవెన్స్లో అర్జీలు సమర్పించినా ఫలితం లేదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. అందుకే రాష్ట్ర హైకోర్టులో కేసు వేసినట్లు చెప్పారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా రెండు రోజుల కిందట తమ కంటే జూనియర్లు అయిన మరో 94 మంది పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్ 2 పంచాయతీ అధికారులుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ 1996 రూల్ 24 ప్రకారం పదోన్నతుల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలి కానీ సంబంధిత అధికారులు సీనియారిటీ లిస్టుని ప్రకటించకుండా తమ ఇష్టం వచ్చినట్లు దొడ్డిదారిన పదోన్నతులు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 మార్చి 2024లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని తెలిసి 15 మార్చి 2024 అర్ధరాత్రి ప్రమోషన్ ఆర్డర్ తీసుకొని అదే రోజు గ్రేడ్ 2 పంచాయతీ కార్యదర్శులుగా కొందరు దొడ్డిదారిన ప్రమోషన్లు పొందినట్లు వివరించారు. శారీరక వికలాంగులైన పోలిశెట్టి శ్రీనివాసరావు, కే రవిలను ప్రమోషన్ లిస్టులో వీహెచ్గా (గుడ్డివారు) చూపించి అడ్డదారిలో ప్రమోషన్లు కల్పించారని వివరించారు. పంచాయతీ కార్యదర్శులలో గుడ్డివారు లేరని తెలిపారు. అదే లిస్టులో ఏసీబీ కేసులో నెల్లూరు జైలులో ఉన్న ఎం బాలు నాయక్కి కూడా ప్రమోషన్ కల్పించారని తెలిపారు. 15 మార్చి 2024న ఇచ్చిన ప్రమోషన్ లిస్టులో 14 మంది మాత్రమే అదే రోజున జాయిన్ అవ్వగా మిగిలిన 135 మంది రెండేళ్ల తరువాత అంటే 16 మార్చి 2026న జాయిన్ అయినట్లు తెలిపారు. అధికారులు ఇచ్చిన రెండు ప్రమోషన్ల లిస్టులో తమ పేర్లు లేవని తెలిపారు. ప్రస్తుతం ప్రమోషన్ పొందిన వారి కంటే తాము సీనియర్ల మని అన్నారు. తమపై అధికారులు కక్ష కట్టి తమ ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దొడ్డి దారిన ఇచ్చిన రెండు ప్రమోషన్ లిస్టులను వెంటనే నిలుపుదల చేసి జోనల్ సీనియార్టీ లిస్టుని, జిల్లా సీనియార్టీ లిస్టులను బహిర్గతం చేసి పారదర్శకంగా ప్రమోషన్లను చేపట్టి తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. పంచాయతీ కార్యదర్శుల డిమాండ్ -
మద్యంమత్తులో భార్యను హత్య చేసిన భర్త
మేడికొండూరు: మద్యం మత్త ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో ఓ భర్త కట్టుకున్న భార్యపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన మండలం పేరేచర్లలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గోదావరి జిల్లా భీమవరానికి చెందిన నంబూరు వెంకటేశ్వర్లు(23), లక్ష్మి(20) దంపతులు రెండు వారాల క్రితం పేరేచర్ల గ్రామానికి వలస వచ్చారు. ఇక్కడి ఎల్ఎన్ఎస్ కాలనీ ఒకటో లైన్ పరిసరాల్లో రోడ్డు పక్కన తాత్కాలికంగా నివాసం ఉంటున్నారు. వీరు రోజూ గ్రామంలోని వీధుల్లో తిరుగుతూ చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ బాటిళ్లులు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే సోమవారం కూడా కాగితాలు ఏరుకుని వచ్చిన వెంకటేశ్వర్లు.. తీవ్రంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య లక్ష్మితో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులో పూర్తిగా విచక్షణ కోల్పోయిన వెంకటేశ్వర్లు.. తీవ్ర ఆగ్రహంతో కూరగాయలు కోసే కత్తిని తీసుకుని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. లక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో సీఐ దర్యాప్తు.. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేడికొండూరు సీఐ మధుసూదన్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీ మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించింది. నిందితుడు వెంకటేశ్వర్లును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ కేసు నమోదు చేసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. సీఐ వెంట ఎస్ఐ ఖాజీబాబు ఉన్నారు. కూరగాయలు కోసే కత్తితో ఘాతుకానికి ఒడిగట్టిన వైనం -
కాలువలోకి దూసుకెళ్లిన ఆటో
ఇంకొల్లు(చినగంజాం): ఆటో హ్యాండిల్ అదుపు తప్పడంతో పంట కాలువలోకి దూసుకెళ్లి డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటన ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామానికి చెందిన అన్నపురెడ్డి ముసలయ్య (58) తన ఆటోలో ఒంగోలు నుంచి ఇంకొల్లు గ్రామానికి కొబ్బరి బొండాల లోడుతో వస్తున్నాడు. మరికొద్ది సేపట్లో ఇంకొల్లు చేరుకునే క్రమంలో కొణికి గ్రామం దాటిన తరువాత అతని ఆటో హ్యాండిల్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దాంతో ముసలయ్య ఆటోను నియంత్రించలేకపోవడంతో ఆటో పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆటో నీటిలో బోల్తా కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 30 ఏళ్లుగా ముసలయ్య ఆటో డ్రైవర్గా ఉన్నాడు. భార్య వెంకటేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై జీ సురేష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడి పోస్టుమార్టం నిమిత్తం చీరాల వైద్యశాలకు తరలించారు. ముగ్గురికి తీవ్రగాయాలు కారంచేడు: ఆటోను కారు ఎదురుగా ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ ప్రధాన రహదారిలో కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు.. చీరాల మండలం పాత చీరాలకు చెందిన ఒక కుంటుంబ ఆటోలో ఏడుగురితో కలిసి పల్నాడు జిల్లా కోటప్పకొండ దైవ దర్శనం కోసం చేసుకొని తిరిగి చీరాల వస్తున్నారు. ఈ క్రమంలో చీరాల వైపు నుంచి పర్చూరు వైపునకు వస్తున్న కారు కారంచేడు అంబేడ్కర్ కాలనీ సమీపంలో వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను 108 సిబ్బంది చీరాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం తొమ్మిది నుంచి 10 గంటల వరకు గతంలో పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీల పరిష్కారంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని తెలిపారు. ఆన్లైన్లో కూడా అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకున్న హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజెండ్ల మండలం దాట్లవారిపాలెం గ్రామానికి చెందిన గొట్టం నాగిరెడ్డి (36) ఆర్టీసీ బస్టాండ్లో నిద్రిస్తుండగా ఈ నెల 16న అతనిపై మాచవరం మండలం చెన్నయపాలెం గ్రామానికి చెందిన భీమవరపు వెంకటేశ్వరరావు కర్రతో దాడి చేసి హత్య చేశాడు. మృతుడు, నిందితుడు ఇద్దరూ పట్టణంలో యాచిస్తూ రాత్రుళ్లు ఆర్టీసీ బస్టాండ్లో నిద్రిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా మృతుడు నాగిరెడ్డి, నిందితుడు వెంకటేశ్వరరావును మద్యం సేవించేందుకు డబ్బుల కోసం వేధిస్తూ అనేక మార్లు దాడికి పాల్పడ్డారన్నారు. దీంతో కక్ష పెంచుకొని అతనిపై విచక్షణ రహితంగా దాడి చేయటంతో నాగిరెడ్డి మృతి చెందాడన్నారు. హత్యకు ఉపయోగించిన కర్రను, రక్తపు మరకల దుస్తులను నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నామన్నారు. తెనాలి: ఔత్సాహిక నటీనటులకు నటశిక్షణ ఒక వరమని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస నాయక్ అన్నారు. మా–ఏపీ ఆధ్వర్యంలో గత మూడురోజులుగా స్థానిక అంబేడ్కర్ కాలేజీలో జరిగిన సినీనటన శిక్షణ తరగతులు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సభకు మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్రాజా అధ్యక్షత వహించారు. -
యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలి
ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తాడేపల్లి రూరల్: యువతలో క్రీడా స్ఫూర్తి పెరగాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురంలో ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ వద్దు బ్రో–క్రికెట్ ముద్దు బ్రో అనే నినాదంతో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విద్యాసంస్థల్లో సుమారు 40 వేల ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒత్తిడిని అధిగమించడానికి, విజయాలను సాధించడానికి క్రీడలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. టోర్నమెంట్లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 50 జట్లు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నగేష్బాబు, డీఎస్పీ ఏపీ పోలీస్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఎ.శాంతిరాజు, శ్వాస ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ అనిత జ్యోతి పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన వేంకటేశ్వర బాల కుటీర్ పాఠశాలలో జరుగుతున్న మెన్ అండ్ విమెన్ టీమ్ చాంపియన్ షిప్– 2026 పోటీలు ఆదివారం ముగిశాయి. పురుషుల విభాగంలో ఆద్యంత రామన్ నాయుడు, కేజీ అఖిల్, కె.హర్షవర్ధన్, ముక్కుపాటి చేతన్, ఉమెన్ విభాగంలో తేజ అనూష తన్నీరు, జయ అహల్య తన్నీరు, అనన్య గొల్లపల్లి, కంచర్ల అంజుశ్రీలు విజయం సాధించారు. పోటీల నిర్వాహకుడు విజయ్కుమార్ మాట్లాడుతూ గెలుపొందిన ఎనిమిది మంది రాష్ట్ర పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలకు జిల్లా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీంద్రరాజు, బాలకుటీర్ సీఏఓ దుర్గా రఘురామ్, ప్రిన్సిపాల్ సుధామాధవి బహుమతులు ప్రదానం చేశారు. అర్బిటర్గా అనిల్ వ్యవహరించారు. లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కర్నూలులో ఈ నెల 24న జరిగే 12వ సీనియర్ రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు గుంటూరు జిల్లా నుంచి పది మంది బాల బాలికలు ఎంపికయ్యారని జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి షేక్ ఖాజామొహిద్దీన్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మెహబూబ్ షంషేర్ ఖాన్ మెమోరియల్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కోచ్ నాంచారమ్మ, నాగేశ్వరరావుల పర్యవేక్షణలో గుంటూరు జిల్లా జట్టు ఎంపిక చేశామన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు గుంటూరు జిల్లా నుంచి సీహెచ్ గౌతమ్, మేదర నాగచైతన్య, బి.నాగ చైతన్య, బి.స్వర్ణసుజిత్, కే అభినవసాగర్, అకిశెట్టి విష్ణుదేవరాయలు, షేక్ నస్రిన్, షేక్ నజరీన్, లక్ష్మీపావని, జి.జాన్వీలు ఫ్రీ స్టైల్, బ్యాక్ స్ట్రోక్, బ్రస్ట్ స్ట్రోక్, బటర్ ఫ్లై విభాగాలలో ఎంపికై నట్లు వెల్లడించారు. బాపట్ల: ఈవీఎంల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం బాపట్ల జిల్లా కేంద్రంలో భద్రపరిచిన ఈవీఎంల గోదామును జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్తో కలసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ గోదాం వద్ద నిరంతర నిఘా ఉంటుందన్నారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, ఎన్నికల పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు. -
విద్యాశాఖలో విభజన పర్వం
పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల విభజన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఆయా జిల్లాల వారీగా కేటాయించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్ మొదటి వారంలో ఉపాధ్యాయుల నుంచి ఏ జిల్లాకు ఎవరు వెళతారనే విషయమై ఆప్షన్లు నమోదుకు విద్యాశాఖాధికారులు చర్యలు చేపడుతున్నారు. గుంటూరు ఎడ్యుకేషన్ : కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంతో సంబంధం లేకుండా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొత్తగా డీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. పాఠశాలల నిర్వహణ, టెన్త్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ వంటి అంశాలు ఆయా డీఈవో కార్యాలయాల నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు వ్యవహారాలు, నియామకాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలను ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన చేపడుతున్నారు. కొత్త జిల్లాలను కేంద్ర నోటిఫై చేసి, గెజిట్ విడుదల చేయడంతో ఆయా జిల్లాల వారీగా విద్యాశాఖలో విభజనకు అడుగులు పడుతున్నాయి. జాబితా ప్రకటన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, నగరపాలక సంస్థ, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఉపాధ్యాయ పోస్టులను ఆయా జిల్లాల వారీగా విభజించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని కేటగిరీల వారీగా 15 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారిలో ఆయా జిల్లాల వారీగా ప్రభుత్వ వాస్తవంగా మంజూరు చేసిన పోస్టులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలను విభజన ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులతో కూడిన సీనియార్టీ జాబితాను అధికారులు ప్రకటించారు. ప్రతిని గుంటూరు డీఈవో అధికారిక సైట్లో పొందుపర్చారు. దీనిపై అభ్యంతరాలను స్వీకరించేందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాలో మంజూరైన పోస్టులు, క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ఖాళీలను పరిగణనలోకి తీసుకుని విభజన దిశగా ముందుకు వెళ్లనున్నారు. వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు జూన్లో ఉపాధ్యాయులకు రెండు విడతలుగా వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆ తరగతుల్లో భాగంగా ఏ జిల్లాలో పని చేసేందుకు ఎవరు వెళతారనే విషయమై ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు నమోదు చేయించనున్నారు. దీంతో జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టులను కేటాయించి, ఇక పూర్తిగా జిల్లాస్థాయిలోనే ఉపాధ్యాయుల సర్వీసు సంబంధిత వ్యవహారాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలు చేపట్టేందుకు ఆస్కారముంది. -
పాస్పోర్ట్ అప్పగించిన మాజీ మంత్రి రజిని
నరసరావుపేట టౌన్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడదల రజిని తన పాస్పోర్ట్ను ఆదివారం డీఎస్పీ కార్యాలయంలో అందజేశారు. చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి విడదల రజినిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తప్పుడు కేసును కొట్టివేయాలని ఆమె రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ, ప్రతి ఆదివారం చిలకలూరిపేట పట్టణ పోలీస్స్టేషన్లో సంతకం పెట్టటంతోపాటు పాస్పోర్ట్ను విచారణ అధికారి అయిన డీఎస్పీకి అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. దీంతో విడదల రజిని మొదట చిలకలూరిపేట పట్టణ పోలీస్స్టేషన్లో సంతకం పెట్టారు. అనంతరం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. డీఎస్పీ ఎం.హనుమంతరావుకు పాస్పోర్టును అందజేశారు. ఆమె వెంట మైనార్టీ నాయకుడు దరియావలి, న్యాయవాది నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 524.00 అడుగులకు చేరింది. ఇది 156.6700 టీఎంసీలకు సమానం.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.3374 టీఎంసీలు. చీరాల అర్బన్: చంద్రబాబు పాలన తీరు ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకీల మోత అన్న చందంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని అప్పట్లో పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ధరలు తగించకపోగా పెంచుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంపు, గ్యాస్ ధరల పెంచి ప్రజలపై పెనుభారం మోపుతుతున్నారు. యుద్ధ సంక్షోభాన్ని బూచిగా చూపుతూ పాలకులు చమురు మంట పెట్టారు. లీటర్ పెట్రోల్పై రూ. 3.35, డీజిల్ పై రూ.3.16 చొప్పున ధర పెంచడంతో ప్రత్యక్షంగా వాహనదారులపై ఆ భారం పడింది. పరోక్షంగా నిత్యావసర వస్తువులు సహా అన్ని రకాల సామగ్రిపై పడుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బ్లాక్లో గ్యాస్ సిలిండర్ల విక్రయాలు పెరిగాయి. యంత్రాలతో చేసే వ్యవసాయ పనులకు బాడుగ ధరలు భారంగా మారాయి. ఆటో చార్జీల పెంపుతో ప్రయాణాలకు ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ప్రభుత్వపరంగా ఫోన్ ద్వారా సేకరిస్తున్న ప్రజాభిప్రాయంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రైతులపై మరింత భారం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో వ్యవసాయం దండగ అనే చందంగా పరిస్థితి మారింది. సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా కాలేదు. నకిలీ విత్తనాల బెడదతో రైతులు నష్టపోయారు. పంట రుణాలు మాటలకే పరిమితం అయ్యాయి. అన్నీ తట్టుకుని పండించిన పంటలకు మద్దతు ధరలు లేవని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపు పరోక్షంగా వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం కూడా ప్రశ్నార్థకమేని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండెక్కిన కూరగాయల ధరలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నిత్యావసర సరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో మధ్యతరగతి, పేద వర్గాలకు ఆదాయం ఎంతున్నా కుటుంబ పోషణకే సరిపోవటం లేదని వాపోతున్నారు. కూరగాయల ధరలు కొండెక్కాయి. వాటిని పండించే రైతుకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. మధ్యలో దళారీ వ్యవస్థ లబ్ధి పొందుతోంది. వంట నూనెలు, పప్పుల ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. సామాన్యుల ఇంటి బడ్జెట్ నానాటికీ పెరిగిపోతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్7 -
అంకెతో వేగానికి లంకె
