YS Jagan Mohan Reddy
-
భక్తులకు వైఎస్ జగన్ శ్రీ కన్యకాపరమేశ్వరి జయంతి శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి : శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని పేర్కొన్నారు. శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సఖ్యత, సంతోషాలు మరియు అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. pic.twitter.com/ocXww8S6f1— YS Jagan Mohan Reddy (@ysjagan) April 26, 2026 -
MAVIGUN దెబ్బకు మంత్రులు సింగపూర్ కు పరుగో పరుగు
-
విదేశీ పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అర్ధరాత్రి బెంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం యూరప్ వెళ్లారు. రెండు వారాల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. -
YS Jagan: త్వరగా కోలుకోవాలి
-
గవర్నర్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురికావడంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. గవర్నర్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త బాధ కలిగించిందని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. Deeply concerned to hear about the hospitalization of Hon’ble Governor Shri Justice S. Abdul Nazeer garu. Wishing him a speedy recovery and praying for his good health.@governorap— YS Jagan Mohan Reddy (@ysjagan) April 25, 2026కాగా, అబ్దుల్ నజీర్ కడుపు నొప్పితో బాధపడడంతో శనివారం తెల్లవారుజామున మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. అబ్దుల్ నజీర్ శుక్రవారం బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉండగా అర్ధరాత్రి 12 గంటలకు బెంగళూరు నుంచి రావాల్సిన గవర్నర్ విమానం ఆలస్యమైంది. అర్ధరాత్రి గంటలకు గవర్నర్ విజయవాడ చేరుకున్నారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు అబ్దుల్ నజీర్ కడుపులో నొప్పి బాధపడ్డారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. -
మూడో కంటికి తెలియదు.. చేతికి మట్టి అంటదు.. అదే చంద్రబాబు విజన్
-
జగన్ విజన్తోనే లోకల్ క్యాడర్ వ్యవస్థ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించే లోకల్ క్యాడర్ వ్యవస్థ గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే రూపుదిద్దుకుంది. తాజాగా కూటమి ప్రభుత్వం దీని అమలుకు గెజిట్ జారీ చేసినా ఆ ఆలోచన, ప్రణాళిక వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదే. 2022లో జిల్లాలను పునర్వ్యవస్థీకరించాక అందుకనుగుణంగా లోకల్ క్యాడర్ వ్యవస్థను రూపొందించి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. దానికి గతేడాది డిసెంబర్లో ఆమోదం లభించడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన గెజిట్ను కూటమి ప్రభుత్వం జారీ చేసింది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా 1975 నాటి పాత లోకల్ క్యాడర్ విధానమే కొనసాగింది. రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి ఉద్యోగాలను భర్తీ చేసేవారు. ఒక జిల్లాకు చెందిన అభ్యర్థి తన జోన్లోని అనేక జిల్లాల అభ్యర్థులతో పోటీ పడాల్సి వచ్చేది. స్థానికత ఉన్నప్పటికీ అది విస్తృత పరిధిలో ఉండడంతో చాలామందికి అవకాశాలు తగ్గిపోయేవి. రాష్ట్రం విడిపోయాక 2014–19లో జిల్లాలను విభజించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. 2022లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ.. కొత్త లోకల్ క్యాడర్ ఏర్పాటు ఈ పరిస్థితిని మార్చడానికి 2022లో వైఎస్ జగన్ జిల్లాలను పునర్వ్యవస్థీకరించారు. రాష్ట్రాన్ని 13 నుంచి 26 జిల్లాలుగా విభజించడం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేశారు. అదే సమయంలో ఉద్యోగాల విషయంలో స్థానికతను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి 2023లో కొత్త లోకల్ క్యాడర్ వ్యవస్థకు రూపకల్పన చేశారు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు పోస్టులను పూర్తిగా జిల్లా యూనిట్గా మార్చారు. తద్వారా ఏ జిల్లాలోని ఉద్యోగాల్లో ఆ జిల్లాకే చెందిన అభ్యర్థులకే ఎక్కువ అవకాశం లభించేలా చేశారు. ఆపై ఉన్న పోస్టులకు జోన్, మల్టీ జోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానంగా 95 శాతం పోస్టులను స్థానిక అభ్యర్థులకు రిజర్వ్ చేయడం ద్వారా ఉద్యోగాలపై స్థానికులకు బలమైన హక్కు కల్పించారు. అంతకుముందు ఉన్న విధానంలో 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే స్థానిక రిజర్వేషన్ ఉండేది. మిగిలిన పోస్టులకు జోనల్ పరిధిలో ఎక్కువ పోటీ ఉండేది. కొత్త విధానంలో 95 శాతం లోకల్ రిజర్వేషన్ పెట్టడం ద్వారా యువతకు మరింత భద్రత కల్పించారు. 2023లో కేంద్రానికి పంపిన జగన్ ప్రభుత్వం.. తాజాగా ఆమోదం ఈ విధానాన్ని రూపొందించినా దాన్ని అమలు చేయాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం. స్థానికత, లోకల్ రిజర్వేషన్ అంశాలు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డి పరిధిలోకి వచ్చే అంశాలు కావడంతో కేంద్ర హోంశాఖ పరిశీలనతో పాటు రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 2023లో లోకల్ క్యాడర్ వ్యవస్థ ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపింది. ఆ ప్రతిపాదనలను గతేడాది డిసెంబర్ 15న రాష్ట్రపతి ఆమోదిస్తూ ఆర్డర్ జారీ చేశారు. దీంతో దాన్ని అమలు చేయడానికి వీలుగా ఈ నెల 20న కూటమి ప్రభుత్వం రాష్ట్రపతి ఆర్డర్ను జీవో ఎంఎస్ నంబర్ 45 ద్వారా రాష్ట్ర గెజిట్లో ప్రచురించింది. దీంతో ఈ విధానం అధికారికంగా అమల్లోకొచి్చంది. ఈ లోకల్ క్యాడర్ వ్యవస్థకు రూపకల్పన, విధానం, స్థానిక రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం ఉండగా చేసిన నిర్ణయాలే. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నుంచి లోకల్ క్యాడర్ డిజైన్ వరకు జరిగిన ప్రతి కీలక దశ అప్పట్లోనే పూర్తయింది. అయితే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర ఆమోదం రావడంతో ఇప్పుడు గెజిట్లో ప్రచురణ జరిగింది. నిరుద్యోగ యువతకు భరోసా రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఇది భరోసానిచ్చే విషయం. తమ జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశాలు పెరిగాయి. స్థానిక పోటీ పరిమితమవడం వల్ల గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు మరింత అనుకూలంగా మారింది. మొత్తంగా చూస్తే జగన్ హయాంలోనే రూపుదిద్దుకుని ఇప్పుడు అమల్లోకి వచ్చిన లోకల్ క్యాడర్ వ్యవస్థ ఒక తరం భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్మాణాత్మక సంస్కరణ అని నిపుణులు చెబుతున్నారు. -
జగన్ జగన్ అంటూ జపం నిద్రలో తండ్రీకొడుకు కలవరింతలు..!?
-
ఏపీ తొలి మహిళా సీజేకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
కీర్తి చోరుడు బాబు.. మరో క్రెడిట్ చోరీ
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ క్రెడిట్ చోరీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను తమవిగా చెప్పుకుంటూ అభాసుపాలవుతున్నా.. రోజురోజూకూ మరింత దిగజారి కీర్తి చౌర్యానికి పాకులాడుతున్నారు. తాజాగా రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్ పెట్టుబడులు తామే తెచ్చామంటూ గొప్పలు పోతున్నారు. అయితే ఈ పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. రెన్యూ పవర్ సీఈఓ సుమంత్సిన్హా గత ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఒప్పందాలు చేసుకున్నారు. అనంతరం అప్పటి సీఎం వైఎస్ జగన్ దార్శనికతను కొనియాడారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. వైఎస్ జగన్కు ధన్యవాదాలు ‘‘పెట్టుబడులను ఆకర్షించడం, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, ఉద్యోగ అవకాశాలను సృష్టించడంపై వంటి అనుకూలమైన వ్యాపార వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడిదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తోంది. 2050 నాటికి ఆగ్నేయాసియాలో ప్రవేశించే పెట్టుబడిదారులకి ఏపీ తొలి ప్రాధాన్యంగా మారాలని, పెట్టుబడులకు ప్రాధాన్యతనిచ్చే ప్రపంచ గమ్యస్థానంగా ఎదగాలని రాష్ట్రం ఒక దార్శనికతను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కర్టెన్ రైజర్లో నిన్న జరిగిన చర్చకు సంబంధించి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు.’’ » ఇవి రెన్యూ పవర్ చైర్మన్, సీఈఓ సుమంత్ సిన్హా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్సెస్ట్మెంట్ సమ్మిట్లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం, గత ప్రభుత్వంతో ఒప్పందాల అనంతరం సామాజిక మాధ్యమం(లింక్డ్ఇన్) వేదికగా చెప్పిన మాటలు ఇవి. తండ్రీ కొడుకుల తీరు సిగ్గు..సిగ్గు వైఎస్ జగనే రెన్యూ పవర్ని తీసుకొస్తే.. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఆ సంస్థను గెంటేసిందని, తామే ఆ సంస్థ నుంచి పెట్టుబడులు తీసుకువస్తున్నామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నిస్సిగ్గుగా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. క్రెడిట్ చోరీ నాటకంలో తండ్రీకొడుకులు పోటీ పడుతున్నారు. కానీ నెటిజన్లు వాస్తవాలను బయటపెట్టి సోషల్ మీడియాలో వారిని ట్రోల్స్ చేస్తున్నారు. -
అర్చకులపై రెడ్బుక్ టెర్రర్
సాక్షి, అమరావతి : రాజకీయాలకు తావే ఉండకూడని గుళ్లను అడ్డు పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు రోజుల క్రితం టీటీడీ అనుబంధ ఒంటిమిట్ట ఆలయంలో పనిచేసే అర్చకులు వేద అశీర్వచనం చేయడంపై వివరణ కోరుతూ ప్రభుత్వ పెద్దలు టీటీడీ ద్వారా షోకాజ్ నోటీసులు ఇప్పించడం కలకలం రేపింది. కోట్లాది భక్తుల ఆరాధ్య దైవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ట్రస్టు బోర్డు చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలు వెలుగులోకి వచ్చినా చర్యలు చేపట్టకపోగా కనీసం వివరణ కూడా కోరలేదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో పలుమార్లు శ్రీవారికి పట్టు వ్రస్తాలు సమర్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులపై చర్యలు చేపట్టడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తిరుమల కేంద్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ కో ఇటీవల కాలంలో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుంటూ శ్రీ వేంకటేశ్వరస్వామి పవిత్రతను సైతం దెబ్బతీసేలా పలు సందర్భాల్లో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు కొనసాగింపుగానే అర్చకులకు నోటీసులు ఇచ్చినట్లు చర్చ సాగుతోంది. దిగజారుడు రాజకీయం ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్తగా కార్యాలయంలోకి ప్రవేశించే సమయంలో టీటీడీ సహా వివిధ ఆలయాల నుంచి వేద పండితులు వచ్చి ఆశీర్వచనం అందజేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గ, మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కూడా తమ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం ఆలయ అర్చకులను ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల రాజంపేట నియోజకవర్గంలో ఓ మండల టీడీపీ నేత అనుచరులు ఒక ఎస్సీ యువకుడిపై దాడి చేశారు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి తమ్ముడు, మండల టీడీపీ నేతలు ఒంటిమిట్ట ఆలయ అర్చకులను కర్నూలు జిల్లాలో పోలీసు ఉన్నతాధికారి ఆఫీసుకు తీసుకెళ్లి.. ఆ అధికారికి వేద ఆశీర్వచనం చేయించారు. ఇప్పుడు ఇదే అధికార పార్టీ నేతలు.. అర్చకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వేద ఆశీర్వచనం చేయడం తప్పన్నట్లు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీనిపై కనీస ఆలోచన లేకుండా టీటీడీ పెద్దలు అర్చకులకు నోటీసులతో ఇబ్బంది పెట్టడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు చేయలేదా? ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి అర్చకులు వివిధ సందర్భాల్లో వేద ఆశీర్వచనం ఇవ్వడం సాధారణం అని దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు అప్పటి టీటీడీ అ«ధికారులు వేద పండితులతో వేద ఆశీర్వచనం అందించడంతో పాటు వస్త్రం కూడా అందజేశారని గుర్తు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వల్ల ఎవరికైనా ఎలాంటి ప్రోటోకాల్ ఉండదని, అయినా అప్పుడు చంద్రబాబుకు టీటీడీ అధికారులు ఆ గౌరవం అందించడం కేవలం ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్న గుర్తింపే అని నెటిజన్లు స్పష్టం చేస్తున్నారు. -
జస్టిస్ లీసా గిల్కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఆరోగ్యశ్రీతో బాబుకు నో క్రెడిట్.. అందుకే కుట్రలు: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు తెచ్చే అప్పులు.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 450 రోజులైనా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడంలేదని మండిపడ్డారు.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ పథకం 2006-07లో ప్రారంభమైతే.. కూటమి ప్రభుత్వ కాలంలో రెండు సార్లు ఆగిపోయింది. ఇరవై ఏళ్లలో ఇలాంటి గొప్ప పథకం నిలిచిపోవడం దారుణం. ఆరోగ్యశ్రీ పేరు చెప్పితే చంద్రబాబు నాయుడుకు క్రెడిట్ రావటంలేదు. ఆరోగ్యశ్రీ పేరు చెప్తే రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ గుర్తుకు వస్తున్నారు. అందుకే ఈ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆరు నెలలు ఎదురు చూసినా బిల్లులు రాక మళ్లీ స్ట్రైక్ చేశారు. ఆసుపత్రుల నిరసనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది. అప్పులకు సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ను, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలను షూరిటీగా పెడుతున్నారు. ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉందా? చంద్రబాబు. ప్రభుత్వం తీసుకున్న అప్పులను ప్రైవేట్ ఆసుపత్రులే చెల్లించాలనే షరతు పెట్టడం దారుణం. రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.54 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వం నడపడం చేతకాక ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నారు. ఈ మాత్రం దానికి మంత్రులు ఎందుకు? సింగపూర్ పర్యటనలు ఎందుకు?. “సంపద సృష్టి” అంటే చంద్రబాబు భాషలో అప్పులు చేయడమేనని అర్ధం. సంపద సృష్టించలేక అప్పులతోనే పాలన సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పెట్టుబడిదారులకు లాభదాయక వనరుగా మార్చుతున్నారు. ఇంత దారుణమైన విధానం దేశంలో ఎక్కడా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగించేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అన్ని ప్రైవేట్ వ్యక్తులకే ఇస్తే ఆరోగ్య శాఖ అవసరం ఏంటి?. ప్రతీ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్ నిర్మిస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు. ప్రజలపై ఆరోగ్య బిల్లులు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
భగీరథ మహర్షి జయంతి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
భగీరథ మహర్షి జయంతి.. వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: భగీరథుని జయంతి సందర్భంగా సగరులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన తపోధనుడు భగీరథ మహర్షి. తన కఠోర తపస్సుతో గంగను భువికి తీసుకువచ్చి, మానవళికి వరంగా ప్రసాదించిన భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.#BhagirathaMaharshiJayanthi pic.twitter.com/HMuhFkZYEZ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 23, 2026 -
రాబోయే రోజులు మనవే.. కష్టాలు చెప్పుకున్న ప్రజలకు భరోసా ఇచ్చిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి
-
చీకటి కొన్నాళ్లే.. రాబోయే రోజులు మనవే
సాక్షి ప్రతినిధి,కడప: కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, చీకటి కొన్నాళ్లేనని.. రాబోయే రోజులు మనవేనని.. మంచి కాలం ముందుందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులు, చంద్రబాబు కూటమి ప్రభుత్వ బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రజలతో రోజంతా మమేకమయ్యారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జనం కోసం క్యాంపు కార్యాలయంలోనే ఉండిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు. కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన వారి బాధలు వింటూ.. నేనున్నాను.. మీకేం కాదని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. వారి ఆగడాలను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను పేరు పేరున పలకరించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో మాట్లాడి పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రెండో రోజు బుధవారం వైఎస్ జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతిని కాంక్షిస్తూ ఉదయం ఇప్పట్ల గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడారు. ఇటీవల మరణించిన వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ బలోపేతానికి, ప్రజలకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీ కార్యకర్తల త్యాగాలు, కృషి ఎల్లప్పుడూ స్మరణీయమన్నారు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కొన్ని నెలల క్రితం మృతి చెందిన పుల్లారెడ్డి ఇంటికి చేరుకుని ఆయన చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. పుల్లారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి సానుభూతి వ్యక్తం చేశారు. ఇటీవల వివాహం చేసుకున్న ఆయన కుమారుడు విష్ణువర్ధన్రెడ్డి, అమృతరెడ్డి దంపతులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, పార్నపల్లి రహదారిపై వైఎస్ జగన్ను రాజారెడ్డి కాలనీ వాసులు కలిశారు. జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని, పరిహారం విషయంలో తమను ప్రభుత్వం సంప్రదించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారితో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడుదామని చెప్పారు. న్యాయం జరగకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా న్యాయం చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. దారి పొడవునా జనమే జనం వైఎస్ జగన్ ఇప్పట్ల పర్యటన సందర్భంగా గ్రామస్తులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పులివెందుల నుంచి ఇప్పట్ల వరకు దారిపొడవునా అనేక గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి తరలి వచ్చారు. ఇప్పట్ల గ్రామంలో వైఎస్ జగన్ను చూడగానే అవ్వాతాతలు కన్నీళ్లు పెట్టుకున్నారు. వైఎస్ జగన్ గడ్డం నిమురుతూ అభిమానాన్ని చాటుకున్నారు. భయపడొద్దు అవ్వా.. మనకు మళ్లీ మంచి రోజులొస్తాయి.. ధైర్యంగా ఉండండంటూ వారికి భరోసా కలి్పంచారు. అభిమాన నేతను చూసేందుకు గ్రామంలోని మహిళలంతా తరలి వచ్చారు. దారి వెంబడి చేతులు ఊపుతూ అభిమానం చాటుకున్నారు. తిరుగు ప్రయాణంలో సైతం గుంపులు గుంపులుగా రోడ్డుపైకి చేరి వైఎస్ జగన్ను కలుసుకునేందుకు వేచి ఉన్నారు. వైఎస్ జగన్ వారందరికీ అభివాదం చేస్తూ.. వారి కష్టాలు విని ధైర్యం చెబుతూ ముందుకు సాగారు. వైఎస్ జగన్ను కలిసిన పిన్నెల్లి బ్రదర్స్ ఇటీవల అక్రమ కేసులో బెయిల్పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలు బుధవారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. అక్రమ కేసులతో నియంత్రించాలనుకోవడం అవివేకమని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, మంచి రోజులు వస్తాయన్నారు. అన్యాయంగా ప్రవర్తించి, ఏకపక్ష చర్యలు చేపట్టిన వారెవ్వరినీ వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రోడ్డు నాణ్యతపై సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేస్తే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారని మర్రిపాడు మండలానికి చెందిన యువకులు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అక్రమ కేసులకు జడవాల్సిన పనిలేదని, వచ్చేది మన ప్రభుత్వమేనని జగన్ ధైర్యం చెప్పారు. కార్యాలయం వద్ద జన సందోహంవైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో పులివెందుల క్యాంపు కార్యాలయం జనసంద్రంగా మారింది. పార్టీ అభిమానులు, క్యాడర్తోపాటు యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడా చూసినా జనమే కనిపించారు. ఒక దశలో జనాన్ని అదుపు చేయడం పోలీసులకు కూడా కష్టం అనిపించింది. కార్యాలయ ప్రాంగణమంతా జై జగన్ నినాదాలతో హోరెత్తింది. వైఎస్ జగన్ వారందరికీ అభివాదం చేస్తూ.. కరచాలనం చేసుకుంటూ, సెల్ఫీలు ఇస్తూ ముందుకు కదిలారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమర్నాథరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎస్ రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎస్బీ అంజద్బాషా, చాంద్బాషా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, మాజీ మేయర్లు సురేష్బాబు, పాకా సురేష్, పార్టీ నేతలు వైఎస్ మనోహర్రెడ్డి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
Ys Jagan: కష్టాలు వింటూ.. అక్కున చేర్చుకుంటూ..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమయ్యారు. మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలో తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడారు. ప్రధానంగా కార్యకర్తల కష్టసుఖాలు అడుగుతూ.. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల వెతలు వింటూ నేనున్నానని.. మీకేం కాదని భరోసా ఇచ్చారు.ధైర్యంగా ముందుకు పోవడమే ఆలస్యమని.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. మంచి కాలం ముందు ఉందంటూ వివరించారు. ప్రధానంగా కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కష్టాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి బాధలు విన్న ఆయన కొన్నింటికి సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో మాట్లాడుతూ మార్గం చూపారు.వైఎస్ జగన్ ఉదయం ఇప్పట్ల పర్యటన తర్వాత భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మాట్లాడారు. ముఖ్యమైన నాయకులతోనూ చర్చించారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన బాధితుల నుంచి వినతులను స్వీకరించారు. తెలిసిన ప్రతి ఒక్క కార్యకర్తను పేరు పేరునా పలకరించడమే కాకుండా కష్ట, సుఖాలు, ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.వారిని ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేనున్నానని.. ఏదైనా సమస్యలున్నా పార్టీ అండగా ఉంటుందని వివరించారు. కొంతమంది దివ్యాంగులు, యువత ఆయనను అభిమానంగా వచ్చి కలుసుకున్నారు. వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూనే మరోవైపు ప్రతి ఒక్కరితో విడివిడిగా మాట్లాడుతూ వచ్చారు.వైఎస్ జగన్ పులివెందులకు వస్తున్నారని తెలుసుకున్న జనాలు భారీగా తరలి వచ్చారు. పార్టీ అభిమానులు, క్యాడర్తోపాటు యువత, దివ్యాంగులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరూ తరలి రావడంతో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. కార్యాలయ ప్రాంగణమంతా జగన్ను చూసేందుకు వచ్చిన అభిమానులతో పోటెత్తింది. వైఎస్ జగన్ నినాదాలతో హోరెత్తింది. వైఎస్ జగన్ను చూడగానే ఉప్పొంగిన అభిమానంతో జై జగన్ నినాదాలతో నినదించారు. -
పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)
-
మాజీ సీఎం నాదెండ్ల మృతిపై YS జగన్ సంతాపం
-
చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు
-
జగనన్న ఇళ్లు కాదు ఊర్లు ఊర్లే సృష్టించాడు, అది వైఎస్ జగన్ అంటే..
-
నాదెండ్ల భాస్కర రావు మృతి తీరని లోటు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నాదెండ్ల భాస్కర్ రావు మృతిపై వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలియజేశారు. నాదెండ్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన నాయకుడని ప్రజాసేవలో ఆయన నిబద్ధత, రాజకీయ అనుభవం తరతరాలకు ఆదర్శమన్నారు. ఆయన మరణం రాష్టానికి తీరని లోటని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
YSRCP సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
-
చిట్టిబాబు మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సినీ దర్శకనిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు(71) మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చిట్టిబాబు మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారాయన. నిర్మాతగా, అనలిస్ట్గా తనదైన శైలిని ఏర్పరచుకున్న చిట్టిబాబుగారు.. సినీ రంగంపై ఆయనకు ఉన్న అవగాహన, విశ్లేషణాత్మక దృష్టి ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచింది. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు వారికి ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ప్రసాదించాలి అని ఒక ప్రకటనలో వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఛాతి నొప్పి కారణంగా త్రిపురనేని చిట్టిబాబును కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన గుండెపోటుతో కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి కుమారుడే చిట్టిబాబు. ఆయన అసలు పేరు వరప్రసాద్. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరులో 1955 జూలై 28న జన్మించారు. మొదట కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించారాయన. నటుడిగానూ 30 చిత్రాల్లో అలరించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి పలు చిత్రాలు తీశారు. రాజకీయాలపరంగా క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించారు. -
సభ్య సమాజం తలదించుకునేలా బుచ్చయ్య తీరు
నరికేస్తాం‘ఏంట్రా యదవల్లారా మీరు నరికేది.. మేమే నరకగలం.. మాకు అధికారం ఉంది.. మేం తలుచుకుంటే మిమ్మల్ని నరికేయగలం.. కానీ, శాంతియుతంగా ముందుకు వెళ్తాం.. పిచ్చిపిచ్చి పేలాపనలు పేలితే అంబటి అయినా గిమ్మటి అయినా గుమ్మటం పట్టించేస్తాం.. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేరు’ అంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబును టార్గెట్ చేస్తూ బుచ్చయ్య చౌదరి తాజాగా వ్యాఖ్యలు చేశారు.చంపితే తప్పేముంది?‘నువ్వు ఓ సైకో.. నీకు ఉరి వేయక సన్మానాలు చేయాలా? నీ తల ఎందుకు తీయకూడదు? నిన్ను చంపితే తప్పేముంది? ఉరి తీసినా తప్పు లేదు?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టార్గెట్ చేస్తూ గతంలో పత్రికా సమావేశాలు, టీవీ డిబేట్లలో బుచ్చయ్య ఊగిపోతూ మాట్లాడారు. ఆయన దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత. అటువంటి నాయకుడు ఎంతో హుందాగా.. కొత్త తరానికి స్ఫూర్తిగా ఉండాలి. కానీ, ఆయనే సభ్యసమాజం తలదించుకునే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇంతటి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా.. పార్టీ అధిష్టానం కనీసం పట్టించుకోకపోవడం చూస్తూంటే.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.సాక్షి, రాజమహేంద్రవరం: వ్యక్తిగత ప్రయోజనమో.. సొంత అజెండాయో.. అధినాయకుల మెప్పు కోసమో.. పదవీ లాలసో తెలీదు కానీ.. కొన్నాళ్లుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. విపక్ష నాయకులపై దూషణల పంథా పట్టారు. సినిమాల్లో ప్రతినాయకుల మాదిరిగా ‘చంపుతా.. నరుకుతా..’ అంటూ శివాలెత్తిపోతున్నారు. సభ్యతను పూర్తిగా పక్కన పెట్టేసి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులపై దిగజారుడు వ్యాఖ్యలకు దిగుతున్నారు. అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూంటారు. కానీ, ఆ విమర్శలు, ఆరోపణలు విధానపరమైన అంశాలకు పరిమితమైతే ఫర్వాలేదు. కానీ, బుచ్చయ్య మాత్రం తరచుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మాజీ సీఎం అనే కనీస గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లు దూషణలకు దిగడం ఆయనకు పరిపాటిగా మారుతోంది. విలేకర్ల సమావేశాలు, టీవీ డిబేట్లలో పదేపదే అవే విమర్శలు చేస్తూ తన రాజకీయ అనుభవానికి సమాధి కట్టుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అధినేతల మెప్పు కోసమేనా?టీడీపీ మహానాడు అనంతరం చంద్రబాబు ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ సందర్భంగా కొందరు మంత్రులకు ఉద్వాసన పలకనున్నారని తెలుస్తోంది. వారి స్థానంలో సీనియర్లకు మంత్రి పదవులిచ్చి, మాజీ సీఎం, వైఎస్సార్ సీపీని విమర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ రాయేస్తే పోలా.. అనే రీతిలోనే బుచ్చయ్య ఇలా రెచ్చిపోతున్నారని అంటున్నారు. మాజీ సీఎం జగన్ను, వైఎస్సార్ సీపీని గట్టిగా విమర్శిస్తే తనకు బెర్త్ ఖాయమవుతుందని భావించారో.. ఏమో కానీ కొన్ని నెలలుగా ఎన్నడూ లేని విధంగా దారుణమైన దూషణలకు దిగుతున్నారు. విజయవాడలో ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. తద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని విశ్లేషకులు అంటున్నారు.స్వపక్షంలో అవమానాలు మర్చిపోయారా?సీనియర్ నేత అయినప్పటికీ టీడీపీలో బుచ్చయ్య చౌదరి ఆది నుంచీ అవమానాలే ఎదుర్కొంటున్నారు. దివంగత ఎన్టీఆర్కు ఆయన అత్యంత సన్నిహితుడు. ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో బుచ్చయ్య ఎన్టీఆర్ వర్గంలోనే ఉన్నారు. తనకు అన్యాయం జరిగితే అధినాయకత్వాన్నే ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఆయన వ్యవహార శైలిని చంద్రబాబు జీర్ణించుకునే వారు కాదు. ఇష్టం లేకపోయినా పార్టీలో సీనియర్ అనే కారణంగా పట్టించుకోకుండా వదిలేసేవారు. టీడీపీపై ఉన్న అభిమానంతో గోరంట్ల సైతం పార్టీలో అలాగే కొనసాగేవారు. మంత్రి పదవి రాని సమయంలో ‘పార్టీలో పదవులు అమ్ముకుంటున్నార’ని గతంలో తీవ్ర స్థాయిలో ఆరోపించారు కూడా. ఈ నేపథ్యంలో ఆయనను చంద్రబాబు పెద్దగా నమ్మరనే ప్రచారం ఉంది. అందువల్లనే చంద్రబాబు ప్రభుత్వంలో బుచ్చయ్యకు మంత్రి పదవి దక్కలేదని అంటారు. తనను అంతగా అవమానించినప్పటికీ.. ఇప్పటికీ వారినే పొగడటం, మాజీ సీఎంను దూషించడం వంటివన్నీ మంత్రి పదవి కోసమేననే అభిప్రాయాన్ని కలిగించక మానవు.వైఎస్సార్ సీపీ నేతలు గరంగరంబుచ్చయ్య చౌదరి దూషణలపై వైఎస్సార్ సీపీ నేతలు మండిపడుతున్నారు. మహిళలను కించపరుస్తూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉద్యమించిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ మాజీ సీఎంపై దూషణలకు దిగడంపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి పదవి కోసమే బుచ్చయ్య నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, వయసును, అనుభవాన్ని పక్కన పెట్టి మరీ మత్రి భ్రమించి దూషిస్తున్నారని ఆ పార్టీ నేతలు జక్కంపూడి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మార్గాని భరత్రామ్ తదితరులు ఆరోపిస్తున్నారు. ‘నరుకుతామంటున్నారు. ఎక్కడి రావాలో టైమ్, డేట్ చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు. మంత్రి పదవి కోసం ‘నరుకుతా, చంపుతా, ఉరి తీయాలి’ మాట్లాడటమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి.. ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దూషణలు తగవని హెచ్చరిస్తున్నారు. బుచ్చయ్య తీరు ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. -
కోదండరామ స్వామి ఆలయంలో YS జగన్ కు వేదాశీర్వాదం
-
పులివెందులలో వైఎస్ జగన్
-
తమిళనాడులో జగన్ నామ గర్జన.. విజయ్ అభిమానం
జననేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్కు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడికి వెళ్లిన అభిమానులు వైఎస్ జగన్ భారీ సంఖ్యలో తరలివచ్చి వెన్నంటే ఉంటారు. తమ అభిమాన నేతపై వారికున్న అభిమానాన్ని చాటుకుంటారు. కాగా, తమిళనాడు ఎన్నికల్లో సైతం వైఎస్ జగన్ పేరు మారుమోగుతోంది.ఎన్నికల ప్రచారంలో భాగంగా టీవీకే అధినేత విజయ్.. వైఎస్ జగన్పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. జగన్తో కలిసి ఉన్న ఫొటోను విజయ్ ప్రదర్శించారు. దీంతో, ఒక్కసారిగా అక్కడున్న వారిలో జోష్ వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీవీకే అధినేత విజయ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నికల వేడి మధ్యలో, ప్రచార రథంపై నిలబడి ఉన్న విజయ్ ఒక్కసారిగా వైఎస్ జగన్ ఫొటోను పైకి ఎత్తి చూపించారు. ఆ ఫొటోను పైకెత్తిన క్షణంలోనే సభ మొత్తం ఒక్కసారిగా మార్మోగిపోయింది. “జగన్.. జగన్” అంటూ జనం గళం ఉప్పొంగిపోయింది. అది సాధారణ స్పందన కాదు. ఒక నాయకుడిపై ప్రజల్లో ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ.. ఒక్క క్షణంలో బయటపడిన ఎమోషన్. అది ఒక ఫొటో మాత్రమే అయినా, స్పందన మాత్రం తుఫాన్లా ఎగిసిపడింది. అక్కడున్న వారంతా జగనన్న సీఎం అంటూ నినాదాలు చేశారు.Vijay holding jagan and vijay photo in TN election campaign 🇺🇿🔥🇪🇸 https://t.co/AwkL1Kuljk pic.twitter.com/SGblloxsRb— ᴊᴀɪxᴊᴀɢᴀɴɪꜱᴍ✨ (@ysj_fanboy) April 21, 2026విజయ్ ఫోటో ఎత్తిన తీరు.. జనం ఇచ్చిన ఆ రియాక్షన్.. ఈ రెండూ కలిసిన ఆ క్షణం నిజంగా ప్రజల గుండెల్లో “జగన్” అనే పేరు ఎంత లోతుగా ఉందో చూపించింది. ఇదీ జగన్ అంటే ప్రజల్లో గుండెల్లో ప్రత్యేక అభిమానమని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. వైఎస్ జగన్ అంటే ఒక నమ్మకం.. ఒక ఇంపాక్ట్ అని మరోసారి రుజువైంది. View this post on Instagram A post shared by 𝑯𝒊𝒓𝒂𝒏 𝑮𝒖𝒕𝒕𝒂 (@hiran_gutta) -
సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ ఇప్పట్ల పర్యటన అప్డేట్స్.. సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ఇప్పట్ల చేరుకున్న వైఎస్ జగన్సుధాకర్ రెడ్డి ఇంటికి చేరుకున్న వైఎస్ జగన్ఇటీవల మృతి చెందిన సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్పార్నపల్లి నిర్వాసితులకు భరోసా.. కడపపార్నపల్లి రహదారిపై వైఎస్ జగన్ను కలిసిన రాజారెడ్డి కాలనీ వాసులు..జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్నామని నిర్వాసితులు ఆవేదన.పరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదనపరిహారం ఇప్పించి ఆదుకోవాలని వైఎస్ జగన్కు వినతి.న్యాయం కోసం పోరాటం చేద్దాం.న్యాయం జరగకపోతే మూడేళ్లు ఆగండి మనం అధికారంలోకి వస్తాం..తప్పకుండా న్యాయం చేస్తామన్న వైఎస్ జగన్మీకు అన్యాయం జరగదు.. జగన్ సార్ చూసుకుంటాడని ఎంపీ అవినాష్ రెడ్డి భరోసా ఇప్పట్ల బయలుదేరిన వైఎస్ జగన్పులివెందులలో తన నివాసం నుంచి ఇప్పట్ల బయలుదేరిన మాజీ సీఎం వైఎస్ జగన్మరికాసేపట్లో ఇప్పట్ల చేరుకోనున్న వైఎస్ జగన్ఇప్పట్ల లో ఇటీవల మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్అనంతరం పులివెందుల క్యాంప్ ఆఫీసుకు వైఎస్ జగన్క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్, ప్రజల నుంచి వినతుల స్వీకరణ👉లింగాల మండలం ఇప్పట్ల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ సీఎం వైఎస్ జగన్👉వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.👉వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన ఇప్పట్లకు బయలుదేరుతారు. నేరుగా లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డికి ఇంటికి వెళతారు. అక్కడ సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. -
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు
-
ధైర్యంగా ఉండండి
సాక్షి, కడప: కష్టాలు చెప్పుకున్న వారందరికీ నేనున్నానంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం చెప్పారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, అందరికీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మంగళవారం సాయంత్రం వైఎస్సార్ కడప జిల్లా పులివెందులకు చేరుకున్న జగన్కు స్థానిక ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. భాకరాపురం సమీపంలోని హెలిప్యాడ్ నుంచి ఇంటికి చేరుకునే వరకు జగన్ను చూసేందుకు దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా బారులుతీరారు. యువత జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్.. నాయకులు, కార్యకర్తలు, స్థానికులను పేరు పేరునా పలుకరించారు. పలువురితో సెల్పిలు దిగారు. మధ్యలో కాన్వాయ్ని ఆపిన అభిమానులతో కరచాలనం చేశారు. ప్రజల నుంచి వినతులు సైతం స్వీకరించారు. ఈ సందర్భంగా టీడీపీ అరాచకాలను ధైర్యంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, పోరాట పంథాను ఎంచుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాగా, క్యాంపు కార్యాలయంలో వేద పండితులు వైఎస్ జగన్ను ఆశీర్వదించారు. పులివెందులలోని తన నివాసానికి వచ్చే మార్గంలో కాన్వాయ్ ఆపి ప్రజల కష్టాలు వింటున్న మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ నేతలతో చర్చలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. వివిధ అంశాలపై వారితో వైఎస్ జగన్ చర్చించారు. వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది వైఎస్ జగన్ను కలిసి వివాహ శుభ లేఖలు, వినతులు అందించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అత్తార్ చాంద్బాషా, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కె.సురేష్ బాబు, రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. నేడు ఇప్పట్లకు వైఎస్ జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
చంద్రబాబూ.. తప్పు చేస్తున్నారు
సాక్షి, అమరావతి: ‘మీరు తప్పు చేస్తున్నారు.. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావిురెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా..’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు.సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారంటూ ఎత్తిచూపారు. ‘మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా?’ అని నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ ‘‘చంద్రబాబు గారూ.. ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయపడి పోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి బాండ్లు సైతం ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం?⇒ ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? రూ.3.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా.. మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా..⇒ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రావిురెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి, అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా.. ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వసూ్తనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే కదా.. ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తున్నారు.⇒ సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా అర్థం?⇒ ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు. ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వలంటీర్లకు మాట ఇచ్చి, అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదే కదా? మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిళ్లకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా? ⇒ చంద్రబాబు గారూ.. సూటిగా ఒక ప్రశ్న. మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా? చంద్రబాబు గారూ.. మీరు తప్పు చేస్తున్నారు. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు, భయపడుతున్నారు. -
‘ఉపాధి’పై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, అమరావతి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కింద పనులు చేసిన కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల పేదల కడుపులు మాడిపోతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. 2023–24తో పోల్చితే 2025–26లో రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన ఉపాధి పనులు, వేతనాల వృద్ధి రేటు వివరాలు ‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చరిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏను అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతో పాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకబడి పోయింది.ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధన దాహం, అవినీతి వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’ అని వైఎస్ జగన్ ఆ పోస్టులో ప్రభుత్వ తీరును కడిగి పారేశారు. -
వైఎస్ జగన్కు వేదపండితుల ఆశీర్వచనాలు
పులివెందుల: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల పర్యటనలో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వేద పండితుల ఆశీర్వచనాలు అందాయి. పులివెందులలోని వైఎస్ జగన్ నివాసంలో ఒంటిమిట్ట కోదండ రామాలయం వేద పండితులు.ఆశీర్వాదాలు అందించారు ఈ మేరకు సీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాలు, ప్రసాదాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్కు అందించారు వేద పండితులు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఏప్రిల్ 21) వైఎస్ జగన్ పులివెందులకు వచ్చారు. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన (ఫోటోలు)
-
దీనర్థం మీరు భయపడిపోతున్నారనే కదా?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలు అమలు చేయాలని కోరినవారిని వేధిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేయటంపై మండిపడ్డారు. ఇదెక్కడి పరిపాలన అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్.‘చంద్రబాబూ.. ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయపడిపోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. బాండ్లు సైతం ప్రతి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. రెండేళ్లు అవుతున్నా మేనిఫెస్టోలో చెప్పినవి ఏవీ చేయకపోగా, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అమలు చేసేశామని పచ్చి అబద్ధాలు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజల నుంచి, ఉద్యోగుల నుంచి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ప్రశ్నించే గొంతుకలపై బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు. అంటే మీరు భయపడుతున్నారనే కదా దీని అర్థం. ప్రజలు, ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయంటేనే మీ పరిపాలన బాగా లేదనే కదా అర్థం. ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే కదా దాని అర్థం. మరి అవి ఎప్పుడు నెరవేరుస్తారని అడగడం తప్పా?’ అని ప్రశ్నించారు.తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా? రెండేళ్లు అవుతున్నా, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించడం నేరమా? అని వైఎస్ జగన్ అన్నారు. ‘రూ.3.50 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు.. అవేమవుతున్నాయని నిలదీయడం అపరాధమా? వీటికి సమాధానం చెప్పుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనే కదా?మీరు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే కదా? ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి చేసిన తప్పేంటి? ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే ఆయన చేసిన నేరమా? ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే అతనిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి అతన్ని డిస్మిస్ చేశారంటే మీరు భయపడిపోతున్నారనే కదా? ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన పెండింగ్ డీఏలు, పీఆర్సీ, మీరు వస్తూనే ఇస్తామన్న ఐఆర్ ఇవ్వాలని అడగడంలో తప్పేముంది? అది మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీనే కదా? ఉద్యోగుల విషయంలో మీరు వ్యవహరిస్తున్న తీరు, మీ మోసపూరిత వైఖరిని అందరూ గమనిస్తున్నారు. సీఐ శంకరయ్య విషయంలోనూ మీరు ఇలాగే దుర్మార్గంగా వ్యవహరించారు. మా చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లుగా సీఎం స్థాయిలో మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని, అది తనను బాధించిందని శంకరయ్య అంటే అతన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించడం మీ నిరంకుశ పాలనకు నిదర్శనం కాదా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటే మీరు భయపడుతున్నారనీ కదా అర్థం’ అని అన్నారు.వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? ‘ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా? ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెండేళ్లు అవుతున్నా ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. పైగా ఉద్యోగులపై కక్ష సాధింపులు ఇది జంగిల్ రాజ్ కాదా? ఉగాది రోజున మీ జీతాలు డబుల్ చేస్తామని వాలంటీర్లకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కడుపుకొట్టింది నువ్వు కాదా? 2.60 లక్షల మందిని రోడ్డున పడేసి, ఆ వ్యవస్థే లేకుండా చేసిన అరాచకత్వం నీదేకదా? మీ కక్ష సాధింపులకు, మీరు ఉద్యోగులపై పెట్టే ఒత్తిడులకు ఒక్క సచివాలయ ఉద్యోగులే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మందికి పైగా ఆకస్మిక మరణం పొందింది నిజం కాదా? చంద్రబాబూ.. సూటిగా ఒక ప్రశ్న, మీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షుడిగా ఉన్న అశోక్ బాబు మీ తరఫున కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదా? బీజేపీని ఓడించమని పిలుపు ఇవ్వలేదా? మరి ఎందుకు అతన్ని డిస్మిస్ చేయలేదు? అంటే మీ వాళ్లకు ఒక న్యాయం, పక్క వాళ్లకు మరో న్యాయమా? చంద్రబాబూ.. మీరు తప్పు చేస్తున్నారు. అందుకే ప్రజలకు, ప్రశ్నించే గొంతుకలకు, భయపడుతున్నారు’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. .@ncbn గారూ ఇటీవల మీరు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మీరు బాగా భయపడిపోతున్నారని అర్థమవుతోంది. ఎన్నికల ముందు అధికారం కోసం నోటికి వచ్చిన వాగ్దానాలు ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టారు. బాండ్లు సైతం ప్రతి ఇంటికీ వెళ్లి ఇచ్చి ప్రతి…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2026 -
పులివెందులలో వైఎస్ జగన్
కడప: మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. నేటి నుంచి(ఏప్రిల్ 21వ తేదీ) మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. రేపు(బుధవారం, ఏప్రిల్ 22వ తేదీ) ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డి ఇంటికి బయలుదేరి వెళతారు వైఎస్ జగన్. 9.45గంటలకు సుధాకర్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి తిరగుపయనమవుతారు. -
ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది
-
MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్
-
‘చంద్రబాబూ.. ఎంజీఎన్ఆర్ఈజీఏపై ఇంత నిర్లక్ష్యమా ?’
సాక్షి, తాడేపల్లి: ఎంజీఎన్ఆర్ఈజీఏ అమలులో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతులేని అవినీతి, అసమర్థ నిర్ణయాలతో గ్రామీణ వ్యవస్థ దెబ్బ తింటోందంటూ ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతులేని అవినీతి చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘నిజానికి ఎంజీఎన్ఆర్ఈజీఏ అనేది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెరుగుతుంది. పల్లె ప్రజలకు ఆదాయం సమకూరుతుంది. అలాంటి చారిత్రాత్మక ఎంజీఎన్ఆర్ఈజీఏని అత్యుత్తమంగా అమలు చేయటంలో మిగతా రాష్ట్రాలతోపాటు ఏపీ కూడా ఒకటిగా ఉండేది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో పూర్తిగా వెనుకపడి పోయింది...ఉపాధి పొందిన కుటుంబాలు, వారి ఖర్చులు, వ్యయం వంటి వివరాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. ఈ రెండేళ్లలో జీఎస్టీ, అమ్మకపు పన్ను వృద్ధి తక్కువగా ఉండటానికి కూడా ఇదొక కారణంగా ఉంది. గ్రామీణుల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అంతులేని ధనదాహం, అవినీతి వలనే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.𝗦𝘂𝗽𝗽𝗼𝗿𝘁 𝘁𝗼 𝗥𝘂𝗿𝗮𝗹 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝘆 𝗶𝘀 𝗗𝘄𝗶𝗻𝗱𝗹𝗶𝗻𝗴 From the perspective of Rural economy, effective implementation of the MGNREGA is of vital importance. This programme enhances disposable incomes in rural sections who have highest marginal propensity to… pic.twitter.com/KSvPGgVEsJ— YS Jagan Mohan Reddy (@ysjagan) April 21, 2026 -
ఉద్యోగుల్ని రాజకీయంగా వాడుకున్నదే చంద్రబాబు: వెంకట్రామిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయంగా వాడుకున్న చరిత్ర చంద్రబాబుదేనని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారంటూ ఆయన మంగళవారం మీడియా ద్వారా మాట్లాడారు. పచ్చ మీడియా జర్నలిస్టులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయలేదని గతంలో అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. నా డిస్మిస్ తప్పని ప్రతీ ఐఏఎస్కు తెలుసు. నన్ను డిస్మిస్ చేసింది కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే. కానీ, కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఉద్యోగులు భయపడరు. ఉద్యోగులను రాజకీయంగా వాడుకుందే చంద్రబాబు. గతంలో ఏపీ ఉద్యోగులను తీసుకెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయించారు. ఆ సమయంలో ఉద్యోగుల చేత ప్రధాని మోదీని చంద్రబాబు తిట్టించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీలేమయ్యాయి?. ఎప్పుడు అమలు చేస్తారు??.. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏం చేసింది??. ఈ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 15వ తేదీ పైనే జీతాలు పడుతున్నాయి.. .. ఉద్యోగులకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ఉద్యోగులపట్ల వైఎస్ జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. ఉద్యోగులకు చాలా రకాలుగా మేలు చేశారు. కూటమి ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 100 రెట్లు మేలు అని వెంకట్రామిరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైఎస్సార్సీపీకి ఆయన అనుబంధంగా పని చేశారని.. ఎన్నికల సమయంలోనూ పార్టీ కోసం ప్రచారం చేశారని.. తద్వారా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకున్నట్లు సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. -
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
-
నేటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 21వ తేదీనుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 21వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బెంగుళూరు ఎయిర్డ్రోంకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3గంటలకు హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు.అక్కడి నుంచి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4 నుంచి రాత్రి 7గంటల వరకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. 22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డి ఇంటికి బయలుదేరుతారు.9.45గంటలకు సుధాకర్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్కు రోడ్డు మార్గాన వైఎస్ జగన్ బయలుదేరుతారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్ ద్వారా బెంగళూరుకు తిరగుపయనమవుతారు. -
వైఎస్ జగన్ పులివెందుల టూర్.. పూర్తి షెడ్యూల్..!
-
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. తన పర్యటనలో బాగంగా వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకుంటారు. అక్కడ భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. మరుసటిరోజు(22న) ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి ఇటీవలె మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ ఓదార్చనున్నారు. తిరిగి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీన ఉదయం పర్యటన ముగించుకుని పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబుగారూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన దీర్ఘాయుష్షు మీకు కలగాలని కోరుకుంటున్నా అంటూ ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు. Happy Birthday @ncbn Garu! Wishing you a healthy and peaceful long life!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 20, 2026చంద్రబాబు నాయుడికిది 76వ పుట్టినరోజు. ఆయన 1950 ఏప్రిల్ 20న తిరుపతి జిల్లా నరవరిపల్లిలో జన్మించారు. తొలిసారి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆపై 1980లలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. 1995లో ఎన్టీఆర్ను గద్దె దించిన చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చున్నారు. 1995–2004, 2014–2019, 2024–ప్రస్తుతం.. రెండుసార్లు ఉమ్మడి ఏపీకి, రెండుసార్లు విభజిత ఏపీకి.. మొత్తం నాలుగుసార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. -
60% పూర్తయిన బ్రిడ్జిని మధ్యలో ఆపేసిన కూటమి
-
రేపటి నుంచి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
సాక్షి, అమరావతి/కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. 21న సాయంత్రం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీస్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 22న ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలం ఇప్పట్ల వెళతారు.ఇటీవల మృతి చెందిన స్థానిక వైఎస్సార్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబీకులను పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల క్యాంప్ కార్యాలయానికి వెళ్లి ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు. 23న ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనమవుతారు. -
జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్
-
పవన్ త్వరగా కోలుకోవాలి.. జగన్ ప్రార్థన..
-
పవన్ త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఇటీవల సర్జరీ జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ త్వరగా కోలుకోవాలంటూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2026ఇదిలా ఉండగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ పోస్ట్లో పేర్కొంది. శుక్రవారం ఉదయం సడెన్గా పవన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్న ఆయన తన వ్యక్తిగత వైద్యుల సలహాతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శనివారం సాయింత్రం శస్త్రచికిత్స చేశారు.వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయాన్ని పవన్ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ తెలిపారు. 2018లో పవన్ కల్యాణ్ కంటి సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో హైదరాబాద్లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ ఎడమ కంట్లో కురుపు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు శస్త్రచికిత్సతో తొలగించారు. రంగస్థలం మూవీ సక్సెస్ మీట్లో ఈ విషయాన్ని పవన్ వెల్లడించారు. -
కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు గరళం తాగిన శివుడు జగన్
-
మీ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దేశ ద్రోహమా?
సాక్షి, అమరావతి: ‘మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా..? మీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా..? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష?’ అని సీఎం చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి.. అతనిపై అక్రమ కేసులు పెట్టడం ఏంటి.. మరి మీరు పెడుతున్న పోస్టులకు ఎంత మందిని అరెస్టు చేయాలి? అంటూ ప్రశ్నించారు.తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం జంగిల్ రాజ్ కాదా అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. గత రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని మీరు.. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడటం ఎంత వరకు సబబు అంటూ ప్రశ్నించారు.ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా అంటూ నిలదీశారు. ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పేరోజు దగ్గర్లోనే ఉందని స్పష్టం చేస్తూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శనివారం పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలా? గడిచిన రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సబబు? మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నా వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వ్యవస్థలను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సుపరిపాలనా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి అక్రమ కేసులు, అరెస్టులకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండీ చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని హెచ్చరించారు. వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు?‘చంద్రబాబు గారూ.. మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా? ఆ గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడమా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా? మీరు చెప్పనిది చూపించారా? వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి? అతనిపై అక్రమ కేసు పెట్టడం ఏంటి? అతని ఇంట్లో సోదాలు చేయడం ఏంటి? అతనేమైనా ఉగ్రవాదా? టెర్రరిస్టా? మరి మీరు పెడుతున్న పోస్టులకు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం జంగిల్ రాజ్ కాదా? ఆయన ఇంట్లో లేని సమయంలో ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇంట్లో తిష్ట వేయడం ఏంటి? ఇది రెడ్బుక్ పాలనకు నిదర్శనం కాదా? -
అతనేమైనా ఉగ్రవాదా? అదేమైనా దేశ ద్రోహమా?: వైఎస్ జగన్
తాడేపల్లి: చంద్రబాబు అరాచక పాలనపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ అయ్యారు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో చేస్తున్న అక్రమ అరెస్టులు, వేధింపులపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘చంద్రబాబూ.. మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా? ఆ గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడమా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు చేయనిది చెప్పారా? మీరు చెప్పనిది చూపించారా? వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకెందుకు? బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పనిచేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటి? అతనిపై అక్రమ కేసు పెట్టడం ఏంటి? అతని ఇంట్లో సోదాలు చేయడం ఏంటి? అతనేమైనా ఉగ్రవాదా? మరి మీరు పెడుతున్న పోస్టులకు రోజూ ఎంత మందిని అరెస్ట్ చేయాలి? తెలంగాణ సీనియర్ జర్నలిస్టు కేవీఆర్పై కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం జంగిల్ రాజ్ కాదా? ’ అని ప్రశ్నించారు.@ncbn గారూ.. మీ ఉద్దేశంలో పరిపాలన అంటే ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు వేయడమా? ఆ గొంతుకలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించడమా? మీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే అదేమైనా దేశ ద్రోహమా? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? వాళ్లు ఏమైనా మీరు…— YS Jagan Mohan Reddy (@ysjagan) April 18, 2026ఇది రెడ్బుక్ పాలనకు నిదర్శనం కాదా? ఇంట్లో తాను లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఇంట్లో తిష్టవేయడం ఏంటి? అని వైఎస్ జగన్ నిలదీశారు. ‘ఇది రెడ్బుక్ పాలనకు నిదర్శనం కాదా? పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? గడిచిన రెండేళ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే నిందితులపై చర్యలు తీసుకోని మీరు.. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వారిపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు కరెక్ట్? మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నా వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వ్యవస్థలను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం సుపరిపాలనా? పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్ష సాధింపుల కోసం శాంతిభద్రతలను దెబ్బతీసి అక్రమ కేసులు, అరెస్టులకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు, ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని వైఎస్ జగన్ విమర్శించారు. -
ఏపీ అభివృద్ధికి తారకమంత్రం.. ప్రజల్లో మావిగన్ క్రేజ్
-
దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టాలపై YS జగన్ సంచలన పోస్ట్
-
బిల్లులను అడ్డుకున్న పార్టీలు ఏం సాధించాయి?
సాక్షి, అమరావతి: ‘కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించి ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లూ పెరిగేవి... మహిళా రిజర్వేషన్ బిల్లూ ఆమోదం పొందేది..’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కానీ ఆ బిల్లులను లోక్సభలో అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో దేశంలో మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకూ న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడటంతోపాటు మహిళా రిజర్వేషన్ బిల్లు వాయిదా పడిందన్నారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలే అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై తన అభిప్రాయాన్ని వైఎస్ జగన్ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో పోస్టు ద్వారా వెల్లడించారు. అందులో ఆయన పేర్కొన్న అంశాలు ఇవీ... » కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపుదల విధానంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగేవి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయి. ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింతగా దిగజారుతుంది. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసినందుకు జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్టపోతాయి. » 50 శాతం సీట్ల పెంపుదల విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుతం ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లు 38 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 34 మాత్రమే అవుతాయి. అంటే ఏపీ 4 ఎంపీ సీట్లు నష్టపోతుంది. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 17 ఎంపీ సీట్లు 26 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 24 మాత్రమే అవుతాయి. అంటే రెండు సీట్లు నష్టపోవాలి. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ సీట్లు 42 స్థానాలకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా ఆ రాష్ట్రంలో 42 ఎంపీ సీట్లే ఉంటాయి. అంటే ఆ రాష్ట్రం ఏమీ నష్టపోదు. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం కేరళలో ఉన్న 20 ఎంపీ సీట్లు 30 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 23 మాత్రమే అవుతాయి. అంటే కేరళ 7 ఎంపీ సీట్లు నష్టపోతుంది. » 50 శాతం సీట్ల పెంపుదల విధానం అమలు చేస్తే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న 39 ఎంపీ సీట్లు 59 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు 50 మాత్రమే అవుతాయి. అంటే తమిళనాడు 9 ఎంపీ సీట్లు నష్టపోతుంది. 50 శాతం సీట్ల పెంపుదలే ఉత్తమ విధానం.. 2026 జనాభా లెక్కలు అమలైతే మరింతగా నష్టపోతాంమాజీ సీఎం వైఎస్ జగన్ తన వాదనను బలపరిచే గణాంకాలను పట్టిక రూపంలో కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పునర్విభజన బిల్లులో చెబుతున్నట్టుగా 50 శాతం సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల ఎలా ఉంటుంది..? అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు ఎంతగా తగ్గుతాయో వివరించారు. ఇక 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య మరింతగా తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును యథాతథంగా ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరమన్నారు. వైఎస్ జగన్ వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి.... మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి సంక్షిప్తంగా ఇలా..» ప్రస్తుతం దేశంలో ఉన్న 534 లోక్సభ ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే దేశంలో ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76 శాతంగా ఉంది. » కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పునర్విభజన బిల్లు ఆమోదం పొందితే... ప్రస్తుతం చెబుతున్న 50 శాతం పెంపు విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్ల సంఖ్య 195కు పెరుగుతుంది. అంటే దేశం మొత్తం మీద 815 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.87 శాతానికి పెరుగుతుంది. » 2011 జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే దేశంలో ఏర్పాటయ్యే 850 ఎంపీ సీట్లలో దక్షిణాది రాష్ట్రాల్లో 174 ఎంపీ సీట్లే ఉంటాయి. అంటే దక్షిణాది రాష్ట్రాల వాటా 20.44 శాతమే ఉంటుంది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు 21 ఎంపీ సీట్లను నష్టపోతాయి. » అదే 2026 జనాభా లెక్కలు అమలులోకి వస్తే దక్షిణాది రాష్ట్రాలు అంతకంటే ఎక్కువ ఎంపీ సీట్లను నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేస్తున్నాయి. దాంతో ఆ రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గింది. కాబట్టి 2026 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఎంపీ సీట్లు బాగా తగ్గిపోతాయి. అందుకే జనాభా లెక్కలతో నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం చెబుతున్న 50 శాతం సీట్ల పెంపుదలను ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరం. -
తప్పుడు పోస్టులపై వైఎస్ భారతీరెడ్డి లీగల్ నోటీసులు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో తనను లక్ష్యంగా చేసుకుంటూ పెడుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. తనపై సర్క్యులేట్ అవుతున్న తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికలు మెటా ప్లాట్ఫామ్స్, ఎక్స్ కార్పొరేషన్, యూట్యూబ్, గూగుల్లకు లీగల్ నోటీసులు పంపారు. భారతీరెడ్డి తరఫున న్యాయవాది ప్రద్యుమన్ కైస్తా ఈమేరకు నోటీసులిచ్చారు. తప్పుడు కథనాలతో కూడిన పోస్టులను ప్రచారం చేస్తున్న థింక్ ఆంధ్ర, ఎం9 న్యూస్లకు సైతం నోటీసులు పంపారు.భారతీరెడ్డి, జగన్మోహన్రెడ్డి బాధితులుగా మారారు..వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు వారి రాజకీయ ప్రత్యర్థులకు చెందిన ఐటీ సెల్ ప్రారంభించిన దుష్ప్రచారానికి బాధితులుగా మారారు. ఈ దాడి.. అన్ని పరిమితులను దాటి వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని సాగుతోంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఖాతాలు కలిగిన థింక్ ఆంధ్ర.. తప్పుడు, పరువు నష్టం కలిగించే పోస్టులను విస్తృతంగా ప్రచురించి ప్రసారం చేస్తోంది. మిర్చి 9 న్యూస్ కూడా ఇలాంటి కంటెంట్నే సృష్టించి విస్తృతంగా వ్యాప్తి చేస్తోంది. ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్ పనే..ఈ కంటెంట్ను భారతీరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రత్యర్థుల ఐటీ సెల్కు సంబంధించిన అకౌంట్లు సేకరించి వాటిని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో థింక్ ఆంధ్రా ఓ తప్పుడు, ఆధారరహిత కథనాన్ని సృష్టించింది. ఫేస్బుక్, యూట్యూబ్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ప్రణాళికబద్ధంగా సాగుతున్న దాడి...వైఎస్ జగన్ దంపతులపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే ఆ తప్పుడు కథనాలు, పోస్టులను వ్యాప్తి చేస్తున్నారు. ఇదంతా ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దాడి. ఆ పోస్టులు నా క్లయింట్ కుటుంబ పరువుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. అవి పరువు నష్టం కలిగించే తప్పుడు వార్తలే కాకుండా భారతీరెడ్డి వ్యకిగత గోప్యతను సైతం హరిస్తున్నాయి. ఇది చట్ట ప్రకారం నేరం. ఈ నేపథ్యంలో మీరు పోస్టు చేసిన, ప్రసారం చేసిన తప్పుడు కథనాలను తక్షణమే తొలగించాలి. అదే విషయానికి సంబంధించిన ఇతర పోస్టులను సైతం తొలగించాలి. భారతీరెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చేస్తున్న దుష్ప్రచారం తాలూకు తప్పుడు, నిరాధార కథనాలను, పోస్టులను ప్రసారం చేస్తున్న ఆయా సామాజిక మాధ్యమాల అకౌంట్లను సైతం బ్లాక్ చేయాలి. లేని పక్షంలో భారతీరెడ్డి తీసుకునే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. ప్రస్తుత లీగల్ నోటీసులో ప్రస్తావించిన అంశానికి సంబంధించిన ఏ విధమైన కంటెంట్ అయినా, అలాగే నా క్లయింట్కు అపకీర్తి కలిగించే సమాచారాన్ని ప్రచురించడం, మళ్లీ ప్రచురించడం, ప్రసారం చేయడం, అప్లోడ్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, ప్రచారం చేయడం, షేర్ చేయడం, వ్యాప్తి చేయటాన్ని తక్షణమే నిలిపివేయాలి. మీరు ప్రచురించిన, ప్రసారం చేసిన, పోస్టు చేసిన కథనాలు తప్పుడు కథనాలని అంగీకరిస్తూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అలాగే ఆ కంటెంట్ ఇప్పటికే తొలగించినట్లు ప్రకటించాలి..’ అని ప్రద్యుమన్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. -
'మహిళలకు న్యాయం జరగలేదు': వైఎస్ జగన్ ట్వీట్
మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ఇందులో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు, దాని వల్ల తామేం సాధించామనేది గట్టిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గేవనేది వాస్తవం అని పేర్కొన్నారు.అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడింది. దీని వల్ల అటు దక్షిణాది రాష్ట్రాలకు కానీ, ఇటు మహిళలకు కానీ న్యాయం జరగలేదని వెల్లడించారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలు గనక అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇప్పటికే కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని జగన్ పేర్కొన్నారు.Opposing parties should seriously question themselves; what have they achieved ?While the reality is that the numbers would come down for the south and women reservation bill has been postponed ! Justice is rendered neither to the south nor the women! If 2026 census were to… pic.twitter.com/RgRYPR42gx— YS Jagan Mohan Reddy (@ysjagan) April 17, 2026 -
ఇది కదా పాలన...
-
జగనన్న చేసినంత ఎవరూ చేయలేదు.. మహిళలకు సొంత అన్న జగన్
-
కుప్పం కోర్టు చీవాట్లు.. జగన్ టూర్ గ్రాండ్ సక్సెస్
-
ఆ ఘనత వైఎస్ జగన్దే: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: ఇవాళ దేశ చరిత్రలో గొప్పరోజుగా మిగిలిపోతుందని.. దశాబ్దాల తర్వాత మహిళా రిజర్వేషన్ కల నెరవేరబోతుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శుక్రవారం ఆమె తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైఎస్సార్సీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించిందన్నారు.‘‘మహిళా రిజర్వేషన్ బిల్లుతో దేశ భవిష్యత్తు మారబోతుంది. మహిళా శక్తితో మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్గా చేద్దాం. మహిళల అభివృద్ధి గురించి ఆలోచించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 90 శాతం పథకాలు మహిళల గౌరవం పెంచే పథకాలే. అమ్మ ఒడి దగ్గర నుంచి ప్రతి పథకం మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదే...మహిళలకు వైఎస్ జగన్ ఎన్నో అవకాశాలు కల్పించారు. మహిళలను హోం మినిస్టర్లగా, డిప్యూటీ సీఎంలుగా చేసిన ఘనత జగనన్నదే. మహిళల పట్ల వైఎస్ జగన్ సామాజిక సంఘ సంస్కర్తగా ఆలోచన చేశారు. కూటమి పాలనలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగాయి. ఏపీలో లా అండ్ ఆర్డర్ పని చేయడం లేదు. చంద్రబాబు అజెండా రెడ్బుక్ పాలనే’’ అని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళా సాధికారతకు అనేక కార్యక్రమాలు చేపట్టింది వైఎస్ జగనే. రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో చేయూత అందించారు. చంద్రబాబు వచ్చాక మహిళలకు రక్షణ లేదు. వేధింపులు, అఘాయిత్యాలు, ఆత్మహత్యలు పెరిగాయి. పోలీసు వ్యవస్థ రాష్ట్రంలో పూర్తిగా దిగజారిందనేదానికి నిదర్శనం. మహిళల కోసమే జగన్ దిశ యాప్, మహిళా పోలీస్ స్టేషన్లు, జీరో ఎఫ్ఐఆర్ లు తెచ్చారు. కానీ చంద్రబాబు మహిళల కోసం ఏం చేశారు?. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని మా హయాంలో ఆరోపణలు చేశారు. మరి నిజంగానే అదృశ్యమైతే వారిని చంద్రబాబు, పవన్ వెనక్కి తెచ్చారా?. మహిళల మీద లైంగికదాడి చేసిన కూటమి ఎమ్మెల్యేలు, నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?’’ అంటూ విడదల రజని నిలదీశారు. -
జగన్ టూర్ సక్సెస్.. బాబులో ఫస్ట్రేషన్
-
శ్రీహరి అరెస్ట్ అయిన వెంటనే జగన్ నాకు ఫోన్ చేసి ఒకటే చెప్పారు..
-
"ఎవడైతే నాకేంటి" లో నటించమని వైఎస్ జగన్ గారిని అడిగితే, ఏమన్నారంటే..!
-
కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: కందుకూరి వీరేశలింగం పంతులుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులు అర్పించారు. ‘‘సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన మహోన్నతుడు కందుకూరి వీరేశ లింగం పంతులుగారు. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ, స్త్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/VYYbUHYVtN— YS Jagan Mohan Reddy (@ysjagan) April 16, 2026 -
మంత్రాలయం రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
కర్నూలు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం విచారకమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం మరో 13 మంది గాయపడటం, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. -
జగనన్న కోసం పని చేస్తున్నందుకు నా జన్మ ధన్యం అయింది.. పొన్నవోలు ఎమోషనల్
-
ఫిషింగ్ హార్బర్లపై హక్కు మత్స్యకారులదే.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
-
మత్స్యకారుల కడుపుపై తంతున్నారు, గంగపుత్రులను తరిమేసేందుకు కుట్ర... చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైఎస్ జగన్
-
నెల్లూరు తీరంలో దేవర... జువ్వలదిన్నె మత్స్యకారులకు భరోసా
-
పోలీసులు సీజ్ చేసిన బోట్లు దొంగతనమా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబునాయుడు మత్స్యకారులకు మేలు చేయకపోగా వారి కడుపు మీద కొడుతున్నాడని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించిన అనంతరం అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఇది మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ ఏరియా. ఈ ప్రాంతంలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు ఎవరూ రాకూడదు. అందుకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. అయినా వాటిని ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్ బోట్లు మన ప్రాంత జలాల్లోకి ప్రవేశించి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన మత్స్యకారులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారికి కడుపు మండి వారే స్వయంగా రంగంలోకి దిగి ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీజ్ చేసిన ఆ బోట్లను బీద సోదరులు కుట్ర పన్ని దొంగతనంగా తీసుకెళ్లిపోయారు. ఇందుకు బీద సోదరులు, ఆయన అనుచరుడు కొండూరు పోలిశెట్టి, అక్కడి బోటు యజమాని అశోక్ మధ్య జరిగిన సంభాషణ, వారి కాల్ డేటానే సాక్ష్యం. నారా లోకేశ్ మార్చి 12న జువ్వలదిన్నెకు వస్తే, మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోయారు. మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎంతో మంది ఏకమయ్యారు. వారు కుట్ర పన్నినట్టు కాల్ డేటా ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పోలీస్ అధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబును ఒకటే అడుగుతున్నా.. పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనగా చూస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?’ అంటూ మండిపడ్డారు.ఫిషింగ్హార్బర్ మీకే.. ఇదే నా భరోసామీ అందరికీ భరోసా ఇస్తున్నా. కళ్లు మూసుకుని తెరిచే లోపల మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఈ ఫిషింగ్ హార్బర్ మీ హక్కు. ఈ ఫిషింగ్ హార్బర్ పరిధిలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మంచి జరిగేలా ఒక్కో బోటుకు 10, 12 మందిని యజమానులను చేస్తాం. ఫిషింగ్ హార్బర్లను మత్స్యకారులకు అంకితం చేస్తాం. ఇక్కడ పాళెం మత్స్యకారులు కొంత మంది పట్టపు కార్పొరేషన్ కావాలని అడిగారు. నాడు మన ప్రభుత్వంలో అడిగిన వారికి కాదనకుండా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. మనం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పట్టపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా.ఈ ప్రభుత్వం మా కడుపు కొడుతోంది అన్నా..అన్నా.. ఇక్కడ హార్బర్కు 79 ఎకరాల స్థలం ఉందన్నా. ఆరు జిల్లాల్లో సుమారు 150 మరపడవలు ఉన్నాయి. కావలి నియోజకవర్గంలోని ఆరు తీర ప్రాంత పంచాయతీల్లో మరో వెయ్యి వరకు సంప్రదాయ పడవలు ఉన్నాయి. హార్బర్ అందుబాటులోకి వస్తే నిత్యం నాలుగు వేల మంది వరకు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. చేపలు ఆరబెట్టుకోవడం, ఐస్ ఫ్యాక్టరీలు, వలల రిపేర్లు, తదితర పనులకు ఉన్న స్థలం సరిపోదనుకుంటుంటే కూటమి ప్రభుత్వం హార్బర్ స్థలంలో సగం ప్రైవేట్ సంస్థకు కేటాయించడం అంటే హార్బర్ను పూర్తిగా మూసివేయడంతో సమానం. మీ హయాంలో 95 శాతం పూర్తయిన హార్బర్లో మిగిలిన ఐదు శాతం పూర్తి చేసి, అందుబాటులోకి తేకపోవడం మా కడుపులు కొట్టడమే. మీరే మాకు అండగా నిలబడి న్యాయం చేయాలన్నా. మావాళ్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అధికారులకు అర్జీలు ఇచ్చి విసిగిపోయిన తర్వాత, ప్రాణాలకు తెగించి అక్రమంగా వేట సాగిస్తున్న కడలూరుకు చెందిన పడవలను పట్టుకుని నాలుగు జిల్లాల్లోని 160 గ్రామాలకు చెందిన మత్స్యకారులు వంతుల వారీగా కాపలా ఉంటే పోలీసుల సాయంతో పడవలు తప్పించేశారు. ఈ విషయంలో కూడా మాకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నా. – రామచంద్రయ్య, మత్స్యకారుడు, అన్నగారిపాళెం, కావలి రూరల్ మండలం ఇలాగైతే మేము బతకలేం జగనన్నా..అన్నా.. మీ హయాంలో హార్బర్ వచ్చింది. త్వరత్వరగా నిర్మాణం కూడా పూర్తి చేశారు. మాకు చాలా సంతోషం కలిగిందన్నా. హార్బర్ రాక ముందు మేము తెప్పల్లో వెళ్లి పది కిలోలు, 20 కిలోలు చేపలు తెచ్చుకునే వాళ్లం. వాటిని ఇక్కడ అమ్ముకునే వీలు లేక పల్లెలకు వెళ్లి అమ్ముకునేవాళ్లం. హార్బర్ వచ్చిన తర్వాత మా కష్టాలు తీరుతాయని ఆశ పడ్డాం అన్నా. వలసలు ఆగిపోతాయని, ఇక్కడే పని దొరుకుతుందని సంబర పడ్డాం. ప్రస్తుత చంద్రబాబు కూటమి ప్రభుత్వం హార్బర్లో మిగిలిన కొద్దిపాటి పనులు నిలిపేసి, ప్రైవేట్ సంస్థకు భూములు ఇచ్చిందన్నా. మాకు ఆస్తిగా మీరు ఇచ్చిన హార్బర్ను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడితే ఎలా అన్నా? మీరే మా మత్స్యకారులకు న్యాయం చేయాలన్నా. హార్బర్ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే మా పరిస్థితి ఏమిటన్నా.. ఇలాగైతే మేము బతకలేం జగనన్నా.– రంగయ్య, మత్స్యకారుడు, అలిచెర్ల బంగారుపాళెం, జువ్వలదిన్నె -
మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు: వైఎస్ జగన్
చంద్రబాబుకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా.. కూటమి ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. కళ్లు మూసి తెరిచే లోపు మూడేళ్లు పూర్తవుతాయి. మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తాం. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొత్తు. వాటిని చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా లాక్కోలేరు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు.. మొత్తంగా రూ.26 వేల కోట్లతో అన్ని రకాల అనుమతులతో పనులు ప్రారంభించాం. దాదాపు 95 శాతం ప్రాజెక్ట్ల పనులు పూర్తి చేశాం. మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. ఇది జరిగి రెండేళ్లయినా మత్స్యకారులకు అందుబాటులోకి రాకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది.మన రాష్ట్ర మత్స్యకారులకు సంబంధించిన ఫిషింగ్ ఏరియాలోకి పక్క రాష్ట్రాల మత్స్యకారులు రాకూడదు. కఠిన నిబంధనలు ఉల్లంఘించి తమిళనాడులోని కరైకల్ ప్రాంతానికి చెందిన మెకనైజ్డ్ బోట్లు వచ్చి మన మత్స్యసంపదను తరలించుకు పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్లకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వారే స్వయంగా ప్రాణాలకు తెగించి ఆ బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బోట్లను సీజ్ చేశారు. దీంతో బీద సోదరులు కుట్ర పన్నడం.. నారా లోకేశ్ మార్చి 12న జువ్వలదిన్నెకు రావడం.. మార్చి 16న ఆ బోట్లను ఇక్కడి నుంచి తరలించుకుపోవడం చూస్తున్నాం. ఇందుకు బీద అనుచరుడు, బోట్ యజమాని మధ్య జరిగిన కాల్డేటానే సాక్ష్యం.మత్స్యకారుల కడుపు కొట్టడం కోసం నారా లోకేశ్, ఎంపీ, ఎమ్మెల్యేతో పాటు పలువురు ఏకమవ్వడం దుర్మార్గం. ఆధారాలు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్కరినైనా అరెస్ట్ చేశారా? పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని ఎవరైనా పోలీస్ స్టేషన్ నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లిపోతే మీరు ఇలాగే విడిచి పెడతారా? మత్స్యకారులంటే ఇంత చులకనా? చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగదు. ఇంత కన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ప్రపంచ చరిత్రలో ఇంకొకటి ఉంటుందా?– వైఎస్ జగన్సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వారి కడుపుపై తంతోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ‘ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, రూ.150 కోట్లతో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దాదాపు రూ.16 వేల కోట్లతో 4 పోర్టులు.. మొత్తంగా రూ.20 వేల కోట్లతో ఆ పనులన్నింటికీ శ్రీకారం చుట్టాం. అవే కాకుండా అదనంగా మరో రూ.6 వేల కోట్లతో మొత్తంగా రూ.26 వేల కోట్లతో పోర్టులకు సంబంధించి విస్తరణ ప్రణాళిక కూడా సిద్ధమైంది. మా హయాంలోనే దాదాపు 95 శాతం ప్రాజెక్ట్ల పనులు పూర్తి చేశాం. మా ప్రభుత్వ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పూర్తి చేశాం. 2024 మార్చి 12న ఎన్నికల కోడ్ రావడంతో ప్రత్యక్ష ప్రారంభానికి వీలుపడలేదు. అదే ఏడాది ఆగస్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. రెండేళ్ల క్రితమే జాతికి అంకితమైన ఈ ఫిషింగ్ హార్బర్ను దురదృష్టవశాత్తు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అప్పగించకుండా కుట్రలతో వ్యవహరిస్తోంది’ అని నిప్పులు చెరిగారు. బుధవారం వైఎస్ జగన్ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో మమేకమయ్యారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు. రెండేళ్లయినా ఇంత వరకు దీనిని గంగపుత్రులకు అప్పగించకుండా వారి పొట్ట కొట్టేందుకు చంద్రబాబు సర్కారు హార్బర్ భూములను సాగర్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. ‘జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమే కుట్ర చేస్తోంది. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. మేము రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని అక్కడి నుంచి తరిమేస్తాం. రాష్ట్రంలోని 10 ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు, ఆస్తి. వాటిని ఎవరూ సొంతం చేసుకోలేరు. మత్స్యకారులందరినీ పక్కాగా మ్యాపింగ్ చేసి, ఆర్థిక తోడ్పాటు అందించి.. ఆ హార్బర్ల పరిధిలోనే మెకనైజ్డ్ బోట్లకు యజమానులను చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..జువ్వలదిన్నె హార్బర్ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్వాగతం పలుకుతున్న మత్స్యకారులు, అశేష జనవాహినిలో ఒక భాగం రూ.26 వేల కోట్లతో పనులు ⇒ రాష్ట్రంలో ఎంత ఘోరంగా అన్యాయాలు జరుగుతున్నాయనడానికి ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉదాహరణ. మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మొత్తంగా రూ.26 వేల కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల పనులు ప్రారంభించాం. ⇒ ఇప్పటికే మూలపేట, మచిలీపట్నం పనులు 35 శాతం పూర్తి కాగా, రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఫిషింగ్ హార్బర్లలో జువ్వలదిన్నెను కూడా పూర్తి చేశాం. రాష్ట్రంలో అంతకు ముందు 4 ప్రదేశాల్లో 6 పోర్టులు ఉంటే, కొత్తగా మరో నాలుగు పోర్టులకు శ్రీకారం చుట్టాం. వాటి ద్వారా వాళ్ల జీవన ప్రమాణాలు మెరుగు పడాలని రాష్ట్రవ్యాప్తంగా ఒక మ్యాప్ గీసి పనులు చేపట్టాం. ఎక్కడెక్కడైతే మత్స్యకారులున్నారో వాళ్లందరికీ హక్కుగా ఫిషింగ్ హార్బర్లు రావాలి.⇒ దేవుడి దయతో మన ప్రభుత్వ హయాంలోనే వీట న్నింటికీ వేగంగా అడుగులు ముందుకు పడ్డాయి. పోర్టులకు సంబంధించి కీలకమైన భూ సేకరణలు కూడా పూర్తి చేసి, అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చాం. ఈ పోర్టులన్నింటినీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, బ్యాంకు రుణాలను సైతం దీనికి టై అప్ చేశాం. ఫైనాన్సియల్ క్లోజర్ కూడా కంప్లీట్ చేసి, మారిటైమ్ బోర్డు క్రియేట్ చేశాం. అన్ని రకాలుగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయాం. ⇒ రామాయపట్నం పోర్టులో దాదాపు 95 శాతం ప్రాజెక్టు కూడా పూర్తి చేశాం. శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో కీలకమైన భూసేకరణతో పాటు, అన్ని రకాల అనుమతులు, ఫైనాన్షియల్ టైఅప్ కూడా పూర్తి చేసి, ఆ ప్రాజెక్టులో కూడా దాదాపు 35 శాతం పనులు వేగంగా పరుగెత్తించగలిగాం. అప్పటికే పనులు మొదలయ్యాయి. బ్యాంకుల్లో డబ్బులున్నాయి. ఇక వాళ్లు పనులు చేసుకుంటూ పోతే చాలు ప్రాజెక్టుకు ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా పూర్తవుతుంది. ఆ స్టేజ్లోకి వాటిని తీసుకొచ్చాం. ⇒ మచిలీపట్నంలో కూడా భూ సేకరణ పూర్తి చేసి, అన్ని అనుమతులూ తీసుకొచ్చి బ్యాంకులతో టై అప్ చేసి, లోన్లన్నీ శాంక్షన్ చేయించాం. మారిటైమ్ బోర్డు ద్వారా పూర్తిగా పనులు చేసి, దాంట్లో కూడా దాదాపు 35 శాతం పనులు మన ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కాకినాడ వద్ద ఇంకో ప్రైవేట్ పోర్టు కూడా వేగంగా పనులు మొదలు పెట్టింది. ప్రైవేట్ పోర్టు పక్కన పెడితే ప్రభుత్వ రంగంలో ఉన్న 3 పోర్టుల పనులు రెండేళ్లవుతున్నా ఎందుకు జరగడం లేదు? దీనిపై చంద్రబాబును గట్టిగా నిలదీస్తున్నా. ఇవి కాకుండా దాదాపు రూ.3,800 కోట్లతో మొదలు పెట్టిన 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు. ఇందులో జువ్వలదిన్నె ప్రాజెక్టు ఒకటి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె వద్ద మత్స్యకారులుచంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం ⇒ చంద్రబాబును రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా చీదరించుకుంటున్న పరిస్థితి. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్లు, సూపర్ సెవెన్లు అని, బాండ్లు అని ఇంటింటికీ తిరిగి అందరినీ మోసం చేశాడు. ఎన్నికలైపోయిన తర్వాత గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. ఆయన పెడతానన్న బిర్యానీ కూడా తీసేశాడు. చివరికి పలావు పోయింది. బిర్యానీ పోయింది. ⇒ ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన), వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితులు. మరో వైపు చూస్తే గవర్నమెంట్ బడులు అన్యాయమైన పరిస్థితుల్లోకి పోతున్న దుస్థితి. మనం గోరు ముద్ద పథకం అమలు చేస్తే, ఈ రోజు చిన్నారులకు మంచి భోజనం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. పిల్లల చేతుల్లో ట్యాబ్లు కనపడాల్సిన చోట, ఇంగ్లిష్ మీడియం బోధన జరగాల్సిన చోట.. ఈ రోజు నాసిరకం చదువులు అందుతున్నాయి. పడకేసిన ఆరోగ్యశ్రీ.. మెడికల్ కళాశాలలు నిర్వీర్యం ⇒ ఆరోగ్య శ్రీ పథకం పడకేసింది. రూ.లక్షలు కడితే తప్ప పేదవాడికి వైద్యం అందని పరిస్థితి. ఈ రోజు కూడా ఇక్కడికి ఒకరు బోర్డు పట్టుకుని వచ్చారు. నా పరిస్థితి ఇలా ఉందన్నా.. మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఇలా ఉందన్నా.. అని బోర్డు పట్టుకుని నన్ను కలిసి గోడు చెప్పుకున్నాడు. అదే మన ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీలో ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. 3,300 ప్రొసీజర్లతో ఏ పేద వాడికి ఆరోగ్యం బాగోలేకపోయినా చిక్కని చిరునవ్వుతో వైద్యం అందించే పరిస్థితి ఉండింది. ఈ రోజు పేదవాడికి వైద్యం అందించడానికి నెట్వర్క్ ఆస్పత్రులు బోర్డు తిప్పేస్తున్న పరిస్థితి. వైద్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పాల్సిన పని లేదు. ⇒ ఉచిత పంటల బీమా గాలికెగిరి పోయింది. రైతులకు ఏ పంటకూ గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఆ రోజు అక్కచెల్లెమ్మలకు అన్ని పథకాలు అందిస్తూ.. సున్నా వడ్డీ పథకం సైతం అందించాం. ఈ రోజు అక్క చెల్లెమ్మలకు ఏ పథకమూ అందక.. చివరికి సున్నా వడ్డీ పథకం కూడా తీసేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా ప్రజలు చంద్రబాబును తిడుతున్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ పెద్ద మనిషి చంద్రబాబు ప్రభుత్వాన్ని దేవుడు చూస్తూ ఊరుకోడు. ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేసే రోజులు త్వరలోనే వస్తాయి. మత్స్యకారుల అభివృద్ధి గురించి ఒక్క రోజైనా ఆలోచించారా? ⇒ తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, ఆ పోర్టులతో పాటు ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్, ఫిషింగ్ హార్బర్.. వీటన్నింటి ద్వారా మత్స్యకారులకు మేలు జరిగేలా బ్లూ ఎకానమీని బిల్డ్ చేసేలా అడుగులు ముందుకు వేశాం. అయ్యా చంద్రబాబూ.. నువ్వు ఏ రోజూ కూడా మత్స్యకారుల గురించి గానీ, రాష్ట్రం గురించి గానీ ఆలోచన చేయలేదు. ఈ మాదిరిగా పోర్టులు కట్టాలని కానీ, మత్స్యకారులకు మేలు చేస్తూ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కట్టాలని ఏ రోజూ ఆలోచించ లేదు. ఏ రోజూ వాళ్లకు మంచి జరిగేలా కార్యక్రమం చేయలేదు. ⇒ నువ్వు ఎలాగూ చేయలేకపోతివి. కనీసం జగన్ చేసిన పని.. జువ్వలదిన్నెలో ఇక్కడే కనిపిస్తోంది. ఈ జువ్వలదిన్నె ప్రాజెక్టు తయారై రెండేళ్లు అవుతోంది. నేను 2024 మార్చి 12న ఈ ప్రాజెక్టును వర్చువల్గా జాతికి అంకితం చేస్తే, ప్రధాని మోదీ అదే ఏడాది ఆగస్టులో జాతికి అంకితం చేశారు. అలాంటి దీనిని కూడా మత్స్యకారులకు ఎందుకు అందుబాటులోకి తీసుకురాలేదు? చంద్రబాబు గారూ సమాధానం చెప్పండి.జువ్వలదిన్నె హార్బర్లో నిలిపి ఉన్న బోట్లను పరిశీలిస్తున్న వైఎస్ జగన్ రెండేళ్ల నుంచి ఎందుకంత తాత్సారం?⇒ కాసేపటి క్రితం ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను రాష్ట్రం మొత్తానికి చూపించాం. ఈ ప్రాజెక్టు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే దాదాపుగా రూ.300 కోట్లు ఖర్చు చేశాం. ఈ ప్రాజెక్టు అన్ని రకాలుగా పూర్తయినా కూడా ఈ ప్రభుత్వం మత్స్యకారులకు అందుబాటులోకి తీసుకురాక పోవడం దారుణం. ⇒ బాపట్ల జిల్లాలో నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కు సంబంధించి 62 శాతం పనులు మా ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం హార్బర్ పనులు కూడా దాదాపు 57 శాతం పూర్తయ్యాయి. కాకినాడ జిల్లా ఉప్పాడలో మరో ఫిషింగ్ హార్బర్ పనులు కూడా మన ప్రభుత్వ హయాంలోనే 56 శాతం పూర్తయ్యాయి. ⇒ మరో వైపు రెండో దశ కింద శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాళెం, మంచినీళ్లపేట, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, పశ్చిమగోదావరి జిల్లా బియ్యపుతిప్ప, బాపట్ల జిల్లా వాడరేవు, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టాం. ఇవి కాకుండా దాదాపు రూ.150 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు.. విశాఖపట్నం జిల్లా భీమిలి, విజయనగరం జిల్లా చింతపల్లి, అనకాపల్లి జిల్లా రాజులపేట, దొండవాక, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పల్లంకలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.20 వేల మందిని బోట్లకు ఓనర్లను చేసే వాళ్లం⇒ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, చిల్ రూమ్స్, ఐస్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు, డ్రైయింగ్ ప్లాట్ ఫామ్స్.. ఇవే కాకుండా బోట్ రిపేర్ వర్క్ షాపులు, నెట్ మెండింగ్ మెషీన్లు, గేర్ షెడ్ల వంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తెచ్చాం. ప్రతి ఫిషింగ్ హార్బర్లో ఈ వసతులన్నీ ఉంటాయి. ఈ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏడాదికి దాదాపు 41 వేల టన్నుల మత్స్య సంపద వస్తుంది. మత్స్యకార అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరిగేలా వారికి ప్యాకింగ్, మార్కెటింగ్, వేల్యూ ఎడిషన్లో, ఫుడ్ స్టాల్స్లో పని దొరుకుతుంది. ఈ రకంగా పెద్ద ప్రణాళిక చేశాం. ⇒ ఇక్కడ ఏకంగా 1,250 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారులు హక్కుగా పొందాలని ఆరాటపడ్డాం. ఒక్కో బోటుకు 12–15 మంది వరకు గ్రూపు చేసి వారిని ఓనర్లుగా చేయాలని భావించాం. వారు 10 శాతం చెల్లిస్తే, 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. మిగిలిన 40 శాతం లోనుగా ఇప్పిస్తామని చెప్పాం. ఈ ఆదాయమంతా ప్రతి మత్స్యకారుడికి చెందాలని, వారి కుటుంబాలు బాగుండాలని కలలు కన్నాం. 2024లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనుక వచ్చి ఉంటే మత్స్యకారులందరికీ బోట్లు అంది ఉండేవి. 1,250 మెకనైజ్డ్ బోట్లకు దాదాపు 20 వేల మంది మత్స్యకారులు ఓనర్లు అయ్యేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మత్స్యకారుల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. అయితే మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో కడుతున్న 10 ఫిషింగ్ హార్బర్లను చంద్రబాబు కాదు కదా వారి తాత కూడా మత్స్యకారుల నుంచి లాక్కోలేరని హెచ్చరిస్తున్నా.⇒ ఇక్కడ హార్బర్ కోసం సేకరించిన భూములను ప్రైవేట్ డిఫెన్స్ సంస్థకు కట్టబెట్టి మత్స్యకారులను తరిమేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నాడు. 79 ఎకరాల్లో సగం భూములు ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి కేటాయించి, దోపిడీ కార్యక్రమం చేపట్టారు. కృష్ణపట్నం పోర్టు వద్ద కావాల్సినన్ని భూములున్నాయి. అక్కడ ప్రైవేట్ సంస్థకు కేటాయించకుండా హార్బర్ భూములనే కట్టబెట్టడం వెనుక ఆంతర్యం గ్రహించాలి. ఇదంతా మత్స్యకారులను ఇక్కడి నుంచి తరిమేసే కార్యక్రమం. మత్స్యకారుల కోసం జగన్ భూములు సేకరించి ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తే, చంద్రబాబు వారిని తరిమేసి ప్రైవేట్ వారికిచ్చి దోచుకునే కార్యక్రమానికి తెర లేపాడు. -
జగనన్న కోసం వస్తే పోలీసులు కర్రలతో కొడుతున్నారు
-
సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జిలెటిన్ స్టిక్స్, గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ ప్రమాదంలో పలువురు గాయపడటం బాధాకరమని, గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోందన్నారు. పేలుడు తీవ్రతతో ఇళ్లు ధ్వంసమవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా పేలుడు పదార్థాల నిల్వపై కట్టుదిట్టమైన నియంత్రణలు ఉండాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. -
మత్స్యకారులతో వైఎస్ జగన్ మమేకం (ఫొటోలు)
-
మన వారసత్వం జగనన్న గుండె ధైర్యం, చరిత్రలో ఒకే ఒక్కడు వైఎస్ జగన్
-
ఏ ప్రైవేట్ కంపెనీకి ఇస్తావా ఇచ్చుకో... మా ప్రభుత్వం వచ్చాక మాత్రం
-
వచ్చేది YSRCP ప్రభుత్వమే... వెళ్తూ వెళ్తూ ఇచ్చిపడేసిన జగన్
-
ఇదిగో ఫోన్ కాల్ డేటా.. బీద మస్తాన్ కు ఇచ్చిపడేసిన జగన్
-
2029లో వచ్చేది నేనే.. నీ తాత కూడా ఆపలేడు..
-
ఎవడికి ఇస్తావో ఇచ్చుకో.. నువ్వు కాదు నీ తాత దిగి వచ్చినా.... మాస్ వార్నింగ్
-
మార్చి 12న లోకేష్ వచ్చాడు.. 16న బోట్ల దొంగతనం.. జగన్ కౌంటర్లకు నవ్వులే నవ్వులు
-
వైఎస్ జగన్, మత్స్యకారుడు బాబును ఓ రేంజ్ లో ఏకిపారేశారు
-
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వ(వైఎస్సార్సీపీ) హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చంద్రబాబు సర్కార్ను వైఎస్ జగన్ నిలదీశారు.మత్స్యకారుల నుంచి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబ్టి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి. కళ్లుమూసి తెరిచే లోపే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
మత్సకారులతో YS జగన్ భేటీ
-
వైఎస్ జగన్ జువ్వెలదిన్నె ఏరియల్ సర్వే
-
జగన్ కు ఘన స్వాగతం పలికిన మత్స్యకారులు
-
జగన్ నెల్లూరు పర్యటన.. అడుగడుగునా ఆంక్షలు
-
Watch Live: వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన
-
జువ్వెలదిన్నెకు బయల్దేరిన జగన్.. హెలికాప్టర్ లో మిథున్ రెడ్డి
-
జగన్ పర్యటన.. జువ్వలదిన్నెలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు రూరల్: మత్స్యకారుల సమస్యలు విని వారికి అండగా నిలిచే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెలో ఇవాళ(బుధవారం) పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తోంది.జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు బయటి నుంచి వచ్చే పడవలకూ మద్దతు ఇస్తూ స్థానిక మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తీవ్ర ఆందోళనలకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంతో వాళ్లను కలిసి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. అయితే.. జగన్ రాక నేపథ్యంలో జువ్వలదిన్నె పోలీసు ఆంక్షల వలయంగా మారింది. ఫిషింగ్ హార్బర్ వైపు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మత్స్యకారులను సైతం అటువైపు అనుమతించడం లేదు. చివరకు మీడియాకు సైతం అనుమతి లేదని చెబుతున్నారు. ఈ ఆంక్షలపై వివరణ కోరితే.. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇదీ చదవండి: జువ్వలదిన్నెకు జగనన్న.. కూటమిలో ఉలిక్కిపాటు -
మా భవిష్యత్.. మా నమ్మకం నువ్వే జగన్
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటన యావత్ ఆంధ్రప్రదేశ్ తీరంలోని మత్స్యకారుల జీవితాలకు భరోసాగా నిలువనుందా? అంటే అవునని గంగపుత్రులతోపాటు వైఎస్సార్సీపీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. ఆయన చేసే దిశానిర్దేశంపైనే మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. వైఎస్ జగన్ తమ భావితరాల భవిష్యత్ కోసం అందుబాటులోకి తెచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం, తాము ప్రాణాలకు తెగించి పట్టుకున్న పుదుచ్చేరి బోట్లను వదిలేసేందుకు మంత్రి లోకేశ్ పోలీసులకు ఆదేశాలివ్వడం, టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు వదిలేయించడంతో ఎవరు ఎవరి ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారో అర్థమవుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. తమ జీవితాలను మార్చేందుకు వైఎస్ జగన్ పడిన కష్టాన్ని, విజన్ను వృథా కానివ్వమని, మా భవిష్యత్, మా నమ్మకం జగనేనంటున్నారు. మత్స్యకారుల బతుకులతో ఆడుకుంటూ, భవిష్యత్ను చీకట్లోకి నెట్టేసే ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జువ్వలదిన్నెలో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 8.45 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి 9గంటలకు హెలిప్యాడ్ వద్దకు చేరుకుని జువ్వలదిన్నెకు బయలుదేరుతారు. 10 గంటలకు జువ్వలదిన్నె హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఫిషింగ్హార్బర్ వద్దకు చేరుకుని 10.25 గంటల వరకు సందర్శిస్తారు. ఆ తరువాత 11.05 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని బెంగళూరుకు తరలి వెళుతారు.చంద్రబాబు/లోకేశ్ చేసిన ద్రోహం æగత ప్రభుత్వం ప్రారంభించి, పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సీఎం చంద్రబాబు, లోకేశ్, నేతలు ఈ క్రెడిట్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని, మత్స్యకారుల్లో ఆయనకు బలం పెరుగుతుందని భావించి కుట్రలకు తెగించారు. ఫిషింగ్ హార్బర్కు కేటాయించిన 78.6 ఎకరాల్లో ముఖ ద్వార ప్రాంతంలోనే తొలి దశలోనే 29.5 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టేసి ఒక్క రోజు ముందు వచ్చి శంకుస్థాపన చేసి మత్స్యకారుల భావితరాలకు సైతం ద్రోహం చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ జాలర్లతో పడుతున్న కష్టనష్టాల నేపథ్యంలో ఐదు నెలల క్రితం ప్రాణాలకు తెగించి కావలి మండలం పెద్దపట్టపుపాళెం, బోగోలు మండలం జువ్వలదిన్నె ప్రాంతాల్లో నాలుగు పాండిచ్చేరి బోట్లను పట్టుకున్నారు. అప్పట్లో మత్స్య శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. తమిళ బోట్ల యజమానులతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల నేపథ్యంలో మార్చి 12న జువ్వలదిన్నెకు వచ్చిన లోకేశ్ నాలుగు పాండిచ్చేరి బోట్లు వదిలేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు. మత్స్యకారులతో పెట్టుకుంటే ఇబ్బందని పోలీసులు చెప్పినా రెడ్బుక్ రాజ్యాంగం మత్తులో ఉన్న లోకేశ్ అదంతా నేను చూసుకుంటానని చెప్పి వెళ్లిపోయినట్లు సమాచారం. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రను మార్చి 17న నెల్లూరుకు పంపించి, మత్స్యకారులకు మేలు చేస్తున్నామంటూ మీటింగ్ పెట్టించారు. స్థానికుడైన టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు సహకారంతో అదే రోజు రాత్రి నాలుగు పాండిచ్చేరి బోట్లను వదిలేయించి ఏకంగా ఆత్మస్థైర్యంపైనే దెబ్బ కొట్టారు.ఫలితం ఏమిటంటే.. ఐదు నెలలుగా స్థానిక మత్స్యకారుల నిర్బంధంలో పాండిచ్చేరి బోట్లు ఉండగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటు వైపు కన్నెత్తి చూడడానికి భయపడిన తమిళ జాలర్లు.. బోట్లు విడుదల చేసిన మరుసటి రోజు నుంచే విచ్చలవిడిగా తీరం వైపు దూసుకొచ్చి ఆంధ్రా మత్స్యకారులకు సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేసిన మేలు తరతరాలుగా సంప్రదాయ వృత్తి వేటను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని, భావితరాల భవిష్యత్ను ఉజ్వలం చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక అభివృద్ధి చేపట్టారు.బతుకు దెరువుకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, గుజరాత్ వంటి పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్లే మత్స్యకారులు, యువతకు స్థానికంగానే వేట, ఉపాధి కలి్పంచేందుకు జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్కు శ్రీకారం చుట్టారు. దానికి అనుబంధంగా మత్స్యకార మహిళలకు మత్స్య సంపద ప్యాకింగ్, మార్కెటింగ్, ఫుడ్ కోర్టుల ద్వారా ఉపాధి అవకాశాలు కలి్పంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిషింగ్ హార్బర్లో కోల్డ్ చైన్, ఐస్ ప్లాంట్, చిల్ రూమ్ వంటి మౌలిక వసతులు, బోట్ రిపేర్ వర్క్ షాపులు, గేర్ షెడ్లు, నెట్ మెండింగ్ షెడ్లు వంటి సౌకర్యాలు కలి్పంచారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్యాయంచంద్రబాబు ప్రభుత్వంలో మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. ప్రభుత్వం చేయాల్సిన పని మేం చేసి తమిళ రాష్ట్రాల సోనాబోట్లను పట్టుకుంటే వాటిని ప్రభుత్వ పెద్దలు గుట్టు చప్పుడు కాకుండా విడిచి పెట్టి ఏం తెలియనట్లు నాటకాలాడుతున్నారు. అదేమంటే మంత్రుల కమిటీ వేశామని బుకాయిస్తున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటనతో మత్స్యకారులకు పూర్తి భరోసా ఉంటుంది. మత్స్యకారులకు జగనన్నే అండ. – కొండూరి అంకయ్య, ఎంపీటీసీ, పాకలఆర్థికంగా నష్టపోయాం సోనాబోట్ల కారణంగా ఆర్థికంగా నష్టపోయాం. సోనాబోట్లను అడ్డుకోవాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేదు. చివరికి మేం సమష్టిగా వెళ్లి 4 సోనాబోట్లను తెచ్చి జువ్వలదిన్నె హార్బర్లో ఉంచితే వాటిని ప్రభుత్వ పెద్దలు కుటిల రాజకీయంతో విడిపించి మాకు తీరని ద్రోహం చేశారు. మత్స్యకారులకు మొదటి నుంచి జగనన్న అండగా ఉన్నారు. జగనన్న పర్యటనతో మత్స్యకారులకు మేలు జరుగుతుంది. – కాటంగారి చిట్టిబాబు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు, పోతయ్యగారిపట్టపుపాళెం, పాకలమా గోడు ఆలకించరు ఇతర రాష్ట్రాల సోనాబోట్ల వల్ల తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా మా గోడు పట్టించుకోలేదు. మేం చందాలు వేసుకుని నిధులు సమకూర్చుకుని సోనాబోట్లపై ప్రాణాలకు తెగించి దాడి చేసి వాటిని పట్టుకుంటే ప్రభుత్వ పెద్దలు ఏం ఎరగనట్లు కుట్రలు పన్ని వాటిని విడిపించి మాకు తీరని ద్రోహం చేశారు. ప్రభుత్వ పెద్దలు మాకు మభ్య పెట్టే మాటలు చెబుతున్నారు. జగనన్న పర్యటనతో మత్స్యకారులకు పూర్తి భరోసా లభిస్తుంది. – వాయిల రామ్మూర్తి, మాజీ కాపు, పోతయ్యగారిపట్టపుపాళెం, పాకలటీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ గుర్తించలేదు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ మా భవిష్యత్ గురించి ఆలోచన చేయలేదు. వైఎస్ జగన్ ఐదేళ్లు అధికారంలో ఉంటే.. అందరితోపాటు సమానంగా సంక్షేమ పథకాలు, మా మహిళలకు పొదుపు రుణాల మాఫీ, మా బిడ్డలకు అమ్మఒడి, ఫీజురీయింబర్స్మెంట్, మాకు వేట నిషేధ సమయంలో ఏటా రూ.10 వేలు లెక్కన ఠంచన్గా అందించారు. చంద్రబాబు రూ.20 వేలిస్తామని చెప్పినా.. సగం మందికి కూడా రావడం లేదు. ఈ సమస్యలన్నీ జగన్కు వివరించి పరిష్కారం కోరాలని మత్స్యకారులందరూ ఎదురు చూస్తున్నారు. – వాయిల శ్యామ్, మార్కండేయపురం, తుమ్మలపెంట పంచాయతీ -
నేడు వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన
-
జగన్ వల్లే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్: మత్స్యకారుడు
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటనకు సంబంధించిన అప్డేట్స్.. -
శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి జగన్ కు ఆహ్వానం..
-
గంగపుత్రులకు వెన్నుదన్నుగా
సాక్షి, అమరావతి: వేటకు వెళ్తేగానీ పూట గడవని గంగపుత్రులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచిందని మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా, జగనన్న ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం.. ఇలా ప్రతి సంక్షేమ పథకం ద్వారా గత ప్రభుత్వంలో తాము లబ్ధి పొందామని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా క్రమం తప్పకుండా అందించిన వేట నిషేధ భృతి (మత్స్యకార భరోసా), ఆయిల్ సబ్సిడీ పెంపుతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య, వేటపై ఆధారపడి జీవనోపాధి పొందిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదేళ్లు క్రమం తప్పకుండా.. ఎన్నికల హామీ మేరకు 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చీ రాగానే మత్స్యకారులకు వేట నిషేధ భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచడమే కాదు.. ఆరంభంలోనే నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా నిషేధ భృతిని అందించి వారికి అండగా నిలిచారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లకే కాదు.. తెప్పలు, ఇతర సంప్రదాయ పడవలపై వేట సాగించే వారికి సైతం సాయాన్ని అందజేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది.2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఏటా సగటున 60 వేల మంది మాత్రమే లబ్ధి పొందితే 2019–24 మధ్య వైఎస్ జగన్ హయాంలో 5.38 లక్షల మందికి రూ.538 కోట్లకుపైగా భృతిని అందజేశారు. గతంలో డీజిల్పై లీటర్కు రూ.6.03 చొప్పున సబ్సిడీ ఇవ్వగా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.9కు పెంచింది. వేటకు వెళ్లే్టప్పుడు సబ్సిడీని మినహాయించుకుని ఆయిల్ నింపుకొనే వెసులుబాటు కల్పించారు.2014–19 మధ్య 1,100 బోట్లకు మాత్రమే ఆయిల్ సబ్సిడీని వర్తింప చేస్తే.. 2019–24 మధ్య ఈ సంఖ్య ఏకంగా 23,209కి పెరిగింది. ఆయిల్ సబ్సిడీ ద్వారా రూ.148 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇక 50 ఏళ్ల పైబడిన మత్స్యకారులకు ఇస్తున్న పింఛన్ 2018–19 నాటికి 42,729 మందికి వర్తింప చేయగా 2019–24 మధ్య ఏకంగా 69,741 మందికి అందచేశారు. టీడీపీ హయాంలో పింఛన్ కోసం రూ.51.57 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.759.47 కోట్లు వెచ్చించింది. పరిహారం రెట్టింపు.. చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి ఆదుకుంది. 2019–24 మధ్య 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.16.87 కోట్ల పరిహారాన్ని అందజేసింది. మరోవైపు డాక్టర్ కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు రూ.647.44 కోట్లు సాయాన్ని అందించారు. వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో గత ప్రభుత్వం రూ.4,913 కోట్ల మేర మత్స్యకారులకు లబ్ధి చేకూర్చింది.గత ప్రభుత్వంలో ఏపీకి అవార్డులు..వైఎస్ జగన్ ప్రభుత్వ తోడ్పాటుతో మత్స్య ఉత్పత్తుల దిగుబడులు 39.92 లక్షల టన్నుల (2018–19లో) నుంచి 51.58 లక్షల టన్నులకు (2023–24లో) చేరాయి. 2019–24 మధ్య జాతీయ స్థాయిలో 19.37 శాతం వృద్ధి రేటు నమోదైతే.. ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్కు స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కడం గమనార్హం.చంద్రబాబు, కూటమి వచ్చాక ఆ భరోసా మచ్చుకైనా కానరావడం లేదని మత్స్య కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా రూ.20 వేల చొప్పున మత్స్యకార భరోసా ఇస్తామని హామీ ఇచి్చన చంద్రబాబు ప్రభుత్వం తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టిందని, రెండో ఏడాది అరకొరగా విదిలించి చేతులు దులుపుకొందని మండిపడుతున్నారు. ఇక డీజిల్ సబ్సిడీ ఎప్పుడిస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. ఆయిల్ కంపెనీలు డీజిల్పై లీటర్కు రూ.24 మేర పెంచిన భారాన్ని తగ్గించాలని మొర పెట్టుకున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వెన్నుదన్నుగా నిలిచారు.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు జరిగినంత మేలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు బాటలు వేశారు. ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకార భరోసా అందించి వెన్నుదన్నుగా నిలిచారు. చేయూత, ఆసరా, ఫీజు రీయింబర్సుమెంట్, ఆరోగ్యశ్రీ, ఇళ్లపట్టాలు, ఇళ్లు.. ఇలా ప్రతీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చారు. –వాసుపల్లి జానకీరామ్, ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఏ ఒక్క పథకం లేదు.. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు మహర్దశ. నేడు మమ్మల్ని పట్టించుకునేవారు కరువయ్యారు. తొలి ఏడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టారు. మత్స్యకారులకు ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు కావడం లేదు. కొత్తగా మత్స్యకార పింఛన్లు మంజూరు చేయడం లేదు. బతుకు భారంగా తయారైంది. –చోడిపల్లి శ్రీను, మత్స్యకారుడు, పాయకరావుపేట -
పోర్టులు, హార్బర్లపై 'బాబు' వల!
సాక్షి, అమరావతి: కొత్తగా సంపద సృష్టిస్తానని నమ్మబలికి ఉన్న సంపదనే బినామీల చేతుల్లో పెట్టేస్తున్నారు..!అభివృద్ధికి తానే కేరాఫ్ అంటూ జబ్బలు చరుచుకుంటూ.. జరిగిన అభివృద్ధిని నాశనం చేసేస్తారు! ప్రజోపయోగ కార్యక్రమాలన్నింటినీ నిలిపివేసి ప్రజాధనాన్ని వాటాలతో పంపకాలు చేస్తుంటారు!వారం వారం రూ.వేల కోట్ల అప్పులు చేస్తూ.. పైసాకి కూడా లెక్కలు చెప్పరు..! టోటల్గా చంద్రబాబు పాలన అంటే రాష్ట్ర సంపదను కరగబెట్టి తన బినావీులకు ధారపోయడం! వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ ముందుచూపు, విజన్తో శ్రీకారం చుట్టిన 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను తన సన్నిహితులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు అధికారంలోకి రాగానే పనులను కుట్రపూరితంగా నిలిపివేయడమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో 1,053 కి.మీ. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలో రూ.26,501 కోట్లతో చేపట్టిన పోర్టులు, షిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే తొక్కిపెట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన వాటిని కూడా అందుబాటులోకి తేకుండా మోకాలడ్డారు. ప్రధాని ప్రారంభించిన జువ్వలదిన్నెను అందుబాటులోకి తేకుండా...రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్, మూలపేట వద్ద 4 కొత్త పోర్టులతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ల్యాండ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులకు అన్ని రకాల అనుమతులు సాధించి ఎక్కడా మధ్యలో పనులు ఆగకుండా పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చి ప్రారంభించింది. 2024 ఎన్నికల నాటికే రామాయపట్నం పోర్టు 90 శాతానికిపైగా పూర్తయింది. బల్క్ కార్గో బెర్త్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది. దీనిని 2024 ఆగస్టు 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అయినాసరే.. దాదాపుగా పూర్తయిన రామాయపట్నం పోర్టుతోపాటు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువ్వలదిన్నె హార్బర్ను అందుబాటులోకి తేకుండా చంద్రబాబు నిలిపివేశారు. రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడంతో ఆ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడింది. కూటమి సర్కారుపై మత్స్యకారుల్లో ఆగ్రహావేశాలు..తమిళనాడుకు చెందిన మత్స్యకారులు భారీ బోట్లతో రాష్ట్ర తీరంలోకి అక్రమంగా చొరబడి మత్స్య సంపదను అపహరిస్తున్నట్లు స్వయంగా నెల్లూరు కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తెచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నెల్లూరు జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు ఎదురొడ్డి తమిళనాడు బోట్లను పట్టుకొని బంధిస్తే కూటమి సర్కారు దొడ్డిదారిన వదిలేయడంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. డబ్బులు తీసుకుని బోట్లను వదిలేసిన గ్రామాలను గుర్తించి జరిమానా విధించడమే కాకుండా అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుతో మత్స్యకారులు ఎవరూ మాట్లాడకూడదంటూ మత్స్యకార సంఘాలు అంతర్గతంగా ఆదేశించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. దీంతో ముఖ్యమంత్రి హడావుడిగా సమీక్ష నిర్వహించి రెండో విడత హార్బర్ల నిర్మాణం చేపట్టాలంటూ బుజ్జగించే యత్నాలు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి తెచ్చి ఉంటే 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరేది. ఈ హార్బర్లు అందుబాటులోకి వస్తే అదనంగా 4.5 లక్షల టన్నుల మత్స్య సంపద ద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,000 కోట్లు పెరిగి ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు.ప్రైవేటీకరణ దిశగా బాబు అడుగులుపీపీపీ విధానంలోకి పోర్టులు, ఫిషింగ్ హార్బర్లుతూర్పు తీర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో టీడీపీ పెద్దలకు కావాల్సిన వారికి కట్టబెట్టడానికి రంగం సిద్ధమైంది. సంపద సృష్టిలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తే.. చంద్రబాబు వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటుపరం చేస్తున్న చంద్రబాబు సర్కారు.. మిగిలిన పోర్టులు, హార్బర్లను కూడా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టనుంది. ఈ కుట్రలో భాగంగానే తీరప్రాంతం అభివృద్ధి ముసుగులో ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్లైన్స్ 2026 తాజాగా విడుదల చేసింది. దీనిద్వారా తీర ప్రాంతంలోని వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను టీడీపీ పెద్దలు తమకు నచ్చినవారికి కేటాయించనున్నారు. తీర ప్రాంతంలో ‘ఏ’ కేటగిరీ భూములను ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా, బీ కేటగిరీ కింద భారీ స్థాయిలో భూ కేటాయింపులను ప్రభుత్వ ఆమోదంతో చేపట్టనున్నారు. కనిష్టంగా ఆరు నెలల నుంచి 30 సంవత్సరాల వరకు లీజు విధానంలో ఈ భూములను కట్టబెట్టనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్లో అభివృద్ధి చేసిన పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను పీపీపీ విధానంలోకి మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నారు. ఇందులో భాగంగానే నిర్మాణ పనులను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో బందరు పోర్టు నిర్మాణ కాంట్రాక్టుల విలువ భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. గతేడాది మార్చిలో రూ.402.62 కోట్ల పనులను కేటాయించగా తాజాగా మరో రూ.395.38 కోట్ల విలువైన పనులను అప్పగిస్తూ బందరుపోర్టు కాంట్రాక్టు సంస్థకు ప్రభుత్వం నజరానా అందించింది. వాస్తవానికి గతేడాది డిసెంబర్ నాటికి అందుబాటులోకి రావాల్సిన పోర్టు పనులను నిలిపివేసి చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది.మత్స్యకారులకు దగా..ఫిషింగ్ హార్బర్ల వద్ద నౌకా తయారీ కేంద్రాలుచేపల వేట కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కష్టాలను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.3,520.64 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తొలిదశలో సుమారు రూ.2,113.06 కోట్లతో ఐదు హార్బర్లు నిర్మించాలని ప్రతిపాదించగా కూటమి సర్కారు వాటిని నాలుగుకు కుదించడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని రూ.632 కోట్లకు తగ్గించేసింది. బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, ఓడరేవుల్లో మాత్రమే హార్బర్లు నిర్మిస్తోంది. బియ్యపుతిప్పను ఫిషింగ్ హార్బరు నుంచి ఫిష్ల్యాండ్ సెంటర్గా మార్చేసింది. మత్స్యకారుల ఆర్థిక స్థితిగతులను మార్చేసే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయంలో కోత పెట్టడంపై మత్స్యకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిర్మాణ పనుల నుంచి ప్రభుత్వం తప్పుకోవడమే కాకుండా ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించడంపై మండిపడుతున్నారు. అంతేకాదు.. ఫిషింగ్ హార్బర్ల వద్ద నౌకా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు మత్స్యకారుల పొట్ట కొడుతోంది. ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరులో 29.58 ఎకరాలను పుణెకు చెందిన సాగర్ డిఫెన్స్కు అప్పగించగా.. మచిలీపట్నం హార్బర్ వద్ద కూడా నౌకా తయారీ కేంద్ర నిర్మాణం దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.జగన్పై నమ్మకంతోనే భూములిచ్చాం.. వైఎస్ జగన్పై ఉన్న నమ్మకంతోనే మా భూములను, గ్రామాన్ని మూలపేట పోర్టుకు త్యాగం చేశాం. పోర్టు పనులు కూడా వేగంగా జరిగాయి. ఈ ప్రాంత అభివృద్ధికి జగన్ చేసిన కృషిని భావితరాలు కూడా గుర్తుంచుకుంటాయి. – జీరు శివ, నిర్వాసితుడు, మూలపేట, సంతబొమ్మాళి మండలంప్రాణాలైనా అర్పిస్తాం.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మా మత్స్యకారుల భవిష్యత్తు. వైఎస్ జగన్ మా బతుకులు మార్చాలని గట్టి సంకల్పంతో నిర్మించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏనాడూ మా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. వైఎస్ జగన్ కట్టించిన ఫిషింగ్ హార్బర్ భూముల్లో కొంత భాగం ప్రైవేట్కు అప్పగించారంటే.. మిగతాది కూడా వారికి కట్టబెట్టే ఉద్దేశం ఉన్నట్లే. ప్రాణాలైనా అర్పించి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కాపాడుకుంటాం. – మామిడి గోవిందస్వామి, మాజీ సర్పంచ్, జువ్వలదిన్నె, బోగోలు మండలం జగన్ వరమిస్తే.. చంద్రబాబు ద్రోహం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మించి వైఎస్ జగన్ వరమిస్తే.. చంద్రబాబు వచ్చి ద్రోహం తలపెట్టారు. మా ప్రాంతాన్ని ప్రైవేట్కు అప్పగించే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడుంది? మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డికి పేరొస్తోందనే దుగ్ధతోనే మా బతుకులు, భవిష్యత్ను అంధకారం చేయడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నారు. మత్స్యకారులంతా ఏకమై మా అభిప్రాయాలను వైఎస్ జగన్కు తెలియజేయాలని తీర్మానించుకున్నాం. – ప్రళయ కావేరి రాంబాబు, తుమ్మలపెంట, కావలి మండలంఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు..బందరు పోర్టుతో ఈ ప్రాంతవాసుల కల సాకారమైంది. ఎన్నో సంవత్సరాలుగా పోర్టు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీని నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలి. పోర్టు ఆధారిత పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి. – మద్దుల గిరీష్, కృష్ణాజిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, మచిలీపట్నం, కృష్ణాజిల్లాగత ప్రభుత్వం సఫలీకృతం.. పోర్టు నిర్మాణంతో బందరుకు మహర్దశ రానుంది. 20 సంవత్సరాలుగా పోర్టు నిర్మాణం కోసం పోరాటం చేశాం. పోర్టు తీసుకురావటంలో గత ప్రభుత్వం సఫలీకృతమైంది. శరవేగంగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.– డాక్టర్ బి.శ్రీనివాసాచార్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్, ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడుహార్బర్తో మత్స్యకారులకు మేలుమచిలీపట్నం హార్బర్ నిర్మాణంతో ఈ ప్రాంత మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుంది. మత్స్యసంపదకు మంచి ధర లభించేలా ఎగుమతిదారులను ప్రోత్సహించాలి. సముద్ర ముఖ ద్వారాన్ని మెరుగుపరచాలి. – సైకం ఆంజనేయులు, డీప్ సీ ఫైబర్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
నేడు వైఎస్ జగన్ జువ్వలదిన్నె పర్యటన
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం జువ్వలదిన్నెలో పర్యటించనున్నారు. ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం బోగోలు మండలంలోని జువ్వలదిన్నె చేరుకుంటారు.10.30 గంటలకు ఫిషింగ్ హార్బర్ను పరిశీలించిన అనంతరం 11 గంటలకు మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు. -
శ్రీమన్నారాయణ మహాయజ్ఞానికి వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఆధ్యాత్మికత,ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలం ఉల్లిపాలెంలో ఈ నెల 19 నుంచి 29 వరకు శ్రీమన్నారాయణ మహాయజ్ఞం జరగనుంది.శ్రీమన్నారాయణ మహాయజ్ఞంలో పాల్గొనాలని కోరుతూ శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామి వైఎస్ జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ‘అభినవ మేల్కోట భక్తి గీతమాలిక’ సీడీని జగన్ ఆవిష్కరించారు. అనంతరం సంపత్కుమార రామానుజ జీయర్ స్వామిని సత్కరించారు. తరువాత వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలు సమాజానికి ఐక్యతను, సానుకూలతను తెస్తాయి. ఇలాంటి మహాయజ్ఞాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి’ అని అన్నారు.కార్యక్రమంలో మాజీ మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను వేమూరు టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సమర్ధించడం ఎంతవరకు సమంజసం అంటూ తనీష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.దీనిపై ఎమ్మెల్యే కార్యాలయానికి చెందిన వ్యక్తి ఫిర్యాదుతో చినపులివర్రులో కొల్లూరు ఎస్ఐ ఏడుకొండలు, మరికొందరు పోలీసులు తెల్లవారుజామున మఫ్టీలో గోడదూకి తన ఇంట్లోకి చొరబడి తనను వెంట తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారని వైఎస్ జగన్కు తనీష్ బాబు వివరించారు. ఎవరు మీరు, నా భర్తను ఎందుకు తీసుకెళుతున్నారని ప్రశ్నించిన తన భార్య అనూషపై, అడ్డుకున్న స్ధానికులపై దౌర్జన్యం చేసిన తీరును వైఎస్ జగన్కు ఆయన వివరించారు.తనీష్బాబును అక్రమంగా తీసుకెళుతున్న సమాచారం తెలుసుకుని అప్పటికప్పుడు తాను చినపులివర్రు వెళ్ళి పోలీసుల దౌర్జన్యాన్ని నిలదీసినట్లు వేమూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు తెలిపారు. సోషల్ మీడియా కేసులలో నోటీసులు ఇవ్వకుండా వీధిరౌడీల్లా అర్ధరాత్రి ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడమేంటని ప్రశ్నించిన వైఎస్ జగన్.. పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మండిపడ్డారు.తనీష్బాబుకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని.. తనీష్ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో తనీష్ బాబు భార్య అనూష, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, చిలుమూరు రామ్మోహన్ రావు, సొంటి కామేశ్వరరావు, వసుమల్ల రోహిత్, అంబటి రామ్మోహన్ రావు ఉన్నారు. -
ప్రైవేట్ కేసు వేద్దాం.. న్యాయ సాయం చేస్తాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంబొట్లవారి పాలెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణార్జునరెడ్డి మంగళవారం కలిశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాననే నెపంతో తనను చెరుకుపల్లి ఎస్ఐ అనిల్కుమార్ అక్రమంగా స్టేషన్లో నిర్భందించి, విచక్షణారహితంగా లాఠీలతో కొట్టాడని.. తన శరీరంపై గాయాలను వైఎస్ జగన్కు కృష్ణార్జునరెడ్డి చూపారు.టీడీపీ నాయకుల మెప్పు పొందడానికి కొంతమంది పోలీసు అధికారులు రెచ్చిపోతున్నారని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి బాధితులకు న్యాయం జరిగేలా చూద్దామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. కృష్ణార్జునరెడ్డిని అక్రమంగా నిర్భందించి దాడిచేసిన ఎస్ఐ అనిల్పై చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ జగన్కు వైఎస్సార్సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ వివరించారు. కృష్ణార్జున రెడ్డికి అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, అతని కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. -
ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు
-
అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి
-
మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్: సీదిరి అప్పలరాజు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఉన్న ఫిషింగ్ హర్బర్లను మత్స్యకారులకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జువ్వలదిన్నె(కావలి) హార్బర్ను ప్రైవేట్పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి మత్స్యకారులకు తోడుగా, అండగా నిలిచింది వైఎస్ జగన్ మోహన్రెడ్డినే. వైఎస్సార్సీపీ హయాంలో పది ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయన మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు. కానీ, కూటమి ప్రభుత్వం మళ్లీ మత్స్యకారులను జీవితాలను చీకట్లోకి నెట్టేస్తోంది. కూటమి పని తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు ఆలోచన చేయాలి.. ఆంధ్రా మత్స్యకారులు పాక్, బంగ్లా జైళ్లలో మగ్గిపోవడం చూశాం. ఇప్పుడు ఫిషింగ్ హార్బర్లను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర చేస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్పరం చేయాలనుకోవడం దుర్మార్గం. అసలు ఫిషింగ్ హర్బర్లలోకి మత్స్యకారులు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మత్స్యకారుల జీవితాలను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీదిరి ప్రశ్నించారు. మత్స్యకారులు ఉద్యమించి.. గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని సీదిరి పిలుపు ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్ల ప్రైవేటీకరణ అంశంపై కూటమిని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు నోరు తెరవకపోతే మరింత అన్యాయం జరుగుతుంది. మిగతా ఫిషింగ్ హార్బర్లనూ ప్రైవేటీకరణ చేస్తారు. అందుకే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్న మత్స్యకారులు ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ప్రైవేటీకరణ వద్దు.. హర్బర్లు ముద్దు అని నినాదాలు చేయాలి. మత్స్యకారులకు వైఎస్జగన్ అండగా ఉన్నారు. కాబట్టి రేపటి ఆయన జువ్వలదిన్నె పర్యటన విజయవంతం చేయాలి’’ అని సీదిరి అప్పరాజు కోరారు. -
నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం
-
అంబేద్కర్ పేరును పలకడం కాదు.. ఆశయాల ఆచరణే ముఖ్యం
సాక్షి, తాడేపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాల కొనసాగింపుపై ఆయన చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.‘‘అంబేద్కర్ని గుర్తు చేసుకోవడం అంటే ఆయన వారసత్వాన్ని అనుసరించడం కాదు.. ఆ ఆశయాలను ఆచరణలో పెట్టడం. ఆయన పేరును ఎన్ని సార్లు పలుకుతామన్నది కాదు.. ఆయన విజన్ను ఎంత స్థిరంగా ముందుకు తీసుకెళ్తామన్నదే ముఖ్యం. అదే ఆయనకు ఇచ్చే నిజమైన గౌరవం’’ అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఒక ఆంగ్ల పత్రిక కోసం తాను రాసిన వ్యాసాన్ని కూడా పంచుకున్నారు. ఆ వ్యాసంలో అంబేద్కర్ వారసత్వాన్ని కేవలం జ్ఞాపకార్థకంగా కాకుండా.. సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలను పాలనలో ఆచరణలో పెట్టడం ద్వారానే ఆయనకు నిజమైన నివాళి అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.To remember Babasaheb Ji is not to ritualise his legacy, but to apply it. The measure of our commitment lies not in how often we invoke his name, but in how consistently we advance his vision.#AmbedkarJayanti#StatueOfSocialJusticehttps://t.co/RtKG4gUOmU pic.twitter.com/QN9y6qb2ll— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2026 -
జువ్వలదిన్నెకు వైఎస్ జగన్.. కూటమిలో ఉలిక్కిపాటు
సాక్షి, నెల్లూరు రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటన కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. గత నెల రోజులుగా తీరప్రాంతంలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడేమో.. రేపటి జగన్ పర్యటనతో తారాస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల వ్యవహారంతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్నాయి. తీర ప్రాంతంలో టీడీపీ జెండా పీకేసేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, తమను దోచుకుంటున్న పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లను వదిలేయడం వంటి ఘటనలు మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. పైగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు ఈ కుట్రలకు కారణమని ఆరోపణలు రావడంతో, ఆయనను తీరప్రాంతంలో నిషేధిస్తూ, ఆయనతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడితే భారీ జరిమానా విధించేలా మత్స్యకార పెద్దలు తీర్మానించడం(దురాయి విధింపు) సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. జగన్ రాక మత్స్యకారుల పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఫిషింగ్ హర్బర్ను సందర్శించడంతో పాటు ఆయన మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే అదనుగా జగన్ ఇచ్చే భరోసాతో మత్స్యకారులు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు. తమ భవిష్యత్ బతుకులకు వెన్నుపోటు పొడిచి ఛిద్రం చేస్తున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదని మత్స్యకారులు అంటున్నారు. జగన్ పర్యటన తర్వాత కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. తెలుగు దేశం పార్టీని తీర ప్రాంతంలో సమూలంగా నిషేధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గంగలో కలిపేస్తామని తీర్మానం చేయబోతున్నాయట. జగన్ రాకతో ఉమ్మడి నెల్లూరుతో పాటు ప్రకాశం, గుంటూరుల నుంచి కూడా భారీగా మత్స్యకారులు తరలి రావొచ్చని అంచనాలున్నాయి. ఈ పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం.. జగన్ పర్యటనకు మత్స్యకారులు స్వచ్చందంగా తరలి రాకుండా తమదైన కుట్రలను ప్రయోగించే అవకాశం లేకపోలేదు. -
ఈ నెల 15న వైఎస్ జగన్ పర్యటన కాకాణి క్లారిటీ..
-
ఈ నెల 15న YS జగన్ నెల్లూరు పర్యటన
-
అమరావతి VS మావిగన్.. జగన్ విజన్ వర్సెస్ బాబు శకుని బుద్ది
-
మావిగన్ వారియర్స్.. అమరావతి గ్రాఫిక్స్!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన రాజధాని ‘మావిగన్’ ఓవైపు... ముఖ్యమంత్రి చంద్రబాబు అరచేతిలో వైకుంఠంగా చూపిస్తున్న రాజధాని అమరావతి మరోవైపు..! రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి గ్రోత్ ఇంజన్గా మావిగన్... రాజధాని ముసుగులో చంద్రబాబు ముఠా అవినీతికి వేదికగా అమరావతి...! రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు పారబోసుకోవడం అవివేకమని ప్రజలు గుర్తిస్తుండటం తాజా పరిణామం. ఆచరణ సాధ్యం కాని అమరావతి కంటే అతివేగంగా సాకారమయ్యే మావిగన్ వైపు ప్రజాభిప్రాయం మొగ్గుతోందన్నది స్పష్టమవుతుండటం ఆసక్తికరంగా మారింది. దాంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తన శకుని మార్కు కుతంత్రాలకు బరి తెగించారు. రాజధాని అంశంలో టీడీపీ కుట్రలు బెడిసికొట్టడంతో తనదైన డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అమరావతి ఆచరణ సాధ్యం కాదని... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపాదించిన రాజధానిగా ‘మావిగన్’ అందుబాటులో ఉన్న ఏకైక పరిష్కారమనే నిశ్చితాభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. ప్రజల మనోగతం వెల్లడి కావడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ కూటమి పెద్దలు దీని నుంచి దృష్టి మళ్లించేందుకు దిగజారుడు రాజకీయాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ పచ్చ మీడియా ప్రాపగాండాతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. చంద్రబాబు కుట్రలను వైఎస్సార్సీపీ సమర్థంగా తిప్పికొడుతోంది. రాజధానిగా ‘మావిగన్’ ఏ విధంగా మెరుగైనదో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దుర్బుద్ధి, కుట్రలను ఎండగడుతూ ఆయన మామ ఎన్టీ రామారావుతోపాటు ఆయన తోడల్లుడు దగ్గుబాటి, బావమరిది నందమూరి హరికృష్ణతోపాటు పలువురు నేతలు స్వయంగా చెప్పిన మాటలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి తదితరులు గతంలో చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలను ప్రస్తావిస్తున్నారు. ‘అమరావతి’ అవినీతిపై సమాధానం చెప్పలేకే... టీడీపీ కూటమి సర్కారు రెండేళ్ల పాలనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. సున్నా వడ్డీ పథకానికి అతీ గతీ లేదు.. నాడు – నేడు పథకం అటకెక్కింది. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం పచ్చి మోసంగా మారింది. అటు సంక్షేమ పథకాలు నిలిచిపోవడం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలే లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. దాంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు హఠాత్తుగా రాజధానిగా అమరావతి తీర్మానాన్ని తెరపైకి తెచ్చారు. తద్వారా తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ. అయితే రాజధానిగా అమరావతి ఏ విధంగా ఆచరణ సాధ్యమో చెప్పాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. కేవలం రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని నిలదీశారు. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధాని నిర్మాణానికి ఏ రూ.10 లక్షల కోట్లు అవుతుందో అంతే చిక్కడం లేదన్నారు. చంద్రబాబు 2014–19లో, 2024 నుంచి ఇప్పటివరకు రాజధాని కోసం ఖర్చు చేసింది కేవలం రూ.8 వేల కోట్లేనని గుర్తు చేశారు. దీన్నిబట్టి ఆయన చెబుతున్న అమరావతి రానున్న 30 ఏళ్లలో కూడా సాధ్యం కాదన్నారు. ఇక అమరావతి నిర్మాణం పేరిట యథేచ్ఛగా పాల్పడుతున్న అవినీతిని వైఎస్ జగన్ సాక్ష్యాధారాలు, గణాంకాలతో సహా ఎండగట్టారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఇటాలియన్ మార్బుల్స్తో అధునాతనంగా నిర్మించే భవనాలకే చ.అడుగుకు రూ.4,500 ఖర్చు అవుతోంది. కానీ అమరావతిలో మాత్రం చ.అడుగుకు ఏకంగా రూ.14 వేలు దాకా చెల్లిస్తూ పనులు ఎందుకు కట్టబెడుతున్నారని ప్రశ్నించారు. కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) దేశంలో కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున ఆరు లేన్ల రహదారులు నిర్మిస్తుంటే... అమరావతిలో మాత్రం కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున టెండర్లు ఖరారు చేయడం ఏమిటని నిలదీశారు. అమరావతి దోపిడీ కుట్రలో భాగస్వాములైన ఈనాడు కిరణ్ వియ్యంకుడు, చంద్రబాబు బినామీ బలుసు శ్రీనివాసరావు తదితరులకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల రూపంలో భారీగా ప్రజాధనాన్ని దోచిపెడుతున్న తీరును ఎండగట్టారు. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం ఏ విధంగా ఆచరణ సాధ్యమో తెలపాలని.. రాజధాని పేరుతో సాగుతున్న అవినీతిపై వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానమే లేకుండా పోయింది. దాంతో రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ప్రజలకు స్పష్టమైంది. అమరావతి పేరిట భారీగా అవినీతికి పాల్పడుతున్నారన్నది బహిర్గతమైంది. ‘మావిగన్’కు ప్రజామోదం.. రాష్ట్ర రాజధానిగా వైఎస్ జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ పట్ల రాష్ట్రవ్యాప్తంగా సానుకూల అభిప్రాయం బలపడుతోంది. పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాల పరంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్’ గ్రోత్ ఇంజన్గా నిలుస్తుందని స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన 110 కి.మీ. అర్బన్ ప్రాంతం, అంతర్జాతీయ విమానాశ్రయం, బందరు పోర్టు, పూర్తి కనెక్టివిటీ ఉన్న జాతీయ రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలతో మావిగన్ రాజధానిగా అత్యంత అనుకూలమనే ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికే రూ.2 లక్షల కోట్లు కావాల్సి ఉండగా... కేవలం రూ.20వేల కోట్లతో మావిగన్ను పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దవచ్చన్నది స్పష్టమవుతోంది. ‘మావిగన్’కు వ్యతిరేకంగా టీడీపీ తమ సోషల్ మీడియా విభాగం ద్వారా చేసిన అవహేళన, దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. దాంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు తనదైన శైలిలో మరోసారి క్రెడిట్ చోరీకి యత్నించి భంగపడ్డారు. తాము ప్రతిపాదించిన అమరావతిలో మావిగన్ ఒక భాగమని నమ్మించేందుకు యత్నించారు. కానీ కూటమి ప్రభుత్వం గాలిలో మేడలు కడుతున్న అమరావతి వేరు... వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణ సాధ్యమైన మావిగన్ వేరని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు మాటలను ఏమాత్రం విశ్వసించడం లేదని నిఘావర్గాలు కూడా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే చంద్రబాబు ‘దుష్ప్రచార’ కుతంత్రం... అమరావతిపై తన కట్టుకథలు బెడిసికొడుతుండటం... మావిగన్కు అనుకూలంగా ప్రజాభిప్రాయం బలపడుతుండటంతో చంద్రబాబు తన మార్కు కుతంత్రాలకు పదును పెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన కపట నైజాన్ని గుర్తు చేస్తున్నాయి. ‘2009 ఎన్నికల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను..!’ అని హెచ్చరించడం గమనార్హం. అనంతరం అనుమానాస్పద రీతిలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దుర్మరణం చెందడం సందేహాలను బలపరుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మరోసారి తన మార్కు దుర్బుద్ధిని ప్రదర్శించారు. అమరావతి పేరిట తాము సాగిస్తున్న అవినీతి బట్టబయలు కావడంతో మరోసారి తన పన్నాగానికి పదును పెట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని కించపరుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు దుష్ప్రచారానికి తెగబడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ... అభూత కల్పనలను జోడిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు టీడీపీ దుష్ప్రచారానికి తెరతీసింది. మంత్రి అచ్చెన్నాయుడు మొదటగా ఈ కుట్రను లేవనెత్తగా... మంత్రులు నిమ్మల రామానాయుడు, అనిత, టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఆ కుట్రలో పాత్రధారులుగా మారారు. చంద్రబాబు రాజకీయ స్వార్థం, కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు, బరితెగించి సాగించిన అవినీతి గురించి గతంలో పలువురు చేసిన విమర్శలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. సొంత మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వైస్రాయ్ కుట్ర ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు గురించి ఎన్టీ రామారావు, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది నందమూరి హరికృష్ణ, సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడులతోపాటు పలువురు సీనియర్ నేతలు గతంలో చేసిన విమర్శలను సామాన్యులు సైతం చర్చించుకుంటున్నారు. బాబు నైచ్యానికిదే నిదర్శనం! 2009 ఆగస్టులో వైఎస్ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన నైచ్యానికి అద్దంపడుతున్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తాను’’ అని చంద్రబాబు హెచ్చరించడం, ఆ తర్వాత రోజే అనుమానాస్పద రీతిలో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు డర్టీయెస్ట్ పొలిటీషియన్తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దేశంలోనే డర్టీయెస్ట్ రాజకీయ నాయకుడు.. ఆయన నాయకుడు కాదు.. మేనేజర్ మాత్రమే.. కాపీ క్యాట్..! ఆయనకు ఆదర్శాలు లేవు.. స్వార్థం మాత్రమే ⇒ డిసెంబర్ 30, 2018 ప్రెస్ మీట్లో ‘హైదరాబాద్ను ప్రపంచ మ్యాప్పై పెట్టానని చంద్రబాబు అంటాడు.. మెంటల్..! అంత సమర్థుడైతే అమరావతి ఎందుకు కట్టలేదు? గ్రాఫిక్స్ తప్ప నిజమైన భవనాలు ఏవీ రాలేదు. ⇒ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో నవంబర్ 25, 2018 పరిగి (వికారాబాద్) బహిరంగ సభ, ప్రెస్మీట్లో.. హత్యా రాజకీయాలే బాబు బ్రాండ్!ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబే అన్నది నిర్వివాదాంశమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలకు అడ్డుగోడగా ఉన్నారనే 1988లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగాను హత్య చేయించారని, ఇందుకు నాటి హోంమంత్రి కోడెల శివ ప్రసాద్ ద్వారా కుట్ర పన్నారని చెబుతున్నారు. రంగా హత్యలో స్వయంగా పాల్గొన్న వెలగపూడి రామకృష్ణకు 2009లో, 2024లో చంద్రబాబు విశాఖ తూర్పు నియోజకవర్గ టికెట్ ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. 1985లో ఎన్టీఆర్పై హత్యాయత్నం చేసిన మల్లెల బాబ్జీ.. విజయవాడలో అనుమానాస్పద స్థితిలో చనిపోవడం వెనుక వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ కుట్రలో సూత్రధారులు పేర్లు బయట పడకూడదనే మల్లెల బాబ్జీని అంతం చేశారని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న ప్రముఖ పాత్రికేయుడు పింగళి దశరథ రామ్ను విజయవాడలో నడిరోడ్డుపై హత్య చేయడం వెనుక కుట్రదారు చంద్రబాబేనని సోషల్ మీడియాలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డిని 1998లో టీడీపీ వర్గీయులు హత్య చేశారు. ఆ కేసులో నిందితులు ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య అనంతరం నిందితులకు చంద్రబాబు ప్రభుత్వమే హైదరాబాద్లో నెల రోజులపాటు ఆశ్రయం ఇవ్వడం గమనార్హం. 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్బుక్ అరాచకం బీభత్సం సృష్టిస్తోంది. 21 నెలల్లోనే 21 రాజకీయ హత్యలకు తెగబడ్డారని, చంద్రబాబు అధికారం చేపట్టాక రాష్ట్రంలో 710 హత్యలు జరగడం దారుణంగా దిగజారిన శాంతిభద్రతల దుస్థితికి నిదర్శనమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడు..!-నాదెండ్ల భాస్కర్రావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అవినీతిపరుడు. దిగజారుడు వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడని మాకు రిపోర్ట్ వచ్చింది. అటువంటి వ్యక్తి ఇక రాజకీయాల్లోకి వస్తే ఎంతగా దిగజారి ప్రవర్తిస్తాడో ఊహించుకోండి. చంద్రబాబు అలానే దిగజారుడు, అవినీతి రాజకీయాలే లక్ష్యంగా పని చేస్తున్నాడు.చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయం...-పవన్ కళ్యాణ్, టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి(గతంలో చంద్రబాబుపై చేసిన విమర్శలు) చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. రాజధాని అమరావతి, కోస్టల్ కారిడార్ పేరుతో అవినీతికి పాల్పడుతోంది. రాష్ట్రంలో భూములు, గనులు, ఇసుక కుంభకోణాలు పెచ్చుమీరుతున్నాయి. లోకేశ్ నా తల్లిని దూషించారు. ఖబడ్దార్...! చంద్రబాబు ఔరంగజేబ్... గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం: ఎన్టీరామారావు‘రాజ్యాధికారం కోసం తండ్రిని జైల్లో పెట్టిన, సోదరుడిని హత్య చేసిన ఔరంగజేబ్ వంటి వాడు చంద్రబాబు. తెలుగు జాతి చరిత్రలో అభినవ ఔరంగజేబ్ చంద్రబాబు. నాతోనే ఉంటూ పథకం ప్రకారం వెన్నుపోటు పొడిచాడు. గుండెల మీద తన్నాడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం... గాడ్సే కన్నా ఘోరం. చంద్రబాబు దశమ గ్రహం. కుటుంబాన్నీ, ప్రజలను మోసం చేసిన కుట్రదారు చంద్రబాబు -దగ్గుబాటి వెంకటేశ్వర రావు‘అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారు. అందుకోసం 1995లో వైస్రాయ్ హోటల్ కుట్ర ద్వారా ఇటు కుటుంబాన్ని, అటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. అధికారం, అవినీతే చంద్రబాబు లక్ష్యాలు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు ఇప్పించి యథేచ్చగా అవినీతికి పాల్పడేవారు. 1985ృ89 ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో మద్యం డిస్టిలరీల లైసెన్సు ఇప్పిస్తానని తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి గోనె సంచిలో కోట్ల రూపాయలు తీసుకువచ్చి ఇచ్చారు. విద్యుత్ ప్లాంట్ల లైసెన్సుల మంజూరులో అవినీతికి పాల్పడితే ఎన్టీ రామారావు తీవ్రంగా మందలించారు. అయినా సరే గోతికాడ నక్కలా కాచుకుని వెన్నుపోటు పొడిచారు. రంగా హత్య వెనుక చంద్రబాబు-మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య(‘అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం’ పుస్తకంలో పేర్కొన్నారు) ప్రజా నాయకుడు, విజయవాడ ఎమ్మెల్యేగా ఉన్న వంగవీటి మోహన రంగా హత్య వెనుక ప్రధాన కుట్రదారు చంద్రబాబే. ఆయన ప్రోద్బలంతోనే రంగాను హత్య చేశారు. రంగా జీవించి ఉంటే టీడీపీకి మనుగడ ఉండదని భావించారు. అందుకే రంగా హత్యకు పచ్చ జెండా ఊపారు.’ చంద్రబాబు అరాచక శక్తి-దేవినేని నెహ్రూ, మాజీ మంత్రి‘అధికారం కోసం చంద్రబాబు ఎంతటి అరాచకానికైనా పాల్పడతారు. 1994లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును, ఆయన కుమారుడు హరికృష్ణను మా ముందే పచ్చి బూతులు తిట్టారు. ఇక వైస్రాయ్ హోటల్ కుట్రతో ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా పార్టీ నిర్వహించే ధర్నాల సందర్భంగా బస్సులను దహనం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు. సామాన్య ప్రయాణికులు చనిపోతారని కార్యకర్తలు చెప్పినా సరే ఆయన వినిపించుకునేవారు కాదు. సామాన్యులు చనిపోతే మనకేం... బస్సులు తగలబెట్టకపోతే పార్టీ కార్యక్రమాలు విజయవంతం అయినట్టు కాదు అని చంద్రబాబు చెప్పేవారు. అంతటి అరాచక శక్తి చంద్రబాబు. అవినీతి, అక్రమాల్లోనే చంద్రబాబు సీనియర్-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి(2019 ఎన్నికల సందర్భంగా గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ఎన్నికల సభల్లో ప్రసంగిస్తూ) ‘అద్భుతమైన రాజధాని అంటూ చంద్రబాబు అక్రమ సంపాదన ఆర్జనలో బిజీ అయిపోయారు. ఆయన చేస్తోంది రాజధాని నిర్మాణం కాదు.. కూలి పోతున్న టీడీపీ నిర్మాణం. అమరావతి, పోలవరం ప్రాజెక్టు సహా అన్నింటిలోనూ చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ దోపిడీకి పాల్పడుతున్నారు. సొంత హెరిటేజ్ కంపెనీ కోసమే ఆయన తపన అంతా. పోలవరం ప్రాజెక్టును తన అవినీతికి ఏటీఎంగా చేసుకున్నారు. ప్రజల్ని మోసగించేందుకు డేటా చోరీకి పాల్పడ్డారు. చంద్రబాబు తాను సీనియర్నని చెప్పుకుంటారు. కానీ సొంత మామకే వెన్నుపోటు పొడవటంలో ఆయన సీనియర్. తెలుగు ప్రజలను మోసం చేయడంలో సీనియర్. నేడు తిట్టిన పార్టీ ఓళ్లోనే రేపు కూర్చోవడంలో సీనియర్. కేంద్ర పథకాలను తనవిగా స్టిక్కర్ వేసుకోవడంలోనే సీనియర్.’ -
ఈ నెల 15న నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న జువ్వలదిన్నె హార్బర్కు వైఎస్ జగన్ వస్తున్నారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సోమవారం తెలిపారు.‘కూటమి ప్రభుత్వం హార్బర్ను ప్రైవేటు పరం చేయాలని చూస్తోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గ సమస్యకు అండగా నిలవడానికి వైఎస్ జగన్ వస్తున్నారు. జువ్వలదిన్నె హార్బర్ వైఎస్ జగన్ హయాంలో నిర్మితమైంది. జగన్ పర్యటనకు ఎన్ని ఆటంకాలు కలిగించినా విజయవంతం అవడం ఖాయం’ అని కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. -
ఆశా భోస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి,తాడేపల్లి: దిగ్గజ ‘స్వరరాణి’ ఆశా భోంస్లే మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆశా భోంస్లే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆశా అద్భుతమైన కంఠం ప్రతి ఇంటిలోనూ ప్రతిధ్వనించాయి. ఆశా భోంస్లే కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి ‘ఓం శాంతి!’ అని పేర్కొన్నారు. ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. Deeply saddened by the loss of the legendary ‘Queen of Melody,’ Asha Bhosle Ji. Her unparalleled voice and versatility have resonated in every household and will live on forever. My heartfelt condolences to her family.Om Shanthi! pic.twitter.com/g0SVX93b7b— YS Jagan Mohan Reddy (@ysjagan) April 12, 2026 -
అమరావతి x మావిగన్
సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ఆలోచననుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం చంద్రబాబు అండ్ కో ఎన్ని డైవర్షన్ కుట్రలు చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు అదే చర్చ నడుస్తోంది. ఆచరణ సాధ్యం కాని అమరావతి గురించి, మావిగన్ ప్రయోజనాల గురించి జనం బేరీజు వేసుకుంటున్నారు. ప్రజా రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు మావిగన్ అన్ని విధాలా అనుకూలమైన ప్రాంతమని వ్యాఖ్యానిస్తున్నారు. మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు పట్టణాలను కలిపి మహానగరంలా మార్చుకునేందుకు, మంచి రాజధానిగా అభివృద్ధి చేసుకునేందుకు అవకాశముందని అంటున్నారు.. తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతోనే ఇది సాధ్యమవుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. మావిగన్తో వచ్చే అవకాశాలు, ఉద్యోగాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. 10 రోజులుగా రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్గా మారింది. మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ దీనిపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. మావిగన్తో వచ్చే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించిన వైఎస్ జగన్ అమరావతిపై అనేక ప్రశ్నలనూ సంధించారు. జగన్ అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన చేశారని జనం అంటున్నారు. మావిగన్కు ప్రజల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతుండడంతో సీఎం చంద్రబాబు కంటికి కునుకు కరువయ్యింది. ఎల్లో మీడియా సహకారంతో, మందీ మార్బలం ప్రోద్బలంతో మావిగన్ నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎల్లో మీడియాలో మరణ మృదంగం కథనాలు వస్తున్నాయి. వైఎస్ మరణానికి జగనే కారణమనే దిగజారుడు రాతలకు ఎల్లో పత్రికలు దిగజారాయి. చంద్రబాబు ఉసిగొల్పడంతోనే ఆయన మెప్పుకోసం చుట్టూ ఉన్న వందిమాగధ బృందాలు గార్దభాల్లా గొంతు విప్పుకుని ఓండ్రపెడుతున్నాయి. అసలు నరహంతక చరిత్ర చంద్రబాబుదే కదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. మల్లెల బాబ్జీ, పింగళి దశరథరామ్, వంగవీటి రంగా, చివరకు పిల్లనిచ్చిన సొంత మామ ఎన్టీఆర్, తమ్ముడు రామ్మూర్తినాయుడి వరకు ఏ మరణాన్ని చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చంద్రబాబువైపే వేళ్లన్నీ చూపిస్తాయన్న సంగతి తెల్సిందే.. అవేవీ ప్రజలకు తెలియవన్నట్లుగా ఉంది ఈ ఎల్లో సిండికేట్ వీరంగం చూస్తుంటే.. మావిగన్ అంటే వీళ్లెంత భయపడుతున్నారో ఈ డైవర్షన్ రాజకీయాలను చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు. మొదట మావిగన్ అంటే జోక్ అన్నారు.. ప్రజల్లో మద్దతు పెరుగుతుండడంతో ఆ తర్వాత అది సీఆర్డీఏ పరిధిలోనే ఉంది అంటున్నారు.. ఎవరేమన్నా ప్రజలు మాత్రం మావిగన్ ప్రజా రాజధాని అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. అమరావతి ప్రచారం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవన్న విషయం అందరికీ అర్థమవుతోంది.. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన ఆచరణాత్మకమైన మావిగన్.. చంద్రబాబు ఆచరణసాధ్యం కాని ఊహాజనితమైన అమరావతిని పోల్చుకుంటూ రాష్ట్రంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తొలి రోజు నుంచే పరుగులుఇప్పటికే అన్ని మౌలికవసతులు ఉండి 110 కి.మీ జాతీయ రహదారులు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి–తాడేపల్లి వంటి నాలుగు కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో రెండు మున్సిపాల్టీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజునుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకుపైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతుండడం వల్ల ఈ ప్రాంతం వేగవంతమైన గ్రోత్ ఇంజన్గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలవలు దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, లక్ష ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయడానికి చాలా సుదీర్ఘ సమయం పడుతుందంటున్నారు. మావిగన్లో అన్ని మౌలికవసతులు ఉండటంలో తొలిరోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అదే అమరావతి విషయానికి వస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదంటున్నారు. ఆచరణసాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధానే లేకుండా చేస్తున్నాడని విమర్శకులంటున్నారు.అమరావతికి ఎన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో?అమరావతిలో రోడ్లు వేయడానికి, కరెంట్ ఇవ్వడానికి, డ్రైనేజీ వ్యవస్థ, నీళ్లు వంటి బేసిక్ వసతులు కల్పించడానికి ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చంద్రబాబు ప్రభుత్వమే సెంట్రల్ గవర్నమెంట్కు, బ్యాంకులకు ఇచ్చిన డీపీఆర్లలో స్పష్టంగా పేర్కొంది. ఈ లెక్కన చూసుకుంటే తొలి దశలో 50 వేల ఎకరాలకే లక్ష కోట్లు, ఇప్పుడు రెండో దశ కింద సేకరిస్తున్న మరో 50 వేల ఎకరాలు కలుపుకుంటే మొత్తం లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కేవలం రోడ్లు వేయడం, కరెంట్, డ్రైనేజీ పనులకే అవసరం అవుతాయి. వీటన్నింటినీ పూర్తి చేయడానికి చాలా దశాబ్దాలు పట్టే అవకాశం కనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఉన్న రూ. 2లక్షల కోట్ల అంచనా వ్యయం విలువ ఏళ్లు గడిచేకొద్దీ రూ.4 లక్షల కోట్లు అవుతుందో, రూ. 10 లక్షల కోట్లు అవుతుందో తెలియదు. అదే మావిగన్లో అయితే ఇందులో కేవలం పదోవంతు అంటే సుమారు రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తే చాలు ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేసుకుని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలతో పోటీ పడగలమని నిపుణులంటున్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ కాదని, రానున్న కాలంలో రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా తయారయ్యే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.అందుబాటులో అన్ని మౌలిక వసతులుమావిగన్ పూర్తిగా జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించి ఉండటం వేగంగా వృద్ధి చెందడానికి ప్రధానంగా కలిసివచ్చే అంశం. 110 కి.మీ పైగా ఆరులైన్ల జాతీయ రహదారులు ఉండటమే కాకుండా, దేశంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించే విజయవాడలోని అతిపెద్ద రైల్వే జంక్షన్తో పాటు గుంటూరు రైల్వే జంక్షన్ ఉన్నాయి. అదే అమరావతి పూర్తిగా ఒక మారుమూల ప్రాంతంగా ఉండటంతో ఈ ప్రాంతాన్ని ప్రధాన రహదారులకు అనుసంధానించడానికి ప్రత్యేకంగా రహదారులు, రైల్వే లైన్లు నిర్మించాలి. ఇందుకోసం వేల కోట్లు వ్యయం చేయాల్సి రావడం లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి పెద్ద గుదిబండగా మారుతుందని ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. పోర్టు, ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు వంటి అన్ని కీలక మౌలికవసతులు మావిగన్లో ఉండటంతో ఎటువంటి అదనపు వ్యయాలు లేకుండా తొలి రోజు నుంచే పెద్ద నగరాలతో పోటీపడ వచ్చంటున్నారు.పోర్టు నగరాల్లో శరవేగంగా అభివృద్ధిచెన్నై సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం.. ముంబైకి సమీపంలో పోర్టు, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడంతో ఆ నగరాలు స్వల్ప కాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయని.. వాటితరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గడమే కాకుండా ఇది ఎగుమతులు దిగుమతులతో ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వేలైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది.. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తోపాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి.. అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీలుపడటం ఖాయమంటున్నారు. అదే అమరావతి విషయానికి వస్తే మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 5,000 ఎకరాలు కేటాయించడంతోపాటు వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. -
జగన్, అవినాష్ రెడ్డిలపై షర్మిల కామెంట్స్ ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి
-
‘మహిళా పక్షపాతి వైఎస్ జగన్’
విశాఖ: మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపిన తమ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధన్యవాదాలు తెలియజేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో మహిళలకు వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు వరుదు కళ్యాణి. ఈ రోజు(శనివారం, ఏప్రిల్ 11వ తేదీ) విశాఖ నుంచి ప్రెస్మీట్లో మాట్లాడారు వరుదు కళ్యాణి. ‘ దేశంలో ఏ నాయకుడు ఇవ్వలేనన్ని పదవులు మహిళలకు వైఎస్ జగన్ ఇచ్చారు. దేశం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నామినేటెడ్ పదవులు పనుల్లో మహిళలకు పెద్ద పీట వేశారు. మహిళకు 50 శాతం పదవులు, నామినేట్ పనులు కట్టబెడుటు అసెంబ్లీలో చట్టం చేశారు. మహిళలు కోసం వైఎస్ జగన్ అనేక సంక్షేమ పథకాలను రూపొందించారు. చట్ట సభల్లో మహిళలకు కీలకమైన పదవులు అప్పగించారు.జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 50% పైగా మహిళలకు ఇచ్చారు. మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించారు. వైఎస్ జగన్ పాలనలో మహిళలు మహారాణుల్లా బతికారు. మహిళల కోసం దిశ చట్టాన్ని యాప్, పోలీస్ స్టేషన్ తెచ్చారు. కుటమి పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి.. ఎమ్మెల్యేలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మహిళలంతా జగనన్నకు రుణపడి ఉంటారు’ అని తెలిపారు. ఇక చంద్రబాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని వరుదు కళ్యాణి విమర్శించారు. -
జగన్ విజన్ భేష్ ..మంత్రివర్గంలో మావిగన్.. చంద్రబాబు అసంతృప్తి
-
చంద్రబాబు గూటిలో చిలక షర్మిల.. గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కామెంట్స్
-
జగన్ ను ప్రశ్నించే హక్కు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేదు..
-
జ్యోతిరావ్ పూలేకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, తాడేపల్లి: ప్రముఖ సామాజిక సంస్కర్త జ్యోతిరావ్ పూలే జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆయనకు నివాళులర్పించారు. సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెందకపోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన జ్యోతిరావ్ పూలే.. నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు.. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించి, వితంతువుల పునర్వివాహానికి మద్దతుగా, బడుగు, బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారు అని గుర్తు చేశారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వైఎస్ జగన్ ఓ ట్వీట్ చేశారు.సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెందకపోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన జ్యోతిరావ్ పూలే గారు నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారు. తన సతీమణి సావిత్రిబాయి పూలేని పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. అనాథ శిశువులకు ఆశ్రయం కల్పించి, వితంతువుల పున… pic.twitter.com/6dFqgJbxnP— YS Jagan Mohan Reddy (@ysjagan) April 11, 2026 -
ఏపీలో మావిగన్ ట్రెండ్.. రగిలిపోతున్న ఎల్లో మీడియా..
-
నిన్న జగన్ గారిని కలిశాను.. మావిగన్ పై ఆయన చెప్పింది ఒక్కటే
-
360 లక్షల కోట్లు..! వాటే విజన్
-
మంత్రివర్గంలో మావిగన్!
సాక్షి, అమరావతి : మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్గా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలిసింది. శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మావిగన్పై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని పలువురు మంత్రులు చెప్పినట్లు తెలిసింది. దీనివల్ల అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్టం చేసిన అంశానికి పెద్దగా ప్రచారం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈ విషయంలో మంత్రులు వెనుకబడ్డారని, మావిగన్ను తిప్పికొట్టలేకపోయారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేసి.. వ్యతిరేకంగా పని చేయించినా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మాత్రం దీటైన స్పందన రాలేదని అన్నట్లు తెలిసింది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని, అందుకు అందరూ సిద్ధం కావాలని చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారని సమాచారం. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే పని చేయాలని.. ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోపు అన్నిచోట్లా పారిశుధ్యం, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని సూచించారు. కనీసం ఆయా పనులు మొదలయ్యేలా అయినా చర్యలు తీసుకుంటేనే అర్బన్ ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. ఏబీఎన్ రాధాకృష్ణ ఏం మాట్లాడారనే విషయంతో సంబంధం లేకుండా పార్టీ ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందేనని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం అజెండా, అందులో చర్చించే అంశాలు ముందుగానే లీక్ అవుతున్నాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి లీక్ అవుతుందో తెలుసుకోవడం పెద్ద పని కాదని, కానీ అలా జరక్కుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. లీకులు మంత్రుల నుంచి జరుగుతోందా, అధికారుల నుంచా అని ఆరా తీసినట్లు తెలిసింది. అదే సమయంలో తమకు కేబినెట్ అజెండా ఇప్పటి వరకు అందలేదని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్లో జరుగుతున్న అవినీతిపై సాక్షిలో ప్రచురితమైన కథనంపైనా చంద్రబాబు స్పందించినట్లు తెలిసింది. ఎక్కడెక్కడ ఇబ్బందులు వస్తున్నాయో గుర్తించి, తనకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. -
కొత్త డిస్కం.. జగన్ విజన్కు తార్కాణం
సాక్షి, అమరావతి: వ్యవసాయానికి పాతికేళ్లపాటు పగటిపూట తొమ్మిది గంటలు విద్యుత్ను ఉచితంగా అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో తీసుకున్న నిర్ణయాన్ని ఎట్టకేలకు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి కొనసాగించక తప్పలేదు. ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విష ప్రచారం చేసినా.. తుదకు జగన్ తీసుకొచ్చిన సంస్కరణలే మంచివనే నిర్ణయానికి వచ్చినట్టుంది. ఈ క్రమంలో వైఎస్ జగన్ తీసుకువచ్చిన వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ప్రతిపాదనను తిరిగి తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం మూడు డిస్కంల ఆధ్వర్యంలో ఉన్న 11 కేవీ వ్యవసాయ ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర మంత్రి మండలి (క్యాబినెట్) శుక్రవారం ఆమోదం తెలిపింది. దీంతో విజన్ ఉన్న నాయకుడు జగన్ అని మరోసారి రుజువైంది. ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి అండగా నిలవడంతో పాటు అధికారంలోకి వచ్చాక వారికి మంచి చేయాలనే లక్ష్యంతో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్కు అప్పట్లో పంట చేలల్లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతన్నలు అడుగడుగునా తమ గోడును చెప్పుకున్నారు. రాత్రనకా, పగలనకా సాగు నీటి కోసం బోర్ల వద్ద పడిగాపులు కాస్తూ, విద్యుత్ కోసం పడుతున్న బాధలను కన్నీళ్లతో వివరించారు. వారి కష్టాలను కళ్లారా చూసిన జగన్.. అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలని అప్పుడే నిశ్చయించుకున్నారు. 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు ఢోకా లేకుండా చేయాలనుకున్నారు. అది కూడా పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా అందించాలనుకున్నారు. అది సౌర విద్యుత్ వల్లనే సాధ్యమవుతుందని భావించారు. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే సౌర విద్యుత్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఉచిత విద్యుత్ సరఫరా చేసేలా సామర్థ్యం కలిగిన వ్యవసాయ ఫీడర్లను అప్గ్రేడ్ చేయడం కోసం రూ.1,700 కోట్లు ఖర్చు చేశారు.కొత్త డిస్కంకు అప్పుడే అంకురార్పణ అన్నదాతలకు ఉచిత విద్యుత్ను హక్కుగా అందించాలనే సంకల్పంతో 2020 ఫిబ్రవరి 15న గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఈసీఎల్) ను ఏర్పాటు చేసి, సౌర విద్యుత్ సమీకరణకు శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయాన్ని మెచ్చి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సెకీ) 2021 సెప్టెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. రైతుల శ్రేయస్సు కోసం ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి ముందు చూపుతో ఆలోచించి సౌర విద్యుత్ సేకరణకు ప్రయత్నించడం అభినందనీయమని ఆ లేఖలో పేర్కొంది. యూనిట్ రూ.2.49కే 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను తామే సరఫరా చేస్తామంటూ ప్రతిపాదన చేసింది. సెకీతో ఒప్పందం కోసం ఏపీజీఈసీఎల్ పేరును ఏపీ రూరల్ అగ్రికల్చర్ పవర్ సప్లై కంపెనీ లిమిటెడ్ (ఏపీఆర్ఏపీఎస్సీఎల్)గా మార్పు చేస్తూ 2021 నవంబర్ 3న జగన్ ప్రభుత్వం జీఓ నంబర్ 152ను విడుదల చేసింది. అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీలు (ఐఎస్టీఎస్) నుంచి మినహాయింపు పొందడంలో భాగంగానే వ్యవసాయానికి ప్రత్యేక డిస్కం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతితో ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఇది వ్యవసాయానికి అత్యంత అవశ్యకం కావడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏపీఆర్ఏపీఎస్సీఎల్కు ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ (ఏపీఆర్ఏపీఎల్) అనే పేరును ఖరారు చేసింది.నాడు అంతా విష ప్రచారమని తేటతెల్లంరాష్ట్రంలో తూర్పు (ఏపీఈపీడీసీఎల్), మధ్య (ఏపీసీపీడీసీఎల్), దక్షిణ (ఏపీఎస్పీడీసీఎల్) ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లున్నాయి. వీటి పరిధిలో 22 లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులున్నాయి. వీటన్నిటినీ కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురానున్నారు. మూడు డిస్కంలకు చెందిన విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏపీఆర్ఏపీఎల్కు బదిలీ చేస్తున్నారు. సర్వీసులు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు, స్తంభాలు ఇలా వ్యవసాయ విద్యుత్ సరఫరాకు వినియోగిస్తున్నవన్నీ కొత్త డిస్కంలో విలీనం చేస్తారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలుపడంతో ఇంధన శాఖ ఏపీఈఆర్సీకి ఫైలును పంపనుంది. మండలి ఆమోదం అనంతరం ఏపీఆర్ఏపీఎల్కు ప్రత్యేక కార్యాలయం, సిబ్బంది కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందని ఇంధన శాఖ ఉన్నతాధికారులు ‘సాక్షి’కి వెల్లడించారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ సెకీ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల భారం పడుతుందని చంద్రబాబు అండ్ కో చేసిందంతా కూడా తప్పుడు, విష ప్రచారం అని తేలిపోయింది. -
విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : వైఎస్సార్ జిల్లాలో కీర్తన అనే విద్యార్థిని ప్రేమోన్మాది దారుణంగా గొంతు కోసం హత్య చేసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదు. టీడీపీ పాలనలో మహిళల భద్రత కరువైంది. వ్యవస్థపై నేరస్తులకు ఎలాంటి భయం లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా, ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు మాటలే తప్ప కఠిన చర్యలు శూన్యం. పోలీసుల అప్రమత్తత కొరవడడం, సరైన నిఘా లేకపోవడమే ప్రధాన కారణం. దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నమోదు చేసి వేగంగా న్యాయం జరిగేలా చూడాలి’ అని డిమాండ్ చేశారు. అదే సమయంలో బాలిక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు వైఎస్ జగన్.కాగా, వైఎస్సార్ జిల్లాలోని ఖాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతిని గొంతు కోసి చంపేశాడు. తనను పెళ్లి చేసుకోలేదని ఓ యువకుడు.. యువతి గొంతు కోశాడు. కడప రిమ్స్కు తరలిస్తుండగా చెన్నూరు వద్ద దారిలోనే యువతి ప్రాణాలు విడిచింది.ఖాజీపేట అగ్రహారంలో కీర్తన(16) అనే విద్యార్థినిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిగ్రీ విద్యార్థి ఆవుల వెంకటేష్(19) పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు. ఖాజీపేట మోడల్ స్కూల్లో కీర్తన ఇంటర్మీడియట్ చదువుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
MAVIGUN పై షర్మిల జోకర్ కామెంట్స్ సజ్జల సెటైర్స్ అదుర్స్
-
అసలైన జోకర్ నువ్వు....చిలక జ్యోతిష్యం చూపిస్తూ షర్మిలను ఏకిపారేసిన రాచమల్లు
-
జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం
-
జగన్పై షర్మిల వ్యాఖ్యలు, రాచమల్లు అదిరిపోయే కౌంటర్
-
మావిగన్ బెటర్ ఆప్షన్ అంటున్న జగన్ మాటకు పెరుగుతున్న ప్రజా మద్దతు
-
MAVIGUN అనే పదం డిక్షనరీలో అర్ధమే లేదన్నారు.. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ లో ఉంది
-
టీడీపీ డైవర్షన్ కుట్రలు.. MAVIGUNను అడ్డుకోవడం కోసం టీడీపీ నీచపు రాజకీయం
-
జై జగన్.. మావిగన్ కి జై కొట్టిన బాబు
-
దేశంలోనే ప్రత్యేకం.. వైఎస్సార్ ప్రజాప్రస్థానం
సాక్షి, అమరావతి: ‘మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర దేశంలోనే ఎప్పటికీ ప్రత్యేకమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పేరుతో, వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్రలు ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలనకు నాందిపలికాయి. తండ్రి, కుమారుడు పాదయాత్రలు చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వాటిని పరిష్కరించిన ఘనత దేశంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుంది’ అని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశంసించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేపట్టి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొని కేక్ కట్ చేశారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలతో మమేకమవుతూ..ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ... ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలను నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకునేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి మండుటెండలో తెలంగాణలోని చేవెళ్ల నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేశారు. సాధారణ ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత సంక్షేమ పాలనకు బాటలు వేసింది. వైఎస్సార్ పాదయాత్ర కారణంగానే 2004లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో యూపీఏ అధికారంలోకి రావడానికి కూడా కారణమైంది. వైఎస్సార్ తనయుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత సుదీర్ఘమైన పాదయాత్ర చేసి తండ్రికి మించిన తనయుడిగా నిలిచారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలను తీసుకొచ్చి అద్భుత పాలనను అందించారు.’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, కాకమాను రాజశేఖర్, చల్లా మధు తదితరులు పాల్గొన్నారు. -
సీఆర్డీఏనే మావిగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు మావిగన్ అంటున్నారని, తాము చేస్తున్నది కూడా అదేనని, అదే సీఆర్డీఏ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సైకో ప్రవర్తనలతో రౌడీయిజం బ్యాచ్ వితండవాదాలు చేస్తోందని.. ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడిచేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి వెనుక రాజకీయ పార్టీ లేకపోతే ఇంటినుంచి బయటకు రాగలడా అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రాన్ని వీరు సర్వనాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని.. మనమంతా కలిసి కాపాడుకోవాలన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో గురువారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘ఇప్పటికే విభజనవల్ల, గత పాలకులవల్ల రాష్ట్రం చాలా నష్టపోయింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తున్నాం. అడవుల్లో ఉండే ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్లిపోతారు. ఇతను కూడా అంతే. ఎక్కడో ఉండి అప్పుడప్పుడు వచ్చి దుష్ప్రచారం చేసి పారిపోతాడు. సద్విమర్శలు చేస్తే సమాధానం ఇస్తాం. అమరావతి సెల్ఫ్ మోనిటైజేషన్ ప్రాజెక్టు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంటున్నారు. అది సీఆర్డీఏ రీజియన్. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతిని కదపలేరు. ఇలాంటి తరహా వ్యక్తులను అరెస్టు చేయడానికినాకు నిమిషం పట్టదు. కానీ, చట్టం తన పని తాను చేసుకుంటుంది. నంద్యాలలో పర్యటిస్తుంటే ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్టుచేసి జైల్లో పెట్టారు. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం మేం రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 ప్రక్రియ పూర్తిచేసి 1.12 కోట్ల పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ పూర్తిచేస్తాం. ‘22ఏ’ నుంచి 1.37 లక్షల ఎకరాలకు విముక్తి ఇక గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసు ఇనామ్ భూములను 22ఏ జాబితా నుంచి 1.37 లక్షల ఎకరాలను తొలగిస్తున్నాం. మరో లక్ష ఎకరాల సర్వీసు ఇనామ్ భూములకు కూడా 22ఏ జాబితా నుంచి విముక్తి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాం. అలాగే, రాష్ట్రంలో ఫ్రీహోల్డ్ కింద అర్హత కలిగిన 9.25 లక్షల ఎకరాలపై భూ యజమానులకు యాజమాన్య హక్కులు కల్పిస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు. -
‘మావిగన్’కు మద్దతు పెరుగుతుండడంతో డైవర్షన్ కుట్రలు
సాక్షి, అమరావతి: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన ‘మావిగన్’ (మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు) రాజధాని ప్రతిపాదనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ, అన్ని వర్గాలలోనూ మద్దతు పెరుగుతోంది. ఎక్కువ ఖర్చు లేకుండానే ఒక మహానగరాన్ని అభివృద్ధి చేసుకునే మార్గమున్నప్పుడు ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల ఉపయోగమేమిటన్న చర్చ జరుగుతుండడంతో అధికారపార్టీలో అలజడి మొదలైంది. మూడు నగరాలను కలుపుతూ హైవేలు ఉండడం, పోర్టు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఉండడం.. తక్కువ ఖర్చుతోనే, తక్కువ కాలంలోనే మావిగన్ను ఓ మహానగరంగా అభివృద్ధి చేసుకునేందుకు కలసివచ్చే అంశాలుగా ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్నారు.రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, తాగునీరు వంటి సదుపాయాలకే రూ. 2 లక్షల కోట్లు అవసరమయ్యే అమరావతి అస్సలు సాధ్యమయ్యేది కాదని తెలిసీ చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అమరావతి ప్రతికూలాంశాలను, మావిగన్ సానుకూలాంశాలను జనం బేరీజువేసుకుంటున్నారు. ఇది మింగుడుపడని చంద్రబాబు వెంటనే డైవర్షన్ అస్రా్తన్ని బయటకు తీశారు. అచ్చెన్నాయుడుతో ఓ విలేకరుల సమావేశం పెట్టించి అవాకులు, చెవాకులు పలికించారు.. అచ్చెన్నాయుడి అసందర్భ ప్రేలాపనలు బాబుగారి డైవర్షన్ రాజకీయంలో భాగమేనన్న విషయం అందరికీ అర్థమైపోయింది.. రూ. 2 లక్షల కోట్లతో రోడ్లు, డ్రైనేజీలా.. ఇక రాజధాని ఎప్పుడు?అమరావతి కోసం మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి సౌకర్యాల కల్పనకు కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఎకరానికి రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. అంటే లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, తాగునీరు కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి.ఇంకా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? రాష్ట్రానికేమన్నా అంత ఆదాయముందా..? ఇది అదనంగా చేయాల్సిన అప్పే కదా.. అసలు ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? అంత సుదీర్ఘ కాలంలో రూ.2 లక్షల కోట్లు వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుందని ఆర్థికవేత్తలంటున్నారు. అసలు ఇదంతా సాధ్యమయ్యేదేనా అని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అందరూ చర్చించుకుంటున్నారు. అలాగే దేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వాలు భవనాలు కట్టగానే రాజధాని తయారైపోవడం మనం చూడలేదు.ఆర్థిక కార్యకలాపాలకు ఎక్కువ అవకాశం ఉన్న నగరాలే రాజధానులుగా అభివృద్ధి చెందాయి. ఇప్పటి వరకు అమరావతిలో సదుపాయాలు లేవు.. ప్రభుత్వం కడతానంటున్న బిల్డింగులూ లేవు.. ఇక ఆర్థిక కార్యకలాపాలెక్కడ? మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే అన్ని సదుపాయాలున్నాయి. పోర్టు, ఎయిర్పోర్టు, హైవేలున్నాయి. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వ బిల్డింగులు కట్టుకుంటే సరిపోతుంది.. ఇలాంటి విషయాలన్నీ జనం బేరీజు వేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో ‘మావిగన్’ హోరు..అమరావతి కంటే మావిగన్ బెస్ట్ అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మావిగన్లో ఇప్పటికే పోర్టు ఉంది, సముద్ర తీరం, విమానాశ్రయం ఉన్నాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్, రహదారులు ఇలా అనేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అమరావతిలో ఏముంది? అని వారు నిలదీస్తున్నారు. అమరావతిలో కేవలం నీరు, రోడ్లు, డ్రెయినేజీలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందని, ఇందులో 10 శాతం అంటే కేవలం రూ.20 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేస్తే మావిగన్ అత్యుత్తమ రాజధాని అవుతుందని లెక్కిస్తున్నారు. అంతేకాదు అమరావతిలో నిర్మాణాలకు, ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలకు ఖర్చు విషయంలో భారీ వ్యత్యాసం ఉండటం వెనుక అవినీతి దాగుందని ఉదాహరణలతో సహా బయటపెడుతున్నారు.అమరావతిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం భ్రమరావతి చేస్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. సామాజిక మాధ్యమాలలోనే కాదు.. సామాన్య జనంలోనూ వైఎస్ జగన్ ప్రతిపాదనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అమరావతి కోసం 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్లు అవసరమవుతాయని గతంలో చంద్రబాబు మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అబ్బే.. అవన్నీ ఫేక్ వీడియోలని మంత్రి లోకేశ్ ట్వీట్ చేయడం చూస్తే చంద్రబాబు ప్రభుత్వంలో మావిగన్ రేపిన కల్లోలం అర్థమవుతూనే ఉందని విశ్లేషకులంటున్నారు. లోకేశ్ ట్వీట్ను ఖండిస్తూ నాడు చంద్రబాబు ప్రసంగించిన వీడియోలతో పాటు ఎకనమిక్ టైమ్స్ సహా పలు జాతీయ పత్రికలలో వచ్చిన క్లిప్పింగ్స్ కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు. సమాధానాలు లేకే డైవర్షన్ కుట్రలు..తక్కువ ఖర్చుతోనే మావిగన్ను మహానగరంగా అభివృద్ధి చేసుకునే అవకాశమున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి.. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలోనే రాజధానిని అభివృద్ధి చేసుకునే ప్రతిపాదనను పక్కనపెట్టేసి లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన అమరావతివైపు చంద్రబాబు ఎందుకు పరుగులు తీస్తున్నారని అన్ని వైపుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అమరావతి ప్రాజెక్టు పనుల కోసం అయినవారికి అధిక ధరలకు టెండర్లు, మొబిలైజేషన్ అడ్వాన్సులు వంటివన్నీ రోజుకొకటి బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ, టీవీ చర్చలలోనూ ఇది ప్రధానాంశంగా మారడం చంద్రబాబు అండ్కో కు తలనొప్పిగా తయారయ్యింది. దాంతో డైవర్షన్ రాజకీయాలకు తెరతీశారు. అచ్చెన్నాయుడును రంగంలోకి దింపి అసందర్భంగా మాట్లాడించడం.. మావిగన్పై ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు.ఈ ప్రశ్నలకు బదులుందా బాబూ..?⇒ పోర్టు, ఎయిర్పోర్టు, జాతీయ రహదారులు ఉన్న మావిగన్ ప్రాంతంలో తక్కువ ఖర్చుతోనే, తక్కువ సమయంలోనే మహానగరాన్ని అభివృద్ధి చేసుకోగలమని ఆర్థికవేత్తలు, నిపుణులు చెబుతున్న మాట నిజం కాదా?⇒ అమరావతిలో లక్ష ఎకరాలలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, కరెంటు సదుపాయాలకు రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తేబోతున్నారు? ఇవి కాకుండా నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? ఇవన్నీ ఎంత సమయంలో పూర్తి చేస్తారు? మొత్తం ఎన్ని దశాబ్దాలు పడుతుంది?⇒ ఆ రూ.2 లక్షల కోట్లలో పది శాతం అంటే రూ.20 వేల కోట్లతోనే మావిగన్ ప్రాంతంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయవచ్చన్న ప్రతిపాదనపై ఎందుకు మాట్లాడడం లేదు?⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన, బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు?⇒ దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది?⇒ అమరావతి ప్రాంతంలో పనుల కోసం అధిక ధరలకు టెండర్లు పిలవడం, అయినవారికే అప్పగించడం.. ఎలాంటి పనులు చేయకుండానే ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్సులిచ్చేయడం, అందులో కమీషన్లు కాజేయడంపై వస్తున్న ఆరోపణలపై ఎందుకు మాట్లాడడం లేదు?⇒ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఏమేమి కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? -
నాన్న పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాసింది
సాక్షి, అమరావతి: ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్ర చరిత్రను తిరగరాసిందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం 2003 ఏప్రిల్ 9వతేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి వైఎస్సార్ తన పాదయాత్రను ప్రారంభించిన విషయం విదితమే. రాష్ట్ర గతిని మార్చేసిన వైఎస్సార్ చరిత్రాత్మక పాదయాత్ర ఘట్టానికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన తండ్రి స్మృతులను గుర్తు చేసుకుంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో గురువారం వైఎస్ జగన్ పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది..ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రను తిరగరాయగలదని నాడు నాన్న చేపట్టిన పాదయాత్ర నిరూపించింది. నాకు బాగా గుర్తు.. ఏప్రిల్ 9, 2003న ఎర్రటి ఎండలో.. ప్రజల కష్టాల్లో పాలుపంచుకునేందుకు నాన్న చేపట్టిన ఆ పాదయాత్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపింది. నేనున్నాననే భరోసా ఇచ్చింది. నాన్నకు రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రిని చేసింది. నాన్న సీఎం కాగానే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసిన దగ్గరి నుంచి ఆయన తెచ్చిన ఎన్నో సంస్కరణలు, పథకాలు రాష్ట్ర రూపురేఖలు మార్చేశాయి.రైతును రాజుగా నిలిపాయి. అక్కచెల్లెమ్మలు వారి సొంత కాళ్లపై నిలబడేలా చేశాయి. బడుగు, బలహీన వర్గాలకు బతుకుపై భరోసాను కల్పించాయి. ఎంతోమంది పేద పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా అయ్యేలా చేశాయి. ఎన్నో సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో నాన్న వేసిన ఆ ముద్ర ఎవరూ చెరిపేయలేనిది. నాన్న చేపట్టిన పాదయాత్ర నేటికి 23 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ నా ఈ ప్రయాణం కొనసాగుతుంది. -
అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: అల్లూరి జిల్లాలో బాలికల మృతిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మూలగుమ్మి జలపాతంలో పడి ముగ్గురు బాలికలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమన్నారు.‘‘ఇటీవలే ఇంటర్ పరీక్షలు రాసి భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్ధులు ఇలా అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ప్రమాదంలో గాయపడిన మరో బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు చేపట్టాలి’’ అని వైఎస్ జగన్ సూచించారు. -
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో భారీగా 'మావిగన్' ఫ్లెక్సీలు
-
కంటతడి పెట్టిన బొత్స
-
మామను చంపిన నువ్వు తల్లి, చెల్లి గురించి మాట్లాడతావా.. నీ మొహానికి సిగ్గుందా..!
-
నువ్వెంత నీ బతుకెంత..కేశినేని చిన్నికి దేవినేని అవినాష్ స్ట్రాంగ్ వార్నింగ్
-
వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ కు మద్దతుగా ఫ్లెక్సీలు


