breaking news
YS Jagan Mohan Reddy
-
పులివెందులకు YS జగన్..
-
వెలిగొండ లెక్కలు బయటపెట్టే దమ్ముందా.. శ్రీకాంత్ రెడ్డి సంచలన కామెంట్స్
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి(మంగళవారం) నుంచి పులివెందులలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలో జరిగే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు.01.09.2026 షెడ్యూల్ ఇలా.. వైఎస్ జగన్ సెప్టెంబర్ 1న(మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు.02.09.2026 షెడ్యూల్..సెప్టెంబర్ 2న ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.చదవండి: తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్టు బాబు అబద్ధాలు.. వెలిగొండలో క్రెడిట్ చోరీ -
విజయసాయి వ్యాఖ్యలపై మల్లాది విష్ణు కౌంటర్..
-
జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా...? బొప్పరాజు రియాక్షన్
-
వెలిగొండకు జగన్ అప్పుడే.. క్రెడిట్ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!
-
బాబూ... చెత్త ఎవరిది? సోషల్ మీడియాలో రివర్స్ కౌంటర్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు భలే ప్రకటనలు చేస్తుంటారు. వాటిని ఎల్లో మీడియా పరమ పవిత్రం అన్నట్లుగా ప్రముఖంగా ప్రచురించి ప్రచారం చేస్తుంటుంది. చంద్రబాబు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. అది ఏమిటంటే రాజకీయాలలో చెత్తను తొలగిద్దాం.. అని అన్నారు. మామూలుగా అయితే ఇది ఆహ్వానించదగిందే. కాని ఆయన లక్ష్యం వేరు. ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నానని ఆయన అనుకోవచ్చేమోకాని, వాటిని విన్నవెంటనే, పత్రికలలో చదివిన వెంటనే గుర్తుకు వచ్చేది అధికార పార్టీలో ఉండేవారు చేసే అక్రమాల గురించే కదా! ఆ విషయాన్ని ఆయన పట్టించుకోకుండా స్పీచ్లు ఇస్తుండడం విశేషం.మనం రాజకీయాలలో ఉన్నవారిని అలాంటి పదాలతో సంభోధించడం సరైన పద్దతి కాదు. ఎవరు తప్పు చేసినా తప్పే. అసలు రాజకీయాలలో చెత్త అంటే ఏమిటో ఆయన ఒక నిర్వచనం ఇస్తే బాగుంటుంది కదా! ఎవరిపైన కేసులు ఉంటే వారు ఆ కోవలోకి వస్తారని అన్న భావనా? లేక ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడితే దానిని ఆ విధంగా పరిగణించాలన్న అర్థమా? ఎన్నికలలో డబ్బు ఖర్చు చేసేవారిపై వ్యాఖ్యలా?ఒక విశేషం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఈ స్పీచ్ ఇవ్వడానికి రెండు రోజుల ముందు జాతీయ స్థాయిలో ప్రజస్వామ్య సంస్కరణల వేదిక ఒక నివేదిక విడుదల చేసింది. అందులో ఏమి ఉంది? ఏపీలో 79 శాతం మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయనే కదా! అంటే అత్యధిక సంఖ్యలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మీదే కదా! నేర చరిత్ర కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబుది నాలుగో స్థానం అని అందులో ప్రకటించారు. ఈయనపై 19 క్రిమినల్ కేసులు ఉంటే, కొన్ని తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని రిపోర్టు చెబుతుంది. ఆయన శిష్యుడుగా గుర్తింపు పొందిన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు ఉన్నాయట. ఆయన అగ్రస్థానంలో ఉన్నారు.వీటిలో పెక్కు రాజకీయపరమైన కేసులు ఉండవచ్చని వీరు వాదించవచ్చు. కాని ఎదుటి పక్షాలపై అలాంటి కేసుల ఆధారంగానే చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారే! అక్కడే వచ్చింది సమస్య. తాను ఎవరిపైన ఆరోపణ చేస్తే అందులో నిజం ఉందని అనుకోవాలన్నది ఆయన భావన. అదే తనపై ఎవరైనా ఆరోపణ చేస్తే ఎవరూ నమ్మకూడదన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. రాజకీయాలలో ఉన్నప్పుడు ఎంతసేపు ఎదుటివారిపై బురద వేయడమే పనిగా పెట్టుకున్నప్పుడు ఆ బురద తమపై కూడా పడే అవకాశం ఉంటుందని వారు గుర్తించాలి కదా! తనకు మీడియా బలం ఉంది కనుక తను చెప్పిందే జనంలోకి వెళుతుందని చంద్రబాబు భ్రమపడి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఆయనకే నష్టం.ఇవి కూడా చదవండి: వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనను ఎద్దేవ చేస్తూ అనేక విషయాలను ఫాక్ట్స్ అండ్ ఫిగర్స్తో పోస్టులు వస్తున్నాయి. గొడ్డలి పార్టీ అని వైఎస్సార్సీపీని అంటూ తన పార్టీని వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పిలిపించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ను ఉద్దేశించి చంద్రబాబు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు చాలా అనుచితంగా ఉంటున్నాయి. చంద్రబాబు తన హోదాను, సీనియారిటీని కూడా మర్చిపోయి ఏది పడితే అది ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరం. ప్రజలు నిజాయితీగా ఉంటే నాయకులు తప్పులు చేయరట. ఎన్నికలలో డబ్బు ప్రభావం లేకుండా చేయవలసిన బాధ్యత ప్రజలదట. అది జరిగితేనే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందట. అంటే ఇప్పట్లో రాష్ట్రం స్వర్ణాంధ్ర కాదని పరోక్షంగా చెప్పినట్లు అనుకోవాలా? ఎంతసేపు ప్రజలను నిందిస్తున్నారే తప్ప, తాము డబ్బు పంచకుండా ఎన్నికలలో పోటీచేస్తామని మాటవరసకు చెప్పలేకపోతున్నారన్న విమర్శ వస్తోంది.సీపీఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు అయితే నేరుగా రాజకీయాలలో డబ్బు ప్రభావం తెచ్చిందే చంద్రబాబు అని స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పార్టీ అధినేత పీఏ వందల కోట్లు సంపాదించారని ఆయన ఏ ఆధారంతో చెప్పారో తెలియదు. కాని చిత్రం ఏమిటంటే స్వయంగా చంద్రబాబు పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీబీటీడీనే రెండువేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. దాని గురించి ఎన్నడైనా చంద్రబాబు వివరణ ఇచ్చారా? స్కిల్ స్కామ్లో ఆయన పీఏ అరెస్టు కాకుండా అమెరికాకు పంపించిందెవ్వరో తెలియదా! స్కిల్ స్కామ్లో అప్పటి సీఐడీ చేసిన అభియోగాలపై ఎన్నడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పాయింట్ వైజ్ వివరణ ఇచ్చి, తానేమి తప్పు చేయలేదని చెప్పి ఉండాలి కదా!ఈ స్కామ్లో ఏ అధికారులు అరెస్టు అయింది అందరికి తెలుసే. డీఎస్సీ, ఏపీపీఏస్సీ అంశాలను చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్లు ప్రస్తావిస్తూ తమ వాదన సమర్థించుకునే యత్నం చేస్తున్నా, జగన్ విసిరిన సవాల్, అంటే సీబీఐ విచారణకు సిద్దపడకపోవడం వారి బలహీనతగా కనిపించదా! నకిలీ మద్యంతో గత ప్రభుత్వంలో 30వేల మంది చనిపోయారని ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.విశేషం ఏమిటంటే కూటమి అధికారంలోకి వచ్చాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ములకల చెరువు గ్రామం వద్ద టీడీపీ నేతలే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్నే పెట్టిన విషయం బహిర్గతం అయింది. అలాంటివి ఏవైనా జగన్ టైమ్లో కనిపించాయా? అయినా ఈ ఆరోపణలు ఏమిటో! చంద్రబాబు స్పీచ్ ఇస్తున్న టైమ్లోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి తీవ్ర ఆరోపణ చేశారే. ఈ రెండేళ్లలో 200 కోట్లు భూ దోపిడీ, ఇతరత్రా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మరి వాటిపై విచారిస్తానని ఎందుకు చెప్పలేకపోయారు.అంతేకాదు. అదే ఎమ్మెల్యే తనకు ప్రతినెల మామూళ్లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ను బెదిరించినట్లు కూడా వార్తలు వచ్చాయే!విజయవాడ టీడీపీ ఎంపీ వర్గంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల మాటేమిటి? గంజాయి, మట్టి, ఇసుక మాఫియాగా మారి ఏ విధంగా అక్రమాలు చేస్తున్నదానిపై ఎన్ని ఆరోపణలు చేసింది ఆయనకు తెలియదా? వాటిపై చర్య తీసుకోకపోగా పార్టీ కమిటీ కొలికపూడిని పిలిచి మందలించిందని వార్తలు వచ్చాయే. ఇటీవలే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పోలీస్ స్టేషన్ అడ్డగానే దందాలు చేస్తున్నట్లు జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారే. వారిద్దరు బహిరంగంగా మాట్లాడవద్దని సలహా ఇస్తే సరిపోతుందా!ఇక మహిళలను వేదించిన కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను కనీసం పిలిచి కోప్పడ్డారా? ఒక మంత్రే తనను వేధించారని ఒక ఎన్ఆర్ఐ మహిళ ఫిర్యాదు చేస్తే ఏమి చర్య తీసుకున్నారో ప్రజలకు తెలియచేసి ఉండాల్సింది కదా! ఇలా చెప్పుకుంటూ పోతే భారతం అంత అయ్యే పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వ అద్వాన్న పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతుంది.ఇక మంత్రి లోకేష్ డీఎస్సీపై ఐదో సారి చర్చకు రమ్మన్నా రావడం లేదని సభలలో ఉపన్యాసాలు ఇచ్చి, జనం వాటినే నమ్మాలని తండ్రి మాదిరే అనుకుంటే ఎలా? జగన్ విసిరిన సీబీఐ సవాల్ను దమ్ముగా ఎదుర్కుని స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరగలేదని రుజువు చేసుకోవచ్చు కదా! చంద్రబాబు, లోకేష్లు తమను తాము పొగుడుకుంటే పొగుడుకోవచ్చు. కాని ఎదుటివారిపై నిందలు మోపే ముందు, అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు అవి తమకు కూడా తగులుతాయేమో చూసుకుని మాట్లాడితే వారికే మంచిది కదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
శిలాఫలకం తప్ప... వెలిగొండకు నువ్వు చేసిందేమిటి? బాబు క్రెడిట్ చోరీపై జగన్ రియాక్షన్
-
శిలాఫలకమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ది
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ చరిత్రను మార్చేలా కొన్నాళ్లుగా సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారం, ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి.. క్రెడిట్ చోరీ యత్నాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు చరిత్ర చాలా స్పష్టం.. శిలాఫలకం మాత్రమే మీది.. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ గారిది.. కీలక జంట సొరంగాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది.. ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ’ అంటూ సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు.. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరంటూ సీఎం చంద్రబాబుకు చురకలంటించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టి.. నల్లమలసాగర్ను నింపి.. రైతులకు సాగునీరు, ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించాలని హితవు పలికారు. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ ఆదివారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..నాన్న స్వప్నం సాకారం కావడం సంతోషంగా ఉంది..నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం.. మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం.. ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని. కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. చంద్రబాబు గారూ వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది. సంకల్పం, సమగ్ర నిర్మాణం వైఎస్సార్ గారిది.. కీలక జంట సొరంగాల పూర్తి ఘనత మా ప్రభుత్వానిది.. ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ.1996 నుంచి 2004 వరకూ ఖర్చు చేసింది కేవలం రూ.పది లక్షలే.. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే.. చంద్రబాబు గారూ మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావుడిగా, అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చు చేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది.జలయజ్ఞంలో వెలిగొండకు సమగ్రరూపం ఇచ్చిన వైఎస్సార్వైఎస్సార్ గారు ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు. వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైఎస్సార్ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికి కూడా బ్రేక్త్రూ సాధించలేకపోయారు. మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తి చేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేం సిద్ధం చేశాం. మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు? ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?వెనుకబడిన ప్రాంతానికి తీవ్ర అన్యాయం..మరోవైపు మీరు అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధం చేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు? నల్లమలసాగర్కు నీటిని ఎందుకు తరలించలేదు? రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు? మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా? చంద్రబాబు గారూ ప్రచార ఆర్భాటాన్ని పక్కన పెట్టండి. నల్లమలసాగర్ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి. -
‘వెలిగొండ’లో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి? చంద్రబాబు క్రెడిట్ చోరీకి వేరే ఇంకేం సాక్షాలు కావాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా మరో క్రెడిట్ చోరీకి సిద్ధమయ్యారు! విశాఖలో డేటా సెంటర్.. భూముల సమగ్ర రీ సర్వే,.. గత ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకుంటున్న రీతిలోనే ఆయన దృష్టి తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. ఈ నెల 31న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాలు (ట్విన్ టన్నెల్స్) ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు విడుదల చేస్తున్నానని.. మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్నానంటూ ‘ఎక్స్’ ద్వారా సీఎం చంద్రబాబు గొప్పగా అబద్ధాలు చెబుతుంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. వాస్తవానికి వైఎస్సార్సీపీ హయాంలో రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండలో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్ టన్నెల్స్)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. నల్లమలసాగర్లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్టైమ్ సెటిల్మెంట్ కింద నిర్వాసితులకు రూ.1,301.56 కోట్లతో పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. 96 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి 2024 జనవరి నాటికే పునరావాసం కల్పించింది. మిగతా 7,225 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వైఎస్ జగన్కు పేరొస్తుందనే నిర్వాసిత కుటుంబాలకు 26 నెలలుగా పునరావాసం కల్పించకుండా.. నల్లమలసాగర్కు కృష్ణా జలాల తరలింపుపై చంద్రబాబు సర్కార్ జాప్యం చేస్తూ వచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. నిర్వాసిత కుటుంబాలకు రూ.1,301.56 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.758 కోట్లను ఇటీవల బాబు సర్కార్ చెల్లించింది. బాబు సర్కారు జాప్యం వల్ల ప్రకాశం బ్యారేజీ మీదుగా 2024–25, 2025–26లో వరుసగా 848.96 టీఎంసీలు, 1,652.12 టీఎంసీల చొప్పున కృష్ణా వరద జలాలు సముద్రంలో కలిశాయని సాగునీటి రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హయాంలో నాసిరకంగా ఫీడర్ కెనాల్ పనులు..గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఖరీఫ్ సీజన్లోనే కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు విడుదల చేసే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్ను అనుసంధానం చేసే ఫీడర్ ఛానల్ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన 5.2 కి.మీ.లలో గట్లు (ఎంబాక్మెంట్) పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2024లో కురిసిన వర్షాలకు టీడీపీ హయాంలో పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్ చానల్ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్ ఛానల్ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్వాల్, మిగతా చోట్ల కాంక్రీట్ లైనింగ్ పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. అస్మదీయ కాంట్రాక్టర్కు అధిక ధరలకు బాబు సర్కార్ కట్టబెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ముడుపులు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.‘కొండంత’ స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత వైఎస్సార్..⇒ శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ. పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1991–93లో డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు. ⇒ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్ ద్వారా 62 వేల ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. ⇒ జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్ ఛానల్ పనులను చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్ పనులను చేపట్టారు.ఇంజినీరింగ్ అద్భుతం.. నల్లమలసాగర్ వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్)ను కలుపుతూ మూడు డ్యామ్లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్ సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్ అద్భుతమని సాగునీటి రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. నల్లమలసాగర్ పనులను మహానేత వైఎస్సార్ పూర్తిచేశారు.హామీని నిలబెట్టుకున్న వైఎస్ జగన్..⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని తన పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వెలిగొండను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. ⇒ 2014–19 మధ్య టీడీపీ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసే హెడ్ రెగ్యులేటర్ పనులను అదే ఏడాది (2021) పూర్తి చేయించారు. ⇒ రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్ జగన్.. రివర్స్ టెండరింగ్ నిర్వహించి, టీడీపీ సర్కార్ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు. ⇒ రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్ పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టారు. తద్వారా రికార్డు సమయంలో 7.685 కి.మీల పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేశారు. ⇒ శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. ⇒ 2014–19లో టీడీపీ సర్కార్ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్ క్లియర్ చేశారు. ⇒ 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. ⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. ⇒ వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్ జగన్ రూపొందించిన ప్రణాళికలో భాగంగా దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండస్ట్రియల్ హబ్కు 2.58 టీఎంసీలు, పామూరు నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుపాక్చరింగ్ జోన్)కు 1.27 టీఎంసీల సరఫరాకు లైన్ క్లియర్ చేశారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృది్ధకి ఊతం ఇవ్వడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.అప్పుడూ ఇప్పుడూ బాబు సర్కార్ దోపిడీ..2014–19 మధ్య జరిగిన అక్రమాలను కడిగేసిన కాగ్⇒ ఎన్టీఆర్కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు.. అదే ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసమే వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.⇒ విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజెక్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు సర్కార్ దోపిడీకి నిదర్శనం. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపెట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)ల మరమ్మతుల కోసం కాంట్రాక్టర్లకు రూ.66. 44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. ⇒ 2017.. 2018.. 2019.. ఇలా ఎప్పటికప్పుడు వెలిగొండ పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తూ వచ్చిన చంద్రబాబు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు మరో కాంట్రాక్టర్కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో ఈ దోపిడీని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కడిగి పారేసింది. -
చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి : చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ చోరీపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తాను చేయని దానిని చేసినట్లు చెప్పుకోవడంపై వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. దీనిలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఎవరి హయాంలో ఏం చేశారో లెక్కలతో సహా వివరించారు వైఎస్ జగన్. ఈ మేరకు ‘ ఎక్స్’లో పోస్ట్ చేశారాయన. చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ యత్నాలు‘నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని. కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చే పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే. చంద్రబాబూ.. వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం. శిలాఫలకం మాత్రమే మీది… సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది. కీలక జంట సొరంగాల పూర్తి మా ప్రభుత్వానిది. మీరు ఖర్చు చేసింది కేవలం రూ. 10 లక్షలుఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ. చంద్రబాబూ… మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజాలను దాచలేరు. 1996లో హడావిడిగా అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు. వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైఎస్సార్ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్యాయి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికీ కూడా బ్రేక్త్రూ సాధించలేకపోయారు. మొత్తం మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తిచేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట్టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేము సిద్ధం చేశాం. మరి మొత్తం ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు?, ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?, అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి మరోవైపున తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు?, వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు?చంద్రబాబూ.. ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండిప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?, వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?, జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధంచేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలేదు?, నల్లమలసాగర్కు నీటిని ఎందుకు తరలించలేదు?, రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ఆలస్యం చేశారు?, మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా?, చంద్రబాబూ.. ప్రచారపు ఆర్భాటాన్ని పక్కనపెట్టండి. నల్లమలసాగర్ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి.పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి’ అని డిమాండ్ చేశారు. నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక… pic.twitter.com/nDineOXzWb— YS Jagan Mohan Reddy (@ysjagan) August 30, 2026 ఇదీ చదవండి:బాబూ.. చిరిగిన బ్యాగూ! -
వెలిగొండ వెలుగులు జగన్ వే
-
అంబటి రాంబాబుకి జగన్ పరామర్శ
-
అంబటి రాంబాబుకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి అంబటి రాంబాబును వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన గుండెకు డాక్టర్లు స్టంట్లు వేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అంబటి చికిత్స పొందుతున్నారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.ఇదీ చదవండి: బాబూ..! చిరిగిన బ్యాగూ! -
అవమానించిన ఒక్కొక్కరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి.. జగనన్న 2.0 మీ ఊహకే వదిలేస్తున్న
-
తెలుగు భాషా దినోత్సవం.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో.. సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న… pic.twitter.com/tTKbMnguS0— YS Jagan Mohan Reddy (@ysjagan) August 29, 2026 -
వైఎస్ జగన్ ప్రశ్నలకు టీడీపీ ఉక్కిరిబిక్కిరి..!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న బాటింగ్ను టీడీపీ తట్టుకోలేకపోతోందన్న దిగులు ఎల్లో మీడియాకు బాగానే పట్టుకున్నట్లు ఉంది. అందుకే జగన్ మీడియా సమావేశంపై నేరుగా దాడి చేయడానికి ఈ తెలుగుదేశం మీడియా పడరాని అగచాట్లు పడుతోంది.జగన్ బుధవారం నాడు కరువు సమస్య, బీసీల రిజర్వేషన్లపై ప్రభుత్వ డ్రామా, గంజాయి ప్రదేశ్గా మారిన ఏపీ, వెలిగొండ క్రెడిట్ చోరీ మొదలైన అంశాలపై డిటైల్డ్గా తన మీడియా సమావేశంలో మాట్లాడారు. వీటన్నిటికి ఆయన ఆధారాలు, సాక్ష్యాలు చూపుతూ తన వాదన వినిపించారు. వాటికి నేరుగా సమాధానం ఇవ్వలేక, టీడీపీ నేతలు, మంత్రులు కప్పదాటు వైఖరి ప్రదర్శించారు. కాని ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి మాత్రం రాజును మించిన రాజభక్తితో, టీడీపీని కాపు కాసే బాధ్యత తమదే అన్నట్లుగా జగన్పై నేరుగా దాడి చేసింది. జగన్ చెప్పినవి అబద్దాలని రాసేసుకుంది. ఆ రకంగా జగన్పై బురద వేసి ఆ మీడియా సంతృప్తి చెందింది.జగన్ చెప్పిన విషయాలను పరిశీలిద్దాం.. ముందుగా కరువు ప్రస్తావనను జగన్ చేశారు. రాష్ట్రంలో కరువు ఉందన్నది వాస్తవమే కదా!స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఆ విషయాన్ని చెబుతున్నారు కదా! అయినా పట్టిసీమ నుంచి నీరు వచ్చేసిందని చెప్పి ప్రకాశం బారేజీ వద్ద పూజలు చేసి నీళ్లు వదలి కృష్ణా డెల్టా కింద మంత్రులు నీరు ఇస్తున్నట్లు చెప్పింది అవాస్తవమా? ఆ సందర్భంలో వీరంతా ఏ రకంగా గప్పాలు పోయారో తెలియదా! ఆ విషయాలనే కదా జగన్ గుర్తు చేసింది.వాటికి ఆధారంగా ఎల్లో మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను కూడా చూపించారు కదా! కాకపోతే ఎల్లో మీడియా, టీడీపీ నేతలు కరువు అన్న పదాన్ని వాడకుండా ఎల్నినో అని చెప్పుకుని జనాన్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు. మంత్రుల మాటలు నమ్మి పంటలు వేసుకున్న రైతులు నష్టపోతున్నారని జగన్ తెలిపారు. ఇందులో తప్పేముంది? అబద్దం ఏమి ఉంది. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ మొదలైన ప్రాంతాలలో నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్న వార్తలు ఎల్లో మీడియాలో కూడా వచ్చాయి కదా!రైతులను, కరువు బారిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవడం లేదని జగన్ విమర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు కరువును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న నిర్దిష్ట చర్యలేమిటి? ఇంకా ప్లానింగ్లోనే ఉన్నామని కదా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నది. పలు చోట్ల ముఖ్యంగా రాయలసీమ నుంచి వలసలు ఎలా సాగుతున్నాయో పత్రికలలో వార్తలు వచ్చాయి కదా!ఆగస్టు 11నాటికి శైశైలంలో 879 అడుగుల నీటి మట్టం వచ్చినా పోతిరెడ్డిపాడు నుంచి నీరు ఎందుకు ఇవ్వలేదన్నది జగన్ ప్రశ్న. రైతులకు ఇవ్వకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు వంటి పాలకులు ఉంటారనే, తాము రాయలసీమ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ను ఆరంభించామని జగన్ తెలిపారు. ఇది వాస్తవమే కదా! ఈ స్కీమ్ను జగన్ వేగంగా ముందుకు తీసుకువెళుతున్న సమయంలో ప్రభుత్వం మారడం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారని చంద్రబాబు ఈ స్కీమ్ను నిలిపివేయడం కరెక్టే కదా! రేవంత్ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పినా చంద్రబాబు ఖండించలేకపోయారే. మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులు జగన్ చేసిన విమర్శలకు జవాబు ఇస్తూ ప్రతి విమర్శలు చేశారే కాని, ప్రభుత్వం ఇంతవరకు ఏ చర్యలు తీసుకున్నది వివరించినట్లు కనిపించలేదు.జగన్ టైమ్లో రైతులకు ఉచిత భీమా అమలు చేస్తే ఈ ప్రభుత్వం దానిని ఎందుకు కొనసాగించలేకపోయింది? రామానాయుడు మాత్రం కరువు నేపథ్యంలో తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని, ఆ తర్వాత ఆరుతడి పంటలకు నీరు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కరువు సమస్య కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక పరిస్థితులు గడ్డుగా మారాయి. వాటిని ఎలా నివారిస్తారన్న జగన్ ప్రశ్నకు బదులు ఇచ్చినట్లు లేదు.జగన్ టైమ్లో వివిధ స్కీమ్ల ద్వారా గ్రామీణ ప్రాంతాలవారికి ఆర్థిక సాయం అందించడంతో చేతిలో డబ్బులు ఆడాయి. వ్యాపారాలు కూడా సాగాయని ఆర్థిక నిపుణులు కూడా అంగీకరించారు. జగన్ టైమ్లో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వస్తే ఈ ఎల్లో మీడియా ఎంత నీచమైన రాతలు రాసిందో మర్చిపోయి ఉండవచ్చు. ప్రపంచం అంతటా ఏర్పడినట్లే ఏపీలో కూడా అప్పట్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది. కేంద్రం సూచనల ప్రకారం రుణం తీసుకోవలసి వచ్చింది. మిగిలిన రాష్ట్రాలకన్నా మెరుగ్గా కరోనాను జగన్ ప్రభుత్వం ఎదుర్కుంది. అయినా జగన్ ఏపీని శ్రీలంక చేసేస్తున్నారని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాసిందా? లేదా? ఉద్యోగులకు జీతాలు ఆలస్యం అయితే కోర్టులలో కేసులు వేయించి వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశాలు తెచ్చింది ఎవరో తెలియదా!తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లు అని చంద్రబాబు అంటే అదేమిటని ప్రశ్నించకపోగా, ఎల్లో మీడియా ఔను, ఔను అని భజంత్రి వాయించాయే. ఇప్పుడు కరువు సమస్య వల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతుంటే వారిని మభ్య పెట్టడానికి ఎల్లో మీడియా ఎల్నినో, యుద్దం అంటూ సాకులు ప్రచారం చేస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు క్రెడిట్ గురించి కూడా ఎల్లో మీడియా తనదైన శైలిలో టీడీపీ ఖాతాలో వేయడానికి తహతహలాడుతోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ లేకపోతే ఈనాటికి కూడా ఈ ప్రాజెక్టు వాస్తవరూపం దాల్చేది కాదన్నది పచ్చి నిజం.జగన్ రెండేళ్ల క్రితం సొరంగాలకు ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ,నిర్వాసితులకు పరిహారం చెల్లించి రిజర్వాయిర్లోకి నీరు తరలిస్తామని ప్రకటించారు. ఈలోగా ప్రభుత్వం మారింది. రెండేళ్ల క్రితం ఈ పని పూర్తి చేయకుండా ఆలస్యం చేసింది కూటమి ప్రభుత్వం కాదా! వైఎస్సార్సీపీ, జగన్ కలిసి సుమారు 31 కిలోమీటర్ల మేర సొరంగాలు తవ్విస్తే, చంద్రబాబు హయాంలో 6.68 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తి చేశారన్నది నిజమా? కాదా? ఈ క్రెడిట్లో ఎవరి వాటా ఎంతో చెబితే తప్పుకాదు. మొత్తం క్రెడిట్ను చోరీ చేయాలని చూస్తేనే ఇబ్బంది. ఇక ఏపీ గంజాయి ప్రదేశ్గా మారిందని జగన్ ఆరోపణ.ఈ మధ్యనే ఏకంగా పోలీసుల వాహనంలోనే గంజాయి తరలించిన వార్తను ఎల్లో మీడియా మర్చిపోయిందా? నిత్యం ఎక్కడో చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. వంద రోజుల్లో గంజాయి నిరోదించి చూపుతామని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు ఎన్నికల ముందు చేసిన ప్రగల్బాలను జగన్ ప్రస్తావించారు. ఆ ప్రకారం వారు చేయలేకపోయిన విషయాన్ని జగన్ ఎండగట్టారు. ఇక బీసీల రిజర్వేషన్ల అంశాన్ని కూడా ఎల్లో మీడియా నిస్సిగ్గుగా భుజాన వేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తోంది.గతంలో జగన్ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై జీఓ ఇస్తే తప్పుపట్టారా?లేదా?దానిపై టీడీపీ నేతే కోర్టుకు వెళ్లారా?లేదా?ఆ తర్వాత అది ఆగిపోతే జగన్ పార్టీపరంగా ఆయా పదవులను ఏభై శాతం పైగా బీసీలకు ఇచ్చారే! ఆ విషయాన్ని ఆయన లెక్కలతో సహా చూపించారు. మరి చంద్రబాబు మళ్లీ ఇప్పుడు జీఓ ఇచ్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెబితే దానికి కోర్టు ఆమోదం తెలుపుతుందా?పార్లమెంటులో సంబంధిత చట్ట సవరణ చేయిస్తామని ఎందుకు టీడీపీ ప్రకటించలేదు?ఇక వైఎస్సార్సీపీ బీసీ నేతలపై కేసులు అక్రమమా? కాదా? అన్నది అందరికి తెలిసిందే. చంద్రబాబు నాయుడుతో సహా పలువురు టీడీపీ నేతలపై అప్పట్లో అవినీతి కేసులు వస్తే ఇదే ఎల్లో మీడియా గుండెలు బాదుకుని గోల, గోల చేసిందే. టీడీపీ ముఖ్యనేత పీఏ ఇంటిపై ఆదాయపన్ను శాఖ దాడి చేసి రెండువేల కోట్ల అక్రమాలను కనుగొన్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం బహిరంగ రహస్యమే కదా! ఆ కేసు ఏమైందో చెప్పి, ఆ తర్వాత వైఎస్సార్సీపీపై ఎన్ని ఆరోపణలు చేసినా ఆలోచించవచ్చు. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు అన్నట్లు టీడీపీతో పాటు ఎల్లో మీడియా ప్రవర్తిస్తున్న విషయాన్ని జనం గమనించరా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇవి కూడా చదవండి: బాబూ.. అమరావతి కథనం వెనుక అసలు కథేంటి? -
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ రాఖీ శుభాకాంక్షలు
-
వైఎస్ జగన్ చొరవతోనే సురక్షితంగా వచ్చిన మత్స్యకారులు
