breaking news
YS Jagan Mohan Reddy
-
ప్రైవేటుకే ‘అసైన్డ్’
సాక్షి, అమరావతి : చంద్రబాబు సర్కారు ప్రైవేటీకరణ దాహం ఎంతకీ తీరడం లేదు. విలువైన ప్రభుత్వ భూములు, మెడికల్ కాలేజీలు, టూరిజం శాఖ హరిత రిసార్టులను ఇష్టానుసారంగా ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులకు కట్టబెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. తాజాగా గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములపై పడ్డారు. ఆ భూములను వెనక్కు తీసుకుని ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అసైన్డ్ భూములపై రైతులకు హక్కులిచ్చి, ఫ్రీ హోల్డ్ చేసి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కానీ 2024 జూన్లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వాటిని మళ్లీ 22–ఏ జాబితాలో పెట్టి వారి నడ్డి విరిచారు. ఇప్పుడు ఏకంగా ఆ భూములను ప్రైవేటుకు ఇచ్చేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరణ చేయనున్నారు. పేదలకు మేలు చేయకపోగా, వారి హక్కులను కాలరాస్తూ వారి నోటి దగ్గర కూడు లాక్కునేలా అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుని, ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని సవరిస్తూ ఈ నెల 10వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. గంటల వ్యవధిలో సర్క్యులేట్.. ఆమోదం తాజాగా టీడీపీ ప్రభుత్వ పెద్దలు పేదల అసైన్డ్ భూములను సైతం కంపెనీల పరం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుండటం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మెడికల్ కాలేజీలు, టూరిజం శాఖ హరిత రిసార్టులు, పలుచోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలకు యథేచ్చగా పంపిణీ చేస్తున్న చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు పేదల భూములను లాక్కునేందుకు మరింతగా బరి తెగించింది. ఈ చట్ట సవరణకు సంబంధించిన ముసాయిదా బిల్లుకు గత నెల 3వ తేదీన మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో ఈ ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపేందుకు వీలుగా సీఎం చంద్రబాబు అత్యవసరంగా ఈ ముసాయిదా బిల్లును సర్క్యులేట్ చేయించారు. ఆ తర్వాత వెంటనే దాన్ని ఆమోదించేశారు. ఇదంతా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. త్వరలో ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.ఇళ్లు కట్టుకునేందుకు ఇచ్చిన భూములు సైతం..1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం పేదలకు అసైన్ చేసిన భూములను అమ్మడం గానీ, లీజుకివ్వడం కానీ చేయకూడదు. ప్రజోపయోగ అవసరాలకు సైతం ఈ భూములను తీసుకోవడం కష్టమే. కానీ ఇప్పుడు జారీ చేయబోయే ఆర్డినెన్స్ ద్వారా ఈ భూములను ప్రభుత్వం వెనక్కు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది. ఇళ్లు కట్టుకోవడానికి ఇచ్చిన భూములను సైతం అసైన్డ్ పరిధి నుంచి మినహాయించవచ్చు. ప్రభుత్వం నామమాత్రంగా డబ్బులు కట్టించుకుని ఇచ్చిన భూములు, హౌసింగ్ బోర్డు లాంటి వాటి ద్వారా ఇచ్చిన భూములను అసైన్డ్ చట్టం పరిధి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. అసైన్డ్ భూములను ఎవరికీ బదలాయించకూడదనే నిబంధనను ఉల్లంఘిస్తే గతంలో తిరిగి వెనక్కు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు చట్ట సవరణ ద్వారా వెనక్కు తీసుకోవడంతోపాటు ఆ భూములను ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం వినియోగించుకునే ఏర్పాట్లు చేసుకున్నారు. అసైన్డ్ రైతులు తమ భూములను అమ్ముకోవడంపై నిషేధం ఉండగా, ప్రభుత్వం అనుమతిస్తే ఆ అమ్మకం చట్టబద్ధమయ్యేలా మార్పు చేశారు. ఇందుకోసం అసైన్డ్ చట్టంలోని సెక్షన్ 2(6), సెక్షన్ 3 (2), సెక్షన్ 3 (2ఎ)ని సవరించారు. ఈ సవరణల ద్వారా తమకు అవసరమైన చోట అసైన్డ్ భూములను వెనక్కు తీసుకుని, ప్రజోపయోగం పేరుతో ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. గ్రీన్ ఎనర్జీ, ప్రైవేటు పరిశ్రమలు, ప్రైవేటు పార్కులకు 99 సంవత్సరాల లీజుకు అసైన్డ్ భూములు ఇచ్చేందుకే సీఎం చంద్రబాబు అత్యవసరంగా ఈ ఆర్డినెన్స్ తెచ్చారని స్పష్టమవుతోంది. రోజుల వ్యవధిలోనే పలుచోట్ల అసైన్డ్ భూములను ఈ పరిశ్రమలకు ఇచ్చేందుకు ఇప్పటికే ఫైళ్లు వాయు వేగంతో నడుస్తున్నాయి. తప్పుదారి పట్టించి.. పేదల నోట్లో మట్టిచంద్రబాబు అధికారంలోకి వచ్చాక దీన్ని తప్పుదారి పట్టించి.. ఫ్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయని 16 నెలలుగా వాటిని 22ఏ జాబితాలో పెట్టారు. అనేక సంవత్సరాల తర్వాత తమ భూములపై తమకు హక్కులు వచ్చాయనే ఆనందం పేద రైతులకు లేకుండా చేశారు. ఆ భూముల అక్రమాలు తేలుస్తామంటూ మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సమీక్షలు, సమావేశాలు, వెరిఫికేషన్ల పేరుతో లక్షలాది మంది రైతులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. తమ భూములను 22–ఏ జాబితా నుంచి తీసి వేయాలని వారు వేడుకుంటున్నా, పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా వాటిని లాక్కునేందుకు గుట్టుచప్పుడు కాకుండా అసైన్డ్ చట్టాన్ని సవరించడానికి సిద్ధమయ్యారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో చంద్రబాబు సర్కారు ఆడిన నాటకం అంతా ఆ భూములను లాక్కునేందుకేనన్న విషయం స్పష్టమవుతోంది.జగన్ హక్కులిస్తే.. బాబు లాక్కుంటున్నారుభూమి లేని నిరుపేదలు బతకడం కోసం ప్రభుత్వాలు వారికి భూములు అసైన్ చేశాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 35 లక్షల ఎకరాల భూములను వివిధ ప్రభుత్వాలు పేదలకు కేటాయించాయి. అయితే ఆ భూములను సాగు చేసుకుని జీవనోపాధి పొందడం మినహా అమ్మడానికి వారికి హక్కులు లేవు. దీంతో తమకు వాటిపై హక్కులు కల్పించాలని ఎన్నో దశాబ్దాలుగా పేదలు ప్రభుత్వాలను కోరుతూ వస్తున్నారు.అయితే ఏ ప్రభుత్వం వారి అభ్యర్థనను మన్నించలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేద దళిత రైతులకు మేలు చేసేందుకు అసైన్డ్ భూములపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. విస్తృత అధ్యయనం తర్వాత ప్రజా ప్రతినిధుల కమిటీ సిఫారసుల ఆధారంగా.. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత ఆ భూములను సంబంధిత రైతులు, లేదా వారి వారసులు అమ్ముకునేందుకు 1977 అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేశారు. తద్వారా రాష్ట్రంలో అసైన్డ్ భూముల వివాదాలకు చరమగీతం పాడారు. అసైన్డ్ రైతుల చిరకాల కోరికను నెరవేర్చి, వారిని అందరి మాదిరిగా సగర్వంగా నిలబెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏకంగా 9.35 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పించారు. రాష్ట్రంలో అసైన్డ్ భూములకు సంబంధించి జరిగిన తొలి సంస్కరణ ఇదే కావడం గమనార్హం. -
కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలో జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర సభ్యులుగా ఉన్న కేడబ్ల్యూడీటీ–2 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)లో.. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను పరిరక్షించడం, ప్రయోజనాలను కాపాడటంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని, పేలవమైన వాదనలు వినిపిస్తోందని మండిపడ్డారు.కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనిల్కుమార్(ఏకే) గోయల్ దాఖలు చేసిన అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వ సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు, ఏకే గోయల్ ఇచ్చిన సమాధానాలే అందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 సెక్షన్–6(2) ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధమని.. ఇదే అంశాన్ని కేడబ్ల్యూడీటీ–2 కేంద్రానికి ఇచ్చిన తుది నివేదికలో స్పష్టం చేసిందని గుర్తుచేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు ట్రిబ్యునళ్లు చేసిన నీటి కేటాయింపులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టంగా పేర్కొందన్నారు.కేడబ్ల్యూడీటీ–2కు 2023 అక్టోబరు 6న కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన అదనపు విధి విధానాలు (టీవోఆర్) చట్టవిరుద్ధమని.. అందుకే వాటిని సవాల్ చేస్తూ నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. ఈ కేసులో టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థంగా వాదనలు వినిపించకపోవడం వల్లే.. కేంద్రం జారీ చేసిన అదనపు విధి విధానాల ప్రకారం విచారణ చేయాలని, తమ తీర్పునకు అనుగుణంగా తుది నిర్ణయం ఉంటుందని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందన్నారు.ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా తుది వాదనలు వినిపించటానికి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హితవు పలికారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. తొమ్మిది పేజీలతో కూడిన ఆ లేఖను తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం..అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం 1956లో సెక్షన్–6(2) బచావత్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–1) అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్ట విరుద్ధమని కేడబ్ల్యూడీటీ–2 కూడా అభిప్రాయపడింది. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 6, 2023న జారీ చేసిన అదనపు విధి విధానాలకు అనుగుణంగా, కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలు(75% లభ్యత) పునఃపంపిణీ చేయడం, కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ కొనసాగిస్తోంది.దీనిపై కేడబ్ల్యూడీటీ–2 ఎదుట గత సెప్టెంబరు 23, 24వ తేదీల్లో తుది వాదనలు కొనసాగాయి. కృష్ణా జలాల్లో కచ్చితంగా 763 టీఎంసీల నీరు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అదే వాదనను కేడబ్ల్యూడీటీ–2 ఎదుట బలంగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే ఆం«ధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగినట్లే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తుది వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి.. కృష్ణా జలాలపై హక్కులను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.చంద్రబాబు సర్కార్ వైఫల్యం వల్లే..ఇప్పుడు కేడబ్ల్యూడీటీ–2 ఎదుట రాష్ట్రం తరఫున చంద్రబాబు సర్కారు వినిపిస్తున్న వాదనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేడబ్ల్యూడీటీ–2 తన తుది నివేదికను 2013 నవంబరు 29న కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ.. ‘కృష్ణా జలాల కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–1 నిర్ణయాలు ఎలాంటి ప్రభావానికి లోనై తీసుకున్నవి కావు. కాబట్టి వాటిని సమీక్షించడం అంటే కొత్తగా గందరగోళానికి తెర తీయటమే’ అని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014లోని 11వ షెడ్యూల్, క్లాజ్–4 ప్రకారం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు ట్రిబ్యునల్ కేటాయించిన జలాలు యథాతథంగా కొనసాగాల్సి ఉంది. ట్రిబ్యునల్ ప్రాజెక్టులకు చేసిన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పు ఉండకూడదు.కానీ, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, విభజన చట్టం 11వ షెడ్యూల్ను తుంగలో తొక్కుతూ కేంద్ర జలశక్తి శాఖ 2023 అక్టోబరు 6న అదనపు విధి విధానాలు జారీ చేస్తూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీలను రెండు తెలుగు రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఆదేశించింది. వెంటనే దాన్ని సవాల్ చేస్తూ, అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023 అక్టోబరు 9న సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2024 జూన్ 12న ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించలేదు.ఫలితంగా కేంద్రం జారీ చేసిన అదనపు విధి విధానాలకు అనుగుణంగా కృష్ణా జలాల పంపిణీపై విచారణ చేపట్టాలని.. తుది నిర్ణయం తమ తీర్పునకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వాటికి అనుగుణంగా 2024 ఆగస్టు 27న కేడబ్ల్యూడీటీ–2 విచారణ మొదలు పెట్టింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలను పున:పంపిణీకి సంబంధించి రెండు రాష్ట్రాల వాదనలు ముందుగా వింటామని 2024 ఆగస్టు 29న కేడబ్ల్యూడీటీ–2 స్పష్టం చేస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా అంగీకరించింది? మొత్తం 36 అంశాలకు సంబంధించి రెండు రాష్ట్రాల సమ్మతికి అనుగుణంగా కృష్ణా జలాల నికర పున:పంపిణీపై విచారణ జరుపుతామని కేడబ్ల్యూడీటీ–2 వెల్లడించింది.కేటాయింపులకు బేసిన్ ప్రాతిపదిక కాదు..కృష్ణా బేసిన్ తమ రాష్ట్రంలో 71 శాతం ఉన్నందు వల్ల 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తమకు కచ్చితంగా 71 శాతం జలాలు కేటాయించాల్సిందే అని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ.. నీటి కేటాయింపులను బేసిన్ ప్రాతిపదికన ఏ ట్రిబ్యునల్ కూడా చేయలేదని గుర్తు చేస్తూ బలంగా వాదనలు వినిపించడంలో టీడీపీ సర్కార్ విఫలమవుతోంది. ఇది దురదృష్టకరం. కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి, గతంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన అంశాలు ఒక్కసారి చూస్తే.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు కృష్ణా జలాలను పంపిణీ చేసేందుకు 1969 ఏప్రిల్ 10న జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–1ను కేంద్రం ఏర్పాటు చేయగా.. ఆ ట్రిబ్యునల్ 1976 మే 27న తుది నివేదిక ఇవ్వగా.. దాన్ని అమలు చేస్తూ నాలుగు రోజుల తర్వాత.. అంటే 1976 మే 31న ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది.అప్పుడు కూడా కృష్ణా జలాల కేటాయింపులో కేడబ్ల్యూడీటీ–1 నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కృష్ణా పరీవాహక ప్రాంతం 2,58,948 చదరపు కి.మీ కాగా, అందులో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 29.45 శాతం, అంటే 76,252 కి.మీ ఉంది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నదిలో 2,130 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని కెడబ్ల్యూడీటీ–1 నిర్ధారణకు వచ్చింది. ఒకవేళ నదీ పరీవాహక ప్రాంతాన్నే పరిగణలోకి తీసుకుని ఉంటే, నాడు ఆ ప్రాంతం ఉన్న మన ఆంధ్రప్రదేశ్కు 2,130 టీఎంసీల నీటిలో 627.29 టీఎంసీలు మాత్రమే కేటాయించేవారు. అన్ని అంశాలు, సమగ్ర అధ్యయనం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో అనుసరించే ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుని ‘ఫస్ట్ ఇన్టైమ్ ఫస్ట్ ఇన్ రైట్’ (ఎవరైతే ముందుగా ప్రాజెక్టు నిర్మించి, నీరు వినియోగిస్తారో వారికే తొలి హక్కు)ను అనుసరిస్తూ.. కేటాయింపులు జరిపింది.నాడు మన రాష్ట్రంలో తొలుత 1885–1928 మధ్య కర్నూలు–కడప కాలువ (కేసీ కెనాల్)తో పాటు కృష్ణా ఆయకట్టులో నీటి వినియోగం జరిగింది. ఆ ప్రాతిపదికన రాష్ట్రంలో కృష్ణా నీటి కేటాయింపుపై ప్రాజెక్టులను మూడు వర్గాలుగా విభజించి నిర్ణయం తీసుకున్నారు. 1951 నాటికి పూర్తయిన ప్రాజెక్టులు, 1951 నుంచి 1960 సెప్టెంబరు వరకు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, 1960 తర్వాత చేపట్టిన ప్రాజెక్టులుగా కేడబ్ల్యూడీటీ–1 వర్గీకరించింది. ఆ మేరకు పాత ప్రాజెక్టులకు 749.16 టీఎంసీలు, అప్పటికే ప్రతిపాదనలో ఉన్న జూరాలకు 17.84 టీఎంసీలు, శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలతోపాటు పునరుత్పత్తి (రీజనరేషన్) అవసరాల కోసం మరో 11 టీఎంసీలు.. అన్నీ కలిపి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కృష్ణా జలాల్లో మొత్తం 811 టీఎంసీలు కేటాయించారు.కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపుల మేరకు రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తా ఆంధ్రాకు 387.24 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు లభిస్తాయి. కృష్ణా డెల్టా ఆధునికీకరణతో మిగిలే 20 టీఎంసీలను తెలంగాణలోని భీమా ఎత్తిపోతలకు కేటాయించారు. తుదిగా రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాంధ్రకు 20 టీఎంసీలు తగ్గి 367.24 టీఎంసీలు, తెలంగాణకు ఆ 20 టీఎంసీలు పెరిగి వాటా 298.96 టీఎంసీలకు పెరిగింది. అలా ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల నీరు కృష్ణా జలాల్లో దక్కింది. ఆ మేరకే 2015, జూలై 18, 19 తేదీల్లో కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తాత్కాలిక సర్దుబాటు ఒప్పందం జరిగింది.పంపిణీ చేయాల్సింది కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలనే..కేడబ్ల్యూడీటీ–1 అవార్డు గడువు ముగియడంతో 2004 ఏప్రిల్ 2న కేంద్ర ప్రభుత్వం కేడబ్ల్యూడీటీ–2 ను ఏర్పాటు చేసింది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు, కర్ణాటక, మహారాష్ట్ర వాదనలు కూడా విన్న తర్వాత కేడబ్ల్యూడీటీ–2 ప్రాథమిక నివేదిక 2010 డిసెంబర్ 31న, తుది నివేదికను 2013 నవంబరు 29న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వేర్వేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశాయి. కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ గెజిట్ ప్రచురించలేదు.2014లో విభజిత ఆంధ్రప్రదేశ్తోపాటు, తెలంగాణకు కృష్ణా జలాలను పంపిణీ చేసే బాధ్యతను కేడబ్ల్యూడీటీ–2కు అప్పగించింది. అప్పటి నుంచి పలుమార్లు.. 2014 నుంచి 2024 వరకూ కేడబ్ల్యూడీటీ–2 గడువు పొడిగిస్తూనే వచ్చారు. 2024 ఆగస్టు 29న కేడబ్ల్యూడీటీ–2 ఆదేశాలు జారీ చేస్తూ.. నాడు ఉమ్మడి రాష్ట్రంలో కేడబ్ల్యూడీటీ–1 ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల నీటి పున:పంపిణీపై వాదనలు వింటామని వెల్లడించింది. ఆ తర్వాత నదిలో కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికలో సగటు ప్రవాహాలు, 75% నుంచి 65% మధ్య ఉన్న మిగులు జలాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అదనంగా కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపై వాదనలు వింటామని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల పున:పంపిణీ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం.కేవలం కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించని 194 టీఎంసీల మిగులు జలాల పంపిణీపై మాత్రమే ట్రిబ్యునల్ విచారించాల్సి ఉంది. అందులోనూ విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో ప్రస్తావించిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగతో పాటు, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం పూర్తి ఉదాసీనత ప్రదర్శిస్తోంది.గతంలో కేటాయించిన 811 టీఎంసీల పున:పంపిణీని సమీక్షిస్తామన్న కేడబ్ల్యూడీటీ–2 నిర్ణయంపై కనీసం అభ్యంతరం కూడా చెప్పడం లేదు. కృష్ణా డెల్టాలో వినియోగించిన నీటిలో 95 శాతం ఆ పరీవాహక ప్రాంతం వెలుపల వినియోగిస్తున్నట్లు అంగీకరించడం వల్ల, కృష్ణా జలాలపై రాష్ట్రం హక్కు, ఆ నీటి వినియోగంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంపై ఈ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదన్న విషయం స్పష్టమవుతోంది.రాయలసీమకు అన్యాయం..ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళి (ఆపరేషన్ ప్రోటోకాల్)కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన కేడబ్ల్యూడీటీ–2లో ఏకే గోయల్ దాఖలు చేసిన అఫిడవిట్ చూస్తే.. దేశంలోనే కరవు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయం స్పష్టమవుతోంది. కరవు ప్రాంతాలైన రాయలïÜమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగు నీరందించేలా తెలుగుగంగ (కృష్ణా 29 టీఎంసీలు. పెన్నా 30 టీఎంసీలు), గాలేరు–నగరి (38 టీఎంసీలు), హంద్రీ–నీవా (40 టీఎంసీలు), వెలిగొండ (43.5 టీఎంసీలు) చేపట్టారు.మిగులు జలాలపై ఆధారపడి శ్రీశైలం నుంచి మూడు దశాబ్దాలుగా తెలుగుగంగకు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులకు 12 ఏళ్లుగా నీటి విడుదల జరుగుతోంది. వెలిగొండలో మొదటి దశ దాదాపు పూర్తయింది. రెండో దశలో శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని నల్లమలసాగర్కు తరలించాల్సి ఉంది. కానీ.. కేడబ్ల్యూడీటీ–2 ముందు ఏకే గోయల్ దాఖలు చేసిన అఫిడవిట్ శ్రీశైలం నుంచి తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటి విడుదలను ప్రశ్నార్థకం చేసింది. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు అమలులో ఉన్నంత కాలం.. బేసిన్లోని రాష్ట్రాలు 2,130 టీఎంసీలు వినియోగించుకున్న తర్వాతే.. అందులోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 811 టీఎంసీల నికర జలాలను వినియోగించుకున్న తర్వాతే తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని ఆ అఫిడవిట్లో పేర్కొన్నారు.ఇక పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించిన 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో నాగార్జునసాగర్ ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. వాటిని కూడా బేసిన్లోని రాష్ట్రాలు 2,130 టీఎంసీలను వాడుకున్న తర్వాతే వినియోగించుకుంటామని అఫిడవిట్లో పేర్కొన్నారు. గత ఆరేళ్లలో కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద పరిస్థితి చూస్తే.. జూలై, ఆగస్టులో శ్రీశైలానికి ప్రవాహం మొదలవుతోంది. ఏ ఏడాదీ అవసరాలకు మించి వరద రాలేదు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో తొలి నుంచి టీడీపీ వైఖరి దారుణం. ఏనాడూ అక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదు.మీ పాపం వల్లే.. ఆల్మట్టి ఎత్తు పెంపు..చంద్రబాబు 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1996లో లోక్సభ ఎన్నికల తర్వాత యునైటెడ్ ఫ్రంట్కు కన్వీనర్గా ఉన్నారు. ఆ ఎన్నికల తర్వాత హెచ్డీ దేవెగౌడ ప్ర«ధాని అయ్యారు. అప్పుడు ఆయన తన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా కర్ణాటకలో కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పని మొదలుపెట్టారు. దీనివల్ల డ్యామ్లో 100 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యం ఏర్పడుతుంది. అది మన రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తుందంటూ రైతులతోపాటు విపక్షాలు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా మీరు (చంద్రబాబు) ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత 2000లో బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తుండడంతో కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది.ఆ నేపథ్యంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు మొదలుపెట్టాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు మేలు చేసేలా హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టు.. తెలంగాణ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్లు వచ్చాయి. కానీ, మీ ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అవన్నీ పునాదిరాళ్లకే పరిమితం అయ్యాయి. అప్పుడు కేవలం మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ 2010లో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.విభజన తర్వాత తెలంగాణకు హక్కులు తాకట్టు..రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో సీఎంగా ఉన్న మీరు (చంద్రబాబు) హైదరాబాద్లో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. తమ భూభాగంలో ఉన్నాయనే సాకు చూపుతూ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంతో పాటు పులిచింతల పవర్ ప్రాజెక్టును కూడా 2014లో తెలంగాణ ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. నాగార్జునసాగర్ కుడి కాలువ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలోనే ఉన్నా దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది. ఇంత జరిగినా దేన్నీ మీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతున్నా అప్పటి మీ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.దీంతో కృష్ణా జలాల కేటాయింపు, వినియోగంలో తమకు చాలా అన్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ నేపథ్యంలోనే కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కృష్ణా బోర్డు, దాని పరిధి, విధి విధానాలు ఖరారు చేస్తూ 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విభజన చట్టం 11వ షెడ్యూలులోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులను అనుమతి ఉన్న ప్రాజెక్టులుగా ప్రకటించింది. వీటన్నింటి సాధన కోసం నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది.కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా పని చేసింది. ఇప్పుడు టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అదే చిత్తశుద్ధితో పని చేయాలని కోరుతున్నాం. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ద్వారా రాష్ట్రానికి దక్కిన 512 టీఎంసీలలో ఇప్పుడు ఒక్క టీఎంసీ కోల్పోయినా అందుకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది.ఇప్పటికైనా మేలుకో బాబూ..!కేడబ్ల్యూడీటీ–2 ఎదుట రెండు తెలుగు రాష్ట్రాల వాదనలు కొనసాగుతుండగానే.. కృష్ణా జలాలు అత్యధికంగా వినియోగించుకునేలా, ఇప్పుడున్నవే కాకుండా, అదనంగా కూడా 372.54 టీఎంసీలు నిల్వ చేసుకునే విధంగా ప్రాజెక్టులు చేపట్టడానికి తెలంగాణ ప్రభుత్వం 2025 సెప్టెంబరు 16న జీఓ ఎంఎస్ నెం. 34 జారీ చేసింది. మరోవైపు అదేరోజు అటు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆల్మట్టి డ్యామ్లో నీటి నిల్వ ఎత్తు 519.16 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులకు అనుమతి ఇచ్చింది. దీనివల్ల ముంపునకు గురయ్యే 1,33,867 ఎకరాల భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదిక అమల్లోకి రాక ముందే కర్ణాటక సర్కార్ ఆల్మట్టిలో నీటి నిల్వ ఎత్తును పెంచేస్తున్నప్పటికీ మీరు చేష్టలుడిగి చూస్తుండటం దారుణం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ, ప్రయోజనాలను కాపాడటంలో మీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, అలక్ష్య ధోరణి వల్లే పొరుగు రాష్ట్రాలు ఆ విధంగా చురుకుగా వ్యవహరిస్తున్నాయి. దీనివల్ల మన రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని మళ్లీ ఒకసారి మీ దృష్టికి తెస్తున్నా. గతంలో మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా, రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది. తిరిగి ఈరోజు అదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అదే సమస్య ఎదురవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు రాజీ పడతారన్న అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది. -
సాకే శైలజానాథ్ను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. శైలజానాథ్ తల్లి గంగమ్మ మృతి పట్ల సంతాపం తెలిపారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్న వైఎస్ జగన్.. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.సాకే శైలజానాథ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సాకె గంగమ్మ ఈ ఉదయం(శుక్రవారం) కన్నుమూశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పని చేసిన సాకే శైలజానాథ్.. ప్రస్తుతం శింగనమల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. -
Gankala Kavitha: పార్టీ ఏదైనా వైఎస్ జగన్ చేసిన మంచి చెప్పాల్సిందే
-
జగన్ హైదరాబాద్ పర్యటన పై ఎల్లో మీడియా చిల్లర డిబేట్లు... ఏకిపారేసిన కాకాణి
-
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ
తాడేపల్లి: కృష్ణా జలాల పరిరక్షణలో వైఫల్యంపై చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండగట్టారు. ఈ మేరకు వైఎస్ జగన్..చంద్రబాబుకు లేఖ తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో వైఎస్ జగన్ ఏమన్నారంటే?.. ‘ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలి. KWDT–2 ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలి. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలిరాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వలన ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుంది. దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయాన్ని రైతుల ఆందోళనలను ఖాతరు చేయలేదు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు.. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఏపీ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసింది.ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సీఎంగా ఉన్న తరుణంలోనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితిలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర హక్కులను సమర్థంగా కాపాడాలి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీల నికర నీటిలో ఒక్క టీఎంసీ తగ్గినా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. దీనికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి’ అని సూచించారు. -
గంగపుత్రులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
గంగపుత్రులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని గంగపుత్రులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాంకాక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. వివిధ పథకాల ద్వారా మత్స్యకారులకు రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం. గతంలోనే కాదు ఇప్పుడు, ఎప్పుడూ మత్స్యకారులందరికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని మాట ఇస్తున్నా’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల…— YS Jagan Mohan Reddy (@ysjagan) November 21, 2025 -
Ground Report: జగన్ కట్టారు బాబు కొట్టేశారు
-
కూటమి, మోసం.. రెండూ కవల పిల్లలు: ఆర్కే రోజా
సాక్షి, తాడేపల్లి: మోసం, కూటమి ప్రభుత్వం రెండూ కవల పిల్లలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేస్తోందన్నారు. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను ఆదుకోవాలని రోజా డిమాండ్ చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మామిడి రైతులకు అండగా ఉండటం కోసం బంగారుపాలెం పర్యటన చేశారు. జగనన్న వస్తుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను తప్పుదోవ పట్టించడానికి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి 45 వేల మంది రైతులు పండించిన 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ప్యాక్టరీలకు తోలారు.అప్పుడు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒక్క కిలోకు ప్రభుత్వం 4 రూపాయలు ప్యాక్టరీలు 8 రూపాయలు మొత్తం కిలో మామిడికి 12 రూపాయలు ఇస్తామని చెప్పారు. నెలలు గడిచినా ప్రభుత్వం ఇవ్వాల్సిన 180 కోట్లు, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు విడుదల చేయలేదు. రైతు సంఘాలు ఆందోళన చేయడం వారికి అండగా నా వంతు బాధ్యతగా నేను కూడా రైతుల ఆందోళనకు అండగా నిలబడ్డాను. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన 180 కోట్లు విడుదల చేశారు. అయితే, ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతుండటంతో ప్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోతే రైతులకు మద్దతుగా పోరాటం చేశామని నేను మాట్లాడిన విషయం మీకు తెలిసిందే.తాజాగా ప్రభుత్వం ప్యాక్టరీ యాజమాన్యం ఇవ్వాల్సిన 8 రూపాయలు కాకుండా ప్రభుత్వం ఇచ్చినట్లే 4 రూపాయలు ఇస్తుంది. కొన్ని చోట్ల మూడు రూపాయలు కూడా ఇస్తున్నారని కూడా రైతులు తమ బాధను నాకు చెప్పినప్పుడు చాలా బాధేసింది. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో.. ప్రభుత్వ మోసం వల్ల 45 వేల మంది రైతులు 180 కోట్లు నష్ట పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు కిలోకు 8 రూపాయల చొప్పున 360 కోట్లు ఇవ్వాలని మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తమ న్యాయమైన డిమాండు కోసం మామిడి రైతులు చేసే పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఎప్పటిలాగే ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు. స్వంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు...మోసం - కూటమి ప్రభుత్వం రెండూ కవలపిల్లలుగా మారింది, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి @ysjagan గారు మామిడి రైతులకు అండగా ఉండటం కోసం…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 21, 2025 -
సాకే శైలజానాథ్కు మాతృవియోగం.. వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ కీలక నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ (Shailajanath) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సాకె గంగమ్మ ఈ ఉదయం(శుక్రవారం) కన్నుమూశారు. దీంతో పలువురు రాజకీయ నేతలు ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.గంగమ్మ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలియజేశారు. శైలజానాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు.. గంగమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పని చేసిన సాకే శైలజానాథ్.. ప్రస్తుతం శింగనమల వైఎస్సార్సీపీ ఇంఛార్జ్గా ఉన్నారు. -
జన ప్రభంజనం.. హైదరాబాద్ లో జగన్ ను చూసి కూటమి కుళ్ళు రాజకీయాలు
-
తండ్రికి తగ్గ తనయుడు.. వైఎస్ జగన్ పై ప్రశంసలు
-
సీఎం జగన్ నినాదాలతో దద్దరిల్లిన హైదరాబాద్
-
జగన్ కు ప్రాణహాని? ఎప్పుడైనా.. ఏదైనా జరగవచ్చు!
-
హైదరాబాద్ లో జగన్ క్రేజ్ చూసి కూటమి గగ్గోలు
-
ఉప్పొంగిన అభిమానం... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో ఘన స్వాగతం
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా మురళీధర్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లానరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆరంగి మురళీధర్ని పార్టీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. -
జగన్నినాదాలతో హోరెత్తిన భాగ్యనగరం
సాక్షి, హైదరాబాద్: జనాభిమానం పోటెత్తింది.. బేగంపేట ప్రాంతం జనసంద్రంగా మారింది.. కనుచూపు మేర అభిమాన జనం.. జగన్నినాదాలతో భాగ్యనగరం హోరెత్తింది.. పొరుగు రాష్ట్రంలో సైతం అభిమానం చెక్కుచెదరలేదని స్పష్టమైంది.. తమ అభిమాన నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడికొస్తున్నారని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న యువత భారీ సంఖ్యలో తరలి రావడం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది..2014 తర్వాత తెలంగాణలో వైఎస్సార్సీపీ కార్యకలాపాలు లేకపోయినా వేలాది మంది అభిమానులు బేగంపేట మొదలు నాంపల్లి వరకు ‘జై జగన్.. సీఎం సీఎం..’ అంటూ నినాదాలు చేస్తూ జననేత అడుగులో అడుగు వేసుకుంటూ రావడం కనిపించింది.. జగనన్నను దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే చేయి కలపాలని, మాట కలపాలని పెద్ద సంఖ్యలో యువత ముందుకు చొచ్చుకు వస్తుంటే నియంత్రించడానికి పోలీసులు శ్రమించాల్సి వచి్చంది.. హైదరాబాద్లో వైఎస్ జగన్కు ఇంతటి ఆదరణ లభించడం చూసి ‘పచ్చ’ మీడియాకు పిచ్చెక్కింది.. రెండు రోజుల ముందు నుంచే విషం చిమ్మిన సదరు ఎల్లో మీడియా.. తాజాగా అవాకులు, చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కింది. జగనన్నా.. నీ వెంటే మేమంతా: జగన్ కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న అభిమానులు జగన్ను చూడటానికి ఇంత మంది జనం ఎలా వచ్చారంటూ నిష్టూరమాడింది. ప్రత్యేకంగా డిబేట్లు పెట్టి జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తెలంగాణ అధికారగణాన్ని తప్పు పట్టింది. ఓ తోక పత్రికకు చెందిన చానల్ మరో అడుగు ముందుకు వేసి లోటస్ పాండ్ వద్ద జనమే లేరని పచ్చి అబద్ధాలు చెప్పడం దుర్మార్గం. దీనంతటికీ కారణం జగన్కు జనాదరణ చెక్కుచెదరక పోగా, మరింత పెరిగిందని తేటతెల్లమవ్వడమే.అన్నా.. నీవు సంతోషంగా ఉండాలె వైఎస్ జగన్ కోర్టు హాల్ నుంచి బయటికి రాగానే ఆయనతో ఫొటో దిగేందుకు అభిమానులు, ప్రజలు ఎగబడ్డారు. దీంతో కోర్టు హాల్ నుంచి కారు వరకు జగన్ను క్షేమంగా చేర్చడం కోసం పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. లిఫ్ట్ వద్ద పెద్ద ఎత్తున సిబ్బంది, న్యాయవాదులు చొచ్చుకువచ్చారు. ‘అన్నా.. నీవు సంతోషంగా ఉండాలె’ అంటూ మహిళా సిబ్బంది ఆకాంక్షించారు. ‘నమస్తే జగన్ అన్నా.. మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది’ అంటూ న్యాయవాదులు మాట కలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో కొంత మంది అభిమానులు పోలీసులను దాటుకుని ఒక్కసారిగా దగ్గరకు వచి్చనా, ఆయన అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడ నుంచి నేరుగా తల్లి వైఎస్ విజయమ్మను కలిసేందుకు బంజారాహిల్స్ లోటస్ పాండ్లోని ఇంటికి బయలుదేరారు. ఇంటి వద్దకు వెళ్లాక జన సందోహంలో చిక్కుకుపోయారు. భారీగా తరలివచి్చన అభిమానులకు అభివాదం చేసుకుంటూ నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి బేగంపేట విమానాశ్రయానికి వెళ్లారు.రెచ్చిపోయిన పచ్చ మీడియా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో వైఎస్ జగన్కు భారీగా ఆదరణ లభించడం చూసి ఎల్లో మీడియా పూనకాలెత్తింది. ఉదయం 11 గంటల నుంచే అక్కసు వెళ్లగక్కడం ప్రారంభించింది. అంతకు ముందు రెండు రోజుల నుంచి కూడా విష ప్రచారం చేయడమే కాకుండా గురువారం మరో అడుగు ముందుకు వేసి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ప్రత్యేక చర్చా వేదికలు నిర్వహించింది. ఇష్టానుసారం మాట్లాడుతూ.. జగన్ను చూడటానికి ఇంతగా జనం రావడం తప్పు అని తేల్చింది.యూరప్ పర్యటన తర్వాత కోర్టులో హాజరై వెళ్లాలన్న సూచన మేరకే వస్తున్నారని తెలిసినా, పనిగట్టుకుని దుష్ప్రచారం చేసింది. జగన్ను చూడటానికి అంత మంది జనం వస్తే పోలీసులు ఏం చేశారని ఓ పచ్చ చానల్ ప్రెజెంటర్ అక్కసు వెళ్లగక్కడం చర్చనీయాంశమైంది. జగన్ ప్రజాదరణ కలిగి ఉండటమే నేరం అన్నట్లు సదరు ప్రెజెంటర్ తీర్పు చెప్పడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఉదయం టిఫిన్ అమరావతిలో, మధ్యాహ్న భోజనం మరో ఊళ్లో, రాత్రి డిన్నర్ హైదరాబాద్లో చేస్తుండటం ఎల్లో మీడియా కంటికి కనిపించడం లేదా? వారినెందుకు తప్పు పట్టరు? అంటూ ప్రశ్నిస్తున్నారు.బేగంపేటలో అపూర్వ స్వాగతంగత నెల యూరప్ పర్యటనకు అనుమతి వచ్చిన నేపథ్యంలో సీబీఐ కోర్టు సూచించిన మేరకు గురువారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యేందుకు వచి్చన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హైదరాబాద్లో అపూర్వ స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయంలో పెద్ద సంఖ్యలో జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు. జై జగన్.. అంటూ నినదించారు. ‘అన్నా.. జగనన్నా..’ అని అరుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ వస్తున్నారని తెలుసుకుని ఉదయం నుంచే నగరంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన అభిమానులు.. ప్రజలు భారీగా తరలివచ్చారు. జగన్ కాన్వాయ్ వెంట నాంపల్లిలోని సీబీఐ కోర్టు వరకు అడుగులో అడుగు వేశారు. దారి మధ్యలో అడుగడుగునా నినాదాలు చేస్తున్న అభిమానులకు వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బారికేడ్లను దాటిన అభిమానంవైఎస్ జగన్ ఉదయం 10.51 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ వేచి చూస్తున్న పెద్ద సంఖ్యలో అభిమానులు, ఆయన్ను చూడగానే.. ‘జై జగన్..’అంటూ నినాదాలు చేశారు. వారి కేరింతలతో విమానాశ్రయం ప్రాంగణం మారుమోగింది. ఓ దశలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి జగన్ను చూసేందుకు పరుగులు తీశారు.ఉదయం 11.11 సమయంలో తన కాన్వాయ్లో విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన జగన్.. గ్రీన్ ల్యాండ్స్, రాజ్భవన్, ఖైరతాబాద్, లక్డీకాపూల్ మీదుగా నిర్ణీత సమయానికే నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. ఈ మార్గంలో అభిమానులు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఆయన కాన్వాయ్ వెనుక ద్విచక్ర వాహనాల్లో అభిమానులు బయలుదేరారు.ఉదయం 11.45 గంటలకు జగన్ కాన్వాయ్ నాంపల్లి కోర్టుకు చేరుకోగానే.. అప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు జగన్ ఉన్న వాహనాన్ని మాత్రమే లోపలకు అనుమతించారు. కోర్టు బయట కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని వేచి ఉన్నారు. సీబీఐ కోర్టు ప్రాంగణంతో పాటు న్యాయస్థానం లోపల కూడా న్యాయవాదులతో నిండిపోయింది. జగన్ను చూసేందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కూడా పోటీ పడ్డారు. మధ్యాహ్నం 12.26 గంటలకు జగన్ బయటకు వచ్చారు. -
నితీష్ కుమార్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
బిహార్ ముఖ్యమంత్రిగా పదోసారి ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నితీష్ కుమార్ బిహార్కు మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా (ఎక్స్ ద్వారా) తన శుభాకాంక్షలను తెలియజేశారు.జేడీయూ (యునైటెడ్) అధ్యక్షుడు నితీష్ కుమార్ గురువారం పట్నాలోని గాంధీ మైదానంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డిఎ)కి చెందిన పలువురు సీనియర్ నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.Heartiest congratulations to Shri @NitishKumar Ji on taking oath as Chief Minister of Bihar! Wishing you the very best for a successful tenure!— YS Jagan Mohan Reddy (@ysjagan) November 20, 2025సీఎం నితీష్ కుమార్తో పాటు జేడీయూ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ చౌదరి, అశోక్ చౌదరి, శ్రావణ్ కుమార్, లేషి సింగ్, మొహ్మద్ జమాఖాన్, బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ సింగ్, రామనిషాద్, నితిన్ నబీన్, అరుణ్ శంకర్ ప్రసాద్, సురేంద్ర మెహతా, లఖేంద్ర కుమార్ రోషన్, నారాయణ ప్రసాద్, శ్రేయసి సింగ్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీనికిముందు నితీష్ ఎన్డీఏ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నుంచి అనుమతి తీసుకున్నారు.ఇదీ చదవండి: ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం -
జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్
-
Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్
-
ఎల్లో మీడియా విషపు రాతలు... ఇచ్చిపడేసిన జూపూడి
-
జగన్ తో పోలీస్ సెల్ఫీ
-
జై జగన్ అంటూ..జగన్ కాన్వాయి వెంట..!