స్పీడ్ కాదు.. టైర్పై నెంబర్ చూడు గురూ..జిల్లాలో ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలు సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు 2021 1047 431 913 2022 1071 397 1011 2023 972 352 912 2024 1042 442 1143 2025 898 355 781 పట్నంబజారు: గుంటూరు జిల్లా రహదారులపై వేగం ఒక అలవాటుగా మారింది. వేగం ప్రాణాంతకం.. వేగాన్ని మోయలేని టైర్లే మృత్యు సంకేతం. అయితే ఆ వేగాన్ని మోయగల సామర్థ్యం వాహనాలకు ఉందాం లేదా అన్న ప్రశ్నే ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. జిల్లాలో ఏడాది కాలంలో నమోదైన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే, సుమారు ప్రతి నాలుగింట ఒక ప్రమాదం టైర్ లోపాల కారణంగానే జరుగుతున్నట్టు రవాణాశాఖ, పోలీసులు అధికారుల ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం – టైర్లపై ఉన్న వేగ సూచిక అక్షరాలపై వాహనదారుల అవగాహన లేకపోవటమే అందుకు కారణమని సుస్పష్టమవుతోంది. ప్రమాదాలు ముఖ్యంగా టైర్ బరస్ట్ అవ్వటం, స్కిడింగ్, గ్రిప్ కోల్పోవటం వంటివి జరగటం వలనే జరుగుతున్నాయి. అంటే వాహనం ఎంత వేగంతో వెళ్తుందో తెలిసినా, ఆ వేగాన్ని మోయగల టైర్లు వాడకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అంకె తేల్చేస్తుంది ప్రతి ద్విచక్ర వాహనం, కారు టైర్ పక్క భాగంపై కనిపించే నెంబర్లు ఉదాహరణకు 90/90–17 49పి, 165/70 ఆర్,14 81టి వంటి కోడ్లు సాధారణంగా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఈ కోడ్లో చివర ఉన్న అక్షరమే ఆ వాహనం ఎంత వేగం వరకు సురక్షితంగా ప్రయాణించగలదో నిర్దేశిస్తుంది. ఉదాహరణకు ‘పి’ అక్షరం ఉన్న టైర్ గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగం వరకు మాత్రమే భద్రత కల్పిస్తుంది. గుంటూరు–విజయవాడ, గుంటూరు–నరసరావుపేట, గుంటూరు–చిలకలూరిపేట హైవేల్లో చాలా మంది ద్విచక్ర వాహనదారులు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా, వారి బైకుల్లో 100, 110 కిలోమీటర్ల వేగానికి మాత్రమే అనుకూలమైన జే, కే అక్షరాల టైర్లు ఉండటం ప్రమాదాలకు తావిచ్చినట్లు తెలుస్తోంది. వివరం తెలిసేది ఇలా... వాహనం టైర్ సైజ్ 120/80 ఆర్ 18 అని ఉంటే... అందులో 120 అనేది టైర్ వెడల్పు మిల్లిమీటర్లలో, 80 జరిగిన వెడల్పుతో కూడిన రేషియో, 18 అంటే టైర్కు సంబంధించి డైమీటర్ అంగుళాలలో ఉంటుంది. 18: టైర్ డైమీటర్ అంగుళాలలో ఉదాహరణకు ‘ఎం’ ‘వి’ అనే అక్షరాలు బండి టైర్లు ఎంత స్పీడు వెళ్ళవచ్చు అనే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. ఏ1 ఉంటే 5 కిలోమీటర్లు, ఏ2కు 10, ఏ3 15, బి 50, సీ 60, డి 65, ఈ 70, ఎఫ్ 80, జీ 90, జే 100, కె 110, ఎల్ 120, ఎం 130, ఎన్ 140, పి 150, క్యూ 160, ఆర్ 170, ఎస్ 180, టీ 190, యూ 200, హెచ్ 210, వి 240, డబ్ల్యూ 270, వై 300, జెడ్ 240 ప్లస్ వరకు గరిష్ట వేగంతో వెళ్ళ వచ్చని సూచికలు చెబుతున్నాయి. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టైర్లపై అంకెలు, పేర్లును జాగ్రత్తగా గమనించటం ద్వారా ప్రమాదాలు తగ్గవచ్చని ఆర్టీఏ, పోలీసు శాఖ అధికారులు చెబుతున్నారు. -
మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం
బాపట్లటౌన్: మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో దోహద పడతాయని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్పేరెడ్ గ్రౌండ్లో ఆదివారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందితో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పని ఒత్తిడిని అధిగమించి మరింత ఉత్సాహంగా విధులు నిర్వహించేందుకు క్రీడలు ఎంతో దోహద పడతాయన్నారు. టోర్నమెంట్లో గెలుపోటములు సమానమని తెలిపారు. క్రీడల వలన నాయకత్వ లక్షణాలు పెరగడంతోపాటు సమష్టి కృషి అలవడుతుందన్నారు. ఆడడం, వీక్షించడం మంచి అలవాట్లు అయినప్పటికీ బెట్టింగ్లు నిర్వహించడం ప్రమాదకరమని హెచ్చరించారు. బెట్టింగ్ల వలన అనేక మంది ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తమ జీవితాలను అంధకారంలోకి నెట్టుకున్న ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిణామాలు చూస్తూనే కొంతమంది అత్యాశతో, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్లకు పాల్పడుతున్నారని చెప్పారు. యువత బెట్టింగ్ అనే మహమ్మారికి దూరంగా ఉండాలని, క్రికెట్ను కేవలం క్రీడా స్ఫూర్తితో మాత్రమే చూడాలని పేర్కొన్నారు. దానిని జూదంగా మార్చి తమ అమూల్యమైన భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, ఎస్బీ సీఐ జి.నారాయణ, ఎస్బీ–2 సీఐ ఎం.రాంబాబు, సీసీఎస్ సీఐ పి. ప్రేమయ్య, ఆర్ఐలు మౌలుద్దీన్, ప్రదీప్, చీరాల 2 టౌన్ సీఐ శశికుమార్, ఇతర పోలీస్ అధికారులు, చీరాల సబ్ డివిజన్, జిల్లా హెడ్ క్వార్టర్స్ జట్ల సభ్యులు పాల్గొన్నారు. ఓవరాల్ చాంపియన్ హెడ్ క్వార్టర్స్ జట్టు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన హెడ్ క్వార్టర్స్ జట్టు ఓవరాల్ చాంపియన్ షిప్ను కై వసం చేసుకుంది. చీరాల సబ్ డివిజన్ జట్టుపై బాపట్ల హెడ్ క్వార్టర్స్ జట్టు విజయం సాధించింది. టోర్నమెంట్లో చీరాల, బాపట్ల, రేపల్లె సబ్ డివిజన్లకు చెందిన మూడు జట్లు, ఏఆర్ జట్టు, హెడ్ క్వార్టర్స్ జట్టు పాల్గొన్నాయి. -
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై కత్తితో దాడి
చీరాల: చీరాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్పై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. స్థానిక జయంతిపేటకు చెందిన వాసిమళ్ల హరీష్ చీరాల ఆర్టీసీ డిపోలో హైర్ బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్లోకి వస్తుండగా చీరాల మండలం కీర్తివారిపాలేనికి చెందిన చుక్క సుబ్రహ్మణ్యం, ఏలిక రమేష్లు హరీష్ వద్దకు వచ్చి ఒక మహిళతో తనకు అక్రమ సంబంధం ఉందనే నెపంతో తనను చంపాలని ఉద్దేశంతో తనతో గొడవపడ్డారన్నారు. ఈ క్రమంలో ఇరువురు కులం పేరుతో దూషించారని, రమేష్ తనను కిందకు పడవేయగా సుబ్రహ్మణ్యం కత్తితో కడుపులో పొడిచారన్నారు. చుట్టుపక్కల వాళ్లు కేకలు వేయడంతో అక్కడ నుంచి పరారయ్యారన్నారు. చికిత్స నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించగా అవుట్పోస్టు పోలీసులు క్షతగాత్రుడి వద్ద నుంచి వివరాలను నమోదు చేసుకున్నారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ శనివారం అర్థరాత్రి మారువేషంలో ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. తలపాగా పెట్టుకుని, ముఖానికి మాస్క్ ధరించి, సాధారణ వ్యక్తి మాదిరిగా పలు వార్డుల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. డాక్టర్ యశస్వి రమణ ఆస్పత్రి సూపరింటెండెంట్గా 2024 అక్టోబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఆస్పత్రిలో పలు సమస్యలు ఉన్నాయని, వాటిని ఆస్పత్రి అధికారులు పరిష్కరించలేకపోతున్నారని మీడియాలో వరుసగా కథనాలు రావటంతో 2025 నవంబర్లో బిచ్చగాడి వేషం ధరించి రాత్రిళ్లు ఆస్పత్రిలో తనిఖీలు చేశారు. మళ్లీ రెండోసారి 2025 డిసెంబర్లో మార్చురీ విభాగం వద్ద డబ్బులు తీసుకుంటున్నారని మీడియాలో కథనాలు రావటంతో మారు వేషంలో మార్చురీ వద్ద తనిఖీలు చేశారు. నేడు తాజాగా మూడోసారి ఆస్పత్రిలో మారు వేషంలో తనిఖీలు చేశారు. మూడుసార్లు మారువేషాల్లో తనిఖీలు చేసినా ఆయనకు ఏ విధమైన లోపాలు కనిపించకపోవటం, ఆస్పత్రిలో అందరూ విధుల్లో ఉండటం, రోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవటం వంటి విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మారు వేషం వేసిన ప్రతిసారి సోషల్ మీడియాలో దానిని పోస్ట్ చేసి ఆయన వైరల్ అయ్యారే తప్పా రోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. మూడుసార్లు తూతూ మంత్రమే.. సాధారణంగా ఆస్పత్రిలో రాత్రిళ్లు విధుల్లో కొంత మంది వైద్య సిబ్బంది, వైద్యులు ఉండరనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ అసిస్టెంట్ సర్జన్, డ్యూటీ అసిస్టెంట్ ఫిజీషియన్లు అందుబాటులో ఉండరనేది నగ్నసత్యం. ఒకవేళ ఎవరైనా బాధితులు చికిత్స కోసం వచ్చి ఎమర్జెన్సీ వార్డుల్లో మరణిస్తే దానిని ధ్రువీకరించి డ్యూటీ అసిస్టెంట్స్ డాక్టర్స్, సర్జన్స్ సంతకాలు చేయాల్సి ఉంది. కాని వీరు ఉండకపోవటంతో పీజీ వైద్యులతో సంతకాలు చేయించటం లేదా కొన్ని సార్లు ఉదయం డ్యూటీ డాక్టర్స్ వచ్చే వరకు భౌతిక కాయాలను ఉంచి సంతకాలు చేయించి తరలిస్తున్నట్లు ప్రతి ఒక్కరు చెవులు కొరుక్కుంటున్నారు. కాని సూపరింటెండెంట్ తనిఖీలు ఇలాంటి లోపాలు ఏమీ కనిపించలేదు. ఆయన తనిఖీలు చేసిన శనివారం, ఆదివారం సమయాల్లో సాధారణంగా పెద్ద డాక్టర్స్ రాకుండా జూనియర్స్పైనే పని వదిలి వెళ్లటం ఇక్కడ పరిపాటే. శనివారం రాత్రి వేళల్లో సూపరింటెండెంట్ తనిఖీలు చేసిన సమయంలో అందరూ విధుల్లో ఉన్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మారువేషాల్లో తన సొంత పబ్లిసిటీ కోసం తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చేసిన తనిఖీల్లో ఇప్పటి వరకు ఎలాంటి తప్పిదాలను గుర్తించలేదు. ఎవరిపైనా ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు. మాచర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ నెమలిదిన్నె వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు ఆదివారం అక్రమంగా అరెస్టు చేశారు. వెంకట రంగారెడ్డిది మాచర్ల మండలం కంభంపాడు గ్రామం కాగా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామం వదిలి వెళ్లి విజయవాడలో నివాసం ఉంటున్నాడు. వెంకట రంగారెడ్డిని మాచర్ల రూరల్ పోలీసులు అరెస్టు చేసి మాచర్ల కోర్టులో హాజరుపరచనుననట్లు పోలీసులు తెలిపారు. వెంకట రంగారెడ్డిని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరచనున్నట్లు సమాచారం. ఇప్పటికే నెమలిదిన్నే వెంకట రంగారెడ్డిపై 14 అక్రమ కేసులు బనాయించి పోలీసులు అరెస్టు చేశారు. 15వ కేసును బనాయించి 15వ సారి జైలుకు పంపే పనిలో పోలీసులుఉన్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
ముగిసిన జాతీయస్థాయి నాటిక పోటీలు
పర్చూరు(చినగంజాం): మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో మూడు రోజులుగా కొనసాగుతున్న తొమ్మిదో జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. కళానికేతన్ వీరన్నపాలెం డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాటిక పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. ఆదివారం రాత్రి ప్రదర్శించిన నాటిక పోటీలకు సంబంధించి యార్లగడ్డ రాజేష్, పద్మజ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా చిట్టినేని రవీంద్రబాబు, హరిచందన దంపతులు నటరాజ పూజ కార్యక్రమం నిర్వహించారు. దెబ్బ తింటున్న సంప్రదాయాలు.. ప్రదర్శనలో ముందుగు విశాఖపట్టణం తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘చిటికెన వేలు’ నాటిక అభివృద్ధి పేరుతో వస్తున్న కొత్త పుంతలకు అనుగుణంగా తమ పెద్దల చేతివేలు పట్టుకొని సాగే సంప్రదాయం దెబ్బతింది అనే సారాంశంతో సాగింది. కొండ ప్రాంతంలో జీవనం చేసే సోమన్న కుటుంబం భూమిని స్వేచ్ఛగా సాగు చేసుకొని పంటలు పండించుకుంటూ, తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ పెద్దల నుంచి సంక్రమించిన భూమిని సాగుచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయన తన పెద్దల చిటికెన వేలు పట్టుకొని వారి అడుగుజాడల్లో నడచిన సోమన్న ఆయన కొడుకు రెంజింను కూడా అలాగే నడిపించాడు. నాగరి కథ అభివృద్ధి పేరుతో వారి మనవడు కొత్త పుంతలను ఆహ్వానించాడు. తండ్రి చిటికెన వేలు విడిచి ప్రభుత్వాధికారులకు తన భూమి హక్కులను, చిటికెన వేలు కూడా సమర్పించుకున్నాడనేది సారాంశం. ‘జనరల్ బోగీ’ల్లో ఎన్నో కష్టాలు.. రెండో ప్రదర్శన కొలకలూరు శ్రీసాయి ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘జనరల్ బోగీలు’ అనే నాటిక రైలులో జనరల్ బోగీల్లో సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను గురించి కొనసాగింది. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికుల అవస్థలు గురించి తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక. రైలులో జనరల్ బోగీలలో ప్రయాణించే వారి వివరాలు రైల్వే వాళ్ల దగ్గర ఉండవు. ప్రమాదం జరిగిన సందర్భాలలో వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుంది. జనరల్ బోగీలలో ప్రయాణించే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తూ సాగిన నాటిక. మూడో నాటిక దీపం కింద ‘చీకటి’ అనే నాటికను వీరన్నపాలెం గ్రామంలోని నటులు ప్రదర్శించారు. అనంతరం బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. గోరంట్ల యమునా కుమార్ అధ్యక్షతన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు జెట్టి హరిబాబు ఆహ్వానం పలుకగా ముఖ్య అతిథిగా కాకతీయ కమ్యూనిటీ ఫౌండేషన్ చైర్మన్ గూడూరి సత్యనారాయణ, గౌరవ అతిథులుగా పేర్ని వీరనారాయణ, గోరంట్ల రమేష్, యార్లగడ్డ రజిని, కొల్లా వెంకట్రావు, దండమూడి ఏలీషా చౌదరి, కఠారి రమేష్ నాయుడు పాల్గొనగా కళానికేతన్ కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. ప్రజల సమస్యలను ఎత్తిచూపిన ప్రదర్శనలు -
అక్రమాలకు ‘సహకారం’
● అన్నవరం పీఏసీఎస్లో అవినీతిపై ఫిర్యాదులు ● విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ● వెలుగులోకి సీఈవో శ్రీనివాసరావు అక్రమాలు, వేధింపులు ● సీఈవో వైఖరితో ఉద్యోగి ఆత్మహత్య ● విచారణ నిలిపివేయాలని సహకార మంత్రికి ఎమ్మెల్యే లేఖ ● అంగీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు ● పాలకుల తీరుపై అన్నదాతల తీవ్ర ఆగ్రహం నరసరావుపేట రూరల్: అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన అవినీతిపై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. మూడు దశాబ్దాలుగా అన్నవరం సొసైటీలో తిష్ట వేసిన వ్యక్తి అందినకాడికి దండుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తట్టుకోలేక గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో మహిళా ఉద్యోగిని కూడా జీతాలు ఇవ్వకుండా వేధించాడు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మహిళా ఉద్యోగి.. సొసైటీలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరపాలని విన్నవించారు. దీంతో అక్రమాల డొంక కదిలింది. దీనిని ఆదిలోనే ఆపాలని సదరు ఉద్యోగి ఏకంగా కూటమి ఎమ్మెల్యేతో ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో విచారణను ప్రభుత్వం నిలిపివేసింది. రొంపిచర్ల మండలం అన్నవరం పీఏసీఎస్ అవినీతిపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు పలు మార్లు ఫిర్యాదులు అందాయి. సొసైటీ పరిధిలోని రైతులతోపాటు సిబ్బంది సైతం అవినీతి గురించి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్... జిల్లా సహకార అధికారిని విచారణకు ఆదేశించారు. సొసైటీ రికార్డులను పరిశీలించి రైతులను అధికారులు విచారించారు. పీఏసీఎస్లో అవినీతి నిజమేనని నిగ్గు తేల్చారు. విచారణలో రూ.16.86 లక్షల అవినీతి జరిగిందని నిర్ధారించారు. సెక్షన్ 52 ప్రకారం పూర్తి స్థాయి విచారణకు జిల్లా సహకార అధికారి నాగరాజు ఈ ఏడాది మార్చి 30వ తేదీన ఆదేశించారు. పీఏసీఎస్ సీఈవోగా పనిచేస్తున్న దొప్పలపూడి శ్రీనివాసరావు అవినీతిలో కీలక సూత్రధారి అని అధికారులు ప్రాథమిక విచారణలో తేల్చారు. శ్రీనివాసరావు భార్య ఉషారాణిని సొసైటీ ఉద్యోగినిగా చూపిస్తూ 2014–19 కాలానికి రూ.6.12 లక్షలు వేతనంగా డ్రా చేశాడు. అయితే ఉషారాణిని కార్యాలయంలో ఎప్పుడూ చూడలేదని విచారణలో అధికారులకు రైతులు తెలిపారు. గతంలో శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ కాలానికి కూడా సొసైటీ నుంచి జీతాలు, పాత బకాయిలను సొసైటీ మినిట్ పుస్తకంలోని ఖాళీ పేజీలలో నకిలీ తీర్మానాలు సృష్టించి మొత్తం రూ.8.94 లక్షలు తన ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు విచారణలో వెల్లడైంది. రైతు నుంచి వసూళ్లు చేసిన రూ.1.90 లక్షలను బ్యాంక్లో జమ చేయనట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గతంలో సొసైటీలో పెయిడ్ సెక్రటరీగా పనిచేసిన జేపీ కుమార్కు ఇవ్వాల్సిన మొత్తం రూ.3.45 లక్షలను కూడా శ్రీనివాసరావు నకిలీ తీర్మానాలతో డ్రా చేసినట్టు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే చదలవాడ అండ అన్నవరం పీఏసీఎస్లో జరిగిన అవినీతిపై పూర్తి స్ధాయి విచారణ జరిగితే మరింత అక్రమాలు వెలుగులోకి వస్తాయని భావించిన సీఈవో శ్రీనివాసరావు... ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబును ఆశ్రయించాడు. సీఈవోపై వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఎమ్మెల్యే నేరుగా సహకార శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడుకు ఏప్రిల్ 2వ తేదీన లేఖ రాశారు. దీనిపై స్పందించిన మంత్రి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అన్నవరం పీఏసీఎస్పై విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతికి వంతు పాడుతూ ఎమ్మెల్యే విచారణ నిలిపివేయాలని కోరడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
కేసుల పరిష్కారానికి ముందుకు రండి
నరసరావుపేట టౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయ సేవలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సదస్సు నిర్వహించారు. సమాధాన్ సమరోహ 2026లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జియావుద్దీన్ మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నవారు ఆగస్టు 21, 22, 23 తేదీలలో జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని కోరారు. దీనికోసం ఈ నెల 31వ తేదీలోపు నిర్దేశిత గూగుల్ ఫారం పూరించి తమ అంగీకారం తెలియజేయాలన్నారు. ప్రజల అవగాహన కోసం ముద్రించిన ప్రత్యేక కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీపీ కట్ట కాళిదాస్, మొదటి పట్టణ సీఐ షేక్ టి.ఫిరోజ్, ట్రాఫిక్ సీఐ లోకనాథం, ఎస్ఐ వంశీకృష్ణ, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పలువురు ప్రజలు పాల్గొన్నారు. నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షలో పల్నాడు జిల్లా 87.30 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఐసెట్ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 511 మంది నమోదు కాగా పరీక్షకు 449 మంది హాజరయ్యారు. వీరిలో 392 మంది అర్హత సాధించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో 201 మంది పురుషులు, 191 మంది మహిళలు ఉన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో చేరేందుకు అర్హులు. పథకాలను మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోండి మాచర్ల రూరల్: మాజీ సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగపర్చుకోవాలని సైనిక సంక్షేమ ఉమ్మడి జిల్లా శాఖాధికారి ఆర్.గుణశీల కోరారు. శనివారం పెన్షనర్స్ అసోసియేషన్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మాజీ సైనికుల కుటుంబాల కోసం ప్రభుత్వం అనేక పథకాలను అందిస్తుందని సాగు భూమితో పాటు పిల్లల చదువులలో రిజర్వేషన్, క్యాంటీన్లో సబ్సిడీపై అందించే వివిధ వస్తువులను సకాలంలో తీసుకోవాలని కోరారు. విద్యకు స్కాలర్షిప్, కుమార్తె వివాహానికి నగదు, వైకల్య గ్రాంటు, ఈసీహెచ్ఎస్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలను అందుకోవాలన్నారు. మృతిచెందిన మాజీ సైనికుల భార్యలకు గుర్తింపు కార్డులను అందించారు. ఇటీవల అంగవైకల్యం పొందిన ఇన్నారెడ్డి గృహానికి వెళ్ళి పరామర్శించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కేపీ సిద్ధంరాజు, ప్రధానకార్యదర్శి తాటి వినోద్బాబు, కోశాధికారి ఆర్ గోపాల్ నాయక్, ఉపాధ్యక్షులు వి.మరియదాసు, సభ్యులు కారంకి శ్రీనివాసరావు, రామారావు, పి.బాబు, ఇన్నారెడ్డి, శేఖర్, రవి పాల్గొన్నారు.పొన్నూరు: మామిళ్లపల్లి రైతులపై టీడీపీ నాయకులు దాడి చేసి అక్రమ కేసులు బనాయించిన నేపథ్యంలో రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదివారం రానున్నారని పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మామిళ్లపల్లి అడ్డరోడ్డు నుంచి మామిళ్లపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. లక్ష్మీపురం: ఓ ఇంట్లో 25 సవర్ల బంగారం, రూ.2.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. ముత్యాలరెడ్డినగర్ 8వ లైన్ ప్రాంతానికి చెందిన దుగ్గెంపూడి ప్రభాకర్రెడ్డి కన్స్ట్రక్షన్ పని చేస్తుంటారు. భార్య భూలక్ష్మి ఇంటి వద్దనే ఉంటుంది. ఇంట్లో బీరువాలో ఉన్న 25 సవర్ల బంగారం, అలాగే బీరువాలో ఉన్న రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. దీన్ని గమనించిన ప్రభాకర్రెడ్డి ఆయన సతీమణి భూలక్ష్మి, ఇంట్లో పని చేసే మహిళపై అనుమానం వ్యక్తం చేశారు. బాధితులు అరండల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బాపట్ల