తిరుపతి అర్బన్: సముద్రంలో వేటకు వెళ్లి 24 రోజుల పాటు ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుమిట్టాడిన కోనసీమ మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చొరవ, కేంద్రంపై తీసుకొచి్చన ఒత్తిడే కారణమని వైఎస్సార్సీపీ నేత, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చెప్పారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 3న ఓడలరేవు నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో తాము కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్కు లేఖలు రాసి పరిస్థితి తీవ్రతను వివరించినట్లు తెలిపారు.శ్రీలంక, బంగ్లాదేశ్, మయ న్మార్ ఎంబసీలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసినట్లు చెప్పారు. పార్టీ నేత వాసుపల్లి జానకిరామ్ కోస్ట్గార్డ్ హెడ్ క్వార్టర్స్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తూ గాలింపు చర్యలు ముమ్మరం చేయించారని చెప్పారు. వైఎస్సార్సీపీ వినతికి స్పందించిన కేంద్ర ప్రభుత్వ యంత్రాంగానికి, విదేశీ ఎంబసీలకు, కోస్ట్ గార్డ్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో మత్స్యకారుల భద్రతలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గురుమూర్తి మండిపడ్డారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళితే తిరిగి ప్రాణాలతో వస్తారో, రారో అన్న దుస్థితి నెలకొందని చెప్పారు.వైఎస్ జగన్ ప్రభుత్వం మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించడంతో పాటు, వేట నిషేధ సమయంలో ‘మత్స్యకార భరోసా’ ఇచ్చి ఆదుకుందని తెలిపారు. వారికి డీప్ సీ ఫిషింగ్ బోట్లు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధంచేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ ఫైళ్లన్నీ అటకెక్కించిందన్నారు. పదే పదే ప్రమాదాలు జరుగుతున్నా ‘సేఫ్టీ ఆడిట్’ నిర్వహించలేదన్నారు. మహా రాష్ట్ర ప్రభుత్వం జాలర్లకు శాటిలైట్ ఫోన్లు ఇస్తుంటే, ఇక్కడ ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.బోట్లలోని ట్రాన్స్పాండర్లు, నావిగేషన్ పరికరాలు పనిచేయకపోయినా పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రతి బోటుకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, శాటిలైట్ ఫోన్లు ఇవ్వాలని, ట్రాన్స్పాండర్లలో సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నావిగేషన్ పరికరాలు 24 గంటలూ పనిచేసేలా సోలార్ పవర్ బ్యాకప్ ఏర్పాటుచేసి, ప్రతి బోటుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు అందించాలని కోరారు. -
మహిళలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
తాడేపల్లి. రేపు(శుక్రవారం, ఆగస్టు 28వ తేదీ) రాఖీ పండుగను పురస్కరించుకుని ఏపీలోని మహిళలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు.. ప్రతి ఒక్క పాపకు, ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు తెలియజేశారు.రక్షాబంధనం అన్నది ఆత్మీయతలూ అనురాగాల పండుగ అని గుర్తు చేసిన వైఎస్ జగన్.. అక్కచెల్లెమ్మలకు ఎప్పుడూ అన్ని విధాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం లభించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ తన సందేశంలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: పంచదార్ల కొండపై వైఎస్సార్సీపీ పోరాటానికి దిగొచ్చిన ప్రభుత్వం -
పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
కరవు ప్రమాద ఘంటికలు మోగుతున్నా కుంభకర్ణుడి నిద్ర నటిస్తారా?. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్
-
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు-ఆటో ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని పేర్కొన్నారు. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారిగా తెలిసిందని, ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమన్నారు.ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. తీవ్రంగా గాయపడిన వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని వైఎస్ జగన్ కోరారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
34% రిజర్వేషన్లు.. మహా డ్రామా
వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ.. ఓన్లీ జగన్ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి.50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లంటూ చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు మా ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకున్నాం. 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం. -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు వైఎస్ జగన్ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చాడు. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు.. అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్లు పేరిట మరోసారి చంద్రబాబు మహా డ్రామాకు దిగాడని విమర్శించారు. మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడని.. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టి వేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనేనంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలను ఆపేయడంతో పాటు సూపర్ సిక్స్, సూపర్సెవెన్ హామీలను చెత్త బుట్టలో వేసి బీసీల బతుకులను బుగ్గిపాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాజకీయంగా బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక, వారి మీద అక్రమ కేసులు పెట్టి, జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది మేమే ‘2019లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత జీవో నంబర్ 176 ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలకు సిద్ధం అయ్యాం. కానీ చంద్రబాబు తన పార్టీ నాయకుడు, తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసు వేయించాడు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నందుకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా చంద్రబాబు మరోసారి మహా డ్రామాకు దిగాడు. పైగా మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపట నాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే. బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే. అప్పుడు బీసీలకు పథకాలే పథకాలు.. వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30 లక్షల కోట్లు పంపించాం. నాన్ డీబీటీతో కలిపి కేవలం బీసీలకే రూ.1.82 లక్షల కోట్లు అందించాం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వాహనమిత్ర, చేదోడు, తోడు, కళ్యాణమస్తు, షాదీ తోఫా, సున్నా వడ్డీ వంటి పథకాల ద్వారా ఈ ప్రయోజనం బీసీ కుటుంబాలకు చేరింది. ఇవన్నీ ఒక్క వైఎస్సార్సీపీ.. ఓన్లీ జగన్ హయాంలోనే జరిగాయి. అప్పట్లో బీసీలకు చేసిన అభివృద్ధి చెబుతుంటే రోమాలు నిక్క»ొడుస్తున్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాడు. ఈ పథకాలన్నింటినీ ధ్వంసం చేశాడు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అంటూ ఇచ్చిన బాండ్లను చెత్తబుట్టలో పారేశారు. చంద్రబాబుదంతా మోసమే. నిజంగా బీసీలకు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో అందరూ ఆలోచించాలి. బీసీలు ఎదుగుతుంటే బాబు చూడలేరు రాజకీయంగా బీసీలు ఎవరైనా ఎదుగుతుంటే చంద్రబాబు ఓర్చుకోలేక అక్రమ కేసులతో జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టాడు. ఒక మహిళా ఎస్సైని అడ్డుపెట్టుకుని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి.. తప్పుడు కేసులు పెట్టి, ఆమదాలవలస నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ను జైలుకు పంపారు. టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపివేయించి, అది చేసింది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని చెప్పి.. ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షిపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు సునీల్ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో జైలుకు పంపాడు. చంద్రబాబుకు బీసీలపై ప్రేమవుంటే ఇవన్నీ చేస్తాడా? విశాఖలో ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళితే అందులో ఆరుగురు చనిపోతే, కనీసం వారిని చూడటానికి స్థానిక మంత్రి కూడా వెళ్లలేదు. ఈయన బీసీల గురించి మాట్లాడతాడు. విద్యా దీవెన, వసతి దీవెన లేక చదవులు మానేస్తున్న వారిలో అత్యధికులు బీసీలే ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. మరి చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరి హయాంలో బీసీలు బాగుపడ్డారో అందరూ ఆలోచించాలి.34% రిజర్వేషన్లకు మించి బీసీలకు పదవులు ఇచ్చాం⇒ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బీసీల తల రాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ ఐదేళ్లలో మేం తీసుకు వచ్చాం. కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34 శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.⇒ మా కేబినెట్లో 25 మంది ఉంటే, అందులో 11 మంది బీసీలే. అంటే దాదాపు 40 శాతం మంత్రి పదవులు బీసీలకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురు బీసీలను ఈ జగన్ రాజ్యసభకు పంపారు. అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం. ⇒ చంద్రబాబు 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేము 25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే అంటే 44 శాతం ఇచ్చాం. 58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకే ఇచ్చాం. అంటే 48 శాతం వారికే. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల్లో 6 అంటే 46 శాతం బీసీలకే. 13 మేయర్ పదవుల్లో 9 అంటే 69 శాతం బీసీలకే. 636 ఎంపీపీ స్థానాల్లో 239 అంటే 38 శాతం బీసీలకే. మున్సిపల్ ఛైర్మన్ పదవులు 84లో 44 అంటే శాతం బీసీలకే.⇒ 639 జెడ్పీటీసీల్లో 227 అంటే 36 శాతం బీసీలకే. 8,239 ఎంపీటీసీల్లో 3,361 అంటే 41 శాతం మంది బీసీలే. 10,536 సర్పంచుల్లో దాదాపు 4 వేల మంది బీసీలే. అంటే 38 శాతం వారికే. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39 శాతం బీసీలకే. ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో 53 బీసీలకు ఇచ్చాం. అంటే 37 శాతం ఇచ్చాం. ⇒ 139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబుకు కలలో కూడా ఆలోచన రాలేదు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ పనులు–కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చట్టం చేసి మరీ ఇచ్చాం. ఇందులో మహిళలకు కూడా 50 శాతం వాటా ఉండే విధానం మేం తీసుకు వచ్చాం. దేశంలోనే ఇది తొలిసారి. ⇒ బీసీలకు చట్ట సభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించాం. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం. అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం. -
కరువు కాటేస్తున్నా కుంభకర్ణుడి నిద్రే
జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి, విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. ఈ రోజు నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.ఇలాంటి పాలకులు ఉంటారనే... రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయలసీమ ప్రజల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత రైతులకు మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు?చంద్రబాబు ప్రభుత్వంలో డీఎస్సీ2025లో అక్రమాలు, పేపర్ లీకేజీల మీద సాక్ష్యాలు, ఆధారాలతో గత వారం సమగ్రంగా మాట్లాడా. ఏపీపీఎస్సీ గ్రూప్ృ1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలపై సాక్ష్యాలతో వాస్తవాలను వివరించా. ఈ రెండింటిపై సీబీఐ విచారణకు మేం రెడీ.. మీరు రెడీనా? అని ఛాలెంజ్ కూడా చేశా. నేను ఛాలెంజ్ చేశాక ఇంత వరకూ ఆ అంశాలపై వాళ్లు మాట్లాడలేదు. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు నేనిచ్చిన సమాధానాలపై వక్రీకరణలు చేస్తున్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం ఉందని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. జూన్లో సాధారణ వర్షపాతం కంటే 25 శాతం లోటు వర్షపాతం నమోదు అయిందని కూడా తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా, సాగుకు నీళ్లు ఇస్తున్నామంటూ జూలై 8న వెన్నుపోటు పార్టీ మంత్రులు ఫొటోలకు ఫోజులు ఇస్తూ పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీరి మాటలు నమ్మి సాగు ప్రారంభించిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రంలో తీవ్ర కరువు తాండవిస్తోందని గుర్తించటానికి కూడా చంద్రబాబు ఇష్టపడటం లేదు..’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయకట్టు చివర ఉండే ప్రతి ఎకరాకూ నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించారంటూ చేసిన ప్రచారాలను నమ్మి ఎకరాకు కనీసం రూ.15 వేలు చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీశైలంలో పూర్తి స్థాయిలో నీటిమట్టం ఉన్నప్పటికీ చంద్రబాబు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు ఇవ్వకుండా సీమ ప్రాజెక్టులన్నీ ఒట్టిపోయేలా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పులిచింతల నుంచి 10.5 టీఎంసీల కృష్ణా జలాలను తరలించేందుకు తెలంగాణ అక్రమంగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నా చంద్రబాబు కనీసం నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు, వ్యవసాయ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడం.. రైతులకు అండగా నిలవడంలో చంద్రబాబు సర్కార్ ఘోర నిర్లక్ష్యం, దారుణ వైఫల్యాలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. సీమలోనే కాదు.. కోస్తాలోనూ కరువు ఛాయలురాష్ట్రంలో కరువు ప్రమాద ఘంటికలు మోగుతున్నా చంద్రబాబులో కనీస స్పందన లేకుండా పోయింది. జూన్, జూలై, ఆగస్టు.. ఇప్పటి వరకూ 52 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 41.78 శాతం, రాయలసీమలో 52.36 శాతం.. ఇలా రాష్ట్రంలో ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఇంత దారుణమైన పరిస్థితులున్నా కుంభకర్ణుడి తరహాలో చంద్రబాబు నిద్ర నటిస్తున్నారు. రైతులకు మంచి చేస్తూ ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. జూన్ నుంచి ఆగస్టు 26వ తేదీ వరకూ సాధారణ వర్షపాతం 388.54 మిల్లీవీుటర్లు (ఎంఎం) నమోదు అవ్వాల్సి ఉండగా 189.62 ఎంఎం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలో 688కిగానూ 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. అంటే 91 శాతం రాష్ట్రం లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటోంది. ఈ 625 మండలాల్లో 434 చోట్ల 19 శాతం కంటే అధికంగా లోటు వర్షపాతం ఉంది. మరో 191 మండలాల్లో 19 శాతం నుంచి 59 శాతం వరకూ తీవ్ర లోటు వర్షపాతం నెలకొంది. ఇక 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఏఎస్ఆర్, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి జిల్లాల్లో వర్షపాత లోటు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నిత్యం కరువు ఉండే రాయలసీమ జిల్లాలే కాకుండా కోస్తాంధ్ర జిల్లాల్లోనూ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితులతో రైతాంగం, ప్రజలు అల్లాడుతుంటే దీన్ని గుర్తించడానికి కూడా వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు ఇష్టపడటం లేదు. రైతులను ప్రజలను ఆదుకోవడానికి ఏ మాత్రం అడుగులు ముందుకు వేయడం లేదు. ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలో 63 లక్షలకు పైగా ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా కేవలం 50 లక్షల ఎకరాల్లోనే సాగు నమోదైంది. అంటే దాదాపు 80 శాతానికే సాగు పరిమితం అయింది. సీమకు నీళ్లివ్వడానికి బాబుకు మనసు రాలేదురాయలసీమకు నీళ్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు ఎంతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలంలో గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఈ ఆగస్టు 11వ తేదీనే 879.50 అడుగులకు చేరుకుంది. అవకాశం ఉన్నా కూడా, పోతిరెడ్డిపాడు ద్వారా కిందకు రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు సరిపడా ఇవ్వడానికి చంద్రబాబుకు మనసు రాలేదు. శ్రీశైలంలో 880 అడుగుల్లో నీటిమట్టం ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదలవచ్చు. 880 అడుగుల నుంచి నీటిమట్టం తగ్గేకొద్దీ పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం తగ్గుతూ పోతుంది. 854 అడుగుల కంటే కిందకు నీటిమట్టం పడిపోతే... రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలనుకున్నా, ఇవ్వలేని దుస్థితి వస్తుంది. అలాంటిది ఈ రోజు పరిస్థితి గమనిస్తే శ్రీశైలం నుంచి ఎడాపెడా అటు తెలంగాణ కరెంట్ ఉత్పత్తి చేస్తుండగా, ఇటు చంద్రబాబు కూడా రైతుల గురించి ఆలోచించకుండా విద్యుదుత్పత్తి చేస్తున్నారు. రోజుకు 48 వేల క్యూసెక్కులు నీటిని వాడుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో కేవలం 7 వేల క్యూసెక్కులు ఉంటే ఔట్ఫ్లో 48 క్యూసెక్కులు ఉంటోంది. నికరంగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మూడు వారాల్లోనే శ్రీశైలం నీటిమట్టం 854 అడుగుల దిగువకు చేరుకుంటుంది. ఈ రోజు బహుశా 165 టీఎంసీల నీళ్లున్నాయి. రోజుకు 3.5 టీఎంసీల లెక్కన వాడుతూ పోతే మూడు వారాల్లో 75 టీఎంసీల మేర ఖర్చు అయిపోతాయి. 854 అడుగుల నీటి మట్టానికి వచ్చేస్తాం. దీని తర్వాత రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నా ఇవ్వలేం. ఇంతకంటే నీటిమట్టం పడిపోతే పోతిరెడ్డిపాడును ఆపరేట్ చేయలేం. మరోవైపు ఎల్నినో, కరువు కనిపిస్తోంది. జూన్, జూలై, ఆగస్టు కూడా అయిపోయింది. సెప్టెంబర్ 15 వరకే వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీశైలంలో ఎడాపెడా నీళ్లు తోడేస్తుంటే 854 అడుగుల కిందకు నిల్వలు పడిపోయాక రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా? మరి ఇప్పుడు మీరెందుకు నీరు ఇవ్వడం లేదు? అని చంద్రబాబును నిలదీస్తున్నా. ఇలాంటి పాలకులు ఉంటారనే.. రాయలసీమ లిఫ్ట్ అనేది ఒక ఇన్సూరెన్స్ ప్రాజెక్టు కింద రాయల సీమ ప్రజల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కట్టడం మొదలు పెట్టాం.ఒక్క పైసా ఇవ్వని దుస్థితి2025 అక్టోబర్లో మోంథా తుపాను వచ్చి రైతులు నష్టపోతే ఇప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పైసా సాయం చేయలేదు. ఉచిత పంటల బీమాను నాశనం చేశారు. సీజన్ ముగిసేలోపే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశారు. ఈ–క్రాప్, రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు. అగ్రి ల్యాబ్్సను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేని దుస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తెచ్చింది. మా హయాంలో ‘సీఎం యాప్’ ఉండేది. ప్రతి ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలతో పోస్టర్లు ప్రదర్శించే వాళ్లం. ఆ ఆర్బీకే పరిధిలో గిట్టుబాటు ధరలు రాని పరిస్థితుల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రభుత్వాన్ని అలెర్ట్ చేసేవారు. తక్షణమే జాయింట్ కలెక్టర్/మార్క్ఫెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రంగంలోకి దిగేవారు. పంటలు కొనుగోలు చేసి మార్కెట్లో పోటీ సృష్టించేవారు. దీంతో రేట్లు పెరిగేవి. ఈ మాదిరిగా మా హయాంలో ఐదేళ్లలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రూ.7,800 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా నిలిచాం. గిట్టుబాటు ధరలు ఇప్పించాం. ఇప్పుడు ఆ వ్యవస్థను చంద్రబాబు పూర్తిగా నాశనం చేశారు. చివరకు రైతులకు సున్నా వడ్డీ పథకాన్నీ రద్దు చేసేశారు. పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ కాకుండా అన్నదాతా సుఖీభవ ద్వారా ఏటా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మూడేళ్లకు రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా ఇచ్చిందేమో రూ.19 వేలు. ఏకంగా రూ.41 వేలు ఎగ్గొట్టాడు. ఆదుకునే ఆలోచన ఉందా బాబూ?ఇంత తీవ్రమైన కరువు పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీలు, ప్రజలను చంద్రబాబు ఆదుకున్నారా? అసలు ఆదుకునే ఆలోచన అయినా ఆయనకు ఉందా? ఎంతసేపూ మాపై తప్పుడు ప్రచారం చేయడం, అబద్ధాలు, టాపిక్ డైవర్షన్, రెడ్బుక్పైనే ధ్యాస పెడుతున్నారు. కరువు సమయంలో ప్రజలను ఆదుకోవాలనే ధ్యాస లేదు. జూన్, జూలై, ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే వర్షాలు పడతాయి. అప్పుడు ఖరీఫ్ సీజన్ నడుస్తుంది. జూన్లో 25 శాతం, జూలైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. ఆ రెండు నెలల్లోనే సగటున 52 శాతం లోటు వర్షపాతం కనిపించింది. ఇంత లోటు వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళిక (కంటింజెన్సీ ప్లాన్) ఏమైంది? ఆగస్టులోనే దాన్ని అమలు చేసి ఉండాలి. కనీసం అప్పుడైనా రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇచ్చి ఉంటే ఆగస్టు, సెప్టెంబర్లో కొద్దో గొప్పో కురిసే వర్షాలతో పంటలు పండి రైతులు కొంతైనా బాగుపడేవారు. అలసందలు, ఉలవలు, నువ్వులు, మినుములు, జొన్నలు, పెసలు ఇలాంటివన్నీ ప్రత్యామ్నాయ పంటలు. మరి ఎంత మందికి మీరు ప్రత్యామ్నాయంగా ఉచిత విత్తనాలు ఇచ్చారు? విత్తనాల పంపిణీ ఎందుకు జరగలేదు? ఇప్పటికే పంటలు వేసుకుని నష్టపోయిన రైతులకు ఏం సహాయం చేశారు? వర్షపాతం జూలై చివరి నాటికి 52 శాతం లోటు ఉన్న నేపథ్యంలో కరువు పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఎదుర్కొనే వ్యవస్థ (డ్రౌట్ మానిటరింగ్ సెంటర్లు) పూర్తి స్థాయిలో అప్రమత్తమై ఉండాలి. జిల్లా కంటింజెన్సీ ప్లాన్లు అమలై ఉండాలి. విపత్తు నిర్వహణ ప్రణాళిక (క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్) అమలులోకి వచ్చి ఉండాలి. ప్రతి జిల్లాలో డ్రౌట్ కంటింజెన్సీ సెల్ ఏర్పాటై ఉండాలి. కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం డ్రౌట్, రిసీలియంట్ షార్ట్ డ్యూరేషన్ సీడ్ స్టాక్స్ పంపిణీ రైతులకు జరిగి ఉండాలి. మరి ఇవన్నీ జరిగాయా? ఆగస్టు నెల ముగుస్తోంది. సెప్టెంబర్ 15 తరువాత వర్షాలు కూడా పడవు. ఇక ఆ తర్వాత మీరేమిచ్చినా ఎవరికి ఉపయోగం? వ్యవసాయ రంగంపై ఆధారపడిన కూలీలకు ఈపాటికే అదనంగా ఉపాధి హామీ పనుల కల్పన ప్రారంభమై ఉండాలి. పేదలకు ఆహార భద్రత కార్యక్రమాలు ఇప్పటికే మొదలవ్వాలి. జిల్లాలవారీగా పశువులకు మేత సమకూర్చి ఉండాలి. మేత అందుబాటులో ఉన్న రాష్ట్రాల నుంచి సేకరణ జరిగి ఉండాలి. మరి ఇవన్నీ ఎందుకు అమలు కాలేదు? సీఎంగా చంద్రబాబు ఏం చేస్తున్నారు? గుండెల మీద చేయి వేసుకుని తనను తాను చంద్రబాబు ప్రశ్నించుకోవాలని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. కనిష్ట స్థాయిలో సీమ డ్యామ్లలో నీటి నిల్వలురాయలసీమలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వల పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. తెలుగు గంగ కెనాల్పై ఆధారపడిన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 180 టీఎంసీలు అయితే ప్రస్తుతం కేవలం 55 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఇందులో డెడ్ స్టోరేజ్ 14 టీఎంసీలు తీసేస్తే అందుబాటులో ఉన్నది 41 టీఎంసీలే. అంటే కేవలం 23 శాతం నీళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే పరిస్థితి. ఎస్ఆర్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), జీఎన్ఎస్ఎస్ (గాలేరు–నగరి) కింద ఉండే గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం 59 టీఎంసీలు. వీటిలో ఇప్పుడు కేవలం 31 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. డెడ్ స్టోరేజ్ 8 టీఎంసీలు తీసేస్తే 23 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉంటాయి. అంటే కేవలం 39 శాతం నీళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ–నీవా) కింద జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి, పత్తికొండ, కృష్ణగిరి, అడవిపల్లి నిల్వ సామర్థ్యం 8.31 టీఎంసీలు. ఇప్పుడున్న నిల్వ కేవలం 4 టీఎంసీలు మాత్రమే. డెడ్ స్టోరేజ్ 1.65 టీఎంసీలు పోనూ కేవలం 2.5 టీఎంసీల నీరే అందుబాటులో ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో కరువు తీవ్రత మరింత దారుణంగా ఉంటుందని స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ నీళ్లు మళ్లిస్తుంటే బాబు మౌనంమరోవైపు నాగార్జున సాగర్ కుడి కాల్వ, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ప్రాంతానికి చంద్రబాబు చుక్క నీరు ఇవ్వడం లేదు. ఇంకా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే.. నాగార్జున సాగర్ కింద ఏపీకి సంబంధించిన పులిచింత ప్రాజెక్ట్ ఎగువన, దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా లిఫ్ట్లు కడుతున్నా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం చింతలపాలెం మండలం పాతవెల్లటూరు దగ్గర రూ.1,450 కోట్లతో మహాత్మాగాంధీ పంప్డ్ హౌజ్ నిర్మాణాన్ని వేగంగా చేపడుతోంది. దీని ద్వారా పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలింపు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తిగా అక్రమ నిర్మాణం. అదే విధంగా తెలంగాణలోనే చింతలపాలెం మండలం బుగ్గమాదారం దగ్గర రూ.394 కోట్లతో రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా పులిచింతల దిగువన కృష్ణా నది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించాలని చూస్తున్నారు. పులిచింతల సామర్థ్యం దాదాపు 45 టీఎంసీలు అయితే ఏకంగా 10.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ల ద్వారా మళ్లించడానికి తెలంగాణ ప్రభుత్వం పనులు చేపడితే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. కనీసం మాటలు లేవు. అడిగిన దాఖలాలూ లేవు. సాగునీటికి సంబంధించి ఇంత దారుణమైన పరిస్థితులను చంద్రబాబు కల్పించారు.పబ్లిసిటీ స్టంట్తో రైతులను ముంచారు..జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయ్యాక... జూలై 8న పంటలకు నీళ్లు ఇస్తామంటూ ప్రకాశం బ్యారేజీ లాకుల దగ్గర వెన్నుపోటు పార్టీ ప్రభుత్వంలోని మంత్రులు ఫొటోలతో ఫోజులిచ్చారు. పబ్లిసిటీ స్ట్టంట్ చేశారు. వీళ్లను నమ్మి, నీళ్లు ఇస్తారనే ఆశతో కృష్ణా డెల్టాతో పాటు మిగిలిన చోట్లా రైతులు పెట్టుబడులు పెట్టి, అష్టకష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని నార్లు నాటారు. సాగుకు వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఈరోజు ఆ నార్లు ఎండుతున్న దుస్థితి. ఎకరాకు కనీసం రూ.15 వేల చొప్పున రైతులు నష్టపోయారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే.. మరోవైపు చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు.బాబు నిర్వాకంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టంకరువు వల్ల ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులు, రైతు కూలీలను, ప్రజలను చంద్రబాబు ఆదుకుంటున్నారా? అంటే అదీ లేదు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్సార్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి తీవ్ర అన్యాయం చేశారు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని భరించి కట్టుకోవాల్సిన దుస్థితి తెచ్చారు. పంటల బీమా పథకం ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం గమనిస్తే.. రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో 2022–23 ఖరీఫ్లో 1.18 కోట్ల దరఖాస్తులకు ఉచిత పంటల బీమా వర్తిస్తే.. 2026–27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందకు వచ్చాయి. ఇది స్వయంగా పార్లమెంట్లో లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు. పీఎంఎఫ్బీవై కింద రాష్ట్రాలు, సంవత్సరాల వారీగా రైతులు, పంటల బీమాలో కవర్ అయిన భూ విస్తీర్ణం, ఇతర వివరాలను స్పష్టంగా కేంద్రం పార్లమెంట్కు ఇచ్చింది. మా హయాంలో నమోదైన 1.18 కోట్ల దరఖాస్తులు ఎక్కడ? బాబు పాలనలో రైతులే ప్రీమియం కట్టుకునే పరిస్థితుల్లో 40 లక్షల దరఖాస్తులు ఎక్కడ? ప్రస్తుతం 30–33 శాతం రైతులే బీమా పరిధిలోకి వచ్చారని తెలుస్తోంది. పైగా ఇంకా దారుణం ఏంటంటే 2023–24కు సంబంధించి.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024 జూలైలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం తరపున ప్రీమియం కట్టాలి. రైతులు, రాష్ట్ర వాటాను రాష్ట్ర ప్రభుత్వం కడితే 1/3 వాటాను కేంద్రం ఇస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఏకంగా రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లింది. రూ.1,100–1,800 కోట్లు కట్టి ఉంటే రైతులకు రూ.3 వేల కోట్లు వచ్చేవి. -
ఘోర రోడ్డు ప్రమాదం
కోదాడ, కోదాడ రూరల్/సాక్షిప్రతినిధి, విజయవాడ: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురై సగం రోడ్డుమీద, సగం డివైడర్పై ఆగిపోయిన ట్రాలీ లారీని గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్డ్రైవర్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (టీఎస్ 08యుఎల్ 5112) 42 మంది ప్రయాణికులతో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సూర్యాపేట సమీపంలోని చార్జింగ్ స్టేషన్ వద్ద ఆపి బస్సు చార్జింగ్ పెట్టుకున్నారు. ఈ సమయంలో మొదటి డ్రైవర్ డ్యూటీ దిగి రెండో డ్రైవర్కు బస్సు అప్పగించాడు. హైదరాబాద్ నుంచి విజయవాడవైపు ఐరన్ పిల్లర్లలోడ్తో వెళ్తున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు కోదాడ శివారులో అదుపుతప్పి డివైడర్పైకి సగం వెళ్లి ఆగింది. ఆ తర్వాత 48 నిమిషాలకు కోదాడ శివారుకు చేరుకున్న బస్సు డ్రైవర్ ట్రాలీ లారీని గమనించకుండా వెనుకవైపు నుంచి వేగంగా ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ట్రాలీ లారీలో ఉన్న ఐరన్ పిల్లర్లు బస్సులోకి చొచ్చుకురావడంతో బస్సు కుడివైపు భాగం పూర్తిగా దెబ్బతిని డ్రైవర్ సీటు వెనుక సీట్లలో ఉన్న యాసారపు చిన్ని(32), బొల్లిపోగు మేరీ జ్యోత్స్న (29), సూరవరపు షకీనా(24), చెన్నకేశవుల నాగేంద్రబాబు(31), పడికిటి లక్ష్మీతేజ (30), కొండూరు భావన వర్ష(23) అక్కడిక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ రూరల్ ఇన్చార్జ్ సీఐ రామకృష్ణారెడ్డి, పలువురు ఎస్సైలు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ ఘటనాస్ధలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. కోదాడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.రోడ్డు మీద నిలిచిపోయిన ట్రాలీ లారీతోనే..కోదాడ దాటిన తరువాత కిలోమీటరు దూరంలో ఇనుప పిల్లర్ల లోడ్తో వెళుతున్న ట్రాలీ లారీ బుధవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ప్రమాదానికి గురై డివైడర్మీదకు దూసుకెళ్లింది. సగం టైర్లు రోడ్డుమీద, సగంటైర్లు డివైడర్పై ఉన్నాయి. లారీ డ్రైవర్ ఎలాంటి హెచ్చరిక బోర్డులూ పెట్టకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి అరగంట ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కూడా ట్రాలీ లారీని ఢీకొట్టబోయి తృటిలో తప్పించుకుంది. ఆ బస్సుకు స్వల్పంగా గీతలు పడ్డాయి.ఆ బస్సు డ్రైవర్ తన బస్సును పక్కకు ఆపి ట్రాలీ లారీ వద్దకు వచ్చి డ్రైవర్ను తీవ్రంగా హెచ్చరించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెంటనే హెచ్చరిక బోర్డులు పెట్టాలని గట్టిగా చెప్పి వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ బస్సు వెళ్లిన 15 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్తో పాటు లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను పోలీసులు అతికష్టంమీద వెలికితీశారు. కోదాడ వైద్యశాలకు తరలించారు. పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.మృతుల్లో ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులే..మృతి చెందిన ఆరుగురిది ఉమ్మడి కృష్ణా జిల్లా. వీరిలో యాసరపు చిన్ని, భావనవర్ష, షకీనా మినహా మిగిలిన ముగ్గురూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. షకీనా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంటర్వ్యూకు వెళ్లి తిరిగి వస్తూ మృత్యుఒడికి చేరారు.క్షతగాత్రుల వివరాలు» విజయవాడకు చెందిన యాసరపు సుధాకర్, కేతు రమణమ్మ, ఆదిలాబాద్కు చెందిన రాథోడ్ విశాల్లకు గాయాలు కావడంతో వారు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు, ఉన్నం యశ్వంత్ సూర్యాపేట ఏరియా వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు.» తాడేపల్లిగూడెంకు చెందిన పెద్దోజు భవానీకి తీవ్రగాయాలు కావడంతో ఆమెను ఖమ్మంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. » విజయవాడకు చెందిన గరికపాటి మనోహర్, ఏలూరుకు చెందిన బండి చందన, సాయిల అనిల్కుమార్, సుంకర విజయలక్ష్మి, కరిషపోగు వంశీ, ఆకుల నవీన్కుమార్, జి.వి. ధృవకుమార్, ఎం.జేసన్కుమార్ విజయవాడలోని పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. రేపల్లి వేదవ్యాస్ ఏలూరు ఆంధ్ర వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. గాయపడిన వారిలో వరంగల్కు చెందిన జి.అవినాష్ ఉండగా.. ఆయన ఎక్కడ చికిత్సపొందుతున్నాడన్న వివరాలు తెలియరాలేదు.తీవ్ర విషాదకరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్సాక్షి, అమరావతి: హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత అధికారులను కోరారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, విషమ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు!