-
Advocate: ఇక కోర్టుకు రావాల్సిన పనిలేదు
-
లోటస్ పాండ్ వద్ద పోటెత్తిన జగన్ అభిమానులు..
-
నాది తెలంగాణ .. జగన్ కారణజన్ముడు క్రేజ్ కి బిత్తరపోయిన పెద్దాయన
-
లోటస్ పాండ్ చేరుకున్న వైఎస్ జగన్
-
దారిపొడవునా ఘన స్వాగతం.. ఏపీ కాకపోయినా ఇసుకేస్తే రాలనంత జనం
-
జగన్ మాస్ ఫాలోయింగ్...ఈ వీడియో చూస్తే ఎల్లో బ్యాచ్ కు నిద్రపట్టదు
-
రాష్ట్రం ఏదైనా... జగన్ అడుగు పెట్టితే ఇదే సీన్ రిపీట్ అవుద్ది
-
కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్ కు YS జగన్
-
జగన్ రాకతో.. దద్దరిల్లిన హైదరాబాద్
-
హైదరాబాద్కు జగన్.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
-
హైదరాబాద్ లో జగన్ క్రేజ్..
-
Watch Live: CBI కోర్టుకు YS జగన్
-
కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి
-
హైదరాబాద్కు వైఎస్ జగన్.. ఉప్పొంగిన అభిమానం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి (YS Jagan Hyderabad Visit) రాకతో నగరంలో కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్పోర్టు వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. దారి వెంట ఆయనతో ముందుకు కదులుతూ జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. జగన్ పర్యటన నేపథ్యంలో అటు గన్నవరం.. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ల వద్ద కోలాహలం నెలకొంది. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్దకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. వాళ్లకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదిలారు. భారీ ర్యాలీగా నాంపల్లి సీబీఐ కోర్టు వద్దకు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చారు. జగన్ రాక నేపథ్యంతో హైదరాబాద్ నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. కోర్టుకు వచ్చే 2 మార్గాలను ఆధీనంలోకి తీసుకుని.. న్యాయవాదులకు మాత్రమే లోపలికి అనుమతించారు. ‘‘హాజరును కోర్టు రికార్డు చేసింది. ప్రస్తుతానికైతే ఆయన మళ్లీ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు’’ అని జగన్ తరఫు లాయర్ మీడియాకు తెలిపారు. కోర్టు ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన అక్కడి నుంచి నేరుగా లోటస్పాండ్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మతో భేటీ అయ్యారు. ఆపై పర్యటన ముగించుకుని తిరుగు పయనం అయ్యారు.ఇదీ చదవండి: కుమ్మక్కై జగన్పై అక్రమ కేసులు.. కుట్రలు పన్ని దుష్ప్రచారం -
పాడేరు వైద్యకళాశాలకు 50 సీట్లు హుళక్కి
సాక్షి, అమరావతి: బాబు సర్కారు నిర్లక్ష్యం కారణంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లు దక్కకుండాపోయాయి. ఉత్తరాంధ్రలోని గిరిజనులకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతోపాటు వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలను నెలకొల్పిన విషయం తెలిసిందే. 150 ఎంబీబీఎస్ సీట్లతో 2024–25 విద్యా సంవత్సరంలో కళాశాల ప్రారంభించేందుకు వీలుగా గత ప్రభుత్వంలోనే చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే కొత్త వైద్య కళాశాలల్ని పీపీపీ పేరిట ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పాడేరు కళాశాలను గాలికి వదిలేసింది. అయినప్పటికీ వైఎస్ జగన్ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా 50 ఎంబీబీఎస్ సీట్లతో కళాశాల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే కళాశాలకు మరో 100 సీట్లు సమకూరాల్సి ఉండగా 2025–26 విద్యా సంవత్సరానికి 50 సీట్లకు అనుమతి కోసం పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. నేషనల్ మెడికల్ కమిషన్తో సంప్రదింపులు జరిపి, సీట్లు రాబట్టే బాధ్యతను కళాశాల, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)పై నెట్టేసి ప్రభుత్వం పెద్దలు చేతులు దులిపేసుకున్నారు. వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ గత ప్రభుత్వంలో వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టడంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా చొరవ చూపారు. 2023–24లో నాలుగు వైద్య కళాశాలలకు కొన్ని కారణాలతో తొలుత ఎన్ఎంసీ అనుమతులు ఇవ్వలేదు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైద్యశాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, డీఎంఈ సహా పలువురు అధికారుల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. ఆ ఏడాది ఐదు కళాశాలల్లో దరఖాస్తు చేసిన వంద శాతం సీట్లకు అనుమతులు రాబట్టారు. వందేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఒకే ఏడాది ఏకంగా 750 సీట్లను రాష్ట్రానికి సమకూర్చారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలున్న అనుకూల పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబు చొరవ చూపకపోవడం వల్ల 50 సీట్లు కూడా రాష్ట్రానికి సమకూరకుండా పోయాయి. వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టగా వాటిలో 10 కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం రెండేళ్లలో 1750 కొత్తగా ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి సమకూరకుండా చంద్రబాబు అడ్డుపడ్డారు. దీంతో 2024–25 విద్యా సంవత్సరంలో 700, 2025–26లో 1,750 సీట్ల చొప్పున 2,450 మంది విద్యార్థులు వైద్య విద్యకు దూరం కాగా.. వారి భవిష్యత్ తలకిందులైంది. కనీసం చొరవ చూపని ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో సీట్ల మంజూరులో పలు అభ్యంతరాలను ఎన్ఎంసీ వ్యక్తపరిచింది. వాటికి ప్రిన్సిపల్ వివరణ ఇవ్వగా, పరిశీలనలోకి తీసుకోలేదు. ఆగస్టులో సీట్లు మంజూరు చేయలేమని తేల్చేసి లెటర్ ఆఫ్ డిస్అప్రూవల్ను ఎన్ఎంసీ జారీ చేసింది. దీంతో మొదటి అప్పీల్కు ప్రిన్సిపల్ దరఖాస్తు చేశారు. అప్పీల్ సందర్భంగా కొన్ని పొరపాట్లు దొర్లడంతో దానిని తిరస్కరించినట్టు ఎన్ఎంసీ ఈ నెల మొదటి వారంలోనే తేల్చేసింది. గత వారంలో ప్రిన్సిపల్ సెకండ్ అప్పీల్ చేశారు. ప్రారంభంలోనే దరఖాస్తును ఎన్ఎంసీ నిరాకరించింది. మొదటి అప్పీల్ను పరిగణనలోకి తీసుకోనేలేదు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఈ వ్యవహారంలో చొరవ చూపలేదు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) షెడ్యూల్ ప్రకారం గురువారం అర్ధరాత్రితో 2025–26 ఎంబీబీఎస్ ప్రవేశాల ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రభు త్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనుమతులు రాబట్టడంలో ప్రిన్సిపల్ను బాధ్యుల్ని చేస్తూ షోకాజ్ నోటీసులు ఇవ్వడం వైద్యశాఖలో చర్చనీయాంశంగా మారింది. -
వైఎస్ జగన్పై.. కుమ్మక్కై అక్రమ కేసులు.. కుట్రలు పన్ని దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటై కుట్రపూరితంగా వైఎస్ జగన్పై తప్పుడు కేసులు బనాయించాయి. ఓదార్పు యాత్ర చేయడానికి వీల్లేదన్న కాంగ్రెస్తో తెర వెనుక జట్టుకట్టిన చంద్రబాబు తన వాళ్లు కూడా తప్పుడు కేసులు పెట్టేలా చక్రం తిప్పారు. రాజకీయంగా వైఎస్ జగన్ను అణగదొక్కాలన్న కాంగ్రెస్, చంద్రబాబు కుట్రలకు వంతపాడుతూ ఎల్లో మీడియా నిత్యం పచ్చి అబద్ధాలు, కట్టుకథలతో తప్పుడు రాతలు రాసింది.మహానేత వైఎస్సార్ జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ అప్పటి అధినేత్రి సోనియా గాంధీకి, అధిష్ఠానానికి మంచివాడిలా కనిపించిన వైఎస్ జగన్.. వైఎస్సార్ హఠాత్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన ఆయన అభిమానులను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టడంతోనే నచ్చకుండాపోయారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓవైపు కేంద్రంలో చేతిలో ఉన్న అధికార దుర్వినియోగంతో, మరోవైపు టీడీపీతో కుమ్మక్కయి రాజకీయంగా దిగజారి వైఎస్ జగన్పై అక్రమ కేసులు నమోదు చేసింది.16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించింది. అయినా, వైఎస్ జగన్ వెరవలేదు. 2009 నుంచి పదేళ్ల పాటు తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజల కోసం నిలిచారు. అధికారంలోకి వచ్చాక 2019–24 మధ్య జనం మెచ్చేలా సుపరిపాలన అందించారు. ఆత్మీయత.. విశ్వసనీయత.. దార్శనికత.. పారదర్శకత.. మానవీయత కలగలసిన ప్రజా నాయకుడిగా ఎదిగారు. దీంతో వైఎస్ జగన్పై మళ్లీ కుట్రలు, కుయుక్తులకు తెరలేపారు.గత నెల యూరప్ పర్యటనకు అనుమతిస్తూ కోర్టు సూచన మేరకు మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు. కోర్టు అనుమతితో వైఎస్ జగన్ గత నెల యూరప్ పర్యటనకు వెళ్లారు. అనుమతి మంజూరు చేసే సమయంలో పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఈ నెల 14లోపు కోర్టు ఎదుట హాజరుకావాలని జడ్జి సూచించారు. నేరుగా హాజరైతే తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని, ఆన్లైన్లో హాజరుకు అవకాశం ఇవ్వాలని జగన్ మెమో దాఖలు చేశారు. 16 నెలల అక్రమ నిర్బంధం అనంతరం విడుదలైన వైఎస్ జగన్కు అపూర్వ స్వాగతం పలికిన అభిమానులు (ఫైల్) అయితే, నేరుగా హాజరుకావాలని నిర్ణయించుకుని ఆ మెమోను వెనక్కు తీసుకున్నారు. ఈ సందర్భంగా 21లోగా హాజరుకావాలని న్యాయమూర్తి సూచించారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ గురువారం హాజరుకానున్నారు. దీనిపైన కూడా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. మద్యం, స్కిల్ డెవలప్మెంట్, తదితర కేసుల్లో బెయిల్పైన ఉన్న సీఎం చంద్రబాబే అసలు దోషి. బెయిల్పైన ఉండే చంద్రబాబు సీఎంగా కొనసాగుతున్నారు. దీన్ని విస్మరించి జగన్ లక్ష్యంగా ఎల్లో మీడియా, టీడీపీ నేతలు దుష్ప్రచారం సాగిస్తుండటంపై రాజకీయ పరిశీలకుల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. ఓదార్పు యాత్రలో ఓ అవ్వ ఆత్మీయత(ఫైల్) తప్పుడు కేసులేనని అంగీకరించిన శంకర్రావు, ఆజాద్వైఎస్ జగన్మోహన్రెడ్డిని అణగదొక్కేందుకు చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం... తమ ఎమ్మెల్యే శంకర్రావు ద్వారా తప్పుడు ఆరోపణలతో హైకోర్టులో కేసు వేయించింది. దీనికి టీడీపీ నుంచి ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు జత కలుస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, ఈ కుమ్మక్కు కొంతకాలం తర్వాత కాంగ్రెస్ నేతల మాటల్లోనే స్పష్టమైంది. ‘‘వైఎస్ జగన్ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా. ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ (అప్పటి) సోనియాగాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు.నేను చేశానంతే’’ అని శంకర్రావు, ‘‘రాజకీయంగా వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు వేశాం’’ అని కాంగ్రెస్ మాజీ అగ్ర నేత గులాం నబీ అజాద్ వేర్వేరు సందర్భాల్లో మీడియా ఎదుట కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, సోనియా మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్లోనే ఉండి ఉంటే 2014కు ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారని స్పష్టం చేయడం గమనార్హం. ఇలా, వైఎస్ జగన్మోహన్రెడ్డిని అణగదొక్కేందుకు దశాబ్దంన్నర కిందట చేసిన కుట్రలను నేటికీ టీడీపీ, ఎల్లోమీడియా కొనసాగిస్తుండడం గమనార్హం.‘‘వైఎస్ జగన్ను రాజకీయంగా వేధించేందుకే కేసులు వేశా. ఆయనపై కేసులు వేసేందుకు మా పార్టీ చీఫ్ (అప్పటి) సోనియాగాంధీ పేపర్లు పంపి సంతకాలు చేయమన్నారు. నేను చేశానంతే’’-కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు బతికుండగా పలుమార్లు చేసిన వ్యాఖ్యలు ఇవీ... ‘‘రాజకీయంగా వైఎస్ జగన్ను ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు వేశాం. సోనియా గాంధీ మాట విని ఓదార్పు యాత్ర చేయకుండా కాంగ్రెస్లోనే ఉండి ఉంటే 2014కు ముందే వైఎస్ జగన్ సీఎం అయ్యేవారు’ - ఇవీ కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ గతంలో చేసిన వ్యాఖ్యలు -
చిన్నారికి నామకరణం చేసిన వైఎస్ జగన్
-
చిన్నారికి పేరు పెట్టిన జగన్ మావయ్య
సాక్షి, గుంటూరు: చిన్నారులంటే వైఎస్ జగన్ మోహన్రెడ్డికి అపారమైన మమకారం. ప్రజల మధ్యకి వెళ్లినప్పుడు వాళ్లూ ఆయన పట్ల ఎంతో భావోద్వేగానికి లోనవుతుంటారు. దీంతో స్వయంగా వాళ్లను దగ్గరకు తీసుకుని బుజ్జగించడం తరచూ చూసేదే. అలా ఓ చిన్నారికి మావయ్యగా ఆయన నామకరణం చేశారు కూడా. మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనాదేవి దంపతులు బుధవారం తమ అభిమాన నేత వైఎస్ జగన్ను తాడేపల్లికి వెళ్లి కలిశారు. తమ కుమార్తెకు నామకరణం చేయాలని ఆయన్ని కోరారు. దంపతుల కోరిక మేరకు వారిని అడిగి తెలుసుకుని మోక్షితా రెడ్డిగా పేరు పెట్టి లాలించారు. తమ కుమార్తెకు జగన్ చేతుల మీదుగా నామకరణం జరిగినందుకు ఆ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
రైతులకు ఒకే ఏడాది 7800 కోట్లు.. అది జగన్ ట్రాక్ రికార్డు
-
జగన్ షాక్ ఒకే కుటుంబంలో 18 మంది....
-
ఆకాశ గంగను ఒడిసిపట్టిన భగీరథి
పీసీ పల్లి: నిత్యం కరువు కాటకాలతో అల్లాడే ప్రాంతం. అరకొరగా అందే భూగర్భ జలాలూ ఫ్లోరైడ్తో నిండిపోయి తాగేందుకు పనికిరాని దుస్థితి. గుక్కెడు నీటి కోసం మైళ్ల దూరం వెళ్లాల్సిందే. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్న ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం మురుగమ్మి(Murugammi) గ్రామం వైఎస్ జగన్ ప్రభుత్వ సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులతో వర్షపు నీటిని ఒడిసిపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశంలోనే 2వ ఉత్తమ నీటి సంరక్షణ పంచాయతీగా ఎంపికైంది. సర్పంచ్ సుబ్బరత్నమ్మ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. వైఎస్ జగన్ సహకారంతో కల సాకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2021–24 మధ్య మురుగమ్మి పంచాయతీ సర్పంచ్ సుబ్బరత్నమ్మ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ఆయన సహకారంతో గ్రామంలో 47కుపైగా వాటర్òÙడ్ పథకాలను చేపట్టారు. పంచాయతీలో సుమారు రూ.కోటికి పైగా నిధులు వెచి్చంచి నీటికుంటలు, ఊట కుంటలు, చెక్ డ్యాంలు నిర్మించారు. కొండ చుట్టూ కందకాలు తీయించారు. కొండ మీద పడిన వర్షపు నీరు ఎక్కడికి అక్కడ ఆగి భూమిలోకి ఇంకేటట్లు రెండు కందకాలు రూ.2 లక్షలతో తవ్విచారు.వర్షం నీరు ఎటువైపు వాలు ఉంటే అటు ప్రవహిస్తూ ఒకచోట ఇంకేటట్టు రూ.27 లక్షలు వెచ్చించి 16 చిన్న ఊట కుంటలు తీశారు. 21 డక్ అవుట్ పాండ్లు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.35 లక్షలు ఖర్చు చేశారు. ‘అమృత సరోవర్’ పేరిట నీరు ఎక్కువగా ప్రవహించే ఏటవాలు ప్రాంతంలో కుంటతీసి చుట్టూ పెద్ద కందకం ఏర్పాటు చేశారు. ఈ చర్యల వల్ల వర్షాకాలంలో వాటర్ షెడ్ పథకాల్లో గణనీయంగా నీరు చేరింది. దీంతో చుట్టుపక్కల ఉన్న పంట పొలాల బోర్లలో భూగర్భ నీటిశాతం గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు వరి, శనగ, పొగాకు వంటి పంటలు సాగు చేశారు. అంతేకాకుండా కొత్త నీరు చేరడంతో నీటిలో గతంలో అధికంగా ఉండే ఫ్లోరైడ్ శాతం తగ్గుముఖం పట్టింది. నా కష్టం.. జగనన్న ఆశయం ఫలించాయి 2021–24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులు సంతోషంగా ఉండాలని, పల్లెలు పంటలతో కళకళలాడాలని కోరుకునేవారు. ఆయన ఆశయానికి అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చిన నిధులను దుర్వినియోగం కాకుండా పంచాయతీల్లో వాటర్ షెడ్ పథకాలు పెద్ద ఎత్తున నిర్మించాను. నా కష్టం.. జగనన్న ఆశయం నెరవేరి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లోని బోర్లలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. నా కష్టాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. – సుబ్బరత్నమ్మ, సర్పంచ్, అవార్డు గ్రహీత, మురుగమ్మి -
Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర
-
సౌదీ ప్రమాదంపై YSRCP అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
సౌదీ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు. Deeply shocked to learn about the tragic accident that occurred in Saudi Arabia. I wish a speedy recovery for the injured.My prayers are with the families of the victims in this difficult hour. May their souls rest in peace.— YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2025ఇక, సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది ఉమా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీ కొట్టి మంటలు చెలరేగడం.. అంతా గాఢ నిద్రలో ఉండడంతో సజీవ దహనం అయ్యారు. వీళ్లంతా భారత్ నుంచే అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే మృతుల్లో హైదరాబాద్కు చెందిన యాత్రికులే అధికంగా ఉన్నారు. -
ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తున్నది కేవలం అప్పుల్లోనే... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
రాష్ట్రం దూసుకెళ్తున్నది అప్పుల్లోనే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్ధంగా రాష్ట్ర ఆర్థి క పరిస్థితి ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికల్లోని గణాంకాలను ఉటంకిస్తూ, ఆర్థి క నిర్వహణలో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందంటూ కడిగిపారేశారు. రాష్ట్రం దూసుకుపోతున్నది కేవలం అప్పులు చేయడంలోనేనని పేర్కొన్నారు. కొసరంత ఆదాయం.. ఇసుమంత మూలధన వ్యయం.. కొండలా పెరిగిపోతున్న రుణభారం..! ఇదీ చంద్రబాబు విజన్..! అంటూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే...⇒ 2025–26 ఆర్థి క సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించి కాగ్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ధి అత్యంత నిరాశజనకంగా ఉందన్నది స్పష్టమవుతోంది. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పినదానికి విరుద్ధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. ⇒ ఆర్థిక రంగంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే.. వారి ఘోర వైఫల్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. 2025–26 ఆర్థి క సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వృద్ధి కేవలం 7.03 శాతం మాత్రమే. 2025–26లోనైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకుంటుందని చాలా మంది ఆశించారు. కానీ.. కాగ్ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నది స్పష్టం అవుతోంది. గత ఆర్థి క సంవత్సరం మొదటి ఆరు నెలలతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) ఆదాయాల వృద్ధి కేవలం 2.85 శాతం మాత్రమే. ⇒ 2023–24 నుంచి 2025–26 వరకూ రెండు ఆర్థి క సంవత్సరాల్లో మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో పోల్చితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయాల వృద్ధి కేవలం 2.75 శాతం మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్రం అద్భుతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తోందంటూ ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం 2024–25లో జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) వృద్ధి 12.02 శాతం సాధించామని.. 2025–26లో 17.1 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది.కానీ.. ఫలితాలు అత్యంత దారుణంగా ఉన్నాయన్నది కాగ్ విడుదల చేసిన గణాంకాలే తేల్చి చెబుతున్నాయి. ఈ స్థాయిలో జీఎస్డీపీ వృద్ధి సాధించాలంటే రెండేళ్ల కాలంలో భారీ ఎత్తున పెట్టుబడులు, నిధులు వ్యయం చేయాలి. అప్పుడు జీఎస్డీపీలో సీఏజీఆర్ 14.53 శాతం అవుతుంది. దీని ఫలితంగా రెండేళ్లలో సంబంధిత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి 12–15 శాతంగా ఉంటుంది. కానీ, వాస్తవం ఏమిటంటే.. రెండేళ్లలో పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) కేవలం 2.75 శాతం మాత్రమే. అంచనాలు ఆ స్థాయిలో ఉంటే.. వాస్తవ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. గత రెండేళ్లలో మూలధన వ్యయం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) 16 శాతం తగ్గడం అత్యంత ఆందోళనకరం. ⇒ 2025–26 తొలి త్రైమాసికంలో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి కేవలం 3.47 శాతం మాత్రమే. గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో జీఎస్టీ, అమ్మకపు పన్ను ఆదాయాలు బాగా తగ్గాయి. కానీ.. చంద్రబాబునాయుడు మాత్రం గతేడాది పోల్చితే.. 2025–26 తొలి త్రైమాసికంలో జీఎస్డీపీ వృద్ధి 10.50 శాతం అధికంగా ఉందని ప్రకటించారు. ఇది పూర్తిగా అవాస్తవం.⇒ గత ఐదేళ్లలో 2019–24 మధ్య ఆంధ్రప్రదేశ్ సొంత పన్నుల ఆదాయం వార్షిక వృద్ధి రేటు 9.87 శాతం. రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్నుల ఆదాయం రూ.58,031 కోట్ల నుంచి రూ.92,922 కోట్లకు పెరిగింది. ఆ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు 10.23 శాతంగా ఉంది. గత ఐదేళ్లలో జీఎస్డీపీ వృద్ధి, పన్ను ఆదాయాల వృద్ధితో పోల్చితే టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీ, పన్ను ఆదాయాల వృద్ధి తక్కువగా ఉందన్నది స్పష్టమవుతోంది. అయినప్పటికీ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు ఎలా చెప్పగలరు?⇒ రాష్ట్రం దూసుకుపోతున్నట్లు కనిపించే ఏకైక అంశం అప్పుల విషయంలోనే. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఏకంగా రూ.2,06,959 కోట్లు అప్పులు చేశారు (వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో.. టీడీపీ కూటమి సర్కారు 17 నెలల్లోనే 62 శాతం అప్పు చేసింది). -
చంద్రబాబుకు గుడివాడ అమర్నాథ్ కౌంటర్
సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో మూడు సార్లు ఇలానే సీఐఐ సదస్సులు నిర్వహించారు. 2014-19 మధ్యలో లక్షకోట్లు పెట్టుబడులు వస్తాయని నమ్మించారు. మొత్తం మీద 35వేలకోట్లు మాత్రమే రూపాంతరం చెందాయి. లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకి లేని పోని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారు.మా ప్రభుత్వంలో సదస్సు నిర్వహించాం. కానీ పారదర్శంగా ఎంవోయూలు కుద్చుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సీఐఐ సదస్సులో కొత్తగా ఏం తీసుకొచ్చారో క్లారిటీ ఇవ్వలేకపోయారు. వైఎస్ జగన్ హాయంలో 2023లో గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు జరిగింది. వైఎస్ జగన్ హయాంలో కుదుర్చుకున్న సంస్థలతో చంద్రబాబు మళ్లీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో పారిశ్రామిక వేత్తలు బెదిరిపోయారని చంద్రబాబు చెప్పారు. వైఎస్సార్సీపీ పాలనలో బెదిరిపోయిన పారిశ్రామిక వేత్తలు ఎవరో చెప్పాలి. నాడు జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో వైఎస్ జగన్తో పాటు ముకేష్ అంబానీ, అదానీ, దాల్మియా నవీన్ జిందాల్, ఒబారిస్ సంజయ్ బంగర్, భజంక, బీవీఆర్ మోహన్ రెడ్డి,జీఎంఆర్ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వేదికపై కూర్చున్నారు. కానీ ఇవాళ సీఎం చంద్రబాబుతో వేదికపై రాష్ట్ర కేబినెట్ మంత్రులు కూర్చున్నారు. దీనీ ద్వారా పారిశ్రామిక వేత్తలకు వైఎస్ జగన్ మీద నమ్మకం ఉన్నట్టా, చంద్రబాబు మీద నమ్మకం ఉన్నట్టా. తండ్రీకొడుకులు ఒకరు ఒకరు తబలా కొట్టుకోవడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. రెన్యూ సంస్థ 2022 ఏడాదిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారు. చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను బెదిరించి అబద్ధాలు చెప్పించారు. లులు ఛైర్మన్ చంద్రబాబు ఆస్థాన విద్వాసంసుడు. ఏ సదస్సు జరిగిన లులు అధినేత కనిపిస్తారు. లులు సంస్థ పేరు 2014 నుంచి చెపుతున్నారు. ఇప్పటికి కనీసం ఒక బిల్డింగ్ కూడా కట్టలేదు. మా హయంలో వచ్చిన ఇనార్బిట్ మాల్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. వైఎస్ జగన్ కట్టిన పోర్టులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. కరణ్ అదానీ గూగుల్ డేటా సెంటర్ ఎవరి హయంలో వచ్చిందో చెప్పారు. సముద్రతీరంలో వైఎస్ జగన్ పోర్టులు కడితే.. మీరు బికినీ పెస్టివల్ ఎలా నిర్వహించాలని ఆలోచించారు.స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే జర్నలిస్ట్ మీద చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్టేషన్ చూస్తే స్టీల్ ప్లాంట్ను ఏదొకటి చేసేలా ఉన్నారు. ప్రొడక్షన్ బట్టి జీతం ఇస్తామని సర్క్యులర్ ప్రవేశ పెడతారా. దేశంలో ఎక్కడైనా ఇటు వంటి పరిస్థితి ఉందా. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ లో 5000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. ఉన్న ఉద్యోగులను కాపాడలేని మీరు, రానున్న ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారా.? వైఎస్ జగన్ పాలనలో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది కాబట్టి, చంద్రబాబు 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని లెక్కలు చెప్పారని ధ్వజమెత్తారు. -
జగన్ 2.0 ను తట్టుకోలేరు టీడీపీకి ఉష శ్రీ చరణ్ వార్నింగ్
-
మీ సిగ్గు లేని ప్రచారాలు ఆపండి! ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్వీట్
-
ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఆందోళన
సాక్షి, తాడేపల్లి: ఏపీ ఆర్ధిక పరిస్థితిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా ఆర్థిక పరిస్థితి ఉందని జగన్ తెలిపారు. కాగ్ నివేదికలను ఉటంకిస్తూ వైఎస్ జగన్ వివరాలను ఎక్స్లో పోస్టు చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి, పెరిగి పోతున్న రుణభారం అంటూ జగన్ పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరకరంగా మారింది. కాగ్ విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సంపద సృష్టిస్తామంటూ టీడీపీ, జనసేన నేతలు చెప్పిన దానికి విరుద్దంగా పరిస్థితి ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పనితీరును గమనిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనపడతాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి కేవలం 7.03% మాత్రమే ఉంది. 2025-26లోనైనా రాష్ట్రం ఆర్థికంగా కోలుకుంటుందని చాలామంది ఆశించారు.కానీ, కాగ్ విడుదల చేసిన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. సొంత ఆదాయాలు ఏమాత్రం పెరగకపోగా, మూలధన పెట్టుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతుంది. అయినప్పటికీ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందంటూ ఎలా ప్రచారం చేస్తారు?. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్డీపీ వృద్ధిని 12.02%గా ప్రభుత్వం ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ వృద్ధిని 17.1%గా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఫలితాలు దారుణంగా ఉన్నట్లు కాగ్ నివేదికలే తేల్చి చెప్తున్నాయి. సంపద సృష్టి లేకపోవటంతో రాష్ట్రం తిరోగమనంలో ఉంది. కానీ, అభివృద్దిలో వేగంగా పరుగులెత్తుతోందంటూ ఎలా మాట్లాడతున్నారు?’ అని ప్రశ్నించారు.𝙇𝙤𝙬 𝙍𝙚𝙫𝙚𝙣𝙪𝙚 𝙂𝙧𝙤𝙬𝙩𝙝, 𝙇𝙤𝙬 𝘾𝙖𝙥𝙚𝙭 𝙖𝙣𝙙 𝙍𝙞𝙨𝙞𝙣𝙜 𝘿𝙚𝙗𝙩 - 𝙏𝙝𝙚 𝙑𝙞𝙨𝙞𝙤𝙣 𝙤𝙛 @ncbn 𝙂𝙖𝙧𝙪The figures released by the CAG for first half of FY 2025-26 reveal a very discouraging growth of State Government revenues. This is quite contrary to the… pic.twitter.com/aQSOlWz7uL— YS Jagan Mohan Reddy (@ysjagan) November 16, 2025 -
ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి
సాక్షి, అమరావతి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడి అని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో దాడికి సంబంధించిన వీడియోతో సహా పోస్టు చేశారు. ‘హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పగలగొట్టడం, అద్దాలను విరగ్గొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో దుర్వినియోగం చేస్తున్నారన్న హెచ్చరికగా దీన్ని భావించాలి. చంద్రబాబు నాయకత్వం మద్దతుతో టీడీపీ నేతలు, రౌడీ మూకలు హింసాత్మక చర్యల ద్వారా ప్రత్యర్థులను భయపెట్టి, రాజకీయ వ్యతిరేకతను అణచి వేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. -
YSRCP ఆఫీస్పై దాడిని తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్
-
హిందూపురం ఘటనను తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: హిందూపురంలో వైఎస్సార్సీపీ కార్యాలయంపై దాడి ఘటనను(Attack on Hindupur YSRCP Office) వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఖండించారు. ఇది వైఎస్సార్సీపీపై దాడి మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారాయన. వైఎస్సార్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు, బాలకృష్ణ అనుచరులు జరిపిన హింసాత్మక దాడి ప్రజాస్వామ్యంపై నేరుగా జరిగిన దాడి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ను పగలగొట్టడం, అద్దాలను విరగ్గొట్టడం, కార్యకర్తలపై దౌర్జన్యం చేయడం వంటి చర్యలు ప్రజాస్వామ్య విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ దాడిపై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది నిర్లక్ష్యం కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు నాయకత్వంలో దుర్వినియోగం చేస్తున్నారన్న హెచ్చరికగా భావించాలి. టీడీపీ హింసాత్మక చర్యలు, చంద్రబాబు నాయకత్వం మద్దతుతో గుంపుల ధారాళాన్ని ప్రోత్సహించడం, భయపెట్టి ప్రత్యర్థులను అణచివేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని ప్రభుత్వానికి పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ స్వేచ్ఛను నమ్మే ప్రతి పౌరుడిపై ఈ దాడి జరిగినట్లే. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని తన ఎక్స్ ఖాతాలో దాడికి సంబంధించిన వీడియోతో సహా వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. The violent attack by TDP leaders and Balakrishna’s followers on the YSRCP office in Hindupur is a direct assault on democracy itself. We strongly condemn this barbaric act. When political parties start destroying offices, smashing furniture, breaking glass panes, and physically… pic.twitter.com/aFVgHXoRDl— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2025 -
సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్ జగన్ నివాళి
తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన నటుడు కృష్ణ(krishna ghattamaneni). దాదాపు యాభై ఏళ్ల పాటు తన సత్తా చాటిన ఈ లెజెండరీ నటుడు లోకాన్ని వీడి అప్పుడే మూడేళ్లు గడిచింది. నేడు(నవంబర్ 15) ఆయన వర్ధంతి . ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.‘తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 1965లో 'తేనె మనసులు' సినిమాతో హీరోగా పరిచయమై కృష్ణ, 350కు పైగా చిత్రాల్లో నటించారు. కౌబాయ్, జేమ్స్ బాండ్, రాబిన్ హుడ్ వంటి హాలీవుడ్ శైలి సినిమాలను తెలుగులో పరిచయం చేసి, టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించిన మొదటి తెలుగు నటుడిగా గుర్తింపు పొందారు. 2022 నవంబర్ 15న కృష్ణ కన్నుమూశారు. తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన… pic.twitter.com/NMADN49Ww5— YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2025 -
విశాఖ అభివృద్ధిపై YS జగన్ మోహన్ రెడ్డి మార్క్
-
ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. 2025 ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో పురుషుల విభాగంలో బంగారు పతకం సాధించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ధీరజ్ విజయం అందరికీ గర్వకారణమని.. భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.Heartiest congratulations to Dhiraj Bommadevara from Andhra Pradesh on clinching the GOLD MEDAL in the Men's Recurve at the Asian Archery Championship 2025! A true champion and a moment of immense pride. May he achieve many more victories!#IndianArchery@BommadevaraD pic.twitter.com/aCuTysqs5r— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2025 -
ఆస్ట్రేలియా ఎన్నారైల మద్దతు చిరస్మరణీయం:లక్ష్మీపార్వతి
సిడ్నీ: వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్న ఆస్ట్రేలియా ఎన్నారై వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు,కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న ఆమె పార్టీ నాయకుడు చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పార్టీ కష్టకాలంలో ఉన్న వైఎస్ జగన్పై మీరు చూపిన ఆధారాభిమానానికి పార్టీ ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటుంది. మీ మద్దతు చిరస్మరణీయంగా నిలుస్తుంది’అని పేర్కొన్నారు. ‘మీ సహాయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలుగా భరోసా ఉంటుంది. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నారైలు మాట్లాడుతూ వైఎస్ జగన్ పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేసుకున్నారు. తమలో చాలామంది మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల వల్ల విదేశాల్లో స్థిరపడ్డామని తెలిపారు. ఆ రుణం తీర్చుకునేందుకు మేము ఎల్లప్పుడూ వైఎస్ జగన్కు మద్దతుగా ఉంటాం’అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింతల చెరువు సూర్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, వీరం రెడ్డి, గజ్జల చంద్ర ఓబుల రెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, దూడల కిరణ్ రెడ్డి, నరెడ్డి ఉమా శంకర్, కృష్ణ చైతన్య కామరాజు, నల్ల జగదీశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
"నీ సంగతి చూస్తా.. అని సోనియా అన్నప్పుడు.. జగన్ రియాక్షన్..గూస్ బంప్స్..
-
పెళ్లి వేడుకలో వైఎస్ జగన్
-
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు (ఫొటోలు)
-
బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు బాలల దినోత్సవం. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘నాణ్యమైన విద్య, ప్రపంచానికి పరిచయంతో పిల్లలు పెద్ద కలలు కనేలా ప్రేరేపిస్తాయి. మనం వారిని ఆ మార్గంలో నడిపించాలి. శక్తివంతమైన, ప్రగతిశీల భారతదేశం కోసం ఆ కలలను సాకారం చేసుకోవడంలో వారి పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయాలంటే అందుకు వారికి అధికారం కల్పించాలి’ అని పోస్టు చేశారు. Quality education and exposure to the world inspire children to dream big. We should guide them on that path and ensure they are empowered to unlock their full potential in realising those dreams, for a vibrant, robust, and progressive India. #ChildrensDay— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2025 -
నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశీస్సులు
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంగునూరు కొండారెడ్డి, లక్ష్మీ దంపతుల కుమార్తె వివాహం గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాల్లో గురువారం సాయంత్రం జరిగింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వివాహ వేడుకకు విచ్చేసి.. నూతన వధూవరులు ప్రణయచంద్రారెడ్డి, జానకి ప్రియను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. – గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం) కంటి‘పాప’ భావోద్వేగం ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లిలోని సీఏ కన్వెన్షన్ హాలులో గురువారం వివాహ వేడుకకు హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసిన ఓ పాప ఆనందంతో భావోద్వేగానికి గురైంది. కంటతడి పెట్టింది. దీంతో ఆ పాపను వైఎస్ జగన్ ఆప్యాయంగా హత్తుకున్నారు. కన్నీళ్లు తుడిచి ఓదార్చారు. -
క్రెడిట్ చోరీతో చిక్కిన చినబాబు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు తరలి వచ్చేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన కృషిని 2023లో విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సు సాక్షిగా రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా ప్రశంసించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగానే తాము ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు నాడు లింక్డిన్లోనూ స్వయంగా వెల్లడించారు. వాస్తవం ఇలా ఉంటే.. రెన్యూ పవర్ని తామే రప్పించి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నామంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. విశాఖలో అదానీ డేటా సెంటర్ పేరు మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వ పెద్దలు.. పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వకపోగా, వైఎస్ జగన్ కట్టించిన ఇళ్లలోకి మళ్లీ కొత్తగా గృహ ప్రవేశాలు చేయించి, తామే కట్టించినట్లు డ్రామాలాడారు. ఇప్పుడు విశాఖలో సీఐఐ సమ్మిట్ వేదికగా మరో క్రెడిట్ చోరీకి శ్రీకారం చుట్టారు. క్రెడిట్ చోరీలో తండ్రితో పోటీ పడుతున్న నారా లోకేశ్ రెన్యూ పవర్ విషయంలో సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసి అడ్డంగా దొరికిపోయారు. తరిమేసింది బాబు సర్కారే..! విచిత్రంగా అదే రెన్యూ పవర్ సంస్థతో తాజాగా విశాఖ సదస్సుకు ఒకరోజు ముందే చంద్రబాబు సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి రెన్యూ పవర్ను తరిమేసింది చంద్రబాబు ప్రభుత్వమే. గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను రద్దు చేసి 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను కర్నూలు జిల్లాకు తరలిస్తూ ఈ ఏడాది జూలై 28న బాబు సర్కార్ జీఓ నెం.56 జారీ చేసింది. ఈ నిజాలను వెలుగులోకి తెచ్చిన నెటిజన్లు.. లోకేశ్ క్రెడిట్ చోరీకి పాల్పడ్డారంటూ మీమ్స్తో దుమ్మెత్తిపోస్తున్నారు. రెన్యూ పవర్ను తెచ్చిందే వైఎస్ జగన్.. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ పవర్తో పెట్టుబడుల ఒప్పందం జరిగింది. 2023 జూన్ 20న 300 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో స్థాపించేందుకు రెన్యూ పవర్కు అనుమతిస్తూ జీవో నెం.15ను వైఎస్సార్సీపీ ప్రభుత్వం జారీ చేసింది. అనంతరం 2024 ఫిబ్రవరి 5న అదే సంస్థను మరో 600 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తూ జీవో నెం.16ను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. అంతేకాదు రెన్యూ సంస్థ ప్రాజెక్టులకు అవసరమైన భూములు ఆ రెండు జిల్లాల్లో కేటాయించేందుకు కూడా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నాడే అంగీకారం తెలిపింది. ఈ జీఓలపై నాటి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.విజయానంద్ సంతకాలు చేశారు. దీన్నిబట్టి రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భూ కేటాయింపులతో సహా 600 మెగావాట్లు, 300 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయనేది సుస్పష్టం. -
క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో.. అప్పట్లోనే మంజూరై నిర్మాణంలో ఉన్న ఇళ్లను పట్టుకుని ‘ఈ ఇళ్లన్నీ మేమే కట్టేశాం’ అంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని.. నాటకాల రాయుడు అని అంటారని చురకలు వేశారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను తనదిగా చెప్పుకోవడంలో.. ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ సీఎం చంద్రబాబుపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో క్రెడిట్ చోర్ బాబు హ్యాష్ట్యాగ్తో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న ‘‘క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించలేదు. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చు చేయలేదు. ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. గత ప్రభుత్వం.. అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకుని ‘‘ఇళ్లన్నీ మేమే కట్టేశాం’’ అంటున్నారు. కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గు పడకుండా పచ్చి అబద్ధాలను బల్లగుద్ది మరీ చెబుతూ ఆ క్రెడిట్ మాదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు.» మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లల్లో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మీరు మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకు మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే. » ఇవికాక 2023 అక్టోబర్ 12న ఒకేసారి 7,43,396 ఇళ్లల్లో ఒకే రోజు గృహ ప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందే ఉన్నా అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం! మా హయాంలో 71,800 ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చి, వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి, కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేశాం. » అయినా అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ను కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం చంద్రబాబు గారూ! మేము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం.మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం! ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడంలో.. అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి. -
ఇచ్చట పాత ఒప్పందాలు మళ్లీ కుదుర్చుకోబడును!
సాక్షి, అమరావతి: అన్నీ పాత ఒప్పందాలే..! అందులోనూ గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో భారీ కోతలు..! పెట్టుబడుల సదస్సుకు ఒకరోజు ముందుగానే గతంలో కుదిరిన ఒప్పందాలనే మళ్లీ మళ్లీ చేసుకుంటూ చంద్రబాబు సర్కారు సరికొత్త గారడీకి శ్రీకారం చుట్టింది. విశాఖలో శుక్ర, శనివారాల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తుండగా.. ఒక రోజు ముందే గురువారమే పాత ఒప్పందాలే మరోసారి చేసుకుని రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తెస్తున్నట్లు చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఒప్పందంపై నాటి సీఎం వైఎస్ జగన్తో భేటీ అనంతరం రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హా పోస్టు వైఎస్సార్ సీపీ హయాంలో 2023లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను తెచ్చినట్లు చెప్పుకునేందుకు చంద్రబాబు సర్కారు ఆపసోపాలు పడింది. పాత ఒప్పందాలనే మళ్లీ మళ్లీ కుదుర్చుకుంటూ చంద్రబాబు సర్కారు చేస్తున్న హడావుడిని చూసి పారిశ్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఈ ప్రభుత్వం తమపై ఒత్తిడి చేయడంతో కాదనలేక తిరిగి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ కంటే ఒక రోజు ముందుగానే రూ.3.65 లక్షల కోట్ల విలువైన 35 ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మూడూ పాత ఒప్పందాలే.. గతంతో పోలిస్తే పెట్టుబడుల్లో కోతలు⇒ 2023లో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో రూ.2.35 లక్షల కోట్ల ఎన్టీపీసీ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఏబీసీ లిమిటెడ్తో రూ.1,20,000 కోట్ల ఒప్పందం అతి పెద్దదిగా నిలిచింది. ఇప్పుడు అదే సంస్థతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని అదేదో కొత్త ఒప్పందంగా తాజాగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకుంది. ఏబీసీ గ్రూప్నకు చెందిన ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎవ్రెన్), యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ రూ.1,10,250 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తాజాగా గురువారం న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (నెడ్క్యాప్)తో ఒప్పందం కుదుర్చుకుంది.⇒ ఇదే తరహాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూ పవర్ రాష్ట్రంలో రూ.97,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే ఒప్పందాన్ని రూ.82,000 కోట్లకు తగ్గిస్తూ తిరిగి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. రెన్యూ పవర్ చైర్మన్, సీఈవో సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అనంతరం ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఎంవోయూల మాయ సాక్షి, విశాఖపట్నం: టీడీపీ హయాంలో 3సార్లు విశాఖ వేదికగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న కొన్ని కంపెనీలు ఆ తరువాత పత్తా లేకుండాపోయాయి. వాటిలో మచ్చుకు కొన్ని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హీరో ఫ్యూచర్స్తో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న దృశ్యం(ఫైల్) ⇒ రూ.234 కోట్లతో 300 మందికి ఉపాధి కల్పించేలా వజ్ర రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం. ⇒ రూ.300 కోట్లతో ఎకో రిసార్ట్ అండ్ వుడ్ కాటేజీ నిర్మాణానికి వాటర్ స్పోర్ట్స్ సింపిల్ సంస్థతో ఎంవోయూ ⇒ రూ.153 కోట్ల పెట్టుబడులు పెట్టేలా స్కైవాల్ట్ ్జ మెరీనా సంస్థతో ఒప్పందం ⇒ రూ.100 కోట్లతో ఎంఐసీఈ సెంటర్ ఏర్పాటుకు వైబ్ గ్రూప్స్తో ఎంవోయూ ⇒ రూ.2 వేల కోట్లతో గోల్డ్ఫిష్ అబాడ్ సంస్థతో గోల్ఫ్ కోర్స్ నిర్మాణ ఒప్పందం. ⇒ రూ.7 వేల కోట్లతో మైత్రా మొబిలిటీ సంస్థ ఎల్రక్టానిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు ఒప్పందం. ⇒ రూ.550 కోట్లతో మాగ్నమ్ పైరెక్స్ సంస్థతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఒప్పందం.హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థ సీఎండీ రాహుల్ ముంజాల్తో తాజాగా మళ్లీ విశాఖపట్నంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న సీఎం చంద్రబాబు ⇒ వైఎస్సార్సీపీ హయాంలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకున్న హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఇప్పుడు ఆ పెట్టుబడిని ఏకంగా రూ.15,000 కోట్లకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం గమనార్హం. -
మోసాలతో పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వం
-
క్రెడిట్ చోరీలో అడ్డంగా దొరికిన నారా లోకేష్
సాక్షి, విజయవాడ: క్రెడిట్ చోరీలో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే రెన్యూ (Renew) పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో సైతం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకుంది. పెట్టుబడుల ఒప్పందంలో భాగంగా రెన్యూ పవర్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ హయాంలోనే అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లో భూ కేటాయింపులూ జరిగాయి. 600 మెగా వాట్లు, 300 మెగా వాట్లు సామర్థ్యం గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అయితే విచిత్రంగా అదే రెన్యూ కంపెనీతో వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్లో కూటమి ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. రెన్యూ సంస్థను గత 5 ఏళ్లలో రాష్ట్రం నుండి పంపేసారంటూ నారా లోకేష్ పచ్చి అబద్ధాలు ఆడారువై ఎస్ జగన్ తెచ్చిన కంపెనీతో మళ్ళీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుటుంటుంది. ఇప్పటికే వైఎస్ జగన్ తన పాలనలో అందించిన అనేక సంక్షేమ పథకాలు,రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులను చంద్రబాబు తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడగా.. తాజాగా లోకేష్ సైతం రెన్యూతో ఒప్పందం కుదర్చుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023 జూన్ 20న రెన్యూ ప్రోజెక్టుకి అనుమతులు ఇస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం జిఓ 15 జారీ చేసింది. 2024 ఫిబ్రవరి5 న రెన్యూకి రెండో ప్రాజెక్ట్ మంజూరు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోల్లో పేర్కొంది. గత ప్రభుత్వంలో రెన్యూ పెట్టుబడుల ఒప్పందాలు, జీవోలపై ఇప్పటి సిఎస్,ఎనర్జీ సెక్రటరీగా కూడా ఉన్న విజయానంద్ సంతకాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెన్యూతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, వాటికి గురించి ట్వీట్ చేసి నారా లోకేష్ అభాసుపాలయ్యారు. -
నాటకాల రాయుడు బాబుపై జగన్ సీరియస్..
-
చంద్రబాబు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబూ.. మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’ చాలా బాగుందంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చురకలు అంటించారు. క్రెడిట్ చోర్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్తో వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా.. ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా.. గత ప్రభుత్వం అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైఎస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు.. నాటకాల రాయుడు అంటారు’’ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు.‘‘మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,00,092 ఇళ్లలో ఒక్క ఇంటిపట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించ లేదు. ఆ 3,00,092 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ మా హయాంలోనే కట్టించినవే. శ్లాబ్ కంటే కింద స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలోఉన్నవే. ఇవికాక అక్టోబరు 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకేరోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ళముందే ఉన్నా… అసలు వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీం చాలా హేయం!చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది.పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా……— YS Jagan Mohan Reddy (@ysjagan) November 13, 2025..మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చి, వారి పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించాం. 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి…కోవిడ్లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకుపైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తిచేసినా, అన్నీ మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పడమే కాకుండా, మీ ఎల్లోమీడియా ద్వారా ప్రచారం చేయించుకుని, ఆ క్రెడిట్ కొట్టేయాలనుకుంటున్న మీ స్కీం చాలా హేయం..చంద్రబాబూ.. మేము 31.9 ఇళ్ల పట్టాలను ఇచ్చి, అందులో 21.75లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టాం. మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా, ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడ్డం అత్యంత హేయం!. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదిగా చెప్పుకోవడంలో, ఆ పేదల ఇళ్లస్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయడం, అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. -
సెంటు భూమి ఇవ్వలేదు... 3 లక్షల ఇళ్లు కట్టేశాడంట బాబును చీదరించుకుంటున్న జనం
-
నాడు ఉద్యోగాల విప్లవం నేడు అడుగడుగునా మోసం
సాక్షి, అమరావతి: అబద్ధాలు చెప్పడంలో డబుల్ పీహెచ్డీలు చేసిన సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలోనూ అదే పంథాను అనుసరిస్తున్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ సీఎంను అని చెప్పుకుంటున్న ఆయన హయాంలో డీఎస్సీ తప్ప ఇతర పోస్టులు భర్తీ చేసింది అరకొరే. అదీ తప్పులు చేసి, యువతను మోసం చేసి అభ్యర్థుల కన్నీటికి కారణమయ్యారు. 1998, 2018లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించినా పోస్టులు భర్తీ చేయలేదు. ఆ అభ్యర్థులకు న్యాయం చేసింది మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నీ కలిపి మొత్తం 34,108 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, 2019–24 మధ్య వైఎస్ జగన్ సీఎంగా 6,26,116 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇక వివిధ పరిశ్రమలను స్థాపించి వీటిలో 24,68,146 మందికి ఉద్యోగ అవకాశాలు క ల్పించారు. రెండేళ్లపాటు కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఒక్క విద్యాశాఖలోనే 21,608 పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారంటేవిద్యా రంగానికి వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. అలాగే, 2024లో 6,100 పోస్టులతో డీఎస్సీ ఇచ్చారు. తొలి సంతకానికే దిక్కులేని పాలన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు గత ఏడాది జూన్ 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సందర్భంగా తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ ఫైలుపై చేశారు. అయితే 14 నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఇటీవల అరకొరగా పోస్టులు భర్తీ చేశారు. ఇంకా ఈ భర్తీలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కానీ జగన్ ప్రభుత్వంలో గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పడిన న్యాయ చిక్కులను పరిష్కరించడంతోపాటు ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వ, పారిశ్రామిక రంగాలలో 30,94,262 ఉద్యోగాలను భర్తీ చేసింది. బాబు జమానాలో చేసింది అరకొరగానే.. చంద్రబాబు పాలనతో ప్రతి నోటిఫికేషన్ను వివాదాస్పదంగా మార్చేశారు, ఇందుకు 1998, 2018 డీఎస్సీలే ఉదాహరణ. వాస్తవానికి చంద్రబాబు హయాంలో డీఎస్సీని ఓ పెద్ద నాటకంగా మార్చేశారు. 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టును ఆశ్రయించారు. ఈ నోటిఫికేషన్లో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను.. చంద్రబాబు 300 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా, మిగిలిన పోస్టులను వైఎస్ జగన్ 2021లో న్యాయ వివాదాలు పరిష్కరించి భర్తీ చేశారు. అలాగే, గత ఐదేళ్ల జగన్ పాలనలో 1998 డీఎస్సీ అభ్యర్థులు 4,059 మంది, 2008 అభ్యర్థులు మరో 2,193 మందికి ఎంటీఎస్గా విధుల్లోకి తీసుకున్నారు. స్పెషల్ డీఎస్సీ–2019 ద్వారా 602 మందికి, 2023లో కేజీబీవీల్లో 1,250 మందికి కాంట్రాక్టు విధానంలోను, ట్రిపుల్ ఐటీ, యూనివర్సిటీల్లో కాంట్రాక్టు ఫ్యాకల్టీగా మరో 450 మంది.. ఇలా మొత్తం 15,508 పోస్టులు భర్తీ చేశారు. 2024 డీఎస్సీ ద్వారా 6,100 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోగా.. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఈ పోస్టులను నిలిపివేసింది. ఇవికూడా భర్తీ అయితే మొత్తం 21,608 పోస్టులను భర్తీ చేసినట్టు అయ్యేది. విద్యా సంస్కరణలకు బ్రాండ్ వైఎస్ జగన్ గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడి కీర్తిని ఐక్యరాజ్య సమితిలో నిలబెట్టారు వైఎస్ జగన్. నాడు–నేడుతో ప్రభుత్వ బడుల్లో 11 రకాల సదుపాయాలు కల్పించడంతో పాటు ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు టోఫెల్, ఐబీ సిలబస్ను ప్రవేశపెట్టారు. ‘మనబడి: నాడు–నేడు’ ద్వారా రాష్ట్రంలోని 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూడు విడతల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను అమలు చేశారు. 2019–20లో తొలివిడతగా 15,715 స్కూళ్లలో రూ.3,669 కోట్లతో 11 రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రభుత్వ స్కూళ్లతో పాటు జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, భవిత కేంద్రాలు, జిల్లా విద్యాబోధనా శిక్షణ కళాశాలల(డైట్స్)తో పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లనూ నాడు–నేడులోకి చేర్చింది. నాడు–నేడు రెండో దశలో రూ.8000 కోట్లతో 22,344 స్కూళ్లలో పనులు చేపట్టారు. అంతేగాక దేశంలో ఎక్కడా లేనివిధంగా నూరు శాతం ప్రభుత్వ బడులను డిజిటలైజేషన్ ప్రవేశపెట్టడంతోపాటు సీబీఎస్ఈ సిలబస్ను సైతం ప్రభుత్వ బడిలో అమలు చేశారు. అలాగే, అంతర్జాతీయంగా పేరు పొందిన ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ను సైతం అమలు చేసేందుకు బాటలు వేశారు. కానీ ఏడాదిన్నర కాలంలోనే ఈ విద్యా సంస్కరణలు అన్నింటినీ కూటమి ప్రభుత్వం తన కుటిల∙బుద్ధితో ఒకొక్కటిగా రద్దు చేస్తూ వస్తోంది. -
ఇది ప్రజా విజయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు, విద్యార్థులతో కలిసి వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ కావడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు, భావసారూప్య పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రజా విజయం అని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి తక్షణమే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. » వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గళమెత్తారు. 175 నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల ద్వారా ప్రజలు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను, సంకల్పాన్ని స్పష్టంగా వ్యక్త పరిచారు. ర్యాలీల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం.. ప్రభుత్వ రంగంలో విద్య, వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిదర్శనం. ఆ సంకల్పంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలందరితోపాటు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంస్థలు, మిత్రపక్షాలు.. వివిధ ప్రజా సంఘాలకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఉద్యమం ప్రజల నిబద్ధతను, సామాజిక న్యాయంపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రజలు స్వలాభం కోసం కాకుండా, సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు. » తమ బాధ్యత మరిచి, ప్రభుత్వ పెద్దల మాటలు మాత్రమే వింటున్న పోలీసులు నిరసన ర్యాలీలను అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎక్కడా ప్రజలు ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ధైర్యంగా, శాంతియుతంగా ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టింది. బలవంతంగా ప్రజల గొంతు నొక్కలేమని ప్రజా ఉద్యమ ర్యాలీ మరోసారి నిరూపించింది. » చంద్రబాబు గారూ.. ఇకనైనా ప్రజల మనోభావాలు గుర్తించి, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోండి. ప్రజల సంకల్పాన్ని తక్కువగా అంచనా వేయడం రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరం అవుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ చారిత్రక ఉద్యమాన్ని విజయవంతం చేసిన అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు మరోసారి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. -
కట్టించింది జగన్.. క్రెడిట్ కొట్టేస్తున్నది బాబు
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం దేవగుడిపల్లెకు చెందిన ఎస్.ముంతాజ్బేగం, ఎం.హేమలతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో పక్కా ఇళ్లు మంజూరు చేయగా వారు పూర్తిచేశారు. గోడలపైనా ఇదే రాశారు. ఈ వివరాలు గృహనిర్మాణశాఖ లెక్కల్లోనే స్పష్టంగా ఉన్నాయి. కానీ, వీటిలో గృహ ప్రవేశాలంటూ బుధవారం సీఎం చంద్రబాబు ఆర్భాటం చేశారు. ముంతాజ్బేగంకు దేవగుడిపల్లెలో సొంత స్థలం ఉండగా పక్కా ఇంటికి 2022 మే 9న ఆమోదం వచ్చింది. ముంతాజ్బేగం పేరిట తహసీల్దార్ 2023 జూలై 6న పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. 2022 ఏప్రిల్– 2023 జూన్ 4 వరకు మూడు బిల్లులు నా బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. రోజుకు రూ.200 లెక్కన 90 రోజుల ఉపాధి హామీ పథకం బిల్లు వచ్చింది. కేవలం రంగులు వేయించి బుధవారం గృహ ప్రవేశం చేయించారు. » హేమలతకూ సొంత స్థలం ఉండగా 2022 జూలై 9న పక్కా గృహం మంజూరైంది. 2024 మార్చికి పూర్తి చేశారు. ఈ బిల్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఉపాధి హామీ బిల్లు కూడా అందింది. ఇప్పుడు చంద్రబాబు సర్కారురంగులు వేసింది. ఇంటి స్థలం ధ్రువీకరణ పత్రం, ఇంటి మంజూరు పత్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జారీ అయ్యాయని వాటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు తీసుకున్నారని హేమలత చెప్పడం గమనార్హం.అద్దె బాధల నుంచి విముక్తినా పేరు ఫాతిమా. ఇదిగో ఇది నాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇంటి పట్టా. వ్యవసాయ కూలిగా జీవనం సాగించే నేను వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పక్కా ఇంటి కోసం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నా. వెంటనే స్థలం, ఇంటి పట్టా ఇచ్చారు. రూ.1.80 లక్షల సాయం చేశారు. నెలనెల అద్దె కట్టడానికి ఇబ్బంది పడేవాళ్లం. జగనన్న పుణ్యాన సొంతింటి కల నెరవేరింది.గత ప్రభుత్వంలోనే సొంతింటి సంబరంనలుగురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్న నన్ను భర్త కొన్నేళ్ల క్రితమే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. 30 ఏళ్లు కళ్యాణదుర్గంలోని బాడుగ ఇంట్లో ఉన్నాం. నెలకు రూ.4 వేల వరకు అద్దె కట్టేదాన్ని. గాజులు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న పుణ్యమా అని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కురాకుల తోట జగనన్న కాలనీలో ఇల్లు వచ్చింది. మొత్తం బిల్లు రూ.1.80 లక్షలు మంజూరైంది. ఇప్పుడు సొంతిట్లోసంతోషంగా ఉంటున్నాం. –నబియా భాను, జగనన్న కాలనీ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంగత ప్రభుత్వంలోనే... అద్దె ఇంటి నుంచి సొంత గూటికిమేం చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వంలో మమ్మల్ని లబ్ధిదారులుగా గుర్తించి ఇంటి పట్టా ఇచ్చారు. ఆలస్యం లేకుండా బిల్లులు చెల్లించారు. ప్రస్తుతం ఆ ఇంట్లోనే ఉంటున్నాం. 2022లో గృహ ప్రవేశం చేసి ఇందులోనే నివసిస్తున్నాం. ఇంత సాయం అందించిన జగనన్న మా పాలిట దేవుడు. –షేక్ నాగూర్ బి, గుంటూరు జిల్లా దుగ్గిరాల జగనన్న కాలనీ సొంతింటి కల నెరవేర్చింది జగనన్నమాకు 2.50 సెంట్ల స్థలం ఉంది. కానీ, పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు తగినన్ని డబ్బులు లేవు. చాలాకాలం పాటు అద్దె ఇళ్లలో ఉన్నాం. జగనన్న ప్రభుత్వం రాగానే భరోసా కల్పించారు. రెండు విడతలుగా బిల్లులు నా బ్యాంక్ అకౌంట్లో వేశారు. నిర్మాణం పూర్తి చేసి 2023లోనే గృహప్రవేశం చేశాం.– నల్లమోతు రాణి, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం, ఏలూరు జిల్లాజగనన్న హయాంలోనే మాకు ఇల్లునా భర్త, నేను వ్యవసాయ కూలీలం. మాకు ఇద్దరు పిల్లలు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ స్ధలంతో పాటు ఇల్లు మంజూరు చేశారు. ఇంటి పట్టా, నిర్మాణానికి డబ్బులు కూడా ఇచ్చారు. సకాలంలో బిల్లులు రావడంతో కొంత నా డబ్బులు వేసుకుని ఇల్లు పూర్తి చేశా. ఇప్పుడు అందులోనే ఉంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. జగనన్నకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. –సంగం త్రివేణి, గండేపల్లి గ్రామం, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా15 ఏళ్ల నిరీక్షణ... వైఎస్సార్సీపీ హయాంలో సాకారంసొంతిల్లు లేక చాలా ఇబ్బందిపడ్డాం. 15 ఏళ్ల పాటు అద్దె ఇళ్లలోనే ఉన్నాం. చిన్న గుడిసె, బడితెల గోడల ఇంట్లో మరికొన్నేళ్లు ఉన్నాం. ఆ సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మా స్వగ్రామం మెళియాపుట్టిలోనే జగనన్న కాలనీలో స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తి చేశాం. త్వరలోనే గృహప్రవేశం చేస్తాం. సొంతిల్లు అనే ఆలోచనే సంతోషంగా ఉంది. దీన్ని సాకారం చేసింది వైఎస్ జగన్. – రిన్న మహంతి, మెళియాపుట్టి గ్రామం, పాతపట్నం నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లాఅన్నీ అప్పుడే మంజూరు...జగనన్న ప్రభుత్వంలోనే మాకు పక్కాగృహం మంజూరైంది. స్థలానికి పొసెషన్ సర్టిఫికెట్ ఇచ్చారు. బిల్లులన్నీ కూడా సకాలంలో చెల్లించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. మొత్తం రూ.1.80 లక్షల బిల్లు ఇచ్చేశారు.–సుజాత, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు ‘కలరింగ్’
నాడు‘‘సెంటు స్థలం ఇస్తారంట..! ఆ సెంటు స్థలం ఎందుకు పనికొస్తుంది...? ఒక్కదానికి సరిపోతుంది. చనిపోయిన తర్వాత పూడ్చడానికి సెంటు స్థలం పనికొస్తుంది. అంతకుమించి ఇళ్లు కట్టడానికి పనికిరాదు. – వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై చంద్రబాబునేడుఅన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లెకి చెందిన ఎస్.అల్తాబ్బేగమ్ వ్యవసాయ కూలీ. ఈమె పేరిట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవ రత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పక్కా గృహం మంజూరు చేశారు. 2022 ఏప్రిల్లో నిర్మాణం ప్రారంభించారు. నాటి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. ఉచితంగా ఇసుక, సబ్సిడీపై రూ.32 వేల విలువైన సిమెంటు, ఐరన్, ఇతర నిర్మాణ సామగ్రి సమకూర్చింది.వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంత సాయం చేస్తే, కేవలం తాళంచెవి చేతిలో పెట్టి చంద్రబాబు క్రెడిట్ కొట్టేసేందుకు పాకులాడుతున్నారు. అల్తాబ్బేగమ్ మాత్రమే కాదు, బుధవారం సీఎం నుంచి తాళాలు అందుకున్న దేవగుడిపల్లెకు చెందిన తలారి రమాదేవి, చిన్ని, తిరుపతి మల్లక్కలకూ 2021–22లో వైఎస్ జగన్ ప్రభుత్వమే ఇళ్లు మంజూరు చేసింది. ఇలా పేదలందరికీ ఇళ్ల పథకం కింద వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేసే కుతంత్రానికి తెరలేపారు. శవాలు పూడ్చడానికి కూడా పనికి రావని గేలి చేసిన పెద్దమనిషి ఇప్పుడు అవే స్థలాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు.సాక్షి, అమరావతి: ఏడాదిన్నర పాలనలో పేదలకు గజం స్థలమైనా పంచిన దాఖలాల్లేవు.. పట్టుమని పది ఇళ్ల నిర్మాణాలకు అనుమతులిచ్చిన పాపాన పోలేదు... కానీ, తమ ప్రభుత్వం 3 లక్షల ఇళ్లు నిర్మించేసిందని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. అన్నింటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పనులను తామే చేసినట్లు క్రెడిట్ కొట్టేస్తున్న సీఎం చంద్రబాబు... ఇప్పుడు పేదలకు ఇళ్లు కట్టించేశామంటూ నిస్సిగ్గుగా డప్పు కొట్టుకుంటున్నారు. ఈ మేరకు ఎల్లో మీడియాలో ప్రకటనలతో ఆర్భాటం చేశారు. ఇదంతా చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. చంద్రబాబు మూడు లక్షల ఇళ్ల కథ కమామిషు ఏమిటి? అని చూస్తే అసలు విషయం బయటపడుతోంది. పాలనలో విఫలమైన బాబు పేదలకు తాను చేయని మేలును చేసినట్టు మభ్యపెడుతున్న కుతంత్రం బయటపడుతోంది.గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లేరాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం అమలు చేసింది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను ఉచితంగా మహిళల పేరిట ఉచితంగా పంచిపెట్టారు. వీటి మార్కెట్ విలువ రూ.1.15 లక్షల కోట్ల పైమాటే. పెద్దఎత్తున పట్టాలు మంజూరు చేయడం ద్వారా 17 వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. అంతేకాక జగనన్న కాలనీల్లో 19 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. వీటికి ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) ఇళ్లు 2.62 లక్షలు అదనం. ఎన్నికలు ముగిసేనాటికి 9 లక్షలపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు శ్లాబ్ పూర్తయిన, 99 వేల ఇళ్లు శ్లాబ్ దశలో ఉన్నాయి. చాలావరకు తుది దశ నిర్మాణాలు కూడా పూర్తయినా ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి. ఇలాంటి ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్టు బాబు సర్కార్ ప్రచారం చేసుకుంటోంది. బుధవారం చంద్రబాబు దేవగుడిపల్లెలో పంపిణీ చేసిన ఇళ్లు సైతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసి నిర్మించినవే. అక్కడి రాజీవ్ కాలనీలో ఇళ్లు లేని పేదలకు 40 ఇళ్లను గత ప్రభుత్వం ఇచ్చింది. 30 మంది లబ్ధిదారులు నిర్మాణం మొదలుపెట్టగా, ఎన్నికలు ముగిసేనాటికే కొన్ని పూర్తయ్యాయి. మిగిలినవి దాదాపు నిర్మాణం పూర్తిచేసుకున్న దశలో ఉన్నాయి. ఇలా గత ప్రభుత్వంలో మంజూరు చేసి, నిర్మించిన ఇళ్ల తాళాలను సీఎం, మంత్రులు లబ్ధిదారుల చేతుల్లో పెట్టడం గమనార్హం.పూర్తి అండగా వైఎస్ జగన్2019–24 మధ్య సొంతింటి కల సాకారం చేస్తూ పేదలకు నాటి సీఎం జగన్ పూర్తి అండగా నిలిచారు. 31 లక్షల మందిపైగా పేద అక్కచెల్లెమ్మల పేరిట రూ.76 వేల కోట్లకుపైగా మార్కెట్ విలువ చేసే స్థలాలను పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికి యూనిట్కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేయడంతో పాటు, స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణం అందించారు. ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై ఇస్తూ మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల ప్రయోజనం చేకూర్చారు. ఇక కాలనీల్లో నీరు కరెంట్, విద్యుత్, ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలకు రూ.355 కోట్ల దాక ఖర్చు చేశారు. ఐదేళ్లలో ఇళ్ల పట్టాలకు భూ సేకరణ, లేఅవుట్ల అభివద్ధి, ఇళ్లకు బిల్లు చెల్లింపులు, ఇతర రూపాల్లో దాదాపు రూ.35,300 కోట్లు వెచ్చించారు. మొత్తంగా పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇంటి స్థలం, ఇంటితో కలిపి కనీసం రూ. 6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన స్థిరాస్తిని మహిళలకు అందిస్తూ లక్షాధికారులుగా తీర్చిదిద్దారు. రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద సృష్టికి పాటుపడ్డారు.బాబు పాలనలో గజం స్థలమైనా మిథ్య!17 నెలల పాలనలో పేదలకు గజం స్థలం ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చినవీ రద్దు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటోంది. వైఎస్ జగన్ హయాంలో ఉచితంగా స్థలం ఇచ్చి, ఇళ్లు మంజూరు చేసినప్పటికీ పరిస్థితులు అనుకూలించక కొందరు నిర్మాణాలు వాయిదా వేసుకున్నారు. ఈ తరహా స్థలాలను రద్దు చేయాలని కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రకటించారు. పేదల నుంచి స్థలాలు లాగేసుకుని పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టాలని ఆదేశించారు. ఇదంతా పేదలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతిలో 50 వేలమంది పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టగా చంద్రబాబు అడ్డుపడ్డారు. పేదలకు స్థలాలిస్తే సామాజిక అసమతుల్యత వస్తుందని కోర్టు స్టే తెచ్చారు. గద్దెనెక్కిన వెంటనే ఆ పట్టాలను రద్దు చేశారు. సాయం పెంపులోనూ మొండిచేయిపట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ, గజం కూడా ఇచ్చింది లేదు. 2019లో వైఎస్సార్సీపీ సర్కారు వచ్చాక 6 నెలల్లోనే కోవిడ్ వ్యాప్తి మొదలైంది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితులను అధిగమించి 2020 డిసెంబరు 25న వైఎస్ జగన్ 31 లక్షల మందిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలిచ్చి చరిత్ర సష్టించారు. కాగా, ఈ స్థలాలు శవాలు పూడ్చడానికి తప్ప దేనికీ పనికిరాదని పేదల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు. నాడు శ్మశానాలతో పోల్చిన స్థలాల్లోని ఇళ్లనే నేడు తన ఖాతాలో వేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు.చంద్రబాబు కనీసం ఇళ్ల పట్టాల పంపిణీలో విఫలమయ్యారు. పేదలకు ఎన్నికల ముందు హామీలిచ్చి మోసం చేయడమే కాక సీఎం హోదాలోనూ దగా చేశారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక గృహ నిర్మాణ శాఖపై తొలి సమీక్షలోనే పేదల ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అదనపు సాయం వస్తుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. కొద్ది రోజులకే ఆ సాయం ఊసే లేకుండా చేసేశారు.1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే టిడ్కో ఇళ్లుమిగిలినవారికి లబ్ధిదారుల వాటా 50 శాతం తగ్గింపులక్షమంది లబ్ధిదారులకు ప్లాట్లు అప్పగింత2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం పట్టణ పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇస్తామని, ఏపీ టిడ్కో ఏర్పాటు చేసి హంగామా చేసింది. తక్కువ ధరకే ఇల్లు వస్తుందన్న ఆశపడగా కఠిన నిబంధనలు పెట్టింది. కొన్నిచోట్ల పునాదులతో వదిలేయగా, చాలాచోట్ల స్థలాల సేకరణే చేయలేదు. 2019లో ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరు, రెండు–మూడు ప్రాంతాల్లో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించింది. కానీ, వైఎస్ జగన్ సీఎం కాగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన కఠిన నిబంధనలను సడలించారు. 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో, 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,212 టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ ధరలను పక్కనబెట్టి, 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ప్లాట్లు కేటాయించారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్లను లబ్ధిదారులకు అందించగా, మరో 77 వేల ఇళ్లను 90 శాతంపైగా వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది.300 చదరపు అడుగుల విస్తీర్ణంలో 1,43,600 ఇళ్లను ఉచితంగా ఇవ్వగా రూ.10,339 కోట్ల మేర లబ్ధి చేకూరింది. వీరి నుంచి గత టీడీపీ సర్కారు లబ్ధిదారుల వాటాగా వసూలు చేసిన రూ.500 కోట్లను తిరిగి చెల్లింపు ప్రారంభించి రూ.250 కోట్లను వెనక్కిచ్చింది. 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించాలని నిబంధన పెట్టింది. వైఎస్సార్సీపీ సర్కారు దీన్ని 50 శాతం తగ్గించింది. ఈ రెండు యూనిట్లకు గాను 1,18,616 మంది పేదలపై రూ.482 కోట్ల భారం తగ్గింది. పైగా లబ్ధిదారులకు ఇళ్లను ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 1,77,546 ఇళ్లు పూర్తి చేసిందని అసెంబ్లీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం ప్రకటించడం గమనార్హం. -
కట్టలు తెగిన ప్రజాగ్రహం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందకుండా చేస్తూ.. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారుపై విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు తిరగబడ్డారు. రూ.లక్షల కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టి, నీకింత నాకింత అంటూ పంచుకుతినేందుకు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటంపై కళ్లెర్ర చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమంలో కదం తొక్కేందుకు ప్రభంజనంలా జనం కదలివచ్చారు. ర్యాలీలకు అనుమతి లేదు.. పాల్గొంటే అక్రమ కేసులు పెడతాం.. అంటూ పోలీసుల నోటీసులు, బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరసన ర్యాలీల్లో కదంతొక్కారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా రూ.2.50 లక్షల కోట్లు అప్పు చేశారని, అందులో రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీల పనులు పూర్తి చేయడానికి ఖర్చు చేయలేరా.. అంటూ ర్యాలీల్లో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని దూరం చేస్తారా.. పేద విద్యార్థులకు వైద్య విద్యను అందకుండా చేస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలంటూ డిమాండ్ చేశారు. ఒకవేళ కాదూ కూడదని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కొనసాగిస్తే వైఎస్సార్సీపీతో కలిసి మహోద్యమాన్ని నిరి్మస్తామంటూ కోటి గళాలు రణ నినాదాలు చేయడంతో దిక్కులు పిక్కటిల్లాయి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలతో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఈ నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఉద్యమంలో భాగంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, అంతకు మించి సంతకాలు చేస్తున్నారు. పదండి ముందుకు.. పదండి తోసుకు! అడ్డంకులను అధిగమించి..సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ ర్యాలీలను నిలువరించడానికి విఫలయత్నం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బైకు ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకుని, బైక్ల తాళాలు లాక్కునే ప్రయత్నం చేయగా యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో వెనక్కు తగ్గారు. గుంటూరులో పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు బెదిరింపు ధోరణితో వ్యవహరించడంపై నిరసన వ్యక్తమైంది. నెల్లూరులో మెడికల్ విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఫ్లకార్డులు మెడలో వేసుకుని మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఒంగోలులో నిరసన ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. టూ టౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు తన సిబ్బంది ద్వారా చాలా సేపు నిలువరించారు. చివరకు ప్రజలు తోసుకొని ముందుకు సాగారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వినతిపత్రం తీసుకునేందుకు అధికారులు, కార్యాలయ సిబ్బంది అందుబాటులో లేకుండా పోవడంతో అక్కడి తలుపునకు అంటించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో పార్టీ శ్రేణులు, ప్రజలు నిరసన ర్యాలీ నిర్వహించారు. విశాఖ జిల్లా భీమిలిలో ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల భారీ బైక్ ర్యాలీ మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గమైన టెక్కలిలో ప్రజలను నియంత్రించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గరివిడి ఆర్వోబీ వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకోగా గంటపాటు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో పర్ల గ్రామానికి చెందిన సిరియాల పాపినాయుడు కిందపడి పోవడంతో కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించి ర్యాలీ కొనసాగించారు. ఆయన వైద్య ఖర్చును వైఎస్సార్సీపీ భరిస్తుందని నేతలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎల్లవరం నుంచి రంపచోడవరం వరకు 35 కిలోమీటర్ల మేర బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు. అయినా యాడికిలో ర్యాలీ కొనసాగింది. కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆర్డీవో కార్యాలయంలో డిమాండ్ పత్రం అందచేశారు. -
నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం
సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు చేపట్టింది. నిరసన ర్యాలీల సక్సెస్పై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు.‘‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. 175 నియోజకవర్గాలలోనూ భారీగా నిరసన ర్యాలీలు జరిగాయి. ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు ఇది నిదర్శనం. ప్రజారోగ్యం, వైద్య విద్య విషయంలో ఇతర పార్టీల ప్రతినిధులు కూడా కలిసి రావటం సంతోషకరం. ప్రజల సంక్షేమమే ముఖ్యం అని వీరంతా అనుకోవటం మంచి పరిణామం. పోలీసులు ఈ ర్యాలీలను అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. కేసుల భయం కూడా లేకుండా ఎంతో ధైర్యంగా అందరూ తమ నిరసనను వ్యక్తం చేశారు...ప్రజల గొంతును బలవంతంగా అణచివేయలేరని వీరంతా నిరూపించారు. చంద్రబాబూ.. ఈ బలమైన ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే మీ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోండి. ఇవ్వాల్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నా కృతజ్ఞతలు’అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
జగన్ కట్టించిన ఇళ్లకు... చంద్రబాబు హంగామా
-
కూటమికి వణుకే.. వైఎస్సార్సీపీ శ్రేణుల భారీ ర్యాలీ
చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, కక్షపూరిత వైఖరి, ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న ర్యాలీల్లో కదం తొక్కేందుకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజాసంఘాలు, సామాజికవేత్తలు కోటి గొంతుకలతో సింహగర్జన చేయనున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ సమరభేరి
-
చదువు వలనే సమాజంలో గౌరవం..
