YS Jagan Mohan Reddy
-
క్రికెటర్ కేఎస్ భరత్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: రెండు రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి.. కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న ఏపీకి చెందిన బ్యాటర్-వికెట్ కీపర్ కేఎస్ భరత్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్న భరత్కు శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆల్ ది బెస్ట్ కేఎస్ భరత్ అంటూ పోస్ట్ చేశారు వైఎస్ జగన్.ఆంధ్రప్రదేశ్కు చెందిన టీమిండియా వికెట్కీపర్-బ్యాటర్ కేఎస్ భరత్.. గురువారం తన అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ.. భవిష్యత్తులో కోచింగ్, మెంటరింగ్ ద్వారా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు భరత్,. Wishing K.S. Bharat all the best as he embarks on a new Journey after announcing his retirement from international cricket. Good luck for the future!@KonaBharat pic.twitter.com/uy5XpUI3h8— YS Jagan Mohan Reddy (@ysjagan) June 6, 2026 కాగా, 2023లో ఆస్ట్రేలియాతో నాగ్పూర్లో టెస్టు అరంగేట్రం చేసిన భరత్, భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 221 పరుగులు చేశాడు. వికెట్కీపర్గా 18 క్యాచ్లు, ఒక స్టంపింగ్ నమోదు చేశాడు.అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, భారత్కు దేశవాళీ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 113 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో 6102 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 34 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 308 పరుగులు.లిస్ట్-ఏ క్రికెట్లో భరత్ 82 మ్యాచ్లు ఆడి 8 సెంచరీలు, 10 అర్ద సెంచరీల సాయంతో 2692 పరుగులు చేశాడు. అలాగే దేశవాలీ టీ20ల్లో 91 మ్యాచ్లు ఆడి 11 అర్ద సెంచరీల సాయంతో 1812 పరుగులు చేశాడు. ఐపీఎల్లో భరత్ 11 మ్యాచ్ల్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 199 పరుగులు చేశాడు. -
విజయదుర్గ అధిపతి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
విజయదుర్గ పీఠాధిపతి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: విజయదుర్గ పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘పీఠాధిపతి మృతి ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటు. ఆధ్యాత్మిక రంగానికి విశిష్ట సేవలందిస్తూ వేలాది మంది భక్తులకు మార్గదర్శకులుగా నిలిచారు. ధర్మ పరిరక్షణ, సనాతన ఆధ్యాత్మిక విలువల ప్రచారం.. భక్తి మార్గ బోధన కోసం ఆయన జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు’’ అని వైఎస్ జగన్ అన్నారు.‘‘సుబ్రహ్మణ్యం గారి సేవలు, బోధనలు భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన మరణం భక్తజనులకు తీవ్ర వేదన కలిగించింది. సుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులకు, శిష్యులకు, భక్తులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నా. సుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
దగా డీఎస్సీపై మెగా కవరింగ్..
సాక్షి, అమరావతి: మొత్తం మోసాలతో సాగిన దగా డీఎస్సీ–2025పై చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ పాత పాటే పాడుతోంది. తమకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించిన అభ్యర్థులపై పెయిడ్ వీడియోలతో మానసిక దాడులకు దిగుతోంది. ముఖ్యంగా డీఎస్సీలో సర్టిఫికెట్ల పరిశీలన కోసం 1:1 నిష్పత్తి (ఒక పోస్టుకు ఒక్క అభ్యర్థి) ప్రకారం కాల్ లెటర్లు అందుకుని మోసానికి గురైన అభ్యర్థులు ఇటీవల వివిధ సామాజిక మాధ్యమాల్లో గోడు వెళ్లబోసుకున్నారు. అలాగే, ‘సాక్షి’ పత్రికను ఆశ్రయించారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు స్వయంగా వచ్చి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి న్యాయం చేయాల్సిందిగా కోరారు. వీరి గురించి పత్రికల్లో రాగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో టీడీపీ పెయిడ్ ఫ్యాక్టరీ ఆర్టిస్టులు చెలరేగి ‘ఫేక్’ ప్రచారానికి దిగారు. అలాగే, నష్టపోయిన అభ్యర్థులదే తప్పు అన్న చందంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు 1:1 నిష్పత్తికి కొత్త అర్థం చెప్పింది. కాల్ లెటర్లు వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చినట్టు భావించవద్దని ఆ లెటర్లలోనే ఉందని అధికారులు చెప్పడం విస్తుగొల్పుతోంది. రెండు జాబితాల్లోనూ వీరి పేర్లెందుకు లేవు? డీఎస్సీలో అభ్యర్థులకు పంపిన కాల్ లెటర్లకు ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. మెరిట్ లిస్టు ప్రకటించే ముందే అన్ని రిజర్వేషన్లు.. వర్టికల్, హారిజాంటల్ (ఉమెన్, స్పోర్ట్సు, ప్రత్యేక అవసరాలు, ఎక్స్ సర్వీస్మెన్) పరిశీలించి తుది మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఆ జాబితాలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను 1:1 నిష్పత్తిలో అంటే.. ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని సర్టిఫికెట్ల పరిశీలన కోసం పిలుస్తారు. సర్టిఫికెట్ల పరిశీలనలో అన్నీ సక్రమంగా ఉన్న అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవుతారు. సర్టిఫికెట్లు సరిగా లేనివారిని ‘తిరస్కరణ’ జాబితాలో పెట్టి, వీరి స్థానంలో తర్వాత మెరిట్ (ఓపెన్ లేదా అదే రిజర్వేషన్) అభ్యర్థికి కాల్ లెటర్ పంపుతారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీలోనూ ఇదే సూత్రం అనుసరించినట్టు విద్యా శాఖ చెప్పడం లేదు. ప్రస్తుతం అన్యాయానికి గురై, ఉద్యోగం రాక ఆందోళన చేస్తున్న దాదాపు 1,500 మంది అభ్యర్థులు కాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారే. వారి సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో తిరస్కరణకు గురవలేదు. జిల్లాల్లో ప్రదర్శించిన ‘రిజెక్ట్’ జాబితాలోనూ వీరు లేరు. అంటే వారు ఎంపిక జాబితాలో తప్పనిసరిగా ఉండాలి. అందులోనూ లేరు. వీరిని ఈ రెండు జాబితాల్లోనూ ఎందుకు చూపలేదో అధికారులు చెప్పడంలేదు. అలాగే, ‘కాల్ లెటర్ సర్టిఫికెట్ల పరిశీలనకు మాత్రమే.. ఉద్యోగానికి ఎంపికైనట్టు కాదు’ అని ముందే చెప్పామని భాష్యం చెబుతున్నారు. 1:1 నిష్పత్తిలో పంపిన అన్ని కాల్ లెటర్లకు ఇదే వర్తిస్తుంది. మరి కొందరే ఎందుకు అన్యాయానికి గురయ్యారనేది పెద్ద ప్రశ్న!డీఎస్సీ మెరిట్ బాధిత అభ్యర్థులను ‘ఫేక్’ అంటూ తప్పుడు పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా బాధిత అభ్యర్థులపై దుష్ప్రచారంకాల్ లెటర్లు అందుకుని సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యి ఎంపిక, తిరస్కరణ జాబితాల్లో పేర్లు లేని అభ్యర్థులు ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించి న్యాయం చేయాల్సిన ప్రభుత్వం.. వారిపై ఎదురు దాడికి దిగుతోంది. పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా అభ్యర్థులపై దుష్ప్రచారం చేయడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వద్ద గోడు వెళ్లబోసుకున్న అభ్యర్థులపై పెయిడ్ ఆర్డిస్టులు తీవ్రమైన ట్రోలింగ్కు దిగారు. మరోపక్క అభ్యర్థుల మెరిట్ను సైతం అధికారులు రోజుకోలా మార్చేస్తున్నారు.» చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.ఏకాంబరం బీసీ–డి కేటగిరీకి చెందినవారు. ఇతనిది మెరిట్ జాబితాలో 125వ ర్యాంకు. జిల్లాలో బీసీ–డి కేటగిరిలో 7 పోస్టులు ఉండగా, 5 మెరిట్, 2 హారిజాంటల్ రిజర్వేషన్లో భర్తీ చేశామని అధికారులు చెప్పారు. ఈ మెరిట్ (5 పోస్టులు)లో చివరి ర్యాంకు 114లో ఉన్న అభ్యర్థికి ఇచ్చామని గత శనివారం పాత్రికేయుల సమావేశంలో అధికారులు ధ్రువీకరించారు. కానీ శుక్రవారం ఈ మెరిట్ 116 అభ్యర్థికి ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో ఏది సరైనది? వాస్తవానికి అధికారులు చెబుతున్న 114 ర్యాంకు అదే జిల్లాకు చెందిన ఎస్టీ అభ్యర్థిది. ఈ ర్యాంకును బీసీ–డిలో చూపడం విస్తుగొల్పుతోంది. అలాగే, 116 ర్యాంకు మహిళది.» అంకాని నాగవేణి (బీసీ–ఎ) విషయంలోనూ ఇలాగే చెప్పుకొచ్చారు. ఈ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. మరి 8వ అభ్యర్థిగా ఉన్న నాగవేణికి ఎందుకు కాల్లెటర్ పంపారన్న ప్రశ్నకు సమాధానం లేదు. ప్రకటించిన ఏడుగురు మెరిట్ అభ్యర్థుల్లో ఎవరికైనా సరైన సర్టిఫికెట్లు లేక, రిజెక్ట్ అయిన సమయంలోనే 8వ అభ్యర్థికి కాల్లెటర్ పంపాలి. అలా ఎందుకు చేయలేదు? » ఉన్న పోస్టులకు అంతే సంఖ్యలో మెరిట్ ప్రకారం కాల్లెటర్లు పంపితే.. అదనపు అభ్యర్థి ఎక్కడి నుంచి వచ్చారు? వారికి కాల్ లెటర్లు ఎందుకు పంపినట్టు? సర్టిఫికెట్లు ఎందుకు పరిశీలించినట్టు? ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. అయినప్పటికీ అంతా సక్రమమే అనే కలరింగ్ ఇస్తూ చేసిన తప్పును ఒప్పు అని భ్రమింపజేసేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
వైఎస్ జగన్, సజ్జలకు నోటీసులు అంబటి రియాక్షన్
-
రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదు
సాక్షి,అమరావతి: రెండేళ్ల పాలనలో కూటమి సర్కార్ చేసిందేమీ లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. చేసింది చెప్పుకోవాలన్నా ఏమీ కనిపించడం లేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఈ రెండేళ్ల పరిపాలనతో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద జల్లడం, అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వైఎస్ జగన్పై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ రెండేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి మాత్రమే చంద్రబాబు పని చేస్తున్నారు.లిక్కర్ స్కాం జరగకున్నా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతీ పైసా ప్రభుత్వ ఖజానాలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్ది. చంద్రబాబు గతంలో లిక్కర్ పేరుతో లెక్కలేనన్ని స్కాములు చేశారు. లిక్కర్లో చంద్రబాబు రూ.25వేల కోట్ల స్కాం చేశారు. చంద్రబాబు 40వేల బెల్టు షాపులు నడిపించారు. రాష్ట్ర ఖజానాకు రూ.5వేల కోట్లుకుపైగా నష్టం చేకూర్చారు. వ్యవస్థలు మేనేజ్ చేసి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. -
‘జగనన్న ఉన్నప్పుడు ఇట్లా కాదు మామా!’
‘చంద్రబాబు ముఖంలో మార్పు వచ్చింది.. మారిన మనిషంటూ జనాన్ని నమ్మించి, గ్యారెంటీ బాండ్లని చేతిలో పెడితే.. మురిసిపోయి ఓట్లేసినందుకు మన బతుకులు బస్టాండ్ అయ్యాయి మామా!’ అంటూ బద్వేలు నియోజకవర్గం కలసపాడు పీర్ల చావిడి రచ్చబండ కాడ కూర్చుని జనం కూటమి సర్కార్ను ఎద్దేవా చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఏ ఒక్క పథకం డబ్బులు అకౌంట్లలో పడకపోగా, నిబంధనల పోట్లతో ఉన్న పథకాలకు తూట్లు పొడుస్తున్న చందాన సాగుతున్న అరాచక పాలనపై పల్లెల్లో జనం తిరగబడుతున్నారు. ఇటీవల ఊర్లో శుభకార్యానికి హైదరాబాద్ నుంచి వచ్చిన రామచంద్రుడిని చూసి రచ్చబండ కాడ ఉన్న వెంకన్న పలకరించాడు. ‘ఏమిరా రామచంద్రా! ఎట్లుంది హైదరాబాద్ల నీ ఉద్యోగం? జీతం బాగానే ఇస్తున్నారా, ఏమన్నా ఎనకేస్తున్నావా? బంగ్లాలు, ఇండ్లు ఏమన్నా కట్టినావా సామీ?’ అని గుక్కతిప్పుకోకుండా అడిగేశాడు.దానికి రామచంద్రుడు నిట్టూరుస్తూ.. ‘ఏం సరిపోతాదిలే మామా! జీతాలు చూస్తే అణాపైసలు.. ఖర్చులు చూస్తే కొండంత! ఏది ముట్టుకున్నా రేట్లు సెగలు పుట్టిస్తున్నాయి. అంత సీన్ ఉంటే పిల్లోలను ఊర్ల ముసలోళ్ల కాడ ఎందుకు వదిలిపోతా? నా సామిరంగా.. ఈ రెండేళ్ల నుంచి నడ్డి విరిగిపోతాంది మామా! వెనకటికి మన జగనన్న సీఎంగా ఉన్నప్పుడు మనకు ‘వైఎస్ఆర్ ఆసరా’, ‘సున్నా వడ్డీ రుణాలు’ టైమ్కు వచ్చేవి. ఏడాదికి రూ.18 వేలకు పైగా ఒకేసారి చేతికొస్తే ఆడోళ్లు పొదుపుగా దాచుకునేవాళ్లు. పిల్లకు ‘అమ్మ ఒడి’ వచ్చేది, పెద్ద పిల్లోనికి ‘ఫీజు రీయింబర్స్మెంట్’ వచ్చేది. ఇంటి పెద్దన్నగా జగనన్నే ఉండి ఆదుకునేటోడు. ఆ డబ్బులతో పిల్లల చదువులే కాకుండా ఇంట్లో ముసల్లోళ్ల వంటా వార్పుకు కూడా సాయపడేవి. ఊర్లో ఉపాధి పనులు ఉండి కూలి గిట్టుబాటయ్యేది. దాంతో పండగలకు మేం కూడా ఎంతో సంతోషంగా ఊరికొచ్చేవాళ్లం. కానీ ఇప్పుడేమైందో ఏమో గానీ.. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ‘తల్లికి వందనం’ పోయింది, ‘వైఎస్ఆర్ ఆసరా’ పోయింది, ‘సున్నా వడ్డీ’ కూడా పోయింది! ఇక కడప దగ్గర్లో ఇంజినీరింగ్ చదువుతున్న నా కొడుకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని కాలేజీ వాడు రూ.75 వేలు కట్టమన్నాడు, లేకుంటే పరీక్షలు రాయనీయమన్నారట! చేసేది లేక నీ కూతురు పుస్తెల గొలుసు, ఇంకొన్ని చిన్న చిన్న వెండి సొమ్ములు ఉంటే బ్యాంకులో తాకట్టు పెట్టి ఫీజు కట్టినాం మామా.. జగనన్న ఉన్నప్పుడు ఇట్టాంటి తిప్పలు అస్సలు ఉండకపోయేవి, హాయిగా నిద్రపోయేవాళ్లం. మన బావమరిది కూడా అప్పట్లో ‘రైతుభరోసా’ డబ్బులతో హాయిగా వ్యవసాయం చేసుకునేటోడు. ఇప్పుడు వాడికీ వ్యవసాయంలో తీరని నష్టాలు వచ్చాయట. ఈసారి యూరియా దొరక్క వాడు వేసిన మొక్కజొన్న పంట అంతా ఎండిపోయిందట, వాడు కూడా దిగాలుగా కూర్చున్నాడు. ఏదో పిల్లలను, ముసల్లోళ్లను చూద్దామని ఆశగా ఊరికొస్తే.. ఇక్కడ ఎవరి ముఖంలోనూ సంతోషమనేదే కనిపిస్తలేదు మామా..!’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడే కూర్చుని ఉన్న యుగంధర్ మాటలో మాట కలిపాడు. ‘నిజమేరా రామచంద్రా..! మా అన్న భార్యకు గతంలో ‘వైఎస్ఆర్ ఆసరా’, ‘సున్నా వడ్డీ’ డబ్బులు చక్కగా వచ్చేవి. ఇప్పుడు అవేవీ రావడం లేదు. మా అన్న పాడెక్కి ఏడాది కావస్తోంది. ఇంతవరకు నా వదినకు వితంతు పింఛన్ ఇవ్వలేదు! 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న చంద్రబాబు.. వితంతువులను ఇలా నడిరోడ్డున పడేశాడు. మేం గ్రామ పెద్దను తీసుకుని సచివాలయానికి వెళ్తే.. ‘మీ అన్నకు ఇదివరకు పింఛన్ లేదు కాబట్టి, మీ వదినకు కొత్త పింఛన్ రాదు’ అని సాకులు చెప్తున్నారు. ఏం చేయాలో తెలియక నా వదిన కూలి పనులకు వెళ్లి బతుకీడుస్తోంది.గతంలో ఆమె కొడుక్కి వాలంటీర్ ఉద్యోగం ఉండేది. నెలకు రూ.5 వేలు వస్తే ఇల్లు గడిచేది. ఇప్పుడా ఉద్యోగం లేదు, వాడు కూడా రోడ్డున పడ్డాడు. అటు ఉద్యోగమూ లేదు, ఇటు నిరుద్యోగ భృతీ లేదు. జాబ్ క్యాలెండర్ రాకపోయే సరికి వాడు బతుకుదెరువు కోసం పట్టణం వెళ్లిపోయాడు. ఈ పండుగకు కూడా వాడు ఊరికి రాలేదు. ఇక్కడేమో నా వదిన మంచం పట్టింది. ఏందిరా రామచంద్రా..! ఇప్పుడు ఊర్లో రేషన్ కార్డు కావాలన్నా జన్మభూమి కమిటీ నాయకుల కాళ్లు పట్టుకోవాలి. పిల్లల చదువుల కోసం ‘ఇ.డబ్ల్యూ.ఎస్’ సర్టిఫికెట్ కావాలన్నా నెలల తరబడి ఆఫీస్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. రెండేళ్లకే ఎంత దారుణమైన మార్పు వచ్చిందిరా అబ్బా! నాడు సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు.. ఇప్పుడు మాయమాటలు చెప్పి మనందరికీ వెన్నుపోటు పొడిచాడు! పాలిచ్చే బర్రెను కాదనుకుని, తన్నే దున్నపోతును తెచ్చుకుని ఇంట్లో కట్టేసుకున్నాం. ఇదేం కర్మరా రామా.. రెండేళ్లలోనే ఇట్లయిపాయె!’ అంటూ యుగంధర్ నిట్టూర్చాడు. అక్కడే కూర్చుని అన్నీ వింటున్న శ్రీకాంత్ ఒక్కసారిగా నోరు తెరిచి.. ‘నిజమేరా బావా..! జగనన్న పాలనలో మాకు కుట్టుపని నిమిత్తం ప్రతి ఏడాది రూ. 10 వేలు ‘జగనన్న చేదోడు’ పథకం కింద ఇచ్చేటోళ్లు. ఇప్పుడవి రాకుండా పోయాయి. ఊర్లో ఎక్కడైనా బతుకుదామన్నా అసలు పనే దొరకడం లేదు. చేసేది లేక కట్టుకున్న భార్యను, పిల్లలను, ముసలోళ్లను ఊర్లోనే వదిలేసి, బతుకుదెరువు కోసం హైదరాబాద్ పోయి దొరికిన కాడ కమిషన్కు బట్టలు కుడుతున్నా. ఓటు ఈ మోసగానికి వేసి పెద్ద తప్పు చేశామా అనిపిస్తోంది’ అని ఆవేదన చెందాడు. రాజశేఖర్ ఏకబిగిన అందుకొని.. ‘చంద్రబాబు పాలన అంతా ఉత్తుత్తిదేరా అబ్బా..! జనాన్ని నమ్మించడం, ఓట్లు దండుకొని మోసం చేయడం ఎలాగో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ఇటు నిరుద్యోగ భృతి లేదు, అటు సూపర్ సిక్స్ హామీల అమలు అంతంతమాత్రమే. పేద పిల్లలు డాక్టర్లు కావాలని జగనన్న ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ఈ కూటమి సర్కార్ ప్రైవేట్ పరం చేసి, పేదల వైద్యాన్ని అంగట్లో అమ్మేసింది! ఆరోగ్యశ్రీని పూర్తిగా బొంద పెట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల నుంచి అమరావతి జపం చేయడం, ప్రజలకు మాయమాటలు చెప్పి దోచుకోవడం తప్ప ఇంకేం కనిపించడంలేదు’ అని ఊదరగొట్టాడు. దాంతో రచ్చబండ కాడ ఉన్న జనం అంతా ‘అవునురో అబ్బా.. ఇవన్నీ అక్షరాలా నిజాలేరో! ఓటేసి నిలువునా మోసపోయాం’ అంటూ తలలు పట్టుకున్నారు. – కాతా వెంకట నరసింహారెడ్డి, బద్వేలుమా ఉసురు తగులుతుంది! జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, నాలాంటి నిరుద్యోగులు లక్షలాది మందికి గౌరవంగా జీవనోపాధి కల్పించారు. అలాంటి ఉపాధిని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి లాగేసుకుంది. నమ్మించి మా బతుకులను రోడ్డున పడేసిన ఈ కూటమి సర్కార్కు మా ఉసురు తగులుతుంది. – షేక్ అర్షియా, మాజీ వలంటీర్, కలసపాడు.జీవనోపాధినే లాగేసుకున్నారు! వలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించబోమని, పైగా జీతం రూ. 10 వేలు చేస్తామని ఎన్నికలపుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా కూటమి ప్రభుత్వం వచ్చాక వలంటీర్ వ్యవస్థే లేకుండా చేశారు. వలంటీరుగా ఉన్నప్పుడు నెలకు రూ. 5 వేలు వచ్చినా మా సొంత ఊర్లోనే ఖర్చులకు సరిపోయేవి. ఇప్పుడు ఆ కాస్తా లేకుండా చేసి ఘోరంగా మోసం చేశారు.– మల్లిఖార్జున, మాజీ వలంటీర్, బ్రాహ్మణపల్లె.నేడు ఆఫీసుల చుట్టూ తిప్పలు! మేము వలంటీర్లుగా ఉన్నప్పుడు నెలలో మొదటి ఐదు రోజులు ఎక్కడికెళ్లినా వెతికి పట్టుకొని మరీ అవ్వతాతల చేతుల్లో పింఛన్లు పె ట్టేవాళ్లం. ఇప్పుడు ఆ పరి స్థితి లేదు. రేషన్ కార్డు కావాలన్నా, ఇతర ప్రభుత్వ సేవ లు కావాలన్నా పేదలు తమ రెక్కాడితే గాని డొక్కాడరని తెలిసి కూడా ఉపాధి పనులు వదిలేసి నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.’– శ్రీనివాసులు, మాజీ వలంటీర్, కలసపాడు. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని రక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ‘‘పర్యావరణాన్ని పరిరక్షించడానికి నిబద్దతతో పని చేద్దాం. సుస్థిరత అనేది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. మనందరి జీవితాల్లో అంతర్భాగం కావాల్సిన ఒక బాధ్యత’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. On the occasion of World Environment Day, let us reaffirm our commitment to protecting nature and conserving the environment for future generations. Sustainability is not just a goal but a responsibility that should be integrated into our lives.#WorldEnvironmentDay— YS Jagan Mohan Reddy (@ysjagan) June 5, 2026 -
వైఎస్సార్సీపీలో పలు నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పలువురిని పార్టీ రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా నియమించారు. డి.శ్రీరామకృష్ణమూర్తి(అమలాపురం), గొల్లపల్లి డేవిడ్ రాజు(కొత్తపేట), ఎస్.సత్యనారాయణమ్మ(కర్నూల్) పార్టీ కార్యదర్శులుగా (పార్లమెంట్) నియమితులయ్యారు.అలాగే, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా జె.మారయ్య(ఆలూరు), ఆర్.బి.చంద్రశేఖర్ రెడ్డి(పాణ్యం), గంధం వీర రాఘవరెడ్డి(ఆళ్లగడ్డ), నారపురెడ్డి జగదీశ్వర్ రెడ్డి(జమ్మలమడుగు), రాచంరెడ్డి భాస్కర రెడ్డి(పుట్టపర్తి), రాజులపూడి భాస్కరరావు(అమలాపురం)ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. -
దద్దరిల్లిన గుంటూరు.. జగన్ నినాదాలతో YSRCP భారీ ర్యాలీ
-
చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి : ప్రకాశం జిల్లా ఒంగోలు చెరువుకొమ్ముపాలెం ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భభ్రాంతిని వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందటం తీవ్ర విషాదకరం.అత్యంత పిన్న వయసులో ఉన్న నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకరం. ఆ చిన్నారుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. తమ గారాల పట్టీలను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖం తీరనిది. చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ప్రకాశంలో విషాదంప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు దిగి నలుగురు చిన్నారులు గల్లంతయ్యారు. గల్లంతయిన ఇద్దరు చిన్నారుల మృతదేహాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి. మరో ఇద్దరు చిన్నారుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పారిపోలేవ్.. దాక్కోలేవ్.. జగన్ వస్తున్నాడు!
-
నిన్ను నీ కొడుకుని తగలపెట్టాలి అంబటి ఫైర్
-
ఎస్పీ బాలు జయంతి.. వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఆయనకు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన అమృత గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వేలాది పాటలు ఆలపించినా, ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని పంచిన మహా గాయకుడు ఆయన. తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన అమృత గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. వేలాది పాటలు ఆలపించినా, ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని పంచిన మహాగాయకుడు ఆయన. తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న… pic.twitter.com/X5hf8FqDgk— YS Jagan Mohan Reddy (@ysjagan) June 4, 2026 -
టీడీపీవాడు కూడా జగనే బెస్ట్ అనేలా... పేర్ని నాని గూస్ బంప్స్ స్పీచ్
-
స్పెషల్ కమిషన్ వేస్తా.. మీ ఉద్యోగం మీకు వచ్చేలా చేస్తా..! DSC అభ్యర్థులకు జగన్ హామీ
-
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
-
సీబీఐతో విచారించాలి
పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. -డీఎస్సీ బాధిత అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా సాక్షి, అమరావతి: ఒక పోస్టుకు ఒక్కరు (1:1) నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచి అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ 2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయం.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్షేపించారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్నట్లు అభ్యర్థులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోందని, అందుకే డీఎస్సీ 2025పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ 2025 అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలను వైఎస్ జగన్ దృష్టికి తెచ్చి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదన, బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్ వారికి న్యాయం జరిగేలా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఇష్టారాజ్యంగా జీవోలు జారీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీనివల్ల అర్హులైన ఎందరో అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తామన్నారు. అందుకోసం పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ఈ డీఎస్సీపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని చెప్పారు. అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని.. తప్పు చేసిన వారిని శిక్షిస్తామని చెప్పారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నాడు పారదర్శకంగా ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు.. వైఎస్సార్సీపీ హయాంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే 2019లో గాంధీ జయంతి నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా, ఏ వివాదం రాలేదు. అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే చంద్రబాబు కేవలం 16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే మీ తరఫున న్యాయపోరాటం చేస్తాం. మీకు ఖర్చు లేకుండా మేమే భరించి, కోర్టులో పోరాడతాం. పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మార్చేసి.. స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీవో ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీవో జారీ చేసి.. ఆ కోటాలో అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి కాగానే మళ్లీ నియమావళిని మారుస్తూ మరో జీవో ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తప్పుల మీద తప్పులు.. 1:1 పద్ధతిలో పిలిచి సర్టిఫికెట్ పరిశీలన కూడా పూర్తి చేసి, రిజెక్ట్ చేయడం ఒక తప్పు. రెండో అనైతికం ఏమిటంటే.. ఏ పరీక్షా రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని పూర్తి చేయగానే గేట్లు మూసి మరో జీవో ఇచ్చారు. ఇంతకంటే దగా, మోసం మరొకటి ఉంటుందా? ఓ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వ చ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే.. అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు రాలేదని చెప్పారు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు. పరీక్షకు ముందే పేపర్లు లీక్ చేయడం.. ఆ తర్వాత ఇష్టానుసారంగా జీవోలు జారీ చేయడం.. 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫై చేసి అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం... ఆ తర్వాత మెరిట్ వాళ్లకు కాకుండా కింద ఉన్నవారికి ఇవ్వడం... వీటిపై గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేస్తే స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. మీరంతా క్వాలిఫైడ్ కాబట్టే మీకు కాల్ లెటర్స్ కూడా వచ్చాయి. మిమ్మల్ని 1:1 నిష్పత్తిలో పిలిచి అన్యాయం చేశారు. రెండు జీవోలు జారీ చేసి ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఏ అర్హత లేకపోయినా, టెట్ క్వాలిఫై కాకపోయినా ఉద్యోగాలు ఇచ్చారు. అలా వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్లీ ఇంకో జీవో ఇచ్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి అన్ని అర్హతలు ఉండాలని, పరీక్ష కూడా రాయాలంటూ జీవో జారీ చేశారు. మీకు అండగా న్యాయ పోరాటం చేస్తాం.. మావైపు నుంచి మీకు పూర్తి అండగా ఉంటాం. మాకు ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. విద్యార్థి విభాగం ఉంది. లీగల్ టీమ్ ఉంది. వారితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి మీ తరఫున కోర్టులో పిటిషన్ వేసి పోరాడతాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి పూర్తి విచారణ జరిపించి మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ మూడేళ్లూ మీ తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తాం. మీ అందరికీ ఒకటే హామీ..! పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసి మీ కేసులన్నీ విచారించి న్యాయం చేస్తాం. 1998, 2008 డీఎస్సీలో కూడా అన్యాయం అయిపోయిన వారికి మనం న్యాయం చేశాం. డీఎస్సీ 2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తాం. మన ప్రభుత్వం రాగానే విచారణ జరిపిస్తాం..రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే డీఎస్సీ 2025 అక్రమాలపై విచారణ జరిపిస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు సీబీఐ విచారణకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే మీ స్పెసిఫిక్ కేసుల మీద ఒక కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. మీకు న్యాయం జరిగేలా చూస్తాం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ జరగకుండా ఉండదు. -
మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది.. మెరిట్తో సర్కారు ‘ఆటలు’!