చంద్రబాబు పాలనలో ఈ రాష్టంలో ఏ పంటకూ రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. కానీ.. ఒక్క గంజాయికి మాత్రం గిట్టుబాటు ధర వస్తోంది. గంజాయి రవాణా స్థాయి నుంచి మాఫియా స్థాయికి చేరింది. పోలీసులనే వాటాదారులుగా చేసి చినబాబు, పెదబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు.నేరస్తులు, పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ కుమ్మక్కై ఈ దందా నడుపుతున్నారు. రేంజ్లుగా విభజించి సిండికేట్గా ఫామ్ అయ్యి.. ఆర్గనైజ్్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు.నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడింది. విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సొహైల్ను విశాఖలో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడన్నారు. అసలు అతను తప్పించుకున్నాడా? తప్పించబడ్డాడా? జూన్ 9న ఘటన జరిగితే ఇప్పటి వరకు సొహైల్ను పట్టుకోలేకపోయారు.పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్.. బాధ్యత గల డిపార్టుమెంట్.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. – మాజీ సీఎం వైఎస్ జగన్సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు పాలన సర్వం గంజాయి, డ్రగ్స్ మయం అని, మట్టి, ఇసుక, క్వార్ట్జ్, సిలికా, కల్తీ లిక్కర్ అన్నింటా మాఫియానేనని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డారు. ఒకవైపు రాజకీయ వేధింపులకు పాల్పడుతూ, తప్పుడు కేసులు పెడుతూ.. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా పంచేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థను చంద్రబాబు సర్కార్ దిగజార్చిన తీరును వీడియోలు ప్రదర్శించి చూపుతూ.. ఫోటోలు, సాక్ష్యాధారాలు చూపుతూ కడిగిపారేశారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..ప్రతి వీధికీ బెల్ట్ షాపు..‘‘రాష్ట్రంలో ఒకవైపు మట్టి, ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియానే. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను వాళ్లకు నచ్చినవాళ్లకు, వాళ్ల మనుషులకు, బంధువులకు పప్పుబెల్లాలకు కట్టబెడుతున్నారు. రాజధాని పేరుతో అమరావతిలో బిల్డింగ్లు ఎస్ఎఫ్టీకి రూ.21 వేల నుంచి 22వేలు దాటింది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను శెనక్కాయలు, బఠాణీలకు అమ్మేస్తున్నారు. విలువైన భూమి ఎక్కడ కన్పించినా వదలడంలేదు. విశాఖపట్నంలో ఏ భూమినీ వదలడంలేదు. స్కాములు చేస్తున్నారు. ఇవన్నీ గాక డ్రగ్స్, గంజాయి.. బెల్ట్ షాపుల పేరిట కల్తీ లిక్కర్. ప్రతి ఊరుకు, ప్రతి వీధికి చంద్రబాబు తీసుకుపోయాడు. ఇదే రాష్ట్రంలో జరుగుతున్న పాలన. ఎస్సైలు జేమ్స్బాండ్లు అయితే.. చర్యలెందుకు?నిజంగానే ఎస్పీ చెబుతున్నట్టుగా సమాచారం మేరకు రెయిడ్ చేశారంటే.. డీఎస్పీ చెబుతున్నట్టు ఇద్దరు ఎస్సైలు వెళ్తుంటే.. రోడ్డు పక్కన ఒక వ్యక్తి అనుమాస్పదంగా కన్పిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలేసి పారిపోయి ఉంటే.. జేమ్స్బాండ్ 117 మాదిరిగా ఇద్దరు ఎస్సైలు ఛేజ్ చేసి ఉంటే.. వాళ్లకు నువ్వేం చేస్తావ్? శభాష్ అంటూ వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, సీఎం మెడల్, ఇంకో మెడల్ ఇచ్చేలా చేస్తావ్. కానీ అంతటి జేమ్స్బాండ్లకు వీఆర్ ఎందుకు ఇచ్చారయ్యా? నువ్వే ఒకవైపు వాళ్లు జేమ్స్బాండ్లు అంటున్నావ్.. నువ్వే మళ్లీ వాళ్లను వీఆర్ అంటున్నావ్.. చార్జీషీటు అంటున్నావ్.. యాక్షన్ అంటున్నావ్.. మళ్లీ ఇంకొక పక్కన డీఎస్పీ, ఎస్పీ అందరూ వారిని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో గంజాయి వదిలి బైక్లో పారిపోయాడంటూ ఎవరిని ఇరికిస్తారో పాపం. ఇప్పటికే ఇరికించే కార్యక్రమాలు రాష్ట్రంలో చాలా చేస్తున్నారు.పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో!నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందనేది చెప్పడానికి మరో ఉదాహరణ.. మొన్న విజయవాడలో సీఐ వేధింపులు భరించలేక వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతికుమార్ కుటుంబం చేస్తున్న ఆరోపణ ఏంటి? నా కొడుకు చేత చేయకూడని పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ఇంకో పిల్లాడు సాయికృష్ణ పోలీస్ స్టేషన్లోనే హత్యకు గురై బూడిద కూడా దొరకని పరిస్థితి. ఆ వ్యవహారంలో కూడా ఇలాంటి చర్చే నడుస్తోంది. నిజంగా వ్యవస్థ అన్నది ఏ స్థాయికి దిగజారిపోతుందనేందుకు ఇవన్నీ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్. గ్రానైట్ మాఫియా నుంచి చినబాబు, పెదబాబుకు కలెక్షన్లుఅద్దంకి ఘటనలో వస్తున్న సమాచారం.. ఆ తర్వాత జరుగుతున్నవి చూస్తా ఉంటే.. గ్రానైట్ మాఫియా నుంచి పోలీసులే కలెక్షన్ చేసి ఎమ్మెల్యేకు ఇంత? చినబాబుకు ఇంత? పెదబాబుకు ఇంత? పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ మత్తులోకి వెళ్లిపోయారు. ఆ మత్తులోనే ఎస్సైలు కారులో వెళ్తూ దారిలో ఇదంతా జరిగింది. నిజంగా పోలీసుల సౌలభ్యం కోసం ఐజీలకు రాయలసీమ, కోస్తా అనే రేంజ్లు ఇస్తారు. ఫస్ట్టైమ్ ఏం చూస్తున్నామో తెలుసా? రేంజ్లుగా విభజించి సిండికేట్గా ఫామ్ అయ్యి.. కలెక్షన్ల వసూళ్లలో పాత్రధారులుగా పోలీసులే ఉండటం. ఎమ్మెల్యేల మద్దతుతో వసూళ్లు చేసి చినబాబుకు ఇంత, పెదబాబుకు ఇంత? అని ఆర్గనైజ్్డగా గంజాయి మాఫియాను నడుపుతున్నారు. కుప్పంలోనూ విచ్చలవిడిగా గంజాయి..ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి, గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వాళ్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికారపార్టీకి చెందిన నేత అనుచరులు తమిళనాడులో 220 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. ఇవన్నీ నిజాలు. కుప్పం టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. చంద్రబాబు పాలనలో సర్వం గంజాయి మయం.. సర్వం దోపిడీ మయం.. సర్వం డ్రగ్స్ మయం.. సర్వం నకిలీ లిక్కర్ మయం..క్రమశిక్షణా చర్యలంటూ కప్పిపుచ్చడమెందుకు?» మరి ఇంత జరిగిన తర్వాత కూడా దాన్ని కవరప్ చేసేందుకు ఏంచేశారో గమనించాలి. (వీడియోలు ప్రదర్శించి వివరించారు.) డీఎస్పీ చెబుతున్న మాటలకు.. ఎస్పీ చెబుతున్న మాటలకు.. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ రిపోర్టుకు పొంతనలేదు. డీఎస్పీ, ఎస్పీ, ఎఫ్ఐఆర్లలో మూడు వేర్వేరు వెర్షన్లు చెప్పారు.» ఇద్దరు ఎస్సైలు కారులో వెళ్తుంటే.. రోడ్డు పక్కన అనుమానాస్పదంగా వ్యక్తి కన్పిస్తే.. ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్పై పారిపోతుండగా.. వీరిద్దరు కారులో ఛేజ్ చేసి పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగిందని దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ చెప్పాడు.» కాదు కాదు ముందస్తుగానే సమాచారం వచ్చినందున.. ఆ సమాచారం మేరకు రెయిడ్ చేశామని ప్రకాశం జిల్లా ఎస్పీ అంటాడు. » ఎఫ్ఐఆర్ కాపీలో ఇద్దరు ఎస్సైల వాంగ్మూలం చూడండి. ఇద్దరు ఎస్సైల్లో ఒక ఎస్సై కొడుక్కి కడుపు నొప్పి వచ్చిందంట. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బల్లికురవ ఎస్సై పిలిస్తే.. సంతమాగులూరు ఎస్సై వెళ్లాడంట. కాంట్రడిక్షన్ చూడండి. మూడు వెర్షన్స్ ప్లే చేస్తాను చూడండి. (డీఎస్పీ, ఎస్పీ వీడియోలు ప్లే చేసి చూపించారు). » గంజాయిని సీజ్ చేశారని, వేగంగా వెళ్లే క్రమంలో ఆటోను ఢీకొట్టారని, ప్రమాదం జరగడంతో 108కు ఎస్సై ఫోన్ చేశాడని, గాయపడిన వారిని ఎస్సై అంబులెన్స్లో ఎక్కించి పంపించాడని ఎస్పీ చెప్పాడు. కానీ 108 రికార్డులో సమాచారం ఇచ్చింది స్థానికుడు అని రిపోర్టు అయ్యి ఉంది. చంద్రబాబు వచ్చాక 108 కాంట్రాక్ట్ తమ వాళ్లకే కట్టబెట్టారు. ఆ నిర్వాహకులే.. స్థానికుడు సమాచారం ఇచ్చినట్టు 108 పేషెంట్ కేర్ రికార్డులో పేర్కొన్నారు. » ఎస్సైలు ఆ రోజు మత్తులో కారులో వెళ్తూ ఆటోను ఢీకొట్టారు. ఆటోలో ఉన్న వారు గాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. కారు నడుపుతున్న ఎస్సై, వెనుక సీట్లో కూర్చున్న ఇద్దరు ఎస్సైలు మత్తులో ఉన్నారు. ఎస్సైలు ప్రయాణిస్తున్న ఆ కారులో గంజాయి ఉంది. లిక్కర్ బాటిల్ ఉంది. పోలీస్ యూనిఫాం ఉంది. » ఇన్ని కన్పిస్తుంటే.. వాళ్లను డీఎస్పీ రక్షించేందుకు ప్రయత్నం చేస్తాడు.. తప్పుడు వాగ్మూలం ఇస్తాడు. వీడియోలు తీసినప్పుడు సీఐ బెదిరిస్తాడు.. వీడియోలు తీయొద్దని. వీడియోలు, ఫొటోలు తీస్తే అరెస్టు చేస్తానని బెదిరిస్తాడు. ఐపీఎస్ చేసిన ఎస్పీ కూడా గంజాయి తరలిస్తున్న ఎస్సైలను ప్రొటెక్ట్ చేయాలని తప్పుడు వాంగ్మూలం ఇస్తున్నాడు. » పోలీసులే గంజాయితో దొరకడం అన్నది క్షమించరాని నేరం. బాధ్యతగల గవర్నమెంట్.. బాధ్యత గల డిపార్టుమెంట్.. బాధ్యతగల పోలీసు ఆఫీసర్లు చేయాల్సిన పని ఏంటంటే.. ఇలాంటి పనులు చేసే పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. డిస్మిస్ చేయాలి. జైలులో పెట్టాలి. తప్పు చేస్తే ఇలా జరుగుతుంది అనే సంకేతాన్ని పంపించాలి. కానీ చంద్రబాబూ నువ్వేం చేస్తున్నావ్ ఆ ఎస్సైలను కాపాడేందుకు తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు ఆధారాలు అన్నీ బిల్డ్ చేస్తా ఉన్నావ్. ఇవన్నీ చూస్తుంటే నిజంగా ప్రజలకు ఏమనిపిస్తుంది? అంతా కలిసికట్టుగా రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు.. గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేస్తున్నారు.. అని ప్రజలకు సంకేతాలు ఇవ్వడం కాదా? ఇలా జరుగుతోంది రాష్ట్రంలో పరిపాలన.పోలీసులే వాటాదారులుగా గంజాయి మాఫియా..!మొన్న ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన నిజంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఓ ఊదాహరణ. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థతోనే.. అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసు వ్యవస్థతోనే.. దగ్గరుండి వారిని కూడా వాటాదారులుగా చేస్తూ.. డ్రగ్స్, గంజాయి మాఫియాను ఆ స్థాయికి తీసుకుపోతే ప్రజలు ఇక ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎవరిని నమ్మాలి? అద్దంకి ఘటనలో తాజా సమాచారం ప్రకారం మత్తులో ఉన్న ఒక ఎస్సై కారు నడిపితే మరో ఇద్దరు ఎస్సైలు మత్తులో వెనుక సీట్లో కూర్చున్నారు. ఆ కారుతో ఒక ఆటోని ఢీకొట్టడం.. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారును ప్రజలు చుట్టుముట్టడం.. అందులోనివారంతా మత్తులో ఉండడాన్ని ప్రజలు చూడటం.. వెనక సీటులో, డిక్కీలో గంజాయి, లిక్కర్, పోలీస్ యూనిఫామ్ దొరకడం.. ఇదంతా చూసి ప్రజలు షాక్కు గురయ్యారు. మనం నిజంగా ఏపీలో ఉన్నామా? లేక కొలంబియాలో ఉన్నామా? అని అన్పిస్తోంది. రాష్ట్రంలో ఈ పరిస్థితులు చూసి ప్రతీ ఒక్కరు కూడా ఆందోళన చెందారు. గ్రామస్తులు ఆ ఘటనను వీడియోలు తీస్తుంటే సీఐ వచ్చి బెదిరించాడు. వీడియో తీస్తే జైలులో పెడతా అన్నాడు. (ఈ ఘటనను వీడియో, ఫొటోలతో వైఎస్ జగన్ వివరించారు).మా హయాంలో.. ఉక్కుపాదం మోపాం..ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పెట్టి గంజాయి, డ్రగ్స్పై మా హయాంలో ఉక్కుపాదం మోపాం. 11,550 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం చేశాం. 4.50కోట్ల గంజాయి మొక్కలు తొలగించాం. 13,210 మందిని అరెస్టు చేశాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా రూట్లన్నీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి.. వారు చెప్పినట్టుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్న ట్రైబల్స్ను గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. రూ.144కోట్లు ఖర్చు చేసి ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సహించాం. దాదాపు 3లక్షల ఎకరాలకుపైగా పోడు భూములు గిరిజనులకు పంచిపెట్టాం. ఈ రోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే గంజాయి వ్యాపారం చేయిస్తూ, వారిని భాగస్వాములను చేస్తూ టీడీపీ నాయకులు అందరూ కలిసి చేస్తున్న మాఫియా సామ్రాజ్యం. -
వెలిగొండలో చంద్రబాబు క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో ఏమీ చేయకపోయినా, ఆ ప్రాజెక్టును తానే పూర్తి చేసినట్లు సీఎం చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి.. పనులు వేగంగా చేశారని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు సొరంగాల పనులు పూర్తి చేశామని గుర్తు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో తన పాత్ర ఏమిటనేది చంద్రబాబు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చంద్రబాబుది క్రెడిట్ చోరీ.. ఏమీ చేయకున్నా ఘనత(క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్) తనదేనంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సూటిగా సమాధానాలు చెప్పారు. ‘స్థానిక ఎన్నికలను చంద్రబాబు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుపుతాడన్నది అనుమానమే. కానీ, ప్రజాస్వామ్యంలో పోరాడక తప్పదు. గతంలో నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పోలీసులను ఉపయోగించి.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధించి.. నోట్ల కట్టలను వెదజల్లారు.. ఆ తర్వాత నా పాదయాత్ర జరిగింది.. 2019 ఎన్నికల్లో నంద్యాల శాసనసభ స్థానంలో 37 వేల ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలి.డీబీటీ ద్వారా ప్రజలకు మేం చేసిన మంచి చెప్పి స్థానిక ఎన్నికలకు వెళ్లాం.. అందుకే భారీ మెజార్టీతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు’ అని వైఎస్ జగన్ ఓ ప్రశ్నకు స్పష్టంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రజల నాడి తెలుసుకోవడానికి ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వెఎస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని తేలిందని సర్వే సంస్థలు వెల్లడించడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘చంద్రబాబు పాలన ఈ విధంగా ఉంటే వెన్నుపోటు పార్టీకి ఎవరు ఓట్లు వేస్తారు?’ అని అన్నారు. -
రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)
-
వైఎస్ జగన్ కు రాఖీ కట్టిన మహిళలు
-
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు మహిళలు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్కు రాఖీలు కట్టిన మహిళలు ఆయనకు స్వీట్లు తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా వైఎస్ జగన్ను కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. తనను ఆప్యాయంగా కలిసి రాఖీలు కట్టిన మహిళలకు వైఎస్ జగన్ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడి, వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఇదీ చదవండి: పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్ -
కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా స్పందించని బాబు..
-
వాళ్ళో పెద్ద జేమ్స్ బాండ్స్.. పోలీసుల మాట్లాడిన వీడియోలు లైవ్ ప్రూఫ్
-
సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్, YS జగన్ దిగ్భ్రాంతి
-
పోరాటం చేయాల్సిందే.. వెళ్తూ వెళ్తూ వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ అదుర్స్
-
వెంట్రుకలు నిక్క పొడిచే వాస్తవాలు.. BC సోదరులు తెలుసుకోవాలి..
-
దొంగ ఓట్లపై కూటమి కన్ను..! స్థానిక ఎన్నికలపై జగన్ సంచలనం
-
గంజాయితో అడ్డంగా దొరికిన పోలీసులు... లైవ్లో ఆధారాలతో బయటపెట్టిన జగన్
-
పోలీస్ కారులో గంజాయి, మద్యం.. YS జగన్ స్ట్రాంగ్ రియాక్షన్
-
డేంజర్ బెల్స్ మోగుతున్నా చలనం ఉండదా చంద్రబాబు..
-
కారుమూరి అరెస్ట్ పై YS జగన్ రియాక్షన్
-
పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో ఓ వైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే.. మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు.రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు అందునా కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతీ చోటా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో వాటాదారులుగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో.. మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయి. డ్రైవర్తో సహా మరో ఇద్దరూ పోలీసులు మత్తులోనే ఉన్నారు. సీఐ వచ్చి వీడియోలు తీసే జనాల్ని తీయొద్దని బెదిరించారు. అలాంటప్పుడు ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ప్రజలు ఎవరిని నమ్మాలి? అని వైఎస్ జగన్ నిలదీశారు.పైగా అద్దంకి ఘటనను కవర్అప్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటనలు చేశారు. వాళ్ల మాటలకు ఎఫ్ఐఆర్కు పొంతనే లేదు(ఈ సందర్భంగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధనరాజుల వేర్వేరు స్టేట్మెంట్ల వీడియోలను ప్రదర్శించారు). ఇలాంటి పోలీసులను జైలుకు పంపకుండా.. తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారు. కూటమి పాలనలో అద్దంకి ఘటనే కాదు.. కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని కట్టడి చేశాం. గంజాయి కేసుల్లో 13,210 మంది అరెస్ట్ చేశాం. 11 వేల ఎకరాల్లో గంజాయి పంటల్ని ధ్వంసం చేశాం.ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకి దూరం చేశాం. ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశాం అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీ మయం.. గంజాయి మయం. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు.. పెదబాబుకి ఇంత అని వాటేలేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది.. అది గంజాయే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే! -
ఫోటోలకు భలే ఫోజులు ఇస్తాడయ్యా.. నిమ్మలపై జగన్ సెటైర్లు
-
కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది వైఎస్సార్సీపీనే. మా కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామని వైఎస్ జగన్ వెల్లడించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లతో మేం ఎన్నికలకు వెళ్లాం. సుప్రీంకోర్టు, హైకోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే. కోర్టుకు వెళ్లొద్దని దొంగ ఏడుపులు ఏడ్చేది చంద్రబాబే. బీసీల అభ్యున్నతికి నిజాయితీగా కృషి చేసింది మేమే. మా కేబినెట్లో 11 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాం. 40 శాతం మంత్రి పదవులు బీసీలకే ఇచ్చాం. 11 రాజ్యసభ సీట్లలో నలుగురు బీసీలను పంపింది మేమే. రెండు డిప్యూటీ సీఎం పదవులు కూడా బీసీలకే ఇచ్చాం.అలాగే, 13 జెడ్పీ చైర్మన్ సీట్లలో ఆరు బీసీలకే ఇచ్చాం. 13 మేయర్ స్థానాల్లో బీసీలకే 9 ఇచ్చాం. 636 ఎంపీపీ స్థానల్లో బీసీలకే 239 ఇచ్చాం. 84 మున్సిపల్ చైర్మన్ స్థానాల్లో 44 బీసీలకే ఇచ్చాం. 196 ఏఎంసీ చైర్మన్ స్థానాల్లో బీసీలకే 76 ఇచ్చాం. ఇవ్వన్నీ చట్టం చేసి మరీ ఇవ్వడం వైఎస్సార్సీపీకే సాధ్యపడింది. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం కేటాయించాలని పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టించాం. బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేశాం. వివిధ పథకాల ద్వారా డీబీటీ పద్దతిలో ఇచ్చాం. రూ.లక్షా 30వేల కోట్లు బీసీలకు అందజేశాం.బీసీల బతుకులను చంద్రబాబు బుగ్గిపాలు చేశాడు. మా హయాంలో అమలైన పథకాలను రద్దుచేశాడు. మేనిఫెస్టో హామీలను చెత్తబుట్టలో వేశాడు. రాజకీయంగా ఎదిగే బీసీలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి సీదిరి అప్పలరాజును జైలులో పెట్టించారు. ఓ మహిళా ఎస్ఐను అడ్డుపెట్టుకుని చింతాడ రవిని అక్రమంగా జైలుకు పంపారు. కర్నూలులో టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తే విరూపాక్షిపై తప్పుడు కేసులు పెట్టారు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
బాబు చాప్టర్ క్లోజ్... తేల్చేసిన సర్వేలు! టీడీపీ క్యాంపులో మొదలైన టెన్షన్..
-
నార్లు ఎండుతున్నా.. చంద్రబాబు ధ్యాసంతా వాటి మీదే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా దాన్ని గుర్తించేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదని అన్నారు. జూన్, జులైలోనే 52 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని వైఎస్ జగన్ వెల్లడించారు.బుధవారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేశారు. కూటమి పాలనతో ఇప్పటిదాకా రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. 2025 అక్టోబర్లో మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నా.. ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా కూడా అందలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచామని జగన్ గుర్తు చేశారు. అయితే బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారని, పంటలు దెబ్బతిన్న రైతులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం డైవర్షన్, రెడ్బుక్ రాజకీయాలపై దృష్టి సారిస్తోందని జగన్ విమర్శించారు. మంత్రులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంపైనే చంద్రబాబు దృష్టి ఉందని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా తాను ఏం చేస్తున్నానో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.ఇదీ చదవండి: చంద్రబాబు అలా చేస్తే మనదే విజయం: వైఎస్ జగన్ -
ఎదో రైతులను ఉద్ధరిస్తున్నట్టు ప్రకాశం బ్యారేజ్ వద్ద ఫోజులు.. TDP మంత్రులను ఏకిపారేసిన జగన్..
-
కోడిగుడ్డు మీద ఈకలు పీకి.. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
తీవ్రకరువులో కుంభకర్ణుడి మాదిరిగా చంద్రబాబు తీరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ సవాల్ విసిరితే ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలోనూ తీవ్ర కరువు నెలకొంది. అంత తీవ్ర పరిస్థితులు ఉన్నా చంద్రబాబు స్పందించడం లేదు. పైగా కుంభకర్ణుడిలా నిద్ర నటిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటిదాకా 52 శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు....ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలుసు. జులైలోనూ అదే పరిస్థితి. అయినా పంటలకు నీళ్లు ఇస్తామని ఫోజులు ఇచ్చారు. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా.. ఎకరాకు 15 వేలు నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్న చంద్రబాబు కనీసం స్పందించడం లేదు అని వైఎస్ జగన్ అన్నారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు నీటిని విడుదల విషయంలో చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ, ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి మీద చంద్రబాబు దృష్టి సారించారని జగన్ ధ్వజమెత్తారు. అవకాశమున్నా పొత్తిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదీ చదవండి: అదే గనుక జరిగితే వైఎస్సార్సీపీదే విజయం -
Watch Live: వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్
-
మదర్ థెరీసాకు వైఎస్ జగన్ నివాళి
తాడేపల్లి : మహనీయురాలు మదర్ థెరీసా జయంతి సందర్భంగా ఆమెకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. మానవత్వానికి ప్రతిరూపం మదర్ థెరిసా అని, ఆమె జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకుందామని అన్నారు. ప్రేమ, కరుణ, నిస్వార్థ సేవతో తన జీవితాన్ని పేదలు, నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యుల సేవకే అంకితం చేశారని పేర్కొన్నారు. ఎంత చిన్న పని అయినా మనిషి జీవితంలో గొప్ప మార్పును తీసుకురాగలదని ఆమె జీవితం మనకు చాటి చెబుతుందన్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడమే థెరిసాకు మనం అందించే నిజమైన నివాళి అని జగన్ పేర్కొన్నారు. మదర్ థెరిసా స్ఫూర్తితో ప్రేమ, దయ, సేవాభావాన్ని మన జీవితంలో భాగం చేసుకుందామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. On the birth anniversary of Mother Teresa, we remember her life of love, compassion, and selfless service. Her legacy reminds us that even the smallest act of kindness can make a lasting difference. Let us honour her memory by caring for those around us. pic.twitter.com/Qfqvt4fdBH— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2026 -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. రైతులను పట్టించుకోకుండా చంద్రబాబు.. కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు.. కల్తీ లిక్కర్ ప్రతీ ఊరికీ వ్యాపించింది. ఇందుకు అద్దంకి ఘటనే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టులకు వెళ్లింది చంద్రబాబు.. అడ్డుకుందీ చంద్రబాబే.. మళ్లీ దొంగ ఏడుపులు ఆయనవే అని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరువు తీవ్రత, ప్రభుత్వ నిర్లక్ష్యం, బీసీ రిజర్వేషన్లు, గంజాయి సమస్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..డీఎస్సీ అక్రమాలపై సవాల్ విసిరితే ఇప్పటి వరకు స్పందించలేదు.చంద్రబాబు సహా ఎవరూ స్పందించలేదు.రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది.ఏపీలో లోటు వర్షపాతం ఉంది.తీవ్ర కరువు పరిస్థితులు కనిపిస్తున్నా సీఎం చంద్రబాబు స్పందించడం లేదు.జూన్ నుంచి ఇప్పటి వరకు 52 శాతం లోటు వర్షపాతం ఉంది. ఏ జిల్లాలో చూసినా లోటు వర్షపాతమే ఉంది.చంద్రబాబు తీరు కుంభకర్ణుడి మాదిరిగా ఉంది.బాబు నిద్ర నటిస్తున్నారు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమం చేపట్టలేదు.ఇప్పటి వరకు 189.62 మి.మీ మాత్రమే వర్షపాతం నమోదు.688 మండలాలకు 625 మండలాల్లో లోటు వర్షం ఉంది.కోస్తాలోనూ కరువు ప్రభావం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 91 శాతం లోటు వర్షపాతం ఎదుర్కొంటోంది.28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తోంది.ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూలై 10న పంటలకు నీళ్లిస్తామని ఫొటోలకు ఫోజులిచ్చారు.రైతులంతా పెట్టుబడులు పెట్టి అష్టకష్టాలు పడుతున్నారు. మంత్రులు పబ్లిక్ స్టంట్లు వేస్తున్నారు. శ్రీశైలం ఖాళీ.. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు ముందుకెళ్లారు.ప్రతీ ఎకరాకు రైతుకు రూ.15వేల నష్టం.ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలిసినా ప్రభుత్వం మేల్కోలేదు.పత్రీ ఎకరాకు చివరి వరకు నీరిస్తామని గొప్పలు చెప్పారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వచ్చింది.మరోవైపు.. చంద్రబాబు మానవత్వం లేదకుండా వ్యవహరిస్తున్నారు.ఆగస్టు 11న శ్రీశైలం నీటిమట్టం 880 అడుగులు.అవకాశమున్నా పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదు.854 అడుగులకు నీటి మట్టం తగ్గితే సీమకు నీరు రాదు.ప్రస్తుతం 7000 క్యూసెక్కులు మాత్రమే ఇన్ఫ్లో ఉంది.శ్రీశైలం నుంచి ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.సెప్టెంబర్ 15వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇదే పరిస్థితి కొనసాగితే నీటి మట్టం 854 అడుగులకు చేరుతుంది.ఆ తర్వాత రాయలసీమకు నీరిచ్చే అవకాశం ఎలా ఉంటుంది??సీమ ప్రాజెక్ట్ల కెపాసిటీ 180 టీఎంసీలు.. ప్రస్తుతం 55.56 టీఎంసీలు.సీమ ప్రజలకు 23 శాతమే నీరు అందుబాటులో ఉంది.నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి చుక్కనీరు ఇవ్వడం లేదు.నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్ట్ ఉంది.పులిచింతల దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్ట్లు నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు.తెలంగాణలో మహాత్మగాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతోంది.రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేంగా జరుగుతున్నాయి.అయినా చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు ఆదుకున్నాడా?కరువు ఉన్నా ప్రజలు, రైతులను చంద్రబాబు ఆదుకున్నాడా?.వైఎస్సార్సీపీ ఉచిత పంటల బీమా పథకాన్ని కూడా రద్దు చేశారు.2023లో 1.18 కోట్ల ఉచిత పంటల బీమా దరఖాస్తులు వస్తే2026-27లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.స్వయంగా ఈ గణాంకాలను కేంద్రమే వెల్లడించింది.అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం బీమా కట్టలేదు.రైతులకు రూ.3000 కోట్ల నష్టం జరిగింది.2025 అక్టోబర్లో మోంథా తుపాను వచ్చింది.రైతులకు ఇప్పటికీ ఒక్క పైసా ఇవ్వలేదు.ఉచిత పంటల బీమాను చంద్రబాబు నాశనం చేశారు చంద్రబాబు దగ్గర రైతులను ఆదుకునే ప్లాన్ ఏమైనా ఉందా?.డైవర్షన్, రెడ్బుక్పై ఉన్న ధ్యాస.. బాబుకు రైతులపై లేదు.రైతులకు ప్రత్యామ్నాయం ఎందుకు చూపించలేదు??రైతులకు ఉచిత విత్తనాలు ఎందుకు ఇవ్వలేదు.ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారు. బీసీ రిజర్వేషన్లపై కామెంట్స్.. 2019లో మేం వచ్చిన తర్వాత జీవో నంబర్-176 ఇచ్చి బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇచ్చి, ఎన్నికలకు సిద్ధం అయ్యాం.కానీ, చంద్రబాబు, తన పార్టీ నాయకుడు, తన గవర్నమెంట్లో అప్పట్లో, AP State Employment Guarantee Councilలో అప్పటి సభ్యుడు బిర్రు ప్రతాపరెడ్డి ద్వారా హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ కేసు వేయించాడు.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50శాతం దాటుతున్నందుకు బీసీలకు 34శాతం కొట్టేస్తున్నామని హైకోర్టు తీర్పు ఇచ్చింది.హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసిందని తెలిసి కూడా మరోసారి మహా డ్రామాకు చంద్రబాబు దిగాడు.మళ్లీ కోర్టుకు పోయి అడ్డుకోవద్దంటూ కపటనాటకాలు ఆడుతున్నాడు. కోర్టుకు పోయేది ఆయనే, కొట్టివేయించేదీ ఆయనే, మళ్లీ దొంగ ఏడుపులు ఏడ్చేదీ ఆయనే.బీసీల అభ్యున్నతి విషయంలో ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే.. అది కేవలం వైఎస్సార్సీపీ మాత్రమే.రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి తలరాతలను మార్చే విప్లవాత్మక సంస్కరణలు ఆ ఐదేళ్లలో మేం తీసుకు వచ్చాం.కోర్టులు కొట్టేసినా, బీసీలకు ఆమేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలని మాకు మేముగా నిర్ణయం తీసుకుని, 34శాతమే కాదు, అంతకంటే ఎక్కువ పదవులు ఇచ్చి, మా చిత్తశుద్ధిని చాటుకున్నాం.మా కేబినెట్లో 25 మంది ఉంటే, అందులో 11 మంది బీసీలే. అంటే దాదాపు 40 శాతం మంత్రిపదవులు బీసీలకే.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సామాజిక వర్గాలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, ఇందులో రెండు డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చాం.మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ స్థానాల్లో నలుగురు బీసీలను ఈ జగన్ రాజ్యసభకు పంపారు.అంటే దాదాపు 36 శాతం ప్రాతినిధ్యం. చంద్రబాబు 2014-19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు.25 లోక్సభ సీట్లలో 11 బీసీలకే అంటే 44 శాతం బీసీలకే ఇచ్చాం.58 ఎమ్మెల్సీల్లో 28 బీసీలకే ఇచ్చాం. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదువులు ఉంటే, 6 అంటే 46శాతం బీసీలకే13 మేయర్ పదవుల్లో, 9 అంటే, 69శాతం బీసీలకే.636 ఎంపీపీ స్థానాల్లో, 239 అంటే 38 శాతం బీసీలకేమున్సిపల్ చైర్మన్ పదవులు 84లో, 44 అంటే ౫౩శాతం బీసీలకే639 జడ్పీటీసీల్లో, 227 అంటే, 36శాతం బీసీలకే8,239 ఎంపీటీసీల్లో, 3,361 అంటే, 41 శాతం మంది బీసీలే.10,536సర్పంచుల్లో దాదాపు ౪వేల మంది బీసీలే. అంటే 38శాతం వారికే.AMC చైర్మన్ పదవులు 196లో 76 అంటే 39శాతం బీసీలకేప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు 137లో, 53 బీసీలకు ఇచ్చాం. అంటే 37% ఇచ్చాం.139 బీసీ కులాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కలలో కూడా చంద్రబాబుకు ఆలోచన రాలేదు. చట్టం చేసి మరీ.నామినేటెడ్ పదవుల్లో 50 శాతం, నామినేటెడ్ పనులు–కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం.ఇందులో మహిళలకు కూడా 50% వాటా ఉండే విధానం మేం తీసుకు వచ్చాం. దేశంలోనే ఇది తొలిసారి.అంతేకాదు బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలతో ప్రైవేట్ బిల్లు పెట్టించాం.కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కోసం కూడా డిమాండ్ చేశాం.అలాగే బీసీ కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాం.వివిధ డీబీటీ పథకాల ద్వారా బీసీల ఖాతాల్లోకి నేరుగా రూ.1.30లక్షల కోట్లు పంపించాం.కాని ఇప్పుడు చంద్రబాబు బీసీల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాడు. మా పథకాలన్నింటినీ ధ్వంసం చేశాడు.పైగా రాజకీయంగా బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక వారిమీద అక్రమకేసులు పెట్టి, జైల్లో పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు.యాక్సిడెంట్ కేసును హత్యాయత్నం కేసుగా మార్చి మాజీ మంత్రి, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సీదిరి అప్పలరాజును జైల్లోపెట్టాడు.ఒక మహిళా ఎస్సైను అడ్డుపెట్టుకుని, జరగని దాన్ని జరిగినట్టుగా చూపించి, తప్పుడు కేసులు పెట్టి, ఆముదాలవలస నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త చింతాడ రవికుమార్ను జైలుకు పంపాడు.టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే, పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్తచేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపివేయించి, అదిచేసింది ఎమ్మెల్యే, అతని అనుచరులు అని చెప్పి, ఆలూరు ఎమ్మెల్యే, బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షిపై కేసులు పెట్టి జైల్లోపెట్టారు.యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వర్రావు, ఆయన కొడుకు కారుమూరి సునీల్ను అన్యాయంగా తప్పుడు కేసుల్లో జైలుకు పంపాడు.మరి చంద్రబాబుకు బీసీలమీద ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్ముతారా?గంజాయిపై కామెంట్స్..రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది.మట్టి, శాండ్, లిక్కర్ మాఫియా నడుస్తోంది.విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు.కల్తీ లిక్కర్ ప్రతీ ఊరికీ వ్యాపించింది.అద్దంకి ఘటనే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలు చేస్తున్నారు.ప్రజలు ఎవరిని నమ్మాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలి?.మత్తులో కారు నడిపింది కూడా మరో ఎస్ఐ అని తెలుస్తోంది.డ్రైవర్తో సహా మరో ఇద్దరు పోలీసులు కూడా మత్తులో ఉన్నారు.వీడియో తీసిన గ్రామస్తులను సీఐ బెదిరించారు.రాష్ట్రంలో పరిస్థితులు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.డీఎస్పీ, ఎస్పీ మాటలు.. ఎఫ్ఐఆర్కు పొంతన లేదు.ఎవరో గంజాయి వదిలి పరారయ్యాడని డీఎస్పీ అన్నారు.సమాచారం మేరకే దాడులు చేశామని ఎస్పీ చెప్పుకొచ్చారు.ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం దీనికి భిన్నంగా ఉంది.పోలీసులే గంజాయితో దొరకడం క్షమించరాని నేరం.ఇలాంటి పోలీసులను జైలుకు పంపాలి.కానీ, తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూశారు.రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేస్తున్నారు.నిజంగా పోలీసులు ఛేజ్ చేసి దొంగలను పట్టుకుంటే వీఆర్కి పంపి ఎందుకు చర్యలు తీసుకున్నారు?. -
మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు మిలాద్-ఉన్-నబీ. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా..‘ప్రేమతో మనసులు గెలవాలనీ.. కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనీ.. క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలనీ.. మహ్మద్ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయం. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు. ప్రేమతో మనసులు గెలవాలని.. కరుణతో కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలని.. క్షమ, సహనం, సోదరభావాలతో శాంతియుత సమాజాన్ని నిర్మించాలని మహ్మద్ ప్రవక్త మానవాళికి అందించిన సందేశం సదా అనుసరణీయం. మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) August 26, 2026 -
స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే విజయం మనదే... వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
-
గుర్తుపెట్టుకోండి.. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. స్థానిక ఎన్నికల్లో YSRCP కొట్టే దెబ్బకు...
-
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. -
ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే.. 'మనదే విజయం'
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా జరిగితే వెన్నుపోటు పార్టీ కూటమికి ఘోర పరాజయం తప్పదు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో ప్రత్యక్షంగా చూశాం. అందుకే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు వారు ఎన్నికల్లో మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మనకు మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. పార్టీ, ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది. ఇలా చేయగలిగితే మన గెలుపు ఖాయం.మీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరిగితే ఇక నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడి పోరాడాలి.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ ృ వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. దాదాపు 15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఈ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్లెట్ మెటేరియల్ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. తీరా ఏమీ చేయకుండానే అన్నీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు. ఇందుకు సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. – వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తే వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని, వెన్నుపోటు పార్టీ కూటమి ఘోర పరాజయం పొందడం ఖాయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఏ విధంగా దౌర్జన్యం చేశారో చూశామన్నారు. కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏమేం చేశారో? ఎన్ని దౌర్జన్యాలు చేశారో? ప్రత్యక్షంగా చూశామంటూ ఎత్తిచూపారు. అందుకే రానున్న స్థానిక ఎన్నికల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ నేతలకు ఉద్బోధించారు. ‘కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి.. అధికార పక్షం వాళ్లు.. చంద్రబాబు ఎంత దౌర్జన్యం చేసినా, మాకు మా నాయకుడు ఉన్నాడు అనే భావన, నమ్మకం మీరు కార్యకర్తల్లో కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు’ అని తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేశారు. వెన్నుపోటు పార్టీ కూటమి రెండేళ్ల పాలనపై ఇప్పటికే ప్రతి ఇంటా చర్చ మొదలైందని.. ప్రజలంతా ఈ పాలనను, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనను పోల్చి చూస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరపాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. స్థానిక ఎన్నికలు సందేహమే? అయినా సన్నద్ధం‘స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని మనం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఎన్నికలు ఇప్పుడే జరుగుతాయా.. లేదా.. అన్నది తెలియడం లేదు. ఒక వైపు 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెబుతున్నారు. ‘సర్’ రిపోర్టు కూడా అదే చెబుతోంది. మరో వైపు ఆ 44 లక్షల మందిని కలిపి ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారు. అంటే లేని ఓట్లు ఉన్నట్లుగా చూపుతున్నారు. అది చట్ట ప్రకారం నేరం. రెండో వైపు పట్టణ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అంశం. గతంలో మనం ఇవ్వాలనుకుంటే, కోర్టు కొట్టేసింది. పక్కన తెలంగాణలో కూడా కోర్టు దాన్ని కొట్టేసింది. అయినా దానిపై చంద్రబాబు కావాలని జీవో ఇచ్చి, ఎన్నికలకు వెళ్తున్నాడు. అంటే అక్కడ ఒక స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కావాలని జీవో ఇచ్చి డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే కోర్టు కొట్టేస్తుంది కాబట్టి. ఇవన్నీ చూస్తుంటే, చంద్రబాబు అసలు స్థానిక ఎన్నికలు జరుపుతాడా? అని అనుమానం వస్తోంది. అయినా, ఎన్నికలు జరుగుతాయన్న ఆలోచనతోనే మనం సిద్ధం కావాలి. ఆ దిశలో ముందుకు సాగాలి. గట్టిగా పోరాడాలి.ఇప్పుడు ప్రతి ఇంటా అదే చర్చ2024 మార్చి 16న ఎన్నికల కోడ్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి మనం దాదాపు 30 నెలలుగా ప్రతిపక్షంగా ఉన్నా, గ్రామ స్థాయి వరకు పార్టీని బలంగా నిర్మించుకోగలిగాం. తొలిసారిగా గ్రామ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండున్నరేళ్లలో ఇలా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మించుకోగలిగాం. ఇది ఒక మంచి కార్యక్రమం. చంద్రబాబు రెండున్నరేళ్ల పాలన ఎలా ఉంది? అంతకు ముందు మన పరిపాలన ఎలా ఉంది? అన్న దానిపై ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు పాలన లో వంచన, దగా..ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలన చూస్తే.. అంతా మోసం, దగా కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చేవి కాకుండా, అంతకు మించి ఇస్తామన్నాడు. అమ్మ ఒడి మనం ఒకరికి ఇస్తే, ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఆ పథకం ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి బాండ్లు పంపారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దానిపై సంతకాలు చేశారు. ఏ పథకం ద్వారా ఆ ఇంట్లో ఎంత లబ్ధి కలుగుతుంది.. అని లెక్కలు చెప్పి నమ్మించారు. మన కంటే మూడింతలు ఎక్కువ ఇస్తామన్నారు. మనం చేయూత కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇచ్చాం. పలు మల్టీ నేషనల్ కంపెనీలు తెచ్చి అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాం. చంద్రబాబు ఏం చెప్పారంటే.. ఇంట్లో 50 ఏళ్లు నిండిన వారుంటే నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తామన్నాడు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున, ఏటా రూ.36 వేలు ఇస్తామన్నాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామన్నారు. అలా అన్నీ ఇస్తామని చెప్పి నమ్మించి, తర్వాత మోసం చేశారు. ప్రజలు దాన్ని గుర్తించారు. అందుకే ఈ రోజు ప్రతి ఇంట్లో వాటిపై చర్చ జరుగుతోంది. ఒకవైపు అన్నీ వైఫల్యాలు. మరో వైపు అరాచక పరిస్థితి. యథేచ్ఛగా రెడ్బుక్ అమలవుతోంది. స్కూళ్లు నాశనం అయ్యాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు. ఈ పథకం ద్వారా వైద్య సేవలు అందడం లేదు. విద్య, వైద్య రంగాలు మొత్తం నాశనం అయ్యాయి. మహిళలకు సున్నా వడ్డీ రుణాలకు మంగళం పాడారు. ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. అరెస్టులు.. భయపెట్టి లొంగ దీసుకునే పరిస్థితి.సమావేశానికి హాజరైన పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు కార్యకర్తల్లో నమ్మకం కలిగించాలి..ప్రస్తుతం ప్రజలు మన వైపు ఉన్నారు. కార్యకర్తల కోసం మనం గట్టిగా పని చేయాలి. అధికార పక్షం వాళ్లు ఎంత దౌర్జన్యం చేసినా, మా నాయకుడు నాతో ఉన్నాడన్న నమ్మకాన్ని మీరు కార్యకర్తలకు కల్పించాలి. అలా చేస్తేనే, రేపు ఎన్నికల్లో వారు మీకు తోడుగా నిలబడతారు. స్థానిక సంస్థల పదవులకు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అది ఒక విధంగా మంచిదే. ఒక బలమైన అభ్యర్థి అక్కడ నిలబడితే, మిగిలిన స్థానాలపై అతడు దృష్టి పెట్టొచ్చు. పోటీలో గట్టిగా నిలబడతాడు. ఆ బలమైన అభ్యర్థి.. మిగిలిన చోట్ల బలాన్ని ఇవ్వాలి. అలాగే అతడు సూపర్విజన్ కూడా చేయాలి. అలా చేయగలిగితే, మనం ఎన్నికల్లో గట్టిగా నిలబడతాం. అంతే కాకుండా పార్టీ నుంచి ఇతర ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ, బలం లాభిస్తుంది.ఈ విభాగాలు.. ఈ పనులు చాలా ముఖ్యంప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎమ్మెల్యే/ఇన్చార్జ్ లీగల్ సెల్, మీడియా సెల్ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు దౌర్జన్యం చేస్తాడు. మన పార్టీ వారిని వేధిస్తాడు. కాబట్టి మన క్యాడర్ను, కార్యకర్తలను కాపాడుకోవాలి. అందు కోసం మీరు మంచి టీమ్తో లీగల్ సెల్ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా మీడియా సెల్ కూడా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రెస్ మీట్స్ (మీడియా సమావేశాలు)లో తరచూ మాట్లాడాలి. మనం చేసిన మేలు, సంక్షేమం చెబుతూ పార్టీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి. కాబట్టి తప్పనిసరిగా మీడియా సెల్స్ ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను బాగా ఉపయోగించుకోవాలి. ఎలా ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి.. ఎలా యాక్టివేట్ చేయాలి.. ఎలా నడిపించాలనే దానిపై శిక్షణ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తిగా దిగజారిపోయిన నెగటివ్ మీడియా ఈనాడు, ఏబీఎన్ తదితర వాటితో పోరాడుతున్నాం. మీకు మీరుగా బలంగా ఎదిగేందుకు, మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు, పార్టీ ఇంకా బలంగా మారడానికి మీరు తప్పనిసరిగా లీగల్ సెల్, మీడియా సెల్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను పక్కాగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు నియోజకవర్గ స్థాయిలో పని చేస్తూ.. జిల్లా స్థాయి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పటి వరకు దీంట్లో యాక్టివ్గా లేని వారు వెంటనే వాటిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండో అంశం.. ఇంటింటా ప్రచారం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఇంటింటికీ వెళ్లాలి. మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి మంచి చేశామనేది చెప్పాలి. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన దగా, వంచన గురించి వివరించాలి. మరో వైపు బలమైన అభ్యర్థి నిలబడాలి. ఆ అభ్యర్థి అందరినీ కలుపుకుపోవాలి. ఎక్కడా ఇగోకు వెళ్లొద్దు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకం. కేవలం 9 ఓట్లతో ఓడిన వారు, గెల్చిన వారు కూడా ఉన్నారు. జో జీతా వహీ సికందర్ఎన్నికల్లో గెలుపు ముఖ్యం. ఎందుకంటే.. జో జీతా వహీ సికందర్ (గెలిచిన వారే రాజు). కాబట్టి వచ్చే 60, 70 రోజులు మీరు మీ నియోజకవర్గాలు దాటి వెళ్లొద్దు. అందరినీ కలవండి. వ్యవస్థలు పక్కాగా ఏర్పాటు చేసుకొండి. అన్యాయం చేస్తే వదిలి పెట్టబోమని పోలీసులకు కూడా గట్టిగా చెప్పండి. చూస్తుండగానే మూడో ఏడాదిలోకి వచ్చాం. కాబట్టి వచ్చేది మన ప్రభుత్వమే. ఆ తర్వాత మీరు ఎక్కడున్నా, రిటైర్ అయినా వదిలిపెట్టబోమని చెప్పండి. వారిలో న్యూట్రాలిటీ (తటస్థ వైఖరి) తీసుకురావడానికి ప్రయత్నించండి. అప్పటికీ వారు మారకపోతే వారి వివరాలు డిజిటల్ డైరీలోకి ఎక్కించండి’ అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మీ పాత్ర చాలా కీలకంప్రతి చోటా అభ్యర్థుల ఎంపిక ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. పార్టీ కోసం గట్టిగా పని చేసే వారిని ఎంపిక చేయండి. రిజర్వేషన్ల ఖరారు తర్వాత, మారితే చూడొచ్చు. అంతేకానీ, అప్పుడు అభ్యర్థుల కోసం వెతికితే అంతగా ప్రయోజనం ఉండదు. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మీరు స్వయంగా హాజరై గుర్తింపు కార్డులు, మెటీరియల్ పంపిణీ చేయాలి. వాటికి సంబ«ంధించి, తగిన విధంగా నిర్దేశం చేయాలి. ప్రతిచోటా మీ ప్రమేయం ఉండాలి. స్థానిక ఎన్నికల్లో పార్టీతో పాటు, అభ్యర్థి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వారిపై ప్రజలకు ఎక్కువ దృష్టి ఉంటుంది. అందుకే అందరికీ ఆమోద యోగ్యమైన వారిని ఎంపిక చేయాలి. వీలైనంత వరకు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం వచ్చేలా చొరవ చూపాలి.ప్రతి చోటా పోటీ చేయాలిఎక్కడా ఏకగ్రీవం ఉండకూడదుమీ నియోజకవర్గాల్లో.. ఎక్కడా కూడా మన పార్టీ అభ్యర్థి పోటీ చేయని పరిస్థితి రాకూడదు. అలా మన పార్టీ అభ్యర్థి నిలబడకుండా, పోటీలో లేకుండా ఉంటే, అక్కడ ఏకగ్రీవ ఎన్నిక జరిగితే నన్ను అడగాల్సిన పని లేదు. మీరు ఆ తర్వాత ఎన్నికల్లో నిలబడరు. అంటే, టికెట్ దక్కదు. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా, స్థానిక ఎన్నికల్లో ప్రతిచోటా మనం అభ్యర్థులను నిలపాలి. మన కార్యకర్తలకు తోడుగా నిలబడాలి. పోరాడాలి. అప్పుడే వారు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మీకు తోడుగా ఉంటారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ రూపొందించిన మెటీరియల్ (బుక్లెట్) ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ అనేది ప్రతి ఊళ్లో, ప్రతి ఇంటికి వెళ్లాలి. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా చెప్పాలి. ఇవన్నీ మీ ద్వారానే పార్టీ కొనసాగిస్తుంది. ఈ ప్రక్రియ ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇంకా గుర్తింపు కార్డులు సిద్ధం అవుతున్నాయి. దాదాపు 15 లక్షల కార్డులు రెడీ అవుతున్నాయి. జిల్లా, నియోజకవర్గాలు, మండల స్థాయిలో ఆ కార్డుల పంపిణీ జరుగుతుంది. బుక్లెట్ మెటీరియల్ కూడా మీకు అందుతుంది. ఇవన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి కాబట్టి.. ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి.ఐదు అంశాలతో సంస్థాగత సమావేశాలు1. చంద్రబాబు పాలన వైఫల్యాలు2. మన ఐదేళ్ల పాలన, సంక్షేమం, సంస్కరణలు, ప్రజలకు చేసిన మేలు3. కేడర్ను మోటివేట్ చేసి, ఎన్నికలకు సిద్ధం చేయడం4. ఐడీ కార్డుల పంపిణీ5. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటా ప్రచారం సంస్థాగత సమావేశాల షెడ్యూల్⇒ సెప్టెంబరు 5, 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ఇందులో పార్టీ జిల్లా స్థాయి నాయకులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్్జలు, జిల్లా స్థాయిలో అన్ని కమిటీల ఇన్ఛార్్జలు, పార్టీ సీనియర్ నాయకులు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొంటారు.⇒ సెప్టెంబరు 8, 9, 10, 11 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో సమావేశాల నిర్వహణ. వీటిలో నియోజకవర్గ స్థాయి పార్టీ నేతలు, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.⇒ సెప్టెంబర్ 12 నుంచి 22 వరకు మండల, వార్డు స్థాయి సమావేశాలు జరుగుతాయి. ఇందులో గ్రామ, వార్డు స్థాయి నుంచి కూడా నాయకులు పాల్గొంటారు. ఆ తర్వాత ఇంటింటి ప్రచారం. అంటే సెప్టెంబర్ 23 నుంచి ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ‘వెన్నుపోటు పార్టీ – వెన్నుపోటు పాలన’ బుక్లెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ విలేజ్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు అందరూ పాల్గొంటారు. మన పాలనలో విప్లవాత్మక మార్పులుమేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99 శాతం అమలు చేశాం. పూర్తి పారదర్శకతతో పాలించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించి, ఇంటి గడప వద్దే ప్రభుత్వ సేవలు అందించాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాం. దేవుడి దయ వల్ల ఆ విధంగా ఒక గొప్ప పాలన ఇవ్వగలిగాం. ఎన్నికల్లో ఒక మాట చెబితే, ఒక విషయాన్ని మేనిఫెస్టోలో పెడితే, దాన్ని తూ.చ తప్పకుండా అమలు చేపి చూపాం. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే, ఒక షెడ్యూల్ ప్రకటించి పథకాలు అమలు చేశాం. ఇది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని గర్వంగా చెప్పగలుగుతాం.⇒ సంస్కరణలు, మార్పులు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ప్రభుత్వ బడుల్లో నాడు–నేడు ద్వారా పూర్తి మార్పులు చేశాం. 6వ తరగతి నుంచి డిజిటల్ బోర్డులు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాం. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ. ఇంకా బైజూస్ కంటెంట్.⇒ గ్రామ స్థాయిలో చూస్తే ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. గ్రామంలో విలేజ్ క్లినిక్స్. ఆరోగ్యశ్రీలో 3,300కు పైగా ప్రొసీజర్లు. రూ.25 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్. నాడు దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60 శాతం స్పెషలిస్టుల కొరత ఉంటే, మన దగ్గర అది కేవలం 4 శాతం మాత్రమే. ఆ స్థాయిలో ఆస్పత్రుల్లో నియామకాలు జరిపాం. మన హయాంలో ఆస్పత్రుల్లో జీరో వెకెన్సీ.⇒ వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తెచ్చాం. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేశాం. ఉచిత పంటల బీమా అమలు చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ప్రతి అడుగులో రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి పంటకు కచ్చితమైన గిట్టుబాటు ధర కల్పించాం. సీఎం–యాప్ ద్వారా పంటల ధరలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి, జేసీ స్థాయి అధికారితో మార్కెట్లో జోక్యం చేసుకున్నాం. తద్వారా పంటల కొనుగోలులో పోటీ ఏర్పడి, రైతులకు మేలు జరిగింది. అలా ఐదేళ్లలో రూ.7,800 కోట్లతో పంటల కొనుగోలు చేశాం.⇒ సుపరిపాలన, మహిళా సాధికారత, విద్య, వైద్యంలో ఎప్పుడూ చూడని మార్పులు. కొత్తగా 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు. కర్నూలు, విశాఖలో కొత్త ఎయిర్పోర్టులు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో అత్యుత్తమ వైద్య సేవలందించాం. డయాలసిస్ సేవలు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్. ఆస్పత్రి ఏర్పాటు చేశాం. రూ.600 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేశాం. అలా ప్రతి సమస్యకు పరిష్కారంగా శాశ్వత చర్యలు చేపట్టాం. -
జూడాల స్టైపెండ్పైనా వెన్నుపోటు ముఠా పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: జూనియర్ వైద్యుల(జూడాల) స్టైపెండ్ పెంచకుండా తీరని అన్యాయం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. పచ్చి అబద్ధాలతో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని గత ప్రభుత్వంపై బురద జల్లుతోంది. జూడాల స్టైపెండ్ తగ్గింపును గత ప్రభుత్వం సమర్థించిందని మంగళవారం ఓ మెమోను తెరపైకి తెచ్చి దుష్ప్రచారం చేసి లబ్ధి పొందేందుకు కుటిలయత్నం చేసింది. అయితే, వాస్తవానికి జూనియర్ డాక్టర్ల సంక్షేమానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి స్టైపెండ్నూ పెంచి మేలు చేసింది. దీనికి బలమైన ఆధారాలు ఉండడంతో చంద్రబాబు సర్కారు దుష్ట కుయుక్తులు పారలేదు. జూనియర్ వైద్యులు గతంలో వైఎస్ జగన్ చేసిన మేలును గుర్తు చేసుకుని దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు. 2020లో జూడాల స్టైపెండ్ పెంచుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అసలేం జరిగిందంటే.. జూడాలకు స్టైపెండ్ చెల్లింపులకు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనలపై వైద్య విభాగాధిపతుల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2022లో నవంబర్ 28న వైద్య శాఖ ముఖ్యకార్యదర్శి.. డీఎంఈకి ఓ మెమో జారీ చేశారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న స్టైపెండ్ విధానాన్ని పరిశీలించాలని మాత్రమే ఆ మెమోలో సూచించారు. ఈ మెమోను గత వైఎస్ జగన్ సర్కారు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఇది జరిగిన కొద్దినెలలకే అంటే 2023లో బ్రాడ్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్తో సమానంగా తమ స్టైపెండ్స్ పెంచాలని సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కొద్ది నెలల వ్యవధిలోనే స్టైపెండ్స్ పెంచుతూ 2023 అక్టోబర్ 10న వైఎస్ జగన్ ప్రభుత్వం జీవో 624 విడుదల చేసింది. దీంతో మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.70 వేలు, రెండో ఏడాదికి నెలకు రూ.72 వేలు, మూడో ఏడాదికి నెలకు రూ.74 వేల మేరకు అప్పట్లో స్టైపెండ్లు పెరిగాయి. దీన్నిబట్టి పరిశీలిస్తే ఆ మెమో.. వైద్య శాఖ అధికారుల మధ్య సమాచార మార్పిడికి జారీచేసింది మాత్రమేనని తేటతెల్లమైంది. దీనిని అప్పటి ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోకపోయినా చంద్రబాబు సర్కారు దానిపై దుష్ప్రచారం చేస్తోంది.కోవిడ్ విపత్తులోనూ స్టైపెండ్ పెంపు 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది తిరగకుండానే కోవిడ్ మొదలైంది. 2021, 2022లో వైరస్ వ్యాప్తి తీవ్రమైంది. ఆ సంక్షోభ పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ సర్కార్ జూడాల స్టైపెండ్ కోతకు ఆలోచన కూడా చేయలేదు. వరుసగా 2020, 2022, 2023, 2024లలో జూడాల స్టైపెండ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం పెంచింది. ఆయుష్ వైద్య విద్యార్థులకూ అల్లోపతి వైద్య విద్యార్థులతో సమానంగా స్టైపెండ్ పెంపును వర్తింపజేసింది. 2009లో ఇచ్చిన 287 జీవో ప్రకారం 15 శాతానికంటే అధికంగా మొత్తంగా 42.4శాతం స్టైపెండ్ వైఎస్ జగన్ పెంచారు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు వర్తింపజేశారు. ఇలా వైఎస్ జగన్ చేసిన మేలు కళ్లెదుటే కనిపిస్తుంటే బాబు సర్కార్ దుష్ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం (ఫొటోలు)
-
రేపు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమకాలీన రాజకీయ పరిణామాలు, పలు కీలక అంశాలపై వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. -
కూటమి దొంగ ఓట్లు వేసుకునే ప్రమాదం ఉంది
-
సమరానికి సిద్దం లోకల్ ఎన్నికలకు సై
-
ఏకగ్రీవం అనే మాట వినిపిచకుండా.. స్థానిక ఎన్నికలు జరగాలి
-
ఆషామాషీగా తీసుకోవద్దు స్థానిక ఎన్నికలపై జగన్ దిశానిర్దేశం
-
YS జగన్ కు రాఖీ కట్టిన మహిళలు
-
స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికలు–బలమైన అభ్యర్థులుస్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతోపాటు బలం లభిస్తుంది. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికీ వెనకాడవద్దు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలిఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయంఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కో-ఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటా. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారన్నదానిపైనా నివేదికలు తీసుకుంటా. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే, మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు.గ్రామస్థాయి ప్రచార కార్యక్రమం“వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన”పై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలి. ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామగ్రిని పార్టీ అందిస్తుంది. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం జరగాలి.14–15 లక్షల గుర్తింపు కార్డులుపార్టీ కేడర్ కోసం దాదాపు 14–15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయి. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తాం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలి. సమావేశాల్లో గుర్తింపు కార్డులతోపాటు ఇంటింటి ప్రచార సామగ్రినీ కేడర్కు పంపిణీ చేయాలి. గుర్తింపు కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది; కార్యకర్తలు తమ ఫోన్లలోనే సమాచారాన్ని పొందవచ్చు. సెప్టెంబరు 5,6,7 తేదీల్లో ఒకరోజు ఏదో ఒకరోజు జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. సెప్టెంబరు 8,9,10,11 తేదీల్లో ఏదో ఒకరోజు అసెంబ్లీ నియోజవకర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. ఇక మండల, వార్డు, డివిజన్ స్థాయిల్లో సెప్టెంబరు 12 నుంచి 22 వరకూ సమావేశాలు నిర్వహిద్దాం. లీగల్, మీడియా సెల్స్ యాక్టివ్గా ఉండాలిప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్లను వెంటనే బలోపేతం చేయాలి. పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కేడర్పై దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉంది; కార్యకర్తలను రక్షించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్ సెల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేయాలి. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలి. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్, మీడియా వ్యవస్థలన్నీ ఒకే యూనిట్గా పనిచేయాలి.సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యంప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి, మిగిలిన వారినీ యాక్టివేట్ చేయాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపైకి మొత్తం పార్టీ కేడర్ను తీసుకురావాలి. సోషల్ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలి. జగన్ 2.0 సూపర్ యాప్, వైయస్సార్సీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాలి. పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవాలి. పార్టీ కేడర్కు వాస్తవ సమాచారం, అవసరమైన న్యూస్ కంటెంట్ నిరంతరం అందాలి. నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వ్యక్తిగతంగా కలిసి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరాలి. ఎందుకంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రతికూల మీడియా వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం.నాయకులకు హెచ్చరికనియోజకవర్గాల్లో మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్స్పై యాక్టివ్గా లేని నాయకులు ఇప్పటికైనా గేర్ మార్చాలి. నాయకులు కార్యకలాపాలను తమ నియంత్రణలోకి తీసుకోకపోతే కార్యకర్తలు నష్టపోతారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైయస్సార్సీపీ–కూటమి పాలన మధ్య తేడాను వివరించాలి.ఈగోలకు తావులేదుస్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలి. తొమ్మిది ఓట్లతో గెలిచిన సందర్భాలు, తొమ్మిది ఓట్లతో ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటూ కీలకమే. “జో జీతా వహీ సికందర్”.. గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి. ప్రతి గ్రామంలో పార్టీని బలంగా కన్సాలిడేట్ చేసి, సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం సృష్టించాలి. రాబోయే 60–70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టిపెట్టాలి. సరైన శ్రద్ధ, పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటే స్థానిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాంవాళ్ల పేర్లు డిజిటల్ బుక్లోకి..పోలీసు అధికారులు పదవిని దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. కానీ అలా జరగడం లేదు. కార్యకర్తలను వేధించే, అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తప్పవు. ప్రతి పోలీసు అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థలో నిష్పాక్షికత తీసుకురావడానికి పార్టీ నాయకులు గట్టి ప్రయత్నం చేయాలి అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: ఆలయాల విధ్వంసం.. పవన్ కంటికి కనిపించడం లేదా? -
స్థానిక ఎన్నికలపై పార్టీ ముఖ్యనేతలతో జగన్ భేటీ
-
YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్
-
YSRCP ముఖ్య నేతలతో జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
ముఖ్య నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు.రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. -
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులతో వెంటనే చర్చలు జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు
-
YS జగన్ పాలనలో విద్యా వికాసం, ఇప్పుడు విధ్వంసం
-
చంద్రబాబూ.. మీ అహంకారం వీడండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల(జూడా)ను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో సీఎం చంద్రబాబు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మండిపడ్డారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని స్టైపెండ్ను 15 శాతం కంటే మెరుగ్గా పెంచాలని జానియర్ డాక్టర్లు కోరుతుంటే కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని ప్రభుత్వం చెప్పడం అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో జీవో 287లో నిర్దేశించిన 15 శాతం కంటే అధికంగా.. మొత్తంగా 42.4 శాతం స్టైపెండ్ పెంచామని గుర్తు చేశారు. సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తిని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్దేశించిన దాని కంటే పెంచి.. మొత్తంగా 77 శాతం పెంపు వర్తింపజేశామన్నారు. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచామని చెప్పారు. ఇప్పటికైనా అహంకారం వీడి, జూడా ప్రతినిధులతో వెంటనే చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చంద్రబాబుకు సూచించారు. తగిన స్థాయిలో స్టైపెండ్ పెంచి, సమ్మెను విరమింపజేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలని హితవు పలికారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..రెండు వారాలైనా స్పందించరా?‘రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు? నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలు కావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపేశారు? జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితికి చంద్రబాబు ప్రభుత్వ మొండి వైఖరి కారణం కాదా? ఇప్పటికే ప్రభుత్వం పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవైపు ప్రభుత్వ వైద్య రంగాన్ని దారుణంగా దెబ్బ తీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు చేపట్టాం. ఐదింటిని పూర్తి చేసి, తరగతులు కూడా ప్రారంభించాం. మరో కాలేజీని క్లాసులకు సిద్ధం చేశాం. ఇలా మొత్తంగా 6 కళాశాలలు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తి చేయాల్సి ఉండగా, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిసరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. డబ్ల్యూహెచ్వో/జీఎంపీ ప్రమాణాలు ఉండే మందులు లేక ప్రభుత్వాస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్య రంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. -
నేడు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ రీజినల్ కో–ఆర్టీనేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్టీనేషన్, అనుబంధ విభాగాలు), స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొననున్నారు.రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ ప్రక్రియ తదితర కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఈ అంశాలపై పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. -
జూడాల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం
తాడేపల్లి: జూనియర్ డాక్టర్ల పట్ల చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపు వైఖరిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వాకం వల్ల వారు స్టైఫండ్ కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి.. పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు వైఎస్ జగన్. ‘చంద్రబాబూ… రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు ఎందుకు స్పందించడం లేదు?, నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలుకావాల్సిన స్టైఫండ్ సవరణను ఎందుకు నిలిపివేశారు?, జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తిని కూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి, మొత్తంగా 77శాతం వారికి పెంచాం. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచాం. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే, కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా?, జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకూ అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.ఈ పరిస్థితికి మీ ప్రభుత్వ మొండి వైఖరే కారణం కాదా చంద్రబాబు?, ఇప్పటికే మీరు పెట్టిన బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవైపు ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి, ఐదింటిని పూర్తిచేసి క్లాసులు కూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సరిపోక ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు–నేడు పనులను మీరు నిలిపివేశారు. WHO/GMP ప్రమాణాలు ఉండే మందులు లేక గవర్నమెంటు ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయి. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారు. వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్లను నిర్వీర్యం చేశారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారు. ప్రజారోగ్య వ్యవస్థలో మీరు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు జూనియర్ డాక్టర్ల విషయంలోనూ అహంకారంతో వ్యవహరిస్తూ, మిగిలిన వైద్యసేవలను కూడా పేదలకు దూరం చేస్తున్నారు. చంద్రబాబూ.. ఇప్పటికైనా అహంకారం వీడండి. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి. తగిన స్థాయిలో స్టైపెండ్ను పెంచి, సమ్మెను విరమింపజేసి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడండి’ అని సూచించారు..@ncbn గారూ… ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి, పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా?రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా మీరు… pic.twitter.com/g6QjRjj4kA— YS Jagan Mohan Reddy (@ysjagan) August 24, 2026 ఇదీ చదవండి: వెన్నుపోటు పార్టీపై బీసీ గర్జన! -
రేపు YSRCP ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత ప్రజా సమస్యలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రజాపోరాటాలపై నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరుకానున్నారు. -
బాబూ.. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సమాధానమేది?
ఆంధ్రప్రదేశ్లో విశ్వసనీయతతో కూడిన రాజకీయానికి, బుకాయింపు రాజకీయానికి మధ్య ఉన్న తేడాను గమనించండి. డీఎస్సీ అక్రమాలపై సాక్ష్యాధారాలు చూపుతూ మీడియా సమావేశంలో వివరించడమే కాకుండా, వైఎస్సార్సీపీ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చేసిన ఆరోపణలు అన్నింటికి జవాబు ఇచ్చిన తీరు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతను పెంచిందని చెప్పాలి.ప్రతిపక్షం లేని అసెంబ్లీలో చంద్రబాబు, మంత్రి లోకేష్లు డీఎస్సీపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇచ్చి, విపక్షం ఉన్న శాసనమండలిలో అసలు చర్చకే వెనుకాడడం, దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఏపీపీఎస్సీపై ఆరోపణలు చేసిన వైనంతో వారు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో లోకేష్ పరిణితితో వ్యవహరించలేకపోతే, చంద్రబాబు మాత్రం డబాయింపు విధానాన్ని అనుసరించారన్న అభిప్రాయం కలుగుతుంది. అన్నింటికి మించి డీఎస్సీ, ఏపీపీఎస్సీలు రెండిటి పైన సీబీఐ విచారణకు అప్పగించాలని జగన్ సవాల్ విసరడంతో చంద్రబాబు, లోకేష్లకు గుక్క తిప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి.మామూలుగా అయితే జగన్ మీడియా సమావేశం పూర్తి కాగానే టీడీపీ అధినేతలు దానికి కౌంటర్గా వారే మాట్లాడడం కాని, లేదా పార్టీ ఇతర నేతలతో కాని జవాబు ఇప్పించేవారు. కాని అలా చేసినట్లు కనిపించలేదు. అసెంబ్లీలో వీరు ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూటమి ఎమ్మెల్యేలు దాదాపు మౌన ప్రేక్షకుల మాదిరిగానే ఉన్నారనిపించింది. దాదాపుగా ఒక్క ప్రశ్న కూడా వేయకపోవడం, ముఖ్యమంత్రి, మంత్రి చెబుతున్న దానిలో హేతుబద్దత లేదన్న భావన కలుగుతున్నా వాటిని ఎత్తిచూపలేకపోవడం వారి బలహీనతగా తీసుకోవాలి. టీచర్ల నియమాకాలకు సంబంధించి జరిగే డీఎస్సీ ప్రక్రియలో, ప్రత్యేకించి క్రీడా రిజర్వేషన్ విభాగంలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ నిర్దిష్ట ఆధారాలతో ఆరోపిస్తోంది. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ సభ్యులు పోరాటం చేశారు. వెంటనే ఆ అక్రమాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కాని అధికార టీడీపీ చర్చకు ముందుకు రాలేదు. పోనీ అసెంబ్లీలో కూడా ఈ అంశం చర్చకు పెట్టకుండా ఉంటే అదో పద్దతి అనిపించేది. చంద్రబాబు, లోకేష్లు డీఎస్సీ అక్రమాలు జరగలేదని చెప్పడానికి చేసిన వాదనలో చాలా లోపాలు కనిపించాయి. జగన్ చేసిన ఆరోపణలు ఒక్కోదానికి క్లారిటీగా సమాధానం ఇవ్వలేకపోయారు. వాటిలో కొన్నిటిని పరిశీలించండి.జగన్ తన వాదనలో ప్రధానంగా క్రీడా కోటాలో 372 పోస్టులు పరీక్షలు లేకుండా ఇచ్చిన విదానాన్ని ప్రశ్నించారు. ఇందుకోసం రెండు జీఓలు ఇచ్చి, వారికి ఉద్యోగాలు ఇచ్చేశాక మళ్లీ ఆ జీఓలను రద్దు చేస్తూ వేరొక జీఓ ఇవ్వడం గురించి జగన్ ప్రస్తావించారు. తమకు కావల్సినవారికి ఉద్యోగాలు ఇచ్చి, తదుపరి గేట్లు మూసివేశారా అన్నది ఆయన వేసిన ప్రశ్న. దీనికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా జవాబు ఇచ్చినట్లు కనిపించలేదు. ప్రఖ్యాత క్రీడాకారిణి పీవీ సింధూతో ఈ టీచర్లను లోకేష్ పోల్చడాన్ని యావన్మంది తప్పుపట్టారు. ఈ విషయం కూటమి ఎమ్మెల్యేలకు కూడా అర్థం అయి ఉండాలి. కాని అధికార పక్షంలో ఉన్నందున వారు అడగలేకపోయి ఉంటారు. లోకేష్ తీరు ఇమ్మెచ్యూర్గా ఉందని పలువురు విశ్లేషకులు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మేధావులు వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖల ఆధారంగా ఉద్యోగాలు ఎలా ఇస్తారో అర్థం కాదు. కేవలం స్థానికంగా ఆటలలో పాల్గొంటే చాలన్న పద్దతి బహుశా దేశంలో మరే రాష్ట్రంలో ఉండి ఉండదు. చిత్రంగా జాతీయస్థాయి క్రీడలలో మెడల్స్ సంపాదించిన కొందరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. వారు బహిరంగంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. నవీన్ అనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు వచ్చినట్లు ప్రకటించడం, ఆ తర్వాత అతనిని మెరిట్ లిస్ట్ నుంచి తొలగించడం, పరీక్ష పత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యతలు ఒకరికే అప్పగించడం వంటివాటిని లోకేష్ సమర్ధించుకున్న తీరు కూడా అంత బాగోలేదు.టీచర్ల పోస్టులకు బేరాసారాలు సాగిన ఆడియో తదితర విషయాలను కూడా జగన్ ఆధారసహితంగా చూపించారు. చంద్రబాబు, లోకేష్లు ఇచ్చిన సమాధానాలలో పరస్పర విరుద్దంగా ఉన్న అంశాలను కూడా ప్రస్తావించారు. జగన్ లేదా వైఎస్సార్సీపీ డిమాండ్ చేసినంతనే లోకేష్ తన పదవికి రాజీనామా చేస్తారని ఎవరూ అనుకోలేదు. కాని తన వైపు తప్పులేదని చెప్పుకోవడానికి ఆయన పడిన పాట్లు, ఆయనను రక్షించడానికి తండ్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన యత్నాలు అందరికి అర్థం అయిపోయాయన్నది పలువురి భావన.చంద్రబాబు తనదైన శైలిలో ఎదురుదాడి చేయడానికి యత్నించారు. పనికట్టుకుని ఏపీపీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ, తన జీవితంలోనే ఎన్నడూ ఇలాంటి కుంభకోణం చూడలేదంటూ పెద్ద హడావుడి చేయాలని ఆయన తలపెట్టారు. కాని అది పండలేదు. అసెంబ్లీలో అయినా, బయట అయినా ఆయన ఎంత గట్టిగా మాట్లాడితే, అంత అసత్యం అయి ఉంటుందని, గతంలో వైఎస్సార్సీపీలో ఉండి, ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఒక ఎమ్మెల్యే అంటుండేవారు. పనికట్టుకుని జగన్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న అధికారి గురించి చంద్రబాబు ప్రస్తావించడంపై రకరకాల చర్చలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో చంద్రబాబుపైన పలు కీలకమైన కేసులు రావడానికి ఆ అధికారి కారణమన్న కోపం ఉండి ఉండవచ్చని, దానిని ఈ సందర్భంగా బయటపెట్టారని కొందరు అంటున్నారు.అయితే జగన్ తన వివరణలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అన్నిటిని పటాపంచలు చేసే విధంగా మాట్లాడారు. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఆ తర్వాత మెయిన్స్ పరీక్షలు తమ ప్రభుత్వంలో జరిగాయని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మొత్తం ప్రక్రియ జరిగిందని ఆయన తెలిపారు. అసలు సంబంధం లేని డిజిటల్ వాల్యుయేషన్, హాయ్ లాండ్ ఇష్యూలను తెరపైకి తెచ్చి, వాస్తవాలు మరుగున పరచడానికి ముఖ్యమంత్రి యత్నించారని ఆయన ఆరోపించారు. వాటిని కూడా ప్రస్తావించి జగన్ హైకోర్టు తప్పుపట్టలేదన్న సంగతిని గుర్తు చేశారు.గ్రూప్-1 పరీక్షలలో అవకతవకలు జరగలేదని చంద్రబాబు ప్రభుత్వం నియమించిన సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చిందని, పేపర్ టాంపర్ కాలేదని సీఎఫ్ఎస్ఎల్ నివేదిక పేర్కొందని జగన్ వెల్లడించడంతో కూటమి ప్రభుత్వ వాదనంతా వీగిపోయినట్లయింది. ఇంటర్వ్యూ బోర్డుల ఏర్పాటు, వాల్యుయేషన్ మూడు ప్రదేశాలలో జరపడం, అన్నిచోట్ల సిసిటీవీ కెమెరాల అమరిక జంబ్లింగ్ మొదలైన పద్దతులను కట్టుదిట్టంగా అమలు చేశామని జగన్ తెలిపారు. చంద్రబాబు, లోకేష్లు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వారిలో తమ ప్రభుత్వం తప్పు చేయలేదన్న కాన్పిడెన్స్ను చూపించలేకపోయారన్న అభిప్రాయం పలువురిలో ఏర్పడింది.అదే టైమ్లో జగన్ తన ప్రజెంటేషన్లో ఒక స్పష్టత, వీడియో, ఆడియో ఆధారాలు, ప్రభుత్వ జీఓలు, కోర్టు తీర్పులలోని వివిధ భాగాలు మొదలైనవాటిని చూపించడం ద్వారా తన క్రెడిబిలిటీని మరోసారి రుజువు చేసుకున్నట్లయింది. ఈ వివాదాల నుంచి బయటపడాలంటే, అవినీతి జరగలేదని, తాము అసత్యాలు చెప్పడం లేదని ప్రజలను నమ్మించాలంటే చంద్రబాబు ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే జగన్ విసిరిన సవాల్కు ధైర్యంగా స్పందించి డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండిటిపైన సీబీఐ విచారణకు ఆదేశించడమే. మరి వారు అలా చేయగలుగుతారా!.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైఎస్సార్సీపీ బీసీ నేతల సమావేశం ప్రారంభం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బీసీ నేతల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలోని బీసీ నేతలు ఈ భేటీకి హాజరై పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలపై జరుగుతున్న దాడులు, బీసీలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.అలాగే రానున్న రోజుల్లో బీసీల కోసం పార్టీ తరఫున చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీల హక్కులు, రక్షణ, సంక్షేమం వంటి అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై జరుగుతున్న దాడులపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, ఆయా ఘటనలపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బీసీల సమస్యలపై పార్టీ భవిష్యత్ కార్యాచరణను నేతలు వెల్లడించే అవకాశం ఉంది. -
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు చెబుతున్నారు... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
బడులు ఖాళీ అవుతున్నా బాబు అబద్ధాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24లో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 5.56 లక్షలు తగ్గిందని కేంద్ర విద్యా శాఖకు చెందిన యూడైస్ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్–యూడీఐఎస్ఈ) గణాంకాలు తేల్చిచెబుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందంటూ చంద్రబాబు సర్కార్కు చురకలంటించారు. ‘యూడైస్+’ గణాంకాలను ఉటంకిస్తూ ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో కూటమి సర్కార్ అనుసరిస్తున్న తీరును కడిగిపారేశారు. విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయని, విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా.. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఎత్తిచూపారు. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామమంటూ ‘ఎక్స్’లో తన ఖాతాలో ఆదివారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. వైఎస్ జగన్ ఆ పోస్టులో ఏమన్నారంటే.. బాబు ప్రభుత్వ డొల్ల ప్రచారం.. ఈ లెక్కలే సాక్ష్యం.. ‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంతో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో 5,56,666 మంది విద్యార్థులు తగ్గినట్లు వెల్లడిస్తున్న యూడైస్ ప్లస్ నివేదిక 2023–24 విద్యాసంవత్సరంతో పోల్చితే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222కు, ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య 991 నుంచి 797కు తగ్గినట్లు వెల్లడిస్తున్న యూడైస్ ప్లస్ నివేదిక » నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యూడైస్’ వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది. » అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రైవేటు విద్యా సంస్థలతో టీడీపీకి ఉన్నఅపవిత్ర సంబంధం కారణంగానే.. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది. విద్యారంగంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు» వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు–నేడు కార్యక్రమం కోసం మా ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది.» ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం.» ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. » ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం. -
ప్రభుత్వ బడులు ఖాళీ.. లోకేష్ తప్పుడు లెక్కలపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా YS జగన్ నివాళి
-
ప్రభుత్వ బడులు ఖాళీ.. 5.56 లక్షల మంది విద్యార్థులెక్కడ?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. ‘UDISE+’ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలని వైఎస్ జగన్ తెలిపారు. కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి అని వివరాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాల్లో ఇప్పటికే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. ‘మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 2023–24తో పోలిస్తే 2025–26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటోంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతోనే దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది’.‘నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన ‘యుడైస్’( యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ – యూడీఐఎస్ఈ) వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2023–24 విద్యా సంవత్సరం, 2025–26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి పడిపోయింది. అంటే ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 45 వేల నుంచి 44,222 కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. మరోవైపు అదే సమయంలో ప్రైవేటు యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగింది’.‘అలా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే, కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం’.𝗧𝗵𝗲 𝗣𝗹𝗶𝗴𝗵𝘁 𝗼𝗳 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁 𝗦𝗰𝗵𝗼𝗼𝗹𝘀 𝗶𝗻 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵: 𝗔 𝗖𝗿𝗶𝘀𝗶𝘀 𝗼𝗳 𝗘𝗻𝗿𝗼𝗹𝗺𝗲𝗻𝘁 𝗮𝗻𝗱 𝗣𝘂𝗯𝗹𝗶𝗰 𝗘𝗱𝘂𝗰𝗮𝘁𝗶𝗼𝗻𝗧𝗵𝗲 𝗥𝗲𝗮𝗹𝗶𝘁𝘆 𝗕𝗲𝗵𝗶𝗻𝗱 𝘁𝗵𝗲 𝗘𝗻𝗿𝗼𝗹𝗺𝗲𝗻𝘁 𝗖𝗹𝗮𝗶𝗺𝘀 𝗼𝗳 𝘁𝗵𝗲… pic.twitter.com/iJEkKuRO6w— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2026‘ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు విద్యా రంగంలో నారాయణ, శ్రీచైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం వంటి సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలతో టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ, ప్రైవేటు విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకరమైన పరిస్థితి ఇది’.‘2019–24 మధ్య గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. మనబడి నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఫర్నిచర్, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యాసంస్థల రూపురేఖలను మార్చాం. మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించగా, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతున్నాయి. నాడు-నేడు కార్యక్రమం కోసం మన ప్రభుత్వం రూ.8,524 కోట్లు ఖర్చు చేసింది’.‘ఎనిమిదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించాం. పేద పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాం. విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించాం. ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ (ఐఎఫ్పీ) ఏర్పాటు చేశాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశాం. ఇంకా మూడో తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లిష్లో నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టాం. ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఒప్పందం చేసుకున్నాం’.ఇది కూడా చదవండి: అల్లూరి గుహలపై టీడీపీ నేతల కన్ను.. ‘ఇంకా మన పిల్లలు ప్రపంచస్థాయిలో పోటీ పడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బాకలారియేట్–ఐబీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించాం. ఐబీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మన ప్రభుత్వం ప్రతి అడుగూ ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతుండగా, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యా రంగంలో ఆందోళనకర పరిణామం’ అని వెల్లడించారు. -
ప్రకాశం పంతులు జయంతి.. వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: నేడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. ప్రకాశం పంతులుకు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, తెలుగువారి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి దృఢమైన పునాదులు వేసిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి దాయకం. ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, తెలుగువారి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర ప్రగతికి దృఢమైన పునాదులు వేసిన ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి దాయకం.… pic.twitter.com/73ZxbQUDXG— YS Jagan Mohan Reddy (@ysjagan) August 23, 2026 -
ఉలకవేం బాబూ.. పలకవేం లోకేశ్.. వైఎస్ జగన్ సవాల్పై నోరు మెదపరేం?
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి బట్టబయలు చేశారు. ఈ స్కామ్ నుంచి తన కొడుకు, విద్యా శాఖ మంత్రి లోకేశ్ను కాపాడుకోవాలన్న ఆరాటంతో ఏపీపీఎస్సీ–2018 గ్రూప్–1 నియామకాలపై సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ తప్పుడువేనంటూ సాక్ష్యాధారాలతో బహిర్గతం చేశారు. గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, మరి డీఎస్సీ–2025పై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబు, లోకేశ్కు వైఎస్ జగన్ సవాల్ విసిరారు. సిద్ధమైతే రెండింటిపై తక్షణమే సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని ఛాలెంజ్ చేశారు. వైఎస్ జగన్ సవాల్ విసిరి.. ఛాలెంజ్ చేసి 36 గంటలు గడిచినా అటు సీఎం చంద్రబాబుగానీ.. ఇటు మంత్రి లోకేశ్గానీ దానిపై నోరు మెదపడం లేదు. సవాల్ను స్వీకరిస్తున్నట్లుగానీ.. ఛాలెంజ్కు సిద్ధపడుతూ సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాస్తామనిగానీ వారిద్దరూ ప్రకటించలేదు. డీఎస్సీ కుంభకోణానికి పాల్పడ్డారు కాబట్టే తండ్రీకొడుకులు ఇద్దరూ మౌన ముద్ర దాల్చారని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, విద్యావేత్తలు, మేధావులు స్పష్టం చేస్తున్నారు. ‘నీట్ ప్రశ్నపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, లోకేశ్కు మరో నీతి ఉంటుందా?’ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మెగా డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అడ్డంగా దొరికిపోయిన తండ్రీ కొడుకులు » డీఎస్సీ కుంభకోణం, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు, లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి చూపుతూ వారు చెబుతున్నవన్నీ అబద్ధాలేనంటూ వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. » రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ, పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు లోకేశ్ స్వయంగా అంగీకరించడాన్ని గుర్తు చేస్తూ, ప్రశ్నల లీకేజీకి ద్వారాలు తెరిచిన వైనాన్ని వివరించారు. » ‘డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారీ విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు తొలి ర్యాంక్ వచ్చి ందని చంద్రబాబు, లోకేశ్ అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మొదటి మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది. రెండో లిస్ట్లో నవీన్ పేరు తీసేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చి న నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి. ఆయనకు ప్రశ్నపత్రం యాక్సెస్ ఉంది కాబట్టి. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. నవీన్కు ఉద్యోగమిస్తే గోల అవుతుంది కాబట్టి. అందువల్ల ముందస్తుగానే మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు తొలగించారు. నవీన్ కోర్టుకు వెళ్లాడు. ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నాడు. మరి ఇది నవీన్ దగ్గరే ఆగిపోయిందా? లేక ఇంకా జరిగిందా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. » చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు, లోకేశ్ ఒప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ దీన్ని సమర్థించుకోవడానికి క్రీడాకారులకు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని.. పీవీ సింధుకు నేరుగా ఉద్యోగం ఇచ్చిన రీతిలోనే 372 టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చామని చెప్పడాన్ని ఎత్తిచూపారు. వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకునేందుకు ప్రత్యేకంగా జీఓ నెం.4, జీవో నెం.47 ఇచ్చి గేట్లు ఎత్తారని.. పని పూర్తయిన తర్వాత జీవో నెం.23, జీవో నెం.56 ఇచ్చి మళ్లీ గేట్లు మూసేశారని చెప్పారు. ఇంతకు ముందు పరీక్షలతో సంబంధం లేదన్నారని.. తర్వాత జీవోల్లో పరీక్షలో అర్హత సాధించాల్సిందేనన్నారని.. అంటే మళ్లీ గేట్లు మూసేశారని వివరించారు. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ‘సాఫ్ట్బాల్’ అసోసియేషన్ నుంచి, అలాగే లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న ‘జూడో’ అసోసియేషన్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో పోస్టులు భర్తీ చేసిన వైనాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో చంద్రబాబు, లోకేశ్ ఒప్పుకున్నారని.. కానీ బేరసారాలు జరిపిన వ్యక్తిని అరెస్టు కూడా చేయకపోవడాన్ని ఎత్తిచూపారు. » వైఎస్ జగన్ సాక్ష్యాధారాలతో డీఎస్సీ కుంభకోణాన్ని బట్టబయలు చేయడంతో తండ్రీకొడుకులు అడ్డంగా దొరికిపోయారని.. తేలుకుట్టిన దొంగల్లా నోరు మెదపడం లేదని డీఎస్సీ అభ్యర్థులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం డీఎస్సీ కుంభకోణాన్ని సాక్ష్యాధారాలతో బట్టబయలు చేస్తూ.. ఎన్నో కీలక డాక్యుమెంట్లను ప్రదర్శిస్తూ.. సీబీఐ దర్యాప్తునకు సిద్ధమా అంటూ వైఎస్ జగన్ సవాల్ విసిరారు. 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గ్రూప్–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏకంగా గంటా 54 నిమిషాల పాటు సుదీర్ఘంగా వీటి గురించి వివరిస్తూ మాట్లాడారు. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నేరుగా స్పందించకుండా ఎప్పటిలాగే టాపిక్ డైవర్షన్కు తెర తీశారు. ఇన్ని ముఖ్యమైన అంశాలపై స్పందించకుండా డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఒకటే అన్నారంటూ నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో తమకు అలవాటైన రీతిలో విష ప్రచారం చేస్తున్నారని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు మండిపడుతున్నారు. కళ్లెదుటే డీఎస్సీ కుంభకోణంపై సాక్ష్యాలు కనిపిస్తుంటే వాటిపై స్పందించే దమ్ము, ధైర్యం లేక ఇలా పలాయన మంత్రం పఠిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. -
మీకంటే వైఎస్ జగన్పాలన వంద రెట్లు బాగుంది
సాక్షి, అమరావతి: నవులూరు రైతుల ఆస్తిని దొబ్బేసి, వాళ్లు దాని కోసం కాళ్లరిగేలా తిరుగుతుంటే పట్టించుకోకుండా పాలాభిషేకం చేయమంటారా అని సీఎం కుమారుడు, మంత్రి లోకేశ్పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నవులూరు రైతుల సమస్యను స్వయంగా తెలుసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో ప్రజల ఆస్తులను లాక్కుంటున్న మీకు పాలాభిషేకం కావాలా అని ప్రశ్నించారు. మీ పాలనకంటే వైఎస్ జగన్ పాలన వంద రెట్లు బాగుందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. నవులూరు గ్రామంలోని సర్వే నంబర్ 774లో ఉన్న 30 ఎకరాల భూమికి వందేళ్లకుపైగా చరిత్ర ఉందని తెలిపారు.1907లో బ్రిటిష్ వాళ్లు రాసిన ఆర్ఎస్ఆర్లో ఈ భూమిని చెరువుగా పేర్కొన్నారని, 1913లో అదే భూమిని ఆరు సర్వే నంబర్లుగా విభజించి వ్యవసాయానికి అనుగుణమైన భూమిగా గుర్తించారని తెలిపారు. 1923–25 ప్రాంతంలో ఎకరన్నర, రెండు ఎకరాల చొప్పున పలువురు వ్యక్తులకు ఆ భూములను అసైన్ చేశారని చెప్పారు. ఆ తర్వాత వందేళ్లలో భూములు పలువురి చేతులు మారాయన్నారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గుంటూరు కలెక్టర్ ఈ 30 ఎకరాల భూమిని సీఆర్డీఏకు అప్పగించేశారని తెలిపారు. బాధితులు కలెక్టర్కు అర్జీలు పెట్టగా తాము ఆ భూమిని సీఆర్డీఏకు దానం చేసేశామని, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పారని వివరించారు. పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టుకుంటే సీఆర్డీఏ నుంచి సమాధానం రావాల్సి ఉందని చెప్పి వాళ్లు మాత్రం అర్జీ పరిష్కారమైందని రాసేసుకున్నారని విమర్శించారు. కోర్టు వ్యాజ్యంలో ఉన్న భూమిని రాజధాని కోసం లాగేసుకుంటారా అని మండిపడ్డారు. అమరావతిని నిర్మించడానికి రైతుల పొట్ట కొడతారా, ఆస్తి హక్కు ఉన్నవారికి పరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. 200 గజాల స్థలం కోసం బాధితుడు మళ్లీ హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇదీ లోకేశ్ నియోజకవర్గంలో జరుగుతున్న తంతు అని అన్నారు. ఎవరి శవాల మీద మీరు రాజ్యం ఏలుదామని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆస్తుల మీద మీరు రాజ్యం ఏలదామని అనుకుంటున్నారని మండిపడ్డారు. -
హోరెత్తిన అభిమాన సంద్రం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో పర్యటించారు. నగరంలోని జల విహార్ గ్రాండ్ లాన్స్లో జరిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు స్నిగ్ధ, అనంత పినాక్ శర్మలను ఆశీర్వదించి, వారికి హృదయ పూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడున్న వారందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు. వైఎస్ జగన్ కాన్వాయి జల విహార్ గేటులోకి ప్రవేశించగానే పెద్ద ఎత్తున అభిమానులు జై జగన్.. అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వైఎస్ జగన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న సమయంలోనూ పెద్ద సంఖ్యలో అభిమానులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం మార్మోగింది. తమ అభిమాన నాయకుడితో కరచాలనం చేసేందుకు, మాట్లాడేందుకు పలువురు పోటీపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపు చేయడం కాస్త కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్.. కరచాలనం చేసుకుంటూ.. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాన్వాయ్ వెంట ద్విచక్ర వాహనాలపై యువత దారి పొడవునా జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకుసాగారు. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ రాక సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వైఎస్ జగన్తో పాటు కేసీఆర్, కేటీఆర్ చిత్రాలతో రూపొందించిన కటౌట్లు కనిపించాయి. ‘ధీరుడు వైఎస్ జగన్కు స్వాగతం’.. ‘వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తుంది’ అనే క్యాప్షన్తో ఏర్పాటైన కటౌట్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. కాగా, వివాహ వేడుకలో వైఎస్సార్సీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్, రోజా, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, విడదల రజిని, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్లతో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. -
షావుకారు జానకి మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి
-
షావుకారు జానకి మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి కన్నుమూతపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో షావుకారు జానకి గారు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి దిగ్గజ నటుల సరసన కథానాయికగా నటించడంతో పాటు, తదనంతరం తల్లి, అమ్మమ్మ, నానమ్మ వంటి విభిన్న పాత్రల్లోనూ తన సహజ నటనతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు.భారతీయ చలనచిత్ర రంగానికి షావుకారు జానకి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని, నంది అవార్డులతో పాటు అనేక పురస్కారాలు ఆమె ప్రతిభకు దక్కిన గౌరవాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. షావుకారు జానకి మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పేర్కొంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ పరిశ్రమకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.👉ఇదీ చదవండి: ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూత -
హైదరాబాద్ లో జగన్ జన ప్రభంజనం
-
హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు)
-
హైదరాబాద్ లో నూతన వధూవరులను ఆశీర్వదించిన YS జగన్
-
హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్, జనసంద్రంగా మారిన బేగంపేట్ ఎయిర్ పోర్ట్
-
హైదరాబాద్లో జగన్ మాస్ క్రేజ్... తగ్గేదేలే
-
Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం
-
హైదరాబాద్లో వైఎస్ జగన్ భారీ ఫ్లెక్సీలు.. అభిమానుల కోలాహలం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట్ ఎయిర్పోర్టు వద్ద సందడి నెలకొంది. వైఎస్సార్సీపీ అభిమానులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్టు వద్దకు చేరుకున్నారు. తమ అభిమాన నేత వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎయిర్పోర్టు వద్ద వేచి చేస్తున్నారు.మరికాసేపట్లో వైఎస్ జగన్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. దీంతో ఆయన రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వైఎస్ జగన్ రాకతో బేగంపేట్ పరిసరాల్లో సందడి నెలకొంది. అభిమానులు, పార్టీ శ్రేణుల రాకతో ఎయిర్పోర్టు పరిసర రోడ్లు జనసంద్రంగా మారాయి. వైఎస్ జగన్ను చూసేందుకు, స్వాగతం పలికేందుకు భారీగా కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది.Hearty welcome @ysjagan Anna 🔥🔥🔥 pic.twitter.com/IQvz55shwJ— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) August 21, 2026మరోవైపు.. వైఎస్సార్సీపీ అభిమానులు హైదరాబాద్లో భారీ స్థాయిలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్పై తమ అభిమానాన్ని చాటుకుంటూ ఫొటోలు పెట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. YSJAGAN Telangana Hyderabad Visit Draws AttentionYS Jagan is set to arrive in Hyderabad today. Large welcome posters and cutouts have appeared across the city, including a striking @ysjagan @KCRBRSPresident – @KTRBRS display arranged by BRS leader Chirra Ravinder Yadav pic.twitter.com/o2X6BuiKMl— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) August 21, 2026 -
మహిళలకు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఈ రోజు శ్రావణ శుక్రవారం సందర్బంగా మహిళలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు తెలిపారు. "నా అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మీవ్రత శుభాకాంక్షలు.సర్వమంగళకారిణి లక్ష్మీదేవి అనుగ్రహంతో, ప్రతి ఇల్లు సిరిసంపదలతో సుఖశాంతులతో ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అని వైఎస్ జగన్ పేర్కొన్నారునా అక్క చెల్లెమ్మలందరికీ వరలక్ష్మివ్రత శుభాకాంక్షలు. సర్వమంగళకారిణి లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఇల్లు సిరిసంపదలతో, సుఖశాంతులతో, ఆరోగ్యంతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.— YS Jagan Mohan Reddy (@ysjagan) August 21, 2026 -
YSRCP అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్ కు హాజరైన వైఎస్ జగన్
-
హైదరాబాద్లో వైఎస్ జగన్.. జలవిహార్ వద్ద అభిమానుల సందడి
వైఎస్ జగన్ హైదరాబాద్ పర్యటన అప్డేట్స్..కొత్త జంటకు వైఎస్ జగన్ ఆశీర్వాదం.. జల విహార్ చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు స్వాగతం పలికిన పెండ్యాల కుటుంబ సభ్యులునూతన వధువరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్.వైఎస్ జగన్ను చూసేందుకు భారీగా జల విహార్ చేరుకున్న అభిమానులు.వైఎస్ జగన్ వెంట భారీగా తరలివచ్చిన అభిమానులుసీఎం సీఎం నినాదాలతో దద్దరిల్లుతున్న జలవిహార్ బేగంపేట నుంచి జలవిహార్కు బయలుదేరిన వైఎస్ జగన్వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట భారీ జనసందోహం.. ఎయిర్పోర్టు వద్ద కోలాహలం.. బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వైఎస్ జగన్వైఎస్ జగన్కు స్వాగతం పలికిన వైఎస్సార్సీపీ నేతలు అయోధ్య రామిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, నాగార్జున, పెండెం దొరబాబు, పూత్త ప్రతాపరెడ్డి, కొండా రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులుబేగంపేట విమానాశ్రయానికి పెద్దఎత్తున చేరుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు ,అభిమానులుమరికాసేపట్లో జలవిహార్లో జరగనున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్న వైఎస్ జగన్👉వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు హైదరాబాద్కు బయలుదేరారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పెండ్యాల సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో సుమారు రెండు గంటల పాటు వైఎస్ జగన్ ఉండనున్నారు. Hearty welcome @ysjagan Anna 🔥🔥🔥 pic.twitter.com/IQvz55shwJ— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) August 21, 2026హైదరాబాద్లో జగనన్న ఫ్లెక్సీలు.. -
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
గ్రూప్-1పై, మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?.. చంద్రబాబు, నారా లోకేష్కు వైఎస్ జగన్ సవాల్
-
జగన్ హామీ ఇచ్చారు.. అమ్మా ప్రియాంక ఎక్కడున్నావ్ అమ్మ.. ఏడ్చేసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు
-
అబ్బా.. కొడుకులకు ఫైనల్ వార్నింగ్.. DSC కుంభకోణంలో సంచలన నిజాలు
-
నేడు హైదరాబాద్కు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జలవిహార్ గ్రాండ్ లాన్స్లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. -
కేంద్ర మంత్రికో నీతి.. మీ తండ్రీ కుమారులకో నీతా?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో తప్పులపై ప్రశ్నిస్తే అబ్బాకొడుకులు గింజుకుంటారే గానీ సీబీఐ విచారణకు అంగీకరించడం లేదంటూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ల వ్యవహార శైలిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘నీట్ ప్రశ్నపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరి అదే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబుకు, ఆయన కుమారుడికి వేరే నీతి ఉంటుందా?’ అని సూటిగా ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు.గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీ 2025 కుంభకోణం, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1ల నియామకాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అసెంబ్లీలో మాట్లాడిన మాటల వీడియోలను చూపుతూ.. వారు చెబుతున్నవన్నీ అబద్ధాలేనంటూ సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. మెగా డీఎస్సీ విషయంలో లీకేజీ, అక్రమాలపై తాము ఇప్పటివరకూ ఏ అంశాలనైతే ప్రజలముందు ఉంచామో అవన్నీ వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితిలోకి వచ్చిందని వైఎస్ జగన్ తెలిపారు. ఇవన్నీ గట్టిగా ప్రస్తావిస్తామనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరకు ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని చెప్పారు. సభలో ఉన్న ఏకైక ప్రతిపక్షం తమదని, ప్రతిపక్ష నాయకుడిగా తనను గుర్తిస్తే, సభా నాయకుడు సీఎంతో సమానంగా సమయం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి గుర్తించడం లేదన్నారు. గ్రౌండ్లో ప్రత్యర్థి జట్టు లేనిచోట.. బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీ కుమారులు ఇద్దరూ బ్యాటింగ్ చేస్తూ, తాము అద్భుతంగా చేశామని తమకు తాము కితాబు ఇచ్చుకుంటున్నారంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ పేపర్ లీకేజీ, అక్రమాలపై చర్చ చేపట్టాలంటూ నాలుగు రోజులపాటు శాసన మండలిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్తంభింపచేశారని తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడతారేగానీ పక్కనే ఉన్న మండలిలో మాత్రం చర్చకు ముందుకు రావడం లేదన్నారు. ఎందుకంటే అక్కడ తమ పార్టీ బలం ఉంది కాబట్టి చర్చ జరిగితే వారి తప్పులన్నీ బయటకు వస్తాయని, డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేసి తప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ తేటతెల్లం అవుతోంది కాబట్టి అక్కడ చర్చించడానికి ముందుకు రావడం లేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ స్కామ్ను అంశాలవారీగా ఎండగడుతూ వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఒక్కరికే రెండు బాధ్యతలా..?డీఎస్సీ పరీక్ష ప్రశ్నల తయారీ అనేది ఒక అంశం. పరీక్ష నిర్వహణ అనేది మరో అంశం. ఈ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్లు అసెంబ్లీలో లోకేశ్ స్వయంగా అంగీకరించారు. పైగా తప్పేముంది? అని దబాయిస్తున్నారు. ప్రశ్న పత్రం తయారీ అనేది ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బాధ్యత. పరీక్షల నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ బాధ్యత. ఈ రెండూ ఒక్కరి చేతే చేయిస్తే పారదర్శకత లోపిస్తుంది. లీకేజీకి ఎక్కువ అవకాశం ఉంది. ఈ రెండు బాధ్యతలు ఒకే వ్యక్తి నిర్వహించిన చరిత్ర ఎన్నడూ లేదు. ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణను ఒకే వ్యక్తికి అప్పగించామని లోకేశ్ తనకు తానుగా ఒప్పుకున్నారు. పరీక్ష పత్రం తయారీ, నిర్వహణ ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చెక్స్ అండ్ బ్యాలన్స్ అనేది తొలగిపోయింది. లీకేజీకి ద్వారాలు తెరిచారు. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం.ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?డీఎస్సీ ప్రశ్న పత్రాలు తయారు చేసే విభాగంలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు తొలి ర్యాంక్ వచ్చిందని తండ్రీ కుమారులు అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. మొదటి మెరిట్ లిస్ట్లో నవీన్ పేరు ఉంది. రెండో లిస్ట్లో అతడి పేరు తీసేశారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? నవీన్ పేరు లేకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ ఎందుకు విడుదల చేశారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు కాబట్టి ఇవ్వలేదని చంద్రబాబు, లోకేశ్ చెబుతున్నారు. ఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు? తన ఐడీని బ్లాక్ చేశారని, కాల్ లెటర్ తనకు పంపలేదని నవీన్ కోర్టుకు వెళ్లాడు. తన ఐడీ బ్లాక్ అయ్యిందని, కాల్ లెటర్ రాలేదని, డీఎస్సీలో మంచి మార్కులు వచ్చాయని, అయినా ఎందుకు కాల్ లెటర్ రాలేదని, ఇది నా జీవితానికి చివరి ఛాన్స్ అని విద్యాశాఖకు నవీన్ మెయిల్ పెట్టాడు. ఇదే విధంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. క్యాండిడేట్ ఐడీని బ్లాక్ చేసి కాల్ లెటర్ పంపనప్పుడు అతడు వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడు? దీనికి అసెంబ్లీలో అబ్బా కొడుకులిద్దరూ ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే కారణం.. నవీన్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాబట్టి. ఆయనకు ప్రశ్నపత్రం యాక్సెస్ ఉంది కాబట్టి. పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి. అతడికి ఉద్యోగం ఇస్తే గోల అవుతుంది కాబట్టి. ముందస్తుగానే మెరిట్ లిస్ట్లో అతడి పేరు తొలగించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతడికి ఉద్యోగం ఇవ్వలేదు. తన ఐడీని బ్లాక్ చేశారు. కాల్ లెటర్ పంపలేదు. మొదటి లిస్ట్లో అతడి పేరు ఉంది, రెండో లిస్ట్లో తీసేశారు. ఆ వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. తన ఉద్యోగం తనకు ఇవ్వాలని అడుగుతున్నాడు. మరి ఇది నవీన్ దగ్గరే ఆగిపోయిందా? ఇంకా జరిగిందా? సీబీఐ దర్యాప్తు జరిగితేనే కదా ఇవన్నీ తెలిసేది.పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలా?ఒకవైపు సింధు పేరు చెప్పి వీళ్ల అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన ఎస్టీ అభ్యర్ధి దుర్గయ్యకు కాల్ లెటర్ పంపి ఉద్యోగం ఇవ్వలేదు. అతను ఆర్చరీలో బంగారు పతకం సాధించాడు. ఆశ్చర్యమేమిటో తెలుసా? వీళ్ల పార్టీకి చెందిన నేతలు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న ‘‘సాఫ్ట్బాల్’’ అసోసియేషన్ నుంచి, అలాగే లోకేశ్ తోడల్లుడు, విశాఖపట్నం ఎంపీ భరత్ అధ్యక్షుడిగా ఉన్న ‘‘జూడో అసోసియేషన్ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఏకంగా 372 పోస్టులు భర్తీ చేశారు. సాఫ్ట్బాల్ సంఘ అధ్యక్షునిగా ఉన్న కూన రవికుమార్, జూడో సంఘ గౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ భరత్ గతంలోనూ స్పోర్ట్స్ కోటా ఉండేది. కానీ డీఎస్సీ క్వాలిఫై అవ్వాలి. కానీ ఇప్పుడు లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇంటర్ కాలేజీ స్థాయిలో పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉన్న వారికి ఉద్యోగాలిచ్చారు. పని అయిపోయిన తరువాత ప్రభుత్వమే ఈ జీవోలను రద్దు చేసింది. ఇక మీదట క్వాలిఫై అయితేనే అర్హత అని మరలా పాత పద్ధతికే వచ్చారు. ఇలా ఎందుకు జీఓలు మార్చారు? ఏకంగా జీవోలు ఇచ్చే స్థాయికి స్కామ్ వెళ్లిందంటే పైనుంచి కింద వరకూ అందరూ ఉన్నట్టే కదా! మంత్రి సంతకం లేకుండా జీవో ఇస్తారా? దీనిపై సీబీఐ ఎంక్వైరీ జరగాలా వద్దా?బేరసారాలు జరిగినట్లు ఒప్పుకున్నా చర్యలేవీ?స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఆ వ్యక్తి ఎవరో పోలీసులు కనుక్కోకుండా, ఎఫ్ఐఆర్లో ఆ వ్యక్తి పేరు రాయకుండా కేవలం ‘సస్పెక్ట్’ అని మాత్రమే రాశారు. పైగా అతడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యానికి కారణం.. సీనియర్ అధికారులతో మాట్లాడినట్లు రాశారు. మరి ఎవరితో మాట్లాడినట్లు? అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి. అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, బెయిల్పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అసెంబ్లీలో తండ్రీ కుమారులు చెప్పినట్లు నిజంగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారా? కోర్టు ముందు ప్రవేశపెట్టారా? జైలుకు పంపారా? ఆ అరెస్ట్ ఉత్తదేనన్న సీసీటీఎన్ఎస్..కేంద్రం ఆధ్వర్యంలోని ‘క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్’ (సీసీటీఎన్ఎస్)లో చూస్తే.. ఆ వ్యక్తిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఉంది. ఆ విషయం డాక్యుమెంట్లో ఉంది. నిజానికి ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. కానీ, తండ్రీ కుమారులు ఇద్దరూ ఈ విషయంలో చాలా సీరియస్గా వ్యవహరించినట్టు, అతడిని అరెస్టు చేసినట్లు, చర్యలు తీసుకున్నట్లు పచ్చి అబద్ధాలు చెబుతూ డ్రామా చేశారు. స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం రూ.14.10 లక్షలు లంచంఒంగోలులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. డీఎస్సీలో జాబ్ ఇప్పిస్తామని నమ్మించి తమను మోసం చేశారని ఓ మహిళా అభ్యర్థి రాధిక నుంచి ఫిర్యాదు వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం రూ.14.10 లక్షలు లంచం ఇచ్చినట్లుగా బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. రిఫరెన్స్గా మరో వ్యక్తికీ ఇలా చేస్తున్నామని ఆమెకు చెప్పారు. రిఫరెన్స్గా చూపిన వ్యక్తికి వచ్చింది. కానీ ఈ అమ్మాయికి రాలేదు. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా నిలదీస్తే ఏపీ టూరిజంలో మరో పోస్టు ఇస్తామని మభ్యపెట్టారు. ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లో డీఎస్సీ పోస్టు కోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరిజం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు. గతేడాది నవంబర్ 11న ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంత వరకూ ఎలాంటి చర్యలు లేవు. అరెస్టులు లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఆ అమ్మాయి ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా ఎక్కడికక్కడే వదిలేయాలని తండ్రీ కుమారులు ఇచ్చిన ఆదేశాలతోనే పోలీసులు ఇంత బరి తెగిస్తున్నారు. డీఎస్సీ లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్ కోటా బేరసారాల వరకూ అన్నీ సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు. అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేశ్ తక్షణం రాజీనామా చేయాలి.పీవీ సింధూతో పోలికా..? పరీక్ష రాయకుండానే ఉద్యోగాలా?డీఎస్సీ పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీ చేశామని కూడా ఒప్పుకున్నారు. దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామూలుగా లేవు. స్పోర్ట్స్ పర్సన్స్కు పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదంట! పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి పిల్లలకు చదువుచెప్పే 372 టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట! సింధూకి ఏ రూల్ పాటించారో ఇక్కడ కూడా అదే రూల్ పాటించారంట! 372 ఉద్యోగాలు పరీక్ష లేకుండా సింధూ పేరు చెప్పి తీసుకొచ్చారు. ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం ఆ అబ్బా కొడుకులు ఇద్దరికే మినహా ఎవరికైనా సాధ్యం అవుతుందా? పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? అసలు డీఎస్సీ ఎందుకు? పిల్లలకు చదువు చెప్పే సామర్ధ్యం ఉందో లేదో చూసేందుకే కదా? మరి బుద్ధి ఉన్న వాళ్లెవరైనా ఇలా చేస్తారా? అసలు పీవీ సింధుతో ఎలా పోలుస్తారు? పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్లో వెండి పతకం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం వచ్చాయి. ఒలింపిక్స్ నుంచి నేషనల్ గేమ్స్ వరకు ఏ మెడల్ సాధించిన వారికి ఎటువంటి పోస్టులు ఇవ్వాలనేది స్పష్టంగా వివరిస్తూ 2024 డిసెంబర్ 10న ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 18 ఇదీ.. దీనిలోనే శాప్ కోచ్లకు ఇచ్చే పోస్టుల గురించి కూడా పేర్కొన్నారు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్ ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. ఇలాంటివాళ్లకి ప్రత్యేక పాలసీ ఉంది. ఆమేరకు కేబినెట్ నిర్ణయాలు తీసుకుని వారికి మేలు చేస్తుంది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్ వచ్చాయని అడుగుతున్నా. అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నారు.సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్ కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని చెబుతున్న ఈ చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు. మరి తర్వాత వచ్చేవాళ్లు క్రీడాకారులు కాదా? వాస్తవం ఏమిటంటే.. వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకోడానికి ప్రత్యేకంగా జీఓ నెం.4, జీవో నెం.47 ఇచ్చి గేట్లు ఎత్తారు. పని పూర్తయిన తరువాత జీవో నెం.23, జీవో నెం.56 ఇచ్చి మళ్లీ గేట్లు మూసేశారు. ఇంతకు ముందు పరీక్షలతో సంబంధం లేదన్నారు. తర్వాత జీవోల్లో పరీక్షలో అర్హత సాధించాల్సిందేనన్నారు. అంటే మరలా గేట్లు మూసేశారు. -
డాక్టర్ ప్రియాంక హత్యపై న్యాయ పోరాటం
సాక్షి, అమరావతి: డాక్టర్ ప్రియాంక హత్యపై వైఎస్సార్సీపీ తరపున న్యాయ పోరాటం చేస్తామని ఆమె తల్లిదండ్రులకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో దారుణ హత్యకు గురైన డాక్టర్ ప్రియాంక తల్లిదండ్రులు చంద్రమ్మ, వెంకటేష్ గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. తమ బిడ్డ ఎంతో కష్టపడి మెరిట్లో రాజమండ్రి కళాశాలలో సీటు తెచ్చుకుందని, ఆమెను కిరాతకులు బలి తీసుకున్నారని వారు కన్నీటి పర్యంతమయ్యారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు వైఎస్ జగన్ను కోరారు. కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులను వైఎస్ జగన్ ఓదార్చి, పార్టీ తరపున న్యాయ పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు.ఆ రాక్షసులకు మరణ శిక్ష పడే వరకు విశ్రమించం: ప్రియాంక తండ్రి వెంకటేష్తమ బిడ్డను చంపిన రాక్షసులకు మరణ శిక్ష పడేవరకు విశ్రమించబోమని డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేష్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ను కలిసిన అనంతరం వైఎస్సార్సీపీ మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుకతో కలిసి వెంకటేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆర్థిక స్థోమత లేకపోయినా రెక్కలు ముక్కలు చేసుకుని మా బిడ్డను డాక్టర్ను చేశాం. మా బిడ్డ కూడా కష్టపడి చదివింది. మెరిట్లో పీజీ సీటు వచ్చిందని రాజమండ్రికి పంపిస్తే.. రాక్షసుల్లా కారుతో గుద్ది గుద్ది చంపేశారు. ఈ నెల 2న ప్రియాంకకు పెళ్లిచూపులు జరిగాయి. 3న కాలేజీకి వెళ్లిన పాపను అదే రోజు రాత్రి పొట్టనబెట్టుకున్నారు. మేము ప్రాణాలతో ఉన్నా చనిపోయిన శవాలతో సమానం అయిపోయాం. ఆస్పత్రిలో చేర్చినప్పటి నుంచి మాకు సరైన సమాచారం ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వకుండా కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. నిందితులు మద్యం, గంజాయి మత్తులో ఉన్నారా లేదా అనే పరీక్షల వివరాలు కూడా బయటపెట్టలేదు. స్థానిక పోలీసులు, అధికారులపై మాకు ఏమాత్రం నమ్మకం లేదు. నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మా పాపను పొట్టనబెట్టుకున్న హంతకులకు ఉరిశిక్ష పడేవరకు మా పోరాటం ఆగదు. వాళ్లు తప్పించుకోలేరు. ఈ కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి మా కుటుంబానికి న్యాయం చేయాలి. దీనిపై మేం హైకోర్టుకు కూడా వెళ్తాం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని కలిశాం. చట్ట ప్రకారం వాళ్లకు శిక్షలు పడేలా చేస్తామని, బాధపడవద్దు అని వైఎస్ జగన్ మమ్మల్ని ఓదార్చి, మాకు ధైర్యం చెప్పారు.ప్రియాంక కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం: మాజీ ఎంపీ బుట్టా రేణుకపలుకుబడి ఉన్న నిందితులను కాపాడాలని ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారు. కిరాతకంగా హత్య చేసిన వారికి కఠిన శిక్షలు పడాలి. బాధిత చేనేత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతాం.నిందితులను కాపాడుతున్న అధికార పార్టీ పెద్దలు ఎవరు?: మాజీ ఎంపీ మార్గాని భరత్ఉద్దేశపూర్వకంగా కారును మూడుసార్లు డాక్టర్ ప్రియాంక తలపై నుంచి ఎక్కించి చంపేస్తే, దానిని ప్రభుత్వం, పోలీసులు సాధారణ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఘటన జరిగిన రాత్రి కేవలం మాల్ దగ్గరి సీసీ ఫుటేజ్ మాత్రమే చూపించారు. మిగిలిన సిటీ సీసీ ఫుటేజీలను, నిందితుల కాల్ డేటా ఎందుకు బయటపెట్టడం లేదు? పైగా నిర్లక్ష్యపు డ్రైవింగ్ అంటూ కేసు నమోదు చేయడంలో ఆంతర్యమేంటి? నిందితులు మద్యం, డ్రగ్స్ సేవించిన విషయాన్ని ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు? నిందితులను కాపాడుతున్న అధికార పార్టీ పెద్దలు ఎవరో తేల్చాలి. నిందితులతో పాటు వారికి కూడా కఠినమైన శిక్షలు పడాలి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ బాజీలాల్ను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇంత దారుణ ఘటన జరిగిన కాసేపటికే బాధ్యతగల డీఎస్పీ అదే మాల్లో సినిమాకి వెళ్లడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనం. తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. -
25 గంటల్లో 22 గంటలు అబద్ధాలే!
సాక్షి, అమరావతి: నాలుగు రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆత్మస్తుతి, పరనిందలా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను తిట్టడానికే చంద్రబాబు ఈ సమావేశాలను ఎక్కువగా ఉపయోగించుకున్నారు. మరోవైపు.. తన పాలన గురించి, ఈ రెండేళ్లలో జరిగిన కుంభకోణాల గురించి ఆయన తన తనయుడు లోకేశ్తో కలిసి ఇష్టానుసారం అబద్ధాలు మాట్లాడారు. ఈసారి అసెంబ్లీ మొత్తం 25.15 గంటలపాటు సాగింది. అందులో ఏకంగా 22 గంటలు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురదజల్లేందుకే వెచ్చించారు.చంద్రబాబు మొదలు ఆయన తనయుడు లోకేశ్ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ను ఆడిపోసుకోగా, మంత్రులు, ఎమ్మెల్యేలు తండ్రీకొడుకులను మెప్పించడం కోసం జగన్ను లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారం మాట్లాడారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా చెప్పుకోవడానికి చేసిందేమీలేక జగన్ను తిట్టడం ద్వారా డైవర్షన్ రాజకీయాలకు దిగారు.అసెంబ్లీలో దాటవేత రాజకీయం..అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో డీఎస్సీ నియామకాల కుంభకోణంపై చర్చ పెట్టి అసలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా జబ్బలు చరుచుకున్నారు. చంద్రబాబు, లోకేశ్లు ఇదే అంశంపై ఒకే ప్రజెంటేషన్ను రెండుసార్లు చూపిస్తూ మాట్లాడారు. కానీ, కుంభకోణానికి సంబంధించిన కీలకమైన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పలేక నీళ్లు నమిలారు. సభలో తమను ప్రశ్నించేవారు ఎవరూ లేకపోవడం, తాము చెప్పిన అబద్ధాలనే గొప్ప శ్లోకాలుగా కీర్తించే ఎమ్మెల్యేలు ఉండడంతో అసెంబ్లీని అందుకోసం ఉపయోగించుకున్నారు. డీఎస్సీపై చర్చకు బెదిరి ‘మండలి’లో పరార్..మరోవైపు.. డీఎస్సీ అంశంపై శాసనమండలిలో చర్చించేందుకు ముందుకురాకుండా కూటమి సభ్యులు పారిపోయారు. డీఎస్సీ కుంభకోణంపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యులు నాలుగు రోజులపాటు పట్టుబట్టారు. అసెంబ్లీలో చెప్పినట్లే మండలిలో ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెప్పడం కుదరదని, నిజాలు బయటపడతాయన్న భయంతో చర్చకు దిగే ధైర్యం చేయలేక తప్పించుకుని పారిపోయింది. డీఎస్సీపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించిన ఆ శాఖా మంత్రి లోకేశ్.. మండలిలో చర్చించేందుకు భయపడి వెనక్కి వెళ్లిపోవడాన్ని బట్టి తాను పేపర్ టైగర్నని నిరూపించుకున్నారు. డైవర్షన్ కోసం గ్రూప్–1 నియామకాలపై చర్చ..అదే సమయంలో డీఎస్సీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏపీపీఎస్సీ గ్రూప్–1 నియామకాలపై చర్చను తెరపైకి తెచ్చారు. ఈ చర్చలో చంద్రబాబు వాస్తవాలను పూర్తిగా వక్రీకరిస్తూ కళ్లుమూసుకుని అబద్ధాలు వల్లించడమే పనిగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి, నిండు సభలో నిస్సిగ్గుగా అవాస్తవాలు చెప్పి తనకు రాజకీయ ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టవని మరోసారి నిరూపించారు. చివరి రోజు సూపర్ సిక్స్ హామీలన్నీ అమలు చేసేసినట్లు సభ్యులతో మాట్లాడించి ప్రజలను వంచించే ప్రయత్నం చేశారు. సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి్సన స్పీకర్ అయ్యన్నపాత్రుడు తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానన్న సంగతే మరిచిపోయి ఎప్పటిమాదిరిగా టీడీపీ నేతలా వ్యవహరించారనే విమర్శలు మూటగట్టుకున్నారు. మొత్తంగా ఈ నాలుగు రోజుల అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలను చర్చించడానికి కాకుండా జగన్ని తిట్టిపోయడానికి, డీఎస్సీ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసలు వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తండ్రీకొడుకులు వాడుకున్నారని స్పష్టమైంది. -
ఉద్యోగులకు బాబు వెన్నుపోటు
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులు, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ఉద్యోగులకూ వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ‘ఉద్యోగులను చంద్రబాబు చాలా దారుణంగా మోసం చేశారు. అధికారంలోకి రాగానే మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఉన్న పీఆర్సీ రద్దు చేశారు. కొత్త పీఆర్సీ వేయలేదు. 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి.ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం దాదాపు రూ.40 వేల కోట్ల బాకీ ఉంది. సీపీఎస్ రద్దు చేస్తానన్న హామీ కూడా నెరవేర్చలేదు. అదే గత మా ప్రభుత్వం గ్యారెంటీ పెన్షన్ పథకం (జీపీఎస్) అమలు చేసి ఉద్యోగులకు మేలు చేసింది. కాగా, ఉద్యోగులకు అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబునాయుడు’ అంటూ ఓ ప్రశ్నకు వైఎస్ జగన్ జవాబిచ్చారు. ద్రవ్యోల్బణం ఒక మిథ్య అన్న సీఎం చంద్రబాబు ఐక్యూ ఎలా ఉందనేది అందరికీ తెలుస్తోందంటూ వైఎస్ జగన్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధన తప్పు..‘సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష నిర్ణయం తప్పు. టీచర్లు వారి సమస్యల కోసం మా పార్టీ ఎంపీలతో కలిసి, కేంద్రంలో విజ్ఞాపన పత్రం ఇస్తే, వారిని సస్పెండ్ చేశారు. అది హేయమైన చర్య. ఇంకా 20 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్న టీచర్లను ఇప్పుడు టెట్ రాయమనడం ఎంత వరకు సబబు?. వారు ఇంతకాలం ఒకే సబ్జెక్ట్ బోధిస్తున్నారు. టెట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. వారు అవన్నీ పాస్ కావడం కష్టం. నాడు వారు ఎంపికైనప్పుడు టెట్ లేదు. ఇప్పుడు రాయాలంటే ఎలా?. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించాలి. వారి నిర్ణయాన్ని ఎండగట్టి, చట్ట సవరణ కూడా చేయించాలి. దాని ఆధారంగా కోర్టులో పోరాడాలి. అంతేకానీ, ఆ పని చేయకుండా, మా ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీచర్లను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం. ఉద్యోగులను మోసం చేసిన సీఎం చంద్రబాబు.. ప్రశ్నిస్తే వేధిస్తూ వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారంటూ మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ చెప్పారు. డీఎస్సీపై కోర్టుకు వెళ్లాం.. కేంద్రానికి నివేదించాం..డీఎస్సీపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధపడడం లేదు కదా.. మీరే అన్ని వివరాలతో సీబీఐకి ఏమన్నా లేఖ రాసే అవకాశం ఉందా అని విలేకరులు అడగ్గా.. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసు వేశాం. విచారణ జరుగుతోంది. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రధానమంత్రికి లేఖ కూడా రాశాం. మా పార్టీ ఎంపీలు కేంద్ర హోం మంత్రిని కలిసి డీఎస్సీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అబ్బాకొడుకులకు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయాలని మరోసారి చాలెంజ్ విసిరారు. -
గ్రూప్–1పై మేం రెడీ.. మెగా డీఎస్సీపై మీరు రెడీనా? సీబీఐ విచారణకు సిద్ధమా
పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేశ్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా? స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందిలో ఎంత మందికి సింధూకి వచ్చినట్లు మెడల్స్ వచ్చాయి? అసాధారణ ప్రతిభ కనబరిచే అంతర్జాతీయ క్రీడాకారులకు ప్రత్యేక నియామకం కల్పించటాన్ని సాధారణ స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్తో ఎలా పోలుస్తారు? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా? తన స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నారు.చరిత్రలో మొదటిసారి అసలు పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలిచ్చారు. విద్యా శాఖ మంత్రి ఆమోదం లేకుండా ఆ జీవోలు ఇవ్వగలుగుతారా? అరాచకాలకు గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు జరిగినట్లుగా అసెంబ్లీలో తండ్రీ కుమారులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ఇందులో ఆ బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నెంబర్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. బేరసారాలు జరిగినట్లు ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? స్పష్టంగా మొబైల్ నెంబర్ కనిపిస్తున్నా అనుమానితులంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యలూ లేవు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని, బెయిల్పై వచ్చాడని తండ్రీ కుమారులు చెబుతున్నారు. అంటే ఆ స్థాయిలో కేసు నీరు గారుస్తూ.. అసెంబ్లీ సాక్షిగా తండ్రీ కుమారులు ఎంత పచ్చి అబద్ధాలు చెప్పారో చూడండి.. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 అక్రమాలన్నీ పక్కా సాక్షా్యధారాలతో రుజువు కావడంతో తన కుమారుడిని కాపాడుకోవడానికి సీఎం చంద్రబాబు కొత్త ఆట మొదలు పెట్టారని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మరింత దిగజారిపోయి ఏపీపీఎస్సీ 2018 గ్రూప్–1 నియామకాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షలో ఇప్పటి మెగా డీఎస్సీలో మాదిరిగా పేపర్ లీకేజీ కాలేదు.. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు.. పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని.. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? అని చంద్రబాబు, నారా లోకేశ్కు సూటిగా వైఎస్ జగన్ సవాల్ విసిరారు. సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సీబీఐ విచారణ కోరుతూ దర్యాప్తు సంస్థకు లేఖ రాయాలని చాలెంజ్ చేశారు. గ్రూప్–1 నియామకాల్లో తామెక్కడా తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేశారు. పక్కా సాక్ష్యాధారాలతో మెగా డీఎస్సీ కుంభకోణం రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవాలన్న ఆరాటంతో 2018 గ్రూప్–1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలను, పారదర్శకంగా చేపట్టిన గ్రూప్–1 నియామకాలను ఆధారాలతో వైఎస్ జగన్ వివరించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మెయిన్స్ నిర్వహణ.. మూల్యాంకనం.. ఇంటర్వూ్యలు.. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ పూర్తయిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..డీఎస్సీ పోస్టులు అమ్ముకునేందుకు బేరసారాలు ఆడుతున్న ఆడియో కాల్ వివరాలను ఫోన్ నంబర్తో సహా ప్రదర్శించిన వైఎస్ జగన్ ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల ఉద్యోగాల భర్తీ..మా హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న ఫిర్యాదు వచ్చిందా? చిత్తశుద్ధి, పారదర్శకత అంటే అది. ఇప్పుడు చూస్తే కుట్రపూరిత జీవోలు ఇచ్చి వీళ్ల ఎంపీలు, ఎమ్మెల్యేలే ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి 372 మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఇష్టారాజ్యంగా కుంభకోణాలు చేశారు. మేం 1.30 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎక్కడైనా ఒక్క ఆరోపణ వచ్చిందా? వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 78 నోటిఫికేషన్లు ఇచ్చి 6,296 పోస్టులు భర్తీ చేశాం. ఎక్కడైనా చిన్న వివాదం తలెత్తిందా? మేం ఇచ్చిన వాటిలో ఏడు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ. మీ జోక్యంతో జరిగిన అక్రమాలన్నీ స్పష్టంమా హయాంలో జరిగిన గ్రూప్–1 నియామకాలకు, ఇప్పటి డీఎస్సీ–2025 నియామకాలకు ఎంతో తేడా ఉంది. చరిత్రలో మొదటిసారి పరీక్షే లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి సంతకాలు లేకుండా ఈ జీవోలు ఇవ్వగలుగుతారా? నేరుగా విద్యా శాఖ మంత్రి ఆమోదంతో పరీక్షే లేకుండా ఉద్యోగాలు కట్టబెట్టే వ్యవస్థను రూపొందించారు. 372 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అరాచకాలకు గేట్లు ఎత్తారు. ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. ఇది నేరుగా చంద్రబాబు కుమారుడు విద్యా శాఖ మంత్రిగా ఉండగా జరిగింది. ఇది ఎంతో ఘోరమైన విషయం. డీఎస్సీ పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టిన చరిత్ర ఎప్పుడూ లేదు. మా హయాంలోని గ్రూప్–1, ఇప్పటి డీఎస్సీ–2025కి మధ్య మొదటి తేడా ఇది. ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు మొదటి ర్యాంక్ ఎలా వచ్చింది? మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? అదేవిధంగా అతని ఐడీలను ఎందుకు చెరిపేశారు? అతడికి కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఈ సాక్ష్యాలతోనే పేపర్ లీకైందని స్పష్టంగా రుజువైంది. బేరసారాలు జరిగినట్టుగా ఆడియో, వీడియో సాక్ష్యాలు కనిపిస్తున్నా మీరు తీసుకున్న చర్యలేమిటి? మొబైల్ నంబర్ కనిపిస్తున్నా అనుమానితులని అంటున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఎలాంటి చర్యల్లేవు. మరో కేసులో రూ.14 లక్షల నగదు లావాదేవీ జరిగినా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయరు. విచారణ చేపట్టరు. ఇలా మీ వ్యక్తిగత జోక్యంతో కూడిన కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ స్వతంత్ర సంస్థ. పెద్ద పెద్ద అధికారుల పర్యవేక్షణలో ఆ సంస్థ పనిచేస్తుంది. పరీక్షలు నిర్వహిస్తారు. బాబు దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. పైగా మా ప్రభుత్వం రాక ముందే గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికే మెయిన్స్ నిర్వహించాం. హైకోర్టు ఆదేశాలతో, కోర్టు ఆధ్వర్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనం, ఎంపికైన వారికి ఉద్యోగాల కల్పన ఇలా ప్రతి ప్రక్రియ చేపట్టాం. ఈ పరిస్థితి ఇంతకు ముందు లేదుబాబు పాలనలో నేరుగా పోలీసులతోనే నేరుగా గంజాయి అమ్మిస్తున్నారు. ప్రతి గ్రామం, వీధుల్లో గంజాయి లభ్యమవుతోంది. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. గంజాయి సంస్కృతి గ్రామాలకు పాకింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్షాపులు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇంతకు ముందు రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. పోలీసులే నేరుగా గంజాయి అమ్మకాలు.. బీసీల రిజర్వేషన్ అంశం.. బీసీలకు ఎవరేం చేశారు? రైతుల సమస్యలు.. రాష్ట్రంలో నెలకొన్న కరవు, సంక్షోభ పరిస్థితులపై వచ్చే వారం మరోమారు మీడియా ముందుకు వస్తా. -
కొడుకును కాపాడుకోవడం కోసమే.. ఏపీపీఎస్సీపై అభాండాలు
సాక్షి, అమరావతి: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు, కుంభకోణానికి పాల్పడి, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయిన తన కొడుకును కాపాడుకోవాలన్న ఆరాటంతో సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా గ్రూప్–1 నియామకాలపై పచ్చి అబద్ధాలు వల్లెవేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు వల్లెవేసిన అబద్ధాలను సాక్ష్యాధారాలతో కడిగిపారేశారు. గురువారం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ గ్రూప్–1పై చంద్రబాబు ప్రభుత్వమే వేసిన సిట్ ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ, ఇంటర్వూ్యలు జరిగాయని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పారన్నారు.‘నిజానికి నాడు చంద్రబాబు హయాంలోనే గ్రూప్–1 పరీక్షల ప్రిలిమ్స్ జరిగాయి. మేము వచ్చాక మెయిన్స్ మాత్రమే నిర్వహించాం. ఎక్కడా తప్పు చేయలేదు. అక్రమాలు చోటు చేసుకోలేదు. డీఎస్సీ కుంభకోణం నుంచి కొడుకును కాపాడుకోవడం కోసమే నాలుగేళ్లుగా పనిచేస్తున్న 163 మంది ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయడానికి కూడా చంద్రబాబు వెనుకాడటం లేదు’ అని జగన్ విమర్శించారు. ఏపీపీఎస్సీపై చంద్రబాబు అబద్ధాలను అంశాలవారీగా ఆధారాలతో సహా జగన్ ఖండించారు. వైఎస్ జగన్ ఏమి మాట్లాడారంటే...డీఎస్సీలోలా పేపర్ లీకేజీ లేదు‘‘చంద్రబాబు తన కొడుకును కాపాడుకోవడానికి ఏ విధంగా బురద జల్లుతున్నాడో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు మరింత దిగజారిపోయి తన ప్రభుత్వమే 2018లో ప్రకటించిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 పోస్టుల భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. 163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్ చేశాడు. బాబు ప్రభుత్వ హయాంలోనే ప్రిలిమ్స్ అయిపోయాయి. మేము చేసింది కేవలం మెయిన్స్ నిర్వహించడమే. ఇక ఎక్కడ నుంచి వస్తాయి స్వార్థ ప్రయోజనాలు. అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో లాగా పేపర్ లీకేజీ జరగలేదు. ఇప్పటి డీఎస్సీలో లాగా ప్రశ్నపత్రాల తయారీ విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. ఎవరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు తీసుకురాలేదు. మా ప్రభుత్వంలో పరీక్షలే రాయకుండా ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు అమ్ముకున్నట్లుగా, బేరసారాలు చేస్తున్నట్లుగా, డబ్బులు ఇచ్చినట్లుగా ఎవరివీ ఆడియోలు, వీడియోలు ఎలాంటి ఆధారాలు మా ప్రభుత్వ హయాంలో రాలేదు. మా ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఇప్పుడు జరుగుతున్న డీఎస్సీ స్కాంకు మధ్య తేడా ఇదే. కేవలం కొడుకును కాపాడుకోవడం కోసం చంద్రబాబు ఆక్రోశం, ఆరాటం బయటకు వస్తోంది.చంద్రబాబు వేసిన సిట్టే క్లీన్ చిట్ ఇచ్చిందిఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన ఆరోపణలపై వాస్తవాల్లోకి వెళ్దాం.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2025 ఏప్రిల్లో ఒక సిట్ వేశారు. ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని నవంబర్14, 2025న చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది ఒకవైపు జరుగుతుండగానే ఈ సిట్ ఇలా హైకోర్టులో అఫిడవిట్లు వేస్తుండటంతో ఎలాగోలా ఇరికించాలన్న తాపత్రయంతో చంద్రబాబు ఫిబ్రవరి14, 2026న రెండో సిట్ వేశారు. బాబు కింద పనిచేసేవారే కదా ఆ సిట్లో ఉండేది. అధికారులను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటే కదా.. నిజాలు ఎవరూ దాచిపెట్టలేరు.ఎప్పటికైనా బయటకు వస్తాయి. 2019 ఎన్నికలకు 76 రోజుల ముందు చంద్రబాబు నోటిపికేషన్ ఇచ్చారు. మా ప్రభుత్వం మే 30న రాక మునుపే మే 26, 2019 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయాయి. మేం వచ్చాక ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటించి 2020 డిసెంబర్లో మెయిన్స్ నిర్వహించాం. బాబు హయాంలో నిర్వహించిన ప్రిలిమ్స్లో ఎంపికైన వారికి మెయిన్స్ నిర్వహిస్తే వారిపై బురద జల్లుతున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే మొత్తం ప్రక్రియకోవిడ్ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయం. అటువంటి సమయంలో పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యం కాకూడదని అప్పటి అధికారులు డిజిటల్ ఎవాల్యుయేషన్కు వెళ్లాలని నిర్ణయించారు. అప్పటి కమిషన్లో మునుపటి ప్రభుత్వం చంద్రబాబు హయాంలో నియమించిన ఐదుగురు సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. బోర్డులో ఉన్న 10మంది సభ్యుల్లో ఐదుగురు వాళ్ళే ఉన్నారు. డిజిటల్ ఎవాల్యుయేషన్ అంటే.. రాసిన పరీక్షల స్క్రిప్ట్స్ను స్కాన్చేసి పరీక్ష దిద్దే వారికి పంపిస్తారు. ఆన్లైన్లో వారు మార్కులు వేస్తారు. ఇది కూడా కోవిడ్ వల్ల.. అప్పటి పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. రక్త సంబంధీకులు చనిపోతే కూడా అంత్యక్రియలు నిర్వహించడానికి భయపడే పరిస్థితులు అవి. గ్రూప్స్ కింద ఒకే చోట తీసుకువచ్చి ఫిజికల్ ఎవాల్యుయేషన్ చేయలేని పరిస్థితి. అయినా కొంత మంది హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు డిజిటల్ ఎవాల్యుయేషన్ పరిగణనలోకి తీసుకోలేదు. ప్రక్రియ ముందుకు సాగలేదు. డిజిటల్ ఎవాల్యుయేషన్ను తప్పుపట్టలేమని, కానీ నోటిఫికేషన్లో ఈ విషయం పేర్కొనకపోవడం వల్ల తాము మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నట్లు హైకోర్టు తీర్పులో స్పష్టంగా పేర్కొంది. హైకోర్టు చెప్పిన తర్వాత డిజిటల్ ఎవాల్యుయేషన్ అన్నది పరిగణనలోకి తీసుకోలేదు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేసి ఆ మార్కుల ఆధారంగా ఇంటర్వూ్యలు పూర్తి చేసి, 163 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. నాలుగేళ్ల నుంచి ఈ 163 మంది ఉద్యోగాలు చేస్తుంటే ఇప్పుడు చంద్రబాబు వీరిపై విషం కక్కుతున్నారు.⇒ మెగా డీఎస్సీ స్కామ్లో కుమారుడిని కాపాడుకునేందుకే గ్రూప్ 1 నియామకాలపై చంద్రబాబు పిచ్చి ఆరోపణలు.⇒ చంద్రబాబు ఆరోపణలపై సీబీఐ విచారణకు మేం సిద్ధమే. మరి మెగా డీఎస్సీ–2025పై సీబీఐ విచారణకు మీరు సిద్ధమా..? చంద్రబాబు, లోకేశ్ సిద్ధమైతే సీబీఐకి లేఖ రాయాలి.⇒ 1.30 లక్షల ఉద్యోగాలు ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇచ్చిన చరిత్ర మాది⇒ అసలు పరీక్షే రాయకుండా ఎవరైనా ఉద్యోగాలు ఇస్తారా? ⇒ స్కామ్ల కోసం జీవోలు ఇచ్చి పని పూర్తయ్యాక వాటిని రద్దు చేశారు⇒ మీ స్కామ్లను కప్పిపుచ్చుకోవడానికి అంతర్జాతీయ క్రీడాకారిణి సింధును అడ్డుపెట్టుకుంటారా?⇒ డీఎస్సీలో అక్రమాలు జరిగాయనేందుకు ఎన్నో సాక్షా్యలున్నాయి..⇒ ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు? స్పోర్ట్స్ కోటా పేరిట ఇష్టానుసారంగా జీవోలు ఇచ్చి ఎందుకు మార్చారు? పార్టిసిపెంట్ సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇచ్చేస్తారా? టీచర్ పోస్టులకు బేరసారాల ఆడియో కాల్పై తీసుకున్న చర్యలేమిటి? డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇప్పిస్తామని తన దగ్గర రూ.14.10 లక్షలు లంచం వసూలు చేశారని బాధిత అభ్యర్థి రాధిక తాజాగా ఫిర్యాదు చేయడం స్కామ్కు నిదర్శనం కాదా?⇒ హైకోర్టు పర్యవేక్షణలో పారదర్శకంగా జరిగిన గ్రూప్ 1కి.. స్కామ్లు జరిగిన మెగా డీఎస్సీకి అసలు పోలిక ఉందా?చంద్రబాబు ఆరోపణలుృవాస్తవాలు1 డిజిటల్ ఎవాల్యుయేషన్లో అక్రమాలు జరిగాయి.వాస్తవం: అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ను పూర్తిగా పక్కన పెట్టి, హైకోర్టు సూచనల మేరకు మాన్యువల్ ఎవాల్యుయేషన్లో ప్రక్రియ పూర్తి చేసినప్పుడు, ఈ ఆరోపణకు విలువేముంది?2 గ్రూప్1 ఎవాల్యుయేషన్ హాయ్ల్యాండ్లో ఏదో జరిగింది.వాస్తవం: హాయ్ల్యాండ్లో జరిగిన ప్రక్రియకు, తుది ఫలితాల వెల్లడికి ఏ సంబంధం లేదు. ఆ మేరకు 2025, నవంబరు 11న చంద్రబాబు ప్రభుత్వమే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మాన్యువల్ ఎవాల్యుయేషన్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అన్నీ నియమానుసారం జరిగాయని అధికారులు అందులో తేల్చి చెప్పారు. అందుకే హాయ్ల్యాండ్ అనేది టాపిక్ కాదు. అది అప్రస్తుతమని స్పష్టం చేశారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ కూడా ఏపీపీఎస్సీ, ఎస్ఆర్ఆర్ అండ్ సీఆర్ఆర్ కాలేజీలో జరిగాయని, ఎక్కడా అక్రమాలు లేవని, అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో జరిగిందని చెప్పారు.3 జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందివాస్తవం: జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, సిట్ (చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిందే) స్పష్టమైన నివేదిక ఇచ్చినా, అబద్ధాలు ప్రచారం చేస్తూ నిందలు వేస్తున్నారు. నిజానికి మాన్యువల్ ఎవాల్యుయేషన్ ప్రక్రియ అంతా సీసీ టీవీల పర్యవేక్షణలో చేయడం జరిగింది. గతంలో చంద్రబాబు ఏనాడైనా, అలా జవాబుపత్రాలు దిద్దించారా? ఆయన హయాంలో 2016, 2017లో పరీక్షలు నిర్వహించినప్పుడు పేపర్లు దిద్దేటప్పుడు సీసీ కెమెరాలు లేవు. మా హయాంలో ఏపీపీఎస్సీలో పనిచేసిన సవాంగ్లాంటి అధికారులు చాలా సమర్థులు.వీళ్లు అల్లాటప్పా మనుషులు కాదు. ఎప్పుడూలేని విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. జవాబు పత్రాలు, వాటిని దిద్దడంలో కానీ, ఓఎంఆర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)లో కానీ ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, సీఎఫ్ఎస్ఎల్ స్పష్టంగా ధ్రువీకరించిందని సిట్ నివేదిక ఇచ్చింది. అయినా తన కొడుకును కాపాడుకునేందుకు, చంద్రబాబు గ్రూప్ృ1 పరీక్షపై అభాండాలు వేస్తున్నారు. ఇక ఇక్కడ వివాదం ఎక్కడుంది?.4 ఓఎంఆర్ షీట్ల సవరణలు గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు చేశారు. వారికి ఎలాంటి అర్హత లేదు.వాస్తవం: చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా అంతా దొంగలే. అంతా తప్పుడు ప్రచారం చేస్తూ, నిందలు వేస్తున్నారు. అసలు వారు నియమించిన సిట్, చాలా స్పష్టంగా చెప్పింది. ఎక్కడా, ఏ తప్పు జరగలేదని తేల్చి చెప్పింది. ఇంకా సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. సీఎఫ్ఎస్ఎల్ నివేదికలు కూడా ఉన్నాయి. ఇక్కడ అందరూ గుర్తించాల్సిన ఒక అంశం ఏమిటంటే, మేము అధికారంలోకి వచ్చే నాటికే, ప్రిలిమ్స్ ముగిశాయి. మరి ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా ఏపీపీఎస్సీ బోర్డులో ఎక్కువ మంది టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారే.5 పేపర్లు ఒకసారి దిద్దిన తర్వాత మళ్లీ కరెక్షన్స్ చేశారు.వాస్తవం: అసలు ఏపీపీఎస్సీ పరీక్షల మూల్యాంకనం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలి. ఎక్కడా అభ్యర్థికి అన్యాయం జరగకుండా అనేక మంది బాధ్యులు ఉంటారు. ఇంకా పలు దశలు ఉంటాయి. చీఫ్ ఎగ్జామినర్ మొదలు, స్క్రూటినైజర్, సూపర్వైజర్లు ఉంటారు. అంత మంది చెక్ చేస్తారు. కంట్రోల్ బండిల్ స్లిప్లు ఉంటాయి. వాటిపై అందరి సంతకాలు ఉంటాయి. అదొక పక్కా విధానం. ఎక్కడా ఏ అభ్యర్థికి నష్టం జరగకుండా ఒక పక్కా విధానం, వ్యవస్థ ఉంటుంది. ఇంకా ఏ పేపర్ ఎవరిదని ఎవరికీ తెలియదు. కేవలం బార్కోడ్ మాత్రమే ఉంటుంది. దిద్దేవారికి అది ఎవరి ప్రశ్నపత్రం అనేది అస్సలు తెలియదు. ప్రతి దానికి బార్ కోడ్, క్యాంప్ ఆఫీసర్ సిగ్నేచర్ ఉంటుంది. వీటన్నింటిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇదంతా ఒక ప్రొసీజర్. ఏదో ఆరోపణ చేయాలని, బండపడేయాలన్నట్లు బురదజల్లుతున్నారు.6 రాతపరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చాయని ఆరోపణ.వాస్తవం: ఇక్కడ నా సవాల్. చంద్రబాబుగారి హయాంలో గతంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కుల వివరాలు బయట పెట్టగలరా? నిజానికి ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు మా హయాంలో తెచ్చాం. అత్యంత పారదర్శకంగా, నిజాయితీగా నిర్వహించాం. ఫేషియల్ రికగ్నిషన్, థంబ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాం. చరిత్రలో తొలిసారిగా పరీక్ష హాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశాం.మా తర్వాతే యూపీఎస్సీలో కూడా అమలు చేశారు. మా ప్రభుత్వం రాకముందు, ఏపీపీఎస్సీకి సంబంధించి ఒకటే ఇంటర్వ్యూ బోర్డు. అందులో ఒకరు మాత్రమే సివిల్స్ సర్వీసెస్ అధికారి ఉండేవారు. మేము వచ్చిన తర్వాత మూడు ఇంటర్వ్యూ బోర్డులు పెట్టాం. 24 మంది ఐఏఎస్, ఐపీఎస్లు, వివిధ వర్సిటీలకు చెందిన ఆరుగురు వీసీలను పెట్టాం. అభ్యర్థులకు జంబ్లింగ్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించాం.అంటే ఏ అభ్యర్థి, ఏ బోర్డు ముందుకు వెళ్తారో వేరెవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాక, మళ్లీ పాత విధానం. ఒకటే బోర్డు, ఒకే ఐఏఎస్ అధికారి. మా హయాంలో ఒకేసారి 1.30 లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క ఫిర్యాదు వచ్చిందా? అంత పారదర్శకంగా ఆ ఉద్యోగాలు ఇచ్చాం. ఒక్కటంటే ఒక్క ఆరోపణ వచ్చిందా? మా హయాంలో ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6296 పోస్టులు భర్తీ చేశాం. కానీ, ఎక్కడా వివాదాలు లేవు. మేము ఇచ్చిన రెండు నోటిఫికేషన్లు చంద్రబాబు పెండింగ్లో పెట్టారు. మరో రెండు రద్దు చేశారు. ఇదీ చంద్రబాబుకు నిరుద్యోగుల పట్ల ఉన్న ప్రేమ.7 కొంత మంది ఎవాల్యుయేటర్లు సెల్ఫోన్లో మాట్లాడారు. వాస్తవం: అసలు తాను దిద్దేది ఎవరి పేపరో ఎవాల్యుయేటర్కు ఎలా తెలుస్తుంది? అక్కడ అభ్యర్థి పేరు, ఇతర వివరాలు ఏవీ ఉండవు. కేవలం ఒక్క బార్కోడ్ మాత్రమే ఉంటుంది. పైగా అన్నిచోట్ల సీసీ కెమేరాలు కూడా ఉన్నాయి. వక్రీకరణకైనా హద్దూ, పొద్దు ఉందా?చివరిగా చంద్రబాబుకు ఇదే నా సవాల్చంద్రబాబు ఆరోపణలు చేస్తున్న గ్రూప్ృ1 పరీక్ష, గత ఏడాది మీరు నిర్వహించిన డీఎస్సీ. రెండింటిపై సీబీఐ విచారణ జరిపిద్దాం. ఒక్క డీఎస్సీృ2025పైనే కాదు. గ్రూప్ృ1. 2018పైనా సీబీఐ విచారణకు మేము రెడీ. నీవు రెడీనా? మేము తప్పు చేయలేదు. మాకు ఆ ధైర్యం ఉంది. మరి మీకు ఆ ధైర్యం ఉందా? -
వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వైఎస్సార్సీపీ అభిమాని వర్షిత రెడ్డి వివాహ రిసెప్షన్కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో జరిగిన వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరయ్యారు.నూతన వధూవరులు వర్షితరెడ్డి, క్రాంతి భాస్కర రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్.. నూతన దంపతుల వైవాహిక జీవితం ఆనందంగా, సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. -
రేపు హైదరాబాద్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (21 ఆగస్టు, శుక్రవారం) హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి, 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి జలవిహార్ గ్రాండ్ లాన్స్లో జరిగే సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు. -
ప్రియాంక తల్లిదండ్రుల మాటలు విని జగన్ కళ్లలో కన్నీళ్లు తిరిగాయి..