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఏపీ ఎస్ఎస్సీ-2025లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన నంద్యాల విద్యార్థిని ఇష్రత్ కలిశారు. దీనిలో భాగంగా ఎస్ఎస్సీలో 600 మార్కులకు 599 మార్కులు సాధించిన ఇష్రత్ను వైఎస్ జగన్ అభినందించారు. ఇష్రత్ను అభినందించడంతో పాటు లక్ష రూపాయిలు ప్రోత్సాహం కూడా అందించారు వైఎస్ జగన్. ఈ మేరకు వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ ప్రతి విద్యార్థిని చదువుకున్నప్పుడే సమాజంలో జరుగుతున్న సంఘటనలపై అవగాహన వస్తుంది. ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి. చదువు వలనే సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రతీ విద్యార్థి భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలి’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
నిఖిల్ కుటుంబానికి రూ.2 లక్షల సాయం ప్రకటించిన YS జగన్
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు వైఎస్ జగన్ నివాళి
-
మౌలానా అబుల్ కలాం ఆజాద్కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భారతరత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ళ అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు నూరీ ఫాతిమా, షేక్ ఆసిఫ్, మెహబూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.‘‘ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం. మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ కూడా చేశారు. "భారత రత్న" మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి విద్యాశాఖ మంత్రిగా దేశానికి ఆయన అందించిన సేవలు అజరామరం.మైనార్టీ సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు. pic.twitter.com/rKD6LTwvNb— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2025 -
ఢిల్లీ పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడు ఘటనతో దేశం మొత్తం ఉలిక్కి పడింది. పేలుడు ధాటికి 10 మంది మృతి చెందగా.. 24 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ‘‘ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారాయన. Deeply shocked and saddened to learn about the massive explosion near Red Fort Metro Station in Delhi. My heart goes out to the families who lost their loved ones in this strongly condemnable incident.Praying for a speedy recovery of all those injured in this ghastly tragedy.— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025 సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద భారీ పేలుడు సంభవించింది. తొలుత పార్క్ చేసి ఉన్న కారు పేలి ఈ ఘోరం సంభవించిందని అంతా భావించారు. అయితే 6.52గం. ప్రాంతంలో పేలుడు సంభవించిందని, రెడ్సిగ్నల్ వద్ద కారు నెమ్మదిగా ఆగి ఆగుతుండగానే పేలిందని, ఆ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పేలుడుకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు తర్వాతే స్పష్టమైన ప్రకటన చేస్తామని అన్నారు. -
అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,అమరావతి: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అందెశ్రీ మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన విషయం అన్న ఆయన, తెలంగాణ మాండలిక సాహిత్యంలో అందెశ్రీ తన ప్రత్యేకత చాటారని అన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి, గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేసిన అందెశ్రీ ఎలాంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారని కొనియాడారు. అందెశ్రీ మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని అభివర్ణించిన వైఎస్ జగన్ అందెశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. -
100 సంవత్సరాల చరిత్ర తిరగరాసిన ఘనత వైఎస్ జగన్ దే..
-
ఈర్ష్య.. అసూయలతో రాజకీయం ఎంత కాలం?
రాజకీయాల్లో నిర్ణయాలు ప్రజావసరాలకు తగ్గట్టుగా ఉండాలి కానీ ద్వేషంతోనో... ప్రత్యర్థికి ప్రయోజనం కలుగుతుందన్న సంశయంతోనో చేయకూడదు. చేస్తున్నది మంచి పనా? కాదా? అన్నది ఆలోచిస్తే రాజకీయాలలో పెడధోరణులు తగ్గుతాయి. అయితే సమకాలీన రాజకీయాలలో ప్రజోపయోగాల కంటే ద్వేషానికే పెద్దపీట పడుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ జనసేన, బీజేపీల కూటమి సర్కార్, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఈర్ష్యా, అక్కసులతో చేస్తున్న కొన్ని పనులు వారికే చేటు తెచ్చిపెడుతున్నాయి. కూటమి ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలతోపాటు ఆయన చేసిన అభివృద్దిని కూడా విధ్వంసం చేసే రీతిలో సాగుతోంది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి, సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడు సంకుచిత ధోరణితో ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరు అందరిని విస్మయపరుస్తోంది. విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించింది. నగరం నడిబొడ్డున పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ గా పేరొందిన స్వరాజ్ మైదానంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఒక పెద్ద లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్, స్వాతంత్ర చరిత్రకు సంబంధించిన విజ్ఞాన వేదిక, రిక్రియేషన్ సెంటర్.. వాకింగ్ ట్రాక్ల ఏర్పాటుకు సంకల్పించింది. కొన్నిటి నిర్మాణం దాదాపు పూర్తి అయింది. ఈలోగా ప్రభుత్వం మారిపోయింది. దీంతో అంబేద్కర్ మహా శిల్ప కేంద్రానికి గ్రహణం పట్టింది. అధికారంలోకి రావడంతోనే కూటమి పార్టీ నేతలు కొందరు ఈ కేంద్రంపై దాడి చేసి, జగన్, అంబేద్కర్ పేర్లను తొలగించారు. విమర్శలు రావడంతో అంబేద్కర్ పేరును మాత్రం తిరిగి పెట్టారట. ఆ తర్వాత ప్రభుత్వం ఈ కేంద్రాన్ని పూర్తిగా విస్మరించింది. చివరికి అక్కడ పనిచేసే పనివారికి జీతాలు ఇవ్వడం లేదు. దాంతో వారు పనులు చేయకపోవడంతో ఆ ప్రాంగణం అంతా అపరిశుభ్రంగా తయారైంది. ప్రజా సంఘాలు, దళిత సంఘాలవారు నిరసన తెలిపారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ అక్కడకు వెళ్లి పరిస్థితి చూసి ఒక ప్రశ్న వేశారు. ‘‘నెలకు రూ.పది లక్షలు ఖర్చు చేసి ఒక అద్భుతమైన ప్రదేశాన్ని పరిరక్షించలేని చంద్రబాబు ప్రభుత్వం రెండు లక్షల కోట్లు వెచ్చించి రాజధానిని ఎలా నిర్మించగలుగుతుంది?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.టీడీపీ అంబేద్కర్ను అగౌరవ పరిచిందంటూ నెటిజన్లు చంద్రబాబు గతంలో చేసిన కొన్ని ప్రసంగాల వీడియోలను బయటకు తీసి ఏకి పారేస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం అంతంతమాత్రంగానే ఉంది. 2014 టర్మ్లో టీడీపీ ప్రభుత్వం ఈ మైదానాన్ని చైనా మాల్కు ఇవ్వడానికి ప్రయత్నించిందని, సృ్మతివనం పేరుతో అమరావతిలో ఓ మారుమూల ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు ప్లాన్ చేసినా జనాగ్రహం కారణంగా వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అంటారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ మహాశిల్పాన్ని, కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీని నిర్వహణ, పర్యవేక్షణలపై చేతులెత్తేసింది. ఈ తప్పును తొందరగా దిద్దుకోకపోతే ఫలితం అనుభవించాల్సి వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో ఏదో తూతూ మంత్రంగా చేసి, ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారట. అంబేద్కర్ కేంద్రమే కాదు... విశాఖలో రిషికొండ మీద జగన్ నిర్మించిన భవనాలను కూడా కూటమి సర్కారు ఏడాదిన్నరగా పాడు పెడుతోంది. బహుశా వీటిని కూడా ప్రైవేటు రంగానికి అప్పగించవచ్చని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాల నిర్మాణానికి పూనుకుని, కొన్నిటిని పూర్తి చేసి, మిగిలిన వాటిని కొనసాగిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పది కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంది. ప్రైవేటీకరణలో భాగంగా ఇంకా మొదలుకాని కొన్ని కాలేజీల టీచింగ్ ఆస్పత్రులకు సంబంధించి విలువైన యంత్ర పరికరాలను ఇతర చోట్లకు తరలిస్తున్నారు. అందులో పులివెందుల కాలేజీ ఎక్విప్ మెంట్ కూడా ఉంది. పులివెందుల అంటే చంద్రబాబు అండ్ కో కి ఉన్న ద్వేషం అలాంటిదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. వైఎస్ జగన్ గతంలో కుప్పంలో ప్రభుత్వ స్కూల్ను నాడు-నేడు కింద బాగు చేయించడం, కుప్పానికి హంద్రీ-నీవా నీళ్లు ఇవ్వడానికి కృషి చేయడం, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అదే చంద్రబాబు మాత్రం జగన్ నియోజకవర్గమైన పులివెందుల పట్ల వివక్ష చూపుతున్నారన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు. పులివెందులతోపాటు రాయలసీమలోని మదనపల్లె, ఆదోని, ప్రకాశం జిల్లా మార్కుపురం కాలేజీల నుంచి కూడా పరికరాలను తరలించారని వార్తలు వచ్చాయి. ఇది ఆ ప్రాంత ప్రజలలో ఆవేదన మిగుల్చుతుందని చెప్పాలి. టూరిజం రంగానికి చెందిన హోటళ్లు, భవనాలను కూడా ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి వీలుగా ఆసక్తి కలిగిన కంపెనీలను ఆహ్వానించారు.ఇలా ఒక్కొక్క రంగాన్ని ప్రైవేటువారికి అప్పగించేస్తే ప్రభుత్వం ఇక చేసేది ఏముంటుందని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవస్థలతో పాటు, ఆయా నిర్మాణాలను నిర్లక్ష్యం చేయడం, ప్రైవేటువారిపరం చేయడం వంటి చర్యల ద్వారా కూటమి సర్కార్ విధ్వంసకర చర్యలకు పాల్పడుతోందన్న అభిప్రాయం కలుగుతోంది.దీనికంతటికి మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న ద్వేషమే కారణంగా కనిపించడం లేదా!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సీపీ బ్రౌన్కు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు సీపీ బ్రౌన్ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీపీ బ్రౌన్కు నివాళి అర్పించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సీపీ బ్రౌన్. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని పోస్టు చేశారు. తెలుగు భాషను ప్రేమించి, తెలుగు సాహిత్యాన్ని ముద్రించి భద్రపరచి, ప్రపంచానికి పరిచయం చేసిన మహానుభావుడు సి.పి. బ్రౌన్ గారు. ఆయన సమకూర్చిన తెలుగు–ఇంగ్లీష్ నిఘంటువు తెలుగు భాష అభివృద్ధికి శాశ్వతమైన పునాది వేసింది. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/8kBc2udUnO— YS Jagan Mohan Reddy (@ysjagan) November 10, 2025 -
శీతల్దేవికి వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ఆసియా కప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన పారా ఆర్చర్ శీతల్దేవికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ‘శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.ఓపెన్ ఆర్చరీ(ఏబుల్–బాడీడ్) అంతర్జాతీయ ఈవెంట్కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్గా నిలిచిన శీతల్కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాదించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్లో పాల్గొననున్న శీతల్కి ఆల్ ది బెస్ట్’ అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
టిడ్కో ఇళ్ల.. సం‘గతేంటి’ బాబూ?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని లబ్ధిదారులు అందరికీ 2026 జూన్ నెలాఖరులోగా టిడ్కో ఇళ్లు అందజేస్తామని ఇటీవల మున్సిపల్శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. అయితే ‘ఈ మొత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.7,280 కోట్లు అవసరం. కూటమి ప్రభుత్వం 18 నెలల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. మరో ఏడు నెలల్లో ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్క లబ్ధిదారుకు కూడా ఇల్లు ఇచ్చింది లేదు.జగన్ పూర్తి చేసిన ఇళ్లే దిక్కు..పేదలకు ఇళ్ల విషయంలో పూర్తి వైఫల్యం నేపథ్యంలో పరువు కాపాడుకునేందుకు బాబు సర్కార్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 90 – 95 శాతం పనులు పూర్తయిన 6 వేల ఇళ్లకు హంగులు అద్ది ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలంటే తమకు నిధులు ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థలు పట్టుబట్టడంతో చేసేది లేక రాజీవ్ స్వగృహ నిధుల నుంచి రూ.200 కోట్లు తీసుకుని కాంట్రాక్టర్లకు చెల్లించినట్టు విశ్వసనీయ సమాచారం. కాగా బాబు ప్రభుత్వ పాలనకు భిన్నంగా జగన్ సర్కార్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లింది. ప్రతిచోటా ఇళ్ల నిర్మాణంతో పాటు నూరుశాతం మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించడం జరిగింది. మొత్తం 2,62,212 ఇళ్లలో దాదాపు లక్ష ఇళ్లను జగన్ సర్కార్ లబ్ధిదారులకు అందించిన విషయాన్ని మున్సిపల్శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు. జగన్ హయాంలోనే మరో 77,546 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. లబ్ధిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా అక్రమాలకు జగన్ సర్కారు చెక్...ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం బాబు హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలను గుర్తించి రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించింది. ⇒ చదరపు అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692 తగ్గించి రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. తద్వారా ఈ ప్రయోజనాన్ని పేదలకు అందించింది. ⇒ నిరుపేదలకు కేటాయించిన 300 చదరపు అడుగుల ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్ల భారం లేకుండాపోయింది. ⇒ 365 చదరపు అడుగుల ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. దాంతో రెండు, మూడు కేటగిరీల లబ్ధిదారులకు టీడీపీ లెక్కల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు జగన్ సర్కారు తగ్గించింది. ⇒ అలాగే గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై మోపిన అధిక ధరల భారాన్ని సైతం జగన్ ప్రభుత్వం తగ్గించింది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే 1,43,600 ఇళ్లలో ఒక్కోఇంటికి రూ.6.55 లక్షలు ఖర్చవగా నిరుపేదలకు పూర్తి ఉచితంగా అందించారు. ⇒ 365 చదరపు అడుగుల ఇంటికి రూ.7.55 లక్షలు ఖర్చవగా, ప్రభుత్వం రూ.4.15 లక్షలు భరించి లబ్ధిదారులకు వారి వాటాగా చెల్లించాల్సిన సొమ్ముకు సంబంధించి రూ.3.40 లక్షల రుణ సదుపాయం కల్పించింది. ⇒ అలాగే రూ.8.55 లక్షలతో నిర్మించిన 430 చ.అడుగుల ఇంటికి జగన్ ప్రభుత్వం రూ.4.15 లక్షలు చెల్లించి లబ్ధిదారు వాటాగా రూ.4.40 లక్షల రుణ సదుపాయం కల్పించింది. బాబు పాలనలో రూ. 8,929.81 కోట్ల దోపిడీ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో రూ.8,929.81 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. అన్ని మున్సిపాలిటీల్లో 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు జారీ చేయగా, చాలా మున్సిపాలిటీల పరిధిలో స్థలం లభించలేదు. అయితే, భూములు దొరికిన చోట నాడు చదరపు అడుగు నిర్మాణ ధర రూ.1,000 కంటే తక్కువే. అయితే బాబు ప్రభుత్వం మాత్రం కంపెనీలు ఇచ్చిన ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2,034.59 వరకూ నిర్ణయించి కాంట్రాక్టులు కట్టబెట్టింది. సగటున చదరపు అడుగు నిర్మాణానికి రూ.2,203.45గా చెల్లించారు.అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా ఇచ్చారు. పైగా ఎక్కడా నూరు శాతం ఇళ్లు ఇచ్చింది లేదు. కేవలం 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా నెల్లూరులో ఇళ్లు పూర్తవకపోయినా రంగులు వేసి లబ్ధిదారులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం 2019 మే నాటికి 77,350 ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇందులో 20 వేల వరకు మాత్రమే 60 శాతం పూర్తి చేశారు. -
తవ్వినకొద్దీ.. కట్టుకథలే..!
వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పటిలాగే సవతి ప్రేమ ఒలకబోస్తోంది. సీఎం చంద్రబాబు నుంచి ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటపు ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తికి, నిర్వాసితుల పునరావాసానికి దాదాపు రూ.2000 కోట్లు అవసరమంటూ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఏడాదిన్నర కాలంలో అత్తెసరు నిధులు విడుదల చేసి పనులు వేగంగా జరుగుతున్నాయంటూ మంత్రి నిమ్మల రామానాయుడు అసత్య ప్రకటనలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చటగా మూడోసారి వచ్చిన మంత్రి.. ప్రాజెక్టుకు ఎంత నిధులిచ్చారు..జరిగిన పని గురించి చెప్పకుండా వచ్చే ఏడాదిలో నీళ్లిచ్చేస్తామంటూ ఎప్పటిలాగే గొప్పలు చెప్పుకుని వెళ్లిపోయారని పశ్చిమ ప్రకాశం వాసులు మండిపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: మూడు జిల్లాల వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. 1997లో వెలిగొండ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. సర్వే పేరుతో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకుండా తన నైజాన్ని ప్రదర్శించిన విషయాన్ని నేటికీ ప్రకాశం జిల్లా ప్రజలు మర్చిపోలేదు. 2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాలనలో ఐదు సార్లు జిల్లాకు వచ్చారు. వచ్చినప్పుడల్లా ‘త్వరలో వెలిగొండను ప్రారంభించి పశ్చిమ ప్రకాశాన్ని సస్యశ్యామలం చేస్తా’ అంటూ హామీలు గుప్పిస్తూ కాలం గడిపేశారు. 2018 జూన్ నెలలో జిల్లాకు వచ్చిన చంద్రబాబు.. 2019 సంక్రాంతికల్లా వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని ప్రకటించారు. అధికారం పోయిన తర్వాత జిల్లాకు వచ్చి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయడంపై పశ్చిమ ప్రకాశం ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. తన హయాంలో వెలిగొండ ప్రాజెక్టును గాలికొదిలేసి వైఎస్సార్ సీపీ హయాంలో వెలిగొండ పనులు వేగంగా జరుగుతుంటే విమర్శలు చేయటమే పనిగా పెట్టుకోవటాన్ని ప్రజలు విమర్శించారు. ఈ నేపథ్యంలో 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండు సార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అత్తెసరు నిధులను వెలిగొండ ప్రాజెక్టుకు కేటాయించింది. ఈ నిధులతో పనులు జోరుగా జరుగుతున్నాయంటూ రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కూడా సీఎం చంద్రబాబు మాదిరిగానే మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముచ్చటగా మూడోసారి... వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు ఇప్పటికే రెండు సార్లు వచ్చిన నిమ్మల ఇటీవల దోర్నాల వచ్చి వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, సాక్షి దినపత్రికపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పారు. మూడు సార్లు వచ్చి ఏం సాధించారంటే.. ప్రొటోకాల్ ఖర్చులు తప్ప ఏమీ లేదనే చెప్పాలని రైతులు మండిపడుతున్నారు. 2014–19 వరకు 2 టన్నెల్స్ కలిపి 4 కిలోమీటర్లలోపే... చంద్రబాబు మూడోసారి సీఎంగా ఉన్న 2014–19 మధ్యలో వెలిగొండకు గ్రహణం పట్టింది. ప్రాజెక్టుకు ప్రధానమైన రెండు టన్నెళ్లు కలుపుకుని కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయి. ఆ పనులను సైతం తన బినామీ అయిన సీఎం రమేష్కు నామినేషన్ మీద అప్పగించి వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. జలయజ్జంలో 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించారు. ఆయన అకాల మరణం తర్వాత పనులు మందగించాయి. చంద్రబాబు నిధులివ్వకుండా ప్రాజెక్టును చిన్నచూపు చూసి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల ప్రజలనూ నిలువునా మోసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు టన్నెళ్లు పూర్తి... వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పొడవు 18.80 కిలోమీటర్లు. రెండో టన్నెల్ పొడవు 18.78 కిలోమీటర్లు. ఈ రెండు టన్నెళ్లకు సంబంధించిన పురోగతిని పరిశీలిస్తే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టును ఉరుకులు, పరుగులు పెట్టించారు. ఆయన హయాంలో మొదటి టన్నెల్కు సంబంధించి 11.58 కి.మీ పనులు పూర్తి చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రెండు టన్నెళ్లకు సంబంధించి కేవలం 4 కిలోమీటర్లు మాత్రమే పూర్తిచేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే 5.22 కిలోమీటర్ల మేర మొదటి టన్నెల్ తవ్వి పనులు పూర్తి చేశారు. అలాగే రెండో టన్నెల్ను కూడా 10.04 కిలోమీటర్లు తవ్వకాలు పూర్తి చేశారు. వెలిగొండ ప్రాజెక్టు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా ఖర్చు చేసింది. రెండు టన్నెళ్లు పూర్తయిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతులు...వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఒక వైపు ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు నిర్వాసితులకు అండగా నిలిచారు. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా నిర్వాసితులకు మార్కాపురం మండలం కుంట వద్ద, పెద్దారవీడు మండలం సుంకేశుల, కలనూతల, చింతలముడిపి గ్రామాల వారికి గోగులదిన్నె వద్ద, సుంకేశులలోని ఎస్సీలకు తోకపల్లి వద్ద కలనూతలలో, కొంతమంది నిర్వాసితులకు ఇడుపూరు వద్ద కాలనీలు ఏర్పాటు చేశారు. అలాగే సిమెంటు రోడ్లు, వాటర్ ట్యాంకులు, కమ్యూనిటీ హాలు, పాఠశాలలు నిర్మించారు. చంద్రబాబు హయాంలో పునరావాసానికి రూ. 1.80 లక్షలు ప్రకటిస్తే.. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రూ.12.50 లక్షలకు పెంచారు. అందుకోసం రూ.1400 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వీటిని పట్టించుకోకపోవడంతో చిల్లచెట్లు, పిచ్చికంపతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారాయి. దీంతో నిర్వాసితుల్లో నిరాశ, నిస్పృహలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు పరిధిలో 11 గ్రామాల ప్రజలు ప్రస్తుతానికి సొంతూళ్లలోనే ఉంటున్నారు. మొత్తం 7,270 కుటుంబాలు ఉన్నాయి. పునరావాస ప్రక్రియ పూర్తికాకపోవడంతో శిథిలావస్థకు చేదుకున్న గృహాల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు వీరి కష్టాలను గాలికొదిలేసి ఆర్భాటపు ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారని పశి్చమ ప్రకాశం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
శీతల్ దేవికి వైఎస్ జగన్ అభినందనలు
ఆసియాకప్ టోర్నీ కోసం భారత జట్టుకు ఎంపికైన భారత పారా అర్చర్ శీతల్ దేవికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "శీతల్ దేవి ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం. ఓపెన్ ఆర్చరీ (ఏబుల్డ్) ఈవెంట్కు అర్హత సాధించిన తొలి భారతీయ పారా ఆర్చర్గా నిలిచిన శీతల్కు అభినందనలు. పట్టుదల, అంకితభావం ఉంటే ఏదైనా సాధించవచ్చని శీతల్ నిరూపించింది. ఆసియాకప్లో పాల్గోనున్న ఆమెకు ఆల్ది బెస్ట్" అంటూ ఎక్స్లో ఆయన పేర్కొన్నారు.A highly inspiring achievement! My heartiest congratulations to @archersheetal on this historic milestone of being the first Indian Para Archer to Qualify for Able-Bodied International event.Your journey is a shining example of what dedication and belief can achieve.We are… https://t.co/oSrtHVgdmW— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025 చరిత్ర సృష్టించిన శీతల్..శీతల్ దేవికి పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. కాళ్లతో విల్లును పట్టుకుని టార్గెట్ను గురిపెడుతూ పారా ఆర్చరీ ప్రపంచంలో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. 2024 పారాలింపిక్స్లో మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్లో కాంస్యం సాధించిన శీతల్... భారత జూనియర్ జట్టులోకి ఎంపికైంది. సౌదీ అరేబియాలోని జిద్దాలో జరిగే ఆసియా కప్ స్టేజ్–3 టోర్నీలో వైకల్యం లేని, సాధారణ ఆర్చర్లతో కలిసి ఆమె పోటీపడనుంది. -
చీకట్లో ట్రీట్ మెంట్ ఇదేం పాలన బాబు.. జగన్ ఫైర్
-
భక్త కనకదాసకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: భక్త కనకదాస జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో..వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భక్త కనకదాస జయంతి నిర్వహించారు. కనకదాస చిత్ర పటానికి వైఎస్సార్సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, కుము-కురబ నేత గడ్డం రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.కులమత భేదాల గోడల్ని చెరిపేసిన భక్తి యోధుడు, శ్రీకృష్ణ భగవానుడికి గొప్ప భక్తుడు శ్రీ భక్త కనకదాస. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడు ఆయన. ఎన్నో భక్తి కీర్తనలతో కవిత్వానికి కొత్త ఊపిరి పోశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య ధైవంగా నిలిచిన శ్రీ భక్త… pic.twitter.com/5y5o1f6IP7— YS Jagan Mohan Reddy (@ysjagan) November 8, 2025 -
బాబు ‘విజన్’ డ్రామా.. ‘ఎల్లో’ ఎలివేషన్!
‘ఊరు మారినా ఉనికి మారునా’ అని ఓ సినీకవి అన్నాడు కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీన్ని.. ‘పేరు మారినా ఖ్యాతి పోవునా’ అని పాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను, ప్రజాసేవకు ఏర్పాటు చేసిన విస్తృత వ్యవస్థల పేర్లు మార్చి సంబరపడుతోంది టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం. ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయంతో వాటిని కొనసాగిస్తున్నప్పటికీ ఎక్కడ జగన్ పేరు జన హృదయాల్లో నిలిచిపోతుందో అన్న భయంతో పథకాల పేర్లు మార్చేసి కూటమి ప్రభుత్వం ఆత్మ వంచన చేసుకుంటోంది.తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా మార్చాలని చంద్రబాబు ప్రతిపాదించారు. ముందుగా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా నామకరణం చేయాలని అనుకున్నప్పటికీ ఎందువల్లో విజన్ యూనిట్ పేరుకు పరిమితమయ్యారు. ప్రతి నియోజకవర్గానికి విజన్ ప్లాన్ రూపొందిస్తామని, సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలని చంద్రబాబు అధికారుల సమావేశంలో తెలిపారు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పించాలని కూడా ఆయన అన్నారు. విజన్ పేరుతో ప్రజలను భ్రమల్లో ఉంచడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు విజన్ 2020. ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి ఒకటి. అంతే తేడా!ఈ మధ్య ఒక రోజు మంత్రి లోకేశ్ టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళితే అక్కడ నాలుగువేల మంది క్యూ కనిపించిందట. కొన్ని గంటల వ్యవధిలోనే లోకేశ్ వారి నుంచి వినతిపత్రాలు తీసుకున్నారట. ప్రభుత్వం ప్రజల వద్దకు వెళుతుంటే, వారి సమస్యలు తీరుతుంటే ఈ స్థాయిలో జనం పార్టీ ఆఫీస్కు వెళ్లి వినతులు సమర్పించుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది?. ఎల్లో మీడియా లోకేశ్కు ఎలివేషన్ ఇచ్చే క్రమంలో ఈ వార్తను రాసింది. కానీ, అది తిరగబడినట్లు వ్యంగ్యంగా వ్యాఖ్యలు వచ్చాయి. నిజానికి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ సేవలు ప్రజల ఇళ్ల వద్ద అందించడం కోసం వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. ఈ వ్యవస్థ పనితీరుపై సర్వత్రా ప్రశంసలూ వ్యక్తమయ్యాయి. కానీ, చంద్రబాబు, పవన్కళ్యాణ్లు ఆది నుంచి ఈ వ్యవస్థలకు వ్యతిరేకంగానే మాట్లాడారు. వలంటీర్లను మూటలు మోసేవారని, మగవారు ఇళ్లల్లో లేనప్పుడు తలుపులు కొట్టే వారని చంద్రబాబు నానా మాటలూ అన్నారు. పవన్ కూడా వలంటీర్లను మహిళలను కిడ్నాప్ చేసే వారితో పోల్చడం తెలిసిందే.అయితే.. ప్రజల్లో వలంటీర్ వ్యవస్థపై ఉన్న భరోసా, నమ్మకాలను గమనించిన తరువాత ఎన్నికల సమయంలో తామూ ఈ వ్యవస్థలను కొనసాగిస్తామని నమ్మబలికారు. అంతటితో ఆగకుండా.. వలంటీర్ల గౌరవ వేతనాలను రెట్టింపు చేస్తామని హామీలు గుప్పించారు కానీ అధికారం వచ్చిన తరువాత మాత్రం తూచ్ అనేశారు! రైతు భరోసా కేంద్రాల పేర్లను కూడా రైతు సేవా కేంద్రాలుగా మార్చిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై గతంలో తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేశారు. అంతమంది ఉద్యోగుల నియామకం ఏమిటని ధ్వజమెత్తారు. కానీ, ఇవి ప్రజా సేవలకు అత్యంత కీలకంగా మారిపోవడం, రాష్ట్ర ప్రభుత్వానికి సచివాలయం మాదిరిగా గ్రామాలకు, వార్డులకు ఇవి అని ప్రజలు గుర్తించారు.సచివాలయాలన్నిటికి జగన్ శాశ్వత భవనాలు ఏర్పాటు చేశారు. వివిధ శాఖలకు చెందిన సుమారు 1.30 లక్షల మంది ఉద్యోగులను ఏకకాలంలో నియమించి రికార్డు సృష్టించారు. తుపాన్ల వంటి విపత్కర పరిస్థితుల్లో ఈ వ్యవస్థలు సహాయ కార్యక్రమాల అమల్లో చురుకుగా పాల్గొని ప్రజల ప్రశంసలు పొందాయి కూడా. ఈ నేపథ్యంలో వీటిని ఎత్తి వేయలేమన్న అభిప్రాయానికి వచ్చిన చంద్రబాబు సర్కార్ క్రెడిట్ జగన్కు దక్కరాదన్న అక్కసుతో కొత్త పేరు పెట్టే ప్రయత్నం చేస్తోంది. తద్వారా క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్నారన్నమాట. అయితే ఈ విజన్ యూనిట్లకు వేరే బాధ్యతలు అప్పగిస్తారో, లేక జగన్ టైమ్లో మాదిరి సేవలు అందించేలా చూస్తారో చెప్పలేం.స్కీముల కాపీలో టీడీపీకు ఘనమైన ట్రాక్ రికార్డే ఉంది. 2019 ఎన్నికల సమయంలో జగన్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి విజయవంతంగా అమలు చేయగా చంద్రబాబు అండ్ కో 2024లో దీన్నే ‘అన్నదాతా సుఖీభవ’ అని నామకరణం చేసింది. ఎక్కువ మొత్తానికి హామీ ఇచ్చినా అధికారంలోకి వచ్చిన తరువాత ఎగవేశారన్నది వేరే సంగతి. ఇంటికో విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని జగన్ ‘అమ్మ ఒడి’ ద్వారా అందిస్తే.. ఇంట్లో ఉన్న విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’ పేరుతో తామూ ఇస్తామని కూటమి ప్రకటించింది. తొలి ఏడాది ఎగవేసి రెండో ఏట అరకొరగా అమలు చేసి మమ అనిపించింది. అలాగే జగన్ రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల (31 లక్షల పేదలకు ఇళ్లస్థలాలివ్వడమే కాకుండా.. నిర్మాణమూ చేపట్టిన భారీ కార్యక్రమం) పేరును కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ నగర్లుగా మార్చింది. ‘జగనన్న గోరుముద్ద’ కాస్తా ఇప్పుడు మధ్యాహ్న భోజనమైంది. విద్యా కానుక విద్యార్థి మిత్రగా మారితే పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చేసేందుకు జగన్ చేపట్టిన ‘నాడు-నేడు’ ఇప్పుడు ఏస్థితిలో ఉందో ఎవరికీ తెలియదు. పేరును మాత్రం ‘మనబడి -మన భవిష్యత్తు’ అని పెట్టేశారు. వాహనమిత్రను ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అని, ‘మత్యకార భరోసా’ని ‘మత్స్యకారుల సేవలో’ అని మార్చేశారు.మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం దిశ యాప్ను తీసుకువస్తే దానిని శక్తి యాప్గా మార్చారు. వైఎస్ఆర్ పేరుతో ఉన్న ఆరోగ్యశ్రీ స్కీమ్ను ఎన్టీఆర్ వైద్యసేవగా ఛేంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలలో అమలు చేసిన మహిళల ఉచిత బస్ స్కీమ్ను కూటమి తన ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. ఆడబిడ్డ నిధి కూడా కాపీ స్కీమే. అయినా అది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాదిరే ఏపీలో కూడా చంద్రబాబు సర్కార్ అమలు చేయలేకపోయింది. చంద్రబాబు తన ఇన్నేళ్ల పదవీ కాలంలో ఎందుకు ఇలాంటివి తీసుకు రాలేకపోయారంటే సమాధానం ఉండదు. ఒకప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇస్తే, అలా చేస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరవేసుకోవల్సిందేనని చంద్రబాబు అనేవారు. తదుపరి ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్ ఉచిత విద్యుత్తును అమలు చేసి చూపించారు. దాంతో అదంతా తమ సంస్కరణల వల్లే సాధ్యమైందని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు.గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వేని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నేతలు, తమ ప్రభుత్వంలో దానినే కొనసాగిస్తుండడం విశేషం. జగన్ తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తామే తెచ్చామన్నట్లుగా పిక్చర్ ఇవ్వడం, వాటిని ప్రైవేటు వారికి అప్పగించడం ద్వారా జగన్కు క్రెడిట్ రాకుండా చేయాలని చూడడం, విశాఖలో అదాని డేటా సెంటర్ కు జగన్ అంకురార్పణ చేస్తే, దానిని మర్చిపోవడం కోసం వ్యూహం అమలు చేయడం వంటివి కూడా చెప్పుకోదగినవే. ఏది ఏమైనా చంద్రబాబు తనకు ఇష్టం లేకపోయినా, సచివాలయాలను కొనసాగిస్తుండడం ద్వారా జగన్ తెచ్చింది మంచి వ్యవస్థ అని, జగన్కే విజన్ ఉందని ఒప్పుకున్నట్టు అయ్యింది. వారు భావిస్తున్నట్లుగా సచివాలయాల పేరు మార్చినా, జగన్ ప్రభుత్వం నిర్మించిన భవనాలు జనానికి కనిపించవా? జగన్ పేరు గుర్తుకు రాకుండా ఉంటుందా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? చంద్రబాబును నిలదీసిన : వైఎస్ జగన్
-
ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు?
సాక్షి, అమరావతి: ‘‘చంద్రబాబు గారూ.. అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని మీరు రొటీన్ డైలాగులు చెబుతున్న పరిణామాల మధ్య, ఈ పెద్దాసుపత్రిలో కరెంటు పోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి?’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతారా.. అంటూ నిప్పులు చెరిగారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..» విశాఖపట్నం కేజీహెచ్లో గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కరెంట్ పోతే రాత్రి 12.30 గంటల వరకు పట్టించుకునే నాథుడు లేడు. దాదాపు 12 గంటలపాటు చిన్న పిల్లలు, గర్భిణులు, రోగులు అష్టకష్టాలు పడ్డారు. ఆపరేషన్లు చేయించుకున్న వారి పరిస్థితి మరింత హృదయ విదారకం. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురులోనే రోగులకు సేవలు అందించాల్సిన దుస్థితి.ఇవన్నీ మీ రొటీన్ డైలాగ్లు, డ్రామాల మధ్య మీకు కనపడక పోవడం దారుణం. రెండు వేల పడకలున్న ఆస్పత్రిలో 1,700 మంది ఇన్పేషెంట్లు ఉన్నారు. ఇలాంటి ఆస్పత్రి నిర్వహించే తీరు ఇదేనా? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్న కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేదా? అది కూడా 12 గంటలపాటు స్పందన లేకపోవడమా? ప్రభుత్వ ఆస్పత్రులు అంటే ఇంత చులకన ఎందుకు? ఇంత నిర్లక్ష్యం దేనికి?» మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్లు నిర్వీర్యం, పీహెచ్సీలు నిర్వీర్యం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు, సీహెచ్సీల్లో స్పెషలిస్టు డాక్టర్ల తొలగింపు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, టీచింగ్ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులు నిలిపేయడం, సిబ్బంది విషయంలో జీరో వేకెన్సీ పాలసీకి మంగళం, ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి సర్వనాశనం, ఆరోగ్య ఆసరా మాయం.. 108, 104ల పరిస్థితి ఘోరం. చివరకు 104, 108 కాంట్రాక్టులను మీ పార్టీ సభ్యుడికి అవినీతి కోసం కట్టబెట్టి, ఇన్ని రకాలుగా ప్రభుత్వ వైద్య రంగాన్ని సర్వనాశనం చేసి, ఇప్పుడు కేజీహెచ్ లాంటి ఆస్పత్రులను కూడా దెబ్బతీస్తున్నారు. మేం తెచ్చిన కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ అంతకు మించి హాని చేస్తున్నారు. » మా ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించి అనేక అభివృద్ధి పనులు చేశాం. ప్రస్తుత క్యాజువాలిటీని ఆధునికీకరించడమే కాకుండా, రెండో క్యాజువాలిటీని 24 గంటలూ సేవలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. సీఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి 200 పడకలు అందుబాటులోకి తెచ్చాం. కొత్త అల్ట్రా సౌండ్ స్కాన్, కొత్త ఎమ్మారై, మొబైల్ ఎక్సరే, ఆన్లైన్లోనే రోగి పరీక్ష ఫలితాలను తెలుసుకునే ఏర్పాటు, క్రిటికల్ కేర్ యూనిట్తోపాటు ఓపీ మొత్తాన్ని ఆధునికీకరించాం. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్ నిర్మాణం, ఆధునిక పరికరాలు, భావనగర్ వార్డులో ఏఎంసీ యూనిట్లు, అందుబాటులోకి కేన్సర్ కేర్ యూనిట్.. అందులో అత్యాధునిక పరికరాలు, ఒక్క కేజీహెచ్కే కొత్తగా 8 అంబులెన్సులు, రోగుల సహాయకుల బస కోసం చౌల్ట్రీల ఆధునికీకరణ, దీంతోపాటు వెయిటింగ్ హాల్స్ను కనీసం 200–250 మంది ఉండేలా తీర్చిదిద్దాం. ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలతో కేజీహెచ్ ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందేలా నిరంతరం కృషి చేశాం. కానీ, మీరు వాటన్నింటినీ నీరుగారుస్తూ పేదవాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మేం గొప్పగా ఆధునికీకరించినవి కూడా మీరు మెయింటెయిన్ చేయలేకపోతున్నారు. కార్డియాలజీ విభాగంలో పరికరాలు పాడైపోయి ఈ ఏడాది జనవరి నుంచి దాదాపు ఏడు నెలలకు పైగా గుండె ఆపరేషన్లు ఆగిపోవడం మీ పాలనా వైఫల్యం కాదా చంద్రబాబు గారూ? ఇప్పుడు కూడా అరకొరగానే నడిపిస్తున్నారు కదా? ఆస్పత్రిలో కరెంటు లేని కారణంగా ఆక్సిజన్ అందకపోవడంతో దేవీ అనే మహిళ చనిపోయిందని ఆ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇలా ఎన్ని పాపాలు చేస్తారు చంద్రబాబు గారూ? చివరకు నిన్న పులివెందుల టీచింగ్ ఆస్పత్రి నుంచి పరికరాలు తీసేస్తున్న ఫొటోలు చూస్తుంటే నిజంగా మీ పాపాలకైనా హద్దుండాలి కదా? .@ncbn గారూ…, అసలు పరిపాలన అంటే మీకు తెలుసా? ప్రభుత్వ ఆస్పత్రులను ఇలా భ్రష్టు పట్టిస్తారా? ఉత్తరాంధ్ర ప్రాంతంలోని పేదలకు పెద్ద దిక్కు అయిన విశాఖపట్నం కేజీహెచ్ ఆస్పత్రిని నిర్వహించలేని దౌర్భాగ్యస్థితిలో మీరు ఉన్నారు. విజన్ గురించి, ఆన్లైన్ పరిపాలన గురించి సచివాలయంలో కూర్చుని… pic.twitter.com/u0761DrSW5— YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2025 -
గొల్లపల్లిని ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, కోనసీమ జిల్లా: అస్వస్థతకు గురైన వైఎస్సార్సీపీ రాజోలు కో ఆర్డినేటర్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. గొల్లపల్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గొల్లపల్లి కుమారుడు శ్రీధర్కు ధైర్యం చెప్పారు.గొల్లపల్లి సూర్యారావు (నవంబర్ 5, బుధవారం) గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే అమలాపురం కిమ్స్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. రాజోలు మండలం శివకోడులో గురువారం జరిగే రచ్చబండ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆయన బుధవారం వెళ్లారు. పార్టీ నాయకుడు ఇంటిలో మెట్లు ఎక్కి వెళుతుండగా అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే పార్టీ నాయకులు స్థానిక ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.ఈసీజీలో తేడా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అమలాపురం కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్.. కిమ్స్ వైద్యులతో మాట్లాడారు. కిమ్స్ గుండె వైద్యుడు అభిషేక్ వర్మ ఆధ్వర్యంలో వైద్య నిపుణుల బృందం గొల్లపల్లి గుండెలోని క్లాట్స్ తొలగించి రెండు స్టంట్లు వేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సూర్యారావు ఆరోగ్యం మెరుగ్గా ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని డాక్టర్ శ్రీకాంత్ సూచించారు. కిమ్స్ చైర్మన్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) పర్యవేక్షణలో సూర్యారావుకు వైద్యులు సేవలు అందిస్తున్నారు. -
వందేమాతరం గీతంపై వైఎస్ జగన్ ట్వీట్
తాడేపల్లి : వందేమాతరం.. భారతీయ గీతం. ఇది బంకిమ్ చంద్ర చటర్జీ 1875లో రచించిన దేశభక్తి గీతం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రేరణగా నిలిచిన గీతం. అయితే ఈ గీతం 150 ఏళ్ల స్పూర్తిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. ‘ 'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం. బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధికోసం కలిసి పనిచేద్దాం’ అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.'వందేమాతరం' 150 సంవత్సరాల స్ఫూర్తికి నా వందనం.బంకిం చంద్ర ఛటర్జీ గారు రచించిన ఈ పవిత్ర గీతం మన స్వాతంత్య్ర సమరయోధులలో రగిలించిన ఐక్యతా భావనే మనందరికీ ఆదర్శం. ఆ స్ఫూర్తితో మన భావితరాల కోసం, వారి అభివృద్ధికోసం కలిసి పనిచేద్దాం.#VandeMataram150— YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2025ఇదీ చదవండి: స్థానిక స్వపరిపాలనకు మార్గదర్శి వైఎస్ జగన్ -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈనెల 12న ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పేరుతో 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు పార్టీ నాయకులు వెల్లడించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందని వివరించారు.ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్సార్సీపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన నాటి సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 కాలేజీలను పూర్తి చేశారు. మిగిలిన కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణాలకు నిధుల కొరత లేకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్తో టైఅప్ చేయడం జరిగింది.కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేయకపోగా సేఫ్ క్లోజర్ పేరుతో పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతే కాకుండా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించి డాక్టర్లు కావాలని కలలు కనే పేద విద్యార్థుల ఆశలకు చంద్రబాబు గండి కొట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 12న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర, ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, నారాయణమూర్తి, ఇతర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
‘స్ధానిక స్వపరిపాలనకు మార్గదర్శి వైఎస్ జగన్ ’
కాకినాడ: ‘విజన్ యూనిట్’ అంటూ సచివాలయాల పేరును మార్చాలనుకుంటున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేరు మార్చవచ్చేమో కానీ వ్యవస్థను సృష్టించిన వాళ్లను మార్చలేరంటూ ధ్వజమెత్తారు. స్ధానిక స్వపరిపాలన,ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం ఇచ్చింది మాజీ సిఎం వైఎస్ జగన్ అని, స్ధానిక స్వపరిపాలనకు వైఎస్ జగన్ మార్గదర్శి అని స్పష్టం చేశారు కురసాల.ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) కాకినాడ నుంచి మాట్లాడిన కురసాల.. ‘తుపాన్ భాధితుల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఐతే కొన్ని పేపర్లు చూస్తే డేటా ఆధారిత సెంటర్లు అని రాసి ఉన్నాయి. తుపాను తర్వాత చంద్రబాబు లండన్ వెళ్లిపోతే.. మంత్రి లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లిపోయాడన్నారు. లండన్ బాబు వచ్చి డేటా ఆధారిత పరిపాలన కోసం మాట్లాడుతున్నారు. తుపాన్ వల్ల ఎంత పంట నష్టం జరిగింది? ఎంత మంది రైతులు నష్టపోయారు? ఎన్ని రోడ్లు పోయాయంటే డేటా లేదు.స్ధానిక స్వపరిపాలన , ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం ఇచ్చింది మాజీ సీఎం వైఎస్ జగన్. విజన్ యూనిట్ అని సచివాలయాల పేరు మార్చాలనుకున్నారు. పేరు మార్చవచ్చేమో కానీ... వ్యవస్ధలను సృష్టించిన వాళ్ళను మార్చలేరు. *హెడ్ లైన్లు..అందమైన ఫోటోలకు తప్పా... నిన్న ఏం చేశాం అనే దానిపై ఫాలోఫ్ ఉంటుందా?, బెల్టు షాపుల మీద ఉక్కుపాదం అని చంద్రబాబు చెబుతున్నారు.. గత 16 నెలలుగా ఏం చేశారు?, ప్రభుత్వ మద్యానికి సమాంతరంగా నకిలీ మద్యాన్ని తీసుకువచ్చారు.మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయో మీరే నమ్మట్లేదు. నకిలీ మద్యాన్ని అమ్మడం వల్లే మద్యం అమ్మకాలు తగ్గాయి. చాలా గందరగోళం లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సచివాలయాలను విజన్ యూనిట్ అని చంద్రబాబు అంటున్నారు కధా? ఎవరూ విజనరీనో చంద్రబాబు చెప్పాలి. వాట్సప్ లో సేవలు అందుతున్నప్పుడు ..లోకేష్ దగ్గరికి, కలెక్టరేట్ లకు ఎందుకు ప్రజలు తమ అర్జీలను తీసుకువెళ్తున్నారు’ అని కురసాల ప్రశ్నించారు. బండి సంజయ్కు నో.. కేటీఆర్ ఓకే -
నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్
-
జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే
-
YS Jagan: క్రెడిట్ చోర్ చంద్రబాబు
-
Sakshi Special: జయహో జగనన్న YSRCP చారిత్రక విజయానికి తొలి మెట్టు..
-
భావితరానికి యువతే దిక్సూచి... రాజకీయాల్లో విద్యార్థులు, యవత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
మన ఖాతాలో వేసేద్దాం..
సాక్షి, అమరావతి: ఏమార్చి.. పేరు మార్చి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అమ్మ ఒడి నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకూ అదే తీరు. తాజాగా గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్లుగా పేరు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా ఇచ్చిన 143 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, ప్రారంభించిన వ్యవస్థల పేర్లు మార్చి.. వాటిని తానే ప్రారంభించినట్లు గొప్పులు చెప్పుకోవడానికి తహతహలాడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిదే. దేశ చరిత్రలో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒకే నోటిపికేషన్తో 1.34 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమించారు. అంతకు ముందే అంటే 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా నాలుగున్నరేళ్లలో ప్రజల ఇంటి గుమ్మం వద్దకే 12 కోట్ల ప్రభుత్వ సేవలను అందించారు. సచివాలయ వ్యవస్థపై దేశ వ్యాప్త ప్రశంసలుకరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రంలో ప్రజలకు గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు అందించిన సేవలపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచివాలయ వ్యవస్థ పనితీరును కేంద్రం, పలు రాష్ట్రాల అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నీరుగార్చడానికి కుట్ర పన్నారు. ఈ క్రమంలోనే విత్తనం నుంచి విక్రయం వరకూ రైతులకు చేదోడువాదోడుగా నిలిచే రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. వాటి పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చి దిష్టిబొమ్మల్లా తయారు చేశారు. వలంటీర్లకు గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.పది వేలకు పెంచుతామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఏకంగా వలంటీర్లను తొలగించి వెన్నుపోటు పొడిచారు. గ్రామ, వార్డు సచివాలయాలను అనవసరంగా ఏర్పాటు చేశారని.. వాటిలో నియమించిన ఉద్యోగుల వేతనాల భారం పెరిగి పోయిందని అక్కసు వెళ్లగక్కారు. ఆ తర్వాత మోంథా తుపానును గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ.. ఇప్పుడు ఆ వ్యవస్థను తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవడానికి వాటి పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతామని ప్రకటించారు.‘అమ్మ ఒడి’ విషయంలోనూ అంతే.. » తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించే సమయంలో అది మంత్రి నారా లోకేశ్ ఆలోచన నుంచి పుట్టిందంటూ గొప్పలు పోయారు. వాస్తవానికి వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మ ఒడి పథకానికే పేరు మార్చి అమలు చేస్తున్నారని విద్యార్థులు, తల్లితండ్రులే ఎలుగెత్తిచాటారు. » వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయం అని, వాటిని అంతకంటే గొప్పుగా అమలు చేస్తామని.. అదనంగా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను కూడా అమలు చేస్తామంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఊదరగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్ అమలు చేసిన పథకాల పేర్లు మార్చారు. మరి కొన్ని రద్దు చేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలను గాలికొదిలేశారు.» వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషి వల్ల విశాఖపట్నంలో గూగుల్తో కలిసి డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థ నడుం బిగించింది. ఇప్పుడు ఆ డేటా సెంటర్ తన వల్లే విశాఖకు వచ్చి ందంటూ సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. » వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించి, ఏడు కాలేజీలను అప్పట్లోనే పూర్తి చేశారు. తరగతులు కూడా ప్రాంభమయ్యాయి. కానీ.. సీఎం చంద్రబాబు మాత్రం ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగిస్తూ అదే తన ఘనతగా చెప్పుకుంటుండటం కొసమెరుపు. -
యువతే లీడర్: వైఎస్ జగన్
ఇది సోషల్ మీడియా యుగం.. ఈ యుగంలో డ్రైవ్ చేసేది యువతే.. యువత చేతుల్లోనే భవిష్యత్ ఉంది.. వారెలా డిసైడ్ చేస్తే, ఆ గవర్నమెంట్ వస్తుంది.. ఆ ప్రభుత్వం.. మీరు సిట్ అంటే సిట్! స్టాండ్ అంటే స్టాండ్! దటీజ్ ద పవర్ ఆఫ్ యంగ్స్టర్స్. గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయాయి. టోఫెల్ క్లాస్లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘భావితరానికి మీరే దిక్సూచి.. రాజకీయాల్లో విద్యార్థులు, యువత తులసి మొక్కల్లా ఉన్నతంగా ఎదగాలి..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. సోషల్ మీడియా యుగంలో డ్రైవ్ చేసేది యువతేనని, వారి చేతుల్లోనే భవిష్యత్ ఉందన్నారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమైన వైఎస్ జగన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జరుగుతున్న పరిణామాలపై చర్చించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోవైఎస్ జగన్ ఏమన్నారంటే.. తులసి మొక్కల్లా ఎదగాలి.. ఒక నాయకుడి గొప్పతనానికి యువత, విద్యార్థి దశ నుంచే బీజం పడుతుంది. మీరంతా జనరేషన్–జీ లో ఉన్నారు. భావి తరానికి దిక్సూచీ కాబోతున్నారు. బహుశా ఒకటి, రెండు టరమ్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తారు. మీరు రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. మీరంతా సోషల్ మీడియాను అత్యధికంగా అనుసరించేవారు, దాన్ని నడిపించేవారు, 90 కి.మీ. వేగంతో ప్రయాణించే మనసు ఉన్నవారే! రాజకీయాలు ఎలా ఉండాలంటే.. ఫలానా వ్యక్తి మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకుని చెప్పేలా, యువతరం మనవైపు చూసేలా ఉండాలి. మనలో ఆ క్యారెక్టర్, గుణాలు కనిపించినప్పుడే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతోందో అందరం చూస్తున్నాం. సరైన విత్తనం వేయకపోతే పరిస్థితి మారదు.. విద్యార్థులు, యువత గట్టిగా అడుగులు ముందుకు వేస్తే.. దేశాలలో ప్రభుత్వాలు కూడా మారిపోతున్నాయి. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడం పాత కథ అయితే.. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చే కార్యక్రమాలు జరిగాయి. అంత శక్తిసామర్థ్యాలు ఉన్నవారు యువకులు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే.. మన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి.. ఏం జరుగుతోంది..? అనేది మనమంతా చూడాల్సి ఉంది. రాష్ట్రం బాగుండాలని అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఇక్కడి రాజకీయ పరిణామాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఒక యువకుడు గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీ పడి ఉద్యోగాన్ని అవలీలగా సంపాదించుకునే పరిస్థితి ఉందా? మీ మనస్సాక్షినే అడగండి. ఏదైనా రాత్రికి రాత్రే జరగదు. ఒక నాయకుడు ప్రణాళికాబద్ధంగా ఒక అడుగు వేస్తే.. ఆ విత్తనం చెట్టుగా కావడానికి, విజన్ ట్రాన్స్లేట్ కావడానికి కనీసం 10 నుంచి 15 ఏళ్లు పడుతుంది. అదే ఈరోజు సరైన విత్తనం వేయకపోతే ఎన్నేళ్లు గడిచినా పరిస్థితి మారదు. 10, 15 ఏళ్ల తర్వాత కూడా మన బతుకులు మారవు. ఇదే మాదిరిగా ఉంటాం. మనం లీడర్లుగా కాబోతున్నప్పుడు.. అలాంటి మంచి విత్తనాలు వేసే ఆలోచన మన మనసులో మెదలాలి. మనం చేసే పని వల్ల భవిష్యత్ తరాలు మారాలి. మరి విద్యా వ్యవస్థ మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది? గత 18 నెలలుగా ఎలాంటి అడుగులు పడుతున్నాయి? అనే తేడాను గమనించాల్సిన అవసరం చాలా ఉంది. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మన హయాంలోనే ఆ అడుగులు.. యువకులుగా మన పాత్ర కీలకమన్నది గుర్తు పెట్టుకోవాలి. మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసీచూడనట్లు వదిలేశామంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఆ దిశగా మొట్టమొదటి సారిగా అడుగులు పడింది మన హయాంలోనే అని గర్వంగా చెప్పగలను. విద్యార్థుల భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దేలా విద్యా రంగంలో మనం చాలా మార్పులు చేశాం. కేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి? వారు భావితరంతో పోటీపడి నిలబడటమే కాకుండా విజయం సాధించాలనే ఆలోచన చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే. ఆ ఆలోచన చేయగలిగిన వాడే.. లీడర్ విద్యార్థులకు ఓటుహక్కు ఉండదు కాబట్టి ఏ రాజకీయ నాయకుడూ వారి గురించి ఆలోచన చేయడు. కానీ వారే రేప్పొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిన వారు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు.. లీడర్ అవుతారు. అలాంటి అడుగులు పడింది వైఎస్సార్సీపీ హయాంలోనే అని గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదట అడుగులు.. ఇంగ్లిష్ మీడియం వైపు పడ్డాయి. ఎవరైనా నారాయణ.. శ్రీచైతన్య.. వంటి ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్లాలి? మన గవర్నమెంట్ స్కూళ్లు ఎందుకు అలా లేవు? అవి ప్రైవేట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితి ఎందుకు లేదు? ప్రైవేట్ స్కూళ్లే.. గవర్నమెంట్ స్కూళ్లతో పోటీపడే పరిస్థితిని తీసుకొచ్చినప్పుడు పేదవాడి జీవితం బాగు పడుతుందని భావించి మొట్టమొదటి విత్తనం అక్కడ నుంచి పడింది. అందులో భాగంగా వేగంగా అడుగులు వేస్తూ గవర్నమెంట్ స్కూళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. తొలిసారిగా గవర్నమెంట్ స్కూళ్లలో తప్పనిసరి ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్చాం. 3వ తరగతి నుంచే ఒక పీరియడ్గా టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ప్రతి పిల్లవాడి చేతికి పుస్తకాలతోపాటు తెలుగు–ఇంగ్లిష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా ఇచ్చాం. 8వ తరగతి నుంచి ప్రతి పిల్లాడి చేతిలో ట్యాబులు పెట్టి ప్రైవేట్ స్కూళ్ల కంటే గొప్పగా అడుగులు వేయించాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈనే కాదు.. ఏకంగా ఐబీని కూడా తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూళ్లలో పిల్లలకు పరిచయం చేశాం. జెనీవా నుంచి ఐబీ టీమ్ వచ్చి మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. 2025లో ఫస్ట్ క్లాస్.. 2026లో సెకండ్ క్లాస్.. 2027లో థర్డ్ క్లాస్.. ఇలా 2035 నాటికి మన పిల్లలు టెన్త్ క్లాస్ పరీక్షలు ఐబీలో రాసే విధంగా జెనీవా నుంచి వచ్చిన ఐబీ బృందం మన ప్రభుత్వంతో కలసి పని చేసింది. ఎందుకివన్నీ జరిగాయంటే.. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు ఇవ్వగలిగితే ఆంధ్రా కాదు.. ప్రపంచంతోనే పోటీ పడగలుగుతారు. ప్రపంచంతోనే పోటీ పడుతున్నప్పుడు.. మన పిల్లల చదువులు అక్కడి నుంచి మొదలవుతున్నాయా? లేదా? అనేది అత్యంత ముఖ్యమైన విషయం. అందుకే విద్యా వ్యవస్థను మార్చుకుంటూ వచ్చాం. ఉన్నత విద్యలో విప్లవం.. ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడుతో శ్రీకారం చుట్టి.. అమ్మ ఒడితో పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించాం. 75 శాతం హాజరు తప్పనిసరి చేశాం. గోరుముద్ద ద్వారా రోజుకో మెనూతో పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించాం. ఈ మార్పులను ఉన్నత విద్య వరకు తీసుకెళ్లాం. తొలిసారిగా ఉన్నత విద్యలో జాబ్ ఓరియెంటెడ్ కరికులమ్ తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ హయాంలోనే. మన చదువుల్లో లేనిది ఏమిటి? బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నది ఏమిటి? అని మొట్టమొదటిసారిగా బేరీజు వేశాం. అక్కడున్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు? డిగ్రీ అనేది ఇక్కడ నామ్కేవాస్తే చదువుగా ఎందుకు ఉంది? అక్కడి డిగ్రీకి విలువ ఎందుకు ఉంది? అనే విషయంపై అసెస్ చేసి ఎడెక్స్ను తీసుకొచ్చాం. ప్రముఖ ‘ఐవీ లీగ్’ కాలేజీలు, స్టాన్ఫర్డ్, ఎంఐటీ లాంటి పెద్ద యూనివర్సీటీల డిగ్రీలను మన కోర్సులో భాగం చేస్తూ.. సర్టిఫికెట్లు కూడా వారి దగ్గరి నుంచే వచ్చే విధంగా.. క్రెడిట్లు కూడా వారే ఇచ్చేలా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలను ఆన్లైన్ కరికులమ్లో భాగం చేశాం. డిగ్రీలో నాణ్యతను పెంపొందిస్తూ తొలిసారి తప్పనిసరి అప్రెంటిస్ విధానం తీసుకొచ్చాం. విద్యాదీవెన, వసతి దీవెనకు రూ.16,800 కోట్లు ఇచ్చాం.. కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను మెరుగుపరుస్తూ ‘నాక్’ (నేషనల్ ఎస్సెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రిజి్రస్టేషన్ చేయించాం. మనం అధికారంలోకి రాకముందు 2019 నాటికి కేవలం 257 కాలేజీలకు నాక్ రిజి్రస్టేషన్ ఉంటే 2024 ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 437కి తీసుకెళ్లాం. అంతేకాకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదని, అప్పులపాలు కాకూడదని తాపత్రయపడుతూ మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన పథకాన్ని తీసుకొచ్చాం. ఆ ఒక్క పథకం కిందనే రూ.12,609 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి త్రైమాసికం అయిపోగానే దానికి సంబంధించిన ఫీజులు క్రమం తప్పకుండా పిల్లల తల్లుల ఖాతాల్లో వేశాం. హాస్టల్ ఖర్చుల కింద వసతి దీవెన ద్వారా క్రమం తప్పకుండా ఇచ్చాం. డిగ్రీ పిల్లలకు ఏటా రూ.20 వేలు రెండు విడతల్లో ఇచ్చాం. ఏటా రూ.1,100 కోట్లు ఏప్రిల్లో ఇచ్చేలా అడుగులు పడ్డాయి. ఒక్క వసతి దీవెన కింద మొత్తం రూ.4,275 కోట్లు ఇచ్చాం. ఇలా పిల్లలు గొప్ప చదువులు చదవాలని భావిస్తూ ఉన్నత విద్యా రంగంలో విద్యాదీవెన, వసతి దీవెన కింద రెండు పథకాల కోసం ఏకంగా రూ.16,800 కోట్లు ఖర్చు చేసింది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. దీనివల్ల పేద, మధ్య విద్యార్థులు ఎవరూ ఫీజులు కట్టలేక చదువులు మానేయాల్సిన పరిస్థితులు రాకుండా అడుగులు పడ్డాయి. 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలిచంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడికల్ కాలేజీలను కాపాడుకునేందుకు పార్టీ కార్యాచరణ చేపట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమంలా సాగుతోంది. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు అన్నింటిలో ఇన్వాల్వ్ కావాలి. తటస్థులను కూడా కూడగట్టి నడవాలి. ఈనెల 12న నియోజకవర్గాల్లో ర్యాలీలను విజయవంతం చేయాలి. సీఎం చంద్రబాబు షాక్ తిని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే స్థాయిలో నిర్వహించాలి. డిసెంబరులో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఆందోళన చేపట్టి చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచుదాం. పార్టీ పరంగా అన్ని కమిటీల నిర్మాణం జరుగుతోంది. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు అవుతున్నాయి. గ్రామస్థాయిలో విద్యార్థి, యువజన అనుబంధ విభాగం కూడా రావాలి. చైతన్యం అక్కణ్నుంచే మొదలు కావాలి. 18 నెలలుగా అంతా తిరోగమనం..ఈ రోజు ఏం జరుగుతోంది? గత 18 నెలలుగా అంతా తిరోగమనం. స్కూళ్ల దగ్గరి నుంచి మొదలు పెడితే.. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. టోఫెల్ క్లాస్లు ఎత్తివేశారు. సబ్జెక్టు టీచర్ కాన్సెప్టు గాలికి ఎగిరిపోయింది. 8వ తరగతి నుంచి పిల్లలకు ట్యాబ్లు ఆపేశారు. గోరుముద్ద కింద నాసిరకం ఆహారం పెడుతున్నారు. ఉన్నత విద్యా రంగం పరిస్థితి చూస్తే.. పిల్లలు బాగా చదివితే వాళ్లెక్కడ గొప్పవారు అవుతారనే బాధ చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సెపె్టంబరు చివరి వరకు ఏడు త్రైమాసికాల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే! గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ ఏప్రిల్లో వెరిఫై చేసి మే నెలలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాసి దాన్ని ఆపించాడు. ఎన్నికల తరువాతైనా చంద్రబాబు ఇవ్వాలి కదా? అక్కడి నుంచి ఫీజులకు బ్రేక్ పడింది. ఇప్పటికి ఏడు త్రైమాసికాలు. డిసెంబరుతో మరో త్రైమాసికం జోడవుతుంది. ఒక్కో త్రైమాసికానికి రూ.650 కోట్ల నుంచి రూ.700 కోట్లు. ఏకంగా దాదాపు రూ.4,900 కోట్లు పెండింగ్లో ఉంటే ఈ ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. అంటే రూ.4,200 కోట్లు బకాయి పెట్టారు. ఈ డిసెంబరు వస్తే మరో రూ.700 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. వసతి దీవెన కింద ఏటా రూ.1,100 కోట్లు ఇవ్వాలి. రెండేళ్లలో రూ.2,200 కోట్లు బకాయి పెట్టారు. రెండింటికి కలిపి చంద్రబాబు దాదాపు రూ.6,400 కోట్లు బకాయి పెట్టారు. దీంతో పిల్లలు చదువులు మానేస్తున్నారు. సర్టిఫికెట్లు రాని పరిస్థితి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలకు తోడుగా వైఎస్సార్సీపీ నాయకత్వం తీసుకోకపోతే చదువులు మానేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెబుతా.. జీఈఆర్ (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) అంటే . మీ అందరికీ తెలుసు. ఇంటర్ తర్వాత ఉన్నత విద్యలో ఎంతమంది చేరుతున్నారని చూస్తే.. మన ప్రభుత్వం రాక ముందు 2018–19లో జీఈఆర్ 27.86 శాతం ఉంటే, మన ప్రభుత్వం వచ్చాక 2023–24 నాటికి జీఈఆర్ 37 శాతానికి పెరిగింది. అది ఇప్పుడు మళ్లీ రివర్స్ అయింది. ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గుతున్నారు. చదువులు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. మరోవైపు ఉద్యోగాలు, పిల్లల భవిష్యత్ చూస్తే ఆందోళనకరం. స్వయం ఉపాధికి ప్రోత్సాహం..నిజంగా మెరుగైన ఉద్యోగాలు సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్లో (స్వయం ఉపాధి రంగం) వస్తాయి. అది ఒక విప్లవం. ఆ దిశగానే ఆసరా, సున్నా వడ్డీకే రుణాలు, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం అమలు చేశాం. అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద నిలబడేలా ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, అమూల్ లాంటి సంస్థలతో టై అప్ చేశాం. చేయూత ద్వారా దాదాపు 26 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. ఆసరా, సున్నా వడ్డీ ద్వారా దాదాపు కోటి మందికిపైగా మేలు జరిగింది. నేతన్న నేస్తం, వాహనమిత్ర, తోడు, చేదోడు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. వ్యవసాయం దండగ కాదు.. పండగరాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. చంద్రబాబు నోటి నుంచి వ్యవసాయం దండగ అనే మాటలు వస్తే.. మేం పండగ అని చేసి చూపాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్న ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడిపించాం. రైతులకు ఏ విపత్తు, ఆపద వచ్చినా వెంటనే ఆదుకున్నాం. గతంలో రాష్ట్రంలో 6 పోర్టులు మాత్రమే ఉంటే, కోవిడ్ ఉన్నప్పటికీ మన హయాంలో మరో 4 కొత్త పోర్టులకు శ్రీకారం చుట్టాం. అందులో మూడు ప్రభుత్వ రంగంలోనివే. మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల పనులు చాలా వేగంగా జరిగాయి. సగానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఒక్క కాకినాడ పోర్టు మాత్రం ప్రైవేటు రంగంలో అభివృద్ధి జరుగుతోంది. ఇంకా 10 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల పనులు చురుగ్గా కొనసాగాయి. నాడే అదానీ డేటా సెంటర్..మన హయాంలోనే అదానీ డేటా సెంటర్ ప్రాసెస్ జరిగింది. అసలు డేటా రావాలంటే కేబుల్ కావాలి కదా? సింగపూర్ నుంచి సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ హయాంలోనే లేఖ కూడా రాశాం. అవన్నీ జరిగాయి, మనం చేశాం కాబట్టే ఇప్పుడు డేటా సెంటర్ వస్తోంది. విశాఖ అభివృద్ధికి అడుగులు వేశాం కాబట్టే గూగుల్ వస్తోంది. భోగాపురం ఎయిర్పోర్టు భూసేకరణ చేసి, వేగంగా అన్ని అనుమతులు పొంది, పనులు కూడా చేశాం. అందుకోసం దాదాపు రూ.900 కోట్లు ఖర్చు చేశాం. అవన్నీ మనం చేశాం కాబట్టి పురోగతి కనిపిస్తోంది. అలా మంచి విత్తనాలు నాటాం. విత్తనం వేయకపోతే చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? మేం ఎన్ని ఉద్యోగాలిచ్చామో మీ లెక్కలే చెబుతున్నాయి..వైఎస్సార్సీపీ హయాంలో ఒక్క ప్రభుత్వ రంగంలోనే దాదాపు 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ రంగంలో శాశ్వత ఉద్యోగాలు 2,13,662 ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో మన కళ్లెదుటే కనిపిస్తారు. వాటిలో దాదాపు 1.26 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. వైద్య ఆరోగ్య రంగంలో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత లేకుండా చేశాం. దేశంలో 61 శాతం స్పెషలిస్టు వైద్య నిపుణుల కొరత ఉంటే, మన హయాంలో ఏపీలో అది కేవలం 4 శాతం మాత్రమే ఉంది. అలా 17 వేల మందిని నియమించాం. పాఠశాల విద్యలో 10,300 పోస్టులు భర్తీ చేశాం. టీచర్ పోస్టులు ఇచ్చాం. డీఎస్సీ సమస్యలన్నీ పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చాం. ఇవి కాకుండా 2.66 లక్షల మంది వలంటీర్లు. ఆప్కాస్లో మరో లక్ష మంది, 18 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్లో, రేషన్ డోర్ డెలివరీ వాహనాల్లో 20 వేల ఉద్యోగాలు కల్పించాం. ఇవి కాకుండా ఎంఎస్ఎంఈలు 4.78 లక్షల యూనిట్లు గ్రౌండ్ చేయడం ద్వారా దాదాపు 33 లక్షల ఉద్యోగాలను సృష్టించగలిగాం. మన హయాంలో వాటికి క్రమం తప్పకుండా రాయితీలు ఇచ్చి భరోసా కల్పించి నిలబెట్టాం. ఉద్యోగ, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలది చాలా కీలక పాత్ర. వీటిలో పెట్టుబడి తక్కువే అయినా ఉద్యోగాలు ఎక్కువ. అదే పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడి ఎక్కువ.. ఉద్యోగాలు తక్కువ. ఇంకా లార్జ్ అండ్ మెగా రంగంలో మరో లక్ష ఉద్యోగాల కల్పన. అన్నీ కలిపితే.. 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సృష్టించగలిగాం. ఇవి మనం చెప్పే లెక్కలు కాదు. వాళ్లు తయారు చేసుకున్న సామాజిక సర్వే నివేదికలో చూపించిన లెక్కలే ఇవన్నీ! మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దారుణం..చంద్రబాబు చేస్తున్న మరో దారుణమైన పని.. కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. ఆయన మంచి చేయకపోగా చెడు చేస్తున్నారు. స్కూళ్లు, ఆస్పత్రులు, ఆర్టీసీ బస్సులను గవర్నమెంట్ ఎందుకు నడుపుతుందో ఆలోచన చేశారా? ప్రభుత్వం వాటిని నిర్వహించకుంటే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పేదలు దోపిడీకి గురవుతారు. దీనికి చెక్ పడాలంటే ప్రభుత్వమే వాటిని నిర్వహించాలి. 1923 నుంచి 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు కేవలం 12 మాత్రమే. వాటిలో ఒక్కటి కూడా చంద్రబాబు కట్టలేదు. మన ప్రభుత్వ హయాంలో కోవిడ్ ఉన్నప్పటికీ, ఏకంగా 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టాం. ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటైతే స్థానికంగా సూపర్ స్పెషాలిటీ సేవలు టీచింగ్ ఆస్పత్రి మాదిరిగా అందుబాటులోకి వస్తుంది. ఆ స్థాయిలో వైద్య సేవలందుతాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు, స్టూడెంట్లు, మెడికోస్, నర్సింగ్ విద్యార్థులు వీరంతా అక్కడే పని చేస్తారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం చేరువలో అందుబాటులోకి వస్తుంది. ఎప్పుడైతే అవన్నీ అందుబాటులోకి వస్తాయో ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఆగిపోతుంది. 50 కి.మీ. లోపే పేదలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతున్నప్పుడు ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.లక్షలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. పేదలకు, మధ్య తరగతికి ఒకవైపు మంచి చేస్తూ మరోవైపు ఆ 17 మెడికల్ కాలేజీల ద్వారా 2,550 మెడికల్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఫ్రీగా పిల్లలకు దక్కుతాయి. మిగిలిన సీట్లు కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీల కంటే తక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లుగా మారి మన ప్రాంతంలోనే సేవలు కూడా అందిస్తారు. మనం చేపట్టిన మెడికల్ కాలేజీల్లో మన హయాంలోనే 7 కాలేజీలు పూర్తయ్యాయి. 5 కాలేజీల్లో తరగతులు కూడా మొదలై మూడు బ్యాచ్లు జరిగాయి. పాడేరు మెడికల్ కాలేజీలో గత ఏడాది క్లాస్లు ప్రారంభమయ్యాయి. గత ఏడాది పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తామంటే వద్దని అడ్డుపడి చంద్రబాబు లేఖ రాశారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం రూ.3,000 కోట్లు ఖర్చు చేశాం. మిగిలిన 10 కాలేజీలకు మరో రూ.5 వేల కోట్లు అవసరం. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే చాలు. అంటే ఏటా రూ.1,000 కోట్లు మాత్రమే వెచ్చించాలి. కానీ ఆ మనిíÙకి మనసు రాదు.. అది కూడా ఖర్చు చేయకుండా ఏకంగా వాటిని అమ్మేస్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్ చూస్తే రూ.2.50 లక్షల కోట్లు. మెడికల్ కాలేజీలకు కావాల్సింది ఏటా కేవలం రూ.1000 కోట్లు. ఆయన పెట్టపోతే పోయే..! మేం వచ్చిన తరువాత చేసుకుంటాం. కానీ ఇలా స్కామ్లు చేస్తూ అమ్మడం ఏమిటి? ఈ స్థాయికి దిగజారిపోయిన వ్యక్తిని నిలదీయడం యువత నుంచే మొదలు కావాలి!! ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎ.రవిచంద్ర, తోట రాంజీ, శ్రీవాత్సవ, చెవిరెడ్డి హర్షిత్, ప్రణయ్రెడ్డి, వైస్ ప్రెసిడెంట్స్ ఓబుల్రెడ్డి, నీలి ఆనంద్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యువతకు జగన్ మెసేజ్.. మీరంతా జెన్-Z తరంలో ఉన్నారు
-
కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి: YS జగన్
-
YS Jagan: వ్యవసాయం దండగ అన్నావ్.. మరి నువ్వు ఏం తింటున్నావ్
-
YS Jagan: పిల్లలను చదివించడం భారం కాదు అందుకే ప్రతి తల్లిదండ్రులకు మాటిస్తున్న..
-
YSRCP విద్యార్ధి విభాగం లీడర్లతో వైఎస్ జగన్ సమావేశం
-
చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని ఆరోపించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు మంచి చేయకపోగా.. చెడు చేస్తున్నారని అన్నారు. అలాగే, సమాజంలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని గుర్తు చేశారు. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించారు. అనంతరం వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘కల్మషం లేని రాజకీయ వ్యవస్థ మీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. మంచి రాజకీయాలకు బీజం విద్యార్థి దశలోనే పడుతుంది. మీరంతా జెన్ -Z తరంలో ఉన్నారు. భావి తరానికి మీరంతా దిక్సూచీ. రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలి. పలానా వాడు మన రాజకీయ నాయకుడు అని కాలర్ ఎగరేసేకునేలా మనం ఉండాలి. మనలో ఆ గుణాలను, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఈ రాష్ట్రం మనది కాబట్టి.. ఈ రాష్ట్రం బాగుండాలని మనమంతా కోరుకుంటున్నాం. ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితిలోకి ప్రతి విద్యార్థీ వెళ్లాల్సిన అవసరం ఉంది.కాని, ఆ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?.ప్రపంచంతో పోటీ పడాలి.. ఒక్క రాత్రిలోనే ఇవన్నీ జరగవు. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాలి. ఒక నాయకుడు తన విజన్లో భాగంగా ఒక అడుగు వేస్తే, అవి ఫలితాలు ఇవ్వడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది. అలాంటి ఆలోచనలు మనం చేయాలి. అది రియాల్టీలోకి వచ్చినప్పుడు భవిష్యత్తు తరాలు మారుతాయి. సమాజంలో విద్యార్థులుగా మీ పాత్ర అత్యంత కీలకం. మన ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థలో గొప్ప మార్పులు తీసుకు వచ్చాం.కేజీ నుంచి పీజీ వరకూ మంచి చదువులు ఉండాలని భావించాం. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించేలా మన ప్రభుత్వంలో ఆలోచనలు చేశాం.స్కూలుకు వెళ్లే పిల్లలకు ఓట్లు లేవని, ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి పట్టించుకోదు. కాని, రేపు భవిష్యత్తును నిర్దేశించేది వాళ్లే. అందుకని స్కూళ్ల నుంచే మనం విప్లవాత్మక చర్యలు తీసుకు వచ్చాం. ప్రైవేటు స్కూల్స్తో పోటీపడేలా ప్రభుత్వ స్కూల్లను తీర్చిదిద్దాం. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం ప్రారంభించాం. ఆ స్థాయి విద్యను మన పిల్లలకు మనం ఇవ్వాలి.6,200 కోట్లు బకాయిలు.. మనకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదు, మన పోటీ ప్రపంచంతోనే. ఎడెక్స్తో ఉచితంగా ఆన్లైన్ కోర్సులు ఇప్పించాం. ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్శిటీలకు చెందిన కోర్సులు అందుబాటులోకి ఇచ్చాం. ఆయా యూనివర్శిటీలు సర్టిఫికెట్లు ఇచ్చేలా చేశాం. డిగ్రీల్లో కొత్త కోర్సులు తీసుకు వచ్చాం. మనం రాక ముందు 257 కాలేజీలకు మాత్రమే నాక్ రిజిస్ట్రేషన్ ఉంటే 2024 నాటికి 432కి పెరిగాయి. పూర్తి ఫీజు రియింబర్స్మెంట్ తీసుకు వచ్చాంది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. కేవలం విద్యాదీవెన అనే ఒకే ఒక పథకం కింద రూ.12,609 కోట్లు ఇచ్చాం. వసతి దీవెన కింద ప్రతి విద్యార్థికీ ఏడాదికి రూ.20వేలు ఇచ్చాం. చదువుల కోసం అప్పులు పాలు కాకుండా చూశాం. కాని, ఇవాళ అన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. పిల్లలు చదవకూడదు అనే ఉద్దేశంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. ఏడు త్రైమాసికాల నుంచి ఫీజు రియింబర్స్మెంట్ పెండింగ్లో పెట్టారు. ఫీజు రియిబంర్స్మెంట్లో రూ.4,200 కోట్లు పెండింగ్ ఉంది. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు పెండింగ్. మొత్తంగా రూ.6,200 కోట్లు బకాయి పెట్టారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాయకత్వం తీసుకోవాలి.1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే 6.3 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 52 వేల మందిని ఆర్టీసీలో రెగ్యులరైజ్ చేశాం. హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్లో కూడా భారీగా ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఉద్యోగాలను కోత కోస్తున్నారు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 4.7లక్షల యూనిట్ల ద్వారా 33లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తోడుగా ఉందనే భావన ఎంఎస్ఎంఈలకు ఉండేది. క్రమం తప్పకుండా వారికి ప్రోత్సాహకాలు అందేవి. అందుకనే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చాయి.చంద్రబాబు చేసిందేంటి?. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడు. అసలు చంద్రబాబు చేసింది ఏముంది?. సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైఎస్సార్సీపీ. అదానీ-గూగుల్కు 2022లో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉంది. మనం ఇక్కడ కూడా భూములు ఇచ్చాం, అన్ని ఏర్పాట్లూ జరిగాయి. ఆరోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తోంది. మూలపేట ప్రారంభించి మనం కట్టుకుంటూ వెళ్లాం కాబట్టి ఇప్పుడు మూలపేట పోర్టు జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్టుకు అన్ని అనుమతులు తీసుకొచ్చి మనం శరవేగంగా నిర్మాణాలు చేశాం.మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రపు పని. మంచి చేయకపోగా, చెడు చేస్తున్నాడు. 2019 వరకూ ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12. అప్పటికి చంద్రబాబు ఒక్కటి కూడా తేలేదు. ఐదేళ్లలో కోవిడ్ రెండేళ్లు తీసేస్తే, మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు తీసుకు వచ్చాం. ప్రతి జిల్లాకో గవర్నమెంటు మెడికల్ కాలేజీ తీసుకు వచ్చాం. 17 కొత్త మెడికల్ కాలేజీల వల్ల 2,550 సీట్లు అందుబాటులోకి వస్తాయి. సగం సీట్లు ఉచితం, మిగిలిన సీట్లు తక్కువ రేటుకే అందుబాటులోకి వస్తాయి. మన పిల్లలు ఇక్కడే డాక్టర్లు అయ్యే అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజీలు సీట్లు ప్రారంభం అయ్యాయి. పాడేరు కూడా ఎన్నికల తర్వాత ప్రారంభం అయ్యింది. 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.సీట్లు వద్దని లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు.. పులివెందుల కాలేజీకి 50 సీట్లు కేంద్రం ఇస్తే.. వద్దంటూ చంద్రబాబు లెటర్ రాశాడు. మిగిలిన 10 కాలేజీలకు రూ.5వేల కోట్లు పెడితే చాలు. ఏడాదికి రూ.వేయి కోట్లు పెట్టినా చాలు. కాని, చంద్రబాబుకు మనసు రాదు. ఆయన పెట్టకపోయినా పర్వాలేదు, అలా వదిలేస్తే మేం వచ్చాక కట్టుకుంటాం. స్కాములు చేస్తూ అమ్మేస్తున్నాడు. ఇలాంటి వాటిపై ప్రశ్నలు వేసి, నిలదీసే బాధ్యత మీది. రాష్ట్రంలో కోటి సంతకాల కార్యక్రమం జరుగుతోంది. మీరంతా చురుగ్గా పాల్గొనాలి. గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం రావాలి. మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది. మీరు ఎవర్ని డిసైడ్ చేస్తే.. ఆ ప్రభుత్వం వస్తుంది. విద్యార్థి, యువకులకు ఉన్న శక్తి అది. తటస్థులను, భావసారూప్యత ఉన్న వ్యక్తులను కూడా కలుపుకోవాలి. అసెంబ్లీ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు 11 నుంచి 12వ తేదీకి మార్పు జరిగింది. డిసెంబర్లో ఫీజు రియింబర్స్మెంట్పై ఆందోళనలు ఉంటాయి. అంతవరకూ చంద్రబాబుకు సమయం ఇద్దాం అని సూచించారు. -
‘2027లో వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర’
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రజా సంకల్ప పాదయాత్ర మొదలు పెట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కార్యాలయ ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ 341 రోజులపాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలగుండా 134 నియోజకవర్గాల్లో అన్నివర్గాలకు చెందిన లక్షలాది మందిని పలకరించారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో తనకు ఎదురైన అనుభవాలను, ప్రజల ఆకాంక్షలను వివరిస్తూ వాటికి తాను ఏం చేయబోతున్నానో వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు వివరించడమే కాకుండా అధికారంలోకి రావడంతోనే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజా పాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా ట్రెండ్ సెట్ చేశారని పార్టీ నాయకులు తెలియజేశారు.సమాజంలో ఉన్న ఆర్థిక, సామాజిక అసనమానతలు తొలగించేలా నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందించడమే మార్గంగా భావించి ఆ రంగాల్లో వినూత్న మార్పులు తీసుకొస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దురహంకార, ప్రజా వ్యతిరేక అవినీతి పాలనకు వ్యతిరేకంగా 2027నుంచి వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, సాకె శైలజానాథ్, మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్కుమార్, మురుగుడు హనుమంతరావు, వరుదు కళ్యాణి, రుహుల్లా, వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.పాదయాత్ర సాహసోపేత నిర్ణయం: మాజీ మంత్రి మేరుగు నాగార్జున దేశ రాజకీయ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు ఇది. వైయస్ జగన్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం రాష్ట్ర చరిత్రను మార్చేసింది. తన పాదయాత్ర ద్వారా అడుగడుగునా అన్ని వర్గాల వారిని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ నేనున్నానని హామీ ఇచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ తన ఐదేళ్ల పాలనలో అమలు చేసి పాలనలోనూ దిక్సూచిగా నిలిచారు.మళ్లీ జగన్ ప్రజా పాలన వస్తుంది: మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజల కష్టాలను, ఆకాంక్షలను దగ్గర్నుంచి చూసిన పార్టీ అర్టీ అధ్యక్షులు వైయస్ జగన్, వాటికి పరిష్కారాలను వెతుకుతూ ఆసాంతం ముందుకుసాగారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే లక్ష్యంగా హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక ఓటేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైయస్సార్సీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రజా పాలన వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నా. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు: మాజీ మంత్రి పేర్ని నాని దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్, నిరంతరం ప్రజా శ్రేయస్సు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకుసాగారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, వేధింపులు, కేసులు, ఒత్తిళ్లు ఎదురైనా ఏనాడూ వెనకడుగు వేయలేదు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. తన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా 2,516 గ్రామాల ప్రజలను పలకరించి వారి ఆకాంక్షలను స్వయంగా తెలుసుకున్నారు. ఆప్యాయమైన తన పలకరింపు, చిరునవ్వుతో ప్రతి గుండెను తాకారు.చిన్నారులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, రైతులు, ఆటో డ్రైవర్లు, లాయర్లు, వృత్తి పనులు చేసుకునే కార్మికులు, కౌలు రైతులు.. ఇలా అన్ని వర్గాలను పలకరించి అక్కున చేర్చుకున్నారు. వారి కష్టాలను విని తానొస్తే ఏం చేయబోయేది వివరించారు. 124 బహిరంగ సభల ద్వారా పాదయాత్రలో తాను చూసిన అంశాలను, తన అనుభవాలను వివరించడంతోపాటు ప్రజాభిలాషకు అనుగుణంగా అధికారంలోకి వస్తే ఏం చేయబోయేది కూడా ఎప్పటికప్పుడు స్పష్టంగా చెబుతూ వచ్చారు. 55 ఆత్మీయ సమ్మేళనాల ద్వారా కుల వృత్తులను బతికించడానికి ఏం చేయాలనే దానిపై కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు.వైద్య విప్లవం తెచ్చిన ఘనత జగన్దే..సింగిల్గా పోటీ చేసి 151 స్థానాల్లో భారీ విజయం నమోదు చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించారు. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో తన పాలన ద్వారా చూపించారు. సమాజంలో వెనుకబాటుకు కారణం నిరక్ష్యరాస్యత అని గ్రహించి రాష్ట్రంలో విద్యావిప్లవం తీసుకొచ్చారు. ఖరీదైన కార్పొరేట్ వైద్యం చేయించుకునే క్రమంలో అప్పులపాలై కుటుంబాలు చితికిపోవడమో లేదా వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు మార్చాలని వైద్య విప్లవం తీసుకొచ్చారు. విద్య, వైద్య రంగాల్లో నాడు-నేడు కార్యక్రమం చేపట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పేదవాడికి వైద్యం మరింత చేరువ చేయాలని తపించి తన ఐదేళ్ల పాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించి 7 కాలేజీలను పూర్తి చేసిన ఘనత జగన్కే దక్కుతుంది.ఢిల్లీలో నాటి కేజ్రీవాల్ ప్రభుత్వం 800 స్కూల్స్ను పదేళ్లలో మార్చి చూపిస్తే, వైఎస్ జగన్ హయాంలో (కరోనాతో రెండేళ్లు పోయినా) మూడేళ్లలో 16 వేల పాఠశాలలను కార్పొరేట్కి దీటుగా తీర్చిదిద్దారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ బడుల్లో సీట్ల కోసం రికమండేషన్ చేయాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేలను కోరారంటే ఎంతగొప్పగా తీర్చిదిద్దారో అర్థం చేసుకోవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులను నాశనం చేశారు. ఇంగ్లిష్ మీడియం రద్దు చేశారు. వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు ధన దాహంతో ప్రైవేటుపరం చేస్తున్నాడు. వైద్య విద్య చదవాలన్న పేదవిద్యార్థుల ఆశలకు గండి కొట్టాడు. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. పెత్తందారీ విధానాలతో పేదలకు విద్య, వైద్యం దూరం చేస్తున్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నందుకు రాష్ట్ర ప్రజలంతా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలను బలితీసుకుంటున్నది చంద్రబాబే..మోంథా తుపాన్తో దెబ్బతిన్న పొలాలను పరిశీలించి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు అండగా నిలబడాలని వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు వెళితే.. ఎవర్నీ చంపకుండా రావాలంటూ నారా లోకేశ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. సభలు, పబ్లిసిటీ స్టంట్ల ద్వార అమాయకుల ప్రాణాలను బలి పెట్టే లక్షణం చంద్రబాబుదని మర్చిపోయినట్టున్నాడు. ఎన్నిలకు ముందు చంద్రబాబు నిర్వహించిన కందుకూరు సభలో ఏడుగురు, గుంటూరు సభలో ముగ్గుర్ని పొట్టనపెట్టుకున్నాడు. గుంటూరులో చీరల పంపిణీ పేరుతో పేదలను బలితీసుకున్నాడు.కూటమి ప్రభుత్వం వచ్చాక ఆలయాల్లో తొక్కిసలాటలు జరిగి దేవుడ్ని చూడ్డానికి వచ్చిన భక్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సింహాచలం గుడిలో గోడ కూలి ఏడుగురు, తిరుపతిలో 9 మంది చనిపోయారు. ఏకాదశి రోజున కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన భక్తులు తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. దీన్ని ప్రైవేటు ఆలయం అని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటు. శాంతిభద్రతల శాఖను నిర్వహించే చంద్రబాబు కనీస బాధ్యత తీసుకోలేదు. చేతకానివారు, అవినీతిపరులు, తప్పుడు ఆలోచనలు ఉన్నవారు అధికారంలో ఉంటే ప్రజలకు శాపాలుగా మారతాయని చెప్పడానికి ఈ వరుస దుర్ఘటనలే ఉదాహరణలు.వైఎస్ జగన్ ఉద్దేశించి మాట్లాడుతున్న నారా లోకేశ్.. మోంథా తుపాన్తో రైతులు నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఆయన మాత్రం ముంబైలో కుటుంబంతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేశాడు. నేనే గెలిపించానని ప్రచారం చేసుకుంటున్నారు. రైతులు అల్లాడిపోతుంటే అమిత్షా కొడుకుతో ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం గొప్ప అనుకోవడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తితోనే రాబోయే రోజుల్లో 2027 నుంచి మళ్లీ మరోసారి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభం అవుతుంది. మళ్లీ ప్రజలందర్నీ నేరుగా పలకరించి అక్కున చేర్చుకుంటారు. -
ప్రజా సంకల్పం.. జగన్ పాదయాత్రకు 8 ఏళ్లు పూర్తి
-
Perni Nani: వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఎనిమిదేళ్లు...
-
అడ్డుకుంటే ఆగేదా.. జనాభిమానం!
వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలతో చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని కూటమి సర్కారు వణికిపోతున్నట్లుగా ఉంది. ప్రతి పర్యటన సందర్భంగా పలు రకాల ఆంక్షలు పెట్టి.. ఎలాగైనా సరే ఆ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. పాపం.. వారి ప్రయత్నాలేవీ ఫలించడం లేదు సరికదా.. జగన్ సభలు, పర్యటనలు జనసంద్రాలవుతున్నాయి. తాజాగా జగన్ చేసిన కృష్ణ జిల్లా పర్యటనలో కేవలం 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఏడు గంటల సమయం పట్టిందంటే.. జనాభిమానం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సహజంగానే ఇవన్నీ ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర సంస్థలకు కడుపు మంట మిగులుస్తుంది. వారి కథనాలు చూస్తే అవి ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా స్వప్రయోజనాల కోసమే మీడియాను నడుపుతున్నట్లు తేటతెల్లమవుతుంది. అయితే జగన్ టూర్కు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోందన్న విషయాన్ని వారు చెప్పకనే చెప్పేస్తున్నారు. ‘‘అడుగడుగునా అరాచకమే’’ అన్న ఈనాడు కథనం చూడండి... జగన్ పోలీసులు పెట్టిన షరతులను ఉల్లంఘించారన్నది ఏడుపు. ఆంధ్రజ్యోతి కూడా జగన్ టూర్తో జనం పాట్లు పడ్డారని గొంతు చించుకుంది. అంతేకానీ ఈ ఎల్లోమీడియా పత్రికలు జనం రాలేదని మాత్రం రాయలేకపోయాయి. రాజకీయ నాయకుల పర్యటనల్లో సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. వాటిని నియంత్రణకే పోలీసులు ఉంటారు. కానీ వారు ఆ పని చేయకుండా ఎక్కడెక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వస్తున్న జగన్ అభిమానులను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2019-24 మధ్య ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణలు కూడా చాలా చోట్ల పర్యటించారు. కానీ ఎన్నడూ ఈ రోజు జగన్ పర్యటనలకు పెట్టినన్ని ఆంక్షలు పెట్టలేదు. శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఇంటినుంచి బయటకు వెళ్లవద్దని, ఫలానా టూర్ చేయవద్దని పోలీసులు చంద్రబాబును చెబితే ఆయన ఊరుకోలేదు సరికదా... అంతెత్తున విమర్శించారు. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా వారిపై దుర్భాషలాడారు. హెచ్చరికలు జారీ చేశారు. పుంగనూరు, అంగళ్లు వద్ద పార్టీ కార్యకర్తలను వైఎస్సార్సీపీపై ఉసికొల్పిన సందర్భాన్ని ఎల్లో మీడియా మర్చిపోయి ఉండవచ్చు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు దూకుడు కారణంగా ఒక కానిస్టేబుల్ కన్ను పోయింది. పోలీసు వాహనం దగ్ధమైంది. అప్పట్లో అవన్ని ప్రజాస్వామ్యయుతంగా జరిగినట్లు, అదంతా ప్రభుత్వ తప్పు, పోలీసుల వైఫల్యం అని చెప్పుకుంది టీడీపీ, చంద్రబాబు బృందం. కందుకూరు వద్ద నడిరోడ్డు మీద సభ పెట్టినప్పుడు తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించినప్పుడు ఎల్లో మీడియాకు జనం పాట్లు కనిపించలేదు. వారికి ఇవి నరకంగా అనిపించలేదు. గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు సభ పెట్టి చీరల పంపిణీ చేసినప్పుడు జరిగిన తొక్కిసలాట వీరికి గుర్తుకు రాదు. విజయవాడలో ఒకసారి పవన్ కళ్యాణ్ రోడ్ షో చేసినప్పుడు గంటలకొద్ది ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మాబోటి వాళ్లం కూడా ఒక సందర్భంలో ట్రాఫిక్లో చిక్కుకున్నాం. జగన్ సీఎంగా ఉండగా... బహిరంగ సభల్లో తొక్కిసలాటలు, మరణాలు లేకుండా చూడడానికి, నిర్దిష్ట ప్రదేశాలలో మాత్రమే సభలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం జీవో ఇస్తే టీడీపీ, ఎల్లో మీడియాకాని రచ్చ రచ్చ చేశాయి. సంపాదకీయాలు సైతం రాసి గగ్గోలు పెట్టాయి. కోర్టుకు వెళ్లి రద్దు చేయించాయి! జగన్ టూర్లో ఎక్కడైనా తొక్కిసలాటలు జరిగాయా? పొరపాటున వాహనం తగిలి ఒక వ్యక్తి మరణించిన ఘటన తప్ప ఇంకేమైనా ప్రమాదాలు జరిగాయా? కృష్ణా జిల్లా టూర్లో జగన్ కాన్వాయితోపాటు ఇతర ప్రయాణికుల వాహనాలు, బస్సులు అన్నీ మామూలుగానే నడిచాయి. జనం గూమికూడిన చోట ట్రాఫిక్ కొద్దిసేపు ఆటంకం కలిగి ఉండవచ్చు. జనం పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్కు స్వాగతం చెబుతుంటే ఆయన వారిని కాదని ఎలా వెళ్లిపోగలుగుతారు? ఇవన్ని ప్రజాస్వామ్యంలో భాగం కాదా? జగన్ టూర్ వల్ల జనానికి ఇబ్బందులు వస్తుంటే, అధికార హోదాతో తిరుగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల టూర్ల వల్ల ఇంకెంత ఇబ్బంది కలుగుతుంది? పర్యటన ప్రాంతానికి రావడానికి అరగంటో, గంట ముందునుంచే ట్రాఫిక్ నిలిపివేయడమో, నియంత్రణలు పెట్టడమో చేస్తుంటారు కదా! అప్పుడు జనం పాట్లు పడినా, నరకం చూసినా తప్పు లేదా? జనం జగన్కు నీరాజనం పలుకుతున్న వైనం కూటమి నేతలకు ఆందోళన కలిగిస్తుండవచ్చు. వైఎస్సార్సీపీ ఓటమి పాలైన ఏడాదికే జగన్ సమావేశాలకు ప్రజలు తండోపతండాలుగా వస్తూండేందుకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్ని సంగతి వారికి తెలియదా? నిజానికి పోలీసులు జగన్ టూర్పై పోలీసులు పెట్టిన షరతులు అసంబద్ధమైనవి. హైవేపై గుమి కూడకూడదట. రాకపోకలకు, ప్రజాజీవనానికి అంతరాయం కలగరాదట. జగన్ తో పాటు ఏభై మంది మాత్రమే ఉండాలని, పది వాహనాలే వెళ్లాలని, దిచక్ర వాహనాలకు అనుమతి లేదని మరో షరతు పెట్టారట. ఇలాంటి షరతులు పెట్టిన పోలీసులను విమర్శించాల్సి మీడియా వాటిని సమర్థిస్తూ కథనాలు రాయడం, ఉల్లంఘించారని వైసీపీపై ఎదురుదాడి చేయడం చూస్తే ఈనాడు మీడియా జర్నలిజం ఎంత నీచంగా మారిందో తెలుస్తుంది. అత్యంత ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడు వెళుతున్నప్పుడు జనం పోగవ్వకుండా ఎలా ఉంటారు? 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చైతన్యరథం వేసుకుని రాష్ట్రమంతటా టూర్ చేశారు.రహదారులన్నీ కిక్కిరిసిపోయేవి. అయినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దిక్కుమాలిన ఆంక్షలు పెట్టలేదు. అది వదిలేద్దం. చంద్రబాబు కుమారుడు లోకేశ్ యువగళం కార్యక్రమంపై కూడా ఇలాంటి నియంత్రణలు లేవు. సినిమా నటుడు కూడా అయిన పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పర్యటనలు జరిపిన సందర్భంలోనూ పోలీసులు ఇలాంటి షరతులు పెట్టలేదు. రాజకీయ నేతలు రోడ్లపై టూర్లు చేయకూడదని, తద్వారా ప్రజలకు అసౌకర్యం కలిగించరాదన్నదే ఎల్లో మీడియా విధానమైతే అదే మాట చంద్రబాబు పర్యటనల సందర్భంలోనూ చెప్పి ఉండాల్సింది. అప్పుడు చెప్పని సుద్దులు ఇప్పుడు చెప్పడం కచ్చితంగా ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. జగన్ తాజా టూర్లో జనం ప్రభుత్వంపైకి సంధించిన ప్రశ్నలకన్నా, ఇతర చిల్లర అంశాలే ఫోకస్ అవ్వాలన్నదే ఎల్లో మీడియా లక్ష్యం కావచ్చు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా జగన్ రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, రైతు భరోసాగా రూ.13500 చెల్లింపు మొదలైన హామీలను అమలు చేశారు.దాంతో రైతులను ఏమార్చడానికి ‘‘అన్నదాత సుఖీభవ’’ కింద తాము ఏడాదికి రూ.ఇరవై వేలు ఇస్తామని, ఇతరత్రా అన్నిప్రయోజనాలు కల్పిస్తామని టిడిపి, జనసేన తమ ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేశారు. ఇప్పుడేమో వాటిని అమలు చేయడం లేదు. ఒక ఏడాది ఎగవేసి, తదుపరి రూ.ఐదు వేలే ఇచ్చారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. మోంథా తుపాను వల్ల రైతుల వరి పంట నేలవాలి పోవడంతో చాలా నష్టపోయారు. వారికి నష్టపరిహారం ప్రకటించలేదు. పైగా పరిహారం తీసుకుంటే ధాన్యం కొనుగోలుకు బాధ్యత లేదని రైతులను బెదిరిస్తున్నారు. రైతులు వీటన్నిటిని జగన్ వద్ద ప్రస్తావించారు. అవన్ని జనంలోకి వెళతాయి కనుక ఈ రకంగా పోలీసులతో అడ్డదిడ్డమైన కండిషన్లు పెట్టించి టూర్ విఫలం చేయాలని చూశారనుకోవాలి. అయినా రైతులే వైసీపీ శ్రేణులే కాదు..సాధారణ జనం కూడా తరలిరావడం కూటమి నేతలకు, ఎల్లో మీడియాకు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి ఎనిమిదేళ్లు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభమై నేటికి ఎనిమిదేళ్లు అయ్యింది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 341 రోజులు వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. వైఎస్ జగన్ తన పాదయాత్రలో కోట్లాది మందిని కలిసి స్వయంగా వారి బాధలను విన్నారు. నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటూ భరోసా ఇచ్చారు.నాడు వైఎస్ జగన్ పాదయాత్ర 13 జిల్లాల్లో 134 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగింది. 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా వైఎస్ జగన్ ప్రయాణం చేశారు. రాష్ట్రంలో మొత్తం 3,648 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది. వైఎస్ జగన్ పాదయాత్ర రాష్ట్ర చరిత్రని మార్చేసింది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ భారీ విజయం సాధించారు. 151 అసెంబ్లీ నియోజకవర్గాలు, 22 పార్లమెంటు నియోజకవర్గాలలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఇదే సమయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, రఫుల్లా, వరుదు కళ్యాణి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. LIVE: వైయస్ జగన్ గారి ప్రజాసంకల్పం పాదయాత్రకి నేటితో 8 ఏళ్లు.. పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కటింగ్ https://t.co/Q4Bl6pxlp3— YSR Congress Party (@YSRCParty) November 6, 2025 -
నేడు YSRCP విద్యార్ధి విభాగం నేతలతో YS జగన్ భేటీ
-
ఆకలితో 'అల'మట..
‘సముద్రపు అలలపై బతుకు నావ ఎదురీత. ఆటుపోట్లు దాటుకుంటూ అలుపెరగని సుదీర్ఘ సాహస యాత్ర. కుటుంబ పోషణ కోసం ప్రాణాలొడ్డి మత్స్యకారుల చేపల వేట. వలకు పరిగె చిక్కితేనే బువ్వ దక్కేది. దినదినగండం నూరేళ్ల ఆయుష్షు.. ఇదీ మత్స్యకారుల జీవన చిత్రం’ – ఉప్పాడ నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావుతుపాను గండం దాటినా కష్టాల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారుల జీవనం ఒడ్డున పడ్డ చేపలా తయారైంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఉన్న భరోసా తమకు ఇప్పుడు లభించడంలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. తుపాను ప్రభావంతో రూ.83.21 లక్షల విలువైన 486 బోట్లు, వలలు దెబ్బతిన్నట్టు అధికారిక అంచనా. వాస్తవానికి సముద్రంలోని చేపల వేటనే నమ్ముకుని బతికే 8.50 లక్షల మంది జీవనాన్ని తుపాను అతలాకుతలం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు చేపల వేట నిషేధం కొనసాగింది. ఆ తర్వాత అరకొరగా వేట కొనసాగినా.. ఇటీవల వర్షాలు, తుపాన్ల దెబ్బకు పూర్తిగా ఆగిపోయింది. తుపాన్ గండం దాటిపోవడంతో రెండు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్తున్న మత్స్యకారులకు పరిగె కూడా పడటం లేదని వాపోతున్నారు. ‘అప్పులు తీరే మార్గంలేదు. కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఎట్టా బతికేది.’ అంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడ ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన ఏడు వేల కుటుంబాలుఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో సుమారు ఏడు వేల మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి. ఉప్పాడ గ్రామంలోని మత్స్యకార ఇళ్లు సముద్ర కోతకు గురై కూలిపోతున్నా, ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడంలేదు. తమ ఉపాధిని, ఊరిని కాపాడాలని సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ఉప్పాడ మత్స్యకారులు ఆందోళనకు దిగి పవన్కు అక్టోబర్ 10వ తేదీ వరకు డెడ్లైన్ పెట్టారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన పవన్ ‘వంద రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని’ హామీ ఇచ్చారు. తాజా తుపాను వల్ల మరింత కష్టాల్లో చిక్కుకున్న తమను పవన్ కనీసం పలకరించి భరోసా ఇవ్వకపోవడంపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న అప్పులు.. తరుగుతున్న ఆదాయం‘జగన్ మాకు ఇంటి స్థలం ఇచ్చారు. సాయం అందించారు’ అని పిఠాపురం నియోజకవర్గంలోని సుబ్బంపేటకు చెందిన సూరాడ చిన కోదండం గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు అంతటి భరోసా ప్రభుత్వం నుంచి లభించడంలేదని పేర్కొన్నాడు. ‘తీసుకున్న డ్వాక్రా రుణానికి నెలకు రూ.6 వేలు, ప్రైవేట్ అప్పుల వాళ్లకు రూ.5 వేలు, ఇల్లు గడవడానికి మరో రూ.10 వేలు కలిపి కనీసం రూ.20 వేలకుపైగా అవసరమవుతోంది. ఆదాయం లేదు. దిక్కుతోచడం లేదు’’ అని కోదండం పేర్కొన్నారు.వృత్తి రక్షణకు సహకరించాలిఉప్పాడతోపాటు సమీప గ్రామాలకు చెందిన దాదాపు 900 బోట్లపై చేపల వేటతో ఏడు వేలకుపైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం చేపల వేటపై రెండు నెలలు నిషేధం విధించింది. ఇప్పుడు వరుసగా వర్షాలు, తుపాన్లతో ఉపాధి కోల్పోయాం. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతోపాటు మా వృత్తి రక్షణకు సహకరించాలి. – ఎస్.సింహాద్రి, ఉప్పాడచేప చిక్కకపోతే పస్తులే..చేపలు చిక్కకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మాకు వేరే వృత్తి తెలియదు. ప్రభుత్వం నిత్యావసర సరుకులతోపాటు ఆర్థిక సాయం కూడా చేయాలి. మమ్మల్ని ఆదుకోవడంతోపాటు మా బతుకుదెరువును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – పుట్టా అప్పలరావు, ఉప్పాడఆక్వా రంగానికి ‘జగన్’ ఆక్సిజన్వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మత్స్యకారులకు భరోసా ఇవ్వడంతోపాటు ఆక్వా రంగానికి ఆక్సిజన్ అందించారు. మత్స్యకార భరోసా పెంచారు. బోట్లకు డీజిల్ సబ్సిడీ పెంచారు. నవరత్నాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచారు. కరోనా కష్టకాలంలోను మత్స్యకారులను ఆదుకున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడీ, ధరలు దక్కేలా చేయడం, మార్కెటింగ్ వంటి విషయాల్లో చేపలు, రొయ్యల రైతులకు జగన్ అండగా నిలిచారు. – వడ్డి రఘురామ్, మాజీ వైస్ చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీఅందరికీ సాయం అందించాలిమోంథాకు రాష్ట్రంలో మత్స్యకారులందరూ ఉపాధి కోల్పోయారు. కాగా కేవలం 23 వేల మందికి మాత్రమే 50 కిలోల బియ్యం, నిత్యావసరాలు ప్రభుత్వం అందిస్తోంది. మిగిలిన అందరికీ నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందాలి. చేపలు అమ్ముకుని జీవించే మహిళలకు కూడా సాయం అందించాలి.– అర్జిల్లి దాసు, జాతీయ మత్స్యకార సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శిగంగ పుత్రులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ అండ..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఐదేళ్లపాటు రాష్ట్రంలోని గంగపుత్రులకు కొండంత అండగా నిలిచి భరోసా కల్పించారు. మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి)తోపాటు ఆయిల్ సబ్సిడీ పెంపు, నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలు (డీబీటీ), (నాన్–డీబీటీ)తో వారు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను నిలదొక్కుకునేలా చేశారు. జగన్ కృషితో రాష్ట్రంలో వేటకు వెళ్లే బోట్ల సంఖ్యే కాకుండా.. వేటపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..» ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి)ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంతోపాటు నిషేధ సమయం ప్రారంభంలోనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు.» మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాదు..తెప్పలు ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని అందించారు. » గత టీడీపీ పాలనలో ఏటా సగటున 60 వేల మంది లబ్ధి పొందితే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 1.16 లక్షల మంది లబ్ధి పొందారు» ఆయిల్ సబ్సిడీగా గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.59.42కోట్లు ఇస్తే.. వైఎస్సార్సీపీ హయాంలో రూ.148.04కోట్లు ఇచ్చారు.» 50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు ఇస్తోన్న పింఛన్ గత టీడీపీ హయాం (2014–15)లో 42,729 మందికి వర్తింపచేయగా వైఎస్సార్సీపీ హయాంలో 2023–24లో 69,741 మందికి ఇచ్చారు. గత టీడీపీ హయాంలో పింఛన్ కోసం రూ.51.57 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్సార్సీపీ రూ.759.47 కోట్లు ఖర్చు చేసింది.» మత్స్యకార భరోసాకు గత టీడీపీ పాలనలో రూ.104.62కోట్లు ఇస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 538.01 కోట్లు ఇచ్చింది. » గత టీడీపీ ప్రభుత్వం డీజిల్పై లీటర్కు రూ. 6.03 చొప్పున సబ్సిడీ ఇవ్వగా, దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.9కి పెంచింది.» వేటకు వెళ్లే ముందు ఆయిల్ నింపేటప్పుడేసబ్సిడీని మినహాయించుకుని చెల్లించే వెసులుబాటును కల్పించారు.» గతంలో 1,100 బోట్లకు మించి ఆయిల్ సబ్సిడీని వర్తింప చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తెప్పలు, నావలతో సహా ఆయిల్ సబ్సిడీని సద్వినియోగం చేసుకున్న బోట్ల సంఖ్య ఏకంగా 23,209కి చేరింది.» చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు గత టీడీపీ హయాంలో తొలి ఏడాది రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా, ఆ తర్వాత దాన్ని రూ.5 లక్షలకు పెంచారు. ఇలా బాబు హయాంలో 300 మంది వేటకు వెళ్లి మృతి చెందితే కేవలం రూ.11.43 కోట్ల పరిహారం మాత్రమే ఇచ్చారు. ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.16.87 కోట్ల పరిహారాన్ని అందజేసింది.» జీఎస్పీసీ పైపులైన్ నిర్మాణం వల్ల డాక్టర్ కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించింది.» వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రూ.4,913 కోట్ల లబ్ధిని నేరుగా మత్స్యకారులకు అందించింది.జీవన ఆటు'బోట్లు'555 రాష్ట్రంలోని మత్స్యకార గ్రామాలు 2.50 లక్షలు:సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు8.50 లక్షలు:సముద్రంలో చేపలవేటపై ఆధారపడి జీవించేవారురూ.20 లక్షలు: బోటు కనీస విలువరూ.5 లక్షలు: బోటులోని వల విలువరూ.1.50 లక్షలు:బోటుపై ఒక్కసారి వేటకు వెళితే అందులోకి బోటుకు డీజిల్, బియ్యం, సరుకుల వ్యయంరూ.20 లక్షలు: బోటులో వెళ్లే ఎనిమిది మందికి ముందస్తు పెట్టుబడి కింద యజమానికి ఇచ్చేది -
విద్యార్థి విభాగం నేతలతో వైఎస్ జగన్ భేటీ నేడు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. విద్యార్థుల సమస్యలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. -
అంబేడ్కర్ పైనా కూటమి కక్ష!
సాక్షి, అమరావతి: భావితరాలకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచేలా విజయవాడ నగరం నడిబొడ్డున వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించిన బీఆర్ అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి ప్రభుత్వం కక్ష కొనసాగుతూనే ఉంది. దాదాపు 20 ఎకరాల్లో సుమారు రూ.297.71 కోట్లతో మహోన్నత ఆశయంతో నిర్మించిన అద్భుత ప్రాంగణం అసలు లక్ష్యాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది.వైఎస్ జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న అక్కసుతో చంద్రబాబు ప్రభుత్వం రాగానే సామాజిక న్యాయ మహాశిల్పంపై వక్రదృష్టి సారించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే స్వరాజ్ మైదానంలోని అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం పేరు (స్టీల్ అక్షరాలు)ను తొలగించారు. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో దానిలో వైఎస్ జగన్ పేరు తొలగించి అంబేడ్కర్ పేరును మాత్రం మళ్లీ ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఆ ప్రాంగణంలో గత ప్రభుత్వం చేపట్టిన చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఆడిటోరియం, లైబ్రరీ తదితర నిర్మాణాలను సైతం నిలిపివేసింది. డ్వాక్రా బజార్ పేరుతో స్టాల్స్ ఏర్పాటు చేయించింది. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తమవడంతో నెల తర్వాత ఆ స్టాల్స్ను తొలగించింది. ప్రైవేటు పరానికి యత్నం భారత రాజ్యాంగ నిర్మాత చరిత్ర, ఆయన ఘనతను నిలువెత్తున నిలబెట్టిన సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరింత అద్భుతంగా తీర్చిదిద్దాల్సింది పోయి పీపీపీ పద్దతిలో ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. దీనిపై వైఎస్సార్సీపీ, వామపక్షాలు, దళిత, గిరిజన సంఘాలు ఈ ఏడాది జనవరిలో ఆందోళనకు దిగాయి. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చెత్తాచెదారాల మయం ప్రైవేటీకరణ ప్రయత్నం బెడిసికొట్టడంతో సర్కారు మరో కుయుక్తి పన్నింది. ఆ ప్రాంగణాన్ని ఎవరూ సందర్శించకుండా చేయడానికి పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసింది. ఒకప్పుడు పచ్చటి పచ్చిక బయళ్లు, పిల్లల ఆటస్థలాలు, ఉవ్వెత్తున ఎగసే అందమైన ఫౌంటైన్లు, రంగురంగుల విద్యుద్దీపాలతో, నిత్యం వేలాది సందర్శకులతో కళకళలాడిన ఈ ప్రాంగంణం ఇప్పడు చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రాంగణంలోని వాటర్ ఫౌంటైన్లలో నీరు మార్చకపోవడంతో అవి నాచు, చెత్తతో నిండిపోయాయి. సిబ్బందికి 9 నెలలు వేతనాలు నిలిపివేత ఇక్కడ పనిచేస్తున్న 23 మంది సిబ్బందికి 9 నెలల క్రితం ప్రభుత్వం జీతాలు నిలిపివేసింది. అక్టోబరు 3 నుంచి వారు ధర్నాలు చేపట్టడంతో తొలుత ఒక నెల జీతం మాత్రమే ఇచ్చింది. మళ్లీ ఆందోళనకు దిగడంతో కొద్ది రోజుల క్రితం 6 నెలల జీతాలు చెల్లించింది. ఆందోళన చేశారనే అక్కసుతో ఇప్పుడు వారిలో కొందరిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఇది మరో దారుణం అంబేడ్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం దేశంలోనే ఓ స్ఫూర్తిదాయక ప్రదేశం. ఇక్కడ కేవలం అంబేడ్కర్ నిలువెత్తు శిల్పమే కాదు.. అంబేడ్కర్ చరిత్రను ఆవిష్కరించారు. మహాశిల్పం పెడస్టల్ (పీఠం)లోని 3అంతస్తుల్లో అంబేడ్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ చిత్రాలు, లైబ్రరీతోపాటు ఆడిటోరియం కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం దీనిని నీరుగార్చేలా ఎవరినీ లైబ్రరీ, ఆడిటోరియం లోపలికి అనుమతించడంలేదు. సందర్శకులను నిరుత్సాహపరిచేలా ప్రభుత్వం పథకం ప్రకారమే ఇలా చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆయనకు కర్నాటక లా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించటంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్.. నేడు గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం రాష్ట్రానికి గర్వకారణం. ఇది వారి అంకితభావానికి లభించిన గుర్తింపు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’’ అని ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.న్యాయమూర్తిగా ఎన్నో కీలక తీర్పులు ఇచ్చిన అబ్దుల్ నజీర్ గారు, నేడు గవర్నర్గా కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో ముందున్నారు. చట్టం, న్యాయ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఆయనకు కర్ణాటక స్టేట్ లా యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ (Honorary Doctor of Laws) ప్రకటించడం రాష్ట్రానికి… pic.twitter.com/BDwSNSHr50— YS Jagan Mohan Reddy (@ysjagan) November 5, 2025 -
Gopireddy: కూటమి పాలనలో రైతులు తీవ్ర అవస్థలు.. పేదలు బాగుండాలంటే జగన్ రావాలి
-
జగన్ సునామీని చూసి ఏడుస్తున్న ఎల్లో మీడియా
-
జగన్ అన్ స్టాపబుల్.. ఎవర్రా ఆపేది..?
-
వైఎస్ జగన్ పర్యటన సక్సెస్.. పోలీసుల ఓవరాక్షన్!
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్పై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ అక్రమ కేసు పెట్టారు. అంతేకాకుండా డ్రోన్ వీడియోల ఆధారంగా మరికొందరిపైన కూడా కేసులు పెడతామని పోలీసులు చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇక, అంతకుముందు.. వైఎస్ జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు.జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, వైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు.అడ్డుకున్న పోలీసులు.. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
జగన్ సైనికులుగా కొడాలి నాని, వల్లభనేని వంశీ
-
చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్
-
వైఎస్ జగన్ పర్యటన హైలైట్స్
-
బాబు చేసిన మోసం.. తుఫాన్ కన్నా డేంజర్
-
ఏపీ సీఎం చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి... ప్రభుత్వం స్పందించకపోతే రైతుల తరఫున పోరాటం సాగిస్తాం... మోంథా తుపాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
'దయలేని బాబు' దగా పాలన
తుపాన్తో నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి.. ఎలా పరిహారం ఎగ్గొడదామా అని ఆలోచనలు చేస్తుండటం దుర్మార్గం. ఎన్యుమరేషన్ అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి కావాలని చెబుతూ ఒక్క రోజు ముందు 30న ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని ఏమంటారు? ఒక్క రోజులో ఎన్యుమరేషన్ అనేది ఎలా సాధ్యం? పంట నష్ట పరిహారం జాబితాలో పేరుంటే ధాన్యం కొనుగోలు చేయం అని చెప్పడం దారుణం. ఇలా రైతులను బ్లాక్ మెయిల్ చేస్తూ.. బెదిరిస్తూ.. పైకి మాత్రం రైతులను ఉద్దరిస్తున్నట్లు బిల్డప్లా?తుపాను కారణంగా వరి కంకుల సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించడం ఎన్యుమరేషన్ ప్రక్రియలో కీలకం. ఎన్యుమరేషన్ చేసే అధికారులు పంట పొలాల వద్దకు వచ్చి స్వయంగా చూసే పరిస్థితే లేదు. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే మీ విధానం? – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆకుమర్రు లాకు నుంచి సాక్షి ప్రతినిధి: ‘రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తుపాను దెబ్బకు పంటలు తీవ్రంగా దెబ్బతిని రైతులు గగ్గోలు పెడుతుంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు దృష్టిలో వ్యవసాయం అనేదే దండగ.. రైతు అనే వాడు వేస్ట్.. అందుకే ఆయన హయాంలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయం, రైతుల విషయంలో చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలి.. రైతులు రాష్ట్రానికి వెన్నెముక అని గుర్తించాలి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వ తీరు మారకపోతే బాధితుల తరఫున వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంది’ అని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. మంగళవారం ఆయన కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు. పంట పొలాల్లో దిగి.. బాధిత రైతులతో మమేమకవుతూ జరిగిన పంట నష్టం గురించి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తానున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా గూడూరు మండలం ఆకుమర్రు లాకు వద్ద బాధిత రైతులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టం అని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. ‘మోంథా తుపాను వల్ల నష్టపోయిన రైతులకు అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పోతాడు.. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వచ్చి క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై పోతాడు.. రైతుల విషయంలో ఈ ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు’ అని ఎత్తిచూపారు. పంటలు దెబ్బ తిన్న ప్రతీ రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, పంటల బీమా పరిహారం కూడా ఇవ్వాలని, ప్రస్తుత రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల బీమాను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. గత 18 నెలల్లో సంభవించిన విపత్తుల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు. లేదంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. కృష్ణాజిల్లా నిడుమోలు వద్ద భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 18 నెలల్లో ఒక్క రైతుకైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ⇒ రైతు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఒకసారి మారుమూల ప్రాంతాలకు వెళ్లాలి. క్షేత్ర స్థాయిలో తిరిగితేనే వాస్తవ పరిస్థితి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు ఉన్నాయి. మోంథా తుపాను దాదాపు 25 జిల్లాలపై ప్రభావం చూపింది. ⇒ అటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు కృష్ణా నుంచి కర్నూలు వరకు దాని ప్రభావం కన్పించింది. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. నిజంగా ఎప్పుడూ ఊహించని విధంగా పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వరి పంటకే ఎక్కువగా 11 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పత్తి, మొక్కజొన్న, అరటి, బొప్పాయి పంటలు మరో నాలుగు లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. ⇒ వరి పంట గింజలు పాలు పోసుకున్న దశలో తుపాను విరుచుకుపడింది. తీవ్రమైన గాలులు, వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది. చంద్రబాబు 18 నెలల పాలనలో దాదాపు 16 సార్లు తుపానులు, వరదలు, అకాల వర్షాలు, కరువు వంటి వైపరీత్యాల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. ఈ 18 నెలల్లో ఏ రైతుకైనా ఒక్క సారైనా ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకైనా ఒక్కసారైనా పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) ఇచ్చారా? అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తా అని హామీ ఇచ్చి.. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.ఐదు వేలతో సరిపెట్టారు. ⇒ ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాలేదు. ఇన్సూరెన్స్ రాలేదు. చివరికి ఎరువులు బ్లాకులో కొనుక్కోవాల్సిన పరిస్థితుల్లోకి రైతులు వెళ్లిపోయారు. రూ.266కు దొరకాల్సిన యూరియా కట్టను ఏకంగా రూ.500, రూ.600 చొప్పున బ్లాకులో కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అవసరాన్ని బట్టి బ్లాకులో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇలా కష్టాల సాగు చేసిన రైతులు తాము పండించిన పంటను అమ్ముదామంటే ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. కనీసం మద్దతు ధరకు కూడా కొనే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది ధాన్యం 75 కేజీల బస్తాకు మద్దతు ధర ప్రకారం రూ.1,750 రావాల్సి ఉండగా, రైతుల చేతికొచ్చింది మాత్రం కేవలం రూ.1,350 మాత్రమే. చంద్రబాబు హయాంలో ప్రతి అడుగులోనూ రైతు నష్టపోతూనే ఉన్నాడు. నాడు ప్రతి రైతుకు భరోసా ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో వారిపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని ఐదేళ్ల పాటు అమలు చేసి అండగా నిలిచింది. మూడున్నర ఎకరాలున్న రైతులు సైతం దాదాపు రూ.70 వేలు, రూ.66 వేలు చొప్పున గతంలో బీమా పరిహారం డబ్బులు అందుకున్న పరిస్థితులను ఇక్కడి రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు ఏ రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. విపత్తుల వేళ పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని ఏ రోజు ఏ రైతు ఆ ఐదేళ్లలో అధైర్య పడలేదు. కారణం.. పంట నష్టం జరిగితే జగనన్న ఉన్నాడు.. పైసా భారం పడకుండా తమ పంటకు బీమా చేయించాడని, తమకు డబ్బులొస్తాయని ధైర్యంగా ఉండేవారు. ప్రతి రైతుకు భరోసా ఉండేది. ⇒ ఏదైనా విపత్తు వేళ పంటలకు నష్టం వాటిల్లితే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఇస్తాడనే ధైర్యం ఉండేది. ఆ డబ్బులతో మరుసటి సీజన్లో పెట్టుబడి పెట్టుకోవచ్చనే ధైర్యం ఉండేది. సీజన్ మొదలయ్యే సరికే ప్రతి రైతుకు ఓ భరోసా ఉండేది. వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున ఇస్తారన్న నమ్మకం ఉండేది. ⇒ ఆర్బీకే వ్యవస్థ అనేది రైతులను చేయి పట్టి నడిపించే వ్యవస్థగా ఉండేది. ప్రతీ రైతు వేసిన పంటకు ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకే పరిధిలోనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్.. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు అందుబాటులో ఉండే వారు. సచివాలయాలతో అనుసంధానం చేసి వలంటీర్లతో కలిసి రైతులను చేయిపట్టి నడిపించేవారు. ప్రతి రైతును.. అతను సాగు చేసిన పొలంలో నిలబెట్టి జియో ట్యాగ్ చేసి ఈ–క్రాప్ బుకింగ్ చేసే వారు. తద్వారా పంటకు ఎప్పుడు, ఏ ఇబ్బంది వచ్చినా రైతుకు ప్రభుత్వం తోడుగా నిలబడేది. ధరలు పతనమైన ప్రతిసారి ప్రభుత్వ జోక్యం ⇒ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉండేది కాదు. ఆర్బీకే పరిధిలో ఏ పంటను ఏ రేటుకు కొనుగోలు చేసేది రైతులకు తెలియజేసేవాళ్లం. ఆ రేట్ల కంటే తక్కువగా పడిపోతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. మద్దతు ధరల వివరాలు ఆర్బీకేలో ప్రదర్శించేవాళ్లం.⇒ ఎక్కడ ఏ పంట రేటు తగ్గినా వెంటనే ఆర్బీకే అసిస్టెంట్ నుంచి ఎలెర్ట్ వచ్చేది. మార్క్ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఉన్న జేసీలు వెంటనే మార్కెట్లో జోక్యం చేసుకునే వారు. ధరలు పడిపోయిన పంటలను కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీని తీసుకొచ్చి «రైతుకు తోడుగా నిలబడేవారు. ఇందుకోసం కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ (సీఎం యాప్) అనే యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలో ఉండేది. ⇒ ఈ యాప్ ద్వారా గ్రామ స్థాయిలో ధరలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ప్రతి రైతుకు బాసటగా నిలిచే వారు. ఇలా ఐదేళ్లలో ధర లేని సమయంలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి కనీస మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. ఇందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ⇒ అప్పట్లో రైతులు సాగు చేసిన ప్రతి పంటను ఈ–క్రాప్లో నమోదు చేసేవాళ్లం. తద్వారా రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేశాం. దాదాపు 85 లక్షల మంది రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి ఉచితంగా పంటల బీమా అమలు చేశాం. 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ కింద రూ.7,800 కోట్లు జమ చేశాం. ⇒ ప్రస్తుతం చంద్రబాబు హయాంలో కేవలం 19 లక్షల మంది మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. అది కూడా బ్యాంక్ రుణాలు తీసుకున్న వారు. మరి ప్రీమియం చెల్లించని మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి పంటల బీమా పరిహారం అందకుండా చేయడం దుర్మార్గం కాదా?ఇదేం విడ్డూరం.. ఒక్క రోజు ముందు ప్రొసీడింగ్సా!?⇒ తుపాన్తో నష్టపోయిన రైతులు ఆశ్చర్యం కలిగించే విషయాలు చెబుతున్నారు. మీ పొలంలో ఎన్యుమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా? అని అడిగితే.. ఈ పొలంలోకే కాదు రాష్ట్రంలో దెబ్బతిన్న ఏ పొలంలోకి, ఏ రైతు దగ్గరకు ఎన్యుమరేషన్ చేసేందుకు ఎవరూ రాలేదన్న మాట విని్పస్తోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ అక్టోబర్ 30వ తేదీన ప్రొసీడింగ్స్ (ఉత్తర్వులు చూపిస్తూ) ఇచ్చారు.⇒ ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్, సోషల్ ఆడిట్ 31వ తేదీ కల్లా పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. ఒక్క రోజులో ఎన్యుమరేషన్ (పంట నష్టం మదింపు), సోషల్ ఆడిట్ అయిపోవాలట! ఎలా సాధ్యమో మీరే చెప్పండి. పైగా ఈ గడువులోగా చేయకపోతే యాక్షన్ తీసుకుంటామని ఇదే ప్రొసీడింగ్స్లో స్పష్టం చేశారు. క్రాప్ డామేజ్, ఎన్యుమరేషన్, సోషల్ ఆడిట్, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అంతా పూర్తి చేసి తుది జాబితాలను 1వ తేదీకల్లా వ్యవసాయ శాఖ డైరెక్టరేట్కు పంపాలని పేర్కొన్నారు.⇒ ఈ ఆదేశాలు చూస్తుంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారో తెలుస్తోంది. ఎన్యుమరేషన్ అనేది ఎవరూ పంట పొలాల వద్దకు వచ్చి చేసే పరిస్థితి లేదు. గాలులు, తుపాను వల్ల ధాన్యం సుంకు విరిగిపోయింది. ఎన్యుమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారి అయినా సరే పొలంలో అడుగుపెట్టాలి. వరి కంకులను చూడాలి. సుంకు (పుప్పొడి) రాలిపోయిందా? లేదా? అన్నది పరిశీలించాలి. ఎన్యుమరేషన్ ప్రక్రియలో ఈ విషయాన్ని స్పష్టంగా రాయాలి. సుంకు రాలిపోతే పాలు పోసుకునే పరిస్థితి ఉండదు. జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. తద్వారా తాలు గింజలు ఏర్పడతాయి. ఈ వాస్తవాలు పరిశీలించేందుకు పొలాల వద్దకు వెళ్లకుండానే ఎన్యుమరేషన్ అయిపోయిందంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఇదేనా రైతులకు మేలు చేసే విధానం?ధాన్యం కొనబోమని బ్లాక్ మెయిల్ చేస్తారా?⇒ ఎన్యుమరేషన్ కోసం ఎందుకు పొలం వద్దకు రాలేదని ఏ రైతు అయినా అడిగితేæ వారిని వెటకారం చేసి మాట్లాడుతున్నారు. పైగా ప్రతి రైతుకు వ్యవసాయ శాఖాధికారి నుంచి తాము చెప్పిన పత్రాలు (ఆధార్, 1బి జిరాక్స్, కౌలు గుర్తింపు కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం) సమరి్పంచిన వారి పొలాల్లో మాత్రమే పంట నష్టం పరిశీలించి జాబితాలో పెడతామని మెసేజ్లు పంపిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కూడా చెప్పిస్తున్నారు. అదీ అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తీసుకొస్తేనే స్వీకరిస్తామని, లేదంటే ఆ పత్రాలు స్వీకరించం అని తెగేసి చెబుతున్నారు. ⇒ మరొక వైపు ‘దయచేసి రైతులు గమనించగలరు. ఇప్పుడు పంట నష్టం చేయించుకున్న రైతుల నుంచి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయబడదు’ అని నిర్దయగా మెసేజ్లు పంపిస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ కోసం ఎవరైనా అడిగితే వాళ్ల ధాన్యం కొనుగోలు చేయరట! అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?⇒ ఎక్కడైనా తుపాను వచ్చినపుడు ప్రభుత్వం మానవత్వం ప్రదర్శించాలి. నష్టపోయిన రైతులను ఉదారంగా ఆదుకునేందుకు ముందుకు రావాలి. పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ), పంటల బీమా పరిహారం (ఇన్సూ్యరెన్స్) వచ్చేలా చేయాలి. అంతే కాకుండా వారి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేసే కార్యక్రమం చేపట్టాలి. అది ఇస్తే ఇది ఇవ్వం.. ఇది ఇస్తే ఆది ఇవ్వం.. అని చెబుతూ రైతులను బెదిరించడం దారుణం. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోంది.మా హయాంలో కచ్చితమైన చర్యలు⇒ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి తుపానులు వచ్చే ముందు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించే వాళ్లం. వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో జిల్లా యంత్రాంగం కలిసి పనిచేసేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్ల పరిధి తగ్గించాం. తక్కువ నియోజకవర్గాలకు ఎక్కువ మంది కలెక్టర్లు, జేసీలు వచ్చారు. ఇలాంటి విపత్తుల వేళ ప్రాణ నష్టం జరగకుండా కచ్చితమైన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే వాళ్లం. కలెక్టర్ల చేతుల్లో కావాల్సినంత డబ్బులు పెట్టేవాళ్లం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గరుండి చూసుకోమని చెప్పేవాళ్లం.⇒ వారం.. పది రోజుల టైం ఇస్తున్నాం.. ఎన్యుమరేషన్ పక్కాగా, పారదర్శకంగా చేయాలని చెప్పేవాళ్లం. తర్వాత ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదో ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు కలెక్టర్ పనితీరు ఏలా ఉంది.. పంట నష్టం కోసం ఎన్యుమరేషన్ ఎలా జరిగింది.. అన్ని సదుపాయాలు మీకు కల్పించారా.. లేదా.. వంటి వివరాలు ప్రజలను అడిగి తెలుసుకునేవాణ్ని. ఏ ఒక్కరైనా అధికారులు బాగా చేయలేదని చెబితే ఉద్యోగం పీకేస్తామని గట్టిగా చెప్పే వాళ్లం. అందువల్ల అధికారుల్లో ఒక భయం ఉండేది. ఆకుమర్రు లాకు వద్ద పొలంలోకి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్ ఈ–క్రాప్ను గాలికొదిలేశారు..⇒ ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఈ క్రాప్ అనేది రైతులకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. అలాంటిది ఈ ప్రభుత్వ హయాంలో ఈ–క్రాప్ తెరమరుగైపోయింది. పంట పొలంలో రైతులను నిలబెట్టి, జియో ట్యాగ్ చేసి, వారి ఫొటోతీసిసి అప్లోడ్ చేసే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఈ–క్రాప్ నిర్వచనం మార్చేశారు. ఈ–క్రాప్ చేశామంటే చేశామన్నట్టుగా ఉంది. టీడీపీ వాళ్లయితే ఉన్న భూమి కంటే ఎక్కువగా సాగు చేసినట్టు చూపిస్తున్నారు.⇒ ఇందుకు బాపట్ల జిల్లాయే ఉదాహరణ. ఈ జిల్లాలోని పర్చురులో 112 శాతం, జే.పంగలూరులో 114 శాతం.. బల్లికురవలో 115 శాతం.. వేటపాలంలో 117 శాతం.. చీరాలలో 122 శాతం.. చినగంజాంలో 128 శాతం చొప్పున ఈ–క్రాప్ నమోదైనట్టుగా చూపించారు. అంటే ఉన్న భూమి కన్నా సాగైన భూమి ఎక్కువగా ఉందా? ఉన్నభూమి 100 శాతమైతే 128 శాతం విస్తీర్ణంలో సాగైనట్టు చూపిస్తున్నారు. అదెలా సాధ్యం! ఈ–క్రాప్ను ఏ విధంగా నీరుగారుస్తున్నారో ఇంతకంటే ఉదాహరణలు కావాలా?⇒ ఇలాంటి విపత్తుల వేళ కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే వారు. వారం, పది రోజుల తర్వాత నేను వెళ్లే వాడిని. పరిస్థితిని అంచనా వేసే వాళ్లం. ముఖ్యమంత్రి వస్తాడేమో అనే భయంతో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా కలెక్టర్లు పనిచేసే వారు. ఈ రోజు ప్రభుత్వ పనితీరు చూస్తుంటే.. ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ⇒ రైతుకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదు. ఇంతటి విపత్కర పరిస్థితులు జరిగినప్పుడు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే.. ఒకరోజు చాపర్లో అలా అలా తిరుగుతాడు. మరుసటి రోజు లండన్ పోతాడు. ఆయన కొడుకు ఆ్రస్టేలియా నుంచి వస్తాడు.. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి పోతాడు. ఇక్కడ రైతుల పరిస్థితి ఏడవ లేక.. కడుపులో బాధ తట్టుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ ఒక్క కౌలు రైతుకు కౌలు కార్డులు ఇవ్వడం లేదు. ఇస్తే వాళ్లకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే దురాలోచనతో ఉన్నారు.ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారు?⇒ ఎన్యుమరేషన్ లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు? తుపాను వల్ల దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇంత పంట నష్టం ఎప్పుడు జరగలేదని మీ ఎల్లో మీడియాలో, మీ గెజిట్ పేపర్ ఈనాడులోనే తొలుత రాశారు. ఇప్పుడు ఎందుకు తగ్గించి రాస్తున్నారు? ఎన్యుమరేషన్ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? ఎందుకు రైతులకు తోడుగా నిలబడలేకపోతున్నారు? పైగా ఎన్యుమరేషన్ చేస్తే మీ పంటను కొనుగోలు చేయం అని ఎందుకు భయపెట్టిస్తున్నారు? రైతుకు మంచి చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నష్టం చేసే కార్యక్రమాలు చేస్తోంది?⇒ మీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం (ఇన్సూరెన్స్) డబ్బులు రావడం లేదు. ఇన్సూరెన్స్ డబ్బులు కట్టి ఉండి ఉంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మాదిరిగా నష్టపోయిన ప్రతి రైతుకు కనీసం రూ.25 వేలకు పైగా పరిహారం వచ్చేది. మీ తప్పిదం వల్ల వారికి ఈ పరిహారం అందకుండా పోయింది. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేయడం వల్ల నష్టం జరిగింది. కాబట్టి ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వచ్చేలా చేయాల్సిన బాధ్యత మీదే. అలా చేయాలని రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 18 నెలల్లో 16 సార్లు రైతులు నష్టపోయారు. మీరు తగ్గించి, కోతలేసి వేసిన లెక్కల ప్రకారమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూ.600 కోట్లు ఇవ్వాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. రబీ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని వర్తింపచేయాలని కోరుతున్నా. -
అడుగుకో ఆంక్ష... రోడ్డుకో బారికేడ్!
