Economy
-
డబ్ల్యూపీఐకి గుడ్బై.. పీపీఐకి మారనున్న కేంద్రం!
ధరల తీరును మరింత ప్రతిఫలించే విధంగా వస్తు, సేవలకు ఉత్పత్తిదారుల ధరల సూచీ (పీపీఐ)ని కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. ప్రస్తుతం ప్రతి నెలా విడుదల చేస్తున్న టోకు ధరల ఆధారిత సూచీ స్థానంలో వచ్చే ఐదేళ్లలోపు దీన్ని పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టనుంది.దేశవ్యాప్తంగా మే నెలకు అన్ని కమోడిటీలకు సంబంధించి అవుట్పుట్ పీపీఐ 109.6 శాతంగా నమోదైంది. ఏప్రిల్లో ఇది 108.6 శాతంగా ఉంది. తయారీ రంగానికి సంబంధించి ప్రయోగాత్మక ఇన్పుట్ పీపీఐ మే నెలకు 104.9గా ఉంది. ప్రయోగాత్మక విధానంలో విడుదల చేస్తున్న ఈ డేటా నాణ్యతను పరిశీలించి, భాగస్వాముల అభిప్రాయాలను తెలుసుకుని అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రస్తుతం ఇదే విధానం అమల్లో ఉంది. దీంతో భారత్ సైతం డబ్ల్యూపీఐ నుంచి పీపీఐకి మారాలంటూ ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చాన్నాళ్లుగా కోరుతోంది. దీనికితోడు నీతిఆయోగ్ వర్కింగ్ గ్రూప్ ఇటీవలే చేసిన సిఫారసుల మేరకు పీపీఐకి మారాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఉత్పత్తి తయారీ లేదా సేవను అందించేందుకు కంపెనీకి అయ్యే వ్యయాన్ని ఇన్పుట్ ప్రైస్ రూపంలో, తయారీ అనంతరం ఆయా సంస్థలు విక్రయించే ధరను అవుట్పుట్ ప్రైస్ రూపంలో డేటాను విడుదల చేయనున్నారు.ఇన్పుట్ ధరలు పెరుగుతుంటే (కంపెనీలు వినియోగించే ముడి సరుకులు, విడిభాగాలు, మైక్రోచిప్లు తదితర), అంతిమంగా కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తుంటాయి. దాంతో రిటైల్ ధరలు పెరుగుతాయి. ఈ డేటాకు అనుగుణంగా ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం తగిన దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. పీపీఐ అవుట్పుట్ ప్రైస్కు రవాణా, పన్నులు, వర్తకుల మార్జిన్లు కలసి రిటైల్ ధరలు నిర్ణయమవుతాయి. -
డీజిల్, జెట్ ఇంధనంపై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు!
పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ముడిచమురు సమీకరణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు, ఎగుమతిదారులు అనవసర లబ్ధి పొందకుండా అడ్డుకట్ట వేసేందుకు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. సవరించిన కొత్త ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే, సామాన్యుడిపై భారం పడకుండా దేశీయ వినియోగం కోసం సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి సుంకాలు పెంచకపోవడం గమనార్హం.విండ్ఫాల్ ట్యాక్స్ అంటే..ఏదైనా ఒక పరిశ్రమ లేదా కంపెనీ తమ సొంత కష్టం లేదా అదనపు పెట్టుబడి లేకుండా అనుకోకుండా మారిన అంతర్జాతీయ పరిస్థితులు లేదా బాహ్య కారణాల వల్ల భారీగా లాభ పడినప్పుడు (విండ్పాల్ గెయిన్స్) ఆ అదనపు లాభాలపై ప్రభుత్వం విధించే ప్రత్యేక పన్నునే విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు.సవరించిన పన్నుల వివరాలు..ఎగుమతులను నిరుత్సాహపరిచి, దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ పన్నును సవరించింది.ఇంధనం రకంపాత సుంకం (లీటరుకు)సవరించిన కొత్త సుంకం (లీటరుకు)మార్పుడీజిల్రూ. 13.5రూ. 14.0రూ. 0.50 పెంపుజెట్ ఇంధనంరూ. 9.5రూ.12.5రూ.3 పెంపు -
ఆర్థిక ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం!
బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ల ప్రయోజనాలే పరమావధిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఆర్థిక ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే ప్రక్రియపై నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినతరం చేసింది. రుణదాతలు, బ్యాంకింగ్ సిబ్బంది కస్టమర్లను తప్పుదారి పట్టించి ఉత్పత్తులను అంటగట్టే ‘మిస్ సెల్లింగ్’ పద్ధతులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త గైడ్లైన్స్ను విడుదల చేసింది.అమల్లోకి వచ్చేది ఎప్పుడంటే?సవరించిన నూతన మార్గదర్శకాలు తొలుత జులై 2026 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, బ్యాంకింగ్ వ్యవస్థలో సాంకేతిక, కార్యాచరణ మార్పులు చేసుకోవడానికి వీలుగా సెంట్రల్ బ్యాంక్ గడువును పొడిగించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2027 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.నూతన మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలుబ్యాంకులు ఏ రకమైన ఆర్థిక ఉత్పత్తి లేదా సేవను విక్రయించాలన్నా సదరు కస్టమర్ స్పష్టమైన ఆమోదం తీసుకోవాలి. అలాగే ఆ ఉత్పత్తి కస్టమర్కు ఎంతవరకు అనుకూలమైనదో ముందే నిర్ధారించుకోవాలి.సంతకం చేసిన డిక్లరేషన్లు, ఓటీపీ-ఆధారిత ఆమోదాలు, డిజిటల్ ధ్రువీకరణలు లేదా ఒప్పంద పత్రాలలో స్పష్టంగా పేర్కొన్న సమ్మతి నిబంధనల ద్వారా మాత్రమే ఈ అనుమతిని సేకరించాల్సి ఉంటుంది.డిజిటల్ ప్లాట్ఫారమ్లు, యాప్లలో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా లేదా మోసగించేలా రూపొందించే వినియోగదారు-అనుభవ పద్ధతులు లేదా డార్క్ ప్యాటర్న్స్(డిజిటల్ ప్లాట్ఫారమ్లు వినియోగదారులను మోసగించడానికి లేదా వారి ప్రమేయం లేకుండా కొన్ని పనులు చేయించడానికి ఉపయోగించే వ్యూహాలు) వాడకాన్ని ఆర్బీఐ పూర్తిగా నిషేధించింది.తప్పుగా విక్రయిస్తే.. పూర్తి రీఫండ్!బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యంత కీలకమైన నిబంధనను ఆర్బీఐ ఈసారి తీసుకొచ్చింది. ఆర్థిక ఉత్పత్తులను కస్టమర్లకు తప్పుగా విక్రయించినట్లు రుజువైతే బ్యాంకులు ఆ విక్రయాన్ని రద్దు చేయడమే కాకుండా.. కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ రద్దు, రీఫండ్ గురించిన సమాచారాన్ని కస్టమర్కు అధికారికంగా తెలియజేయడం తప్పనిసరి.ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏజెంట్లే..సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఆర్థిక ఉత్పత్తులను ప్రమోట్ చేసే వారిపై కూడా ఆర్బీఐ నిఘా పెంచింది. ప్రమోషన్లు లేదా కస్టమర్లను ఆకర్షించే ప్రక్రియలో పాల్గొనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సన్లు, అనుబంధ సంస్థలు, ఇతర డిజిటల్ మార్కెటింగ్ మధ్యవర్తులను ఇకపై డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లు లేదా డైరెక్ట్ మార్కెటింగ్ ఏజెంట్లుగానే పరిగణిస్తారు. తద్వారా వారికి కూడా బ్యాంకింగ్ నిబంధనలు, బాధ్యతలు వర్తిస్తాయి.ఉద్యోగుల ఇన్సెంటివ్లపై స్పష్టతబ్యాంక్ సిబ్బంది కస్టమర్లపై ఒత్తిడి తెచ్చి ఉత్పత్తులను విక్రయించకుండా చూసేందుకు ఆర్బీఐ ప్రోత్సాహకాలపై స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. థర్డ్ పార్టీ సంస్థలు (ఇన్సూరెన్స్ కంపెనీలు మొదలైనవి) నియంత్రిత సంస్థల/బ్యాంకుల ఉద్యోగులకు నేరుగా ప్రోత్సాహకాలు అందించడాన్ని పూర్తిగా నిషేధించారు. బ్యాంకులు లేదా నియంత్రిత సంస్థలు తమ సొంత సిబ్బందికి అంతర్గతంగా ప్రోత్సాహకాలను అందించుకోవచ్చు.గమనిక: అయితే, ఈ అంతర్గత ప్రోత్సాహక నిర్మాణాలు ఉద్యోగులను దూకుడుగా అమ్మకాలు జరిపేలా ప్రోత్సహించకూడదని, అది మిస్ సెల్లింగ్కు దారితీయకూడదని ఆర్బీఐ హెచ్చరించింది.ఈ నూతన నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు తమ సొంత ప్రకటనలు, మార్కెటింగ్, అమ్మకాల ప్రక్రియల కోసం ఒక సమగ్రమైన, పారదర్శకమైన విధానాన్ని రూపొందించుకోవాలని సెంట్రల్ బ్యాంక్ ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా దేశంలో మిస్ సెల్లింగ్ మోసాలకు అడ్డుకట్ట పడటంతోపాటు కస్టమర్లలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం మరింత బలపడనుంది.ఇదీ చదవండి: బంగారు పంట పండింది! -
డీల్తో ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్ నిర్ణయంతో భారత్కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు. జూన్ 19 స్విట్జర్లాండ్లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అనిశ్చితికి తెర.. శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. హార్మూజ్ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు. -
ఎగుమతులు భేష్..!