సాక్షి, అమరావతి: ‘‘మంత్రి నిర్వాకంతో మా భవిష్యత్తు మట్టి కొట్టుకుపోయింది. తమ వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఇష్టానుసారంగా నియమాలు మార్చారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీలో అంతులేని అక్రమాలు చేశారు..! ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు..! 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు మాకు న్యాయం చేయండి...! మెగా డీఎస్సీ మెరిట్ లిస్టులో నా పేరొచ్చింది. 1:1 రేషియోలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. తీరా సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణం అడిగితే.. ఆ పోస్టు స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని.. హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల పోస్టు మిస్సయ్యిందని చాలా తేలిగ్గా సమాధానం చెబుతున్నారు. వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన జాబ్ ఇస్తామన్నట్లు కాదని అంటున్నారు..! కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకుని తిరుగుతున్నా లెక్క చేయడం లేదు..! నేషనల్ గేమ్స్లో బంగారు పతకం సాధించినా నాకు పోస్టు ఇవ్వలేదు.. రజతం, కాంస్య పతకం ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలిచ్చారు.. సర్టిఫికెట్లు పరిశీలించకుండా పోస్టులు ఇచ్చేశారు...! అసలు ఏ పరీక్షా రాయని వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం ఇచ్చి మెరిట్లో ఉన్న మాకు అన్యాయం చేశారు..! మెరిట్ లిస్టులో వచ్చిన వారికి రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం ఇవ్వడంతో నాకు రావాల్సిన ఉద్యోగం రాకుండా పోయింది...! కటాఫ్ మార్కులు ప్రకటించకపోవడం వల్ల చాలా గందరగోళంగా ఉంది...! ఉన్నది 3 పోస్టులు... ముగ్గురమే ఉన్నాం... కానీ ఫైనల్ జాబితాలో నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు..! నిబంధనలకు విరుద్ధంగా టీచర్ పోస్టులను భర్తీ చేశారని మా బాధ ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోవడం లేదు..! ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు.. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు..!!’’ ఇదీ మెగా డీఎస్సీ 2025 వేలాది మంది బాధిత అభ్యర్థుల ఆక్రందన!! మెరిట్లో ఉండి అన్యాయానికి గురైన అభ్యర్థులు బుధవారం పెద్ద ఎత్తున తరలివచ్చి తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ గోడు చెప్పుకున్నారు. డీఎస్సీ నిర్వహణ, టీచర్ పోస్టుల ఎంపికలో జరిగిన అనేక అక్రమాలను ఆయనకు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారంతా కలిసి మీడియాతో మాట్లాడారు.తమకు జరిగిన అన్యాయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరిస్తున్న డీఎస్సీ–2025 బాధిత అభ్యర్థులు నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను పక్కనబెట్టారు నేను నేషనల్ గేమ్స్లో బంగారు పతకం విజేతను. మా జిల్లా నుంచి 6 పోస్టులు ఉంటే రజతం, కాంస్య పతక విజేతలకు ఉద్యోగాలు ఇచ్చి నాకు బంగారు పతకం ఉన్నా ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. – అనిగి దుర్గయ్య, పోలవరం మండలం, ఏలూరు జిల్లా లోకేశ్ వద్దకు వెళితే.. మెగా డీఎస్సీలో ర్యాంక్ తెచ్చుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు కూడా హాజరయ్యా. ఎస్జీటీ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసింది నలుగురం మాత్రమే. అందులో ముగ్గురిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. ఎస్టీ వర్గానికి చెందిన నా పేరు తుది జాబితాలో లేదు. రోస్టర్ నంబర్లు అటూ ఇటూ చేసి నన్ను కాదని ఒక మహిళకు ఇచ్చారు. క్యారీ ఫార్వర్డ్ పోస్టు కాబట్టి నాకు కచ్చితంగా రావాలి. నాకు జాబ్ ఎందుకు రాలేదో వివరాలు చెప్పమని అప్లికేషన్ రాసిస్తే పక్కన పడేశారు. దానిపై స్టాంప్ వేసి ఇస్తే కోర్టుకు వెళ్తారని, అందుకే ఆ పని చేయబోమని అధికారులు చెప్పారు. మంత్రి నారా లోకేశ్ను కలవడానికి ఛాంబర్కు వెళ్తే అనుమతి లేదంటూ ఓఎస్డీ నా అప్లికేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ శాఖకు పంపించారు. చివరకు ఎస్టీ కమిషన్ను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది.– ఎం.జగదీష్ నాయక్, వైఎస్సార్ కడప జిల్లాఇష్టారీతిన నియమాలు మార్చారు నేను ఉర్దూ మీడియంలో చదువుకున్నా. పదో తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ కాగా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ సందర్భంగా ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉండాలన్నారు. ఈ డీఎస్సీలో గతంలో లేని విధంగా నియమాలు మార్చారు. – ఎండీ షాబుద్దీన్, విశాఖ జిల్లాచాలా అన్యాయం.. నేను ఎస్సీని. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చక్కగా జరిగింది. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత డీఈవో ఆఫీస్ నుంచి ఫోన్ చేసి మళ్లీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ అడిగితే పంపా. మాకు 3 పోస్టులు ఉన్నాయి. మేము ముగ్గురమే ఉన్నాం. కానీ ఫైనల్ జాబితాలో మాత్రం నా పేరు లేదు. కారణం అడిగితే స్పోర్ట్స్ కోటాలో ఆ జాబ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. నాకు చాలా అన్యాయం జరిగింది. – ఇందిర, కృష్ణా జిల్లాఅన్నీ బాగున్నా జాబ్ రాలేదు.. నేను కరాటే బ్లాక్బెల్ట్ ఛాంపియన్ను. మా ఊరిలో 37 మంది డీఎస్సీ రాస్తే నేను ఒక్కదాన్నే పాస్ అయ్యా. నేను ఓపెన్ కేటగిరీలో ఉన్నా రిజర్వేషన్ కేటగిరీలో పిలిచారు. నా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ బాగా జరిగింది. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. కారణం అడిగితే అప్పటికే అన్ని పోస్టులు భర్తీ అయ్యాయని చెప్పారు. గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. నాది బీసీ–డీ అయితే నన్ను ‘బీసీ–సి’గా చూపారు. కోర్టుకు వెళ్లినా ఎలాంటి విచారణ జరిపించడం లేదు. మరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఎందుకు చేశారంటే సమాధానం చెప్పలేదు. – నాగలక్ష్మి, గుంటూరు జిల్లాఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? బీసీ–ఈ వర్గానికి చెందిన నేను సెకండ్ ప్లేస్లో ఉన్నా. ఎస్ఏ పోస్టు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లా. అధికారులు కంగ్రాట్స్ కూడా చెప్పారు. కానీ సెలక్షన్ లిస్టులో నా పేరు లేదు. కారణాలు చెప్పలేదు. ఎన్నిసార్లు లోకేశ్ను కలవాలని ప్రయత్నించినా ఇంటి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిల్చినప్పుడు ఉద్యోగం రావాలి కదా? ఇవన్నీ చంద్రబాబుకు తెలియదా? వెరిఫికేషన్ చేసినంత మాత్రాన జాబ్ ఇవ్వాలా? అని మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అన్యాయానికి న్యాయం చేయగలిగేది మీరు ఒక్కరు మాత్రమే. మీపై ఎంతో విశ్వాసం ఉంది. – షర్మిల, మదనపల్లె. అన్నమయ్య జిల్లాజీవో 77 ప్రకారం ఓపెన్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయాలి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి. హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం మహిళలు, పీహెచ్సీ, ఎక్స్సర్వీస్మెన్, స్పోర్ట్స్కోటా పోస్టులు భర్తీ చేయాలి. అయితే ప్రభుత్వం అలా చేయలేదు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారట.. నాకు డీఎస్సీలో 75 మార్కులు వచ్చాయి. తొలి జాబితాలోనే నా పేరు వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా బాగా జరిగింది. కానీ ఉద్యోగం రాలేదు. ఎందుకు అని అడిగితే.. మీ కులంలో స్పోర్ట్స్ కోటాలో ఇంకొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. మరి ముందే అతడు ఉన్నాడని తెలిసీ నన్ను ఎందుకు పిలిచారు? 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేసినట్లు ఇప్పుడు కూడా న్యాయం చేయండి. – బాలకృష్ణ, కాకినాడ, జిల్లాఅవకాశం ఉన్నా పోస్టు ఇవ్వలేదు డీఎస్సీ మెరిట్లో నాకంటే ముందు ఒక అమ్మాయి ఉంది. ఆమె కానిస్టేబుల్. ఆమెది ఫేక్ సర్టిఫికెట్. మేం ఫిర్యాదు చేస్తే ఆమెను క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత నేను ఉన్నా నాకు అవకాశం ఇవ్వలేదు. విజయనగరానికి చెందిన అమ్మాయికి జాబ్ ఇచ్చారు. ఒక పోస్టు క్యాన్సిల్ అయితే తర్వాత అభ్యర్థికి ఇవ్వబోమని, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. – దుర్గామల్లిక, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లామా గోడు చెబుతుంటే ‘ఫేక్’ అంటున్నారు.. మాది పేద మత్స్యకార కుటుంబం. కోచింగ్కు వెళ్లలేదు. కష్టపడి చదివా. ఫిజికల్ సైన్స్ బీసీ–సీలో నాది మూడో ర్యాంక్. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. ఓవరాల్ మెరిట్లో నాది 53వ ర్యాంక్. 10వ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఓపెన్లో కాకుండా బీసీ–సీ కేటగిరీలో పోస్టు ఇచ్చారు. అతడిని ఓపెన్లో పంపించి ఉంటే నాకు మా కేటగిరీలో జాబ్ వచ్చి ఉండేది. నాకు జాబ్ ఎందుకు రాలేదని అధికారులను అడిగితే ఒక అమ్మాయి స్పోర్ట్స్ సర్టిఫికెట్తో వచ్చిందని చెప్పారు. మా గోడు ‘సాక్షి’లో ప్రచురిస్తే మమ్మల్ని ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. – శ్రావణ్కుమార్, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లాతీరని అన్యాయం.. నాది బీసీ–ఏ. ఇందులో ఒకటే పోస్టు ఉంది. నేను ఒక్కదాన్నే ఉన్నా. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినా చివరకు ఉద్యోగం రాలేదు. మహిళా రిజర్వేషన్లో ఒక పోస్టు ఉంది. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫిజికల్ సైన్స్లో మాకు అర్హత ఉంది. ఎమ్మెస్సీ చదివా. నాకు స్పోర్ట్ సర్టిఫికెట్ ఉన్నా జనరల్ కేటగిరీలో దరఖాస్తు చేశా. కానీ నాకు తీరని అన్యాయం చేశారు. – లక్ష్మీపార్వతి, వైఎస్సార్ కడప జిల్లా మెరిట్లో ఉన్నా అన్యాయం.. నాది జనరల్ కేటగిరిలో 76వ ర్యాంక్. ఓహెచ్లో ఫస్ట్ ర్యాంక్. జిల్లాలో ఫస్ట్ వచ్చా. కానీ నాకు మొదటి విడతలో కాకుండా రెండో దశలో కాల్ లెటర్ పంపారు. మెడికల్ టెస్టు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా జరిగింది. కానీ జాబ్ రాలేదు. రోస్టర్లో మరొకరు ముందు ఉన్నారని చెప్పారు. 137వ ర్యాంక్ వచ్చిన ఆమెకు జాబ్ ఇచ్చారు. మెరిట్లో ఉన్నా నాకు ఇవ్వకుండా అన్యాయం చేశారు. – నరసింహారావు, ప్రకాశం జిల్లాఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిటోరియస్ క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం హారిజాంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 4 ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదు నేను ఎస్ఏ సోషల్లో డీఎస్సీ రాశా. మా బీసీ–డీ కేటగిరీలో 7 పోస్టులు ఉంటే 5 పోస్టులు జనరల్లో మిగిలిన రెండు మా కేటగిరీలో ఉన్నాయి. నన్ను సర్టిఫికెట్ పరిశీలనకు పిలిచినా జాబ్ ఇవ్వలేదు. నా పోస్టు హారిజాంటల్ రిజర్వేషన్లో మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు. డీఈవో ఆఫీస్లో అడిగితే తమకేమీ తెలియదని విజయవాడ వెళ్లమన్నారు. అక్కడకు వెళ్తే తమకు సంబంధం లేదంటున్నారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగదు. మాకు మీరు మాత్రమే న్యాయం చేయగలరు. – ఏకాంబరం, మాదిరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా జీరో ర్యాంకు వారికి ఉద్యోగం ఇచ్చారు నా సర్టిఫికెట్ వెరిఫికేషన్ బాగా జరిగింది. నాది బీసీ–బీలో మూడో పోస్టు. కానీ జాబ్ రాలేదు. నాకు ఇవ్వకుండా స్పోర్ట్స్ కేటగిరీలో ఇచ్చామని చెప్పారు. నాపేరు రిజెక్ట్ లిస్ట్లో కూడా లేదు. అదేమని అడిగితే సమాధానం చెప్పడం లేదు. నాకు అన్యాయం చేసి జీరో ర్యాంక్ ఉన్న వ్యక్తికి స్పోర్ట్స్ కోటా కింద జాబ్ ఇచ్చారు. – రాణి, కృష్ణా జిల్లాడిగ్రీ లేకున్నా పోస్టు ఇచ్చారు మాకు (మహిళలకు) ఓపెన్ కేటగిరీలో 30 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటా కింద అందులోకి ఒకరిని తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు డిగ్రీ లేదు కాబట్టి అది పూర్తి చేసుకోవడానికి మూడేళ్ల సమయం ఇచ్చారు. అంటే.. అర్హత లేకున్నా ఉద్యోగం ఇచ్చి, ఆ తర్వాత చదువుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆమెది ఓసీ. ఆమెను తీసుకొచ్చి మా కేటగిరీలో వేశారు. దాంతో నా ఛాన్స్ పోయింది. – వీరవేణి, తూర్పు గోదావరి జిల్లా కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నాకంటే ముందు ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. అతడిది ఫేక్ సర్టిఫికెట్ అని తేలడంతో పోస్టింగ్ ఆపారు. జాబితాలో ఆ తర్వాత ఉన్న నాకు ఉద్యోగం ఇవ్వకుండా క్యారీ ఫార్వర్డ్ చేశామని చెప్పారు. ఇక్కడ అన్ని అర్హతలున్న నేను ఉన్నా, నాకు జాబ్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాఅన్నీ సరిగా ఉన్నా ఉద్యోగం ఇవ్వలేదు ఎస్సీ వర్గానికి చెందిన నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. గ్రీవెన్స్ సెల్లో దరఖాస్తు చేస్తే నావన్నీ కరెక్టుగా ఉన్నాయని, జాబ్ ఎక్కడివ్వాలో తెలియడం లేదని సమాధానం చెప్పారు. ఆశ్చర్యం ఏమిటంటే నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని మా కేటగిరీలో చూపారు. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ముగ్గురిని ఓపెన్లో చూపారు. ఎవరిని కలిసినా చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. – కె.శరత్బాబు, కాకినాడ, తూ.గో జిల్లా స్పోర్ట్స్ కోటాలో ఆయా శాఖలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని సవరించిన జీవో వైకల్యం సర్టిఫికెట్ ‘రిజెక్ట్’.. గెరివి అంజనప్పకు ఒక కన్ను పూర్తిగా లేదు. మరో కంటికి రక్త సరఫరా లేదు. ఆయనకు కంటి చూపు లేదని ధ్రువీకరిస్తూ మెడికల్ బోర్డు (అనంతపురం జీజీహెచ్) 40 శాతం వైకల్యంతో సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారు. విజయవాడ వచ్చి కమిషనరేట్లో కలిసినా తామేమీ చేయలేమంటున్నారు. – హెచ్.వసంత్కుమార్, అనంతపురం జిల్లా (అభ్యర్థి గెరివి అంజనప్ప తరపున మాట్లాడారు)ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది... నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి, అక్రమాలతో డీఎస్సీ –2025 ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. 1 : 1 పద్ధతిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరై ఉద్యోగం వస్తుందన్న భరోసాతో ఇంటికెళ్లిన వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. స్పోర్ట్స్ కేటగిరీ పేరుతో అర్హులైన అభ్యర్థుల పొట్టగొట్టారు. అర్హులకు అన్యాయం చేసి పోస్టులను అమ్ముకోవడంపై సీబీఐతో విచారించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. – ఎ.రవిచంద్ర, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీల ఏర్పాటు
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. రాజధాని రైతులు, డీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. బాధితుల సమస్యలు తెలుసుకుని, న్యాయపోరాటం చేసేందుకు ఈ కమిటీలు పనిచేస్తాయి.ఏ కమిటీల్లో ఎవరు?సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ: పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేశ్, మంగళగిరి ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాలవజ్రబాబు సీఆర్డీఏ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శనరెడ్డి, కె.శ్రీనివాస్డీఎస్సీ పోరాట కమిటీ: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, టి.కల్పలత, పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్రడీఎస్సీ లీగల్ సెల్ కమిటీ: పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎం.మనోహర్ రెడ్డి, జల్లా సుదర్శన్ రెడ్డి, జీవీఎస్ కిశోర్ -
అన్నా నువ్వే మాకు దిక్కు... బాధపడకు అమ్మా.. ఎలా న్యాయం జరగదో నేనూ చూస్తా..!
-
ఆటా సభలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్కు వివరించారు. -
జగన్ ముందే జీవోలన్నీ గుక్కతిప్పుకోకుండా చెప్పిన.. డీఎస్సీ అభ్యర్థి!
-
మీ ఉద్యోగం మీకు వచ్చేలా చేసే బాధ్యత నాది.. జగన్ భరోసా
-
డీఎస్సీ అభ్యర్థులతో వైఎస్ జగన్, కంటతడి పెట్టుకున్న మహిళా
-
జగన్.. జగన్.. అని గొంతు చించుకున్నాడు... తెలంగాణలో మీటింగ్ పెడతాడట
-
డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వ డీఎస్సీ స్కాంకు బలైన డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా ఉంటానని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హమీ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ తమను అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు డీఎస్సీ అభ్యర్థులు బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో అర్హత ఉన్నా తమకు ఉద్యోగం రాని తీరును వివరించారు. తెర వెనుక ‘డార్క్ ఆపరేషన్’ జరిగిందనీ.. పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారాయని డీఎస్సీ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు తోడుగా నేనుంటా డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనపై వైఎస్ జగన్ స్పందించారు. అభ్యర్థులకు న్యాయపరమైన సహాయం అందిస్తాం. అన్యాయం జరిగిందంటున్న అభ్యర్థులకు తోడుగా నిలుస్తాం. అభ్యర్థుల న్యాయ పోరాటాలకు తోడుగా ఉంటాం. పార్టీకి చెందిన లీగల్ విభాగం ఈ పోరాటంలో మీకు సహాయపడుతుంది. ఆ లీగల్ ఖర్చులను మేమే భరిస్తాం.డీఎస్సీ అక్రమాలు, ఉల్లంఘనలపై సీబీఐ చేత ఎంక్వైరీ చేయించాలని ఇప్పటికే డిమాండ్ చేశాం. ఇప్పుడు అన్యాయం జరిగిందని చెప్తున్న కేసులన్నింటి మీద రీ ఎంక్వైరీ చేయిస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కచ్చితంగా రీ ఎంక్వైరీ చేయిస్తాం. ఈ ప్రత్యేక కేసులమీదే కమిషన్కూడా వేయిస్తాం. స్పోర్ట్స్ కోటా పేరిట ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా సర్టిఫికెట్ ఆధారంగా ఇస్తామని జీవో ఇచ్చారు.ఉద్యోగాలు పూర్తిచేశాక, మళ్లీ ఆ జీవోను మార్పు చేసి మళ్లీ కొత్త జీవో తీసుకొచ్చారు. ఎవరికోసం మొదట జీవో తీసుకొచ్చారు. ఎవరికి మేలు చేయడానికి తీసుకొచ్చారు. చంద్రబాబు తన వాళ్లకోసం గేట్లు తెరిచారు. వాళ్ల పని అయిపోయిన తర్వాత మళ్లీ జీవోను ఉప సంహరించుకున్నారని చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఢిల్లీ అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఢిల్లీలోని రెస్టారెంట్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవటం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయని అన్నారు. -
బాబుకు బిగ్ షాక్.! "మావిగన్" కి జై కొడుతున్న రాజధాని రైతులు
-
వైఎస్ జగన్ను కలిసిన డీఎస్సీ అభ్యర్థులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను తాజాగా డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతిని అభ్యర్థులు.. వైఎస్ జగన్కు వివరించారు. టీడీపీ నేతలు స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నట్టు తెలిపారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు చెప్పుకొచ్చారు. నిజమైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం ఆవేదన వ్యక్తం చేశారు. -
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
మా భూములివ్వం.. బాబు ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబు సర్కారు.. మరో 50 వేల ఎకరాలు కావాలంటూ తమను వేధిస్తోందని, మూడు పంటలు పండే పచ్చటి భూములను ఇచ్చేదే లేదని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాల రైతులు స్పష్టం చేశారు. తమ ప్రమేయం లేకుండానే లే అవుట్లు, ప్లాట్లు వేస్తోందని.. రిజిస్ట్రేషన్లు సైతం చేసేస్తోందని మండిపడ్డారు. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న తమకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తమ గోడు ఏమాత్రం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ కష్టాన్ని వివరించామని తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి నేతృత్వంలో ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు వైఎస్ జగన్ను కలిసి తమ కష్టాలను వివరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని చెప్పారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. రెండో విడత భూసేకరణ పేరుతో రైతులను భయపెడుతున్నారని, ఉన్న అరెకరం పొలం ఇచ్చి తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. పెనుమాకలో మినీ రిజర్వాయర్ పేరుతో పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం.. రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేసిందని చెప్పారు. పక్కనే భూ సేకరణకు భూములివ్వని రైతుల పొలాలను 20 అడుగుల లోతు వరకు చెరువుల్లా తవ్వేసి.. వ్యవసాయానికి పనికి రాకుండా చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారిపోయాయని చెప్పారు. తామంతా (రైతులు) ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం పొలాల్లో తవ్వేసిన మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికే రాజధాని కోసం ఇళ్లు, పొలాలను ఇచ్చేసిన రైతులకు ప్రభుత్వం వాగుల్లో ప్లాట్లు కేటాయించడం అత్యంత దారుణమని మండిపడ్డారు.ఎంత మంది రైతులను చంపేద్దామనుకున్నారు?రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. భూములు ఇవ్వడానికి నిరాకరించిన రైతుల పట్ల మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ఉన్న అరెకరం పొలం ఇచ్చి కుటుంబాలను ఎలా పోషించుకోవాలన్న రైతుల ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. అనుమతి లేకుండా రైతుల పొలాలను అడ్డగోలుగా తవ్వేయడం దుర్మార్గం కాదా? భూసేకరణకు భూములివ్వని రైతుల పొలాల్లో 20 అడుగుల లోతున చెరువుల్లా తవ్వేశారు. ఇటీవల కురిసిన వర్షంతో ఆ పొలాలన్నీ చెరువుల్లా మారాయి. డ్రెడ్జింగ్ చేసి ఇసుకను పక్కనే కుప్పలుగా పోశారు. రైతులు ఆవేదనతో అల్లాడిపోతుంటే కూటమి నాయకులు మాత్రం రైతుల పొలాల్లో మట్టి, ఇసుక అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. మంచి ప్లాట్లు నేతలు తీసుకుని, రైతులకు వాగుల్లో ప్లాట్లు కేటాయించడం చూసి ఎంతో మంది బోరున విలపిస్తున్నారు. ఇలా అధికారులకు తన గోడు చెప్పుకుంటూనే ఓ రైతు గుండె పగిలి చనిపోయాడు. ఇప్పుడు రైతుల పొలాలను తవ్వేసి, ఇంకెంత మంది రైతులను ఇలా చంపేద్దామనుకుంటున్నారు? కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసం రైతుల జీవితాలను మట్టిపాలు చేయాలనుకోవడం చాలా తప్పు. బలవంతపు భూసేకరణ పేరుతో రైతులను వేధించడం ఇకనైనా ఆపాలి. – దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తవైఎస్ జగన్ హామీతో ధైర్యం వచ్చిందిచంద్రబాబు ప్రభుత్వ తీరుతో తామంతా నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని, ఈ ప్రభుత్వం తమ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తోందని రాజధాని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను సీఆర్డీఏ కమిషనర్, మంత్రి లోకేశ్.. ఉండవల్లిలోనే ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని తెలిపారు. ఉన్న అరకొర భూములు ప్రభుత్వానికి ఇచ్చేస్తే తరతరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశామన్నారు. తమ బాధలను సావధానంగా విన్న వైఎస్ జగన్.. అండగా ఉంటామని తమకు హామీ ఇచ్చినట్టు రైతులు తెలిపారు. ఈ అన్యాయంపై రైతుల పక్షాన నిలబడి న్యాయస్థానాల్లో పోరాడతామని హామీ ఇచ్చారన్నారు. జగన్ హామీతో తమకు ధైర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వమే దగ్గరుండి రైతుల పొలాలను తవ్వేయడం, భూములు ఇవ్వని రైతుల పొలాల్లో వారి అనుమతి లేకుండా లే అవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలుసుకుని వైఎస్ జగన్ మండిపడ్డారని తెలిపారు.చంద్రబాబు, లోకేశ్ మా గోడు వినలేదునాకు ఉన్నదే కొంచెం భూమి. అందులో కొంత కృష్ణా నదిలో కొట్టుకుపోయింది. మిగిలింది సీడ్ యాక్సిస్ రోడ్ అంటున్నారు. దాని పక్కనే బఫర్ జోన్ అంటున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూమిలో కూడా లేఅవుట్ వేశారు. నాకు భూమి మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. సీఆర్డీఏ కమిషనర్ మా మొర ఆలకించడం లేదు. మా ఎమ్మెల్యే లోకేశ్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోనే ఉంటారు. మా రైతులను పిలిచి మా గోడు వినాలి. పచ్చని పంటలు పండే భూములు ఇవ్వడానికి మేం సిద్ధంగా లేము. ప్రభుత్వం స్పందించక పోవడంతో న్యాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశాం. వైఎస్సార్సీపీ లీగల్గా అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. – శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి రైతుభూములివ్వడం ఇష్టం లేదుతరతరాలుగా మేము అనుభవిస్తున్న భూమిని ల్యాండ్ పూలింగ్కు ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. 12 ఏళ్లుగా ఇదే మాట మీదే ఉన్నా. ఈ భూమిని నమ్ముకునే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. పిల్లలను చదివించుకుంటున్నా. అన్నం పెట్టే పొలాన్ని ఇవ్వడం మాకిష్టం లేదు. – శంకర్రావు, ఎర్రపాలెం రైతుప్రభుత్వం తీరుతో నిద్ర కరువు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కారణంగా మేం రోజూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వడం ఇష్టం లేదని మొత్తుకుంటున్నా నోటీసులు, నోటిఫికేషన్ల పేరుతో మమ్మల్ని అధికారులు వేధిస్తున్నారు. వైఎస్ జగన్ హామీతో మాకు ధైర్యమొచ్చింది. – అశోక్ రెడ్డి, ఉండవల్లి రైతుమా పొలాన్ని పనికి రాకుండా చేశారుమా గ్రామ రైతులు ఏడాదంతా పూల తోటలు సాగు చేస్తారు. ఎకరం పొలంలో ఏడాదికి రూ.3–4 లక్షలు సంపాదిస్తాం. రెండెకరాలున్న రైతులు ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా తరతరాలుగా బతుకుతున్నారు. మొదటి విడత భూసేకరణకు పోను మా గ్రామంలో 450 ఎకరాల భూమి మాత్రమే మిగిలి ఉంది. మా సమ్మతి లేకుండానే ఆ భూముల్లో కూడా ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేశారు. ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. మా పొలాల చుట్టూ మెరక తోలేస్తున్నారు. వర్షాలు కురిస్తే నీరు నిలబడిపోయి ఆ పొలం వ్యవసాయానికి పనికి రాకుండా పోతుంది. ఇలాగైతే మేం ఏం తిని బతకాలి? – శివరామ్, రైతు, నిడమర్రు -
అమరావతి రైతులకు అండగా ఉంటాం
సాక్షి, అమరావతి: ‘రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలన్నదే మా అభిమతం.. ముందు నుంచి మా వైఖరి అదే.. మీకు అన్ని విధాలా అండగా ఉంటాం’ అని రాజధాని అమరావతి ప్రాంత రైతులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం దారుణమని, బాధితుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. వారికి బాసటగా నిలిచారు. రైతుల భూములను లాక్కోవడానికి దౌర్జన్యం చేస్తున్న వారందరి పని పడతామని, తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కురగల్లు గ్రామాలకు చెందిన రైతులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు, బెదిరింపులను వైఎస్ జగన్కు వివరించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు, బాధలు విన్న వైఎస్ జగన్, రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏం అన్నారంటే..అందుకే మావిగన్ ప్రతిపాదన‘‘ఇప్పటికే 50 వేల ఎకరాలు తీసుకున్నారు. ఇంకా 50 వేల ఎకరాలు అవసరం ఏముంది? అందుకే ‘మావిగన్’ ప్రతిపాదించాం. ఇప్పటికే గన్నవరంలో విమానాశ్రయం ఉంది. దానికి దగ్గర్లోనే మరో ఎయిర్పోర్టుకు అనుమతి ఇవ్వరు. మావిగన్లో పోర్టు కూడా ఉంది. అది మచిలీపట్నంలో ఉంది. చంద్రబాబు తీరుతో మరో 30 ఏళ్ల తర్వాత కూడా మనకు రాజధాని కనిపించదు. ఎందుకంటే పనులు జరగవు. కారణం అక్కడ కనీస మౌలిక వసతుల కల్పన కోసం ఎకరానికి రూ.2 కోట్లు కావాలని 12 ఏళ్ల క్రితమే బ్యాంకులకు నివేదిక ఇచ్చారు. నిజానికి ఇప్పటికి ఆ రేటు పెరిగింది. ఈ లెక్కన రోడ్లు, డ్రైనేజీ, నీరు, కరెంటు వీటిన్నింటికే ఎన్నేళ్లు ఎన్ని కోట్లు ఖర్చు చేయాలి?చంద్రబాబు ఉద్దేశం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాది రైతు పక్షపాత ప్రభుత్వం. రైతులను సంతోష పెట్టే విధంగా ఉండాలనేదే మా అభిమతం. ముందు నుంచి మాది అదే వైఖరి. కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక్కడ రైతులకు నష్టం కలగకూడదనే మావిగన్ను ప్రతిపాదించాం. ఆ ప్రాంతంలో ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం జీరో నుంచి కడతామని అమరావతిపై వెనక్కు తగ్గడం లేదు. అక్కడ నిరంతరం పనులు.. నిరంతరం కమీషన్లు.. అదే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం.. అదే చంద్రబాబు ఉద్దేశం. రాజధాని పనుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. అవసరం అయితే భూములు వెనక్కుఅమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తాం. బలవంతంగా భూ సేకరణ అనేది ఉండదు. అవసరం అయితే భూములు వెనక్కు ఇస్తాం. ఇప్పుడు మీ పోరాటంలో మా పార్టీ న్యాయ విభాగం కూడా పాలు పంచుకుంటుంది. మా లీగల్ టీమ్ మీకు అన్ని విధాలుగా సహాయ, సహకారిగా ఉంటుంది. పార్టీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తాం. మీ తరఫున గట్టిగా పోరాడతాం. మనం ఇప్పుడు చేయగలిగింది న్యాయ పోరాటం మాత్రమే. మూడేళ్ల తర్వాత దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం ఏర్పడితే, మీకు పూర్తి న్యాయం చేస్తాం. అవకాశం ఉంటే భూములు కూడా తిరిగి ఇస్తాం.దౌర్జన్యం చేసే వారికి శిక్ష తప్పదుముఖ్యమంత్రిగా చేయకూడని పని చంద్రబాబు చేస్తున్నారు. రైతులు భూమి ఇవ్వకపోతే కక్షగట్టడం దారుణం. ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేయడం, కాలువ తవ్వడం, రోడ్లు వేయడం, తోడిన నీరు పంపింగ్ చేయడం, దగ్గర్లో రిజర్వాయర్లు ఉంటే గండి కొట్టి, నీరు పారేలా చేయడం దారుణం. ఇప్పుడు పలు రకాలుగా దౌర్జన్యం చేస్తున్న వారందరికీ శిక్ష పడేలా చేస్తాం. మీకు న్యాయం చేస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించేలా చేస్తాం. మీ తరఫున పోరాడేందుకు లీగల్ కమిటీ వేయడం ద్వారా అమరావతి రైతులకు న్యాయం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం’’ అని వైఎస్ జగన్ అమరావతి రైతులకు భరోసా ఇచ్చారు. -
ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అత్యంత బాధాకరం
సాక్షి, అమరావతి: పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మహోన్నత లక్ష్యంతో గత ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులతో అమలైన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరమని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపుగా నిలిచిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నరసరావుపేట, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు వైద్యులు మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య రంగ పరిస్థితులు, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కాకపోవడం వల్ల వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారని తెలిపారు. ఆస్పత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు పారదర్శకంగా ఇవ్వకుండా, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో చికిత్స అందించాల్సిన వ్యాధులకు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా నిధులు కేటాయిస్తూ.. అందులో అవినీతి, కమీషన్లకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం (ఆరోగ్య ఆసరా), రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడం, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు, నాడు – నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలతో వైద్య, ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ డాక్టర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, వైద్యులు కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి, శేషిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, హనిమిరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రకిరణ్, వసంత, చెన్నారెడ్డి, కొండారెడ్డి, జయభారత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, క్రాంతికుమార్, వెంకట లక్ష్మి తదితరులు వైఎస్ జగన్ను కలిశారు. -
వైఎస్ జగన్కు వైద్యుల ఫిర్యాదు
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయి పేదలు నాణ్యమైన వైద్యానికి దూరమయ్యారంటూ డాక్టర్లు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటురూ జిల్లా డాక్టర్లు వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరోగ్రశ్రీ నిర్వీర్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు చికిత్సకు నోచుకోలేకపోతున్నారన్న డాక్టర్లు..ఆసుపత్రులకు మంజూరు చేసే ఎల్వోసీలు కూడా పారదర్శకంగా లేవన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. కమీషన్ల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు.అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీని తెచ్చారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేయడం బాధాకరం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించాం. మరిన్ని వ్యాధులను చేర్చడంతో పాటు చికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సహాయం అందించాం. రోగులకు మెరుగైన సేవలు అందించేలా అనేక సంస్కరణలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేశాం. కొత్త మెడికల్ కాలేజీలు, గ్రామ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం, నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టాం. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. కానీ చంద్రబాబు సర్కార్ వాటిని నిర్వీర్యం చేయటం బాధాకరం. బాధితులకు అండగా నిలుద్దాం’అని పిలుపునిచ్చారు. -
అన్యాయంగా, బలవంతగా తీసుకున్న, మీ భూమిని వెనక్కి ఇచ్చే బాధ్యత నాది
-
ఫైనల్ గా చెప్పేది ఒక్కటే.. మావిగన్ బెస్ట్.. అమరావతి రైతులతో జగన్
-
LIVE : అమరావతి రైతులతో వైఎస్ జగన్..
-
భయపడకండి మీకు నేనున్నా... అమరావతి రైతులకు జగన్ హామీ
-
అమరావతి రైతులతో YS జగన్ భేటీ
-
జగన్ ఇచ్చిన ఇళ్ల స్థలాలను జిందాల్ సంస్థకు..!
-
తెలంగాణ ప్రజలకు YS జగన్ శుభాకాంక్షలు
-
అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: అమరావతి రైతులతో వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతి ప్రాంత రైతులకు అండగా ఉంటామని, కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకుంటామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. భూములు ఇవ్వని రైతుల్ని కూటమి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందంటూ అమరావతి రైతులు మంగళవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వైఎస్ జగన్.. అమరావతి రైతులకు ధైర్యం ఛెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది..: రైతులుఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. భూములు ఇవ్వని వారిని ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. భూ సేకరణకు నోటిఫికేషన్లు ఇచ్చి దౌర్జన్యం చేస్తోంది. భూములు ఇవ్వని రైతుల పొలాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. డెవలప్మెంట్ పనులు పేరు చెప్పి మా పొలాలను ధ్వంసం చేస్తోంది. దేవాలయ భూముల్లో ఇప్పుడు ప్లాట్లు ఇస్తామంటున్నారు. దేవాలయ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేవాలయ భూముల రక్షణ విషయంలో మీరు తోడుగా ఉండాలి. ఇప్పుడు కడుతున్న స్టీల్ బ్రిడ్జి పూర్తిగా కుంగిపోయింది. ఈ గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు.కరకట్ట రోడ్డు విస్తరించుకుంటే సరిపోతుంది.దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది, రైతులకు ఇబ్బంది లేకుండా పోతుంది. ఉండవల్లికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరుగలేదు.బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.మా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గట్టిగా గళం వినిపించాలి’ అని కోరారు.రైతుల్ని బలవంత పెట్టడం సరికాదు: వైఎస్ జగన్అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తాం. రైతులను బలవంతం పెట్టడం మంచిదికాదు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. రైతులకు సంతోష పెట్టేలా ఏదైనా జరగాలి. వారిని కష్ట పెట్టేలా చేయకూడదు. మొదటి తీసుకున్న 50వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ 50వేల ఎకరాలు అంటున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా మావిగన్ను సూచించాం. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఉంది. అది ఉండి కూడా మరొక ఎయిర్పోర్టు అంటున్నారు. ఇప్పుడ అక్కడ పనులు కూడా జరుగుతున్నాయి. వచ్చే కొద్ది నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.మచిలీపట్నంలో పోర్టు కూడా వచ్చింది. మన హయాంలో మొదలుపెట్టాం, నిధుల కొరతలేకుండా చూశాం. జాతీయ రహదారులు ఉన్నాయి, రైల్వే స్టేషన్లు ఉన్నాయి.కాని ఇవేమీ చంద్రబాబుకు పట్టదు. భవిష్యత్తులో కూడా రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు.కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చేయాలి. జీవితమంతా రోడ్లు వేయడానికి, జీవితమంతా డ్రైనేజీ తవ్వడానికి, జీవితమంతా నీళ్లు ఇవ్వడానికి, జీవితమంతా కరెంటు ఇవ్వడానికే ఖర్చుపెట్టాలి.దాదాపు రెండు లక్షల కోట్లు దీనికోసమే ఖర్చు చేయాలి.రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోంది. ఏది చూసినా స్కామే కనిపిస్తోంది. రాజధాని పేరుతో స్కాములు మీద స్కాములు చేస్తున్నారు. మావిగన్ను గ్రోత్ కారిడర్గా ప్రకటిస్తే చాలు వెంటనే అభివృద్ధి. 110 కి.మీ. అటు ఇటూ గ్రోత్ కారిడర్కు అటు ఇటూ.. ఈ డబ్బు పెడితే మొత్తం కారిడర్ అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ ప్రజలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రజా ప్రతినిధుల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో జరిగే ప్రధాన కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. Warm wishes to all the brothers and sisters of Telangana on the auspicious occasion of Telangana Formation Day!— YS Jagan Mohan Reddy (@ysjagan) June 2, 2026 -
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో రెండేళ్లుగా జరుగుతున్న దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా, వెన్నుపోటు పాలనతో ప్రజలు విసిగిపోయారని, అయినా ప్రభుత్వం నిస్సిగ్గుగా అబద్ధాలతో డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ పార్టీ నేతలతో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’పేరుతో పోస్టర్, బుక్ లెట్ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.అనంతరం చంద్రబాబు మోసాల పాలనకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమాలకు ప్రజలు, మేథావులు, ఆలోచనాపరులు విరివిగా హాజరై చంద్రబాబు మోసాల్ని గ్రహించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. తన ప్రసంగంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకేమన్నారంటే..చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లురెండేళ్లుగా చంద్రబాబు ఆధ్వర్యంలో దుర్మార్గ, రాక్షస, అరాచక, మాఫియా పాలన జరుగుతోంది. ఎలాంటి జంకూ బొంకూ లేకుండా బరితెగించి, చట్టాన్ని పూర్తిగా వాడుకుని, వ్యవస్థలన్నింటినీ తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చేశారు. ఓవైపు అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. మా పాలనలో ఐదేళ్లలో చేసిన అప్పును ఇప్పుడు రెండేళ్లలోనే చేసేశారు. అప్పట్లో రెండేళ్ల పాటు కోవిడ్లో ఆదాయం రాలేదు, ఖర్చు పెరిగింది. తానిచ్చిన మోసపూరిత హామీల్ని పక్కన పెట్టేయడమే కాకుండా, అవన్నీ పూర్తి చేసేశామని చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న తరుణంలో దీనిపై ప్రజల్లో చర్చ జరగాలంటే, ఈ రెండేళ్లలో జరిగే ఘోరం తెలియాలంటే ఓ ఉపన్యాసం, ప్రెస్ మీట్ తో సాధ్యం కాదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం.ఈ మోసపూరిత పాలనలో సంక్షేమ పథకాలన్నీ చాపచుట్టేసిన నేపథ్యంలో వాటిపై ప్రజల్లో చర్చ జరిగే విధంగా, మేథావులు, ఆలోచనాపరులు, వివేచనా పరులు తమ చుట్టూ ఉండే వారికి చెప్పే విధంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఇవాళ పోస్టర్ కార్యక్రమం విడుదల కార్యక్రమం ఇక్కడ చేశాం, రేపు జిల్లా కేంద్రాల్లో పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఎల్లుండి నియోజకవర్గ కేంద్రాల్లో ఇదే కార్యక్రమం జరుగుతుంది.ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు నిరసన కార్యక్రమాలుప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్తో ఫోన్లలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్ లెట్, పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు దీన్ని డౌన్ లోడ్ చేసుకుని, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. అలాగే ప్రజల వైపు నుంచి సూచనలు, సలహాలు ఉన్నా స్వీకరిస్తాం. ఈ క్యూఆర్ కోడ్ తో పోస్టర్లు డౌన్ లోడ్ చేసుకుని, మీ చుట్టు పక్కల ఉండే వారితో చర్చించాలని కోరుతున్నాం.రాష్ట్రంలో అతిపెద్ద ప్రతిపక్షంగా, బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ 2019-24 మధ్య ఇచ్చిన రికార్డు స్థాయి సంక్షేమ పాలనను సైతం గుర్తుచేసుకునే విధంగా, ప్రస్తుత పాలనతో పోల్చుకునే విధంగా 4వ తేదీ మండల కేంద్రాల్లో నిరసనలు, 8, 9 తేదీల్లో టౌన్ హాళ్లలో మీటింగ్స్ నిర్వహించబోతున్నాం. అలాగే 12వ తేదీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తాం. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇచ్చిన బాండ్ పేపర్లను కూడళ్లలో తగులబెట్టే కార్యక్రమం కూడా ఇందులో ఉంటుంది. ఈ నిరసనలకు సంక్షేమ పథకాలు రాని బాధితులు కూడా తరలిరావాలి. ప్రతీ నెలా క్రమం తప్పకుండా ఏదో విధంగా కొంత మొత్తం ప్రజల ఖాతాల్లో పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేశారు.ఇప్పుడు అదంతా సున్నా అయిపోయింది. డ్వాక్రా మహిళలు పూర్తిగా రోడ్డున పడ్డారు. 18 శాతం పైగా ఉన్న వీరి నిరర్ధక ఆస్తుల్ని వైఎస్ జగన్ హయాంలో 4 శాతానికి తగ్గించాం. డ్వాక్రా మహిళలు మా హయాంలో కోటికి పెరిగారు. బ్యాంకులు కూడా వారికి లోన్లు ఇచ్చి సాయం చేశాయి. వైఎస్ జగన్ పాలన చివరి ఏడాదిలో 49 వేల కోట్లుగా ఉన్న డ్వాక్రా మహిళల రుణం కాస్తా ఇప్పుడు 30 వేల కోట్లకు పడిపోయింది. ఆరోగ్యం, విద్య విషయంలో ప్రభుత్వ సాయం తగ్గిపోయి పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి కేవలం మా మాటలు కాదు, క్షేత్రస్దాయిలో అనుభవిస్తున్న వారి మాటలే.నిరసనల్లో ప్రజలు, మేథావులు భారీగా పాల్గొనాలిచంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చేశానంటే అందరూ నమ్మాల్సిందే అన్నట్లుగా ఉంది. మాయల మరాఠీ రోజూ అదే చెప్తుంటే ప్రజలు కూడా నమ్మక ఏం చేస్తారు ? ఈ లోగా వైఎస్సార్సీపీ మీద, పార్టీ అధినేత గురించి మాట్లాడకుండా వారిపై కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్ ఏది కాదో అదే అని చూపించే ప్రయత్నం పచ్చమీడియాలో చేస్తున్నారు.మెగా డీఎస్సీ పేరు మీద నెల రోజులుగా సాక్ష్యాలతో సహా బయటపెడున్నా వారి మీడియాలో ఎక్కడా కనబడదు. మహా ఉంటే అధికారుల సాయంతో దబాయింపు చేస్తున్నారు. తాడు లాగే పోటీతో, బ్రిడ్జి గేమ్స్ తో టీచర్ ఉద్యోగాలు పొందవచ్చని వీళ్లు నిరూపించారు. సెలెక్షన్ అయ్యాక తిరిగి నిబంధనలు మార్చేశామని అధికారులతోనే చెప్పిస్తున్నారు. చంద్రబాబు సుపుత్రుడు విద్యామంత్రి మాత్రం దీనిపై ఉలకడు, పలకడు. మేం ప్రశ్నిస్తుంటే ఇసుక, బైజూస్ అని డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో కోటీ 47 లక్షల బాధిత కుటుంబాలు ఉన్నాక వారు రేపైనా తీర్పు ఇచ్చారు. కానీ వారిని గందరగోళ పరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని అడ్డుకునేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. వైఎస్ జగన్ లక్ష్యం తాను ఉన్నా, మరొకరు వచ్చినా సంక్షేమం కొనసాగాల్సిందే. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు అప్పుల భారంలో ముంచి వెళ్లిపోతే, వైఎస్ జగన్ అలా వదిలేకుండా అప్పుల బాధ తీర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ తెస్తే దాన్ని కూడా ఇప్పుడు ఎత్తేస్తున్నారు. అందుకే వీటిపై ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నాం. అందుకే వైఎస్సార్సీపీ నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో భారీగా పాల్గొనాలని ప్రజలు, సంక్షేమ పథకాల బాధితులతో పాటు మేథావులు, ఆలోచనాపరులకు పిలుపునిస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. -
బ్యాడ్మింటన్ స్టార్స్ సాత్విక్-చిరాగ్లకు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి,తాడేపల్లి : బ్యాడ్మింటన్ క్రీడాకారులు సత్విక్సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేఎఫ్ఎఫ్ సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్లో వారు టైటిల్ గెలుచుకోవటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ‘వీరి గెలుపు ఆంధ్రప్రదేశ్కే కాదు, దేశానికే గర్వకారణం. భవిష్యత్తులో వీరిద్దరూ మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ఆయన ఆకాంక్షించారు Heartiest congratulations to Satwiksairaj Rankireddy and Chirag Shetty on winning the KFF Singapore Badminton Open 2026 Men’s Doubles title. Proud moment for India and Andhra Pradesh. Wishing them both many more achievements and continued success ahead.@BAI_Media@satwiksairaj… pic.twitter.com/xG3LlcCxM0— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2026 -
మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : మంత్రాలయం, గాజువాక ఘటనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రెండు వేర్వేరు ఘటనలో పలువురు మృత్యువాత పడటంపై వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రాలయం తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఘటనలో ఐదుగురు, గాజువాక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తుంగభద్ర నదిలో మునిగి ఐదుగురు మృతిచెందడం విషాదకరం. ఈతకు వెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని వైఎస్ జగన్ సంతాంప వ్యక్తం చేశారు. ఇక గాజువాక రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడటంపై వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు వైఎస్ జగన్. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్ జగన్ కోరారు.కాగా, మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన సంగతి తెలిసింద. మంత్రాలయంలోని బంంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు వారు. వారిలో ఆరుగురు ఈత కొట్టడం కోసం దిగగా, వారిలో ఆదోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకొచ్చేసింది. మిగతా ఐదుగురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. అక్కడ నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయలేక పోవడంతో ప్రమాదం చోటు చేసుకుని ఐదుగురు గల్లంతయ్యారు. వీరి కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. వారంతా విగత జీవులుగా మిగిలిపోయారు. ఈ విషాద ఘటనలో ఇద్దకు హైదరాబాద్కు చెందిన యువన్ చంద్ర, సతీష్లుగా గుర్తించగా మరో ఇద్దరిని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర, ధనులుగా గుర్తించారు, ఉరవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. మరొకవైపు ఈరోజు(ఆదివారం, మే 31) ఉదయం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సుఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పలువురికి గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. -
సూపర్ స్టార్ కృష్ణకు YS జగన్ నివాళి
-
కేసులకు, బెదిరింపులకు భయపడం : విడదల రజని
సాక్షి,తాడేపల్లి: కేసులకు, బెదిరింపులకు తాను బెదిరిపోనని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ‘చంద్రబాబు మోసానికి’ రెండేళ్లు పేరిట పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో మహానాడు సాక్షిగా అబద్ధాలు,మహిళలకు చేసిన మోసంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విడదల రజిని మీడియాతో మాట్లాడారు.చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే వేధింపులు.. సూపర్ సిక్స్ హామీని గాలికొదిలేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీని అమ్మకానికి పెట్టారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని ఆటకెక్కించారు. చంద్రబాబు మోసాలు,అన్యాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. బాబును భూస్థాపితం చేయడం మహిళలకే సాధ్యం’అని అన్నారు. -
సూపర్ స్టార్ కృష్ణకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సినీ నటుడు కృష్ణకు నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి.. వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణ. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి… pic.twitter.com/Q3aVftNnZP— YS Jagan Mohan Reddy (@ysjagan) May 31, 2026 -
జగన్ అద్భుత పాలనలో.. ఏపీకి స్వర్ణయుగం
-
YS Jagan: ప్రజల ఆకాంక్ష ఒక్కటే..!
నేడు.. సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజునేడు.. అవధి లేని సంక్షేమానికి నాంది పడిన రోజునేడు.. అభివృద్ధికి కొత్త అర్థం చెప్పిన రోజునేడు.. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’ అంటూ సరిగ్గా ఇదే రోజు జననేత జగన్ చేసిన ప్రమాణం.. నవ్యాంధ్ర ప్రదేశ్ చరిత్రలో నవశకాన్ని లిఖించింది. ఆ శుభదినాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు. ప్రజల ముంగిటకు చేర్చి, దేశానికే ఆదర్శంగా నిలిపారు. అవ్వాతాతలకు బిడ్డలా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిలా.. పిల్లలకు మేనమామలా.. కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలతో భరోసానిచ్చారు. ఇంటివద్దకే పింఛన్లు, రేషన్ సరకులు.. అమ్మ ఒడి.. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన.. రైతు భరోసా వంటి వినూత్న పథకాలతో పేదలకు చేయూతనిచ్చారు. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి పథకాలతో ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచారు. తమ జీవితాలను మలుపు తిప్పిన ఆ రోజును ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు.సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. అధికారంలోకి వచ్చిన తరువాత వారి బతుకుల్ని ఏవిధంగా బాగు చేయాలో తెలుసుకునేందుకు.. 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర చేసి.. వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున.. అంటే 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన తండ్రి, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టించారు. కోవిడ్ వంటి మహావిపత్తు ముంచుకొచ్చినా.. తన ఐదేళ్ల పాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా చూశారు.కారణాలేవైనా.. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకు జగన్ అందించిన సంక్షేమ పాలనకు దూరమయ్యామనే ఆవేదన రెండేళ్లుగా జనానికి తప్పడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వంపై విసిగి వేసారుతున్న ప్రజలు మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని, ‘జగన్ అనే నేను’ మాటను మరోసారి వినాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొత్త పుంతలు తొక్కిందనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. సంక్షేమ సిరులు అప్పటి వరకూ రూ.2 వేలుగా ఉన్న సామాజిక భద్రతా పింఛన్ను ఇచ్చిన మాట మేరకు రూ.2.250కి పెంచుతూ నాడు జగన్ తొలి సంతకం చేశారు. ఆ తరువాత ఏటా రూ.250 చొప్పున పెంచుతూ చివరి సంవత్సరానికి పింఛను మొత్తాన్ని రూ.3 వేలు చేశారు. 2019 మే 30 నాటికి ఉమ్మడి జిల్లాలో 5,81,827 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు పొందుతున్నారు. జగన్ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లాలో మరింత మందికి లబ్ధి చేకూరింది. 2019కి ముందు టీడీపీ పాలనలో రేషన్ కార్డు కోసం అర్హులైన వారు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. జగన్ పాలనలో అరగంటలోనే రేషన్ కార్డు మంజూరు చేసి అందించడం ఓ సెన్సేషన్. ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిపుష్టం చేసి, ఈ పథకం పరిమితిని తొలుత రూ.5 లక్షలకు, ఆపై ఏకంగా రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కలి్పంచారు. అంతేకాదు.. ఏకంగా 3,200కు పైగా ప్రొసీజర్లను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు, కళ్లజోళ్లు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా అందించారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచే ఆయన శ్రీకారం చుట్టారు. జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లులకు ఏటా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించారు. జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి వినూత్న పథకాలు అమలు చేశారు. ప్రభుత్వ బడుల్లో ట్యాబులు, డిజిటల్ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి వాటికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఆసరా, చేయూత, డ్వాక్రా మహిళల రుణమాఫీ (ఆసరా), 45–60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి ఏటా ఆర్థిక సాయం అందించారు. ఓసీ మహిళలకు కూడా దీనిని వర్తింపజేశారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించారు. అంతేకాదు.. ప్రకృతి విపత్తులు సంభవించి, పంట నష్టం వాటిల్లితే సీజన్ దాటకుండానే పరిహారం అందించడం ఓ రికార్డు. పేదల సొంతింటి కలను నిజం చేసేలా అక్కచెల్లెమ్మల పేరిట వేలాది మందికి ఇళ్ల స్థలాలు అందించడమే కాదు.. ఇళ్ల నిర్మాణానికి సైతం సాయం అందించారు. జగనన్న కాలనీల పేరిట ఏకంగా ఊళ్లే నిర్మించారు. ప్రజల వద్దకే పాలన ఉమ్మడి జిల్లాలో 2019 నాటికి 779 క్లస్టర్ల పరిధిలో 1,072 గ్రామ పంచాయతీలుండేవి. కానీ, 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులుండేవారు. 230 క్లస్టర్ల పరిధిలో కార్యదర్శుల కొరత ఉండటంతో ఆ ప్రభావం ప్రభుత్వ సేవలపై పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక పరిపాలనను ప్రజల చెంతకే చేర్చేలా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న కాకినాడ జిల్లా కరపలో శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలోను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రతినిధులుగా 11 మంది ఉద్యోగులను నియమించి, దేశ విదేశాలకు సైతం ఆదర్శంగా నిలిచే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలకు నాంది పలికారు. అంతే కాదు.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ను ప్రజల ఆమోదంతో నియమించి, సచివాలయ వ్యస్థకు అనుసంధానం చేశారు. దీంతో, ప్రజలకు 500కు పైగా ప్రభుత్వ సేవలు వారి ముంగిటనే ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సులభంగా అందేవి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమగా పునర్వ్యవస్థీకరించారు. అభివృద్ధి మెరుపులు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మన బడి నాడు–నేడు పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. మొదటి విడత ఆధునీకరించిన పాఠశాలలను ఉమ్మడి జిల్లాలో పి.గన్నవరం మండలం పోతవరం జెడ్పీ హైసూ్కల్లో విద్యార్థులకు అంకితం చేసి, రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల పిల్లలు సైతం డాక్టర్లు కావాలనే ఆకాంక్షతో రాజమహేంద్రవరం, అమలాపురాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం కళాశాలలో ఇప్పటికే బోధన ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయతి్నస్తోంది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా నల్లజర్ల మండలంలో రూ.250 కోట్లతో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టారు. తద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు 1,500 మందికి ఉపాధి అవకాశాలు కలి్పంచారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో బయో–ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి 2022 నవంబర్లో జగన్ భూమిపూజ చేశారు. తొండంగి మండలంలో కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణం జరగడానికి నాడు జగన్ దార్శనికతే కారణమని చెప్పాలి. మత్స్యకారుల కోసం సుమారు రూ.230 కోట్లతో ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారు. -
ప్రజారోగ్యానికి వైఎస్ జగన్ పాలనలో పెద్దపీట
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్ జగన్ పాలనలో 2023–24లో ఆంధ్రప్రదేశ్ పలు కీలక సామాజిక, ఆరోగ్య సూచీలలో జాతీయ సగటును దాటి ముందంజలో నిలిచింది. 2019–21 సర్వే ఫలితాలతో పోల్చి చూస్తే, మరింతగా ప్రజారోగ్యానికి అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు స్పష్టమైంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–6) 2023–24 నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2023–24లో రాష్ట్రంలో ప్రజారోగ్యం, మౌలిక వసతులు, మహిళా సాధికారత రంగాలలో విప్లవాత్మక మార్పులు నమోదయ్యాయి. వైఎస్సార్సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజారోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను జాతీయ సర్వే చాటి చెప్పింది. రాష్ట్రంలో మహిళల విద్య, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఊహించని రీతిలో పురోగతి కనిపించినట్లు నివేదిక పేర్కొంది. పదవ తరగతి, అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 2019–21లో 39.6 శాతం ఉండగా, 2023–24 నాటికి అది 48.4 శాతానికి పెరిగి, జాతీయ సగటు 46.4 శాతాన్ని అధిగవిుంచడం గమనార్హం. అదే సమయంలో మహిళలు ఇంటర్నెట్ వినియోగంలోనూ ముందంజలో ఉన్నారు. సాంకేతిక వినియోగంలో మహిళలు దేశ సగటుకు సమానంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2019–21లో కేవలం 21 శాతంగా ఉన్న ఇంటర్నెట్ వాడుక, 2023–24 నాటికి ఏకంగా 63.6 శాతానికి చేరడం విశేషం.తల్లీ పిల్లల ఆరోగ్యం దేశానికే ఆదర్శంగర్భిణిలు, బాలింతల సంరక్షణ, శిశు ఆరోగ్య రక్షణలో ఏపీ జాతీయ సగటును మించి అద్భుతమైన పనితీరు కనబరిచినట్లు సర్వే వెల్లడించింది. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లోనే వైద్య పరీక్షలు చేయించుకున్న తల్లుల సంఖ్య రాష్ట్రంలో 81.7 శాతం నుండి 88.6 శాతానికి పెరిగింది. ఇది జాతీయ సగటు 76.2 శాతం కంటే చాలా ఎక్కువ. రాష్ట్రంలో ప్రసవాలు ఆసుపత్రుల్లోనే (ఇన్స్టిట్యూషనల్ బర్త్స్) జరిగేలా చూడటంలో రికార్డు నమోదైనట్లు సర్వే పేర్కొంది. 2019–21లో 96.5 శాతం ఉన్న ఆసుపత్రి ప్రసవాలు.. 2023–24 నాటికి 98.4 శాతానికి చేరి, జాతీయ సగటు 90.6 శాతాన్ని మించాయి. 12–23 నెలల వయసున్నపిల్లల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో 2019–21లో 73.2 శాతం ఉండగా, 2023–24లో అది 87.7 శాతానికి పెరిగింది. జాతీయ సగటు (82.6శాతం)తో పోలిస్తే చిన్నారుల సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది.వివాహ వయసు పరిమితిలో సానుకూల మార్పుసామాజిక చైతన్యం పెరగడం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణ, వివాహ వయసు పరిమితుల్లో సానుకూల మార్పులు వచ్చినట్లు ఈ సర్వే పేర్కొంది. రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.8 శాతంగా స్థిరపడినట్లు తెలిపింది. ఇది జాతీయ సగటు (2.0 శాతం) కంటే తక్కువగా ఉంటూ జనాభా స్థిరీకరణను సూచిస్తోందని తెలిపింది. బాల్య వివాహాల నియంత్రణలో గత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు సర్వే వెల్లడించింది.మహిళల ఆర్థిక భద్రతలో టాప్మహిళల ఆర్థిక భద్రత, కుటుంబ నిర్ణయాధికారాల్లో ఆంధ్రప్రదేశ్.. దేశ సగటును దాటి దూసుకుపోయినట్లు సర్వే వెల్లడించింది. తమ పేరిట సొంతంగా బ్యాంక్ లేదా పొదుపు ఖాతా కలిగి ఉండి, దానిని స్వయంగా వినియోగిస్తున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 81.8 శాతం నుండి 92.3 శాతానికి పెరిగినట్లు సర్వే తెలిపింది. ఇది జాతీయ సగటు (89.0 శాతం) కంటే చాలా ఎక్కువ అని పేర్కొంది.గృహ హింస 29.9 శాతం నుంచి 22.7 శాతానికి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల గృహాలకు మౌలిక వసతులు కల్పించడంలో ఏపీ మెరుగైన స్థానాన్ని నిలబెట్టుకున్నట్లు సర్వే ప్రకటించింది. రాష్ట్రంలో 99.7 శాతం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉండగా, జాతీయ సగటు 98.3 శాతంగా ఉంది. 97.6 శాతం కుటుంబాలు సురక్షిత తాగునీటి వనరులను పొందుతుండగా, దేశ సగటు 96.5 శాతంగా ఉంది. -
గాదె వెంకటరెడ్డి మృతిపై YS జగన్ సంతాపం
-
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వెంకటరెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవలు అందించారని... ఆయన మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు.‘‘ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ స్పందించే నాయకుడిగా గుర్తింపు పొందారు. తన తండ్రి డాక్టర్ వైఎస్సార్కు గాదె వెంకటరెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు. వైఎస్సార్తో కలిసి ప్రజా సమస్యలపై పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
KNR పై కేసు, రోజా స్టాంగ్ రియాక్షన్
-
చంద్రబాబు రాక్షస పాలనపై పోరుబాట... వైఎస్సార్సీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు
-
బాబు రాక్షస పాలనపై పోరు
‘‘స్టేట్ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్ మీద రూ.31.62. లీటరు డీజిల్ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది’’‘‘స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కార్యకర్తల మనసులు గెలుచుకోవడానికి ప్రతి నియోజకవర్గ ఇన్చార్జి ప్రయత్నం చేయాలి. ఈరోజు వారికి మీరు అండగా నిలబడితే రాబోయే ఎన్నికల్లో ఈ కార్యకర్తలు మీ గెలుపు కోసం కృషి చేస్తారనే విషయాన్ని మాత్రం మరువొద్దు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సరే ప్రతి స్థానంలోనూ వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేయాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగిందంటే మాత్రం దాన్ని నేను సీరియస్గా తీసుకుంటా’’‘‘కుప్పంలో టీడీపీకి 20 వేలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదు సార్లు, పది సార్లు కనిపిస్తోంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతి సారీ తండ్రి పేరు చూసినా లేదా భర్త పేరు చూసినా ఒకటే ఉంటాయి. ఇది కుప్పంలో మన కళ్ల ఎదుటే కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ. ప్రతి ఊరిలో మనవారు అనుకున్న 50 ఓట్లు తొలగిస్తే చాలు.. నియోజకవర్గ వ్యాప్తంగా 5 వేల వరకు మన ఓట్లు పోయినట్టే!’’ -పార్టీ నేతలతో భేటీలో వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోకుండా అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు రెండేళ్ల రాక్షస పాలనపై జూన్ 4 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం, దగా, వంచనను వివరిస్తూ ‘వెన్నుపోటుకు రెండేళ్లు..’ పేరుతో రూపొందించిన బుక్లెట్ను వైఎస్ జగన్ విడుదల చేశారు. అది గ్రామగ్రామానా, ఇంటింటికీ చేరేలా చూడాలని నిర్దేశించారు. ప్రతి కార్యకర్త వద్ద ఆ బుక్లెట్ ఉండాలని.. డిజిటల్ రూపంలో కూడా అందుబాటులోకి తెచ్చామని వెల్లడించారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన కార్యాచరణ.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత.. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంపై వైఎస్ జగన్ ప్రధానంగా చర్చించి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు చేసినా దీటుగా ఎదుర్కొని పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న వారిని ఇప్పటి నుంచే గుర్తించాలని, వారిని అభ్యర్థులుగా ప్రకటించి ప్రతి అడుగులో తోడుగా నిలవాలని నిర్దేశించారు. స్వయంగా ఎమ్మెల్యే అభ్యర్థి తమకు అండగా నిల్చారన్న భావన స్థానిక ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసే ప్రతి ఒక్కరిలో కలిగేలా చొరవ చూపాలని సూచించారు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం గట్టిగా పని చేస్తారన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వొద్దని.. ఒకవేళ అలా జరిగితే అది అక్కడి ఇన్ఛార్జ్ వైఫల్యంగా భావిస్తామని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలకు వైఎస్ జగన్ గట్టిగా సూచించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన పశి్చమ బెంగాల్, తమిళనాడులో ఫలితాలను ప్రస్తావిస్తూ.. ఆయా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ‘సర్’ ఎలాంటి ప్రభావం చూపిందన్న విషయాన్ని గణాంకాలతో సహా వివరించారు. ఓట్లు తగ్గినా.. పెరిగినా డేంజరేనని హెచ్చరించారు. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో పార్టీ నేతలు బాబు రాక్షస పాలన.. ‘ముసలి పులి.. బంగారు కడియం’ రెండేళ్ల చంద్రబాబు పాలన గురించి నాకన్నా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా చక్కగా చెబుతాడు. చంద్రబాబు పాలన ఈ రెండేళ్లలో ఎలా ఉంది అని చూసిన తర్వాత.. ‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’ అని రుజువైంది. వెన్నుపోటు.. విధ్వంసం.. అరాచకం.. అబద్ధాలు.. డైవర్షన్ పాలిటిక్స్.. దోపిడీ.. అవినీతి.. ఇదే ఈ రెండేళ్ల చంద్రబాబునాయుడు పరిపాలన! ఇంతకు ముందు ఎన్నికలప్పుడు కూడా చెప్పా.. ‘ఒక ముసలి పులి. బంగారు కడియం’ కథ! చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే ఇదే అని! ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతున్న పరిస్థితులు మన కళ్ల ఎదుటే చూశాం. ఆ రోజుల్లో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు.. అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి పులి, బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని పులి తిన్నట్టుగానే తినేస్తున్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తోందో చంద్రబాబునాయుడును చూసినా ఈరోజు అదే కనిపిస్తుంది. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన చంద్రబాబు చంద్రబాబు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు. సూపర్ సెవెన్ అన్నాడు. మేనిఫెస్టో కాపీ అన్నాడు. 143 హామీలు మేనిఫెస్టోలో పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనమంతా చూస్తున్నాం. రెండేళ్లు అయిపోయింది. మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లలో భాగంగా ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్క చెల్లెమ్మకూ ప్రతి నెలా రూ.1,500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తానన్నావు కదా! రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అని అడిగితే మాట రాదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా నిరుద్యోగ భృతి అని చదువుకున్న ప్రతి పిల్లాడికీ నెలకు రూ.3 వేల భృతి ఇస్తానన్నావు. సంవత్సరానికి రూ.36 వేలు.. రెండేళ్లకు రూ.72 వేలు ఇప్పటికే బాకీ పడ్డావు. మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా? అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకూ సంవత్సరానికి రూ.48 వేలు బాకీ. రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మూడో సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి కేటాయింపులు లేవు కదా? అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా కనిపించదు. దీనిపై అడిగితే మాత్రం చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతోంది. టపా అని ఎక్కడన్నా పొరపాటున చంద్రబాబునాయుడును నిద్రలేపి మావిగన్ అని చెవిలో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోయినా పడిపోతాడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడులో ఇవన్నీ చూస్తున్నాం. సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు పెట్రో ధరల తగ్గింపుపైనా మోసమే.. చంద్రబాబు 143 హామీల్లో మనందరికీ ప్రధానంగా పెట్రోలు, డీజిల్ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఈరోజు లీటరు పెట్రోలు రూ.117 దాటింది. లీటరు డీజిల్ చూస్తే రూ.105 దాటింది. పెట్రోలు, డీజిల్ ధరలు అధికారంలోకి రాగానే తగ్గిస్తామని చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు, డీజిల్పై విపరీతంగా బాదుడే బాదుడు కనిపిస్తోంది. స్టేట్ గవర్నమెంట్కు ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్ము లీటరు పెట్రోల్ మీద రూ.31.62. లీటరు డీజిల్ మీద రూ.23.46. అదే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లీటరు పెట్రోలు మీద రూ.11.90. లీటరు డీజిల్ మీద రూ.7.80. ఈరోజు పెట్రోల్, డీజిల్ మీద ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు వాటి ద్వారా నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు? అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. అందుకే బాబు డైవర్షన్ పాలిటిక్స్.. ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు తాను ఫలానా మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్ధాలు మినహా ప్రజలకు ఈ రెండు సంవత్సరాల్లో నేను ఈ మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి. ప్రజలను ఈ టాపిక్ నుంచి.. ఆ టాపిక్ లోకి మభ్య పెట్టాలన్న దిక్కుమాలిన ఆలోచనతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రజలందరూ పిచ్చోళ్లు అని చంద్రబాబునాయుడు అనుకుంటున్నాడు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ప్రజలు చాలా చైతన్యవంతులు. గర్వంగా కాలర్ ఎగరేసుకుని చెప్పగలం.. రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగు పడిందన్నా.. నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా.. పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాయి అన్నా.. ఒక రైతు బాగుపడ్డాడు అన్నా.. ఒక అక్కచెల్లెమ్మ బాగు పడిందన్నా.. ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడ్డాడన్నా.. ఇవన్నీ ఒక్క నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైఎస్సార్సీపీ, మీ జగనన్న పాలనలోనే జరిగాయి అని గర్వంగా చెప్పగలుగుతా. మంచి చేశాం అని చెప్పి కాలర్ ఎగరేసుకుని.. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికీ వెళ్లగలిగిన పరిస్థితి ఒక్క వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు, ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు రెండు సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పర్చేందుకు ఒక బుక్లెట్ను రిలీజ్ చేస్తున్నాం. ప్రతి కార్యకర్త వద్ద ఉండాలి.. ప్రతి ఇంటికీ చేర్చాలి బుక్లెట్లో అన్ని అంశాలను క్షుణ్నంగా మనం చదువుకోవడమే కాకుండా మన పారీ్టలో ప్రతి కార్యకర్తకు ఈ రెండేళ్ల పాలనలో ప్రతి అంశం మీద అవగాహన ఉండేలా రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వాళ్లందరికీ అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది మనం నిర్వహించిన ర్యాలీలు కార్యక్రమం అప్పట్లో బాగా జరిగింది. రెండో ఏడాది కూడా చంద్రబాబునాయుడు పాలన మీద నిరసన తెలుపుతూ అంతకన్నా ఇంకా గొప్పగా ర్యాలీలు జరగాలి. ఈ కార్యక్రమాలు అన్నింటినీ జూన్ 4 నుంచి 12 వరకు పార్టీ తరఫున చేపడుతున్నాం. ‘సూపర్హిట్’ అంటూ నిస్సిగ్గుగా ప్రచారం..ఎన్నికల హామీల్లో ఇంకా చాలా ఉన్నాయి.. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పచ్చి మోసాలుగానే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే మరోవైపున సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు అన్నీ చేసేశాం అని ఏకంగా ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడూ ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకునిపోయే వ్యక్తి బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడేమో.. ఒక్క చంద్రబాబునాయుడు తప్ప. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ బుక్లెట్ ఇందుకే..‘చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు రెండేళ్లు..’ బుక్ లెట్లో సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లతో ఏరకంగా ఆయన మోసం చేశాడనే దగ్గర నుంచి.. ఏ రకంగా విద్యాదీవెన, వసతి దీవెన ఎగ్గొట్టి పిల్లలను రోడ్ల మీదకు తెచ్చాడనే పరిస్థితి నుంచి.. ఆరోగ్యశ్రీ దుస్థితి, విద్య, వైద్యం, వ్యవసాయం ఏరకంగా కుప్పకూలిపోయింది? అక్కచెల్లెమ్మల జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి? లాంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అవినీతి అన్నీ కూడా క్లుప్తంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో ఈ బుక్లెట్ రూపొందించడం జరిగింది. ఇది అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. క్యూఆర్ కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకూ చేరేలా మన పార్టీ వెబ్సైట్లో కూడా ఈ బుక్లెట్ వివరాలు అన్నీ అందుబాటులోకి తీసుకొచ్చాం.చంద్రబాబుకి సెగ తగిలేలా నిరసన కార్యక్రమాలు ఇలా.. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలను ఒకవైపు ఎస్ఐఆర్, గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ నియోజకవర్గాల్లో ప్రతి మండలంలోనూ జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టండి. చంద్రబాబునాయుడుకు సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ‘ఈనాడు’లో ఎన్నికల ముందు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ కాపీ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫొటోలతో సంతకాలు పెట్టి ఇచ్చిన బాండ్ల కాపీలు.. (ఇవి నెట్లో, బుక్లెట్లో అందుబాటులోనే ఉన్నాయి) ప్రతి మండల కేంద్రంలో 4వ తేదీన ఈ రెండూ చూపిస్తూ నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్చార్జి పాలు పంచుకోవాలి. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలు పంచుకుని కార్యక్రమం జరిగేలా ప్రణాళిక రూపొందించాం. తరువాత జూన్ 8, 9వ తేదీల్లో వీలును బట్టి నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో టౌన్ హాల్ సదస్సు ఉంటుంది. యువకులు, రైతులు, మహిళలు పాల్గొనే ఈ కార్యక్రమంలో వీరందరి సమక్షంలో వెన్నుపోటుకు రెండేళ్లు బుక్లెట్లోని అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి అవగాహన కల్పించడం జరుగుతుంది. చివరగా జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ భారీ నిరసన ర్యాలీలు నిర్వహిద్దాం. ఈ కార్యక్రమాన్ని స్వయంగా నేను పర్యవేక్షిస్తా. తూతూ మంత్రంగా నిర్వహిస్తే సహించేది లేదు. ప్రజలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి నిరసన సెగ తగిలేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. -
నెల్లూరు సమీపంలో పడవ ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.ఇద్దరు మత్స్యకారులు మృతిచెందడం బాధాకరం. గల్లంతైన మరో ఇద్దరు క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటున్నా.గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలి.బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’అని అన్నారు. నెల్లూరు తీర ప్రాంతంలో పడవ ప్రమాదంనెల్లూరు జిల్లా బోగోలు మండలం సముద్ర తీరంలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. వేటకు వెళ్లిన బోటు తిరగబడి ఇద్దరు మత్స్యకారులు మృతి చెందారు. ఉదయం నాలుగు గంటలకు తెప్ప బోటులో నలుగురు కలిసి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో బోటు తిరగబడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన ఇద్దరు మత్స్య కారుల కోసం గాలింపు చర్యలు కొసాగుతున్నాయి. మృతులు అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. -
ముస్లింలకు వైఎస్ జగన్ బక్రీద్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ముస్లింలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘త్యాగాల పండుగ బక్రీద్. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్ పండగ జరుపుకుంటారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనం. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’’ అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
ఈ బుక్లెట్ ప్రతి ఇంటికీ చేరాలి: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ప్రతి ఇంట్లో బాబు వెన్నుపోటు పాలనపె చర్చ జరగాలి
-
నువ్వు, నీ దిక్కుమాలిన ఆలోచనలు... పనికొచ్చే పని చేయవా..?
-
కొంచెం బోర్ కొట్టినా వినండి..! నేతలతో జగన్ సరదా సన్నివేశం
-
మమతా బెనర్జీ, స్టాలిన్ ఓటమికి ఇదే కారణం
-
వెన్నుపోటుకు రెండేళ్లు
-
ఇదేం జోక్ కాదు.. లెట్ తీసుకోకండి...
-
స్థానిక సంస్థల ఎన్నికలే మన టార్గెట్.. YSRCP నేతలకు జగన్ హెచ్చరిక
-
జూన్ 12.. గుర్తుపెట్టుకోండి..! చంద్రబాబు కు చెమటలు పట్టించాలి
-
స్థానిక సంస్థల ఎన్నికలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికల్లో చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ ధీటుగా నిలబడాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎలాంటి కుట్రలు చేస్తాడో మన అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని చూశాం. పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలు చేయడం చూశాం. బరితెగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు. ఇన్ని ఉన్నా, స్థానిక సంస్థల ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ దీటుగా నిలబడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే మన కార్యకర్తకు కచ్చితంగా తోడుగా ఉండాలి. విజయమైనా, పరాజయమైనా.. తన ఎమ్మెల్యే కేండిడేట్ తనకు అండగా ఉన్నాడు అని ప్రతి కార్యకర్తకూ కలగాలి. చంద్రబాబు కుట్రలను ఎదుర్కొంటూ అండగా నిలబడ్డాడని కార్యకర్తకు అనిపించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు తోడుగా ఉంటే, వాళ్లే మీకు జనరల్ ఎన్నికల్లో బలగంగా నిలబడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలో పార్టీ జెండా ఎగరాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. దాన్ని సీరియస్గా తీసుకుంటాను. అలా జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జి ఫెయిల్యూర్గానే భావిస్తాను. ప్రజల్లో నిరంతరం ఎవరు ఉన్నారు? పార్టీ కార్యక్రమాల్లో ఎవరు చురుగ్గా పాల్గొంటున్నారో, ఇప్పటికే మీకందరికీ అవగాహనకు వచ్చి ఉంటుంది.అలాంటి వారిని గుర్తించి, పోటీకి సన్నద్ధం చేయండి.స్థానిక ఎన్నికల సమయం వచ్చే సరికి, చంద్రబాబు పరిపాలనా వైఫల్యాలను మన పార్టీ గ్రామ, వార్డు స్థాయి యంత్రాంగం ద్వారా, ప్రతి ఇంటికీ ఈ బుక్లెట్ మెటీరియల్ ద్వారా ప్రజలను జాగృత పరచాలి. రెండేళ్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశాం. కమిటీ సభ్యులు అందరికీ కూడా వెన్నుపోటు రెండేళ్లు కాపీలు అందేలా చూడండి. ఈ బుక్లెట్ ప్రతీ ఇంటికీ చేరేలా చూడాలి. చంద్రబాబు వైఫల్యాలపై చర్చ జరిగేలా చూడాలి. చంద్రబాబు మోసాలు, వెన్నుపోట్లపై ప్రజలు తిరగబడతారు’ అని తెలిపారు. -
సర్ ప్రక్రియ.. వైఎస్ జగన్ హాట్ కామెంట్స్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం త్వరలో సర్ ప్రక్రియను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మనం ఎస్ఐఆర్పై దేశ వ్యాప్తంగా అనేక భయాలు, ఆందోళనలను అనేక రాజకీయ పార్టీలు వ్యక్తంచేయడం చూశాం. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రభావితం చేసిందన్న వాదనలనూ విన్నాం. పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఏం జరిగిందో అంతా చూసే ఉంటారు. బెంగాల్లో 91 లక్షలు, అంటే ఉన్న ఓట్లలో 11.9%. అలాగే తమిళనాడులో 74 లక్షలు, అంటే మొత్తం ఓట్లలో 11.6% తొలగించారు. మమతాబెనర్జీ పోటీచేసిన భవానీపూర్లో 44,990 ఓట్లను తొలగించారు. అక్కడ ఆమె 15,105 ఓట్లతో ఓడిపోయారు. తమిళనాడులో స్టాలిన్ పోటీచేసిన నియోజకవర్గంలో దాదాపుగా 71,133 ఓట్లను తొలగించారు. ఆయన ఓడింది 8వేల ఓట్లతేడాతోనే. అంతేకాకుండా బెంగాల్లో తీసేసిన ఓట్లు 91లక్షలు అయితే, ఆ రాష్ట్రంలో మమత పార్టీ ఓడింది 31లక్షల తేడాతో. అదే తమిళనాడులో తీసేసింది 74లక్షల అయితే, స్టాలిన్ పార్టీ ఓడింది 17 లక్షల తేడాతోనే. అందుకే మనమంతా ఎస్ఐఆర్పై జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఓట్లు పెరగడం వల్ల ఓడిపోయాం. అక్కడ ఓట్లు తీసేయడం వల్ల వాళ్లు ఓడిపోయారు. ఈ రెండూ డేంజరే. ఊరికి యాభై మన ఓట్లను తీసేస్తే చాలు.. నియోజకవర్గానికి 5వేలు పోయినట్టే. అదే సమయంలో టీడీపీ బోగస్ ఓట్లమీద కూడా మనం దృష్టిపెట్టాలి. కుప్పంలో అది మన కళ్లెదుటే కనిపించింది. కుప్పంలో ఓట్ల జాబితా ఒక్కసారి చూస్తే 22వేల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయి. ఒకే పేరు ఐదుసార్లో, పది సార్లో కనిపిస్తుంది. లిస్టులో ఆ పేరు కనిపించిన ప్రతిసారి కూడా తండ్రి పేరు చూసినా, లేక భర్త పేరు చూసినా సేమ్ ఉంటాయి. ఏపీలో ఓట్ల జాబితా ఓ హిస్టరీ అండ్ మిస్టరీ. ఇలాంటి బోగస్ ఓట్లు, తప్పుడు ఓట్లు మీద దృష్టిపెట్టాలి. అందుకే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా అని వైఎస్సార్సీపీ శ్రేణుల్ని ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. -
బాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’.. వైఎస్సార్సీపీ బుక్ విడుదల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్సీపీ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో బుక్ విడుదల చేశారు. జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం జరుపుతున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు ప్రజల నిరసన సెగలు తగలాలి అని అన్నారు.నిరసనలు ఇలా..జూన్ 4న మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు.జూన్ 8 లేదా 9న నియోజకవర్గ హెడ్క్వార్టర్స్లో టౌన్హాల్ సదస్సులు నిర్వహించాలి.జూన్ 12న ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసు. బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైంది. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైంది. మూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. సూపర్-6, సూపర్-7 లేదు. ఆడబిడ్డ నిధికి నిధుల్లేవు.18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలే. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారు. వ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారు. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదు. రాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!. తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోంది. ఇప్పటికీ హామీల అమలు లేదు. మేనిఫెస్టో అడ్రస్ కనిపించదు. ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు. గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారు. ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారు. కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలి’ అని చెప్పుకొచ్చారు. -
ముసలి పులి బంగారు కడియం కథ.. మళ్లీ చెప్పిన జగన్
-
ఓట్లు తొలగించే కుట్ర..! పార్టీ నేతలతో జగన్ కీలక భేటీ
-
LIVE: YSRCP ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ
-
వైఎస్సార్సీపీ కీలక సమావేశం.. జగన్ స్పీచ్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై ఆయన కేడర్కు దిశానిర్దేశం చేశారు.. వైఎస్ జగన్ స్పీచ్ హైలైట్స్చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసుబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైందిజగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారుమేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదికూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైందిమూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారుసూపర్-6, సూపర్-7 లేదుఆడబిడ్డ నిధికి నిధుల్లేవు18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలేనిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారుఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోందిమావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారువ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారుతగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారుఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదురాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోందిఇప్పటికీ హామీల అమలు లేదుచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమంచి చేశానని చెప్పుకునే స్థితిలో ఆయన లేరుమేనిఫెస్టో అడ్రస్ కనిపించదుఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారుగొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారుప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారుకానీ, తెలివైన వాళ్లని గుర్తించాలివైఎస్సార్ పాలనలో, వైఎస్సార్సీపీ హయాంలోనే జనాలకు మంచి జరిగింది.. ఆ విషయం కాలర్ ఎగరేసి మరీ చెప్పగలంవెన్నుపోటుకు రెండేళ్లు.. బుక్లెట్ ఆవిష్కరణచంద్రబాబువి వెన్నుపోటు కాదు.. వెన్నుపోట్లుసూపర్సిక్స్, సూపర్ సెవెన్ మోసాలను ప్రజలకు వివరించేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలుచంద్రబాబు మోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ విడుదలబుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తూ.. మొదటి ఏడాది ర్యాలీ నిర్వహించాం: వైఎస్ జగన్రెండో ఏడాది కూడా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహించాం: వైఎస్ జగన్జూన్ 4 నుంచి 12 దాకా.. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహిద్దాం: వైఎస్ జగన్జూన్ 4న.. మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు: వైఎస్ జగన్8 లేదా 9వ తేదీన నియోజకవర్గ హెడ్క్వార్టర్స్ టౌన్హాల్లో సదస్సులు: వైఎస్ జగన్12న.. ప్రతీ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు: వైఎస్ జగన్ఎండలు, సర్ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం తదిరత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్: వైఎస్ జగన్ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలి: వైఎస్ జగన్కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: వైఎస్ జగన్ప్రజల నిరసన సెగలు చంద్రబాబుకి తగలాలి: వైఎస్ జగన్జగన్ కీలక వ్యాఖ్యలు ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయిచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమున్పిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో ఆ కుట్రలు చూశాంపోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో చూశాంఅందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలిప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలిచిందన్న నమ్మకం కలగాలిఆ నమ్మకం కలిగితేనే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారుచంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ జెండా ఎగరాలిఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు.. అదే జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటాంఏకగ్రీవం జరిగిందంటే ఇన్చార్జిలు ఫెయిల్ అయ్యారన్నమాటఇప్పటికే గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటయ్యాయివీరందరితో కలిసి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలివైఎస్సార్సీపీ హయాంలో అందిన పథకాలు.. కూటమిలో ఎలా రద్దయ్యాయో ప్రజలకు వివరించాలిబాబు వెన్నుపోటు పాలన గురించి ప్రతీ ఇంట చర్చ జరగాలిస్థానిక సంస్థల ఎన్నికలను కచ్చితంగా సీరియస్గా తీసుకోవాలిసర్ ప్రక్రియ గురించి.. బెంగాల్, తమినాడు ఎన్నికలను అంతా చూశారుసర్ ద్వారా బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారుమమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45 వేలకు పైగా ఓట్లు తొలగించారుఆమె 15 వేల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్లో 71 వేల ఓట్లు తొలగించారుఆయన ఓడింది 8 వేల ఓట్ల తేడాతో.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి91 లక్షల ఓట్లు బెంగాల్లో తొలగించారుమమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారుస్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడారుకాబట్టి సర్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలిఓట్లు పెరగడం వల్ల మనం ఓడాం.. ఓట్లు తగ్గడం వల్ల వాళ్లు ఓడారుకుప్పంలో కళ్లెదుటే అది కనిపించిందిఏపీలో ఓట్లు హిస్టరీ అండ్ మిస్టరీమనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50 ఓట్లు తొలగించినా చాలూ.. -
సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకోవడంలో బాబు సర్కారు విఫలం
సాక్షి, అమరావతి: సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు సర్కారు చూపిస్తున్న నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ కేసులో బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో సీబీఐతో దర్యాప్తు చేయాల్సిందిపోయి.. తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సీబీఐ వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.‘ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం అని భరోసా ఇచ్చాను’ అంటూ ‘ఎక్స్’లోని తన ఖాతాలో మంగళవారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. బాబు సర్కారు మౌనం ‘‘సుగాలి ప్రీతి కేసులో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం. కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది. పెన్షన్ తీసేయడం బాధాకరం ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన సిట్ రిపోర్టు, అప్పట్లో చేసిన సీడీఎఫ్డీ ల్యాబ్ రిపోర్టులు, డీఎన్ఏ ప్రొఫైల్లో ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో సీబీఐతో ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని సీబీఐ చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ(మంగళవారం) న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు తోడుగా ఉంటానని చెప్పాను. ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం.’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
సుగాలీ ప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి,తాడేపల్లి: సుగాలిప్రీతి కేసులో బాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కేసును ఆటకెక్కించటంపై ధ్వజమెత్తారు. ఈ మేరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, వారి ఆవేదనను వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి 2017లో దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం.కానీ చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే..ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు, CDFD ల్యాబ్ రిపోర్టులు, డీఎన్ఏ ప్రొఫైల్ ఉన్న వివరాలను సైతం చూపించారు.మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం’అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన… pic.twitter.com/0RRSDHwQav— YS Jagan Mohan Reddy (@ysjagan) May 26, 2026 -
జగన్ ప్రశ్నలకు తండ్రీకొడుకుల మైండ్ బ్లాక్
-
వైఎస్ జగన్ ను కలిసిన సుగాలి ప్రీతి తల్లి
-
వైఎస్ జగన్ను కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు
సాక్షి,తాడేపల్లి: పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుటుంబ సభ్యులను తిట్టిన వారి మీద పెట్టిన కేసుల్లో పురోగతి ఉంది కానీ తొమ్మిదేళ్ల క్రితం హత్యాచారానికి గురైన తన కుమార్తె కేసు దర్యాప్తులో మాత్రం ముందడుగు పడలేదని సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే సుగాలి ప్రీతి కేసు గురించి మాట్లాడి నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మీద ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చాక రెండేళ్లుగా కనీసం తమను పట్టించుకోవడం మానేశారని ఆమె ఆక్షేపించారు.అధికారంలోకి వచ్చాక మొదటిగా సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం అయ్యాక వెళ్లి కలిస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారయ్యాయని, డీఎన్ఏ రిపోర్టులు మారిపోయాయని మాట మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలోనే 2019కి ముందే ఆయన్ను కలిసి ముద్దాయిలు టీడీపీ వారేనని చెప్పినప్పుడు, అండగా ఉండి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాక తామెవరో కూడా తెలియనట్టు వ్యవహరిస్తున్నాడని వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సుగాలి పార్వతి ఆవేదన చెందారు.ప్రెస్మీట్లో సుగాలి పార్వతి ఇంకా ఏం మాట్లాడారంటే..:పవన్కళ్యాణ్ పచ్చి స్వార్థం:వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిందించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని అర్థమైంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన దానిలో పదో శాతమైనా సీఎం చంద్రబాబుని నిలదీసి ఉంటే ఈపాటికే కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చేది. ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుంటే, జనసేన నాయకులు, కార్యకర్తలతో తనపై దాడులు చేయించారు. జనసేన నాయకుడు గాదె వెంకటేశ్వరరావుని పురమాయించి తన వైకల్యాన్ని, కులాన్ని అవమానించేలా మాట్లాడించారు. పవన్కళ్యాణ్ను కలిసినప్పుడు కూడా ఇదే వైకల్యం, అదే రెడ్డి కులం ఉన్నాయని అన్నారు. మరి అవన్నీ తెలిసి కూడా అప్పుడెందుకు మాట్లాడలేదు? ఇచ్చిన హామీకి కట్టుబడడం అంటే ఇదేనా?.నా కూతురు దూరమైందన్న బాధ కన్నా కూటమి ప్రభుత్వం చేస్తున్న అవమానాలే మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. ప్రధాని మోదీతో మాట్లాడి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామన్న హామీ పవన్కళ్యాణ్కు గుర్తుకు లేదా? సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకునే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు.పవన్కళ్యాణ్కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా..:మాకు ఏదైనా న్యాయం జరిగిందీ అంటే, అది వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే. మేము కోరిన వెంటనే అడిషనల్ ఎస్పీ రమాదేవి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి అత్యాచారం జరిగిందనే విషయాన్ని నిర్ధారించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ విషయాన్ని మరుగున పడేసేందుకు ప్రయత్నించడం బాధాకరం. ఇప్పటికైనా పవన్కళ్యాణ్ తక్షణం స్పందించి నా బిడ్డ కేసు దర్యాప్తు చేయించి, నిందితులను శిక్షించాలి. లేదంటే రాజకీయ లబ్ధి కోసమే నా కూతురు కేసు వాడుకున్నానని బహిరంగంగా చెప్పాలి. ముద్దాయిలను కాపాడటానికి నాది రెడ్డి కులమంటూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు.వీల్ ఛైర్ యాత్రకు ఎందుకు అనుమతివ్వడం లేదు?:నా కుమార్తె మృతికి న్యాయం చేయాలనే డిమాండ్తో 2025 లో వీల్ ఛైర్ యాత్రకు సిద్ధమైతే 300 మంది పోలీసులతో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. ఏ తప్పూ చేయకపోతే ప్రభుత్వం ఎందుకంతగా భయపడుతోంది? ఇప్పుడైనా నా వీల్ ఛైర్ యాత్రకు అనుమతివ్వాలి. ఎస్సీ, ఎస్టీ యాక్టు ప్రకారం మాకు రావాల్సిన బెనిఫిట్స్ని కూటమి ప్రభుత్వం ఆపేసిందని తెలుసుకున్న వైఎస్ జగన్గారు చాలా బాధ పడ్డారు. అవన్నీ సాధించడంతో పాటు కుటుంబానికి న్యాయం జరిగే దాకా పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
SIRపై YS జగన్ కీలక సమావేశం
-
జగన్ ను చూసేందుకు పోటెత్తిన జనం.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
-
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!
ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్, కీలక మంత్రి లోకేశ్లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్ ఆర్ నాట్ ద సేమ్’’ అంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... ‘‘అవును.. బోత్ కేన్ నెవ్వర్ బీ ద సేమ్’’ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్మీడియాలో హైలైట్గా నిలుస్తోంది.జగన్ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్పై కొన్ని విమర్శలు చేశారు.‘‘బోత్ ఆర్ నాట్ సేమ్, అర్థమైందా రాజా...’’ అంటూ సినిమా డైలాగు ఒకటి వదిలారు. చేసిన విమర్శలకు ఆధారాలు చూపిస్తే ఓకే కానీ... 99 శాతం అర్ధ సత్యాలుతో వాగడమే సమస్య. అచ్చం తన తండ్రి చంద్రబాబు మాదిరిగానే జగన్ అడిగిన వాటికి సూటిగా జవాబివ్వకుండా ఊకదంపుడు ఉపన్యాసాలకు పరిమితమవుతున్నారు. హుందా రాజకీయాలు చేయడం, నిర్మాణాత్మక విమర్శలు చేయడం, ప్రతిపక్షం చేసే ఆరోపణలకు బాధ్యతాయుతంగా జవాబు ఇస్తే గౌరవం కానీ... గొడ్డలి పార్టీ అని, మరొకటి అని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేసి, చుట్టుపక్కల ఉన్న వారితో ఆహా.. ఓహో అనిపించుకుని మురిసిపోతే ఆయనకే నష్టం.లోకేశ్ వ్యాఖ్యలకు జగన్ దీటుగా ఇచ్చిన సమాధానంతో ఎవరి తీరు ఏమిటన్నది స్పష్టమైపోయింది. వెన్నుపోటు ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు... ప్రజాబలంతో గద్దెనెక్కిన తామూ....‘నెవ్వర్ కేన్ బీ ద సేమ్’’ అని స్పష్టం చేశారు. అలాగే.. ప్రజలకు ఇచ్చిన హామీలను టీడీపీ ఎలా ఎగవేసింది.. తాము ఎలా నూటికి నూరుశాతం అమలు చేసింది ప్రస్తావించి లోకేశ్ వ్యాఖ్యను పూర్వపక్షం చేశారు. 2014లో చంద్రబాబు రైతు రుణ మాఫీతోపాటు అనేకానేక ఇతర వాగ్ధానాలిచ్చిన అధికారంలోకి రావడం.. ఆ తరువాత కొంత కాలానికి ఎన్నికల మేనిఫెస్టోను తెలుగుదేశం వెబ్సైట్ నుంచి తొలగించడం తెలిసిందే. 2024లో సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి చాలావాటిని అమలు చేయకుండానే చేసేసినట్లు ప్రచారం చేసి టీడీపీ నేతలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు. అదే జగన్ తన మానిఫెస్టోని సచివాలయాల్లో ప్రదర్శనకు పెట్టి అంతా దానిని ఫాలో అవ్వాలని ఆదేశించి కొత్త ట్రెండ్ సృష్టించారు. దీనిని చంద్రబాబు, లోకేశ్లు కాదనగలరా? దీనిపై వారు సమాధానం చెబితే బాగుంటుంది కదా! అందుకే బోత్ కెన్ నెవ్వర్ సేమ్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్య అర్థవంతం అవుతుంది.అమరావతి రోడ్లు, భవనాల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిని జగన్ అంకెలతో సహా కడిగి పారేశారు. దీనికి లోకేశ్ సమాధానం ఇవ్వలేకపోయారు. కాని మంత్రి అచ్చెన్నాయుడుతో మాత్రం... ‘‘ఆవును అమరావతిలో అయ్యే ఖర్చు వేరు..ఇతర ప్రాంతాలలో అయ్యే ఖర్చు వేరు రెండిటిని ఎలా పోల్చుతారు’’ అంటూ చిత్రమైన సమాధానం ఇచ్చారు. కానీ ఏ కారణాల వల్ల చదరపు అడుగుకు రూ.ఇరవై వేలకు పైగా వ్యయం అవుతోందన్నది వివరించలేకపోయారు. జగనేమో నిర్మాణాలలో ఏ కాంపొనెంట్కు ఎంత ఖర్చు చేస్తున్నది వివరిస్తూ వివరంగా మాట్లాడారు.చంద్రబాబు, లోకేశ్ తదితరులు వైసీపీని తరచు గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తమకు ఏదో పరపతి పెరుగుతుందని, వైసీపీని ప్రజల్లో విలన్ మాదిరి చేసి చూపించవచ్చని తాపత్రయపడుతున్నారు. అయితే నిత్యం ఈ అబద్ధపు ప్రచారమే చేస్తూండటం సంస్కారయుతంగా అనిపించదు. అందుకే జగన్ దానికి బదులు ఇస్తూ టీడీపీపైన, చంద్రబాబు పైన వచ్చిన హత్యారాజకీయాల ఆరోపణల చిట్టాను చదివారు. వాటిలో ఒక్కోదానికి జవాబివ్వకుండా జగన్ తాతగారు రాజారెడ్డి హత్య తర్వాత నిందితులు హత్యకు గురయ్యారని, ఇళ్లు కూల్చారని ఏవేవో ఆరోపణలు చేశారు. వాటిలో నిజం ఉందా?చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి హత్య జరిగింది. హత్య చేసింది టీడీపీ వారు కాదని ఎన్నడైనా చంద్రబాబు చెప్పగలిగారా? రాజారెడ్డి హత్య జరగడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం అయితే ఎదురు ఆరోపణలు చేయడం టీడీపీ ప్రత్యేకత. ఆ తర్వాత ఏమైనా అల్లర్లు జరిగి ఉంటే వాటిని నియంత్రించలేకపోవడం చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతే అవుతుంది కదా? ఈ విషయాన్ని కప్పిపుచ్చి విమర్శలు చేస్తే ఏమి ప్రయోజనం? చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం గురించి జగన్ ప్రస్తావించారు. అందులో చంద్రబాబువి ఎలాంటి హింసా రాజకీయాలో వెల్లడించారు.దానికి ఇన్నేళ్లకు కూడా చంద్రబాబు ఎందుకు జవాబు ఇవ్వలేదన్నది ప్రశ్న. అలాగే మాజీ ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి రంగా హత్యకు సంబంధించి మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన పుస్తకంలో చంద్రబాబు పాత్రపై రాసిన అంశంపై జగన్ నిలదీస్తే దాని గురించి నోరెత్తరు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త హత్యతో పలు అంశాలను జగన్ లేవనెత్తారు. అలాగే ప్రశ్నించే వారిపై, సోషల్ మీడియాపై కత్తికట్టి చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులపై కూడా జగన్ గట్టిగా మాట్లాడారు.వాటన్నిటికి టీడీపీ నుంచి వచ్చే జవాబు ఒకే మాట గొడ్డలి పార్టీ, వివేక హత్య కేసు, తల్లి, చెల్లి.. వివేక హత్య కేసులో జగన్ పై ఎలాంటి ఆరోపణలు లేవని సీబీఐ తేల్చినా వీరు మాత్రం తమ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తుంటారు. ఆ హత్యలో పాల్గొన్నానని చెప్పిన దస్తగిరి తరఫున టీడీపీ కేసులు ఎక్కువగా వాదించే సిద్ధార్థ లూధ్రా ఎలా న్యాయవాది అయ్యారన్న జగన్ ప్రశ్నకు సమాధానం ఇవ్వరు.తమిళనాడులో విజయ్ గెలుపులో తన పాత్ర ఏమి ఉంటుందని చాలా హుందాగా జగన్ జవాబు ఇచ్చారు. విజయ్ ఒకచోట జగన్ ఫోటో పట్టుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అమిత్ షాతో పవన్, నాదెండ్ల ల భేటీలో వచ్చిన అంశాలపై జగన్ వ్యూహాత్మకంగా జవాబిచ్చారు.అది జరిగిందా? లేదా? అన్నదాని జోలికి వెళ్లకుండా జగన్ గురించి జగన్ పాలన గురించి చంద్రబాబు గురించి, చంద్రబాబు పాలన గురించి, వ్యత్యాసం గురించి అమిత్ షాకు బాగానే తెలుసు అని వ్యాఖ్యానించి టీడీపీ, జనసేనలను డిఫెన్స్లో పడేసినట్లు అనిపించింది. జగన్ అప్పుడప్పుడో లేక నెలకోసారి ప్రెస్మీట్ పెట్టి వరసబెట్టి పలు అంశాలపై మాట్లాడి కూటమికి గుక్క తిప్పుకోనివ్వకుండా చేయగలుగుతున్నారన్నది మాత్రం నిజం.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
లోకేష్ కాదు లీకేష్.. మెగా DSCలో దగా
-
రేపు పార్టీ ముఖ్యనేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 27న పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ రోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. దీనికి పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరవుతారు.రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్, పార్టీ కమిటీల నిర్మాణం తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలోని వైఫల్యాలు, ప్రజా సమస్యలు, సమకాలీన రాజకీయ పరిణామాలపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేస్తారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరుగుతుంది. -
మెగా డీఎస్సీనా? లేక దగా డీఎస్సీనా?... చంద్రబాబును సూటిగా ప్రశ్నించిన మాజీ సీఎం వైఎస్ జగన్
-
మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా?
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు సర్కార్ నిర్వహించిన డీఎస్సీ–2025 పరీక్షలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని ఆక్షేపించిన మాజీ సీఎం వైఎస్ జగన్, పేపర్ లీకులు, డేటా డిలీట్లు, మెరిట్ లిస్టుల మాయం వంటి ఘటనలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, కొత్త నోటిఫికేషన్ను ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. నారా లోకేశ్ని మంత్రి పదవి నుంచి తప్పించి ... మెగా డీఎస్సీని స్కాంపై సీబీఐ దర్యాప్తు కోరాలన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా సోమవారం సీఎం చంద్రబాబు సర్కార్ తీరును ఎండగడుతూ వైఎస్ జగన్ పోస్టు చేశారు. చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా ⇒ డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. దీనికేమి సమాధానం చెబుతారు? మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘డార్క్ ఆపరేషన్’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? ⇒ రూ.15 లక్షలకు ‘‘స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టీఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి? ⇒ టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏమిటి? మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి.. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరాలి. చంద్రబాబూ..! మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయాలి. -
మెగా కాదు దగా డీఎస్సీ.. బాబు,లోకేష్ పై జగన్ ఫైర్
-
ఇది రిక్రూట్మెంటా?.. లేక వేలం పాటా..?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి,తాడేపల్లి : డీఎస్సీ పరీక్షల లీకులు, డేటా బేస్ మాయంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ను పదవి నుండి తొలగించాలనీ.. లీకుల విషయమై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమవారం (మే 25) వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు.చంద్రబాబూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా?. లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా?. పారదర్శకత ఎక్కడ ఉంది?.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?. మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు?.మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు?.టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు?.కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా?.మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా?.ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా?. ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి?.టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు?దీనివెనుక మతలబు ఏంటి?.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి’అని డిమాండ్ చేశారు. .@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 25, 2026 -
ఢిల్లీలో 102.. విజయవాడలో 118
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధిక స్థాయికి చేరుకోవడం ఇటు రాజకీయ యుద్ధంగా మారింది. ఎన్నికల ముందు ప్రజలపై భారం తగ్గిస్తామని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ధరల తగ్గింపుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “జగన్ హయాంలో పెట్రోల్ రేట్లు పెరిగాయంటూ ప్రచారం చేశారు.. మరి ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు?” అనే గొంతుక సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.తాజాగా పెంచిన ఇంధన ధరలతో.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102 వద్ద ఉండగా.. విజయవాడలో అది రూ.118కి చేరడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు హైదరాబాద్లో పెట్రోల్ రూ.115.69గా ఉంది. అంటే పొరుగు రాష్ట్రంతో పోల్చినా కూడా ఏపీలోనే ఇంధన భారం ఎక్కువగా పడుతోంది. కానీ, టీడీపీ అనుకూల మీడియా మాత్రం హైదరాబాద్ విషయాన్నే పదే పదే ప్రస్తావిస్తూ.. ఏపీలో రేట్లను ఏ మూలన ప్రస్తావించడం లేదు.అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, హర్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయన్నది తెలిసిందే. సామాన్యుల జేబుకు చిల్లుపడే విషయంలో.. ఆయిల్ కంపెనీలు, కేంద్రం చేతులెత్తాశాయి. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ధరలు మరింత ఎక్కువగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక వ్యాట్, అదనపు సెస్సులేనని విమర్శలు వస్తున్నాయి.ప్రస్తుతం ఏపీలో పెట్రోల్పై 31 శాతం వ్యాట్తో పాటు లీటరుకు అదనంగా రూ.4 వ్యాట్, మరో రూ.1 రోడ్ డెవలప్మెంట్ సెస్సు వసూలు చేస్తున్నారు. ఇందులో అదనపు వ్యాట్, ఇతర భారం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అమలులోకి వచ్చిందని మొన్నటి ప్రెస్మీట్లో వైఎస్ జగన్ గుర్తు చేశారు.( 2015లో అప్పటి బాబు సర్కార్ ఫిబ్రవరి 5వ తేదీన ఇచ్చిన జీవోలో.. పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డించారు). అయితే.. కరోనా వంటి కష్టకాలంలో కూడా తమ ప్రభుత్వం కేవలం రోడ్ సెస్సు కింద ఒక్క రూపాయి మాత్రమే పెంచిందని ఆయన వివరించారు. అదే సమయంలో చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెరిగాయని ప్రచారం చేశారని.. అధికారంలోకి వస్తే తగ్గిస్తామని మాటిచ్చారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మౌనం వహిస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్ చెప్పిన లెక్క ప్రకారం.. దేశవ్యాప్తంగా.. గత 10 రోజుల్లో నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. మే 15 నుంచి ఇప్పటివరకు దేశ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.8 పెరిగింది. ఈ ప్రభావంతోనే విజయవాడలో ధరలు మరింత ఎగబాకాయి. దీంతో “ఏపీలో సామాన్యుడికి భారం” అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే..జగన్ తాజా వ్యాఖ్యల్లో మరో కీలక ప్రశ్న కూడా లేవనెత్తారు. “ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఓట్లు అడిగారు. జగన్ హయాంలో పెరిగిందని విమర్శించారు. అప్పుడు అంత విమర్శించారు కాబట్టి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ధరలు తగ్గించాలి కదా? మరి ఎందుకు పెరుగుతున్నాయ్” అని చంద్రబాబు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ ప్రెస్మీట్ నాటికి పెట్రో ధరలు రూ.4 పెరిగాయి. ఈ మధ్యలోనే మరో నాలుగు రూపాయలు పెరిగింది. ఈ లెక్కన జగన్ కోరినట్లు ఆ రూ. 8 చంద్రబాబు తగ్గింపు చేసి ఉంటే.. ఏపీలో వాహనదారులపై భారం చాలా వరకు తగ్గేదే అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక.. ఇంధన ధరల వ్యవహారంలో ఎన్నికల ముందు కూటమి నేతలు చేసిన విమర్శలు, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కనిపిస్తున్న వైఖరి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందనే అభిప్రాయం ఆరోపిస్తోంది. “జగన్ హయాంలో పెట్రోల్ భారం” అంటూ ప్రచారం చేసిన నేతలు.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధరలు ఏపీలో ఉన్నా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ అడిగిన దానికి సమాధానం ఏదని నిలదీస్తున్నారు. మరోవైపు హామీల్లో తగ్గింపు మాటలు చెప్పి.. చేతల్లో మాత్రం అదనపు భారం కొనసాగిస్తుండటంతో ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పుడు ప్రజలు “మాటల బాబు.. చేతల్లో ఎక్కడ?” అని నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. -
జగన్ మాస్టర్ ప్లాన్.. బాబు, లోకేష్ వెన్నులో టెన్షన్ షురూ..
-
27న వైఎస్సార్సీపీ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ఎల్లుండి(బుధవారం) పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం తదితర అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే కార్యాచరణ, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే అంశాలపై కూడా సమావేశంలో సమగ్ర చర్చ జరగనుంది.అలాగే, చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. -
ప్రశ్నిస్తే కేసులా..? ప్రొ. నాగేశ్వర్ కేసుపై జగన్ సీరియస్
-
ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర పార్థసారథిరెడ్డిది
పులివెందుల: టీడీపీ నేత పేర్ల పార్థసారథిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని వేముల మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ బయపురెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల భాకరాపురంలో వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజారెడ్డిని చంపిన నీచ చరిత్ర కలిగిన పార్థసారధిరెడ్డి తనకు దారుణమైన అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతూ వైఎస్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తాతను చంపిన వారిని తాను, తన తండ్రి పట్టించుకోలేదని ఇటీవల చెప్పారన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి 11 ఏళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారని, వారిద్దరూ తలచుకుంటే నువ్వు పులివెందుల ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగేవాడివా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయిన తర్వాత రాయలసీమలో ఎక్కడా ఫ్యాక్షన్ ఉండకూడదని నిశ్చయించుకుని పూర్తిగా రూపుమాపారని చెప్పారు. కర్నూలు జిల్లాలో కాటసాని కుటుంబానికి, బిజ్జల పార్థసారథి కుటుంబానికి ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాలకు కూడా వైఎస్ రాజీ కుదిర్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం వేముల, వేంపల్లె మండలాల్లో అక్రమ మైనింగ్ ద్వారా పార్థసారథిరెడ్డి, టీడీపీ నాయకులు రూ.కోట్లు దోచుకోలేదా అని ప్రశ్నించారు. గనుల కోసమే తమ పార్టీ నాయకుడు వేల్పుల రాముపై పార్థసారథిరెడ్డి హత్యాయత్నం చేశాడన్నారు. టీడీపీ నాయకులు ప్రతిసారి వివేకాను హత్య చేస్తున్నారని, గొడ్డలిపార్టీ అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అసలు వైఎస్ వివేకాను ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ వివేకాను చంపాల్సిన అవసరం వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిలకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయే ముందురోజు వరకు వైఎస్ జగన్, వైఎస్ అవినాష్ గెలుపు కోసం పనిచేశారన్నారు. అసలైన వెన్నుపోటు పార్టీ టీడీపీయేనన్నారు. ఇప్పటికైనా పార్థసారథిరెడ్డి నిరాధారణమైన ఆరోపణలు, ప్రేలాపనలు మానుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో వేముల చెరువు నీరు లేకుండా కనపడిందా, ప్రస్తుతం ఆ చెరువు పరిస్థితి ఎలా ఉంది అని ప్రశ్నించారు. ఎవరేమిటో ప్రజలు గమనిస్తున్నారని, తమతో పోటీ పడాలంటే అభివృద్ధిలో పోటీపడాలన్నారు. పార్థసారథిరెడ్డి ఇకపై చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కార్యక్రమంలో వేముల మాజీ సర్పంచ్ రాఘవరెడ్డి, ఎంపీపీ గంగాదేవి వెంకటనారాయణ, ఎంపీటీసీలు మల్రెడ్డి, రామచంద్రారెడ్డి, గంగిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు మదర్సావలీ, రాధాకృష్ణయ్య, డీసీసీ మాజీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, కో–ఆప్షన్ సభ్యుడు మహబూబ్పీరా, వైఎస్సార్సీపీ నాయకులు చలమారెడ్డి, రాజారెడ్డి, చలపతి, నాగభూషణం, గంగాధర్, మల్లారెడ్డి, శ్రీనివాసులు, శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
వావిలాల లీలామహేశ్వరి కన్నుమూత
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): ‘ఆంధ్రా గాందీ’, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పెంచుకున్న కుమార్తె వావిలాల లీలామహేశ్వరి (87) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించారు. వావిలాల గోపాలకృష్ణయ్య నీడలో పెరిగిన లీలామహేశ్వరి ఆయన విలువల్ని పుణికిపుచ్చుకున్నారు. జీవిత చరమాంకంలో గోపాలకృష్ణయ్యను ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారు. గుంటూరు అరండల్పేట 9/2వ అడ్డరోడ్డులోని వావిలాల గోపాలకృష్ణయ్య నివాసం ప్రస్తుతం అపార్ట్మెంట్గా మారగా.. లీలామహేశ్వరి అక్కడే నివసిస్తూ తండ్రి వారసత్వాన్ని, జ్ఞాపకాలను కాపాడుకుంటూ వచ్చారు.కుమారి వావిలాల లీలామహేశ్వరి 1939 జూన్ 4న వావిలాల బ్రహ్మసోమయాజులు, అఖిలాండేశ్వరి అన్నపూర్ణమ్మ దంపతులకు గుంటూరులో జన్మించారు. గోపాలకృష్ణయ్యకు బ్రహ్మసోమయాజులు పెద్ద అన్న. లీలామహేశ్వరిని గోపాలకృష్ణ పెంచుకుని తమ కుమార్తెగా చెప్పేవారు. లీలామహేశ్వరికి ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. అతి పెద్ద కుటుంబం కావడంతో ఆరి్థక పరిస్థితుల దృష్ట్యా లీలామహేశ్వరి పీయూసీ వరకు చదివారు. ఆమె వివాహం చేసుకోలేదు.ఉపాధ్యాయురాలిగా ఉద్యో గ జీవితాన్ని ప్రారంభించి, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను ఉన్నత చదువులు చదివించారు. వారికి వివాహాలు జరిపించారు. ఆ తర్వాత ఆమె కూడా ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. మొదట గుంటూరు లోని సెయింట్ ఇగ్నిషియస్ బాలికల పాఠశాలలో, ఆ తర్వాత బ్రాడీపేటలోని శ్రీ బండ్లమూడి హనుమాయమ్మ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందారు. సారా నిషేధం, సంపూర్ణ అక్షరాస్యత, పలు సామాజిక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. వావిలాల సంస్థ తరఫున అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం గుంటూరులోని బొంగరాలబీడు శ్మశానవాటికలో నిర్వహించారు.వావిలాల లీలామహేశ్వరి మృతి సమాజానికి తీరని లోటుమాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య కుటుంబానికి చెందిన వావిలాల లీలామహేశ్వరి మృతిపట్ల మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఆమె జీవితమంతా సేవాభావంతో జీవించారని కొనియాడారు. మహనీయుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు చివరి దశలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వావిలాల సంస్థకు విశిష్ట సేవలు అందించడంతోపాటు ఉపాధ్యాయినిగా అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి అందరికి ఆదర్శమని పేర్కొన్నారు. లీలా మహేశ్వరి మరణం సమాజానికి తీరని లోటని అన్నారు. -
రైతులకు సంఘీభావంగా వెళ్తే అరెస్టులు చేయిస్తారా?
సాక్షి, అమరావతి: మొక్కజొన్న రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లెకు ఎవరు వెళ్తున్నా పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా? అని సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా ఎవరూ ప్రశ్నించకూడదా? అని నిలదీశారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొఫెసర్ నాగేశ్వర్పై దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? అని నిలదీశారు. మీరే దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరని అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తించుకోవాలంటూ హెచ్చరించారు. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై మా పోరాటం ఆగదు చంద్రబాబూ..! ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎప్పటికీ గళం విప్పుతూనే ఉంటుంది.. నిరంతరం ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేస్తూ వైఎస్ జగన్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..⇒ చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. దీన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగమోహన్కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. ⇒ జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు? ⇒ మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400– రూ.1,600 కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా దీన్ని ఎవరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి అరెస్టులు చేస్తారా? ⇒ మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ.నాగేశ్వర్పై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పారీ్టల మీదా విమర్శలు, అన్ని వార్తాంశాల మీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్రాజ్ చేశారు చంద్రబాబూ! ⇒ చంద్రబాబు గారూ.. మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలిం.. ప్రజలు దీన్ని ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, అణచివేతలు, కక్ష సాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది -
డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
తాడేపల్లి: ప్రముఖ అభ్యుదయ రచయిత, సాహితీ విమర్శకుడు, విశాలాంధ్ర మాజీ ఎడిటర్, విమర్శకుడిగా తెలుగు సాహిత్యంలో లబ్ధప్రతిష్ఠులైన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సాహిత్య రంగంలో అభ్యుదయ భావజాలాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసిన రచయితగా డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ విశిష్ట స్థానం సంపాదించారని జగన్ పేర్కొన్నారు. రచయితగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.అభ్యుదయ రచయితల సంఘం పునర్నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, అనేక రచనల ద్వారా సమాజంలో చైతన్యం నింపారని కొనియాడారు. ప్రముఖ సామాజిక సంస్కర్త తాపి ధర్మారావు జీవితంపై ఆయన చేసిన పరిశోధనలు, వెలువరించిన గ్రంథాలు తెలుగు సాహిత్యానికి విలువైన ఆస్తిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.విశాలాంధ్ర పత్రిక సంపాదకుడిగా ఆయన జర్నలిజం రంగానికి అందించిన సేవలు కూడా విశేషమని వైఎస్ జగన్ గుర్తుచేశారు. డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణం తెలుగు సాహిత్య రంగానికి, అభ్యుదయ ఉద్యమాలకు తీరని లోటని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, హైదరాబాద్ నారాయణగూడలోని స్వగృహంలో వృద్దాప్య సమస్యలతో డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మరణించిన సంగతి తెలిసిందే. -
చంద్రబాబూ.. అంత ఫ్రస్టేషన్ ఎందుకు?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. ఈ మేరకు మామిళ్లపల్లె ఘటనలపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ ’ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. ‘గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం. జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు? మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్రాజ్ చేశారు చంద్రబాబూ.చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో… pic.twitter.com/t1FH8uUsDv— YS Jagan Mohan Reddy (@ysjagan) May 24, 2026 మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది’ అని స్సష్టం చేశారు. -
వావిలాల లీలా మహేశ్వరి మరణం బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి,గుంటూరు: కుమారి వావిలాల లీలా మహేశ్వరి మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య గారి కుటుంబానికి చెందిన లీలా మహేశ్వరి జీవితాంతం సేవా భావంతో జీవించారు. వావిలాల గోపాలకృష్ణయ్య చివరి దశలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం. వావిలాల సంస్థకు విశిష్ట సేవలు అందించారు. ఉపాధ్యాయునిగా ఎన్నో సంవత్సరాలు అంకితభావంతో పనిచేశారు.విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ, సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి సమాజానికి ఆదర్శనీయం. కుమారి వావిలాల లీలా మహేశ్వరి గారి మరణం సమాజానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’అని పేర్కొన్నారు. -
నా ప్రశ్నలకు బదులేది ? చంద్రబాబుకు YS జగన్ సూటి ప్రశ్నలు
-
దశరథన్నా.. ధైర్యంగా ఉండండి
తిరుపతి తుడా : టీడీపీ రౌడీమూకల దాడిలో తీవ్రంగా గాయపడ్డ రాయచోటి మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ దశరథరామిరెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి శుక్రవారం పరామర్శించారు. అనంతరం ఆయన వైఎస్ జగన్కు ఫోన్చేసి దశరథరామిరెడ్డితో మాట్లాడించారు. ఈ సందర్భంగా ఆయనకు జగన్ ధైర్యం చెప్పారు. ‘‘దశరథన్నా.. ధైర్యంగా ఉండండి. పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది’’ అంటూ భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గడికోట మీడియాతో మాట్లాడుతూ.. దశరథరామిరెడ్డిపై అతి కిరాతకంగా కత్తులు, రాడ్లతో దాడిచేయించారని మండిపడ్డారు. దీని వెనుక స్థానిక మంత్రి ప్రమేయం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ మూకలు అరాచక శక్తులుగా మారిపోయారన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ బెదరదని హెచ్చరించారు. ప్రశాంతమైన రాయచోటి కోసం తాము ప్రయతి్నస్తుంటే, టీడీపీ నేతలు అల్లర్లకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేస్తామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని గడికోట తేల్చిచెప్పారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దశరథరామిరెడ్డికి ఫోన్లో ధైర్యం చెబుతున్న వైఎస్ జగన్ -
ఈ ప్రశ్నలకు బదులేదీ?
సాక్షి, అమరావతి : చంద్రబాబు కూటమి ప్రభుత్వం తీరుతో రాష్ట్రం ఓ వైపు అప్పుల ఊబిలో కూరుకుపోతుండగా, మరోవైపు కీలక రంగాలన్నీ తిరోగమనంలో పయనిస్తున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలేవీ అమలు చేయకుండానే, చేసేశామని.. రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో డప్పు కొట్టుకుంటోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ రంగాల వారీగా ఆధారాలు చూపిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తూ నిలదీశారు.ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు చంద్రబాబు కానీ, ఆయన మంత్రులు కానీ స్పష్టంగా సమాధానం ఇచ్చిన పాపాన పోలేదు. అడ్డగోలు వాదనతో దూషిస్తూ, దుర్భాషలాడుతూ ఎదురు దాడికి దిగారు. మొదటి నుంచీ రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు ఆద్యులెవరన్న ప్రశ్నకు సమాధానం లేదు. వైఎస్ రాజారెడ్డిని హత్య చేసిన వారికి హైదరాబాద్లో ఇదే టీడీపీ కార్యాలయంలో షెల్టర్ ఇచ్చిందెవరన్న ప్రశ్నపై నోరు విప్పితే ఒట్టు. రాజధానిలో చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఎందుకు వెచ్చిస్తున్నారో సమాధానం చెప్పలేదు. ఇంటీరియర్, తదితర సౌకర్యాలను కలిపితే చదరపు అడుగు రూ.30 వేలు దాటిపోవచ్చు. అయినా కమీషన్ల కోసం సమర్థింపే కనిపిస్తోంది తప్ప.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నామనే భీతి ఇసుమంతైనా లేదు.విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులు సైతం ఇక్కట్లు పడుతున్నారు. పీఆర్సీ లేదు.. నాలుగు డీఏలు లేవు. దాదాపు రూ.35 వేల కోట్ల బకాయిలున్నాయి. వీటన్నింటిపై చంద్రబాబు కూటమి నుంచి సమాధానమేలేదు. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) గణాంకాలు చూపి ప్రశ్నించినా స్పందనే ఉండదు. పైగా వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ డైవర్షన్ రాజకీయం చేయడం మాత్రమే కనిపిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజల్లో తీవ్ర చర్చే లేవనెత్తాయి. ఈ సందర్భంగా వాటిలో కొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి. బాబూ.. సమాధానం చెప్పండి⇒ రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తుండటం నిజం కాదా? ⇒ మీ స్కామ్ల కోసం చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తుండటం నిజం కాదా?⇒ స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్ట్లు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తుండటం వాస్తవం కాదా? ⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటక పోవడం నిజం కాదా?⇒ దేశంలో హైవేల నిర్మాణానికి కిలోమీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతుంటే.. అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నట్లు? ⇒ ఈ లెక్కన అమరావతి ఎలా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అవుతుంది? అలా అంటూనే రాజధాని కోసం రూ.47,387 కోట్ల అప్పులు చేయడం, బడ్జెట్ నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపించడం నిజం కాదా? ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లు ఖర్చు చేస్తుండటం నిజం కాదా?⇒ రాజధానిలో మీ (చంద్రబాబు) మనుషులు ఏబీఎన్ రాధాకృష్ణ, అశ్వినీదత్, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు మీ బినామీలకు రోడ్ల పక్కన, సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు ఇవ్వడం నిజం కాదా?⇒ ఈ విషయాలపై నిలదీస్తే, ఇందుకు ప్రత్యామ్నాయంగా ‘మావిగన్’ను సూచిస్తే మీకు (చంద్రబాబు) బీపీ పెరిగి మీ మంత్రులతో బూతులు తిట్టిస్తుండటం వాస్తవం కాదా?⇒ కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లుతోందెవరు?⇒ మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా?⇒ మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేనూ చూస్తా’ అని మీరు (చంద్రబాబు) బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా? ⇒ మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?⇒ మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతుండటం నిజం కాదా? మీ (చంద్రబాబు) లాయర్ సిద్దార్థ లూథ్రానే దస్తగిరి తరఫున కూడా లాయర్గా వాదిస్తుండటం వాస్తవం కాదా? ⇒ చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా? ⇒ ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మెన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా?⇒ ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? ⇒ సొంత మామను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొన్నదెవరు?⇒ వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతుండటం నిజం కాదా?⇒ మల్లెల బాబ్జి ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? ⇒ జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ను చంపిందెవరు? ⇒ 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించింది మీరు కాదా?⇒ మీ కాంట్రాక్టర్లకు రిటైల్ బంకుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ ఇవ్వాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసిందెవరు?⇒ సూపర్ సిక్స్, సూపర్ సెవన్ సహా 143 హామీలు అమలు చేయకుండా మోసం చేసిందెవరు?⇒ అప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నది మీరు కాదా?⇒ మహిళలను పిల్లలను పుట్టించే యంత్రాలుగా చూస్తూ, ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామని ఒత్తిడి చేస్తున్నదెవరు?⇒ 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పింఛన్.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, కొత్త పింఛన్లు ఎంత మందికి ఇచ్చారు?⇒ రైతులకు ఉచిత పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ ఎగ్గొట్టిందెవరు? ఆర్బీకేలు నిర్వీర్యం చేసిందెవరు? ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర లేకున్నా పట్టించుకోనిదెవరు? ⇒ విద్యా దీవెన, వసతి దీవెన కింద రూ.9,728 కోట్లు ఇవ్వాలనడం నిజం కాదా? ఆరోగ్య శ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదెవరు?⇒ రాష్ట్రంలో సోషల్ మీడియా సెన్సార్షిప్ కొనసాగుతుండటం నిజం కాదా? ⇒ మీకు (చంద్రబాబుకు) వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టిస్తుండటం వాస్తవం కాదా? ⇒ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు సాగుతుండటం నిజం కాదా? ⇒ ఓ వైపు పొదుపు చర్యలు అంటూ చంద్రబాబు, ఆయన కొడుకు, దత్తపుత్రుడులు వేర్వేరుగా ప్రైవేట్ చాపర్లో తిరుగుతుండటం నిజం కాదా? -
కాకర్ల వెంకట్రామిరెడ్డి ఉద్యోగం తొలగింపు.. జగన్ సంచలన రియాక్షన్
-
అమరావతిలో బాబు లూటీ
సాక్షి, అమరావతి: అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలన్నీ దొంగ మాటలని తేలిపోయిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘ఇప్పటికే అమరావతి పేరుతో రూ.47,387 కోట్లు అప్పు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. అమరావతిలో స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నావని ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ (రక్తపోటు) పెరుగుతోంది’ అంటూ మండిపడ్డారు. లక్ష ఎకరాల అమరావతిలో కేవలం రోడ్లు, నీళ్లు, కరెంటు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసి కూడా, చంద్రబాబు తన స్కాముల కోసం రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆచరణాత్మకంగా (మోస్ట్ ప్రాక్టికల్) మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్గా పెట్టాలని మావిగన్ను ప్రతిపాదించామని స్పష్టం చేశారు. ‘అమరావతి అయితే సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలి. అదే మావిగన్ అయితే మొదటి రోజు నుంచే ఫలితాలు వస్తాయని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి.. ప్రజలందరూ ఇదే కరెక్టని, చంద్రబాబు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందులపాలు చేయడం ధర్మం కాదంటుంటే.. సమాధానం చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో బీపీ పెరిగి నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, ఆయన మంత్రులతో సహా అబద్ధాలాడుతూ, బూతులు తిట్టిస్తున్నారు. మీడియా ప్రతినిధులు ఎప్పుడైనా చంద్రబాబును మావిగన్పై స్పందన కోరండి.. గుండె ఆగిపోకపోతే అదృష్టం. వెంటనే మిమ్మల్ని తిట్టకపోతే.. మీపై బ్లాస్ట్ కాకపోతే చూడండి’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని కొత్త సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు, రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు, అంచనా వ్యయం పెంపు, అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం.. తద్వారా చోటుచేసుకున్న భారీ స్కామ్లను సాక్ష్యాధారాలతో సహా వివరించారు. స్కాముల కోసం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్న సీఎం చంద్రబాబు తీరును కడిగి పారేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ‘ప్రజలు తమ బతుకు బండిని నడపడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ప్రజల బాగోగులను గాలికి వదిలేసి ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచి.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దారుణమైన అవినీతి, దోపిడీ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. ప్రశ్నించే గొంతును పాశవికంగా అణగదొక్కుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల గొంతు వినిపించడానికి వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు. ఈ కాలంలో ప్రజలకు చేసిన మంచి ఏమిటో చెప్పుకునే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. రెండేళ్లుగా బాబు పరిపాలనలో తీరు ఇదే. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుసూ్తనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఏ విషయంలోనైనా గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ను డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీ, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. పొరపాటున చంద్రబాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగిపోవచ్చు. మావిగన్ అంటే చాలు బాబుకు అంతగా బీపీ పెరుగుతోంది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అనేది దొంగ మాటేచంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు రాష్ట్రానికి ఎన్నటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా ఉండేలా వ్యవహరిస్తున్నారు. లక్షల ఎకరాల్లో అమరావతి నిర్మాణం పేరిట కేవలం రోడ్లు, డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికే రూ.2లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాదని తెలిసీ చంద్రబాబు స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమ కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ ఇంత వరకు చంద్రబాబు చెప్పిన మాటలు దొంగ మాటలుగా తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన, తెస్తున్న (కమిట్) అప్పులు రూ.47,387 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి మరో రూ.9,200 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. స్కాముల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారని ప్రశ్నిస్తే బాబుకు రక్తపోటు (బీపీ) వస్తోంది.మావిగన్ అంటే ఉలికిపాటు.. రక్తపోటురాష్ట్రానికి ఆచరణాత్మకంగా (మోస్ట్ ప్రాక్టికల్), ఏపీ పరిస్థితులను పూర్తిగా మనస్సులో పెట్టుకుని మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు వరకు 110 కిలోమీటర్ల హైవేకు ఇరువైపుల రాజధాని కారిడార్గా పెట్టాలని మావిగన్ను ప్రతిపాదించాం. మచిలీపట్నం–విజయవాడ 70 కిలో మీటర్లు, విజయవాడ–గుంటూరు మరో 40 కిలో మీటర్లు హైవే వెంట అద్భుత రాజధాని అవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వైఎస్సార్సీపీ హయంలో నిర్మాణం తలపెట్టిన పోర్టు శరవేగంగా నడుస్తోంది. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం కనిపిస్తోంది. 3 రైల్వే స్టేషన్లు, 4 జాతీయ రహదారులు కలుస్తున్నాయి. 9 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 35–40 లక్షల జనాభా ఉంది. అదే అమరావతి అయితే.. అంతా సున్నా (జీరో) నుంచి మొదలు పెట్టాలని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో మద్దతు పెరిగే సరికి తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు, ఆయన మంత్రులు నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారు. ఏడు బిల్డింగులకు రూ.14,092 కోట్లుసెక్రటేరియట్ బిల్డింగ్లకు మాత్రమే రూ.10,665 కోట్లు అవుతుందా? ఏమిటీ దోపిడీ అని ఎవరైనా ప్రశ్నిస్తే బాబుకు బీపీ పెరుగుతుంది. ఇవి కాకుండా కొత్త అసెంబ్లీ కోసం 11.21 లక్షల ఎస్ఎఫ్టీలో నిర్మాణానికి రూ.1,947 కోట్ల ఖర్చు తేల్చారు. అంటే ఎస్ఎఫ్టీ రూ.17,356 పడింది. కొత్త హైకోర్టుకు 20.32 లక్షల ఎస్ఎఫ్టీలో పాక్షికంగా రూ.1,480 కోట్లతో టెండర్లు పిలిచారు. ఇది పూర్తయ్యే సరికి ఏ స్థాయికి రేట్లు పెరుగుతాయో తెలీదు. ఇలా 5 సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కలిపి.. ఏడు బిల్డింగుల కోసం ఏకంగా రూ.14,092 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. కి.మీ. రోడ్డు నిర్మాణానికి రూ.53 కోట్లా?అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పార్లమెంట్కు ఈ ఏడాది ఫిబ్రవరి 5న లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ, అమరావతిలో కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్కు కిలోమీటరుకు రూ.69 కోట్లు ఖర్చయితే.. చంద్రబాబు అమరావతిలోని సీడ్ యాక్సెస్ నుంచి వారధి వద్ద కలిపే ఫ్లై ఓవర్కు కిలోమీటర్కు రూ.189 కోట్లు ఖర్చు చూపిస్తున్నారు.⇒ చంద్రబాబు రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు. ⇒ ఆచరణ సాధ్యం కాదని తెలిసినా, చంద్రబాబు తన స్కాముల కోసం రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటూ చెప్పిన మాటలు దొంగ మాటలని తేలాయి.