-
రిలీజ్ తరువాత జగన్ ను కలిసిన సీదిరి కుటుంబం
-
వైఎస్ జగన్ని కలిసిన మెడికో ప్రియాంక పేరెంట్స్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెడికో ప్రియాంక తల్లిదండ్రులు గురువారం కలిశారు. తమ కుమార్తెను కారుతో ఢీకొట్టి చంపిన విషయమై వైఎస్ జగన్కు ప్రియాంక పేరెంట్స్ వివరించారు.తమ కుమార్తెను తలచుకుని వెంకటేష్, చంద్రమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. వారిని వైఎస్ జగన్ సముదాయించి ధైర్యం చెప్పారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలంటూ వైఎస్ జగన్ను ప్రియాంక కుటుంబ సభ్యులు కోరారు. అవసరమైన న్యాయ పోరాటం చేద్దామంటూ వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
వైఎస్ జగన్ను కలిసిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. అక్రమ కేసులో అరెస్టై 23 రోజుల పాటు శ్రీకాకుళం జైలులో ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజుతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ధైర్యం చెప్పారు.రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఉండాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని సీదిరి అప్పలరాజుకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పి, పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. -
ఇదే నా సవాల్... బల్ల గుద్ది ఛాలెంజ్ విసిరిన జగన్
-
వైఎస్ జగన్ ఫుల్ స్పీచ్ @ తాడేపల్లి
-
వెళ్తూ వెళ్తూ.. అబ్బా కొడుకులకు జగన్ ఓపెన్ ఛాలెంజ్
-
కొంచెం కూడా సిగ్గులేకుండా.. లోకేష్ ను కాపాడుకోవడానికి మరింత దిగజారుతావా చంద్రబాబు..
-
పోస్టుకు 14 లక్షలు తీసుకున్నారు. ధర్మేంధ్ర ప్రధాన్ కో రూల్ నీకో రూలా..?
-
బాబు, లోకేశ్కు వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్
సాక్షి, తాడేపల్లి: ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ చెప్పిందని.. అయినా దుష్ప్రచారం ఆపడం లేదని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్కు ఓపెన్ చాలెంజ్ విసిరారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ గ్రూప్-1 చంద్రబాబు హయాంలో రిలీజ్ అయిన నోటిఫికేషన్. ఎన్నికల ముందు హడావిడిగా ఆయన దానిని రిలీజ్ చేశారు. మేం అధికారం చేపట్టక ముందే ప్రిలిమ్స్ జరిగాయి. ప్రిలిమ్స్లో పాసైన వాళ్లకే మేం మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాం. ఎలాంటి అవకతవకలు జరగలేదని.. చంద్రబాబు వేసిన సిట్ చెప్పింది. వాల్యూయేషన్లో ఎలాంటి తప్పులు జరగలేదని తేల్చి చెప్పింది. అయినా కూడా పదే పదే తప్పుడు ప్రచారాలు చేశారు. అసలు ఏపీపీఎస్సీలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ఘనత మాది. మరి బాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఫలితాలను బయటపెట్టగలరా? అని సవాల్ విసిరారు. బాబు హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన ఫలితాలను బయటపెట్టగలరా?.. రిటన్ టెస్ట్లో ఎన్ని మార్కులు, ఇంటర్వ్యూలో ఎన్ని మార్కులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగాలిచ్చాం. మా హయాంలో 78 నోటిఫికేషన్లతో 6,296 ఉద్యోగాలిచ్చాం. ఒక్క ఆరోపణ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. మా హయాంలో నిర్వహించిన 2018 గ్రూప్-1పై సీబీఐ దర్యాప్తునకు నేను రెడీ.. మీ హయాంలో జరిగిన 2025 డీఎస్సీపై సీబీఐ దర్యాప్తునకు మీరు సిద్ధమా? అని చంద్రబాబుకి వైఎస్ జగన్ ఓపెన్ చాలెంజ్ విసిరారు.తప్పు చేయలేదు కాబట్టే తల ఎత్తుకుని అడుగుతున్నాం. ఫస్ట్ ర్యాంకర్ నవీన్కు ఎందుకు ఉద్యోగం రాలేదు?. విద్యాశాఖ మంత్రి ఆదేశాలు లేకుండా జీవోలు ఇవ్వగలరా?. బేరసారాల ఆడియో, వీడియో టేపులపై చర్యలేవీ?. సీబీఐ విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి లేఖ రాశాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశాం. సీబీఐ విచారణ చేయించాలని కోర్టును కూడా ఆశ్రయించాం. సవాల్కు సిద్ధమైతే.. విచారణకు సిద్ధమైతే దర్యాప్తు సంస్థకు లేఖ రాయండి అని వైఎస్ జగన్ అన్నారు. -
కొంచెం సీక్రెట్ గా చేయాలంటా.. DSC స్కాం పై మరో సంచలనం ఆడియో వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
-
DSC స్కాం పై మరో సంచలనం ఆడియో వైఎస్ జగన్ మాస్ ర్యాగింగ్
-
కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: స్పోర్ట్స్కోటాలో ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నాలు జరిగాయన్నది వాస్తవమేనని అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వమే ఒప్పుకుందని వైఎస్ జగన్ మోహన్రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పులు బయటకు వచ్చాయని.. కేసు కూడా నమోదైందని ఆయన గుర్తు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవోలిచ్చే స్థాయికి డీఎస్సీ స్కాం వెళ్లింది. మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?. డీఎస్సీ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటకు వచ్చాయి. టేపులు బయటకు వచ్చినట్లు బాబు, లోకేశ్లు ఒప్పుకున్నారు. ఎంతో సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ, జరిగింది ఏంటో తెలుసా?.. ఎఫ్ఐఆర్ కాపీలో నిందితుడిని సస్పెక్టెడ్ అని రాశారు. అరెస్ట్ శిక్ష సంగతి పక్కన పెడితే.. ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అసలు వెంటనే ఎఫ్ఐఆర్ రాయకుండా ఉన్నతాధికారులతో ఎందుకు మాట్లాడారు?. ఆడియో, వీడియో టేపుల్లో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ బయటకు వచ్చింది. ఆ నెంబర్ ఎవరిదనేది కనుక్కోవడం పోలీసులకు ఎంత సేపు పని?. దారుణంగా అబద్దాలు ఆడుతున్నారు.. నిందితులను కాపాడుతున్నారు అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీలో జాబ్ ఇస్తారని ఓ మహిళా అభ్యర్థి దగ్గర డబ్బు తీసుకున్నారు. ఆపై మోసం చేశారు. ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తారని మభ్య పెట్టారు. ఆమె తనను మోసం చేశారని కంప్లయింట్ చేశారు. ఎవరికి రూ.14 లక్షలు ఇచ్చారో అనేది కూడా ఉంది. డీఎస్సీ అని పేర్కొనకుండా.. ఏపీ టూరిజంలో మోసం చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో రాశారు. గతేడాది నవంబర్లోనే ఇది జరిగితే.. ఇప్పటిదాకా ఎలాంటి కేసు లేదు. కేసులో పురోగతి లేదని ఎస్పీకి ఆమె ఫిర్యాదు చేసినా.. పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవే కాదు.. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కానీ, ఇక్కడ నారా లోకేశ్తో చంద్రబాబు రాజీనామా చేయట్లేదు. పైగా మరింత దిగజారిపోయారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని దుష్ప్రచారానికి దిగారు. కానీ, ఆ వ్యవహారం అయన ప్రభుత్వం చివర్లోనే ప్రిలిమ్స్ జరిగింది.ఆక్రోశంతో దుష్ప్రచారం2019కి ముందే బాబు హయాంలో ఆ నోటిఫికేషన్ వచ్చింది. మా ప్రభుత్వం అధికారం చేపట్టకముందే(2019 మే 26న).. ప్రిలిమ్స్ జరిగాయి. మేం ప్రిలిమ్స్లో పాసైన వాళ్లకు మెయిన్స్ మాత్రమే నిర్వహించాం. ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిజిటల్ వాల్యూయేషన్ జరిపించాం. అయితే కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. డిజిటల్ వాల్యూయేషన్ను పరిగణనలోకి తీసుకోకుండా మాన్యువల్ వాల్యూయేషన్ చేయాలని కోర్టు చెప్పింది. అలా చేశాకే.. నియామకాలు జరిపాం. అలాంటప్పుడు అక్రమాలకు తావెక్కడిది?. అయితే చంద్రబాబు ప్రభుత్వం.. డిజిటల్ వాల్యూయేషన్లో అవకతవకలు జరిగాయని అంటోంది. హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని పక్కన పెట్టాక ఆ ప్రస్తావన మళ్లీ ఎందుకు వస్తోంది?. అంటే.. ఇది 165 మంది జీవితాలను అతలాకుతలం చేసే ప్రయత్నమా?. ఇదే గ్రూప్-1 వ్యవహారంపై నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. 2025లో సిట్ వేశారు. ఆ సిట్ అధికారులు ఏ తప్పు జరగలేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇరికించే కుట్రలో భాగంగా మరో సిట్ వేశారు. సిట్లో ఉన్నది చంద్రబాబు ప్రభుత్వంలో పని చేసేవారే కదా?. నిజాలను ఎవరూ దాచిపెట్టలేరు.. బయటకు రావాల్సిందే. మా హయాంలో ఇప్పటి డీఎస్సీ మాదిరి ఏ స్కాంలు జరగలేదు. మేమేం పరీక్షలే నిర్వహించకుండా.. ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎవరికీ అనుకూలంగా జీవోలు తేలేదు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నట్లు.. బేరసారాలు జరిగినట్లుగా.. ఆడియో, వీడియోలు ఇలాంటి ఆధారాలేవీ బయటకు రాలేదు. మా హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. కొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబుకి ఈ ఆక్రోశం’’ అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీలో లీకేజీల నుంచి బేరసారాల వరకు పరిశీలించాలి. మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాల్సిందే. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందే అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
PPPT-వేసి మరి అబ్బాకొడుకులను ఆడుకున్న YS జగన్
-
జీవో ఎందుకు ఇచ్చారు ఎందుకు రద్దు చేసారు? అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు...
-
అసెంబ్లీలో గింజుకోవడం... బౌలింగ్ లేకుండానే తండ్రి కొడుకుల బ్యాటింగ్..
-
అసెంబ్లీ సాక్షిగా అబ్బా కొడుకులే నిజం ఒప్పుకున్నారు... లైవ్ లో వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్
-
పీవీ సింధులా ఎంత మందికి మెడల్స్ వచ్చాయి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ నియామకాల్లో పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇచ్చుకునేందుకే స్పోర్ట్స్ కోటాను ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన డీఎస్సీ అవకతవకలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.డీఎస్సీ పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని జగన్ నిలదీశారు. పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అసలు ఎలా అనగలిగిందని ప్రశ్నించారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చే సమయంలో కనీసం అభ్యర్థుల విద్యా సామర్థ్యాన్ని కూడా పరీక్షించాల్సిన అవసరం లేదా? అని అన్నారు. ‘‘చదువు చెప్పే వారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇస్తారా? చంద్రబాబు, లోకేశ్ మైండ్లో చిప్లు ఉన్నాయా? లేదా?’’ అని మండిపడ్డారు. స్పోర్ట్ కోటాలో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా జీవోలు కూడా జారీ చేశారని.. రిక్రూట్మెంట్లు అయ్యాక వాటిని వెనక్కి కూడా తీసుకున్నారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. పీవీ సింధుకు ఇచ్చినట్లుగానే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు.. కానీ పీవీ సింధులా ఎంతమంది అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని పతకాలు సాధించారు? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని దేశానికి ఎన్నో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు ప్రత్యేక కేటగిరీ కింద ఉద్యోగం ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టరని ఆయన అన్నారు. కానీ అదే పేరుతో సాధారణ నియామక ప్రక్రియను పక్కనపెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు.పీవీ సింధు స్థాయిలో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నవారు ఎంతమంది? దేశానికి, రాష్ట్రానికి పతకాలు సాధించినవారు ఎంతమంది? అనేది చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మంది అర్హతలు, వారు సాధించిన పతకాలు, ప్రభుత్వం జారీ చేసిన జీవోల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు, నారా లోకేశ్ల అబద్ధాలు ఏస్థాయిలో ఉన్నాయంటే.. ఆర్చరీలో గోల్డ్ మెడల్ అందుకున్న దుర్గయ్యకి కూడా ఉద్యోగం రాలేదు. కాల్లెటర్ పంపిన తర్వాత కూడా.. ఉద్యోగం ఇవ్వలేదు అంటే అర్థం చేసుకోవాలి అని వైఎస్ జగన్ అన్నారు. అందుకే తాము సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. -
బౌలింగ్ లేకుండానే తండ్రి కొడుకుల బ్యాటింగ్.. లోకేష్ అసెంబ్లీ స్పీచ్ పై జగన్ ఫైర్
-
బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే తండ్రీకొడుకుల బ్యాటింగ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తప్పు చేశారు అని క్లియర్ కట్గా ఉన్నా.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన డీఎస్సీ అవకతవకల అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఆధారాలు ప్రజల ముందు ఉంచాం. ఆ అవకతకవలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని తమకు ఆ హోదా ఇవ్వడం లేదు. కౌన్సిల్లోనూ మాట్లాడడానికీ సమయం ఇవ్వడం లేదు. బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీకొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారు అని చంద్రబాబు, నారా లోకేశ్లను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. డీఎస్సీలో అక్రమాలపై పోరాడుతున్నాం. అందుకే తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1పై కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. ప్రశ్నిస్తే గింజుకుంటున్నారు తప్ప.. తప్పు ఒప్పుకోవడం లేదు. అసెంబ్లీలో మాట్లాడతారు కానీ.. మండలిలో మాట్లాడరు. తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపుతుందని చంద్రబాబుకు భయం అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీ పేపర్ తయారీ, నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టారు. స్వయంగా ఈ విషయాన్ని లోకేశ్ సభలో అంగీకరించారు. ప్రశ్నాపత్రం తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీది. పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ది. రెండూ ఒకే వ్యక్తి చేతిలో పెడితే పారదర్శకత ఉంటుంందా?. ఏపీ డీఎస్సీ నియామక చరిత్రలోనే రెండు బాధ్యతలు ఒకే అధికారి చేతికి ఎప్పుడూ ఇవ్వలేదు. ఇక్కడే డీఎస్సీ స్కామ్కు బీజం పడింది. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం. ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?. ఇలా చేయడం లీకేజీకి తెర తీసినట్లు కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు.ఆ లీకులు నవీన్ ఒక్కడి దగ్గరే ఆగాయా?నవీన్ తన ర్యాంకును, ఉద్యోగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ విద్యాశాఖకు లేఖ కూడా రాశారని జగన్ తెలిపారు. మొదటి మెరిట్ జాబితాలో నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. అలాంటప్పుడు ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.వెరిఫికేషన్కు హాజరు కాలేదనే కారణంతో నవీన్కు ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోందని వైఎస్ జగన్ అన్నారు. అదే నిజమైతే.. తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ నవీన్ కోర్టును ఎందుకు ఆశ్రయించాడని ప్రశ్నించారు. అంతేకాకుండా రెండో మెరిట్ జాబితాలో నవీన్ పేరు లేకుండా ఎలా విడుదల చేశారని నిలదీశారు.పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ముందుగానే నవీన్ పేరును మెరిట్ జాబితా నుంచి తొలగించారని అన్నారు. ప్రశ్నాపత్రం తయారీ విభాగంలో పనిచేసే ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవీన్ ఒక్కడి వరకే పేపర్ లీక్ పరిమితమైందా? లేక ఇంకా ఎంతమందికి చేరింది? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నవీన్ విషయంలోనే ఇలా జరిగిందా? డీఎస్సీ వ్యవహారంలో మరెవరైనా లబ్ధి పొందారా? అనే అంశాలపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు. -
Watch Live: YS జగన్ కీలక ప్రెస్ మీట్
-
మండలిలో జగన్ మాస్టర్ ప్లాన్.. కూటమికి చెక్.. డిప్యూటీ చైర్మన్ పీఠం YSRCP కైవసం
-
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, డీఎస్సీపై మాట్లాడారు.వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..డీఎస్సీ అక్రమాలపై ఆధారాలు ప్రజల ముందు ఉంచాం.డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రశ్నిస్తే గింజుకున్నారు. తప్పు ఒప్పుకోవడం లేదు.తప్పులను ప్రతిపక్షం ఎత్తుచూపుతున్నదని చంద్రబాబుకు భయంఅసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్ బ్యాటింగ్ చేస్తున్నారు.ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని హోదా ఇవ్వడం లేదు. ప్రశ్నపత్రం తయారీ ఎస్సీఈఆర్టీ బాద్యతరెండూ ఒకే వ్యక్తి చేతిలోపెడితే పారదర్శకత ఉంటుందా?ఇక్కడే స్కామ్కు బీజం పడింది.ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?స్వయంగా లోకేష్ సభలో అంగీకరించారు.ఏపీ డీఎస్సీ నియామాక చరిత్రలో ఎప్పుడు ఒకే వ్యక్తికి రెండు బాధ్యతలు అప్పగించలేదుపేపర్ తయారీ విభాగంలో వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ది.ఫస్ట్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ నవీన్ పేరు ఉందిఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్కు ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు?వెరిఫికేషన్లో నవీన్ పేరు లేదని ఉద్యోగం ఇవ్వలేదటఇదే వాస్తవం అయితే నవీన్ కోర్టుకు ఎందుకు వెళ్లాడు?సెకెండ్ వెరిఫికేషన్ లిస్టులో కూడా నవీన్ పేరు తొలగించారు.సర్టిఫికెట్ వెరిఫికేష్కు నవీన్ ఎలా వస్తాడు?డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై చర్చకావాలంటూ నాలుగు రోజులపాటు శాసనమండలిని మా ఎంఎల్సీలు స్తంభింపచేశారు.కాని, అక్కడ డిస్కషన్ చేయడానికి ముందుకు రావడంలేదు. ఎందుకు కౌన్సిల్లో చర్చకు ఒప్పుకోలేదంటే, కారణం డీఎస్సీలో తప్పులు జరిగాయి కాబట్టి, సీబీఐ విచారణ చేయాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి, జరిగిన దానికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామాచేసి తప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి. డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ–పరీక్ష నిర్వహణ రెండూ ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా అంగీకరించారు. మేం లేవనెత్తిన కీలక అంశంకూడా ఇదే. అంగీకరించడమే కాకుండా, తప్పేముంది అని దబాయించాడు.ప్రశ్నలు తయారుచేసే వ్యవస్థకు, పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఎందుకు తొలగించారో దర్యాప్తు జరగాలి, అంతేకాదు, ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలాలి? అందుకే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం.మరి ఇన్ని తప్పులు కనిపిస్తున్నప్పుడు సీబీఐ దర్యాప్తు జరగాలా? వద్దా?వాళ్ల మనుషులకు టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు.చదువు చెప్పేవారికి పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చేస్తారా?డీఎస్సీ నియామకం తర్వాత ఇచ్చిన జీవోను ఎందుకు వెనక్కి తీసుకున్నారుపీవీ సింధు పేరు చెప్పి చంద్రబాబు, లోకేష్ అబద్ధాలుచరిత్రలో లేనివిధంగా పరీక్ష రాయని వారికి ఉద్యోగాలు ఇచ్చేశారు.మెడల్స్ కాదు కేవలం పాల్గొన్నందుకే ఉద్యోగాలు ఇచ్చేశారు.గతంలో డీఎస్సీ క్వాలిఫై అయితేనే ఉద్యోగం వచ్చేది.జీవోలు ఇచ్చే స్థాయికి స్కాం వెళ్లింది.372 మందికి ఉద్యోగాలిచ్చిన జీవోలను రద్దు చేశారు.మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇస్తారా?డీఎస్ స్కాంపై ఆడియో, వీడియో టేపులు బయటపడ్డాయి.డీఎస్సీ పరీక్ష రాయకుండానే, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, అసలు పరీక్ష రాయకుండానే, స్పోర్ట్స్కోటాలో పోస్టులు ఇచ్చామని, దీనికోసం జీవోలు జారీచేశామనికూడా ఒప్పుకున్నారు.దీన్ని సమర్థించుకోడానికి చెప్పిన కబుర్లు మామ్మూలుగా లేవు.స్పోర్ట్స్ పర్సన్స్కు టెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదంట, పీవీ సింధులాంటి వారికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చాం కాబట్టి, పిల్లలకు చదువుచెప్పే ఈ టీచర్ ఉద్యోగాలూ కూడా అలాగే ఇచ్చారంట?ఇలా అడ్డగోలుగా సమర్థించుకోవడం ఆ అబ్బా, కొడుకులు ఇద్దరికే తప్ప, ఎవరికైనా సాధ్యం అవుతుందా?పీవీ సింధుకు, డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో నింపిన 372 ఉద్యోగాలకు మధ్య పోలిక తీసుకువచ్చినందుకు చంద్రబాబును, లోకేష్ను ఏమనుకోవాలి? వీళ్ల మైండ్లో చిప్లు ఉన్నాయా? లేవా? ఉంటే అవి పనిచేస్తున్నాయా? లేవా?పీవీ సింధుకు 2016 రియో ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్, 2020 టోక్యో ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చాయి. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్, కామన్వెల్త్, ఏసియన్ గేమ్స్, ఇలా చాలా ఇంటర్నేషనల్ టోర్నీల్లో ఎన్నో విజయాలు సాధించింది. స్పోర్ట్స్ కోటాలో నియమించిన దాదాపు 372 మందిలో పీవీ సింధులా ఎంతమందికి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ అచీవ్మెంట్స్ ఉన్నాయి? బుద్ధి ఉన్నోడు ఎవరైనా ఇలాంటి పోలికలు తెస్తారా?తన స్కాంలను కప్పిపుచ్చుకోవడానికి సింధులాంటి ప్లేయర్ను అడ్డుపెట్టుకుంటున్నాడు.సింధులాంటి వాళ్లకు ఇవ్వడానికే టీచర్ రిక్రూట్మెంట్లో స్పోర్ట్స్కోటాకు ఈ కొత్త జీవోలు ఇచ్చామని, చెప్తున్న ఈ చంద్రబాబు, లోకేష్ - ఇద్దరూ కూడా మళ్లీ ఇచ్చిన ఆ జీవోలను ఎందుకు ఎత్తివేశారో మాత్రం అసెంబ్లీలో సమాధానం చెప్పలేకపోయారు.ఒకవైపు సింధు పేరుచెప్పి, మరోవైపు వీళ్ల అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయి - అంటే, చివరకు ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ షిప్ సాధించిన, ఎస్టీ కేండిడేట్ దుర్గయ్యకు కూడా, కాల్ లెటర్ పంపిన తర్వాత కూడా, పోస్టు ఇవ్వకుండా అన్యాయం చేశారు. డీఎస్సీ విషయంలో ఏ ఫిర్యాదు వచ్చినా పక్కన పెట్టారు.విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాల్సిందే: వైఎస్ జగన్‘నీట్’ లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాధర్మేంద్ర ప్రధాన్కు ఒక నీతి.. బాబు కుమారునికి మరొక నీతా?కొడుకును కాపాడుకునేందుకు బాబు మరింత దిగజారుడుబాబు, లోకేష్ డైరెక్షన్లోనే పోలీసుల వ్యవహరంమేం నిర్వహించిన ఎపీపీఎస్సీలో లీకేజీ జరగలేదు.స్పోర్ట్స్ కోటా పేరిట టీచర్ పోస్టుల అమ్మకాలు, బేరసారాలు చేసినట్టుగా, ఆడియో, వీడియో కాల్స్ బయటకు వచ్చినట్టుగా అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు.మరి వీడియోలో బేరసారాలు చేస్తున్న వ్యక్తి ఫోన్ నంబర్ అంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో, పేరు చూపకుండా, కేవలం సస్పెక్ట్ అని ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు సీనియర్ అధికారులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఆకేసును ఎందుకు నిర్వీర్యం చేశారు. మరి చంద్రబాబు, లోకేష్లు ఇద్దరూ వీటికి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఒంగోలులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఒక డీఎస్సీ అభ్యర్థికి స్పోర్ట్స్కోటాలో పోస్టు ఇప్పిస్తామని రూ.14లక్షలు తీసుకున్నారు.రిఫరెన్స్గా మరో వ్యక్తికి కూడా ఇలాగే చేస్తున్నామని చెప్పారు. రిఫరెన్స్గా చూపిన వ్యక్తికి పోస్టు వచ్చింది, కాని, ఈ అమ్మాయికి పోస్టు రాలేదు. గట్టిగా అడిగితే ఏపీ టూరిజంలో మరో ఉద్యోగం ఇస్తామంటూ మభ్యపెట్టారు. తనకు అన్యాయం జరిగిందని, ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాని పోలీసులు ఎఫ్ఐఆర్లో డీఎస్సీ పోస్టుకోసం బేరసారాలు చేశారని రాయకుండా, టూరిజం పోస్టుకోసం అన్నట్టుగా రాశారు.గత ఏడాది నవంబర్ 11న, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, ఇప్పటివరకూ ఎలాంటి చర్యల్లేవు. తన కంప్లైంట్పై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఎస్పీకి ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు.అంటే డీఎస్సీ విషయంలో ఏ కంప్లైంట్ వచ్చినా, ఎక్కడవి అక్కడే ఎలాంటి విచారణ లేకుండా వదలిలేయాలని, తండ్రికొడుకులు ఇద్దరూ ఆదేశాలు ఇచ్చినట్టుగా, దాన్ని పోలీసులు పాటిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది.లీకేజీ దగ్గరనుంచి స్పోర్ట్స్కోటా వరకూ, ఆపై బేరసారాల వరకూ ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అంశాలు.అందుకే డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరగాలి. జరిగిన వాటికి బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి. మేం ఎవరికీ అనుకూలంగా జీవోలు తీసుకురాలేదుకొడుకును కాపాడుకునేందుకే చంద్రబాబు ఆక్రోశంనిజాలను ఎవరూ దాచలేరు.. బయట పెట్టాల్సిందేఅప్పట్లో కోవిడ్ వల్ల డిజిటల్ వాల్యుయేషన్కు వెళ్లాం.మార్కుల ఆధారంగా 165 మందికి ఉద్యోగాలు ఇచ్చాం.కొంతమంది కోర్టుకు వెళ్లడంతో డిజిట్ వాల్యుయేషన్ను పరిగణలోకి తీసుకోలేదు.మాన్యువల్ వాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది.నాలుగేళ్ల తర్వాత చంద్రబాబు విషం కక్కుతున్నారు. కొడుకును కాపాడుకునేందుకు చంద్రబాబు కొత్త గేమ్ మొదలుపెట్టాడు. మరింత దిగజారిపోయి 2018- ఏపీపీఎస్సీ గ్రూప్-1 భర్తీపై తప్పుడు ఆరోపణలు చేయడం మొదలుపెట్టాడు.163 మంది ఉన్నత ఉద్యోగుల జీవితాలను అతలాకుతలం చేయాలని చంద్రబాబు టార్గెట్ చేశాడు.అప్పటి ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇప్పటి, డీఎస్సీ మాదిరిగా పేపర్ లీకేజీ అప్పుడు జరగలేదు.ఇప్పటి డీఎస్సీ మాదిరిగా ప్రశ్నపత్రాల విభాగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ లేదా ఇతర ఉద్యోగులు ఎవ్వరికీ ర్యాంకులు రాలేదు. ఎవ్వరికీ అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు, పరీక్షలే లేకుండా ఎవ్వరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు.ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా, డబ్బులు ఇచ్చినట్టుగా, బేరసారాలు చేస్తున్నట్టుగా ఆడియో, వీడియో ఆధారాల్లాంటివి బయటకు రాలేదు.బయటకు వస్తున్నదల్లా చంద్రబాబు ఆక్రోశం. కొడుకును కాపాడుకోవాలన్న ఆయన ఆరాటం మాత్రమే.చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాదిలోనే 2025, ఏప్రిల్లో ఒక సిట్ వేశాడు. ఫైనల్ ఫలితాల వెల్లడిలో ఏ తప్పూ జరగలేదని హైకోర్టులో గవర్నమెంటు అడ్వకేట్లు సైతం అఫడవిట్ ఫైల్ చేశారు. ఇది ఓవైపు జరుగుతుండగానే 2026 ఫిబ్రవరి 14న మరొక సిట్ వేశారు. సిట్లో ఉండేది ఎవరు? చంద్రబాబుగారి కింద పనిచేసే వారే.బురదజల్లడంకోసం దర్యాప్తు బృందాలను ఇష్టానుసారంగా వాడుకోవడం చంద్రబాబుకు కొత్తకాదు.గ్రూప్-1 వాల్యూషన్కు సంబంధించి హాయ్ల్యాండ్లో ఏదో జరిగిపోయిందని, అదే పనిగా, ఒకే అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. హాయ్లాండ్లో ఎలాంటి ఎవాల్యూషన్ జరగలేదని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి.చంద్రబాబు ప్రభుత్వమే 2025 నవంబర్ 15న, హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కూడా ఇదే విషయాన్ని రాశారు.మరి ఏదో జరిగిపోయిందన్న ప్రచారం ఎందుకు చేస్తున్నారు?గ్రూప్ -1పై ఎల్లో మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది.బాబు హయాంలోని ఏపీపీఎస్సీ ఫలితాలు బయటపెట్టగలారా?ఇంటర్వ్యూలలో ఎన్ని మార్కులు వచ్చాయో, రిటన్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పగలరా?.. చంద్రబాబుకు వైఎస్ జగన్ సవాల్..ఏపీపీఎస్సీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం: వైఎస్ జగన్ఒక్క ఆరోపణ లేకుండా 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చాం.2018 గ్రూప్ -1, 2025 డిఎస్సీ విచారణకు రెడీ.. సీబీఐ విచారణకు మీరు సిద్ధమా?తప్పు చేయలేదు కాబట్టి తలెత్తుకుని అడుగుతున్నాం.. చంద్రబాబు, లోకేష్కు వైఎస్ జగన్ సవాల్ మేం ఇచ్చిన దాంట్లో 7 నోటిఫికేషన్లను చంద్రబాబు పెండింగ్లో పెట్టాడు. మరో రెండింటిని రద్దు చేశాడు. ఇదీ నిరుద్యోగుల మీదున్న ప్రేమ.చంద్రబాబూ…మేం సవాల్ విసురుతున్నాం. మేం అడుగుతున్నట్టుగా DSC-2025పైనే కాదు, 2018 గ్రూప్-1 నోటిఫికేషన్మీదా, సీబీఐ ఎంక్వైరీ వేయండి. మేం రెడీ. చంద్రబాబు రెడీనా?తప్పు చేయలేదు కాబట్టి, మేం రెడీగా ఉన్నాం. చంద్రబాబు రెడీ అయితే వెంటనే సీబీఐ దర్యాప్తుకు లెటర్ రాయాలి. -
మోసాలపై చర్చ మొదలైంది!. హామీల ‘వెన్నుపోటు’పై రెండేళ్లకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఎస్ జగన్ వ్యాఖ్య
-
మోసాలపై చర్చ మొదలైంది
‘‘ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. అక్కడ జగన్ ఉన్నాడు. వైఎస్సార్సీపీ ఉంది. ఇక్కడ చంద్రబాబు ఉన్నాడు. వెన్నుపోటు పార్టీ ఉంది. తేడా ఒక్క మనిషి మాత్రమే. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’’ ‘‘చంద్రబాబు హయాంలో రైతులు హ్యాపీగా లేరు. మహిళలు హ్యాపీగా లేరు. చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు. ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు.’’ ‘‘నాడు మడమ తిప్పని మన పరిపాలన గురించి ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. అలాగే చంద్రబాబు చేసిన మోసాలపైనా చర్చ సాగుతోంది. అందుకే వెన్నుపోటు పార్టీ అని చంద్రబాబు పార్టీకి ప్రజలే నామకరణం చేశారు. ఎన్టీ రామారావు అయినా సరే. ప్రజలైనా సరే. ఆయన చేసేది వెన్నుపోటు కాబట్టి. ఆ పార్టీకి ప్రజలే ఆ నామకరణం చేశారు.’’ -వైఎస్ జగన్సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ పాలనపై రెండేళ్లలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. 5 ఏళ్ల మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా పోల్చి చూస్తున్నారు. జగన్ ఎలా చేయగలిగాడు? అదే చంద్రబాబు పాలనలో ఎందుకు జరగడం లేదు? అన్నదానిపై చర్చ జరుగుతోంది.’ అని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేరని, అన్ని వర్గాలనూ మోసం చేశారని అన్నారు. స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మన గెలుపు తధ్యమని పేర్కొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులతో భేటీ అవుతున్న వైఎస్ జగన్.. ఆ దిశలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా పలకరించి.. ఆప్యాయంగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను.. జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాజమండ్రి రూరల్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు, పార్టీకి చెందిన స్థానిక మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నారు? జగన్ ఇచ్చే దానికన్నా మూడింతలు ఎక్కువ ఇస్తామని చంద్రబాబు అన్నారు. అప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు ఇవి. జగన్ అమ్మఒడి కింద ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే రూ.15 వేలు ఇచ్చాడు. నేను అలా కాదు. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున.. నీకు 15 వేలు, నీకు 15 వేలు ఇస్తా అన్నాడు. అంతటితో ఆగిపోలా. జగన్ చేయూత కింద 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, వాళ్లకు బ్యాంకుల్లో అనుసంధానం చేసి, అమూల్, ఐటీసి, రిలయన్స్, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్తాన్ లీవర్ వంటి సంస్థలతో టైఅప్ చేయించి, ప్రతి మహిళను తాను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ, 45 ఏళ్లు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఇస్తే.. జగన్ ఏటా కేవలం రూ.18,750 మాత్రమే ఇస్తున్నాడు. నేను అధికారంలోకి వస్తే, 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.4 వేల చొప్పున ఏటా రూ.48 వేలు ఇస్తానన్నాడు. మరి ఎక్కడ రూ.18,750. ఎక్కడ రూ.48 వేలు. అంటే దాదాపు మూడు రెట్లు. ఇంకా అంతటితో ఆగలా. 18 ఏళ్లు నిండిన ఏ మహిళకైనా నెలకు రూ.1500 చొప్పున ఏటా రూ.18 వేలు ఇస్తామన్నారు. అలా నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు, నీకు రూ.18 వేలు అని ప్రచారం చేశారు. అది ఆడబిడ్డ నిధి అంట!. ఇంకా భుజాన కండువా వేసుకుని ఎవరైనా రైతు కనిపిస్తే ఏమన్నాడు?. జగన్ ఇచ్చేది ఏటా రూ.13,500 మాత్రమే కదా, నేను వస్తే రూ.26 వేల చొప్పున ఇస్తామన్నారు. మళ్లీ ఎవరైనా యువకుడు కనిపిస్తే ఏమన్నాడు? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అన్నాడు. అదే నిరుద్యోగ భృతి. అలా అప్పుడు జగన్ ఇచ్చేవాటికన్నా ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పాడు. బాండ్లు, సంతకాలతో పచ్చి మోసం ఇంటింటికి పార్టీ కార్యకర్తలను, ఎమ్మెల్యే క్యాండిడేట్లను పంపాడు. తన ఫోటో, సంతకంతో ఒక బాండ్ తయారు చేసి, ప్రతి ఇంటికి ఇవ్వడం. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? నీకు రూ.36 వేలు, నీకు రూ.36 వేలు అని, మీ ఇంట్లో రైతులు ఉన్నారమ్మా? అయితే ఆయనకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు ఉన్నారమ్మా? వాళ్లకు ఏటా రూ.18 వేలు. మీ ఇంట్లో 50 ఏళ్లు నిండిన మీ అత్తమ్మ ఉందా? నీకు రూ.48 వేలు. సినిమా రిలీజ్ జూన్, 2024. అని బాండ్లు ప్రతి ఇంటికీ పంపారు. ఇంకా ప్రమాణం. ‘నేను పవన్ కళ్యాణ్. మేమిద్దరం ప్రమాణ పూర్తిగా ప్రమాణం చేస్తున్నాం’ అని చెప్పి, ఇద్దరూ బాండ్ల మీద సంతకాలు చేశారు. అవేవీ అమలు కాలేదు కాబట్టి, ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ ఈరోజు రాష్ట్రంలో మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా. అధిక ధరలకు పీపీఏలు. ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాలకు ఇచ్చేయడం, కొత్త మెడికల్ కాలేజీల అమ్మకం. అమరావతిలో చూస్తే చదరపు కట్టడానికి ఏకంగా రూ.20 వేలు వ్యయం. అదే హైదరాబాద్, బెంగళూరులో ఫైవ్ స్టార్ సదుపాయాలతో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్ కట్టినా చదరపు అడుగుకు రూ.4,500. ఇంకా మహా అయితే రూ.5 వేలు వ్యయం. మరి ఇక్కడ అమరావతిలో ఇసుక ఉచితం. ఇంకా పలు రాయితీలు. అయినా చదరపు అడుగుకు రూ.20 వేలు ఖర్చు అంటున్నారు. లూటీ ఏ స్థాయిలో జరుగుతోందో ఇవన్నీ ఉదాహరణలు. ఇప్పుడు పీపీపీ పేరుతో దోచేయడం. ఆస్పత్రి సేవలు, తాగునీరు, ఆర్టీసీ, చివరకు చెత్త ఎత్తడం కూడా అంతా పీపీపీ. అంటే ఇక మీదట మొత్తం ప్రైవేట్ వాళ్ళకే. అంటే లంచాలు తీసుకోవడం. అన్నీ అమ్మేయడం. చంద్రబాబు పాలనలో సంపద సృష్టి అంటే అర్ధం ప్రభుత్వ ఆస్తులన్నీ శనక్కాయలు, పప్పుబెల్లాలకి అమ్మేయడం. విద్యార్థులకూ వెన్నుపోటు రాష్ట్రంలో పిల్లలు కూడా సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేవు. మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్ లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026. ఏటా రూ.1100 కోట్లు. మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది. దీంతో రూ.3,300 కోట్లు బాకీ. విద్యాదీవెన 2024 జనవరి–మార్రి త్రైమాసికం నుంచి ఇవ్వలేదు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం వరకు చూసుకుంటే మొత్తం 13 త్రైమాసికాలు పెండింగ్. ప్రతి క్వార్టర్కు రూ.700 కోట్లు. అంటే మొత్తం రూ.9,100 కోట్లు బాకీ. అది వసతి దీవెన బాకీ రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రూ.12,400 కోట్లు. కానీ, ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి రూ.1700 కోట్లు. మరోసారి రూ.1100 కోట్లు. అంటే ఇంకా రూ.9 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు. ఫీజు చెల్లించలేక పిల్లలు చదువులు మానేసే దుస్థితి. ఇక గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలు ఏకంగా 6 లక్షలు తగ్గారు. అక్కచెల్లెమ్మలకూ వంచన అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు లేదు. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్ల సంగతి దేవుడెరుగు. ఇచ్చే సున్నా వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేశాడు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో ఇచ్చే రుణాలు చంద్రబాబు హయాంలో రూ.20 వేల కోట్లు ఉంటే, మన హయాంలో వాటి పరపతి పెంచడంతో, ఆ రుణ పరిమితి రూ.49 వేల కోట్లకు చేరింది. ఇంకా ఆ అక్కచెల్లెమ్మలకు మనం చేయూత ఇచ్చాం. ఆసరా ఇచ్చాం. సున్నా వడ్డీ రుణాలు ఇచ్చాం. రకరకాల పద్ధతుల్లో చేయి పట్టుకుని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగింది. దీంతో రుణ పరిమితి రూ.20 వేల కోట్ల నుంచి రూ.49 వేల కోట్లకు చేరింది. అలా మన హయాంలో పెరుగుదల ఉంటే, ఇప్పుడు రూ.49 వేల కోట్ల నుంచి ఈ రోజు రూ.39 వేల కోట్లకు పడిపోయింది. సంక్షోభంలో వ్యవసాయం.. రైతుల గురించి కనీసం పట్టించుకునే నాథుడు లేడు. ఈరోజు రాష్ట్రంలో కరువు పరిస్థితి. 53 శాతం వర్షం లోటు కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ.. ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఏ రైతుకూ గిట్టుబాటు ధర రాని పరిస్థితి. లోటు వర్షపాతం నమోదవుతున్నా, ఎక్కడా వరికి బదులు ప్రత్యామ్నాయ విత్తనాలు ఇవ్వలేదు. ఉచిత పంటల బీమా ఈయనే దగ్గరుండి కత్తిరించాడు. ఇన్పుట్ సబ్సిడీ తీసేశారు. ఆర్బికేలను నిర్వీర్యం చేశారు. రైతులకు సున్నా వడ్డీ పథకం సున్నా. చివరికి ఏ స్థాయిలో వీళ్ళకు ప్లానింగ్ లేకుండా ఉన్నారంటే, శ్రీశైలంలో పూర్తిస్థాయి నీటి మట్టం 878 అడుగుల పైన ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలుగుతాం. ఫుల్ డ్రా అంటే 44 వేల క్యూసెక్స్. పక్కన తెలంగాణ పవర్ హౌస్ నుంచి పవర్ జనరేషన్ కోసం రిజర్వాయర్లో 800 అడుగుల నుంచే పంప్ చేస్తున్నారు. శ్రీశైలం నుంచి కల్వకుర్తి.. జూరాల నుంచి భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమకు మాత్రం నీళ్లు ఇవ్వడం లేదు. కేసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు మొత్తం పంటలంతా నష్టపోతున్నారు. రైతులందరూ 40 శాతం పెట్టుబడి పెట్టి నారుమళ్ళు వేసి ఫెర్టిలైజర్స్ చల్లారు. ఒకవైపు ఉచిత పంటల బీమా లేదు.. మరోవైపు నీళ్లు ఇవ్వలేను అంటాడు.రెండేళ్లలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత..ఎన్నికలు జరిగి చూస్తుండగానే మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కళ్ళు మూసుకొని, తెరిచే సరికి ఇంకో సంవత్సరం దాటితే, ఆ తర్వాత నా పాదయాత్ర మొదలవుతుంది. కళ్ళు మూసుకొని, తిరిగి తెరిచేసరికి ఈ రెండేళ్లు ఇట్టే ముగిసిపోతాయి. చూస్తుండగానే, మూడో ఏడాది కూడా వేగంగా గడిచిపోతుంది. ఇప్పటికే ప్రతి ఇంట్లో చర్చ మొదలైంది. మామూలుగా ఏ పార్టీకైనా, ప్రభుత్వానికైనా మూడో ఏడాదిలో వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. కానీ చంద్రబాబు పాలనలో అది ఇప్పటికే కనిపిస్తోంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. దీనినిబట్టి చూస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా మన గెలుపు తథ్యం.చంద్రబాబు పాలనకు–మన పాలనకు తేడా ఏమిటంటే...ఎన్నికల మేనిఫెస్టో 99 శాతం పూర్తి చేసిన ఏకైక పార్టీ.. ఈ రాష్ట్రంలో.. బహుశా దేశంలో ఏదైనా ఉంది అంటే, అది వైఎస్సార్సీపీ అని సగర్వంగా చెప్పగలం. చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళ్లి, మా పాలనలో ఇలా జరిగింది అని గొప్పగా కూడా చెప్పుకోగలం. మన పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రతి ఇంట్లో కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా, ఆ రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుందో చెప్పేవాళ్లం. ఆ తర్వాత క్రమం తప్పకుండా అమలు చేసే వాళ్లం. అలా పక్కాగా బటన్ నొక్కిన పరిపాలన ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఏకంగా రూ.2.73 లక్షల కోట్ల డీబీటీ.. అంటే నేరుగా బటన్ నొక్కడం, నేరుగా నగదు నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు, ఇళ్లలోకి వెళ్లిన పరిస్థితి. అలాంటిది చరిత్ర ఎప్పుడూ చూడలేదు. ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా, నేరుగా ఇంటి దగ్గరికే పాలన వచ్చి, పథకాలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ చూడలేదు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సుపరిపాలన, లా అండ్ ఆర్డర్లో దిశ వంటి కార్యక్రమం, ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్ సచివాలయంలో ఉండడం. ఇవన్నీ చరిత్ర చూడని విషయాలు. స్కూళ్లు మన కళ్ళ ఎదుటే బాగుపడడం, ఆ స్కూళ్లలో నాడు–నేడు కార్యక్రమాలు జరగడం, గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, మూడవ తరగతి నుంచే టోఫెల్ పీరియడ్, పిల్లలకు ఇంగ్లీష్లో శిక్షణ, 6వ తరగతి నుంచి క్లాస్ రూమ్స్ అన్నీ డిజిటలైజ్ కావడం, ఒక వైపు తెలుగు, మరో వైపు ఇంగ్లిష్ మీడియంతో బైలింగువల్ టెక్ట్స్ బుక్స్, రోజుకో మెనూతో బడి పిల్లలకు పౌష్టికాహారం ఇస్తూ అమలు చేసిన గోరుముద్ద.. ఆ స్థాయిలో సమీక్ష చేసిన సీఎంను బహుశా చరిత్రలో ఎప్పుడూ చూసి ఉండరు. 8వ తరగతికి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరు.రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, నేతలువిద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు విద్యా రంగంలో విప్లవాత్మక దిశగా మార్పులు వేస్తూ, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్సీ మాత్రమే కాదు.. ఏకంగా ఐబి సిలబస్. ఐబి వాళ్ళని తీసుకొచ్చి, మన రాష్ట్ర ప్రభుత్వంతో పని చేయిస్తూ, 2020 నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో ఒక క్లాస్ యాడ్ చేసేట్టుగా, 2025 మొదటి క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు, ఇలా పెంచుకుంటూ, 2035 నాటికి ఐబి సిలబస్. అలా ఏకంగా మన రాష్ట్ర పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ 2035 లో రాసేట్టుగా అడుగులు పడిన పరిస్థితి అంతకు ముందు ఎప్పుడైనా జరిగింది అని అంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. మనం రాక మునుపు ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్లు కూడా సరిగ్గా లేవు. మనం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిధిని 3300 ప్రొసీజర్లకు తీసుకెళ్లాం. ఇంకా పథకంలో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాం. మనం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టాం. నాడు–నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మారిన పరిస్థితులు కూడా మన హయాంలోనే. మొదటిసారిగా గ్రామాల్లో విలేజ్ క్లినిక్ అన్నది దర్శనం ఇచ్చింది కూడా మనం వచ్చిన తర్వాతనే. మనం వచ్చిన తర్వాతే తొలిసారిగా ప్రతి మండలంలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ). ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు. ఒక 104 అంబులెన్స్ సర్వీస్. పీహెచ్సీలో ప్రతి డాక్టర్కు ఆ మండలంలో నాలుగైదు గ్రామాలు కేటాయించి, ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే, మరో డాక్టర్ 104 సర్వీస్లో తనకు కేటాయించిన గ్రామాల్లో వైద్య సేవలందించేలా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాం. వైద్య సేవల కోసం తనకు కేటాయించిన గ్రామాలకు వెళ్లే డాక్టర్, అక్కడి విలేజ్ క్లినిక్ను ఉపయోగించేలా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి, అలా డాక్టర్లను గ్రామాలకు పంపించిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే. సాధారణంగా గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మందులు దొరకని పరిస్థితి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు మాత్రమే దొరికేట్లుగా చేసి పరిస్థితి కూడా ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఫ్యామిలీ డాక్టర్ కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఆరోగ్య సురక్ష కానీ, ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం కానీ.. ఇవన్నీ చరిత్రలో ఎప్పుడూ జరగని విషయాలు. గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట తొలిసారిగా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు. ఆ ఆర్బీకే పరిధిలోని గ్రామంలో ప్రతి ఎకరా ఈ–క్రాప్. ఆర్బీకేలోనే ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. తాను అగ్రికల్చరల్ అసిస్టెంట్గా రైతు చేయి పట్టుకుని నడిపించడం. ఆ గ్రామంలో వేసిన ప్రతి పంటకు ఆర్బీకేలో బోర్డు పెట్టి పంటలకు గిట్టుబాటు ధరలు ప్రదర్శించడం. ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే, ఆ గ్రామంలో వెంటనే ఆర్బికే అసిస్టెంట్, సీఎం–యాప్ ద్వారా అంటే..‘కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్’. ఆ సీఎం యాప్ను యాక్టివేట్ చేస్తే జాయింట్ కలెక్టర్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ మార్క్ ఫెడ్, వెంటనే జోక్యం చేసుకునే వారు. జాయింట్ కలెక్టర్ ఆ హోదాలో ఆ ఆర్బికే పరిధిలో ఏ రైతుకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, ఏ పంటకైతే గిట్టుబాటు ధర రావడం లేదో, వెంటనే జాయింట్ కలెక్టర్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి, ఆ గ్రామంలో ఆ పంట కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీతనం పెంచేవాడు. ఏకంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద మన ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి, ప్రతి రైతు ముఖాన చిరునవ్వు కనిపించే విధంగా గిట్టుబాటు ధరలు కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఎప్పుడూ చూడని మార్పులు ఇవన్నీ. గ్రామంలోనే మన ముందే సచివాలయం. మన గ్రామంలోనే 10 మంది పిల్లలు అక్కడే పని చేస్తూ, చిక్కటి చిరునవ్వుతో సేవలు. మన గ్రామంలోనే 60 ఇళ్లకు ఒక వాలంటీర్, మన గ్రామంలో ఇంటికే నేరుగా వెళ్లి సహాయం అందించే పరిస్థితులు. ఇవన్నీ ఎప్పుడూ చరిత్రలో చూడలేదు. లంచాలు లేకుండా ప్రభుత్వ సాయం, ఎప్పుడైనా జరిగిందంటే, అది ఒక్క వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే.పోలీస్ వ్యవస్థ గాడి తప్పింది⇒ రాష్ట్రం నివ్వెరపోయే ఘటన. మొన్న అద్దంకిలో జరిగింది. ఓ కారు ఆటోను ఢీ కొట్టింది. చూస్తే, కారులో ఇద్దరు ఎస్ఐలు సివిల్ డ్రెస్లో ఫుల్ మత్తులో ఉన్నారు. అప్పుడందరూ చుట్టుముట్టి కారు డిక్కీ ఓపెన్ చేస్తే, గంజాయి, మద్యం, పెద్ద ఎత్తున డబ్బులు, పోలీస్ యూనిఫార్మ్ కనిపించాయి. యాక్సిడెంట్ విషయం తెలిసిన ఒక సీఐ అక్కడికి వచ్చాడు. అక్కడ స్థానికులు ఆ యాక్సిడెంట్ను వీడియో తీస్తుంటే, కేసు పెడతామని బెదిరించారు. ఆ తర్వాత ఆ ఎస్ఐలను ఘటనా స్థలి నుంచి తప్పించింది ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. వాళ్ళ కారు. అయినా ఇంతవరకు కేసు లేదు. ప్రజలు కూడా మర్చిపోయేలా కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ⇒ పోలీస్ వ్యవస్థ ఈరోజు ఏ స్థాయిలో గాడి తప్పిందో చెప్పడానికి మీ రాజమండ్రిలోనే జరిగిన ఘటన. చిన్న ఉదాహరణ చెబుతా. డాక్టర్ ప్రియాంక. పీజీ మెడికల్ స్టూడెంట్. మన కళ్ల ముందే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు చూస్తే నిజంగా బాధ అనిపించింది. తాగిన మైకంలో మత్తులో అది మరి గంజాయా లేకపోతే మద్యమా ఏమో గాని ఆ మత్తులో కారుతో గుద్దడం, ఒకసారి కూడా కాదు, గుద్దిన తర్వాత మళ్ళీ మళ్ళీ గుద్దుకుంటూ వెళ్ళిపోవడం. అటువంటి వాళ్ళ మీద చంద్రబాబునాయుడు గవర్నమెంట్లో ఏం కేసు పెట్టారు? కనీసం సరైన సెక్షన్లలో కేసులు కూడా పెట్టలేదు. చివరికి ఆ పాప నాన్న బాధతో మాట్లాడితే, వైఎస్సార్సీపీ ఆ కుటుంబానికి అండగా నిలబడితే, ప్రజలు వైఎస్సార్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా ఏకమై నిరసనకు దిగితే కూడా చంద్రబాబు మనసు కరగని పరిస్థితి. ⇒ మరోవైపున చూస్తే, దొంగ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి? డాక్టర్ అప్పలరాజు కేసు. పాపం అప్పలరాజు కొడుకు బైక్ యాక్సిడెంట్. కారు కాదు. తాగింది లేదు, తాగుడు అలవాటు కూడా లేదు. 18 ఏళ్ల పిల్లోడు. పాపం బైక్ యాక్సిడెంట్ పొరపాటున జరిగింది. వెంటనే ఆ పిల్లోడు 108 కి ఫోన్ చేశాడు. ప్రమాదంలో గాయపడిన ఆ గొర్రెలకాపరికి సీపీఆర్ కూడా చేశాడు. అలా ఆ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేశాడు. స్వయంగా 108 అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అప్పలరాజు కూడా పోలీసులకు స్వయంగా సమాచారం ఇచ్చారు. కానీ, అదే అప్పలరాజు మీద పెట్టిన కేసు ఏమిటి? ఏకంగా మర్డర్ కేసు పెట్టారు. ఇక్కడేమో రాజమండ్రిలో మత్తులో కారుతో రెండు మూడు సార్లు గుద్ది, ఆపకుండా వెళ్ళిపోతే, చిన్న చిన్న సెక్షన్లతో కేసు. ⇒ మొన్న తాడిపత్రిలో గోవా నుంచి లిక్కర్ రవాణా. ఏదో కొన్ని కార్టన్లు కాదు. లారీలకు లారీల లోడ్. అంతకు ముందు తంబళ్లపల్లె నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి, ములకలచెరువులో ఏకంగా లిక్కర్ మాన్యుఫ్యాక్చరింగ్ కుటీర పరిశ్రమ పెట్టి, వాళ్ల బెల్ట్ షాపులకు పంపిణీ చేసి అమ్మించారు. ప్రతి ఐదు బాటిళ్లలో ఒక బాటిల్ కల్తీ బాటిల్. లిక్కర్ షాప్ పక్కనే పర్మిట్ రూమ్.ఆ పర్మిట్ రూమ్ల్లో లూజ్గా మందు అమ్మకాలు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మకం. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.ఎవరైనా చంద్రబాబుని ఎన్నికల హామీలపై ప్రశ్నించినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన బాండ్లు చూపించి అడిగినా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రయోగిస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రశ్నించే గొంతు మీద కేసులు. అక్రమ కేసులు, అరెస్టులు, రొటీన్గా సాగుతున్నాయని, అవి ఏ స్థాయికి చేరాయంటే, రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ గాడి తప్పిందని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడైతే పోలీసులను ఈ మాదిరిగా ఉపయోగించుకోవడం మొదలుపెడతారో, అప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యవస్థ గాడి తప్పుతుందని జగన్ అన్నారు. స్థానిక సమరానికి సై!స్థానిక సంస్థ ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులంతా సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ రెండేళ్లలో ఈ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికీ మేలు చేయలేదని ఎత్తిచూపారు. అందుకే త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఆ వ్యతిరేకత కనబడకుండా కుట్రలు చేసే వీలుందని.. అందుకు పోలీసు బలగాలనూ వినియోగించవచ్చని చెప్పారు. వైఎస్సార్సీపీకి అత్యంత ప్రజాదరణ ఉందని.. వచ్చే ఎన్నికల్లో వారే తమకు అండగా ఉంటారని, తోడుగా నిలుస్తారని అన్నారు. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం కుట్రలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో పోరాడాలని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. ‘‘చంద్రబాబు ఒక విలన్. స్థానిక ఎన్నికలు సరిగ్గా జరగనీయడు. పోలీసులను పెడతాడు. దౌర్జన్యం చేస్తాడు. బెదిరిస్తాడు. ప్రలోభాలు పెడతాడు. ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ, అందరూ గుర్తు పెట్టుకోండి. మనకు ప్రజలు సపోర్ట్గా ఉన్నారు. ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. మీ జగనన్న సపోర్ట్గా ఉంటాడు.’’ అని జగన్ పేర్కొన్నారు. ‘వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి.’ అని అన్నారు. ఒకవేళ పోలీసులను దురి్వనియోగం చేసి, ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలవడం కోసం వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం రేపు పొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుగారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ‘అందుకే కచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా మనకు మనం ట్యూన్ చేసుకుందాం. గట్టిగా యుద్ధం చేద్దాం. గెలుపు మనదే. చివరగా, వేణుఅన్న మీ అందరికీ పరిచయస్తుడే. మంచి లీడరు. అందుకే ఆయన్ను గెలిపించే బాధ్యత మీ భుజస్కంధాలపై పెడుతున్నాను’ అని జగన్ పేర్కొన్నారు. -
నేడు వైఎస్ జగన్ ప్రెస్మీట్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడుతారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఈదుమూడి గ్రామ యాదవులు
సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామానికి చెందిన యాదవులు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమపై జరిగిన దాడి, అనంతరం తమపైనే నమోదైన కౌంటర్ కేసు, పోలీసుల వ్యవహారశైలితో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.మేకలు మేపుకుంటున్న తమపై టీడీపీ నేతలు దాడి చేశారనీ.. తిరిగి తమమీదే కేసులు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వైఖరిపై వైఎస్ జగన్కు బీసీలు ఫిర్యాదు చేశారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
వచ్చే ఎన్నికల్లో బాబు కూసాలు కదలడం గ్యారంటీ
-
రాజమండ్రి డాక్టర్ ప్రియాంక ఘటనపై వైఎస్ జగన్ రియాక్షన్
-
YS జగన్ పాదయాత్రపై బిగ్ అప్డేట్!
-
విజయం మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే..
-
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో ఇవాళ(బుధవారం) వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇంఛార్జి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మరో ఏడాదిలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయండి’’ అంటూ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారని ఆయన దుయ్యబట్టారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో మన వైయస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే నాటి గత మన ఐదేళ్ల పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
కూటమి కుట్రలను ఎదుర్కొంటూ యుద్ధం చేయాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని.. గెలుపే లక్ష్యంగా పని చేయాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క వర్గమూ కూడా సంతోషంగా లేదన్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు పోలీసులను ప్రయోగిస్తారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి. మనకు అత్యంత ప్రజాదరణ ఉంది. అందుకే తప్పకుండా గెలుస్తాం’’ అని వైఎస్ జగన్ తేల్చి చెప్పారు.‘‘రాష్ట్రంలో దారుణంగా దిగజారిన శాంతి భద్రతలు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన పోలీసులు. ఆ స్థాయికి దిగజారిన వ్యవస్థలు. ఆ ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు కుట్రలు చేస్తున్నారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను దారుణంగా చంపారు. కారుతో పదే పదే ఢీకొట్టి ప్రాణం తీశారు. అయినా కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారు. అంత దారుణంగా పోలీసులు, అధికార పార్టీ వారు కుమ్మక్కై పని చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచిన వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. విద్యార్థులు, రైతులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. అందుకే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం మీద రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అదే సమయంలో మన వైఎస్సార్సీపీపై రోజురోజుకీ ప్రజాదరణ పెరుగుతోంది...అందుకే నాటి గత మన ఐదేళ్ల పరిపాలనను, ఇప్పుడు వెన్నుపోటు పార్టీ కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారు. దీనిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. మరో ఏడాదిలో నా పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనదే విజయం. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయండి’’ అంటూ వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. -
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇంఛార్జ్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వారితో వైఎస్ జగన్ చర్చించారు. -
గాలింపు చర్యలు విస్తృతం చేయాలి
సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల నుంచి చాలా రోజులుగా ఎలాంటి సమాచారం అందకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ కోరారు. కోస్ట్గార్డ్, నేవీ, మత్స్యశాఖ, జిల్లా యంత్రాంగంతో పాటు సముద్రంలో అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక, సమాచార వ్యవస్థలను వినియోగించి గాలింపు చర్యలను మరింత విస్తృతం చేయాలని ఆయన సూచించారు. కాకినాడ, విశాఖపట్నం, పారాదీప్తో పాటు సముద్ర తీర ప్రాంతాల్లోని మత్స్యకారుల బోట్లు, ఇతర నౌకల సహకారాన్ని కూడా తీసుకుని గల్లంతైన బోటు ఆచూకీ కోసం నిరంతరం ప్రయత్నించాలని కోరారు. ఎనిమిది మంది మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని, వారి ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
శ్రీశైలంలో 878 అడుగుల నీరున్నా కేసీ కెనాల్కు విడుదల చేయరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలో తగిన స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కేసీ కెనాల్కు సాగు నీరు విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలానికి చెందిన కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల బృందం మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించింది.డాక్టర్ వైఎస్సార్, వైఎస్సార్సీపీ ప్రభుత్వాల హయాంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్కు సకాలంలో సాగు నీరు విడుదల చేసి రైతులను ఆదుకున్నారని రైతులు గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో 878 అడుగులకుపైగా నీరు ఉన్నా కక్ష సాధింపు చర్యలతో చుక్క నీరు వదలడం లేదని ధ్వజమెత్తారు. నీరు విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్కి రైతులు విజ్ఞప్తి చేశారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ కుట్రపూరిత చర్యలను వివరించారు. వైఎస్సార్, వైఎస్ జగన్ 854 అడుగులకే నీళ్లిచ్చారువైఎస్సార్ హయాంలో, అలాగే వైఎస్ జగన్ ప్రభుత్వంలో శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడే కేసీ కెనాల్కు నీటిని విడుదల చేసి రైతులు పంటలు పండించుకునేలా చేశారు. కానీ నేడు శ్రీశైలంలో 878 అడుగులకు నీళ్లు చేరినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం చుక్క నీరివ్వడంలేదు. ఈ అన్యాయంపై మాజీ సీఎం వైఎస్ జగన్ని కలిసి విన్నవించాం. – శేఖర్ రెడ్డి, చిన్నగురువలూరుచంద్రబాబు పాలనలోనే ఈ కరవు కాటకాలు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే రైతులకు ఇలాంటి కరవు కాటకాలు, కష్టాలు వస్తాయి. చంద్రబాబు ప్రభుత్వ పక్షపాత ధోరణి, కక్ష సాధింపు చర్యల వల్లే ఈ దుస్థితి వచి్చంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మొదటి ప్రాధాన్యతగా కేసీ కెనాల్కు నీరిచి్చన తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి, ఇతర అవసరాలకు ఇవ్వాలి. కానీ మాకు అన్యాయం చేస్తున్నారు. – శంకర్, చిన్నగురువలూరు -
నేడు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో రాజమండ్రి రూరల్కు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు
తాడేపల్లి : ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు.. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. వైఎస్సార్సీపీ తరుఫున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ముందు వైఎస్ జగన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు తుమాటి మాధవరావు. రేపు రాజమండ్రి రూరల్ నేతలతో వైఎస్ జగన్ సమావేశంరేపు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి స్థానిక సంస్థల మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యలు, సంస్థాగత అంశాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరితో వైఎస్ జగన్ చర్చించనున్నారు. వైఎస్ జగన్ను కలిసిన కేసీ కెనాల్ రైతులుశ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేయకపోవటంపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీ కెనాల్ రైతులు.. వైఎస్ జగన్ను కలిశారు. రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంపై వైఎస్ జగన్ వద్ద వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయరులో 878 అడుగుల నీరు ఉన్నా సాగునీరు విడుదల చేయటం లేదంటూ ఫిర్యాదు చేశారు. మీ హయాంలో 854 అడుగుల నీటిమట్టం ఉన్నా నీటిని విడుదల చేశారంటూ వైఎస్ జగన్కు గుర్తు చేశారు రైతులు.