గుడివాడ రూరల్: నాయకులకు నోటీసులు... కార్యకర్తలపై ఆంక్షలు... ప్రజలకు అడ్డంకులు... మొత్తంగా పర్యటనను విఫలం చేయడానికి కుయుక్తులు..! కానీ, అశేష జనం ముందు... వారి అభిమానం ముందు ఇవేమీ నిలవలేదు...! పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం పన్నిన పన్నాగాలు విఫలమయ్యాయి. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను బాధిత రైతులను పరామర్శించి, వారి పంట పొలాల పరిశీలనకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన కార్యకమ్రం దిగ్విజయమైంది. జగన్ పర్యటనను విఫలం చేయడమే లక్ష్యంగా ముందుగానే వైఎస్సార్సీపీ నియోజకవర్గాల ఇంచార్జిలు, ముఖ్య నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులను బెదిరించింది. తద్వారా జన సమీకరణ జరగకుండా అడ్డుకోవాలని ఎత్తు వేశారు. అయితే, ఇవేవీ ఫలించలేదు. పైగా ప్రజలు భారీగా, స్వచ్ఛందంగా తరలి వస్తుండడంతో ఇక ఓవర్ యాక్షన్కు దిగారు. దీనికి గోపువానిపాలెం ఘటన సరైన ఉదాహరణ. జగన్ వస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు గోపువానిపాలెం అడ్డ రోడ్డుకు చేరుకోగా పోలీసులు బారికేడ్లు, రోప్లతో అడ్డగించారు. రోడ్డు మార్జిన్లో నిల్చుని ఉన్నా చెదరగొట్టారు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ సంగతి తెలిసిన పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ అక్కడకు వచ్చి ఎందుకు ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అయితే, సమాధానం ఇవ్వకుండా వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. దీంతో కైలే అనిల్, ౖవైఎస్సార్సీపీ శ్రేణులు పమిడిముక్కల సీఐ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. దారులు మూసి.. చెక్పోస్టులు పెట్టి... వైఎస్ జగన్ను చూసేందుకు అభిమానులు కార్లు, బైక్లు, ట్రాక్టర్లతో పాటు కాలినడకన తండోపతండాలుగా తరలిరావడంతో కూటమి ప్రభుత్వం పోలీసులను ఉసిగొలిపింది. వందలమందిని మోహరించి బారికేడ్లు, తాళ్లతో చెక్పోస్టులు పెట్టి అడ్డంకులు సృష్టించింది. వైఎస్ జగన్ పర్యటించే గ్రామాలకు ఉన్న అన్ని దారులను మూసివేయించింది. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలంటూ వైఎస్ జగన్కు సైతం షరతులు విధించింది. 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతి అంటూ అధికార దర్పం చూపించింది. ప్రధాన కూడళ్లు జనసంద్రం... పోలీసుల అవాక్కు రైతులు వైఎస్ జగన్ను కలవకుండా భారీగా బలగాలను మోహరించినా, రోప్ పార్టీలతో అడ్డుకునే ప్రయత్నం చేసినా, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ నిలిపివేసినా ప్రధాన కూడళ్లు జనసంద్రంగా మారడం చూసి పోలీసులు అవాక్కయ్యారు. మరోవైపు కూటమి పాలనలో తమకు జరుగుతున్న అన్యాయాలు, ఎదురవుతున్న నిర్లక్ష్యంపై రైతులు, ప్రజలు జగన్కు వినతిపత్రాలు ఇచ్చారు. కాగా, రైతులు, ప్రజలు, అభిమానులు పోటెత్తడంతో వైఎస్ జగన్ పర్యటన ఉదయం 9.45 కు మొదలై సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మచిలీపట్నం, గూడూరుల్లోనూ... మచిలీపట్నంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ రాక కోసం వేచి ఉండగా బందరు డీఎస్పీ చప్పిడి రాజా ఇంతమంది ఇక్కడ ఉండొద్దంటూ చెదరగొట్టారు. బైక్లపై ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు వచ్చే క్రమంలో తాళాలు లాక్కునేందుకు ప్రయతి్నంచారు. మధ్యాహ్నం బ్రిడ్జి నీడ కింద ఉండగా ఇక్కడ ఉండొద్దని ఇనగుదురు సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాల పెగ్గులు తీసేయమని సిబ్బందికి హుకుం జారీ చేశారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత పేర్ని కిట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, అభిమానులు మచిలీపట్నం వైపు వెళ్లకుండా చెక్పోస్టు ఏర్పాటు చేసి దారి మళ్లించారు. డ్రోన్ కెమెరాలతో వీడియోలు తీస్తూ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారు. అంతకుముందు తాడిగడపలోనూ రైతులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనాలపై వస్తున్న యువతను ఆపి తాళాలు లాక్కున్నారు. మచిలీపట్నం, సుల్తాన్నగర్, ఎస్ఎన్ గొల్లపాలెంలో బారికేడ్లు పెట్టి ప్రజలను వెళ్లనివ్వలేదు. దీంతో రైతులు పొలాల నుంచి నడుచుకుంటూ జగన్ వద్దకు చేరుకున్నారు. గండిగుంట, నెప్పల్లి సెంటర్లో పోలీసులు ఆటంకాలు కల్పించారు. జగన్ కాన్వాయ్తో పాటు వస్తున్న వాహనాలను నిలిపివేశారు. పామర్రు, బల్లిపర్రుకు భారీగా చేరుకున్న రైతులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు ఆపేశారు. మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి నుంచి రామరాజుపాలెం వైపు ఎవరినీ రానివ్వకుండా అడ్డరోడ్డ వద్ద బారికేడ్లను పెట్టారు. పెడన నియోజకవర్గం గూడూరు మండలం రామరాజుపాలెం అడ్డరోడ్డు నుంచి గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు పెట్టారు. బందరు వైపు నుంచి సీతారామపురం గ్రామానికి వెళ్లే రోడ్డుపై బారికేడ్లతో ఓవర్యాక్షన్ చేశారు. కనీసం బైక్లనూ అనుమతించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. తుపాను కారణంగా నీట మునిగిన పంట పొలాలకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. కేసులు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి వరికోటి అశోక్బాబును అదుపులోకి తీసుకుని, ఆయనవెంట వచ్చిన వాహనాలతో పాటు స్టేషన్కు తరలించారు. సీతారామపురంలో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట టీడీపీ జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు కవ్వించారు. అయినా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రతిఒక్కరూ అత్యంత సంయమనం పాటించారు. -
కృష్ణా తీరం.. జన తరంగం
గుండెలపై కకావికలమైన పంటను చూసి పుట్టెడు శోకంతో ఉన్న పుడమితల్లి పరవశించింది. కన్నీళ్లతో కుంగికృశించిన హృదయాలు నేనున్నానంటూ చాచిన ఆపన్నహస్తాన్ని మురిపెంగా ముద్దాడాయి. సర్కారు ఆంక్షలు సంకెళ్లు తెంచి.. సదా తమ క్షేమాన్నే కాంక్షించే అభిమాన నేతను హత్తుకునేందుకు ఉవ్విళ్లూరాయి. కష్టాల్లో కానరాని ఏలికలపై ధ్వజమెత్తిన ప్రజాపతికి జయజయధ్వానాలు పలికాయి. నీ వెంటే మేమంటూ మండుటెండనూ లెక్కచేయక గళమెత్తి నినదించాయి. కృష్ణా తీరం జనతరంగమై ఉప్పొంగింది. జన హృదయ విజేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా నీరాజనం పలికింది.సాక్షి, అమరావతి: మోంథా తుపాను ధాటికి విలవిల్లాడిన రైతులను పరామర్శించేందుకు మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన దిగ్విజయంగా సాగింది. తమ కన్నీళ్లు తుడిచేందుకు వచ్చిన జననేతకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పల్లెల్లో మహిళలు రోడ్లకిరువైపులా నిలబడి పూలవర్షం కురిపించారు. అడుగడుగునా ఆంక్షలు పెట్టినా, రోడ్లు, కూడళ్లు, సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టి.. తాళ్లతో దారులు మూసేసినా ప్రజలు వెనుకడుగు వేయలేదు. మండుటెండను సైతం లెక్కచేయక మొక్కవోని పట్టుదలతో ముందుకురికారు. అభిమాన నేతకు గోడు వెళ్లబోసుకునేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. మోంథా తుపానుతో నష్టపోయిన పంట పొలాలను వైఎస్ జగన్కు చూపించి ఆదుకోవాల్సిన సర్కారు పెద్దలు ఇప్పటివరకూ పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. సమస్యలు చెప్పుకుని ఓదార్పు పొందారు. పంటలు నష్టపోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే పరిహారం తీసుకుంటే దెబ్బతిన్న పంటను కొనడం కుదరదని సర్కారు బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలను ఆసాంతం సావధానంగా విన్న జననేత అధైర్యం వద్దని తానున్నానని భరోసా ఇవ్వడంతో కొండంత అండగా ఉందని సాంత్వన పొందారు. తాడేపల్లి నుంచి ఉదయం కారులో బయలుదేరిన వైఎస్ జగన్కు విజయవాడలోనే ప్రజలు దారికి ఇరువైపులా బారులుతీరి జయజయధ్వానాలు పలికారు. పటమటలో మహిళలు గుమ్మడి కాయలతో జననేతకు దిష్టి తీశారు. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. కానూరులో రైతులు, మహిళలు వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు. ఈడుపుగల్లు, గోశాల వద్ద జగన్ను కలిసిన మహిళా రైతులు, తుపానుతో నష్టపోయిన అరటి, వరి పంటలను చూపించారు. ఈ సందర్భంగా పూర్తిగా పనికి రాకుండా పోయిన వరి కంకులను వైఎస్ జగన్ పరిశీలించారు. ఆకునూరు సెంటర్లో వైఎస్ జగన్ను కలిసిన కల్లుగీత కార్మికులు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. గండిగుంటలో వైఎస్ జగన్పై మహిళలు పూలుజల్లి ఘనస్వాగతం పలికారు. గోపువానిపాలెంలో మహిళలు, వృదులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి గజమాలలతో జగన్కు స్వాగతం పలికారు. నిడమోలు, తరకటూరులో దారికి ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. ఆయనకు పామర్రులోనూ రైతులు పాడైపోయిన పంటలను చూపించారు. పెడన నియోజకవర్గం, గూడూరు వద్ద మహిళలు జయహో జగనన్న అంటూ నినదించారు. రామరాజుపాలెంలోనూ వైఎస్ జగన్కు పంట పొలాలను చూపి రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆకుమర్రు లాకు వద్ద స్వయంగా వరి చేలో దిగిన జగనన్నతో రైతులు ముఖాముఖి మాట్లాడి మురిసిపోయారు. తమ బాధలు వినే నాయకుడు వచ్చాడని పరవశించిపోయారు. సీతారామపురం గ్రామానికి చేరుకున్న జగన్కు మహిళలు హారతులు పట్టారు. అక్కడి నుంచి బీవీ తోటకు బయలుదేరిన జగన్ వెంట నడిచిన నాయకులు, కార్యకర్తలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. 70 కి.మీ. ప్రయాణానికి 7 గంటలకు పైగా అడుగడుగునా ప్రజలు నీరాజనం పలకడంతో వైఎస్ జగన్ పర్యటన నెమ్మదిగా ముందుకు సాగింది. 70 కిలోమీటర్ల దూరానికి 7 గంటలకు పైగా సమయం పట్టిందంటే జగన్పై ప్రజాభిమానం ఏస్థాయిలో ఉప్పొంగిందో ఊహించుకోవచ్చు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పామర్రు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణాజిల్లా పర్యటనలో ఆయన కాన్వాయ్తో పాటు వస్తున్న పార్టీ నేతల కార్లను పోలీసులు అడ్డుకున్నారు. తాము అధినేత వెంట వెళ్తే తప్పేంటని ప్రశి్నంచిన నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. ఈ ఘటన మొవ్వ మండలం కూచిపూడి స్టేషన్లో మంగళవారం చోటు చేసుకుంది. జగన్ కాన్వాయ్తో పాటుగా బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్బాబు తన అనుచరులతో కలిసి మూడు కారుల్లో కాన్వాయ్తో పాటు వస్తున్నారు. వారిని నిడుమోలు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అశోక్బాబు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. తమ విధులకు ఆటంకం కల్పించారంటూ అశోక్బాబు, ఆయన అనుచరులపై మొవ్వ ఎస్సై కె.ఎన్.విశ్వనాథ్ కేసులు పెట్టారు. డ్రోన్తో నిఘా పెనమలూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించటమే కాకుండా అడుగడుగునా నిఘా పెట్టారు. పెనమలూరు మండల పరిధిలోని పలు గ్రామాల కూడళ్ల మీదుగా జగన్ పర్యటన జరిగిన సమయంలో పోలీసులు డ్రోన్లు పెట్టి చిత్రీకరించారు. ప్రతి సెంటర్లో డ్రోన్లు ఏర్పాటు చేశారు. -
ఎవరూ వచ్చి చూసింది లేదు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ, నెట్వర్క్: ‘తుపాను వల్ల దెబ్బతిన్న మా పంటలను చూడటానికి రావాలని కోరినా.. ఎవరూ రావట్లేదు. ఇప్పుడు దెబ్బతిన్న పంటలను జాబితాలో రాసుకుంటే.. రేపు ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. బయట వ్యాపారులకు అమ్ముకోమంటున్నారు. గత 17 నెలల కాలంలో ఒక్క రూపాయి ఇన్పుట్ సబ్సిడీ వేసింది లేదు. తాలు ధాన్యంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నియోజకవర్గంలో చేపట్టిన పర్యటన రోడ్ షోలా సాగిందే గానీ రైతులకు ఒనగూడింది ఏమీ లేదు..’ అంటూ అన్నదాతలు నిర్వేదం వ్యక్తం చేశారు. రైతుకు కష్టమొచ్చినపుడు ప్రభుత్వం పట్టించుకోకపోతే.. వ్యాపారులు పట్టించుకుంటారా? అని ఆక్రోశించారు. వైఎస్ జగన్ హయాంలో క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించి, విపత్తులతో పంటలు దెబ్బతిన్న ప్రతిసారి సహాయం అందించిందని.. ఇప్పుడు కూటమి సర్కారు రైతులనే కట్టుకోమంటోందని, వంద మంది రైతుల్లో ఎనిమిది మంది కూడా ఇన్సూరెన్స్ కట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను పట్టించుకున్న వారే లేరని, మీరే యాత్రల ద్వారా ఈ ప్రభుత్వం మెడలు వంచి కనువిప్పు కలిగించాలని వేడుకున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తుపాన్ బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెడన నియోజకవర్గం రామరాజుపాలెం, ఆకుమర్రు లాకుల వద్ద రైతులతో మాట్లాడారు. పంట పొలాల్లోకి దిగి స్వయంగా నష్టాన్ని పరిశీలించి వారిని ఓదార్చారు. రైతు పరసా వెంకటేశ్వరరావుతో వైఎస్ జగన్ రైతు: నమస్తే సార్... నాకు మూడు ఎకరాలుంది వైఎస్ జగన్: మూడు ఎకరాల పరిస్థితి ఏమిటి? రైతు: ఎకరానికి రూ.35 వేలు పెట్టుబడి పెట్టా... యూరియా అందలా వైఎస్ జగన్: యూరియా బ్లాక్లో కొనుక్కోవాల్సి వచ్చింది! రైతు: ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదు... వైఎస్ జగన్: ఇన్పుట్ సబ్సిడీ రావటం లేదు. ఈ రెండేళ్ల కాలంలో చంద్రబాబు వచ్చాక ఇన్సూరెన్సు ఇచ్చిందీ లేదు. రైతు: చేను పడిపోతే వచ్చి చూసిన అధికారి లేడు వైఎస్ జగన్: చేను పడిపోయినా ఏ ఒక్క అధికారీ వచ్చి చూడలేదు. పొలంలోకి వచ్చి చూసింది లేదు. రైతులు: లోపలకు అయితే అనుకోవచ్చు... రోడ్డు పక్కనే ఉన్నా వచ్చి రాసింది లేదు.రామరాజుపాలెంలో వరి పొలంలో దిగి రైతులకు వైఎస్ జగన్ ఓదార్పు..వైఎస్ జగన్: పంట నష్టం నమోదు చేశారా? రైతు ఓడుబోయిన బ్రహ్మకృష్ణ: రాయలేదు సార్.. వైఎస్ జగన్: సుంకు విరిగి పోయింది. దాని వల్ల పాలు పోసుకునే పరిస్థితి లేదని చెప్పినా కూడా రాయలేదా..? రైతు: రాయలేదు సార్...! నాకు మీ ప్రభుత్వంలో 3.18 ఎకరాలకు రూ.66,780 డబ్బులు పడ్డాయి వైఎస్ జగన్: మన ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా ఉండటం వల్ల మీకు రూ.66,780 పడ్డాయి. ఈ రోజు కనీసం పొలాలకు వచ్చి ఎన్యూమరేషన్ చేసేవాడు లేడు. ఎన్యూమరేషన్ అనేది జరగలేదు. సుంకు పోయిందని చెప్పినా కూడా ఎవరూ రాలేదా? రైతు: రాలేదు సార్... వైఎస్ జగన్: ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తారంటే.. సుంకు ఉందా లేదా? ఇవన్నీ చూడటానికే..! సుంకు పోయింది కాబట్టి దిగుబడి రాదు. అందుకు ఎన్యూమరేషన్ చేయాలి. రైతు: ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి అయింది సార్...యూరియా బస్తా బ్లాక్లో రూ.500 పెట్టి కొన్నా. మీ ప్రభుత్వంలో రూ.270కి ఎక్కడ పడితే అక్కడ యూరియా కట్టలు దొరికాయి సార్. వైఎస్ జగన్: రూ.260...270 పెట్టి కొనాల్సింది... రూ.500 పెట్టి కొనుక్కున్నారు. పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు చొప్పున అన్నదాతా సుఖీభవ ఇస్తామన్నారు. ఎంత ఇచ్చారు? రెండేళ్లకు రూ.40 వేలకు ఎంత వచ్చింది? రైతు: రూ.5 వేలు ఇచ్చారు సార్. వైఎస్ జగన్: రూ.40 వేలు అని చెప్పి.. రూ.5 వేలు ఇచ్చారు. ఈ 18 నెలలు కాలంలో ఇన్పుట్ సబ్సిడీ ఏమైనా ఇచ్చారా..? ఒక్కసారైనా వచ్చిందా? రైతులు: ఏమీ రాలేదు సార్. వైఎస్ జగన్: ఒక్కసారి కూడా రాలా..? ఈ క్రాప్ కూడా చేయడం లేదు! రైతు: నిరుడు కూడా మునిగిపోతే పట్టించుకోలేదు. వైఎస్ జగన్: లాస్ట్ టైం పోయినా కూడా పట్టించుకోలేదు... ఇప్పుడు కూడా పట్టించుకోలేదు...! ఇది వరుసగా రెండోసారి...! ఈ ప్రభుత్వంలో పట్టించుకునే నాథుడు లేడు. మన ప్రభుత్వంలో సమయానికి రైతు భరోసా వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది. యూరియా బస్తా కూడా తక్కువ రేటుకే ఆర్బీకేల ద్వారా రూ.270కే ఇచ్చాం. రైతు: మీ ప్రభుత్వంలోనే నాకు కౌలు కార్డు వచ్చింది సార్... వైఎస్ జగన్: ఈ ప్రభుత్వంలో కౌలు కార్డు ఇవ్వలేదా...? రైతులు: లేదు సార్.లోటు స్పష్టంగా కనపడుతోందయ్యా...!మచిలీపట్నంటౌన్: ‘నువ్వు లేని లోటు స్పష్టంగా కనపడుతోందయ్యా..! నిన్ను కోల్పోయి ఎంతో తప్పు చేశాం. ఈసారికి మన్నించయ్యా..’ అంటూ కృష్ణా జిల్లా గూడూరు మండలం రామరాజుపాలేనికి చెందిన రైతు సాయిబాబు వైఎస్ జగన్ ఎదుట ఆక్రోశించాడు. ‘మీరు సీఎంగా ఉన్న సమయంలో రైతుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన సాగించారు. ప్రస్తుతం ఆ తేడా మాకు ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది’ అని పేర్కొన్నాడు. తనకు నాలుగు ఎకరాల పొలం ఉందని, వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా కింద రూ.72 వేలు అందాయని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదని అధికారులు చెబుతున్నారని, ఇదెక్కడి అన్యాయమో తమకు అర్ధం కావటం లేదని వాపోయాడు. ఆకుమర్రు లాకు సమీపాన నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన అనంతరం రైతులు సాయిబాబు, గణేశన రమేష్ బాబు, దేసు ప్రసాద్తో వైఎస్ జగన్ మాట్లాడారు. జగన్: తుపాన్ తర్వాత ఎవరైనా అధికారి వచ్చారా? రైతు సాయిబాబు: రాలేదన్నా.. జగన్: మనిషి వచ్చి చూసి రాసుకోవడం ఇంపార్టెంట్.. సుంకు ఉందా? పాలు పోసుకుంటుందా.. లేదా? అన్నది అప్పుడే తెలుస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అడిగితే.. పంటలు కొనుగోలు చేయబోమని చెప్పారా? రైతులు: రైతుకు పంట నష్ట పరిహారం ఇస్తే.. ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. జగన్: చంద్రబాబు వచ్చి రెండు సంవత్సరాలు..! రెండు సీజన్లు అయిపోయాయి.. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఏరోజూ రాలేదు. పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి రూ.20 వేలు ఇస్తామన్నారు. అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లకు కలిపి రూ. 40 వేలు ఇవ్వాలి. ఎంత ఇచ్చారు? రైతులు: రూ.5,000 ఇచ్చారు. జగన్: మిగిలిందంతా ఎగరగొట్టారు. అన్నదాతా సుఖీభవ లేదు.. ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఎరువుల రేటు ఎలా ఉంది? రైతులు: యూరియా బ్లాక్లో అమ్మారు. జగన్: యూరియా ఎంతకు కొన్నారు? రైతు సాయిబాబు: మూడు రోజులు తపస్సు చేసి యూరియా కట్ట రూ.1200కు కొన్నాం అన్నా..! రైతు రమేష్ బాబు: యావరేజ్ మీద రూ.650, రూ.700కి కొన్నాం. జగన్: రూ.260 ఖరీదు చేసే కట్టను.. రూ.600 – రూ.700 దాకా కొనాల్సి వచ్చింది. పంటలకు కనీసం గిట్టుబాటు ధరైనా వస్తోందా? రైతులు: అదీ లేదన్నా..! జగన్: గత సంవత్సరం బస్తా ఎంతకు అమ్మారు? రైతులు: సార్వాలో బస్తా వడ్లు రూ1250 – రూ.1300కి అమ్మేమన్నా..! జగన్: రూ.1750కి అమ్మాల్సిన ధాన్యాన్ని రూ.1300కి అమ్మారు.. రైతు సాయిబాబు: ధాన్యాన్ని మిల్లర్ల వద్దకు తీసుకెళ్లా.. తేమ శాతం ఎక్కువగా ఉందని, తాలు ఉందని కటింగ్లు చేసుకుంటూ పోయి మా చేతికి రూ.1,300 ఇచ్చారు. జగన్: ఎకరాకు పెట్టుబడి ఎంత పెట్టారు? రైతులు: ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల పెట్టుబడి పెట్టాం. జగన్: ఇప్పుడు ఎన్ని బస్తాలు వచ్చేలా ఉంది? రైతులు: పది బస్తాలు కూడా వస్తాయో లేదోనయ్యా..! కంకిలో 25 శాతం గింజలు కూడా వచ్చేలా లేవు. జగన్: వారు (ప్రభుత్వం) చేసిన సాయం ఏమీ లేదు.. కనీసం తుపాన్ వచి్చన రోజైనా ఆదుకుందా? రైతులు: సర్పంచ్ మమ్మల్ని తీసుకెళ్లి భోజనాలు పెట్టారు. జగన్: మన ప్రెసిడెంట్ రాజు పెట్టించారు.. వాళ్లేమీ పెట్టలేదుగా! రైతు సాయిబాబు: మమ్మల్ని ఆదుకునే వారు లేరు. ఎరువులు బ్లాక్లో కొన్నాం. గత ఐదు సంవత్సరాల్లో పంటల బీమా మీరు ఎలా చేశారో కూడా మాకు తెలియదు. మాది రూపాయి ఖర్చు లేదు. నాకు సబ్సిడీ పడింది. మొత్తం రూ.72 వేలు వచ్చాయి. ఇవాళ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టలేదు. కడదాం అని వెళితే టైం అయిపోయిందన్నారు. రైతు రమేష్ బాబు: మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కట్టాలనే మాట కూడా మర్చిపోయాం సార్..జగన్: మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సమయానికి వచ్చేది. పెట్టుబడికి రైతు భరోసా ఇచ్చేవాళ్లం. రైతు రమేష్ బాబు: ఇవాళ కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.. రైతు సాయిబాబు: మీరున్న ఐదు సంవత్సరాలు ధైర్యంగా వడ్లు అమ్ముకున్నాం. మిల్లర్ల వద్దకు తీసుకువెళ్లి అమ్మాం. రైతు రమేష్ బాబు: ఇప్పుడు వడ్లు మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదు -
వైఎస్ జగన్ పర్యటన సూపర్ సక్సెస్
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈరోజు(మంగళవారం, నవంబర్ 4వ తేదీ) చేపట్టిన కృష్ణా జిల్లా పర్యటన సూపర్ సక్పెస్ అయ్యింది. జగన్ పర్యటించే గ్రామాల్లో బ్యారికేడ్లు అడ్డంపెట్టినా, గ్రామస్తులను కూడా కదలనీయకుండా చేసి వేధింపులకు గురి చేసినా, ఇలా ఎన్నో రకాలుగా ఆటంకాలు సృష్టించాలని చూసినా వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటన అత్యంత విజయవంతమైంది. కృష్ణా జిల్లాలో మోంథా తుపాను ప్రభావితమైన ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటన సాగింది. దాంతో గ్రామస్తులను, రైతులను అడ్డుకోవాలని పోలీసులు చూశారు. కూటమి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తన్న ఏపీ పోలీస్ యంత్రాంగం.. జగన్ పర్యటనను విజయవంతం కాకుండా చూడాలని ఎప్పటిలానే ప్రయత్నాలు చేసింది. కానీ వారు చేసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయి. వీటిని గ్రామస్తులు, రైతన్నలు, యువత, మహిళలు ఎవరూ లెక్కచేయలేదు. తమ జననేత జగనన్న వస్తున్నాడని తెలిసి ఊరూ-వాడా ఏకమై కదిలారు. జగనన్నకు సంఘీభావం తెలుపుతూ జై జగన్ నినాదాలతో హెరెత్తించారు. రైతన్నలకు భరోసా.. వైఎస్ జగన్ పడిపోయిన పంట పొలాల్లో దిగి పరిశీలించారు. అదే సమయంలో రైతన్నతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోకపోతే వైఎస్సార్సీపీ మరో పోరాటం చేయడానికి కూడా వెనుకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.జనసంద్రం.. ఐదు గంటల ఆలస్యంవైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆ రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. విజయవాడ నుండి గొల్లపాలెం వరకు అడుగడుగునా భారీ జనసందోహమే కనిపించింది. దాంతో ఆ భారీ జనసందోహనికి అభివాదం చేస్తూ జగన్ పర్యటన ముందుకు సాగింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ పర్యటన ఆలస్యమైంది. సుమారు ఐదు గంటలు ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ జగన్ కోసం రైతులు, మహిళలు, కార్యకర్తలు వేచి చూడగా, పొలాల్లో నుండి సైతం వచ్చి జగన్ను కలిశారు రైతన్నలు. తుపానుతో తాము నష్టపోయిన విషయాలను జగన్కు వివరించారు. ఇదీ చదవండి:‘మా హయాంలో జగనన్న ఉన్నాడనే భరోసా ఉండేది’ -
YS Jagan: పంట పొలాల పరిశీలన (ఫొటోలు)
-
వైఎస్ జగన్ను చూడగానే ఆత్మకూరు రైతుల ఆవేదన..
-
జగన్ వెంట జనసంద్రం.. చంద్రబాబు ఈ వీడియో చూస్తే ఏమవుతాడో
-
జగనన్న ఉన్నాడనే ధీమా ఉండేది
అమరావతి: వ్యవసాయం దండగ అన్న సీఎం చంద్రబాబు అదే ధోరణితో వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో దాదాపు 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని, దాంతో రైతులకు నష్టం కలుగుతోందని, అయినా ఏ ఒక్క రైతును ఆదుకున్న దాఖలా లేదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. మొక్కుబడిగా చాలా తక్కువగా పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా రద్దు, ఇన్పుట్ సబ్సిడీ రద్దు, పంటలకు లేని కనీస మద్దతు ధర, రైతులకు తగిన యూరియా కూడా సరఫరా చేయకపోవడం, చివరకు పంటలు కూడా కొనేవారు లేకపోవడంతో.. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు నానా అగచాట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు తుపాన్లో నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడతామని, రైతులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని వైఎస్ జగన్ ప్రకటించారు.మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన పంటలు పరిశీలించడంతో పాటు, రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాలలో పర్యటించారు. తాడేపల్లి నుంచి బయలుదేరిన ఆయనకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. మరోవైపు ప్రతిచోటా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా రోప్పార్టీలు, బారికేడ్లు ఛేదించుకుని జనం, అభిమానులు తరలిరాగా, రైతులు తమ గోడు చెప్పుకున్నారు.కాళ్లకు చెప్పులు కూడా లేకుండా.. పొలాల్లోకి:కాళ్లకు చెప్పులు కూడా లేకుండా, పంట పొలాల్లోకి దిగిన వైఎస్ జగన్ , రైతులతో మమేకం అయ్యారు. తుపాన్లో నష్టపోయిన పంటలను స్వయంగా చూశారు. రైతులతో మాట్లాడి వారి బాధలు ఆరా తీశారు. వారి ప్రతి కష్టాన్ని, ఇబ్బందిని సావధానంగా విన్నారు. వారికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. చివరగా పెడన నియోజకవర్గం, గూడూరు మండలం, ఆకుమర్రులాకు వద్ద రైతులను కలుసుకున్న ఆయన, వారి బాధలు, కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..:వరసగా నష్టాలు. అయినా అందని సాయం:మోంథా తుపాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా పంట నష్టం జరిగింది. కారణం ఏమిటంటే, ఇప్పుడు నష్టపోయిన పంటల్లో దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. అది పొట్టకొచ్చే దశలో ఉంది. అంటే గింజలు తయారయ్యే పరిస్థితి. ఈదురుగాలులు, భారీ వర్షాలతో చాలా నష్టం సంభవించింది. ఇంకా పత్తి, మొక్కజొన్న, బొప్పాయి మరో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, రైతులు నష్టపోయారు. ఈ 18 నెలల్లో 16 సార్లు అలా రైతులు ఇబ్బంది పడ్డారు. మరి ఏ ఒక్క రైతుకు అయినా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఇన్సూరెన్స్ డబ్బు అందిందా? పెట్టుబడి సాయం మొత్తం చేశారా? అంటే అదీ లేదు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. ఇన్ని ఇబ్బందులు పడి, నష్టం జరిగినా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అదే మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలు చేశాం. దీంతో ఏ రైతు ఇబ్బంది పడలేదు. అప్పుడు మూడు ఎకరాలున్న రైతులకు దాదాపు రూ.70 వేల పరిహారం అందింది.అదే ఇప్పుడు చివరకు ఇప్పుడు యూరియా కూడా బ్లాక్లో కొనాల్సి వచ్చింది. బస్తా యూరియా దాదాపు రూ.600కు కొనాల్సి వచ్చింది. ఇంకా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.1750 ఉంటే రైతుకు రూ.1300 కూడా రావడం రాలేదు. ఏ ఒక్క పంటకూ కనీస గిట్టుబాటు ధర రాలేదు.నాడు జగనన్న ఉన్నాడన్న భరోసా:అందుకే అందరూ మా ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఏం జరిగినా రైతులు ఆందోళన చెందలేదు. జగనన్న ఉన్నాడు. ఆదుకుంటాడు అన్న భరోసా ఉండేది. ఉచిత పంటల బీమా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ కూడా వస్తుంది. ఏటా సీజన్ ఆరంభంలో పెట్టుబడి సాయం చేస్తాడు. అలా ఏటా రూ.13,500 తప్పనిసరిగా ఇస్తాడు అన్న నమ్మకం రైతుల్లో ఉండేది. అలా వారిలో ఒక భరోసా ఉండేది. రైతులను చేయి పట్టి ఆర్బీకేలు నడిపించేవి. ప్రతి ఎకరా ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకేల్లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండేవారు. వారు పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేసే వారు. దాంతో ఏ పంటకు, ఏ ఇబ్బంది వచ్చినా, ఈ–క్రాప్ ఉంది కాబట్టి ప్రభుత్వం తోడుగా నిలబడేది.ఆర్బీకేలు జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవి. తద్వారా రైతులకు కనీస మద్దతు ధర వచ్చేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ జిల్లా జేసీకి సమాచారం ఇస్తే, వారు వెంటనే జోక్యం చేసుకుని, మార్కెట్లో పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడేవారు. సీఎం–యాప్ ద్వారా ప్రతి రైతుకు ఆర్బీకేల్లో ఆసరగా నిల్చేవాళ్లం. దాదాపు రూ.7800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం. అందుకోసం ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం.ప్రతి ఎకరా ఈ–క్రాప్ చేసి, ఉచిత పంటల బీమా ఇచ్చాం. 70 లక్షల ఎకరాలకు ఉచిత పంటల బీమా అమలు చేయడంతో, ఆ బీమా పరిధిలో ఏకంగా 85 లక్షల మంది రైతులు ఉండేవారు. ఉచిత పంటల బీమా వల్ల దాదాపు రూ.7800 కోట్ల పరిహారం రైతులకు అందింది. అదే ఇప్పుడు చంద్రబాబు పాలనలో కేవలం 19 లక్షల మంది రైతులకు, 19 లక్షల ఎకరాలకు మాత్రమే పంటల బీమా ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? వారికి పంటల బీమా లేదు. మరి వారి పరిస్థితి ఏమిటి?. వారందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు?.ఒక్క రోజులో ఎన్యుమరేషన్. ఎలా సాధ్యం?:ఈరోజు ఈ రైతు ఒకే విషయం చెప్పాడు. ఎక్కడా, ఏ రైతు వద్దకు, ఏ పొలం వద్దకు ఎవరూ ఎన్యుమరేషన్ కోసం రాలేదు. ఇంకా ఇక్కడ ఒక దారుణ అంశం ఏమిటంటే..(అంటూ ఆ ఆర్డర్ కాపీ చూపారు). ఇది అక్టోబరు 30న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్. ఎన్యుమరేషన్, సోషల్ ఆడిటింగ్ ఆ మర్నాటికల్లా (అంటే అక్టోబరు 31. కేవలం ఒకే ఒక్క రోజు) పూర్తి కావాలని అందులో ఆదేశించారు. అక్కడ ఇంకో పేరాలో ఏం రాశారంటే.. అక్టోబరు 31 నాటికి అవి కచ్చితంగా పూర్తి చేయాలి. ఆ పని చేయకపోతే, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారట. ఆ తర్వాత రైతులు కనీసం దరఖాస్తు కూడా చేయడానికి వీలు లేదు. ఆ వివరాలు నవంబరు 1నాటికి కలెక్టరేట్కు చేరాలట. ఇది ఎంత దారుణం. కేవలం ఒకే ఒక రోజులో పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు? అది సాధ్యమేనా? ఈదురుగాలులు, వర్షాలతో పంట నష్టం ఎలా జరిగింది? సుంకు విరిగిపోయిందా? పంట ఎలా ఉంది? సుంకు విరిగిపోతే, గింజ పాలు పోసుకోదు. ఎన్యుమరేషన్ చేసే వాళ్లు పొలంలోకి దిగి చూస్తేనే తెలుస్తుంది. కానీ, ఇక్కడ ఎక్కడా ఎవరూ రాలేదు. పొలంలోకి రాలేదు. అయినా ఎన్యుమరేషన్ జరిగిందని చెబుతున్నారు.ఇంకో దారుణం.. ఒకటి తీసుకుంటే మరొకటి కట్:ఈ పత్రాలు సమర్పించిన వారు, అక్టోబరు 31 నాడు పత్రాలు, డాక్యుమెంట్లు తెచ్చిన వారికే పరిహారం ఇస్తారట. అంటే ఇప్పుడు ఆ పని చేసిన రైతుల ధాన్యాన్ని, ఆ తర్వాత కొనుగోలు చేయబోమని చెప్పారు. అంటే ఇన్పుట్ సబ్సిడీ, పరిహారం కోరిన రైతుల ధాన్యం కొనుగోలు చేయబోమని చెబుతున్నారు. కనీస మానవత్వం చూపాలి. పంట నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. పరిహారం ఇవ్వాలి. పంటలు కూడా కొనుగోలు చేయాలి. కానీ, ఇక్కడ ఒకటి ఇస్తే, మరొకటి ఇవ్వబోమంటున్నారు. అంటే ఎంత నిర్దయగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ–క్రాప్కు పూర్తిగా ఎగనామం పెట్టింది. ఈ–క్రాప్ చేస్తే, ఇలాంటి విపత్కర పరిస్థితిలో శ్రీరామరక్షగా నిలుస్తుంది.తూతూ మంత్రంగా ఈ–క్రాప్.. అందులోనూ అవినీతికి బీజం:అసలు ఈ–క్రాప్ అంటే. రైతులను పొలాల్లో నిలిపి ఫోటో తీయాలి. కానీ, ఇప్పుడు ఈ–క్రాప్ పేరుకే చేస్తున్నారు. ఇంకా వాస్తవ పంటలకు మించి ఈ–క్రాప్ చూపుతున్నారు. టీడీపీ వారికి ఏకంగా ఉన్న భూమి కన్నా, ఎక్కువ పంట వేశారని చూపుతున్నారు. అలా పర్చూరులో 112 శాతం, జె.పంగలూరులో 114 శాతం, బల్లికరువులో 115 శాతం, వేటపాలెంలో 117 శాతం, చీరాలలో 122 శాతం. చిన్న గంజాంలో 128 శాతం ఎక్కువ చూపుతున్నారు. అంటే ఉన్న భూమి కంటే ఎక్కువగా పంటను చూపుతున్నారు. ఆ స్థాయిలో ఈ–క్రాప్ నీరుగార్చారు.కష్టాల్లో రైతులు. జల్సా టూర్లలో తండ్రీ కొడుకులు:ఈ ప్రభుత్వం రైతులను పూర్తిగా గాలికొదిలేసింది. ఇక్కడ ఇంత విపత్కర పరిస్థితులు ఉంటే, సీఎం ఏం చేశారు?. ఒకరోజు ఛాపర్లో అలా తిరిగి, మర్నాడు లండన్ వెళ్లిపోయారు. ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో పర్యటించి వచ్చి, మర్నాడు క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం ముంబై వెళ్లాడు. ఇది వాళ్ల వ్యవహారశైలి.అదే మా ప్రభుత్వంలో నేనేం చేసేవాణ్ని?:తుపాన్ రాగానే, అధికారులకు బాధ్యతలు అప్పగించేవాళ్లం. జిల్లాలు పెంచడం వల్ల, కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు ఎక్కువగా వచ్చారు. ఇంకా సచివాలయాలు ఉండేవి. తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే కలెక్టర్లకు నిధులు ఇచ్చే వాళ్లం. వారికి వారం, పది రోజుల టైమ్ ఇచ్చి, అన్నీ పక్కాగా చేయమనేవాళ్లం. ఆ తర్వాత నేను స్వయంగా వస్తానని చెప్పి, అలాగే పర్యటించేవాణ్ని. దాంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే, కలెక్టర్లు విస్తృతంగా పర్యటించి, ఎలాంటి తప్పిదం లేకుండా చూసేవాళ్లు. నేను ఆ వారం, పది రోజుల తర్వాత ఎప్పుడు, ఎక్కడికి వస్తానో తెలియదు కాబట్టి, అందరు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, అన్ని సహాయ కార్యక్రమాలు చేసేవారు. బాధితులను ఆదుకునే వారు.నష్టాన్ని ఎందుకు తక్కువ చూపుతున్నారు?:కానీ, ఈరోజు ప్రభుత్వం అనేది ఉందా? ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. పంట నష్టాన్ని ఎందుకు తక్కువ చేసి చూపుతున్నారు. పంటల నష్టం చాలా జరిగిందని ఎల్లో మీడియాలోనే రాశారు. మరి పంట నష్టం లెక్కలు ఎందుకు తక్కువ చేసి చూపుతున్నారు? రైతులకు మంచి చేయకుండా ఎందుకు నష్టం చేస్తున్నారు? చంద్రబాబు, నీ తప్పిదం వల్ల రైతులకు పంటల బీమా పరిహారం రావడం లేదు. మీరు ప్రీమియమ్ కట్టి ఉంటే, వారికి పరిహారం ఉండేది. ఉచిత పంటల బీమా మీరు ఎత్తేయడం వల్ల, వారికి నష్టం జరుగుతోంది. కాబట్టి, అది ఇచ్చి మీరే ఆదుకోవాలి. రబీ నుంచైనా కచ్చితంగా ఉచిత పంటల బీమా అమలు చేయాలి. ఇన్పుట్ సబ్సిడీ కింద కూడా తగ్గించి, తగ్గించి చివరకు రూ.600 కోట్లు బకాయి పెట్టారు. అది వెంటనే ఇవ్వాలి.రైతుల పక్షాన పోరాడతాం:రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతు కంట కన్నీరు రాష్ట్రానికి అరిష్టం. వ్యవసాయం దండగ అనేది చంద్రబాబు వైఖరి. అందుకే వారికి ఈరోజు ఇన్ని ఇబ్బందులు. రైతులు రాష్ట్రానికి వెన్నెముక. వారిని ఆదుకోవాలి. లేకపోతే మేము రైతుల పక్షాన పోరాడతాం. ఇంకా కౌలు రైతులకు కార్డులు కూడా ఇవ్వలేదు. అవి వెంటనే ఇవ్వాలి. రాష్ట్రంలో రైతులకు న్యాయం, మేలు జరిగే వరకు వారికి తోడుగా నిలుస్తామని, పోరాడతామని వైఎస్ జగన్ ప్రకటించారు. -
Farmers: రామరాజుపాలెంలో YS జగన్ మీరే ఆదుకోవాలి..
-
Gudur Farmers: పంట పొలాల్లో రైతులతో YS జగన్