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026పైకి ఆహారం.. తింటే విషమే – ప్రణీత్, ఆహార భద్రతాధికారి విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 524.10 అడుగులకు చేరింది. ఇది 156.8580 టీఎంసీలకు సమానం. ఆహారంలో విచ్చలవిడిగా రంగుల వాడకం తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం పండ్లను మగ్గించేందుకు కార్బైడ్ వాడకం తనిఖీల్లో బయటపడుతున్న వాస్తవాలు -
రూ.10 వేలు కొట్టు.. రూ.10 కోట్లు పట్టు
నరసరావుపేట రూరల్: పది వేలు చెల్లిస్తే పది కోట్లు ఇస్తామంటూ స్కీమ్ను ప్రారంభించి అమాయక ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని నరసరావుపేట రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టణ శివారు ప్రాంతమైన కేసానుపల్లి పంచాయతీ పరిధిలోని ఎల్టీ నగర్లో రెండు రోజుల క్రితం చిలకలూరిపేట మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు కార్యాలయాన్ని ప్రారంభించాడు. వెంకట్రావు కోకోనట్ మర్చంట్ పేరుతో ప్రారంభించిన కార్యాలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ ఎంవీ సుబ్బారావు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల విచారణలో స్కీమ్లో సభ్యుల నుంచి నిర్వాహకులు ఈకేవైసీ తీసుకుంటున్నట్టు సేకరిస్తున్నట్టు గుర్తించారు. గిఫ్ట్ మనీ పేరుతో టోకరా.. రాకేట్ ల్యాబ్ పేరుతో వెంకట్రావు గత కొంతకాలంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో గిఫ్ట్ మనీ స్కీమ్ను నిర్వహిస్తున్నాడు. స్కీమ్లో చేరిన సభ్యులు మొదటగా రూ.10 వేలు చెల్లిస్తే రూ.10 కోట్లు వరకు లబ్ధిపొందవచ్చని నమ్మబలుకుతున్నాడు. తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో అధిక సంఖ్యలో స్కీమ్లో సభ్యులుగా చేరుతున్నారు. ఇందుకోసం 500 మంది వరకు ఏజెంట్లు ఈ స్కీమ్లో పనిచేస్తున్నారు. వీరంతా కలిసి దాదాపు నాలుగు వేల మందిని స్కీమ్లో సభ్యులుగా చేర్చినట్టు తెలుస్తుంది. స్కీమ్లో చేరి రూ.10 వేలు చెల్లించిన నాలుగు రోజుల తరువాత సింగపూర్లో వారి పేరుపై అకౌంట్ ప్రారంభించి రూ.3 లక్షలు జమ చేసినట్టు నమ్మించేందుకు నకిలీ సందేశాలు పంపుతారు. నెల రోజుల తరువాత రూ.10 కోట్లు జమ చేస్తామని నమ్మబలికి ఇప్పటికే రూ.కోట్లులో వసూలు చేసినట్టు సమాచారం. -
హాస్టల్ జీవితం వ్యక్తిత్వ వికాసానికి పునాది
బాపట్ల: హాస్టల్ జీవితం వ్యక్తిత్వ వికాసానికి పునాది వంటిదని నిధి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.మోహన్ రావు అన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన 81వ సంవత్సర హాస్టల్ డే సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థి జీవితంలో హాస్టల్ అనేది కేవలం నివాస స్థలం మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, సమయపాలన, పరస్పర సహకారం, నాయకత్వ లక్షణాలను నేర్పించే జీవిత పాఠశాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి జీవించడం ద్వారా భిన్న సంస్కృతులను అర్థం చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. హాస్టల్ జీవితం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ అఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ డి.సంపత్ కుమార్ విద్యార్థులు హాస్టల్లో గడిపే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకొని విద్యతో పాటు మంచి నడవడి, సేవాభావం, స్నేహసౌహార్దాలను పెంపొందించుకోవాలని సూచించారు. అసోసియేట్ డీన్, చీఫ్ వార్డెన్ డా. పి. ప్రసూన రాణి మాట్లాడారు. బాలికల హాస్టల్ వార్డెన్ డా.కె.జయలలిత, బాలుర హాస్టల్ వార్డెన్ డా. కె. చంద్రశేఖర్ హాస్టల్ నివేదికలను సమర్పించారు.హాస్టల్ సిబ్బందికి నూతన వస్త్రాల బహూకరణ కార్యక్రమాన్ని బాలికల అడిషనల్ వార్డెన్ డా.ఎం.తుషార నిర్వహించగా, కన్వీనర్ డా. కె.సుశీల లక్కీ డిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలుర అడిషనల్ వార్డెన్ డా.పి.సుధా జాకబ్ వందన సమర్పణ చేసారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిధి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ జి.మోహన్ రావు -
వేధింపులకు ఉద్యోగి బలి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మర్రిపాలెంలో ఉద్యోగంలో చేరిన శ్రీనివాసరావు తిరిగి అన్నవరం సొసైటీకి సీఈవోగా వచ్చాడు. అప్పటి నుంచి సిబ్బందిపై వేధింపులు ప్రారంభించాడు. జీతాలు ఇవ్వకుండా బెదిరించడంతో తట్టుకోలేక ఓరుగంటి శ్రీనివాసరెడ్డి అనే గుమస్తా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతూ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావుతోపాటు సొసైటీ పీఐసీ నర్రా సురేంద్రబాబుపై కేసు నమోదు అయింది. సొసైటీ ఉద్యోగిని పచ్చవ భవానికి 18 నెలలు జీతం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. దీనిపై ఆమె కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా జరిగిన విచారణలో అవినీతి వెలుగు చూసింది. -
ఆలోచింపజేసిన నాటికలు
వీరన్నపాలెం(చినగంజాం): సామాజిక రుగ్మతలను ఎత్తి చూపించేవే నాటికలు అని వక్తలు పేర్కొన్నారు. శనివారం 9వ జాతీయ స్థాయి నాటిక పోటీలు మండలంలోని వీరన్నపాలెం గ్రామంలో కళానికేతన్ ఆధ్వర్యంలో నాటికలను ప్రదర్శించారు. చిట్టినేని అప్పయ్య, మక్కెన రామసుబ్బయ్య, ఇంకొల్లు గురుప్రసాదరావు కళాప్రాంగణంలో నిర్వహించిన ప్రదర్శనలను గోరంట్ల రత్తయ్య, ప్రసన్నాంజలి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేయగా, చిట్టినేని శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు నటరాజ పూజ నిర్వహించి పోటీలను ప్రారంభించారు. మనిషిని గౌరవించని సమాజం.. ముందుగా హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ వారి ‘అమ్మచెక్కిన బొమ్మ’ నాటికను విభిన్న తత్త్వపు మనిషి సీ్త్ర, పురుషుడు కాని వారిని అవమానించడం, గౌరవించక పోవడం, అసహ్యించుకోవడం అనేది మానవజాతి దిగజారుడు తనానికి ఓ ప్రతీక చూపుతూ ప్రదర్శన సాగింది. పాలకుల మొసలి కన్నీరు.. ఆ తరువాత హైదరాబాద్ కళాంజలి ప్రదర్శన అన్నదాత నాటికను అన్నం పెట్టే రైతు నోట్లో అందరూ మట్టి కొట్టే వారే. ప్రకృతి వైపరీత్యాలు వల్ల నష్టాలు, గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు రాబట్టుకోలేని స్థితిలో పాలకుల మొసలి కన్నీరు, దళారీల దోపిడి, వ్యాపారుల మోసాలు రైతు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయనే కఠా సారాంశంతో సాగింది. చిన్నచిన్న సమస్యలకే విడాకులా ! తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి ప్రదర్శన విడాకులు కావాలి నాటికను దాంపత్య జీవితంలో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, అపోహలు, చిన్నచిన్న సమస్యలు తలెత్తటం సహజం. అంత మాత్రాన కలిసి బతకలేమన్న తొందరపాటుతో పంతాలకు పోయి విడాకులు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే అంశంతో నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
6.490 కిలోల గంజాయి స్వాధీనం
చినగంజాం: గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నిందితుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం చినగంజాం పోలీస్ స్టేషన్లో ఇంకొల్లు సీఐ ఎం రామానాయక్, ఎస్ఐ శీలం రమేష్లు నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు.. శుక్రవారం స్థానిక పోలీసులు, జీఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న కేరళం రాష్ట్రానికి చెందిన సుహైబ్ రెహమాన్ (30) అనే వ్యక్తిని పట్టుకున్నారు. చినగంజాం ఎస్ఐ శీలం రమేష్ తన సిబ్బందితో కలిసి నేరస్తుడిని అదుపులోనికి తీసుకొని విచారించగా ఒడిశాలోని రాయ్గఢ్లో ఓ వ్యక్తి వద్ద రూ.30 వేలకు 6.490 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తన ట్రావెల్ బ్యాగ్లో దాచుకొని రైలులో కేరళంకు తరలిస్తున్నట్లు గుర్తించారు. అతనిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. గతంలో నిందితుడు గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడినట్లు, కేరళంలోని హోస్బుర్గ్ పోలీస్ స్టేషన్లో నాలుగు గంజాయి కేసులు, ఒక దాడి కేసు నమోదైనట్లు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో అతనిని రిమాండ్ కు పంపించారు. -
కోన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం
కర్లపాలెం: క్రీడాకారులు తమ ప్రతిభను కనబరిచేందుకు క్రికెట్ పోటీలు దోహదపడతాయని వైఎస్సార్ సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. కర్లపాలెం మండలం కట్టావాద గ్రామంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కోన ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడల వైపు ఆసక్తి పెంపొందించుకోవాలని చెప్పారు. గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఆటల పోటీలు దోహదపడతాయన్నారు. క్రికెట్ పోటీలు స్నేహపూర్వక వాతావరణంలో సక్రమంగా నిర్వహించాలని నిర్వాహకులను ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, అంబేడ్కర్ యువజన సేవా సమాఖ్య గౌరవ అధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్, ప్రముఖ ఆక్వా వ్యాపారవేత్త చెన్ను జనార్థన్, నాయకులు మార్పు బెనర్జి, మార్పు రత్నం, వీరయ్య, సలగల మోక్షానందం, కొండమూది శ్యామ్యూల్, దాసరి బాబూరావు ఉన్నారు. -
జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ఢీకొని వ్యక్తి మృతి
చీరాల రూరల్: జన శతాబ్ది ఎక్స్ప్రెస్ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం వేటపాలెంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ కొండయ్య తెలిపిన వివరాలు.. వేటపాలెం పందిళ్లమ్మ గుడి సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో సిబ్బంది పరిశీలించగా మృతుడి వద్ద ఎటువంటి సమాచారం లభించలేదని చెప్పారు. మృతుని వయస్సు 55 ఏళ్లు ఉంటాయని, 5.5 అడుగుల ఎత్తు చామన ఛాయ కలిగిన రంగు కలిగి ఉన్నాడని తెలిపారు. గడ్డంతో పాటు తల వెంట్రుకలు బాగా పెరిగి ఉన్నాయని, మృతుని శరీరంపై తెలుపు రంగు కలిగిన ఆఫ్ హ్యాండ్స్ టీషర్టు, బులుగు, తెలుపు మెరూన్ చెక్స్ కలిగిన లుంగీ ఉందని తెలిపారు. మృతుని చిరునామా ఎవరికై నా తెలిసినట్లయితే జీఆర్పీ పోలీసులకు 9247575633 సమాచారం అందించాలని సూచించారు. చేపల పట్టివేతపై రెవెన్యూ విచారణ ముప్పాళ్ల: ‘మట్టిపై కన్నేస్తే... చేపలు దొరికాయ్..’ అంటూ సాక్షిలో వచ్చిన కథనం పై రెవెన్యూ అధికారులు శనివారం విచారణ చేపట్టారు. మండలంలోని బొల్లవరం గ్రామ సమీపంలో ఉన్న ఏడు ఎకరాల భూమిలో తవ్విని చెరువులో మట్టి తవ్వకాలు చేసేందుకు గాను నీళ్లు వెళ్లే బెట్టే క్రమంలో దొరికిన చేపల ఆదాయం కోసం టీడీపీ నాయకులు పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం బయటకు పొక్కటంతో రెవెన్యూ అధికారులు చెరువు ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ జరుగుతున్న వ్యవహారాన్ని ఫొటోలలో సేకరించారు. అక్కడి వారి నుంచి వివరాలు సేకరించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు ఆర్ఐ ఆంజనేయులు, వీఆర్వోలు తెలిపారు. చెరువులో నీటిని బయటకు పంపినట్లుగా గుర్తించామని, పరిశీలించే సమయంలో చిన్నపాటి చేపలు బాక్స్ల్లో ఉండటాన్ని గుర్తించారు. అన్ని పనులు వెంటనే నిలిపివేయాలని, పంచాయతీ, రెవెన్యూ అధికారుల అనుమతితోనే తదుపరి చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు. అనుమతులు లేకుండా పనులు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
కర్లపాలెం: ఆటోను పశువుల సంచార వైద్యశాల వ్యాన్ ఢీకొనటంతో ఓ మహిళ మృతి చెందిన ఘటన చెరుకుపల్లి సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్లపాలెం మండలం చింతాయపాలేనికి చెందిన ఆటో చెరుకుపల్లి వెళుతుండగా పెట్రోల్ బంక్ల వద్ద పశు సంవర్ధక శాఖకు చెందిన పశువుల సంచార వైద్యశాల వ్యాన్ ఢీకొట్టింది. క్షతగాత్రులను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రులలో తోట పద్మావతి(50) మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆటో డ్రైవర్ ఏనుగు పోలీస్రావు, తన్నీరు కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు పెదమల్లు వెంకటరావు, పెదమల్లు శివకుమారి, తోట దుర్గ, యాజలి సాంబయ్య స్వల్పంగా గాయపడ్డారు. వీరందరూ బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. మృతురాలు తోట పద్మావతి కుమార్తె, పసుపులేటి కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెరుకుపల్లి ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన కోన.. ఆటో ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ సైనికుడు తోట వెంకటరమణ భార్య పద్మావతి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఏరియా వైద్యశాలకు వెళ్లి పద్మావతి మృతదేహాన్ని పరిశీలించారు. వెంకటరమణను ఓదార్చారు. గాయాలైన వారిని పరామర్శించారు. గుంటూరు మెడికల్: డీఎంహెచ్ఓ కార్యాలయం పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎఫ్ఎన్ఓ, ఎల్జీఎస్ ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్సీ, అర్బన్ పీహెచ్సీల్లో 45 పోస్టులకు గాను దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్టును శుక్రవారం విడుదల చేశామన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గుంటూరు డీఎంహెచ్ఓ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా తెలియజేయాలన్నారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్ (సన్), కేవీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 27వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు, సన్ వ్యవస్ధాపకుడు కె.యశ్వంత్ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో శిక్షణ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో జరగనున్న శిక్షణ తరగతుల్లో 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు హాజరు కావచ్చునని తెలిపారు. కె.యశ్వంత్ మాట్లాడుతూ 12 ఏళ్లుగా ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.ఆసక్తి గల విద్యార్థులు 94913 36996, 79895 70755, 93469 84938 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్విన్ మణిదీప్, పాల్గొన్నారు. -
గుంటూరు జిల్లా జైలులో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా కారాగారంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. డెస్క్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా కారాగారాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ వల్ల ఖైదీలకు, వారి బంధువులకు ఉన్న సమస్యలకు త్వరితగతిన పరిష్కరించడానికి వీలు కలుగుతుందన్నారు. ఖైదీలు, వారి బంధువులు హెల్ప్ డెస్క్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్, స్టాఫ్, డెప్యూటీ లీగల్ ఎయిడ్ డెఫన్స్ కౌన్సెల్, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం గుంటూరు మహిళా ప్రాంగణంలోని శిశు గృహాన్ని సందర్శించి అక్కడ ఉన్న పిల్లలకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టాభిపురంలోని మాతృశ్రీ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న పిల్లలకు సురక్షితమైన బాల్యం, భవిష్యత్పై అవగాహన సదస్సు నిర్వహించారు. పిల్లలందరూ బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో ఉండాలని ఆకాంక్షించారు. వారికి అన్ని సదుపాయాలు అందుతున్నాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్ జీవన్ క్రాంతి, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రూరల్: వ్యవసాయ రంగంలో సమస్యలను పరిష్కరించేలా కృత్రిమ మేధపై ఆవిష్కరణలు ఉండాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ అన్నారు. చిన్న, సన్నకారు, కౌలు రైతుల జీవితాలలో గుణాత్మక మార్పులు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, సుస్థిరంగా మార్చే లక్ష్యంతో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇక్రిశాట్ సంయుక్త ఆధ్వర్యాన నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంనందున్న సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయంలో కృతిమ మేధస్సుపై వర్క్షాప్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ వ్యవసాయం పూర్తిగా డేటా ఆధారిత నిర్ణయ వ్యవస్థల వైపు పయనిస్తుందని చెప్పారు. ఈ డేటా కచ్చితత్వం రైతు సేవ కేంద్రాలలో లభ్యమయ్యేలా చూడాల్సిన ఆవశ్యకతను వివరించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ, ఐకార్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ లీడర్ డాక్టర్ రవినారాయణసాహూ, సీఆర్ఐడీఏ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏవీఎం సుబ్బారావు వ్యవసాయ, అనువర్తనాలు విభాగంలో గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ వీఎం చౌదరి, ఐఐటీ ఖరగ్పూర్కు చెందిన డాక్టర్ రాజేంద్ర మాచవరం మాట్లాడారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సెక్రటరీగా డాక్టర్ మణి వ్యవహరించారు. నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ డి.త్రిపాఠి, హైదరాబాద్ అటారీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎన్ మీరా, డాక్టర్ ఎంవీ రమణ, యూనివర్సిటీ అధికారులు, వివిధ పరిశోధన సంస్థలు, స్టార్టప్ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): పరిశ్రమల రక్షణలో శిక్షణ పొందిన సేఫ్టీ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ (4 సంవత్సరాలు), 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్న్ను శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ పి. బ్రహ్మాజీరావు, హెడ్ ఆప్ ది ఫైర్ అండ్ సేప్టీ విభాగం అరుణ్కుమార్ పాణిగ్రాహి తదితరులు పాల్గొన్నారు. -
పరిహారానికీ ఏడుపే!
రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని చెబుతున్న చంద్రబాబు సర్కారు... వారిని ఆదుకోవడంలో విఫలమైంది. గత అక్టోబర్ నెలలో సంభవించిన మోంథా తుపానుతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఏడు నెలలైనా బాధిత రైతులకు బాసటగా నిలవడానికి బాధపడుతోంది. అది తమ బాధ్యత కానట్టుగా వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొరిటెపాడు (గుంటూరు): గత ఏడాది అక్టోబర్ మాసంలో మోంథా తుపాను ధాటికి నష్టపోయిన వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సర్వే అనంతరం నివేదిక రూపొందించారు. దానిని ప్రభుత్వానికి పంపారు. సుమారు ఏడు నెలలు కావస్తున్నా ఇంత వరకు నష్ట పరిహారం మంజూరు చేయలేదు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తే అప్పుల నుంచి బయటపడతామని అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. మోంథా తుపాను ధాటికి జిల్లాలో సాగు చేసిన వరి, పత్తి, మినుము, కంది, సోయాబీన్ వంటి పంటలతోపాటు అరటి, కూరగాయలు, తమలపాకు, పువ్వులు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అప్పట్లో 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టం జరిగితే పరిహారం అందజేస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సర్వే చేసి పంట నష్టాన్ని గుర్తించారు. ప్రతి ఏడాది ఇవే అవస్థలు ఏటా ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతూనే ఉన్నారు. అకాల వర్షాలు, తుపానుల కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బతింటున్నాయి. మిగిలిన కొద్దిపాటి పంటలను విక్రయించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తుపాను పరిహారం వస్తే కొంత మేర నష్టం భర్తీ అవుతుందనే ఆశలో అన్నదాతలు ఉన్నారు. ఏడు నెలలు పూర్తవుతున్నా ప్రభుత్వం నష్టపరిహారం అందించలేదు. కనీసం ఆ దిశగా చర్యలేవీ తీసుకోకపోవడంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు. ఇలాంటి గడ్డు పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఆదుకోకుంటే ఎలా అని అన్నదాతలు వాపోతున్నారు. గతేడాది అక్టోబర్ మాసంలో సరిగ్గా పంట చేతికి వచ్చే సమయంలో తుపాన్ దెబ్బతీయడంతో రైతులకు కన్నీరే మిగిలింది. జిల్లాలో వరి 2,693.20, పత్తి 1,282.50, మినుము 1,243.55, సోయాబీన్ 234.61, కంది 10.02 ఎకరాల్లో సాగు చేశారు. అరటి 450.61, కూరగాయలు 123.27, తమలపాకులు 24.43, పువ్వులు 0.60 ఎకరాలలో నష్టపోయినట్లు గుర్తించారు. జిల్లాలో 3,800 మంది రైతులు సుమారు రూ.5,75 కోట్లు నష్టపరిహారం అందుకునేందుకు అర్హులుగా గుర్తించారు. నివేదికను ప్రభుత్వానికి పంపారు. నెలలు గడుస్తున్నా పరిహారం మాత్రం పైసా దక్కలేదు. ఇంకెప్పుడు ఇస్తారని ప్రభుత్వాన్ని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో... నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రకృతి అనుకూలించకపోయినా, వర్షాలు పడి పంటలకు నష్టం జరిగినా, వర్షాలు లేక పంటలు ఎండిపోయినా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడే పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు ఇబ్బందులు పడకుండా, పెట్టుబడుల కోసం ఇతరులను ఆశ్రయించకుండా వ్యవసాయం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. ఎటు నుంచి ఎటు చూసినా చంద్రబాబు ప్రభుత్వం వల్ల రైతులకు నష్టం తప్పడం లేదు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తానన్న రూ.20 వేల సాయాన్ని తొలి ఏడాది ఇవ్వలేదు. రెండో ఏడాది కూడా కౌలు రైతులకు అందజేయలేదు. ఖరీఫ్, రబీ సమయాల్లో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మోంథా తుపాను కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది మరో 20 రోజుల్లో ప్రారంభం కానున్న ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం అవసరమయ్యే ఖర్చుల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ చివరిలో వచ్చిన మోంథా తుపాను తాకిడికి జిల్లా వ్యాప్తంగా సాగైన పంటలు దెబ్బతిన్నాయి. ఇంతవరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకపోవడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలి. – కంచుమాటి అజయ్కుమార్, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం -
ప్రతి నీటి బొట్టును సంరక్షించాలి
కలెక్టర్ వినోద్కుమార్యద్దనపూడి: ప్రతి నీటి బొట్టును సంరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మున్నంగివారిపాలెం గ్రామంలో జలధార–జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో పర్యటించి రక్షిత మంచినీటి పథకాలు, ఇంకుడుగుంతలు, కంపోస్ట్ పిట్స్ను పరిశీలించారు. అనంతరం చెరువుకట్టపై కొబ్బరిమొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో చెరువుల పూడికతీత పనులు ఒక యజ్ఞంలా చేపట్టాలన్నారు. మనందరం పెట్రోలు, డీజిల్ ఆదా చేసినట్లుగానే నీటిని కూడా ఆదా చేయాలన్నారు. అందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాగునీటి కాలువలు, చెక్డ్యాంలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా గ్రౌండ్ వాటర్ లెవల్స్ మరింత పెంచుకోవచ్చన్నారు. నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో సమర్థవంతంగా అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నీటి వనరును సంరక్షించడం, వర్షం నీటి నిల్వలను పెంపొందించటంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అలాగే గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా, చెరువు కట్టలపై మొక్కలు నాటి గ్రామాలను పచ్చతోరణాలుగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఎల్.ప్రభాకర్రావు, జలవనరుల శాఖ ఎస్ఈ గోపీనాథ్, డ్వామా పీడీ విజయలక్ష్మి, తహసీల్దారు రవికుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ పదవుల్లో పలువురు నియామకం
బాపట్ల: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా అద్దంకి నియోజకవర్గానికి చెందిన జజ్జర ఆనందరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్మీడియా వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా వేమూరుకు చెందిన దాసరి కిరణ్బాబును నియమించారు. వీరి నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. మరొకరికి గాయాలు మంగళగిరి టౌన్: బైక్ను కారు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు మరొకరు గాయపడిన ఘటన శుక్రవారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పసుపులేటి మధుబాబు(50) శుక్రవారం పని నిమిత్తం ఆత్మకూరు వచ్చాడు. తిరిగి చిలువూరు వెళ్లే క్రమంలో నంబూరు మీదుగా వెళ్లేందుకు మంగళగిరి జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు మంగళగిరి పట్టణ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న మధుబాబు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. కారు, బైక్ రెండూ అదుపుతప్పి సర్వీస్రోడ్ నుంచి కిందకు ఎగిరిపడ్డాయి. బైక్పై ప్రయాణిస్తున్న మధుబాబు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న ఆదినారాయణకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మధు బాబు ఓ ప్రైవేటు బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నాడు. నేషనల్ హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంగళగిరి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు మధుబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెట్ల పూజ మార్గంలో జారిపడిన శ్లాబు పెచ్చులు
బాలిక తలకు గాయం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి పాత మెట్ల మార్గంలో శ్లాబ్ పెచ్చులు ఊడిపడి ఓ బాలిక తలకు గాయమైంది. ఈ ఘటన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై చోటు చేసుకుంది. గుంటూరుకు చెందిన పద్మావతి తన కుమార్తె స్నేహతో కలిసి అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. పద్మావతి మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి వెళ్తోంది. మహామండపం పక్కనే ఉన్న పాత మెట్ల మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండపైకి చేరుకుంటుండగా, మెట్ల మార్గంలోని పాత స్టోర్ రూమ్ సమీపంలో కుళాయి వద్దకు వచ్చేసరికి బాలిక స్నేహ నిల్చున చోట పై నుంచి పెద్ద పెచ్చు ఊడిపడింది. ఆ పెచ్చు బాలిక తలపై పడటంతో గాయం అయి తీవ్ర రక్తస్రావం అయింది. ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద ఉన్న దేవస్థాన ఆరోగ్య కేంద్రానికి బాలికను తీసుకొచ్చారు. అయితే అక్కడ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో నర్సు వైద్యం అందించింది. గాయం నుంచి రక్తస్రావం తగ్గడంతో వెంటనే దేవస్థాన అంబులెన్స్లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికకు వైద్యం చేసిన వైద్యులు ఐదు కుట్లు వేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఆలయ ఈవో శీనానాయక్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు దేవస్థానం ఇద్దరు వైద్యులను నియమించింది. అయితే శుక్రవారం రద్దీ వేళ ఒక్క వైద్యుడు కూడా అందుబాటులో లేకపోవడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భక్తులు ఆలయ ఈవో శీనానాయక్ దృష్టికి తీసుకెళ్లారు. -
ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకోవాలి
ప్రకాశం, బాపట్ల జిల్లాల నాబార్డ్ డీడీ రవికుమార్ ఇంకొల్లు (చినగంజాం): రైతులంతా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించుకుని సాగు ఖర్చులు తగ్గించాలని ప్రకాశం, బాపట్ల జిల్లాల నాబార్డ్ డీడీ రవికుమార్ సూచించారు. ఇంకొల్లు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, బాపట్ల సెర్ఫ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎఫ్పీసీ సెంటర్కు సంబంధించిన సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం ఇంకొల్లు పంచాయతీ పరిధిలోని హనుమోజీపాలెం గ్రామంలో సాయి సేవా సమితి భవనంలో నిర్వహించారు. రైతులతో నిర్వహించిన ఈ సమావేశంలో డీడీ రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో రైతు ఉత్పత్తి కేంద్రాలకు భవిష్యత్లో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. నాబార్డు ఆర్థిక సహాయ సహకారాలతో ఎఫ్పీసీ సెంటర్లను అందులోని సభ్యులంతా కలిసి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎఫ్పీసీ సెంటర్లపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రధానంగా రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఉమ్మడిగా ఎఫ్పీసీ ద్వారా అమ్ముకుని లబ్ధిపొందాలని సూచించారు. రైతులు పంటలు సాగుచేసేటప్పుడు బహుళ జాతి పంటలు ఒకే పొలంలో సాగు చేయటం వలన ఫలితం ఉంటుందని తెలిపారు. అనవసరంగా రసాయన క్రిమి సంహారక ఎరువుల వాడకం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నేచురల్ ఫార్మేషన్ ద్వారా వ్యవసాయం చేసి ఖర్చులు తగ్గించుకుని నాణ్యమైన ఉత్పత్తులు పండించాలని తెలిపారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సందేహాలకు సమాధానాలు తెలిపారు. కార్యక్రమంలో సెర్ఫ్ సంస్థ కో ఆర్డినేటర్ శివ, ఇంకొల్లు ఎఫ్ఏసీ సెంటర్ ఎండీ ఎం.శ్రీనివాసబాబు. బీఓడీ సభ్యులు దేవబత్తిన దుర్గా ప్రసాద్, పాలేటి సుబ్బారావు, గుడివాడ ప్రసాద్, ఆరే మురళి, బత్తిన రాములు, ఆరే కోటేశ్వరరావు, ఆరే శరత్, ఆర్.వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికంగా బాపట్ల జిల్లా అభివృద్ధి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పారిశ్రామికంగా బాపట్ల జిల్లా అభివృద్ధికి, పరిశ్రమల స్థాపనకు మీ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి విధానంలో ప్రభుత్వం విరివిగా రాయితీలు కల్పిస్తుందని చెప్పారు. స్థిర పెట్టుబడి రాయితీ, విద్యుత్ రాయితీ, పావలా వడ్డీ రాయితీల్లో భాగంగా 49 పరిశ్రమలకు రూ.8.30 కోట్లు రాయితీ మంజూరు చేశారు. బాపట్ల జిల్లాలో టీ షర్డ్స్, క్యాప్, జనపనారతో వివిధ రకాల ఉత్పత్తుల యూనిట్ స్థాపనకు కృషి చేయాలన్నారు. బీచ్లలో ప్లాస్టిక్ వాడకం నిషేధం బాపట్ల జిల్లాలోని బీచ్లలో జూన్ నెల ఒకటో తేదీ నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రత్యామ్నాయంగా జనపనార బ్యాగులు, సంచులు వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇందు కోసం జనపనార సంచులు, బ్యాగులు ఉత్పత్తి చేయాలని, వాటిపై ‘బే ఆఫ్ బాపట్ల‘ లోగో ముద్రించాలన్నారు. అలాంటి యూనిట్లను స్థాపించే వారికి యుద్ధ ప్రాతిపదికన రుణం మంజూరు చేయాలన్నారు. మార్టూరులో మాడ్యూల్ ప్యానెల్ ఉత్పత్తి జైట్ ఎనర్జీ సోలార్ పీవీ మాడ్యూల్ ప్యానెల్ ఉత్పత్తి కేంద్రం మార్టూరులో ఏర్పాటు కానుందని కలెక్టర్ వినోద్కుమార్ చెప్పారు. రూ.198.4 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రాగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయన్నారు. ఆ పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన రుణ సదుపాయం కల్పించాలని, పర్యావరణ అనుమతులు పరిశీలించాలని సూచించారు. బాపట్ల మండలంలో ఎంఎస్ఎంఈ పార్కు కోసం భూమి గుర్తించాలని, ప్రభుత్వ భూమి లేకపోతే భూసేకరణతో కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై రామకృష్ణ, ఎల్డీఎం శివకృష్ణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నరసింహారావు, ఏపీ ఎస్ఎఫ్సీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామాంజనేయులు, ఆర్డీవో గ్లోరియా, ఫ్యాప్సియా రాష్ట్ర సీనియర్ సభ్యులు భక్తవత్సలం, కమిటీ సభ్యులైన వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ ద్వారా రూ.100కోట్లు జీఎస్టీ పన్నుల ద్వారా బాపట్ల జిల్లాకు రూ.100 కోట్లు ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ చెప్పారు. జీఎస్టీ పన్నుల వసూలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల వసూలులో బాపట్ల జిల్లా మంచి పురోగతి సాధించినట్లు చెప్పారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో 10శాతం పన్నులు వసూలు పెరిగిందన్నారు. ప్రొఫెషనల్ టాక్స్ కింద జిల్లాలో రూ.39.32 కోట్లు పన్ను వసూలు అయిందన్నారు. పర్యాటకరంగంగా బాపట్ల జిల్లా అభివృద్ధి చెందుతోందని కలెక్టర్ చెప్పారు. చిన్నగంజాం బీచ్ను శనివారం ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో జీఎస్టీ అధికారి మురళీకృష్ణ, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ వై రామకృష్ణ, కమిటీలోని అనుబంధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి
బాపట్ల: విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రపంచ స్థాయి పోటీలకు సిద్ధం కావాలి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల 81వ వార్షికోత్సవ సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ విద్యకు బాపట్ల వ్యవసాయ కళాశాల ఒక చారిత్రాత్మక కేంద్రంగా నిలిచిందని చెప్పారు. ఎనిమిది దశాబ్దాలుగా అనేక మంది శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులను ఈ కళాశాల అందించిందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, నూతన పద్ధతులను రైతులకు చేరవేయడంలో కళాశాల కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, బ్యాంకింగ్, అగ్రి బిజినెస్ సంస్థలు, ఆహార పరిశ్రమలు, వ్యవసాయ సాంకేతిక సంస్థల్లో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రైతులకు వ్యవసాయ విద్య ఎంతో తోడ్పడుతోందని పేర్కొంటూ, శాసీ్త్రయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచడం, ఖర్చులు తగ్గించడం, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం సాధ్యమవుతోందన్నారు. విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు గ్రామాలకు వెళ్లి రైతులకు ప్రత్యక్షంగా సూచనలు అందిస్తూ వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగి రైతు సంక్షేమానికి తమ వంతు సేవ చేయాలని ఉపకులపతి పిలుపునిచ్చారు. అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ప్రసూనా రాణి కళాశాల గత ఏడాది విద్య రంగంలో సాధించిన విజయాలతోపాటు క్రీడలు, మరియు సాంస్కృతిక పోటీలలో సాధించిన ఓవర్ ఆల్ చాంపియన్ షిప్ వివరాలతో కూడిన వార్షిక నివేదికను సమర్పించారు. సభకు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ సి.హెచ్. శ్రీనివాస రావు అధ్యక్షత వహించగా, విశిష్ట అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఆహార ప్రాసెసింగ్ సొసైటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్ జి.శేఖర్ బాబు(ఏ.ఎఫ్.ఎస్.) ఆధునిక వ్యవసాయ చరిత్రలో బాపట్ల వ్యవసాయ కళాశాల చేస్తున్న సేవలను కొనియాడారు. అతిథిగా పాల్గొన్న ఐ.సి.ఏ.ఆర్. డైరెక్టర్, అటారీ సౌత్ జోన్ డాక్టర్ షేక్ ఎన్.మీరా మాట్లాడుతూ విద్యార్థులే వ్యవసాయ రంగ భవిష్య నిర్దేశకులని పేర్కొన్నారు. ఆఫీసర్ ఇన్చార్జి స్టూడెంట్ ఆక్టివిటీస్ డాక్టర్ ఎం.శ్రీరేఖ వందన సమర్పణ చేశారు. వైస్ చాన్సలర్ డాక్టర్ పి.వి.సత్యనారాయణ -
వెంచర్లకు రాజధాని మట్టి
తాడికొండ: రాజధానిలో వాగులు, రిజర్వాయర్ల పేరిట తొలగిస్తున్న నల్లమట్టిని అధికార పార్టీకి చెందిన నాయకులు వాటాలు వేసుకొని మరీ విక్రయిస్తున్నారు. తద్వారా రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. నల్లమట్టికి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ప్రధానంగా బడా బాబులకు చెందిన రియల్ ఎస్టేట్ వెంచర్లకు వేల లారీలలో మట్టి తరలించి స్థలాలను చదును చేస్తున్నారు. వీరికి తోడు రైతులు పంట పొలాలను చదును చేసుకునేందుకు అరకొరగా తోలించుకుంటుండగా ఖాళీ స్థలాలకు కూడా మట్టి భారీగా తరలిస్తున్నారు. పోలీసులు, విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఇదేమీ కనిపించక పోవడం విడ్డూరంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో పెద్ద డంపర్ లారీకి రూ.6 వేలు – రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. పల్లపు ప్రాంతమైనా... ప్రభుత్వం సమీకరించిన భూములలో మట్టిని రాజధాని అవసరాలకు వదిలేసి పక్క మండలాలకు వేల ట్రిప్పుల్లో తరలించడం పట్ల పలువురు మండిపడుతున్నారు. రాజధాని ప్రాంతం అసలే పల్లం కావడంతో చినుకు పడితే చిత్తడిగా మారి జల సంద్రాన్ని తలపించి రోడ్లపై ప్రయాణాలు కూడా నిలిచిపోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే రాజధాని ప్రాంతంలో పల్లపు ప్రాంతాలకు ఈ మట్టిని తరలిస్తే మంచిదే కానీ బయటకు విక్రయించి రూ. కోట్ల సంపాదనను ప్రైవేటు వ్యక్తులు జేబులో నింపుకోవడం పట్ల పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణం కోసం పేరేచర్ల ప్రాంతం నుంచి తరలించే కంకర, గ్రావెల్ ఇతర నిర్మాణ సామగ్రి తరలించే లారీలతో పాటు అక్రమ ఇసుక తరలింపు, ఇతర వాహనాల రాకపోకలతో రద్దీగా మారింది. దీనికి తోడు లారీల డ్రైవర్లు ఇష్టారీతిగా స్పీడు పెంచి నడుపుతుండటం స్థానికులకు ప్రాణ సంకటంగా మారింది. -
డయేరియా కలకలం
చేబ్రోలు: కలుషిత ఆహారం తినటంతో కొత్తరెడ్డిపాలెం దళితవాడలో శుక్రవారం సుమారు వందమందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావటంతో స్థానికంగా కలకలం రేగింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెం పాత దళితవాడ ప్రాంతంలో గత మూడు రోజులుగా ప్రార్థన కూటములు జరిగాయి. హాజరైన భక్తులకు మొదటి రెండు రోజులు శాకాహార భోజనం అందించారు. చివరి రోజు గురువారం రాత్రి చికెన్ బిర్యానీని అందజేశారు. బిర్యానీ తిన్న కొంతమంది అస్వస్థతకు గురవటంతో శుక్రవారం తెల్లవారుజామున రాజేష్, వజ్రం, జయరాణిలను 108 వాహనంలో తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక ప్రైవేటు వైద్యుని వద్ద మరి కొంతమంది చికిత్సలు పొందారు. ఉదయం నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరిగిపోయింది. ప్రత్యేక వైద్య శిబిరం స్థానిక తెలుగు బాపిస్టు చర్చిలో అత్యవసరంగా ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో వచ్చారు. కుర్చీలలో, బల్లల మీద కూర్చోబెట్టి సైలెన్ ఎక్కించారు. తర్వాత సమీపంలోని పీహెచ్సీ నుంచి బెడ్లను తెప్పించి బాధితులకు సైలెన్ సీసాలు పెట్టారు. వైద్య చికిత్సలు మొదలు పెట్టారు. నీరసంగా ఉన్న మరో నలుగురిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చేబ్రోలు, వట్టిచెరుకూరు ప్రాంతాల నుంచి రెండు 108 వాహనాలను మెడికల్ క్యాంపు వద్ద అందుబాటులో ఉంచారు. అధ్వానంగా పారిశుద్ధ్యం దళితవాడ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఎక్కడ మురుగు అక్కడే, చెత్తా చెదారం నిల్వ ఉండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వస్తున్నారనే సమాచారంతో పంచాయతీ సిబ్బంది హడావుడిగా చర్చి పరిసర ప్రాంతాలను శుభ్రం చేసే పనిలో పడ్డారు. రోజూ తమ ప్రాంతానికి పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది రావటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్య సేవలకు ఆదేశం బాధితుల సంఖ్య అధికంగా ఉండటంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పరిస్థితిని సమీక్షించారు. వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. మూడు రోజుల పాటు ప్రార్థన కూటమి జరిగిందని, అక్కడ బిర్యానీ తిన్న తర్వాత గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నుంచి అస్వస్థతకు గురైనట్లు బాధితులు వివరించారు. వైద్య సిబ్బందికి షిఫ్టులవారీగా విధులు కేటాయించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఇంటింటి సర్వే నిర్వహించటంతోపాటు అనుమానితులందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. బాధితులకు మంచి ఆహారం అందజేయాలన్నారు. బెడ్లు, పరుపులు, కూలర్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని తెనాలి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారిని ఆదేశించారు. ప్రస్తుతం 44 మంది అస్వస్థతకు గురైనట్లు కలెక్టర్కు అధికారులు వివరించారు. పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ గ్రామంలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని డీపీవో సాయికుమార్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నీటి నమూనాలు సేకరించి నివేదికను అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి ఆదేశాలు జారీ చేశారు. ప్రార్థన కూటమి నిర్వహించిన సంఘ పెద్దతో కలెక్టర్ మాట్లాడారు. చికెన్ ఎక్కడ కొనుగోలు చేశారు.. ఎన్ని గంటలకు తయారు చేసి, ఎప్పుడు భోజనాలు పెట్టారు.. వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. యడ్లపాటినగర్లోని షాపులో చికెన్ కొనుగోలు చేసినట్లు తెలపటంతో షాపులో తనిఖీ చేయాలని స్థానిక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దారు కె. శ్రీనివాసవర్మ, ఎంపీడీవో ఊహారాణి తదితరులు పాల్గొన్నారు. అదుపులోనే పరిస్థితి గుంటూరు వెస్ట్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో 11, 12, 13 తేదీల్లో బాప్టిస్ట్ ప్రేయర్ హాలులో ప్రార్థన కూటములు జరిగాయన్నారు. 13వ తేదీ రాత్రి దాటిన తర్వాత భోజనాలు ఏర్పాటు చేశారని, అక్కడికి రాని వారి ఇంటికి ఆహారాన్ని పంపించినట్లు తెలిసిందన్నారు. 14న ఉదయం, కొంత మంది మధ్యాహ్నం కూడా తిన్నారని తెలిపారు. దాదాపు 100 మంది భోజనం చేయగా 44 మంది అస్వస్థతకు గురయ్యారన్నారు. నలుగురి పరిస్థితి ఇబ్బందిగా మారడంతో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి పంపామన్నారు. ముందు రోజు నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారు పదుల సంఖ్యలో వచ్చినప్పటికీ వైద్యసిబ్బంది స్పందించికపోవటంతో బాధితుల సంఖ్య అధికమైంది. తెనాలి, గుంటూరు వైద్యశాలలకు బాధితులు వెళ్లటంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. డీఎంహెచ్వో కె.విజయలక్ష్మి, తెనాలి డిప్యూటీ డీఎంహెచ్వో అన్నపూర్ణమ్మలు మధ్యాహ్నం ఆ ప్రాంతానికి వ,చ్చారు. ఇంటింటికీ తిరిగి పరిస్థితిని అంచనా వేశారు. వైద్య సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాధితుల సంఖ్యను గుర్తించే పని చేపట్టారు. గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో 38 డయేరియా కేసుల నమోదుపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం అధికారులతో చర్చించారు. కలుషిత ఆహారం కారణంగా ఈ కేసులు నమోదైనట్లు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ పద్మావతి వివరించారు. ముగ్గురిని చేబ్రోలు పీహెచ్సీకి తరలించి, అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. దీనికి ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని మంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశించారు. -
తీర్మానం ప్రకారమే...
వేమూరు: చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు విక్రయిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక సహజవనరుల దోపిడీకి తమ్ముళ్లు తెగబడుతున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా బరి తెగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంపాదనే ముఖ్యం అమృతలూరు మండలంలోని మోపర్రు గ్రామంలోని చెరువులో మట్టిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులోని మట్టి తవ్వకాలు చేపట్టారు. మట్టిని ట్రాక్టర్ల ద్వారా ఇతర గ్రామాల వారికి అధిక రేట్లకు అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు, మైనింగ్ అధికారులు మట్టి తవ్వకాల గురించి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. మట్టి తవ్వకాలు నిలిపి వేసేందుకు ఒక మహిళ యంత్రాలు, ట్రాక్టర్లకు అడ్డుపడినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు పేర్కొన్నారు. చెరువులో మట్టిని తెలుగు దేశం నాయకులు సంపాదన కోసం ఇలా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులు వెంటనే అక్రమ మట్టి తవ్వకాలను నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకునేందుకు ఒక మహిళ ట్రాక్టర్లను, జేసీబీలను అడ్డుకుంది. దీంతో చుండూరు పోలీసులు హడావుడిగా చెరువులో తవ్వకాలు జరిగే ప్రాంతానికి వెళ్లారు. తెలుగు దేశం పార్టీలోని రెండు వర్గాలతో మాట్లాడారు. గొడవలు లేకుండా మట్టి తవ్వకాలు చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. బాపట్ల జిల్లా కేంద్రం నుంచి మైనింగ్ అధికారులు కూడా వచ్చి పరిశీలించారు. పెదగాదెలవర్రు గ్రామంలోని తెలుగు దేశం పార్టీలోని కంఠమనేని రాహుల్, మాజీ సర్పంచ్ కుమారుడు వేణుమాధవ్ రెండు వర్గాలు చీలారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు వేణుమాధవ్కు మద్దతుగా ఉన్నారు. రాహుల్ వర్గం మట్టి తవ్వకాలు నిలిపివేయాలని తహసీల్దారు కార్యాలయంలో, చుండూరు సర్కిల్ సీఐకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ మట్టి తవ్వకాలు నిలిపి వేయలేదు. రాహుల్ వర్గం చెరువు వద్దకు వచ్చి గొడవ చేయడంతో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు నిలిపివేశారు. చెరువుల్లో మట్టి తవ్వకాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మోపర్రు గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులను పక్కన పెట్టి జూనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్థానికులు చెప్పుకొంటున్నారు. చెరువు మట్టి తవ్వకాలు కూడా యువకులు చేస్తుండటంతో సీనియర్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం రెండు వర్గాలకు చెందిన వ్యక్తులను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పిలిపించి చర్చలు కూడా జరిపించారు. సీనియర్ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఎంపీడీఓ మారుతి శేషాంబను చెరువు వద్దకు పంపించారు. మట్టి తవ్వకాలను ఆమె పరిశీలించారు. గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం మట్టి తవ్వకాలు చేస్తున్నారు. మట్టిని గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తున్నారు. మట్టి బయటి వారికి అమ్ముకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – నెహ్రూబాబు, తహసీల్దారు, చుండూరు మండలం. -
విద్యార్థులు విజయాల వైపు సాగాలి
మంగళగిరి టౌన్: విద్యార్థులు ఉన్నత స్థానం నుంచి అద్భుత విజయాలవైపు ప్రయాణం సాగించాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సీకే కన్వెన్షన్లో గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్లతో కలసి పెమ్మసాని కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో అత్యధికంగా బాపట్లలోని కొల్లూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి దివ్యతేజశ్రీ 596 మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి తెలిపారు. 65 మంది విద్యార్థులకు రూ. 5 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం, లెదర్ బ్యాగ్, పెన్నులతోపాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా జిల్లాలో మొదటి పది స్థానాలు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లిడ్క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు, ఎన్ఆర్ఐ విద్యాసంస్థల ఈడీ తిలక్బాబు, ఆర్జేడీ నాగమణి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల విద్యాశాఖ అధికారులు సలీంబాషా, శ్రీనివాసరావు, రామారావు, చంద్రకళ, ఏలూరు, గుంటూరు, తెనాలి డీవైఈవో సుధాకర్ రావు, ఏసురత్నం, శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని -
గ్రంథాలయాలు నడిచేదెలా!
బాపట్లశుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026 వేధిస్తున్న నిధుల లేమి, సిబ్బంది కొరత 7సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రూ.23 కోట్ల సెస్సు బకాయిలు నిధుల కొరతతో రెండు నెలలుగా అందని వేతనాలు వేసవి శిక్షణ శిబిరాలకు మంజూరు కాని నిధులు వైఎస్సార్ సీపీ హయాంలో గ్రాంటు విడుదల –పీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘంతెనాలి: స్థానిక మార్కెట్యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5200, మోడల్ ధర రూ.4000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి ఉండవల్లికి చెందిన కొండా బాలప్రదీప్, విజయశాంతి దంపతులు రూ.1,00,116 విరాళమిచ్చారు. -
21 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెన్ అండ్ ఉమెన్ టీమ్ చాంపియన్షిప్ సెలక్షన్ పోటీలు స్థానిక శ్యామలానగర్లోని వెంకటేశ్వర బాలకుటీర్లో నిర్వహిస్తామని పోటీల నిర్వాహకుడు పి.విజయ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చెస్ వచ్చిన ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఎంపిక చేసిన టీమ్ను ఈ నెల 27న బాటప్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన బ్రోచర్ను జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు ిసీహెచ్ రవీంద్ర రాజు, బాలకుటీర్ సీఏఓ దుర్గా రఘురామ్, ప్రిన్సిపల్ సుధామాధవి, విజయ్కుమార్ తదితరులు ఆవిష్కరించారు. మంగళగిరి టౌన్: ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన అఖిల భారత టేబుల్ టెన్నిస్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ బృందం ప్రతిభ కనబరిచింది. ఏపీ ఈగల్ బృందం గురువారం వివరాలను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏపీ ఈగల్ బృందం రెండు కాంస్య పతకాలను సాధించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున పోటీల్లో పాల్గొన్న ఏపీ ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ స్వరూపారాణి మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. మహిళల విభాగంలో అప్పా ఎస్పీ శోభామంజరి, స్వరూపా రాణిలు ఉమెన్ డబుల్ విభాగంలో రాణించి మరొక కాంస్య పతకాన్ని రాష్ట్ర ఖాతాలో వేశారని తెలియజేశారు. అఖిల భారత పోలీస్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్శాఖకు చెందిన అధికారులు రెండు పతకాలు సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన డీజీపీ హరీష్కుమార్ గుప్తాకు ఏపీ ఈగల్ చీఫ్ రవికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 524.30 అడుగులకు చేరింది. ఈ నీరు 157.2340 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
అధికారుల ఆదేశాలు బేఖాతరు
● ఆగని తవ్వకాలు ● ఆందోళనకు సిద్ధమవుతున్న రైతులు కొల్లూరు: అధికారుల ఆదేశాలను ఇసుకాసురులు బేఖాతరు చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం పరిధిలోని కృష్ణా నదిలో ఇసుక క్వారీ దక్కించుకున్న హైదరాబాద్కు చెందిన నిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థ టీడీపీ నేతల అండదండలతో బాపట్ల జిల్లాలో ఇసుక తవ్వకాలకు పాల్పడుతోంది. అక్రమ తవ్వకాలపై బుధవారం ‘సాక్షి’లో ‘అక్రమాలకు హద్దే లేదు’ అనే శీర్షికన కథనం వెలువడింది. దీంతో స్పందించిన అధికారులు బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాన్ని పరిశీలించిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్, సర్వే శాఖల అధికారులు బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్నట్లు నిర్ధారించి తవ్వకాలు నిలిపివేయించారు. ఉమ్మడి సర్వే నిర్వహించి ఇరు జిల్లాల నడుమ హద్దులు నిర్ణయించిన అనంతరం తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అక్కడ నుంచి లారీలను, పొక్లెయిన్లను వెనక్కి పంపారు. జిల్లా యంత్రాంగ ఆదేశాలను పెడచెవిన పెట్టిన నిర్వాహకులు గురువారం తిరిగి బాపట్ల జిల్లా పరిధిలో ఇసుక తవ్వకాలు ఆరంభించారు. జిల్లా పరిధిలో ఐదు పొక్లెయిన్లు మోహరించి ఇసుక తవ్వకాలు చేపట్టడాన్ని పసిగట్టిన పోతార్లంక, తదితర లంక ప్రాంత రైతులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆ ప్రాంతానికి వెళుతుండటాన్ని ముందుగానే పసిగట్టిన ఇసుకాసురులు హుటాహుటిన అక్కడ నుంచి యంత్రాలను కృష్ణా జిల్లా హద్దులలోకి తరలించారు. అధికార యంత్రాంగం తక్షణం స్పందించకుంటే ఆందోళనకు దిగేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. -
యువకుడిపై హత్యాయత్నం
సత్తెనపల్లి: హత్యాయత్నానికి యత్నించిన యువకులకు దేహశుద్ధి చేసిన సంఘటన పట్టణంలోని వడ్డవల్లి చెక్క వంతెన వద్ద బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని వడవల్లి చెక్కవంతెన ఏరియాకు చెందిన నల్లబోతుల నాగరాజు, భార్య భవానీ హోటళ్లలో కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ముగ్గురు సంతానం. కాగా భవానీ ఆరు నెలల నుంచి పట్టణంలోని అచ్చంపేట రోడ్లో గల శివాలయం సమీపంలో నివాసముండే పమిడిగుంట్ల మహేష్ను రహస్యంగా కలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నాగరాజు తన భార్య భవానీని ప్రశ్నించడంతో మహేష్తో ఉన్న వివాహేతర సంబంధం అంగీకరించింది. నాగరాజు, తన కుటుంబ సభ్యులు చెప్పినా భవానీ ఖాతరు చేయకుండా మహేష్తో తిరుగుతుంది. నాగరాజు ప్రశ్నిస్తున్న విషయాన్ని మహేష్కు భవానీ చెప్పడంతో నెల రోజులుగా నాగరాజును చంపుతానంటూ మహేష్ ఇంటి పరిసరాల్లో కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. భయపడిన నాగరాజు ఇంటికి రావడం మానేశాడు. కుటుంబ సభ్యులు నచ్చ చెప్పడంతో ఈనెల 13న సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఆ విషయాన్ని నాగరాజు భార్య భవానీ తన ప్రియుడైన మహేష్ కు ఫోన్ లో తెలియజేయగా మహేష్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నాగరాజును హతమార్చేందుకు కత్తి తీసుకొని రాగా గమనించిన ఇరుగు పొరుగువారు మహేష్ దాడి చేస్తాడన్న భయంతో పట్టుకోవడానికి ప్రయత్నించగా అతను కత్తి చూపించి అందర్నీ బెదిరించాడు. నా తమ్ముడు, స్నేహితులతో మళ్ళీ వస్తానని, నాగరాజును కచ్చితంగా చంపుతానని, అడ్డొచ్చిన వారిని కూడా చంపుతానని మహేష్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుమారు 10:30 గంటల సమయంలో మహేష్ తమ్ముడైన ఆకాష్, అతని స్నేహితులైన మధార్వలి, షేక్ ఖాసిం సైదా అలియాస్ అండా ముగ్గురు మోటార్ సైకిల్ పై వచ్చారు. మహేష్ తమ్ముడు అయిన ఆకాష్ తను చేతిలో ఉన్న గొడ్డలితో ఇంటి సమీపముకు వచ్చి నాగరాజును హతమార్చేందుకు యత్నించగా నాగరాజు భయంతో పరుగులు పెట్టాడు. నాగరాజును వెంబడించారు. అప్పటికే అప్రమత్తంగా ఉన్న స్థానికులు అడ్డు పడటంతో ఆకాష్ పెనుగులాడి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. మిగిలిన ఇద్దరు మదార్వలి, ఖాసీం సైదా అలియాస్ అండా స్థానికులకు దొరకడంతో వారిరు వురికి దేహశుద్ధి చేసి విద్యుత్ స్తంభానికి కట్టేశారు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. భవానీ, మహేష్ల మధ్య ఉన్న అక్రమ సంబంధానికి నాగరాజు అడ్డుస్తున్నాడనే ఉద్దేశంతో పథకం ప్రకారం నాగరాజును హతమార్చేందుకు యత్నించారు. దీనిపై నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు హత్యా నేరం క్రింద నల్లబోతుల భవానీ, పమిడి గుంట్ల మహేష్, పమిడిగుంట్ల ఆకాష్, మధార్వలి, ఖాసిం సైదా అలియాస్ అండా పై పట్టణ సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమ వసూళ్లను నిరసిస్తూ రైతుల ఆందోళన
నాదెండ్ల: మైనింగ్ శాఖకు చెందిన ఏఎంఆర్ కంపెనీ చెక్పోస్టు సిబ్బంది రైతుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు గురువారం ఆందోళనకు దిగారు. సాతులూరు వద్ద గుంటూరు–కర్నూలు రహదారిపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి రాస్తారోకో నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలోని చందవరం సెంటర్లో ఉన్న ఏఎంఆర్ కంపెనీ చెక్పోస్టు సిబ్బంది రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లను వేధిస్తున్నారని విమర్శించారు. రైతులు తమ పొలాల్లో మెరక మట్టిని తోలుకుంటున్నారని, ట్రాక్టర్కు రూ.500 చెల్లించాలంటూ రైతులపై ఏఎంఆర్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అన్నారు. గ్రామంలోని ఓ మహిళ తన పొలంలోని మెరక మట్టిని ట్రాక్టర్లలో ఇతర పొలాలకు తోలించిందని, అందుకు ఏఎంఆర్ సిబ్బంది అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి ఒక్కో ట్రాక్టర్కు రూ.500 చెల్లించాల్సిందేనంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారని అన్నారు. డబ్బులు చెల్లించకుంటే కేసులు నమోదు చేయించి జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఏఎంఆర్ సంస్ధ నుండి రైతులను కాపాడాలని, ఈ సంస్థపై ప్రభుత్వం చర్యలు తీసుకుని చెక్పోస్టును తొలగించాలని డిమాండ్ చేశారు. రైతులు, ట్రాక్టర్ డ్రైవర్ల ఆందోళనతో రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం తెలుసుకున్న ట్రైనీ ఐపీఎస్ జె నిరంజన్, నరసరావుపేట రూరల్ సీఐ సుబ్బరావు, నాదెండ్ల, నరసరావుపేట రూరల్ ఎస్సైలు ఆర్ వెంకటేశ్వరరావు, కిశోర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఏఎంఆర్ సిబ్బందిపై కేసులు నమోదు చేస్తామని హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. -
అవార్డులకు ఆరోగ్య కేంద్రాలు ఎంపిక
గుంటూరు మెడికల్: జిల్లా లోని పట్టణ ఆరోగ్యకేంద్రాలు, ఆయష్మాన్ ఆరోగ్య మందిర్ల అవార్డులు, పారితోషికాలకు ఎంపికై న ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, సిబ్బందిని గురువారం డీఎంహెచ్ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అభినందించారు. ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో జాతీయ నాణ్యత అంచనా సంస్థ (ఎన్క్యూఏఎస్) రెండు రోజుల పాటు, నవజాత, మాతాశిశు, కౌమార బాలికల సంరక్షణ, సంక్రమణ, అసంక్రమణ వ్యాధుల నివారణ అంశాలపై నిర్వహించిన ప్రమాణాలలో మూడు పట్టణ ఆరోగ్యకేంద్రాలు, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు అవార్డులు రావడం అభినందనీయమన్నారు. అవార్డులకు ఎంపికై న నందులపేట (తెనాలి) –88.23 శాతం, రెడ్డిపాలెం (గుంటూరు) – 89.56శాతం, అడవితక్కెళ్లపాడు (గుంటూరు) –93.79 శాతం, మూడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మాచవరం, పాండ్రపాడు –92.44శాతం, ఉప్పలపాడు, పెదనందిపాడు 91.75శాతం, ఉప్పలపాడు, పెదకాకాని 82.49శాతంలు అవార్డులకు ఎంపికయ్యాయని తెలిపారు. ఒక్కో పట్టణ ఆరోగ్యకేంద్రానికి రూ.3లక్షల పారితోషికం, ఒక్కో ఆయుష్మాన్ ఆరోగ్యమందిర్కు రూ.1.26 లక్షలు ఆరోగ్యకేంద్రాలకు అభివృద్ధి, సిబ్బంది ప్రోత్సాహకాల రీత్యా అందజేయడం జరుగుతోందన్నారు. అవార్డులు పొందిన ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులను, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించి, మిగతా ఆరోగ్య కేంద్రాలు వీరిని ఆదర్శంగా తీసుకోవాలని, ఆరోగ్యకేంద్రాల నిర్వహణను, వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందజేయాలని సూచించారు. -
టీడీపీ నేతల మధ్య వాటాల వివాదం
కొల్లూరు: కొల్లూరు మండలం చిలుమూరు వద్ద కృష్ణానదిలో 4.870 హెక్టార్ల విస్తీర్ణంలో 73,050 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు ఏప్రిల్ 24న జిల్లా అధికారుల నుంచి అనుమతులు మంజూరయ్యాయి. ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన శ్రీనివాస ఇన్ఫ్రా అండ్ లాజిస్టిక్స్ కంపెనీ నేటి వరకు క్వారీని ఆరంభించలేదు. తవ్వకాలు ప్రారంభం కాకపోవడం వెనుక వాటాల వివాదమే కారణమన్న విషయం టీడీపీ శ్రేణులతోపాటు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత అనుచరులు ఇసుక తవ్వకాల కోసం నదిలో గాలు మార్గం ఏర్పాటు చేసిన ప్రయత్నాలను నియోజకవర్గ స్థాయి నేత అనుచరులు అడ్డుకున్నారు. దీంతో పనులు నిలిపివేచినట్లు చర్చ నడుస్తుంది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత ఇసుక క్వారీ నిర్వహణ అంశంపై మండల స్థాయి పలువురు నాయకులను సంప్రదించినప్పటికీ వేమూరు నియోజకవర్గ స్థాయి నేత కన్నెరజేస్తారన్న సంశయంతో వెనుకంజ వేస్తున్నట్లు వినికిడి. చివరకు ఇసుక క్వారీ నిర్వహణ పంచాయతీలో 60 శాతం వాటా తనకు కేటాయించాలని వేమూరు నియోజకవర్గ స్థాయి నేత డిమాండ్ చేసినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వచ్చిన ఆధాయంలో 60 శాతం ఆయనకిస్తే తమకు మిగిలేదేంటంటూ.. ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం వద్దే తేల్చుకునేందుకు పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేత సమాయత్తమవుతున్నట్లు ఆ పార్టీ శ్రేణులలో చర్చలు నడుస్తున్నాయి. -
తప్పిపోయిన మహిళ బంధువులకు అప్పగింత
పర్చూరు(చినగంజాం): మతిస్థిమితం లేక తప్పిపోయిన మహిళను గుర్తించి పర్చూరు పోలీసులు వారి బంధువులకు అప్పగించారు. పర్చూరు ఎస్సై పులి గోపి వివరాల మేరకు.. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఆవులవారిపాలేనికి చెందిన తిరుమల జంపారావు కుటుంబం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో ఇటీవల నిర్వహించిన పొలిమేర వీరాంజనేయస్వామి తిరునాళ్లకు వచ్చారు. జంపారావు కుమార్తె కూడా వచ్చింది. ఈమెకు మతిస్థిమితం లేదు. తిరునాళ్ల ముగిసిన అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో పూసపాడు అడ్డరోడ్డు వద్ద కుటుంబ సభ్యులతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో అక్కడి నుంచి ఆ మహిళ ఒక్కతే నడుచుకుంటూ వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దాంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం పర్చూరు మండలంలోని జాగర్లమూడి గ్రామంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మహిళను గమనించిన పోలీసులు ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో ఆమెను అదుపులోనికి తీసుకొని విచారించారు. మహిళ మాటతీరు, పరిస్థితిని గమనించిన పోలీసులు ఆమె మతి స్థిమితం సరిగా లేదని గుర్తించారు. అనంతరం ఆమె వివరాలను సేకరించి చివరగా జంపారావు కుమార్తెగా గుర్తించారు. వెంటనే ఎస్ఐ క్రోసూరు ఎస్ఐ సహకారంతో ఆవులవారిపాలెం సర్పంచ్ సహకారంతో మహిళ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మహిళ బంధువులను పర్చూరు పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన మహిళ విషయంలో ఎస్ఐ ప్రదర్శించిన చొరవను పలువురు అభినందించారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ప్రత్తిపాడు: హైవేపై ముందు వెళుతున్న కార్డును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గురువారం సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో చిలకలూరిపేట డిపో నుంచి గుంటూరు డిపోకు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్న ఆర్టీసీ బస్సు, ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం కాటూరి ఆస్పత్రి సమీపంలో పదహారవ నంబరు జాతీయ రహదారిపై విజయవాడ వెళుతున్న ఇన్నోవా కారును వెనుక నుం,ఇ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణీకులు అదృష్టవశాత్తూ బయటపడ్డారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. హైవేపై ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బందితో పాటు ప్రత్తిపాడు ఎస్ఐ నరహరి ట్రాఫిక్ను క్రమబద్దీకరించారు. అదే సమయంలో బస్సులో కూడా ప్రయాణీకులు ఉండటం, ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
హానికర రసాయనాలు వినియోగిస్తే చర్యలు
ఫుడ్ సేఫ్టీ అధికారులుచీరాల: పలు రకాల పండ్లు త్వరగా పండడానికి హానికర రసాయనాలు వినియోగిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ అన్నారు. గురువారం చీరాల కూరగాయల మార్కెట్ సమీపంలోని హోల్సేల్, రిటైల్ పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అరటి, దానిమ్మ, మామిడి, యాపిల్, బొప్పాయి వంటి పండ్ల నుంచి శాంపిల్స్ను సేకరించారు. ప్రస్తుతం వేసవిలో మామిడి పండ్లకు మంచి డిమాండ్ ఉందన్నారు. పక్వానికి రాకముందే త్వరగా పండేందుకు కార్బైడ్ వంటి రసాయనాన్ని వినియోగించడం వలన అవి త్వరగా పండిపోతాయన్నారు. అటువంటి పండ్లు చూడడానికి మంచి రంగుతో కనిపించి ఆకర్షిస్తాయన్నారు. పండ్ల వ్యాపారులు ఇదే అదనుగా హానికర రసాయనాలను వాడుతున్నారన్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కార్బైడ్ వంటి రసాయనాలను వాడుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్కు పంపిస్తామని, నివేదిక వచ్చిన అనంతరం నిబంధనలు ఉల్లఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
అక్రమ కేసులు బనాయించి వేధింపులు
పిడుగురాళ్ల: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్ సీపీ కర్నూలు పట్టణ యూత్ అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసులు పెట్టి, వేధించి ఆత్మహత్య చేసుకునేలా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అణిచివేతల వలన వైఎస్సార్ సీపీ యూత్ విభాగం ఆగదని, మీరు ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంత రెట్టించిన ఉత్సాహంతో పార్టీ శ్రేణులు పనిచేస్తారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారో వారిని ఇబ్బందులకు గురి చేయటం తగదన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లీం మైనార్టీ యువకులను టీడీపీ నేతలు టార్గెట్ చేసి అణిచివేయాలని చూస్తున్నారని, వాటి ఆటలు సాగవని హెచ్చరించారు. దాడులను నిరశిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. పార్టీ గురజాల నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడారు. నియోజకవర్గ యువజన విభాగం అధక్షుడు బి. సాంబశివరావు, పిడుగురాళ్ల మండల యువజన విభాగం అధ్యక్షుడు ప్రసన్న ఉన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ జబీర్ -
అభివృద్ధి పనులు వేగవంతం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ బాపట్ల: జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. సామాజిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, మిగిలిన ఎస్డబ్ల్యూ హాస్టల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రేపల్లె ఎస్డబ్ల్యూ కళాశాల బాలుర హాస్టల్ నిర్మాణ పనులను ప్రాధాన్యంగా పూర్తి చేయాలని తెలిపారు. ఎస్డబ్ల్యూ బాలికల హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. బాపట్ల, పర్చూరు హాస్టళ్లలో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తురుమెళ్లలోని పీఎం అజయ్ ఎస్డబ్ల్యూ బాలికల హాస్టల్ పనులను కూడా నిర్దేశిత ప్రమాణాలతో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎంపీ ల్యాడ్స్ పనులు 15 రోజుల్లో ప్రారంభం కావాలి.. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులన్ని 15 రోజుల్లో ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్, డీఎంఎఫ్ నిధులతో నిర్మిస్తున్న పనులపై జిల్లా కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు 40 ల్యాబ్స్ నిర్మించడానికి ఎంపీ ల్యాడ్స్ మంజూరైనప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు. టెండర్ ప్రక్రియ వారం రోజుల్లో ముగించాలన్నారు. మొత్తం మీద 106 అభివృద్ధి పనులు ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టినప్పటికి పనులు మొదలు కాకపోవడంపై ఆరా తీశారు. మార్కెటింగ్ శాఖకు 60 గోదాములు మంజూరు కాగా, 30 గోదాములు పూర్తి చేయడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాలుగు గోదాములు రద్దు చేయడంపై ఆరా తీశారు. మంజూరైన వాటిని మిగిలిన ప్రాంతాలకు బదిలీ చేసి గోదాములు నిర్మించాలన్నారు. ఇప్పటివరకు నిర్మించిన గోదాములన్నింటిని సహకార శాఖకు అప్పగించాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, సీపీఓ షాలేమురాజు, మైన్స్ ఏడీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.విజయమ్మ, పీఆర్ ఈఈ రాజన్ బాబు, ఆర్అండ్బీ ఇంజినీర్లు నళిని, అరుణకుమారి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
బగళాముఖి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
చందోలు(కర్లపాలెం): చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారిని బుధవారం ఏపీ హైకోర్టు న్యాయూమూర్తి జస్టిస్ ఉమామహేశ్వరరావు దంపతులు, ఏలూరు రిటైర్డ్ ఎస్పీ డీవీఎస్ మూర్తి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ మేనేజర్ నరసింహమూర్తి, ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయం చుట్టూ వారు ప్రదక్షిణలు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో జరిగిన పూర్ణాహుతి పూజా కార్యక్రమాలలో న్యాయమూర్తి దంపతులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్నారు. న్యాయమూర్తి దంపతులకు, ఎస్పీ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందజేసి ఈవో నరసింహమూర్తి అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాలను అందజేశారు. కార్యక్రమంలో పిట్టలవానిపాలెం తహసీల్దార్ డి.వెంకటేశ్వరరావు, బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రాన్ని ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ హెచ్.ఇ.సిలాయ్జాకీ, ఆస్ట్రేలియన్ హై కమిషనర్ హెచ్.ఇ.ఫిలిప్లు బుధవారం సందర్శించారు. వారు విజయకీలాద్రిపై ఉన్న అన్ని ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 27 అడుగుల ఏకశిలా విగ్రహం విఘ్న విమోచక హనుమాన్ను దర్శించుకున్నారు. అనంతరం వారికి చిత్రపటాన్ని, స్వామి వారి శేషవస్త్రాన్ని నిర్వాహకులు బహూకరించారు. ఆలయ విశిష్టతను జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు వివరించారు. పెదకాకాని: పెదకాకానిలోని భ్రమరాంబ మల్లేశ్వర స్వామిని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి అర్చకస్వాములు, వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలను చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు, ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్ అందజేశారు. -
శుభ శకునానికని ఎదురొస్తే ప్రాణాలే పోయాయి
కిలేశపురం(ఇబ్రహీంపట్నం): ఇంటికొచ్చిన బంధువులను తిరిగి పంపించేందుకు కారుకు శుభ శకునానికని ఎదురు వచ్చిన మహిళను వెనుక వైపు నుంచి దూసుకొచ్చిన మరోకారు ఢీకొనగా ఆమె మృత్యువాత పడిన ఘటన మండలంలోని కిలేశపురంలో 65వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఘటనలో ఆమె కుమారుడికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... కిలేశపురం గ్రామానికి చెందిన గుంటుపల్లి రమేష్, గంగాభవాని(44) దంపతుల కుమార్తెకు ఇటీవల వివాహం జరిగింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి కుమార్తెను పుట్టింటికి కారులో తీసుకొచ్చిన బంధువులను తిరుగు ప్రయాణంలో పంపించేందుకు తన కుమారుడు వెంకట జితేంద్రతో కలిసి తల్లి గంగాభవాని శుభశకునం కోసం కారుకు డ్రైవర్ వైపు ఎదురు వచ్చింది. కారు ముందుకు సాగిన మరుక్షణం హైదరాబాద్ వైపు నుంచి దూసుకొచ్చిన మరో కారు వీరిద్దరినీ ఢీకొట్టింది. గంగాభవాని అక్కడికక్కడే మృత్యువాత పడగా, ఆమె కుమారుడు వెంకట జితేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జితేంద్రను హుటాహుటిన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఈతకు వెళ్లి గుర్తుతెలియని యువకుడు మృతి
రేపల్లె: రేపల్లె మండలం రావి అనంతవరం గ్రామంలో మంగళవారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని పంట కాలువలో ఈతకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల్లో ఒకరు మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ముగ్గురు యువకులు కాలువలో ఈతకు దిగగా వారిలో ఒకరికి ఈత రాకపోవడంతో అకస్మాత్తుగా మునిగిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన అతనితో పాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. తర్వాత స్థానికులు గమనించి కాలువలో మునిగిపోయిన యువకుడిని బయటికి తీసేసరికి మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వయస్సు సుమారు 18 నుంచి 20 ఏళ్ల మధ్య ఉండవచ్చని పట్టణ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఇప్పటివరకు మృతుని ఆచూకీ తెలియరాలేదన్నారు. ఈ ఘటనపై పెనుమూడి వీఆర్వో జొన్న రామస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. -
నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: నేషనల్ సబ్ జూనియర్ అండ్ జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీలకు గుంటూరు జిల్లా నుంచి పవర్ లిఫ్టర్లు ఎంపికయ్యారని గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు తెలిపారు. మంగళగిరిలోని అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం క్రీడాకారుల వివరాలు వెల్లడించారు. ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కోనసీమ జిల్లా, అమలాపురంలో పోటీలు జరుగుతాయని తెలియజేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన లిఖిత, విజయశ్రీ, కౌశిక్లు పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. పోటీలకు ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేసి పతకాలు సాధించాలని ఆశించారు. గుంటూరు మెడికల్: పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి సంబంధించి ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్న 211 ఉద్యోగాల ఎంపిక తుది జాబితాను విడుదల చేసినట్లు గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ నాగార్జునకొండ వెంకట సుందరాచారి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుది జాబితాను గుంటూరు మెడికల్ కాలేజీ వెబ్సైట్తోపాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ వెబ్సైట్లో కూడా పరిశీలించవచ్చని తెలిపారరు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 14న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యోగాల నియామక ప్రకటనను మార్చి 26న విడుదల చేయగా, మొత్తం 4,791 దరఖాస్తులు అందినట్లు తెలిపారు. మొదట ప్రాథమిక మెరిట్ జాబితాను విడుదల చేసి, అనంతరం అభ్యంతరాలు (గ్రీవెన్సెస్) స్వీకరించేందుకు తగిన సమయం కల్పించినట్లు చెప్పారు.అందిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించి, ధ్రువీకరణ అనంతరం తుది మెరిట్ జాబితా, తుది ఎంపిక జాబితాను విడుదల చేసినట్లు వివరించారు. ఎంపికై న అభ్యర్థులకు గుంటూరు మెడికల్ కాలేజీ సిబ్బంది ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, తుది ఎంపిక జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేషన్ పరీక్ష ఫలితాలను అదనపు పరీక్షల నిర్వహణ అధికారి ఎ వెంకటేశ్వర్లు బుధవారం విడుదల చేశారు. ఏఎన్యూ పరిధిలో 2026 మార్చి, ఏప్రిల్లో జరిగిన బీఏ, బీఎస్సీ, బీకాం జనరల్, కంప్యూటర్స్, బీబీఏ, బీసీఏ, బీహెచ్ఎం, బీఎఓఎల్ ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 8790 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 8741 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. 99.44 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. పూర్తి వివరాలు వర్స్డ్ఠిటీ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చన్నారు. -
అమృతలూరు పీహెచ్సీకి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు
వేమూరు: అమృతలూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు అందించడం జరిగిందని వైద్యాధికారి డాక్టర్ పాలడుగు శృతి తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన జాతీయ నాణ్యత ప్రమాణాల హామీ బృందం సభ్యులు ఈ ఏడాది ఏప్రిల్ 27 28 తేదీల్లో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించడం జరిగిందన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు అందించే వైద్య సేవలు, కాన్పుల విభాగం పనితీరు, లేబొరేటరీ పనితీరును పరిశీలించారన్నారు. అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన బృంద సభ్యులు, బుధవారం గుర్తింపు పత్రం అందజేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్ర సిబ్బంది డాక్టర్ శృతిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి కొల్లి శ్రీనివాసరెడ్డి, ఆరోగ్య పర్యవేక్షకులు పుట్ట గుంట శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్ మేకా శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలి
చీరాల అర్బన్: చేనేత కార్మికులకు సంబంధించి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కోసం.. అర్హుల జాబితాలో పేరు లేనివారు హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయం ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్శాఖ ఈఈ జాన్ థామస్ తెలిపారు. మగ్గం ఉన్న వారికి 200 యూనిట్లు, పవర్లూమ్ వారికి 500 యూనిట్లు ఉచితం అని ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులపై ‘నేతన్నకు గుండె గు‘బిల్లు’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. చేనేత ఉపవృత్తుల వారికి పథకం వర్తించదని ఈఈ స్పష్టం చేశారు. ఉపవృత్తుల వారికి కూడా మగ్గం ఉన్న చేనేత కార్మికులకు వర్తించే పథకాలు వర్తిస్తాయని తమకు ప్రభుత్వ పరంగా ఎలాంటి గైడ్లైన్స్ లేవని తెలిపారు. ఈ క్రమంలో ఉచిత విద్యుత్కు సంబంధించి అర్హుల జాబితాలో పేరు లేనివారు మళ్లీ హ్యాండ్లూమ్ ఏడీ కార్యాలయం ద్వారా తమకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని పునఃపరిశీలించి అర్హులకు ఇబ్బంది లేకుండా పథకం వర్తింప చేస్తామన్నారు. విద్యుత్ వినియోగానికి సంబంధించి 200 యూనిట్లు కన్నా అదనంగా వినియోగించినా మొత్తం యూనిట్లలో 200 యూనిట్లు పోను మిగిలిన యూనిట్లకు చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. అయితే శ్లాబు ప్రకారం మిగిలిన యూనిట్లకు ధర చెల్లించాల్సి ఉంటున్నారు. కాగా రూ.399 విద్యుత్ బిల్లు వచ్చిన ఓ చేనేత కార్మికుడి నుంచి ఆ మొత్తం కట్టించుకున్నారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ విషయన్ని ఈఈ దృష్టికి తీసుకెళ్లగా తమ జాబితాలో ఉన్నవారికి అలా జరిగితే పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. ఎవరన్నా అద్దె ఇళ్లలో ఉంటే ఆ గృహ యమజాని నుంచి అనుమతి పత్రం పొంది దాఖలు చేయాలని చెప్పారు. విద్యుత్ శాఖ ఈఈ జాన్ థామస్ -
విజయకీలాద్రిపై హనుమజ్జయంతి
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై మంగళవారం హనుమాన్ జయంతి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళా శాసనాలతో ఉదయం 9 గంటలకు యోగాంజనేయస్వామి వారికి తొమ్మిది కలశాలతో అభిషేకం, విశేష అలంకరణ, అనంతరం 27 అడుగుల ఏకశిల మూర్తి శ్రీ విఘ్నవిమోచక హనుమంతునికి 9 రకాల పుష్పాలతో, పండ్లతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు. బాపట్ల: సూర్యలంక బీచ్లో స్వదేశ్ దర్శిని 2.0లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 16 నుంచి 22 వరకు జరగనున్న జాతీయ సీనియర్ కుడో పోటీలకు గుంటూరుకు చెందిన ఆర్ సిద్ధార్థ ఎంపికయ్యాడని కుడో జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సిద్ధార్థ బంగారు పతకం సాధించాడన్నారు. దీంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని తెలిపారు. గుంటూరు వెస్ట్ (క్రీడలు): యువత క్రీడల్లో రాణించడం ద్వారా జిల్లా, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. గతనెల 26 నుంచి 28వ తేదీ వరకు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన జాతీయ అన్ఎక్విప్డ్ ఓపెన్ సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిఫ్టింగ్లో పతకాలు సాధించిన వారిని మంగళవారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ అభినందించారు. ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తుపాకుల నాగజ్యోతి, జి.స్వాతి, కె.సత్యరామరాజు, ఎన్.ప్రణతిలు బంగారు పతకాలు సాధించారు. వినోద్కుమార్ రజత పతకం గెలుపొందారు. కోచ్ ఖమురుద్దీన్ ఆధ్వర్యంలో కలెక్టర్ను కలిశారు. కలెక్టర్ క్రీడాకారులను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అదికారి అఫ్రోజ్ఖాన్ పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 524.50 అడుగులకు చేరింది. ఇది 157.6100 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. -
బాపట్ల
బుధవారం శ్రీ 13 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.రాజుపాలెం: పెదనెమలిపురిలోని పోలేరమ్మ తిరునాళ్లను మంగళవారం వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి సారె, బోనాలు సమర్పించారు. నీట్ను రద్దు చేశారని తెలియడంతో విద్యార్థులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యాం. ఎవరో చేసిన తప్పిదానికి ఒక్క నిర్ణయంతో పరీక్ష మొత్తాన్ని రద్దు చేయడం తగదు. రెండేళ్లపాటు ఎన్నో ఆశలతో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని పరీక్ష రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో రద్దు నిర్ణయం కలచివేసింది. నీట్లో 720 మార్కులకు ప్రాథమిక ‘కీ’లో 691 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయస్థాయిలో మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించాను. పరీక్ష నిర్వహించే సమయంలో పెట్టిన ఆంక్షలు, శ్రద్ధ పేపర్ లీకేజీ కాకుండా చూడడంలో ఎందుకు పెట్టలేదు. – వల్లెపు ధీరజ్కృష్ణ, విద్యార్థి, గుంటూరు ఎన్నో ఆశలతో మరెన్నో ఆకాంక్షలతో.. రాత్రనకా.. పగలనకా.. నిద్రాహారాలు మాని.. ఒకరకంగా ప్రాణం పెట్టి నీట్కు సిద్ధమయ్యారు.. సమయం కాకముందే కేంద్రాలకు చేరుకుని.. కఠిన ఆంక్షల పరీక్షలను దాటుకుని, పరీక్ష రాసి, హమ్మయ్యా.. అంటూ ఇంటికొచ్చారు.. తమకు రాబోయే ర్యాంకులు తలచుకుంటూ.. ఏఏ కళాశాలలో చేరాలో.. ఎక్కడెక్కడ సీటొస్తుందో నంటూ లెక్కలు వేసుకుంటూ.. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో నీట్ రద్దంటూ ఎన్టీఏ ప్రకటించడంతో విద్యార్థులు హతాశులయ్యారు. భవిష్యత్తుపై గంపెడాశలతో ఉన్న తమకు ఎన్టీఏ ప్రకటన శరాఘాత మైందని వాపోతున్నారు. రద్దు ప్రకటన తమ భవిష్యత్తుపై ఖచ్ఛితంగా ప్రభావం చూపుతుందని వ్యథ చెందుతున్నారు. పరీక్ష రోజు కఠిన ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులు లీకేజీ విషయంలో ఎందుకు మిన్నకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 7 -
పొంగిపొర్లిన నిర్లక్ష్యం
వేమూరు: ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపమైంది. కాల్వల్లోకి నీరు అధికంగా విడుదల చేయడంతో పాటు, కాల్వలు మరమ్మతులు చేయకపోవడం, గుర్రపు డెక్క తొలగించకపోవడం వంటి కారణాలతో నీరు పొంగిపొర్లి పంటపొలాల్లో నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. చుండూరు మండలంలోని తుంగభద్ర సైడ్ చానల్కు అధికారులు తాగు నీరు విడదల చేశారు. తుంగ భద్ర సైడ్ చానల్లోని కట్టలు బలహీనంగా ఉండటం, వంతెనల వద్ద తూటి కాడ నిలిచి పోవడంతో నీరు పారుదల కాకపోవడంతో నీరు నడిగడ్డవారిపాలెం పొలాల్లోకి చేరింది. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా పొలం గట్ల నుంచి నీరు పొర్లి పక్కనే ఉన్న జగనన్న కాలనీలోకి సైతం వెళ్లి కాలనీ జలమయమయింది. ఇప్పటికై నా ఇరిగేషన్ అధికారులు కల్పించుకుని దుండిపాలెం గ్రామం వద్ద కోతకు గురైన కాల్వ కట్ట మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా కాల్వలో గుర్రపుడెక్క, వ్యర్థాలు తొలగించాలని రైతులు కోరారు. ● ఘటనపై ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీరు రవీంద్రను వివరణ కోరగా.. దిగువ ప్రాంతాలకు తాగు నీరు అధికంగా విడుదల చేయడంతో చుండూరు మండలంలోని పొల్లాలోకి, జగనన్న కాలనీకి నీరు వెళ్లినమాట వాస్తవమేనని, తాగునీరు విడుదల తగ్గించడం జరిగిందని తెలిపారు. -
హెచ్పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలు పూర్తి చేయాలి
కారంచేడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారంతో నిర్వహిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ లక్ష్యాలను వైద్య సిబ్బంది ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని బాపట్ల జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్ రత్నమన్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కారంచేడు, దగ్గుబాడు పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లతోపాటు పర్చూరు కో లొకేటడ్ పీహెచ్సీ వైద్య సిబ్బందితోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీలోగా మీ పీహెచ్సీల పరిధిలో ఉన్న 15 ఏళ్లలోపు బాలికలను గుర్తించి వారికి ఈ వ్యాక్సిన్ అందించాలన్నారు. బాలికలకు ఈ వ్యాక్సిన్ అందించడం వలన కలిగే మేలు తెలియజేయాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వలన సర్వైకల్ క్యాన్సర్నును నివారించుకోవచ్చని ఆయన తెలిపారు. మూడు పీహెచ్సీల పరిధిలోనూ చాలా తక్కువ మందికే వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని వైద్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పృథ్వీరాజ్, పర్చూరు కో లోకేటెడ్ వైద్యాధికారి డాక్టర్ సాయిప్రశాంతి, దగ్గుబాడు పీహెచ్సీ వైద్యాఽధికారి డాక్టర్ డాక్టర్ హరిత, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా?
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష నిర్వహించే తీరు ఇదేనా.. ? విద్యార్థులు పగలు, రాత్రి అహర్నిశలు కష్టపడి పరీక్ష రాసిన తరువాత హఠాత్తుగా రద్దు చేయడం వారిలోని మనోధైర్యం, ఆత్మ విశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2024లో సైతం ఇదే విధంగా తప్పిదాలు చోటు చేసుకుంటే పరీక్షను రద్దు చేయకుండా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరైన నీట్ నిర్వహణలో ఎన్టీఏ ఘోరంగా విఫలమైంది. పరీక్ష నిర్వహణ పేరుతో విద్యార్థులకు కఠినమైన ఆంక్షలు విధించి, పరీక్ష నిర్వహణలో ఫెయిలయ్యారు. – బాదినేని హరిబాబు, ప్రిన్సిపాల్, భాష్యం మెడెక్స్ కళాశాల, గుంటూరు -
చిలకలూరిపేట ఆర్టీసీలో వీడని ప్రతిష్టంభన
● రెండోరోజూ ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు ● ఆర్ఎం రజితకుమారి ఆధ్వర్యంలో చర్చలు చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: చిలకలూరిపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్ల విధుల బహిష్కరణ రెండో రోజుకూ చేరడంతో ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతంగా మారాయి. తోటి డ్రైవర్పై జరిగిన దాడిని నిరసిస్తూ తమకు ప్రాణరక్షణ కల్పించే వరకు స్టీరింగ్ పట్టే ప్రసక్తే లేదని కాల్ డ్రైవర్లు భీష్మించుకోవడంతో అధికారులకు ఇది పెను సవాలుగా మారింది. మొత్తం 35 మంది డ్రైవర్లకుగాను ఐదుగురు మాత్రమే విధులకు హాజరుకావడంతో డిపో నుంచి బస్సులు కదలలేదు. సమస్య జఠిలం కావడంతో పల్నాడు జిల్లా రీజనల్ మేనేజర్ టి అజితకుమారి సోమవారం స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. నరసరావుపేట, సత్తెనపల్లి నుంచి ఇతర డ్రైవర్లను రప్పించి, అందుబాటులో ఉన్న వారితో డబుల్ డ్యూటీలు చేయిస్తూ ఆర్టీసీ అధికారులు నెట్టుకొస్తున్నారు. డిపో పరిధిలోని అద్దె ప్రాతిపదికన నడిపే 5 సర్వీసులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో చీరాల, మాచర్ల వంటి మార్గాల్లో కీలకమైన సర్వీసులు లేక సామాన్య ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం చేసేందుకు మంగళవారం తిరిగి ఆర్ఎం రజిత కుమారి చిలకలూరిపేట డిపోను సందర్శించారు. అయితే విధులను బహిష్కరించిన ఆన్కాల్ డ్రైవర్లంతా బాధిత డ్రైవర్ దుర్గాప్రసాద్కు అండగ నిలిచారు. తమ తోటి డ్రైవర్కు న్యాయం చేయాలంటూ దుర్గాప్రసాద్కు మద్దతుగా మంగళవారం ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ వద్దనే ఉన్నారు. దీంతో డ్రైవర్లతో ఆర్ఎం ఫోన్ ద్వారా రెండోరోజు చర్చలు జరిపారు. దాడికి పాల్పడ్డ వ్యక్తులపై చర్యలు ఉంటాయని, గ్రామ పెద్దల మధ్యవర్తిత్వం తర్వాత కొంత సానుకూలత వ్యక్తమైనప్పటికీ, విధుల్లో భద్రతపై శాశ్వత భరోసా లభిస్తే తప్ప ఈ అనిశ్చితి పూర్తిగా తొలగేలా లేదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. ఈ విషయంపై ఆర్ఎం అజిత కుమారిని వివరణ కోరగా బాధిత డ్రైవర్కు తప్పక న్యాయం జరిగేలా చూస్తామని, ఇదే విషయాన్ని కాల్డ్రైవర్లతో ఫోన్ద్వారా తెలియజేశామని వారు బుధవారం నుంచి విధులకు హాజరు కానున్నట్లు చెప్పారని వివరించారు. -
నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి ఏర్పాట్లు చేయండి
బాపట్ల: జిల్లాలో నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన విద్యారంగ సమీక్ష సమావేశంలో విద్యార్థులకు కిట్స్ పంపిణీ, పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపాధ్యాయుల హాజరు, యూడైస్ డేటా, మధ్యాహ్న భోజన పథకం, ఎఫ్ఎల్ఎన్కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పీఎంశ్రీ పథకం, సీసీ టీవీ ఏర్పాటు, అనీమియా నివారణ చర్యలు, నైపుణ్యాభివృద్ధి, కెరీర్ కౌన్సెలింగ్, హాస్టల్ నిర్వహణ, ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్మెంట్, జాబ్మేళాలు, వయోజన విద్య, అక్షర ఆంధ్ర కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ సింగ్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారిని మాధవి అధికారులు పాల్గొన్నారు. నైబర్ హుడ్ వర్క్ స్పేస్ కల్పనకు దరఖాస్తులు ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ నైబర్ హుడ్ వర్క్ స్పెస్ పాలసీ 2025–30 కింద పని స్థలాన్ని లీజుకు ఇవ్వదలచిన వర్క్ డెవలపర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ వి.వినోద్కుమార్ -
ఐఓబీ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఒప్పందం
కొరిటెపాడు(గుంటూరు): అమరావతిలో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణానికి ఎన్బీసీసీతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) మంగళవారం అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై బ్యాంక్ చీఫ్ రీజినల్ మేనేజర్ హర్షిత్ సింగ్ సమక్షంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఏజీఎం) కె.ఆస్వథ్ రామన్ నిర్వహించారు. ఐఓబీ తరపున హర్షిత్ సింగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేయగా, ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎస్ రావు, జనరల్ మేనేజర్ రాజారాం సంతకాలు చేశారు. అనంతరం అవగాహన ఒప్పంద పత్రాలను రెండు సంస్థలు పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. అమరావతిలో ప్రతిపాదిత ప్రాంతీయ కార్యాలయం బ్యాంక్ విస్తరిస్తున్న వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంతో పాటు ఈ ప్రాంతంలో వినియోగదారుల సేవలను మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషించనున్నట్లు ఐఓబీ బ్యాంక్ అధికారులు తెలిపారు. -
‘నీట్’ కల చెదిరిన వేళ
గుంటూరు ఎడ్యుకేషన్: జాతీయ స్థాయి వైద్య విద్యా కోర్సుల ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026) రద్దు నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో ఏళ్ల తరబడి కష్టపడి సన్నద్ధమై నీట్ రాసి, జాతీయస్థాయిలో మంచి ర్యాంకు సాధిస్తామనే ధీమాతో ఉన్న విద్యార్థుల్లో ఎన్టీఏ నిర్ణయం ఆత్మ విశ్వాసాన్ని దిగజార్చింది. నీట్ నిర్వహణ సమయంలో దేశంలో ఏ ఒక్క పోటీ పరీక్షకు లేని విధంగా మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, విద్యార్థుల వస్త్రధారణ, ఆభరణాలు, చేతికి పెట్టుకునే వాచీలపై ఆంక్షలు విధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేపర్ లీకేజీని అరికట్టడంలో ఘోరంగా విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈనెల 3వ తేదీన జరిగిన నీట్కు గుంటూరు జిల్లాలో 8,299 మంది విద్యార్థులు హాజరయ్యారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను అధిగమించి, ఆత్మ విశ్వాసంతో పరీక్ష రాసిన విద్యార్థులు లీకేజీ కారణంగా పరీక్షను రద్దు చేస్తున్నట్లు మంగళవారం ఎన్టీఏ ప్రకటించగానే తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యారు. నిరాశ, నిస్పృహలో విద్యార్థులు దేశ వ్యాప్తంగా ఎయిమ్స్ వంటి కేంద్ర ప్రభుత్వ వైద్య విద్యాసంస్థలతోపాటు, రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే ఏకై క ప్రవేశ పరీక్ష నీట్కు తీవ్రమైన పోటీ నెలకొంటుంది. దేశ వ్యాప్తంగా భర్తీ చేసే లక్షా 12వేల సీట్లకు గానూ ఈనెల 3న జరిగిన నీట్కు 22 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. 720 మార్కులకు ఆఫ్లైన్ విధానంలో నిర్వహించే నీట్కు తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యార్థులు 6వ తరగతి నుంచే నీట్ ఫౌండేషన్ శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తుంటారు. నీట్ రాసి ఫలితాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. -
అంతర్జాతీయ పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులు
మంగళగిరి టౌన్: పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గుంటూరు జిల్లాకు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించినట్లు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజయ భాస్కరరావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరిలోని తమ కార్యాలయంలో మంగళవారం విజేతల వివరాలు వెల్లడించారు. ఈనెల 10వ తేదీ నుంచి చైనాలో జరుగుతున్న ఏషియన్ సబ్ జూనియర్, జూనియర్ (మెన్ అండ్ ఉమెన్) క్లాసిక్ అండ్ ఎక్యూప్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో తెనాలికి చెందిన వినయశ్రీ, జ్ఞాన దివ్య మహిళా పవర్ లిఫ్టర్లు పాల్గొని పతకాలు సాధించినట్లు తెలియజేశారు. వినయశ్రీ 84 కేజీల విభాగంలో సబ్ జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిందని, జ్ఞాన దివ్య +84 కిలోల విభాగంలో జూనియర్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీ ల్లో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించినట్లు వివరించారు. అంతర్జాతీయ పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ సభ్యులు అభినందించారు. పతకాలు సాధించిన క్రీడాకారులు -
ఆగస్టు చివరి నాటికి సౌరవిద్యుత్ యూనిట్ల ఏర్పాటు
నరసరావుపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలోని 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీలకు చెందిన గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం వచ్చే ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఏపీసీపీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పి.పుల్లారెడ్డి వెల్లడించారు. మంగళవారం జొన్నలగడ్డ రోడ్డులోని జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశానికి హాజరై ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీల సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్ పథకం అమలు, రెవెన్యూ కలెక్షన్లు, లో ఓల్టేజ్ సమస్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఇంటిపై రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు సంబంధించిన మెటీరియల్లో చాలా భాగం వచ్చాయన్నారు. పీఎం సూర్యఘర్కు సంబంధించి 40 వేల కనెక్షన్లు, వాటిలో జిల్లాలో మూడు వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పీఎం సూర్యఘర్ మరో పది వేల యూనిట్ల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నెలకు ఐదు వేల లక్ష్యంతో రెండు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. సాగు కనెక్షన్లపై దృష్టి రైతులకు రోజుకు 42 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ విద్యుత్ కోసం 12 సబ్స్టేషన్లలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2027 మార్చి చివరికల్లా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తి చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ బకాయిలు కొంత ఉన్నాయని, వాటిని వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన రెవెన్యూ కూడా కొంత బాకీ ఉందన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్, కాలనీల నుంచి విద్యుత్ బకాయిలు సుమారు రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందన్నారు. వాళ్లను కూడా చెల్లించాలని కోరామన్నారు. వేసవిలో ఎక్కడా లో ఓల్టేజ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో ఏడు నూతన సబ్స్టేషన్లు మంజూరయ్యాయని, నాలుగు చోట్ల పనులు మొదలు పెట్టారన్నారు. వచ్చే మూడు నెలల్లో మొత్తం పూర్తి చేస్తామన్నారు. మార్చి నెలలో వందశాతం రెవెన్యూ కలెక్షన్ సాధించామని, ఏప్రిల్ నెలలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి బకాయిలు అందకపోవటంతో ఐదు శాతం రెవెన్యూ తగ్గిందన్నారు. టెక్నికల్ డైరక్టర్ మురళీకృష్ణ యాదవ్, ప్రాజెక్ట్ డైరక్టర్ టీవీఎస్ఎన్ మూర్తి, ఫైనాన్స్ డైరక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఈ పి.విజయకుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. 1.91 లక్షల ఎస్సీ, ఎస్టీల గృహాలపై బిగించేందుకు చర్యలు -
రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరం
రేపల్లె: రాష్ట్ర అభివృద్ధికి దూరదృష్టి గల నాయకత్వం అవసరమని, అలాంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ మాజీ ఇన్చార్జి, వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు అన్నారు. ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా వైఎస్ జగన్ ఇప్పటికే నిరూపించుకున్నారని పేర్కొన్నారు. రేపల్లెలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చగల సామర్థ్యం వైఎస్ జగన్కే ఉందన్నారు. గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని గుర్తుచేశారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచాయని తెలిపారు. తాను రాజకీయంగా ముందుకు సాగేది కూడా వైఎస్ జగన్తోనేనని స్పష్టం చేశారు. ఈ నెల 14న వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో అధికారికంగా చేరనున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ప్రజల సేవలో నిబద్ధతతో పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల: వైద్యరంగంలో వైద్యులతోపాటు నర్సుల పాత్ర కూడా కీలకమని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ విజయమ్మ పేర్కొన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక పీపీ యూనిట్లో నర్సులకు సన్మాన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్క్రాస్ చైర్మన్ బి.ఎస్.నారాయణభట్టు, నవనీతం, చల్లా లావణ్య, డీఎఫ్ఓ యశ్వంత్, జాషువా, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు టైం స్కేల్ అమలు చేయాలని వీసీ ఆచార్య కె.గంగాధరరావుకు వినతిపత్రం అందజేశారు. ఏఎన్యూలో మంగళవారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు ఆధ్వర్యంలో విన్నవించారు. ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా ఎడ్వరైజ్మెంట్, యూజీసీ నిబంధనలు ప్రకారం ఏర్పాటు చేసిన ఫైవ్మెన్ సెలక్షన్ కమిటీ ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఎంపికై 16 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామన్నారు. ఈ నియామకాలు ఏఎన్యూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ద్వారా కూడా ఆమోదించబడ్డాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా ప్రకటించబడ్డ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నూతన నియామకాలు చేపట్టడానికి వర్సిటీ అధికారులు కార్యాచరణ ముమ్మరంగా జరుపుతున్నారన్నారు. కానీ దానికి ముందు జీఓ ఎంఎస్ నెంబరు 24 ప్రకారం యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు టైం స్కేల్ అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న వారికి పోస్టులను వారికి కేటాయించి మిగిలిన ఖాళీలను మాత్రమే రాబోయే రిక్రూట్మెంట్ ప్రక్రియలో నోటిఫై చేయాలన్నారు. అనంతరం వీసీ ఆచార్య కె.గంగాధరరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలంకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షుడు రవి, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మోహనరావు నరసరావుపేట / నరసరావుపేట ఈస్ట్: వేసవి సెలవులు ప్రారంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల సెలవులు హరిస్తూ వివిధ కారణాలతో ఒత్తిడికి గురిచేస్తున్నారని యూటీఎఫ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యా ప్రణాళిక రూపకల్పన, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు రెమిడీయల్ తరగతుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా ప్రణాళిక రూపొందించాలని షెడ్యూల్ విడుదల చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు విద్యా ప్రణాళికలు రూపొందించి 16వ తేదీన సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. విద్యాశాఖ వెకేషన్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని విద్యాశాఖ అధికారులు కొంత కాలంగా మరచినట్టు ఉన్నారని విమర్శించారు. గత నవంబర్లోనే రూపొందించాల్సిన విద్యా ప్రణాళికను అప్పుడు పట్టించుకోని అధికారులు వేసవి సెలవుల్లో షెడ్యూల్ జారీ చేయటం ఉపాధ్యాయులను వేధించటమేనని తెలిపారు. అధికారులు విద్యా ప్రణాళిక వాయిదా వేయాలని, లేకుంటే బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. -
వేగేశన.. భూదాహం తీరేనా!
బాపట్ల: బాపట్ల నడిబొడ్డులో విద్య, వైద్యం, ఆధ్యాత్మికత పెంపుదల కోసం క్రైస్తవ భూములైన ఏబీఎం (అమెరికన్ బాపిస్టు మిషన్) భూములపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ కన్ను పడింది. ఇంకేం అధికారం మనది.. మనల్ని ఆపేదెవరంటూ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2016లో ఏబీఎం స్థలాన్ని ఆక్రమించేశారు. మళ్లీ అధికారం రావటంతో ఆ స్థలంలో మల్టీకాంప్లెక్స్ నిర్మాణానికి తెరతీశారు. ఏబీఎం ఆస్తుల జోలికి వస్తే సహించేదిలేదని మొదటి నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ అధికారం ఉంది కదా..ఏమైనా చేసుకోవచ్చనే ధోరణిలో ఎమ్మెల్యే వేగేశన ఉన్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం కలెక్టర్, ఎస్పీ వంటి ఉన్నతాధికారులు తిరిగే ప్రదేశంలోనే అక్రమ కట్టడం జరుగుతున్నప్పటికీ అధికారులు ఆవైపు కన్నెత్తికూడా చూడకపోవటం చూస్తోంటే రెడ్బుక్ రాజ్యాంగం ఏవిధంగా సాగుతుందో ఇట్టే అర్ధమవుతుంది. స్థలం పొందింది ఇలా.. ఏబీఎం ఆస్తులకు సంబంధించి బాపట్లలో రూ.కోట్లాది విలువైన స్థలాలు ఉన్నాయి. ఇందులో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్కు చెందిన 668/1లో 1.50ఎకరం స్థలాన్ని కాజేసేందుకు వేగేశన నరేంద్రవర్మరాజు 2016లో చక్రం తిప్పాడు. ఈమేరకు మున్సిపాల్టీలో ఖాళీస్థలం పన్ను వేయించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటి రిజిస్ట్రార్ రిజిస్టేషన్ చేయించేందుకు అవకాశం లేదని చెప్పటంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు వివాదాలు లేకపోతే చట్టం ఏవిధంగా ఉంటే ఆవిధంగా చేయాలని చెప్పింది. ఈనిర్ణయం మేరకు ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తన తనయుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆదే ప్రదేశంలో మల్టీకాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరగా.. మున్సిపల్ కౌన్సిల్ 2017 ఫిబ్రవరి 23వ తేదీన తీర్మానం నెంబరు 312పేరుతో కాంప్లెక్స్ నిర్మాణాన్ని రద్దు చేశారు. అయినప్పటికీ పనులు మొదలుపెట్టారు. దీంతో స్థానిక క్రైస్తవులు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించటంతో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ ఆషిరీని విచారణ అధికారిగా నియమించారు. ఈమేరకు మే 16, 2016 నుంచి మే 19, 2016వరకు విచారణ చేపట్టి ఆర్సి నెంబరు 46/2016 పేరుతో అక్కడ ఎటువంటి కట్టడాలు చేయరాదని ఉత్తర్వులు ఇచ్చారు. ఈమేరకు అప్పటి తహసీల్దార్ తిరుమలశెట్టి వల్లయ్య సీఆర్పీసీ కింద 145 సెక్షన్ కింద నోటీసు కూడా జారీ చేశారు. ఏబీఎం స్థలంలో నిర్మిస్తున్న కట్టడాలుఅమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ కింద ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని క్రైస్తవ పెద్దలు డబ్ల్యూపీ నెంబరు 124/1994లో మద్రాసు హైకోర్టులో దావా వేశారు. ఈమేరకు 2000 సంవత్సరం నుంచి వీటిపై ఎటువంటి రిజిస్ట్రేషన్లు చెల్లవని, వాటిని పరిరక్షించాలని 2024లో మద్రాసు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే పెడచెవిన పెట్టి అక్రమ కట్టడానికి పూనుకున్నారు. ప్రజా సంఘాలు ఆందోళన చేసినప్పటికీ పట్టించుకో కుండా ముందుకుపోతున్నారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు తన కుమారుడు పేరుతో అక్రమంగా పొందిన ఏబీఎం ఆస్తుల్లో అక్రమ కట్టడాలు కట్టడం మానుకోవాలి. పేదల కోసం ఉన్న ఈ భూములను తన సొంతానికి అక్రమదారిలో చేజిక్కించుకోవటం సరి కాదు. ఈవిషయంలో అధికారులు సైతం మౌనంగా ఉండటం సరికాదు. పనులు నిలుపుదల చేసేవిధంగా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి. – వేమవరపు విజయ్కుమార్, బాప్టిస్ట్ క్రిస్టియన్ ప్రాపర్టీస్ వెల్పేర్ సొసైటీ అధ్యక్షుడు -
సంగీతంలో రెండోసారి గిన్నిస్ రికార్డ్
కర్లపాలెం: సంగీతంలో ఓ బాలుడు తన సత్తా చాటాడు. రెండోసారి గిన్నిస్ రికార్డు సాధించాడు. కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కట్టుపల్లి విల్సన్బాబు, ప్రత్యూషల కుమారుడు జోయల్ విల్సన్బాబు. 7వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో 22 దేశాల నుంచి 2 వేల మంది కీబోర్డు వాయిద్య కళాకారులతో కార్యక్రమం ఏర్పాటైంది. నిమిషంలో సప్తస్వరాలు, గంటపాటు ఆపకుండా కీబోర్డు వాయించటంపై పోటీలు నిర్వహించారు. జోయల్ విల్సన్బాబుకు రికార్డులో స్థానం లభించింది. 2024 డిసెంబర్ 1న విజయవాడలో జరిగిన సంగీత పోటీలలో కూడా జోయల్ విల్సన్బాబు పాల్గొన్నాడు. ఈ నెల 9న విజయవాడలో జరిగిన హల్లెల్ సంగీత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధుల నుంచి దీనికి సంబంధించి జోయల్ విల్సన్ బాబుకు సర్టిఫికెట్, మెడల్ అందాయి. -
వసతి గృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట: జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అందుకు సంబంధించిన కరపత్రాలను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆమె మాట్లాడుతూ 3 నుంచి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివే విద్యార్థినులు, విద్యార్థులకు వేరు వేరు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దరఖాస్తులు గ్రామ సచివాలయం వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వసతి గృహ సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల కార్యాలయాల్లో పొందాలని సూచించారు. ఇన్చార్జి జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి కె.సంతోష్ కుమార్, వసతి గృహ సంక్షేమ అధికారులు జయప్రద, రాణమ్మ, రాజేశ్వరి, రామాంజనేయులు, వెంకటేశ్వర నాయక్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలం కబ్జాపై కలెక్టర్కు ఫిర్యాదు
మార్టూరు: రూ.కోట్లాది విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కాజేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మంగళవారం జిల్లా కలెక్టర్కు రాజశేఖర్ అనే వ్యక్తి నుంచి ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదులోని వివరాల మేరకు.. స్థానిక జాతీయ రహదారికి పశ్చి వైపున పోలీస్ స్టేషన్, కూరగాయల మార్కెట్లకు మధ్య గల సర్వే నంబర్ ‘640ఏ’లో సుమారు మూడు ఎకరాల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల మేరకు.. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదే అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు గతేడాది పంట సాగు చేశాడు. ఈ విషయమై ప్రజా సంఘాలకు చెందిన పలువురు నాయకులు అప్పట్లో మండల తహసీల్దార్ టి.ప్రశాంతికి, బాపట్ల ఆర్డీవో గ్లోరియాకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేనందున మంగళవారం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్కు ఫిర్యాదు చేసినట్లు అర్జీదారు బాపట్ల జిల్లా అంబేడ్కర్ యూత్ ఫోర్స్ జిల్లా కార్యదర్శి చల్లూరి రాజశేఖర్ తెలిపారు. విచారణ తర్వాత తగిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. -
న్యాయమూర్తులకు పదోన్నతులు
గుంటూరు లీగల్: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ సివిల్ జడ్జి న్యాయమూర్తులకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా కోర్టుకు జూనియర్ డివిజన్ న్యాయమూర్తులుగా పి.రాజశేఖర్ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, తెనాలి నుంచి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. పీడీఎం కోర్టు జడ్జి స్పెషల్ మొబైల్ కోర్టు, గుంటూరుకు బదిలీ అయ్యారు. జె.అంజయ్య ఉదయగిరి, నెల్లూరు జిల్లా నుంచి రైల్వే కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వి.రఘునాథ్ ఏలూరు నుంచి మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరుకు వస్తున్నారు. వస్తున్నట్లు సమాచారం. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ వార్షికోత్సవ సంబరాలు సోమవారం ఐదో రోజుకు చేరాయి. అమ్మవారు గాయత్రిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో చండీ హోమం నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉత్సవ విగ్రహాలను చిలువూరు, తుమ్మపూడి, మంచికలపూడి, కంఠంరాజుకొండూరు గ్రామాలలో ఊరేగించారు. మహిళలు అమ్మవారికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనక తప్పెట్లు, మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామోత్సం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై హనుమజ్జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రిదండి చిన్న జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో సోమవారం దాసాంజనేయస్వామి వారికి అభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్రావు విచ్చేసి స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విజయకీలాద్రి దివ్యక్షేత్ర హనుమత్ విజయయాత్ర విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రం వరకు కొనసాగిందని, భక్తులు అధిక సంఖ్యలో ఈ విజయయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. పొన్నూరు: పట్టణంలోని సహస్రలింగేశ్వరస్వామి, వీరాంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున పంచామృత అభిషేకం, మధ్యాహ్నం లక్ష తమలపాకులు పూజ అర్చకులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారు ఒంటె వాహనంపై నిర్వహించిన గ్రామోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ ఆకురాతి శ్రీనివాసరావు, ధర్మకర్త సభ్యులు పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం 4 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకం, 7 గంటలకు విశేష అలంకరణ, 12 గంటలకు లక్ష తమలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్తులు పాల్గొనాలని ఈఓ శ్రీనివాసరావు కోరారు. -
నేతన్నకు గుండె గుబిల్లు
చీరాల అర్బన్: గత ఎన్నికల ప్రచారంలో చేనేతలకు టీడీపీ వరాల జల్లు కురిపించింది. నేతన్నలు నమ్మారు. ఓట్లు వేశారు. తరువాత సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, సవితలు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. నేతన్న నేస్తం అమలు లేదు. మగ్గాలు ఉన్న వారికి 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలు రెండేళ్లు అటకెక్కింది. ఈ క్రమంలో ఏరు దాటేదాక ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు సర్కార్ తమను చూస్తోందని నేతన్నలు పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. దీంతో నేతన్నలకు ఉచిత విద్యుత్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. అయితే అర్హుల జాబితా తయారీలో నిబంధనల పేరుతో వడపోత పోశారు. కోతలు పెట్టారు. అంతిమంగా జాబితాలో పేరున్నా పలువురికి ఏప్రిల్ నెల కరంట్ బిల్లులు కట్టాలని చెప్తున్నారు. కొందరుకి 200 యూనిట్లు కన్నా అదనంగా మీటర్ రీడింగ్ వచ్చిందని బిల్లులు చెల్లించమంటున్నారు. సాధారణంగా 2,3 తారీఖులలో తీసే మీటర్ రీడింగ్ను కూడా ఆలస్యంగా నమోదు చేశారు. మరి కొందరిని అనర్హులను చేయటమే లక్ష్యం. ఇక ఉపవృత్తుల వారికి మొండి చెయ్యి చూపారు. మాయ మాటలు చెప్పటం చంద్రబాబు నైజం. అతని మాటలు నమ్మి మోసపోవటం మన తప్పని పలువురు చేనేత కార్మికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉచిత విద్యుత్ అమలు ఉందని మండిపడుతున్నారు. జిల్లాలో సుమారు 8వేల మగ్గాలు జిల్లాలో సుమారు 8వేల మగ్గాలు ఉన్నాయి. రెండేళ్లుగా నేతన్న నేస్తం ఊసే లేదు. నేతన్నల ఆందోళనల నేపథ్యంలో కంటి తుడుపుగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు. అందుకు దరఖాస్తు చేసుకోమన్నారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు దరఖాస్తుల నమోదు ప్రక్రియలోనే బాలారిష్టాలతో పలువురు ఆ పథకానికి దూరమయ్యారు. నిబంధనల పేరుతో వడపోత...కోతలు జిల్లాలో 6,275 మంది నేతన్నలు ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే దరఖాస్తు సమయంలోనే సుమారు 2వేల మంది దూరమయ్యారు. పరిశీలనల పేరుతో 6,275 దరఖాస్తులలో 310 దరఖాస్తులను తిరస్కరించారు. మొత్తం మీద చీరాల డివిజన్ పరిధిలోని సింహభాగం ఉన్నాయి. డివిజన్ పరిధిలో మొత్తం దరఖాస్తుదారులు 5,536 మంది కాగా అందులో 4,625 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఇలా వడపోతలు, కోతలే లక్ష్యంగా అంతిమంగా లబ్ధిదారుల జాబితా తయారైంది. మీటర్ రీగిండ్ నమోదులోను జాప్యం సాధారణంగా ప్రతి నెల 2,3 తేదీల్లో మీటర్ రీడింగ్ చూచి, ఎన్ని యూనిట్లు వినియోగించుకుంది నమోదు చేస్తారు. ఏప్రిల్ నెల రీడింగ్ మే 2,3 తేదీల్లో నమోదు చేయాలి. అక్కడ కూడా జాప్యం చేశారు. ఎందుకంటే రెండు, మూడు రోజులు తరువాత రీడింగ్ తీస్తే వినియోగించిన యూనిట్లు కొందరికై నా 200 దాటుతుందని. అంటే అంతిమంగా ఉచిత విద్యుత్ అని గొప్పగా ప్రచారం చేసుకుంటూ, అర్హుల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ఆద్యంతం అధికారులు కష్టపడ్డారు. అలా పై నుంచి వారికి దిశా నిర్దేశం జరిగిందని ఆ శాఖలకు సంబంధించిన కొందరు చర్చించుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు .. ఉపవృత్తుల వారికి మొండిచెయ్యి అబద్ధాలు చెప్పటం టీడీపీ నేతలకు కొత్తేమీ కాదు. అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను అమలు చేయకపోతారా అని ఉపవృత్తులు వారు ఒకింత ఆశ పడ్డారు. నేతన్నల దత్తపుత్రునిగా చెప్పుకున్న మంత్రి లోకేష్ చెప్పిన మాటలు, అసెంబ్లీలో చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ మగ్గం ఉన్న నేతన్నలకు అమలయ్యే పథకాలన్నీ, చేనేత ఉపవృత్తుల వారికి వర్తించే విధంగా చర్యలు చేపడతామని చెప్పటం. సీఎం చంద్రబాబు చేసిన వాగ్దానాలను మననం చేసుకుని మురిసిపోయిన తమకు మొండిచెయ్యి చూపారని చేనేత ఉపవృత్తుల వారు మండిపడుతున్నారు. మొత్తం మీద చేనేత రంగానికి చెందిన అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ పరిధిలో 5,536 దరఖాస్తులు అందాయి. అంతిమంగా అందులో 4,625 మందిని అర్హులుగా గుర్తించాం. ప్రస్తుతం రీడింగ్ తీయడం పూర్తయ్యింది. అర్హుల జాబితాలో ఉన్నవారు ఒక వేళ 200 యూనిట్లు కన్నా ఎక్కువ వినియోగించుకుంటే వారు బిల్లు ఎప్పటి మాదిరిగానే చెల్లించాల్సిందే. అలా ఎంత మంది ఉంటారనేది 13వ తేదీ నాటికి తెలుస్తుంది. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పని చేస్తున్నాం. – జాన్ ధామస్, విద్యుత్శాఖ ఈఈ, చీరాల డివిజన్, చీరాల మాది ఆసుమిషన్ పని. అదే మాకు జీవనాధానం. చేనేత బట్ట తయారు ప్రాథమికంగా చేసే పని మాదే. ఉపవృత్తులకు కూడా మగ్గం ఉన్నవారితో పాటు అన్ని పధకాలకు అర్హత కల్పిస్తామన్నారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. ఇదేం న్యాయం. – జానకిరామయ్య, చేనేత ఉపవృత్తిదారుడు,పేరాల -
అర్జీలను బాధ్యతతో పరిష్కరించాలి
బాపట్ల: బాధితుల నుంచి అందే అర్జీలను అధికారులు బాధ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. తన పరిధిలోని వాటికి ఆయన అక్కడికక్కడే పరిష్కారం చూపగా, కొన్నింటిని పరిశీలన, మరికొన్నింటిని విచారణకు ఆదేశిస్తూ ఆయా శాఖల అధికారులకు పురమాయించారు. పీజీఆర్ఎస్ లో 138 అర్జీలు నమోదు అయ్యాయి. పీజీఆర్ఎస్ పరిష్కారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చెప్పారు. అర్జీలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలన చేయాలన్నారు. వేగంగా విచారణ జరపాలన్నారు. ఇకనుంచి ప్రతిరోజూ, వారానికి, నెల రోజులకు దశలవారీగా పర్యవేక్షణ, సమీక్ష సమావేశాలు జరుగుతాయన్నారు. మండల స్థాయి అధికారులంతా ప్రతి సోమవారం మండలాలలో జరిగే పీజీఆర్ఎస్లో హాజరుకావాలని ఆదేశించారు. గైర్హాజరైతే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండల స్థాయిలో అత్యధికంగా చెరుకుపల్లిలో 11 అర్జీలు పెండింగ్లో ఉండడంపై ఆరా తీశారు. దేవదాయ శాఖలో 48 అర్జీలు, జలవనరుల శాఖలో 11 అర్జీలు నమోదు కావడంపై సమీక్షించారు. కర్లపాలెం మండలంలో వచ్చిన అర్జీలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయకపోవడంపై తహసీల్దార్ను మందలించారు. పీజీఆర్ ఎస్ అర్జీల పరిష్కారంపై వ్యక్తిగతంగా ప్రజల అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 261 పీజీఆర్ఎస్ అర్జీలపై ఆడిట్ చేయాలని ఆదేశించారు. జన గణన వెంటనే ప్రారంభించండి జనగణన ప్రక్రియ నేటికీ మొదలుకాని ప్రాంతాలలో వేగంగా ప్రారంభించాలని సూచించారు. జనగణన ప్రక్రియ సమర్థంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. స్కిల్ హబ్లు సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,520 మంది యువతను నైపుణ్య అభివృద్ధి సంస్థలో నమోదు చేయించాలన్నారు. వారందరి నైపుణ్యాలపై విరివిగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ల ద్వారా శిక్షణలు ప్రారంభించాలన్నారు. త్రైమాసిక ప్రణాళిక ఆధారంగా శిక్షణలు కొనసాగించాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యం ఉండరాదని పలు సూచనలు చేశారు. జిల్లాలోని యువతీ, యువకుల నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడం, జాబ్మేళా నిర్వహించడం కమిటీలోని అధికారులకు లక్ష్యం కావాలన్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మర్రిపూడి విద్యార్థికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం
బాపట్లటౌన్: చిన్నతనంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్లో స్థానం దక్కించుకున్న ఘనత మర్రిపూడి గ్రామానికి చెందిన అభిషేక్ పాల్కు దక్కింది. బాపట్ల మండలం మర్రిపూడి గ్రామానికి చెందిన డాక్టర్ గుమ్మడి సుధాకర్, స్వర్ణలత దంపతుల కుమారుడు అభిషేక్ పాల్ 9వ తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న హైదరాబాద్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు భారీ సంగీత కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాల నుంచి 2000 మంది సంగీత కీబోర్డ్ వాయిద్యకారులు పాల్గొని నిమిషంలో సప్తస్వరాలు, ఒక గంటపాటు కీబోర్డు ఆపకుండా వాయించడంపై పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అభిషేక్పాల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. ఈనెల 9న విజయవాడలోని హల్లెల్ సంగీత పాఠశాలలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అభిషేక్పాల్కు సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. అభిషేక్పాల్ను గ్రామస్తులు, సంఘపెద్దలు ప్రత్యేకంగా అభినందించారు. -
అంతర్ జిల్లాల బాస్కెట్ బాల్ జట్టు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: బాస్కెట్ బాల్ అంతర్జిల్లాల సబ్జూనియర్ బాల, బాలికల జట్ల ఎంపిక ప్రక్రియ సోమవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఎంపిక ప్రక్రియను ఏపీ స్టేట్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, చీఫ్ సెలెక్టర్ గుంటుపల్లి హరగోపాల్ సమక్షంలో శిక్షకులు కోరగంటి రవి, చావల శ్రీను, సురేష్, అనిల్ సూర్య నిర్వహించారు. అంతర్ జిల్లాల సబ్–జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ చాంపియన్న్షిప్కు గుంటూరు జిల్లా జట్టు తరుఫున బాలుర విభాగం నుంచి లోహిత్ కుమార్, నిమేష్ రెడ్డి, అథర్వ్, లోహిత్, ప్రీతం పాల్, శశాంక్, తనీష్, ఇషాంత్, మోక్షిత్, సాయి శివ నాగ్, కార్తికేయ, నాగార్జున, అలీ, షాజాద్, బోడేశ్వర్, ధ్రువేష్ చౌదరి ఎంపికయ్యారు. బాలికల విభాగం నుంచి భూమి, మహిత, దీప్తి, దీక్షిత, పార్నవి, బృంద సాయి, సాన్విత, వేధన్షి, పల్లవి, రాగ వర్షిణి, తన్వి, కావ్య, యాషిక, లీష్మ లను ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు చిత్తూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నారు. -
ఇసుక భూముల్లో నమూనాల సేకరణ
చినగంజాం: ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి స్థానిక వ్యవసాయ భూముల రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా భగర్భ గనులు శాఖ అధికారులు సోమవారం ఇసుక నమూనాలు సేకరించారు. జిల్లా భూగర్భ గనుల శాఖ టెక్నికల్ అసిస్టెంట్ దమయంతి ఆధ్వర్యంలో చినగంజాం సర్వే నంబర్ 828, మోటుపల్లి సర్వే నంబర్ 128లో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారని ఆరోపించిన ప్రాంతంలో మొత్తం ఆరు నమూనాలను సేకరించారు. మండలంలోని సోపిరాల గ్రామానికి చెందిన రైతులు అనుమాలశెట్టి శ్రీరామకృష్ణ తదితర రైతులు ఆ ప్రాంతంలో తమ వ్యవసాయ భూములున్నాయని ఇసుక అక్రమ తవ్వకాలు జరపడం వలన తమ భూములకు సాగు నీరు లేకుండా పోతుందన్నారు. గతంలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో అప్పుడు విచారణ జరిపిన రెవెన్యూ అధికారులు ఆ భూములలో సాధారణ ఇసుక మాత్రమే ఉందని తవ్వకాలు జరగకుండా నిలిపివేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నివేదిక పంపారు. అటు తరువాత స్థానిక రైతులు ఆప్రాంతంలో సాధారణ ఇసుక మాత్రమే కాదని విలువైన సిలికాన్ ఇసుక కూడా ఉందని భూగర్భగనులశాఖతో సర్వే చేయించాలని కోరడంతో సంబంధిత శాఖాధికారులు సోమవారం ఘటనా స్థలానికి వచ్చి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో భూగర్భ గనులశాఖ కార్యాలయ సబార్డినేట్ అధికారి మహేష్, రెవెన్యూ అధికారులు నాగరాజు, స్థానిక రైతులు పాల్గొన్నారు. -
వైభవంగా హనుమాన్ గ్రామోత్సవం
పట్నంబజారు: అంజనీ సుతుడు ఆంజనేయస్వామి గ్రామోత్సవం సోమవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. గుంటూరు నగరం నాజ్ సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఆంజనేయ దీక్షాపరులు, భక్తులు భారీ ఊరేగింపు నడుమ ఆంజనేయస్వామి వారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు బ్రహ్మోత్సవాన్ని నిర్వహించారు. ప్రదర్శనలో భాగంగా క్రేన్తో ఏర్పాటు చేసిన హనుమాన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, స్వామి వారి వేషధారణలు, డప్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నాజ్ సెంటర్లో ప్రారంభమైన ఊరేగింపు భాస్కర్ డీలక్స్, కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ సెంటర్, శివాలయం, భగత్ సింగ్ బొమ్మ సెంటర్ మీదుగా లాలాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని తిరిగి అక్కడ నుంచి హిమని కూల్ డ్రింక్ సెంటర్, జిన్నాటవర్ సెంటర్ మీదుగా తిరిగి ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకుంది. అశేష భక్త సందోహం మధ్య జరిగిన ప్రదర్శన కార్యక్రమంలో నగర ప్రజలు స్వామివారినీ మనసారా స్మరించుకుంటూ నమస్కరించుకున్నారు. ఆలయ ఈవో టి సుభద్ర పర్యవేక్షణలో, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు టీవీ సుబ్బారావు ఆధ్వర్యంలో గ్రామోత్సవం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో గ్రూప్ ఆలయాల పాలకమండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు ఘటాభిషేకం హనుమజ్జయంతి పురస్కరించుకుని నాజ్సెంటర్లోని ఆంజనేయస్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం విశేష పూజలు నిర్వహించనున్నారు. ప్రతిఏటా సాంప్రదాయంగా నిర్వహించే ఘటాభిషేకం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతోందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ ఈఓ, దీక్ష సమాజం సభ్యులు కోరారు. -
14న నాట్కో సెంటర్లో పెట్ స్కాన్ ప్రారంభం
గుంటూరు మెడికల్: క్యాన్సర్ వైద్యంలో రాష్ట్రానికే తలమానికంగా ఉన్న గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో సెంటర్ మరింత అధునాతన సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. నాట్కో సెంటర్ విభాగంలో ఈ నెల 14న పెట్ స్కాన్ సెంటర్ ప్రారంభించనున్నారు. సోమవారం దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్ పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, తదితరులు ఉన్నారు. -
పోలీసుల అదుపులో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్
పెదకాకాని: ఇన్స్ట్రాగామ్లో స్థానిక ఎమ్మెల్యేపై పోస్ట్ చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ సీపీ చేబ్రోలు మండల సోషల్ మీడియా కన్వీనర్, చేబ్రోలు 4వ సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యుడు ఇంటూరి జైపాల్రెడ్డిని పెదకాకాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు మండలానికి చెందిన జైపాల్రెడ్డి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్పై అసభ్యకరమైన పోస్టు పెట్టారని పెదకాకానికి చెందిన టీడీపీ కార్యకర్త దాసరి నరసింహారావు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కార్యకర్త ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం జైపాల్రెడ్డి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియా కన్వీనర్పై కేసు నమోదు చేసి ఉపయోగించిన రెండు ఫోన్లు, లాప్టాప్ సీజ్ చేసినట్లు పెదకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు. అలానే ఎమ్మెల్యేపై మొక్కజొన్న దొంగల గ్యాంగ్ లీడర్ నరేంద్ర, రైతులు రేటు లేదు దొంగలకు డబ్బుల ముద్ద అనే పోస్ట్లు పెట్టారని రామాంజనేయులు, వినోద్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి జైలు గుంటూరు లీగల్: బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి పోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. పల్నాడు జిల్లా కోసూరు మండలం పెరికపాడుకు చెందిన మందా నాగరాజు అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్నేహంగా ఉన్నాడు. నాగరాజు మద్యం తాగేందుకు అతడిని పిలవడంతో భార్య మందలించింది. నాగరాజు ఒంటరిగా మద్యం తాగాడు. అనంతరం రాత్రి సుమారు 12 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి, అందరూ నిద్రిస్తున్న సమయంలో అతడి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో గుంటూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.కె.షమీ పర్వీన్ సుల్తానా బేగం నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధించారు. కేసు దర్యాప్తులో ఎస్ఐలు ఎం.నారాయణ, బి. అనంతకృష్ణ, కోర్టు కానిస్టేబుల్(ప్రస్తుతం ఏఎస్ఐ) శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీగల దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు కొరిటెపాడు(గుంటూరు): విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. విజిలెన్స్ విభాగం, ఆపరేషన్ విభాగం సంయుక్తంగా గుంటూరు పర్యవేక్షక ఇంజినీర్ సీహెచ్ రమేష్ ఆధ్వర్యంలో గుంటూరు డీ–1 సెక్షన్ పరిధిలోని బ్రాడీపేట, అరండల్పేటలలో సోమవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 4,750 సర్వీసులను తనిఖీ చేశారు. అనుమతించిన లోడు కంటే అదనంగా విద్యుత్ వాడుతున్న 108 మందికి రూ.5.05 లక్షలు, అనుమతించిన కేటగిరి కాక ఇతర కేటగిరిలో విద్యుత్ వాడుకుంటున్న ఐదుగురికి రూ.26 వేలు కలిపి మొత్తంగా రూ.5.31 లక్షలు అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు ఎస్ఏ కరీం, పఠాన్ హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ విద్యుత్ సర్వీసుల తనీఖీలు భారత విద్యుత్ చట్టానికి లోబడి ఉంటాయన్నారు. ఫిర్యాదుల కోసం 9440812263, 9440812361 నంబర్లును సంప్రదించాలని వారు కోరారు. తనిఖీల్లో డీఈఈలు షేక్ ముస్తాక్ అహ్మద్, మల్లికార్జున ప్రసాద్, రవికుమార్, ఏఈఈలు, కె.అక్కిరెడ్డి, శివశంకర్, సతీష్కుమార్ పాల్గొన్నారు. ఏఎన్యూ ప్రొఫెసర్కు అరుదైన గౌరవం ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఏఎన్యూ సోషియాలజీ సోషల్ వర్క్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్, జెండర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ కన్సల్టింగ్ వారి గ్లోబల్ రోస్టర్ ఆఫ్ జెండర్ ఎక్స్పర్ట్గా ఎంపికయ్యారు. ఆ సంస్థ యొక్క డైరెక్టర్లు, వ్యవస్థాపకులైన నికోలా, లీ నుంచి ఉత్తర్వులు అందుకున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కె.గంగాధరరావు సోమవారం ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్ను అభినందించారు.