⇒ ప్రజలంతా మావిగన్కు మద్దతు పలుకుతుంటే తట్టుకోలేక, ఆక్రోశంతో బీపీ పెరిగి చంద్రబాబు.. తన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు⇒ గతంలో ఇచ్చిన టెండర్లు రద్దు చేసి, అదే కాంట్రాక్టర్లకు టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతుల్లో తిరిగి టెండర్లు కట్టబెట్టారు. అంతటితో ఆగకుండా స్ట్రక్చర్, మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్, అద్దాల ఫిటింగ్, డిజైన్ తదితర రకరకాల పేర్లతో అదే కాంట్రాక్టర్లకు అన్ని పనులు అప్పగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా వెచ్చిస్తున్నారు. ⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు.⇒ అమరావతిలో వేసే రోడ్లలోనూ చంద్రబాబు భారీ స్కాములు కనిపిస్తున్నాయి. దేశంలో హైవేల నిర్మాణానికి కిలో మీటరుకు సగటున రూ.24 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం చెబుతోంది. కానీ, అమరావతిలో మాత్రం కిలోమీటరు రోడ్డు నిర్మాణ ఖర్చు రూ.53 కోట్లు. ⇒ రాజధానిలో చంద్రబాబు తన మనుషులు ఏబీఎన్ రాధాకృష్ణకు, అశ్వినీదత్కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు తన బినామీలకు రోడ్ల పక్కన విలువైన రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు మాత్రం చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? -వైఎస్ జగన్ అమరావతిలో ప్లాట్ల స్కామ్చంద్రబాబు తన మనుషులకు, ఏబీఎన్ రాధాకృష్ణకు, అశ్వినీదత్కు, బలుసు శ్రీనివాసరావు, బెజవాడ రమేష్ వంటి వారితో పాటు తన బినావీులకు అమరావతిలోని రోడ్ల పక్కన విలువైన రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారు. సామాన్య రైతులకు చెరువులు, వాగులు, కుంటల్లో ప్లాట్లు చూపిస్తున్నారు. ఇంత కంటే అన్యాయం ఉంటుందా? తొలి దశలో తీసుకున్న 50 వేల ఎకరాలకు దిక్కులేదని రైతులు అంటుంటే.. ఇవి సరిపోవని మరో 50 వేల ఎకరాలు కావాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, రైతులు ధర్నాలు చేస్తున్నా లెక్క చేయకుండా బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. మేం బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రశ్నిస్తూ, ఆధారాలతో సహా స్కాములను బయట పెడుతుంటే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. అబద్ధాలు ప్రచారం చేస్తూ, కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వాళ్లే బిల్డప్ ఇచ్చి.. ఒక కథ అల్లుతారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఒక పెద్ద మాఫియా ముఠా. వీళ్లు ఏమనుకుంటే దానిపై ఒక అబద్ధాన్ని సృష్టించి.. దొంగ సాక్ష్యాలతో వీళ్ల అధికారులతోనే కేసులు పెట్టిస్తున్నారు.ఆ అవినీతిని చూసి ఎవరైనా నివ్వెరపోవాల్సిందేవెలగపూడి ప్రాంతంలో ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు అందుబాటులో ఉన్నాయి. వీటిని పక్కన పెట్టి మళ్లీ కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులకు బిల్డింగులు నిర్మిస్తున్నారు. దీనికి శాశ్వత సెక్రటేరియట్ అని కొత్తగా నామకరణం చేసి నిర్మిస్తున్న 5 బిల్డింగుల్లో చంద్రబాబు చేస్తున్న దోపిడీ చూస్తే ప్రజలంతా నివ్వెరపోతారు. 2018లో ఇవే ఐదు టవర్ల కోసం 52,20,496 ఎస్ఎఫ్టీ (చదరపు అడుగు) బిల్డప్ ఏరియాతో నిర్మాణాలకు రూ.2,271 కోట్లతో టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించారు. ఈ లెక్కన ఒక ఎస్ఎఫ్టీకి సుమారుగా రూ.4,350 అవుతుంది. ఇది 2018 రేట్ల ప్రకారం చాలా ఎక్కువ. కానీ, ఇవే బిల్డింగులకు గతంలో ఇచ్చిన పనుల టెండర్లను రద్దు చేసి, కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచారు. ఇక్కడా గతంలో ఉన్న కాంట్రాక్టర్లే వచ్చారు. అవే కంపెనీలకు, అవే పనులు దక్కాయి. ఒక టైలర్ మేడ్ రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు ఈ కంపెనీలకు వచ్చేలా చేశారు. దీనిపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది.⇒ ఐదు బిల్డింగులకు సంబంధించి కేవలం స్ట్రక్చర్ కోసమే రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఖరారు చేశారు. ఈ భవనాల ఆవరణలోనే డ్రెయినేజీ, నీళ్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం మరో రూ.1,053 కోట్లు.. లిఫ్టులు, ఏసీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు ఇచ్చారు. ఇక్కడితో ఆగకుండా బిల్డింగ్లకు అదనంగా అద్దాలు వేసేందుకు (గ్లాస్ ఫిట్టింగ్) రూ.2,540 కోట్లకు జీవోలు ఇచ్చారు. ఇవన్నీ పాత కాంట్రాక్టర్లకే దక్కాయి. ఒక్కోపనికి ఒక్కో కాంట్రాక్టర్ కాదు. అన్నీ వాళ్లకే ఇచ్చారు. ⇒ ఈ ఐదు బిల్డింగులకు డిజైన్ కోసం మరో రూ.401 కోట్లతో కలిపి మొత్తం రూ.10,665 కోట్లు ఖర్చు అవుతుంది. 52,20,496 ఎస్ఎఫ్టీ నిర్మాణానికి ఒక ఎస్ఎఫ్టీకి రూ.20,427 చొప్పున వ్యయం చేస్తున్నారు. ఫర్నీచర్, ఇంటీరియర్ సమకూర్చే సరికి ఎస్ఎఫ్టీకి రూ.30–40 వేలు అవుతుందేమో. ఇక్కడ భవనాల నిర్మాణానికి ఇసుక ఫ్రీ. పైగా ప్రభుత్వం జీఎస్టీ, ఎంఈఆర్ఐటీ, డీఎంఎఫ్, ఎన్ఏసీ చార్జీలు రీయింబర్స్ చేస్తోంది. వీటి మినహాయింపుల విలువ రూ.681 కోట్లు. ఈ మాదిరిగా లూటీ జరుగుతోంది.⇒ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మహా నగరాల్లో కూడా 5 స్టార్ సదుపాయాలతో కలిపి ఎస్ఎఫ్టీ నిర్మాణ వ్యయం రూ.4,500 దాటట్లేదు. తెలంగాణలో కేసీఆర్ 28 ఎకరాల్లో సచివాలయం నిర్మించారు. దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో రూ.615 కోట్లతో కట్టారు. అలా చూసినా ఎస్ఎఫ్టీకి రూ.6 వేలు పడింది. ఇక్కడ ఎస్ఎఫ్టీ రూ.20,420.. హంగులతో కలిపితే రూ.30–40 వేలు అవుతుందంటే ఎవరికైనా కళ్లు చెదురుతాయి.అవునయ్యా.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్!చంద్రబాబు, లోకేశ్కు వైఎస్ జగన్ గట్టి కౌంటర్రాష్ట్రంలో ఓ వైపు పాలన అత్యంత దారుణంగా ఉంటే చంద్రబాబు మరోవైపు తన కొడుకుతో ‘బోత్ ఆర్ నాట్ ది సేమ్’ అంటూ బహిరంగ సభల్లో బాలకృష్ణ డైలాగ్లు కొట్టిస్తున్నాడు’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. వీటికి బదులుగా ఆయన ‘అవునయ్యా.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్’ అంటూ మీడియా సమావేశంలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ ప్రజలకు ద్రోహం చేయడం.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం.. ప్రజలను వాడుకుని వదిలేయడం మీ క్యారెక్టర్.. ఆరు నూరైనా ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ⇒ పనులు చేసి చూపించడం మా స్టయిల్.. పబ్లిసిటీ, క్రెడిట్ చోరీ చేయడం మీ స్టయిల్.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్. ⇒ విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజల చెంతకే పాలన, గృహ నిర్మాణం, మహిళా సాధికారత, మహిళా రక్షణ, దిశా వంటి విప్లవాత్మక కార్యక్రమాలు మా చరిత్ర.. వీటన్నింటిని నాశనం చేయడం మీ చరిత్ర.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.. ⇒ ఐదేళ్ల పాలనలో పారదర్శకంగా బటన్ నొక్కడం.. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాలకు రూ.2.73 లక్షల కోట్లు పంపించడం మా చరిత్ర.. రెండేళ్లయ్యేసరికి మేం చేసిన అప్పులకంటే ఎక్కువగా రూ.3.40 లక్షల కోట్ల అప్పులు చేయడం, మా హయాంలో చేసిన పథకాలన్నీ రద్దుచేయడం, సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు బుట్టదాఖలు చేయడం మీ చరిత్ర.. బోత్ కెన్ నెవర్ బీ సేమ్.. తెలుసుకో. -
పొదుపు పేరుతో చెప్పేవన్నీ సోది కబుర్లే
సాక్షి, అమరావతి: పొదుపు చర్యల పేరుతో చంద్రబాబు చెప్పేవన్నీ సోది కబుర్లేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానమిస్తూ.. ‘చంద్రబాబు చెప్పే మాటలు ఆయన కొడుకు, దత్తపుత్రుడు వినరు. ఒక్కొక్కరికీ ఒక్కో ప్రైవేటు చాపర్.. ఒక్కో ప్రైవేటు విమానం ఉన్నాయి. గన్నవరం, హైదరాబాద్ ఎయిర్ పోర్టులకు వెళ్లి చూస్తే 3 విమానాలు, 3 చాపర్లు కన్పిస్తాయి. ఇంధన పొదుపు పేరిట వాళ్లు చెప్పేవన్నీ సోది కబుర్లే. ఇవేమీ వాళ్లకు వర్తించవు. ఆ సోది వినమని ప్రజల చెవిలో పువ్వులు పెడతారు’ అని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా వ్యవహారాలు) పూడి శ్రీహరి అరెస్టుపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ బదులిస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో ఏదైతే విత్తుతామో అవే పండుతాయి. మీరు ఈ పొద్దున ఏం చేస్తున్నారో రేప్పొద్దున ఇవన్నీ వాళ్లకు చుట్టుకుంటాయి. ఈ రాష్ట్రంలో ప్రతి పోలీస్ సోదరుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి, చంద్రబాబుపై భయంతోనో ఆయన చెప్పినట్టు చేయకండి. వీటన్నిటిపై విచారణలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేశారో ఆ తప్పులపై విచారణ జరుగుతుంది. ఆ తప్పులు చేసిన అధికారులందర్ని చట్టం ముందు నిలబెడతాం. రిటైరైనా, సప్తసముద్రాల అవతల ఉన్నా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చి తీసుకొస్తాం. గవర్నెన్స్లో ఉన్నవాళ్లు కచ్చి తంగా వేసే ప్రతి అడుగు రేప్పొద్దున అదే తమకు చుట్టుకుంటే ఎలా అనేది ఆలోచన చేయాలి. అడుగులు వేయాలి. ఇప్పుడు దేవుడిచ్చి న అవకాశం ప్రజలకు మంచి చేయమని చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. ఆ స్థానాన్ని ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించాలే తప్ప కక్ష తీర్చుకునేందుకు, లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెట్టి వాళ్ల జీవితాలను నాశనం చేయాలని చూడటం దుర్మార్గం. అందుకే పోలీసులకు కూడా చెబుతున్నా రేప్పొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దు’ అని స్పష్టం చేశారు. ఎవరి నోటినుంచైనా అవే మాటలు వస్తాయిపవన్కళ్యాణ్ హోం మంత్రి అమిత్షా వద్దకు వెళ్లారని, జగన్ని ఇబ్బంది పెట్టాలని చూశారని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చెప్పిన విషయాన్ని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘అది ఆయన(అమిత్షా) చూసిన, తెలిసిన అనుభవంతో చెబుతున్నారు. ఆయన చంద్రబాబును చూశారు. జగన్ను చూశారు. ఇప్పుడు చంద్రబాబు పాలనను చూస్తున్నారు. జగన్ చేసిన పాలన చూశారు. ఆయనే కాదు ప్రజలంతా చూశారు. అందుకే ఎవరి నోటినుంచి అయినా ఇవే మాటలు వస్తాయి’ అని స్పష్టం చేశారు. ‘తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ మీ ఫొటో పెట్టుకుని ప్రచారం చేయడంతో అధికారంలోకి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కదా’ అని మీడియా ప్రతినిధులు వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించగా.. ‘ఆయన రాష్ట్రంలో ఆయనకు ఎక్కువ పలుకుబడి ఉంటుందిగానీ జగన్కు ఎలా ఉంటుంది’ అని అన్నారు. -
హామీలకు వెన్నుపోటు
చంద్రబాబు 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ.4 పెరిగింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. సున్నా వడ్డీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నాపట్టించుకునే నాథుడు లేడు. విద్యా దీవెన, వసతి దీవెన రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు. ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంది. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతున్నారు. యువత, మహిళలు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతున్నారు. అన్ని రంగాలు తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు. సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఈ రెండేళ్లలో ఫలాన మంచి చేశానని ప్రజలకు చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. రెండేళ్ల పనితీరు (ప్రోగ్రెస్ రిపోర్టు) చూస్తే.. ఒకే ఒక్కటి కని్పస్తుంది. అదే బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ. ఈ రెండేళ్ల చంద్రబాబు పరిపాలనను గమనిస్తే కనిపించే నిజమిది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తోపాటు 143 హామీలను అమలు చేయకుండా ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్న తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నారని దెప్పిపొడిచారు. ముగ్గురిని కంటే రూ.30 వేలు.. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తామంటూ చంద్రబాబు మహిళలను పిల్లలను కనే యంత్రాలుగా చూస్తున్నారని.. ఇలాంటి దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జగన్ ఇంకా ఏమన్నారంటే.. అంతా అస్తవ్యస్తం.. కష్టాల్లో ప్రజలు ఓ వైపు మా ప్రభుత్వ హయాంలో ఉన్న స్కీములన్నీ రద్దయి పోయాయి. ప్రజల చేతిలో చిల్లిగవ్వలేదు. మరోపక్క ఈయన ఇస్తానన్నవన్నీ మోసాలుగా మిగిలాయి. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. అతలాకుతలం అవుతున్న గ్రామీణ వ్యవస్థ. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రద్దు. రుణాల పరపతి మా హయాంలో మేం స్టార్ట్ చేసినప్పుడు రూ.25 వేల కోట్లు ఉంటే దాన్ని రూ.49 వేల కోట్లకు రుణాలు పెంచుకుంటూ పోయాం. సున్నా వడ్డీ ఇస్తూ, చేయూతనిస్తూ, అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలుస్తూ, ఆసరా అనే ప్రోగ్రామ్ను అమలు చేస్తూ, రకరకాలుగా చేయూతనిస్తూ ముందుకెళ్లాం. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల పరపతి ఎంత దారుణంగా పడిపోయిందంటే.. సున్నా వడ్డీ సైతం రాని పరిస్థితి నెలకొంది. ఆసరా, చేయూత కథ దేవుడెరుగు.. అన్ని పథకాలు రద్దయి పోయాయి. ఈయన ఇస్తానన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు మోసాలుగా తేలాయి. అక్కచెల్లెమ్మల పరపతి మొన్న డిసెంబర్ నాటికి రూ.31 వేల కోట్లకు పడిపోయింది. గ్రామీణ వ్యవస్థలో రైతు సంతోషంగా లేడు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఉచిత పంటల బీమా పథకం లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. మోంథా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇంత వరకు లేదు. ఈ పరిస్థితిలో ఈ పెద్దమనిషి చెంపలేసుకుని కనీసం ఇప్పుడైనా పెట్రోల్, డీజిల్ ధర కనీసం రూ.8 అయినా తగ్గించాలా? లేదా?పెట్రోల్, డీజిల్ ధరలు బాదింది బాబే ‘అయ్యా చంద్రబాబూ.. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్నావు, సూపర్ సెవెన్ అన్నావు. మేనిఫెస్టోలో 143 హామీలిచ్చావు. వీటి సంగతేమిటయ్యా అని చంద్రబాబును గట్టిగా ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరఫున మేం కూడా చంద్రబాబును గట్టిగా నిలదీస్తూనే ఉన్నాం. పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఇప్పుడు హాట్ టాపిక్. వీటి ధర తగ్గిస్తామని వీళ్లు ఇచ్చిన హామీ ఈ రోజు వెన్నుపోటు కాదా? 2014–19 మధ్య ఏ రేట్లు అయితే ఉన్నాయో, ఆ రేట్లే మా హయాంలో ఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఎప్పుడెప్పుడు రేట్లు పెరిగాయో చూడండి. (పీపీటీలో పెట్రోల్, డీజిల్ రేట్లు చూపించారు) చంద్రబాబు 2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్, డీజిల్పై 22.5 శాతం వ్యాట్ విధించారు. ఆ మేరకు 2015 ఫిబ్రవరి 5న జీవో ఇచ్చారు. వ్యాట్కు అదనంగా ప్రతి లీటర్పై రూ.4 వడ్డన. ఆ తర్వాత మా హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో 2020 సెప్టెంబర్ 19న మేము రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాని పరిస్థితుల మధ్య రోడ్లు బాగు చేయడం కోసం ఒక్క రూపాయి రోడ్ సెస్ వేశాం. దీన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ వీళ్లంతా కలిసి నానా యాగీ చేసి, తమిళనాడు బార్డర్లో ఫొటోలు, సెల్ఫీలు తీసి ఎంతో బాదుతున్నట్టు పోజు కొట్టి.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గించేస్తాం అన్నారు. (చంద్రబాబు, లోకేశ్ ప్రసంగాల వీడియో చూపారు) మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించేస్తామని చెప్పారు. రెండేళ్లయింది. తగ్గకపోగా పెట్రోలు, డీజిల్ లీటర్కు రూ.4 పెరిగింది. నిజంగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు.పథకాల బాకీ ఎప్పుడు తీరుస్తావు? ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఏమైంది? » ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పి రెండేళ్లు అవుతోంది. ఇంత వరకు రూపాయి ఇవ్వలేదు. సంవత్సరానికి రూ.18 వేలు. రెండేళ్లకు రూ.36 వేలు ప్రతి మహిళకూ బాకీ. ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి అన్నావు. రెండేళ్లయి పోయింది. ఏటా రూ.36 వేలు చొప్పున రూ.72 వేలు బాకీ. అప్పుడు ఇంటింటికీ పోయి బాండ్లు ఇచ్చారు. ఈ బాకీ ఎప్పుడు తీరుస్తారు? 50 ఏళ్లకే పెన్షన్ లేదు » 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేలు పింఛన్ ఇస్తానన్నావు. అదీ జూన్ 2024 నుంచి. నెలకు రూ.4 వేలు అంటే సంవత్సరానికి రూ.48 వేలు. రెండేళ్లకు రూ.96 వేలు బాకీ. ఇంత వరకు రూపాయి ఇచ్చింది లేదు. గ్రామాల్లో ప్రతి ఇంట్లో తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు చంద్రబాబును.రైతుల నడ్డి విరిచారు రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఏడాదికి రూ.20 వేల చొప్పున అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్నారు. రెండేళ్లయి పోయింది. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాలి. ఇచ్చింది కేవలం రూ.14 వేలు. రూ.26 వేలు ఎగ్గొట్టాడు. అంతే కాకుండా 50 లక్షల మంది రైతులకు మా హయాంలో రైతు భరోసా ఇస్తే, ఇప్పుడు అందులో 7 లక్షల మందికి కోత కోశాడు. కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత, నా పాదయాత్ర జరిగి చివరికి వచ్చిన తర్వాత చివర్లో మోదీ∙వాళ్లు ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. సున్నా వడ్డీ లేదు. ఈ–క్రాప్, ఆర్బీకేలు నిర్వీర్యం. ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ధర్నా చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు. ఉచిత బస్సు.. తుస్సు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నాడు. 16 కేటగిరీల బస్సులు ఉంటే కేవలం 5 కేటగిరీల బస్సులకే పరిమితం చేస్తున్నాడు. ఆ 5 కేటగిరీలు పర్మిట్ చేసే దానికి కూడా ఇప్పుడు మళ్లీ క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ తీసేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తారట. ఇందులో ఉచితం లేదంటూ మహిళలకు ద్రోహం చేయడానికి మళ్లీ పూనుకున్నారు. ఇది ఒక ఎఫెక్ట్ అయితే, రెండోది మేము ప్రభుత్వంలో విలీనం చేసిన 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగస్తుల బతుకులు ప్రశ్నార్థకం చేశారు. ఏకంగా 12 డిపోలను ప్రైవేటుపరం చేశాడు.. భూములతో సహా. భవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు. ఆర్టీసీ బస్సు ఉండదు. ఆర్టీసీ ఉండదు. అతీగతిలేని విద్యాదీవెన.. వసతిదీవెన ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద ఈ రెండేళ్లలో ప్రతి మూడు నెలలకు రూ.700 కోట్లు ఇవ్వాలి. 2024 జనవరి–ఏప్రిల్ త్రైమాసికానికి సంబంధించి వెరిఫికేషన్ పూర్తయింది. ఎన్నికల కోడ్ కారణంగా అప్పటి సొమ్ము పంపిణీ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు 9 త్రైమాసికాలు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాల్సింది. ఇప్పటికి 9 త్రైమాసికాలు అయిపోయాయి. ఈ మార్చి నాటికే బకాయిలు రూ.5,820 కోట్లు. విద్యా దీవెన కింద 9 త్రైమాసికాలకు క్వార్టర్కు రూ.700 కోట్లు చొప్పున రూ.6,300 కోట్లు. ఇప్పటికి ఇచ్చింది ఎంత అంటే, ఒకసారి రూ.1,770 కోట్లు, ఇప్పుడు రూ.900 కోట్లు ఇచ్చాడు. అంటే రూ.2,670 కోట్లు. రూ.3,628 కోట్లు ఇప్పటికే విద్యాదీవెన కింద బకాయిలున్నాయి. వసతి దీవెన ప్రతి జనవరిలో రూ.1,100 కోట్లు క్రమం తప్పకుండా మా హయాంలో ఇచ్చే వాళ్లం. వసతి దీవెన కింద జనవరి 2025 రూ.1,100 కోట్లు, జనవరి 2026 మరో రూ.1,100 కోట్లు.. ఇప్పటికే రూ.2,200 కోట్లు బాకీ. రెండూ కలిపి రూ.5,828 కోట్లు బాకీ. మళ్లీ ఈ సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలు విద్యా దివెన సొమ్ము రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద ఇవ్వాల్సిన మరో రూ.1100 కోట్లు కలిపి రూ.3,900 కోట్లు. పాత బకాయిలు కలిపితే రూ.9,728 కోట్లు ఇవ్వాలి. ఈ రోజు పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి. పట్టించుకునే నాథుడే లేడు. అమ్మ ఒడి మరో మోసం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అన్నారు. చివరికి చూస్తే 20 లక్షల మంది పిల్లల్ని తగ్గించేశారు. రూ.15 వేల కథ దేవుడెరుగు. కొందరికి రూ.9 వేలు. కొందరికి రూ.8 వేలు, కొందరికి రూ.10 వేలు. కొందరికి మాత్రమే రూ.13 వేలు. ఇదీ అమ్మ ఒడి పరిస్థితి. గ్యాస్ కూడా లేదు గ్యాస్ సిలెండర్ల పరిస్థితీ అంతే. ఇప్పటికి 9 ఉచిత సిలెండర్లు ఇవ్వాలి మూడో సంవత్సరం కలుపుకుంటే. ఇంత వరకు ఇచ్చింది ఒకటి రెండు. అది కూడా అందరికీ ఇవ్వలేదు. నంబర్ డ్రాస్టిక్గా తగ్గించారు. కోటీ 50 లక్షల నుంచి 90 లక్షలకు తగ్గించారు. ఇచ్చే అర కొరలో కూడా అన్యాయం. కొత్త పెన్షన్లు లేవు.. ప్రతి నెలా 25 వేలు కట్ మా హయాంలో ఎన్నికల షెడ్యూలు వచ్చే నాటికి 66,34,372 పెన్షన్లు పంపిణీ చేశాం. ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయించాం. చంద్రబాబు హయాంలో పెన్షన్ రూ.1000, మా హయాంలో రూ.3 వేలకు పెంచుకుంటూ పోయాం. వాటిని చంద్రబాబు తగ్గించేస్తున్నారు. ఈ మే నెలలో 60,11,293 పెన్షన్లు మాత్రమే ఇచ్చారు. ఏకంగా 6,23,079 మంది పెన్షన్లు తగ్గించేశారు. ప్రతి నెలా 25 వేల పెన్షన్లు కట్ చేస్తున్నారు. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వకపోగా 6,23,079 మంది పెన్షన్లు కట్ చేశారు.సంక్షోభంలోనూ స్కామ్పెట్రో ధరలు తగ్గించకపోగా ఈ మనిషి ఏం చేశాడో తెలుసా? ఇక్కడా స్కామే చేశాడు. సంక్షోభంలో స్కాములు ఎలా చేస్తారో చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓ పక్క ఏప్రిల్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది. పెట్రోలు బంకుల దగ్గర జనం బారులు తీరారు. ఆ పరిస్థితుల్లో కేంద్రంలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కువ పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉంచి మేలు చేయాలన్న ఆలోచన చేయాల్సింది పోయి ప్రజలను ఇక్కట్లపాలు చేశాడు. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో తక్కువ ధరకు డీజిల్, పెట్రోల్ ఇవ్వండంటూ బీపీసీఎల్, ఐవోసీ తదితర ఆయిల్ కంపెనీలకు లెటర్ (లేఖను చూపుతూ) రాశాడు. మీ ఎన్డీయే కూటమిలో సభ్యుడు చంద్రబాబు ఇలా అడుగుతున్నాడు.. మేం ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదని ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వాళ్లు కేంద్ర మంత్రికి చెప్పారు. అక్కడి నుంచి మోదీ షంటుకున్నారు. దానిపై కేంద్రం చంద్రబాబుకు చీవాట్లు పెడుతూ తిరిగి లేఖ రాసింది. నీకు బుద్దీ జ్ఞానం ఉందా లేదా చంద్రబాబూ? దేశంలో పెట్రోలు, డీజిల్ దొరక్క ప్రజలందరూ అవస్థలు పడుతుంటే, బల్క్ డీజిల్ కొంటే రేటెక్కువ అని చెప్పి.. కాంట్రాక్టర్లకు రీటెయిల్ బంకుల్లో డీజిల్ పోయమని ఎలా అడుగుతున్నావు అని కేంద్రం లేఖ రాసింది. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? తద్వారా ఆ కాంట్రాక్టు పనుల్లో ఈయనకొచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రమే ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా.. ఈ ముఖ్యమంత్రి తప్ప! నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి, బల్క్ లో వాళ్లు డీజిల్ కొంటే లీటర్ రూ.155 అవుతుందని, రీటెయిల్ పెట్రోలు బంకుల్లో కొంటే రూ.101కే దొరుకుతుందని, వాళ్లకు రూ.101కే రీటెయిల్ బంకుల్లో పోయమని నువ్వు లేఖ ఎలా రాశావు? పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామన్న హామీనే కాదు.. సూపర్ సిక్స్ అయినా అంతే, సూపర్ సెవెన్ అయినా అంతే. ఇదే పరిస్థితే. (పీపీటీలో సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు చూపించారు)ఉద్యోగుల బకాయిలు రూ.35 వేల కోట్లుచంద్రబాబు ఉద్యోగులను మరీ దారుణంగా మోసం చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్.. ప్రతి ఆరు నెలలకు డీఏ ఇవ్వాలి. మా హయాంలో ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. 11 డీఏలు ఇచ్చాం. ఒకటి ఎక్కువ ఇచ్చాం. అధికారంలోకి రాగానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం. కాలయాపన లేకుండా పీఆర్సీ వేశాం. ఉద్యోగులు ఇబ్బంది పడకుండా ప్రతి అడుగులో చేయి పట్టుకుని నడపిస్తూ.. వీళ్ల గురించి ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో.. వీళ్లు సీపీఎస్తో ఇబ్బంది పడుతుంటే.. జీపీఎస్ అనే విధానం కూడా తీసుకువచ్చాం. ఈ రోజు మేము తీసుకువచ్చిన జీపీఎస్ను దేశం అంతా కాపీ కొడుతోంది. ఈ రోజు ఉద్యోగుల పరిస్థితి చూస్తే.. ఈ జూన్ వస్తే 5వ డీఏ కూడా పెండింగ్. అధికారంలోకి రాగానే ఐఆర్ అన్నారు. ఇంత వరకు రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నాడు. మా హయాంలో వేసిన పీఆర్సీ చైర్మన్ను కూడా తీసేశారు. కొత్త వారిని కావాలని వేయడం లేదు. ఎందుకంటే కొత్త వారిని వేస్తే రికమండేషన్స్ వస్తే వెంటనే జీతాలు పెంచాలి కాబట్టి. అందుకే పీఆర్సీ వేయడం లేదు. పోలీసు సోదరులకు సరెండర్ లీవ్స్ 5 పెండింగ్. మొట్టమొదటిసారిగా చంద్రబాబు సరెండర్ లీవ్ను స్ప్లిట్ చేస్తున్నాడు. వాయిదా పద్ధతి పెడుతున్నాడు. మరోవైపు ఐదు సరెండర్ లీవ్స్ పెండింగ్. 15 నెలలు టీఏలు పెండింగ్. మేము తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. ప్రతి నెలా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలన్నాడు... ఈ రోజు పరిస్థితి ఏంటంటే అసలు జీతాలు నెలలో ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సరెండర్ లీవ్స్.. వీటన్నింటి కిందా రూ.35 వేల కోట్లు చంద్రబాబు బాకీ. అయినా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవరైనా అడిగితే.. ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకట్రామిరెడ్డి నోరు తెరిచి అడిగితే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేశాడని ఆరోపించి, దొంగ కేసులు పెట్టి ఉద్యోగంలోంచి డిస్మిస్ చేశారు.అప్పుడు సంపద సృష్టిస్తానని.. ఇప్పుడు పిల్లలే సంపద అంటావా?» సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి చంద్రబాబు.. ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అంటున్నాడు. ఇంకా మోటివేట్ చేస్తూ.. ముగ్గురిని కంటే రూ.30 వేలు ఇస్తానంటున్నాడు. నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తా అంటున్నాడు. వీటి కథ దేవుడెరుగు.. సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ హామీలు ఏమైనాయి స్వామీ? ముందు వీటి గురించి ఆలోచించు. ఆ తర్వాత మూడో సంతానం.. నాలుగో సంతానం గురించి చెబితే.. అంతో ఇంతో వినడానికి అవకాశం ఉంటుందని ప్రజలు మొత్తుకుంటున్నారు.» ఈ పెద్దమనిషి చంద్రబాబు ఏదైతే చెబుతాడో.. దాన్ని ఆయన పాటించాలి కదా.. కనీసం ఆయన కొడుకైనా పాటించాలి కదా.. ఆయన కొడుక్కి ఒకడే. ఆయనకొకడే. కానీ బీదోళ్లకు మాత్రం నలుగురు సంతానం కావాలా! వారు చదువుకోకూడదు. వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. వాళ్లు ఇంగ్లిష్ మీడియం చదవకూడదు. వాళ్ల బతుకులు ఎప్పుడూ చితికిపోయి ఉండాలనే దిక్కుమాలిన ఆలోచనలు చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో చంద్రబాబు తప్ప మరెవరూ ఉండరు.» ఈ రోజు గ్రామీణ ఎకానమీ చిన్నాభిన్నమయ్యే పరిస్థితిలో ఉంటే.. పొదుపు సంఘాల మహిళలందరూ ఇబ్బందులు పడుతుంటే.. యువత, మహిళలకు ఉద్యోగాలు దొరక్క సతమతమవుతుంటే.. అన్నీ తిరోగమనంలో ఉంటే, ప్రభుత్వ వ్యవస్థలన్నీ అధ్వాన్న పరిస్థితుల్లో ఉంటే.. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చంద్రబాబు హయాంలో ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో కనిపిస్తుంటే, దానిని మెరుగుపరచాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ముగ్గుర్ని కనండి.. నలుగురిని కనండి అని చెబుతున్నాడు. » మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా భావించడమే చంద్రబాబు చేస్తున్న అతి దిగజారుడు రాజకీయం. నిజానికి మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి. వారు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలబడుతుంది. చంద్రబాబు మహిళలను పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా చూడటం అంటే ఇంతకంటే దారుణమైనపరిస్థితులు రాష్ట్రంలో ఎన్నడూ లేవు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో దైన్యంఅసలు పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? విద్య, వైద్యం, వ్యవసాయం అన్నీ పూర్తిగా మూలన పడిన పరిస్థితులు. ఈరోజు స్కూళ్లలో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం చదువులు ఆగిపోయిన పరిస్థితి. మా హయాంలో మూడో తరగతి నుంచి టోఫెల్ ఒక పిరియడ్గా పెడితే, దాన్ని తీసేసిన పరిస్థితి. మా హయాంలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ దాకా ప్రయాణం అని చెప్పి మేము తీసుకువస్తే.. అసలు ఇంగ్లిష్ మీడియమే లేకుండా చేసిన పరిస్థితి. మూడో తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మేము తీసుకువస్తే.. అది గాలికొదిలేసిన పరిస్థితి. నాడు–నేడుతో మేము బడులను బాగు పరిస్తే.. ఇప్పుడు పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి. ఆరో తరగతి నుంచి ప్రభుత్వ స్కూళ్లను డిజిటలైజ్ చేసి ప్రైవేటు స్కూళ్లతో పోటీ పడేలా మేము చేస్తే.. ఈ రోజు ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు సంకోచించే పరిస్థితి. ప్రభుత్వ బడుల్లో 8వ తరగతికొచ్చే సరికి పిల్లల చేతుల్లో ట్యాబులు పెట్టి ఒక మేనమామలా మేము చదివిస్తే.. ఈ రోజు పిల్లలకు ట్యాబుల కథ దేవుడెరుగు, కనీసం గోరుముద్దలో కూడా క్వాలిటీ లేని పరిస్థితి ఈరోజు బడుల్లో నడుస్తోంది. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. విద్యా దీవెన లేదు. వసతి దీవెన లేదు. చదువులు ఆపేస్తున్న పరిస్థితి. స్కూళ్లు, అంగన్ వాడీలు, హాస్టళ్లలో పిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందక పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితి. ఆస్పత్రులు నాశనం చేశారు. విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి.. పీహెచ్సీల దగ్గర నుంచి.. హాస్పిటల్స్ను రిఫార్మ్ ద్వారా సంస్కరించి.. జీరో వేకెన్సీ పాలసీ తీసుకువచ్చి, సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరతలేని పరిస్థితి మా హయాంలో తీసుకువచ్చాం. ఈ రోజు పూర్తిగా అన్నీ నాశనమైన పరిస్థితి. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టడానికి మేము శ్రీకారం చుట్టి, వాటిలో ఐదు పూర్తి చేశాం. మిగిలినవి వివిధ రకాల స్టేజ్లలో ఉన్నాయి. కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అది కూడా ఐదేళ్లలో ఖర్చు చేస్తే అవి కూడా పూర్తవుతాయి. పిల్లలందరికీ క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వస్తుంది. దానిని పక్కన పెట్టి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు. అమరావతిలో బిల్డింగ్లకు గ్లాసుల కోసం.. కేవలం భవనం అద్దాలకు రూ.2,500 కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వస్తాడు కానీ, మెడికల్ కాలేజీలకు డబ్బులివ్వడానికి మనసు రాదు. నాడు–నేడు కింద స్కూళ్లను బాగు చేయడానికి మనసు రాదు. పూర్తిగా సున్నా వడ్డీ అనే పథకం తీసేసి, ఆసరా, చేయూత అనేపథకాలన్నీ పూర్తిగా రద్దయిపోయిన పరిస్థితి.ఆరోగ్యశ్రీ నిర్వీర్యంఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఇప్పటివరకు రూ.3,746 కోట్లు బకాయిలు పెట్టింది. సంవత్సరానికి రూ.4 వేల కోట్లు కావాలి. అలాంటిది రెండేళ్లలోనే రూ.3,746 కోట్లు బకాయి. మళ్లీ ఈ సంవత్సరం మరో రూ.4 వేల కోట్లు కావాలి. దీంతో నెట్వర్క్ ఆస్పత్రులు పూర్తిగా చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి. వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా.. చంద్రబాబు చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే.. వారికి వాళ్ల పేరుతో లోన్ ఇప్పిస్తున్నాడట. లోన్ కోసం 8 శాతం వడ్డీ కూడా కట్ చేస్తా అంటున్నాడు. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోగా, మాకు లోన్ ఇప్పించడమేంటి స్వామీ.. పైగా దానికి 8 శాతం వడ్డీ కట్ట్టడమేంటీ.. అని నెట్వర్క్ ఆస్పత్రులు లబోదిబోమంటూ బోర్డు తిప్పేస్తున్నాయి. -
ప్రశ్నించే వారికి సంకెళ్లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సోషల్ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం సెన్సార్షిప్ విధిస్తోందని, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. సోషల్ మీడియాలో ఎవరైనా అమరావతిలో జరుగుతున్న స్కామ్లు చూపిస్తే, జీవోలు చూపిస్తే.. చదరపు అడుగుకు రూ.20,427లా అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలపై ఎవరైనా ఆధారాలు చూపిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టినా, తిరుమల లడ్డూ విషయంలో ప్రశ్నించినా, మహిళలపై అఘాయిత్యాల మీద, టీటీడీ చైర్మన్ వ్యవహారంపై ప్రశ్నించినా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. విచ్చలవిడిగా సాగుతున్న మద్యం, గంజాయి విక్రయాలు, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపై ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కంటెంట్ కన్పించకుండా సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై వారి పార్టీ కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారన్నారు. ‘చంద్రబాబు ఏకంగా కుప్పంలో కేసులు పెట్టిస్తాడు. ఎఫ్ఆర్ఐ నమోదు చేస్తారు. సోషల్ మీడియా పోస్టులను ఆ సీఐ ఎక్స్ (ట్విటర్)కు, ఫేస్బుక్, యూ ట్యూబ్ హెడ్క్వార్టర్కు పంపిస్తాడు. ఆ వీడియోలు డిలీట్ చేయమని చెబుతారు. ఎక్కడో శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ఎక్స్ యాజమాన్యానికి కుప్పం ఇన్స్పెక్టర్ రాసిన లేఖను చూస్తే ఎవరికైనా పోలీసులు ఎలా తయారయ్యారో అర్థమవుతుంది’ అని తెలిపారు.పోలీసులు ఎక్కడ?రాష్ట్రంలో ఎక్కడా పోలీస్ డ్యూటీ కన్పించడం లేదని, ఏ కాలేజ్లో చూసినా గంజాయి కన్పిస్తుందని.. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘దాన్ని కట్టడి చేసేందుకు పోలీసులు కన్పించరు. ప్రతి ఐదు లిక్కర్ బాటిల్స్లో ఒక బాటిల్æ కల్తీ అయినా పోలీసులు పట్టించుకోరు. ఏ బెల్టు షాపు దగ్గరా పోలీసులు కన్పించరు. పోలీసులు చేసేది ఏమిటో తెలుసా? చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వెంటనే తప్పుడు కేసులు పెట్టడం, ఆ కేసుల కోసం తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఆ కేసుల్లో అమాయకుల్ని ఇరికించి జైలుకు పంపేందుకు తాపత్రయ పడడం. రాష్ట్రంలో పరిపాలన (గవర్నెన్స్) అనేది పూర్తిగా లేకుండా పోయింది. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. పోలీసుల ప్రాథమిక బాధ్యతలన్నీ (బేసిక్ రెస్పాన్స్బిలిటీస్) మరిచిపోయారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో దిశ అనే యాప్ను తీసుకొచ్చి, ఏ ఆడపిల్లకైనా, ఎలాంటి వేధింపులు జరిగినా సరే.. ఫోన్ చేసిన 10 నిముషాల్లో పోలీసులు పోయేవాళ్లన్నారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన మహిళా పోలీసులు.. ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగితే నిమిషాల్లో స్పందించే వారని గుర్తు చేశారు. ఈ రోజు ఎవరూ పట్టించుకునే వారు లేరని మండిపడ్డారు. -
ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?
రెండేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ కనిపిస్తోంది. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. వీటిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్సీపీపై, నాపై (జగన్పై) అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లుగా ఇదే స్క్రిప్టు, స్క్రీన్ ప్లే, సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదేపదే రక్తపోటు (బీపీ) పెరుగుతోంది. బాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగి పోయేంతగా బీపీ పెరుగుతోంది. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : ‘రెండేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోట్లు పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతూనే ఉంది. వీటన్నింటి నుంచి ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం పరిపాటిగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ డైవర్ట్ చేయడం మామూలైపోయింది. ఎవరిది గన్ కల్చర్.. ఎవరివి హత్యా రాజకీయాలు’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండేళ్లుగా హత్యారాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, డైవర్షన్ పాలిటిక్స్ కోసం అక్రమ కేసులు పెడుతూ రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేసిన తీరును సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. తప్పుడు కేసులు.. దొంగ సాక్ష్యాలు కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మా పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్గా పనిచేసిన నిత్యానందరెడ్డి, మా మామ రవీంద్రనాథ్రెడ్డిపై బురద జల్లుతున్నారు. జాతరలో గొడవ వల్ల ఈ హత్య జరిగిందని దస్తగిరి భార్య మీడియా ఎదుట చెప్పింది. తామెవరికి బినామీ కాదని, డిప్యూటీ మేయర్గా పని చేస్తున్న నిత్యానందరెడ్డితో తమకు ఎలాంటి విబేధాలు లేవని కూడా చెప్పింది. ఇక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలందరూ కలిసికట్టుగా ఉన్నారు.చనిపోతే బాధ పడాల్సింది మా వాళ్లే. అయినా సరే చంద్రబాబు తన రాజకీయాల కోసం టాపిక్ డైవర్షన్ చేసేందుకు, వైఎస్సార్సీపీపై బురద జల్లేందుకు కుట్రలతో దిగజారుతున్నారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 అందరూ కలిసి ఒక కథ తయారు చేస్తారు. దాన్నే నిజమని చెబుతారు. పెద్దపెద్ద అక్షరాలతో రాస్తారు. అధికారంలో ఉన్నారు కాబట్టి వ్యవస్థలన్నీ వీళ్ల చేతుల్లో ఉన్నాయి. గతంలో వేరే రకంగా ఇచ్చి న స్టేట్మెంట్లను తీసుకుని, ఇప్పుడు చంద్రబాబు బృందం చెప్పిన కల్పిత కథల చుట్టూ కేసు బిల్డప్ చేస్తారు. దొంగ సాక్ష్యాలను సృష్టిస్తారు. కొంత మందిని కేసులో ఇరికిస్తారు. అరెస్ట్ చేస్తారు. ఓ వైపు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతుంటే, మా వాళ్ల మీదే కేసులు బనాయించి, ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికించి జైలుకు పంపే కార్యక్రమం చేస్తున్నారు. రెండేళ్లుగా జరుగుతున్న అరాచకాలు ఇవే. తప్పుడు కేసులు వీళ్లే పెడతారు. తప్పుడు సాక్ష్యాలు వీళ్లే క్రియేట్ చేస్తారు. ఆ కేసుల్లో మా వాళ్లను ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అయినా సరే, కళాశాలలు, యూనివర్సిటీల్లో యాక్టివిస్ట్లుగా ఉన్న పిల్లలైనా సరే, వైఎస్సార్సీపీకి మద్దతుదారులైనా సరే, వైఎస్సార్సీపీ నాయకులైనా సరే చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు.. ఇదే స్క్రిప్ట్. చంద్రబాబు లాయర్.. దస్తగిరి లాయర్ సిద్ధార్థ లూథ్రాయే మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా? వైఎస్సార్సీపీ కోసం, అవినాష్ రెడ్డి కోసం జమ్మలమడుగులో ప్రచారం చేసి వచ్చిన రోజే హత్యకు గురయ్యారు. పైగా తానే వివేకానంద రెడ్డిని హత్య చేశానంటూ సాక్షాత్తు టీవీలో ప్రత్యక్ష ప్రసారంలోనే విచ్చలవిడిగా మాట్లాడిన దస్తగిరి అనే ఈ వ్యక్తి, మా చిన్నాన్నను చంపిన వ్యక్తి. ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా. ఎవరిదయ్యా చంద్రబాబూ క్రిమినల్ బ్రెయిన్? రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం ఇదే కదా.. ఈ కేసులో జరుగుతోంది. చంద్రబాబు బావమరిది, ఆయన వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా? ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతున్నా. ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో మోది చంపలేదా? ఎన్టీఆర్ గారి అబ్బాయి హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. పరామర్శ కోసం పోయి చంద్రబాబు ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడ లేదా? ఎవరివయ్యా శవ రాజకీయాలు అని అడుగుతున్నా. సొంత కూతురిని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సొంత మామను, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కొని, ఆయన చనిపోయేలా చేసింది ఎవరయ్యా? చంద్రబాబు కాదా? ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు అని అడుగుతున్నా. వంగవీటి హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే వంగవీటి మోహనరంగారావు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు? పేదలకు ఇళ్ల పట్టాల కోసం విజయవాడలో «నిరాహార దీక్ష చేస్తుంటే.. అర్ధరాత్రి అత్యంత పాశవికంగా నరికి చంపారు. అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ కాదా? ఈ ఘటనలో వేళ్లన్నీ కూడా చంద్రబాబు వైపే చూపిస్తాయి. హరిరామ జోగయ్య అప్పట్లో మంత్రి, చంద్రబాబుకు సహచరుడు. ఆయన రాసిన పుస్తకంలో ఈ ఘటన ఎలా జరిగింది.. చంద్రబాబు పాత్ర ఎంత బలంగా ఉందో రాశారు. మోహన రంగా హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే. హత్యా రాజకీయాలు ఎవరివో.. కుట్ర రాజకీయాలు ఎవరివో.. శవ రాజకీయాలు ఎవరివో ప్రజలకు తేటతెల్లమవుతున్నాయి. ఎన్టీఆర్పై దాడి కేసులో మల్లెల బాబ్జీని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆయన లాడ్జిలో శవంగా మారాడు. అతని జేబులో దొరికిన లెటర్లో తనకు రూ.3 లక్షలు ఇస్తానని చెప్పి చివరికి రూ.30 వేలు ఇచ్చారని రాసి ఉంది. ఎన్టీఆర్పై దాడి కోసమే ఈ డబ్బులు ఇచ్చారా? అదే నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్న దానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. మరొక ఉదాహరణ..పింగళి దశరథరామ్. ఈయన ఒక ప్రముఖ జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న ఈ వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చి రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. ఈ ఘటనలో వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. ఎవరివి హత్యా రాజకీయాలు.. ఎవరివయ్యా కుట్ర రాజకీయాలు.. ఎవరివయ్యా శవ రాజకీయాలు? అబద్ధాలు.. దొంగ కేసులు.. తప్పుడు సాక్ష్యాలుఎప్పుడు ఏ ఘటన జరిగినా, వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు డైవర్షన్ చేసేందుకు కొత్త టాపిక్ను, కొత్త అబద్ధాన్ని తెరపైకి తీసుకొస్తారు. దానికి రెక్కలు కడతారు. ఇష్టమొచ్చి నట్టుగా మాట్లాడతారు. ఇంకొక విస్తుగొలిపే విషయం.. రెండ్రోజుల క్రితం ఈనాడులో చూశాను. నకిలీ మద్యం కేసులో 89 మంది సాక్షులట.. జోగి రమేష్ పేరు చెప్పారట! ఈ కల్తీ మద్యం ఘటన జరిగింది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో. కల్తీ మద్యం తయారు చేసిన వాళ్లకు, పోలీసుల మధ్య లావాదేవీల్లో తేడా వచ్చి ఈ విషయం బయటకొచ్చింది. చంద్రబాబు హయాంలో కొనసాగుతున్న కల్తీ మద్యం ఫ్యాక్టరీలు.. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నరేళ్ల తర్వాత బయట పడిన విషయాలివి. తంబళ్లపల్లిలో చంద్రబాబు పార్టీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తన సన్నిహితుల పీఏల ఆధ్వర్యంలో కల్తీ మద్యం తయారు చేస్తే.. పోలీసులు రైడ్ చేస్తే అడ్డంగా దొరికి పోయారు. అధికారంలో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వం. చేసింది చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యే అభ్యరి్థ. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పైనే బనాయించారు. నిజంగా మనుషుల్లో మానవత్వం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నా. ఒక అబద్ధానికి రెక్కలు గట్టి ఇష్టమొచ్చి నట్టుగా ఇరికించేస్తున్నారు. జోగి రమేష్ను బీసీ నాయకుడు అని కూడా చూడకుండా ఓ తప్పుడు కేసులో 83 రోజులు జైలులో పెట్టారు. బెయిల్పై బయటకొస్తే ఇంటిపై యాసిడ్ బాటిల్స్తో దాడి చేయించారు. ఆ దాడి చేసిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ రోజు చార్జిషీట్ ఫైల్ చేసారట.. 89 మంది సాక్షులట. జోగిరమేష్ పేరు చెప్పారట. నిజంగా ఎంత దారుణంగా కేసులు బిల్డప్ చేస్తున్నారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు రెండేళ్లుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఐదు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ బాటిల్ అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరగడం లేదు. ఈ కల్తీ మద్యం తయారు చేసేది చంద్రబాబు హయాంలోనే. అమ్మేది చంద్రబాబు మాఫియా ముఠా బెల్టు షాపులు. ఇవన్నీ పోలీసులకు తెలుసు. బెల్టుషాపులు నడుపుతున్నారని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని, ప్రతీ ఐదు బాటి ల్స్కు ఒక బాటిల్ కల్తీ అని అందరికీ తెలుసు. అయినా అటువైపు పోలీసులు, అధికారులు కన్నెత్తి చూడరు. అంబటి మురళీపైనే తప్పుడు కేసులు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో చాలా దారుణమైన ఘటన. భావి సమాజం ఖండించాల్సిన అంశం. మామిళ్లపల్లిలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు చిన్న రైతులు తాము పండించిన మొక్కజొన్న పంటకు రేటు లేదని ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) చూస్తే రూ.2,400. కానీ రూ.1,400, రూ.1,600కు మించి ధర రావడం లేదు. అందుకే ఊళ్లోని గోదాములో దాచుకున్నారు. ఆ గోదాము ఉన్నది మా పార్టీకి చెందిన అంబటి మురళి ఇంటి పక్కన. ఆయనది అదే ఊరు. ఆయన కూడా కాపు నాయకుడే. కానీ స్థానిక ఎమ్మెల్యే, చంద్రబాబు పోలీసులను పంపుతారు. గోడౌన్పై రైడ్ చేయిస్తారు. ఆ గోడౌన్కు వైఎస్సార్సీపీ జెండాలు కట్టిస్తారు. అభాండాలు వేసి, అబద్ధాలు చెప్పించి మొక్కజొన్న నిల్వ చేశారంటూ గోడౌన్ను సీజ్ చేశారు. నాకు ఆశ్చర్యమనిపిస్తుంది. రేటు లేక దాచుకుంటే సీజ్ చేస్తున్నారు. నువ్వు ఎమ్మెస్పీ ఇచ్చి కొంటామంటే ఎందుకు దాచుకుంటారు? ఏం తప్పు చేశారని గోడౌన్ సీజ్ చేశారు? ఆ రైతులకు ఈ రోజు పంట లేదు. చేతిలో డబ్బుల్లేవు. వైఎస్సార్సీపీ నాయకులు, ఇతరులు ఆ గోడౌన్ను చూడడానికి వెళ్తే అడ్డగిస్తున్నారు. జంగిల్ రాజ్ కాకపోతే ఏమిటిది? దొంగ కేసులు, తప్పుడు సాక్ష్యాలు. మా కుటుంబంలో ముగ్గురిని కోల్పోయాంచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివయ్యా హత్యా రాజకీయాలు? మా కుటుంబంలో మేము ముగ్గురిని కోల్పోయాం. మా తాత, మా నాన్న, మా చిన్నాన్న బలైపోయారు. మేము బాధితులం. కానీ మా పైనే చంద్రబాబు తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడు. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవరు? టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? 1999 ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మా తాత రాజారెడ్డిని దారుణంగా చంపారు. కేవలం మా నాన్న రాజశేఖరరెడ్డిని పులివెందులలో కట్టడి చేయాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీడీపీ కార్యాలయంలో దాచిపెట్టి జైలుకు పంపకుండా రక్షించింది వీళ్లు కాదా? అధికార దుర్వినియోగం చేసింది వీళ్లు కాదా? ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా. మా నాన్న విషయంలోనూ అంతే. నాన్న చనిపోక ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాల క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి. ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు అన్న మాటలు నాకు గుర్తున్నాయి. ఈ మాటలన్న 2–3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికీ ఈ ఘటనలో నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతున్నా.వీటినేమంటారు?» కడపలో మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యకు గురైతే.. ఆ కేసును పూర్తిగా ట్విస్ట్ చేసి మా పార్టీపైనే బురద జల్లేందుకు వాడుతున్నారు. మృతుడు దస్తగిరి భార్య బయటకొచ్చి జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతున్నా, మా వాళ్ల మీదే కేసులు బనాయించారు. » మా తాత రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? ఈ ఘటన 1999 ఎన్న్నికల ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కాదా? ఆ కేసులో దోషులను హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచి కాపాడలేదా? » మా నాన్నను ‘నువ్వు అసెంబ్లీ సమావేశానికి ఎలా వస్తావో నేను చూస్తా’ అని చంద్రబాబు బెదిరించడం.. ఆ మాటలన్న 2ృ3 రోజులకు నాన్న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం నిజం కాదా?» మా చిన్నాన్న వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా?» మా చిన్నాన్నను చంపిన వ్యక్తి ఈరోజు స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కారులో తిరుగుతున్నాడు. చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రానే దస్తగిరి లాయర్ కూడా.» చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ గన్ పట్టుకొని టపా.. టపా.. అని ఇద్దరిని కాల్చిపడేయ లేదా?» ఆ తర్వాత సాక్షులు ఉండకూడదన్న ఆలోచనతో ఇంట్లోని వాచ్మేన్ను ఘటన జరిగిన కొద్ది రోజులకే బండరాయితో కొట్టి చంపలేదా? » ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ యాక్సిడెంట్లో చనిపోతే.. ఇంట్లో శవాన్ని పెట్టుకొని కేటీఆర్తో పొత్తుల కోసం మాట్లాడింది చంద్రబాబు కాదా? » సొంత మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని, పార్టీని, చివరికి గుర్తును కూడా లాక్కున్నదెవరు? » వంగవీటి మోహన్ రంగా హత్యలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేనే.» మల్లెల బాబ్జీ ఎందుకు లాడ్జిలో శవంగా మారాడు? అక్కడ దొరికిన నోట్లో ఏముంది? ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదు? » జర్నలిస్ట్ పింగళి దశరథరామ్ను చంపిందెవరు? ఈ ఘటనలోనూ వేళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. » నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడింది మీ పార్టీ లీడర్. కానీ కేసు మాత్రం మా పార్టీ నేత జోగి రమేష్పై ఎలా పెట్టారు?» రెండేళ్లుగా కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు, ఇరికించడాలు, ప్రలోభాలు, బెదిరించడాలు.. ఊరూరా గంజాయి, డ్రగ్స్, బెల్ట్ షాపులుబాబు నైజాన్ని దగ్గుబాటి, హరిరామజోగయ్య ఏనాడో చెప్పారుఇదే పెద్దమనిషి చంద్రబాబు గురించి ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకం రాశాడు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని అనేక టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. బస్సులు తగలపెట్టకపోతే ధర్నాలు కావట! నేను కాదు అన్నది ఈ మాటలు.. స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి చెప్పిన మాటలు. తాను రాసిన పుస్తకంలో చంద్రబాబు కుట్రలు, రాక్షస రాజకీయాల గురించి వివరించారు. హరిరామజోగయ్య కూడా చంద్రబాబు ఏ రకంగా కుట్రలు చేస్తాడు.. ఎలాంటి రాక్షస రాజకీయాలు చేస్తాడో సవివరంగా తన పుస్తకంలో రాశాడు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో, కుట్రలతో రాజకీయాలు చేసింది.. చేస్తోంది చంద్రబాబు. విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేము. గర్వంగా చెబుతున్నాను నేను ఈ మాటలు. జగన్ మంచోడు కాబట్టే మా తాత రాజారెడ్డిని చంపినోళ్లు ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నారు. జగన్ చెడ్డోడు అయి ఉంటే వాళ్లు బతికి ఉండేవాళ్లా? మా తాతని దారుణంగా నరికి చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు. జగన్ నైజం ఎలాంటిది.. జగన్ మనస్తత్వం ఎలాంటిది.. అని చెప్పేందుకు ఇదొక నిదర్శనం. వారికి ఎప్పటికీ ఏమీ కాదు. ఎందుకంటే మాకు రాజకీయాలు ఎలా చేయాలో మా నాన్న నేర్పించారు. చంద్రబాబు మాదిరి హత్యలు చేయమని కాదు. ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేర్పించారు. అది చంద్రబాబుకు, మాకు మ«ధ్య ఉన్న వ్యత్యాసం. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో? ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో.. ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబుకు 77 ఏళ్ల వయస్సు. బహుశా ఇవి చివరి ఎన్నికలనుకుంటున్నా. ఎన్నికలొచ్చేసరికి మీకు (చంద్రబాబు) 80 ఏళ్లు. ఈ వయసులో కూడా దౌర్భాగ్య రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని అడుగుతున్నా. ఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా చంపిన ఘటనలు ఎలా ఉన్నాయో గమనించండి. వినుకొండలో 2024 జూలై 24న వైఎస్సార్సీపీ నేత రషీద్ను నడిరోడ్డుపై నరికి చంపించే కార్యక్రమాన్ని ఎలా ప్రోత్సహించారో చూస్తే అర్థమవుతుంది. ఇలా ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. (రెండేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టీడీపీ నేతలు హత్య చేసిన ఉదంతాలను ఆధారాలతో సహా వివరించారు) చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఏ రకంగా హత్యలు చేయిస్తున్నాడో? కుట్రలు చేస్తున్నాడో? శవ రాజకీయాలు చేస్తున్నాడో? అందరికీ తెలుసు. ఎవరిది గొడ్డలి పార్టీయో? గొడ్డలి పట్టుకొని ఎంత దారుణంగా హత్యలు చేయిస్తా ఉన్నాడో చెప్పేందుకు ఇవి నిదర్శనాలు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ సాగుతోంది. హత్యా రాజకీయాల మధ్య దారుణమైన పాలన సాగుతోంది. చంద్రబాబు హత్యా రాజకీయాలకు సాక్ష్యాలు ఇవిగో... -
మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదకరం : వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన దువ్వూరు మునిశేఖర్ రెడ్డి అకాల మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. పార్టీ పట్ల అపారమైన నిబద్ధతతో పనిచేస్తూ, ప్రజలతో ఎల్లప్పుడూ మమేకమై సేవలందించిన నాయకుడిగా మునిశేఖర్ రెడ్డి గుర్తింపు పొందారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.మునిశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం, మనోబలం ప్రసాదించాలని ప్రార్థించారు. మునిశేఖర్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. -
గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..
-
అమిత్ షా తో పవన్ కళ్యాణ్ మీటింగ్.. జగన్ రియాక్షన్
-
నేను తలుచుకుంటే.. వాళ్లు బ్రతికి ఉండేవాళ్లా?
-
మా నాన్నని అసెంబ్లీలో అన్న మాటలు మర్చిపోలేదు.. రెండు రోజులకే ఆక్సిడెంట్!
-
రంగాని అర్ధరాత్రి నరికి చంపారు.. నిందితుడు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే.!
-
అది తన కష్టం..! విజయ్ గెలుపుపై జగన్ రియాక్షన్
-
నువ్వు ఒకడిని కంటావ్.. నీ కొడుకు కూడా... పేదవాళ్ళు నలుగురిని కనాల
-
ప్రెస్ మీట్ మధ్యలో జగన్ కామెడీ.. పుష్ప శ్రీవాణితో బాబు మేనిఫెస్టో చదివించి..
-
బాలయ్య అల్లుడికి వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. Yes Lokesh.. Both Are Not Same అని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా తేడా ఉందని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఇంత దారుణమైన పరిపాలన చంద్రబాబు ఓవైపు చేస్తూ.. మరోవైపు తన కొడుకు చేత Both are not the same అని పబ్లిక్ మీటింగ్స్లో డైలాగ్స్ చెప్పించడం ఏంటని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మిస్టర్ లోకేష్.. Yes, both can never be same. వెన్నుపోటుతో పార్టీని, పార్టీ గుర్తును దోచేయడం మీ హిస్టరీ. ఎదురొడ్డి నిలబడి ప్రజా మద్దతు సంపాదించి, ప్రభుత్వంలోకి రావడం మా హిస్టరీ. both can never be sameప్రజలకు ద్రోహం చేయడం, నమ్మించి ముంచడం మీ క్యారెక్టర్. ఆరు నూరైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్.పనులు చేసి చూపించడం మా స్టైల్. పబ్లిసిటీతో క్రెడిట్ చోరీకి పాల్పడ్డం మీ స్టైల్. both can never be sameవిద్యా, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ప్రజలచెంతకే పాలన, గృహనిర్మాణం, మహిళా సాధికారిత, మహిళా రక్షణలో “దిశ’’లాంటి విప్లవాత్మక కార్యక్రమలు మాకున్న చరిత్ర. వాటన్నింటినీ నాశనం చేయడం మీ చరిత్ర. both can never be sameఐదేళ్లలో పారదర్శకంగా అర్హులైన పేదలకు ఇంటివద్దకే డీబీటీ కింద రూ.2.73 లక్ష కోట్లు ఇవ్వడం మా గవర్నెన్స్, రెండేళ్లలో 3.6లక్షలకోట్లు అప్పులు చేసి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లను గాలికి వదిలేసి దోచేయడం మీ గవర్నెన్స్. both can never be sameబాబు అంటే మోసం, జగన్ అంటే నమ్మకం. both can never be same అని అన్నారు. అలాగే, సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు సంతానమే సంపద అంటున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని, నలుగురిని కనమంటున్నాడు. అలా కంటే డబ్బులు ఇస్తాడంట. చంద్రబాబూ నువ్వు ఎందుకు కనలేదు? ఒక్కరితోనే ఎందుకు ఆపావ్? నీ కొడుకు లోకేష్ కూడా ఒక్కడితోనే ఎందుకు సరిపెట్టాడు? నీకొడుకైనా నువ్వు చెప్తున్న దాన్ని పాటించాలి కదా?. నువ్వు వచ్చిన తర్వాత ప్రభుత్వం బాధ్యతగా ప్రజలకు అందించాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా మూలనపడేశావు.మెడికల్ కాలేజీలకు, నాడు -నేడు స్కూళ్లకు డబ్బులు ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాదుకాని, అమరావతిలో బిల్డింగుల అద్దాలకు రూ.2,540 కోట్లు. ముగ్గురు నలుగురిని కంటే, వారికి కనీసం మంచి భోజనమైనా పెట్టే పరిస్థితి కుటుంబాలకు ఉంటుందా? వారి చదువులు ఏం కావాలి? వారి నాణ్యమైన వైద్యం ఎక్కడి నుంచి అందుతుంది?. ముగ్గురు, నలుగుర్ని కనాలంటూ మహిళలను పిల్లలు కనే యంత్రాలుగా చూడ్డం, వారిని చులకన చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇలా మాట్లాడటం తప్పు. మహిళలు బాగుంటనే కుటుంబాలు బాగుంటాయి’ అని చెప్పుకొచ్చారు. -
పెట్రోల్ ధరలపై లోకేష్ దొర అన్న మాటలు.. వీడియోలు ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
బాబు.. కేంద్రం గడ్డి పెట్టలేదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్తో పాటు ఇచ్చిన 143 హామీల సంగతి ఏమిటని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. పెట్రోలు, డీజిలు రేట్లు తగ్గిస్తానంటూ ఇచ్చిన హామీ విషయంలో కూడా చంద్రబాబుది వెన్నుపోటేనని అన్నారు. పెట్రోల్, డీజిల్పై కృత్రిమ కొరత సృష్టించింది ఎవరు?. సంక్షోభంలో కూడా స్కాములు చేశారు అని మండిపడ్డారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ప్రతిపక్ష పార్టీగా ఈ రెండేళ్లుగా మేం చంద్రబాబును అడుగుతున్నది ఏంటంటే.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తారు. వాటి సంగతి ఏమైందని మేమే కాదు, ప్రజలంతా కూడా అడుగుతున్నారు. ఇది తప్పవుతుందా?. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గింపు ఎప్పుడు?. 2014-19 మధ్య చంద్రబాబుకు కోవిడ్ లాంటి గడ్డు పరిస్థితులు లేవు. కానీ, 2015 ఫిబ్రవరిలో పెట్రోలు, డీజిలుపై లీటర్కు రూ.4ల చొప్పున అకారణంగా పెంచాడు. కానీ, మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల మధ్య, మేము గతంలో చంద్రబాబు పెంచిన దాని కన్నా కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచాం. దానిమీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నానా యాగీ చేశారు.పైగా మొన్న ఎన్నికలకు ముందు, అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ మీదున్న ట్యాక్స్లు తగ్గించి, వాటి రేట్లు తగ్గిస్తానంటూ చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటికే రూ.4లు లీటర్ పెట్రోల్, డీజిల్ మీద పెంచారు. చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారమే డీజిల్, పెట్రోల్పై రూ.8 తగ్గించాలి కదా?. ఇలా తగ్గించకపోగా సంక్షోభంలో కూడా స్కాములు చేశారు. కృత్రిమ కొరత సృష్టించి అందులో కూడా తనకు, తన వాళ్లకు సంపద పెంచుకునే ప్రయత్నం చేశాడు.ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ దొరక్క జనం బారులు తీరారు. ఇలాంటి సమయంలో కూడా ముఖ్యమంత్రి అనే వ్యక్తి తక్షణ చర్యలు తీసుకోలేదు. ప్రజల గురించి ఆలోచించకుండా, వారి అవసరాలను తీర్చాల్సింది పోయి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్ లెట్ల నుంచి పెట్రోల్, డీజిల్ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దారుణం. ఇలాంటి మనిషి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా?. అసలు విషయాలు తెలుసుకుని కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెడుతూ లేఖ రాసింది. రిటైల్ అవుట్ లెట్స్ నుంచి కమర్షియల్ అవసరాలకు వాడకూడదని గడ్డిపెట్టింది’ అని చెప్పుకొచ్చారు. -
బాలకృష్ణ గన్ తో ఇద్దరిని టపా..టపా అంటూ కాల్చితే.. బాబు శవ రాజకీయాలుపై జగన్ కౌంటర్
-
సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్న చంద్రబాబు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు. సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది. చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు ఎప్పుడు వచ్చినా వెంటనే టాపిక్ను డైవర్ట్ చేస్తారు. అబద్ధాన్ని సృష్టించి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారు. సోషల్ మీడియాలో అమరావతిలో అవినీతి మీద, ఇందాపూర్-హెరిటేజ్ సంబంధాలమీద, తిరుమల లడ్డూ విషయంలో, మహిళలపై వీళ్ల ఎమ్మెల్యేలు, చివరకు టీటీడీ ఛైర్మన్గా ఉన్న వ్యక్తి చేసిన వ్యవహారాల మీద, విచ్చలవిడిగా వీళ్లు చేస్తున్న మద్యం గంజాయి, ఇసుక, మట్టి మాఫియా దోపిడీపైనా, ఇలా చంద్రబాబు ఇరుకునపడ్డ ఏ కంటెంట్ కూడా కనబడకుండా చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను చంద్రబాబు సెన్సార్ చేస్తున్నాడు.సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి, నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను అడ్డుపెట్టుకుని, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్స్టా లాంటి హెడ్ క్వార్టర్స్కు నేరుగా ఈ పోలీసులే ఆ పోస్టులను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. పోలీసులను వాడుకుని అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారు. పోలీసులు తమ ప్రాథమిక విధులను వదిలేశారు. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా కాలేజీల్లో గంజాయి అమ్మిస్తున్నారు. ఎక్కడ చూసినా డ్రగ్సే ఉంటున్నాయి.ప్రతి ఐదు లిక్కర్ బాటిళ్లలో ఒకటి కల్తీదే. బెల్టు షాపుల ద్వారా ఈ కల్తీ లిక్కర్ను అమ్ముతున్నారు. బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మిస్తున్నారు. రాష్ట్రానికి ఆదాయాలు రావడమే లేదు. అయినా పోలీసులు పట్టించుకోరు. రాష్ట్రంలో గవర్నెన్స్ పూర్తిగా పోయింది. మహిళలకు రక్షణ లేదు. దిశ కార్యక్రమం ద్వారా మహిళలను రక్షణ కల్పించాం. గ్రామ సచివాలయాల్లోనే మహిళా పోలీసును పెట్టాం. కూటమి ప్రభుత్వంలో పరామర్శ కోసం మహిళలను అడ్డుకున్న తీరు అత్యంత హేయం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆ పేరు వింటే బాబు గుండె ఆగిపోతుంది..