న్యూఢిల్లీ: వస్తు ఎగుమతులు మేలో పటిష్ట పనితీరు చూపించాయి. ఆరు నెలల గరిష్ట స్థాయిలో 45.2 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 10 శాతం పెరిగి 73.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్యలోటు (ఎగుమతులను మించి దిగుమతుల విలువ పెరగడం కారణంగా ఏర్పడేది) 28.21 బిలియన్ డాలర్లకు ఎగిసింది. గతేడాది మే నెలలో వాణిజ్యలోటు 21.88 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ముడి చమురు, ఎరువుల కోసం అధికంగా వెచ్చించాల్సి రావడం దిగుమతుల బిల్లు పెరిగేందుకు కారణమవుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల్లోనూ దేశ ఎగుమతులు మెరుగైన వృద్ధిని చూసినట్టు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్రక్టానిక్స్, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మా ఎగుమతుల వృద్ధిలో కీలకపాత్ర పోషించాయి. మరోవైపు మేలో సేవల ఎగుమతులు 36.76 బిలియన్ డాలర్లు, సేవల దిగుమతులు 19.06 బి. డాలర్లుగా ఉండొచ్చన్నది ప్రభుత్వం అంచనా. మొదటి రెండు నెలల్లో మంచి పనితీరు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్–మే) ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 16.09 శాతం పెరిగి 88.91 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే కాలంలో దిగుమతులు 15.14 శాతం జంప్ చేసి 145.35 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 56.44 బిలియన్ డాలర్లుగా ఉంది. పసిడి దిగుమతులు ఎక్కువే.. ఏప్రిల్, మే నెలలో 9.40 బిలియన్ డాలర్ల విలువైన బంగారం దిగుమతులు దేశంలోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 60 శాతం పెరిగాయి. పసిడి, వెండి దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు కేంద్రం ఇటీవలే వాటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. ముడిచమురు దిగుమతుల విలువ సైతం 16.5 శాతం పెరిగి 41.3 బిలియన్ డాలర్లకు చేరింది. పశ్చిమాసియాకు మెరుగైన ఎగుమతులు పశ్చిమాసియాలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రాంతానికి మే నెలలో ఎగుమతులు గతేడాది మే స్థాయికి చేరినట్టు రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. 2025 మేలో 5.38 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఈ ఏడాది అదే నెలలో 5.30 బిలియన్ డాలర్ల మేర ఆ ప్రాంతానికి ఎగుమతయ్యాయి. ఒమన్కు చెందిన దుక్్మ, సోహార్, సలాలా పోర్టుల ద్వారా భారత్ తన ఎగుమతులను పెంచుకుంది. -
డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జనాభా సంక్షోభం ముదురుతోంది. దేశాల ఆర్థిక, సామాజిక భవిష్యత్తును శాసించే జనన రేట్లు ఊహించని విధంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా ఆసియా, ఐరోపా ఖండాల్లోని ప్రభుత్వాలు ఈ ధోరణిని మార్చడానికి పడే తపన అంతా ఇంతా కాదు. ఎక్కువ మంది పిల్లలను కనాలని పౌరులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు అపర కుబేరులలాగా నగదు పంపిణీలు, పన్ను మినహాయింపులు, ఉచిత గృహ వసతి, భారీ కుటుంబ ప్రయోజనాలతో పాటు భావోద్వేగ విజ్ఞప్తులు కూడా చేస్తున్నాయి. అయినప్పటికీ, ఫలితం శూన్యం. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు నానాటికీ దిగజారుతూనే ఉంది.ఈ నేపథ్యంలో.. ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ఒప్పించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రపంచ అనుభవాల నుంచి రేపటి మేటి శక్తిగా ఎదుగుతున్న భారతదేశం ఎలాంటి వ్యూహాత్మక పాఠాలు నేర్చుకోవాలి? అనే అంశాలపై నిపుణులు చర్చిస్తున్నారు.బేబీ బోనస్ ప్రయోగం: చేతులెత్తేసిన దేశాలుపడిపోతున్న జనన రేట్లను తిప్పికొట్టడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడానికి దక్షిణ కొరియా ఒక ఉదాహరణ. 2006లో తక్కువ సంతానోత్పత్తి నివారణకు ఒక సమగ్ర ప్రణాళికను ప్రారంభించినప్పటి నుంచి ఆ దేశం నగదు ప్రోత్సాహకాలు, ఉచిత పిల్లల సంరక్షణ, సంతానోత్పత్తి చికిత్స రాయితీలు, తల్లిదండ్రుల సెలవులు, గృహ సహాయం వంటివాటి కోసం ఏకంగా 200 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అయినా ఫలితం ఏంటి? 2023లో ఆ దేశ సంతానోత్పత్తి రేటు రికార్డు స్థాయి 0.72 కి పడిపోయింది. 2024లో 0.75, 2025లో 0.8 గా ఇది స్వల్పంగా పెరిగినట్లు కనిపించినా స్థిరమైన జనాభాకు అవసరమైన భర్తీ రేటు అయిన 2.1 కంటే ