breaking news
Bapatla
-
పంచాయతీల విభజనకు
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పర్చూరు(చినగంజాం): కొన్ని నెలల్లో పంచాయతీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పంచాయతీల విభజన అంశం తెరమీదకు వచ్చింది. ప్రభుత్వం పంచాయతీల విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పంచాయతీలను ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాల మేరకు విభజన చేపట్టాలంటూ కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్చూరు నియోజకవర్గంలోని అధికారులు విభజనకు సంబంధించిన అంశాలను నివేదిక తయారు చేయడంలో తలమునకలవుతున్నారు. ఎక్కువ పంచాయతీలను విభజించే విధంగా ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నాయకులు సిఫార్సుల మేరకు స్థానిక శాసనసభ్యులు కలెక్టర్లకు ప్రతిపాదనలు అందజేయడంతో వాటిని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. దానికి సంబంధించి ఆయా పంచాయతీల తీర్మానాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుత పంచాయతీల విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి పలు అంశాలను పరిగణలోకి తీసుకునే పనిలో అధికారులు తలమునకలువుతున్నారు. ఇంకొల్లు మండలంలో.. ఇంకొల్లు పంచాయతీని ఇంకొల్లు (13935) హనుమోజీపాలెం (1132), గొల్లపాలెం (888) పంచాయతీలుగా విభజించేందుకు ప్రతిపాదనలు చేశారు. గంగవరం పంచాయతీని గంగవరం (2263), తాటిపర్తివారిపాలెం (686)గాను, ఇడుపులపాడు పంచాయతీని ఇడుపులపాడు(5036), అంకిరెడ్డిపాలెం(600), ఇడుపులపాడు ఎస్సీ కాలనీ (1800)గాను, సూదివారిపాలెం పంచాయతీని సూదివారిపాలెం (730), ఇడుపులపాడు పంచాయతీలోని అంబటిపాలెం (350)ని కలిపి సూదివారిపాలెం పంచాయతీ (1080)గా ఏర్పాటు, కొణికి పంచాయతీని కొణికి (1800), కొణికి పల్లె (1100)గాను ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మార్టూరు మండలంలో నాగరాజుపల్లి పంచాయతీని నాగరాజుపల్లి(2631), నాగరాజుపల్లి తండా, ఎస్సీ కాలనీ కలిపి నాగరాజుపల్లి తండా పంచాయతీ(1561)గాను, -
అర్జీలు గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: పీజీఆర్ఎస్ అర్జీలు గడువులోగా నాణ్యతతో పరిష్కరించేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అధికారులను ఆదేశించారు. అర్జీలను పరిశీలించిన అనంతరం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ అధికారులు, సిబ్బందితో స్థానిక న్యూ వీసీ హాల్లో కలెక్టర్ సోమవారం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సేవలు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వెళ్లేలా పర్యవేక్షించాలని కలెక్టర్ తెలిపారు. వంద సేవలు మాత్రమే ప్రస్తుతం అందుతున్నాయని, మరిన్ని సేవలు అందుబాటులో ఉన్న విషయాలపై అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, గ్రామ పంచాయతీలలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం ప్రచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి, విచారించాలన్నారు. ప్రజలకు మేలు జరగడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ఆ దిశగా కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించాలన్నారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించేందుకు సచివాలయాలలో ప్రత్యేకంగా అర్జీలు నమోదు చేయించాలన్నారు. ఐ–జి ఓ టి, ఈ శ్రమ పోర్టల్ నమోదు కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించడానికి అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఎప్పటికప్పుడు వివరాలు పంపాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అధికారి జి గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, మెప్మా పీడీ ఆనందసత్యపాల్, సీపీఓ షాలేం రాజు, కార్మిక శాఖ అధికారి వెంకట శివప్రసాద్, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలక్ష్మి, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని బాపట్ల పట్టణం డీకే పాలెం మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని ఇందు కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో వ్యక్తిగత ఆత్మస్థైర్యం పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్, ఆర్డీఓ పి గ్లోరియా, ఎంఈఓలు డి శ్రీనివాస్, డి ప్రసాదరావు, తహసీల్దార్ షాలిమా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలి బాపట్ల:బాపట్లలో చేపట్టిన ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేస్తే జిల్లా అభివృద్ధి బాటలో పయనిస్తుందని, ఇందు కోసం భూసేకరణ త్వరగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. భూ సేకరణ ప్రక్రియపై రెవెన్యూ అధికారులతో సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల అభివృద్ధితో రవాణా వ్యవస్థ పెరుగుతుందని, తద్వారా ప్రజల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తున్న అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, జల వనరుల శాఖ, రోడ్లు భవనాల శాఖ, అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఆహార పదార్థాలలో కల్తీలు ఉంటే ఆరోగ్యానికి హానికరం ఆహార పదార్థాలలో కల్తీలు ఉంటే ప్రజల ఆరోగ్యానికి హానికరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. వినియోగదారుల అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఆహార భద్రత నాణ్యతశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడపత్రాలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో విడుదల చేశారు. నాణ్యంగా, సురక్షితమైన ఆహార పదార్థాలతోనే ప్రజల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కలెక్టర్ చెప్పారు. ఆహార పదార్థాలలో కల్తీలు అధికంగా వస్తున్నందున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆహార పదార్థాల ఉత్పత్తులను ప్రజలు పరిశీలించాలన్నారు. రంగులు వినియోగించే ఆహార పదార్థాలు ప్రజారోగ్యానికి హానికరమన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఆహార భద్రతపై అవగాహన పొందాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డీఆర్వో జి.గంగాధర్గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, డీఎస్ఓ జమీర్ బాషా, ఆహార భద్రత తనిఖీ అధికారి ప్రణీత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పనులు వేగవంతం చేయాలి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో నిర్వహించే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల పురోగతిపై సంబంధిత లైన్ డిపార్టుమెంట్ల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ విజయలక్ష్మి, పశుసంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్, వీక్షణ సమావేశం ద్వారా హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, అన్ని మండల ఏపీవోలు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ లీకై ఇల్లు దగ్ధం
మార్టూరు: గ్యాస్ లీక్ కావడంతో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని జొన్నతాళి గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. బాధిత కుటుంబం వివరాల మేరకు.. స్థానిక యాదవవీధిలో రెండు పోర్షన్లు గల ఇంటిలో తండ్రీకొడుకులు రెండు కుటుంబా లుగా విడివిడిగా నివాసం ఉంటున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో అందరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఈ సమయంలో కుమారుడు చిట్టిబోయిన శివయ్య గదిలో గ్యాస్ లీకై విద్యుత్ సరఫరా కావడంతో సిలిండర్ ఒక్కసారిగా పేలి ముక్కలయింది. పేలుడు ధాటికి తండ్రి చిట్టి బోయి న సింగరయ్య నివాసంలోని ఖాళీ సిలిండర్ 200 మీటర్ల దూరంలోని నివాసాల మధ్య పడింది. ఎవరికి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దాచిపెట్టిన నగదు.. బంగారం బూడిద ! శివయ్య భార్య శాంతికి చెందిన రూ.17 వేల నగదు కాలిపోగా ప్లాస్టిక్ బాక్సులో దాచి ఉంచిన సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలు మంటలకు మాడి కనిపించకుండా పోయాయి. సుమారు ఎనిమిది గ్రాముల ఆభరణాల ముక్కలు మాత్రమే మిగిలాయి. శివయ్య తండ్రి సింగరయ్య నివాసంలో రూ.9 వేల నగదుతోపాటు రెండు పోర్షన్లలోని రూ. లక్షకు పైగా ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం కాగా మొత్తంరూ.4 లక్షలు నష్టం వాటిల్లిందని వాపోయారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదం అంచనాలు ఉన్నతాధికారులకు తెలియజేయనున్నట్లు తెలిపారు. -
చిరుధాన్యాల ఉత్పత్తులతో మహిళలకు ఆర్థికాభివృద్ధి
బాపట్ల: మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల ప్రాసెసింగ్ ద్వారా వివిధ ఆహార ఉత్పత్తులుగా మార్చే ప్రక్రియతో గ్రామీణ మహిళలు ఆదాయాన్ని మరింతగా పెంచుకోవచ్చని బాపట్ల వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల అసోసియేట్ డీన్ డీడీ స్మిత్ అన్నారు. సోమవారం గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ప్రధాన లక్ష్యంగా స్వయం ఉపాధికి చిరుధాన్యాల ప్రాసెసింగ్ –మహిళా సాధికారత అనే అంశంపై కళాశాలలో మహిళలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్మిత్ మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాసెసింగ్ మహిళలకు అత్యంత అనుకూలమైన స్వయం ఉపాధికి మార్గమన్నారు. తక్కువ పెట్టుబడి, కొద్ది స్థలం, తక్కువ శక్తితో ఇంటి వద్దనే ప్రారంభించగలిగే అవకాశాలు ఇందులో విస్తారంగా ఉన్నాయని తెలిపారు. మహిళల్లో ఉన్న నైపుణ్యాలను సాంకేతికతతో మేళవిస్తే స్థిరమైన ఉపాధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శిక్షణలో రాగి, జొన్న, సజ్జ, కొరల్రు, సామలు వంటి చిరుధాన్యాల పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు జి.రవిబాబు, బి.శ్రీనివాసులరెడ్డి, కె.వి.ఎస్.రామిరెడ్డి, ఎస్.విష్ణువర్ధన్, కె.లావణ్య పాల్గొన్నారు. -
భారీ క్రేన్ దగ్ధం–తప్పిన ప్రమాదం
చీరాల: వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జరుగుతున్న ఆర్వోబీ పనుల్లో ఉపయోగిస్తున్న భారీ క్రేన్ సోమవారం ప్రమాదవశాత్తూ అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగర్కాలనీ వద్ద ఈపూరుపాలెం స్ట్రయిట్ కట్ వద్ద రైల్వే లైను సమీపంలో వంతెన నిర్మాణానికి ఉపయోగిస్తున్న భారీ క్రేన్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇంజిన్ ఆఫ్లో ఉన్నా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. క్రేన్లో భారీగా ఆయిల్ ఉండడంతో మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. అదృష్టవశాత్తూ అక్కడ పనులు జరగకపోవడం, కార్మికులు ఎవరూ లేకపోవడం ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ నాగభూషణం ఘటనా స్థలానికి సిబ్బందిని పంపించి స్థానికులను అక్కడ నుంచి పంపించివేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని అతికష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వేట్రాక్ పక్కనే ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం షార్టు సర్క్యూట్తో జరిగిందా.. మరేదేమైనా కారణం ఉందా అనే కోణంలో అగ్నిమాపక అఽధికారులు విచారణ చేపట్టారు. -
కారుబోల్తా.. నలుగురికి గాయాలు
బాపట్లటౌన్: కారు బోల్తాపడి.. నలుగురు యువకులు గాయపడిన ఘటన మండలంలోని సూర్యలంక రోడ్డులో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని అసోదివారిపాలేనికి చెందిన ముడుగు రంగారెడ్డి, మర్రి సింహారెడ్డి, మంచాల ఏడుకొండలరెడ్డిలతో పాటు మండలంలోని వెదుళ్లపల్లి కొత్తపాలెం గ్రామానికి దొంతిన నాని తన స్నేహితుడిని సూర్యలంకలోని ఎయిర్ఫోర్స్ హాస్పిటల్లో చేర్చేందుకు సోమవారం సాయంత్రం కారులో వెళ్లారు. ఎయిర్ఫోర్స్ నుంచి బాపట్ల వైపు వస్తుండగా సూర్యలంక రోడ్డులోని చప్టా సమీపంలోకి వచ్చే సరికి కారు అదుపుతప్పి చప్టావద్ద బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు కారులో నుంచి జారి రోడ్డు పక్కనే పడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ కె.శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నలుగురు వ్యక్తులు చీరాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో మర్రి సింహారెడ్డి పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. బాపట్ల ఆర్డీఓ పి.గ్లోరియా, తహసీల్దార్ షేక్ సలీమా, రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు చీరాలలోని వైద్యశాలకు వెళ్లి క్షతగాత్రుల పరిిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాల యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. -
నేడు జిల్లా ఇన్చార్జి మంత్రి బాపట్లకు రాక
బాపట్ల: బాపట్ల జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత సంవత్సరంలో జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ సమీక్షిస్తారని తెలిపారు. పిడుగురాళ్ల: రైతులకు ఆత్మ సౌజన్యంతో వ్యవసాయ, ఉద్యాన శాఖ అన్ని పంటలపై సమగ్ర విజ్ఞానాన్ని రైతులకు తెలియజేయాలనే ఉద్దేశంతో గుంటూరు లాంఫాం క్షేత్ర సందర్శన నిమిత్తం సోమవారం వెళ్లారు. ఈ సందర్భంగా జీవన ఎరువుల ఉపయోగం, వినియోగం గురించి వివరించటం, విత్తన ఉత్పత్తి, మిరపలో తామర పురుగుల నివారణ, పుట్టగొడుగుల సాగు, ఆయిల్ఫామ్ సాగు, అపరాల సాగు విధానం, డ్రోన్ ఉపయోగం గురించి వివరించడం జరిగిందని అధికారులు తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఎం.సంధ్యారాణి, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు ఉన్నారు. గుంటూరువెస్ట్: జిల్లా అగ్నిమాపక భవనం నిర్మాణానికి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం శంకుస్థాపన చేశారు. భవనాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో రూ.3.39 కోట్లతో నిర్మించనున్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆకాక్షించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎం.ఎ.క్యూ జిలానీ, జిల్లా అగ్నిమాపక అధికారి ముక్కు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలిఅర్బన్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారికి ముక్కోటి ఏకాదశి దశావతార మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం స్వామివారిని వరాహావతారంతో అలంకరించి పురవీధుల్లో రథంపై ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వి.అనుపమ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తాడికొండ: అమరావతి రాజధానికి గుంటూరు నుంచి వెళ్లే ప్రధాన రహదారి గత మూడు నెలలుగా గుంతలమయంగా మారడంతో పంట లు అధ్వాన్నంగా తయారయ్యాయి. మరమ్మతుల పేరుతో అధికారులు కాలయాపన చేస్తుండటంతో ఇప్పటికే పూర్తిగా పాడైన పెదపరిమి–తుళ్లూరు మధ్య రహదారిపై దుమ్ము లేచి పంటలపై పేరుకుపోవడంతో పంటలు దుమ్ము కొట్టుకొని పనికిరాకుండా పోతున్నా యని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టి నెల దాటినా అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో అటు రైతులతో పాటు ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. రాజధానికి వెళ్లే ప్రధాన రహదారి దుస్థితి ఇలా ఉండటం పట్ల అంతా మండిపడుతున్నారు. -
సొసైటీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.బాలాజి భట్టిప్రోలు: రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు (సొసైటీలు) ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.బాలాజి విమర్శించారు. భట్టిప్రోలులోని ఏఐటీయూసీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారు మెరుగైన జీవనాన్ని గడిపే విధంగా చర్యలు చేపడతామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు కార్మికుల సంక్షేమాన్ని, పరిశ్రమ రక్షణను విస్మరించారని పేర్కొన్నారు. చేనేత సహకార సంఘాలకు వివిధ రాయితీల రూపంలో చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో సొసైటీలు కొనఊపిరితో కొనసాగుతూ కార్మికులకు ఉపాధి కల్పించలేని దుస్ధితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి, సొసైటీల రక్షణకు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సమితి సభ్యులు కె.రామకోటేశ్వరరావు, కె.వీరమోహన్రావు, ఏఐటీయూసీ నాయకులు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు పునరావృతమైతే చర్యలు
జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పదేపదే పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 60 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను విన్నవించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తి స్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలని కోరారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధిచిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకు వివరించారు. కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్నాయక్, పీజీఆర్ఎస్ సెల్ మహిళా ఎస్ఐ లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు. -
గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్
నగరంపాలెం: ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు కేసులో ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు ఆటగాళ్లను పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హోలులో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. సోమవారం టాస్క్ఫోర్స్ సమాచారంతో గుంటూరు పశ్చిమ డీఎస్పీ అరవింద్ పర్యవేక్షణలో పట్టాభిపురం పీఎస్ సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో వికాస్ నగర్ మూడో వీధిలోని ఓ డాబాపై ఆకస్మిక తనిఖీలు చేశారు. హాలులో ఇద్దరు టేబుల్ ఎదురు కూర్చొని ఉండగా, మరో ఆరుగురు ఫోన్లల్లో బెట్టింగ్లు చేస్తున్నట్లు గుర్తించారు. సోమవారం ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్బాష్ లీగ్ తొమ్మిదో మ్యాచ్(సిడ్నీ థండర్/బ్రిస్బానే హార్ట్) బెట్టింగ్ నిర్వర్తించే క్రమంలో వీరందర్ని పట్టుకున్నారు. నిర్వాహకుడైన తాతినేని శ్రీనివాసరావు, విజయభాస్కరరెడ్డి, కొరిటెపాడు నాలుగో వీధికి చెందిన షేక్ సలీం అలియాస్ శ్రీను, తిరుమలశెట్టి నాగు, శివారెడ్డిపాలెం పోలేరమ్మ గుడి ప్రాంతంలో ఉంటున్న కోటపాటి వెంకటరెడ్డి, పొన్నూరు రోడ్ సాయిబాబాకాలనీ ఒకటో వీధి వాసి దొడ్డా శ్రీకాంత్, బృందావన్ గార్డెన్స్ ఏడో వీధిలో ఉంటున్న జిల్లేలమూడి బ్రహ్మతేజ, నెహ్రునగర్ తొమ్మిదో వీధికి చెందిన పల్లె సుధాకర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.13.60 లక్షలు, ఆన్లైన్లో రూ.5.05 లక్షలు ఫ్రీజ్, ల్యాప్టాప్, ఎనిమిది సెల్ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో నల్లచెరువు మేనకగాంధీనగర్కు చెందిన తాతినేని శ్రీనివాసరావు గత పదేళ్లుగా ఆనన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు. కొరిటెపాడు పార్కు వెనుక ఉండే యర్రబోతుల విజయభాస్కరరెడ్డితో కలసి శ్రీనివాసరావు బెట్టింగ్లు నిర్వహించే వాడని చెప్పారు. ఇద్దరూ ఒక బెట్టింగ్లను పలువురికి అలవాటు చేశారని, యాప్ల ద్వారా బాల్ టు బాల్ బెట్టింగ్ నిర్వహించే వారని వివరించారు. పేకాటలో మోసం అంతర్జాతీయ, జాతీయ, లీగ్ క్రికెట్ మ్యాచ్ల వేళ తాతినేని శ్రీనివాసరావు సెల్ఫోన్లో వాట్సాప్ గ్రూప్లోని సభ్యులకు సమాచారం చేర వేసేవాడని ఎస్పీ తెలిపారు. పీచ్ ఈఎక్స్సీహెచ్ యాప్ సంబంధించి లాగిన్ ఐడీలు, పాస్వర్డ్లు పంపించి బెట్టింగ్లు చేసేవాడని వివరించారు. ఇదిగాక శ్రీనివాసరావు అప్పుడప్పుడు తెలిసిన వ్యక్తులతో పేకాట ఆడేవాడని చెప్పారు. ఇందులో సెల్ఫోన్, రిస్ట్ వాచీ, చెవిలో బ్లూ టూత్ ఉపయోగించి మిగతా ఆటగాళ్లను మోసగించేవాడన్నారు. ఆటగాళ్లకు ఫోన్పేల నగదు చెల్లించేవారని, వంద నుంచి పదివేల రూపాయల వరకు పందేలు ఉంటాయని తెలిపారు. అరెస్ట్ చేసిన ఎనిమిది మందిని న్యాయస్థానంలో హాజరుపరిచామని ఎస్పీ చెప్పారు. పీచ్ ఈఎక్స్సీహెచ్ యాప్ వెనుక ఎవరూ ఉన్నారనేది విచారిస్తున్నామని, గత పదేళ్లల్లో శ్రీనివాసరావుపై ఒక్క కేసు నమోదై ఉందని వెల్లడించారు. కేసుని ఛేదించిన డీఎస్పీలు అరవింద్ ( గుంటూరు పశ్చిమ), శ్రీనివాసులు (ఎస్బీ), సీఐలు అలహరి శ్రీనివాస్ (ఎస్బీ), గంగా వెంకటేశ్వర్లు (పట్టాభిపురం పీఎస్), ఎస్ఐ నాగేంద్ర, పోలీస్ సిబ్బందిని అభినందించారు. -
భట్టిప్రోలులో హిందూ సమ్మేళనం
భట్టిప్రోలు: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మండల కేంద్రమైన భట్టిప్రోలు రథం సెంటర్లో ఉప మండల హిందూ సమ్మేళనం సోమవారం సాయంత్రం నిర్వహించారు. తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గుంటూరు విభాగ్ ప్రచార కార్యవాహ్ గోలి రామారావు మాట్లాడారు. పారాయణలు, భజన సంకీర్తనలు, కోలాట ప్రదర్శనలు కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరిగాయి. కార్యక్రమంలో బాపట్ల జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యన్నారాయణ, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు, జెడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయ భాస్కరి, నిర్వాహకులు వేల్పూరి శ్రీనివాసరావు, బూర్లె అరుణ కుమారి, బండారు శ్రీనివాసరావు, తూనుగుంట్ల సాయిబాబా, పడమట వెంకటేశ్వరరావు, చింతల మురళీకృష్ణ పాల్గొన్నారు. బల్లికురవ: పెళ్లి పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లిన ఇంట్లో దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. సోమవారం యజమాని ఇంటకి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉండటంతో దొంగతనం జరిగినట్లు భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన వివరాల మేరకు.. మండలంలోని చెన్నుపల్లి గ్రామంలోని రామాలయం ఎదురుగా గుంటుపల్లి హరిబాబు ఇటీవలే ఇంటిని మరమ్మతులు చేసుకొని నివాసం ఉంటున్నాడు. కుమార్తె వివాహ పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇంటికి వచ్చి చూడగా బీరువాల్లో ఉండాల్సిన అర కిలో వెండి, నాలుగు సవర్ల బంగారం, రూ. 30 వేలు నగదు చోరీ జరిగినట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుగ్గిరాల: బీటెక్ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నావు ఎందుకంటూ తండ్రి మందలించగా మనస్తాపం చెంది కాలువలో పడి గల్లంతైన పఠాన్ గఫార్ (24) శవమై కనిపించాడు. వడ్డేశ్వరం గ్రామానికి చెందిన గఫార్ తండ్రి మందలించి కారణంగా శనివారం బకింగ్ హామ్ కెనాల్లో పడి గల్లంతయ్యాడు. తండ్రి నాగూర్ ఫిర్యాదు మేరకు తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం బకింగ్ హామ్ కాలువలో రెండు రోజులుగా వెతుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి తుమ్మపూడి సమీపంలో మృతదేహం కనిపించింది. గఫార్ కుటుంబ సభ్యులకు తెలియపరచగా వారు తమ కుమారుడేనని గుర్తించారు. అనంతరం పంచనామా నిమమిత్తం మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. -
బ్రేక్ ఫిట్నెస్ కోసం గుంటూరు వెళ్లటం సరికాదు
బాపట్ల: ఆటోలు బ్రేక్ ఫిట్నెస్ కోసం గుంటూరు వెళ్లే విధంగా చలానాలు రావటం సరికాదని బాపట్ల జిల్లా కార్మికశక్తి ఆటో యూనియన్ నాయకులు జి.పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. ఈమేరకు బాపట్ల పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టిన ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గత 25 సంవత్సరాలుగా బాపట్లలోనే లైనెన్స్లు, బ్రేక్ ఫిట్నెస్లు చేపడుతున్నారని వివరించారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో ఇప్పుడు ఫిట్నెస్లు బాపట్ల నుంచి గుంటూరు తరలించటం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్కన మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించటంతో ఆటోలు నడిపే కార్మికులు రోడ్డున పడ్డారని వివరించారు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అదనపు భారాన్ని ఆటోడ్రైవర్లపై మోపి ప్రభుత్వం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికై న చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, యోహోన్, ఏసుబాబు ఉన్నారు. -
ఉరకలెత్తిన ఉత్సాహం
సందడిగా వివా– వీవీఐటీయూ యువజనోత్సవం పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో జాతీయస్థాయి యువజనోత్సవం (వీవా–వీవీఐటీయూ 2025–26) వేడుకలు ఘనంగా ముగిశాయి. రెండు రోజుల యువజనోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంకేతిక, సాంస్కృతిక, క్రీడలు యువతను ఆకట్టుకున్నాయి. ● ముఖ్య అతిథిగా పాల్గొన్న విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య మాట్లాడుతూ యువజన ఉత్సవాల నిర్వహణ వెనుక గొప్ప ఉద్దేశం ఉంటుందని, నాయకత్వ లక్షణాలు, జీవన నైపుణ్యాల పెంపునకు దోహదపడతాయని తెలిపారు. ● వీవీఐటీ విశ్వవిద్యాలయం చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ రెండు రోజుల యువజనోత్సవంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారని, మంచి అనుభూతులతో సంతోషంగా గడిపారని తెలిపారు. ● వీవీఐటీయూ ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు విజయవంతంగా యువజనోత్సవాన్ని నిర్వహించారని, వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుదలకు ఈ కార్యక్రమం దోహదపడిందని తెలిపారు. ● ముఖ్య అతిథి విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, వీవీఐటీయూ చాన్స్లర్ వాసిరెడ్డి విద్యాసాగర్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ● ఈ వేడుకలో చాంపియన్ చిత్ర బృందం హీరో రోషన్, హీరోయిన్ అనస్వరా రాజన్ బృందం, వానర చిత్ర బృందం హీరో అవినాష్ తిరువీధుల, హీరోయిన్ సిమ్రాన్ చౌదరి సందడి చేశారు. కార్యక్రంలో వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ వై. మల్లికార్జునరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ కె.గిరిబాబు, ఆధ్యాపకులు పాల్గొన్నారు. -
కాకుమానులో గంజాయి స్వాధీనం
ప్రత్తిపాడు: ఆటోలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుడిని కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు సౌత్జోన్ డీఎస్పీ జి. భానోదయ సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం కాకుమాను ఎస్ఐ ఏక్నాథ్ స్థానిక అప్పాపురం రోడ్డు సమీపంలోని కరుణ రూరల్ గోడౌన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పెదనందిపాడు వైపు నుంచి బాపట్ల వైపు వెళుతున్న ఆటోని నిలిపి తనిఖీ చేస్తుండగా, ఆటోలో ఉన్న ఇద్దరిలో ఒక వ్యక్తి దూకి పొలాల్లోకి పారిపోయాడు. దీంతో ఆటోలో ఉన్న బాపట్ల మండలం చెరువుజమ్ముల పాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి దొరికింది. ఈ మేరకు మైనర్ బాలుడిపై కేసు నమోదు చేసి అతని వద్ద నుంచి మూడున్నర కేజీల గంజాయి, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. సీఐ జి. శ్రీనివాసరావు, ఎస్ఐ. ఏక్నాథ్లు బాలుడిని అదుపులోకి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. -
ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
గుంటూరు రూరల్: నల్లపాడు ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటర్ పాలిటెక్నిక్ కళాశాలల స్పోర్ట్స్ గేమ్స్ (ఏపీఎస్జీఎమ్)– 2025 మీట్ సోమవారం ప్రారంభమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే బి. రామాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. జీవితంలో పైకి ఎదగడానికి క్రీడలు ఒక గొప్ప వేదికగా ఉంటాయని చెప్పారు. ఆటలు ఆడేటప్పుడు కేవలం ప్రతిభ కాదు గెలవాలన్న పట్టుదల కూడా ముఖ్యమని సూచించారు. సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని, గెలుపు ఓటములు సహజమని తెలిపారు. ప్రిన్సిపాల్ పి.రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 19 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల నుంచి 382 మంది క్రీడాకారులు రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల పీడీలు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దివ్యాంగ యువతి అదృశ్యం
కారంచేడు: చిన్నతనం నుంచే మూగ, చెవుడుతో ఉన్న యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి చేరలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికి కనిపించకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారంచేడు ఎస్సై షేక్ ఖాదర్బాషా వివరాల మేరకు..కారంచేడు యజ్ఞశాలపేటకు చెందిన కట్టా రాజేశ్వరరావు సుభాషిణి దంపతులకు 22 సంవత్సరాల కుమార్తె హేమంతిదేవి ఉంది. ఈమె చిన్నప్పటి నుంచి చెవుడు, మూగ అవ్వడంతో ఇంటి వద్దనే చూసుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటుంన్నారు. ఈమె ప్రతి రోజూ ఇంటి వద్ద నుంచి పశువుల కొష్టంకు వెళ్లి పశువులకు దాణా పెట్టి వస్తుంటుంది. ఈక్రమంలోనే సోమవారం కూడా ఇంటి నుంచి పశువుల కొష్టంకు వెళ్లిన యువతి మధ్యాహ్నం వరకు ఇంటికి చేరలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు సమీపంలోని అందరినీ విచారణ చేశారు. గత్యంతరం లేక సాయంత్రం ఆమె విషయమై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వద్ద ఫోన్ కూడా ఉందని ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తల్లిదండ్రులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం బృందాలను ఏర్పాటు చేశామని, ఎస్పీ ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ సూచనలతో విచారణ వేగవంతం చేస్తున్నామన్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు 91211 02145 నంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు. -
అలరించిన సంప్రదాయ దినోత్సవం
బాపట్ల: వ్యవసాయ విద్యార్థులకు విద్యా నైపుణ్యం, కెరీర్ గైడెన్స్, సాహిత్య కార్యకలాపాలలో శిక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా బాపట్ల వ్యవసాయ కళాశాలలో సంప్రదాయ దినోత్సవం ఆదివారం నిర్వహించారు. భారతీయ సంప్రదాయాన్ని చాటుతూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, ఒడిశా, నాగాలాండ్, ఝార్ఖండ్లతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఆకర్షణీయమైన వస్త్రధారణలతో వేడుకకు మరింత వన్నె చేకూర్చారు. పలు సంప్రదాయ నాట్యాలు, జానపద నృత్యాలతో పాటు అలనాటి చలన చిత్రాల్లోని మధుర గీతాలకు కూడా నర్తించి అలరించారు. లలిత గీతాలాపన, వాద్య సంగీత ప్రదర్శన, స్కిట్లు వంటి పలు వినోదాత్మక ప్రదర్శనల ద్వారా ఆహూ తులను పరవశింపజేశారు. అంకురం, అవని, అనంతం నిర్దేశాలుగా క్లబ్ బాధ్యతలను నిర్వర్తిస్తుందని వ్యవసాయ కళాశాల ఇన్చార్జి అసోసియేట్ డీన్ ఎస్.ఆర్. కోటేశ్వరరావు తెలిపారు. విద్యార్థుల్లో వేడుకలు జాతీయ సమైక్యతా భావనను నెలకొల్పుతాయని, భారతీయ సంప్రదాయాన్ని గౌరవించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రస్తుత విద్యార్థులకు పూర్వ విద్యార్థులు జూమ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాలలో పలు రాష్ట్రాల విద్యార్థుల సందడి -
బాపట్ల
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సత్తెనపల్లి: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంలో అర్చకులు అలంకరించారు. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు నిలిచిపోయింది. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.7827 టీఎంసీలు.విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 568.80 అడుగులకు చేరింది. ఇది 253.5634 టీఎంసీలకు సమానం. అద్దంకిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరైన నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్రేపల్లె వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జగనన్నకు శుభాకాంక్షలు తెలుపుతున్న నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్, నాయకులు వేమూరులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, రచ్చబండ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు 7 -
మాదక ద్రవ్యాలతో సమాజానికి పెనుముప్పు
గుంటూరు ఎడ్యుకేషన్: మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సమాజానికి పెనుముప్పుగా పరిణమించాయని ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జేకేసీ కళాశాలలో నిర్వహించిన ‘‘రోటోఫెస్ట్–2025’’ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవికృష్ణ మాట్లాడుతూ యువత క్రమశిక్షణ, నైతిక విలువలు, సమాజ సేవ పట్ల నిబద్ధత కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రోటరీ అనేది మానవాళి ఆరోగ్యం, భవిష్యత్తు కోసం నిరంతరం సేవలు అందిస్తున్న అద్భుతమైన సంస్థ అని పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు 1972 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా అనేక మంది విద్యార్థులను డీ–అడిక్షన్ సెంటర్లకు పంపించి పునరావాసం కల్పిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో రోటరీక్లబ్ ప్రతినిధులు మామిడి సుబ్బారావు, నంబూరు కృష్ణమూర్తి, కనమర్లపూడి రవి కిరణ్, ఏవీ హరనాథ్ బాబు, గార్లపాటి రవి కిరణ్, ముప్పవరపు వెంకట సత్యనారాయణ, పట్టాభిపురం సీఐ జి.వెంకటేశ్వర్లు, ఈగల్ సీఐ విక్టర్, ఎస్సై సునీల్ బాబు, విద్యార్థులు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు. ఏపీ ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ -
10 కిలోల గంజాయి స్వాధీనం
చీరాల రూరల్: టాటా నగర్ ఎక్స్ప్రెస్ రైల్లో జరిపిన తనిఖీల్లో 10 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కేరళ రాష్ట్రానికి చెందిన నిందితుడిని అరెస్టు చేసినట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపారు. ఆదివారం రాత్రి జీఆర్పీ స్టేషన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్, ఒంగోలు ఆర్పీ సీఐ ఎస్కే మౌలా షరీఫ్ ఆదేశాల మేరకు ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, అక్రమ మద్యం సరఫరా వంటి వాటిని గుర్తించేందుకు ఆదివారం రైలు బండ్లలో సాధారణ తనిఖీల్లో భాగంగా కేరళ రాష్ట్రానికి వెళ్లే టాటానగర్ ఎక్స్ప్రెస్లో తనిఖీ చేపట్టారు. ఈపురుపాలెం రైల్వేస్టేషన్ సమీపంలో జనరల్ బోగీలో ఒకవ్యక్తి వద్ద అనుమానాస్పదంగా ఉన్న బ్లాకు కలర్ బ్యాగును పరిశీలించగా 10 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. నిందితుణ్ణి ప్రశ్నించగా తనది కేరళ రాష్ట్రం ఎర్నాకుళానికి చెందిన ఆశిన్ షిబుగా చెప్పాడన్నారు. గంజాయితో పాటు నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పట్టబడిన గంజాయి విలువ రూ. 50,000 ఉంటుందని ఎస్సై వెల్లడించారు. నిందితుడు విజయనగం జిల్లా పరిసర ప్రాంతాల్లో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి రైలు బండ్లలో అక్రమంగా తరలించి కేరళ రాష్ట్రంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన నిందితుడు ఆశిన్ షిబును అరెస్టు చేసిన రైల్వే పోలీసులు టాటా నగర్ ఎక్స్ప్రెస్లో ఘటన -
పురావస్తు మ్యూజియం కలేనా?
అద్దంకి: పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఆనవాళ్లను భద్రపరచి, భావి తరాలు చూసేందుకు ఉపయోగపడే పురావస్తు మ్యూజియం ఏర్పాటు కలగానే మిగిలింది. గతంలో పురావస్తు శాఖ మ్యూజియం ఏర్పాటు చేస్తామని మాటిచ్చి ప్రతిపాదనలు తయారు చేసి పంపినా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఏటికేడు పురాతన ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చరిత్ర పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అద్దంకి కోటకు అనవాళ్లు కనుమరగయ్యాయని చెబుతున్నారు. పురాతన కట్టడాలు.. అద్దంకి పట్టణం క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నుంచే ఉన్నట్లు ఇక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. తరువాత వివిధ రాజవంశాలు అద్దంకి రాజధానిగా చేసుకుని రాజ్య పాలన చేశాయి. ఇక్కడ బ్రిటిష్ కాలంనాటి నిర్మాణాలున్నాయి. పురాతన కట్టడాల విషయానికొస్తే చోళుల కాలం నాటి వేయి స్తంభాల దేవాలయం, 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన నాట్య గణపతి ఆలయం, 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించిన పాత శివాలయం(రామలింగే శ్వరాలయం) ఇక్కడే అగస్త్య మహాముని ప్రష్టించిన అగస్తేశ్వరాలయం, పోతురాజు గండిలో తొమ్మిది విగ్రహాలు, రెడ్డిరాజుల కాలం కాకానిపాలెంలోని కోదండరామస్వామి ఆలయం, నాంచారమ్మ ఆలయం(పోలేరమ్మ), రంగనాయకుల ఆలయం, 16వ శతాబ్దానికి చెందిన నరసింహ స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, 13వ శతాబ్దం నాటి గాడిద శాసనం, క్రీస్తు పూర్వ 848లోని పండరగని తొలి తెలుగు పద్య శాసం, 1902లో నిర్మించిన విక్టోరియా మహారాణి సత్రం, 1920లో నిర్మించిన ప్రభుత్వ వైద్యశాల, 1850లో నిర్మించిన పోలీస్స్టేషన్, 1930లో నిర్మించిన తాలూకా ఆఫీసు, క్రీస్తు పూర్వం మూడో శతాబ్దం నాటి సమాధులు, ధర్మవరం కొండపైని బౌద్ధం ఆనవాళ్లు, ధర్మవరం, నన్నూరుపాడు, పేరాయిపాలెం, మణికేశ్వరం, ధేనువకొండ, అద్దంకి కొండ, తదితర ప్రాంతాల్లో పురాత ఆనవాళ్లు కోకొల్లలుగా దొరికినా భద్రపరచే ప్రదేశం లేక ఇప్పటికే కనుమరుగయ్యాయి. అద్దంకి రెవెన్యూ డివిజన్గా మారుతున్న తరుణంలో అద్దంకి పరిసర ప్రజలతోపాటు, చరిత్రను చదువుకునే విద్యార్థుల కోసం పురావస్తు మ్యూజీయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురాతన ఆనావాళ్లు మెండుగా ఉన్న అద్దంకిలో ఒక పురావస్తు మ్యూజియం అవసరం ఎంతైనా ఉంది. భద్రపరచక ఇప్పటికే కొన్ని ఆనవాళ్లు కనుమరుగయ్యాయి. మ్యూజియం ఏర్పాటు చేయకుంటే చరిత్ర పేజీల్లో మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు, పురావస్తు అధికారులు ఆ దిశగా ఆలోచన చేసి మ్యూజియం ఏర్పాటు చేయాలి. – జ్యోతి చంద్రమౌళి, చరిత్ర పరిశోధకుడు -
ఉండవల్లిలో ఫ్లెక్సీలు చింపిన గుర్తు తెలియని వ్యక్తులు
తాడేపల్లి రూరల్: మండల పరిధిలోని అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీలను ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. పార్టీ ఉండవల్లి కమిటీ అధ్యక్షులు వీర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ వాళ్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా ఉండవల్లిలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ లేదని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడం దారుణమని ఖండించారు. తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఇటువంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదని, ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా ఈ విషయాలపై దృష్టి సారించి, ఫ్లెక్సీలు చించినవారు ఏ పార్టీ వారు అయినా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. శనివారం రాత్రి 12 గంటలకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రి 2 గంటలకు చింపివేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎవరి ఫ్లెక్సీలకు వారే బాధ్యులు: సీఐ వీరేంద్ర ఏ పార్టీ వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, అవి ఎవరు చించినా తమకు సంబంధం లేదని, పార్టీ వారే సంరక్షించుకోవాలని సీఐ వీరేంద్ర తెలిపారు. ఫ్లెక్సీలు తొలగిస్తే వెంటనే మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. పోలీసులకు వైఎస్సార్సీపీ నాయకుల ఫిర్యాదు -
పోలియో రహిత సమాజమే లక్ష్యం
బాపట్ల: పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని స్థానిక బాపట్ల పట్టణం రైల్వే పేట ప్రాథమిక పాఠశాలలో ఆదివారం కలెక్టర్ ప్రారంభించారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియోను బాపట్ల జిల్లా నుంచి తరిమి వేయాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,315 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1.45 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయడం లక్ష్యం అన్నారు. పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలకు కలెక్టర్, ఆయన సతీమణి భూమిక చంద్రలాలీ వచ్చి కుమారుడికి పోలియో చుక్కల మందు వేయించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డీఓ పి.గ్లోరియా, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్, తహసీల్దార్ షాలీమా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
పండుగలా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
బాపట్ల జిల్లాలో భారీగా సేవా కార్యక్రమాలుసాక్షి ప్రతినిధి, బాపట్ల: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా పండుగలా జరిగాయి. వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున వేడుకలు నిర్వహించారు. కేక్లు కట్ చేశారు. అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బెడ్లు, దుప్పట్లు అందజేశారు. బైక్ర్యాలీలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో వాడవాడలా వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన మంచిని, పథకాల అమలును ప్రజలు మరోమారు గుర్తు చేసుకున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి విరాళం
తాడేపల్లి రూరల్: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని వడ్డేశ్వరంలో ఉండే యువకుడు బకింగ్హామ్ కెనాల్లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతైన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లి ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేశ్వరానికి చెందిన నాగూర్, షంషుద్దీన్ల పెద్ద కుమారుడు గఫూర్ (25) బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఆరోగ్య సమస్యలతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గ్రామంలోనే ఫొటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. మానసిక పరిస్థితి సరిగా లేదు. శనివారం సాయంత్రం వడ్డేశ్వరం నుంచి బకింగ్హామ్ కెనాల్ దాటే బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాన్ని పెట్టి కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. తెల్లవారుజాము నుంచి ఉదయం 11 గంటల వరకు రద్దీ సాధారణంగా ఉండగా, మధ్యాహ్నం 12 గంటల నుంచి అనూహ్యంగా పెరిగింది. దీంతో ఘాట్రోడ్డుపైకి కార్లు, ఇతర వాహనాలను అనుమతించలేదు. కేవలం భక్తుల ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతించారు. ఆదివారం కావడంతో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, ఉదయం లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, శాంతి కల్యాణం, చండీహోమానికి రద్దీ కనిపించింది. మరో వైపున పెద్ద ఎత్తున భవానీలు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులను సమర్పించారు. ఘాట్రోడ్డు క్యూలో రద్దీ.. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్నారు. మహా నివేదన అనంతరం మహామండపం మీదగా వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉండగా, ఘాట్రోడ్డు మార్గంలో భక్తుల తాకిడి కనిపించింది. పల్స్పోలియోను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పోలియో చుక్కలు వేశారు. -
అపరిచిత లింక్లను క్లిక్ చేయొద్దు
బాపట్ల టౌన్: క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ వచ్చే అపరిచిత లింక్లను క్లిక్ చేయవద్దని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అపరిచిత లింక్లను క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు ఖాతాలను ఖాళీ చేస్తారని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు వినూత్న మార్గాలను ఎంచుకొని ప్రజలను మోసం చేస్తూ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారన్నారు. నూతన సంవత్సరాలను ఆసరాగా చేసుకొని క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు అపరిచిత లింక్లు, ఏపీకే ఫైల్లను ఫేస్బుక్, వాట్సాప్ ఇతర సోషల్ మీడియా వేదికలలో పోస్ట్ చేస్తున్నారన్నారు. వాటిని క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం అయిన పాన్, ఆధార్ కార్డ్ల నంబర్లు, వాటి ఫోటోలు, బ్యాంకు ఖాతా గురించిన సమాచారం తదితర వివరాలను అపరిచిత లింక్ల్లో పంచుకోవద్దని హెచ్చరించారు. ఫోన్ నంబర్ ఆధారంగా కూడా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఈమెయిల్ తదితర సోషల్ మీడియా ద్వారా క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ల పేరుతో అపరిచిత లింక్లను పంపడం. విదేశీ లాటరీ, క్యాష్బ్యాక్ గెలుచుకున్నారని పేర్కొంటూ ప్రాసెసింగ్ ఫీజులు లేదా వ్యక్తిగత వివరాలు అడగడం లాంటి చేస్తారని, వాటిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రయాణం, బహుమతులు, హోటళ్లు, పార్టీ పాస్లు, ఎలక్ట్రానిక్స్పై భారీ డిస్కౌంట్లు ఇస్తామని చెప్పే నకిలీ సందేశాలు, ఈ–మెయిల్లు, సోషల్ మీడియా ప్రకటనలు వస్తుంటాయని, వాటిపై అవగాహన కలిగి ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
నెహ్రూనగర్: ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆదివారం లాడ్జి సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో పౌర హక్కులు అడుగంటి పోతున్నాయని, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు నేడు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేలాదిమంది పోలీసు బలగాలని అడవుల్లో దింపి అక్కడ ఆదివాసుల జీవితాలను సర్వనాశనం చేస్తుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయటం వంటి చర్యలను నిలిపివేయాలన్నారు. జాయింట్ సెక్రెటరీ చిన్న మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం హిందూ మతోన్మాదాన్ని నెలకొల్పుతూ ఈ దేశ ప్రజల పైన మతదాడులు చేస్తుందన్నారు. జనవరి 10, 11 తేదీల్లో తిరుపతిలో జరిగే పౌర హక్కుల సంఘం మహాసభలకు మేధావులు, మైనా ర్టీలు, దళితులు, ఆదివాసీలు వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. వి ప్రభాకర్ ఎన్ నీలాంబరం, డి సుధాకర్ పాల్గొన్నారు. గెలుపును పంచడమే నిజమైన ఆట విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత గుంటూరు ఎడ్యుకేషన్ క్రీడలంటే పతకాలు కాదని, గెలుపును పంచడమే ఆటకు నిజమైన నిర్వచనమని విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత అన్నారు. వికాస్నగర్లోని వికాస్ క్రీడా మైదానంలో భాష్యం ఒలంపస్ పేరుతో మూడు రోజులపాటు జరిగిన వార్షిక స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న డీసీపీ సరిత మాట్లాడుతూ క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తాయన్నారు. మన అనే భావన క్రీడా స్ఫూర్తి ద్వారా పెంపొందించబడుతుందన్నారు. దేశానికి వన్నెతెచ్చిన ఎంతోమంది క్రీడాకారులు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భాష్యం యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. తొలుత డీసీపీ సరిత భాష్యం స్పోర్ట్స్ మీట్ జెండాలను ఆవిష్కరించి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. విద్యా ర్థులు నిర్వహించిన ఓపెన్ పరేడ్లో వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పలు క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డీసీపీ సరిత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈఓలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణంలో శానిటరీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న యువతి గుండెపోటుతో ఆదివారం మృతి చెందింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని 1వ వార్డు, పోలకంపాడు, పోలీస్స్టేషన్ ప్రాంతాల్లో మేడూరి ప్రవల్లిక(30) శానిటరీ సెక్రటరీగా పని చేస్తోంది. భర్త రాజకుమార్ కూడా ఇదే శాఖలో పనిచేస్తున్నారు. ప్రవల్లిక నిండు గర్భణి. గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రవల్లిక మృతివార్త తెలుసుకున్న మున్సిపల్ అధికారులు నివాళులర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ లక్ష్మీపురం: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను మరింత అంధకారంలోకి నెట్టివేసే విధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ దేశంలో కార్మిక వర్గం హక్కులను సాధించుకున్నది కమ్యూనిస్టు ఉద్యమం వల్లేనని స్పష్టం చేశారు. అనంతరం సీపీఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, సీపీఐ నగర కార్యదర్శి ఆకీటి అరుణ్కుమార్ మాట్లాడారు. -
తపాలా ఉద్యోగుల సమస్యలపై పోరాటంలో కీలకపాత్ర
తెనాలి: సంఘ గుర్తింపు రద్దయినప్పటికీ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో నిరంతర చర్చలు కొనసాగిస్తున్నామనీ, రాబోయే ఉద్యమాల్లో కీలకపాత్ర పోషిస్తుందని తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్గుప్తా స్పష్టం చేశారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ) గ్రూప్–సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలు ఆదివారం చెంచుపేటలోని రావి టవర్స్లో ప్రారంభించారు. గ్రూప్–సి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గణపతి అధ్యక్షత వహించారు. రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు, కాకతీయ కో–ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ డీఎల్ కాంతారావు మాట్లాడుతూ నాటి తరం కార్మికుల పోరాట స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని సూచించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించాలని, ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దుకు సమష్టి పోరాటాలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు రద్దు చేసినా ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రూప్ ‘సి’ సంఘం మరింత బలపడిందని పేర్కొన్నారు. ఎన్ఎఫ్పీఈ మాజీ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎన్.పరాశర్ మాట్లాడుతూ అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం (ఏఐపీఈయూ) గ్రూప్ ‘సి’ సంఘ గుర్తింపును కేంద్రప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దు చేసిందన్నారు. పి–4 సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె. మురళి, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.విద్యాసాగర్, జీడీఎస్ సంఘ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి, పీ3, పీ4, జీడీఎస్ సంఘాల జాతీయ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్–సీ ప్రధాన కార్యదర్శి నరేష్గుప్తా -
లోపభూయిష్టంగా విద్యా ప్రణాళిక
బాపట్ల టౌన్: విద్యా శాఖ పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక లోపభూయిష్టంగా ఉందని ఎస్టీయూ బాపట్ల జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బాపట్ల పట్టణంలోని సంఘ కార్యాలయంలో సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళిక ఆదివారాలు, పండుగ సెలవు రోజుల్లో కూడా ఉండడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు విశ్రాంతి లేకుండా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యను అభ్యసించినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతుంటే అందుకు భిన్నంగా అవిశ్రాంతంగా చదవడం, మార్కులే ప్రతిభకు కొలమానంగా రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖాధికారులు చేపడుతున్న చర్యలు ఆక్షేపణీయమన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ ఇప్పటికే ఉపాధ్యాయులు బోధనేతర కార్యక్రమాలతో విలువైన బోధన సమయాన్ని కోల్పోతున్నామని అన్నారు. సమావేశంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి పీవీ నాగరాజు, జిల్లా ఉపాధ్యాయ వాణి కన్వీనర్ నూరుబాషా సుభాని, రాష్ట్ర కౌన్సిలర్స్ గుగ్గిలం ఉదయ శంకర్, డీవీ సుబ్బారావు, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు వంకా ప్రభాకరరావు, తోట శివయ్య, శివాంజనేయులు, ఏవీ నారాయణ, బుజ్జిబాబు, ఓ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు బడుగు శ్రీనివాస్ -
రాష్ట్ర స్థాయి ఖోఖో చాంపియన్ ప్రకాశం
జె.పంగులూరు: ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఎంఎస్ఆర్, బీఎన్ఎం జూనియర్ కళాశాలలో గత మూడు రోజుల నుంచి పంగులూరులో జరుగుతున్న 44వ రాష్ట్ర స్థాయి బాలబాలికల పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ప్రకాశం బాలుర జట్టు ప్రథమ స్థానం సాధించింది. ద్వితీయ స్థానం కృష్ణ, మూడో స్థానం వైజాగ్, విశాఖ పట్నం సంయుక్తంగా సాధించాయి. బాలికల విభాగంలో చిత్తూరు మొదటి స్థానం సాధించింది. రెండో స్థానం శ్రీకాకుళం సాధించగా, మూడో స్థానం విజయనగరం, ప్రకాశం జట్లు సంయుక్తంగా సాధించాయి. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గరటయ్య, కె.హనుమంతరావు, యూనియన్న్ బ్యాంక్ అసోసియేషన్ సెక్రటరీ రాజేష్ ఖన్నా, కేకేఎఫ్ఐ సెక్రటరీ సీతారామిరెడ్డి, రఘుబాబు, గ్రామ పెద్దలు వీరనారాయణ, రామారావు, రావూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మ్యాచ్ల వివరాలు మొదట జరిగిన చిత్తూరు, శ్రీకాకుళం బాలికల ఫైనల్ మ్యాచ్లో మొదటి టాస్ గెలిచిన చిత్తూరు జట్టు డిఫెన్స్ ఎంచుకొని నిర్ణీత 9 నిమిషాలకు 26 పాయింట్లు సాధించింది. అనంతరం డిఫెన్స్ చేసిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 9 నిమిషాల్లో 14 పాయింట్లు సాధించింది. 12 పాయింట్ల తేడాతో శ్రీకాకుళంపై చిత్తూరు విజయం సాధించింది. అనంతరం జరిగిన బాలుర మ్యాచ్లు మొదట టాస్ గెలిచిన ప్రకాశం జట్టు రన్నింగ్ ఎంచుకుంది. డిఫెన్స్ చేసిన కృష్ణా నిర్ణీత 9 నిమిషాలకు 10 పాయింట్లు సాధించింది. అనంతరం డిఫెన్స్ చేసిన ప్రకాశం నిర్ణీత 9 నిమిషాలకు 24 పాయింట్లు సాధించి మ్యాచ్ వన్ సైడ్ చేసింది. మంచి ప్రతిభ కనబరిచిన బాజీ ఆల్ రౌండర్ ట్రోఫీని అందుకున్నాడు. బాలికల విభాగంలో చిత్తూరుకు ప్రథమ స్థానం -
వృద్ధురాలిని ఇంటికి చేర్చిన శ్రద్ధ ఫౌండేషన్
రేపల్లె: మతిస్థిమితం లేక తప్పిపోయిన వృద్ధురాలు విశాఖపట్టణానికి చేరడంతో అక్కడి శ్రద్ధ రిహాబిటేషన్ ఫౌండేషన్ సభ్యులు ఆశ్రయం కల్పించి, నాలుగు నెలల తరువాత కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. రేపల్లె పట్టణం 4వ వార్డుకు చెందిన మేత్ర సూరిబాబు భార్య శివ చెంచులక్ష్మి మతిస్థిమితం లేక ఆగస్టు 1న ఇంటి నుంచి వెళ్లిపోయి విశాఖపట్టణం చేరారు. వీధుల్లో తిరుగుతున్న ఆమెను అక్కడి శ్రద్ధ రిహాబిటేషన్ ఫౌండేషన్ సభ్యులు చేరదీసి ఆశ్రమంలో ఆశ్రయం కల్పించటంతో పాటు చికిత్సలు అందించారు. నాలుగు నెలలు గడిచాక మతిస్థిమితం రావటంతో శివ చెంచులక్ష్మి తనది రేపల్లె పట్టణంలోని 4వ వార్డు అని ప్రతినిధులకు తెలియజేశారు. ఫౌండేషన్లో విధులు నిర్వహించే పొన్నూరుకు చెందిన డాక్టర్ శ్రావణి, పొన్నూరుకు చెందిన రోటరీ క్లబ్ ప్రతినిధులకు విషయాన్ని తెలియజేశారు. క్లబ్ ప్రతినిధులు రేపల్లె ప్రాంతంలోని ఉపాధ్యాయుడు ఉల్లంఘుంట వెంకటేశ్వరరావును సంప్రదించి శివ చెంచులక్ష్మి కుటుంబ సభ్యుల ఆచూకీని కనుగొన్నారు. ఆదివారం శ్రద్ధ రిహాబిటేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆమెను రేపల్లెకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనిపై కుటుంబ సభ్యులు ఆశ్రయం కల్పించిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు
పెదకాకాని: అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం ఆదివారం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న జీవీఆర్ ప్రైమ్ హోటల్లో ఆదివారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడుగురు మహిళలు, 9 మంది పురుషులు (విటులు), ఒక మేనేజర్, ఒక ఆర్గనైజర్ మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారందరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు పెదకాకాని పోలీసుస్టేషన్కు తరలించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి, పేకాట, వ్యభిచారం, కోడిపందాలు, సింగిల్ నెంబర్ లాటరీలు వంటి చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంహించేది లేదన్నారు. అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారు, నిర్వహించే వారు, వాటికి సహకరించే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు ఎడ్యుకేషన్: శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మార్చి 1న నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల చిత్రకారులు జనవరి 20లోపు పేర్లు నమోదు చేసుకోవాలని క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ డాక్టర్ కేపీ బాబు ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, యువతలో సృజనాత్మతకను కళలను, పెంపొందించడంతో పాటు సామాజిక సమస్యలపై అవగాహన కల్పించేందుకు కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. చిత్రలేఖన పోటీలతో పాటు ప్రదర్శనలో పాల్గొనేందుకు వివరాల కోసం 98853 77653 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
మోడల్ స్కూల్ టీచర్ల ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ మోడల్ హైస్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సిహెచ్ జోసఫ్ సుధీర్బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కంకరగుంటలోని ఎస్టీయూ భవన్లో ఆదివారం ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూశాఖ రాష్ట్ర అధ్యక్షుడు పి.మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. సుధీర్బాబు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సును పెంచడంతో పాటు కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉపాధ్యాయుల మ్యాచింగ్ గ్రాంట్ సమస్యను పరిష్కరించడంతో పాటు టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపాల్స్ ఉద్యోగోన్నతులను చేపట్టాలన్నారు. ఫిట్మెంట్ అమలుతోపాటు, పే ప్రొటెక్షన్, సర్వీస్ రూల్స్, సెలవు రోజుల్లో స్టడీ అవర్స్ తగ్గింపు, తెలుగు, హిందీ భాషా పండితుల అప్గ్రేడేషన్కు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ ముందు ఉంటుందని అన్నారు, ఏపీ మోడల్ స్కూల్స్ రాష్ట్రోపాధ్యాయ సంఘ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ టెన్త్ స్టడీ అవర్స్ విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించడంతో పాటు, స్లిప్ టెస్టులను నిర్వహించి, తక్షణ మూల్యాంకనం, మార్కులు ఆన్లైనంలో అప్లోడ్కు తగిన పమయం కేటాయించాలని డిమాండ్ చేశారు. వెబ్ ఎక్స్ సమావేశాలను తగ్గించాలని కోరారు కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఏపీ మోడల్ స్కూల్స్ ఎస్టీయూ అధ్యక్షుడు పి.సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శౌరిరాజు, రాష్ట్ర ఆసోసియేట్ అధ్యక్షుడు ఎం.ప్రభుదాసు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లెపు శ్రీనివాసరావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ మేరీ వేలాంగిణి, సీహెచ్ ఝాన్సీవాణి, పద్మజ, విజయలక్ష్మి, పద్మావతి, మేరీ సూజన్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల స్వీకరణ గుంటూరు ఎడ్యుకేషన్: కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నట్లు సమితి అధ్యక్షుడు మల్లెల హరేంద్రనాథ్ చౌదరి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టెన్త్లో 85 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినులు గుంటూరు కుందులరోడ్డులోని కమ్మజన సేవా సమితి కార్యాలయంలో వ్యక్తిగతంగా, సంస్థ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాలు పొంది, పూర్తి చేసి ఈనెల 30లోపు అందజేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల చెందిన విద్యార్థినులకు 80 శాతం మార్కులు వచ్చినా అర్హులేనని, తల్లిదండ్రులు లేని విద్యార్థినులకు 50 మార్కులతో ఉత్తీర్ణులైనా దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. విద్యార్థినుల ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఉపకార వేతనాలకు ఎంఇక చేస్తామని, ఎంపికై నవారికి రూ.ఏడువేలు చొప్పున ఉపకార వేతనం అందజేస్తామని హరేంద్రనాఽథ్చౌదరి తెలిపారు. -
ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో న్యుమేర్ సత్తా
850 డాలర్లు ప్రైజ్మనీ అందజేసిన నిర్వాహకులు చీరాల రూరల్: బంగ్లాదేశ్లో జరిగిన ఓపెన్ ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో చీరాలకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు షేక్ న్యుమేర్ అత్యుత్తమ ప్రదర్శనతో ద్వితీయ స్థానం సాఽధించాడు. పోటీల నిర్వాహకులు చేతులు మీదుగా 850 డాలర్లు ప్రైజ్మనీ అందుకున్నాడు. ఈనెల 16వ తేదీ నుంచి 20 వరకు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓపెన్ ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు షేక్ హుమాయూన్ కబీర్ కుమారుడు షేక్ న్యుమేర్ మెన్స్ సింగిల్స్ విభాగంలో పాల్గొని, కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ప్రత్యర్థులను పదునైన రాకెట్లతో చిత్తు చేసి ద్వితీయ స్థానం సాధించాడు. నిర్వాహకుల చేతులు మీదుగా ప్రైజ్మనీతో పాటు మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాడు. న్యుమేర్ను పలువురు సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు అభినందనలు తెలియజేశారు. న్యుమేర్ గతంలో కూడా అనేక రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాడు. జె.పంగులూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లా బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్గా వైఎస్సార్ సీపీ నాయకులు స్వయంపు హనుమంతురావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఆయనకు ఒంగోలు కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. స్వయంపు హనుమంతురావు వైఎస్సార్ సీపీ నాయకులుగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ సుపరిచితులే. కొంతకాలం పంగులూరు ఇన్చార్జ్గా ప నిచేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ఆధిష్టానం బీఎస్ఎన్ఎల్ అధికారులకు పేరును సిఫార్సు చేసింది. కార్యక్రమంలో గుంటూరు పీజీ ఎంటీడీ సప్పరపు శ్రీధర్, గుంటూరు డీజీఎం సీవీ గిరిబాబు, ఒంగోలు డీఈ చంద్రశేఖర్, ఒంగోలు ఎస్డీ మురళీ కృష్ణ పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్లో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగిన 28వ ప్రాంతీయస్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా రెండు రోజులపాటు నిర్వహించిన క్రీడలు, ఆటల పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకుంది. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి, అధ్యాపకులు కలసి విద్యార్థినులను అభినందించారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకుల ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న, చేసుకోని విద్యార్థులకు చివరి విడత స్పాట్ కౌన్సెలింగ్ను నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీ రమణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో 2025–26 విద్యాసంవత్సరానికి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు ఈనెల 22వ తేదీ, 24వ తేదీలలో స్పాట్ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. సత్తెనపల్లి: పట్టణ పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన మైనర్ విద్యార్థిని గుంటూరుకు చెందిన ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ యువకుడికి గుంటూరుకు చెందిన మరో యువకుడు ట్విట్టర్లో పరిచయం కావడంతో ఇరువురు కలిసి విజయవాడకు చెందిన మైనర్ విద్యార్థిని కారులో సత్తెనపల్లికి తీసుకువచ్చారు. గుంటూరుకు చెందిన ఇద్దరు యువకులకు సత్తెనపల్లికి చెందిన ఓ యువకుడు సహకరించడంతో ముగ్గురు కలిసి ఆమెను ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్ గదిలో ఉంచారు. విద్యార్థిని తండ్రి కుమార్తె అదృశ్యమైందని విజయవాడ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ పోలీసులు మైనర్ విద్యార్థిని సెల్ఫోన్ సంకేతాల ఆధారంగా సత్తెనపల్లిలో ఉన్నట్లు లోకేషన్ చూపించడంతో వారు ఇక్కడి పోలీసులను సంప్రదించినట్లు సమాచారం. -
క్రీడల్లో అఖిల్ జిగేల్
అద్దంకి: కష్టే ఫలి అనే నానుడిని నిజం చేశాడు ఓ యువకుడు. సంతమాగులూరు మండలంలోని వెల్లలచెరువు గ్రామానికి చెందిన గంటెనపాటి సువార్త, కరుణాకర్ కుమారుడు అఖిల్ ఇస్రాయేల్. చదువుతో పాటు, పలు క్రీడల్లో ప్రావీణ్యం సంపాందించి గిన్నిస్తో పాటు లిమ్కా బుక్ ఆప్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. 15 సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు అందుకుని ప్రశంసలు పొందాడు. బ్రూస్లీ ఆదర్శం చిన్నతనం నుంచే అఖిల్ బ్రూస్లీ సినిమాలు చూసి, అతని లాగా తాను కూడా చేయాలని అనుకునే వాడు. క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలనే తపన ఉండేది. పేద కుటుంబం కావడం, ప్రోత్సహించేవారే లేకపోవడంతో ఆశయ సాధనలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయినా పట్టు వదల్లేదు. బీఎస్సీ కంప్యూటర్స్ చేశాడు. చదవుకు పట్టణం వెళ్లిన సమయంలో అక్కడ వివిధ రకాల క్రీడల్లో ప్రావీణ్యం పొందాడు. 2011 నుంచి మూడు సంవత్సరాల పాటు గుంటూరులో మస్తాన్ అనే గురువు వద్ద కుంగ్ఫూ నేర్చున్నాడు. 2014 నుంచి మరో మూడు సంవత్సరాలు హైదరాబాదులోని సుమన్ షోటోకాన్ అకాడమీలో కిక్ బాక్సింగ్, కరాటేలో శిక్షణ పొందాడు. తరువాత మార్షల్ ఆర్ట్ చేసి, బ్లాక్ బెల్ట్లు వన్ డౌన్, టూ డౌన్ పొందాడు. జైపూల్లో ఐ మాస్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 16 దేశాలకు చెందిన వారు పాల్గొన్న ఈవెంట్లో రెండు సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. బీపీఈడీ, తరువాత ఎంపీఈడీ చేశాడు. వరల్డ్ రికార్డుల్లో స్థానం అఖిల్ గత నెలలో తమిళనాడులో ఈవెంట్లో పాల్గొన్నాడు. 15 నిమిషాలు ఆపకుండా పంచ్లు, కిక్లు ఇచ్చి గిన్నిస్తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు సాఽధించాడు. 30 నిమిషాలు అపకుండా ఇచ్చిన ప్రదర్శనల్లో నోబెల్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. స్టిక్ రోటేషన్ (కర్రసామును పోలిన) ఈవెంట్లో 12 నిమిషాలు కర్రను ఆపకుండా తప్పి మరో రికార్డు సాధించాడు. టాంగ్టా క్రీడలో సిల్వర్ మెడల్ పొందాడు. గట్కా, టాంగ్టా క్రీడా ఏపీ కోచ్గా ఉన్నాడు. సినీ యాక్టర్ సుమన్, స్టంట్మాస్టర్ల చేతుల మీదుగా ఎనిమిది సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు, రామ్ లక్ష్మణ్ల నుంచి మూడు సార్లు, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేతుల మీదుగా ఒక సారి బెస్ట్ మాస్టర్ అవార్డు పొందాడు. కిషన్ రెడ్డి, హీరో ప్రశాంత్, చలపతిరావు, శ్రీశాంత్లతో కలుపకుని మొత్తం 15 సార్లు బెస్ట్ మాస్టర్ అవార్డు పొందాడు. వేలాది మందికి తాను నేర్చుకున్న విద్యలను ఉచితంగా నేర్పుతున్నందుకు ఏలూరులో బోధి ధర్మ అవార్డు పొందాడు. వేలాది మందికి ఉచిత శిక్షణ నేర్చుకున్న విద్యలను శిష్యులకు నేర్పడంతో పాటు, శిష్యులతో కలిసి అద్దంకి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా కరాటేలో శిక్షణ ఇస్తున్నాడు. ఇప్పటి వరకూ లక్ష మందికి ఉచిత ఉచిత శిక్షణ ఇచ్చాడు. భవిష్యత్తులో స్పోర్ట్ కోటాల్లో పోలీసు డిపార్ట్మెంటులో మంచి ఉద్యోగం సాధించాలని ఆశయంగా పెట్టుకున్నానని అఖిల్ చెప్పాడు. -
నిషేధిత జాబితా నుంచి పట్టా భూములు తొలగించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ బాపట్ల: నిషేధిత భూముల జాబితా నుంచి బాపట్ల జిల్లాలోని పట్టా భూములను అత్యధికంగా తొలగించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రశంసలు అందుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. నిషేధిత భూముల జాబితా, చుక్కల భూముల జాబితా నుంచి భూములను తొలగించడంపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. అధికారుల సమష్టి కృషితోనే బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, సీఎం నుంచి అందుకున్న ప్రశంసలు రెవెన్యూ అధికారులకే చెందుతాయని కలెక్టర్ చెప్పారు. నిషేధిత భూముల జాబితా నుంచి పట్టా భూములను తొలగించాలని ఇప్పటి వరకు జిల్లాలో 1,527 అర్జీలు నమోద య్యాయన్నారు. సెప్టెంబర్ నెల నుంచి 597 అర్జీలు పరిష్కారమయ్యాయన్నారు. మిగిలిన 930 అర్జీలు పెండింగ్లో ఉండగా శనివారం 42 అర్జీలపై రెవెన్యూ దస్త్రాల పరిశీలన, విచారణ చేపట్టారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు విస్తృత సేవలు బాపట్ల: అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మంచి సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి కమిటీ సమావేశం శనివారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు బాగుండాలని కలెక్టర్ చెప్పారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా కృషి చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పనితీరు ఆధారంగా వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా మహిళా సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీవోలు గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, సీడీపీఓలు పాల్గొన్నారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తే చర్యలు చీరాల టౌన్: పంటల సాగుకు ముఖ్యమైన యూరియా జిల్లాలో అవసరం మేరకు అందుబాటులో ఉందని, యూరియాను బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ అన్నారు. శనివారం చీరాల పట్టణంలోని అన్నపూర్ణ ఫర్టిలైజర్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే యూరియా విక్రయాలు చేపట్టాలని అధిక ధరలకు అమ్మకాలు చేస్తే డీలర్ షిప్ రద్దు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని రైతులకు కావాల్సిన యూరియా రైతు సేవా కేంద్రాల్లో అందిస్తుందన్నారు. ప్రతి రైతు యూరియాను కొనుగోలు చేసి రశీదులు పొందాలన్నారు. యూరియాను అధిక ధరలకు అమ్మకాలు చేస్తే కలెక్టరేట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నెంబర్ 77028 06804 ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ తూమాటి చంద్రశేఖర నాయుడు, ఇన్చార్జి వ్యవసాయాధికారి అన్నపూర్ణమ్మ ఉన్నారు. -
ఉత్కంఠభరితంగా ఖోఖో పోటీలు
జె.పంగులూరు: స్థానిక మాంగుట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల క్రీడా ప్రాగణంలో, ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరుగుతున్నాయి. శనివారం మెదటి పూల్లో బాలురకు 12, బాలికలకు 12 మ్యాచ్ జరిగాయి. మొత్తం 48 టీంలు పాల్గొన్నాయి. బాలుర టీంలో క్వార్టర్ ఫైనల్కు ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విశాఖ, విజయనగరం, చిత్తూరు, ఈస్టు గోదావరి, కృష్ణ జిల్లా జట్లు చేరాయి. బాలికల విభాగంలో క్వార్టర్ ఫైనల్కు అనంతపురం, విజయనగరం, కర్నూలు, చిత్తురు, ప్రకాశం, తూర్పు గోదావరి, విశాఖ, శ్రీకాకుళం జట్లు చేరాయి. చివరి రోజు ఆదివారం క్వార్టర్ ఫైనల్, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యచ్లు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
బెల్ట్ షాపులతో కుటుంబాలు సర్వనాశనం
జె.పంగులూరు: గ్రామంలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా మద్యాన్ని పారిస్తున్నాయని, దీని వల్ల అనేక కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయని, వెంటనే కట్టడి చేయాలని కోటపాడు దళితులు కోరారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్ సింగారావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నాలుగు బెల్ట్ షాపులు నడుస్తున్నాయని, వీటిల్లో మద్యం కొనుగోలు చేసి పలువురు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. బెల్ట్ షాపులపై ఈ నెల 8న మహిళలు దాడి చేసి మద్యం సీసాలను తగులబెట్టారని చెప్పారు. ఎకై ్సజ్ అధికారులు తనిఖీ చేసి మద్యం సీసాలు ఎక్కడా లేవని తెలిపారన్నారు. మరుసటి రోజు నుంచే మళ్లీ నాలుగు బెబెల్టు షాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని వివరించారు. వీటి నిర్వహణలో అధికారులు, నాయకులు పాత్ర కూడా ఉండటంతో ఽధైర్యంగా నడుపుతున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. తక్షణమే బెల్టు షాపులను కట్టడి చేయకపోతే పేదలు సర్వనాశం అయిపోతారని, అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోటపాడు ఎస్సీ కాలనీ వాసులు పాల్గొన్నారు. -
క్రమశిక్షణకు ప్రతీక క్రీడలు
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడలు కేవలం పతకాలు, ట్రోఫీల కోసం మాత్రమే కాదని, అవి విద్యార్థుల్లో క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే తత్వం, ఓర్పు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని గుంటూరు జిల్లా అగ్నిమాపక విపత్తు స్పందన అగ్నిమాపకశాఖాధికారి ఎం.శ్రీనివాసరెడ్డి అన్నారు. వికాస్నగర్లోని వికాస్ గ్రౌండ్లో భాష్యం ఒలంపస్ పేరుతో నిర్వహిస్తున్న జోనల్స్థాయి వార్షిక స్పోర్ట్స్ మీట్ శనివారం రెండు రోజు కొనసాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో క్రీడలు నేర్పిస్తాయని తెలిపారు. గెలుపోటములు సహజమని, పాల్గొనడమే ముఖ్యమని చెప్పారు. ప్రతి ప్రయత్నం మిమ్మల్ని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. మరో అతిథి డాక్టర్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తరగతి గదులు మేధస్సును పెంచితే, ఆట స్థలాలు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భాష్యం సాంబశివపేట, ఆర్టీసీ కాలనీ, ఎస్వీఎన్ కాలనీ, పట్టాభిపురం, నగరాలు క్యాంపస్లకు చెందిన ప్రైమరీ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈవోలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భాష్యం స్పోర్ట్స్ మీట్లో వక్తలు -
కౌన్సిల్ సమావేశం రసాభాస
చీరాల: చీరాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం రసాభాసాగా సాగింది. ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని ప్రకటించినా అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే కౌన్సిల్ హాలులో 13 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సరైన కోరం లేకుండా సమావేశం ప్రారంభించడంపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అభ్యంతరాలు తెలిపారు. దీంతో వైఎస్సార్ సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వాడీవేడి వాదనలు మొదలయ్యాయి. ఇలా చేయడం సరికాదంటూ మాట్లాడగా టీడీపీ కౌన్సిలర్లు కూడా వాదనలు వినిపించారు. కోరం లేకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. తమకేమి సంబంధం లేదని, మున్సిపల్ చైర్మన్ను అడగాలని ఆయన చెప్పారు. చీరాల మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులు కలిపి మొత్తం 35 మంది ఉండాలి. అయితే కౌన్సిల్లో 13 మంది ఉన్నా సమావేశం ఎలా నిర్వహిస్తారని కమిషనర్ను ప్రశ్నించారు. గతంలోనూ కూడా 18 మంది కౌన్సిలర్లు ఉన్నప్పుడే సమావేశం నిర్వహించామని ఆయన తెలిపారు. ఆయన దాటవేత ధోరణితో మాట్లాడడంతో చైర్మన్ను అడిగారు. తమకు సంఖ్యా బలం ఉందంటూ ఏకపక్షంగా టీడీపీ కౌన్సిలర్లు సమావేశం నిర్వహించుకుని ఆల్ పాస్ చేయించుకోవాలనే నిర్ణయంతోనే ఉన్నారంటూ ఆరోపణలు చేశారు. సభను అర్థవంతంగా నిర్వహించడం లేదంటూ బయటకు వెళ్లిపోయారు. అనంతరం సమావేశం ప్రారంభించిన తర్వాత కొద్ది సమయానికి 17మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. అజెండాలోని 128 అంశాల్లో పలు అభివృద్ధి పనులను, ఇతర అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. చైర్మన్, చైర్మన్ కుర్చీని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ బత్తుల అనిల్ అగౌరవపరిచారంటూ, ఆయన్ను సస్పెండ్ చేయాలని టీడీపీ కౌన్సిలర్ సత్యానందం ప్రతిపాదించారు. కౌన్సిలర్లు అందరి సూచనలతో ఆయన్ను నెల రోజుల పాటు చైర్మన్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డీఈ రంగనాఽథ్, టీపీఓ శ్రీనివాసులు, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
ప్రయాణమే.. పెను సవాలు
బాపట్లశనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అటుగా వెళ్లాలంటేనే హడల్ ఆదమరిస్తే అంతే సంగతులు జాగ్రత్త పడాల్సిందే.. వేమూరు నియోజకవర్గానికి రెండో స్థానం వంతెనల నిర్వహణపై అధికారుల శీతకన్ను సైడ్వాల్స్ విరిగి ఏళ్లు గడిచినా అదే నిర్లక్ష్యం ప్రమాదకరంగా మారిన కాలువల పరిసర రహదారులుఅచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 41.8813 టీఎంసీలు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. బ్రిటీష్ కాలంలో నిర్మించిన వంతెనలు నేటికీ దర్శనం ఇస్తూనే ఉన్నాయి. పూర్తిగా శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆయా మార్గాలలో ప్రయాణం అంటేనే ప్రజలకు పెను సవాలుగా మారింది. కొన్ని చోట్ల ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. -
ఉపాధి హామీ చట్టం రద్దుతో కష్టాలు
అద్దంకి: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దుర్మార్గమని సీపీఎం పట్టణ కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా అద్దంకిలో నిరసనగా శుక్రవారం ిసీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి జీ రామ్ జీ పథకాన్ని తీసుకురావడం అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు పని హక్కుగా ఉన్న ఉపాధి చట్టాన్ని లేకుండా చేయడమేనన్నారు. దీని ద్వారా గ్రామాల్లో కొద్దిమందిగా ఉన్న భూస్వాములకు అనుకూలంగా చౌకగా కూలీలు దొరికేలా చేస్తున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్కే కరీం, కోమరగిరి ప్రమీల, హనుమంతరావు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తలను తయారు చేయాలి
బాపట్ల: ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. పరిశ్రమలను ప్రోత్సహించడానికి వేగంగా అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ పోర్టల్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో రెండు భారీ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. గాజు ఉత్పత్తి పరిశ్రమ, సౌర విద్యుత్ పలకల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం వై.రామకృష్ణ, ఎల్డీఎం శివకృష్ణ, జిల్లా స్థాయి కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఆ ఖాతాల్లోని నగదు తీసుకోవాలి మనుగడలో లేని బ్యాంక్ ఖాతాల నుంచి నగదును తిరిగి తీసుకోవడానికి ఆర్.బి.ఐ. అనుమతులు ఇచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. మీ డబ్బు–మీ హక్కు పేరుతో యూనియన్ బ్యాంక్ రూపొందించిన గోడ పత్రాలను శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఎల్డీఎం శివకృష్ణ, పరిశ్రమల శాఖ మేనేజర్ రామకృష్ణ, డీఎల్డీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించిన జిల్లాల్లో రెండో స్థానంలో నిలిచినందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్కు అవార్డు లభించింది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం ఉదయం లోక్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందించారు. సైనిక కుటుంబాలను ఆదుకునేందుకు ఈ మొత్తం సేకరించారు. -
ప్రేమమూర్తిగా భువిలోకి వచ్చిన ఏసుక్రీస్తు
బాపట్ల: ప్రేమమూర్తిగా భువిలోకి వచ్చిన ఏసుక్రీస్తు క్షమాగుణాలు, సూక్తులు నేటి సమాజానికి మార్గదర్శకం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ తెలిపారు. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా శుక్రవారం స్థానిక పట్టణంలోని షాదీఖానా భవన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు, తేనీటి విందు నిర్వహించారు. కలెక్టర్ క్రిస్మస్ కేకును కట్ చేసి క్రైస్తవ పెద్దలు, పాస్టర్లకు పంచిపెట్టారు. అనంతరం కొవ్వొత్తులతో క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించారు. ఏసుక్రీస్తు ప్రభువు అంటేనే ప్రేమ, దయ, క్షమ గుణాలకు ప్రతిరూపమని కలెక్టర్ చెప్పారు. ఆయన పుట్టినరోజును పండుగగా నిర్వహించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఆయన్ను గుర్తు చేసుకోవడమే ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ప్రపంచ దేశాలన్నీ క్రిస్మస్ పండుగను గొప్ప వేడుకగా జరుపుకుంటారని, జిల్లా ప్రజలు కూడా ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా ప్రజలంతా శాంతి, సమాధానాలతో కలిసిమెలిసి ఆనందంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాష్ట్రంలో క్రిస్టియన్ మిషనరీ పాఠశాల మా ఊరికి దగ్గరలోనే ఉండేదని, అక్కడ చదివే విద్యార్థులు అన్ని రంగాల్లో నంబర్ వన్గా నిలిచేవారని గుర్తు చేసుకున్నారు. ఏసుక్రీస్తు సూక్తులు వారిని ఎంతగానో ప్రభావితం చేశాయని, సమాజంలో పరిపూర్ణ వ్యక్తులుగా మెలిగేవారని తెలిపారు. అదే స్ఫూర్తితో క్రైస్తవ సోదరులు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలన్నారు. క్రిస్మస్ పండుగ అందరిలో సంతోషాన్ని నింపాలని జిల్లా క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి జగన్నాథం పార్థసారథి తెలిపారు. క్రైస్తవ సోదరులంతా సమాధానంతో పండుగను వేడుకగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మానవాళి రక్షణ కోసమే భూలోకంలో ఏసుక్రీస్తు జన్మించారని బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా తెలిపారు. ప్రజలకు మోక్షమార్గం చూపిన ఆయన అందరి హృదయాలలో నీతి, సమానత్వాన్ని స్థాపించారని వివరించారు.మేజర్ ఏసు పాదం వాక్యోపదేశం చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ లవన్న, మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, తహసీల్దార్ షాలీమా, ఫాదర్ ఇన్నయ్య, రెవరెండ్ పి. వరబాబు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జె.పంగులూరు: మోటార్ సైకిల్పై వేగంగా వస్తూ ట్రాక్టర్ ట్రక్కు వెనుక భాగాన్ని ఢీ కొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సమీపంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రేణింగవరం ఎస్సై వినోద్బాబు తెలిపిన వివరాలు...చందలూరు గ్రామానికి చెందిన పెంట్యాల సుధాకర్ (55) అద్దంకి నుంచి స్వగ్రామం చందలూరు మోటార్ సైకిల్పై వస్తున్నాడు. చందలూరు సమీపంలోకి వచ్చే సరికి మలుపు తిరిగే సమయంలో ఎదురుగా ట్రాక్టర్ ట్రక్కును గమనించక ఢీకొట్టాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన సుధాకర్కు భార్య అనంతలక్ష్మి, కుమారులు విష్ణు, చరణ్ ఉన్నారు. బీసీ విభాగం జిల్లా కమిటీ నియామకం బాపట్ల: జిల్లా వైఎస్సార్ సీపీ బీసీ విభాగం కమిటీని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.వెంకట్రావు(వేమూరు),మన్నెం రాజశేఖర్(అద్దంకి), జనరల్ సెక్రటరీలుగా యద్దనపూడి హరిప్రసాద్ (పర్చూరు),పేరాల సురేష్(బాపట్ల),కె.శ్రీనివాసరావు(రేపల్లె),ఓ. వీరయ్య(అద్దంకి),పి.వెంకట దుర్గా కిరణ్(వేమూరు),సెక్రటరీలుగా జి.సుధాకర్(చీరాల), షేక్ కరిముల్లా(అద్దంకి), వెలనాటి వెంకట్రావు(పర్చూరు), ఆరేపల్లి శివయ్య(బాపట్ల), మరకా సురేష్(రేపల్లె),ఎం.నాగేశ్వరరావు(వేమూరు), బి.సురేష్(చీరాల)లను నియమించారు. వీరితోపాటు పలువురిని జిల్లా కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. వ్యాసరచనలో కొప్పరపాడు విద్యార్థిని ప్రతిభ బల్లికురవ: బాపట్ల జిల్లా స్థాయిలో జరిగిన వ్యాసరచన పోటీల్లో కొప్పరపాడు ఉన్నత పాఠశాల విద్యార్థిని ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల హెచ్ఎం పి. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. డిజిటల్ న్యాయవ్యవస్థ ద్వారా సమర్థవంతమైన, వేగవంతమైన పరిష్కారం అనే అంశంపై తెలుగు మీడియం విభాగంలో పి. లక్ష్మీ అమూల్య ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుని రూ. 5 వేల పారితోషిక అవార్డు పొందినట్లు చెప్పారు. మంగళవారం విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు బాపట్ల జిల్లా తరఫున పాల్గొననున్నట్లు హెచ్ఎం వివరించారు. ఎంపీడీవో కుసుమకుమారి ఎంఈఓలు కె. శ్రీనివాసరావు, కె. రమేష్బాబు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కేంద్రం చేతిలో ఉపాధి చట్టం నిర్వీర్యం తెల్ల గాంధీ విగ్రహం వద్ద నిరసన చీరాల: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్ట స్ఫూర్తిని దెబ్బతీస్తూ పేరు మార్పు చేయడం అంటే.. ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడమేనని సీపీఎం చీరాల ప్రాంతీయ కమిటీ కార్యదర్శి ఎన్.బాబూరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పేరు మార్పును వ్యతిరేకిస్తూ సీపీఎం చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కొట్లబజారులోని తెల్లగాంధీ బొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధిని హక్కుగా కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఉపాధిని హక్కుగా కాకుండా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పథకంగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. సీపీఎం కమిటీ సభ్యులు ఎం.వసంతరావు, ప్రసాద్, జి.ఇమ్మాన్యుల్, పి.శ్రీనివాసరావు, డి.మోషే, యు.సాంబయ్య, గోపి, రాంబాబు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. బంగారు ఆభరణాలు చోరీ చీరాల: ఇంటికి వేసిన తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను దుండగులు చోరీ చేశారు. ఈ సంఘటన శుక్రవారం కేపాల్ కాలనీలో చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుట్టా ఫణిరాజ అనే మహిళ చీరాల మండలం కేపాల్ కాలనీలో నివాసముంటోంది. ఆమె భర్త రాజస్థాన్లో సీఆర్పీఎఫ్లో హెడ్కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అనారోగ్యం కారణంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సమీపంలోని ఆమె హాస్పిటల్కు వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 12గంటలకు ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళాలు పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.2.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో ఆమె చీరాల ఒన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మహిళా ఎస్సై రాజ్యలక్ష్మి తెలిపారు. పొన్నూరు: ఒంటరిగా నిద్రిస్తున్న యువతిని కత్తితో బెదిరించి, గాయపరిచి అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్టణంలోని వీవర్స్ కాలనీలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వీరానాయక్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చింతలపూడి గ్రామానికి చెందిన నల్లమోతు వరకుమార్ పట్టణంలోని వీవర్స్ కాలనీకి చెందిన యువతిపై కన్నేశాడు. గురువారం రాత్రి యువతి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి కత్తితో గాయపరిచి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. శుక్రవారం వరకుమార్ను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. బీ–ఫార్మసీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల ఏఎన్యూ(పెదకాకాని): బీ–ఫార్మసీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను శుక్రవారం సీఈ ఆలపాటి శివప్రసాద్ విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేసుకోవాలని, వాటిని పీజీ కోఆర్డినేటర్ కార్యాలయంలో 31వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు ఫీజు రూ.2070 చెల్లించాలని సూచించారు. పర్సనల్ వెరిఫికేషన్ కోసం రూ. 2190 చెల్లించాలని పేర్కొన్నారు. -
రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు. అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ‘ఆదర్శ్ 2025 – స్పోర్ట్స్ ఫర్ హార్మనీ‘ పేరుతో రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రవినాయుడు జాతీయ, క్రీడోత్సవ పతాకాలు ఆవిష్కరించిన అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పావురాలను ఎగురవేశారు. రవినాయుడు మాట్లాడుతూ చదువు ఒక్కటే లక్ష్యంగా ఉన్న ప్రస్తుత టెక్నాలజీ యుగంలో క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి 15 క్రీడా అంశాలపై స్పోర్ట్స్మీట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా క్రీడల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న కళాశాలగా హిందూ కళాశాల పేరు పొందిందని తెలిపారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న క్రీడోత్సవాలకు 25 కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ పీఎం ప్రసాద్ , జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.అఫ్రోజ్ ఖాన్, ఏపీ శాప్ సభ్యుడు ఎస్.సంతోష్ కుమార్, కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు ఎస్వీఎస్ సోమయాజి, ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ వజ్రాల నర్సిరెడ్డి, కొల్లా సుస్మితా చౌదరి, ఫిజికల్ డైరెక్టర్ కోసూరి రవి తదితరులు పాల్గొన్నారు -
జిల్లా పోలీసులకు రాష్ట్ర స్థాయి అవార్డు
బాపట్ల టౌన్: పోలీస్లకు ఎంతో ప్రతిష్టాత్మకమైన రాష్ట్రస్థాయి ఏబీసీడీ అవార్డు బాపట్ల జిల్లాకు రావడం అభినందనీయం అని డీజీపీ హరీష్కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ, సిబ్బందికి సంబంధిత అవార్డు, ధ్రువపత్రం అందజేశారు. ఎస్పీ బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ.. పర్యాటక శాఖకు చెందిన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్లను రూపొందించి మోసం చేస్తున్న కేసును సమర్థంగా దర్యాప్తు చేసినందుకు అవార్డు ఫర్ బెస్ట్ క్రైం డెటెన్షన్ రావడం హర్షణీయం అన్నారు. పర్యాటక శాఖకు చెందిన వెబ్సైట్లు, ప్రఖ్యాతిగాంచిన పలు దేవస్థానాలకు చెందిన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్లను రూపొందించి దుండగులు యాత్రికులు, భక్తుల నగదు కొల్లగొట్టారని పేర్కొన్నారు. ఈ కేసును సవాలుగా స్వీకరించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారన్నారు. వీరు మొత్తం 18 రాష్ట్రాల్లో 127 ఫిర్యాదుల ద్వారా సుమారు రూ.46 లక్షల వరకు మోసం చేసినట్లు గుర్తించామని తెలిపారు. నిందితులు పరంజిత్ (20), బిట్టూ (21)లను అరెస్టు చేశామన్నారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, బాపట్ల రూరల్ సీఐ కె. శ్రీనివాసరావు, సైబర్ సెల్ రిజర్వ్ సీఐ టి. శ్రీకాంత్, ఐటీ కోర్ ఎస్ఐ షేక్ నాయబ్రసూల్, బాపట్ల రూరల్ హెడ్ కానిస్టేబుళ్లు పి. సుబ్బరాజు, వి. రమేష్, ఐటీ కోర్ కానిస్టేబుల్ డి. సురేష్, బాపట్ల రూరల్ కానిస్టేబుళ్లు కె.నాగరాజు, కె.బుజ్జి రాజు, ఐటీ కోర్ మహిళా కానిస్టేబుళ్లు డి.తబిత, ఐ.కీర్తి తదితరులు అభినందనలు పొందిన వారిలో ఉన్నారు. ఎస్పీని అభినందించిన డీజీపీ -
44వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
గ్రామంలో ర్యాలీ నిర్వహిస్తున్న క్రీడాకారులు కార్యక్రమంలో మాట్లాడుతున్న రవినాయుడు జె.పంగులూరు: చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ తద్వారా మంచి భవిష్యత్తు సాధించాలని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపాపరు. స్థానిక జూనియర్ కళాశాలలో శుక్రవారం 44వ బాలబాలికల (18 సంవత్సరాలలోపు) ఖోఖో పోటీలు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమానికి ముందుగా క్రీడాకారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా పతకాలను ఆవిష్కరించారు. ప్రాంగణంలో క్రీడాకారులు మార్చి ఫాస్టు నిర్వహించారు. అంతర్జాతీయ క్రీడాకారులు క్రీడా జ్యోతిని శాప్ చైర్మన్ రవినాయుడుకి అందించగా ఆయన వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ పంగులూరులో ఖోఖో నిర్వహణ చూస్తుంటే ఆనందంగా ఉందంటూ నిర్వాహకులను అభినందిచారు. మొట్ట మొదటిసారిగా ఖోఖో మెడల్ సాధించిన క్రీడాకారులకు డీఎస్సీలో నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వం ఎప్పుడు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచుగరటయ్య మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా గ్రామస్తులు క్రీడను ఆదరిస్తున్నారని తెలిపారు. మొట్టమొదటి సారిగా రెండు సార్లు జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలకు బంగారంతో చేసి బంగారు మెడల్ అందిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేకేఐఎఫ్ సెక్రటరీ సీతారామిడ్డి, డీఎస్డీఓ శ్రీనివాసరావు, రాజరాజేశ్వరి, ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కె. హనుమంతురావు, రఘుబాబు, గ్రామస్తులు రావూరి రమేష్, వీరనారాయణ, రామారావు, రాయిని వెంకటసుబ్బారావు, కర్రి సుబ్బారావు పాల్గొన్నారు. క్రీడా జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించిన శాప్ చైర్మన్ రవినాయుడు అంతర్జాతీయ స్థాయిలో పంగులూరుకు క్రీడలో గుర్తింపు ర్యాలీ నిర్వహించిన క్రీడాకారులు -
సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ జట్టుకు చీరాల క్రీడాకారుడు
చీరాల రూరల్: ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో నిర్వహించే సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ జట్టుకు చీరాల క్రీడాకారుడు కంచర్ల సుభాష్ ఎంపికయ్యాడు. చీరాల జయంతి పేటకు చెందిన కంచర్ల సుభాష్ చిన్నతనం నుంచి చదువుతో పాటు ఫుట్బాల్ క్రీడలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. చిన్నతనం నుంచే అతడు ఫుట్బాల్లో ఆరంగేట్రం చేశాడు. ఐఎల్టీకి కంపెనీకి చెందిన క్రీడామైదానం తన ఇంటికి దగ్గరగా ఉండడంతో నిత్యం సీనియర్ క్రీడాకారులతో కలిసి ఉదయం, సాయంత్రం వేళల్లో సాధన చేసేవాడు. జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది జూలైలో నిర్వహించిన సీనియర్ మెన్ ఫుట్బాల్ జిల్లాస్థాయి సెలక్షన్స్లో అత్యధిక ప్రతిభ కనబరచి జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ● ఆగస్టులో నిర్వహించిన సీనియర్ మెన్ జోనల్ మీట్లో బాపట్ల జిల్లా ఫుట్బాల్ జట్టులో పాల్గొని జట్టును విజేతగా నిలిపాడు. – ● విశాఖపట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి సీనియర్ మెన్ మీట్లో పాల్గొని తన అత్యుత్తమ ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. తన అత్యుత్తమ ప్రతిభతో సుభాష్ సెలక్టర్లను ఆకర్షించాడు. దీంతో సెలక్టర్లు జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సంతోష్ ట్రోఫీ జట్టుకు సుభాష్ను ఎంపిక చేశారు. ● బాపట్ల జిల్లా నుంచి సంతోష్ ట్రోఫికి ఎంపికై న సుభాష్ను జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసిమళ్ల విజయకుమార్, సమ్మర్ ఫుట్బాల్ క్యాంపు ఇన్చార్జ్ బొనిగల ప్రేమయ్య, జోనల్ కోఆర్డినేటర్ ఎన్. దేవదాసు, కోచ్ ప్రసన్న, ఎన్. నరేష్, సీనియర్ క్రీడాకారులతో పాటు కుటుంబ సభ్యులు సుభాష్ను అభినందించారు. మున్ముందు భారత జట్టులో చోటుసంపాదించి దేశం తరఫున ఆడాలని వారు ఆకాంక్షించారు. ఎంపికపై అభినందించిన ఫుట్బాల్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు -
దళిత సర్పంచ్పై అధికార జులుం
సాక్షి టాస్క్ ఫోర్స్: తన స్థలంతోపాటు రైతుసేవా కేంద్రం దారిని ఆక్రమంచి టీడీపీ సానుభూతిపరుడు నిర్మించిన ప్రహరీని కూల్చేసిన ఎస్సీ వర్గీయుడైన సర్పంచ్పై కేసుపెట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన వైనమిది. బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెంలో శుక్రవారం జరిగిన ఈ ఘటన అధికారపార్టీ నేతలు, అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. బాధిత సర్పంచ్ నగేశ్ తెలిపిన మేరకు.. వైఎస్సార్సీపీ పాలనలో ప్రభుత్వస్థలంలో రైతుభరోసా కేంద్రం నిరి్మంచారు. దానికి దారికోసం సర్పంచ్ నగేశ్ సర్వేనంబరు 127/7 లోని తన స్థలంలో ఐదడుగులు ఇచ్చారు. ఆ పక్కనే నివాసం ఉంటున్న టీడీపీ సానుభూతిపరులు టి.వెంకాయమ్మ, శ్రీనివాసరావు దంపతులు ఇటీవల రైతుసేవా కేంద్రానికి వెళ్లే రహదారిలో కొంత, నగేశ్ పట్టాభూమిలో కొంత ఆక్రమించి ప్రహరీ కట్టేందుకు పిల్లర్లు వేశారు. దీంతో సర్పంచ్ ఆ స్థలాన్ని సర్వేచేయాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. తహసీల్దార్ ఆదేశాలతో సర్వేయర్ వచ్చి స్థలాన్ని సర్వేచేసి టీడీపీ సానుభూతిపరుడు గోడకట్టే ప్రదేశంలో ఆక్రమణ ఉందని నివేదిక ఇచ్చారు. ఈ విషయం చెప్పి సర్పంచ్ హెచ్చరించినా వినకుండా వారు గోడకట్టారు. సర్పంచ్పై దాడిచేసి కులం పేరుతో దూషించారు. ఆ విషయమై సర్పంచ్ రెండురోజుల కిందట ఎస్పీకి, జేసీకి ఫిర్యాదు చేశారు. ఎవరూ స్పందించకపోవడంతో సర్పంచ్ నగేశ్ ఆ అక్రమ గోడను యంత్రంతో కూల్చేశారు. దీంతో తన గోడను సర్పంచ్ కూల్చేశారని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడి ప్రోద్బలంతో శుక్రవారం నగేశ్ స్థలంలో నుంచి విద్యుత్ సిబ్బంది కరెంటు స్తంభాలు వేయసాగారు. వారిని నగేశ్ అడ్డుకున్నారు. వారి సమాచారంతో గ్రామానికి వెళ్లిన సీఐ సుబ్బరాజు గోడ కూల్చినందుకు తీసుకెళ్తున్నానంటూ సర్పంచ్ నగేశ్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ విషయమై సీఐ సుబ్బరాజును అడగగా.. ఆక్రమణ విషయమై కోర్టులో తేల్చుకోవాలని, పడేయడం క్రిమినల్ కేసు అవుతుందని చెప్పారు. అందుకే తీసుకొచ్చి 41 నోటీసు ఇచ్చి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాన్ని కబ్జాచేసి గోడ నిరి్మంచినా పట్టించుకోని అధికారులు.. ఆ గోడ తొలగించారని సర్పంచ్పైనే కేసు పెట్టడం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
అంటు వ్యాధుల నియంత్రణలో భాగస్వాములు కావాలి
గుంటూరు మెడికల్: రాష్ట్రంలో ప్రబలుతున్న అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో వైద్యులందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ జి.రఘునందన్ విజ్ఞప్తి చేశారు. బుధవారం రాత్రి స్థానిక జి. ఎం.ఎ హాల్లో సిడ్స్ రాష్ట్ర శాఖ, ఐఎంఏ గుంటూరు శాఖ సంయుక్తంగా ‘మెలియోడో సిస్, స్క్రబ్ టైఫస్ అంటు వ్యాధుల వ్యాప్తి, లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, చికిత్స, నియంత్రణ, నిరోధక చర్యలు’ అంశంపై వైద్య నిపుణులతో ఏర్పాటు చేసిన చర్చ కార్యక్రమంలో డాక్టర్ జి.రఘునందన్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్ టి.సేవ కుమార్ అధ్యక్షత వహించారు. డాక్టర్ జి.రఘునందన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ కొత్తగా అంటువ్యాధులు వెలుగుచూసినా, రాష్ట్ర అధికారులకు ముందుగా గుంటూరు వైద్యులే గుర్తుకు వస్తారన్నారు. వ్యాధి నిర్ధారణ తొలిదశలోనే జరగటం వల్ల అంటు వ్యాధుల మరణాలను చాలావరకు నిరోధించగలిగామని చెప్పారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎం.ప్రవీణ్ మాట్లాడుతూ అంటు వ్యాధుల్ని గుర్తించిన వైద్యులు ఆ వ్యాధుల సమాచారాన్ని తమకు తెలియజేయాలని కోరారు. ఆ వ్యాధుల నియంత్రణ చర్యలల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పాలుపంచుకోవడం జరుగుతుందన్నారు.డీఎంఈ డాక్టర్ జి.రఘునందన్ -
ముగిసిన ‘అన్వేషణ్ – 2025’
తాడికొండ: భారత విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ) నిర్వహించిన విద్యార్థుల పరిశోధన – ఆవిష్కరణ పోటీ (సౌత్ జోన్) అన్వేషణ్–2025, గురువారం వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయంలో విజయవంతంగా ముగిసింది. 17,18 తేదీలలో నిర్వహించిన ఈ కార్యక్రమం భారతదేశంలోనే అతిపెద్ద పరిశోధన మరియు ఆవిష్కరణ పోటీగా కళాశాల యాజమాన్యం తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతెం శాంతా సింగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశ నిర్మాణంలో యువత నేతృత్వంలోని పరిశోధనలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. గౌరవ అతిథి జీనియస్ ఫిల్టర్స్ అండ్ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పంచుమర్తి లక్ష్మీ భీమేష్ మాట్లాడుతూ విద్యార్థులు తమ పరిశోధనా కార్యకలాపాలను వాస్తవ ప్రపంచ పారిశ్రామిక సామాజిక సవాళ్లతో అనుసంధానించాలన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అమరేంద్ర పాణి ప్రత్యేక అతిథిగా హాజరై పాల్గొన్న వారితో పాటు అవార్డు గ్రహీతలను అభినందించారు. అత్యుత్తమ విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులను పోస్టర్ ప్రజెంటేషన్ పోడియం ప్రజెంటేషన్ రెండింటి నుంచి ఎంపిక చేశారు. ప్రతి ట్రాక్ నుంచి మొదటి, రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచిన విజేతలను సత్కరించారు. వీఐటీ–ఏపీ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ డాక్టర్ పి.అరుల్మోళి వర్మన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి హాజరయ్యారు. -
అయ్యప్ప నామస్మరణతో పులకిస్తున్న గ్రామాలు
రెంటచింతల: దేశంలోని పట్టణ ప్రాంతాలతోపాటు పల్లెలు ప్రతి ఏటా నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు హరహర పుత్రుడు అయ్యప్పనామస్మరణతో పులకించిపోతుంటాయి. కోట్లాది మంది భక్తులు కఠినమైన 41 రోజులపాటు అయ్యప్పస్వామి మాలలు ధరించి వారి వారి ప్రాంతాలలో పడిపూజ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. పడిపూజలో అయ్యప్ప స్వామి వారికి 21 రకాల అభిషేకాలతోపాటు వివిధ రకాల పూజా కార్యక్రమాలు చేపడతారు. సాక్షాత్తూ జ్యోతిస్వరూపుడు అయప్పస్వామి మహిషి అనే రాక్షసిని సంహారించి శబరిమలైలో వెలిశాడని పురాణం ద్వారా తెలుస్తుంది. ధర్మశాస్త్ర మణికంఠుడిగా పేరు పొందిన అయప్పస్వామి కేరళ రాష్ట్రంలోని శబరిమలై హిందువులకు ఓ ప్రధాన పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది. దేశ నలుమూలల నుంచి 41 రోజుల పాటు నియమాలను పాఠించి ప్రతి ఏటా సుమారు 5 కోట్ల మంది భక్తులు అయప్ప సన్నిధికి చేరుకుని దర్శించుకుంటారు. కార్తికమాసం, సంక్రాంతి సమయలలో అత్యధిక సంఖ్యలో మాల ధారులు శబరిమలై వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. దక్షిణభారతదేశంలోని ఆంధ్ర, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో అధికంగా అయప్పమాలధారణ స్వీకరిస్తారు. ఆంధ్ర శబరిమలైగా పేరుపొందిన ద్వారపూడి శంఖవరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని శబరిమలై వలే నిర్మించడం విశేషం. ఇరుముడి ప్రత్యేకత రెండు అరలున్న మూట ఇరుముడి. నేతితో నింపిన కొబ్బరి కాయ, రెండు కొబ్బరికాయలు, వక్కలు, తమలపాకులు, నాణాలు, పసుపు, గంధం పొడి, విభూది, పన్నీరు, బియ్యం, అటుకులు, మరమరాలు, బెల్లం, అరటిపండ్లు, కలకండ, అగరువత్తులు, కర్పూరం, మిరియాలు(వావర్ దర్గాకోసం), తేనే, ఎండు ద్రాక్ష, తువ్వాలు వంటి వస్తువులను ప్రతి అయప్ప మాలధారుడు ఖచ్చితంగా ఇరుముడిగా కట్టుకుంటారు. ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని పల్లికెట్టు అంటారు. శబరిమల కేరళలోని పత్తినంతిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో సహ్యాద్రి పర్వతశ్రేణుల ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు 18 కొండల మధ్య వెలసిఉంది. ప్రతి ఏటా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 26 వరకు ఆలయ తలుపులు తెరచి ఉంచుతారు. 27,28,29, మూడు రోజులు ఆలయ తలుపులు మూసి తిరిగి డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మాలధారులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు తెరచి ఉంచుతారు. శబరిమలకు మార్గం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి నేరుగా రోడ్డు మార్గం ఉంది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన పంబ దగ్గర నుంచి ప్రతి భక్తుడు ఇరుముడితో స్వామివారి దర్శనానికి దట్టమైన అడవుల మధ్య సుమారు 7 కి. మీ కాలినడకన వెళ్లాలి. దీనికి మరో మార్గం వండిపెరియార్ నుంచి పులిమేడు కొండ మీదుగా 17 కి. మీటర్లు నడచి వెళ్లాలి. ఈ మార్గంలో పులులు, అడవి జంతువులు ఎక్కువగా సంచరిస్తుంటాయి. దీంతో ఈ మార్గం నుంచి తక్కువ మంది భక్తులు స్వామిదర్శనానికి వెళ్తారు. -
అందంలో మెరిసి.. ఆత్మవిశ్వాసం చాటి..
మిస్ ఆంధ్ర – 2025 పోటీలలో ప్రతిభ చూపిన బాపట్ల యువతి బాపట్ల: మిస్ ఆంధ్రప్రదేశ్ – 2025 పోటీలలో బాపట్లకు చెందిన వడాలశెట్టి కోమల సాయి హర్షిత ప్రతిభ కనబరిచి రన్నర్గా నిలిచారు. విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ టైటిల్ పోరులో తన ప్రతిభ ప్రదర్శించారు. కేవలం బాహ్య సౌందర్యానికి పరిమితం కాకుండా ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వం ఆధారంగా జరిగే ఈ అందాల పోటీలు మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, భావ ప్రకటన నైపుణ్యం వంటి గుణాలను ప్రదర్శించే వేదికగా నిలిచాయి. చిన్ననాటి నుంచే.. ఫైనలిస్ట్గా ఎంపికై న కోమల సాయి హర్షిత ఆద్యంతం తన విశిష్టతను, వ్యక్తిత్వ వికాసాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించి అబ్బురపరిచారు. చక్కటి మాట తీరుతో నిర్భయంగా, స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచిన తీరు ఆకట్టుకుంది. కోమల సాయి బాల్యం నుంచి విద్యాభ్యాసంలో చురుకుగా ఉంటూనే, వక్తృత్వ పోటీలలో ముందంజలో ఉండేవారు. అనేక వేదికలపై అనర్గళంగా ప్రసంగిస్తూ భావ ప్రకటనలో తన నైపుణ్యాన్ని పెంచుకున్నారు. అనేక బహుమతులు సాధించి, తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం బీబీఏ ఎల్ఎల్బీ ఆనర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. తండ్రి స్ఫూర్తిగా.. సివిల్స్లో టాపర్గా నిలవాలనేదే తన భవిష్యత్తు లక్ష్యమని వివరించారు. ముఖ్యంగా మహిళల సాధికారత, స్వావలంబన కోసం పనిచేయాలన్నది తన అభిమతమని తెలిపారు. మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న తండ్రి నిర్మల్ కుమార్ తనకు స్ఫూర్తి అని చెప్పారు. పోటీలో గెలవడం కంటే తనకు లభించిన అవకాశాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకున్నాననేదే ముఖ్యమని తెలిపారు. -
టెట్పై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి
గుంటూరు వెస్ట్: ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, బేషరతుగా ఇన్ సర్వీస్ టీచర్లందరినీ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ అవసరమైన మేరకు విద్య హక్కు చట్టంలో అర్హతల నిబంధనలను సెక్షన్ 23 (2) సవరణ చేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖరరావు, కళాధర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ఎలిమిటెడ్ విద్యార్థులకు 75 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్న ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలన్నారు. జనరల్ సెలవు దినాలు, పండగ రోజుల్లో తరగతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస పని దినాలు సరిపోతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు సెలవు దినాలలో కూడా పాఠశాలలు నిర్వహించడం తగదన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీ వాత్సవకు వినతిపత్రం అందజేశారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా -
బాపట్ల
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరులోని శ్రీ కట్లమ్మతల్లి పరివార దేవతల విగ్రహాల పునఃప్రతిష్ట ఈ నెల 23న జరుగుతుందని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపింది.నీటిపై చేప పిల్లల్లా దూసుకుపోతూ.. గాలిలో దూది పింజల్లా తేలుతూ.. పచ్చికపై కంగారుల్లా పరిగెడుతూ.... ప్రత్యర్థులను టచ్ చేయాలంటే పంగులూరు క్రీడాకారులకే సాధ్యం. ఈ గడ్డపై పుట్టిన ఎందరో జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. అలాంటి గడ్డపై శుక్రవారం నుంచి 44వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు మూడు రోజులపాటు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. జె.పంగులూరు: ఖోఖో పేరు వినగానే జె. పంగులూరు అందరికీ గుర్తుకు వస్తుంది. జాతీయ స్థాయి క్రీడాకారులకు నెలవైన ఈ గ్రామం జిల్లా ప్రతిష్టను పెంచింది. ఇంతటి పేరు రావడానికి గ్రామ ప్రజల ప్రోత్సాహం వర్ణింపలేనిది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోయినా గ్రామస్తులు అక్కడి క్రీడాకారులకు ఆర్థికంగా, మానసికంగా ఎంతో అండగా నిలుస్తున్నారు. వారు జాతీయ స్థాయి క్రీడాకారులగా ఎదిగేందుకు చేస్తున్న సాయం ప్రశంశనీయం. ఎందరికో ఉద్యోగాలు ఈ క్రీడా కోటాలో ఎస్సైలుగా ఏడుగురు, సీఐగా ఒకరు ఉద్యోగం పొందారు. కానిస్టేబుళ్లుగా 30 మంది సేవలందిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయులుగా 34 మంది, సాఫ్ట్వేర్ నిపుణులుగా 27 మంది, ఆర్మీలో సుమారు 25 మంది, అమెరికాలో ఐదుగురు క్రీడాకారులు సేవలు అందిస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, మెడికల్ సీట్లు సాధించినవారు 50 మంది ఉన్నారు. అంతేకాక 1992 – 2025 మధ్య సుమారు 500 మంది బాలబాలికలు పోటీల్లో వ్యక్తిగత పతకాలు సాధించారు. 40 మంది బంగారు, 50 మంది వెండి, 50 మంది కాంస్యపతకాలు కై వసం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరు బంగారు పతకాలు సాధించారు. జాతీయ క్రీడల్లో కాశీవిశ్వనాథ రెడ్డి (బంగారు పతకం), జొన్నలగడ్డ పౌలు (బ్రాంజ్ మెడల్), కంది వెంకటరెడ్డి, రావూరి శ్రీనివాసరావు (బ్రాంజ్ మెడల్), పాలకీర్తి శ్రీను (బ్రాంజ్ మెడల్), పోతిరెడ్డి శివారెడ్డి (బ్రాంజ్ మెడల్), మండవ సౌజన్య (బంగారు పతకం) పతకాలు పొందారు. పంగులూరు గ్రామంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాన్నదే నా అభిమతం. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఖోఖో ఇండియన్ ఫెడరేషన్ అధికారులు ఇక్కడ పోటీల నిర్వహణ తీరు చూసి ఆశ్చర్యపోయారు. వారే అంతర్జాతీయ పోటీలను పంగులూరులో నిర్వహించాలని కోరారు. భవిష్యత్తులో నిర్వహిస్తాం. – బాచిన చెంచు గరటయ్య, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ 2023లో మలేషియాలో ఖోఖో టెస్ట్ సిరీస్లో ప్రతిభ చాటి బంగారు పతకం సాధించా. పంగులూరులో ఖోఖో ఆడటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ ఆట నాకు బంగారు భవిష్యత్తును ఇచ్చింది. ప్రస్తుతం నేను పీఈటీగా ఉద్యోగం పొంది, విధులు నిర్వహిస్తున్నాను. – సూరినాయుడు, అంతర్జాతీయ క్రీడాకారుడు, పీఈటీ ఈ నెల 19 వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఒకే క్రీడా ప్రాంగణంలో 44వ రాష్ట్ర స్థాయి బాలబాలికల పోటీలు నిర్వహించనున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. గ్రామస్తుల సహకారం మరువలేనిది. – కె హనుమంతురావు, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ కార్యదర్శిఎనిమిది సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు, రెండు సార్లు జాతీయ స్థాయి పోటీలు, 254 శిక్షణ శిబిరాలు నిర్వహించారు. పంగులూరు ఖోఖో కర్మాగారం అనడానికి ఇవే ఉదాహరణలు. నేను చిన్ననాటి నుంచి ఇక్కడే ఆట నేర్చుకున్నా. ఎంతోమంది క్రీడాకారులకు నేర్పాను. – రఘుబాబు, జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు71992లో మాగుంట ఎడ్యుకేషనల్ ట్రస్టు కింద ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి అప్పట్లో బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల స్థాపించారు. ఈ కళాశాలలో భవన నిర్మాణ దాత బాచిన వెంకట్రావు. రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో 1992లోనే వెంకట్రావు ఈ క్రీడా పోటీలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఎంతో మంది క్రీడాకారులను తీర్చిదిద్ది వారికి బంగారు భవిష్యత్ అందించడంలో సహకరించారు. గ్రామస్తుల ఆదరాభిమానాలతో అప్పటి నుంచి ఇప్పటికి 254 శిక్షణ శిబిరాలు నిర్వహించడం విశేషం. ఎంతో మంది క్రీడాకారులు ఉద్యోగాలు సాధించారు. మాజీ శాసన సభ్యుడు, రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ బాచిన చెంచు గరటయ్య సహకారం అందిస్తున్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
రేపల్లె : పట్టణంలో పిచ్చికుక్క దాడిలో ఎనిమిది మంది చిన్నారులతోపాటు ఓ మహిళ తీవ్ర గాయాలపాలైంది. పట్టణంలోని 8వ వార్డులో గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు పలువురు విద్యార్థులు ఆటో కోసం వేచి ఉన్నారు. పిచ్చికుక్క ఒక్కసారిగా పిల్లలపై దాడికి దిగింది. వారు గాయాల పాయలయ్యారు. గమనించిన మహిళ కుక్కను అడ్డుకోబోయారు. ఆమైపెనా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. మహిళతోపాటు అజిత్కుమార్, రోహిత్, హర్ష, రిచిత, పూజిత సాయి, చరణ్, నాగబాబు, ప్రేమలు గాయపడ్డారు. గమనించిన స్థానికులు కుక్కను చంపారు. గాయాలపాలైన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాల సూపరిండెండెంట్ డాక్టర్ కొలసాని పృథ్వీ గణేష్ చిన్నారులకు వైద్య చికిత్సలు అందించారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు. క్షతగాత్రులు పాటించాల్సిన నియమాలను సూచించారు. -
ఆలయ భూమి ఆక్రమణ
వేమూరు: తెలుగు దేశం పార్టీకి చెందిన నాయకుడు దేవాలయ భూమి ఆక్రమించి ఏకంగా షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు గ్రామస్తులు ఆరోపించారు. వేమూరు మండలంలోని బలిజేపల్లి గ్రామంలోని గంగా పార్వతి సమేత వాలేశ్వర స్వామి ఆలయలో భూమి ఆక్రమణకు గురైంది. తెలుగు దేశం పార్టీ గ్రామ అధ్యక్షుడు నిజాంపట్నం సత్యనారాయణ ఆలయ ప్రహరీ పక్కన ఉన్న స్థలం ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆక్కడ షెడ్డు నిర్మాణం నిలిపి వేయాలని పంచాయతీ కార్యదర్శికి స్థానికులు వినతిపత్రం అందజేశారు. కార్యదర్శి ఆరా తీయగా అనుమతి లేదని తేలడంతో నిర్మాణం నిలిపి వేయాలని హెచ్చరించారు. -
నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు
ప్రత్తిపాడు: నల్లబర్లీ సాగు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.పద్మావతి అన్నారు. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంలో గురువారం ఆమె పర్యటించి రైతులతో మాట్లాడారు. నల్లబర్లీ పొగాకు సాగును ప్రభుత్వం నిషేధించిందని, సాగు చేయవద్దని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం జీవో నంబర్ 740 జారీ చేసిందని, అతిక్రమించి సాగు చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. టాస్క్ఫోర్స్ టీంలు, ఆర్ఎస్కే సిబ్బంది నల్లబర్లీ సాగు చేయవద్దంటూ అవగాహన కల్పిస్తున్నా, కొందరు రైతులు వినడం లేదన్నారు. అందుకే గ్రామాల్లో పర్యటించి సేకరించిన వివరాలను జిల్లా టాస్క్ఫోర్స్ టీంకు పంపి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆమె వెంట మార్క్ఫెడ్ మేనేజర్ నరసింహారెడ్డి, గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్.మోహన్రావు, తహసీల్దార్ ఉన్నారు. మాచర్ల: మాచర్ల బస్టాండ్ ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం అర్చకులు అడిగొప్పల చెన్నకేశవాచార్యుల ఆధ్వర్యంలో పంచామృతాలతో గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది మహిళలు పూజలో పాల్గొన్నారు. పాత మాచర్లలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు కొండవీటి రాఘవాచార్యులు, అధ్యక్షులు భవనాశి వెంకటేశ్వర్లు, పట్టణంలోని ప్రధాన వీధిలోని కోదండ రామాలయంలో అర్చకులు కొండవీటి వేణుగోపాలాచార్యులు, అధ్యక్షులు బచ్చు రామారావులు ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. అమృతలూరు(భట్టిప్రోలు):గోవాడలోని గంగాపార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం కోటి కుంకుమార్చన, సామూహిక లలితా పారాయణ మహోత్సవం జరుగుతుందని ఎస్ఎస్ఎఫ్ బాపట్ల దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ తెలిపారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల శ్రీనివాసవర్మ, చైర్మన్ పావులూరి రమేష్ ఆధ్వర్యంలో జరుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన అర్చకులు, ఎక్స్అఫిషియో సభ్యులు స్వర్ణ వెంకట శ్రీనివాసశర్మ, ఉపముఖ్య అర్చకులు చావలి శ్రీధరశర్మ, ఆధ్యాత్మికవేత్త పావులూరి వరలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. అన్నదానం కూడా చేస్తున్నట్టు వివరించారు. తాడికొండ: మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో ఈనెల 21వ తేదీన రాష్ట్ర ఓపెన్ చెస్ టోర్నమెంట్–2025 నిర్వహిస్తున్నట్లు చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవీ ఆంజనేయులు గురువారం తెలిపారు. ఆనంద్ ఈ చెస్ వింగ్స్, ఏపీసీఏ విభాగం, గుంటూరు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. అన్ని కళాశాలల నుంచి ఏ వయసు వారైనా పాల్గొనవచ్చన్నారు. ఎంట్రీ ఫీజు రూ.500 అని తెలిపారు. విజేతలకు నగదు బహుమతిగా రూ.50 వేలు ప్రకటించారు. ఈ నెల 20వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు మోతడక చలపతి ఫార్మసీ కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు, భోజన వసతి ఉంటుందన్నారు. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ నల్లాని వెంకట రామారావు, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. -
అలరించిన జానపద సాంస్కృతిక సంబరాలు
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): భావితరాలకు భారతీయ కళల ప్రాశస్త్యాన్ని తెలియజేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ తెలిపారు. మార్కెట్ కూడలిలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఙాన మందిరంలో బుధవారం రాత్రి నాట్స్ ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు, ఉత్తమ ఉపాధ్యాయులు, కవులకు పురస్కారాలు ప్రదానం చేశారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు నిర్వహణలో అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మాట్లాడుతూ భారతీయ కళలు అంతరించపోకుండా జానపద, సాంస్కృత సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కళలను ప్రోత్సహించాలని చెప్పారు. జానపద కళలను చిన్నతనంలో తిలకించానని, ప్రస్తుతం నిర్వహించిన ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో సేవా, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా రాష్ట్రాలలో జానపద కళలను ప్రోత్సహించేందుకు కళాకారులకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. సంస్కృతీ, సంప్రదాయ కళలను ప్రోత్సహించేందుకు నాట్స్ అన్నివేళల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పారు. కన్వీనర్, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాట్కో లక్షలాది రూపాయలతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం ప్రజా గాయకుడు పి.వి. రమణ నేతృత్వంలో కళాకారుల విన్యాసాలు అలరించాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణ జిల్లాలతోపాటు మలినేని ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల కోలాటం, డప్పు, కొమ్ము కోయి తదితర నృత్యాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మందాడి కిరణ్, వేమూరి శ్రీనివాసరావు, వైద్యులు ఏ.ఆంజనేయులు, జన చైతన్య వేదిక నిర్వాహకులు లక్ష్మణ్రెడ్డి, కాకుమాను నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
తెనాలి నుంచి పెద్దాపురానికి ధాన్యం రవాణా
తెనాలి: రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని తెనాలి నుంచి తొలిసారిగా రైల్వేర్యాక్తో 30 వ్యాగన్ల ధాన్యాన్ని బుధవారం సాయంత్రం పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్కు తరలించారు. తెనాలి రైల్వేస్టేషన్కు లారీల్లో చేర్చిన ధాన్యాన్ని వ్యాగన్లలో లోడు చేశారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజరు కె.తులసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లాలో తొలిగా కొనుగోలు కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి నెలరోజుల వ్యవధిలో 26,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించినట్టు తెలియజేశారు. ఇందుకుగాను రూ.63 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్టు తెలిపారు. తెనాలి నుంచి రైల్వే ర్యాక్లో ధాన్యం రవాణా ఇదే ప్రథమంగా చెప్పారు. ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రోడ్డు మార్గాన తరలివెళ్లినట్టు తెలిపారు. జిల్లాలో 20 మంది రైస్మిల్లర్లు సేకరించిన 20 వేల మెట్రిక్ టన్నుల బీపీటీ–5204 ధాన్యాన్ని మధ్యాహ్న భోజన పథకానికి ఉపయోగిస్తామని వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె.సుధీర్బాబు, పెద్దాపురంలోని పట్టాభి ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధులు, తెనాలి, కొల్లిపర మండలాల వీఆర్వోలు, వీఏఏలు పాల్గొన్నారు. -
డీఎస్ నకార సేవలు చిరస్మరణీయం
ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మంగళగిరి టౌన్: విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేసిన డీఎస్ నకార సేవలు చిరస్మరణీయమని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళగిరి పట్టణంలోని పెన్షనర్స్ హోమ్లో జాతీయ పెన్షనర్ల దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ పితామహులు డీఎస్ నకార విగ్రహాన్ని ఆవిష్కరించారు. అసోసియేషన్ సభ్యులు నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడంతో డీఎస్ నకార తన కర్తవ్యంగా న్యాయస్థానానికి వెళ్లారని గుర్తుచేశారు. దీంతో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చారిత్రాత్మక తీర్పు వెలువరించారని.. ఆనాటి నుంచి పెన్షనర్ దినోత్సవాన్ని జరుపుకొంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటగా మంగళగిరిలో నకార విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలువురు సీనియర్ పెన్షనర్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుదాసు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిచ్చయ్య, కృష్ణయ్య, మంగళగిరి శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపిరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అల్లూరికి సహకరించిన బ్రిటిష్ ఉద్యోగులు
మార్టూరు: బ్రిటిష్ ఉద్యోగులు అయి ఉండి కూడా స్వాతంత్య్ర పోరాటంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు సహకరించిన ఫజలుల్లాఖాన్, షేక్ మదీనాల చరిత్రను వెలుగులోకి తీసుకువస్తూ రచించిన పుస్తకాన్ని బుధవారం మార్టూరులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్ )రెడ్ స్టార్ కేంద్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ బాష మాట్లాడుతూ ఫజలుల్లాఖాన్ బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తూనే రంప ఏజెన్సీలో భారతదేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు చేస్తున్న సాయుధ పోరాటానికి సహకరించారన్నారు. అదే ప్రభుత్వంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన షేక్ మదీనా ఉద్యోగ విరమణ అనంతరం అల్లూరికి తుపాకీ కాల్చడం నేర్పించి హిందూ, ముస్లిం ఐక్యతకు పాటుపడ్డారని కొనియాడారు. వీరి చరిత్రను ‘అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా’ పేరుతో సయ్యద్ నజీర్ అహమ్మద్ రచించిన పుస్తకాన్ని గోగుల మూడిరాధా కృష్ణ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు ఆవిష్కరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాల కన్వీనర్ దేవరపల్లి రాము, ఏసురత్నం, ఖాజావలీ ఖాన్, బాబు ఖాన్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ‘అల్లూరికి అండగా నిలిచిన ఫజులుల్లా ఖాన్ షేక్ మదీనా’ పుస్తకావిష్కరణలో వక్తలు -
శ్లాబ్ పెచ్చులూడిపడి మహిళకు తీవ్ర గాయాలు
కొల్లూరు: అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలో మంచంపై నిద్రిస్తున్న మహిళపై కాలం చెల్లిన ఇంటి పైకప్పు పెచ్చులూడిపడి తీవ్ర గాయాల బారిన పడిన సంఘటన కొల్లూరు గాంధీనగర్లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గాంధీనగర్కు చెందిన మాగం శ్రీనివాసరావు భార్య వెంకటేశ్వరమ్మ నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇంటికే పరిమితమైంది. బుధవారం మధ్యహ్నం ఆమె ఇంటిలో నిద్రిస్తుండగా ఉన్నట్లుండి దశాబ్ధాల క్రితం ప్రభుత్వం నిర్మించిన ఇంటి శ్లాబ్ నుంచి భారీ పెచ్చు ఊడి కిందపడింది. నిద్రిస్తున్న వెంకటేశ్వరమ్మపై పడటంతో ఆమె తీవ్రంగా గాయపడటంతోపాటు, ఆమె నిద్రిస్తున్న మంచం సైతం ధ్వంసమైంది. ఇంటి పైకప్పు పెచ్చులు పడటంతో గాయాలపాలైన ఆమె కేకలు వేయడంతో గమనించిన స్థానికులు ఆమెను తెనాలి వైద్యశాలకు తరలించారు. -
బాపట్ల
గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 41.9800 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం బుధవారం 571.40 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,654 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. చంద్రబాబు పాలనలో కూలీలు, రైతులకు అవస్థలువేమూరు(అమర్తలూరు): వ్యవసాయంలో యంత్రాల వల్ల కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు తెలిపారు. అమర్తలూరు మండలంలోని కూచిపూడిలో బుధవారం ఆయన పొలాల్లో విత్తనాలు వేస్తున్న కూలీలతో మాట్లాడారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ యంత్రాల వల్ల సక్రమంగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. రైతులు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. కౌలు రైతులపై వివక్ష చూపుతోందని ఆరోపించారు. సొంత పొలాలున్న రైతుల అకౌంట్లో మాత్రమే డబ్బులు జమ చేశారని, తమ గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది ఖరీఫ్లో వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయామని, రబీలో జొన్న సాగు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి, జొన్నకు గిట్టుబాటు ధర కల్పించాలని కౌలు రైతులు కోరారు. ఈ సందర్భంగా అశోక్బాబు మాట్లాడుతూ వైస్సార్ సీపీ అధికారంలోకి వస్తే రైతులకు, కౌలు రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. మాజీ ముఖ్యమంతిర పాలనలో ప్రతి పంటకు గిట్టబాటు ధర కల్పించడం వల్ల రైతులకు, కౌలు రైతులకు మేలు జరిగిందని పేర్కొన్నారు. పంట సాగు కోసం రైతులకు విడతల వారికి అకౌంట్లో డబ్బులు చేశారని, అప్పులు చేయకుండా పొలాలు సక్రమంగా సాగు చేస్తుకున్నారని ఆయన గుర్తుకు తెచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళలను కూడా మోసం చేసిందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి పాలనలో ఆర్థికావృద్ధి సాధించారని, పలు పథకాల ద్వారా ఆదుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో పనులు లేక, ప్రభుత్వ పథకాలు అందక నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. మహిళలంతా జగన్మోహన్రెడ్డికి అండగా ఉండాలని కోరారు. ఆయన వెంట జిల్లా అధికార ప్రతినిధి సయ్యద్ సిరాజుద్దీన్, దాసరి కిరణ్ ఉన్నారు. 7వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్బాబు -
ప్రైవేటు సేవలో సూపర్ స్పెషలిస్టులు
గుంటూరు మెడికల్ : సాధారణ వైద్య సేవలు సైతం ఖరీదైపోతున్న నేటి రోజుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందాలంటే పేద రోగులు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు గుంటూరు జీజీహెచ్ పేదలకు పెద్ద దిక్కుగా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల కంటే మెరుగైన, అధిక సంఖ్యలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే వైద్య విభాగాలు కలిగి ఉన్న గుంటూరు జీజీహెచ్లో సూపర్ స్పెషలిస్టుల సేవలు అంతంత మాత్రంగానే లభిస్తున్నాయి. సూపర్ స్పెషాలిటీ వైద్యులు గుంటూరు జీజీహెచ్లో జీతాలు తీసుకుంటూ ఎక్కువ సమయం ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాటించని సమయవేళలు మధ్యాహ్నం వైద్యం నిల్ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పేద రోగులకు తప్పని తిప్పలు ... -
తీవ్ర సంక్షోభంలో వ్యవసాయ రంగం
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): దేశంంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని ఓ హోటల్లో బుధవారం వివిధ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జొన్న శివశంకరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టుకునేందుకు రైతులను సంఘటిత పరచాలని ఆ దిశగా ఉద్యమాలను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గుంటూరులో వచ్చే ఏడాది జనవరి 29, 30, 31, ఫిబ్రవరి ఒకటో తేదీన జరగనున్న అఖిలభారత కిసాన్ సమితి జాతీయ సమావేశాల్లో ఉద్యమ కార్యాచరణపై చర్చించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఙరైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం రైతుల చేతుల్లో నుంచి కార్పొరేట్ శక్తుల్లో చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఙమాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభం వల్ల స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ వాటా తగ్గిపోయిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయ రంగంలో ఒక్క పంటకీ గిట్టుబాటు ధరలు లేవన్నారు. గుంటూరులో జరిగే ఏఐకేఎస్ జాతీయ సమావేశాలకు రైతు సంఘం నాయకులు అశోక్ దావాలే, హనన్ మొల్ల విజూ కృష్ణ హాజరు కానున్నట్లు తెలిపారు. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ టి.రత్నారావు, కిసాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు బండ్ల సూరయ్య చౌదరి, లాం ఫారం మాజీ అసోసియేట్ డైరెక్టర్ ఆర్.అంకయ్య, తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ మూర్తి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ సమావేశాలకు సంబంధించిన ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య -
కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో 2026 మార్చి 1వ తేదీ నుంచి కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ టి.సందీప్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఆర్డీఏ, వెలుగు సౌజన్యంతో వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఆసక్తి గల అభ్యర్థులు క్యూర్ కోడ్ ద్వారా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. కారు డ్రైవింగ్లో మహిళలకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే జనవరి 22 వరకు మహిళలకు టైలరింగ్లో శిక్షణ ఇవ్వడం జరగుతోందని, జూట్ ప్రొడక్ట్స్లో వచ్చే జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉచిత శిక్షణకు 19 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ మహిళలు అర్హులని స్పష్టం చేశారు. శిక్షణా కాలంలో ఉచిత భోజనంతో పాటు, వసతి కల్పించడం జరుగుతోందని వివరించారు. పూర్తి వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ, ఓల్డ్క్లబ్ రోడ్, కొత్తపేట, గుంటూరు, 0863–2336912, 8125397953, 9700687696 ఫోన్ నంబర్లును సంప్రదించాలని ఆయన తెలియజేశారు జిల్లాలో 474 మందికి కౌన్సెలింగ్ నగరంపాలెం: జిల్లాలో ఈవ్టీజింగ్, ఇష్టానుసారంగా మోటారుసైకిళ్లను నడిపే వారిని గుర్తించే ప్రత్యేక డ్రైవ్ బుధవారం కూడా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ఈవ్టీజింగ్కి పాల్పడిన 260 మంది, బైక్ పోటీలు, బైక్లపై వంకర్లుగా వెళ్తూ మిగతా చోదకులను ఇబ్బందులకు గురిచేసే 214 మందిని గుర్తించారు. ఈ మేరకు వారికి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కౌన్సెలింగ్ నిర్వహించారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పోలీస్ అధికారులు హెచ్చరించారు. స్కూళ్లు, కళాశాలలు, ప్రధాన రహదారులు, జనసంచారం రద్దీగా ఉండే ప్రాంతాలు, దుకాణాల సముదాయాలు, మార్కెట్లు, థియేటర్లు, రైల్వే/బస్టేషన్లు వద్ద డ్రైవ్ కొనసాగింది. ఈవ్టీజింగ్, బైక్ పోటీలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి డీడీఓలను ఆశ్రయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని జిల్లా విద్యాశాఖాధికారులతో పాటు ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, హెచ్ఎంలు, బోధన, బోధనేతర సిబ్బంది వ్యక్తిగత, సర్వీసు రూల్స్, ఫిర్యాదులను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారి (డీడీవో) ద్వారా పరిష్కరించుకోవాలని పాఠశాల విద్య ఆర్జేడీ బి. లింగేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. డీడీవో స్థాయిలో పరిష్కారానికి నోచుకోని సమస్యలు, ఫిర్యాదులను డీఈవో, ఆర్జేడీకి రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. సంబంధిత అధికారుల వద్ద సమస్య పరిష్కారం కాని పక్షంలో అప్పీల్స్ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, ఉన్నతాధికారులను సంప్రదించిన పక్షంలో సీసీఏ నిబంధలన ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. -
21,22 తేదీల్లో వివా వీవీఐటీయూ 2కే25–26
పెదకాకాని: వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో డిసెంబర్ 21, 22 తేదీల్లో జాతీయస్థాయి యువజనోత్సవం వివా వీవీ 2కే25–26 నిర్వహించనున్నట్లు వీవీఐటీ విశ్వవిద్యాలయం ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహిస్తూ వారిలో ఉన్న అపరిమిత సామర్థ్యాలు, అంతర్గతశక్తిని గ్రహించాలని తెలియపరిచే విధంగా యువర్ పొటెన్షియల్ ఈజ్ ఎండ్ లెస్ ద మ్యాజిక్ ఈజ్ ఇన్ యు అనే నినాదంతో యానిమి ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ చైనా నేపథ్యంలో ఈ యువజనోత్సవాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ (శాక్) విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో 93 అంశాలలో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ యువజనోత్సవానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను బుధవారం విద్యార్థులతో కలసి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, ప్రో–చాన్స్లర్ వాసిరెడ్డి మహదేవ్, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి విడుదల చేశారు. -
ఎయిమ్స్లో పరిశోధనలకు పెద్దపీట
మంగళగిరి టౌన్: వైద్య రంగంలో మంగళగిరి ఎయిమ్స్ గణనీయమైన పరిశోధనలు చేపడుతోందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అహంతం శాంతసింగ్ పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్ వైద్యశాలలో బుధవారం అనుసంధాన దివస్–2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నాల్గవ వార్షికోత్సవ పరిశోధన దినోత్సవాన్ని డాక్టర్ అహంతం శాంతసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ గురువారంతో ముగియనుంది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వైద్యవిద్య, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు ప్రధాన అంశాలపై ఎయిమ్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. క్యాన్సర్ వంటి రంగాల్లో పరిశోధనలు చేపడుతోందని, రక్తహీనత, సికెల్ సెల్ వ్యాధి వంటి సాధారణ, సంబంధిత ప్రజా సవాళ్లపై కూడా దృష్టి పెడుతోందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాపులో వివిధ విభాగాల వైద్య విద్యార్థులు పలు అంశాలపై రీసెర్చ్ చేశారని చెప్పారు. ఎయిమ్స్లో పేషెంట్ కేర్, మెడికల్ స్టూడెంట్స్, రీసెర్చ్ యాక్టివిటీ చక్కగా జరుగుతోందని ఇందుకు నాలుగు రోజులుగా జరుగుతున్న వర్క్షాప్ నిదర్శనమన్నారు. మెడికల్, సర్జికల్, డెంటల్, నర్సింగ్ డిపార్ట్మెంట్లతో పాటు ఇతర డిపార్ట్మెంట్లలో 40 సెక్షన్లలో రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అనంతరం పలు కేటగిరీల కింద రీసెర్చ్ చేసిన వారికి బహుమతులు అందించడంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్గనైజ్డ్ చైర్పర్సన్, డీన్ (రీసెర్చ్) డాక్టర్ జాయ్ ఎ.గోషల్, అసోసియేట్ డీన్ (రీసెర్చ్) డాక్టర్ మాధవరావు, అసిస్టెంట్ డీన్ (రీసెర్చ్) ఆర్తి గుప్త, ఆంధ్రప్రదేశ్ మాజీ డీఎంఈ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వైస్ చాన్స్లర్ డాక్టర్ కె. బాబ్జీ, ఏపీఎంసీ అబ్జర్వర్ డాక్టర్ గోపాలన్, శోద్ క్లినికల్ సొల్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోనికా బహల్, నోవార్టిస్కు చెందిన డాక్టర్ అరుణ్భట్తో పాటు పలువురు ప్రతినిధులు, సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈడీ డాక్టర్ అహంతం శాంతసింగ్ -
మనస్తాపంతో మహిళ బలవన్మరణం
కారంచేడు: భర్త కాపురానికి తీసుకెళ్ళడం లేదని, తన బిడ్డ భవిష్యత్తు ఏంటో అని మనస్తాపం చెందిన మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం మండలంలోని ఆదిపూడిలో జరగగా కారంచేడు ఎస్ఐ షేక్ ఖాదర్బాషా కేసు నమోదు చేసి వివరాలు తెలిపారు. ఆదిపూడి గ్రామానికి చెందిన కాల్వ పాండురంగ, కృష్ణవేణి దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు సంతానంగా ఉన్నారు. కుటుంబం అంతా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. కుమార్తె కోకిల (25)ను ఐదు సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన మద్దెల నాగసాయి ప్రవీణ్ కుమార్కు ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి చరణ్కౌశిక్ అనే మూడు సంవత్సరాల బాబు ఉన్నాడు. కాగా 10 నెలల క్రితం భార్య, భర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో నాగసాయి ప్రవీణ్కుమార్ తన భార్య అయిన కోకిలపై చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె తన బిడ్డను తీసుకొని పుట్టింటికి (ఆదిపూడి)కి చేరింది. ఇరువురు ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. ఈ విషయంపై ఆమె కొన్ని రోజులుగా మనోవేదనతో ఉంది. ఈ క్రమంలో బుధవారం తల్లిదండ్రులు, తమ్ముడు పొలం పనులకు వెళ్ళగా బిడ్డను బంధువుల ఇంటి వద్ద ఉంచి ఆమె ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రానికి వారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల తరలించారు. -
క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు
విజయవాడరూరల్: మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. ఈ పోటీలను వికాస్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ సెక్రటరీ, కరస్పాండెంట్ ఎన్.సత్యనారాయణరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీని నున్నలో రెండు మైదానాలు, సూరంపల్లిలో ఒక మైదానంలో లీగ్–కమ్–నాకౌట్ పద్ధతి నిర్వహిస్తారు. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. తూర్పు గోదావరి జిల్లా ప్రకాశంపై 102 పరుగుల భారీ తేడాతో, కృష్ణా జిల్లాపై 35 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. విజయనగరంపై విశాఖపట్నం పది వికెట్ల తేడాతో, కర్నూలుపై గుంటూరు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచాయి. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆతిథ్య కృష్ణా జిల్లా ప్రకాశంపై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు ప్రవేశించింది. కృష్ణా బౌలర్ యశ్వంత్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృష్ణా జిల్లా కార్యదర్శి ఎం.అరుణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి.శ్రీలత, టోర్నీ పరిశీలకుడు డి.భూపాల్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ టి.విజయవర్మ పాల్గొన్నారు. -
ప్రేమ,దయకు ప్రతిరూపమే ఏసుక్రీస్తు
డీఆర్వో జి. గంగాధర్ బాపట్ల టౌన్: ప్రేమ, దయకు ప్రతిరూపమే ఏసుక్రీస్తు డీఆర్వో జి. గంగాధర్ గౌడ్ తెలిపారు. కలెక్టరేట్లో సెమీ క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. తొలుత డీఆర్వో క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ క్రిస్మస్ సంతోషాలు అందరి జీవితాల్లో వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అందరితో సమాధానం కలిగి ఉండాలని చెప్పారు. కుల, మత భేషజాలు మాని సోదరభావంతో కలిసి ఉండాలన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడమే సమానత్వం పాటించడమన్నారు. మంచి మనసుతో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. ఏసుక్రీస్తు మార్గం అనుసరణీయమని కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తెలిపారు. అందరికీ ఆయన ప్రేమను పంచి పెట్టారని, అదే మాదిరిగా భేదాభిప్రాయాలు లేకుండా సమానత్వంతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని జిల్లా సమాచార సంబంధాల శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణ తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
కోర్టు ఉత్తర్వుల అనంతరం ఆక్రమణలపై నిర్ణయం
రేపల్లె ఆర్డీఓ రామలక్ష్మి కొల్లూరు: భూ ఆక్రమణలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై రేపల్లె ఆర్డీఓ ఎన్.రామలక్ష్మి విచారణ నిర్వహించారు. కొల్లూరు కేటీ కాలనీ మార్గంలో ఇరువురు రైతులు బావి పోరంబోకు భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని అందిన అర్జీతోపాటు, అదే ప్రాంతంలో కాలినడక మార్గాన్ని బళ్లగాడుగా విస్తరించడంపై అందిన అర్జీలపై బుధవారం విచారించారు. రెవెన్యు రికార్డులను పరిశీలించిన ఆర్డీఓ రికార్డుల ప్రకారం కాలినడక మార్గమే ఉందని మిగిలిన భూమి బోధి కాలువ కింద చూపిస్తుందన్నారు. అయితే ఇరు భూ సమస్యలపై కోర్టులో కేసు నడుస్తున్నందున కోర్టు తీర్పు అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆమె కొల్లూరు గౌడపాలెంలో గతంలో బహిరంగ మల విసర్జనకు వినియోగించిన స్థలాన్ని ప్రభుత్వ పెట్రోల్ బంక్కు కేటాయించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఆమె వెంట కొల్లూరు తహసీల్దార్ బి.వెంకటేశ్వర్లు, మండల సర్వేయర్ హర్షవర్ధన్, వీఆర్ఓలు ఉన్నారు. రైల్వే క్రికెట్ జట్టుకు మార్గదర్శిగా సీనియర్ డీసీఎం ప్రదీప్ లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): భారతీయ రైల్వే సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు మార్గదర్శిగా ఐఆర్సీటీసీ అధికారి, గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం డాక్టర్ ప్రదీప్ చిలుకను బుధవారం రైల్వే స్పోర్ట్ ప్రమోషన్స్ బోర్డు నియమించారు. ఈ నియామకం విజయ్ హజారే ట్రోఫీ 2025లో భారతీయ రైల్వే క్రికెట్ జట్టు పాల్గొనే కాలాన్ని కవర్ చేస్తుంది. డిసెంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు బెంగళూరులోని రైల్ వీల్ స్పోర్ట్స్ అసోసియేషన్లో నిర్వహించనున్న ఫ్రీ పార్టిసిపేషన్ కోచింగ్ క్యాంప్ను పర్యవేక్షిస్తారు. అనంతరం బెంగళూరులోనే జరగనున్న లీగ్ దశ పోటీల్లో జట్టుకు మార్గదర్శకం వహిస్తారు. ఈ టోర్నమెంట్ జనవరి 2026తో ముగియనుంది. ప్రదీప్కుమార్ను అధికారులు అభినందిచారు. సావిత్రి భాయి పూలే అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం నెహ్రూనగర్: సావిత్రి భాయి పూలే అవార్డు –2026 ప్రదానం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.శ్రీనివాసులు బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సావిత్రి భాయ్ పూలే 95వ జయంతి సందర్భంగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా, నగర శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న బీసీ మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయుల, వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని ఈ అవార్డు కోసం ఈ నెల 25వ తేదీలోగా 8985618861, 9440536495 వాట్సాప్ నంబర్లకు బయోడేటా పంపాలని సూచించారు. ఆటో బోల్తా .. ఒకరి మృతి నలుగురికి స్వల్ప గాయాలు మాచవరం: అతివేగంగా వెళుతున్న ఆటో బోల్తా కొట్టడంతో ఒకరు మృతి చెందగా, నలుగురికి స్వల్ప గాయాలైన ఘటన మండలంలోని గంగిరెడ్డిపాలెం గ్రామం వద్ద చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం పిడుగురాళ్ల మండలం కొత్త వెల్లంపల్లి గ్రామానికి చెందిన కొందరు కూలి పనులు నిమిత్తం మండలంలోని వేమవరం గ్రామానికి ఆటోలో బయలుదేరారు. గంగిరెడ్డిపాలెం గ్రామ సమీపానికి రాగానే ఆటో అతివేగంగా ప్రయాణిస్తూ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న చెడపొంగు గురవయ్య (65) కు తీవ్ర గాయాలుగా హాస్పిటల్ కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలు కాగా మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ప్రథమ చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్కు నిహాల్ ఎంపిక గుంటూరు ఎడ్యుకేషన్: మణిపూర్లో జనవరి 4వ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ చాంపియన్షిప్నకు శ్రీచైతన్య జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ బైపీసీ విద్యార్థి దానియేలు నిహాల్ ఎంపికై నట్లు విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. బుధవారం లక్ష్మీపురంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడారంగంలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైస్కూల్లో జరిగిన అండర్–19 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని సాధించిన తమ విద్యార్థి దానియేలు నిహాల్ జాతీయస్థాయికి అర్హత సాధించాడని తెలిపారు. ఈసందర్భంగా నిహాల్ను అభినందించారు. -
పంతుళ్లపై పరాయి పెత్తనం
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు రకాల యాప్లతో ఉపాధ్యాయులు తలమునకలై ఉండగా, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం కొత్తగా పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత కోసం వంద రోజుల ప్రణాళికను రూపొందించింది. దీని పర్యవేక్షణకు ప్రతి ఉన్నత పాఠశాలకు ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఒక గెజిటెడ్ అధికారిని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడం విద్యాశాఖ అధికారులకు మింగుడు పడటం లేదు. ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతుల నిర్వహణ, స్లిప్ టెస్ట్, మార్కుల నమోదు, హాజరు నమోదు తదితర అంశాలన్నీంటినీ ఇన్చార్జులు పర్యవేక్షించనున్నారు. జిల్లా పరిధిలో ప్రభుత్వ యాజమాన్యంలోని 273 పాఠశాలల్లో మొత్తం 14,956 మంది పదవ తరగతి విద్యార్థులున్నారు. ఇన్చార్జులుగా ఇతర శాఖల అధికారులు పదవ తరగతి పరీక్షల ప్రణాళికను పర్యవేక్షణకు రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, వైద్య, వ్యవసాయ, ఇరిగేషన్, మున్సిపల్, హౌసింగ్ తదితర శాఖలకు చెందిన అధికారులను ఇన్చార్జులుగా నియమిస్తున్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక ఇన్చార్జి ఉంటారు. అధికారులు తగిన సంఖ్యలో లేనట్లయితే ఒకరికే రెండు, మూడు పాఠశాలలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో అధికారుల నియామకం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. టీచర్ల ఆగ్రహం విద్యాశాఖలో ఇతర శాఖల అధికారుల పర్యవేక్షణపై ఉపాధ్యాయుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమ నిరసనను ఆయా జిల్లాల విద్యాశాఖాధికారుల ఎదుట వ్యక్తపరుస్తున్నారు. ప్రతి జిల్లాలో జిల్లా విద్యాశాఖాధికారితో పాటు డెప్యూటీ డీఈఓలు, ప్రతి మండలంలో ఇద్దరేసి చొప్పున ఎంఈఓలు ఉన్నారు. వీరితో పాటు ప్రతి ఉన్నత పాఠశాలలో అనుభవజ్ఞులైన ప్రధానోపాధ్యాయులు, సీనియర్ సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరూ ఉండగా ఇతర శాఖల నుంచి అధికారులను ఇన్చార్జులుగా నియమించాల్సిన అవసరమేంటని ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇన్చార్జుల నియామకం తమను అవమానించటమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సామర్ధ్యం, సిలబస్ వంటి అంశాలలో వారికున్న అనుభవం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పది ఫలితాలలో ఏవైనా తేడాలు వస్తే ఇన్చార్జులు బాధ్యత తీసుకుంటారా ? అని ప్రశ్నిస్తున్నారు. పర్యవేక్షణ పేరుతో ఇతర శాఖల అధికారులను విద్యాశాఖపై పెత్తనానికి నియమించటం గర్హనీయం. ఇది ఉపాధ్యాయులలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. 100 రోజుల ప్రణాళికతో ఇప్పటికే ఉపాధ్యాయులపై భారం మోపారు. మళ్లీ ఇప్పుడు ఇన్చార్జులను నియమించి ఉపాధ్యాయుల స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. – ఎం.మోహనరావు, ప్రధాన కార్యదర్శి, యుటీఎఫ్, పల్నాడు జిల్లా. పదవ తరగతి పరీక్షల్లో నూరుశాతం ఫలితాల కోసం చేపట్టిన నూరు రోజుల ప్రణాళికను పర్యవేక్షించేందుకు ప్రతి పాఠశాలకు ఒక గెజిటెడ్ అధికారి నియామకం పూర్తయింది. సదరు అధికారి ఆయా పాఠశాలను ప్రతి వారంలో తనకు వీలున్నప్పుడు పాఠశాలను సందర్శించి విద్యార్థి సామర్థ్యం, ఇతర ప్రణాళిక అంశాలను పరిశీలిస్తారు. జిల్లాలోని 273 ప్రభుత్వ పాఠశాలలకు 273 మంది అధికారులను నియమించాం. – పీవీజే రామారావు, డీఈఓ, పల్నాడు జిల్లా -
పూర్వ విద్యార్థుల రజతోత్సవ వేడుకల పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ వేడుకల పోస్టర్ను బుధవారం వీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1996–2000 సంవత్సరాల మధ్య విద్యనభ్యసించిన విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు. వేడుకలు విజయవంతం కావడానికి అన్ని సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేసీహెచ్ కావ్య, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, ప్రో వీసీలు డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్రామ్, డాక్టర్ కె.రాజశేఖరరావు ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రిన్సిపల్ ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆలయ ఎగువ దిగువ సన్నిధులు, శ్రీ గండాలయస్వామి పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ను నిషేధించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ తెలి పారు. ఈ మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బ్యానర్లను ఏర్పాటు చేశారు. కొండపై గల శ్రీ గండాలయస్వామి వారిని దర్శించి దీపం పెట్టే భక్తులు వారి వెంట తీసుకువచ్చే ప్లాస్టిక బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు తిరిగి వారితోపాటే తీసుకువెళ్లాలని సూచించారు. భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను కొండపై వదిలి వెళ్లరాదని ఆయన కోరారు. దేవాలయ పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పేర్కొన్నారు. కారంచేడు: బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన 103 సంవత్సరాల శతాధిక వృద్ధుడు బుధవారం మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన మృతితో గ్రామంలోని పాలేటి వారి బజారులో విషాదఛాయలు అలముకున్నాయి. మండల కేంద్రమైన కారంచేడు గ్రామానికి చెందిన పాలేటి సుబ్బారావు (103)కు 92 సంవత్సరాల భార్య లక్ష్మమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మనవలు, మనవరాళ్లు, ముదిమనవలతో కలిపి సుమారు 20 మందికి పైగా సంతానం ఉన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన సుబ్బారావు అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ సమాచార ప్రసార కేంద్రం నేతృత్వంలో నూనె గింజల పంటల్లో కలుపు యాజమాన్యంపై పుస్తకాల విడుదల కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మి దేవి మాట్లాడుతూ రైతులు క్షేత్రస్థాయిలో చీడపీడలను గుర్తించి, సరైన యాజమాన్య చర్యలు చేపట్టేటట్లు సరళంగా, పుస్తకాలను రూపొందించినట్లు తెలిపారు. వీఆటి రూపకల్పనలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను ఆమె అభినందించారు. రైతులు ఈ పుస్తకాలను సద్వినియోగించుకుని మంచి దిగుబడులు సాధించాలని శారదజయలక్ష్మి దేవి కోరారు. -
పగలు రెక్కీ.. రాత్రిళ్లు చోరీ
నరసరావుపేట టౌన్: పగలు దుప్పట్లు విక్రయిస్తూ రెక్కీ నిర్వహించి తాళ్లాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు నరసరావుపేట ఇన్చార్జి డీఎస్పీ ఎం.హనుమంతరావు తెలిపారు. మంగళవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన బైరా సుజాత గృహంలో దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోని 21 సెవర్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, వాచీలు, రూ.లక్ష నగదును ఈ ఏడాది నవంబర్ 28న దోచుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి చిలకలూరిపేట పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా గుర్రాలచావిడి, పాత బాలాజీ సినిమా హాల్ దగ్గర సోమవారం సంచరిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో పైనేరాన్ని వారే చేసినట్లుగా అంగీకరించారన్నారు. నిందితులు నూర్ హసన్, నొసద్, మిన్నా యామిన్, అబ్దుల్ గప్పార్, సాహుల్ జబ్బార్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 1,25,800 విలువైన చోరీ సొత్తును, దొంగతనానికి ఉపయోగించిన పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన అనంతరం మిగిలిన సొత్తు రికవరీ కోసం పోలీస్ కస్టడీ కోరతామన్నారు. ఈ దొంగల ముఠాపై హర్యానా, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, బీహార్, ఒడిశాలతోపాటు ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాలో కేసులు నమోదై ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో ముఖ్యపాత్ర వహించిన చిలకలూరిపేట అర్బన్ సీఐ పి.రమేష్ , ఎస్ఐ హజరత్తయ్య, సిబ్బంది వై.శ్రీనివాస్, ఎస్.వణుకుమార్, వి.హరీష్, కె. శ్రీరాములు, వి.నారాయణరావు, జి.జాన్బాబు, కె.శివకృష్ణ, షేక్ జాన్బాషా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
విజయకీలాద్రిపై ధనుర్మాస వేడుకలు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ధనుర్మాస వేడుకలను మంగళవారం నుంచి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో ధనుర్మాస వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఉదయం గోదా అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన, మంగళాశాసనం నిర్వహించారు. అనంతరం 1వ పాశుర విన్నపం, తీర్థ ప్రసాద వితరణ జరిగాయి. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదా అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయంలో... పొన్నూరు: పట్టణంలోని స్వయంభూ శ్రీ సాక్షి భావనారాయణస్వామి, కాశీ విశ్వేశ్వరస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దేవాలయం అర్చకులు గోవర్ధనం రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగ్నిక స్వామి వేదాంతం అనంత శ్రీనివాస భట్టాచార్యులు, తిరుప్పావై ప్రవచకులు తిరువాయిపాటి గోవర్ధనాచార్యులు పాల్గొన్నారు. భక్తులు గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. వాజ్పేయి విగ్రహానికి రూ.8 లక్షలు విరాళం గుంటూరుమెడికల్: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్బిహారీ వాజ్పేయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి గుంటూరులో సోమ వారం శంకుస్థాపన జరిగింది. గుంటూరు లక్ష్మీపురం నాలుగు రోడ్ల కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహ ప్రతిష్టకు గుంటూరుకు చెందిన పారిశ్రామికవేత్త మాదల రత్నగిరిబాబు రూ.8 లక్షలు విగ్రహ నిర్మాణ కమిటీకి మంగళవారం అందజేశారు. వైభవంగా స్వామి వారి ఆరాధన మహోత్సవం నగరంపాలెం(గుంటూరువెస్ట్):గుంటూరులోని శ్రీకంచి కామకోటి పీఠ శ్రీమారుతీ దేవాలయ ప్రాంగణంలో శ్రీకంచి కామ కోటి పీఠం 68వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి 32వ ఆరాధన మహోత్సవాన్ని మంగళవారం అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమాలను కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ పర్యవేక్షించారు. శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి విశేష పూజలు తెనాలి: నాజరుపేటలోని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠపాలిత శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి విశేష కార్యక్రమాలు జరిపారు. స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష అలంకరణ చేశారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం చేశారు. అప్పికట్ల వెంకటేశ్వరరావు సిద్ధాంతి ప్రవచనం చెప్పారు. 30న ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 5.45 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం నిర్వహిస్తారు. -
విద్యుత్ను పొదుపుగా వాడండి
బాపట్ల: విద్యుత్ పొదుపుగా వాడి భావితరాలకు వెలుగులు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ ప్రజలకు సూచించారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని మంగళవారం స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యుత్ శాఖ రూపొందించిన వాల్పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ ఇంధనాన్ని పొదుపుగా వాడాలన్నారు. విద్యుత్ను దుర్వినియోగం చేస్తే భావితరాలకు అంధకారం మిగులుతుందని చెప్పారు. సౌర విద్యుత్ వినియోగంపై ప్రజలను చైతన్య పర్చాలన్నారు. విద్యుత్ ఎలా పొదుపు చేయాలనే అంశంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యుత్ శాఖ ఉద్యోగులు నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు, నినాదాలతో ప్రదర్శన పట్టణంలో సాగింది. కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఆంజనేయులు, ఈఈ పీవీఆర్ మల్లికార్జునరావు, ఈఈ జి.భాస్కరరావు, ఈఈ పి.హుస్సేన్ ఖాన్, ఏఓ పి.శ్రీనివాసరెడ్డి, డీఈ టి.శ్రీనివాసరావు, ఇంజినీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
డే నైట్..రైట్ రైట్
జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తరలింపు సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం జనవరి నుంచి ఇసుక అమ్మకాలను ప్రైవేటు కంపెనీకి అప్పగించనుందన్న సమాచారంతో టీడీపీ నేతలు బరి తెగించారు. ఇసుకను రేయింబవళ్లు తరలించి అమ్ముకుంటున్నారు. చీరాల, బాపట్ల, వేమూరు, రేపల్లె ప్రాంతాల్లో అక్రమంగా తరలించి అమ్ముకుంటుండగా, కొందరు టీడీపీ నేతలు కప్పం వసూలు చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో టీడీపీ నేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తితోపాటు పోలీసు ఉద్యోగానికి సెలవు పెట్టిన మరోవ్యక్తి కలిసి అక్రమంగా అమ్ముకుంటున్నారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున తవ్వి తరలిస్తున్నారు. చీరాల ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులకు ఇందులో వాటాలున్నట్లు వినిపిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి వందలాది ట్రాక్టర్లు, టిప్పర్లతో రేయింబవళ్లు తరలించి అమ్ముకుంటున్నారు. బచ్చులవారిపాలెం, ఊటుకూరు సుబ్బయ్యపాలెం మధ్యనున్న ఇసుక దిబ్బల నుంచేకాక చల్లారెడ్డిపాలెం, దేశాయిపేట, చీరాల రూరల్ పరిధిలోని పలుగ్రామాల పరిధిలో తవ్వి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను వదలడం లేదు. ఇసుక నేలలు ఉన్న రైతుల నుంచి ట్రాక్టర్ రూ.350లకు కొని రూ.4 వేల వరకు అమ్ముతుండగా ట్రిప్పర్ 12 నుంచి 15 వేల వరకు విక్రయిస్తూ, చీరాల, వేటపాలెం, బాపట్ల ప్రాంతాల్లో రియల్ వెంచర్లు, గృహ పునాదులకు తరలిస్తున్నారు. సొంత పొలంలో అవసరానికి ఇసుక తరలించినా దందా నిర్వాహకుల ఆదేశాలతో పోలీసులు కేసులు రాస్తున్నారు. ఇక దందా నిర్వాహకులు రేయింబవళ్లు తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతకు కప్పం, మైనింగ్ అధికారులకు నెల మామూళ్లు చెల్లిస్తున్నట్లు ప్రచారం ఉంది. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం ప్రాంతాల నుంచి, కొల్లూరులో కృష్ణా నది నుంచి తరలిస్తున్నా పోలీసులు, అధికారులు స్పందించడం లేదు. రాత్రి వేళ ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలింపు -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజాగ్రహం
బాపట్ల: రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయానికి ప్రజాగ్రహానికి సోమవారం చేపట్టిన నిరసన ప్రదర్శనే నిదర్శనమని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కోన రఘుపతి మాట్లాడారు. చంద్రబాబునాయుడు సర్కారుపై ప్రజలలో ఏవిధమైన అసంతృప్తి ఉందో నిరసన ప్రదర్శనే చెబుతుందన్నారు. పేదల వైద్యం గురించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించి మెడికల్ కళాశాలలను ప్రభుత్వ నిర్వహణలో ఉండే విధంగా నిర్ణయం తీసుకుంటే చంద్రబాబునాయుడు ఏకంగా ప్రైవేటుపరం చేసేందుకు పీపీపీ విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా సంతకాలు సేకరణకు వెళ్లినప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత కనిపించిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వ నిర్వహణలోనే ఉంచాలని చేపట్టిన ప్రతి కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మెడికల్ కళాశాలలో పులివెందుల, పాడేరు కళాశాలలకు ఒక్కొక్కచోట 50 మెడికల్ సీట్లు వస్తే వాటిని తిరిగి వెనక్కి పంపిన చరిత్రహీనుడు చంద్రబాబునాయుడు అన్నారు. మెడికల్ కళాశాలల విషయంలో వెనక్కి తగ్గకపోతే కోర్టు తలుపు తట్టేందుకు వెనుకాడేది లేదని చెప్పారు. ఇండిగో సంక్షోభంలో రామోహన్నాయుడు, లోకేష్ ప్రమేయం ఉందని, వాటిని దాటవేసేందుకు ఆ పార్టీ తలమునకలై ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ప్రధాని పీవీ గుర్తుకురాలేదా? మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు హడావుడి చేసిన నాయకులకు మన రాష్ట్రానికి చెందిన తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు గుర్తుకు రాకపోవటం బాధాకరమన్నారు. బాపట్ల పట్టణంలో నిలిచిపోయిన గుర్రం జాషువా, పొట్టి శ్రీరాములు, కోన ప్రభాకరరావు, ఎన్జీఆర్ విగ్రహాల గురించి పట్టించుకోని అధికార యంత్రాంగం ఆఘమేఘాలపై వాజ్పేయి విగ్రహానికి అనుమతి ఏవిధంగా ఇచ్చారు..ఇవ్వకపోతే నిర్మా ణం జరుగుతుంటే ఏమి చేశారని ప్రశ్నించారు. వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేసిన స్థలం జాతీయ రహదారి నిర్మాణంలో మిగిలిన సొసైటీ భూములని కోన గుర్తు చేశారు. ఈ విషయంపై సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు మరుప్రోలు ఏడుకొండల రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, ఇనగలూరి మాల్యాద్రి, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, చల్లా రామయ్య, జోగి రాజా, అడే చందు, మోర్ల సముద్రాలగౌడ్, రెడ్డింకయ్య, మచ్చా శ్రీనివాసరెడ్డి, అనిల్కుమార్ పాల్గొన్నారు. -
విద్యార్థుల శ్రేయస్సును విస్మరిస్తే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తప్పవు
గుంటూరు ఎడ్యుకేషన్ : విద్యార్థుల శ్రేయస్సుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో షేక్ సలీమ్ బాషా హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ విద్యార్థులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురి చేయరాదని స్పష్టం చేశారు. వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు అనైతిక అడ్మిషన్లకు పాల్పడుతున్నాయని, ఒక పాఠశాలలో విద్యార్థులను మరొక పాఠశాలలో చేర్చుకుని, ఫీజుల విషయంలో వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ విధమైన చర్యలతో విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడటంతోపాటు తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటోందన్నారు. ఇటువంటి అనైతిక చర్యలకు ఎవరూ పాల్పడవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం రూపొందించిన విధి, విధానాల ప్రకారం పాఠశాలలు నిర్వహించాల్సిందేనని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష ఫీజులు వసూలు చేయడం తగదని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో తెనాలి డీవైఈవో శాంతకుమారి, గుంటూరు తూర్పు ఎంఈవో నాగేంద్రమ్మ, డీసీఈబీ కార్యదర్శి ఏ. తిరుమలేష్, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. వలస కుటుంబాల్లోని పిల్లలకు విద్య నేర్పించాలి గుంటూరు ఎడ్యుకేషన్: వలస కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందించడాన్ని సామాజిక బాధ్యతగా గుర్తించాలని జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో గుంటూరులోని మిర్చియార్డు పరిసర ప్రాంతాల్లో బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన పిల్లలకు విద్యనందిస్తున్న వలంటీర్లు, కేర్ టేకర్లకు కెపాసిటీ బిల్డింగ్. కార్యక్రమాన్ని మంగళవారం సాంబశివపేటలోని సెయింట్ జోసఫ్ బీఈడీ కళాశాలలో ప్రారంభించారు. ● ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈవో సలీమ్ బాషా మాట్లాడుతూ ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాల్లోని పిల్లలకు విద్యను అందించడం మన బాధ్యత అని అన్నారు. ● ఉపాధి కోసం వలస వచ్చిన కుటుంబాల్లో బిహార్ వాసులు అత్యధికంగా ఉన్నారని, వారి పిల్లలకు లెర్నింగ్ సపోర్ట్ ఇచ్చే విషయమై బిహార్ నుంచి ప్రథమ్ ఎన్జీవో టీం ప్రత్యేకంగా వచ్చారని, సంబంధిత ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రథమ్ టీంతో సమన్వయం చేసుకుని మూడు రోజులపాటు కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ● బిహార్తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లలకు, ఇక్కడి పిల్లల స్వభావంతో భిన్నంగా ఉన్నాయని, ప్రధానంగా భాషకు సంబంధించిన సమస్య ఉత్పన్నమవుతోంద్నారు. ● గుంటూరు జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ ఐ.పద్మావతి మాట్లాడుతూ ఎన్సీపీసీఆర్ గైడెన్స్, సమగ్రశిక్ష ఎస్పీడీ ఆదేశాల మేరకు గత సెప్టెంబర్లో నిర్వహించిన సర్వే ద్వారా వలస కుటుంబాల్లోని 2,196 మంది పిల్లల వివరాలు సేకరించామని, వారికి విద్యను కొనసాగించేందుకు అవసరమైన లెర్నింగ్ సపోర్ట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ్ టీం కంటెంట్ ప్రతినిధి లీలా పద్మావతి, బిహార్ ప్రథమ్ టీం ప్రతినిధి దీనానాద్ కుమార్ సిన్హా, గుంటూరు ఈస్ట్ ఎంఈవో ఎస్ఎంఎం అబ్దుల్ ఖుద్దూస్ పాల్గొన్నారు. గుంటూరు డీఈఓ సలీమ్ బాషా -
పీఎఫ్ రుణాలపై ఆడిట్ అభ్యంతరాలు తొలగించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: అత్యవసర ఖర్చుల కోసం ఉపాధ్యాయులు దాఖలు చేస్తున్న పీఎఫ్ రుణాల దరఖాస్తులను అసంబద్ధమైన ఆడిట్ అభ్యంతరాలతో తిరస్కరించడం మానుకోవాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.బసవ లింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమను గుంటూరులోని ఆడిట్ కార్యాలయంలో కలిసిన ఏపీటీఎఫ్ బృందం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. – బసవ లింగరావు మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని జెడ్పీ పాఠశాలల్లో వివిధ కేడర్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల అవసరాలకు ఉపయోగపడతాయని నెల నెలా పీఎఫ్లో దాచుకున్న సొమ్ము అనారోగ్య పరిస్థితుల్లో వైద్య చికిత్సల కోసం దాఖలు చేసుకున్న రుణ దరఖాస్తుల్లో రూ.ఐదు లక్షలు దాటితే అసిస్టెంట్ సివిల్ సర్జన్, మెడికల్ సర్టిఫికెట్ తేవాలని లేదంటే పీఎఫ్ దరఖాస్తును తిరస్కరిస్తున్నారని అన్నారు. ● పీఎఫ్ రుణాల మంజూరులో అర్థం లేని నిబంధనలు విధించడం తగదని, లేని నిబంధనలు చూపి దరఖాస్తులను ఏ విధంగా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ఆడిట్ కార్యాలయం నుంచి లేవనెత్తుతున్న అభ్యంతరాలు పూర్తిగా విరుద్ధమన్నారు. ● ఎన్జీవోలకు వర్తించే నిబంధనలను ఉపాధ్యాయులకు అన్వయించడం సహేతుకం కాదని, కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి అయినా సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుందన్నారు. ● పీఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళనలో ఉపాధ్యాయులు ఉన్న పరిస్థితుల్లో జెడ్పీ పీఎఫ్ విభాగం, జిల్లా ఆడిట్ కార్యాలయం ఒకరిపై ఒకరు చెప్పుకుని రుణ దరఖాస్తులను కొర్రీలు వేస్తూ, కాలయాపనతో ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ● ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ పీఎఫ్ రుణాలపై జెడ్పీ కార్యాలయ సిబ్బంది వ్యవహరిస్తున్న అసంబద్ధ విధానాలపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ● రుణానికి దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులతో పాటు, ఉద్యోగ విరమణ అనంతర తుది చెల్లింపులకు ఉపాధ్యాయులకు ఫోన్ చేసి వ్యక్తిగతంగా కలవాలని చెబుతున్నారని, ఈ విధంగా ప్రవర్తించడ సరికాదన్నారు. ● జిల్లా ఆడిట్ అధికారి బి.మధురిమ స్పందిస్తూ ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆడిట్ అధికారిని కలసిన వారిలో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, జి.దాస్, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ యూ.వందనం, జిల్లా కౌన్సిలర్లు సయ్యద్ జహంగీర్, కృష్ణారావు, గురుమూర్తి, అప్పారావు, తదితరులు ఉన్నారు. ఏపీటీఎఫ్ డిమాండ్ -
ఇంటర్ పరీక్షల మార్పులకు సన్నద్ధం కావాలి
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఇంటర్మీడియెట్ బోర్డు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సైమన్ విక్టర్ తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో భాగంగా ఫిబ్రవరి 23 నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో పల్నాడుజిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, పరీక్ష నిర్వహణ అధికారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సైమన్ విక్టర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణకు పాత విధానాన్నే అమలు చేస్తుండగా, ప్రథమ సంవత్సరం పరీక్షల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రథమ సంవత్సరం సిలబస్లో భారీ మార్పులు జరిగాయనీ, అందుకు అనుగుణంగా పరీక్షా విధానంలోనూ మార్పులు చేసినట్టు పేర్కొన్నారు. ఈసందర్భంగా ప్రశ్నల సరళి, మార్కుల కేటాయింపు, అన్సర్ బుక్లెట్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. బోటనీ, జువాలజీ పేపర్లు వేర్వేరుగా ఉంటాయని తెలిపారు. వీటి ప్రశ్నాపత్రం 43, 42 మార్కులకు కేటాయించగా ద్వితీయ సంవత్సరంలో 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉంటాయని, రెండు సంవత్సరాలకు కలిపి 200 మార్కులకు పరీక్ష ఉంటుందని వివరించారు. మార్పులను గుర్తించి అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మార్పులను విద్యార్థులకు వివరించి వారిని సన్నద్ధం చేయాలని తెలిపారు. పరీక్షల స్పెషల్ ఆఫీసర్ వి.వి.సుబ్బారావు, రమేష్, ఆర్జేడి జె.పద్మా, జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు టి.ప్రభాకర్, కె.వేణు, ఎస్ఎస్ అండ్ ఎన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పి.శ్రీనివాససాయి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణాధికారి సైమన్ విక్టర్ జూనియర్ ఇంటర్ పరీక్ష మార్పులపై అవగాహన సమావేశం -
డబ్బులు ఇస్తేనే లోను ఇస్తారంట!
జె.పంగులూరు: ఉన్నతి రుణాలు అందరికీ సక్రమంగా రాయడం లేదని.. ఏ రుణం తీసుకోవాలన్నా.. డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని డ్వాక్రా మహిళలు వాపోయారు. డ్వాక్రా మహిళల స్థితిగతులు తెలుసుకోవాడానికి వచ్చిన బాంకు లింకేజీ అడిషనల్ డైరెక్టర్ రమ ముందు చందలూరు దళిత కాలనీ డ్వాక్రా మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మంగళవారం సాయంత్రం చందలూరులో వారితో భేటీ అయిన అడిషనల్ డైరెక్టర్ రమ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి, వారి జీవనోపాధిలో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అయితే సభ్యులకు పుస్తకాలు రాసినందుకు గాని, లోన్లు మంజూరు చేయించినందుకు గానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. డ్వాక్రా మహిళల డబ్బులతోనే సీ్త్రనిధి బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీఎం పి. కోటేశ్వరరావు, చందలూరు క్లస్టర్ సీసీ చంద్రశేఖర్, వీవోఏలు పాల్గొన్నారు. కార్టూనిస్ట్ సుభానీకి ‘బాపు’ అవార్డు కారంచేడు: ప్రముఖ కార్టూనిస్ట్గా, అనతికాలంలోనే కార్టూన్ ఎడిటర్గా అంచలంచలుగా ఎదిగిన పొలిటికల్ కార్టూనిస్ట్ షేక్ సుభానీకి ‘బాపు అవార్డు’ దక్కింది. కారంచేడు గ్రామానికి చెందిన సుభానీ షేక్ గత 40 సంవత్సరాలుగా హైదరాబాద్లోని డెక్కన్ క్రానికల్ దినపత్రికలో కార్టూనిస్ట్గా పనిచేశారు. కార్టూన్ ఎడిటర్గా.. ఎన్నో పొలిటికల్ కార్టూలను వేసి అనేక మంది మన్ననలు పొందారు. 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఆయన అనేక అవార్డులు తీసుకున్నారు. దీంతో హైదరాబాద్లోని బాపు–రమణ అకాడమీ వారు గుర్తించి సుభానీకి బాపు అవార్డును అందించారు. నాంపల్లి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కవి, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకు రమణ అవార్డు, సినీ నటుడు మురళీమోహన్కు జీవన సాఫల్య పురస్కారం అందించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
తెనాలి రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని బైక్పై వెళుతున్న ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం తెనాలి నుంచి నందివెలుగు మీదుగా ఆర్టీసీ బస్సు గుంటూరు వెళుతుండగా కాజీపేట ఏ–వన్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓ సైకిల్, బైక్ ఢీకొని దానిపై ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై పడ్డారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డుపై పడిన వారిని తప్పించబోయి ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టాడు. బైక్ పై ప్రయాణిస్తున్న కొలకలూరు బాపయ్యపేటకు చెందిన పురంశెట్టి రామకృష్ణ, నీలి శ్రీనివాసరావు గాయపడ్డారు. ఇరువురిని స్థానికులు తెనాలి వైద్యశాలకు తరలించారు. రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా వైద్యశాలలో నాలుగు స్క్రబ్ టైఫస్ అనుమానిత కేసులు తెనాలి అర్బన్: జిల్లాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తెనాలి జిల్లా వైద్యశాలలో ఇప్పటికే 10 మంది చికిత్స పొందారు.మరి కొందరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పొన్నూరుకు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు వైద్యులు తెలిపారు. మంగళవారం మరో నలుగురు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో చేరినట్లు చెప్పారు. వీరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశామని, బుధవారం రిపోర్టులు వచ్చే అవకాశం ఉందన్నారు. బాలుడు బలవన్మరణం మార్టూరు: ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మార్టూరులో మంగళవారం ఉదయం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. స్థానిక విద్యానగర్ కాలనీకి చెందిన దేసు ప్రసన్నకుమార్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు భద్రి ( 14) సంతానం. భద్రి స్థానిక ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. క్లాసులో మెరిట్ స్టూడెంట్గా ఉండే భద్రి.. ఇటీవల తన అమ్మమ్మ మృతి చెందినప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ స్కూల్కు సరిగా వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఉదయం 7:30 గంటల సమయంలో భద్రి తన తాతయ్యకు టీ పెట్టి ఇచ్చి.. ఇంట్లోకి వెళ్లి తిరిగి బయటికి రాలేదు. మనుమడు ఎంతకూ బయటకు రాకపోవడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా.. సీలింగ్ ఫ్యాన్కు తల్లి చీరతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. కేకలు వేస్తూ స్థానికులను అప్రమత్తం చేయగా వారు కింద దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎప్పుడూ చదువులో ముందుందే భద్రి అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. మనస్తాపంతో లారీ డ్రైవర్...బల్లికురవ: మనస్తాపంతో ఓ లారీ డ్రైవర్ మద్యంలో గడ్డి నివారణకు వాడే పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 65 గంటలపాటు మృత్యువుతో పోరాడి మంగళవారం ఉదయం చనిపోయాడు. అందిన సమాచారం ప్రకారం మండలంలోని వైదన గ్రామానికి చెందిన శాయిని వేణుగోపాల్ (52) లారీ డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఈయనకు భార్య రామాంజమ్మ ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. ఎస్సై వై. నాగరాజు కేసు నమోదుతో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
పోలీస్ ఉద్యోగం అంటేనే సేవ
బాపట్ల టౌన్: పోలీస్ ఉద్యోగం అంటేనే సేవ అని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎన్నికై న 191 మందికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పరేడ్ నిర్వహించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు మొత్తం 5,757 మంది ఎంపిక కాగా, వారిలో బాపట్ల జిల్లా నుంచి 191 మంది ఉన్నారన్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించే అంకితభావంతో కూడిన సేవ అని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆలోచనా ధోరణిని మార్చుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, ఎస్బీ సీఐ జి.నారాయణ, అడ్మిన్ ఆర్ఐ షేక్ మౌలుద్దీన్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ -
చలపతి ఫార్మసీలో ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాం నందున్న చలపతి ఫార్మసీ కళాశాలలో అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ ఫార్మసీ (ఏబీఏపీ) సహకారంతో నిర్వహిస్తున్న ఏబీఏపీ 19వ వార్షిక మహాసభ అంతర్జాతీయ సదస్సు (గ్లోబల్ కాన్ఫరెన్స్) మంగళవారం ప్రారంభమైంది. స్థిరమైన అభివృద్ధి కోసం హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ బయో మెడికల్ సైన్సెస్తో సాంకేతికత సమన్వయం అనే ప్రధాన అంశంతో మూడు రోజులపాటు ఈ సదస్సు జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ నాదెండ్ల రామారావు తెలిపారు. కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ శాస్త్రవేత్తలు, అకడమిషీయన్లు, పరిశ్రమ నిపుణులు, పరిశోధకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే అరుదైన అవకాశాన్ని కల్పించిందని ఆయన తెలిపారు. కార్యక్రమానికి చలపతి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వైవి ఆంజనేయులు, సెక్రటరీ వై. సుజిత్కుమార్లు అధ్యక్షత వహించారు. ఏబీఏపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె.ఆర్.ఎస్.సాంబశివరావు కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు. ● ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, చైర్మన్ ప్రొఫెసర్ కె. మధుమూర్తి మాట్లాడుతూ ఉన్నతవిద్య, పరిశోధన నాణ్యత, పరిశ్రమ అకాడమీ అనుసంధానం వంటి అంశాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ● ఏఎన్యూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.గంగాధరరావు మాట్లాడుతూ గ్లోబల్ స్థాయిలో జరుగుతున్న పరిశోధనాధోరణులు, వైద్య శాస్త్రాల్లో సాంకేతికతపై విలువైన అవగాహన కల్పించారు. ● యూనివర్సిటీ ఆఫ్ అలబామా, ట్రాన్స్లేషనల్ సైన్స్ మెడిసిన్ విభాగం డాక్టర్ ఎం.ఎన్.వి.రవికుమార్ మాట్లాడుతూ ప్రయోగశాల స్థాయి పరిశోధనలు, వైద్య ఆవిష్కరణలుగా సమాజానికి ఉపయోగపడే విధానాన్ని వివరించారు. ● ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ నేసె శ్రీనివాసులు వ్యవసాయ పరిశోధనల్లో బయోటెక్నాలజీ పాత్ర, ఆహార భద్రత, సమగ్ర అభివృద్ధి అంశాలపై వివరించారు. ● హైదరాబాద్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ జి. నరహరిశాస్త్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అంతర శాఖల పరిశోధనలు ఇన్నోవేషన్పై సమాచారాన్ని అందించారు. ● అలబామా స్టేట్ యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ మనోజ్ కె. మిశ్రా బయోమెడికల్ సైన్సెస్, గ్లోబల్ రీసెర్చ్ సహకారం యువ పరిశోధకులకు ఉన్న అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో దేశంలోని సుమారు 12 రాష్ట్రాలకు చెందిన 50కి పైగా ప్రముఖ విద్యాసంస్థల నుంచి 1250 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రారంభమైన గ్లోబల్ కాన్ఫరెన్స్ -
21న సెంట్రల్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం
కొరిటెపాడు(గుంటూరు వెస్ట్): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఈ నెల 21వ తేదీన జరుపుకుంటోందని ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రాకేష్ రంజన్ తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ‘భూమిని రక్షించండి.. ఆరోగ్యంగా ఉండండి’ అంటూ వాకథాన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ రంజన్ మాట్లాడుతూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవానికి దారితీసే కార్యకలాపాలలో భాగంగా, కడప ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఆరోగ్యంగా ఉండండి, ఫిట్గా ఉండండి‘ అనే థీమ్తో ఫిట్నెస్ అవగాహన వాకథాన్ను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. శారీరక ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి కడప ప్రాంతీయ కార్యాలయం, నగరపాలెం ప్రాంతంలో ఒక వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ అధిపతి ఇ. వెంకటేశ్వరరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగిందని ఆయన వివరించారు. -
అమరజీవి త్యాగం మరువలేనిది
గుంటూరు ఎడ్యుకేషన్: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు, అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, ఏపీ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు నిర్మల భారతి, ఉద్యోగులు పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మరింతగా అభివృద్ధి చేసుకోవడం అత్యవసరమని వర్సిటీ వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్, టెక్నాలజీ కాలేజీ పరిధిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలక్ట్రికల్ మెషీన్స్ ల్యాబ్ను వీసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగాధరరావు మాట్లాడుతూ త్వరలోనే యూనివర్సిటీలో సోలార్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నూతనంగా ఏర్పాటైన ల్యాబ్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యా, పరిశోధన రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఫిర్యాదుల పరిష్కారానికి జాతీయ స్థాయి పెన్షనర్ అదాలత్ ఉపయోగపడుతుందని డీఆర్ఎం సుథేష్ణసేన్ పేర్కొన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో జాతీయస్థాయిపెన్షన్ అదాలత్ కార్యాక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. పెన్షన్ అదాలత్ను విజయవంతంగా నిర్వహించడం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో గుంటూరు డివిజన్ ముందుండి పనిచేస్తూ వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అనంతరం అదాలత్లో 19 ఫిర్యాదులు నమోదు కాగా, సంబంధిత విభాగాల అధికారుల సమన్వయంతో 10 ఫిర్యాదులు వేదిక వద్దనే పరిష్కరించారు. మిగిలిన వాటిని తక్షణమే పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను డీఆర్ఎం ఆదేశించా రు. ఏడీఆర్ఎం, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్, సీనియర్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్, సీనియర్ డివిజనల్ పర్సనల్ ఆఫీసర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బీ రెండవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం సీఈ ఆలపాటి శివప్రసాద్ వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగిన ఎల్ఎల్బీ రెండవ సెమిస్టర్, ఆరవ సెమిస్టర్ రెగ్యులర్కు 1044 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 755 మంది ఉత్తీర్ణులయ్యారు. అలానే ఎల్ఎల్బీ రెండవ సెమిస్టర్ రెగ్యులర్కు 550 మంది హాజరు కాగా వారిలో 479 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్కు ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈ నెల 27 లోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ. 2070 చొప్పున చెల్లించాలన్నారు. పర్సనల్ వెరిఫికేషన్ జిరాక్స్ ఆన్సర్ బుక్లెట్ ఫీజు రూ. 2190 చెల్లించాలని తెలియజేశారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన పీడీ
భట్టిప్రోలు: ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్ ఫిజికల్ డైరెక్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి 60 విభాగంలో పోల్ వాల్ట్ , లాంగ్ జంప్లలో గోల్డ్, ట్రిపుల్ జంప్లో సిల్వర్ మెడల్ సాధించారు. ఈ నెల 13, 14 తేదీలలో బాపట్ల ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో శ్రీనివాసరెడ్డి సత్తా చాటారు. 2026 జనవరి 29 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు పంజాబ్ రాష్ట్రం అజ్మీర్లో ఆయన జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఆయనను ఎంఈవోలు పులి లాజర్, నీలం దేవరాజు, హైస్కూల్ హెచ్ఎం మాచర్ల మోహన్రావు, సర్పంచ్ మాచర్ల కోటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు మురుగుడు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మార్పులకు సన్నద్ధం కావాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో చోటు చేసుకున్న మార్పులకు అనుగుణంగా సన్నద్ధం కావాలని ఆర్ఐవో జి. సునీత పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలపై సోమవారం గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు సాంబశివపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ సందర్భగా ఆర్ఐవో సునీత మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ సంస్కరణలు, సబ్జెక్టుల వారీగా సిలబస్, మార్కుల విభజనపై వివరించారు. ఆర్జేడీ జె.పద్మ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల విధానంతో పాటు సిలబస్లో చోటు చేసుకున్న మార్పులపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాదేవి, ఇంటర్మీడియెట్ బోర్డు పరిశీలకురాలు పి.రేఖావాణి పాల్గొన్నారు. ఆర్ఐఓ జి. సునీత -
సంతక సమరం!
బాపట్లమంగళవారం శ్రీ 16 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఉవ్వెత్తునపేదలకు తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ కుట్రలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ‘సంతక’ సమరం సోమవారం ఉవ్వెత్తున ఎగిసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయానికి నిరసనగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రజల మద్దతుతో మరో అంకానికి చేరింది. ఇప్పటికే సంతకాల పత్రాలు ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ జిల్లా కేంద్రాలకు తరలించగా.. సోమవారం అక్కడి నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి భారీ ర్యాలీల నడుమ తీసుకెళ్లారు. 9తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1200, గరిష్ట ధర రూ.1800, మోడల్ ధర రూ.1500 వరకు పలికింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 572.60 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 50,710 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి విడుదల నిలిచింది. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 42.0293 టీఎంసీలు. -
పొట్టి శ్రీరాములు జీవితం యువతకు ఆదర్శం
జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ బాపట్లటౌన్: అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని యువతరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. అమరజీవి వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ తెలుగు జాతి చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఘనుడు అమరజీవి అన్నారు. భారత స్వాతంత్య్ర సమరయోధుడిగా, గాంధేయవాదిగా మహాత్మా గాంధీ సత్యం–అహింస సిద్ధాంతాలను అమరజీవి జీవితాంతం ఆచరించారన్నారు. ఉద్యోగం, సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ, వాటన్నింటినీ త్యాగం చేసి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. హరిజనోద్ధరణ కార్యక్రమాల్లో విశేష పాత్ర పోషించారని, రాజకీయ పదవులు గానీ, వ్యక్తిగత లాభాల పట్ల ఎలాంటి ఆసక్తి చూపకుండా ప్రజల హక్కుల కోసమే నిరంతరం పోరాటం సాగించారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలనే ఆశయంతో ఆయన చేసిన పోరాటం చరిత్రాత్మకమన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలను వేరు చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 1952 అక్టోబర్ 19న మద్రాసు (చైన్నె)లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారన్నారు. 58 రోజుల పాటు కొనసాగిన ఆ దీక్షలో ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదని, చివరకు డిసెంబర్ 15న తెలుగు ప్రజల కల సాకారం కావాలని కోరుకుంటూ ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన మరణానంతరం 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆయన త్యాగమే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు బాటలు వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ పి.బాల మురళీకృష్ణ, ఏఆర్ డీఎస్పీ పి.విజయసారధి, ఏఓ బి.శ్రీనివాసరావు, ఆర్.ఐ షేక్ మౌలుద్దీన్, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
రైల్వే వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో డివిజన్కు రజత పతకం
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈనెల 3వ తేదీ నుంచి 6 వరకు నిర్వహించిన ఆల్ ఇండియా రైల్వే వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్లో గుంటూరు రైల్వే డివిజన్లో కమర్షియల్ క్లర్క్ కమ్ టిక్కెట్ క్లర్క్ ఎ.శివరామకృష్ణ యాదవ్ రజత పతకం దక్కించుకోవడం అభినందనీయం అని డివిజన్ డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో వెండి పతకం దక్కించుకున్న శివరామకృష్ణ యాదవ్ను సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం మాట్లాడుతూ తూర్పు కోస్ట్ రైల్వే, విశాఖపట్నంలో చాంపియన్షిప్ నిర్వహించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేలకు చెందిన వెయిట్ లిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొనగా 88 కిలలో విభాగంలో గుంటూరు డివిజన్కు చెందిన ఉద్యోగి శివరామకృష్ణ యాదవ్ వెండి పతకం కై వసం చేసుకోవడం అభినందనీయమన్నారు. డివిజన్ ఉద్యోగులు క్రీడల్లో చురుగ్గా పాల్గొని, డివిజన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావాల్సిందిగా కోరారు. క్రీడాకారుడు శివరామకృష్ణ యాదవ్ను అభినందించిన డీఆర్ఎం -
వైఎస్సార్ సీపీ వర్గీయులపై టీడీపీ నాయకుల దాడి
మంచికల్లు(రెంటచింతల): మంచికల్లు గ్రామంలో సోమవారం సాయంత్రం వైఎస్సార్ సీపీ వర్గీయులపై టీడీపీ వర్గీయులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పొలం వెళ్లి ఇంటికి వస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు పొట్లపాటి శ్రీనివాసరెడ్డితోపాటు తన ఇంటి ముందున్న వెన్నా శ్రీనివాసరెడ్డిని ఆయన తమ్ముడు కొడుకు వెంకటరెడ్డిపై టీడీపీకి చెందిన వారు ఒక్కసారిగా కర్రలతో దాడిచేశారు. దాడిలో వెంకటరెడ్డి రెండు చేతులకు తీవ్రగాయాలు కాగా వెంటనే నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పొట్లపాటి శ్రీనివాసరెడ్డికి, వెన్నా శ్రీనివాసరెడ్డిలకు స్పల్ప గాయాలయ్యాయి. ఘర్షణ జరిగిన విషయం తెలుకున్న వెన్నా శ్రీకాంత్రెడ్డి భార్య ఇప్పుడు గొడవలు ఎందుకు పడుతున్నారని వీధిలో అన్నందుకు కొందరు టీడీపీ వారు ఆమె ఇంటిపైకి వెళ్లి ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం గ్రామంలోని వైఎస్సార్ సీపీకి చెందిన సుమారు 35 కుటుంబాలు గ్రామం విడిచి వివిధ ప్రాంతాలలో తల దాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురజాల డీఎస్సీ జగదీష్ ఆదేశాల మేరకు ఎస్ఐ సీహెచ్ నాగార్జున ఈ నెల 11వ తేదీన వైఎస్సార్ సీపీకి చెందిన 27 మందిని తహసీల్దార్ మేరి కనకం ఎదుట బైండోవర్ చేసి గ్రామంలో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలని గ్రామంలోకి వెళ్లమని చెప్పడంతో వారు గ్రామంలోకి వచ్చారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి పోలీసులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ముంచిన మోంథా..బాబు వంచన
● తుపానుకు దెబ్బతిన్న పంటలకు అందని నష్టపరిహారం ● బాధితుల గుర్తింపుతో సరిపెట్టిన చంద్రబాబు సర్కారు ● చీరాల నియోజకవర్గంలో 4,670 ఎకరాల్లో వరి పంట నష్టం ● సాయం కోసం 3,300 మంది బాధిత రైతులు ఎదురుచూపు పంట నష్టపరిహారం అందించాలి – కావూరి రమణారెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు -
అర్జీలు పునరావృతం కాకుండా చూడాలి
బాపట్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 75 మంది అర్జీదారులు ఎస్పీ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలను వివరించారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఎస్పీ బి.ఉమామహేశ్వర్ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్జీదారుల సమస్యలను చట్ట పరిధిలో విచారించి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలన్నారు. వివిధ సమస్యలతో పోలీస్ కార్యాలయాలకు వచ్చే బాధితులకు భరోసాగా పోలీస్ శాఖ ఉండాలన్నారు. అర్జీలను పూర్తిస్థాయిలో విచారించి శాశ్వతంగా పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలకు సంబంధించిన అర్జీలే అధికంగా వస్తున్నాయని పోలీసు అధికారులు ఎస్పీకి వివరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ జి.రామాంజనేయులు, డీసీఆర్బీ డీఎస్పీ పి.బాలమురళీకృష్ణ, డీసీఆర్బీ సీఐ కె.భుజంగరావు, పీజీఆర్ఎస్ సెల్ డబ్ల్యూఎస్ఐ లక్ష్మీరాజ్యం, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
బాపట్ల: భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధనకు పొట్టి శ్రీరాములు చేసిన కృషి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జరిగింది. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ రోజుగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అనంత రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పల్స్పోలియోను విజయవంతం చేయాలి పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 21వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన గోడపత్రాలను కలెక్టర్ సోమవారం స్థానిక కలెక్టరేట్లో విడుదల చేశారు. 22, 23వ తేదీలలో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కల మందు వేయాలన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించిన 17 వైద్యశాలలకు జిల్లా కలెక్టర్ అవార్డులను ప్రదానం చేశారు. సంబంధిత వైద్యాధికారులు అవార్డులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ జి.గంగాధర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆదర్శ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి
గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా గుంటూరు వెస్ట్: ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద గుర్తించిన అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంపై సోమవారం స్థానిక కలెక్టర్లోని ఎస్ఆర్ శంకరన్ మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు వందలు, ఆపైన జనాభా కలిగిన షెడ్యూల్డ్ కులాల గ్రామాలను ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. జిల్లాలో 40 గ్రామాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ఈ గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతో అనుసంధానం చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో గ్రామానికి రూ. 20 లక్షలు చొప్పున నిధులు విడుదల చేస్తుందన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం , విద్యుత్, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ డీడీ యు.చెన్నయ్య, జడ్పీ సీఈఓ వి.జ్యోతి బసు, డ్వామా పీడీ కె.కళ్యాణ చక్రవర్తి, డిఎస్ఓ పి.కోమలి పద్మ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు రవీంద్ర బాబు, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అధికారులు సమర్థంగా విధులు నిర్వహించాలి మంగళగిరి టౌన్: పోలీస్ అధికారులు, సిబ్బంది సమష్టి కృషితో సమర్థంగా బందోబస్తు విధులు నిర్వహించాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో నిర్వహించనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల నియామక పత్రాల జారీ కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు విధులపై సోమవారం అధికారులకు సిబ్బందికి ఎస్పీ వకుల్ జిందాల్ సూచనలు చేశారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించి సీసీ కెమెరాల అమరికలు, పనితీరును పరిశీలించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు రమణమూర్తి, రవికుమార్, హనుమంతు, స్పెషల్ బ్రాండ్ డీఎస్పీ శ్రీనివాసులు, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయస్థాయి రగ్బీ పోటీలకు వడ్డేశ్వరం విద్యార్థులు తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని వడ్డేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు జాతీయస్థాయి రగ్బీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకుమాను జోజప్ప సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రగ్బీ సౌత్జోన్ ఖేలో ఇండియాలో భాగంగా రాష్ట్ర సబ్జూనియర్ బాలికలు అండర్–15 విభాగంలో గుంటూరు కొత్తపేటలో ఎంఆర్ ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం జూనియర్ క్యాంపస్లో ఈనెల 14వ తేదీన ఎంపిక పోటీలు జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేగావత్ భువనేశ్వరి భాయి ఎంపికై ందని తెలిపారు. ఎంపికై న విద్యార్థిని ఈనెల 27, 28 తేదీల్లో చైన్నె జేఎన్ స్టేడియంలో జరిగే ఖేలో ఇండియా సౌత్జోన్ అస్మిత లీగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్నట్లు తెలియజేశారు. అలానే కృష్ణాజిల్లా, గన్నవరంలో ఈనెల 1, 2 తేదీల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో అండర్–14 విభాగంలో తమ పాఠశాల విద్యార్థిని రావిపాటి దివ్య(8వ తరగతి) ప్రతిభ కనబరిచి జాతీయ జట్టుకు ఎంపికై ందని వివరించారు. రావిపాటి దివ్య ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే జాతీయస్థాయి రగ్బీ పోటీలలో పాల్గొనన్నుట్లు ఆయన తెలిపారు. ఎంపికై న క్రీడాకారిణులను, వ్యాయామ ఉపాధ్యాయులు మెల్లెంపూడి రవి, నూతక్కి రవి, పి.సతీష్కుమార్లను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. -
మిరపకాయల దొంగకు జైలు శిక్ష
అద్దంకి రూరల్: పొలంలో ఆరబోసిన ఎండు మిరపకాయలను దొంగిలించిన కేసులో సోమవారం అద్దంకి కోర్టులో విచారణ జరగ్గా న్యాయమూర్తి బి.అఖిల నిందుతుడికి ఆరునెలల జైలు శిక్ష విధించారు. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. అద్దంకి మండలం రాళ్లపాడు గ్రామంలో డి. శ్రీనివాసరావు పొలంలో ఎండుమిర్చిని ఆరబోశాడు. ఎవరో గుర్తు తెలియని దొంగలు రూ. 1.50 లక్షల విలువ చేసే మిరపకాయలను ఫిబ్రవరి 7న రాత్రి దొంగిలించారని అద్దంకి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అద్దంకి సీఐ సుబ్బరాజు, అప్పటి ఎస్సై ఖాదర్బాషా కేసు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేశారు. నిందితుడు సంతనూతలపాడు మండలం పేర్నమిట్టకు చెందిన చిరుతోటి మధును అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన టాటా ఏసీ ఆటోను, మిర్చిని స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించి చార్జ్ షీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని ఒంగోలు జైలు నుంచి అద్దంకి కోర్టుకు హాజరు పరిచారు. నిందితుడు నేరం అంగీకరించినందుకు న్యాయమూర్తి జైలు శిక్ష విధించారు. 18 నుంచి రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు గుంటూరు వెస్ట్: రాష్ట్ర స్థాయి యువజనోత్సవం, ఆంధ్ర యువ సంకల్ప్–2కే25 కార్యక్రమాన్ని ఈ నెల 18,19, 20వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రవాణా, యువజన సేవలు, క్రీడల శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. దాడికేసులో వ్యక్తి అరెస్టు తాడికొండ: 2023లో జరిగిన కేసులో మంగళగిరి మండలం చినకాకానికి చెందిన లోకేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన తుళ్ళూరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం రాత్రి గుట్టుచప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు సోమవారం అరెస్టు చూపి రిమాండ్కు తరలించారు. 2023లో మూడు రాజధానుల శిబిరం వద్ద జరిగిన దాడిలో నిందితుడుగా ఉన్న కొలకలూరి లోకేష్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తుళ్ళూరు పోలీసులు తెలిపారు. మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణం నాంచారమ్మ ప్రాంగణంలో ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి స్వామివార్ల దేవాలయంలో సోమవారం పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల శ్రీ భక్తమార్కండేయ పద్మశాలీ అన్నదాన సేవా సంఘం కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్ను అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పండుగ వేళల్లో ధార్మిక సత్రాల ద్వారా భక్తులకు సేవలు చేసే భాగ్యం రావడం సంతోషదాయకమన్నారు. కార్యక్రమంలో అన్నదాన సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిన్నవీరయ్య, మాజీ కౌన్సిలర్ బట్టు సదానంద శాస్త్రి, సత్రం అధ్యక్షులు వెంకట కోటయ్య తదితరులు పాల్గొన్నారు. సాగర్లో ఆక్టోపస్ మాక్ డ్రిల్ విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో సోమవారం ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఇటీవల కాలంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాలలో ఉగ్రవాద మూకల కదలికల దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఆక్టోపస్ దళాల డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సాగర్లోని ప్రధాన జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పరిసర ప్రాంతాలు, పవర్ హౌస్ లోపలి భాగంలో ఉగ్రవాదులు చొరబడితే అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏవిధంగా స్పందించాలి, ఆక్టోపస్ బలగాలకు సమాచారం అందిన వెంటనే బలగాలు ఏవిధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి ప్రత్యేక కోడ్లతో ఆపరేషన్ నిర్వహించాలనే అనే విషయంలో సంఘటన జరుగుతున్నట్లుగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ విధంగానే నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ పరిసర ప్రాంతాలలో ఉగ్రవాదుల సంచారం, ఉగ్రవాదులు డ్యామ్పైకి ప్రవేశించే సందర్భాలలో, సాగర్ డ్యాం పరిధిలోని సున్నితమైన విభాగాలలో ఉగ్రదాడిని ఎదుర్కొనే సంఘటనలను ఆక్టోపస్ దళాలు డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులను ఎదుర్కొనే సందర్భంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్సులు, మంటలు చెలరేగితే ఆపటానికి అగ్నిమాపక వాహనాలు నిజంగానే ఉగ్రవాదులను ఆక్టోపస్ దళాలు ఎదుర్కొంటున్నట్టుగా వ్యవహరించారు. మాక్ డ్రిల్ లో ఎస్పీఎఫ్ ఉన్నత అధికారులు, తెలంగాణ పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ దళాలు, ఎస్పీఎఫ్ దళాలు పాల్గొన్నాయి. -
సాహిత్యంలో రారాజు కొసరాజు
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : కొసరాజు సాహిత్యం ద్వారా ఆయన వ్యక్తిత్వం ఎవరెస్ట్ శిఖరమంతా ఉన్నతంగా వెలుగుతుందని మహా సహస్రావధాని ప్రవచన కిరీటి డాక్టర్ గరికపాటి నరసింహారావు అన్నారు. సోమవారం గుంటూరులోని జేకేసీ కళాశాల సమావేశ మందిరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక, మనసు ఫౌండేషన్ సంయుక్తంగా సాహిత్య పరిశోధకులు పారా అశోక్కుమార్ నేతృత్వంలో రూపొందిన కొసరాజు సర్వలభ్య రచనల సంకలనం పుస్తకావిష్కరణ సభ జరిగింది. తొలుత ఈ గ్రంథాన్ని ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకొచ్చారు. అనంతరం కొసరాజు జీవిత మాలికపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను అతిథులు ప్రారంభించి, కొసరాజు విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, పత్తిపాటి దేవాక్షమ్మ, చలసాని అనురాధ, కస్తల పద్మ, డాక్టర్ కొసరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు -
రైల్వే పెన్షన్ అదాలత్ బహిష్కరణ
గుంటూరు మెడికల్: దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజన్ పరిపాలన విభాగంలో సోమవారం నిర్వహించిన పెన్షన్ అదాలత్ను ది రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు బహిష్కరించారు. సోమవారం జరిగిన పెన్షన్ అదాలత్లో ఒక పెన్షనర్ల సంఘానికి అనుమతి ఇచ్చి, తమ సంఘానికి అనుమతి ఇవ్వకపోవడంతో బహిష్కరించామని అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ కె.నారాయణరెడ్డి, సెక్రటరీ ఎల్.రాఘవబాబు తెలిపారు. గుంటూరు డివిజన్లో పనిచేస్తున్న ప్రధాన పెన్షన్ల సంఘాల్లో తమ సంఘం ఒకటని పేర్కొన్నారు. 300 మంది కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. భవిష్యత్తు పెన్షన్ అదాలత్లలో అన్ని గుర్తింపు పొందిన పెన్షనర్ల సంఘాలు పాల్గొనేందుకు, అభిప్రాయాలు తెలియజేసేందుకు సమాన అవకాశాలు ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా తమ సంఘం పాల్గొనకుండా ఉండేందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరండల్పేటలో జరిగిన సమావేశంలో సుధాకర్, కోశాధికారి ఆదినారాయణరెడ్డి, చెన్నయ్య, కోటేశ్వరరావు, శివరామ్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
బాబు మాటల్లోనే బ్యాగోగులు!
బాపట్లసోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 20257ఫిరంగిపురం: మండల పరిధి వేమవరం గ్రామంలోని కోటి ఒక్కలింగాల క్షేత్రంలోని మరకత లింగానికి ఆదివారం వైభవంగా అన్నాభిషేకం నిర్వహించారు. భక్తుల నుంచి సేకరించిన, వంటశాలలో సిద్ధం చేసిన వంద కిలోల అన్నాన్ని వినియోగించారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీటి విడుదల నిలిచిపోయింది. దిగువకు 3,200 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 42.3253 టీఎంసీలు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 573.40 అడుగులకు చేరింది. ఇది 265.1042 టీఎంసీలకు సమానం. సాక్షి ప్రతినిధి, బాపట్ల: విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు పాడైపోయాయి. జిప్పులు పనిచేయడం లేదు. కొన్ని బ్యాగులు పూర్తిగా చినిగిపోయాయి. కుట్లు వేసుకొని వాడదామన్నా బ్యాగులు చీలికలు పేలికలుగా మారడంతో సాధ్యం కావడం లేదు. మూడు నెలలు గడవకుండానే బాబు ఇచ్చిన బ్యాగులు మూలన పడేసి కొత్తవి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది పేదలకు ఆర్థిక భారంగా మారింది. బ్యాగులు కొనుక్కోలేని పేద విద్యార్థులు చినిగిన బ్యాగుల్లోనే పుస్తకాలను మోస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నాసిరకం బ్యాగులు ఇవ్వడంపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా మండిపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నాణ్యమైన బ్యాగులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పేద విద్యార్థులకు కష్టాలు కొల్లూరులోని లూథరన్ చర్చి ప్రాంతానికి చెందిన చెందిన సీహెచ్ మహిరాజు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం జూన్ నెలలో సూల్ బ్యాగు ఇచ్చింది. నెల తిరక్కుండానే బ్యాగు కుట్ల వెంబడి చినిగిపోయింది. పుస్తకాల బ్యాగును సైకిల్ వెనుక ఉన్న క్యారియర్పై పెట్టుకొని బ్యాగులోంచి పుస్తకాలు పడిపోకుండా చూసుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. బాపట్ల పట్టణంలోని భీమవారిలెంకు చెందిన సీహెచ్ చరణ్ బాపట్ల పట్టణంలోని ఏవీవీ పాఠశాలలో 8వతరగతి చదువుతున్నాడు. పాఠశాలలు ప్రారంభమైన నెలకే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగు చిరిగిపోయింది. ఆ బ్యాగులోనే పాఠశాలకు పుస్తకాలు తీసుకెళ్లి చదువుకోవడం ఇబ్బంధిగా ఉందని చరణ్ చెప్పారు. బాపట్ల పట్టణం ఇస్లాంపేటకు చెందిన షేక్ కాలేషా మున్సిపల్ పాఠశాలలో 8 వతరగతి చదువుతున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం జూన్నెలలో బ్యాగు ఇవ్వగా ఆగస్టు నాటికి అది చినిగిపోయింది. ఒకటి రెండు సార్లు కుట్టించుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కొత్తబ్యాగు కొనుక్కొని స్కూల్కు వెళుతున్నట్లు కాలేషా తెలిపాడు. కొల్లూరు మండలం గాజుల్లంకకు చెందిన కన్నారాజు కొల్లూరు బాలురోన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగు చినిగిపోయింది. ఆ బ్యాగులో పుస్తకాలు మొత్తం పట్టకపోవడంతో గోతంతో కుట్టించిన మరో బ్యాగులో పుస్తకాలు సర్దుకొని చంకన ఒక బ్యాగు, భుజాలకు మరో బ్యాగు వేసుకొని పాఠశాలకు వెళుతున్నాడు. కొత్త బ్యాగులు కొనుక్కునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో సర్దుకు పోవాల్సి వస్తోందని కన్నారాజు తెలిపాడు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. బాపట్ల జిల్లాలో 87 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం జూన్ నెలలో స్కూల్ బ్యాగులను అందించింది. విద్యాసంవత్సరం మొదలైన నెలకే కొన్ని బ్యాగులు దెబ్బతిన్నాయి. మరికొన్నింటికి బొందులు తెగిపోగా, ఇంకొన్నింటికి జిప్పులు పాడయ్యాయి. కొన్ని బ్యాగుల కుట్లు ఊడిపోయాయి. కొన్ని ఏకంగా కుట్లు, జిప్పుల వద్ద చినిగిపోయాయి. మొత్తంగా రెండు నెలల్లోపే 90 శాతం బ్యాగులు పనికి రాకుండా పోవడంతో విద్యార్థులు కొత్త బ్యాగులు కొనాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన బ్యాగులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక దానిని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో విద్యార్థులకు బ్యాగులు ఇచ్చారేగానీ నాణ్యమైనవి ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాగులతోపాటు ఇతర వస్తువులను మూడంచెల తనిఖీల ద్వారా ఇస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆర్భాటంగా ప్రకటించారు. అందులో వాస్తవం లేదని క్షేత్రస్థాయిలో ప్రభుత్వం విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగులను చూస్తే అర్థమవుతుంది. విద్యార్థుల బూట్లు ఇతర వస్తువులు సైతం తక్కువకాలంలో పనికిరాకుండా పోయాయి. దీంతో మొత్తం కిట్ నాసిరకంగా ఉందని బాలలు వాపోతున్నారు. కుటుంబ కలహాలతో వివాహిత హత్య నేడు బాపట్లలో బైక్ ర్యాలీ చంద్రబాబు సర్కారు వచ్చాక అన్ని వర్గాలకు కష్టాలు తప్పడం లేదు. చిన్నా, పెద్ద భేదం లేకుండా అందరికీ అవస్థలే. విద్యాసంవత్సరం ప్రారంభంలో పాఠశాలల్లో ఇచ్చిన బ్యాగుల దుస్థితే దీనికి నిదర్శనం. ఇచ్చిన నెలకే చినిగిపోవడంతో చిన్నారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కొత్తవి కొనడానికి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జగనన్న విద్యా కానుక పేరుతో బ్యాగులతోపాటు విద్యార్థులకు దుస్తులు, బూట్లు తదితర సామగ్రి ఇచ్చారు. అవి అన్నీ స్వయంగా ఆయన పరిశీలించి నాణ్యమైనవి మాత్రమే విద్యార్థులకు ఇవ్వడంతో ఇప్పటికీ కొందరు విద్యార్థులు వాటినే వాడుతున్నారు. జగనన్న విద్యార్థులకు నాణ్యమైన వస్తువుల కిట్ ఇచ్చారని విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో చదువుతోపాటు నాణ్యమైన విద్యాసామగ్రి కూడా అందించిన ఘనత వైఎస్ జగన్కే దుక్కుతుందని వారు గుర్తుచేసుకున్నారు. -
ఆడియాలజిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ శిరీష
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెతాలజిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా గుంటూరుకు చెందిన డాక్టర్ ఆర్.శిరీషను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గుంటూరు కొత్తపేటలోని సంఘ కార్యాలయంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. సంఘ రాష్ట్ర సెక్రటరీగా డాక్టర్ బి.ప్రకాశం, ట్రెజరర్గా డాక్టర్ సిహెచ్.సుజిత ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఏపీలోని పలు ప్రాంతాల్లో అనధికారికంగా స్పీచ్ థెరిఫీ సెంటర్లు నడుపుతున్నారని చెప్పారు. మాట, ప్రవర్తన లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రుల నుంచి అనాధికార స్పీచ్ సెంటర్ల నిర్వాహకులు నెలకు రూ. 25 నుంచి రూ.30 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. పిల్లలకు సరైన పద్ధతుల్లో స్పీచ్ థెరఫీ అందిచలేకపోతున్నారని, వేలల్లో ఫీజులు దండుకుంటున్నారని వాపోయారు. ప్రభుత్వం అనధికార ఫీజు సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినికిడి లోపం ఉన్న వారి పిల్లల తల్లిదండ్రులు నిపుణులైన ఆడియాలజిస్ట్లను సంప్రదించి వారి పర్యవేక్షణలోనే వినికిడి యంత్రాలు వినియోగించాలని సూచించారు. సమావేశంలో సంఘ సభ్యులు మోహన్కుమార్, లావణ్య, క్రిష్టాఫర్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక రేపు
చినగంజాం: ఉమ్మడి ప్రకాశం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16వ తేదీ మంగళవారం ఖేలో ఇండియా అస్మిత జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో నిర్వహించనున్నారు. ఈమేరకు ప్రెసిడెంట్ పి.రామచంద్రరావు, సెక్రటరీ ఎం. వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం కడవకుదురు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అండర్ 14,16 బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్కి ఎంపిక చేస్తారని తెలిపారు. జిల్లా స్థాయిలో విజయం సాధించిన మొదటి మూడు స్థానాల వారికి మెరిట్ సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అథ్లెట్స్ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రెండు పాస్ పోర్టు సైజు ఫొటోలు తీసుకొని 16వ తేదీ ఉదయం 8 గంటల లోపు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 9885788827, 7675026220 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కోచ్ రాజు నాయక్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
పిన్నెల్లి సోదరుల అరెస్టుపై నిరసన
కూకట్పల్లి: మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారని కేపీహెచ్బీ టెంపుల్ బస్స్టాప్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆదివారం నిరసన వ్యక్తం చేశాయి. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని, పిన్నెల్లి సోదరులపై పెట్టిన అక్రమ కేసులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్ల కార్డులతో నల్ల కండువాలు వేసుకుని కేపీహెచ్బీ బస్స్టాప్ సెంటర్లో బైఠాయించారు. కార్యక్రమంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల, వైఎస్సార్ సీపీ సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్రరెడ్డి, స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వెంకటరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 18 నెలల కాలంలో 16 అక్రమ కేసులు పెట్టారని, నాలుగుసార్లు వరుసగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కావాలని అక్రమంగా కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. టీడీపీకి చెందిన రెండు వర్గాల వాళ్లు పాత గొడవల నేపథ్యంలో చంపుకుంటే దాన్ని స్వయానా జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా చెప్పినా కూడా ఆ కేసుని కూడా పిన్నెల్లిపై మోపి జైలుకి పంపడం చూస్తుంటే ఒక చెడు సంప్రదాయం అనే విత్తుని నాటారని దానికి ముగింపు ఎలా ఉంటుందో రానున్న రోజుల్లో వైఎస్సార్ సీపీ చూపిస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు వుయ్ స్టాండ్ విత్ పిన్నెల్లి బ్రదర్స్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో శివారెడ్డి, మధుసూదనరెడ్డి, కేపీహెచ్బీ కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కరాటేలో వేటపాలెం విద్యార్థుల ప్రతిభ
వేటపాలెం: మండల కేంద్రంలోని వేటపాలెం విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబర్చి టైటిల్స్ సాధించినట్లు కరాటే మాస్టర్ వి.బ్రహ్మనాయుడు ఆదివారం తెలిపారు. చిలకలూరిపేటలో 2025 నేషనల్ చాంపియన్షిప్ న్యూషావోలిన్, కుంపు టు అకాడమీ షావోలిన్, కుంపుటు అకాడమీ ఆధ్వర్యంలో కరాటే పోటీలు జరిగాయి. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కటాస్ విభాగంలో హారిక, హాసిన, మృణాళిని, శాతసాహస్ర పార్నిత, బాలుర విభాగంలో అస్లాం బంగారు పతకం, చరణ్ వెండి పతకం, వేదసూర్యానంద్ వెండి పతకం సాధించారు. విద్యార్థులను తల్లిదండ్రులు, లిటిల్ స్కాలర్ స్కూల్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు అభినందించారు. -
సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యం
నగరంపాలెం: సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ మార్గం సాహిత్యమేనని ఏపీ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ.విల్సన్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలో ఆదివారం 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ నిర్వహించారు. రమ్య భారతి సాహిత్య పత్రిక నుంచి చలపాక ప్రకాష్, శ్రీ వసిష్ట సోమేపల్లి నిర్వహణలో జరగ్గా, అతిథులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. రమ్య భారతి గౌరవ సలహాదారులు వేముల హాజరత్తయ్య గుప్తా అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి, అకాడమీ చైర్మన్ ఆర్డీ.విల్సన్ మాట్లాడుతూ సాహిత్యంలో మానవతా విలువలు ఉన్నప్పుడు రాణిస్తుందని పేర్కొన్నారు. ఏపీ రచయితల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ సి.భవానిదేవి, ప్రముఖ కథకులు శ్రీ కంఠస్ఫూర్తి మాట్లాడుతూ మనిషిలో అంతర్లీనంగా ఉన్న సాహిత్యాన్ని వెలికితీసేందుకు వేదికను నెలకొల్పిన మహా వ్యక్తి సోమేపల్లి అని కొనియాడారు. అదే బాటలో ఆయన కుమారుడు శ్రీ వశిష్ట సోమే పల్లి పయనిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కథల పోటీల్లో ప్రథమ విజేత సింగరాజు శ్రీనివాసరావు (గెలుపు), ద్వితీయ విజేత జి.రంగబాబు (ఇకనైనా మారండి ), తృతీయ విజేత బీఎస్కే.కరీముల్లా (బేరం), ప్రోత్సాహక ఉత్తమ పుర స్కారాలను సింహప్రసాద్, ఎం.వెంకటేశ్వరరావు (హైదరాబాద్), ఇంద్రగంటి నరసింహమూర్తి (కాకినాడ) కు అందించి, సత్కరించారు. సభలో సాహితీవేత్త లు కేంద్ర సాహిత్య అవార్డుగ్రహీతలు పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ, రావెల సాంబశివరావు, సీహెచ్.సుశీలమ్మ, శివప్రసాద్, తోట కూర వెంకటనారాయణ, సుభాని పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నగరంపాలెం: గుంటూరు నగరంలోని ఇద్దరి రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ ఇటీవల జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయాకు సిఫార్స్ చేయగా, ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. సుందరయ్య కాలనీ ఐదో వీధిలో ఉంటున్న షేక్ బాజీ అలియాస్ సిరిపురం బాజీపై నల్లపాడు పీఎస్లో ఏ కేటగిరి రౌడీషీట్, ఐదు కేసులు నమోదై ఉన్నాయన్నారు. రామిరెడ్డితోట ఒకటో వీధికి చెందిన 19 ఏళ్ల షేక్ సమీర్ అలియాస్ ఫైజల్పై కొత్తపేట పీఎస్లో ఏ+రౌడీషీ ట్, రెండు హత్య కేసులు సహా పది కేసులు ఉన్నాయని వెల్లడించారు. రౌడీషీటర్ బాజీ తరచూ హింసాత్మక ఘటనల్లో ఉంటూ, ప్రజా శాంతికి, స్వేచ్ఛకు భంగం స్పష్టించేలా ప్రవర్తించేవాడని, మరో రౌడీషీటర్ సమీర్ బాల్యం నుంచే నేర జీవితానికి అలవాటుపడ్డాడని తెలిపారు. దోపిడీ, దొంగతనం, హత్యలకు సంబంధించి వరుస హింసాత్మక, చట్ట విరుద్ధమైన తీవ్ర నేరాల్లో పాల్గొనేవాడని వివరించారు. ఇద్దరు నిరంతరం నేరాల్లో జోక్యం చేసుకునేవారని, పలు కేసులు నమోదై, జైళ్లకు వెళ్లి శిక్షలు అనుభవించిన వారిలో మార్పు రాలేదని తెలిపారు. ఈ క్రమంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు వారిపై పీడీ చట్టం ప్రయోగించామని ఎస్పీ పేర్కొన్నారు. ఇద్దరిని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించామని తెలిపారు. జిల్లాలో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా పీడీ చట్టం ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
కుంచెతో తెలుగును వెలిగించిన బాపు
నగరంపాలెం: చిత్రాలు, కార్టూన్ల ద్వారా తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపును స్మరించుకోవడం అందరి బాధ్యతని గజల్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్ రోడ్డులోని భారతీయ విద్యాభవన్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో ఆదివారం బాపు– రమణ–బాలు కళాపీఠం, మల్లెతీగ సంయుక్తంగా బాపు జయంతి – బాపు స్మారక పురస్కారాల సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ అందమైన సీ్త్రని బాపు బొమ్మగా ప్రశంసిస్తున్నామంటే అది ఆయన చిత్రాలకున్న గొప్పతనమని తెలిపారు. తెలుగు వారు ఉన్నంత కాలం బాపు సినిమాలు, చిత్రాలు, కార్టూన్లు సజీవంగా ఉంటాయని చెప్పారు. తెలుగు అమ్మ ఒడి భాష కావాలన్నారు. తెలుగును అధికార భాషకంటే ముందు మన మమకార భాషగా గుర్తించాలని పేర్కొన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాపు– రమణ – బాలు కళాపీఠం వ్యవస్థాపకులు, జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి మాట్లాడుతూ బాపును స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలని తెలిపారు. బాపు సినిమాల్లోని ముఖ్య సన్నివేశాల్ని, పాటల్ని ఆత్మీయ అతిథి, సుప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎం.ప్రభాకర్ గుర్తు చేశారు. సాహితీ సమాఖ్య గుంటూరు కార్యదర్శి ఎస్వీఎస్.లక్ష్మీనారాయణ బాపు ప్రతిభను తెలిపే సంగతుల్ని వివరించారు. మల్లెతీగ కలిమిశ్రీ మాట్లాడుతూ బాపు దర్శకునిగా, చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా సేవలందించారని పేర్కొన్నారు. అనంతరం సుప్రసిద్ధ సినీ దర్శకులు వర ముళ్లపూడి, చిత్రకారుడు అరసవల్లి గిరిధర్, కార్టూనిస్టు హరి వెంకటరమణలకు బాపు స్మారక పురస్కారాలను అందించారు. బాపుతో ఉన్న అనుబంధాన్ని పురస్కార గ్రహీతలు గుర్తు చేసుకున్నారు. కార్టూనిస్టు హరి వెంకటరమణకు సత్కారంచిత్రకారుడు అరసవల్లి గిరిధర్కు సన్మానంముగ్గురికి స్మారక పురస్కారాల ప్రదానం -
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ నెల్లూరు
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు రెండో రోజూ అదే ఉత్సాహాన్ని కనబరిచారు. పెదనందిపాడు మండలం పాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్న్ ఆధ్వర్యంలో జరుగుతున్న 45వ రాష్ట్రస్థాయి వెటరన్న్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నిమ్మగడ్డ నాగేశ్వరరావు, శ్రీ హాస్పిటల్ అధినేత చెరుకూరి పవన్కుమార్లు హాజరయ్యారు. విజేతలకు గోల్డ్, సిల్వర్, బ్రౌంజ్ మెడల్స్తోపాటు, మెమోంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఫిబ్రవరి 13, 14, 15 తేదీల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జమ్మలపూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ జనరల్ సెక్రటరీ మంగా వరప్రసాద్ తెలిపారు. విజేతల వివరాలు.. రెండో రోజు పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఏపీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ మంగా వరప్రసాద్, వెటరనన్ అథ్లెటిక్స్ అసోసియేషన్న్ జిల్లా సెక్రటరీ గణేశుని రాంబాబు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి శివనాగేశ్వరరావు వెల్లడించారు. 5కె రన్నింగ్ పురుషుల 65 ప్లస్ విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన వి.సుధాకర్, 70 ప్లస్ విభాగంలో విశాఖపట్నంకు చెందిన ఎం. శంకరరావులు ప్రథమ స్థానం సాధించారు. మహిళల 5కె రన్నింగ్ 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి.కోటేశ్వరమ్మ, కె.శారదలు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. 1కెఎం వాక్ 90 ప్లస్ విభాగంలో డి.శేషగిరిరావు (గుంటూరు), 3కె వాక్ 70 ప్లస్లో బి.వెంకటలక్ష్మిలు ప్రథమ స్థానం సాధించారు. 481 పాయింట్లతో నెల్లూరు జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్, 431 పాయింట్లుతో విశాఖ జిల్లా రన్నర్స్గా నిలిచింది. బెస్ట్ మార్చ్ఫాస్ట్ వైజాగ్ ప్రథమ స్థానం, కృష్ణా జిల్లా ద్వితీయ స్థానం దక్కించుకుంది. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కె.శ్రీనివాసరావు, ఇస్మాయిల్, రాఘవరావు, కృపారావు, అనిల్, ఎం.సత్యనారాయణలు వ్యవహరించారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
గుంటూరు రూరల్: రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలు రాష్ట్ర జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ నేతృత్వంలో పరిష్కరిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షులు, రాష్ట్ర జేఏసీ కార్యదర్శి డి.వేణుమాధవరావు తెలిపారు. గుంటూరు జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నగరంలోని కృషి భవన్లో నిర్వహించారు. వేణుమాధవరావు మాట్లాడుతూ వ్యవ సాయ విస్తరణాధికారులకు జాబ్ చార్ట్, నామిలికేచర్ మార్పు, తదితర సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో ఏపీ జేఏసీ సహకారంతో పరిష్కారం అవుతాయన్నారు. జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారులు తమ సమస్యలను రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరెడ్డి, రాష్ట్ర కోశాధికారి సుభాని గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు సురేష్, బాపట్ల జిల్లా అధ్యక్షులు సురేష్ గోపి, ప్రకాశం జిల్లా అధ్యక్షులు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కార్యవర్గం గుంటూరు జిల్లా ఏఈఓ సంఘం అధ్యక్షులుగా ఆలా రమేష్బాబు, కార్యదర్శిగా ఎన్ ప్రసాద్బాబు, కోశాధికారిగా ఎంఎన్ కృష్ణారావు, సహాధ్యక్షులుగా ఐ శ్రీకాంత్, ఉపాధ్యక్షులుగా పి రవికుమార్, ఆర్ వెంకయ్య, వీరంకి గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివరావు, ప్రచార కార్యదర్శిగా కె రమేష్బాబు, సంయుక్త కార్యదర్శులుగా ఐ జ్యోత్స్న, పి రాజేంద్రప్రసాద్, బి సౌజన్య, కార్యవర్గ సభ్యులుగా దేవ సమర్పణరావు, ఆదిలక్ష్మి, మురళి ఎన్నికై నట్లు ఎన్నికలు ఎన్నికల అధికారి రమణయ్య తెలిపారు. -
వైభవం.. స్వర్ణోత్సవం
విజయపురిసౌత్: వారంతా 50 ఏళ్ల క్రితం ఏపీఆర్ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. ఆ తరువాత విడిపోయారు. సుధీర్ఘ జీవన ప్రయాణంలో విభిన్నదారుల్లో సాగి వివిధ వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో రాణించారు. జీవితం యాంత్రికమైపోయింది. ఒక్కసారి చిన్ననాటి స్నేహితులను కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాగర్ పరివార్ ఆధ్వర్యంలో దేశ, విదేశాలలో ఉన్నత స్థానాలలో, వివిధ ఉద్యోగాలు చేస్తున్న సుమారు ఐదువేల మంది చిరునామాలు సేకరించారు. 1975 నుంచి 2025 వరకు ఏపీఆర్ జూనియర్ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఆదివారం మరోసారి అదే కళాశాలలో స్వర్ణోత్సవాల్లో తిరిగి కలుసుకుని ఒకే వేదిక పై చేరుకున్నారు. ఒక్కసారిగా అందరిలో ఉద్వేగం...అపురూపమైన ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. పరస్పర పలకరింపులు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫోన్ నంబర్లు, చిరునామాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తమ ఉన్నతికి దోహదపడిన ఆనాటి గురువులను గుర్తు చేసుకున్నారు. అపురూపమైన జ్ఞాపకాలను తమ స్నేహబంధానికి గుర్తుగా గ్రూ్ప్ ఫొటోలు దిగారు. అనంతరం గురువులను శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పూర్వ విద్యార్థులకు కొమ్ముకోయ నృత్యంతో కళాశాలలో ఘన స్వాగతం పలికారు. అనంతరం సభలో స్వర్ణోత్సవ సావనీర్ను ఆవిష్కరించారు.వీపీ సౌత్ ఏపీఆర్జేసీలో 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు -
ఉపకార వేతనాలతో ఉన్నతస్థాయికి ఎదగాలి
తెనాలి: విద్యార్థులు ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని పారిశ్రామికవేత్త, తులసీ సీడ్స్ అధినేత తులసీ రామచంద్రప్రభు పేర్కొన్నారు. ఒక స్థాయికి చేరుకున్నాక తిరిగి సమాజానికి సేవ చేయాలని అన్నారు. పట్టణానికి చెందిన కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రొగ్రెసివ్ అసోసియేషన్ (కెపా) 21వ ప్రతిభా స్కాలర్షిప్ల ప్రదానోత్సవం ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రంలో నిర్వహించారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చింతల శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సభలో 2024–25 విద్యా సంవత్సరానికి 430 మంది విద్యార్థులకు రూ.14.53 లక్షల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. రామచంద్రప్రభు మాట్లాడుతూ తాను ఎస్ఎస్ఎల్సీ పరీక్ష ఫీజు రూ.16 కోసం నాలుగిళ్లు తిరగాల్సి వచ్చిందని, పీయూసీ, బీటెక్ను మెరిట్ స్కాలర్షిప్తోనే చదువుకున్నట్టు గుర్తుచేసుకున్నారు. స్కాలర్షిప్ ప్రాముఖ్యతను విద్యార్థులు గుర్తెరగాలని చెప్పారు. రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్బాబు మాట్లాడుతూ ఇరవైఏళ్లుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్న అసోసియేషన్ సభ్యులను అభినందించారు. నారాయణ గ్రూప్ స్కూల్స్, గుంటూరు ఏజీఎం దాసం శివనాగరాజు, శింగులూరి వీరన్న, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి బళ్లా నరేంద్రకుమార్, భావనా పవన్కుమార్, రంగిశెట్టి రమేష్ ప్రసంగించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జవ్వాజి కోటినాగయ్య, కార్యదర్శి తాడికొండ చిన్నబ్బాయి, సభ్యులు బొల్లిముంత అమరేశ్వరరావు, వెంకటపున్నారావు, బొల్లిముంత శివరామకృష్ణ, సాయికృష్ణ, సాంబశివరావు, బర్మా కోటేశ్వరరావు, జగన్మోహనరావు, సోమరౌతు సాంబశివరావు, తన్నీరు కళ్యాణ్కుమార్ తదితరులు పర్యవేక్షించారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, తెనాలి యూనిట్ కార్యదర్శిగా ఎన్నికై న ముళ్లపూడి సాయికృష్ణను అతిథుల చేతులమీదుగా సత్కరించారు. పారిశ్రామికవేత్త తులసీ రామచంద్రప్రభు 430 మందికి రూ.14.53 లక్షల స్కాలర్షిప్లు అందజేత -
ఖోఖో బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక
నకరికల్లు: ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ పల్నాడు జిల్లా ఖోఖో జట్టు సెలక్షన్స్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఉత్కంఠభరితంగా సాగిన సెలక్షన్స్ను గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు వీరభద్రారెడ్డి, కార్యదర్శి చింతా పుల్లయ్య, ట్రెజరర్ జి.ఝాన్సీరాణి పర్యవేక్షించారు. సుమారు 200 మందికి పైగా బాలబాలికలు సెలక్షన్స్కు హాజరు కాగా బాలబాలికల్లో సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో సెలక్షన్స్ నిర్వహించారు. ఒక్కో జట్టుకు 19 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి చింతా పుల్లయ్య మాట్లాడుతూ పల్నాడు జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19వ తేదీ నుంచి 21వరకు జె.పంగులూరులోను, 24వ తేదీ నుంచి 26 వరకు గుడివాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు పలువురు అభినందనలు తెలిపారు. చిలకలూరిపేట: ఏరా శ్రీను.. ఎలా ఉన్నావు... పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ క్షేమమా అంటూ కాంతారావు పలకరింపు. బాగానే ఉన్నాను.. మీ పిల్లలు అంతా సెటిల్ అయ్యారా అంటూ శ్రీనివాసరావు ప్రతి పలకరింపు. 50 ఏళ్ల తర్వాత కలసిన మిత్రుల మధ్య భావోద్వేగ సన్నివేశమిది. చిలకలూరిపేట ఆర్వీఎస్ సీవీఎస్ హైస్కూల్లో 1974– 75 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం పాఠశాల ప్రాంగణంలో జరిగింది. 50 ఏళ్ల కిందట ఇక్కడ చదువుకుని.. వివిధ ప్రాంతాలలో స్థిర పడిన పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. స్కూల్ ప్రాంగణంలో తిరుగుతూ నాడు తాము చేసిన అల్లరి తలుచుకుంటూ, తరగతి గదులను పరిశీలించి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్న పిల్లల తరహా సందడి చేశారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను తలుచుకున్నారు. నాడు పాఠాలు బోధించిన గురువులు ప్రతాప వెంకట సుబ్రమణ్యశాస్త్రి, చిట్టిపోతు పట్టాభిరామారావు, ఎన్ వెంకట సుబ్బారావులను ఘనంగా సన్మానించారు. ఒకరికొకరు కొసరికొసరి వడ్డించుకుంటూ భోజనాలు చేశారు. సాయంత్రం బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు చెప్పుకున్నారు. 1975లో స్కూల్ ఎస్పీఎల్గా వ్యవహరించిన డీఎల్ కాంతారావు, పూర్వ విద్యార్థులు కందిమళ్ల రాంబాబు, కృష్ణమూర్తి, నాగరాజు, చంద్రశేఖరరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. -
బియ్యం లారీ బోల్తా
రెంటచింతల: మండలంలోని పాలువాయి జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున బియ్యం లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నుంచి బెంగుళూరుకు 600 బస్తాల లోడుతో వెళ్తున్న లారీకి ఎదురుగా వాహనం రావడంతో డ్రైవర్ పఠాన్ దస్తగిరి సడన్గా బ్రేక్ వేయడం వలన లారీ బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ దస్తగిరికి గాయాలు కాగా వెంటనే 108 అంబులెన్స్లో మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెనాలిఅర్బన్: దళితుడుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నం ధర్మారావు డిమాండ్ చేశారు. చుండూరు మండలం వలివేరు దళితవాడకు చెందిన పందిపాటి రెడ్డియ్యపై దాడికి నిరసనగా తెనాలి జిల్లా వైద్యశాలలో ఆదివారం ఎమ్మార్పీఎస్ నాయకులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ముందుగా బాధితుడిని పరామర్శించి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు వేమూరు(చుండూరు): వలివేరు గ్రామానికి చెందిన అప్పిరెడ్డి, సందీప్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ ఎం ఆనందరావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం చుండూరు మండలంలోని వలివేరు గ్రామానికి చెందిన పందిపాటి రెడ్డియ్య ట్రాక్టర్ ట్రక్కు వెనుక భాగం అప్పిరెడ్డి ఇంటి ప్రహారీకి తగిలింది. ఇద్దరు మధ్య వివాదం చోటుచేసుకుంది. అప్పిరెడ్డి, కుమారుడు సందీప్ కోపంతో పందిపాటి రెడ్డియ్యపై శుక్రవారం దాడి చేశాడు. బాధితుడు తెనాలి ప్రభుత్వం వైద్య శాలల్లో చికిత్స పొందుతున్నాడు. శనివారం ఆసుపత్రి అవుట్ పోలీసులు కేసు చుండూరు పోలీసు స్టేషన్కు పంపించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు డివిజన్ పీఆర్ఓ వినయ్కాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వికారాబాద్ – కాకినాడ టౌన్ (07264), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), సికింద్రాబాద్ – నరసాపూర్ (07239) రైళ్లు జనవరి 9వ తేదీన, వికారాబాద్ – నరసాపూర్ (07211) జనవరి 10న, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07280), సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261), వికారాబాద్ – నరసాపూర్ (07249) రైళ్లు జనవరి 11న, వికారాబాద్ – నరసాపూర్ (07211), వికారాబాద్–నరసాపూర్(07253) జనవరి 12 వ తేదీన, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07261) జనవరి 13న కేటాయించినట్లు తెలిపారు. కాకినాడ టౌన్ – వికారాబాద్( 07263) జనవరి 8న, నరసాపూర్–వికారాబాద్ (07250) జనవరి 9న, కాకినాడ టౌన్ –సికింద్రాబాద్ (07279), కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07262), నరసాపూర్ – వికారాబాద్ (07248) రైలు జనవరి 10న, నరసాపూర్ – వికారాబాద్ (07250) జనవరి 11న, కాకినాడ టౌన్ –వికారాబాద్(07262), నరసాపూర్–వికారాబాద్ (07248) జనవరి 12న, నరసాపూర్–వికారాబాద్ (07257), కాకినాడ టౌన్–వికారాబాద్ (07241) రైలు జనవరి 17న, నరసాపూర్–వికారాబాద్ (07259) రైలు జనవరి 18న, కాకినాడ టౌన్–వికారాబాద్ (07285) రైలు జనవరి 19న గుంటూరు డివిజన్ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు. ఈవ్టీజింగ్కు పాల్పడితే కఠిన చర్యలు నగరంపాలెం: జిల్లాలో ఈవ్టీజింగ్పై 332 మందికి అవగాహన కల్పించినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రహదారులపై అనవసరంగా సంచరిస్తున్న కొందరి ఆకతాయిలకు కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. ఈవ్టీజింగ్ను సహించేదిలేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. జిల్లాలోని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, వ్యాపార కూడళ్లు, రద్దీ ప్రదేశాల్లో ప్రత్యేక గస్తీ, ఆకస్మిక తనిఖీలు చేపట్టారని అన్నారు. -
రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు సర్వం సిద్ధం
జె.పంగులూరు: ఈ నెల 19 నుంచి 21 వరకు స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలోని క్రీడా ప్రాంగణంలో 44వ రాష్ట్రస్థాయి బాలబాలికల (18 సంవత్సరాల లోపు) ఖోఖో పోటీలు జరగనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, కె హనుమంతరావు తెలిపారు. స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాల క్రీడాప్రాంగణంలో ఆదివారం కేకేఎఫ్ఐ ఉపాధక్షుడు ఎం.సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో వివరాలు వెల్లడించారు. డాక్టర్ బాచిన చెంచుగరటయ్య మాట్లాడుతూ 19 నుంచి మూడు రోజుల పాటు జరగబోవు 44వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల నిర్వహణలో గ్రామస్తుల పాత్ర ఎంతో ఉందన్నారు. 1993 నుంచి పంగులూరులో 12 రాష్ట్ర, 4 జాతీయ స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఖోఖో నిర్వహణలో పంగులూరు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అతి త్వరలో రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ బిల్డింగ్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఇపాటికే కళాశాల క్రీడా ప్రాంగణంలో ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఖోఖో కార్యదర్శి కె.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 ఉమ్మడి జల్లాల నుంచి బాలబాలికలు 390 మంది క్రీడాకారులు వస్తారన్నారు. టీమ్లతో పాటు కోచ్, మేనేజర్స్ 52 మంది, అసోసియేషన్ సెక్రటరీలు 26 మంది క్రీడల నిర్వహణకు 150 మంది వలంటీర్లు వివిధ ప్రాంతాల నుంచి వస్తారన్నారు. 13 జిల్లాల నుంచి వచ్చే 195 మంది బాలురకు జూనియర్ కళాశాలలో వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 13 జిల్లాల నుంచి వచ్చే 195 బాలికల కోసం గ్రామస్తులు వారికి వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టీంతో వచ్చే కోచ్లకు, మేనేజర్లకు చర్చి ప్రాంగణంలో, రోటరీ క్లబ్లో వసతి కల్పించినట్లు తెలిపారు. వచ్చిన వారికి భోజన వసతులు పంగులూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సహకరించి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు రఘుబాబు, గ్రామ పెద్దలు రావూరి రమేష్, చౌదరి బాబు, ఆర్వీ సుబ్బారావు, రంగారావు, బాచిన నాగార్జున, ఐ. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ఇది కదా ఆనందమంటే..!
●40 వసంతాల ఆత్మీయ కలయిక ●వ్యవసాయ కళాశాల వేదిక బాపట్ల: ‘40 వసంతాల ఆత్మీయ కలయిక‘ వ్యవసాయ కళాశాలలో తాము అభ్యసించిన విద్య తమను ఉన్నత శిఖరాలకు చేర్చిందని, ఆచార్యులు తమ విద్యాభివృద్ధికి, వ్యక్తిత్వ వికాసానికి తీసుకున్న శ్రద్ధ ఈనాటి తమ ఆత్మీయ కలయికకు దోహదపడిందని బాపట్ల వ్యవసాయ కళాశాల 1985 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు అన్నారు. వ్యవసాయ కళాశాలలో జరిగిన 1985వ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో వారు తమ కళాశాలపై తమ భక్తి భావాన్ని ప్రదర్శిస్తూ ఈ పూర్వ విద్యార్థుల కలయిక కళాశాలతో తమకున్న అనుబంధాన్ని మరింతగా పెంచిందని తెలిపారు. 40 వసంతాల ఈ ఆత్మీయ సమ్మేళనం పట్ల తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత అస్సాం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మొహమ్మద్ ఆరిఫ్, 2014లో గుంటూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించిన కాంతిలాల్ దండే వంటి ఐఏఎస్ అధికారులు, ఎం.హెచ్.గంగాధర్, మహేష్ బాబు, దేవకుమార్, విజయనిర్మల, డి.సురేంద్ర, ఆర్.డి.ప్రసాద్, కె.వి.గోపికృష్ణ, డాక్టర్ రామచంద్రారెడ్డి, రాజేశ్వరి, సునీత, డాక్టర్ బి.ముకుందరావు, డాక్టర్ జె.వి.రమణ, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, బ్యాంకు మేనేజర్లు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారు పాల్గొన్నారు. ఆత్మీయ కలయిక కోసం అమెరికా నుంచి సురేంద్ర, వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా విచ్చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తారు. ఇంటర్మీడియెట్ మార్కులతో అగ్రికల్చరల్ బీఎస్సీ, చదివిన చిట్ట చివరి బ్యాచ్గా తమకు ఉన్న గుర్తింపు ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. కొందరు అలనాటి సినిమా గీతాలను ఆలపించారు. కాగా ప్రస్తుత విద్యార్థినులు మరకత వీణ, శాసీ్త్రయ భరత నాట్యంతో, పావని మౌక్తిక జానపద నాట్యంతో, ప్రసీద లలిత గీతాలు ఆలపించి పూర్వ విద్యార్థులకు వినోదాన్ని పంచారు. కార్యక్రమాన్ని ఆర్.శ్రీనివాస్, పూర్ణచంద్రరావు, కాటూరి నాగేశ్వరరావు, ప్రొఫెసర్ డి.వి.సాయిరాం కుమార్ పర్యవేక్షించారు. స్నేహాపు ఆనందాల జ్యోతులు వెలిగాయి. ఆ వేదిక తాకగానే వారి పాదాలు నాట్యమాడాయి. ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఆ హృదయాలు 40 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. అక్షరాలు దిద్దించిన గురువుల జ్ఞాపకాలు మదిలో మెదులుతుండగా.. బాల్యపు స్నేహ మాధుర్యాలు అక్షర కుసుమాలై పరిమళించాయి. తమ చదువుల గుడికి దాతృత్వపు హారం వేసిన అపూర్వ ఘట్టాలు బాపట్ల వ్యవసాయ కళాశాలలో శనివారం ఆవిష్కృతమయ్యాయి. -
వెటరన్.. అదిరెన్
ప్రత్తిపాడు: వెటరన్ క్రీడాకారులు అదరగొట్టారు. వయస్సును లెక్కచేయకుండా మూడు పదుల నుంచి ఏడు పదుల వయసు వరకూ సత్తా చాటారు. ప్రతిభకు ఆసక్తికి వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు. పెదనందిపాడు మండలం పాలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 45వ రాష్ట్ర స్థాయి చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి. రామకృష్ణ ప్రసాద్ హాజరయ్యారు. జాతీయ పతాకంతోపాటు క్రీడా జెండాను ఎగురవేశారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఆయా రాష్ట్రాల క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో భాగంగా తొలిరోజు లాంగ్ జంప్, షాట్ పుట్, 100, 800 మీటర్ల పరుగు పందెం పోటీలను నిర్వహించారు. అన్ని జిల్లాల నుంచి సుమారు నాలుగు వందల మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి 35 ప్లస్, 40 ప్లస్ , 45 ప్లస్ , 50 ప్లస్ , 55 ప్లస్ , 61 ప్లస్ , 65 ప్లస్, 70 ప్లస్.. ఇలా వయస్సుల వారీగా మహిళలు, పురుషుల విభాగాల్లో పోటీలు జరిగాయి. విజేతల వివరాలు ఇవీ.. తొలిరోజు విజేతలుగా నిలిచిన వారి వివరాలను ఏపీఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ మంగా వరప్రసాద్, వెటరన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ గణేశుని రాంబాబు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి శివనాగేశ్వరరావులు వెల్లడించారు. షాట్పుట్ 30 ప్లస్ మహిళల విభాగంలో ప్రథమ స్థానంలో వి. సుదీప్తి (కృష్ణా జిల్లా), ద్వితీయ స్థానం ఎ. సావిత్రి (గుంటూరు), 40 ప్లస్ విభాగంలో డి. స్వర్ణవాహిణి (కృష్ణా) ప్రథమ స్థానం, ఆర్. నిర్మల (విశాఖపట్నం) ద్వితీయ స్థానం, 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ సి. విజయకళ ప్రథమ, కె. పద్మావతి ద్వితీయ స్థానాలు, 65 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన జె. లక్ష్మీ నరసమ్మ ప్రథమ స్థానం సాధించింది. మహిళల 800 మీటర్ల రన్నింగ్ పోటీల్లో 60 ప్లస్ విభాగంలో నెల్లూరు జిల్లాకు చెందిన పి. కోటేశ్వరమ్మ ప్రథమ స్థానం, పి. రాజేశ్వరమ్మ ద్వితీయ స్థానం, 65 ప్లస్ విభాగంలో నెల్లూరుకు చెందిన జె. లక్ష్మీనరసమ్మ ప్రథమ స్థానం సాధించారు. షాట్పుట్ 70 ప్లస్ మహిళల విభాగంలో విశాఖపట్నానికి చెందిన బి. వెంకటలక్ష్మి ప్రథమ స్థానం సాధించింది. 100 మీటర్ల పురుషుల పరుగు పందెం 70 ప్లస్ విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన ధనుంజయ, గుంటూరుకు చెందిన పి. వెంకటప్పయ్య, విశాఖకు చెందిన శంకరరావులు విజయం సాధించారు. విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, క్రీడాకారులు పాల్గొన్నారు. రన్నింగ్ పోటీల్లో క్రీడాకారుడులాంగ్ జంప్ పోటీల్లో మహిళఉత్సాహంగా ఏపీ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ ఆరంభం -
జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా కోర్టులో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ను శనివారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 53 బెంచీలను, గుంటూరు జిల్లా కోర్ట్ ప్రాంగణంలో 17 బెంచీలను ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట ఎన్హెచ్16 వంతెన వద్ద జరిగిన ఒక ప్రమాదంలో అశోక్కి సంబంధించిన ప్రమాద బీమా కేసులో బాధిత కుటుంబానికి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ రూ. కోటి అందించింది. విజ్ఞాన్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్ట్, డాక్టర్ పి. రాజారామ్మోహన్ మధ్య ఐదు ముఖ్యమైన చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించారు. బెంగళూరులోని ఒక భూమి విక్రయ ఒప్పందం విఫలమైన వివాదంలో లోక్ అదాలత్ ద్వారా రూ.20 కోట్ల మేరకు రాజీ కుదిర్చారు. జిల్లా వ్యాప్తంగా సివిల్ కేసులు 1,376, క్రిమినల్ కేసులు 21,415, చెక్ బౌన్స్ కేసులు 578, ప్రీ లిటిగేషన్ కేసులు 97 కలిపి మొత్తం 23,466 కేసులు పరిష్కరించారు. న్యాయ సేవాధికార సంస్థ తరఫున కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ సహకారం అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. విడిపోయిన జంటను ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.నీలిమ సమక్షంలో కౌన్సెలింగ్ ద్వారా కలిపారు. దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 2,212 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. బ్యాంక్ కెనాల్ 150 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 70, పశ్చిమ కాలువకు 45, నిజాంపట్నం కాలువకు 50, కొమ్మూరు కాలువకు 1,666 క్యూసెక్కులు విడుదల చేశారు. 2 నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం వన్టౌన్(విజయవాడ పశ్చిమ): విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు టి.మనోహర్నాయుడు, కె.లక్ష్మయ్య తెలిపారు. సొసైటీ కార్యాలయంలో శనివారం పుస్తక మహోత్సవం పోస్టర్లను ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంగణంలో జరిగే ఈ పుస్తక మహోత్సవం ప్రాంగణానికి వడ్లమూడి విమలాదేవి, ప్రధాన వేదికకు ప్రముఖ రచయిత డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించే ప్రతిభ వేదికకు జయంత్ నార్లేకర్ పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు. రెండో తేదీ సాయంత్రం ఆరు గంటలకు పుస్తక మహోత్సవం ప్రారంభమవుతుందని, ముఖ్యమంత్రిని లేదా ఉపముఖ్యమంత్రి తదితర ప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జనవరి ఐదో తేదీ సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు జె.ప్రసాద్, సహాయ కార్యదర్శి ఎ.బి.ఎన్.సాయిరామ్, కోశాధికారి కె.రవి, కార్యవర్గ సభ్యులు జి.లక్ష్మి, నాగిరెడ్డి, శ్రీనివాస్, ఎ.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 574.10 అడుగులకు చేరింది. ఇది మొత్తం 266.8601 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు వెయ్యి, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 29,354, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. జలాశయం నుంచి ఔట్ఫ్లోగా 49,995 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 49,995 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
మహిళల్లో మౌనం బలహీనత కాకూడదు
●కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ●తుళ్లూరులో ఘనంగా నయీ చేత 4.0 కార్యక్రమం ●పాల్గొన్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తాడికొండ: మహిళల్లో మౌనం బలహీనత కాకూడదని కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్న్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. లింగ సమానత్వ జాతీయ ప్రచార కార్యక్రమం నయీ చేతన 4.0 కార్యక్రమం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డీఆర్డీఏ సౌజన్యంతో తుళ్లూరు మేరీమాత హైస్కూల్లో శనివారం నిర్వహించారు. నయీ చేతన 4.0 కార్యక్రమంలో భాగంగా సీఆర్డీఏ స్కిల్ హబ్ భవనంలో జెండర్ రిసోర్స్ సెంటర్ను హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లతో కలిసి ప్రారంభించారు. ప్రదర్శన శాలలను మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మంత్రి డాక్టర్ పెమ్మసాని మాట్లాడుతూ వివక్ష తగ్గించడమే నయీ చేతన 4.0 కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. సమాజంలో బాల్య వివాహాలు, గృహ హింస, లింగ వివక్ష వంటి రుగ్మతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో 4.50 లక్షల గృహ హింస కేసులు నమోదు అయ్యాయని గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ వివక్షకు గురౌతున్నట్లు అంచనా ఉన్నప్పటికీ అన్ని కేసులు నమోదు కావడం లేదని, ఇందుకు పరువు ప్రతిష్ట కోసం ఆలోచించడం కారణమన్నారు. అందుకే నయీ చేతన కార్యక్రమాన్ని 2021 సంవత్సరంలో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారన్నారు. లింగ సమానత్వం వంట గది నుండి ప్రారంభం కావాలని, అప్పుడే మహిళలు శారీరకంగా, మానసికంగా ధైర్యంగా, స్థైర్యంగా ఉండగలరన్నారు. రాష్ట్ర ఎంఎస్ఎంఇ, సెర్ప్, ఎన్.ఆర్.ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి మాట్లాడారు. జెండర్ చాంపియన్లు చలివెంద్రి సుగంధి, తురకా శ్యామల మాట్లాడారు. జెండర్ చాంపియన్లను మంత్రులు సత్కరించారు. అనంతరం లింగ సమానత్వం కోసం అవగాహన కల్పిస్తూ లఘు నాటికను ప్రదర్శించారు. లింగ సమానత్వంపై అవగాహన కరదీపికను విడుదల చేసి సెల్ఫీ తీసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కోసం వైద్య ఆరోగ్యశాఖ ఉచిత వైద్య శిబిరం, మిషన్ శక్తి కార్యక్రమాలపై ఐసీడీఎస్, శక్తి టీంపై జిల్లా పోలీస్ శాఖ, మహిళా కార్మికులు పని ప్రదేశాల్లో సౌకర్యాలపై జిల్లా కార్మిక శాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సైన్న్స్ ఎగ్జిబిషన్, గ్రామీణ యువతకు డిడియు జీకేవై 2.0 ద్వారా శిక్షణ కార్యక్రమాలపై సీడాప్–డిఆర్డిఏ, స్వయం సహాయక సంఘాల వ్యాపార ఉత్పత్తులతో విక్రయాలు, ప్రదర్శన శాలలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వాకాటి కరుణ, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సెర్ప్ సంచాలకులు శివ శంకర్ ప్రసాద్, డీఆర్డీఏ ఇన్చార్జి ప్రాజెక్టు డైరెక్టర్ వి.విజయలక్ష్మి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్, స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరుకు శనిలా పెమ్మసాని
పట్నంబజారు: గుంటూరుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శనిలా పట్టుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అధికారం ఉందనే గర్వంతో విర్రవీగుతున్నారని మండి పడ్డారు. ‘అధికారం ఉంటే నువ్వేమైనా రౌడీవా పెమ్మసాని’ అని ప్రశ్నించారు. శనివారం గుంటూరు నగరంలోని శంకర్విలాస్ సెంటర్లో జరుగుతున్న ఓవర్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. తొలుత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పరిశీలించిన అనంతరం అరండల్పేట వైపు వచ్చి పిల్లర్లు, తదితర అంశాలను పరిశీలించారు. స్థానిక వ్యాపారులు తమ గోడును వైఎస్సార్సీపీ నేతలకు తెలిపారు. ఫ్లయ్ ఓవర్కు అటు, ఇటు 12 అడుగులు వదిలి పెట్టాలని కోర్టు ఆదేశించినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్పొరేషన్ అధికారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, షాపుల తాళాలు పగులగొడుతున్నారని తెలిపారు. ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టాలని ఇబ్బంది పెడుతున్నారని, బాండ్లు ఇస్తామని చెబుతున్నారు తప్ప నష్ట పరిహారంపై మాట్లాడటం లేదన్నారు. డమ్మీలుగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పెమ్మసాని పెత్తనమే కొనసాగుతోందని ఆరోపించారు. నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు డమ్మీలు మాత్రమేనని విమర్శించారు. రూ. 90 కోట్లతో అసలు బ్రిడ్జిని ఏవిధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు. తాము బ్రిడ్జి నిర్మాణానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2014, 2019 సమయంలో ఆర్ అండ్ బీ మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు, అప్పటి ఎంపీ గల్లా జయదేవ్, పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న మోదుగుల వేణుగోపాలరెడ్డి రూ. 167 కోట్లతో సింగిల్ పిల్లర్ బ్రిడ్జినిర్మాణంతోపాటు, ఆర్యూబీ నిర్మించి నగరానికే మణిహారంలా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించారని తెలిపారు. నగరాన్ని సర్వనాశనం చేసేందుకే పెమ్మసాని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం అఖిల పక్ష సమావేశం నిర్వహించకుండా పెద్ద ఇంజినీర్లు చెబుతున్నప్పటికీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం సగం బ్రిడ్జి మాత్రమే పడగొట్టారని, కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకోకుండా అసలు బ్రిడ్జి ఎలా ప్రారంభిద్దామని అనుకున్నారని ప్రశ్నించారు. అడ్డగోలుగా పనులు మాజీ ఎంపీ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా పార్టీ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ శంకర్విలాస్ ఓవర్బ్రిడ్జి నిర్మాణంపై కనీసం అఖిల పక్ష కమిటీతో చర్చలు లేకుండా ఎలా పనులు ప్రారంభించారని ప్రశ్నించారు. బ్రాడీపేటకు సంబంధించి 14 అడ్డరోడ్డు తెరవకపోవడం పాలకులు, అధికారుల బుద్ధి లేని తనానికి నిదర్శనమన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి లేకుండా బ్రిడ్జి పడగొట్టి, ఆర్యూబీ కూడా నిర్మాణం చేపట్టని దుస్థితిలో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులకు వెళ్లే సమయాల్లో పేదలు ఆటోలోనే మృతి చెందుతున్న పరిస్థితులు ఎంతో బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు, రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, మెట్టు వెంకటప్పారెడ్డి, బైరెడ్డి రవీంద్రారెడ్డి, నందేటి రాజేష్, మామిడి రాము, పఠాన్ అబ్దుల్లా ఖాన్, ఎర్రబాబు, మేడా మురళి, వంగా సీతారామిరెడ్డి, సింగ్ నరసింహారావు, యేటి కోటేశ్వరరావు యాదవ్, బత్తుల దేవానంద్, కార్పొరేటర్లు ఆచారి, అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, కామిరెడ్డి రంగారెడ్డి, అంబేడ్కర్, పూనూరి నాగేశ్వరరావు, పోలవరపు వెంకటేశ్వర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు ఆలా కిరణ్, పఠాన్ సైదా ఖాన్, కానూరి శశిధర్, బుల్లెట్ సలీం, పిల్లి మేరి, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టిన ట్రక్కు
●తీవ్రగాయాలు ●నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు బల్లికురవ: పొలం వెళ్లేందుకు రోడ్డు దాడుతున్న మహిళను రోడ్డు అభివృద్ధి పనులు చేసే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం మేదరమెట్ల–నార్కెట్పల్లి నామ్ రహదారిలోని బల్లికురవ మండలంలోని ఎస్ఎల్ గుడిపాడు గ్రామంలో జరిగింది. అందిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏటి సంపూర్ణ గ్రామంలో నుంచి పడమర వైపు పొలాలకు వెళుతోంది. రోడ్డు అభివృద్ధి పనుల పేరిట రామాంజనేయపురం నుంచి ఎస్ఎల్ గుడిపాడు వరకు ఒకవైపుకు ట్రాఫిక్ మళ్లించారు. ట్రక్కు ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రురాలిని హుటాహుటిన చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతుంది. నామ్ రహదారిపై తరచూ మరమ్మతుల పేరిట ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ బారిగేట్లు, స్టాపర్లు అడ్డుపెడుతూ ప్రమాదాలు సంభవించేలా చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరగంటపాటు గుడిపాడు గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తూ నామ్ రహదారిపై ఆందోళన చేపట్టారు. రెండు వైపుల వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న ఎస్సై వై. నాగరాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులకు నచ్చచెప్పి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. -
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు
బాపట్లటౌన్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహన చోదకులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ హెల్మెట్ బరువు కాదు, అది మీ ప్రాణానికి రక్షణ కవచంలాంటిదన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణతోపాటు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నరసరావుపేట: ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో 2025–26 విద్యా ఏడాదికి ఆదివారం వరకు కొనసాగనున్నాయి. పోటీలలో పురుషుల ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు లూథరన్ హైస్కూల్ మైదానంలో నిర్వహించగా, మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలు నిర్వహించారు. టీడీపీ నాయకుడు డాక్టర్ రాంప్రసాద్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెనాలి: విజయవాడలోని టీటీడీ కల్యాణ మండపంలో రోడ్డులో ఆదివారం జరగనున్న తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ 4వ చిత్రకళా సంతలో తెనాలి శిల్పకళా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ కోరికపై తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఇందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఈ ప్రదర్శనలో భారతరత్న అటల్ బిహారి వాజపేయి, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్టాటా విగ్రహాలతోపాటు స్టైలిష్ స్టిల్తో తయారుచేసిన సింహం, పులి, జామెంట్రిక్ షేప్తో రూపొందించిన జింక, త్రీడీ టెక్నాలజీతో చేసిన ఎలిఫెంట్ ఫైట్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, సెల్ఫ్ మేడ్ పర్సన్ విగ్రహాలను ప్రదర్శిస్తున్నట్టు ‘కళారత్న’ కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మహాసభలు ఆదివారం ఉదయం చేబ్రోలులోని ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు తెలిపారు. మహాసభల ఏర్పాట్లను శనివారం యూటీఎఫ్ నాయకులు పర్యవేక్షించారు. జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో మహాసభలు ప్రారంభం కానున్నాయని, చేబ్రోలు ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా మహాసభలలో జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చేబ్రోలు మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఖాదర్ బాషా, పి.పార్థసారథి కోరారు. -
దళారుల దందా
మేము అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని బాకా ఊదిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదు. ధాన్యం సేకరణ చేస్తున్నామని చెబుతున్నా ఎక్కడా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. తేమ శాతం సాకుగా చూపి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు. అధికారులు దళారులతో కుమ్మక్కై రైతుల కడుపు కొడుతున్నారు. మద్దతు ధర లభించక అన్నదాతలు నష్టపోతున్నారు. సాక్షి ప్రతినిధి,బాపట్ల: రేపల్లె మండలం పెనుమూడి గ్రామానికి చెందిన కౌలు రైతు నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేసి ఇటీవల కోత కోశాడు. రెండు రోజులు ఆరబెట్టి రైతు సేవా కేంద్రానికి ధాన్యం తీసుకెళితే తేమశాతం 20గా ఉందని, మరో రెండు రోజులు ఆరబెట్టి తీసుకరావాలని చెప్పారు. అక్కడే ఉన్న దళారి ఽఈ క్రాప్, పాస్ పుస్తకం పేపర్లు ఇస్తే ధాన్యం అమ్మిస్తానని నమ్మబలికి రైతును రైస్మిల్లుకు తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే తేమ శాతం 26గా వుంది. అదనంగా ఉన్న తొమ్మిది పాయింట్లకు 9 కిలోల ధాన్యం కోతకు అంగీకరిస్తే ఓకే అన్నాడు దళారి. ధాన్యాన్ని మరో రెండు రోజులు ఆరబెట్టే వసతి లేకపోవడం, ఈలోపు వర్షం కురిస్తే ధాన్యం అమ్ముకోలేనని భయపడ్డ రైతు మిల్లర్ షరతులకు అంగీకరించి దళారి చెప్పినట్లు ధాన్యాన్ని తెగనమ్ముకున్నాడు. తేమశాతం 17 ఉంటే 75 కిలోల బస్తాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.1792 ఇవ్వాల్సి ఉండగా కిలోకు రూ.23.82 చొప్పున 9 కిలోలకు రూ.215 పోను బస్తా కు కేవలం రూ.1576 ఇచ్చారు. రైతు ఈ క్రాప్, పాస్పుస్తకం పేపర్లు తీసుకున్న రైస్ మిల్లర్ పౌరసరఫరాల అధికారితో కలిసి సదరు రైతు పేరు ప్రొక్యూర్మెంట్ జాబితాలో చేర్చుకొని మద్దతు ధరను సొంతం చేసుకుంటారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఎలా జరిపిస్తారన్న దానికి ఇదో ఉదాహరణ. ధాన్యాన్ని అమ్మాలంటూ వేమూరు మండలానికి చెందిన రైతును అడిగాడు దళారి. మద్దతు ధరకు అమ్ముకుంటానంటూ రైతు ఽకుదరదన్నాడు. ఆరబెట్టిన ధాన్యాన్ని రెండు రోజుల తరువాత రైతుసేవా కేంద్రానికి తీసుకెళ్లి చూపించాడు రైతు. కొంటామని చెప్పిన సిబ్బంది రెండు రోజుల తర్వాత అదే దళారిని వెంటబెట్టుకొని వచ్చి తేమ శాతం 20కి పైగా ఉందని, మరో రెండు రోజులు ఆరబెట్టాలన్నారు. వెకిలిగా నవ్విన దళారి నాకు తెలియకుండా ఈ ఊర్లో ప్రభుత్వం ధాన్యం కొనదు అన్నాడు. నువ్వు ఓకే అంటే అమ్మిస్తానన్నాడు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ఎలావుందో ఈ ఘటన ఉదాహరణ. రంగంలోకి దళారులు ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్ల తరపున దళారులు రంగంలోకి దిగారు. ప్రతి రైతు సేవా కేంద్రంలోనూ వారు తిష్టవేశారు. ధాన్యం తీసుకు వచ్చిన రైతులకు తేమశాతం అధికంగా చూపి భయపెడుతున్నారు. ఆ తర్వాత ధాన్యాన్ని మిల్లర్లకు అమ్మిస్తున్నారు. ఈ క్రాప్, పాస్ పుస్తకం పేపర్లు రైతుల నుంచి తీసుకుంటున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే ఆ రైతుల ధాన్యాన్ని మిల్లర్లు కొనడంలేదు. మద్దతు ధరకు ధాన్యం కొనాల్సిన రైతు సేవా కేంద్రాల అధికారులు మిల్లర్లు నియమించుకున్న దళారులు చెప్పిన రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొంటున్నారని కర్లపాలెం మండలానికి చెందిన సర్పంచ్ సాక్షితో వాపోయారు. రైతు సేవాకేంద్రాల్లో ఉన్న తేమ శాతం యంత్రాలకు, రైస్ మిల్లుల్లో ఉన్న యంత్రాలకు పొంతన సరిపోవడంలేదు. రెండు యంత్రాలకు 6 నుంచి 10 శాతం తేడా ఉంటోంది. రైతు సేవా కేంద్రాల్లోని కొన్ని యంత్రాల్లోనూ అధికారులు, మిల్లర్లు కలిసి తేమశాతం అధికంగా ఉండేలా చేసినట్లు ఆరోపణలున్నాయి. తేమశాతం యంత్రాల్లో తేడాలు రాకుండా చూసుకోవాలని, వీలైనంత వరకూ రైతుసేవా కేంద్రాల్లో ఉన్న యంత్రాలు రైస్మిల్లుల్లో కూడా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ పదేపదే చెప్పినా అమలు కావడంలేదు. దళారులను కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రైతు సేవా కేంద్రం అధికారులు, మిల్లర్లు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌరసరఫరాల అధికారులు మిల్లర్లు ప్రతిఏటా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తెరతీయం మామూలైంది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలలో సగం కూడా మద్దతు ధరకు కొనడం లేదన్న విమర్శలున్నాయి. మిల్లర్లు తేమశాతం అధికంగా చూపి రైతులను భయపెట్టి తక్కువ ధరకు కొన్న ధాన్యాన్ని ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ కింద చూపి పౌరసరఫరాల అధికారులు, మిల్లర్లు కలిసి రూ.కోట్లలో డబ్బులు కొల్లగొడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి ఏటా ఇదే జరుగుతున్నా ఉన్నతాధికారులు అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతున్నారు. -
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో జట్ల ఎంపిక
జె.పంగులూరు: స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలురు, పురుషులు ఖోఖో జట్ల ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి బాలురు, పురుషుల క్రీడాకారులు 150 మంది పాల్గొన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కళాశాలలో జూనియర్ బాల, బాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరగనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 24, 25, 26 నుంచి రాష్ట్రస్థాయి సీ్త్ర పురుషుల ఖోఖో పోటీలు నిర్వహిస్తారన్నారు. క్రీడాకారుల ఎంపికలో ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు వసంత రఘుబాబు, ఉపాధ్యక్షుడు మండవ సౌజన్య, జాయింట్ సెక్రటరీ వై శ్రీనివాసరెడ్డి పాల్గొని జట్లను ఎంపిక చేసినట్లు ఖోఖో సమాఖ్య ఉపాధ్యక్షులు తెలిపారు. -
ఆన్లైన్లో పరిచయం.. రూ. 18 లక్షలకు టోకరా
లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడు సత్తెనపల్లి: ఫేస్బుక్లో పరిచయమైన యువతి మాటలు నమ్మి ఓ యువకుడు రూ.18 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వెలుగు చూసింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి 20వ వార్డుకు చెందిన తుమ్మల వెంకటేష్బాబు సెల్ఫోన్కు సంబంధించిన విడిభాగాలు విక్రయిస్తుంటారు. వెంకటేష్బాబుకు సెప్టెంబర్ నెలలో ఢిల్లీకి చెందిన సీహెచ్ రుచి అనే యువతి ఫేస్బుక్లో పరిచయమైంది. ఇరువురు వాట్సాప్ ద్వారా చాటింగ్, మాట్లాడుకోవటం చేశారు. ఆమె తెలుగులో మాట్లాడటంతో నమ్మాడు. ఢిల్లీలోని వసంత విహార్ ఏరియాలో నివసిస్తున్నానని, ఎలైట్ మాల్ స్టోర్ అండ్ ఈ కామర్స్ ఆన్లైన్ వ్యాపారానికి మేనేజర్గా పనిచేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఆన్లైన్లో బంగారం, వెండి, తదితర విలువైన వస్తువులు తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించి లాభాలు గడించవచ్చని నమ్మించింది. ఆమె రిఫరల్ ఐడీ లింకు ద్వారా లాగిన్ అయి మొదట ప్రవేశ రుసుము కింద రూ. 40 వేలు కట్టాడు. వివిధ వస్తువుల కొనుగోలు నిమిత్తం నగదు చెల్లించాడు. కొద్ది రోజులకే ధర పెరిగి లాభాటు వచ్చినట్టు చూపారు. గోల్డ్ రింగులు, చైన్లు, బ్రాస్లెట్స్ వంటివి తక్కువ ధరకు ఉన్నట్లు రుచి చెప్పింది. అత్యాశకు పోయిన వెంకటేష్ బాబు మరికొంత డబ్బును యూపీఐ, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించి వస్తువులు కొనుగోలు చేశారు. ఆ నగదు వచ్చేలోపు మరో వస్తువు తక్కువ ధరకు చూపిస్తుండడంతో మొత్తం రూ.18 లక్షలు పెట్టి సామగ్రి కొన్నారు. లాభాలు అధికంగా వచ్చాయని నగదు విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. -
యర్రబాలెంలో స్పటిక రాళ్లు చోరీ
●బీభత్సం సృష్టించిన గుర్తు తెలియని వ్యక్తులు ●వాచ్మన్ను బంధించి రూ.5 లక్షల విలువైన రాళ్లు అపహరణ మంగళగిరి టౌన్: మంగళగిరి నగర పరిధిలోని యర్రబాలెంలో క్రిస్టల్స్ (స్పటిక రాళ్లు) చోరీకి గురైన ఘటన శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. యర్రబాలెం – పెనుమాక రహదారిలో కొన్నేళ్లుగా పలువురు భాగస్వామ్యంతో క్రిస్టల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు బీభ త్సం సృష్టించారు. నెంబరు ప్లేట్లు లేని మూడు కా ర్లలో వచ్చి వాచ్మేన్ కుటుంబాన్ని బెదిరించి, తాళ్ల తో బంధించారు. కేకలు వేయకుండా నోటిపై ప్లాస్టి క్ స్టిక్కర్లు అతికించారు. అనంతరం గోడౌన్ షట్టర్ తాళాన్ని కటింగ్ మిషన్తో కట్ చేసి, సీసీ కెమెరాల కనెక్షన్ను సైతం తొలగించారు. గోడౌన్లోకి ప్రవేశించి కొన్ని క్రిస్టల్స్ను గోతాల్లో నింపుకుని, వారు వచ్చిన కారుల్లో వేసుకుని పరారయ్యారు. అపహరణకు గురైన క్రిస్టల్స్ విలువ 5 లక్షల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ముందుగానే చోరీకి వ్యూహం దుండగులు పక్కా వ్యూహంతోనే చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. రెండు నెలల కిందట ఇదే విధంగా గుర్తు తెలియని వ్యక్తులు క్రిస్టల్స్ చోరీకి యత్నించారు. గోడౌన్ బయట వున్న కెమెరాల కనెక్షన్ను కూడా కత్తిరించారు. గమనించిన వాచ్మేన్ కుటుంబీకులు పెద్దగా కేకలు వేయడంతో పారిపోయే క్రమంలో వాకీటాకీని జారవిడుచుకున్నారు. అప్పట్లో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసి, దుండగులు వదిలి వెళ్లిన వాకీటాకీని సైతం పోలీసులకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. విభేదాలే కారణమా? నలుగురు భాగస్వాములు ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి మధ్య విభేదాల కారణంగానే ఈ చోరీ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిలో ఒక భాగస్వామి వేరే ప్రాంతంలో క్రిస్టల్స్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఆయనే ఈ ముఠాను పంపి భీభత్సం సృష్టించడంతో పాటు దొంగిలించుకుపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చోరీకి జరిగిన తీరులో కొంత భాగం కెమెరాల్లో నమోదైంది. గోడౌన్ లోపలికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించిన ప్రవేశించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. వారిలో ఒక వ్యక్తి గతంలో ఇదే గోడౌన్కు వచ్చాడని, వాచ్మేన్ కుటుంబ సభ్యులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రూరల్ పోలీసులు ఘటనపై మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం రావడంతో శనివారం ఉదయం గోడౌన్ను సీఐ ఎ.వి. బ్రహ్మం, ఎస్ఐ వెంకట్ సిబ్బందితో పరిశీలించారు. లోపల, బయట పరిశీలించి కొన్ని ఆధారాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. -
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్, కలరిపయట్టు పోటీలు ప్రారంభం
పెదకాకాని: విద్యార్థులంతా క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యాయా మోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చుక్కా కొండయ్య తెలిపారు. రాష్ట్రస్థాయి కలరిపయట్టు, ఫెన్సింగ్ పోటీలు గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని వెనిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆధునిక నర్సింగ్ హోం డాక్టర్ వీర్నల ప్రత్యూష్ మాట్లాడుతూ క్రీడల ద్వారా దేహదారుఢ్యం, స్నేహ సంబంధాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు. కలరిపయట్టు అండర్– 17 బాలబాలికల విభాగాల్లో 60 మంది పాల్గొన్నారన్నారు. పెన్సింగ్ అండర్– 17, అండర్– 19 బాలబాలికల విభాగాల్లో పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. 360 మంది క్రీడాకారులు హాజరు పోటీలకు రాష్ట్రస్థాయిలో 13 జిల్లాల నుంచి సుమారు 360 మంది క్రీడాకారులు హాజరయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీలు ఎం. గోపి, కె. నాగశిరీష ఆధ్వర్యంలో ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ శిల్ప సిందూర, పర్యవేక్షకులు మోహనలక్ష్మి, వ్యాయామోపాధ్యాయుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. లక్ష్మీపతి, పలువురు పీఈటీలు పాల్గొన్నారు. -
భవానీ.. శరణు శరణు
భవానీ దీక్షల విరమణకు తరలివస్తున్న భక్తులుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్లు కొలువైన ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు తరలివస్తున్నారు. భవానీల రాకతో ఆలయ పరిసరాలు ఎరుపెక్కాయి. మూడో రోజైన శనివారం లక్ష మంది మాలవిరమణ చేశారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తెల్లవారుజాము రెండు గంటలకు అమ్మవారికి నిత్య పూజల అనంతరం భవానీలను దర్శనానికి అనుమతించారు. చలి తీవ్రత అధికంగా ఉన్నా భవానీలు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని దీక్షలు విరమిస్తున్నారు. శనివారం వేకువ జాము రెండు నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఆలయానికి భవానీలు భారీగా తరలివచ్చారు. వీఎంసీ కార్యాలయం, సీతమ్మ వారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన కంపార్టుమెంట్టు కిటకిటలాడాయి. సాయంత్రమే అధికం గిరిప్రదక్షిణ మార్గంలో పగటి వేళ కంటే రాత్రి వేళలోనే భవానీల రద్దీ అధికంగా కనిపిస్తోంది. కుటుంబ సమేతంగా దీక్షల విరమణకు వస్తున్న భవానీలు సాయం సమయంలో ప్రశాంత వాతావరణంలో గిరిప్రదక్షిణ చేసి, తెల్లవారుజామున అమ్మవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అవుతున్నారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లో చేరుకున్న తర్వాత రెండు గంటల్లో అమ్మవారి దర్శనం, ఇరుముడి, హోమ గుండంలో నేతి కొబ్బరి కాయ సమర్పణ, ప్రసాదాల కొనుగోలు పూర్తవుతోందని భవానీలు పేర్కొంటున్నారు. ఉదయం ఆరు గంటల లోపే భవానీలు దీక్షలను పరిపూర్ణం చేసుకుని రైల్వేస్టేషన్, బస్టాండ్కు చేరుతున్నారు. విశాఖపట్నం వైపు రత్నాచల్, హైదరాబాద్ వైపు శాతవాహన, చెన్నయ్ వైపు పినాకినీ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల లోపు అందుబాటులో ఉండటం ఇందుకు కారణం. -
కాల భైరవస్వామికి పూజలు
పెదపులివర్రు(భట్టిప్రోలు): వ్యాఘ్రపుర క్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ అమ్మవారి దేవాలయంలో కొలువైన శ్రీ కాల భైరవస్వామి వారికి మార్గశిర బహుళాష్టమి శుక్రవారం ప్రాతఃకాలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ దేవత అమ్మవారి దేవాలయంలో నిత్యపూజ కై ంకర్యాలు విరజిల్లుతూ భక్తుల కోర్కెలు తీర్చే బంగారు కల్పవల్లి అమ్మవారిని భక్తులు సందర్శించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : గుంటూరు సంపత్నగర్ శ్రీరామనామ క్షేత్రంలో నిర్వహిస్తున్న 99వ శ్రీరామకోటి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి మూలవిరాట్లకు పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు, అలంకరణ జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి ఉత్సవ మూర్తులను తెప్ప తిరునాళ్లతో మహోత్సవం నిర్వహించారు. అనంతరం హోమం పూర్ణాహుతి చేయగా, వసంత సేవ, అవబదోత్సవం, చక్రతీర్థం కార్యక్రమాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరు కాగా, కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ రాగం వెంకట లీలా సుందరి బెల్లంకొండ మస్తానరావు పర్యవేక్షించారు. నరసరావుపేట రూరల్: మిరప పంటలో తెగుళ్లు, చీడపీడలను అరికట్టేందుకు సస్యరక్షణ చేపట్టాలని పల్నాడు జిల్లా ఉద్యాన అధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. జిల్లా ఏరువాక కేంద్రం కో–ఆర్టినేటర్ డాక్టర్ ఎం.నగేష్, నరసరావుపేట ఉద్యాన అధికారి షేక్ నబీ రసూల్లతో కలిసి ఆయన శుక్రవారం మిరప తోటలను పరిశీలించారు. పోషక లోప నివారణకు పైపాటుగా 19–19–19, ఫార్ములా–6, మెగ్నీషియం సల్ఫేట్ను పిచికారి చేయాలని తెలిపారు. తెల్లనల్లి నివారణకు డైఫెన్డుయురాన్ 1.25 గ్రాములు లేదా స్పెరోమైసిఫెన్ ఒక మి.లీను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని సూచించారు. తెల్లదోమ నివారణకు ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటుచేసి, ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా థాయోమిథాగ్సం 0.4 గ్రాములు లేదా స్పెరోమైసిఫెన్ ఒక మీ.లీను లీటరు నీటితో కలిపి పిచికారి చేయాలని సూచించారు. నల్లతామర నివారణకు సైయాన్ట్రనిలిప్రోల్ 240 మి.లీ ఎకరానికి లేదా ఇమిడా క్లోప్రిడ్, ఫెఫ్రోనిల్ 50 గ్రాములు రెండు కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు. నగరంపాలెం (గుంటూరు వెస్ట్): మహాకాళ భైరవాష్టమిని పురస్కరించుకుని శుక్రవారం గుంటూరు నల్ల చెరువు ఒకటో వీధిలో శ్రీభవానీ శంకర శివసేన పూజ్య గురువులు శ్రీ సూర్యచంద్రేశ్వరానంద స్వామీజీ ఆధ్వర్యంలో కాళభైరవ జయంతి ఆరాధన శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహాకాళ భైరవాష్టమి విశిష్టతను భక్తులకు స్వామీజీ వివరించారు. అనంతరం భక్తులకు భారీ అన్న సంతర్పణ నిర్వహించారు. -
ఘనంగా ప్రారంభమైన క్రెడాయి ప్రాపర్టీ షో
నగరంపాలెం(గుంటూరువెస్ట్) :గుంటూరు నగరంలో ప్రముఖ స్థిరాస్థి సంస్థ క్రెడాయి ప్రాపర్టీ షోను గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. యూనియన్ బ్యాంక్ డీజీఎం సయ్యద్ జవహర్, స్టేట్ బ్యాంక్ డీజీఎం బి.కృష్ణకుమార్ ప్రభు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ది–గుంటూరు కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్యాదవ్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ఎం కిరణ్రెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, క్రెడాయి మాజీ ఏపీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గుంటూరు క్రెడాయి చైర్మన్ ఆరుమళ్ల సతీష్రెడ్డి, సెక్రటరీ మెట్టు సాంబశివారెడ్డి, ట్రజరర్ ఎ.వి.నాగార్జునరెడ్డి, ప్రాపర్టీ షో 2025 కన్వీనర్ తియ్యగూర వినోద్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శివనాగేశ్వరరావు, క్రెడాయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రాంబాబు, కార్యక్రమంలో క్రెడాయి బిల్డర్స్, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
కబడ్డీ ఓవరాల్ చాంపియన్ పల్నాడు జిల్లా
పెదకూరపాడు: గ్రామీణ స్థాయి నుంచి కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పని చేస్తుందని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ యలమంచిలి శ్రీకాంత్ అన్నారు. మూడు రోజులుగా పెదకూరపాడులోని జీఆర్సీఆర్కే శ్రీ చైతన్య పాఠశాలలో రాష్ట్రస్థాయి కబడ్డీ బాలురు, బాలికల పోటీలు, రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు, రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయి కబడ్డీ బాలురు విభాగంలో పల్నాడు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. పార్వతీపురం మన్యం జిల్లా ద్వితీయ స్థానంలో, మూడో స్థానంలో కాకినాడ, శ్రీకాకుళం జిల్లాలు జాయింట్ విన్నర్లుగా నిలిచాయి. బాలురు విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా క్రీడాకారుడు మణికంఠ బెస్ట్ రైడర్ అవార్డు పొందారు. బెస్ట్ ఆల్ రౌండర్గా పల్నాడు జిల్లాకు చెందిన జి హరీష్ నిలిచారు. కబడ్డీ బాలికల విభాగంలో విశాఖపట్నం జిల్లా జట్టు ప్రథమ స్థానంలో, శ్రీకాకుళం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచాయి. జాయింట్ విన్నర్గా కృష్ణాజిల్లా, కర్నూలు జిల్లాలు నిలిచాయి. బాలిక విభాగంలో బెస్ట్ రైడర్గా విశాఖకు చెందిన కుమారి, బెస్ట్ ఆల్ రౌండర్గా హరీష్ నిలిచారు. షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో గుంటూరుకు చెందిన విజయ్, గోపి ప్రథమ స్థానంలో, గుంటూరుకు చెందిన జితేంద్ర, నవీన్ల జోడి ద్వితీయ స్థానంలో నిలిచారు. విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజినీర్ కళాశాలకు చెందిన ప్రవీణ్, కృష్ణల జోడి తృతీయ స్థానంలో నిలిచింది. వాలీబాల్ విభాగంలో పల్నాడు జిల్లాకు చెందిన జీఆర్సీఆర్కే పాఠశాల, గుంటూరు జిల్లాకు చెందిన మేడికొండూరు జట్లు ప్రథమ ద్వితీయ స్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతితోపాటు షీల్డ్ అందించారు. జీఆర్సీఆర్కే శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్లు గుత్తా రాము, కవిత పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
సంతమాగులూరు(అద్దంకి): రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండలంలోని నామ్ రహదారిలోని ఏల్చూరు వద్ద శుక్రవారం జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని ఏల్చూరుకు చెందిన కొండి వెంకట ఆంజనేయులు (19) పల్సర్ ద్విచక్ర వాహనంపై గ్రామంలోకి వస్తున్నాడు. హిందూ శ్మశాన వాటిక దాటి ముందు వెళ్తున్న లారీ పక్కగా వస్తుండగా, అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ క్రమంలో లారీ ముందు టైరు కిందపడి చేయి నుజ్జయింది. తలకు, పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రదేశంలో ఉన్న స్థానికులు పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ లారీని నిలిపివేశాడు. సమాచారం అందుకున్న సంతమాగులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడని టోల్ ప్లాజా అంబులెన్సు సిబ్బంది నరసరావుపేట తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఏడు నెలల క్రితం యువకుడి తండ్రి వెంకట్రావు అకాల మరణం చెందాడు. అదే కుటుంబంలో కొడుకు చనిపోవడంతో బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
విజ్ఞాన్, ఇప్సైటీ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ, గుంటూరులోని ఇప్సైటీ డయాగ్నస్టిక్స్ రీసెర్చ్ సెంటర్ల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరిందని వైస్ చాన్స్లర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఇప్సైటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి కోగంటి, సీఈవో–సీఎస్వో డాక్టర్ సందీప్ కుమార్ నాదెండ్ల విజ్ఞాన్ వైస్ చాన్సలర్ పి నాగభూషణ్లు అవగాహన పత్రాలను మార్చుకున్నారు. వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్, ప్రెసిషన్ మెడిసిన్, ఆధునిక జీవసాంకేతిక రంగాలలో శాసీ్త్రయ, సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం రెండు సంస్థలు కలిసి నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్, డ్రగ్ ఇంటరాక్షన్ల విశ్లేషణ, మాలిక్యులర్ రీసెర్చ్, లో–కాస్ట్ పీసీఆర్ టెక్నాలజీ అభివృద్ధి, సెప్సిస్ ట్రాన్స్క్రిప్టోమిక్స్, బయోఇన్ఫర్మాటిక్స్ అనాలిటిక్స్ వంటి ఆధునిక పరిశోదనరంగాల్లో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. ఇప్సైటీ సంస్థ స్టేట్–ఆఫ్–ది–ఆర్ట్ ప్రయోగశాలలు, హైఎండ్ పరికరాలు, బయోఇన్ఫర్మాటిక్స్ సపోర్ట్, క్లినికల్ డేటా ఇంటిగ్రేషన్ వంటి సౌకర్యాలను అందిస్తుందన్నారు. వీటితోపాటు యూజీ –పీజీ విద్యార్థులకు పరిశోధన ఇంటర్న్షిప్లు, సంయుక్త పరిశోధన ప్రతిపాదనలను జాతీయ–అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీలకు సమర్పించడం, ఇప్సైటీ సంస్థ ఉద్యోగులకు విజ్ఞాన్లో ఉన్నత చదువులకు అవకాశాలు, అధ్యాపకులకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్షాప్లు, అంతర్జాతీయ సదస్సులు, సింపోజియాలు, సంయుక్త శాసీ్త్రయ పత్రాల ప్రచురణ, ఇన్నోవేషన్, స్టార్టప్–ఇకోసిస్టంపై సంయుక్త కార్యక్రమాలు, హెల్త్కేర్–లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఇండస్ట్రీ–అకాడమియా బ్రిడ్జ్ బలోపేతం చేస్తామన్నారు. రెండు సంస్థల సహకారం వలన ఆరోగ్య సేవల మెరుగుదల, ఖచ్చితమైన రోగ నిర్ధారణ, ప్రెసిషన్ థెరపీ అభివృద్ధి, తక్కువ ఖర్చుతో అధునాతన పరీక్షలు అందించడంలో కొత్త అవకాశాలను తెరుస్తుందని వీసీ తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, సీఈవో డాక్టర్ మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంవీ రావు, వివిధ విభాగాల డీన్లు, అధ్యాపక సిబ్బంది, పరిశోధకులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఒక దొంగ దోపిడీదారుడు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) : చంద్రబాబు ఒక దొంగ అని, దోపిడీదారుడని అన్నీ దోచుకోవడమే ఆయన పని అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎంతో కష్టపడి 17 మెడికల్ కళాశాలలను రాష్ట్రానికి తీసుకొస్తే వాటిని కనీసం పట్టించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 15న జరగనున్న కోటి సంతకాల సేకరణ ర్యాలీకి సంబంధించి శుక్రవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహాక సమావేశం నిర్విహించారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అధ్యక్షత వహించారు. ● లక్ష్మీపార్వతి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ మెడికల్ కళాశాలలు కట్టుకుంటూ వస్తే... చంద్రబాబు అమ్ముకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు మేలు చేసేలా 30 ఏళ్ల ముందుకు ఆలోచించి జగన్ విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారన్నారు. ● అంబటి రాంబాబు మాట్లాడుతూ ఈ నెల15న జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి భారీ ఊరేగింపు నడుమ లాడ్జిసెంటర్లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగుతోందన్నారు. జిల్లాలో మొత్తం కలిపి 4,78,589 సంతకాలు పూర్తయినట్లు వివరించారు. పార్టీ అనుబంధ విభాగాల నేతలు, జిల్లా, నగర, గ్రామ, మండల, డివిజన్ నుంచి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ ర్యాలీలో భాగస్వాములు కావాలని కోరారు. ● మాజీ ఎంపీ, ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 1.32 కోట్ల ఓట్లు వస్తే కోటి సంతకాల కార్యక్రమానికి 1.40 కోట్లకు పైగా రావడం ద్వారానే ప్రభుత్వంపై వ్యతిరేకత అర్థమవుతోందన్నారు. పేదవాడి ఆర్తనాదాన్ని తెలియజేసేదే ఈ సంతకమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు భవిష్యత్తులో భరోసా నింపడమే ధ్యేయంగా జగన్ 2.0 లక్ష్యమన్నారు. ● ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రాధాన్యత గుర్తించిన వై.ఎస్.జగన్ వాటిని ప్రజలకు చేరువ చేశాారన్నారు. ఇది కేవలం వైఎస్సార్సీపీ పోరాటం కాదని, ఇది ప్రజా ఉద్యమమని స్పష్టం చేశారు. ● వైఎస్సార్సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే ప్రభుత్వాలే కుప్పకూలి పోయిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయన్నారు. చంద్రబాబుకు అదేగతి పట్టనుందన్నారు. ● పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని, అందుకే కోటి సంతకాలు కాకుండా ఏకంగా 1.40 కోట్ల సంతకాలు పూర్తయ్యాయన్నారు. వైఎస్సార్సీపీకి పోరాటం కొత్తకాదన్నారు. ● మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ టీడీపీ వారే సంతకాలు చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. చంద్రబాబు విధానాలు నచ్చని ఆ పార్టీ వారే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ● తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ వై.ఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా పేదలకు వైద్యం, విద్య అందిందో అది ఇప్పుడు కూడా వారికి అందించేందుకు పోరాడుతున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు నిమ్మకాయల రాజనారాయణ, గులాం రసూల్, వలి వీరారెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, మండేపూడి పురుషోత్తం, పఠాన్ అబ్దుల్లా ఖాన్, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు తాడిబోయిన వేణుగోపాల్, బైరెడ్డి రవీంద్రారెడ్డి, యేటి కోటేశ్వరరావు యాదవ్, పఠాన్ సైదా ఖాన్, నందేటి రాజేష్, సీడీ భగవాన్, ఉడుముల పిచ్చిరెడ్డి, సుబ్బులు, రూత్రాణి, అవినాష్, ప్రభు, వాసిమళ్ల విజయ్, కొండా రవి, తదితరులు పాల్గొన్నారు. 15న నిర్వహించనున్న కోటి సంతకాల ర్యాలీ సన్నాహాక సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి -
ఓవరాల్ చాంపియన్ అంగలకుదురు జెడ్పీ హైస్కూల్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అథ్లెటిక్స్ అసోసియేషన్ అఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా క్రాస్ కంట్రీ పోటీల్లో అంగలకుదురు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్షిప్ టైటిల్ కై వసం చేసుకున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అప్రోజ్ ఖాన్ టైటిల్ సాధించిన టీంకు ట్రోఫీతోపాటు సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 24న కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా టీం పాల్గొంటుందని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ క్రీడాకారులకు స్పాన్సర్ కొరత ఉందని, కంపెనీలు ముందుకు వచ్చి క్రీడాకారులను దత్తత తీసుకుంటే రాబోవు రోజుల్లో గుంటూరు నుంచి అంతర్జాతీయ చూడగలమని తెలిపారు. కార్యక్రమంలో సభ్యులు ఏవీ ఆంజనేయులు, అరుణ్కుమార్, శాప్ కోచ్లు శివారెడ్డి, వెంకటేశ్వర్లు, ఫిజికల్ డైరెక్టర్లు వి.శరత్బాబు, అంజి, నాగరాజు పాల్గొన్నారు. -
రైతు నెత్తిన ఎరువు దరువు
● ఎమ్మార్పీ కంటే అధికంగా వ్యాపారుల విక్రయం ● వ్యవసాయానికి భారీగా పెరిగిన పెట్టుబడులు సత్తెనపల్లి: చంద్రబాబు పాలనలో ఎరువుల, ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతి ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతుండడంతో రైతుల పై మోయలేని భారం పడుతోంది. పెట్టుబడి సాయం అంతంతమాత్రంగానే ఉండటం, గిట్టుబాటు ధరలు లేక నష్టాలు పాలవుతున్నారు. గత ఏడాది సాగు చేసిన వరి, మిర్చి, పత్తి రైతులు భారీగా నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది పంట ఉత్పత్తులు ధరలు పూర్తిగా పతనమయ్యాయి. ఎరువుల ధరలు పెరగడంతోపాటు బస్తాకు అదనంగా వ్యాపారులు దోచుకుంటున్నారు. మద్దతు ధర రాక నష్టాల బాట.. జిల్లా వ్యాప్తంగా 2,76,947 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ప్రధానంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, తదితర పంటలున్నాయి. గత ఏడాది వరికి మద్దతు ధర రాకపోవడంతో రైతులు నష్టాలు బాట పట్టారు. తీరా పంట చేతికి వచ్చేసరికి దళారులకు తక్కువ ధరకే విక్రయించుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఎకరా పంట సాగు చేయడానికి పంటను బట్టి రూ.35 వేల నుంచి రూ.80 వేల పైనే ఖర్చవుతోంది. ఈ ఏడాది ఎరువులు, కూలీల ధరలు పెరగడంతో సాగు ఖర్చులు మరో రూ.15 వేలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం పంట ఉత్పత్తుల ధరలు పూర్తిగా పతనమయ్యాయి. మోంథా తుఫాన్తో పత్తి పంట తడిచి నల్లగా మారింది. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. నాడు అందుబాటులో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో 2019–2024 వరకు ఎరువుల ధరలు నిలకడగా ఉన్నాయి. వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను అందించేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసింది. అంతే కాకుండా డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా వంటి వాటికి కృత్రిమ కొరత సృష్టించి సక్రమంగా రైతులకు అందించలేని దుస్థితిలో చంద్ర బాబు సర్కార్ ఉంది. -
గంగపుత్రులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
బోట్స్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు నిజాంపట్నం: గంగపుత్రులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిజాంపట్నం బోట్స్ యూనియన్ అధ్యక్షుడు మోపిదేవి శ్రీనివాసరావు చెప్పారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ నిజాంపట్నం ఆధ్వర్యంలో మత్స్యకారుల వేట – దిశ నిర్దేశం అంశంపై తుఫాన్ షెల్టర్ భవనంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మత్స్య సంపద కోసం సముద్రంలోకి వేటకు వెళ్ళిన మత్స్యకారులు రోజుల తరబడి వేటను కొనసాగించాల్సి ఉంటుందన్నారు. వేటకు వెళ్ళే సమయంలో ఆహార పదార్థాలు, ప్రథమ చికిత్స కిట్లను తప్పనిసరిగా తీసుకెళ్ళాలన్నారు. ఎటువంటి అనారోగ్యం తలెత్తిన వెంటనే తీరానికి చేరుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అదేవిధంగా తమతో పాటు మైరెన్ సిబ్బందికి సమాచారం తెలియజేసేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను సైతం తీసుకెళ్ళాలని సూచించారు. విపత్తుల సమయంలో అధికారులు సమాచారం అందిస్తే వేటకు వెళ్ళిన మత్స్యకారులు త్వరితగతిన తీరం చేరుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. లేనిపక్షంలో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు. కొంత మంది మత్స్యకారులు గమ్యం మారి మన పరిధిని దాటి వేరే ప్రాంతాలకు వెళ్ళి పడే ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. ఈ సందర్భంగా వేటకు వెళ్ళే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్య సమస్యలు తలెత్తిన సమయంలో నిర్వహించే ప్రాథమిక చికిత్సలు, విపత్తుల సమయంలో అధికారుల నుంచి వచ్చే సమాచారం తదితర అంశాలపై మైరెన్, వైద్య అధికారులు మత్స్యకారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో కోస్ట్గార్డ్ కమాండర్ రాజేందర్ స్వరూప్, అసిస్టెంట్ కమాండర్ వీవీఎన్వీ ప్రసాద్, డాక్టర్ సమీరా, మైరెన్ సీఐ ఏవీ సురేష్, ఫారెస్ట్ అధికారి ఎం.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. -
బాపట్ల
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025చితికిన కూలీల బతుకులు ● పంట కాలువలోకి పల్టీ కొట్టిన కొబ్బరి బొండాల వాహనం ● ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు కూలీలు మృత్యువాత షేక్ ఇస్మాయిల్ , కాంతారావు,శ్రీనివాసరావు (ఫైల్) విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 574.70 అడుగులకు చేరింది. శ్రీ శైలం నుంచి 50,665 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
గంజాయి చాక్లెట్లు పట్టివేత
చీరాల: రైలులో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను శుక్రవారం ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వీవీరందరూ బృందంగా శుక్రవారం పూరి నుంచి తిరుపతి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలును వేటపాలెంలో తనిఖీలు చేశారు. జనరల్ బోగీలో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బ్యాగును పరిశీలించారు. అందులో 71 చాక్లెట్లు కనిపించాయి. వాటిని పరిశీలించగా గంజాయిగా తేలడంతో విచారణ చేపట్టారు. అయితే బ్యాగుకు సంబంధించిన వారు ఎవరూ లేకపోవడంతో స్వాధీనం చేసుకుని చీరాల జీఆర్పీ పోలీస్స్టేషన్లో అప్పగించి, కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయిని నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలుగా రైళ్లలో, బస్సులలో నిరంతరం తనిఖీలు చేస్తున్నామని ఈగల్ టీం బృంద సభ్యులు తెలిపారు. -
పంట కాల్వలోకి బోల్తా కొట్టిన ఆటో.. ముగ్గురి దుర్మరణం
దోనెపూడి: బాపట్ల జిల్లాలోని దోనెపూడి దగ్గరు చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. కొబ్బిరి కాయలతో వెళుతున్న ఓ ఆటో పంట కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో ఐదుగురు ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకంది. అతి వేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమం ఉన్నట్ల సమాచారం. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్ని చాటగడ్డ కాంతారావు, పెసర్లంక శ్రీనివాస్, షేక్ ఇస్మాయిల్గా గుర్తించారు. ఇదిలా ఉంచితే, ఈరోజు(శుక్రవారం, డిసెంబర్ 12వ తేదీ) తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు గోరింట గట్టులోకి పడిపోవడంతో కనీసం 9 మంది మృతి చెందగా, 23 మంది వరకూ గాయపడ్డారు. చింతూరు మండలంలోని తులసిపకల ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 37మంది ప్రయాణికులతో బస్సు వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వారిని వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తన్నారు.ఈ ప్రమాదం తర్వాత పోలీసులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఘాట్ రోడ్లపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో క్లియరెన్స్ మందగించి ప్రమాదం జరిగిందని అంచనాకు వచ్చిన పోలీసు అధికారులు.. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు.రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు 60 కంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడపడంతో డ్రైవర్ల నియంత్రణ కోల్పోతున్నారు.మద్యం తీసుకోవడం, మత్తు పదార్థాలు తీసుకున్ని డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదాలకు కారణంగా మారుతుంది.డ్రైవింగ్ చేస్తున్నప్పడు ఫోన్లో మాట్లాడటం, మెసేజ్ టైప్ చేయడం వాహనం మీద నియంత్రణ కోల్పోవడం ఒక కారణం. నిబంధనలు పాటించకుండా వ్రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం మరో కారణం.ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి సిగ్నల్ జంప్ చేయడం వంటివి కూడా ప్రమాదాలకు కారణం.హెల్మెట్, సీట్బెల్ట్ వంటి సేఫ్లీ పరికరాలు వాడకపోవడం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. వాహనాలు బ్రేక్ ఫెయిల్, టైర్ బ్లాస్ట్ వంటి సమస్యలు. భారీ వర్షాలు కానీ, పొగమంచు ఉన్నప్పుడు కానీ సరైన లైటింగ్ లేకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఒక కారణం. -
ప్రజలకు మెరుగైన వైద్యమే లక్ష్యం కావాలి
బాపట్ల: ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా వైద్యాధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశం గురువారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రజలకు సక్రమంగా అందించాలని కలెక్టర్ చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలన్నారు. పి ఎం జి ఏ వై కార్డులను లబ్ధిదారులైన ఆయా కుటుంబాలకు అందించాలన్నారు. ప్రధానమంత్రి ఆరోగ్య కార్డుల ఈకేవైసీ జిల్లాలో 9,600 పెండింగ్ లో ఉన్నాయన్నారు. లబ్ధిదారుల ఈకేవైసీ తప్పనిసరిగా చేపట్టాలన్నారు. వైద్యశాలల్లో ఔషధాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఔషధాల కొరకు ముందస్తు ఇండెంట్ పంపాలని సూచించారు. జిల్లాకు సరిపడా మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బాపట్ల జిల్లా తీర ప్రాంతం కావడంతో మొక్కలు, చెట్లు అధికంగా ఉన్నందున పాముకాటుకు గురైన వారికి తక్షణమే వైద్యం అందించేందుకు ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి వైద్యశాలలో సంబంధిత ఔషధాలు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వైద్యాధికారులు మంచి వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రజల నుంచి మంచి స్పందన లభించేలా మీ సేవలు విస్తృతం కావాలని అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, ఏపీ వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ పద్మావతి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ డాక్టర్ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. బస్టాండ్లో పరిశుభ్రత పాటించాలి ఆర్టీసీ బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి, ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ లో ఆయన కలియతిరిగారు, ప్రయాణికులతో మాట్లాడారు. అనంతరం పాత బస్సు స్టాప్ కూడలికి ఆయన చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ నిర్మాణం జరిగి కొన్నేళ్లు గడుస్తున్నప్పటికీ సౌకర్యాలు లేని బస్సు స్టాప్ వద్ద ప్రయాణికులు అధికంగా ఉండడంపై ఆరా తీశారు. అని సౌకర్యాలతో ఉన్న బస్టాండ్ ను ప్రయాణికులు వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎల్లప్పుడు పరిశుభ్రంగానే ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల బస్టాండ్ లో ఏడు ఫ్లాట్ ఫామ్ లు ఉండగా, ప్రతిరోజు 100కు పైగా బస్సులు వస్తాయని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ప్లాట్ ఫామ్ ల వద్ద కలెక్టర్ పరిశీలించారు. మరుగుదొడ్ల లోకి వెళ్లి పరిశుభ్రతను పరిశీలించారు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవాలని చెప్పారు. ప్రయాణికులకు తప్పనిసరిగా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు లోపలికి వెళ్లే మార్గం, వెలుపలకు వచ్చు మార్గాలను పరిశీలించారు. పార్కింగ్ స్థలం, అద్దెకు ఇచ్చిన వాణిజ్య సముదాయాన్ని ఆయన పరిశీలించారు. వాటి ద్వారా అద్దెలు క్రమంగా వస్తున్నాయా లేదా అని ఆరా తీశారు. డిపో మేనేజర్ కార్యాలయాన్ని, డ్రైవర్లు స్టాఫ్ రెస్ట్ రూమ్ లను పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికులకు వీలుగా బస్సులు నడుస్తున్నాయా..?, సకాలంలో వస్తున్నాయా...?, సరిగా సమాధానం చెబుతున్నారా..?, తాగునీరు అందుబాటులో ఉంటుందా..? అంటూ ఆరా తీశారు. అనంతరం బస్సు స్టాప్ కూడలికి చేరుకున్నారు. అక్కడ వసతి సౌకర్యాలు పరిశీలించారు. నీటి ట్యాప్ కనెక్షన్లు ఉన్నప్పటికీ తాగునీరు రాకపోవడంతో యుద్ధ ప్రాతిపదికన తాగు నీటి సౌకర్యం కొరకు ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బస్సు స్టాప్ ను ఆధునికరించాలని, ప్రయాణికులు వేచి ఉండడానికి మంచి కుర్చీలు సౌకర్యంగా ఏర్పాటు చేయాలన్నారు. బస్సు స్టాప్ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికులు వచ్చి శుభ్రం చేయాలన్నారు. ఇందు కొరకు డ్యూటీలు వేయాలన్నారు. ఆయన వెంట ఆర్డిఓ పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసిల్దార్ షాలీమా, తదితరులు ఉన్నారు. ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలి స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ తెలిపారు. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలపై వివిధ శాఖల అధికారులతో గురువారం ఆయన స్థానిక కలెక్టరేట్ నుంచి హైబ్రిడ్ మోడ్(జిల్లా అధికారులు, వీక్షణ సమావేశం ద్వారా మండల స్థాయి అధికారులు)లో సమావేశం నిర్వహించారు. బాపట్ల జిల్లా ప్రగతి దిశగా పయనించాలని కలెక్టర్ సూచించారు. ఇంజినీరింగ్ శాాఖలకు అభివృద్ధి ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులను ఇస్తుందన్నారు. నాలుగు గ్రేడ్ లలోనూ అభివృద్ధి కనిపించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ప్రతి కుటుంబానికి స్థిరమైన గృహం ఉండడం గృహ నిర్మాణశాఖ అధికారులకు లక్ష్యంగా ఉందన్నారు. అదే మాదిరిగా ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడం, పైప్ లైన్లు వేయడం ఇందులో భాగమేనన్నారు. గృహ వినియోగానికి విద్యుత్ సరఫరా నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులపై ఉందన్నారు. ప్రజలకు సుఖమయ ప్రయాణం సాగేలా మంచి రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. గుంతలు రహిత రహదారులు ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే అవకాశాలు కల్పించాలన్నారు. మునిసిపాలిటీలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. – జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్ -
ముక్కోటి మహోత్సవాలను విజయవంతం చేయాలి
మంగళగిరి టౌన్ : అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలను ప్రశాంతంగా సజావుగా విజయవంతం అయ్యేలా కృషి చేయాలని మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర సూచించారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో గురువారం వివిధ శాఖలకు చెందిన అధికారులతో ముక్కోటి ఏకాదశి పర్వదిన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ మంగళగిరిలో వేంచేసి యున్న శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్, ఎంటీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, పట్టణ ఎస్ఐ రవీంద్రనాయక్, యూపీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ అనూషలతో పాటు విద్యుత్శాఖ, ఎస్సైజ్శాఖ, ఆర్టిసి, అగ్నిమాపక శాఖల అధికారులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. బీ ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల ఏఎన్యూ(పెదకాకాని): ఈ ఏడాది సెప్టెంబరు నెలలో జరిగిన బీ.ఫార్మసీ ఐదో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఏఎన్యూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. మొత్తం పరీక్షకు 370 మంది హాజరు కాగా 211 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 ఫీజు చెల్లించాలన్నారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫార్మా.డి మొదటి సెమిస్టర్కు 285 మంది హాజరు కాగా వారిలో 194 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్కు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లో సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్) : గుంటూరు రైల్వే స్టేషన్లో 500 కేవీపీ, గ్రిడ్ సౌర విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించడం సంతోషకరమని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ సుధేష్ణసేన్ తెలిపారు. గుంటూరు రైల్వే స్టేషన్లో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్ను డీఆర్ఎం ప్రారంభించారు. ముందుగా సౌర విద్యుత్ ప్లాంట్ వివరాలు సంబంధిత అధికారుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ సౌర ప్లాంట్ సుమారు 8.10 లక్షల యూనిట్లు శుద్ధ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రూపొందించడం జరిగిందన్నారు. నేటి నుంచి గుంటూరులో క్రెడాయ్ ఎక్స్పో నగరంపాలెం(గుంటూరు వెస్ట్): క్రెడాయ్ 8వ ప్రాపర్టీ ఎక్స్పోను ఈనెల 12, 13, 14 తేదీల్లో సిద్ధార్థ కన్వెన్షన్ హాల్ (గుంటూరు రింగు రోడ్లో) నిర్వహిస్తున్నట్లు క్రెడాయ్ ఏపీ మాజీ చైర్మన్ ఆళ్ల శివారెడ్డి గురువారం తెలిపారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రాపర్టీ షో కొనసాగుతుందని అన్నారు. బ్యాంక్లు, బిల్డర్స్, మెటీరియల్ దుకాణాలు, కన్స్ట్రషన్స్ దుకాణాల నిర్వాహ కులు పాల్గొంటారని పేర్కొన్నారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ మామిడి రాము, షో కన్వీనర్ తియ్యగూర వినోద్రెడ్డి, క్రెడాయ్ కార్యదర్శి మెట్టు సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఈ షోకు వచ్చేందుకు ప్రవేశం ఉచితమని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉచితంగా మొక్కలను పంపిణీ చేస్తామని తెలిపారు. సమావేశంలో ఉపాధ్యక్షుడు శివనాగేశ్వరరావు, కోశాధికారి ఆళ్ళ నాగార్జునరెడ్డి, ఈసీ కళ్యాణ్చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
మాతృ మరణాలను నిరోధించాలి
నరసరావుపేట రూరల్: మాతృ మరణాలను నిరోధించే విధంగా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి మాతృ మరణాల పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ హై రిస్క్ ప్రెగ్నెన్సీలపై క్షేత్ర స్థాయి సిబ్బంది ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రక్తంలో హీమో గ్లోబిన్ స్థాయి, గర్భిణులు, ఆరోగ్య, ఆదాయ స్థితిగతులను బట్టి హైరిస్క్ ప్రెగ్నెన్సీలను గుర్తించాలని తెలిపారు. జిల్లాలో చోటుచేసుకున్న ఐదు మాతృ మరణాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరారు. బాధితుల కుటుంబీకుల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రవి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి గౌతమి, డీసీహెచ్ఎన్ ప్రసూన, డీఐవో రాంబాబు, డీఎల్వో మాధవీలత పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలు అభివృద్ధి దిశగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. స్వర్ణాంధ్ర ప్రగతి సూచికలపై జిల్లా అధికారులు, సాంకేతిక సిబ్బందికి ప్రణాళికా శాఖ సంచాలకులు శిక్షణా శిబిరం గురువారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ రంగాలలో మెరుగైన పాలన, అభివృద్ధిని పర్యవేక్షించేందుకు కీలక పనితీరు సూచికలు ఉపయోగిస్తుందని తెలిపారు. ఈ సూచికలు ప్రభుత్వ పనితీరును అంచనా వేయడానికి, స్వర్ణాంధ్ర–2047 లక్ష్యాలను సాధించేందుకు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు. ప్రధాన పనితీరు సూచికలకు సంబంధించిన సమాచారం పర్యవేక్షణకు 200కుపైగా ప్రభుత్వ విభాగాలు, అర్బన్ లోకల్ బాడీస్ కోసం పనితీరు సూచికలను ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. వీటిని ముఖ్యమంత్రి, ఇతర ఉన్నతాధికారులు నెలవారీ, త్రైమాసిక, వార్షిక ప్రాతిపదికన సమీక్షిస్తారని వివరించారు. రంగాల వారి సూచికలు, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు, ఆర్థిక వ్యవస్థ, విద్య, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, ఈ–పరిపాలన వంటి కీలక రంగాలలో ఈ సూచికలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. విజయపురిసౌత్: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ పర్యాటక శాఖ ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. గురువారం టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు యం.దారు నాయక్ తో కలిసి పర్యాటక కేంద్రాలైన నాగార్జునసాగర్ లాంచీ స్టేషన్, ఎత్తిపోతలను ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. నూతన టూరిజం పాలసీతో భారీగా పెట్టుబడులు వస్తాయన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ టూరిజం 19 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు కుదర్చుకున్నట్లు తెలిపారు. సాగర్ లాంచీ స్టేషన్లో రెండు చిన్న బోట్లను త్వరలోనే నూతనంగా ప్రవేశ పెడతామన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఎస్ఈ ఈశ్వరయ్య, జీఎం నాంచారయ్య, డీవీఎం కృష్ణ చైతన్య, జిల్లా టూరిజం ఆఫీసర్ నాయుడమ్మ, మేనేజర్లు మస్తాన్ బాబు, యల్లాల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
అడ్డగోలు కుట్రలు.. అక్రమ నిర్బంధాలు
వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా బరితెగింపు సాక్షి ప్రతినిధి, బాపట్ల: చంద్రబాబు పాలనలో పోలీసులు మరింతగా జులుం ప్రదర్శిస్తున్నారు. అవసరం లేకపోయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను నిర్బధించి పాలకుల మెప్పు కోసం పరితపిస్తున్నారు. చంద్రబాబు సర్కారులో మార్కులు పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు. గురువారం వైఎ్ససార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసేందుకు వెళుతున్నారంటూ జిల్లాలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేసి ఇబ్బందులు పెట్టారు. కొందరు నేతలుకు నోటీసులు ఇచ్చి ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. మరికొందరికి అసలు నోటీసులు ఇవ్వకుండానే అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి మరీ జీపుల్లో తీసుకొచ్చి స్టేషన్లలో నిర్బంధించారు. పోలీసుల చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా అదే దౌర్జన్యం అర్ధరాత్రి దౌర్జన్యంగా నేతల తరలింపు వైఎస్సార్సీపీకి చెందిన కొందరు నేతలకు నోటీసులు ఇచ్చి గృహనిర్బంధం చేసిన పోలీసులు మరికొందరు నేతలు, కార్యకర్తలకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యపూరితంగా స్టేషన్కు తరలించారు. బాపట్లకు చెందిన వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి ఇంటికి 12 గంటల ప్రాంతంలో పట్టణ సీఐ రాంబాబు, ఎస్ఐ విజయకుమార్లు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కారు. బయటకు వచ్చిన రాఘవరెడ్డిని స్టేషన్కు పదమంటూ జీపు ఎక్కించారు. కారణం చెప్పాలని, నోటీసు ఇవ్వాలని కోరినా పోలీసులు ససేమిరా అన్నారు. ముందు స్టేషన్కు పదమంటూ తీసుకువెళ్లారు. ఉదయం 10 గంటల వరకూ స్టేషన్లో నిర్బంధించారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు సుధీర్బాబు, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా రామయ్యలను సైతం పోలీసులు రాత్రంతా స్టేషన్లో ఉంచారు. చీరాలకు చెందిన వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్లకు సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. -
వర్సిటీ అంతర్ కళాశాలల ఆటల పోటీలు ప్రారంభం
ఖాజీపాలెం(కర్లపాలెం): క్రీడలు దేహదారుఢ్యంతో పాటు మనోధైర్యాన్ని కలిగిస్తాయని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు చెప్పారు. నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల 48వ అథ్లెటిక్స్ పోటీలను ఖాజీపాలెం కేవీఆర్ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాలలో గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు ఉంటాయని తెలిపారు. పోటీలను సక్రమంగా నిర్వహించాలని అధ్యాపకులకు చెప్పారు. బాలికల 100మీటర్ల రన్నింగ్లో మొదటి స్థానంలో నాగ నవీన (ఏసీ కళాశాల గుంటూరు), ద్వితీయ స్థానంలో కావ్యారెడ్డి (టీజేపీసీ గుంటూరు), తృతీయ స్థానంలో తేజశ్రీ (కేవీఆర్ కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఖాజీపాలెం) బాలికల 1500 మీటర్ల రన్నింగ్ పోటీలలో మొదటి స్థానంలో లీలా ప్రవల్లిక (కేవీఆర్, కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఖాజీపాలెం), ద్వితీయ స్థానంలో ధనలక్ష్మి (యూనివర్సిటీ కళాశాల నంబూరు), హేమలత (కేవీడీసీ నరసరావుపేట) ఐదు కిలోమీటర్ల రన్నింగ్లో బాలురు మొదటి స్థానంలో ప్రజ్ఞా మనోహర్ ( కేవీఆర్, కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఖాజీపాలెం), ద్వితీయ స్థానంలో వాగ్దేవి డిగ్రీ కాలేజీ నరసరావుపేట, తృతీయ స్థానంలో రుస్తుమ్ అలీ (కేవీఆర్, కేవీఆర్ అండ్ ఎంకేఆర్ కళాశాల ఖాజీపాలెం) విజేతగా నిలిచారు. చరు. వీరికి ఎమ్మెల్యే నరేంద్రవర్మ రాజు, కళాశాల ప్రిన్సిపాల్ శివప్రసాద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పీడీ రామకృష్ణారెడ్డి, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు. -
అక్రమ విద్యుత్ వినియోగం నేరం
కారంచేడు: జిల్లాలో ప్రజలు ఎక్కడైనా అక్రమంగా విద్యుత్ వినియోగించినా, విద్యుత్ చౌర్యం చేసినా అది నేరమని, అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని బాపట్ల జిల్లా ఎస్ఈ జి. ఆంజనేయులు అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రమైన కారంచేడు గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని 14 గ్రామాల పరిధిలో తమ విద్యుత్ విద్యుత్ శాఖ అధికారుల బృందాలు పోల్ టూ పోల్ విజిలెన్స్ తనిఖీలు నిర్వహించారన్నారు. మొత్తం 30 బృందాలను ఏకకాలంలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 2581 సర్వీసులను క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. అక్రమంగా విద్యుత్ వినియోగించే వారు, ఓవర్ లోడ్ వినియోగిస్తున్నవారు, అక్రమంగా విద్యుత్ చౌర్యం చేస్తున్న వారిపై 49 కేసులు నమోదు చేశామన్నారు. వీరికి ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 4.16 లక్షల అపరాధ రుసుం విధించామన్నారు. అనంతరం కారంచేడు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం ప్రభుత్వం నుంచి నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. సాధారణంగా వచ్చే సమస్యలను వెంటనే నివృత్తి చేయగలుగుతున్నామన్నారు. ప్రజల మన్ననలు పొందేందుకు తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తలు తీసుకుంంటున్నామని, అప్రకటిత విద్యుత్ కోతలు విధించడం లేదన్నారు. కార్యక్రమంలో బాపట్ల ఈఈ ఎం భాస్కరరావు, చీరాల ఈఈ కే థామస్, పర్చూరు డీఈఈ జే శ్రీనివాసులు, చీరాల డీఈఈ బీ హరిప్రసాద్, వేటపాలెం డీఈఈ పి. శ్రీనివాసరావు, బాపట్ల, చీరాల, పర్చూరు సబ్ డివిజన్లలోని విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
సత్తెనపల్లి: పెను ప్రమాదం త్రుటిలో తప్పిన సంఘటన సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం వద్ద గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం మండలం ఉప్పలపాడు నుంచి పత్తి లోడుతో ట్రాక్టర్ గుంటూరు వెళుతుంది. అదే సమయంలో సత్తెనపల్లి వైపు నుంచి సిమెంటు లోడుతో లారీ గుంటూరు వెళుతుంది. ట్రాక్టర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన లారీ తగిలి పత్తి లోడు ట్రా క్టర్ ముందు చక్రం ఊడి పోవడంతో ట్రాక్టర్కు ఉన్న పత్తి లోడు ట్రక్కు బోల్తా కొట్టింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
రక్షక భటులే భయపెట్టడం తగదు
బాపట్ల: రక్షణగా నిలవాల్సిన పోలీసులే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్దకు వెళ్లే అవకాశం ఉందంటూ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చి అరెస్టు చేయటం ఏ మేరకు న్యాయమో అర్థం కావడం లేదన్నారు. పోలీసు నిఘా వ్యవస్థ సరిగా లేకపోవటం వలనే బాపట్లలో నాయకులను అదుపులోకి తీసుకున్నారని కోన చెప్పారు. రాత్రి పూట ఇష్టమొచ్చినట్లు నాయకుల ఇళ్లకు వచ్చి అదుపులోకి తీసుకోవటం ఏంటో అర్థం కావటం లేదన్నారు. తన 22 సంవత్సరాల రాజకీయంలో ఇంతవరకు ఎవరూ నోటీసు ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు నోటీసు ఇవ్వటంతోపాటు అరెస్టు చేయటం జరిగిందన్నారు. నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఫోన్లు చేయటంతోపాటు కంగారు పడ్డారని, సున్నితమైన విషయాలను కూడా రాద్ధాంతం చేయటం సరికాదన్నారు. రాజకీయ నాయకులపై పెట్టే కక్ష సాధింపు కేసులను లెక్కకట్టి రౌడీషీట్లు ప్రారంభించటం, రౌడీలకు కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు వీరిని కూడా పిలిచి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలన్నారు. అధికారం ఎవరికి ఉన్నప్పటికీ ఇలాంటి తీరు సరికాదన్నారు. డీఎస్పీకి ఈ విషయాన్ని వివరించామని తెలిపారు. సొంత పూచీకత్తు తీసుకుని వెంటనే పంపుతామని పంపారని చెప్పారు. మనం జిల్లా కేంద్రంలో ఎస్పీ పరిధిలో ఉన్నామని, చిన్నా చితకా విషయాలపై ఇష్టమొచ్చినట్లు వ్యవహరించటం సరికాదని సూచించారు. రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పరిస్థితిని గమనించి ముందుకుపోతే మంచిదని కోన సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాగిత సుధీర్బాబు, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు చల్లా రామయ్య, జోగి రాజాలను అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. కోన రఘుపతిని అరెస్టు చేశారనే విషయం తెలియగానే భారీగా నాయకులు, కార్యకర్తలు బాపట్ల టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు నోటీసులు ఇవ్వటంతోపాటు నాయకులను అదుపులోకి తీసుకుని ఉదయం 9.30 గంటలకు వదిలిపెట్టారు. కోనను వదిలిపెట్టడంతో నాయకులు, కార్యకర్తలు వెనుదిరిగారు.