-
బాబు.. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరివి హత్యా రాజకీయాలు?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. శవ రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా?. వైఎస్సార్ విషయంలో ఏం జరిగిందో అసెంబ్లీలో క్లిప్పింగ్లు చూడాలని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారు. ఏబీఎన్, టీవీ-5, చంద్రబాబు మాఫియా ముఠాగా మారారు. అబద్ధాలు సృష్టించి దొంగ సాక్ష్యాలు తయారు చేస్తున్నారు. ఎవరిది గొడ్డలి పార్టీ.. ఎవరిది గన్ కల్చర్?. ఎవరివి హత్యా రాజకీయాలు.. చంద్రబాబు సమాధానం చెప్పాలి. మా కుటుంబంలో ముగ్గురు బలైపోయారు. హత్యా రాజకీయాలకు మేము బాధితులం.మా తాత, తండ్రి, బాబాయి ముగ్గురు చనిపోయారు. మాపైనే తప్పుడు రాజకీయాలు చేయిస్తున్నారు. మా తాతగారు రాజారెడ్డిని చంపింది టీడీపీ వాళ్లు కాదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రాజారెడ్డి హత్య జరిగింది. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిగారిని చంపేశారు. వైఎస్సార్ను కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందులో ఉన్న రాజకీయ కోణం. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. ఈ కేసులో నిందితులను జైలుకెళ్లకుండా కాపాడారు. ఎవరిది గొడ్డలి పారీ.. చంద్రబాబు చెప్పాలి. మా నాన్న విషయంలోనూ అదే జరిగింది. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. అవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగ్లు చూడాలి. తర్వాత నాలుగు రోజులకే వైఎస్సార్ ప్రమాదంలో చనిపోయారు. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?మా చిన్నాయన వివేకానందరెడ్డి ఇదే చంద్రబాబుగారి ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవమైతే, పైగా తానే హత్య చేశానంటూ సాక్షాత్తూ టీవీ లైవ్ షోల్లో చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల వత్తాసుతో దర్జాగా కార్లలో తిరుగుతున్నాడు. పైగా చంద్రబాబుకు లాయర్ లూథ్రానే, దస్తగిరికీ లాయర్ లూథ్రానే. మరి ఎవరిది క్రిమినల్ బ్రెయిన్?. రాజకీయ లబ్ధికోసం ప్రలోభాలతో హంతకులను రక్షించడం, నిర్దోషులను హింసించడం. వివేకానందరెడ్డి కేసులో జరుగుతున్నది ఇదే.చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు, బాలకృష్ణ గన్ పట్టుకుని టపాటపామని ఇద్దరిని కాల్చిపడేయలేదా? మరి ఎవరిది గన్ కల్చర్?. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో వాచ్మెన్ను బండరాయితో మోది చంపేశారు?. పాపం ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణగారు యాక్సిడెంట్లో చనిపోతే, పరామర్శ కోసం అని పోయి, కేటీఆర్తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడాడు. మరి ఎవరివి శవ రాజకీయాలు?. అంతెందుకు సొంత కూతుర్ని ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సొంత మామ, తండ్రితో సమానమైన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి, సీఎం కుర్చీని, ఆయన పార్టీని, ఆ పార్టీ గుర్తును లాక్కున్నది, ఆయన చనిపోయినట్టుగా చేసింది ఈ చంద్రబాబు నాయుడు కాదా? మరి ఎవరివి కుట్ర రాజకీయాలు?.వేళ్లన్నీ చంద్రబాబు వైపే..వంగవీటి మోహనరంగాగారు ఒక టైగర్. ఆయన ఎలా చనిపోయారు?. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని విజయవాడలో నిరాహారదీక్ష చేస్తుంటే, అర్థరాత్రి నరికి చంపేశారు. ఈ ఘటనలో వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తాయి. ఈ కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణబాబు టీడీపీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్మీద దాడిచేసిన కేసులో “మల్లెల బాబ్జీ’’ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. కొన్నాళ్ల తర్వాత అతను ఒక లాడ్జీలో డెడ్బాడీగా మారాడు. మల్లెల బాబ్జీ జేబులో ఒక లెటర్ దొరికింది. తనకు రూ.3లక్షలు ఇస్తానని చెప్పి, చివరకు రూ.30వేలే ఇచ్చారని సారాంశం. అసలు ఎన్టీఆర్మీద దాడి కోసమే డబ్బులు ఇచ్చారా? అది నిజమైతే ఇచ్చింది ఎవరు? అన్నదానిపై దర్యాప్తు లేదు. ఈ కేసులోనూ వేళ్లు అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి.పింగళి దశరథ్రామ్ ఒక జర్నలిస్టు. విజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రికను పెట్టి, టీడీపీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తుంటే, హైదరాబాద్ నుంచి బస్సుదిగి, రిక్షాలో ఇంటికి వెళ్తుంటే కత్తులతో దాడిచేసి చంపేశారు. ధర్నాలు, ఆందోళనల సమయంలో బస్సులు తగలబెట్టాలంటూ చంద్రబాబు పార్టీ కేడర్కు చెప్పేవాడని స్వయంగా ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక టీవీ ఇంటర్వ్యూల్లో చెప్పారు. ఒక పుస్తకంలో రాసినట్టు కూడా నాకు గుర్తు. హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం.జగన్ నైజం ఇది.. జగన్ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లు కూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబూ నీకు 77 సంవత్సరాలు వచ్చాయి. బహుశా ఇది చివరి ఎన్నికలేమో. ఇంకా ఈ చిల్లర రాజకీయాలు చేయడానికి సిగ్గేయడం లేదా? అని ప్రశ్నించారు. -
బాబు అమరావతి స్కాం తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే...!
-
5 బిల్డింగులకు 10 వేల కోట్లా..?! బాబు బాగా రిచ్..!
-
మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది: జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఏపీ చేసుకున్న దురదృష్టమని అన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. మావిగన్ అంటే బాబుకు గుండె ఆగిపోయేలా ఉంది. చంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్లో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు కారణంగా ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇచ్చిన హామీలకు వెన్నుపోటు పొడిచారు. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకే రూ.2లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసినా అమరావతిపై ముందుకు వెళ్తున్నారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.47,387 కోట్లు అప్పు చేశారు. ఖజానా నుంచి రూ.9200 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. స్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారు. ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ పెరుగుతోంది. రాష్ట్రానికి రాజధాని ఉండాలనే మావిగన్ను ప్రతిపాదించాం. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాం. అమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలి. చంద్రబాబు స్కామ్ల కోసం ఏపీని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు కూడా మావిగన్కు మద్దతు పలికారు. అది తట్టుకోలేక చంద్రబాబు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మంత్రులతో కూడా బూతులు మాట్లాడిస్తున్నారు. రూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న 5 బిల్డింగ్ల నిర్మాణం పేరుతో చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారు. భవన డిజైన్లకే రూ.401 కోట్లు. ఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ.20,427?. వాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాట. మళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే ఇచ్చారు. ఫైవ్స్టార్ హోటల్స్కు కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే!. తెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారు. మన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు?. కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారు. ఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనే’ అని తెలిపారు. జంగిల్ రాజ్గా రాష్ట్రం.. ప్రజల బాగోగులను చంద్రబాబు గాలికి వదిలేశారు. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారు. రెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలి. ఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోంది’ అని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యం.. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు
-
LIVE: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
ఈ మధ్యన బీపీ ఎక్కువైంది.. గుండె ఆగిపోతుందేమో అని భయమేస్తుంది బాబుపై జగన్ సెటైర్లు
-
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుర్మార్గపు పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలోనూ ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు స్కామ్లు చేసుకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబుకి బీపీ పెరుగుతోందిఇచ్చిన హామీలకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుప్రజల బాగోగులను గాలికి వదిలేశారుఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారురాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారురెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలిఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందిచంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుతప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోందిమావిగన్ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉందిచంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టంఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారుచంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందిఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారుస్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారుఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారుఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారుస్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారుప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతోందిరాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించాంరాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాంఅమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలిమావిగన్లో అన్నీ ఉన్నాయిప్రజలు కూడా మావిగన్కు మద్దతు పలికారుఅది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారుతాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారుఅమరావతిలో విచ్చలవిడి దోపిడీనేరూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా.. పర్మినెంట్ పేరిట మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారుమళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే టెండర్లు కట్టబెట్టారుకొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల దోపిడీ చూసి జనం నివ్వెరపోతున్నారుభవన డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారుఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 20, 427 ఆ? పాత లెక్క రూ. 5వేల లోపే ఉందివాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే ఇప్పుడు చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాటఫైవ్స్టార్ హంగులతో కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే అవుతుందితెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారుమన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు??కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారుఅమరావతిలో రోడ్ల వ్యయం చూస్తే కళ్లు తిరుగుతాయికిలోమీటర్ ఖర్చు రూ.24 కోట్లు అవుతుందని కేంద్రమే చెప్పిందిఅమరావతిలో కిలో మీటర్ ఖర్చు రూ.53 కోట్లు అవుతోందిఅమరావతిలో ప్లాట్ల స్కామ్ జరుగుతోందిచంద్రబాబు తన మనుషులకు రోడ్ల పక్క భూములు ఇప్పించారుసామాన్యులకు మాత్రం చెరువులు, కుంటల్లో ఇస్తున్నారు50 వేల ఎకరాలు సరిపోవని మళ్లీ లాక్కుంటున్నారుఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనేవీటన్నింటిని ఆధారాలతో సహా బయటపెడితే చంద్రబాబుకి బీపీ వస్తోందిచంద్రబాబూ.. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ?మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే మాపైనే బురద జల్లుతున్నారుజాతరలో గొడవ వల్లే దస్తగిరి చనిపోయారని ఆయన భార్య చెప్పిందిటాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారువైఎస్సార్సీపీపై బుదర జల్లాలని చూస్తున్నారుకల్పిత కథతో కేసు పెట్టి వైసీపీ వాళ్లనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారుచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?మా తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు చనిపోయారు.. మేం బాధితులంమా తాత రాజారెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యకు గురయ్యారుమా తాతను చంపింది టీడీపీ వాళ్లు కాదా?అధికార దుర్వినియోగం చేసి ఆ హంతకులను చంద్రబాబే రక్షించారుమా నాన్న రాజశేఖర్రెడ్డి విషయంలోనూ అదే జరిగిందిఅసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని మా నాన్నను ఉద్దేశించి చంద్రబాబు అన్నారుతర్వాత 4 రోజులకే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారుఅవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగులు చూడండిమా నాన్న మృతి విషయంలో అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కావాల్సి ఉందిమా చిన్నాన్న వివేకాను అవినాష్ చంపించాడంటూ ప్రచారం చేశారుఅవినాష్ కోసం వివేకా కృషి చేశారుఅలాంటి వివేకాను అవినాష్ చంపించారని బురద చల్లారుచంపానని చెప్పిన దస్తగిరి ఇవాళ బయట దర్జాగా కార్లలో తిరుగుతున్నాడుఈ కేసులో నిందితుడైన దస్తగిరికి లాయర్.. చంద్రబాబు లాయర్ అయిన లూథ్రానేక్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలినందమూరి బాలకృష్ణ గన్తో ఇద్దరిని కాల్చేయలేదా?ఎవరిది గన్ కల్చరో చెప్పాలిఈ కేసులో సాక్ష్యం దొరకకూడదని వాచ్మన్ను బండరాయితో కొట్టి చంపారుహరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి చంద్రబాబు కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడారుఎవరివి శవ రాజకీయాలో చంద్రబాబు చెప్పాలిరాజకీయ జీవితం ఇచ్చిన సొంతమామకే వెన్నుపోటు పొడిచారుపేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి వంగవీటి రంగాను నరికి చంపారుఈ కేసు ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేఎన్డీఆర్పై దాడి చేసి మల్లెల బాబ్జీ లాడ్జిలో శవమై తేలాడుతనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని బాబ్జీ జేబులో ఓ లెటర్ దొరికిందిమల్లెల బాబ్జీ కేసులో అసలు విచారణే జరగలేదుచంద్రబాబుది రాక్షస రాజకీయంవిజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి టీడీపీ అవినీతిని ప్రశ్నించిన పింగళి ధశరథ్రామ్ దారుణ హత్యకు గురయ్యారుఈ హత్య కేసులోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించాయిబాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాశారుచంద్రబాబు కుట్రలన్నీ దగ్గుబాటి అప్పుడే చెప్పారుమాది విలువలతో కూడిన రాజకీయంచంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తుంటే.. మేం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నాంమా తాతను చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు.. మేం చెడ్డోళ్లమైతే వాళ్లు ఉండేవాళ్లా?జగన్ నైజానికి ఇదే నిదర్శనంచంద్రబాబులా మాకు హత్య రాజకీయాలు నేర్పించలేదుచంద్రబాబుకి బహుశా ఇవే చివరి ఎన్నికలుఈ వయసులోనూ ఇలాంటి దౌర్భగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా?స్కామ్ వాళ్లది.. కేసు మా నేతపైనజంగిల్రాజ్లో హత్యారాజకీయాలు నడుస్తున్నాయిఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ వాళ్లను దారుణంగా చంపారువినుకొండలో రషీధ్ను నడిరోడ్డుపై నరికి చంపారుచంద్రబాబుకు ఎప్పు ఇబ్బంది వచ్చినా అబద్ధం సృష్టిస్తారుబాబు మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారుఆయన హయాంలోనే కల్తీ మద్యం ఘటన జరిగిందికానీ, మా పార్టీ నేత పేరును కేసులో చేర్చారుటీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి అనుచరులు కల్తీ మద్యం చేస్తూ దొరికారుచేసింది చంద్రబాబు అనుచరులతే కేసు మాత్రం ఈ దందాను బయటపెట్టిన జోగి రమేశ్ పై పెట్టారుతప్పుడు కేసుతో 83 రోజులు జైల్లో పెట్టారుబెయిల్పై బయటకు వస్తే యాసిడ్ బాటిల్స్ దాడి చేశారుదాడికి పాల్పడిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారుకల్తీ మద్యం కేసును ఎంత దారుణంగా మార్చారో అంతా చూశారుమామిళ్లపల్లిలో తప్పు వాళ్లదేమామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారుకాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు రైతులు గోడౌన్లో పంట నిలవ చేసుకున్నారుమామిళ్లపల్లిలో ఎక్కడా తప్పు జరగలేదని వాళ్లకూ తెలుసుఅయినా గోడౌన్ అంబటి మురళిదని ప్రచారం చేశారుగోడౌన్లోనూ వైఎస్సార్సీపీ జెండాలను టీడీపీవాళ్లే పెట్టారుఅక్రమంగా నిల్వచేశారని తప్పుడు కేసులు పెట్టారుగోడౌన్ను కూడా సీజ్ చేశారుగిట్టుబాటు ధర ఇస్తే రైతులు పంటను గోడౌన్లో ఎందుకు పెట్టుకుంటారు?పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై దౌర్జన్యం చేశారుమహిళలపై కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారుఏపీలో సోషల్ మీడియా సెన్సార్ఏపీలో సోషల్ మీడియా పైనా కూడా ఆంక్షలు పెడుతున్నారుప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేదుప్రభుత్వ తప్పిదాలపై పోస్టులు పెడుతుంటే ఆ కంటెంట్ను కనపడకుండా చేస్తున్నారుసోషల్ మీడియా కూడా సెన్సార్ చేస్తున్నారుకార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారుఎఫ్ఐఆర్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు పంపిస్తున్నారుచంద్రబాబు పెట్రో మాయఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అన్నారుపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్తో పాటు, అలాగే డీజిల్పై 22.5 శాతం వ్యాట్తో అదనంగా 4 రూపాయిలు పెంచారుకోవిడ్లాంటి మహమ్మరి టైంలోనూ రోడ్ సెస్ కింద మేం పెంచింది రూపాయి మాత్రమేకానీ, వైఎస్సార్సీపీ హయాంలో పెట్రోల్ రేట్లు అడ్డగోలుగా ఉన్నాయంటూ నానాయాగీ చేశారుఅప్పట్లో బాబు, లోకేష్, పవన్లు పొలిటికల్ డ్రామా చేశారుఎన్నికల టైంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్లు ప్రకటించారుటీడీపీ మేనిఫెస్టోలోనూ ఇంధన ధరల తగ్గింపు ఉందిరెండేళ్లైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదుగత నెలలో బంకుల వద్ద బారులు తీరారుఇంధన సంక్షోభంలోనూ చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారుఆ టైంలో అమరావతి కాంట్రాక్టర్లకు బల్క్ల్లో ఇప్పించాలని కోరారుచంద్రబాబుకి చీవాట్లు పెడుతూ కేంద్రం లేఖ పంపిందిరిటైల్ బంకుల్లో ఎలా డీజిల్ అడుగుతారని చెప్పిందిఆ టైంలోనూ ప్రజల గురించి కాకుండా కాంట్రాక్టర్ల గురించి ఆయన ఆలోచించారుహామీలు నెరవేర్చకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారుఇప్పటికైనా క్షమాపణలు చెప్పి ధరలు తగ్గించాలిపెట్రోల్ లీటర్కు రూ.8 తగ్గించాల్సిందే మినిమమ్ డ్యూటీ మరిచిన పోలీసులుపొదుపు చర్యల పేరుతో చంద్రబాబు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారువాళ్లు మాత్రం విమానాల్లో తిరుగుతున్నారుఏపీలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారుఏ కాలేజీలో చూసినా గంజాయి కనిపిస్తోందిరాష్ట్రంలో మాత్రం పోలీసులకు కనిపించడం లేదువ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారుపోలీసులు కనీస విధులు కూడా మరిచిపోయారుమా హయాంలో దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పించాం గ్రామాల్లో చంద్రబాబుపై ఆగ్రహంచంద్రబాబు నోరు తెరిస్తే అబద్దం.. మోసంఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారుసూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా తేలాయిమా హయాంలోనీ పథకాలన్నీ నిలిపివేశారుపొదుపు సంఘాల పరిస్థితి దారుణంగా ఉందిపంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఇన్ఫుట్ సబ్సీడీ లేదు.. ఈ క్రాప్ లేదుమొక్కజోన్న, పొగాకు, శనగ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారుకేంద్రం ఇచ్చేది కాకుండా.. అన్నదాన సుఖీభవకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. అంటే ప్రతీ రైతుకు రూ. 40 వేలు ఇవ్వాలిఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 ఇస్తామన్నారునిరుద్యోగికి రూ.3 వేల భృతి అన్నారు.. అంటే ఈ రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ పడ్డారుఏపీలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు16 కేటగిరీల్లో ఐదింటికి మాత్రమే అనుమతించారుఇప్పుడు దానికి కూడా కోత పెడుతున్నారు12 డిపోలను ప్రైవేట్పరం చేశారుఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు తెస్తారంటఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి.. దానికి ఫ్రీ పథకం వర్తించదని చెబుతున్నారుభవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు.. ఆర్టీసీ ఉండదుమా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాంబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారుఅమ్మ ఒడి పథకంలో 20 లక్షల మందికి కోత పెట్టారుహామీలు అమలు చేస్తామని స్వయంగా బాండ్లు పంపిణీ చేశారుగ్రామాల్లో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుఆ హామీల సంగతి ఏమైందని చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారుఉద్యోగులను దారుణంగా మోసం చేశారుమా హయాంలో ఉద్యోగులకు ఏనాడూ ఇబ్బందులు కలగలేదుసంతానమే సంపదట.. మరి లోకేష్ సంగతేంటి?ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారురూ. 30 వేలు, రూ.40 వేలు నగదు ప్రొత్సాహకం ఇస్తామని మభ్యపెడుతున్నారుసూపర్ సిక్స్, సెవెన్ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడమని ప్రజలు మొత్తుకుంటున్నారుచంద్రబాబుకు ఒక్కడే కొడుకు.. లోకేష్కు ఒక్కడే కొడుకుబాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదాప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురు కనాలటవాళ్లు మంచి చదువుకోకూడదటఇదేం దిక్కుమాలిన ఆలోచన?విద్య, వైద్యం, వ్యవసాయం ఏనాడూ మా హయాంలో మూలన పడలేదుపిల్లలకు మేనమామలా మంచి చదవులు చదివించాఇవాళ.. కనీసం గోరుమద్దలు కూడా అందని పరిస్థితిసరైన ఆహారం అందక ఆస్పత్రి పాలవుతున్నారువ్యవస్థలన్నీ ఇంత దారుణంగా, అద్వాన్నంగా ఉంటే.. పిల్లలు కనమని పిలుపు ఇవ్వడమేంటి?మహిళలను పిల్లల్ని కనే మెషీన్లుగా చంద్రబాబు చూడడం దుర్మార్గంకుటుంబాలు బాగుండాలంటే మహిళలు బాగుండాలియస్ లోకేస్.. బోత్ ఆర్ నాట్ సేమ్బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ సినిమా డైలాగులు కొడుతున్నాడుఅవును.. బోత్ ఆర్ నాట్ సేమ్వెన్నుపోటుతో పార్టీని లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీదిప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మాదిప్రజలకు ద్రోహం.. వాడుకోవడం .. వదిలేయడం మీ క్యారెక్టర్ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్పనులు చేసి చూపించడం మా స్టైల్.. పబ్లిసిటీ చేసుకోవడం మీ స్టైల్బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాదిరెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీదివిద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం.. ప్రజల చెంతకు పాలన, మహిళా సాధికారికత, మహిళా రక్షణ.. వీటిని ఆచరణలో చూపించడం మేం చేశాంఅందుకే బోత్ ఆర్ నాట్ సేమ్వైఎస్సార్సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్పై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..ప్రజాస్వామ్యంలో ఏది ఇస్తావో అల్టిమేట్గా అదే తిరిగి వస్తుందిప్రతీ పోలీసుకు విజ్ఞప్తి చేస్తున్నాచంద్రబాబు ప్రలోభాలు, భయంతోనూ పోలీసులు పని చేయొద్దురేపు ప్రభుత్వం మారాక ఎంక్వైయిరీ ఉంటుందితప్పు చేసిన అధికారుల్ని చట్టం ముందు నిలబెడతాంసప్తసముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. తీసుకొస్తాం ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కదా.. టీవీకే అధినేత విజయ్ వైఎస్ జగన్ ఫొటో పట్టుకోవడం, తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ సాధించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందన -
జగన్ పై పవన్ 'కుట్ర ఢిల్లీ కేంద్రంగా మాస్టర్ ప్లాన్
-
జగన్ ఖాతాలోయి తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు
-
అధికారంలోకి రాగానే.. రాజధానిలో ప్రకాశం పంతులు స్మృతివనం
సాక్షి, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు స్మృతివనం, విగ్రహం ఏర్పాటుపై వైఎస్ జగన్కు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాల వారికి తెలియజేసేలా రాష్ట్ర రాజధానిలో ప్రకాశం స్మృతివనం, శాసనసభ ప్రాంగణంలో ప్రకాశం పంతులు విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని తప్పక పరిశీలించి.. అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో వైఎస్ జగన్కు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ, ఈ.క్రిష్ణమాచారి, సీహెచ్.శ్రీనివాసరావు, కె.వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. నేటి తరాలకు స్ఫూర్తిదాయకం అలాగే ప్రకాశం పంతులుకు నివాళులర్పిస్తూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ‘ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం. బుధవారం టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అంటూ వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమకాలీన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు. -
రేపు వైఎస్ జగన్ ప్రెస్ మీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం (గురువారం) 11 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్మీట్ జరగనుంది. ఈ ప్రెస్మీట్లో వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై స్పందించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. సీతారామశాస్త్రికి నివాళి అర్పించారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. ఆయన జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. తెలుగు సాహిత్య సరస్వతీ పీఠంపై అక్షరార్చన చేసిన మహాకవి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. సమాజానికి సందేశం ఇచ్చేలా, యువతకు స్ఫూర్తినిచ్చేలా, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఆయన రాసిన పాటలు కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో గూడుకట్టుకుని ఉన్నాయి. నేడు సిరివెన్నెల… pic.twitter.com/w8E8r9jm4U— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2026 -
అసెంబ్లీలో ఆవరణలో ఆంధ్రకేసరి విగ్రహం ఏర్పాటు చేయించాలి
సాక్షి, తాడేపల్లి: దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులలో దక్షిణ భారతావనిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అగ్రగణ్యులని, అలాంటి మహానీయుడి జీవిత విశేషాలు భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని బ్రహ్మణ సంఘాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాయి. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆయన్ని కలిశారు. ఆ మహానీయుడి జీవిత విశేషాలు భావితరాల వారికి తెలియజేసేలా రాజధానిలోఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట స్మృతివనం, అలాగే అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయించేలా చూడాలని వైఎస్ జగన్కు బ్రహ్మణ సంఘం వినతిపత్రం అందజేసింది. ఆ విజ్ఞప్తిని తప్పక పరిశీలించి, అధికారంలోకి రాగానే తప్పనిసరిగా ఏర్పాటుచేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. దీంతో బ్రహ్మణ సంఘం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జ్వాలాపురం శ్రీకాంత్, ద్రోణంరాజు శ్రీవాత్సవ, రాంపల్లి రవిచంద్ర, పురుషోత్తమ శర్మ, ఈ క్రిష్ణమాచారి, సీహెచ్ శ్రీనివాసరావు, కే వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రకాశం పంతులు వర్ధంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్థంతి. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. టంగుటూరి ప్రకాశం పంతులుకు నివాళి అర్పించారు. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకమని వైఎస్ జగన్ కొనియాడారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తి దాయకం. నేడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు’ అని పోస్టు చేశారు. ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన గొప్పనాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. బ్రిటీష్ పాలకుల అణచివేతకు భయపడకుండా, వారి తుపాకులకు తన ఛాతిని ఎదురొడ్డి నిలిచిన ధీరుడు ఆయన. ప్రజల హక్కుల కోసం, సమాజ అభ్యున్నతి కోసం ఆయన నడిచిన… pic.twitter.com/4esnkiGBRP— YS Jagan Mohan Reddy (@ysjagan) May 20, 2026 -
టంగుటూరి ప్రకాశం పంతులుకి జగన్ నివాళులు
-
దివ్యాంగులకు జగనన్న భరోసా
-
19 వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినా.. దివ్యాంగులకు రిజర్వేషన్లు లేవు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆల్ యూనివర్సిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు కలిశారు. మంగవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో దివ్యాంగ్ వింగ్స్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించారు. రాష్ట్రంలోని 19 యూనివర్సిటీలలో 1,523 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, దివ్యాంగులకు ఎలాంటి రిజర్వేషన్లు కల్పించలేదని వైఎస్ జగన్కు తెలిపారు.ఉన్నత విద్యనభ్యసించి పీహెచ్డీలు పూర్తి చేసిన తమలాంటి దివ్యాంగులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగుల హక్కులు, సాధికారత కోసం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వికలాంగుల హక్కుల చట్టం–2016ను చంద్రబాబు ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తీరువల్ల దివ్యాంగులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా తమకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. దివ్యాంగుల సమస్యలను వైఎస్ జగన్ సావధానంగా విన్నారు. వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను గుర్తుచేసి భవిష్యత్తులోనూ దివ్యాంగులకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు
సాక్షి,తాడేపల్లి: ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్,లెక్చరర్ పోస్టుల భర్తీలో వికలాంగులకు మోసం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.తమలాంటి దివ్యాంగులకు చంద్రబాబు ప్రభుత్వం అవకాశాలు ఇవ్వటం లేదని వాపోయారు. తమకు రిజర్వేషన్ ఇవ్వకపోవటంతో ఉద్యోగ అవకాశాలకు దూరమయ్యాయని తెలిపారు. దివ్యాంగ హక్కుల చట్టాన్ని కూడా అమలు చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు.ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రతినిధుల ఆవేదనపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. దివ్యాంగులకు అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ని కలిసిన వారిలో ఆల్ యూనివర్శిటీ దివ్యాంగ్ వింగ్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం. కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎం. శ్రీనివాసరావు తదితరులున్నారు. -
నీలం సంజీవరెడ్డికి వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, తాడేపల్లి: దివంగత మాజీ సీఎం నీలం సంజీవరెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్వేదికగా ట్వీట్ చేశారు.ఆ ట్వీట్లో ‘భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి..లోక్సభ స్పీకర్గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి.. భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవికి గౌరవం తీసుకొచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయం.నేడు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, లోక్సభ స్పీకర్గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి, భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత… pic.twitter.com/ACFVKQHcEN— YS Jagan Mohan Reddy (@ysjagan) May 19, 2026 -
కుక్కలు ఇలాగే మొరుగుతాయ్.. నన్ను తిట్టడానికి అమెరికా నుంచి రావాలా?
-
మీకు అండగా నేనున్నా.. యలమర్తి కుటుంబానికి జగన్ ఫోన్
-
అస్తవ్యస్త విధానాలు, అవినీతితో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆందోళన


