breaking news
YS Jagan Mohan Reddy
-
జగన్ ముద్రగడకు ఇచ్చిన గౌరవం.. ఎప్పటికీ చెరిగిపోని...
-
విశాఖలో జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ
-
ఫలించిన వైఎస్సార్సీపీ కోటి సంతకాల ఉద్యమం
ఢిల్లీ: వైఎస్సార్సీపీ కోటి సంతకాల ఉద్యమం ఫలించింది. పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇచ్చినట్లు తిరుపతి ఎంపీ గురుమూర్తికి కేంద్ర వైద్యశాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లేఖ రాశారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ సహా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం వైఎస్సార్సీపీ కోటి సంతకాల ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే.ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్న అంశంపై వైఎస్సార్సీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి గత పార్లమెంటు సమావేశాలలో ప్రస్తావించారు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఎంపీ గురుమూర్తికి లేఖ ద్వారా సమాధానం పంపారు.రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ గురుమూర్తి 2025 డిసెంబర్ 12న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు, లోక్సభలో రూల్-377 కింద ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)తో సంప్రదించి అంశాన్ని పరిశీలించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మొత్తం 39 మెడికల్ కళాశాలలు ఉన్నాయని, వాటిలో 19 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, 20 ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో మొత్తం 7,215 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, అందులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 3,415, ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 3,800 సీట్లు ఉన్నట్లు వెల్లడించింది. అదేవిధంగా, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు, చిత్తూరులోని ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు 150 ఎంబీబీఎస్ సీట్లతో అనుమతి జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తన లేఖలో స్పష్టం చేసింది.ఈ సందర్బంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, ప్రభుత్వ వైద్య కళాశాలల బలోపేతం, వైద్య విద్య అవకాశాల విస్తరణకు సంబంధించిన అంశాలను పార్లమెంట్తో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి పేద విద్యార్ధులకు వైద్య విద్యతోపాటు, మెరుగైన వైద్యం అందించాలన్న తమ నాయకుడు వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా ప్రజా ప్రయోజన అంశాలపై భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నిరంతరం కృషి కొనసాగిస్తానని ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. -
అంతా నా ఇష్టం.. YS జగన్ను పొగుడుతూ చంద్రబాబు, ఉమాపై తీవ్ర విమర్శలు
-
దుమ్మురేపుతున్న జగన్ 2.0 సూపర్ యాప్
-
జగన్ 2.0 సూపర్ యాప్ సంచలనం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఏపీ రాజకీయాల్లో సంచలనానికి తెర తీసింది. పార్టీ శ్రేణుల నుంచి ఈ యాప్ పట్ల భారీ స్పందన వస్తోంది. పార్టీ కార్యకర్తలు, నాయకులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ యాప్ను పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుంటున్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న(జులై 16, గురువారం) సాయంత్రం వైఎస్ జగన్ ఈ యాప్ను ప్రారంభించారు. ప్రారంభించిన గంటలోనే 25 వేలకుపైగా డౌన్లోడ్లు నమోదయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఈ ఉదయం కల్లా లక్షకు పైగా కార్యకర్తలు యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని.. కాసేపటికే ఆ వేగం మరింత పెరిగింది. కార్యకర్త టు అధినేత.. అనుసంధానంపార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య నేరుగా సంబంధాలు కొనసాగించేలా ఈ యాప్ను రూపొందించారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు అందరూ ఒకే వేదికపై అనుసంధానమయ్యేలా ప్రత్యేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.యాప్ ప్రారంభోత్సవంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికల్లో తమ పార్టీకి సంబంధించిన కంటెంట్పై జరుగుతున్న పరిణామాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సొంత డిజిటల్ వేదిక అవసరమైందని తెలిపారు. "ప్రతి కార్యకర్త తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పేందుకు ఈ యాప్ ఒక వేదికగా ఉంటుంది. పార్టీతో ప్రతి ఒక్కరూ నిరంతరం అనుసంధానమై ఉంటారు" అని జగన్ పేర్కొన్నారు.డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి 👉: జగన్ 2.0 సూపర్ యాప్నేరుగా ఫిర్యాదు చేసే అవకాశంక్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను నేరుగా పార్టీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ యాప్ ద్వారా కల్పించారు. రాజకీయ వేధింపులు, ఇతర సమస్యలపై కార్యకర్తలు వివరాలను నమోదు చేసుకునేలా డిజిటల్ డైరీ సదుపాయాన్ని కూడా అనుసంధానం చేశారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేస్తే.. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ, రాష్ట్రస్థాయి నాయకత్వం వరకు వాటిపై స్పందించే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.పార్టీ కార్యక్రమాలు.. లైవ్ అప్డేట్స్పార్టీ సమావేశాలు, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు వంటి సమాచారం యాప్లోని లైవ్ ఫీడ్ ద్వారా కార్యకర్తలకు అందుబాటులోకి వస్తుందని జగన్ తెలిపారు. భవిష్యత్తులో యాప్ను మరింత అభివృద్ధి చేస్తామని, కార్యకర్తలకు మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన చెప్పారు.డిజిటల్ పోరాటానికి కొత్త వేదికఇతర సోషల్ మీడియా వేదికల్లో పార్టీకి వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసే అవకాశం కూడా జగన్ 2.0 సూపర్ యాప్లో ఉండనుంది. అదే సమయంలో కార్యకర్తలంతా పార్టీ నాయకత్వంతో నిత్యం టచ్లో ఉండేందుకు ఈ సూపర్ యాప్ ఉపయోగపడుతుంది.మొత్తంగా.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను డిజిటల్గా ఏకం చేయడం, పార్టీ కార్యక్రమాలను వేగంగా చేరవేయడం, క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకోవడం లక్ష్యంగా తీసుకొచ్చిన ‘జగన్ 2.0 సూపర్ యాప్’పై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి పెరుగుతోందన్నది లభిస్తున్న స్పందన బట్టి స్పష్టమవుతోంది. -
ప్యాక్ అప్ అంటున్న కూటమి నేతలు! జగన్ దెబ్బ.. కూటమి గుండెల్లో వణుకు!
-
జగన్ సూపర్ యాప్.. ఇప్పుడు టచ్ చేసి చూడు
-
చంద్రబాబుకు చుక్కలే.. MPలతో జగన్ భేటీలో చర్చించిన అంశాలు ఇవే..
-
ఏపీ సమస్యలపై ఎలుగెత్తాలి. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
సమస్యలపై ఎలుగెత్తాలి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. ప్రజా ప్రయోజనాలు, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్లమెంట్లో గట్టిగా మన గళం వినిపించాలి..’’ అని పార్టీ ఎంపీలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్ సీపీ ఇదివరకే మద్దతు ఇచ్చిందని గుర్తు చేస్తూ.. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నామని చెప్పారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎంపీలతో చర్చించి మార్గనిర్దేశం చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్రెడ్డి, గొల్ల బాబూరావు, లోక్సభలో వైఎస్సార్సీపీ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, లోక్సభ సభ్యులు ఎం.గురుమూర్తి, వైఎస్ అవినాష్రెడ్డి, గుమ్మా తనూజారాణి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. డీఎస్సీ 2025 ఒక పెద్ద స్కామ్..రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద స్కాం చోటు చేసుకుంది. అసలు పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయి. కేవలం తమ వాళ్ల కోసం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చారు. తమ పని అయిపోగానే ఆ జీవోలు రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడో సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేశ్ తోడల్లుడు భరత్ ఉన్నారు. అడ్డగోలుగా భూపందేరాలు.. అంతులేని అవినీతి..మరోవైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేశ్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది. అటు అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టీచర్లకు ‘టెట్’ ఇబ్బందులు..టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు ‘టెట్’ తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అయిన వారే. వీళ్లు ఉద్యోగాలు పొందినప్పుడు టెట్ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యం కాదు. సుదీర్ఘ కాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్న వారిని ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్ష రాయమనడం, దాన్ని తప్పనిసరి చేయడం ఏ మాత్రం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి. వారికి సమస్యను నివేదించాలి. ప్రజా ఆస్తులు పప్పుబెల్లాల్లా పంపకంరాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారు. ప్రైవేటు పేరుతో ఎక్కడికక్కడ దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. నిజానికి ఆయా ప్రాజెక్టుల పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని, దాదాపు పూర్తయిన వాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కామ్ ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏమిటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1,500 కోట్లకు ఇవ్వడం స్కామ్ కాదా? ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి?అప్పుల్లో రికార్డు... ప్రతిచోట అవినీతి, దోపిడీ..ఇష్టానుసారంగా భూముల కేటాయింపులు చేస్తున్నారు. ఇసుక, లిక్కర్, మైన్స్.. దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇంకా ఈ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోంది. అప్పుల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. పరిమితి లేకుండా విపరీతంగా అప్పు చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం. మరోవైపు సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతాంగం చాలా నష్టపోతోంది. భీమవరం సభ ద్వారా ఆక్వా రైతుల ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఉద్యోగులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. 5 డీఏలు పెండింగ్.. సరెండర్ లీవ్స్ పెండింగ్.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే. వీటన్నింటినీ పార్లమెంట్ ఉభయ సభల్లో లేవనెత్తాలి. ఈ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ఎండగట్టాలి. ముఖ్యంగా ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడాలి. -
రీసర్వేకు కూటమి సర్కారు గ్రహణం
సాక్షి, అమరావతి: అసాధ్యమని గత ప్రభుత్వాలన్నీ చేతులెత్తేసిన భూముల రీసర్వేను వైఎస్ జగన్ ప్రభుత్వం సాకారం చేసి చరిత్ర సృష్టిస్తే ఆ కార్యక్రమాన్ని చంద్రబాబు సర్కారు నీరుగార్చేస్తోంది. వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష’ పేరుతో ప్రారంభమైన బృహత్తర యజ్ఞం.. డ్రోన్లు, విమానాలు, రోవర్లు వంటి అత్యాధునిక సాంకేతికతతో ఐదు సెంటీమీటర్ల కచ్చితత్వంతో విజయవంతంగా జరిగింది. జగన్ హయాంలోనే దాదాపు 8 వేలగ్రామాల్లో రీసర్వే పూర్తవగా 30 లక్షలమందికి భూ యజమానులకు క్యూఆర్ కోడ్తో కూడిన భూహక్కు పత్రాలు అందించారు. లక్షల సంఖ్యలో సబ్ డివిజన్లు, మ్యుటేషన్లను ప్రభుత్వమే ఉచితంగా చేసి రైతుల డబ్బు ఆదా చేసింది. కానీ చంద్రబాబు కూటమి సర్కారు వచ్చాక ఏడాది నిలిచిపోయి ఆ తర్వాత ప్రారంభమైన రీసర్వే ఇప్పుడు ముందుకు సాగడంలేదు. కూటమి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే చేపట్టిన 5,107 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయి రికార్డులు వెబ్ల్యాండ్లోకి ఎక్కింది కేవలం 935 గ్రామాల్లోనే. అంటే 82 శాతం గ్రామాల్లో రైతుల భూ రికార్డులు ఇంకా గాల్లోనే వేళ్లాడుతున్నాయి. ప్రతి దశలోను గడువులు దాటి నెలల తరబడి ఫైళ్లు మగ్గుతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు నిర్వహించిన కార్యదర్శుల సమీక్షలోని నివేదికలే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. జగన్కు రీ సర్వే క్రెడిట్ను అడ్డుకోవాలని ఆ కార్యక్రమాన్ని నిలిపివేసిన చంద్రబాబు ఆ తర్వాత జగనన్న పేరు తొలగించి ఆ పథకాన్ని తమ ఖాతాలో వేసుకుని క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. గత ప్రభుత్వం సిద్ధం చేసిన యంత్రాంగం, సాంకేతికత, ప్రణాళిక అన్నీ చేతిలో ఉన్నా కొనసాగించడంలో చిత్తశుద్ధి లేక రీసర్వే అట్టర్ ఫ్లాప్ షోగా మారింది. రైతుల అష్టకష్టాలు..రీసర్వే అస్తవ్యస్తంగా జరుగుతుండడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. పాత రికార్డు చెల్లదు.. కొత్త రికార్డు రాదు. ఈ మధ్యలో ఇరుక్కున్న రైతు పరిస్థితి దయనీయంగా మారింది. భూమి తనదే అయినా రికార్డు చేతిలో లేక బ్యాంకు రుణం పుట్టడంలేదు. పంట పెట్టుబడికి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించాల్సివస్తోందని నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. సర్వే జరిగి నెలలు గడుస్తున్నా తుది నోటిఫికేషన్ రాక హద్దు వివాదాలు తేలడం లేదు. జగన్ హయాంలో భూవివాదాలకు చరమగీతం పాడేందుకు మొదలైన కార్యక్రమం చంద్రబాబు నిర్లక్ష్యంతో రైతులనుఇబ్బందులు పెడుతోంది.గడువులన్నీ గాలికి..రీసర్వేలో ప్రతి దశకు పెట్టుకున్న గడువుల్లో ఒక్కదాన్ని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. అత్యంత కీలకమైన డ్రాఫ్ట్ రికార్డుల ఖరారు, డ్రాఫ్ట్ పాస్బుక్ల జారీ గడువు దాటి ఏడు నెలలైంది. తహసీల్దార్ పరిశీలన, జాయింట్ కలెక్టర్ ఆమోదం వంటి ప్రతి దశలోను వేలగ్రామాల ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లోనే ఉంటున్నాయి. తుది ఆమోదం దశలో గతనెల టార్గెట్లో పూర్తయింది. పదిశాతం కూడా లేకపోవడం గమనార్హం. పోలవరం జిల్లాలో అయితే రీసర్వే చేపట్టిన 400కు పైగా గ్రామాల్లో ఒక్క గ్రామంలో కూడా ప్రక్రియ పూర్తయి రికార్డులు ఆన్లైన్లోకి ఎక్కలేదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్ హయాంలో ఏకకాలంలో వేలగ్రామాల్లో సర్వే బృందాలు దూసుకుపోతే, ఇప్పుడు నెలకు వంద గ్రామాల్లో కూడా జరగడంలేదు. సర్వే నోటీసుల ఈ–కేవైసీ కోసం రైతులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన ఖాతాల్లో ఈ–కేవైసీ పూర్తయింది ఐదోవంతు కూడా లేదు. కొన్ని జిల్లాల్లో పదిశాతం లోపే జరిగింది. జగన్ హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థను రీసర్వేకి అనుసంధానం చేసి రైతు గడప వద్దకే సేవలు తెచ్చారు. ఇప్పుడు అదే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం సర్వే బృందాలను కుదించి రైతును మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పుతోంది. -
ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త పార్టీతో అనుసంధానం... ‘జగన్ 2.0 సూపర్ యాప్’
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ కార్యకర్తలను పార్టీ నాయకత్వంతో నేరుగా అనుసంధానిస్తూ... సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాలను ఒకే వేదికపైకి తెచ్చే లక్ష్యంతో రూపొందించిన ‘‘జగన్ 2.0 సూపర్ యాప్’’ను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ప్రతి కార్యకర్త ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘జగన్ 2.0సూపర్ యాప్’ ఆవిష్కరణ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే..ప్రతి కార్యకర్త నిర్భయంగా అభిప్రాయం చెప్పవచ్చు..వైఎస్సార్సీపీ నుంచి ఈరోజు అధికారికంగా ‘జగన్ 2.0 సూపర్యాప్’ను ఆవిష్కరిస్తున్నాం. సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, అందుకోసం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొచ్చి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అదే జగన్ 2.0 సూపర్యాప్. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు. అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే (తొలగించే) హక్కు ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు దీనివల్ల తిప్పి కొట్టొచ్చు. ప్రతి నాయకుడితో ప్రతి కార్యకర్త అనుసంధానం..పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు గానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశమైనా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఈ యాప్లో మరో మంచి అంశం ఏమిటంటే పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. డిజిటల్ డైరీతో యాప్ను అనుసంధానిస్తాం..భవిష్యత్తులో ఈ యాప్ను ఇంకా అభివృద్ధి చేస్తాం. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త... ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, రాజకీయ వేధింపులకు గురవుతున్న వారు, డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఈ యాప్తో అనుసంధానం అవుతాయి. అంటే ఈ యాప్లో ఆ డిజిటల్ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది.దాని వల్ల వేధింపులు, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్ ద్వారా డిజిటల్ డైరీలో ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు. ఇతర సోషల్ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేసూ్తనే, మరోవైపు ఈ సూపర్ యాప్ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు. -
మీడియాకు ముద్రగడ కుమారుల లేఖ
సాక్షి,కీర్లంపూడి: కాపు ఉద్యమ నేత, దివంగత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమారులు బాలు, గిరిబాబులు మీడియాకు లేఖ రాశారు. ‘వ్యక్తిత్వానికి, ఆత్మాభిమానానికి ముద్రగడ నిలువుటద్దం. ఆయన మరణాంతరం ఏం చేయాలనే దానిపై.. ఆయన మాకు చాలా స్పష్టంగా చెప్పారు. ముద్రగడ నిర్ణయం మేరకే అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు వద్దని చెప్పారు.ఆయన నిర్ణయం మేరకు అధికారిక లాంఛనాలను తిరస్కరించాం. ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి.. ముద్రగడపై అపార గౌరవాన్ని చాటిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.‘మాకు, బార్లపూడి క్రాంతి కుటుంబానికి మధ్య.. కొన్నేళ్లుగా సంబంధాలు, రాకపోకలు లేవు. ఆమె కడచూపుకు రాకూడదన్న నిర్ణయం ముద్రగడదే. మమ్మల్ని మానసిక క్షోభకు గురిచేసే కథనాలు.. ప్రసారం చేయొద్దని మీడియాను వేడుకుంటున్నాం’అని లేఖలో పేర్కొన్నారు. -
జగన్ 2.0 SUPER APP లాంచ్
-
PRC, IR, DA పెండింగ్ పై జగన్ కీలక కామెంట్స్
-
‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
సాక్షి, తాడేపల్లి: పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు కోసం యాప్ డిజైన్ చేశారు. పార్టీ నేతలంతా నేరుగా కార్యకర్తలతో టచ్లో ఉండేలా ఈ యాప్ను రూపొందించారు. సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ నుంచి ఇవాళ అధికారిక ‘జగన్ 2.0 సూపర్ యాప్’ను ఆవిష్కరిస్తున్నామన్నారు.‘‘ఈ రోజు ఏం జరుగుతోంది అంటే.. సోషల్ మీడియాలో మన వాళ్లు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్లుగా డిలీట్ చేయడం, అందుకోసం ఇష్టానుసారం కుట్రలు పన్నడం.. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం. అదే జగన్ 2.0 సూపర్ యాప్. దీంట్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం చెప్పొచ్చు...అంతే కాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటాడు. ఇది మన యాప్ కాబట్టి, మన వాళ్లే ఇందులోకి వస్తారు కాబట్టి, ఎవరు పడితే వారు డిలీట్ చేసే హక్కు కూడా వారికి ఉండదు. ఇది ఒక మంచి పరిణామం. ఇష్టం వచ్చినట్లు చేసే కుట్రలు కూడా దీనివల్ల తిప్పి కొట్టొచ్చు.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇంకా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త మొదలు, పార్టీ కేంద్ర కార్యాలయం వరకు.. నియోజకవర్గస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడితో, ప్రతి కార్యకర్త అనుసంధానమై ఉంటాడు. ఎందుకంటే పార్టీలో ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, పోలీసుల వేధింపుల వల్ల కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఏ అంశంపై కానీ, ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరు అనుసంధానమై టచ్లో ఉండే అవకాశం ఉంటుంది.👉 Click here to download the Jagan 2.0 Super App.ఈ యాప్లో మరో మంచి అంశం ఏమిటంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశం, ప్రెస్మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, ప్రకటనలు.. అన్నీ కూడా ఈ యాప్లో లైవ్ ఫీడ్ ద్వారా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటుంది. భవిష్యత్తులో ఈ యాప్ను ఇంకా అభివృద్ధి చేయడం జరుగుతుంది. కార్యకర్తలు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బంది పడుతుంటే వాటిని ఈ యాప్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత పార్టీ వాటిపై స్పందించడం, నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఆ కార్యకర్తకు అండగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది...పోలీసుల వేధింపులతో ఇబ్బంది పడుతున్న మన పార్టీ వారు, ఇంకా రాజకీయ వేధింపులకు కూడా గురవుతున్న వారు ఇప్పుడు డిజిటల్ డైరీలో నమోదు చేస్తున్న వివరాలు.. ఆ డైరీ కూడా ఈ యాప్తో అనుసంధానం అవుతుంది. అంటే ఈ యాప్లో ఆ డిజిటల్ డైరీ కూడా అందుబాటులోకి వస్తుంది. దాని వల్ల వేధింపుల, సమస్యలు ఎదుర్కొంటున్న వారు నేరుగా ఈ యాప్ ద్వారా డిజిటల్ డైరీలో వాటిని ఫిర్యాదు చేయొచ్చు. ఆ వివరాలు నమోదు చేయొచ్చు...ఇతర సోషల్ మీడియా వేదికల్లో మనపై చేస్తున్న అనుచిత విమర్శలు, వీడియోలు, వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసి, వాటిని తొలగింపచేసే ప్రయత్నం ఒకవైపు చేస్తూనే, మరోవైపు ఈ సూపర్యాప్ను ఎవరూ ఆపలేని విధంగా మనకు మనం సొంతంగా రూపొందించుకోవడం జరిగింది. ఈ యాప్ వల్ల ప్రతి కార్యకర్త నిత్యం, పార్టీ నాయకత్వంతో అనుసంధానమై ఉంటాడు’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
ఎంపీలతో YS జగన్ చర్చించిన అంశాలు
-
ఏపీలో పాలన గాలికి ఎగిరిపోయింది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యం.. వాటికోసం గళం విప్పాలని పిలుపునిచ్చారు.‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇదివరకే మనం మద్దతు ఇచ్చాం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతును మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరిపోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్పీ పోస్టుల భర్తీ పెద్ద స్కాం చోటు చేసుకుంది. పోటీపరీక్ష రాయకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి?. డీఎస్సీ భర్తీలో తీవ్రమైన అవకతవకలు జరిగాయి. డీఎస్సీ పరీక్ష పేపర్లుకూడా లీక్కు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తీవ్ర అవకతవకలు. తమ వాళ్లకోసం జీవోలు ఇచ్చారు. ఈ పని అయిపోగానే ఆ జీవోలను రద్దు చేశారు. సర్టిఫికెట్లు ఇచ్చిన క్రీడా సంఘాలు కూడా వారి చేతుల్లోనే ఉన్నాయి. సాఫ్ట్ బాల్ అసోసియేషన్కు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడు. జూడీ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా విశాఖపట్నం ఎంపీ, లోకేష్ తోడల్లుడు భరత్ ఉన్నాడు. మరో వైపు రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూముల పందేరం జరుగుతోంది. ఐదు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారు. ఘోరమైన అవినీతి జరిగింది’’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.20 వేలపైనే పెడుతున్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవు. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే. పూలింగ్కు భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. బలవంతంగా వారి భూములను లాక్కుంటున్నారు. ఇప్పటికే తీసుకున్న వేల ఎకరాలకే దిక్కులేదు. ఇప్పుడు మళ్లీ మా భూములు ఎందుకు తీసుకుంటున్నారని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్నవారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు...సోషల్ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరిమీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు. టెట్ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్ రాక ముందు నుంచీ టీచర్లుగా పనిచేస్తున్నవారికి టెట్ను తప్పనిసరి చేయడం సరికాదు. పైగా వాళ్లంతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు అయినవారే. వీళ్లు ఉద్యోగాలు పొందనప్పుడు వీళ్లకు టెట్ అనే పరీక్ష లేదు. ఇప్పుడు వీరిని టెట్ రాయమనడం భావ్యంకాదు. సుదీర్ఘకాలంగా ఒకే సబ్జెక్టు బోధిస్తున్నవారిని, ఇప్పుడు అన్ని సబ్జెక్టులున్న టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సరికాదు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రిని కలవాలి, వారికి సమస్యను నివేదించాలి. ..రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. ప్రైవేటు పేరుతో దోచిపెడుతున్నారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం. వీటి పనులన్నీ మొదలై కొలిక్కి వస్తున్నాయి. అలాంటి వాటిని కూడా, దాదాపుగా పూర్తైనవాటిని కూడా ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం అన్యాయం. దారుణమైన స్కాం ఇది. దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం దారుణం. వైఎస్సార్సీపీ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏంటి?. రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1500 కోట్లుకు ఇవ్వడం స్కాం కాదా?. ఇలాంటి వాటిని ప్రైవేటుకు ఇచ్చేస్తే ఇక రాష్ట్రానికి ఆదాయాలు ఎలా వస్తాయి...రాష్ట్రంలో ప్రతిదీ అవినీతి, దోపిడీయే. ఇష్టాను సారంగా భూముల కేటాయింపులు, ఇసుక, లిక్కర్, మైన్స్.. అన్నీ దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది. ఇష్టానుసారం ఈ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. అప్పులు చేయడంలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ రెండు సంవత్సరాల్లో 3.6లక్షల కోట్లమేర అప్పులు చేశారు. విపరీతంగా అప్పులు చేస్తున్నారు. ఎఫ్ఆర్బీఎం చట్టాన్ని ఉల్లంఘించి అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసిన ప్రజలకు చేసింది శూన్యం...సిండికేట్ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు తీవ్రంగా నష్టోతున్నారు. భీమవరం సభ ద్వారా రైతులు ఆగ్రహం పెల్లుబికింది. తాము దగాకు గురవుతున్నామని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. మరో వైపు ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. పీఆర్సీలేదు. ఐఆర్ లేదు. 5 డీఏలు పెండింగ్, సరెండర్ లీవ్స్ పెండింగ్.. ఉద్యోగులకు అన్నీ ఇబ్బందులే.’’ అని వైఎస్ జగన్ వివరించారు. -
YSRCP MPలతో జగన్ భేటీ.. పార్లమెంట్ సమావేశాలపై దిశా నిర్దేశం
-
ఉద్యమ కెరటం అస్తమించింది.. ముద్రగడకు వీడ్కోలు
ఒక ఉద్యమ కెరటం ఆగిపోయింది.. ఒక ఆత్మీయ అనుబంధం తెగిపోయింది. మాటకు, పట్టుదలకు మారుపేరు అయిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనారోగ్యానికి గురై మరణించడం అందరిని కలచివేస్తుంది. ముద్రగడ కాపు ప్రజల కోసం ఎంతో కృషి చేసి ఆ వర్గానికి చాలా మేలు చేశారు కాని, తాను మాత్రం రాజకీయంగా నష్టపోయారని చెప్పాలి. ఎవరు కాపుల ప్రయోజనాలకోసం కృషి చేశారో, చేస్తారో తెలుసుకునే టైమ్కి ముద్రగడ కన్ను మూయడం దురదృష్టకరం.ఆయన కాపు సామాజికవర్గ డిమాండ్లపై ఉద్యమాలు చేసినా, ఇతర సామాజికవర్గాలతో ఎప్పుడూ ఘర్షణ పడలేదు. అదే ఆయన ప్రత్యేకత. ఉమ్మడి ఏపీలోకాని, విభజిత ఏపీలో కాని సామాజికవర్గ నేతలు అతి తక్కుమంది ప్రభావం చూపించారు. వారిలో ముద్రగడ అగ్రగణ్యుడుగా ఉన్నారు. కాపులు పేరుకు అగ్రవర్ణం అయినా, పేదల శాతం ఎక్కువగా ఉంది. వారిని ఆకర్షించడానికి కొన్ని రాజకీయ పార్టీలు పలు హామీలు ఇవ్వడం, మభ్యపెట్టడం, ఆ తర్వాత మర్చిపోవడం మామూలు అయింది.ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని కోరుతూ 2014-19 టరమ్లో ముద్రగడ నడిపిన ఉద్యమం ఏపీని కుదిపివేసింది. ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టి ఉద్యమాన్ని అణచివేయాలని చూసినా, ఉద్యమ నేతలపై ఎన్ని కేసులు పెట్టినా, రకరకాల నిరసన పద్దతులను అవలంబించి ముద్రగడ చరిత్ర సృష్టించారు. మహిళలతో సహా కాపువర్గం వారంతా పళ్లాలతో నిరసన తెలుపుతూ చేపట్టిన ఆందోళన ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. తుని వద్ద ఆయన జరిపిన సభకు వేలాదిగా ఆ సామాజికవర్గ ప్రజలు స్వచ్చందంగా తరలివెళ్లడం ఒక చరిత్ర. అనూహ్యంగా తుని వద్ద రైలు దగ్దం ఘటనతో ఆయనతో సహా అనేక మంది ఉద్యమకారులపై కేసులు వచ్చినా చలించలేదు.టీడీపీ ప్రభుత్వం పెట్టిన కేసులను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. తన కుటుంబ సభ్యులపై పోలీసులతో బూతులు తిట్టించారని అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పలుమార్లు బాధపడ్డారు. ఆయనను రాజమండ్రి ఆస్పత్రిలో నిర్బంధించి ఎవరిని కలుసుకోవడానికి కూడా అనుమతించేవారు కాదని ఆయన చెబుతుండేవారు. రైతులకు సమస్య వచ్చినా, తన అనుచరులపై అక్రమ కేసులు పెట్టినా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన ఆందోళనలకు దిగేవారు. ఉత్తరకంచి గ్రామంలో జరిగిన ఒక ఘటనపై ఆయన దీక్ష చేయడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం. కొన్నిసార్లు తన ఇంటిలోనే తలుపులు వేసుకుని దీక్ష చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్లో కూడా ఆయన కాపుల డిమాండ్లపై దీక్ష చేపట్టారు. అప్పట్లో ఆయన ఆ పార్టీలోనే ఉన్నా ప్రజల కోసం ఉద్యమించడానికి ముందుండేవారు.కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రి రోశయ్యను హెలికాఫ్టర్లో పంపించి ముద్రగడతో రాయబారం చేసి కాపులకు పలు వరాలను ఇవ్వడానికి అంగీకరించింది. ఆ తర్వాత లక్షల మందితో ఒక సభను పెడితే కోట్ల స్వయంగా హాజరయ్యారు. కొన్నిసార్లు అవసరమైతే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని వదలుకోవడానికి కూడా ఆయన వెనుకాడేవారు కారు. ముద్రగడ తండ్రి వీరరాఘవరావు రెండుసార్లు ఇండిపెండెంట్గా విజయం సాధించారు. ఆ తర్వాత రాజకీయాలలోకి వచ్చిన పద్మనాభం 1978 నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎంపీ అయ్యారు. గతంలో జనతా, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉన్నారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రత్యేక అభిమానం కలిగి ఉన్నారు.ముద్రగడను హైదరాబాద్ పంపి, ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేయించి, కోలుకోవడం కోసం జగన్ ఎంతో కృషి చేసినా అది ఫలించలేదు. ముద్రగడ ఆత్మీయత అనేది ఒక అరుదైన అనుభవం. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా ఆతిథ్యం తీసుకోకుండా వెళ్లడానికి ఒప్పుకునేవారు కారు. నిత్య సంతర్పణ మాదిరిగా ఇంటి వద్ద కోలాహలం ఉంటుందంటే ఆశ్చర్యం కాదు. రాజకీయాలలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, తన వ్యక్తిత్వాన్ని ఎన్నడూ వదలుకోలేదు. తనను నమ్ముకున్నవారిని వదలిపెట్టలేదు. ఆయా సందర్భాలలో ప్రభుత్వ నేతలకు లేఖలు రాసి తన అభిప్రాయాలను చెబుతుండేవారు.చంద్రబాబుకు ఆ లేఖలు బాగా చికాకు పెట్టించేవి. ముద్రగడ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయేవారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే, జగన్ ప్రభుత్వం కాపు నేస్తంతో సహా పలు పథకాలను వారి సంక్షేమం కోసం అమలు చేసింది. తద్వారా కాపులకు కూడా ఇతరవర్గాలతో పాటు మేలు చేసిన వ్యక్తిగా జగన్ను ఆయన గుర్తించారు. జగన్ కూడా ఆయనను పితృ సమానుడుగా చూశారు. తన సంతాప సందేశంలో అదే విషయం పేర్కొన్నారు. జనసేనకు చెందిన ఒక ప్రముఖ నేత గత ఎన్నికల ముందు ఆయన ఇంటికి వస్తున్నట్లు ఆ పార్టీ నేతలు సమాచారం ఇచ్చారు. దాంతో ఆయన తగు ఏర్పాట్లు చేసుకున్నారు. కాని ఆయన ఇంటికి రాకపోవడంతో ముద్రగడ చాలా బాధపడ్డారు. మాటపై నిలబడడం కాని, పట్టుదలకు కాని ముద్రగడ పెట్టింది పేరు.గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి ఓటమి ఎదురుకాదని ఆయన విశ్వసించారు. అలా జరిగితే తన పేరు మార్చుకుంటానని శపథం చేశారు. సాధారణంగా రాజకీయాలలో ఇలాంటి సవాళ్లు జరుగుతుంటాయి. ఆ తర్వాత వాటిని విస్మరిస్తుంటారు. కాని ముద్రగడ మాత్రం అందుకు భిన్నంగా తన పేరును పద్మనాభరెడ్డి అని గెజిట్లో నమోదు చేయించుకోవడం విశేషం. తన కుమార్తె జనసేనలో చేరి తనపైనే విమర్శలు చేసిన తీరు ఆయనకు తీరని ఆవేదన మిగిల్చింది. తాను మరణిస్తే ఆమెను రానివ్వద్దని అన్నారంటే ఎంత బాధపడ్డారో అర్ధం చేసుకోవచ్చు.ముద్రగడ పార్ధీవదేహం చూడడానికి వచ్చిన ఆమెను కుటుంబ సభ్యులు అనుమతించలేదు. కూటమి ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికార లాంచనాలతో చేయడానికి ముందుకు వచ్చినా వారు అంగీకరించలేదు. జీవించి ఉన్నప్పుడు ముద్రగడను ఎన్నో బాధలుపెట్టిన కూటమి నేతలు ఇప్పుడు మొసలికన్నీరు కార్చుతున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ముద్రగడ ఏపీ చరిత్రలో తనకంటూ ఒక పేజీని ఏర్పాటు చేసుకున్నారు. గత ఏభై ఏళ్లలో కాపు సామాజికవర్గానికి ఇంతగా గుర్తింపు తెచ్చిన నేత ముద్రగడ తప్ప మరోకరు కాదని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ముగిసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. -
భీమవరం టూర్ గ్రాండ్ సక్సెస్
-
ఉప్పొంగిన జన గోదావరి
సాక్షి, భీమవరం: సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ లూటీతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతుల పక్షాన బుధవారం భీమవరం వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి సభకు వేలాదిగా తరలివచ్చిన ఆక్వా రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులతో ఉదయం 8 గంటల సమయానికే భీమవరంలోని ఉండి బైపాస్రోడ్డు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, లోసరి, నరసాపురం రోడ్లు రద్దీతో నిండిపోయాయి. బైపాస్రోడ్డులోని డాక్టర్ బీవీ రాజు విగ్రహం సమీపంలో ఏర్పాటచేసిన సభా ప్రాంగణం, హెలీప్యాడ్ ఏర్పాటుచేసిన లూథరన్ గ్రౌండ్ జనంతో నిండిపోయాయి. ఉదయం 10.30 గంటలకు జగన్ హెలీప్యాడ్కు చేరుకోగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాలుకా సెంటర్, ప్రకాశంచౌక్, అంబేడ్కర్ సెంటర్, బీవీరాజు విగ్రహం మీదుగా సభాస్థలికి చేరుకున్నారు. సంక్షేమ సారధిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్థానిక మహిళలు, అభిమానులతో తాలుకాఆఫీస్ రోడ్డు, ప్రకాశం చౌక్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి. జనం రద్దీతో హెలీప్యాడ్ నుంచి సభాప్రాంగణం వరకు దాదాపు కిలోమీటరు మేర దూరానికి గంటకు పైగా సమయం పట్టింది. దారిపొడవునా జనానికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. ముద్రగడకు నివాళి సభ ప్రారంభానికి ముందుగా వేదికపై ఏర్పాటుచేసిన దివంగత వైఎస్సార్, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిత్రపటాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు. ఆక్వా రైతులకు భరోసాగా.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన జరిగిన సభలో జగన్ ప్రసంగం ఆద్యంతం ఆక్వా రైతులకు కొండంత భరోసానిస్తూ సాగింది. 2019–24 మధ్యకాలంలో ఆక్వా రైతులను ప్రోత్సహిస్తూ వైఎస్సార్ ప్రభుత్వం రూ. 1.50 రాయితీ విద్యుత్ అందించడం, సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు దోపిడీని అరికట్టేందుకు అప్సడాను తీసుకురావడం తదితర కృషిని వివరించారు. 2024 ఎన్నికల్లో ఆక్వా రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. జోన్తో సంబంధం లేకుండా ఎంతమంది రైతులకు రాయితీ విద్యుత్ను అందించారని జగన్ ప్రశ్నించగా ఎవరికి ఇవ్వలేదని రైతులు చెప్పారు. కోల్డ్ స్టోరేజీలు కట్టించారా? ఏరియేటర్స్పై సబ్సిడీ ఇస్తున్నారా? అని ప్రశ్నించగా ఏమీ చేయలేదని రైతులు సమాధానమిచ్చారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు టీడీపీకి చెందిన వారే కావడంతో చంద్రబాబు వారి దోపిడీకి కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు వైఎస్సార్సీపీ అండగా పోరాడుతుందని, రాబోయే మన ప్రభుత్వంలో సిండికేట్ను నామరూపల్లేకుండా చేస్తానన్న జగన్ భరోసాతో సభాప్రాంగణం మొత్తం రైతుల హర్షధ్వానాలతో మార్మోగింది. జగన్ ప్రసంగిస్తున్నంతసేపు ఈలలు, చప్పట్లతో ప్రజలు, అభిమానులు మద్దతు పలికారు. సీఎం..సీఎం అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. పొగాకు రైతులకు అండ పొగాకుకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని సభలో ఏలూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు తమ వెంట తీసుకువచ్చిన పొగాకును జగన్కు చూపించారు. ధర అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధైర్యపడవద్దని అండగా ఉంటామని జగన్ వారికి భరోసానిచ్చారు.ఆక్వా రైతుల గోడు పట్టదా? ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు విలవిల్లాడుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. రాజకీయాలకు అతీతంగా రైతులంతా రోడెక్కి ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లు లేదు. కూటమి నాయకులు ఆక్వా రైతులకిచ్చిన హామీలు మెడలు వంచి అమలు చేయించేందుకే జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా పోరాటం చేస్తున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ పశి్చమగోదావరి జిల్లా అధ్యక్షుడు ఆక్వా రైతులకు అండగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతిగా రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారు. ముఖ్యమంత్రిగా రైతులకు పెట్టుబడి సహాయం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్ఫుట్ సబ్సిడీ అందించడం, పంటలకు మద్దతు ధరలు కలి్పంచడంలో జగన్ ముందున్నారు. అనేక ఇబ్బందులతో పోరాటం చేస్తున్న ఆక్వా రైతులకు అండగా ఉండి ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే జగన్ పోరుబాట పట్టారు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు రైతులకు అండగా వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీ ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుంది. పంటలకు గిట్టుబాటు ధర కలి్పంచడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రొయ్యలు, వరి, పొగాకు, టమోట, మిర్చి, మామిడి తదితర పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్ట్లతో వేధిస్తున్నారు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి, తణుకు ఆక్వా సంక్షోభానికి ఈ ప్రభుత్వమే కారణం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోడానికి కూటమి ప్రభుత్వమే కారణం. ఆక్వా రైతులకు ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. ఆక్వా జోన్స్తో సంబంధం లేకుండా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి రెండేళ్లు గడిచిపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫీడ్ ధరలు పెంచితే ముఖ్యమంత్రి కిలోకు రూ.4 తగ్గించాలని ఆదేశించినా మొక్కుబడిగా రూ.2 తగ్గించి చేతులు దులుపుకున్నా ఎలాంటి చర్యలు లేవు. – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు జగన్ హయాంలో ఆక్వాకు మంచిరోజులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రొయ్యల సమస్యలను పరిష్కరించడానికి ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ను ఏర్పాటుచేయడంతో రొయ్యల ధరలు నిలకడగా ఉండడమేగాక ఫీడ్, సీడ్ ధరలు అదుపులో ఉండేవి. రైతులకు ఉపయోగపడేలా నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నేడు అప్సడా నిరీ్వర్యమైంది. ఎన్నడూలేని విధంగా ఫీడ్ ధరలు పెంచినా పట్టించుకున్న నాథుడే లేడు. – వడ్డి రఘురామ్, అప్సడా మాజీ వైస్ చైర్మన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత ఏర్పడింది. ఇటీవల ఆక్వా రైతుల ఆక్రందనలు, పోరాటాలు చూస్తుంటే రైతుల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అవగతమవుతోంది. జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలును అన్ని వర్గాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. – చినమిల్లి వెంకటరాయుడు, వైఎస్సార్సీపీ భీమవరం సమన్వయకర్త రైతుల నిరసనలు పట్టవా? కొంతకాలంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోవడం వల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా రోడెక్కి ఆందోళన బాట పట్టారు. రోడ్లపై ఫీడ్ బస్తాలు తగలబెట్టడం, రొయ్యల రోడ్డుపై పారబోసి ఆందోళన చేయడం వంటి ఆందోళనలు చేపట్టారు. రైతుల ఆందోళనలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సైతం పాల్గొంటున్నారంటే ప్రభుత్వంపై రైతుల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. – మామిళ్లపల్లి జయప్రకాష్, వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త జగన్కి ఘన స్వాగతం భీమవరం (ప్రకాశంచౌక్): ఆక్వా రైతుల సమస్యలపై భీమవరంలో ఏర్పాటు చేసిన పోరుబాట కార్యక్రమానికి భీమవరం విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భీమవరం లూథరన్ గ్రౌండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్కు ఉదయం 10.30 గంటలకు జగన్ చేరకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు, ఇన్చార్జిలు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. హెలీప్యాడ్ ప్రాంగణంలో స్థానికంగా ఉండే మహిళలు, యువత ఉత్సాహంగా జగన్ను చూశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, ఉభయగోదావరి జిల్లాల ఇన్చార్జి గుడివాడ అమర్నాథ్, పార్టీ పశి్చమ, ఏలూరు జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎంపీ చింతా అనురాధ, జెడ్పీ చైర్మన్ ఉప్పాల రాధిక, మాజీ ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, తలారి వెంకట్రావు, పొన్నాడ సతీష్ నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, ఇన్చార్జిలు చినమిల్లి వెంకటరాయుడు, పీవీఎల్ నర్సింహరాజు, గుడాల గోపి, వడ్డి రఘురాం, పేర్ని కిట్టు, కంభం విజయరాజు, పిల్లి సూర్యప్రకాష్, మామిళ్లపల్లి జయప్రకాష్ పొన్నాడ సతీష్ ఉప్పాల రాంప్రసాద్, బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, పార్టీ నాయకులు గాదిరాజు సుబ్బరాజు, పెండ్ర వీరన్న, పాతపాటి శ్రీనివాసరాజు, వేండ్ర వెంకటస్వామి, మేడిది జాన్సన్, మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు, కర్రి సుభాíÙణి, చెరుకువాడ నరేష్, యడ్ల తాతాజీ, కోడే యుగంధర్, కోడే విజయలక్ష్మి, బంధన పూర్ణచంద్రరావు, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, చెల్లెం ఆనంద ప్రకాష్ బర్రె శ్రీవెంకటరమణ, కొట్టు నాగు, గంటా రాహుల్, చవ్వాకుల సత్యనారాయణ మూర్తి, జల్లా కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాపు నాయకుడికి ఘన నివాళి.. ముద్రగడ పాడె మోసిన జగన్..
-
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తాం... ఆక్వా రైతులతో ముఖాముఖిలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
-
చెరగని ముద్ర ముద్రగడ ప్రస్థానం..
-
భీమవరం.. బ్రహ్మరథం
సాక్షి, భీమవరం : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా బుధవారం భీమవరం జనసంద్రంగా మారింది. పట్టణంలో రోడ్లన్నీ జనంతో కిక్కిరిశాయి. తమ అభిమాన నేత వైఎస్ జగన్ను దగ్గరి నుంచి చూడాలనే కోరికతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు తరలి వచ్చారు. అడుగడుగునా జనం నిరాజనం పట్టారు. జగన్ కాన్వాయి ప్రయాణించే దారి మొత్తం జనంతో నిండిపోయింది. కేవలం ఒకటిన్నర కిలోమీటరు దూరం ప్రయాణానికి గంటకుపైనే సమయం పట్టింది. రాష్ట్రంలోనే భీమవరం ఆక్వా హబ్గా పేరొందింది. కూటమి పాలనలో సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు అదునుచూసి ఇష్టానుసారం మేత రేట్లు పెంచుతూ, రొయ్య రేట్లు తగ్గిస్తూ రైతుల కష్టాన్ని కాజేస్తున్నాయి. ఈ దోపిడీని అడ్డుకోవాలని మూడు నెలలుగా రైతులు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ పరిస్థితిలో ఆక్వా రైతుల కోసం జగన్ బుధవారం భీమవరం రావడం రైతులకు కొండంత ధైర్యాన్నిచ్చింది. భీమవరం లూథరన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి ఉండి బైపాస్ రోడ్డులోని డాక్టర్ బీవీ రాజు విగ్రహం సమీపంలోని సభా ప్రాంగణం వరకు రోడ్డు ఇసుకవేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. తాలుకా ఆఫీస్ సెంటర్, ప్రకాశం చౌక్, అంబేడ్కర్ సెంటర్లు జనసంద్రాన్ని తలపించాయి. దారి పొడవునా తన కోసం వేచి ఉన్న వారందరికీ వైఎస్ జగన్ చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సదస్సులో చంద్రబాబు ప్రభుత్వ తీరును ఏకిపారేస్తున్నప్పుడు పెద్ద పెట్టున యువత ఈలలు, కేకలు వేశారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యంజెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడంలో సర్కారు నిర్లక్ష్యం రోప్ పార్టీ ఉన్నా జనాన్ని నిలువరించలేక తోపులాట వలంటీర్లుగా వ్యవహరించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఫలితంగా ఆక్వా సదస్సు విజయవంతం భీమవరం: ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బు«ధవారం భీమవరంలో నిర్వహించిన ముఖాముఖి సమావేశం భద్రత ఏర్పాట్లలో ప్రభుత్వం.. పోలీసు శాఖ ఘోరంగా విఫమైందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు పోటెత్తారు. ఇలా భారీగా తరలి వస్తారని ముందే సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని స్పష్టమవుతోంది. వైఎస్ జగన్కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాల్సి ఉన్నా, పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఫలితంగా హెలిప్యాడ్, సభా వేదిక వద్ద రైతులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. భీమవరం పట్టణంలోని లూథరన్ హైసూ్కల్ ఆవరణలో హెలిప్యాడ్ నుంచి తాలూకా ఆఫీస్ సెంటర్, ప్రకాశంచౌక్, అంబేడ్కర్ సెంటర్ మీదుగా గరగపర్రురోడ్డులోని రైల్వే అండర్పాస్ నుంచి బీవీరాజు కూడలి మీదుగా బైపాస్ రోడ్డులోని సభాస్థలి వరకు జగన్ కారులో వెళతారని ఆయన్ను కళ్లారా చూడాలని దారి పొడవున పెద్ద సంఖ్యలో జనం వేచి చూశారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసిన దాఖలాలు కన్పించలేదు. కనీసం జగన్ వేదిక వద్దకు వచ్చే సమయంలో జనం తోసుకువస్తున్నా రోప్ పార్టీ, తగినంత మంది పోలీసులు లేనందున నిలువరించలేకపోయారు. దీంతో వైఎస్ జగన్ ముందుకు పడబోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు అప్రమత్తమై పట్టుకున్నారు. వేదిక ముందు రైతులు, ప్రజల కోసం ఏర్పాట్లు చేసినా పోలీసుల భద్రత వైఫల్యం కారణంగా తోపులాట చోటుచేసుకుంది. అయితే వైఎస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు వలంటీర్లుగా వ్యవహరించడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆక్వా సదస్సు విజయవంతమైంది. -
చంద్రబాబు సిండికేట్ దోపిడీని కూకటివేళ్లతో పెకిలించేస్తాం
మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని గర్వంగా చెప్పగలుగుతా. ఈరోజు మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, అభిమానానికి నిజంగా నోటి నుంచి మాట రానంతగా భావోద్వేగం కలుగుతోంది. ఇసుక వేసినా రాలనంతగా కంటి చూపు మేరలో ఎక్కడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. చంద్రబాబు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు మార్చాలని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే.. అది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే అని గర్వంగా చెప్పగలను. మన హయాంలో ప్రతి రైతును అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపించాం. ఈ రోజు రాష్ట్రంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ఆక్వా ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా సిండికేట్గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. ఈ రోజు ఇలా చంద్రబాబు సానుభూతిపరుల సిండికేట్ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. – వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఆక్వాలో సిండికేట్దే పెత్తనమని మండిపడ్డారు. ఆయన అనుయాయ వర్గీయులే ఏవో కారణాలు, సాకులు చెప్పి అడ్డగోలుగా మేత ధరలు పెంచడంతోపాటు పంట ధరలను తగ్గించేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పరిస్థితిలో ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే ఆక్వాలో ఇప్పుడున్న సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలించేసి.. అప్సడాకు పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వాతో 15 లక్షల మందికి ఉపాధి ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి గమనిస్తే లక్షన్నరకు పైగా రైతులు 5 లక్షలకు పైగా ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. ఫలితంగా దాదాపు 15 లక్షల మందికి ఆక్వా రంగం ఉపాధి కల్పిస్తోంది. కానీ ఈ రంగంలో పరిస్థితులు చూస్తే, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కన్నీళ్లు తెప్పిస్తాయి. అంత దయనీయమైన పరిస్థితిలో ఆక్వా రంగం ఉంది. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. నిజానికి «ఫీడ్ ధరల పెంపు అనేది రైతుల అంగీకారంతోనే జరగాలి కానీ, ఏకపక్షంగా కాదు. ఫీడ్ ధరలు పెంచాలంటే సమీక్ష నిర్వహించాలి. దానికి ఒక హేతుబద్ధత ఉండాలి. ధరల పెంపుపై సమీక్షించాలంటే.. ఫిష్ మీల్ సమృద్ధిగా ఉండే అక్టోబర్, నవంబర్ నెలల్లో హేతుబద్ధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫీడ్ రేట్లపై ఇష్టానుసారం రివ్యూ చేయకూడదు. దీనిపై ఇటీవల ఆక్వా రైతాంగం తమ గోడు వెళ్లబోసుకుంది. అందుకే ఈ ప్రభుత్వానికి అప్పుడే అల్టిమేటం జారీ చేశాం. సిండికేట్ చేతుల్లో నలిగిపోతున్న రైతు చంద్రబాబు చర్మం కొంచెం మందం. మీ అందరికీ కూడా ఇది తెలిసిన విషయమే. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా చలనం ఉండదో.. చంద్రబాబు ప్రభుత్వం కూడా అలాగే తయారైందని చెప్పడానికి బాధపడుతున్నాను. మన ఖర్మ ఏమిటని ఒక్కసారి గమనిస్తే, ఆశ్చర్యంగా ఆక్వా రైతులకు సప్లయి చేసే ఫీడ్ కానీ, ఆ పంట కొనుగోలులో కానీ, చివరకు ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ కూడా చంద్రబాబు సానుభూతి పరులవే. దాంతో వాళ్లు ఎలా కావాలి అంటే అలా వ్యవహారం నడుపుతున్నారు. సీడ్ కొనేటప్పుడు రేటు ఎంతో వాళ్లే నిర్దేశిస్తారు. ఫీడ్ కొనేటప్పుడు కూడా ధర వాళ్లే నిర్దేశిస్తారు. ఆక్వా రైతన్నలు లక్షలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తే, తీరా ఆ పంట (రొయ్యలు) చేతికి వచ్చేసరికే వ్యాపారులంతా మొత్తం సిండికేట్గా ఏర్పడి, రేట్లు ఢమాల్ అని పడిపోయేలా చేస్తున్నారు. అలా చంద్రబాబునాయుడు సానుభూతిపరుల సిండికేట్ ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నడిపిస్తోంది. ఫలితంగా ఆక్వా రైతుల బతుకులు ఆ సిండికేట్ చేతుల్లో నలిగి పోతున్నాయి. చంద్రబాబు సీఎం సీట్లోకి వచ్చారంటే చాలు, ఆ సిండికేట్కు పండగే పండుగ. మన రైతన్నకు మాత్రం కన్నీళ్లే కన్నీళ్లు. ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొట్టమొదటిసారిగా ఇలాంటి పరిస్థితులు మార్చాలి అని చెప్పి తపన, తాపత్రయ పడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా సాగు అభివృద్ధి సంస్థ’ (అప్సడా)ను ఏర్పాటు చేస్తూ 2020 ఆగస్టులో మన ప్రభుత్వం ఏకంగా చట్టమే తీసుకొచ్చింది. ఆ అప్సడాకు ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరించేలా ఆ చట్టంలో నిర్దేశించాం. ఆక్వా రంగంలో అలా ఒక రెగ్యులేటరీ బాడీ ద్వారా సీడ్ రేట్లు, ఫీడ్ రేట్లు, మందుల రేట్లు, ప్రాసెసింగ్ ప్రక్రియ, కొనుగోలు ధరలతో పాటు, మార్కెటింగ్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, రైతాంగానికి నేరుగా తోడుగా ముఖ్యమంత్రి ఉండేలా ఆ రోజు ఒక చట్టాన్ని తీసుకువచ్చి రైతన్నలకు తోడుగా నిలబడ్డాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ముష్టి వేసినట్లు రూ.2 తగ్గించారు మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు. ఆ తర్వాత మరోసారి జూన్ లో పెంచారు. అంటే నాలుగు నెలలు కూడా తిరక్కముందే రెండుసార్లు రేటు పెంచారు. ఏకంగా కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు ఫీడ్ రేట్లు ఎడాపెడా పెంచుకుంటూ పోయారు. రైతుల అంగీకారం లేకుండానే, వారి గోడు వినకుండానే ‘అప్సడా’ చట్టాన్ని ధిక్కరించి ఇష్టానుసారం రేట్లు పెంచేశారు. అలా దారుణంగా పెంచి, ఆ తర్వాత తూతూ మంత్రంగా చంద్రబాబు చెప్పారంటూ కేజీకి రూ.2 తగ్గించారు. నాలుగు నెలలు తిరక్కుండానే కేజీకి రూ.14 నుంచి రూ.16 వరకు పెంపు ఎక్కడ? ముష్టి వేసినట్లు కేవలం రూ.2 తగ్గించడం ఏమిటి? ఇది చంద్రబాబు భాషలో చెప్పాలంటే 100 కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అని చెప్పినట్లుగా ఉంది. చంద్రబాబును నేను ఒకటే అడుగుతున్నా. ఈ రోజు ఆక్వా పంట సాగులో 60 శాతం ఫీడ్ ఖర్చు ఉంటుంది. అలాంటిది ఇష్టానుసారం ఫీడ్ రేటు పెంచుకుంటూ పోతే రైతాంగం ఎలా బతుకుతుంది? ఇదే ఫీడ్ తయారు చేసే కంపెనీ వాళ్లు, అందుకోసం వాడే సోయా, ఫిష్ మీల్, ఇతర మినరల్ మిక్సర్ రేట్లు పెరిగాయి కాబట్టి మేము రేట్లు పెంచుతున్నామని, రేటు పెంచక తప్పడం లేదంటున్నారు. ఆ రేట్లు పెరిగినప్పుడు ఫీడ్ రేటు పెంచుతున్నప్పుడు మరి ఆ రేట్లు తగ్గినప్పుడు మీరు తగ్గించారా.. అని నేను అడుగుతున్నా. రేట్లు పెంచడానికైనా.. రేట్ల మీద నిర్ణయం తీసుకోవడానికైనా ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి హేతుబద్ధత అనేది ఉండాలి కదా.. ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. మార్కెట్లో తక్కువ రేటుకు వాళ్లు కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత కొరత ఉందంటూ.. ఒక కారణం తర్వాత మరో కారణం చెప్పి, ఇష్టం వచ్చినట్లు రేట్ పెంచుకుంటూ పోతారు. ఇలా ఇప్పుడు సిండికేట్ రాజ్యం నడుస్తోంది. సభా వేదిక వద్ద అశేష జనవాహినికి చిరునవ్వుతో అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మీ వైఖరి మార్చుకోండి నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఐదేళ్లలో ఫీడ్ కంపెనీలు మూడుసార్లు ధరలు పెంచితే, అప్సడా ద్వారా ఆ రేట్లు పూర్తిగా తగ్గించామని నేను గర్వంగా చెప్పగలను. అది రైతులపై వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉన్న ప్రేమను చాటుతోంది. ఇంకా రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పనలో కూడా అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వమే కృషి చేసింది. ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల రేట్లను సమీక్షిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర.. ఏ రైతుకు తగ్గకుండా ఆ ఐదేళ్లలో రైతాంగానికి తోడుగా నిలుచుంది. కరోనా లాంటి కష్ట సమయంలో కూడా రైతన్నలకు అండగా నిలబడి కనీస మద్దతు ధర 100 కౌంట్ రూ.230కి తగ్గకూడదని చెప్పి ఏకంగా చట్టం చేసి మరీ రైతన్నలకు అండగా నిలిచిన పరిస్థితి ఒక్క మన ప్రభుత్వంలోనే జరిగింది. అదే ఈరోజు ఆక్వా రైతుల పరిస్థితి ఏమిటని చూస్తే, ఉత్పత్తి ఖర్చు కేజీకి రూ.275కు పెరిగింది. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు సీడ్, ఫీడ్ రేట్లు పెంచుతున్నారు. కానీ, పంట కొనుగోలు రేటుకు వచ్చేసరికి రూ.230 దాటని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో రైతాంగం ఎలా బతుకుతుందని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు గారూ.. ఈ సిండికేట్తో మీరు కుమ్మక్కై మీకు ఇంత, నాకు ఇంత అని చెప్పి మీరు చేస్తున్న వైఖరి మార్చుకోవాలని గట్టిగా కోరుతున్నా. చంద్రబాబు ప్రతి అడుగులో మోసం చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసం, మోసం, మోసం అనే పదాలే వినిపిస్తాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసాలతో అడుగులు ముందుకు వేశాడు. ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి బాండ్లు పంపిణీ చేసి.. అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశాడు. అదే మాదిరిగా ఆక్వా రైతులను కూడా ఆయన మోసం చేస్తూ వచ్చాడు. అవసరమైన జిల్లాల్లో 5 వేల టన్నుల సామర్థ్యంతో కోల్డ్ స్టోరేజ్లు అన్నాడు.. (చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పారో ప్రస్తావిస్తూ) మరి కట్టాడా? జోన్తో సంబంధం లేకుండా జోన్ వెలుపల ఉన్న చెరువులకు సబ్సిడీపై కరెంటు ఇస్తానని హామీ ఇచ్చాడు.. మరి ఇచ్చాడా? ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గిస్తానన్నాడు.. మరి తగ్గించాడా? ఏరియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు.. మరి ఇచ్చాడా? (ఏవీ ఇవ్వలేదంటూ రైతులు పెద్దఎత్తున చేతులు ఊపారు) ఇవన్నీ ఇవ్వకపోగా, మనం అమలు చేసిన రూ.1.50కే యూనిట్ విద్యుత్ను కూడా చంద్రబాబు కత్తిరించే కార్యక్రమం మొదలు పెట్టాడు. అందుకోసం తాజాగా జీవో 169 జారీ చేశారు. దీని ప్రకారం ఆక్వా సాగులో ఉపయోగించే మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ (పీఎఫ్) 0.90 నుంచి 0.95 మధ్య మెయింటైన్ చేయాలని చంద్రబాబు రైతులకు రూల్ పెట్టాడు. ఆక్వా రైతులు సాధారణంగా వాడే మోటార్లలో పీఎఫ్ 0.78 మాత్రమే ఉంటుంది. ఆ మోటార్లలో పవర్ ఫ్యాక్టర్ పెరగాలంటే మళ్లీ ఆ రైతులు కెపాసిటర్లు కొనాలి. అవి కొంటే తప్ప, పీఎఫ్ పెరగదు. 12 వేల కనెక్షన్లు పెండింగ్ కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం మానేశారు. దీంతో కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదు. అలా 12 వేల వరకు కనెక్షన్లు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు త్రీఫేస్ కరెంట్ కాకుండా, కేవలం సింగల్ ఫేస్ కరెంటు ఇచ్చి కోతల మీద కోతలు వేస్తూ రైతాంగం అల్లాడేలా చేస్తున్నాడు. దీంతో జనరేటర్లు పెట్టుకుని సాగు చేయాలంటే, ఆక్వా రైతులకు సాధ్యమయ్యే పనేనా చంద్రబాబూ? రైతుల గోడు పట్టని కూటమి ప్రభుత్వం నా పక్కనే పొగాకు రైతులు కనిపిస్తున్నారు. వారు తమ బాధలు చెప్పుకుంటూ, చూపిస్తున్నారు. వరుసగా రెండేళ్లు పొగాకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. రైతులు రోడ్ల మీద కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ఒక్క పొగాకు రైతే కాదు.. ఏ పంటకు చూసినా రైతన్నలకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి కనిపిస్తోంది. ఆర్బీకేలు నిరీ్వర్యం.. ఉచిత పంటల బీమా లేదు.. సమయానికే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ లేదు.. రైతు భరోసా అన్నది ఒక మోసంగా మిగిలిపోయిన పరిస్థితి. ఈ రోజు ఇటువంటి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి రైతన్నకు వైఎస్సార్సీపీ తోడుగా ఉంటుంది’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వంలో రూ.1.50కే యూనిట్ విద్యుత్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఆక్వా రైతాంగానికి అండగా నిలుస్తూ అడుగులు పడ్డాయి. అంతవరకు ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా చేశాం. ఇందుకోసం మన ప్రభుత్వ హయాంలో 57 నెలల పాటు ఏకంగా రూ.3,306 కోట్లు సబ్సిడీ భారం భరించాం. అదే అంతకు ముందు 2014–19 మధ్య చంద్రబాబు పాలనలో ఏం జరిగిందని చూస్తే, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్పై రూ.3.85 వసూలు చేసి బాదారు. ఆ తర్వాత నా పాదయాత్రలో అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని చెప్పాము. ఆ వెంటనే 2019లో ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబునాయుడు, ఆక్వా రైతులకు సరఫరా చేసే యూనిట్ విద్యుత్ రేటు రూ.2కు తగ్గిస్తూ జీవో జారీ చేశారు. కానీ, ఆ సబ్సిడీ ఇవ్వలేదు. దాన్ని కూడా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక భరించింది. అందుకోసం రూ.451 కోట్లు చెల్లించామని గర్వంగా చెబుతున్నా. 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు నాడు మన హయాంలో ఆక్వా రైతన్నలకు తోడుగా ఉండేలా సీడ్, ఫీడ్.. వాటి నాణ్యత, వ్యాధి నిర్ధారణ.. వాటన్నింటి కోసం ఏకంగా 35 ఆక్వా సాగు ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు ఏర్పాటు చేశాం. ఆర్బీకేల్లో ఏకంగా 782 మంది ఫిషరీస్ అసిస్టెంట్లు అంటే.. ఫిషరీస్ డిగ్రీ పట్టభద్రులను నియమించి, వారితో పాటు ఆక్వా ల్యాబ్ల ద్వారా ప్రతి రైతును చేయి పట్టుకుని నడిపించాం. మన హయాంలో ఏకంగా 120 రోజులు, 150 రోజుల పాటు ఉండే సీడ్ తీసుకొచ్చాం. అదే ఈరోజు కేవలం 90 రోజులకు మించి బతకని పరిస్థితి ఉంది. వీటన్నింటి ద్వారా ఆక్వా రైతన్న అల్లాడిపోతున్నాడు. క్వాలిటీ మానిటరింగ్ అనేది పూర్తిగా పక్కకు తప్పుకున్న పరిస్థితి కనిపిస్తోంది. నరసాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తే, అందులో క్లాసులు కూడా మొదలు పెడితే, ఇప్పుడు చంద్రబాబు అవసరమైన నిధులు ఇవ్వకుండా దాన్ని ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ప్రాంతంలోనే మెడికల్ కాలేజీ పనులు కూడా ఆపేశారు. భీమవరంలో తనను చూడటానికి వచ్చిన వారికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ 51 లక్షల టన్నులకు పెరిగిన ఉత్పత్తి చంద్రబాబు గత హయాంలో చేపలు, రొయ్యల ఉత్పత్తి 39 లక్షల టన్నులు కాగా, మన ప్రభుత్వంలో అది ఏకంగా 51 లక్షల టన్నులకు పెరిగింది. ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు చంద్రబాబు పాలనలో చివరి ఏడాది.. అంటే 2018–19లో రాష్ట్రం నుంచి ఎగుమతుల విలువ రూ.13,855 కోట్లు కాగా, మన ప్రభుత్వంలో 2023–24 నాటికి అది రూ.20 వేల కోట్లకు చేరిందని గర్వంగా చెప్పగలుగుతాను. చంద్రబాబు హయాంలో 86 శాతం ఉన్న యాంటీ బయోటిక్స్ అవశేషాలను మన ప్రభుత్వ హయాంలో ఏకంగా 20 శాతం లోపునకు తగ్గించామని కూడా గర్వంగా చెప్పగలను. అందుకే మన ప్రభుత్వ హయాంలో రెండుసార్లు.. 2021–22, 2023–24లో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. భీమవరంలో వైఎస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలుకుతున్న ప్రజలు ఆక్వా రైతుల సభలో ముద్రగడకు జగన్ ఘన నివాళిభీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తొలుత.. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు. అనంతరం ఆక్వా రైతులను ఉద్దేశించి మాట్లాడారు. మీ కష్టాలు నాకు తెలుసు మీ అందరికీ నేను ఒకటే హామీ ఇస్తున్నా.. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను ఉన్నాను’ అని మీ అందరికీ చెబుతున్నా. చూస్తుండగానే రెండేళ్లు గడిచాయి. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికే మరో మూడేళ్లు గడుస్తాయి. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుందని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతా. మళ్లీ ‘అప్సడా’ పూర్వ వైభవంలోకి వస్తుంది. ఆ సంస్థకు సీఎం చైర్మన్గా ఉంటాడు. ఇప్పుడున్న సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెకిలిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంత వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆక్వా రైతులకు, రాష్ట్ర రైతాంగానికి, ప్రతి పంటకు, పంట వేసిన ప్రతి రైతు చేయి పట్టుకుని నడిపిస్తూ.. వారికి తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా చెబుతున్నా. -
అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు
సాక్షి, కాకినాడ/ గోకవరం/ పిఠాపురం/ కిర్లంపూడి: కాపు ఉద్యమ నేత, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్ర అభిమానులు, పార్టీ నాయకులు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధువుల అశ్రునయనాల మధ్య సాగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. శ్వాసకోశ వ్యాధితో హైదరాబాద్లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముద్రగడ మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెల్సిందే. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి బుధవారం ఉదయం స్వగ్రామమైన కిర్లంపూడికి తీసుకొచ్చారు. ముద్రగడ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఆయన స్వగృహంలో ఉంచారు. తమ ఉద్యమ నేతను కడసారిగా చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు, ప్రజలు, వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తరలిరావడంతో కిర్లంపూడి కిక్కిరిసిపోయింది. ముద్రగడ అభీష్టం మేరకు ఇంటి ఆవరణలోనే కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పాడె మోసిన మాజీ సీఎం వైఎస్ జగన్ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మధ్యాహ్నం 2.55 గంటలకు చేరుకున్నారు. అనంతరం ముద్రగడ భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలను పక్కకు జరిపి ముద్రగడను చివరి చూపు చూసిన వైఎస్ జగన్ కాసేపు ఉద్విగ్నంగా కనిపించారు. అనంతరం ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు బాలు, గిరిబాబు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చి, తానున్నానని ధైర్యం చెప్పారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడే ఉండి ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్ స్వయంగా ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. అంతిమ సంస్కారాల్లోనూ అదే ‘ముద్ర’!జీవించినంతకాలం కొన్ని విలువలకు కట్టుబడి ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం తాను మరణించిన తరువాత కూడా ఏమి చేయాలన్నది ముందుగానే నిర్ణయించారు. దానిని ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తూచ తప్పకుండా పాటించడం విశేషం. ఆయన బతికున్నప్పుడే తన అంత్యక్రియలు ఎలా చేయాలనే విషయమై ముందుగానే పలు సూచనలు చేసినట్టు బంధువులు చెబుతున్నారు. తన భౌతికకాయాన్ని ఆయన ఇంటి ఆవరణలోనే ఖననం చేయాలని సూచించారట. తాను చనిపోయేటప్పటికి తన ఒంటిపై ఏది ఉన్నా వాటన్నిటితోనూ ఖననం చేయాలని, తనకు అంత్యక్రియల అనంతరం ఎటువంటి దిన కార్యాలూ చేయొద్దని ఆయన చెప్పారట. తన భార్య జీవించి ఉన్నంతకాలం సుమంగళిగానే ఉండాలని ఆయన కోరినట్టు చెబుతున్నారు. ఆయన కోరిక మేరకు అన్నీ ఆయన చెప్పినట్టే చేస్తున్నట్టు బంధువులు తెలిపారు. అలాగే ప్రత్యర్థులతో చేతులు కలిపి కుటుంబంపై విమర్శలు చేసిన తన కుమార్తె క్రాంతిని తన భౌతికకాయం వద్దకు రానివ్వవద్దని కూడా ఆయన కుటుంబసభ్యులకు చెప్పారట. వీటన్నిటినీ కుటుంబ సభ్యులు పాటించారు.ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి నివాళి అర్పిస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముద్రగడ సతీమణి పద్మావతిని ఓదార్చుతున్న మాజీ సీఎం వైఎస్ జగన్ క్రాంతి రాకతో గందరగోళంవారించినా వినకుండా ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి భౌతికకాయం వద్దకు వచ్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ‘గో బ్యాక్ క్రాంతి’ అంటూ ముద్రగడ అభిమానులు నినాదాలు చేయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం నెలకొంది. అలాంటి పరిస్థితిలో కూడా పైనుంచి ఆదేశాలందుకున్నట్లుగా పోలీసులు క్రాంతిని భౌతికకాయం వరకు వెంటపెట్టుకుని తీసుకువచ్చారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో ఆమెను బయటకు పంపించేయాలని ముద్రగడ భార్య, బంధువులు పోలీసులను కోరారు. తర్వాత ఆమెను అక్కడి నుంచి తరలించారు.ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన ముద్రగడ కుటుంబంనాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒక దఫా ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా పని చేసిన ముద్రగడ పద్మనాభం రాష్ట్రానికి విశేష సేవలందించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను ముద్రగడ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికి ఉన్నప్పుడు బజారుకీడ్చి.. ఇప్పుడు లాంఛనాలు అనడంలో అర్థమేమిటని వారు ప్రశ్నించారు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసిన ప్రభుత్వం నుంచి తనకు ప్రకటించే ఏవిధమైన సహాయం అందుకోకూడదని ఆయన బతికి ఉన్నప్పుడే నిర్ణయించారని, ప్రభుత్వ లాంఛనాలతో చేస్తే ఆయన ఆత్మ శాంతించదని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ముద్రగడ భౌతికకాయాన్ని ఖననం చేసే సమయంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం చేస్తున్నట్లుగా పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన ముద్రగడ అనుచరులు వెంటనే పోలీసులను అడ్డుకున్నారు.నాడు వేధించి నేడు నాటకాలా! చంద్రబాబు ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభంను గతంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గుర్తుచేశారు. ముద్రగడ కుటుంబ సభ్యుల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మృతి తర్వాత మొసలికన్నీరు కార్చాల్సిన అవసరం లేదని జక్కంపూడి రాజా స్పష్టం చేశారు. ముద్రగడ జీవించి ఉండగా అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని చెప్పారు. -
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, తాడేపల్లి: రేపు (గురువారం 16, జులై) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు పాల్గొననున్నారు.త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. -
నేను విన్నాను...!. నేను ఉన్నాను..!
-
ముద్రగడకు YSRCP నేతల కన్నీటి వీడ్కోలు
-
ముద్రగడకు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
LIVE: ముద్రగడ ఇంటికి వైఎస్ జగన్
-
ముద్రగడకు చివరి వీడ్కోలు.. పాడె మోసిన జగన్
-
కన్నీళ్ల మధ్య ముద్రగడ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్
-
జగన్ ముందు కన్నీరుమున్నీరైన ముద్రగడ భార్య, కొడుకు
-
జగన్ కంటతడి.. ముద్రగడ వద్ద భావోద్వేగ క్షణాలు
-
ముద్రగడ ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్
-
ఆక్వా రైతులకు బాసటగా.. వైఎస్ జగన్ భీమవరం పర్యటన (ఫొటోలు)
-
ఇది ట్రైలర్ మాత్రమే.. దద్దరిల్లిన భీమవరం...
-
YS Jagan: నువ్వు మారుతావా.. నన్ను మార్చమంటావా..?
-
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్.. వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ అంత్యక్రియల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. ఆయన పాడె మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ కిర్లంపూడిలోనే ఉన్నారు. ముద్రగడ ఇంటి ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు.అంతకుముందు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన వైఎస్ జగన్.. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి హెలికాఫ్టర్లో జగ్గంపేటకు చేరుకున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి రాజకీయ ప్రముఖులు, ప్రజలు, అభిమానులు నివాళులు అర్పించారు. అభిమానులు కిర్లంపూడికి పోటెత్తారు. కడసారి ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు, అభిమానులు.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
వెళ్తూ వెళ్తూ చంద్రబాబుకు జగన్ మాస్ వార్నింగ్
-
ఆక్వా రైతులకు జగన్ బంపర్ ఆఫర్
-
ఫ్యాన్స్ రియాక్షన్.. ఢిల్లీ వాళ్ల వల్లే కాలేదు గల్లీ గాళ్లు మీరేంది రా..
-
చంద్రబాబు ఇది నీకు ట్రైలర్ మాత్రమే! జగన్ స్పీచ్ దద్దరిల్లిన భీమవరం
-
ముద్రగడ కు నివాళులు అర్పించిన YS జగన్
-
రూ.2 ముష్టి వేస్తున్నావా.? బాబు పై జగన్ ఉగ్రరూపం
-
జగన్ అస్త్రాల పదును.. కూటమి సమాధానం సున్నా?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు, ప్రకటనలకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఎంత తేడా ఉంటుందో గమనించండి. చంద్రబాబు నాయుడు ఎంతసేపు జగన్ను ఎలా దూషించాలా, వైఎస్సార్సీపీపై ఎలా ఆరోపణలు చేయాలా అన్నదానిపైనే కేంద్రీకరిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతేకాక ఆయా టూర్ లలో ప్రజలను , అధికారులను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆయన తొట్రుపడుతున్న తీరును కూడా అంతా గమనిస్తున్నారు. చంద్రబాబు చేసే వ్యాఖ్యలకు ఎక్కడా ఆధారాలు ఉండవు. అదే జగన్ చాలా స్పష్టమైన ఆధారాలతో మాట్లాడతారు. ఈ మధ్య ఏపీలో జరిగిన లాకప్ డెత్ కేసులు, పోలీసుల వేధింపులు తాళలేక జరుగుతున్న ఆత్మహత్యల కేసులు చంద్రబాబు ప్రభుత్వ పరువును బాగా దిగజార్చుతున్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన అన్నది సర్వసాధారణం అయిపోతోంది.ఈ విషయాలను జగన్ ప్రస్తావిస్తూ ఎక్కడా కులాలు,మతాల గురించి మాట్లాడకుండా స్పెసిఫిక్గా ఆయా ఘటనలను వివరించారు. అదే చంద్రబాబు మాత్రం కులాలు,మతాలు గురించి మాట్లాడుతుండడం, రౌడీయిజం అంటూ ఏవేవో ఆరోపణలు చేస్తుండడం కనిపిస్తుంది. చంద్రబాబు అంత సీనియర్ అయినప్పటికీ ఎందుకో బాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారా అన్న భావన కలుగుతుంది. అది వయసు ప్రభావం కావచ్చని కొన్ని రాజకీయ పక్షాలు అభిప్రాయపడుతుంటే, అదేమీ కాదని, కావాలనే ఆయన డైవర్షన్ రాజకీయాలలో భాగంగా అలా మాట్లాడుతుంటారని మరికొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కుప్పం టూర్ లో ఒక అధికారిని ఉద్దేశించి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును ఉదహరిస్తున్నారు. ఏదో పని గురించి ఆయన అడగగా, ఆ అధికారి నిధుల ప్రస్తావన తేగానే ,వెంటనే ఆ మాటను తప్పించారు.మీకు అవకాశం ఇచ్చానని, ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని అంటూ ఏదో మాట్లాడారు. మరో సందర్భంలో ఒక పౌరుడి ఇంటి వంటగదిలో ఆంగ్లంలో మాట్లాడిన వైనం కూడా ఎవరికి అర్దం కాలేదు. ఇలాంటి ప్రయోగాలను చంద్రబాబు చేయకుండా ఉంటే బెటరేమో అని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. జగన్ హే రామ్..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్ చేస్తూ,ఆయా ఘటనలను ప్రస్తావించారు. పోలీసుల పక్షపాత ధోరణి, రాష్ట్రంలో శాంతి భద్రతల లేమి ,సోషల్ మీడియా యాక్టివిస్టులపై దారుణమైన కేసులు పెట్టడం వంటి వాటిని ఆయన వివరిస్తూ ఏపీకి కావాల్సింది రౌడీ రాజ్యం కాదని, జింగిల్ రాజ్ కాదని అన్నారు. ప్రజలకు భద్రత,బాదితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ లేవనెత్తిన అంశాలపై ఒక్కదానికి కూడా చంద్రబాబు బదులు ఇచ్చినట్లు అనిపించదు.పైగా తాను రౌడీలు, మాఫియాతో రాజకీయాలు చేయవలసి వస్తోందని అనడంలో అర్ధం ఉన్నట్లు కనిపించదు. ఆయన ఉద్దేశం వైసిపిని ప్రజలలో పలచన చేయడం కావచ్చు. కాని ఆయన ఆ మాట అనగానే జనానికి ఈ రెండేళ్లలో టీడీపీ,జనసేన నేతలు, కార్యకర్తలు పలువురు చేస్తున్న రౌడీయిజం,అరాచకాలు గుర్తుకు వస్తున్నాయి.గతంలో టీడీపీకి చెందిన కొందరు చేసిన హత్యలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వ అసమర్ధత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతోందన్న వ్యాఖ్యలు కూడా ఆయా వర్గాలు చేస్తున్నాయి. యూట్యూబర్ రావణ అరెస్టు జరిగిన తీరు, ఆ క్రమంలో జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు రౌడీయిజం చేసిన తీరేమిటి?పోలీస్ స్టేషన్ ల పైనే దాడులు చేయడం ఎప్పుడైనా గతంలో జరిగిందా?అది ప్రభుత్వ అసమర్ధత కాదా! దీని గురించి జవాబు చెప్పకుండా రౌడీ రాజకీయం అంటూ ఎవరిమీదో నెట్టాలని ఎందుకు చూస్తున్నారు?గాదె సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలలో జగన్ స్వయంగా రంగంలో దిగేవరకు చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది. అది కూడా అరకొరగా చేస్తూ పోలీసుల తప్పులను కప్పిపుచ్చే రీతిలో వ్యవహరించడం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా?పైగా సాయికృష్ణ కాపు కులమేనని,సిఐ నాగరాజు అదే కులమని చెప్పడం ద్వారా చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏమి చెప్పదలిచారు?దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే పచ్చి బూతులతో టీడీపీకే చెందిన మరో నాయకుడి ఇంటిపైకి వెళ్లి కూల్చివేయడానికి చేసిన ప్రయత్నం చంద్రబాబు దృష్టిలో రౌడీయిజం అవుతుందా?కాదా?రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక యువతిపై చేసిన దారుణాల గురించి ఎందుకు చర్య తీసుకోలేకపోయారు. రౌడీలు రాజకీయం చేయడం వల్లే వివేక హత్య జరిగిందట.ఆ కేసులో దస్తగిరి అనే నిందితుడికి ఎందుకు టీడీపీ మద్దతు ఇస్తోందన్నదానికి జవాబు దొరకదు. మరి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగాను ఏ రౌడీలు హత్య చేశారు? టీడీపీ వారినే కదా ఆ రోజుల్లో అరెస్టు చేసింది?ఆనాడు జరిగిన ఘటనలపై మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఏమి రాశారు?నేరస్తులతో సమాజానికి నష్టం అని అంటున్నారు.నిజమే!కాని 164 మంది కూటమి ఎమ్మెల్యేలలో 135 మంది పై క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా!అందులో 80 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని వచ్చిన లెక్కలపై ఎప్పుడైనా స్పందించారా?ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఏదైనా ప్రచారం చేయవచ్చనుకుంటే రోజులు మారాయి. సోషల్ మీడియా విస్తారంగా అందుబాటులోకి వచ్చింది. అందులో వాస్తవాలు చెప్పి ప్రశ్నిస్తున్నవారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు అంతగా తాపత్రయపడుతుంది అర్ధం కావడం లేదా?ఒకవైపు వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నీచాతీనీచంగా మాట్లాడిన టీడీపీ నేతలు కొందరిని ఎమ్మెల్యేలుగా చేసేది ఆయనే. జగన్ కుటుంబ సభ్యులను దారుణంగా బూతులు తిట్టిన వారితో టీడీపీ మహానాడులో ఉపన్యాసాలు ఇప్పించేది ఆయనే ! మళ్లీ బహిరంగ సభలలో అదేదో వైఎస్సార్సీపీఇలాంటివి చేస్తున్నట్లు ప్రచారం చేసేది ఆయనే!ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైఎస్సార్సీపీ ఫండింగ్ ఇస్తోందట. దానికి ఆధారం ఉంటే చూపించాలి కదా!అనేక యూట్యూబ్ చానళ్లను టీడీపీ పోషిస్తున్నదన్న అరోపణలు ఉన్నాయి కదా! ఈ చానళ్ళు ఎంత అసభ్యంగా ప్రచారం చేసిన చర్యలు ఉండవు.కాని అదే వైఎస్సార్సీపీపై మాత్రం విరుచుకుపడుతుంటారు. సోషల్ మీడియాలో ఎవరైనా అభ్యంతరకరంగా ప్రచారం చేస్తే చర్య తీసుకోవచ్చు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వారు వేసే ప్రశ్నలకు జవాబు లేక ఏదో రకంగా కేసులు పెడుతున్న వైనాన్ని సమర్దించుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారన్న అభిప్రాయమే కలుగుతుంది.ఐ టీడీపీ పేరుతో ఏమి చేసింది ఎవరికి తెలియదనుకుంటే ఎలా ? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తనకు రౌడీయిజం తెలియదని,తానెప్పుడు హత్యలు చేయలేదని అనవలసిన అవసరం ఏమిటో తెలియదు.ఇలాంటి మాటలు అన్నప్పుడే సమతుల్యత లేకుండా మాట్లాడుతున్నారన్న భావన కలుగుతుందని ఆయన అర్దం చేసుకోవాలి. మావిగన్ అని జగన్అంటే దానిని వాటికన్ తో పోల్చడం ఏమిటి?యధా ప్రకారం లడ్డూ కల్తీ అని స్పీచ్ ఇస్తున్నారు. ఆ కల్తీ ఫిర్యాదు తన హయాంలో వచ్చినా దానిని ఎదుటివారిపై రుద్దుతారు. అసలు ఆయన చేసిన జంతు కొవ్వు ఆరోపణ ఏమిటి?అలా మాట్లాడడం పాపం కాదా?ఇప్పటికీ భక్తుల సెంటిమెంట్లు దెబ్బతినేలా ఎందుకు మాటలు కొనసాగిస్తున్నారు.ఏది ఏమైనా చంద్రబాబు స్థాయికి తగ్గట్లు మాట్లాడలేకపోతున్నారన్న భావన జనంలో ఏర్పడుతోంది.జగన్ మాత్రం స్పష్టమైన ఆధారాలతో తన అభిప్రాయయాలు చెప్పడం ద్వారా తన విశ్వసనీయతను పెంచుకుంటున్నారు.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు సిండికేట్లను కూకటివేళ్లతో పెకలిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో అక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్బంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.అక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. అక్వా రైతులు దీనావస్థలో ఉన్నారు. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే పండగ.. రైతన్నలకు కన్నీరే. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్గా ఏర్పడ్డారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారు. చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది. ఆ సిండికేట్ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.అక్వా రంగంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకే మా ప్రభుత్వంలో రెగ్యులేటరీ బోర్ (అప్సడా) ఏర్పాటు చేశాం. సీడ్, ఫీడ్ మార్కెటింగ్లో సమస్యలు వస్తే పరిష్కరించాం. అక్వా రైతులకు యూనిట్కు రూ.1.50కే విద్యుత్ అందించాం. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశాం. ఐదేళ్లలో సబ్సీడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించాం. ఇందులో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల బకాయిల్ని మేమే చెల్లించాం. ఫీడ్రేట్లు, ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు పెట్టాం. ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించాం. మా హయాంలో అక్వా ఎగుమతుల విలువ రూ.20 వేల కోట్లు. బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నాం అని జగన్ గుర్తు చేశారు.కానీ, చంద్రబాబు మేం తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీలో అక్వా రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రోజు కేజీ రొయ్య కౌంట్ రూ.230 దాటని పరిస్థితి. నాలుగు నెలల్లో ఫీడ్పై కేజీకి 14-16 రూపాయలు ఎడా పెడా పెంచేశారు. ఏకపక్షంగా ధరలు పెంచొద్దని అనేకసార్లు చెప్పాం. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ వచ్చారు. రేట్లు పెంచితే పెంచారు.. తగ్గినప్పుడు తగ్గించరా?. ముష్టి వేసినట్లు రూ.2 లు తగ్గిస్తే సరిపోతుందా?. చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అన్నట్లు ఉంది అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోనీ.. చంద్రబాబు అక్వా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. చంద్రబాబు ప్రతీ అడుగు మోసం.. మోసం. నరసాపురంలో మేం తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారు. రూపాయిన్నర విద్యుత్కు కోత పెట్టారు. రైతులకు ఇవ్వాల్సిన 12 వేల విద్యుత్కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. అక్వా రైతులకు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా.. జనరేటర్లు పెట్టుకుని సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి.. భీమవరం మెడికల్ కాలేజీ పనులు కూడా నిలిపివేశారు అని జగన్ అన్నారు.అక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. నేనున్నాను. రైతుల కోసం ఉద్యమబాట పడతాం. మూడేళ్ల తర్వాత మన రైతు ప్రభుత్వం వస్తుంది. అప్సడాకు పూర్వవైభవం తెస్తాం. చంద్రబాబు సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెలికిస్తాం’’ అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
Live: ఆక్వా రైతులతో YS జగన్ ముఖాముఖి
-
భీమవరం జగన్ ర్యాలీలో ప్రభాస్ ఫోటో
-
జగన్ కు ఘన స్వాగతం పలికిన భీమవరం ప్రజలు
-
జగన్ రాకతో దద్దరిల్లిన భీమవరం
-
జగన్ హయాంలో ఆక్వా రైతులకు భరోసా
సాక్షి, భీమవరం: కూటమి ప్రభుత్వంలో కుదేలైన ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు కదిలారు. ఫీడ్ రేట్లు, పెట్టుబడి వ్యయం పెరగడంతో విలవిలాడుతున్న ఆక్వా రైతన్నలకు భరోసా కల్పించేందుకు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వచ్చారు. చంద్రబాబు నిర్వాకంతో నైరాశ్యంలో మునిగిపోయిన ఆక్వారైతుల కష్టాలను స్వయంగా వినేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు భీమవరానికి విచ్చేశారు జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తమకు చేసిన మేలును ఈ సందర్భంగా ఆక్వారైతులు గుర్తు చేసుకుంటున్నారు.రైతన్నలకు పూర్తి అండదడలువైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలకు పూర్తి అండదడలు అందించారు. చంద్రబాబు సర్కారు ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు ఆక్వా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా పలు నిర్ణయాలు అమలు చేశారు. విద్యుత్, రొయ్యల మేతకు సబ్సిడీ ఇచ్చి మేలు చేశారు. 2019లో అధికారం చేపట్టిన మరుక్షణమే యూనిట్ రూ.1.50కే ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరా చేశారు. దీంతో జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ మేలు జరిగింది. ఆక్వా చెరువులకు 64,735 కనెక్షన్లు ఉండగా జోన్ పరిధిలో ఉన్న 54,033 సర్వీస్లకు సబ్సిడీ విద్యుత్ను సరఫరా చేశారు. 84 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు.15 రోజులకు ఒకసారి ధరల సమీక్షపాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3,804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్ట్లను తెచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడుసార్లు ఉపసంహరింపచేయడం ద్వారా టన్నుకు రూ.8,600 వరకు రైతులపై భారం పడకుండా ఆదా చేశారు. 15 రోజులకు ఒకసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా వైఎస్ జగన్ కృషి చేశారు.కూటమి ప్రభుత్వం వెన్నుపోటుఆక్వా రైతులకు 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కాలరాసింది. జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే ఆక్వాకు సబ్సిడీ విద్యుత్ అందిస్తామన్న హామీని అటకెక్కించింది. అమలులో ఉన్న సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లకు ‘పవర్ ఫ్యాక్టర్’ నిబంధనల పేరిట కోతలు పెట్టేందుకు కుట్రలు చేస్తోంది. మరోవైపు రొయ్యల మేత ధరలను అదుపు చేయంలోనూ విఫలమైంది. ఫలితంగా ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. తమను ఆదుకోవాలను ఎన్నిసార్లు ఆక్వారైతులు వేడుకున్నా చంద్రబాబు సర్కారు స్పందించలేదు. దీంతో అన్నదాతలు విలవిల్లాడిపోతున్నారు. -
భీమవరం బయలుదేరిన జగన్
-
Watch Live: భీమవరానికి వైఎస్ జగన్
-
చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ భీమవరం పర్యటనకు సంబంధించి... -
నేడు భీమవరానికి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడ్డగోలుగా మేత ధరల పెంపు.. రోజురోజుకు పతనమవుతున్న గిట్టుబాటు ధర... విద్యుత్ చార్జీల భారం వెరసి ఆక్వా రంగం కోలుకోలేని దెబ్బతీశాయి. వీటన్నింటికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచి భరోసా ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బుధవారం భీమవరంలో రైతులతో నిర్వహించే సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఆక్వా రైతుల సాధక బాధకాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకు భీమవరంలోని లూథరన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ నుంచి 10.30 గంటలకు ఉండి రోడ్డులో జరిగే రైతుల సమావేశానికి హాజరై సభలో రైతులతో మాట్లాడతారు. ఆక్వా రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఆక్వా సాగు అధికంగా ఉన్న అన్ని జిల్లాల్లో రైతులు నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఆక్వా రైతులకు మద్దతుగా అనేక చోట్ల వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. ఈ పరిణామాల క్రమంలో బుధవారం జరిగే సమావేశంలో ప్రధానంగా మేత ధరల పెంపు, రొయ్యలతో పాటు చేపలకు గిట్టుబాటు ధర, ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరగడం, ఫీడ్ కంపెనీల ధరలు పెంచి రైతులపై అదనపు భారం మోపడం వంటి వాటిపై క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవనున్నారు.తరలిరానున్న ఆక్వా రైతులుమరోవైపు చలో భీమవరానికి ఉమ్మడి పశ్చిమతో పాటు తూర్పుగోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆక్వా రైతులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో భీమవరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు పార్టీ శ్రేణులు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు మంగళవారం సభా ప్రాంగణం, హెలీప్యాడ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. -
ముద్రగడ కుమారునికి ఫోన్ లో జగన్ పరామర్శ
-
ఆక్వా అధోగతి
డాలర్ల పంటగా పేరుగాంచిన రొయ్యల సాగు చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సిండికేట్ దోపిడీతో సాగు భారమై ఆక్వా చరిత్రలో తొలిసారి రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాయం కోసం ధర్నాలు, రాస్తారోకోలు, ఉరితాళ్లు, క్రాప్ హాలిడే హెచ్చరికలతో నిరసన తెలుపుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ఈ తరుణంలో తమ గోడు వినేందుకు, తమ పక్షాన పోరాడేందుకు వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆక్వా రైతులు గంపెడాశతో ఉన్నారు.సాక్షి, భీమవరం: ఉమ్మడి జిల్లాలో ఆక్వాకు దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉంది. అమెరికా, చైనా, యూరప్ దేశాలకు రొయ్యల ఎగుమతులతో ఏటా ప్రభుత్వానికి డాలర్ల రూపంలో కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఆక్వా రైతులకు రూ.1.50కే రాయితీ విద్యుత్ను అందించారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారటీ(అప్సడా)ని ఏర్పాటుచేసి సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యాలను రైతులకు జవాబుదారీ చేశారు. మేత, రొయ్య ధరల స్థిరీకరణ, నాణ్యమైన సీడ్, ఫీడ్ సరఫరాకు కృషిచేశారు. కూటమి పాలనలో అధోగతి రెండేళ్లుగా సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ దోపిడీతో ఆక్వా అధోగతి పాలవుతోంది. సీడ్, ఫీడ్ ధరలు పెంచాలన్నా, రొయ్య రేట్లు తగ్గించాలన్నా అప్సడా చట్టానికి లోబడి జరగాలి. ప్రస్తుతం అప్సడాకు చైర్మన్గా సీఎం చంద్రబాబు ఉన్నారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్, ఎక్స్పోర్టర్స్ దాదాపు టీడీపీకి చెందిన వారే కావడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. అదను చూసి ఏకపక్షంగా మేత ధరలు పెంచుతూ, రొయ్య రేట్లు తగ్గిస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. రోడ్డున పడుతున్న రైతులు ఆక్వా చరిత్రలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేసింది మునుపెన్నడూ లేదని రైతులు అంటున్నారు. సిండికేటు దోపిడీని అడ్డుకోవడంలో చంద్రబాబు తీరుకు నిరసనగా పాలకొల్లు, భీమవరం, వీరవాసరం, ఉండి, కైకలూరు తదితర ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు చెరువులను వీడి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్లో నరసాపురం, పాలకొల్లు, ఆచంటలో చెరువులను ఎండగట్టి పంట విరామానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ పేరిట కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. రెండు నెలల క్రితం మేత ధరలు పెంచడంపై భీమవరం, పాలకొల్లు, వీరవాసరం తదితర చోట్ల మేత బస్తాలను తగలబెట్టి ఆందోళనలు చేశారు. రొయ్య ధరలను తగ్గించడంపై మేలో పాలకొల్లులో రొయ్యలను రోడ్డుపై వేసి తమకు చావే శరణ్యమంటూ ఉరితాళ్లతో నిరసన తెలిపారు. లోకల్ సేల్స్ పెంచుకునేందుకు మృగశిర కార్తె ప్రారంభం రోజున రొయ్యలు, చేపల కూరలతో ఆచంట, పాల కొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగుచేయలేమంటూ కొందరు రైతులు స్వచ్ఛంద క్రాప్ హాలిడేను పాటిస్తున్నారు.ఆశలన్నీ జగన్ పైనే సిండికేట్ దోపిడీని అరికట్టాలని రెండేళ్లుగా రైతులు ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ తరుణంలో జగన్ ఆక్వా రైతులకు అండగా బుధవారం భీమవరం రానుండటం వారికి కొండంత ధైర్యాన్నిస్తోంది. ఇప్పటికైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జననేత రాకకోసం గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలి ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి భీమవరం వస్తున్న జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు కోరారు. ఉండి బైపాస్ రోడ్డులోని సభా వేదిక వద్ద మంగళవారం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, భీమవరం కోఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు మీడియాతో మాట్లాడారు. అధిక సంఖ్యలో రైతులు, ప్రజలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. పార్టీ నేతలు పెండ్ర వీరన్న, పాతపాటి శ్రీనివాసరాజు, మేడిద జాన్సన్, బంధన పూర్ణచంద్రరావు, పాలవెల్లి మంగ తదితరులు పాల్గొన్నారు. -
భీమవరం ఆక్వా రైతులను పరామర్శించనున్న YS జగన్..
-
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే
ఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన కలెక్టర్, ప్రభుత్వం, కమిషనర్.. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరూ కో ఆర్డినేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలూ స్పందించలేదు. ఇలాంటప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోకుండా.. త్రిసభ్య కమిటీ నివేదికలో దొంగ మాటలు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు జూలై 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం తప్పు అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు త్రిసభ్య కమిటీ నివేదికలో తప్పులు రాస్తున్నారు. బాధిత కుటుంబంతో కలిసి మొత్తం ఏడుగురికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. కొత్త బోటు ఇవ్వాలి. కనీసం వీరిని చూసేందుకు కూడా ఎవరూ ఇంటికి రాలేదు. మానవత్వం లేని ప్రభుత్వం. వీరి కుటుంబ సభ్యులకు అందరికీ చెబుతున్నా.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎవ్వరూ భయపడొద్దు.. బాధపడొద్దు. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఒక్క నెల రోజుల్లోగా మేలు చేస్తుందని మాట ఇస్తున్నా. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఫిషింగ్ హార్బర్లు కళకళలాడుతుండేవి. సబ్సిడీతో బోట్లు కొనివ్వాలని భావించాం. తద్వారా ఒక్కో ఫిషింగ్ హార్బర్లో 10 వేల బోట్లు తిరుగుతుండేవి. ఏకంగా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చి, మరో 50 శాతం రుణం ఇప్పించి వీళ్లందరికీ మంచి చేయాలని భావించాం. ఒక్కో బోటుకు 7-8 మందిని ఓనర్లు చేసే వాళ్లం. తద్వారా మత్స్యకార కుటుంబాల్లో గొప్ప అడుగు ముందుకు పడి ఉండేది. ప్రభుత్వం మారడంతో ఫిషింగ్ హార్బర్లను అడ్డుపెట్టుకుని స్కామ్లు చేస్తోంది. -వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం ప్రమాదం జరిగితే.. రాత్రి 7 గంటలకే సమాచారం అందించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం లేదంటూ త్రిసభ్య కమిటీ నివేదికలో పేర్కొనడం ద్వారా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రమాదానికి గురైన మత్స్యకార కుటుంబాలను సీఎంకానీ, సంబంధిత మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు కానీ పరామర్శించలేదని ఎత్తి చూపారు. బాధిత ఏడు కుటుంబాలకు ఒక్కొక్కరికి వెంటనే రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన బోటు స్థానంలో కొత్త బోటు కొనివ్వాలని, ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోగా ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గంగవరం పోర్టుకు కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురి కుటుంబాలతోపాటు, ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. ఆ కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విశాఖలోని జబ్బర్తోట జంక్షన్ వద్ద మీడియాతో మాటా్లడారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యంప్రభుత్వం ఎంత అన్యాయంగా, మానవత్వం లేకుండా ప్రవర్తించిందనే దానికి బోటు ప్రమాదం ఘటన అద్దం పడుతోంది. జూలై 1న చిన్నాతో పాటు మరో ఆరుగురు.. మొత్తం ఏడుగురు వేటకు బయలుదేరారు. జూలై 4న అంటే మూడు రోజుల తర్వాత చిన్న.. తన ఫోన్ నుంచి తన మేనల్లుడు గురునాథ్కు 2.31 గంటలకు (కాల్ డేటా చూపిస్తూ) ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాం.. అని చెప్పాడు. దురదృష్టవశాత్తు ఫోన్ చేసిన గంటకే తీవ్రమైన అలలతో బోటు మునిగింది. వీళ్లంతా కూడా బోటుపైకి ఎక్కారు. ఫోన్లు సముద్రంలో పడిపోయాయి. అక్కడి నుంచి వీరి హృదయ విదారక గాధ ప్రారంభమైంది. పట్టించుకునే వారు లేరు. 10 నాటికల్ మైళ్లు ఈత కొడితే తప్ప ఒడ్డుకు రారు. గంట గంటకు బోటు మునిగిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో బోటు కింది భాగంలో ఒక మనిషి చనిపోయాడు. మిగతా వారు అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలు పెట్టారు. గంటలో ఇంటికి వస్తానన్న మనిషి 3 గంటలైనా రాకపోయే సరికి.. వీరి మేనల్లుడు తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ పక్కన ఫోన్లు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వారి కుటుంబీకులు అధికారులకు విన్నవించే ప్రయత్నం చేశారు. రాత్రి 7 గంటలకు మత్స్యశాఖ అధికారులను కలిసి విన్నవించినా ఎవరూ స్పందించ లేదు. ఏడుగురు కలిసి వేటకు వెళితే ప్రమాదానికి గురై 20 గంటల పైచిలుకు సముద్రంతో యుద్ధం చేసి ఒక్కడే తిరిగొచ్చారు. ఆదుకోవాలని సమాచారమిచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఆదుకున్న పాపాన పోలేదు. సకాలంలో స్పందించి ఉంటే ఐదారుగురు బతికి ఉండేవాళ్లు. అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా? తోడుగా ఉన్నామన్న భరోసా ఏదీ?ఇంత ఘటన జరిగితే సీఎం పట్టించుకోరు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసే ఈ జిల్లా వాసి అయిన మంత్రి కనీసం రాలేదు. ఇదే ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కనీసం ఇంటికి కూడా రాలేదు. పైగా ఏమంటారో తెలుసా? వీడియో కాల్లో వీరి కుటుంబాలను పరామర్శించామని హోం మంత్రి అనితమ్మ అంటోంది. ఒక్కరంటే ఒక్కరు బాధ్యత గల స్థానాల్లో ఉన్న వారు పట్టించుకోలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించలేదని, ఇది మా తప్పే అని.. దానికి క్షమాపణ చెబుతున్నామని ఏ ఒక్కరూ అనలేదు. మనిషిని తీసుకురాలేక పోయినా.. మీకు తోడుగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పే పని చేయలేదు. ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. పైగా ముష్టి వేసినట్టు ఎక్స్గ్రేషియా కింద రూ.5–10 లక్షలు ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులు చనిపోతే నష్ట పరిహారం కింద రూ.5 లక్షలు ఇచ్చేవారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. అంటే వేటకు వెళ్లి ఎవరు చనిపోయినా వారి కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో రూ.10 లక్షలకు పెంచాం. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా దుర్ఘటన జరిగితే రూ.10 లక్షలు నష్టపరిహారం ఇచ్చేవారం. ఇప్పుడు ప్రభుత్వం సకాలంలో స్పందించకుండా తప్పు చేసిన సమయంలో రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే ఇది న్యాయమేనా? ధర్మమేనా? విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలిమరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే.. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలంటే.. అధికారులకు ఒక షాక్ తగిలితే తప్ప స్పందన అనేది రాదు. సీరియస్గా చర్యలు ఉంటాయనేది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అనేది రోల్మోడల్గా ఉండాలి. తప్పుచేసే ప్రభుత్వం ఉండకూడదు. చనిపోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారమివ్వాలి. బాధిత కుటుంబంతో కలిసి మొత్తం ఏడుగురికి ప్రతి ఒక్కరికీ రూ.కోటి ఇవ్వాలి. కొత్త బోటు ఇవ్వాలి. కనీసం వీరిని చూసేందుకు కూడా ఇంటికి రాలేదు. కనీసం మానవత్వం లేని ప్రభుత్వం. వీరి కుటుంబ సభ్యులకు అందరికీ చెబుతున్నా.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎవ్వరూ భయపడొద్దు. బాధపడొద్దు. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఒక్క నెల రోజుల్లోగా మేలు చేస్తుంది. నాదీ బాధ్యత. కచ్చితంగా చేయిస్తామని మాట ఇస్తున్నా. సొంత కాళ్లపై నిలబడేందుకు...మత్స్యకారులు ఎక్కడెక్కడికో వెళ్లి నిర్బంధాలకు గురికాకూడదని, ఇటువంటి వాటికి ఫుల్స్టాప్ పెట్టాలని మన హయాంలో మత్స్యకారుల కోసం ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించాం. నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ, శ్రీకాకుళం జిల్లాలో బుడగట్ల పాలెం, మంచినీళ్ల పేట, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, ఓడరేవు, పశ్చిమగోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప.. ఇలా 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టి వేగంగా పనులు చేయడం మొదలుపెట్టాం. ఇవి కాకుండా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక, రాయదరువు ప్రాంతాల్లో పనులు చేయించడానికి శ్రీకారం చుట్టాం. మనవాళ్లకు ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తున్నందున సబ్సిడీతో బోట్లు కొనివ్వాలని భావించాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఒక్కో ఫిషింగ్ హార్బర్లో 10 వేల బోట్లు తిరుగుతుండేవి. ఒక్కో బోటుకు 7–8 మందిని ఓనర్లు చేసి.. ఏకంగా 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చి, మరో 50% రుణం ఇప్పించి వీళ్లందరికీ మంచి చేయాలని భావించాం. దీంతో మత్స్యకార కుటుంబాల్లో గొప్ప అడుగు ముందుకు పడి ఉండేది. మత్స్యకారులను పరామర్శించిన అనంతరం విశాఖలోని జబ్బర్ తోట జంక్షన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మారింది.. స్కామ్లు జరుగుతున్నాయిరాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఈ రోజు ఏం జరుగుతోందంటే.. ఆ ఫిషింగ్ హార్బర్లను స్కామ్లుగా మారుస్తూ అమ్ముతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు ద్వారా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి, ఆ బోట్ల పార్కింగ్ కోసం వాడాల్సిన ప్రాంతాన్ని ప్రైవేటుకు కట్టబెట్టడం ద్వారా స్కామ్లు చేస్తూ చంద్రబాబు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మత్స్యకారులకు వేధింపులుమన ప్రభుత్వంలో పలాస ఎమ్మెల్యే, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘటన చూస్తే.. మత్స్యకారులను ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం హింసిస్తోందో తెలుస్తుంది. సీదిరి అప్పలరాజు 18 ఏళ్ల కొడుకు బైకు నడుపుతూ దురదృష్టవశాత్తు ఢీకొట్టడంతో ఒక మనిషి చనిపోయారు. చేసింది కరెక్ట్ అని నేను చెప్పను. అయితే ప్రభుత్వం ఏకంగా మర్డరు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేసింది. చివరకు జడ్జి జోక్యం చేసుకుని మర్డర్ కేసు ఎలా పెడతారయ్యా..అని తిట్టి సెక్షన్లు మార్పించారు. ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఆలోచించాలని కోరుతున్నా. జువ్వలదిన్నెలో తమిళనాడు నుంచి బోటు వచ్చి మన మత్స్యకారులను ఇబ్బంది పెడుతుంటే.. ఆ బోటును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ బోటును విడిపించింది ఎవరో తెలుసా టీడీపీకి చెందిన వీళ్లే. నెల్లూరు జిల్లాకు లోకేశ్ వెళతారు. ఆ మరుసటి రోజు బోటు రిలీజ్. పోలీస్స్టేషన్లో పెట్టిన బంగారం దొంగతనం అయినట్టుగా బోటు మాయమైపోతుంది. దానికి కారణం ఎవ్వరయ్యా అంటే లోకేశ్, అదే టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ ఎంపీ.ప్రమాదం జరిగిన జూలై 4న రాత్రి 10:30 గంటలకే మత్స్యకార సంఘం నేత వాసుపల్లి జానకీరామ్ కలెక్టర్కు మెసేజ్ పంపగా..‘వెంటనే పరిశీలిస్తాం’ అంటూ కలెక్టర్ స్పందన తప్పు చేసి.. ఆపై తప్పించుకునే యత్నంరాత్రి 10.30 గంటలకు అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరాం.. కలెక్టర్కు, మెరైన్ సీఐకి మెసేజ్ (మెసేజ్ చూపిస్తూ) పెట్టారు. గంగవరం పోర్టుకు సమీపంలో బోటు ప్రమాదం జరిగిందని తెలుపుతూ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖలో తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం ఉంది. అంటే ఇక్కడే నేవీ ఉంది. కోస్ట్గార్డు ఉంది. విశాఖలో హెలికాప్టర్లు ఉన్నాయి. కలెక్టర్లు, కమిషనర్లు ఉన్నారు. ఇంత మంది ఇక్కడే ఉండీ.. కేవలం 10 నాటికల్ మైళ్ల దూరం వెళితే వీళ్లను కాపాడుకునే పరిస్థితి ఉండేది. కనీసం 5వ తేదీ ఉదయం 7 గంటలకు మనుషులు వచ్చి ఉంటే కనీసం 5–6 మంది బతికి ఉండేవాళ్లం అని చిన్నా చెబుతున్నారు. అంటే ఎవ్వరూ రాలేదు. చివరకు దేవుడి దయతో చిన్నాను చైనీస్ బోటు వాళ్లు చూసి పొద్దున 8.30 గంటలకు రక్షించారు. ఇక్కడ స్పందించాల్సిన కలెక్టర్, ప్రభుత్వం, కమిషనర్.. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరూ కో ఆర్డినేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలూ స్పందించలేదు. తప్పు జరిగిందని ఒప్పుకోకుండా.. త్రిసభ్య కమిటీ నివేదికలో దొంగ మాటలు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు జూలై 5న ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం తప్పు అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు త్రిసభ్య కమిటీ నివేదికలోనూ తప్పులు రాస్తున్నారు.గల్లంతైన ఘటనపై మత్స్యకారుల కుటుంబాలకు జూలై 5న ఉదయం 5గంటలకు సమాచారం అందినట్లు పేర్కొన్న త్రిసభ్య కమిటీ నివేదిక వైఎస్సార్సీపీ, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఇదీఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందనేందుకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. 2023 నవంబర్లో విశాఖ ఫిషింగ్ హార్బర్లో 49 బోట్లు కాలిపోతే ఏకంగా బోటు విలువలో 80 శాతం విలువ కట్టి.. రూ.7.11 కోట్లు వెంటనే విడుదల చేశాం. సుమారు 400 మంది మత్స్యకార హమాలీలు, కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సహాయం అందించాం. 2018లో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకున్నారు. వారి కుటుంబాల వారు వచ్చి నన్ను కలిశారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన చొరవతో కేంద్ర ప్రభుత్వం దౌత్యం జరిపింది. ఫలితంగా 2020 జనవరి 5వ తేదీన ఆ 22 మంది మత్స్యకారులను తీసుకు రావడమే కాకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు వారి చేతిలో పెట్టి జీవనాధారం చూపించింది. 2019లో మత్స్యకారులు వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నిర్బంధానికి లోనైతే కేంద్రం ద్వారా దౌత్యం చేసి తొమ్మిది మందిని సురక్షితంగా ఇళ్లకు చేర్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.ఎవరూ సంతోషంగా లేరు రాష్ట్రంలో ప్రతిదీ ఇలాగే ఉంది. రాష్ట్రంలో ఈ రోజు పిల్లలకు ఫీజు రీ యింబర్స్మెంట్ అందడం లేదు. స్కూళ్లు అన్యాయంగా తయారయ్యాయి. గోరుముద్ద కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. పిల్లలకు కనీసం బ్యాగులు, బూట్లు, పుస్తకాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. ఆరోగ్యశ్రీ దారుణంగా తయారైంది. పేదవాడికి వైద్యం అందడం లేదు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర అందక రోడ్డు ఎక్కే పరిస్థితి. ఉచిత పంటల బీమా, ఆర్బీకేలు ఎగిరిపోయాయి. సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అంటూ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టి, బాండ్లు ఇచ్చి.. ఆపై మోసాలుగా మార్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత ప్రజలందరికీ మేము అన్ని రకాలుగా తోడుంటాం. పార్టీ పరంగా చేయగలిగిన సహాయం చేస్తాం’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీ తనూజ రాణి, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు. -
దివికేగిన ఉద్యమ పతాక.. ముద్రగడ ఇకలేరు
సాక్షి, కాకినాడ/గోకవరం/పిఠాపురం: రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవిశ్రాంత యోధుడి ఊపిరి ఆగిపోయింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కాపు నేత హైదరాబాద్ గచ్చిబౌలిలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కిర్లంపూడి నుంచి హుటాహుటిన హైదరాబాద్ పయనమయ్యారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడికి బుధవారం తరలించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముద్రగడకు ఇద్దరు కుమారులు ముద్రగడ వీరరాఘవరావు (బాలు), ముద్రగడ గిరిబాబు, కుమార్తె క్రాంతి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ధృవతారగా వెలుగొందిన ప్రముఖ కాపు నేత మృతితో ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ముద్రగడ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, మంత్రులు, వైఎస్సార్ సీపీ నేతలు, వివిధ పార్టీల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి, ఏపీ రాజకీయాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి గ్రామంలో వీరరాఘవరావు, సత్యవతి దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య స్వగ్రామమైన కిర్లంపూడిలో, ఎల్ఎల్సీ రాజమండ్రిలోని తన్నీరు బుల్లియ్య గురుకులంలో సాగింది. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం గ్రామానికి మునసబుగా పనిచేశారు. తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. వీర రాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా..ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 1978లో ప్రత్తిపాడు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాటాకు గుడిసె లేని నియోజకవర్గంగా అర్హులందరికీ 3 సెంట్లతో గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. 1989లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, చేనేత జౌళి శాఖ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు. 2024లో వైఎస్సార్సీపీలోకి.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన 2024 మార్చి 15న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. వైఎస్సార్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా ఆయన సేవలందించారు. నిష్పక్షపాత వైఖరి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సంపాదించారు. సూటిగా మాట్లాడటం, అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పడం ముద్రగడ ప్రత్యేకత. కాపు ఉద్యమానికి కేరాఫ్ ముద్రగడ పేరు వినగానే గుర్తుకొచ్చేది కాపు రిజర్వేషన్ ఉద్యమం. కాపులను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. సభలు, దీక్షలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1994 జూలై 1న తన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించినా, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, తన డిమాండ్ను వెనక్కి తీసుకోలేదు. 2014లో కిర్లంపూడి కేంద్రంగా మరోమారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ ఉద్యమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా కాపు సంఘం నాయకులు గ్రామ గ్రామాన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష విరమింపజేసేందుకు టీడీపీ ప్రభుత్వం బలవంతంగా ముద్రగడను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించింది. 2016లో కాపు రిజర్వేషన్ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాపు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కాపు గర్జన చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 31, 2016న తునిలో కాపు గర్జన బహిరంగ సభ నిర్వహించారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు, కాపు నాయకులు తరలివచ్చారు. ముద్రగడ ఒక్కసారిగా రైల్రోకో చేపట్టడం, తదనంతరం రైలుకి నిప్పంటుకోవడంతో తుని ఘటన ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన తర్వాత ఆయనతో పాటు పలువురు కాపు నాయకులపై కేసులు నమోదయ్యాయి. అనేక ఇబ్బందులు, ఆరోపణలు ఎదురైనా ఉద్యమాన్ని విడిచిపెట్టలేదు. కాపు రిజర్వేషన్పై ప్రభుత్వాలకు ఆయన అనేక లేఖలు రాశారు. పోస్టుకార్డుల ఉద్యమమూ నడిపారు. అరుదైన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సామాజిక వర్గం ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా మారిన నాయకులు అరుదు. ముద్రగడ పద్మనాభం అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు. విజయాలు, పరాజయాలు, విమర్శలు, వివాదాలు, అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. మంత్రిగా కంటే ఉద్యమ నేతగా... రాజకీయ వేత్తగా కంటే కాపు ఆత్మగౌరవానికి ప్రతీకగా.. ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పలు పార్టీలతో అనుబంధం ఏర్పడినా, తన జీవితాంతం ప్రజా సమస్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం హక్కుల అంశంపైనే దృష్టి సారించారు. ఎప్పుడూ ఆ లక్ష్యం నుంచి ఆయన దృష్టి మారలేదు. సమస్యలపై తనదైన రీతిలో స్పందించడం ముద్రగడకు అలవాటు. ఆతిథ్యంలో చెరగని ‘ముద్ర’గడ..! ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ అతి«థిగా చూడటంలో ముద్రగడకు సాటి మరొకరు ఉండరు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అల్పాహారం అయినా, భోజనం అయినా చేసి వెళ్లాల్సిందే. అల్పాహారంలోనూ, భోజనంలోనూ చాలా ప్రత్యేకతలుంటాయి. ఎంత మంది వచ్చినా అందరూ తిని వెళ్లే వరకు ఆయనే స్వయంగా దగ్గరుండి అందరినీ తిన్నారా..? లేదా..? అంటూ వాకబు చేసేవారు. ఆయన ఇంట్లో ప్రతి నిత్యం పదుల సంఖ్యలో భోజనాలు చేయాల్సిందే..కేసులు... దీక్షలు..1988లో టీడీపీ ప్రభుత్వం ఉత్తర కంచిలోని తన అనుచరులపై అక్రమంగా కేసులు బనాయించినప్పుడు వాళ్లకు మద్దతుగా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు కిర్లంపూడి నుంచి ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందన లేకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి అక్రమ కేసులు తొలగించింది. 1993లో విజయభాస్కర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రావులపాలెంలో కాపులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఆ సమయంలో పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. 2005లో పోలవరం ఎడమ కాలువ, పుష్కరం ఎత్తిపోతల కోసం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచారు. భూమికి భూమి అనే నినాదంతో సొంత ఇంట్లో పక్కన ఒక తుపాకీ, తలకు రివాల్వర్ పెట్టుకొని ఆమరణ నిరాహార దీక్ష చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. -
ఆక్వా రైతు ఆక్రోశం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆక్వారంగం చంద్రబాబు సర్కారు నిర్వాకంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రూ.వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే ఆక్వా రంగం కకావికలం కావడంతో రైతుల గుండె చెరువైంది. కూటమి సర్కారు చేష్టలుడిగి చూస్తుండటంతో ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. కనివినీ ఎరగని రీతిలో ఓవైపు మేత ధరలు ఆకాశాన్నంటుతుంటే రొయ్యల కౌంట్ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. జోన్, నాన్ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా యూనిట్ రూ.1.50కే ఆక్వాకు సబ్సిడీ విద్యుత్ అందిస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించడమే కాదు.. అమలులో ఉన్న సబ్సిడీ విద్యుత్ కనెక్షన్లకు ‘పవర్ ఫ్యాక్టర్’ నిబంధనల పేరిట కోతలు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు సర్కార్ అసమర్థత, కంపెనీల సిండికేట్ మాయాజాలం మధ్య చిక్కుకుని ఆక్వా రైతు విలవిల్లాడిపోతున్నాడు. కౌంట్ ధరల్లో ఎడాపెడా కోత ఈ – ఫిష్ డేటా ప్రకారం రాష్ట్రంలో 1.62 లక్షల మంది రైతులు 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేçస్తున్నారు. ఏటా 10 లక్షల టన్నులకుపైగా దిగుబడులొస్తున్నాయి. ఆక్వా సాగుదారుల్లో నూటికి 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వైరస్లు, వాతావరణ ప్రభావంతో కనీస దిగుబడులు కూడా రాని దుస్థితిలో కూరుకుపోయారు. ఓ వైపు దిగుబడులు నేలచూపులు చూస్తున్నాయి. మరొక వైపు పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్ చార్జీల కారణంగా 100 కౌంట్కు రావాలంటే కిలోకు రూ.250, 50 కౌంట్కు రూ.300, 30 కౌంట్కు రూ.350కి పైగా ఖర్చవుతోంది.ట్రంప్ సుంకాల పేరిట కౌంట్ ధరలు గత ఏడాది కిలోకి రూ.30–70 మేర తగ్గించగా, పశ్చిమాసియా యుద్దం బూచితో మళ్లీ రూ.30–80 మేర తగ్గించేశాయి. మూడు నెలల క్రితం కిలో రూ.275 పలికిన 100 కౌంట్ ప్రస్తుతం రూ.235కి దిగజారింది. అందులో కూడా రూ.10–15 మేర కోతలేస్తూనే ఉన్నారు. మరొకవైపు గతంలో కౌంట్కు, కౌంట్కు మధ్య రూ.30–50 మేర వ్యత్యాసం ఉండేది. నేడు కంపెనీల సిండికేట్ కారణంగా ఆ వ్యత్యాసం కేవలం రూ.10–30కి పరిమితం కావడంతో ఆక్వా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మేత ధర టన్నుకు రూ.16 వేలు పెంపు లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.90 లక్షలు, టైగర్ రొయ్యలకు రూ.4 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేత కోసం రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72 – 80 వేలు ఉండగా ప్రస్తుతం పెరిగిన ఫీడ్ ధరల కారణంగా వెనామీ ఫీడ్ రూ.1.13 లక్షలు, టైగర్ ఫీడ్ రూ.1.26 లక్షలకు చేరింది. ఆక్వా రైతులకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టాన్ని చంద్రబాబు సర్కార్ నిర్వీర్యం చేయడంతో ఫీడ్ కంపెనీలు దోపిడీకి పాల్పడుతున్నాయి. అప్పడా చట్టానికి విరుద్ధంగా గడిచిన 5 నెలల్లో మేత ధరలు టన్నుకు రూ.16 వేలు చొప్పున పెంచాయి. సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో రూ.4 వేలు తగ్గించేందుకు అంగీకరించిన కంపెనీలు 24 గంటలు తిరక్కుండానే యూటర్న్ తీసుకున్నాయి. టన్నుకు రూ.2 వేలకు మించి తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. మరొకవైపు ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాల ధరలను కంపెనీలు ఇటీవలే భారీగా పెంచేశాయి. ఒక్కో ఏరియేటర్ సెట్పై రూ.3 వేలు, సాధారణ, ప్రీమియం మోటార్లపై రూ.1,000కిపైగా పెంచారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్ఫార్మర్స్, మోటార్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్ల పాటు అర్దరూపాయి కూడా పెరగని రొయ్యల సాగులో ఉపయోగించే మందుల రేట్లు ఇప్పుడు రెండేళ్లలో 30 శాతం పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో సీడ్ ధరలు 35 నుంచి 33 పైసలకు తగ్గిస్తే ఇప్పుడు మళ్లీ 35 పైసలకు పెంచేశారు. విద్యుత్ సబ్సిడీకీ ఎగనామం జోన్, నాన్జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతీ రైతుకు యూనిట్ రూ.1.50కే విద్యుత్ సరఫరా చేస్తామంటూ ఇచ్చిన హామీకి చంద్రబాబు నీళ్లు వదిలారు. పవర్ ఫ్యాక్టర్ పేరిట ఉన్న విద్యుత్ కనెక్షన్లకు కోత పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. మరోవైపు సర్చార్జీ, సర్దుబాటు చార్జీలంటూ ఎడాపెడా బాదేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో సబ్సిడీకి అర్హత పొందిన రైతులు మినహా ఈ రెండేళ్లలో కొత్తగా ఏ ఒక్క రైతు విద్యుత్ సబ్సిడీ పొందలేని దుస్థితి నెలకొంది. సబ్సిడీ పొందే రైతులు సైతం అదనపు చార్జీల పేరిట యూనిట్ రూ.2.50కుపైగా చెల్లిస్తున్నారు. ఇక సబ్సిడీ వర్తించని రైతులకు వాస్తవంగా యూనిట్ రూ.3.85 పైసలకే విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, రూ.5కు తక్కువ కాకుండా బిల్లులొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ లోడ్, అదనపు చార్జీల పేరిట ఒక్కో సర్వీసుకు రూ.8 వేల నుంచి రూ.12వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్లలో రూ.3,804 కోట్ల సబ్సిడీ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2019లో అధికారం చేపట్టిన మరుక్షణం మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం యూనిట్ రూ.1.50కే ఆక్వా రైతులకు విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. టీడీపీ హయాంలో ఎగ్గొట్టిన రూ.309.95 కోట్ల బకాయిలను సైతం చెల్లించింది. అస్తవ్యస్థంగా ఉన్న ఆక్వా జోనేషన్ను చక్కదిద్దింది. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ యూనిట్ రూ.1.50 విద్యుత్ సబ్సిడీని వర్తింప చేసింది. ఆక్వా చెరువులకు 64,735 కనెక్షన్లు ఉండగా జోన్ పరిధిలో ఉన్న 54,033 సర్వీస్లకు సబ్సిడీ విద్యుత్ను సరఫరా చేశారు. 84 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేయగా దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి పొందారు. పాత బకాయిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3,804 కోట్లు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించింది. ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్ ఫీడ్, సీడ్ యాక్ట్లను తెచ్చింది. పెంచిన ఫిష్ ఫీడ్ ధరలను మూడుసార్లు ఉపసంహరింపచేయడం ద్వారా టన్నుకు రూ.8,600 వరకు రైతులపై భారం పడకుండా ఆదా చేశారు. 15 రోజులకు ఒకసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేశారు. -
నేడు భీమవరానికి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి అండగా నిలవనున్నారు. ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికమవడం, రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విద్యుత్ చార్జీల భారం, ఎగుమతుల్లో సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇందుకోసం వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. భీమవరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆక్వా రైతులతో సమావేశమవుతారు. అనంతరం కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ పద్మనాభం భౌతికకాయం వద్ద నివాళి అర్పిస్తారు. -
ఒక్కొక్కరిని ఓదారుస్తూ.. ధైర్యం చెబుతూ..
సాక్షి, విశాఖపట్నం : బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను, మృత్యువుతో పోరాడి ప్రాణాలు దక్కించుకున్న కారి చిన్నాను మంగళవారం జబ్బర్తోటలోని వారి నివాసంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ‘నేనున్నాను.. అధైర్య పడకండి‘ అంటూ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ప్రమాదం జరిగి 10 రోజులు అయినా ప్రభుత్వం నుంచి ఏ మంత్రి కూడా ఓదార్చే ప్రయత్నం చేయలేదంటూ బాధిత మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల (రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు) అరకొర సాయంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మరింత సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించకుంటే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే, చిన్నాకు కొత్త బోటును సమకూర్చడంతో పాటు, బాధిత కుటుంబాల పిల్లల చదువు బాధ్యతను తామే స్వీకరిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం బాధితులకు వైఎస్సార్సీపీ నుంచి కూడా ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ సంభాషణ ఇలా సాగింది.వైఎస్ జగన్: ఆరోగ్యం ఎలా ఉంది? ప్రమాదం జరిగినప్పటి నుంచి వైద్యసేవలు సక్రమంగా అందాయా అన్నా..? మత్స్యకార బాధితుడు కారి చిన్నా : ఆరోగ్యం బాగానే ఉందన్నా. వైద్యసేవలు బాగానే అందాయన్నా.. వైఎస్ జగన్: బోటు ప్రమాదం ఎలా జరిగింది? కారి చిన్నా: మేము జూలై 1వ తేదీన హార్బర్ నుంచి 30 నుంచి 35 నాటికల్ మైళ్ల దూరం వేటకు వెళ్లాం. రెండు రోజుల పాటు వేట బాగానే సాగింది. ఇంటికి తిరుగు ప్రయాణంలో తీరానికి మరో 10 నాటికల్ మైళ్ల దూరం ఉందనగా తుపాను గాలులు, రాకాసి అలల ప్రభావంతో బోటు బోల్తా పడింది. మా అన్నయ్య కొడుకు నీటిలో పడిపోయాడు. మా అన్నయ్య చిన్నయ్య ఏడుస్తూ వాడిని కాపాడటానికి వెంటనే నీళ్లలోకి దూకాడు. అలా వాళ్లిద్దరూ మా కళ్లముందే సముద్రంలో కలిసిపోయారు. బోటు మునుగుతోంది.. రాత్రి 9 గంటల ప్రాంతంలో మునుగుతున్న బోటుపై రెండు లైఫ్ బాయ్ ఫోర్సులను (రక్షణ వలయాలు) పట్టుకుని గడిపాం. కానీ, తెల్లవారే సరికి చీకట్లో అలలు ధాటికి ఒకరు కొట్టుకుపోయారు. చాలా దూరంలో చైనా వాణిజ్య నౌక (షిప్) వెళ్లడం చూసి మిగిలిన నలుగురం ఈదుకుంటూ వెళ్తున్నాం. ఒకరు అలల తాకిడికి మిగతా వారు సముద్రంలో కలిసిపోయారు. 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ వెళ్లి నేను ఆ చైనా షిప్ ‘లంగర్’ (యాంకర్) పట్టుకున్నాను. నా కేకలు విని షిప్ పైనున్న చైనా సిబ్బంది కాపాడారు. వైఎస్ జగన్: ప్రభుత్వం సహాయక చర్యలు అందలేదా? కారి చిన్నా: జూలై 4వ తేదీ రాత్రంతా బోటును పట్టుకునే ఉన్నామన్నా. ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు చేపడతారనే మరుసటి రోజు ఉదయం వరకూ ఉన్నాం. కనీసం మా మత్స్యకార బోటు అసోíసియేషన్ వారికి చెప్పినా వచ్చేవారన్నా.. నలుగురైదుగురం బతికేవాళ్లం.వైఎస్ జగన్: బాధపడకు అన్నా.. ప్రభుత్వం నుంచి నీకు సాయం అందిందా?కారి చిన్నా: మునిగిన బోటు నా సొంతందే అన్నా.. అది మునిగిపోయింది. బోటు పరిహారం గానీ, నాకు ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వం అందజేయలేదన్నా..వైఎస్ జగన్: ప్రభుత్వం సాయం అందించేలా ఒత్తిడి తీసుకొస్తా.. నష్ట పరిహారం ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే రూ.కోటి పరిహారంతో పాటు కొత్త బోటు కోసం డబ్బులు ఇస్తాం. ధైర్యంగా ఉండు.కారి చిన్నా: ఆ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నన్ను మీరు ఫోన్లో పరామర్శించారు. మూడు రోజుల తర్వాత వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. చాలా ధైర్యంగా ఉందన్నా.. మా మత్స్యకారులందరి ధైర్యం మీరేనన్నా.. (మాట నిలుపుకుంటూ మా ఎదుటకు వచ్చారని వైఎస్ జగన్ రాగానే చిన్నా సాష్టాంగ నమస్కారం చేశారు.)వైఎస్ జగన్: స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు మిమ్మల్ని కలిసి ఆర్థిక సాయం అందజేస్తారు. దమయంతి (గల్లంతైన మత్స్యకారుడు కారి గరగయ్య భార్య) : రెండేళ్ల పిల్లోడిని, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడన్నా.. (కన్నీటి పర్యంతమైంది) వైఎస్ జగన్: తల్లీ.. బాధ పడకమ్మా..దమయంతి: మేమెలా బతకాలో తెలియడం లేదన్నా.. నేనే నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా. నా పిల్లోడిని చదివించుకోలేని పరిస్థితి. నా భర్త లేని జీవితం చాలా భయంగా ఉందన్నా.వైఎస్ జగన్ : మిమ్మల్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోకపోతే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మీకు కోటి రూపాయల పరిహారంతో పాటు ఈ పిల్లోడి చదువు బాధ్యతను కూడా తీసుకుంటాం. ఆధైర్య పడకమ్మా. నీకు అన్నివిధాల వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.దమయంతి : నా భర్త డెత్ సర్టిఫికెట్ త్వరగా వచ్చేలా చూడాలన్నా. అది వస్తే పింఛనుకు దరఖాస్తు చేసుకుంటాను. ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బులతో ఏదో కుటుంబాన్ని పోషించుకుంటానన్నా. నాకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నానన్నా.వైఎస్ జగన్ : ఇవన్నీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఒక వేళ ఈ ప్రభుత్వం చేయకపోతే మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మీకు అండగా నిలుస్తుంది. అదేవిధంగా వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అధైర్యపడకమ్మా.. మీ అన్నయ్యగా నేనున్నా.నర్సియమ్మ (గల్లంతైన మత్స్యకారుడు కారి సీతోడు భార్య) : జగన్ బాబూ.. ఎవరూ మా బాధలను పట్టించుకోకపోయినా నీవు వచ్చావు. నాకు చాలా ధైర్యంగా ఉంది బాబూ..వైఎస్ జగన్: మీ కోసమే వచ్చాను. మీ కుటుంబాలను ఆదుకుంటాను. నర్సియమ్మ: నా భర్త గల్లంతయ్యి పది రోజులు దాటింది. నా భర్త ఉన్నాట్లా..? లేనట్లా..? ప్రభుత్వం నుంచి అధికారంగా ఏ సమాచారం లేదు. ఒక వేళ చనిపోయి ఉంటే కనీసం పిండ ప్రదానం, దినకార్యం కూడా చేసుకోలేకపోయాం. ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి కూడా మా దగ్గరికి ఇలా భరోసా కల్పించడానికి రాలేదు.వైఎస్ జగన్: మత్స్యకారులంటే ఈ ప్రభుత్వానికే నిర్లక్ష్యం. మీకు అండగా వైఎస్సార్సీపీ, మీ జగన్ ఉంటాడు. నర్సియమ్మ: నాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడికి పెళ్లి అయింది. చిన్నోడికి ఇంకా పెళ్లి కాలేదు. అన్ని బాధ్యతలు తానే మోయాలి. ప్రభుత్వం నుంచి నా చిన్న కొడుక్కు ఏదైనా ఉద్యోగం కల్పిస్తే నా కుటుంబాన్ని కాపాడినట్లు అవుతుంది బాబూ..వైఎస్ జగన్ : బాధ పడకమ్మా. ఈ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం. మనం అధికారంలో లేము. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగం కల్పిస్తాం. అప్పటి వరకు మీకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీ భర్తకు పరిహారంగా రూ.కోటితో పాటు మీ చిన్నకొడుక్కు ఉపాధి కూడా కల్పిస్తాం.వైఎస్ జగన్ : తల్లీ బాధపడకు.. మీ జగనన్న అండగా నిలుస్తాడు..లక్ష్మీ (గల్లంతైన మత్స్యకారుడు రగుతు బండియ్య భార్య): నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద పాపకు పెళ్లి చేశాను. మరో ఇద్దరు పిల్లల బాధ్యత మోయాలి. నా భర్త గల్లంతయ్యి ఆచూకీ లేకుండా పోయాడు. ఈ బరువు బాధ్యతలు నాపై పెట్టేశాడు. ప్రభుత్వం నుంచి మా కుటుంబాన్ని ఆదుకునే వారెవ్వరూ లేరు.వైఎస్ జగన్ : అధైర్యపడకమ్మా.. ఈ మొద్దు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాను. మీకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తాం. అప్పటికీ ఈ ప్రభుత్వంలో మార్పు రాకపోతే.. మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నీకు రూ.కోటి పరిహారంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం.లక్ష్మీ: చాలా సంతోషం అన్నా.. అదేవిధంగా నా భర్త డెత్ సర్టిఫికెట్ త్వరితగతిన వచ్చేలా చేస్తే.. పింఛనుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. బాధలో ఉన్న మమ్మల్ని ఓదార్చిందుకు వచ్చిన నీవు నిండు నూరేళ్లు బాగా ఉండాలన్నా..వైఎస్ జగన్ : మీకు అండగా వైఎస్సార్సీపీ ఉంటుంది. మీ జగనన్న ఉంటాడమ్మా.. ఇదే రీతిలో వైఎస్ జగన్.. గల్లంతైన మత్స్యకారులు కారి చిన్నయ్య భార్య కె.మౌనిక, మేధా చిన్న అమ్మోరు భార్య మాసినమ్మ, అమర అప్పలరాజు భార్య ఎ.లక్ష్మిలను పరామర్శించి, ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సహాయంచిన్నాకు సహా ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకార కుటుంబాలతో పాటు ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నా కుటుంబానికి కూడా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందివ్వాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. ఇ చ్చిన మాట మేరకు తమ కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పడమే కాకుండా ఆర్థిక సహాయం సైతం ప్రకటించడంపై బాధిత కుటుంబాలు వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపాయి. బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించడాన్ని మత్స్యకార సంఘాల నాయకులు స్వాగతించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేశ్కుమార్, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలా గురువులు, పార్టీ మత్స్యకార విభాగం జిల్లా అధ్యక్షుడు పేర్ల విజయచందర్, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ ఆంక్షలు.. వీధుల్లో బారికేడ్లుభద్రత పేరుతో నిర్బంధం.. అయినా పోటెత్తిన జనం వైఎస్ జగన్ పర్యటనలో సర్కారు పెద్దల డైరెక్షన్.. పోలీసుల యాక్షన్ విశాఖ విద్య/డాబాగార్డెన్స్ : బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన మత్స్యకారులు గల్లంతై రోజులు గడుస్తున్నా, వారి జాడ తెలీక తల్లడిల్లుతున్న మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పడానికి వ చ్చిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ను అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టి అడ్డుకోజూసింది. ఈ క్రమంలో విశాఖ పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. జబ్బర్తోట పరిసర ప్రాంతాల వీధుల ప్రవేశ మార్గాలను మంగళవారం ఉదయం 7 గంటల నుంచే బారికేడ్లు పెట్టి మూసి వేశారు. సుమారు 500 మంది పోలీసులను ఎక్కడికక్కడ మోహరించారు. ఏవీఎన్ కాలేజీ అప్, రెల్లి వీధి జంక్షన్, సమీప వీధులను బ్లాక్ చేశారు. వీధుల్లో షాపులను మూసి వేయించారు. సున్నితమైన ప్రాంతం కావడంతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసులు వారి చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. ఇన్ని అడ్డంకులు సృష్టించినా పెద్ద సంఖ్యలో ప్రజలు జగన్ను చూసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కాగా, చంద్రబాబు సర్కారు బాధితులు పలువురు వైఎస్ జగన్కు వినతి పత్రాలు అందజేశారు. హెల్ప్ మీ.. జగనన్నా.. విశాఖ జబ్బర్ తోటలో వంకా నరేష్ భార్య అమ్మాజి ఓ చిన్నోడి ఫొటోతో ‘హెల్ప్ మీ’ అని ప్లకార్డు పట్టుకుని ఉండటం చూసి వైఎస్ జగన్ దగ్గరకు రమ్మని పిలిచారు. ‘అన్నా.. నా భర్త ఫిషింగ్ హార్బర్లో కూలీ. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడు గగన్ (7) కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎడమ వైపు కిడ్నీ తీసివేయాలన్నారు. కుడివైపు కిడ్నీకి ఇన్ఫెక్షన్ పట్టిందని చెప్పారు. అన్నం తిన్నా బాబుకు అరగడం లేదు. నా కష్టం మీతో చెప్పుకోవాలని ఇలా బోర్డు పట్టుకున్నాను’ అని చెప్పింది. ఆమె కష్టాన్ని విన్న జగన్.. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకి ఈ సమస్యను అప్పగించారు.బర్మా కాందిశీకుల భూమిని కబ్జా చేస్తున్నారన్నా.. విశాఖ ఉత్తర నియోజకవర్గం 49 వార్డులోని కప్పరాడలో సర్వే నెంబర్ 13లో బర్మా కాందిశీకుల భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైందని, దీని వెనుక నియోజకవర్గ ఎమ్మెల్యే పాత్ర ఉందని బాధితులు వైఎస్ జగన్కు వినతి పత్రం సమర్పించారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రోద్బలంతో కొందరు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని వాపోయారు. 3 ఎకరాల భూమిని ఆక్రమించడానికి ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖలో భూ దందాలు పెరిగి పోయాయని వాపోయారు. 49వ వార్డు మాజీ కార్పొరేటర్ అల్లు శంకరరావు, బర్మా కాందిశీకుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఎ.నర్సింహులు, ప్రధాన కార్యదర్శి దీపక్, మహిళా ప్రతినిధులు మంగ, ప్రసన్న తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో యూరియా బస్తా కోసం వెళ్లిన కాంతమ్మ అనే మహిళా రైతు తొక్కిసలాటలో మృతి చెందారని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. ఈ నెల 10వ తేదిన టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలం పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద ఈ ఘటన జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం దీనిని సాధారణ మరణంగా చిత్రీకరించి ఆ నిరుపేద మహిళా రైతు కుటుంబానికి అన్యాయం చేసిందని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తున్నామని చెప్పారు. -
ముద్రగడ భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్న వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాల్లో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ రేపు ఉదయం తాడేపల్లి నివాసం నుంచి తొలుత భీమవరం చేరుకుంటారు. అక్కడ ఆక్వా రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, ముఖ్యంగా ఫీడ్ ధరల విపరీత పెంపు, మార్కెట్లో గిట్టుబాటు ధరల లేమి తదితర కీలక అంశాలపై రైతులతో ముఖాముఖి చర్చించనున్నారు.భీమవరం పర్యటన ముగిసిన అనంతరం, మధ్యాహ్నం ఆయన హెలికాప్టర్లో జగ్గంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడికి వెళ్తారు.మంగళవారం కన్నుమూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి జగన్ నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. -
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి...
-
మత్స్యకారుల జీవిత నావకు దిక్సూచి వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా తాను ఉన్నానని మరోసారి భరోసా ఇచ్చారు. విశాఖలోని జబ్బర్తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ 2020 మేలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు రూ.10 వేలు ఆర్థికసాయం అందిస్తున్నామని ప్రకటించారు. బటన్ నొక్కి మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున వైఎస్ జగన్ జమ చేసేవారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వేట నిషేధ సమయంలో సాయం అందడంతో మత్స్యకారులు సంతోషంగా ఉండేవారు. అప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సాయం అందించలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాకముందు డీజిలుపై లీటరు మీద రూ.6 సబ్సిడీ ఇస్తే, వైఎస్సార్సీపీ సర్కారు రూ.9కు పెంచింది. ఈ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది వైఎస్సార్సీపీ సర్కారు. డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించింది. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోకు పైగా సబ్సిడీ ఇచ్చింది. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి అందించింది. అలాగే, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందించింది. దాదాపుగా రూ.3,500 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. ఈ ఆరు పథకాలలకు మొత్తం రూ.4,913 కోట్లు అందించింది. ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందించిన సాయం అదనం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు, పోర్టుల నిర్మాణాలు చేసింది. తీరం వెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచింది. బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకుంది. ఇవేగాక, మత్స్యకారుల కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలను వైఎస్ జగన్ చేపట్టారు. అందుకే ఆయనకు మత్స్యకారులు ఇవాళ కూడా జేజేలు కొట్టారు.మరోవైపు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అప్పట్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది.రాజ్యాధికారంలో వాటా..సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనుకబడిన మత్స్యకారులను వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆదుకున్నారు. రాజ్యాధికారంలో వాటాను పంచారు. ఆర్థికంగా చేయుతనిచ్చారు. ఎప్పుడూ లేని విధంగా మత్స్యకార వర్గానికి 4 ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. మత్స్యకార సామాజికవర్గంలోని 14 ఉప కులాలను విభజించి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు టీటీడీ బోర్డులో మత్స్యకారులకు చోటే దక్క లేదు. తొలిసారిగా మొదట మల్లాడి కృష్ణారావుకూ, రెండవసారి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్కూ టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లో మత్స్యకారుల సామాజిక వర్గానికి అత్యధిక పదవులు ఇచ్చారు. -
ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అంతకుముందు ముద్రగడ పద్మనాభం మరణంపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ముద్రగడ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రజలకోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయం. ముద్రగడ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని వెల్లడించారు. మా పార్టీ సీనియర్ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది.ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా… pic.twitter.com/HReowspJ4e— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2026 -
జగన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న మత్స్యకారులు
-
ఆంక్షలు పెట్టినా ఆగని జనం విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద జై జగన్ నినాదాలు
-
రేపు భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం, జూలై 15వ తేదీ) పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంతో ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లింది. ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు.ఈ సందర్భంగా ఆక్వా రైతులను పరామర్శించి, వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. -
మీకు నేను అండగా ఉన్న.. వైఎస్ జగన్ POWERFULL SPEECH
-
మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
-
బాధిత మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయం
విశాఖపట్నం: మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్థిక సాయం ప్రకటించారు. వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు దీని గురించి వివరాలు తెలిపారు.ఒక్కో బాధిత కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున అందిస్తామని కేకే రాజు చెప్పారు. ఈ డబ్బును వైఎస్సార్సీపీ తరఫున అందిస్తామని అన్నారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని వివరించారు. చిన్నా కుటుంబానికి రూ.7 లక్షల సాయం చేస్తామని చెప్పారు. కాగా, ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం(జూలై 14వ తేదీ) పరామర్శించారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇవి కూడా చదవండి: చంద్రబాబు సర్కార్కు మానవత్వం ఉందా?: వైఎస్ జగన్విశాఖ పర్యటనలో జగన్కు జై కొట్టిన జనం -
సీదిరి అప్పలరాజు కొడుకుపై మర్డర్ కేసు... జగన్ ఎమోషనల్ కామెంట్స్
-
నేను హామీ ఇస్తున్నా.... నేను వస్తా.. మీకు న్యాయం చేస్తా...
-
5 లక్షలు ముష్టి వేస్తున్నావా.. ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు, కొత్త ఇల్లు
-
మనిషివేనా... వీడియో కాల్ చేస్తావా... అనితపై జగన్ సీరియస్
-
ప్రమాదం జరిగింది ఇలానే..! పిన్ టు పిన్ చెప్పిన YS జగన్
-
చంద్రబాబు సర్కార్కు మానవత్వం ఉందా?: వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు సర్కార్ ఎందుకు స్పందించలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. విశాఖలోని జబ్బర్తోటలో మత్స్యకార కుటుంబాలను ఆయన ఇవాళ(మంగళవారం) పరామర్శించారు. బోటు ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్కు తమ కష్టాన్ని మత్స్యకారులు చెప్పుకున్నారు.. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ నెల 1న ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. కేవలం పది మైళ్ల దూరంలోనే ఘటన జరిగింది. జులైన 4న చిన్నా ఫోన్చేసి ఇంటికొస్తున్నామని చెప్పాడు. దురదృష్ణవశాత్తు పోన్ చేసిన కాసేపటికే బోటు ప్రమాదం జరిగింది. ఫిషరీస్ అధికారులు కూడా స్పందించలేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.బోటు ప్రమాదం జరిగిందని అధికారులకు మెసేజ్ చేశారు. రాత్రి 10:30కి కలెక్టర్, మెరైన్ సీఐకి మెసేజ్ పెట్టారు. వెంటనే స్పందిస్తే గంటల్లోనే మత్స్యకారులు దొరికేవారు. వెంటనే కోస్ట్గార్డ్ వచ్చి ఉంటే ఐదుగురైనా బతికేవారు. ఈనెల 5న చైనా బోటు సిబ్బంది చిన్నాను కాపాడారు. తప్పుడు జరిగింది కాబట్టే త్రీమెన్ కమిటీ వేశారు. త్రీమెన్ కమిటీ నివేదిక అంతా తప్పుల తడక. చంద్రబాబు ప్రభుత్వానికి మానవత్వం ఉందా?’’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి రాలేదు. ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదు. బాధితులను ఫిషరీష్ మంత్రి కూడా పరామర్శించలేదు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని సీఎంకు తెలియదా?. రాత్రికి రాత్రే స్పందిస్తే మత్స్యకారులు బతికేవారు. ఎక్స్ గ్రేషియా కింద అరకొర సాయం చేశారు. బాధితులకు రూ.కోటి చొప్పన ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఏడుగురు మత్స్యకారులకు కుటుంబాలకు పరిహారం అందాలి.మన ప్రభుత్వం వచ్చాక నెలలోపే ఆదుకుంటాం. గతంలో మా ప్రభుత్వంలో మత్స్యకారులకు భరోసా ఉండేది. 2018 పాదయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాట నెరవేర్చాం. పాక్లో చిక్కుకున్న మత్స్యకారులను సేఫ్గా తీసుకొచ్చాం’’ అని వైఎస్ జగన్ గుర్తు చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో మత్స్యకారుల కోసం 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. మరో 6 ఫిష్ ల్యాండ్పనులు కూడా చేపట్టాం. ఈ రోజు ఫిషింగ్ హార్బర్లను స్కామ్లతో అమ్మేస్తున్నారు. ఏపీలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. ప్రభుత్వ స్కూల్ పిల్లలకు బుక్స్, యూనిఫాంలు లేవు. రాష్ట్రంలో రైతు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. ప్రజలతో బాబు చెలగాటమాడుతున్నారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇవి కూడా చదవండి: బాధిత మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ ఆర్థిక సాయంవిశాఖ పర్యటనలో జగన్కు జై కొట్టిన జనం -
ప్రమాదం ఎలా జరిగిందో జగన్ కు వివరించిన కారె చిన్నా
-
జగన్ చూసి కన్నీరు పెట్టిన మత్స్య కారులు.. జబ్బర్ తోటకు చేరుకున్న జగన్
-
మజ్జి కృష్ణవేణి మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సాసీపీ విజయనగరం జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాతృమూర్తి మజ్జి కృష్ణవేణి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.కృష్ణవేణి గారి మరణ వార్త తనను ఎంతో కలచివేసిందని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలుస్తూ, విలువలతో కూడిన జీవితం గడిపిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో మజ్జి శ్రీనివాసరావు, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. -
జగన్ను చూడగానే కాళ్ళమీద పడి బోరున ఏడ్చేసిన బాధితుడు కారే చిన్నా
-
బారికేడ్లు పెట్టి పోలీసులు ఓవర్ యాక్షన్ ఇచ్చిపడేసిన బొత్స
-
విశాఖలో వైఎస్ జగన్.. పోలీసుల వింత ఆంక్షలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో ఉన్నారు. వైఎస్ జగన్ విశాఖ వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఎయిర్పోర్టు వద్దకు తరలివచ్చారు. దీంతో, విశాఖ ఎయిర్పోర్ట్లో పోలీసులు వింత ఆంక్షలు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. పోలీసుల తీరుపై పార్టీ శ్రేణులు, నెటిజన్లు మండిపడుతున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ వస్తున్న సందర్బంగా ఎయిర్పోర్ట్లో పోలీసులు వింత ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. వింత కారణాలు చెబుతూ వాహనాల్ని అనుమతించలేదు. వాహనాలు నిలిపివేశారు. అయితే, పార్టీ అధినేత వస్తుంటే.. నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకోవడమేంటని నేతలు, అభిమానులు కూటమి ప్రభుత్వం, పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైయస్ జగన్ గారు వస్తుండటంతో.. విశాఖ ఎయిర్పోర్ట్లో పోలీసులు వింత ఆంక్షలు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తున్న వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకుంటున్న పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి.. వింత కారణాలు చెబుతూ వాహనాల్ని అనుమతించని పోలీసులు పార్టీ… pic.twitter.com/vteu5SYArz— YSR Congress Party (@YSRCParty) July 14, 2026 -
YS జగన్ రాయల్ ఎంట్రీ.. బాబు,పవన్ కు దడపుట్టాల్సిందే
-
సముద్రంలో గల్లంతైన తన తండ్రి ఫొటోకు ముద్దు పెడుతున్న పసివాడు
-
కాన్వాయ్ ఆపి మరీ వినతి పత్రాలు అందుకున్న జగన్
-
చెరువు గట్టుకు చేరనున్న భరోసా
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరాన్ని దేశ ఆక్వా రాజధానిగా నిలబెట్టాడు రైతు. ఆ ‘తెల్లబంగారం’ డాలర్ల వర్షం కురిపించిన రోజులూ ఉన్నాయిగానీ నేడు అదే చెరువు గట్లపై నిలబడి రైతు ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మే నెలలో పాలకొల్లు–భీమవరం రహదారిపై, రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన రొయ్యలను కుప్పలుగా పారబోసి రైతులు ఆక్రోశించిన దృశ్యం, ఈ రంగం ఎంతటి సంక్షోభంలో కూరుకుపోయిందో ప్రపంచానికి చెప్పకనే చెప్పింది.ఇది ఏదో ఒక జిల్లాకు పరిమితమైన కథ కాదు. రాష్ట్రవ్యాప్తంగా 5.74 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు ఆక్వా రంగంపై బతుకుతున్నాయి. కేవలం పదిహేను రోజుల వ్యవధిలో 100 కౌంట్ రొయ్య ధర రూ. 270 నుంచి రూ. 215కు కుప్పకూలింది. 100 కౌంట్ రొయ్య పండించేందుకు రూ. 270 వరకు ఖర్చవుతుండగా, మార్కెట్లో దక్కుతున్నది రూ. 220–240 మాత్రమే. యాభై దాకా ఉన్న ఎగుమతి కంపెనీలు ఏకపక్షంగా ధరలు నిర్ణయించి, ‘100 కౌంట్కు రూ. 230, 40 కౌంట్కు రూ. 330, 30 కౌంట్కు రూ. 430, నెలాఖరు వరకు ఇవే రేట్లు’ అని ప్రక టించే స్థాయికి పరిస్థితి దిగజారిందంటే, మార్కెట్లో రైతుకు మిగిలే మాటే లేదని అర్థం.మేత, సీడ్, ప్రాసెసింగ్ సంస్థలన్నీ ఒక్కటై సిండికేట్గా వ్యవహ రిస్తూ పంట చేతికొచ్చే వేళకే కొనుగోలు ధర దించుతున్నాయనీ, వాటిలో అధిక భాగం అధికార పెద్దల అనుకూలుర చేతుల్లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పంటను కాపాడుకునేందుకు రైతు అధిక వడ్డీ అప్పుల ఊబిలో దిగబడుతున్నాడు.నీటిమూటలైన హామీలు ఎన్నికల ముందు ‘ఆక్వా జోన్ తో నిమిత్తం లేకుండా రైతులందరికీ యూనిట్ రూ. 1.50కే విద్యుత్’ అని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఆ దిశగా పైసా విడుదల చేయలేదు. ‘హామీని అమలుపర్చలేదు సరికదా సబ్సిడీపై ఇస్తామన్న ట్రాన్ ్సఫార్మర్లు, పరికరాలు కూడా ఇవ్వలేదు’ అని రైతులు వాపోతున్నారు. జీవో 169లోని పవర్ ఫ్యాక్టర్ నిబంధన (క్లాజ్ 4) పారిశ్రామిక ప్రమాణాలు పాటించలేని వేలాది సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు గుదిబండగా మారింది. హేచరీలకు నాణ్యమైన విద్యుత్ కావాలంటూ 2024 నవంబర్లోనే భీమవరం వేదికగా విద్యుత్ శాఖ మంత్రి ఎదుట రైతులు మొరపెట్టుకున్నారు. ‘త్వరలోనే కచ్చితమైన నిర్ణయం’ అని మంత్రి హామీ ఇచ్చి పంతొ మ్మిది నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో మారిందేమీ లేదు.ఈ నేపథ్యంలోనే గత నెల 16న ‘ఏపీ ప్రాన్ ఫెడరేషన్’ ప్రతినిధులు, మాజీ అగ్రికల్చర్ కమిషన్ వైస్ చైర్మన్, ఆక్వా రైతులు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. పెరిగిన మేత ధరలు, పడిపోయిన రొయ్య ధరలు, పెరిగిన పెట్టుబడి వ్యయం, నిలిచిపోయిన రాయి తీల వ్యథను ఆయనకు వివరించారు. ఫలితంగా జూలై 15న జగన్ ఆక్వా రైతులకు అండగా భీమవరం బాట పడుతున్నారు. ఇది మామూలు రాజకీయ పర్యటన కాదు. చెరువు గట్ల మీదకే వెళ్లి రైతు కష్టాన్ని కళ్లారా చూడటం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడం, కుంగిన గుండెల్లో భరోసా నింపడం: ఈ మూడూ ఆ పర్యటన లక్ష్యాలు. ప్రజా సంకల్ప పాదయాత్రలో పశ్చిమ గోదావరి గడ్డపైనే ఆక్వా రైతుకు రూ. 1.50 విద్యుత్ మాట ఇచ్చి, అధికారంలోకి రాగానే అక్షరాలా అమలు చేసి చూపిన నేత ఆయన. అందుకే ఆయన రాక అంటే ఆక్వా సీమకు అది కేవలం సానుభూతి పలకరింపు కాదు, అనుభవం రుజువు చేసిన భరోసా.– డా. కొత్తపల్లి శ్రీనివాస వర్మ, సీనియర్ జర్నలిస్ట్ -
విశాఖ చేరుకున్న YS జగన్
-
జగన్ అంటే ఎందుకంత భయం విశాఖ ఎయిర్ పోర్ట్ లో పోలీసుల ఆంక్షలు
-
విశాఖ పర్యటనలో జగన్కు జై కొట్టిన జనం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన సందర్భంగా నగరంలో సందడి నెలకొంది. ఆయన రాకతో విశాఖ వీధుల్లో భారీగా జనసందోహం కనిపించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు విశాఖకు వచ్చిన వైఎస్ జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మార్గమధ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయనను కలిసేందుకు ప్రయత్నించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన జగన్.. పలువురి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడిన ఆయన.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.కాన్వాయ్ దిగి ప్రజలతో మమేకంపర్యటనలో భాగంగా జగన్ పలుచోట్ల కాన్వాయ్ దిగి ప్రజలతో నేరుగా మాట్లాడారు. స్థానికులు, బాధిత కుటుంబ సభ్యుల నుంచి సమస్యలను విన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. -
YS Jagan LIVE : మత్స్యకార కుటుంబాలకు పరామర్శ
-
విశాఖకు బయలుదేరిన YS జగన్
-
మానవత్వం ఉందా.. కోటి పరిహారం ఇవ్వాల్సిందే: వైఎస్ జగన్
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటనకు సంబంధించి.. -
కన్నీళ్లు తుడిచేందుకు..
సాక్షి, విశాఖపట్నం: సముద్రం జీవనాధారం.. అదే సముద్రం ఆరుగురు మత్స్యకార కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన తొలి గంటల్లోనే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న బాధ ఇప్పటికీ తీరప్రాంతంలో వినిపిస్తోంది. సహాయక చర్యల్లో జాప్యం, అధికారుల పరస్పర విరుద్ధ ప్రకటనలు, బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నాలు.. ఇవన్నీ బాధిత కుటుంబాల ఆవేదనను మరింత పెంచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు అండగా నిలిచేందుకు, వారి బాధను పంచుకునేందుకు, ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖకు రానున్నారు.జబ్బర్తోటకు చెందిన గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ బోటు డ్రైవర్ కారె చిన్నాను వై.ఎస్.జగన్ ఫోన్లో పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగింది? సముద్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? తోటి మత్స్యకారులను కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఎలా ఒడ్డుకు చేరుకున్నారు? అనే వివరాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అవసరమైతే తాను స్వయంగా విశాఖకు వస్తానని అప్పుడే భరోసా ఇవ్వగా.. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా పరామర్శించేందుకు వస్తున్నారు. ఎయిర్పోర్టు నుంచి జబ్బర్తోటకు..వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 10.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సిరిపురం, జగదాంబ జంక్షన్, టర్నర్ చౌల్ట్రీ, పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజీ మార్గం మీదుగా రెల్లివీధి అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడి నుంచి జబ్బరతోట వెళ్లనున్నారు. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలుసుకుని వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోనున్నారు.అరకొర సాయం.. ఆదుకుంటుందా..?ఆరుగురు కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినా, అది వారి జీవితాలకు ఏమాత్రం సరిపోదని మత్స్యకార సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రమాదానికి బాధ్యులెవరో తేల్చడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సముద్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాలను జగన్ తన పర్యటనలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ప్రకృతి వైపరీత్యానికి మించి.. ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ప్రాణనష్టాన్ని మరింత పెంచిందన్న భావన మత్స్యకారుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన రోజే సమాచారం అందిందని ఒక అధికారి చెబుతుండగా..మరుసటి రోజు ఉదయం వరకూ తమకు తెలియలేదని మరో అధికారి చెప్పడం.. అదే సమయంలో ప్రమాదం జరిగిన రాత్రే హెలికాప్టర్లు వెళ్లాయని ఇంకో ప్రకటన రావడం ప్రభుత్వ సమన్వయ లోపాన్ని బట్టబయలు చేసింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి 4వ తేదీ రాత్రి 11.30 గంటలకే సమాచారం అందిందని వెల్లడించగా, మత్స్యశాఖ కమిషనర్ మాత్రం 5వ తేదీ ఉదయం 8.30 గంటలకు తెలిసిందని చెప్పారు. మరోవైపు ఆర్డీవో దిలీప్ చక్రవర్తి మాత్రం ప్రమాదం జరిగిన రాత్రే హెలికాప్టర్ పంపినట్టు ప్రకటించారు. చివరకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ నివేదికలో మాత్రం బాధిత కుటుంబాలు 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొనడం మరిన్ని సందేహాలకు తావిచ్చింది. విలువైన గంటలు వృథా కావడం వల్లే గల్లంతైన వారిని కాపాడే అవకాశాలు కోల్పోయామని మత్స్యకార కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది.గల్లంతైన ఘటనపై మత్స్యకారుల కుటుంబాలకు జూలై 5వ తేదీ ఉదయం 5 గంటలకు సమాచారం అందినట్లు పేర్కొన్న త్రిసభ్య కమిటీ నివేదికప్రమాదం జరిగిన జూలై 4వ తేదీ రాత్రి 10.30 గంటలకే మత్స్యకార సంఘ నేత వాసుపల్లి జానకీరామ్ వాట్సాప్ ద్వారా జిల్లా కలెక్టర్కు సమాచారం.. ‘వెంటనే పరిశీలిస్తాం’ అంటూ కలెక్టర్ స్పందననాడు మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీటముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వై.ఎస్ జగన్ మత్స్యకార సంక్షేమాన్ని ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చారు. వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి ఏటా రూ.10 వేల భరోసా అందించారు. డీజిల్పై అదనపు సబ్సిడీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి దాదాపు రూ.3,800 కోట్లతో భారీ ప్రణాళికలు రూపొందించారు. ఆక్వా హబ్లు, రిటైల్ చేపల విక్రయ కేంద్రాల ద్వారా అదనపు ఆదాయ అవకాశాలు కలి్పంచారు.గతంలో అండగా నిలిచిన జగన్ ప్రభుత్వంవిశాఖ ఫిషింగ్ హార్బర్లో అగి్నప్రమాదంలో బోట్లు దగ్ధమైనప్పుడు కూడా జగన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. పూర్తిగా ధ్వంసమైన 49 బోట్లకు రూ.7.11 కోట్ల నష్టపరిహారం అందించడమే కాకుండా బోట్లపై ఆధారపడిన 400 మంది కారి్మకులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున తక్షణ సాయం అందించింది. హార్బర్ ఆధునికీకరణకు రూ.150 కోట్లు కేటాయించి మౌలిక సదుపాయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది.ఏర్పాట్లను పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలువైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో సోమవారం వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాట్లను పరిశీలించారు.పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్కుమార్, మొల్లి అప్పారావు, పార్టీ సమన్వయకర్తలు జబ్బర్తోటలో బాధిత కుటుంబాల నివాస ప్రాంతాలను సందర్శించారు. వైఎస్ జగన్ బాధిత కుటుంబాలను కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లతో పాటు, విమానాశ్రయం నుంచి జబ్బర్తోట వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్మ్యాప్ను పరిశీలించారు.ఓదార్పునిచ్చే ఆత్మబంధువు రాక కోసం..ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఓదార్పు, ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నలు, మత్స్యకారుల సమస్యలపై మరోసారి గళమెత్తడం..ఈ మూడు ప్రధాన అంశాల చుట్టూనే వై.ఎస్ జగన్ విశాఖ పర్యటన సాగనుంది. ఒకవైపు బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూనే, మరోవైపు మత్స్యకారుల హక్కులు, భద్రత, సంక్షేమంపై ప్రభుత్వాన్ని నిలదీయనుండడంతో ఈ పర్యటనపై తీరప్రాంత ప్రజల్లో ఆసక్తి నెలకొంది. తమ కష్టసుఖాల్లో అండగా నిలిచిన నాయకుడు మరోసారి తమ మధ్యకు వస్తుండడంతో విశాఖ తీరప్రాంతం ఆయన రాక కోసం ఎదురుచూస్తోంది. గతంలోనూ ఇదే తీరు..! మత్స్యకారుల సంక్షేమంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జాలర్లు ఆరోపిస్తున్నారు. 2024లో మత్స్యకార భరోసా పథకం అమలు చేయకపోవడంతో పాటు, తర్వాత విడుదల చేసిన సాయాన్ని కూడా సగానికి తగ్గించిందని చెబుతున్నారు. ఇంకా అనేక మంది అర్హులకు భరోసా అందలేదని పేర్కొంటున్నారు. అలాగే, 2025 అక్టోబరులో బంగ్లాదేశ్లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారుల విడుదల విషయంలోనూ ప్రభుత్వం చొరవ చూపలేదని, మత్స్యకార సంఘం నాయకుడు వాసుపల్లి జానకీరాం చేసిన ప్రయత్నాలతోనే వారు విడుదలయ్యారని, చివరి దశలో మాత్రం ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శిస్తున్నారు.ఇన్చార్జినే దిక్కు..!విశాఖ జిల్లా రాష్ట్రంలోనే అతిపెద్ద మత్స్యకార కేంద్రం. వేలాది కుటుంబాల జీవనాధారమైన ఈ జిల్లాలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పోస్టు ఇప్పటికీ రెగ్యులర్గా భర్తీ కాలేదు. అనకాపల్లి జేడీ ఎల్బీఎస్ వర్ధన్కు ఈ నెల 4న అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో జేడీగా ఉన్న లక్ష్మణ్రావును ఎటువంటి కారణం లేకుండానే నెల్లూరుకు బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. స్థానిక పరిస్థితులపై పూర్తిస్థాయి అవగాహన లేని ఇన్చార్జి అధికారితోనే శాఖను నడపడం వల్ల బోటు ప్రమాదం అనంతరం సహాయక చర్యల్లో ఆశించిన సమన్వయం కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి ప్రోటోకాల్ ఖర్చుల పేరుతో ఒత్తిళ్లు ఉండటంతోనే పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించేందుకు అధికారులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సకాలంలో రెగ్యులర్ జేడీని నియమించకపోవడం పరిపాలనా వైఫల్యమేనని మత్స్యకార సంఘాలు విమర్శిస్తున్నాయి. -
పల్నాడు కలను సాకారం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల కొత్త మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు
-
పల్నాడు కల.. జగన్ సాకారం
సాక్షి, అమరావతి: వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లతో పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభానికి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు జారీ చేసింది. వైఎస్ జగన్ పిడుగురాళ్లలో ప్రభుత్వ నూతన వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి వద్ద రూ.500 కోట్లతో అధునాత వసతులతో వైద్య కళాశాల, బోధనాస్పత్రి నిర్మాణాన్ని చేపట్టారు. గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలోనే 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభం కావాల్సి ఉంది. కళాశాలకు అనుమతులు రాబట్టాలంటే తొలుత బోధనాస్పత్రి అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల నాటికే బోధనాస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేశారు. మరోవైపు మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు తరగతుల నిర్వహణకు వీలుగా కళాశాల, హాస్టల్స్, ఇతర నిర్మాణాలను దాదాపుగా పూర్తి చేశారు. ప్రాజెక్ట్ వ్యయంలో రూ.300 కోట్ల విలువైన పనులు ఎన్నికల నాటికే పూర్తయ్యాయి. ఎన్నికలకు ముందే ఆస్పత్రి భవనాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రారంభించింది. అనంతరం ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.బాబు సర్కార్ బ్రేకులు..ఎన్నికల అనంతరం గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని నిర్ణయించారు. దీంతో పిడుగురాళ్ల వైద్య కళాశాల నిర్మాణ పనులకు బ్రేకులు పడ్డాయి. తొలుత ఈ వైద్య కళాశాలను సైతం పీపీపీలో ప్రైవేట్కు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. అయితే ఈ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. మరోవైపు కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడంపై వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయడంతో పిడుగురాళ్ల వైద్య కళాశాలను ప్రైవేట్కు కట్టబెట్టే నిర్ణయాన్ని చంద్రబాబు విరమించుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కళాశాల ఏర్పాటుకు 19 నెలల అనంతరం చర్యలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ కృషిని చంద్రబాబు కొనసాగించి ఉంటే 2024లోనే బోధనాస్పత్రి అభివృద్ధి అయిపోయి, గత విద్యా సంవత్సరంలోనే మన విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు సమకూరి ఉండేవి. చంద్రబాబు చేసింది శూన్యంవాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తే పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యమేనని బోధపడుతుంది. వైద్య కళాశాల ఏర్పాటు నిర్ణయం, భూ సేకరణ, టెండర్ పిలవడం, పనులు ప్రారంభించడం, మెజార్టీ శాతం పనులు పూర్తి చేయడం.. ఇలా కీలక అడుగులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే పడ్డాయి. మరోవైపు కళాశాల, బోధనాస్పత్రి కోసం పోస్టులను సైతం ఈ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందే లేదు. గత ప్రభుత్వంలో మార్కాపురం, పులివెందుల, ఆదోని, మదనపల్లె వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకు కొత్తగా మంజూరు చేసిన 837 పోస్టులను చంద్రబాబు ప్రభుత్వం పిడుగురాళ్ల వైద్య కళాశాల, బోధనాస్పత్రికి సర్దుబాటు చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే మెడికల్ కాలేజీ ఏర్పాటు చంద్రబాబు ప్రభుత్వం ఘనతే అనే రీతిలో హడావుడి చేస్తుండటం గమనార్హం.మన విద్యార్థులకు తీరని ద్రోహం..ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని వేల మంది విద్యార్థులకు తీరని ద్రోహం తలపెట్టింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టారు. వాటిలో పది కాలేజీలను చంద్రబాబు సర్కారు ప్రైవేట్కు కట్టబెడుతోంది. పులివెందుల వైద్య కళాశాలకు 50 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ మంజూరు చేయగా, లేఖ రాసి మరీ ఆ అనుమతులను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయించింది. ఇలా పది వైద్య కళాశాలలకు బాబు అడ్డుపడటంతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. ఫలితంగా తెలంగాణ విద్యార్థులతో పోలిస్తే నీట్లో ఉత్తమ ర్యాంక్లు సాధించినప్పటికీ కన్వీనర్ కోటాలో సీట్ దక్కక నిరుపేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్య తరగతి వర్గాలకు చెందిన మన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. వైద్య విద్య కలను చంద్రబాబు సర్కారు ఛిద్రం చేయడంతో వారి జీవిత ఆశయం తలకిందులైంది. -
నేడు విశాఖలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖ తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులను వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను నేరుగా వైఎస్ జగన్ పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. విశాఖ పర్యటన షెడ్యూల్ ఇలా.. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరుతారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బాధిత మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి బయటపడిన కారి చిన్నాను పరామర్శించి దుర్ఘటన జరిగిన తీరు గురించి వివరాలు తెలుసుకుంటారు. అనంతరం తిరిగి తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.రేపు భీమవరానికి వైఎస్ జగన్ ఆక్వా రైతులకు పరామర్శసాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను నేరుగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం వెళుతున్నారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులపై రైతులతో ఆయన ముఖాముఖి చర్చిస్తారు. రైతుల సమస్యలను, నష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని అండగా నిలుస్తామని భరోసా ఇవ్వనున్నారు. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్... ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. -
భారత మహిళా క్రికెట్ జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు
తాడేపల్లి : లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ జట్టు చారిత్రక విజయం సాధించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అద్భుత విజయాన్ని నమోదు చేసిన భారత మహిళా జట్టుకు వైఎస్ జగన్ అభినందనలు తెలియజేశారు. ఈ అద్భుతమైన విజయం భావి తరాలకు స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. భారత మహిళా క్రికెట్ టీమ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నానంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. లార్డ్స్లో భారత మహిళా జట్టు అద్భుతమైన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మహిళల టెస్టు ఫార్మాట్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ను మట్టికరిపించింది. ఆతిథ్య జట్టును ఏకంగా 270 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా లార్డ్స్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి మహిళా జట్టుగా హర్మన్ సేన చరిత్రకెక్కింది.Heartiest congratulations to the Indian Women's Cricket Team on their stunning 270-run victory in the first-ever women's Test match at Lord's. May this remarkable achievement inspire generations to come. Wishing the team many more memorable victories ahead.@BCCIWomen pic.twitter.com/4GXu4Lki6P— YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2026 చారిత్రక మ్యాచ్లో టీమిండియా సంచలన విజయం -
చలో భీమవరం.. జగన్ పర్యటనపై సమావేశం
-
YS జగన్ కృషి...పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి 100 మెడికల్ సీట్లు
-
‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్ సీట్లు.. ఫలించిన వైఎస్ జగన్ కృషి
విజయవాడ: పిడుగురాళ్లలో 100 ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఎన్ఎంసీ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలించింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పిడుగురాళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టింది. 17 మెడికల్ కాలేజీల్లో భాగంగా పిడుగురాళ్ల కాలేజీని నిర్మించారు. పల్నాడు జిల్లా ఆరోగ్య భద్రత కోసం మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు వైఎస్ జగన్. 95 శాతం పనులు వైఎస్ జగన్ హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ఏడాది నుంచి మెడికల్ కళాశాల ప్రారంభం కానుంది. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడం వల్ల పల్నాడు ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందడమే కాకుండా, స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించే సువర్ణావకాశం లభించనుంది. వైఎస్ జగన్ దూరదృష్టితో చేసిన ఆలోచనతో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు ఇది ఓ చక్కటి అవకాశం కానుంది. -
'జగనన్న వస్తానన్నారు.. ధైర్యం వచ్చింది'
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదం బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ చిన్నా.. సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ఓదార్పు ఎంతో ధైర్యం ఇచ్చిందని అంటున్నారు. బోటు పూర్తిగా దగ్ధమవడంతో జీవనాధారం కోల్పోయా. ఈ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఈ కష్ట సమయంలో జగనన్న నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. "నీకు అండగా ఉంటాను.. సాయం చేస్తాను" అని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన మాటలతో ఎంతో ధైర్యం వచ్చింది. రేపు ఆయన విశాఖకు వస్తున్నారని తెలిసి సంతోషంగా ఉంది అని చిన్నా అన్నారు. అలాగే..గతంలో కూడా బోటు ప్రమాదాలు జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం బాధితులను ఆదుకుందని చిన్నా గుర్తుచేశారు. అప్పట్లో దెబ్బతిన్న బోట్లకు సుమారు 80 శాతం వరకు ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నామని చెప్పారు.వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. -
YS Jagan భీమవరం పర్యటన
-
ఎల్లుండి భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎల్లుండి (బుధవారం) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు.రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ భీమవరం పర్యటన చేపడుతున్నారు. ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు, విద్యుత్ ఛార్జీలు, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్న పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు.ఈ సందర్భంగా ఆక్వా రైతులను పరామర్శించి, వారి సమస్యలు, ఇబ్బందులు, నష్టాలపై నేరుగా వివరాలు తెలుసుకుంటారు. రైతుల ఆవేదనను విని వారికి ధైర్యం చెప్పడంతో పాటు, వారి సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్, ఈ పర్యటన ద్వారా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారి తరఫున పోరాటాన్ని మరింత బలోపేతం చేయనున్నారు. -
రేపు విశాఖకు వైఎస్ జగన్.. మత్స్యకార కుటుంబాలకు పరామర్శ
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (మంగళవారం) విశాఖలో పర్యటించనున్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన విషాదకర బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకుని, పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.అదే ప్రమాదంలో మృత్యువుతో పోరాడి ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా వైఎస్ జగన్ పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు.పర్యటన షెడ్యూల్ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. విశాఖపట్నం చేరుకున్న అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన కారి చిన్నాను కలుస్తారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులను ఆదేశించిన వైఎస్ జగన్, ఈ విషాద ఘటనపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. -
బాధిత మత్స్యకార కుటుంబాలకు YS జగన్ భరోసా
-
ఈనెల 14న విశాఖకు వైఎస్ జగన్
సాక్షి, విశాఖ : ఇటీవల బోటు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈ మంగళవారం(జూలై 14వ తేదీన) పరామర్శిస్తారని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఏవీఎన్ కాలేజ్ జబ్బర్ పేట సమీపంలో గల మత్య్సకారుల ఇళ్లకు వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి పరామర్శిస్తారని తెలిపారు. విశాఖలో ఈరోజు(ఆదివారం) కన్నబాబు మీడియాతో మాట్లాడారు. బోటు ప్రమాద బాధితుడైన కారె చిన్నాను ఇటీవలే ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శించారని పేర్కొన్నారు. నిన్న శనివారం మత్స్యకారుల కుటుంబాలని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించిన సంగతి తెలిసిందే. కాగా జులై 4న సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. రాకాసి అలల తాకిడికి బోటు బోల్తా పడటంతో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదం నుంచి కారె చిన్నా అనే మత్స్యకారుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఆరుగురి జాడ దొరకలేదు. అయితే ఈ ఘటనపై వేసిన త్రీ మెన్ కమిటీ మాత్రం గల్లంతైన వారు మృతిచెందినట్లు ప్రకటించింది. వారి ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ను మధ్యలోనే ముగించి.. ఆరుగురు మత్స్యకారులు మృతిచెందినట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్షంగా వ్యవహరించిందని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ ప్రమాదం 4 వతేదీన చోటు చేసుకోగా ఆ తరువాతి రోజు సహాయక చర్యలు ప్రారంభించడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్రను మత్స్యకారులు అడ్డుకున్నారు. -
వైఎస్ జగన్ ‘మావిగన్’.. టీడీపీ కూటమికి దడ పుట్టిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ చారిత్రక పరిణామ క్రమంలో భౌగోళిక వ్యూహాలు, పరిపాలనా సౌలభ్యం, ప్రజా సంక్షేమం అనేవి కేవలం తాత్కాలిక రాజకీయ నినాదాలు కాకూడదు. ఒక రాష్ట్ర ఆర్థిక, సామాజిక ప్రగతి అనేది అక్కడ ఇప్పటికే దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న సహజ వనరులు, చారిత్రక మౌలిక వసతుల సద్వినియోగం పైనే ఆధారపడి ఉంటుంది తప్ప, శూన్యం నుంచి సృష్టించాలనుకునే ఊహాజనిత రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల మీద కాదు.ఈ మౌలిక సత్యాన్ని క్షేత్రస్థాయి వాస్తవాలతో విశ్లేషిస్తూ, కృష్ణా-గుంటూరు ప్రాంత పారిశ్రామిక హృదయభూమిని చారిత్రాత్మక తీరప్రాంతమైన మచిలీపట్నంతో అనుసంధానించాలనే వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ వ్యూహాత్మక ఆలోచనల్లోని అంతర్లీన హేతుబద్ధతను ఒకదాని వెనుక ఒకటిగా లోతుగా పరిశీలించాల్సిన చారిత్రక సందర్భం ఇది.నిజమైన ప్రజాస్వామ్యంలో అధికారం, సంపద, అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతం కాకూడదు. అది సమాజంలోని ప్రతి ప్రాంతానికి, చివరి వ్యక్తి వరకు సమానంగా ప్రవహించాలి అన్న మహాత్మా గాంధీ సూక్తిని ఇక్కడ మనం స్మరించుకోవాలి. గతంలో ప్రతిపాదించిన అమరావతి నమూనా ఈ ప్రాథమిక వికేంద్రీకరణ సూత్రానికే పూర్తిగా విరుద్ధంగా సాగింది. ఒకే పరిమిత ప్రాంతంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుమ్మరించి, చుట్టుపక్కల దశాబ్దాలుగా సహజ సిద్ధమైన ఆర్థిక, సాంస్కృతిక శక్తులుగా ఎదిగిన నగరాలను పూర్తిగా విస్మరించడం తీవ్రమైన వ్యూహాత్మక లోపం.విజయవాడ, గుంటూరు నగరాలు ఎప్పటి నుంచో కోస్తాంధ్రాకు వాణిజ్య, విద్యా, రవాణా, వైద్య కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య అపారమైన మానవ వనరులు, అద్భుతమైన రోడ్డు నెట్వర్క్, రవాణా వసతులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఉన్న వసతులను మరింత పటిష్టం చేసి, వాటిని పరిపాలనా కేంద్రాలుగా మలిచి ఉంటే రాష్ట్ర ఆర్థిక రంగానికి ఎంతో మేలు జరిగేది. కానీ, ఈ సహజసిద్ధమైన వసతులను కాదని, పచ్చటి పంట భూములను బలవంతంగా లాక్కొని కాంక్రీట్ వనంగా మార్చాలనుకోవడం అనాలోచిత ఆర్థిక ప్రణాళికే అవుతుంది.ఈ ప్రాంత రవాణా రంగంలో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు సిద్ధంగా ఉన్న వనరుల చారిత్రక నేపథ్యాన్ని మనం గమనించాలి. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నాటి ఘన చరిత్ర కలిగిన గన్నవరం విమానాశ్రయం, దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్, అలాగే ప్రాంతీయ రవాణాకు, సరుకు రవాణాకు అత్యంత కీలకమైన గుంటూరు రైల్వే జంక్షన్లు ఈ నేలపైనే ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన, చారిత్రక రవాణా నెట్వర్క్ కళ్లముందే సిద్ధంగా ఉన్నప్పుడు, వాటిని మరింత విస్తరించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించడం ఏ పాలకుడికైనా ఉండాల్సిన కనీస వివేకం. కానీ, ఈ అద్భుతమైన వ్యవస్థలను పక్కన పెట్టేసి, వాటికి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి అనే ఊహాజనిత పరిధిలోనే సరికొత్తగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం, సరికొత్త అధునాతన రైల్వే స్టేషన్ నిర్మిస్తామంటూ చంద్రబాబు నాయుడు ప్రతిపాదనలు చేయడం స్వార్థపూరిత, సంకుచిత వైఖరిని స్పష్టం చేస్తోంది. ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, కొత్తవాటి పేరుతో కాలయాపన చేస్తూ, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలో భూముల విలువలను పెంచేందుకు ప్రయత్నించడం అల్పబుద్ధి కాక మరేమిటి? ఇటువంటి అనాలోచిత చర్యలు ప్రజాధనాన్ని వృథా చేయడమే కాక, రాష్ట్ర భవిష్యత్తును అప్పుల ఊబిలోకి నెట్టడమే అవుతుంది.భూమి అనేది కేవలం ఒక స్థిరాస్తి కాదు, అది తరతరాల రైతు జీవన విధానం, సంస్కృతి, జీవనాధారం. "రైతు కన్నీరు పెట్టిన నేల ఏనాడూ సంతోషంగా ఉండదు, అది సమాజ పురోగతికి బాటలు వేయలేదు" అనేది పెద్దల మాట. అమరావతి పరిధిలో సాగిన భూసేకరణ ప్రక్రియ తీవ్రమైన లోపాలతో, బలవంతపు ల్యాండ్ పూలింగ్ విధానాలతో సాగింది. మూడు పంటలు పండే పచ్చని మాగాణి భూములను, బహుళ పంటల సాగుకు అనుకూలమైన కృష్ణా డెల్టా భూములను వ్యవసాయానికి దూరం చేయడం ప్రకృతికి, పర్యావరణానికి చేసిన ద్రోహం. దేశానికి అన్నం పెట్టే ఇటువంటి సారవంతమైన భూములను కాంక్రీట్ అడవులుగా మార్చడం వల్ల ఎంతోమంది రైతులు, వ్యవసాయ కూలీలు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానం ఎప్పుడూ రైతాంగ శ్రేయస్సుకు, పర్యావరణ రక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తుంది. బలవంతంగా భూములు లాక్కోవడానికి బదులు, విజయవాడ, గుంటూరులలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను, మౌలిక వసతులను వాడుకుంటూ, వ్యవసాయ రంగాన్ని రక్షించడమే నిజమైన సమగ్ర ప్రణాళిక. విజయవాడ-గుంటూరు నగరాల పరిధిని మచిలీపట్నం తీరప్రాంతంతో అనుసంధానించడం ద్వారా అపారమైన పారిశ్రామిక, వాణిజ్య ప్రగతి సాధించవచ్చనేది మాజీ ముఖ్యమంత్రి వ్యూహంలోని అసలైన మాస్టర్ ప్లాన్.మచిలీపట్నం కేవలం ఒక సాధారణ పట్టణం కాదు, అది శతాబ్దాల చరిత్ర గల అంతర్జాతీయ ఓడరేవు కేంద్రం. డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ కాలంలోనే ప్రపంచ దేశాలతో వ్యాపార సంబంధాలు నెరిపిన ఘనత బందరు సొంతం. అటువంటి చారిత్రక తీరప్రాంతాన్ని, సముద్ర రవాణా మార్గాన్ని వదిలేసి, సముద్రానికి దూరంగా, కేవలం కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసం రాజధానిని ఒకే చోట నిర్బంధించడం చారిత్రక తప్పిదం. మచిలీపట్నం పోర్టును ఆధునీకరించి, విజయవాడ-గుంటూరు పారిశ్రామిక కారిడార్తో కలిపితే, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద ఆర్థిక, పారిశ్రామిక మండలిగా మారుతుంది. ఈ సముద్ర తీర రవాణా సౌకర్యాన్ని, ఉన్న మౌలిక వసతులను సమర్థవంతంగా వాడుకోవాలనే ఆలోచన వెనుక ఉన్న దీర్ఘకాలిక ప్రయోజనాలను మనం గుర్తించాలి.భవనాల నిర్మాణంలో గతంలో జరిగిన అవినీతి, అసంపూర్ణ కట్టడాలు నేటికీ సాక్ష్యాలుగా నిలిచాయి. తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీల పేరిట చదరపు అడుగుకు దేశంలో ఎక్కడా లేని విధంగా వేల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించి, ప్రజాధనాన్ని కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే వాడారనే విమర్శల్లో పూర్తి వాస్తవముంది. కనీసం ఒక వర్షానికి తట్టుకోలేని నాణ్యతా లోపాలు, లీకేజీలు బయటపడ్డాక ఆ నిర్మాణాల వెనుక ఉన్న అవినీతి ఏపాటిదో ప్రజలందరికీ అర్థమైంది. ఇటువంటి లోపభూయిష్టమైన నమూనా కంటే, విజయవాడ-గుంటూరులలో అందుబాటులో ఉన్న శాశ్వత కట్టడాలను కార్యాలయాలుగా మలిచి, మిగిలిన నిధులను మచిలీపట్నం పోర్టు అభివృద్ధికి, గన్నవరం విమానాశ్రయ విస్తరణకు, ఉన్న రైల్వే జంక్షన్ల ఆధునీకరణకు మళ్లించడం ఎంతో లాభదాయకం. ఒక ప్రభుత్వ విజయం కట్టే తాత్కాలిక బిల్డింగుల సంఖ్యను బట్టి కాదు, అది ప్రజల ఆర్థిక స్థితిగతులను ఎంతవరకు మెరుగుపరిచిందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది.మహాత్మా గాంధీ కలలుగన్న 'గ్రామ స్వరాజ్యం' సమ్మిళిత అభివృద్ధిని సాధించాలంటే, అధికార కేంద్రీకరణ సంస్కృతికి స్వస్తి పలకాలి. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల త్రిభుజాకార అభివృద్ధి ద్వారా అటు పరిపాలన, ఇటు పారిశ్రామికీకరణ, మరోవైపు అంతర్జాతీయ వాణిజ్యం ఒకేసారి సాధ్యమవుతాయి. ఈ సహజసిద్ధమైన కారిడార్ను పటిష్టం చేయడమే వైఎస్ జగన్ తీసుకుంటున్న ప్రతి అడుగులోని అంతరార్థం. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనది కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించే వ్యూహాత్మక అడుగు.రైతుల హక్కులను కాపాడుతూ, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ, పర్యావరణాన్ని రక్షించేలా సాగే నమూనా మాత్రమే స్థిరమైన భవిష్యత్తును ఇవ్వగలదు. అమరావతిలోని లోపాలను సరిదిద్దుకుంటూ, విజయవాడ, గుంటూరు నగరాల అనుభవజ్ఞతను, రైల్వే జంక్షన్ల రవాణా అనుకూలతలను, మచిలీపట్నం తీరప్రాంత వ్యూహాత్మక ప్రాధాన్యతను ఏకం చేస్తూ సాగుతున్న ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. ప్రజా శ్రేయస్సే పరమావధిగా, క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా సాగుతున్న ఈ వ్యూహం దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయాన్ని చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.-కంచర్ల యాదగిరిరెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ -
రైతులను తాళ్లతో కట్టేస్తారా? చంద్రబాబుకు చెప్పేది ఒక్కటే.. జగన్ ఆగ్రహం
-
మత్స్యకారులను పరామర్శించడానికి జగన్ వస్తున్నారు
-
రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఎవరిచ్చారు?
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు సర్కార్ సాగించిన దౌర్జన్యకాండపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా.. వారి అభిప్రాయాలు, అభ్యంతరాలను కనీసం పట్టించుకోక పోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసులను మోహరించి.. బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి.. సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమంటూ మండిపడ్డారు.రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి.. భయభ్రాంతులకు గురిచేసి.. భూములను స్వా«దీనం చేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వా«దీనం చేసుకోవడం సరికాదని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వారికి వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నారు. అయినా వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాల నుంచి బలవంతంగా ఈడ్చి పారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వా«దీనం చేసుకోవడం దారుణం. ⇒ బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు ‘మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?’ అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?⇒ రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచి్చన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వా«దీనం చేసుకోవడం న్యాయమేనా? ⇒ ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములివి. మార్కెట్లో భారీ ధరలు పలికే ఈ భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబి్ధదారులు రైతులా? లేక చంద్రబాబు అస్మదీయులా?⇒ రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బ తీస్తామంటే సహించేది లేదు. రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చి పారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ⇒ ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు గారూ.. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. -
పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు కన్నుమూత
నిడదవోలు/సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ కమిటీ మాజీ సభ్యుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు, కాపునాడు మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు (90) వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన గెడ్డం సీతన్న, బుల్లమ్మ దంపతులకు ఆయన ఆరో సంతానం. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి 1962లో స్టూడెంట్ నేతగా ఎన్నికయ్యారు. ఆగ్రాలో ఎంఏ పూర్తి చేసి, ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించారు. 1968లో వ్యాపార రంగంలోకి ప్రవేశించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూనే సమాజ సేవ వైపు దృష్టి సారించారు. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1982లో అప్పుడే ఏర్పాటైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సంఘానికి జాయింట్ కన్వీనర్గా పని చేశారు. అనంతరం ఈ సంఘం కాపునాడుగా రూపాంతరం చెందింది. 1988లో వంగవీటి మోహన రంగాను ముఖ్య అతిథిగా పిలిపించి భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించారు. 1991లో కాపునాడు అధ్యక్షుడిగా విశేష సేవలందించారు. 1994లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొవ్వూరు నుంచి కాంగ్రెస్ అభ్య ర్థిగా ఓటమి ఎదురైనా, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనంలో సత్తా చాటారు. 2000లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, 2003లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డితో మంచి సాన్నిహిత్యం కలిగిన నేతగా గుర్తింపు పొందారు. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2009లో కొత్తగా ఏర్పడిన నిడదవోలు నియోజకవర్గం నుంచి ఆయన పెద్ద కుమారుడు శ్రీనివాస్ నాయుడును కాంగ్రెస్ అభ్య ర్థిగా బరిలోకి దించారు. 2014లో వైఎస్సార్సీపీలో చేరారు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో తన కుమారుడు జి.శ్రీనివాస్ నాయుడును నిడదవోలు (ప్రస్తుతం ఈ నియోజకవర్గం సమన్వయకర్త) వైఎస్సార్సీపీ అభ్య ర్థిగా నిలిపి గెలిపించుకున్నారు. కాగా, జీఎస్ రావుకు భార్య వెంకటలక్ష్మి, మరో కుమారుడు జి.సీతారామ్, కుమార్తె డాక్టర్ పద్మ ఉన్నారు.జీఎస్ రావు సేవలు చిరస్మరణీయంమాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం కుమారుడు జి.శ్రీనివాస్ నాయుడికి ఫోన్లో పరామర్శ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీఎస్.రావు మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కుమారుడు, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్నాయుడుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జీఎస్.రావు కన్ను మూయడం బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో జీఎస్.రావు చేసిన సేవలు, రాజకీయ రంగంలో ఆయనకున్న విశిష్ట అనుభవం చిరస్మరణీయమని అన్నారు. జీఎస్.రావు మరణం రాజకీయ రంగానికి తీరని లోటు అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రా ర్థిస్తున్నానన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
లెజెండరీ గాయని జానకి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్. జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైఎస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించిన వైఎస్ జగన్.. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కాగా, ప్రముఖ దిగ్గజ నేపథ్య గాయని ఎస్.జానకి మైసూరులోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో మృతి చెందారు. “దక్షిణ భారత కోకిలగా ఆమె ప్రత్యేక గుర్తించారు. 1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్. జానకి.. ఆరు దశాబ్దాలకు పైగా సినీ గాన సేవ చేశారు. 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన గానకోకిల.. మధురమైన గాత్రంతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్నారు. గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ, మెలోడీ, భక్తి గీతాల వరకు విశేష ప్రతిభ కనపరిచారు. భారతీయ సినీ సంగీత రంగానికి ఎస్. జానకి సేవలు చిరస్మరణీయం. ఎస్. జానకి మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. గానకోకిల ఎస్. జానకికి సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పించారు. -
రాజధాని రైతులపై రాక్షసకాండను ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని రైతులపై రాక్షసకాండను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వ నిర్వాకాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.‘‘రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?..ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? చంద్రబాబుగారి అస్మదీయులా?’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. చంద్రబాబూ.. రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో… pic.twitter.com/rA7pC3hXRS— YS Jagan Mohan Reddy (@ysjagan) July 11, 2026 -
జగన్ మార్క్ స్కెచ్.. కూటమి కోటలు బద్దలు
-
మాజీ MLA GS రావు మృతిపై జగన్ సంతాపం..
-
వియత్నాంలో బోటు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: వియత్నాంలో బోటు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు తెలుగువారు దుర్మరణం చెందటంపై సంతాపం తెలిపారు. హాలాంగ్ బే వద్ద జరిగిన బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పర్యాటకులు దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కడప, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన పలువురు మొబైల్ డిస్ట్రిబ్యూటర్లు ఈ ప్రమాదంలో మృతి చెందడం ఎంతో కలిచి వేసింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. వియత్నాంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు అవసరమైన సహాయ సహకారాలు అందేలా చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాలి. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవాలి. అక్కడి వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
మాజీ ఎమ్మెల్యే జీఎస్రావు మృతిపై వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) మాజీ అధ్యక్షుడు, కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు జి.శ్రీనివాస్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లో చికిత్స పొందుతున్న జీఎస్.రావు కన్నుమూయడం బాధాకరమని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజా జీవితంలో జీఎస్ రావు చేసిన సేవలు, రాజకీయ రంగంలో ఆయనకున్న విశిష్ట అనుభవం చిరస్మరణీయమని అని ఆయన అన్నారు. జీఎస్రావు మరణం రాజకీయ రంగానికి తీరని లోటన్నారు. జీఎస్.రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
విశాఖకు జగన్.. మత్స్య కారులకు పరామర్శ
-
అమరావతితో ఆర్థిక భారమే! MAVIGUN మాస్టర్ విజన్
-
జై జగన్.. కేకలతో దద్దరిల్లిన సభ.. మాస్ స్పీచ్
-
రైతుల కోసం అవసరమైతే రైలులోనైనా వస్తారు జగన్: పేర్ని నాని
సాక్షి, ఏలూరు: ఆక్వా రైతుల సమస్యలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న భీమవరం పర్యటనను.. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. హెలిప్యాడ్కు అనుమతులు నిరాకరించినా.. అవసరమైతే జగన్ రైలులో అయినా వచ్చి రైతులను కలుస్తారని పేర్కొన్నారు.శనివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని బువ్వనపల్లిలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆక్వా రైతుల ఆత్మీయ సమావేశంలో పేర్ని నాని పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఆక్వా మేత ధరలు భారీగా పెరిగినా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మేత కంపెనీలు, పాలకులు కుమ్మక్కై రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. దీంతో ఉత్పత్తి వ్యయం పెరిగి ఆక్వా రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని అన్నారు.రైతుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రజలే తగిన సమయంలో గుణపాఠం చెబుతారని పేర్ని నాని హెచ్చరించారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో ఆక్వా రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జూలై 15న వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం పర్యటన ఖాయమైందని ఆయన వెల్లడించారు. పర్యటనను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించవని స్పష్టం చేశారు. హెలిప్యాడ్కు అనుమతులు ఇవ్వకపోయినా, ఇతర ఆంక్షలు విధించినా జగన్ వెనక్కి తగ్గరని, అవసరమైతే రైలులో ప్రయాణించి అయినా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారని పేర్ని నాని పేర్కొన్నారు.జగన్ పర్యటనతో ఆక్వా రైతుల సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారనున్నాయని, ప్రభుత్వం రైతుల డిమాండ్లపై స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైఎస్సార్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ఇది కదా జగన్ బ్రాండ్.. రేవంత్ స్వాగత ఫ్లెక్సీలో జగన్ ఫోటో..
-
రాజ్నాథ్ సింగ్కు వైఎస్ జగన్ బర్త్డే విషెస్
సాక్షి, తాడేపల్లి: నేడు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్కు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా వైఎస్ జగన్.. రాజ్నాథ్ సింగ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు. ఈ మేరకు పోస్టు చేశారు. Wishing Hon’ble Union Minister Shri @rajnathsingh Ji a very happy birthday. Wishing him a long, healthy, and happy life. pic.twitter.com/yo3jpBSxsj— YS Jagan Mohan Reddy (@ysjagan) July 10, 2026 -
భూములపై బుకాయింపు
సాక్షి, అమరావతి: తాను చేసిన తప్పులు, అరాచకాలను ఇతరులకు ఆపాదించి బురద చల్లడంలో ఆరితేరిన సీఎం చంద్రబాబు భూముల విషయంలోనూ అదే పంథా అనుసరిస్తున్నారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ పేరుతో నెలకో జిల్లాలో బహిరంగ సభలు పెడుతూ తన అబద్ధాల ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుండడంపై సర్వత్రా తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. వాటి పంపిణీయే ఒక ప్రహసనమైతే దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో రీసర్వే చేసి ఇచ్చిన పాసు పుస్తకాలపై అభూత కల్పనలతో విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు వాటిని రద్దు చేశారు. ఇప్పుడు కొత్తగా తప్పుల తడకలతో పాస్ పుస్తకాలు ఇస్తూ అందుకోసం ప్రతి నెలా సభలు పెడుతున్నారు. తానేదో భూముల సమస్యలు పరిష్కరిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన సభలోనూ ఇదే ప్రయత్నం చేశారు. నిజానికి ఆంగ్లేయుల తరువాత దేశ చరిత్రలో తొలిసారిగా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల రీ సర్వేను ప్రారంభించి విజయవంతంగా నిర్వహించిందని, విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టిందని పరిశీలకులు, రైతులు గుర్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇందుకోసం శాటిలైట్, డ్రోన్, జీపీఎస్, కోర్ స్టేషన్లు, రోవర్లు లాంటి సాంకేతికతను వినియోగించింది. సర్వే కోసం ఏకంగా 10,185 మంది గ్రామ సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. గ్రామ సచివాలయాల ద్వారా ఈ మహా యజ్ఞాన్ని చేపట్టారు. ఐదేళ్లలో 6,800 గ్రామాల్లో రీ సర్వే అన్ని దశలు పూర్తవగా మొత్తం 17 వేల గ్రామాల్లో డ్రోన్ సర్వే కూడా పూర్తయింది. భూముల సర్వే కోసం ఏ రాష్ట్రంలోని లేని విధంగా నాడు ఏపీలో డ్రోన్లు ఉపయోగించారు. సర్వే చేశాక ఉచితంగా 4 కోట్ల హద్దు రాళ్లు కూడా పాతించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పట్టాదార్ పుస్తకాలు ఇచ్చారు. ఆ పుస్తకాలపై క్యూఆర్ కోడ్, భూమి హద్దులు తెలిపే జియో కో–ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) ముద్రించారు. జియో హద్దులతో ఇకపై ఎవరూ భూమి హద్దులు మార్చలేని విధంగా చర్యలు తీసుకున్నారు. రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సర్వేపై చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అయితే చంద్రబాబు నోటికి తాళం వేస్తూ నాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నివేదిక భూముల రీ సర్వేలో ఏపీ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని ధ్రువీకరించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పనితీరుకు ప్రోత్సాహకంగా కేంద్రం రూ.500 కోట్లు ఇన్సెంటివ్ రాష్ట్రానికి ఇవ్వగా అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఆ మొత్తాన్ని తీసుకుంది. అంటే మాజీ సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమానికి బాబు సర్కారు ప్రోత్సాహకాలు అందుకుంది. 22 ఏ జాబితాలో 20 లక్షల ఎకరాలు ఈ రెండేళ్లలో టీడీపీ కూటమి ప్రభుత్వం 20 లక్షల ఎకరాలకు పైగా భూములను 22 ఏ నిషేధిత జాబితాలో పెట్టింది. 13.59 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూములు, 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములు, 1.39 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములు, 40 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములు, 50 వేల ఎకరాల అనా«దీనం భూములను అకారణంగా నిషేధిత భూములుగా ప్రకటించింది. ఇవి కాకుండా పలు జిల్లాల్లో గతంలో 22 ఏ జాబితా నుంచి విముక్తి పొందిన లక్షల ఎకరాల భూములను టీడీపీ ఎమ్మెల్యేలు 22 ఏ జాబితాలో పెట్టించారు. పట్టా భూములు, ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న ఆస్తులను సైతం ఈ జాబితాలోకి నెట్టేశారు. 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం 27 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ పరిధిలోకి తెచ్చి ఎన్నికల సమయానికి 13.59 లక్షల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమాల పేరుతో వాటిని మళ్లీ 22 ఏ జాబితాలో పెట్టేసింది. రెండేళ్లయినా ఆరోపణలు నిరూపించలేకపోయింది. ఆ భూములపై రైతులకు హక్కులు పునరుద్ధరించలేదు. ఒకవైపు లక్షలాది ఎకరాలను 22ఏ జాబితాలో పెట్టి పైకి మాత్రం ఆ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చంద్రబాబు మభ్యపెడుతున్నారు. విలేజ్ సర్వీస్ ఈనాం భూములపై అడ్డగోలుతనం 1.39 లక్షల ఎకరాల విలేజ్ సర్వీస్ ఈనాం భూములను వైఎస్ జగన్ ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి తొలగిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని 22ఏ జాబితాలో పెట్టారు. రెండేళ్ల తర్వాత అందులో తప్పులు లేవని తేలడంతో తాజాగా వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఆదేశాలు ఇచ్చారు. కానీ సభల్లో మాత్రం వైఎస్సార్సీపీ విలేజ్ సర్వీస్ ఈనాం భూములను 22ఏ జాబితాలో పెట్టినట్లు అబద్ధాలు వల్లె వేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ఆటో మ్యుటేషన్, పట్టాదార్ పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్లను తానే ముద్రించినట్లు కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పేస్తున్నారు.గూటుపల్లి భూముల పేరుతో తహశీల్దార్ కార్యాలయంలో షో తాజాగా నంద్యాల జిల్లాకు వెళ్లిన చంద్రబాబు బనగానపల్లె సభలో అబద్ధాల నైపుణ్య ప్రదర్శన తర్వాత అక్కడి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి పబ్లిసిటీ స్టంట్ నిర్వహించారు. బేతంచర్ల మండలం గూటుపల్లిలో సర్వే నెంబర్ 215లో ఉన్న 2,669 ఎకరాలను గత ప్రభుత్వం 22ఏ జాబితాలో పెట్టిందని, ఇప్పుడు వాటిని తాను తొలగించినట్లు అడ్డగోలుగా అబద్ధాన్ని చెప్పారు. వాస్తవానికి ఆ భూముల్ని 1963లో వక్ఫ్ భూములుగా ప్రకటించి 22ఏ జాబితాలో పెట్టారు. ఈ విషయాన్ని మైనారిటీ సంక్షేమ శాఖ బుధవారం జారీ చేసిన జీఓ ఆర్టీ నెంబర్ 77లో స్పష్టంగా పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం 2023లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దాన్ని 22ఏ జాబితాలో పెట్టినట్లు బుకాయించడం గమనార్హం. బేతంచర్ల మండలంలోని భూములను తొలగించడానికి బనగానపల్లె మండల తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లడాన్ని బట్టి చంద్రబాబు చేసింది పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. వివిధ దశల ప్రతిపాదనలు, వెరిఫికేషన్లు చేశాక చివరిగా ప్రొసీడింగ్స్ కలెక్టర్ ఇస్తే జిల్లా రిజిస్ట్రార్ అమలు చేస్తారు. కానీ చంద్రబాబు మాత్రం పబ్లిసిటీ కోసం బేతంచర్ల భూములను బనగానపల్లె మండలంలో పరిష్కరించినట్లు బిల్డప్లు ఇచ్చుకోవడం విశేషం. -
మత్స్యకారుడు చిన్నాకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి, అక్కిరెడ్డిపాలెం: చేపల వేటకు వెళ్లి సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో త్రుటిలో ప్రాణాలతో బయటపడిన మత్స్యకారుడు, బోటు డ్రైవర్ కారి చిన్నాను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో గురువారం పరామర్శించారు. విశాఖ షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాను ఓదార్చి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ రాత్రి సముద్రంలో ఏం జరిగింది? ప్రమాదం తర్వాత బయటపడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అంత దూరం ఎలా ఈదారు? ఎవరు రక్షించారు? అనే వివరాలను చిన్నా ఆయనకు వివరించారు.అవసరమైతే స్వయంగా విశాఖకు వస్తా..మొత్తం అప్పు చేసి పడవ సమకూర్చుకున్నామని, ఇప్పుడు అంతా నష్టపోయి వీధిన పడ్డామని చిన్నా ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి సాయం అందలేదని, దాదాపు రూ.50 లక్షల విలువైన పడవ సముద్రంలో మునిగిపోయిందని వాపోయాడు. బాధితుడికి ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ అవసరమైతే తాను స్వయంగా విశాఖకు వస్తానని భరోసా ఇచ్చారు. పడవ కోల్పోయిన మత్స్యకారుడికి ప్రభుత్వం పరిహారం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. బోటు మునిగిపోతే ఉపాధి కోల్పోతారని, బాధితుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ విశాఖ, విజయనగరం జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, సమన్వయకర్తలు దేవాన్రెడ్డి, మొల్లి అప్పారావు, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్ తదితరులు ఆస్పత్రిలో బాధితుడు చిన్నాను పరామర్శించారు. బాధితుడిని పట్టించుకోని ప్రభుత్వంఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.. ప్రాణాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాను మాత్రం పూర్తిగా విస్మరించింది. కనీసం ఏ అధికారీ వచ్చి పలకరించలేదు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడటం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఆరుగురు గల్లంతు కాగా చిన్నా ఈదుకుంటూ వెళ్లి చైనా నౌక సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సముద్రంలో పడవ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందినా సకాలంలో స్పందించడంలో తీవ్ర అలక్ష్యం చూపిందని బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. -
సౌదీలో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
రియాద్: మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని సౌదీ అరేబియా సెంట్రల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో రియాద్ నగరంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, ప్రవాసాంధ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా సెంట్రల్ కమిటీ కన్వీనర్ రబ్బానీ సయ్యద్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయని కొనియాడారు. వైఎస్సార్సీపీ ఘన విజయం కోసం కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా కలిసికట్టుగా పని చేయాలో దిశా నిర్దేశం చేశారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘మావిగన్’ కార్యక్రమం గురించి రబ్బానీ సయ్యద్ ఈ వేదికపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మావిగన్’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ రియాద్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన కరతాళ ధ్వనులు, ‘జై మావిగన్’ నినాదాలతో ఆడిటోరియం మార్మోగింది.ఈ వేడుకల్లో పార్టీ ముఖ్య నాయకులు సిరుమల సుబ్బారెడ్డి, పట్లోళ్ల శ్రీకాంత్ రెడ్డి, కరీముల్లా బాషా షేక్, వెలంపాటి వేణుగోపాల్ రెడ్డి, గంగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గొల్ల విజయ్, గానుగపెంట శ్రీకాంత్, సుభాన్ ఖాన్ పఠాన్, నాగినేని ఉదయ్ కృష్ణ చౌదరి, షేక్ షాదక్ వలి, కంది శశిధర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని ఈ జయంతి వేడుకలను విజయవంతం చేశారు. -
ఈ నెల 15న భీమవరంలో జగన్ పర్యటన
-
మృత్యుంజయుడు కారె చిన్నాను ఫోన్ లో పరామర్శించిన జగన్
-
చిన్నాను ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి,విశాఖ: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ కారె చిన్నాను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో మాట్లాడిన వైఎస్ జగన్, జరిగిన ప్రమాదంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆ రాత్రి సముద్రంలో ఏం జరిగింది? ప్రమాదం తర్వాత తాము ఎలా బయటపడేందుకు ప్రయత్నించారు? తానొక్కడే అంత దూరం ఎలా ఈదుకుంటూ వచ్చారు? చివరకు తనను ఎవరు రక్షించారు? వంటి వివరాలను మత్స్యకారుడు చిన్నా వైఎస్ జగన్కు వివరించారు.చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడిన ఘటనలో ఆరుగురు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో చిన్నా ఒక్కరే ఈదుకుంటూ వచ్చి ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ప్రమాదంపై సమాచారం అందినప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం జరిగిందని మత్స్యకార కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల స్పందనపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మొత్తం అప్పు చేసి పడవను కొనుగోలు చేశామని, ప్రస్తుతం జీవనాధారం కోల్పోయామని చిన్నా వైఎస్ జగన్కు వివరించారు. తమను ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్, చిన్నాకు ధైర్యం చెప్పారు. అవసరమైతే స్వయంగా విశాఖకు వచ్చి పరామర్శిస్తానని తెలిపారు. పడవ కోల్పోతే మత్స్యకారుల ఉపాధి దెబ్బతింటుందని వైఎస్ జగన్ పేర్కొంటూ, ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు.కాగా, ఈ ప్రమాదంలో మత్స్యకారులు మరణించారని ప్రకటించిన ప్రభుత్వం ఆ ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించింది. కానీ,ఆ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాను మాత్రం పట్టించుకోలేదు. కనీసం ఏ అధికారి కూడా వచ్చి పలకరించలేదు. తనను ఏ విధంగా కూడా ఆదుకోకపోగా, దాదాపు రూ.50 లక్షల విలువైన పడవ సముద్రంలో మునిగిపోయిందని, అందుకని ఎలాగైనా ఆదుకోవాలని చిన్నా వైఎస్ జగన్ను వేడుకున్నారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్, ఈ విషయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అవసరం అయితే తాను కూడా స్వయంగా విశాఖకు వస్తానని వైఎస్ జగన్, మత్స్యకారుడు చిన్నాకు ధైర్యం చెప్పారు. -
రేయ్,గి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాట తీస్తా.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
టీచర్ల ‘టెట్’ ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదు?... ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
వైఎస్సార్కు ఘన నివాళి
సాక్షి, కడప: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ సమాధి వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంక్షేమ ప్రదాతగా, అభివృద్ధి విధాతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను వైఎస్ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు స్మరించుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్దకు మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్న వెంటనే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ అమర్ రహే అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు.. ఆయనతో కరచాలనానికి పోటీ పడుతున్న దృశ్యం ప్రార్థనల్లో వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్, తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, అత్తమ్మ డాక్టర్ సుగుణమ్మ, వైఎస్ సోదరుడు వైఎస్ సు«దీకర్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పులివెందుల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వీరితోపాటు రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామి రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథరెడ్డి, పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, బద్వేలు, ఆలూరు ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, విరూపాక్షి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్ బాషా, మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రెడ్డెప్పగారి రమేష్కుమార్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్ రెడ్డి, కడప, కర్నూలు మాజీ మేయర్లు కె.సురేష్బాబు, బీవై రామయ్య, కమలాపురం, కదిరి పార్టీ ఇన్ఛార్జిలు నరేన్ రామాంజులరెడ్డి, మగ్బూల్ బాషా, పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజోలి వీరారెడ్డి, సాయినాథ్ శర్మ, గోసుల శివభరత్ రెడ్డి, భరత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగు నీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, మహానేతగా వైఎస్సార్ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని కొనియాడారు. మనసున్న, మరపురాని మహానేత వైఎస్సార్సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లి, పరిపాలనలో అందరూ సమానమేనని చాటుతూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని, పాలకుడంటే ఇలా ఉండాలని చాటి చెప్పిన మరపురాని మనసున్న మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజలు, అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులు, వివిధ పార్టీల నేతలు కొనియాడారు. వైఎస్సార్ 77వ జయంతి వేడుకలను బుధవారం దేశవిదేశాల్లో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పండుగలా ఘనంగా నిర్వహించి, నివాళులర్పించారు. గ్రామ గ్రామాన, వాడవాడలా, నగరాల్లోనూ కేక్లు కట్ చేసి పేదలకు వస్త్ర, అన్నదానాలు చేశారు. రక్తదాన శిబిరాలు నిర్వహించి మహానేతపై అభిమానాన్ని చాటుకున్నారు. ‘డాక్టర్ వైఎస్సార్ అమర్ రహే, జోహార్ వైఎస్సార్, వైఎస్సార్ ఆశయ సాధనే వైఎస్సార్సీపీ ధ్యేయం’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. మహానేత డాక్టర్ వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక పథకాలను ప్రజలు, అభిమానులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రగతిలో వైఎస్సార్కు ముందు.. ఆ తర్వాత అనే చరిత్రాత్మక మార్పు వచ్చిందని, నాడు కోట్లాది మందికి వైఎస్సార్ పెద్ద కొడుకులా అండగా నిలిచారని, అందుకే జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని నేతలు కొనియాడారు. రాజన్న పాదయాత్ర దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేసేంత గొప్ప స్ఫూర్తినిచ్చిందన్నారు. కాంగ్రెస్ను జాతీయ స్థాయి లో రెండు సార్లు నిలబెట్టింది వైఎస్సార్ అని, ఆయ న బతికుంటే ప్రధాని స్థాయికి ఎదిగేవారన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పరితపించి సుప రిపాలన అందించిన వైఎస్సార్ను ప్రజలు మరవలేరన్నారు. ప్రజా సమస్యలు వినడం, వాటికి పరిష్కా రం చూపటం వైఎస్సార్ నైజమని ప్రశంసించారు. ఏలూరులో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులు ఇదీ వైఎస్సార్.. ‘వైఎస్సార్ వ్యక్తిత్వం మహోన్నతమైనది. ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలు గతంలో ఎవరూ ఊహించనివి. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడానికి అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకోకపోయినా.. అమలు చేశారు. నాడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకున్న ఒక చిన్నారి పెద్దయ్యాక సివిల్ సర్వీసెస్కు ఎంపికై వైఎస్ జగన్ను కలవడం వైఎస్సార్ విజన్కి నిదర్శనం.’అని వైఎస్సార్సీపీ నేతలు కొనియాడారు. ప్రకాశం జిల్లా గంగదొనకొండలో వైఎస్సార్ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మహిళలు పేదల జీవితాల్లో వెలుగు నింపారుగచ్చిబౌలి (హైదరాబాద్): తామంతా బతికి ఉన్నామంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవేనని పలువురు వ్యాఖ్యానించారు. ఆయన ఎంతో మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఎంతో మంది వైఎస్సార్ చేసిన మేలును గుర్తు చేసుకున్నారు. బుధవారం మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్లో వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని వైఎస్సార్ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఆతీ్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారుడు గోరటి వెంకన్న మాట్లాడుతూ వైఎస్సార్ మరణ వార్త విని తమ ఇంట్లో పిల్లలు సహా ఎవరూ అన్నం ముట్టలేదన్నారు. వైఎస్సార్తో మరిచిపోలేని అనుబంధం ఉందని చెప్పారు. ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..’ అనే పాట ఇచ్చినందుకు వైఎస్సార్ తనను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేస్తున్న వర ప్రసాద్రెడ్డి. చిత్రంలో వై.ఈశ్వర ప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ తదితరులు ఎంపీగా అవకాశం ఇస్తానంటే వద్దని చెప్పగా, కళారత్న అవార్డు ఇచ్చి గౌరవించారన్నారు. శాంతా బయోటెక్ చైర్మన్, పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ‘50 ఏళ్లకు ఓ పుణ్య పురుషుడు రావాలి. వైఎస్సార్ మహారుషి లాంటి మనిíÙ, మహా యోధుడు. వైఎస్సార్ లాంటి వ్యక్తి దేశానికి అవసరం..’ అని అన్నారు. వైఎస్సార్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి భాస్కరశర్మ మాట్లాడుతూ.. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్తో 17 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. సమస్యలకు వైఎస్సార్ అక్కడికక్కడే పరిష్కారం చూపించేవారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చక్రపాణిరెడ్డి, హఫీజ్ఖాన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకర్, కారుమూరి వెంకట్రెడ్డి, శ్యామలారెడ్డి, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి మునిరెడ్డి, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సభ్యులు ఏపీ రెడ్డి, మల్లు సురేందర్రెడ్డి పాల్గొన్నారు.పేదల పెన్నిధి వైఎస్కు ఘన నివాళిసాక్షి, అమరావతి: తెలుగు ప్రజల గుండెల్లో సంక్షేమ రథసారథిగా, నిరుపేదల పెన్నిధిగా చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమాలు తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు, శాసనమండలి సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరై కార్యాలయ ప్రాంగణంలోని వైఎస్సార్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసిన అనంతరం, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పార్టీ నేతలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు బాబు పాలనలో కారు చీకట్లోకి రాష్ట్రం ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్ వ్యక్తిత్వం, సమస్యల పట్ల ఆయన స్పందించే విధానం చిరస్మరణీయమని కొనియాడారు. వైఎస్సార్, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినా చంద్రబాబుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయని గుర్తు చేశారు. అయినా కేవలం ఐదేళ్లలోనే వైఎస్సార్ చరిత్ర సృష్టిస్తే.. ఎన్ని అవకాశాలొచ్చినా ఏమీ చేయకుండా చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారన్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కారుచీకట్లోకి వెళ్లిందని మండిపడ్డారు. 2024లో అడ్డగోలు పొత్తులతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గతం కంటే పదింతలు అబద్ధాలు చెప్పి ఓట్లేసిన ప్రజలను మోసం చేసి పాతాళంలోకి నెట్టేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాకుండానే ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోపిడీ భయంకరంగా సాగుతోందని, ఎవరేం మాట్లాడినా, ఏం రాసినా అక్రమ అరెస్టులు, కేసులు పెడుతూ కారుచీకటి పరిస్ధితులు తెచ్చారని మండిపడ్డారు. ప్రస్తుత పాలకుల వల్ల ప్రజలకు వెలుగు విలువ తెలిసొచ్చిందని, రానున్న రోజుల్లో వైఎస్సార్ స్ఫూర్తితో వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్సార్సీపీ ప్రజా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే వైఎస్సార్సీపీ ధ్యేయమని సజ్జల చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, పార్టీ నేతలు, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. -
పది నెలల తర్వాత ‘స్పెషల్ టెట్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యా శాఖకు బుధవారం మెమో జారీ చేసింది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలని, పార్లమెంటులో చట్టం చేయించాలని కోరుతున్నా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. మంగళవారం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. టెట్ మినహాయింపునకు కృషి చేస్తానని, పార్లమెంటులో చట్ట సవరణ కోసం పోరాడతామని, ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దని వారికి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేగాక, ఇన్ సర్వీస్ టెట్పై ఉపాధ్యాయుల ఆందోళనను ఎందుకు పట్టించుకోవడంలేదని బుధవారం సీఎం చంద్రబాబునాయుడిని ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేసిన 2 గంటల్లోనే ప్రభుత్వం ప్రత్యేక టెట్కు ఉత్తర్వులివ్వడం గమనార్హం. టీచర్ల ఘోషను పట్టించుకోని సర్కారు గత ఏడాది సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో 2011 కంటే ముందు డీఎస్సీ ద్వారా ఎంపికైన లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 ఏళ్లకు పైగా బోధన అనుభవంతో పాటు నాటి నిబంధనల ప్రకారం డీఎస్సీ ద్వారా ఉద్యోగాల్లోకి వచ్చిన తమకు ఇప్పుడు టెట్ ఏమిటని ఉపాధ్యాయులంతా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమిలో ఉన్న కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, వీరి ఘోషను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు. ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకు ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి, రద్దుకు కృషి చేస్తామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించి, ఆ తర్వాత ముఖం చాటేశారు. ఈ 74 వేల దరఖాస్తుల సంగతేంటి? మరోపక్క, సుప్రీం కోర్టు తీర్పు, ఉపాధ్యాయుల విజ్ఞప్తులను పెడచెవిన పెట్టి చంద్రబాబు ప్రభుత్వం గతేడాది సెపె్టంబర్లో టెట్కు నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి 20 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ–2026 స్కామ్ నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం గత నెల 5న ‘ఏపీ టెట్ జూన్ – 2026’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు గడువు ఈనెల 5వ తేదీతో ముగిసింది. ఈ పరీక్ష కోసం 2,13,540 దరఖాస్తులు రాగా, వాటిలో 74,295 దరఖాస్తులు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులవి. వీరి నుంచి ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజు వసూలు చేశారు. ఇప్పుడు స్పెషల్ టెట్ నిర్వహిస్తే ఈ దరఖాస్తులను ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పడంలేదు. జీవో ఎందుకు ఇవ్వలేదు? మరోపక్క స్పెషల్ టెట్ నిర్వహించాలంటే ప్రభుత్వం జీవో విడుదల చేయాలి. ఆ తర్వాతే సిలబస్, పరీక్షా విధానం తదితర అంశాలపై పాఠశాల విద్యా శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. కానీ, ఇప్పుడు అందుకు విరుద్ధంగా స్పెషల్ టెట్కు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి ‘మెమో’ ఇవ్వడంపై ఉపాధ్యాయులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాత తేదీలతో మెమో బుధవారం విడుదల చేసిన ఈ మెమోను జూన్ 25న సిద్ధం చేసినట్లు, జూలై ఒకటో తేదీ విడుదల చేసినట్లు పాత తేదీలు ఉండటం గమనార్హం. అంతేగాక టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, పేరాబత్తుల రాజశేఖర్ స్పెషల్ టెట్పై జూన్ 1న విజ్ఞప్తి చేశారంటూ పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీల విజ్ఞప్తి మేరకే 2025 అక్టోబర్లో 28న ఇన్ సర్వీస్ టెట్పై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి, రద్దుకు కృషి చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చి, ఆ తర్వాత ముఖం చాటేశారు. -
ఉద్యోగాలు ఊస్ట్ టీచర్లకు TET నిబంధనలు
-
టెట్లో వీళ్లూ పాస్ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్ జగన్
తాడేపల్లి: టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా చంద్రబాబు పట్టించుకోకపోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్లో స్పందిస్తూ.. ‘‘20-25 ఏళ్లకు పైబడి సబ్జెక్టు టీచర్లుగా కొనసాగుతున్న వీళ్లు, ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్తో ఉన్న టెట్ పరీక్ష పాస్కావాలని, అందులోకూడా గరిష్టంగా 60శాతం మార్కులు రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా వీళ్లంతా అప్పట్లో డీఎస్సీ ఎలిజిబిలిటీ టెస్టులో ఉత్తీర్ణులు కాబట్టేకదా ఉద్యోగాలు వచ్చాయి? వారికి ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పట్లో “టెట్’’ అనే పరీక్షే లేనప్పుడు, ఇప్పుడు వీళ్లుకూడా టెట్ పరీక్షలో పాస్ కావాలని రూల్ పెట్టడం ఎంతవరకు కరెక్టు?’’ అని నిలదీశారు.టీచర్లకు మానసిక ఒత్తిడి టీచర్లందరికీ టెట్ను తప్పనిసరి చేస్తూ జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్ను తప్పనిసరి చేస్తే, ఈ చట్టం రాకముందు నుంచే టీచర్ ఉద్యోగాలు చేస్తున్నవారికి “టెట్’’ పరీక్షను ఎందుకు తప్పనిసరి చేస్తున్నారంటూ వాళ్లు చేస్తున్న వాదనలో న్యాయం ఉంది కదా? అని వైఎస్ జగన్ అన్నారు. ‘‘అప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాతే వారికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది కదా? టెట్ పరీక్ష నిబంధన కారణంగా ప్రమోషన్ల సమస్యే కాకుండా, చివరకు ఉద్యోగభద్రత లేకుండా చేస్తున్నారని, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని టీచర్లంతా వాపోతున్నారు. కానీ, చంద్రబాబు ఈ టీచర్ల ఇబ్బందుల గురించి పట్టించుకోవడంలేదు. చట్టాన్ని సవరించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలన్న ధ్యాసకూడా ఆయనకు లేకుండా పోయింది. టెట్ రాకముందు అంటే 2011కు ముందు సర్వీసులో ఉన్న టీచర్లందరికీ, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, టీచర్లకు ఉపశమనం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. వారంతా అప్పట్లో కాంపిటేటివ్ పరీక్షలు పాస్ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నది మరిచిపోకూడదు అనికూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను మరొక్కసారి’’ అని చెప్పారు. .@ncbn గారూ.. టెట్ నిబంధనలతో టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నా మీరు పట్టించుకోకపోవడం అన్యాయం. 2011 ముందు నుంచి టీచర్లుగా ఇప్పటికీ పనిచేస్తున్న వారు కూడా టెట్ పరీక్ష తప్పనిసరిగా పాస్ కావాలన్న నిబంధన పెట్టడంతో దాదాపు లక్షమందికి పైగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. 20-25 ఏళ్లకు…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2026 -
MISS YOU NANA.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. YS జగన్ ఎమోషనల్
-
జగన్ దెబ్బకు పోలీసుల్లో కదలిక.. క్రాంతి కుమార్ కేసులో కొత్త మలుపు!
-
MISS YOU NANA.. YS జగన్ ఎమోషనల్
-
మహానేతకు ఘన నివాళి (ఫొటోలు)
-
‘మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం’
సాక్షి, తాడేపల్లి: దివంగత మహా నేత డాక్టర్ వైఎస్సార్కు వైఎస్సార్సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా.. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న ఫోటోలను వైఎస్ జగన్ పోస్టు చేశారు.మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం!Miss You Nana…#77thYSRJayanthi pic.twitter.com/roquXy3Xyy— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2026దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద పూలమాలలు ఉంచి మహానేతకు అంజలి ఘటించారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆరోగ్య సేవలు, విద్యావకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు వంటి రంగాల్లో మహానేత డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు పేర్కొన్నారు. ప్రజల కోసం ఆలోచించిన నాయకుడిగా, ప్రజల హృదయాల్లో నిలిచిన మహానేతగా వైఎస్సార్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు.


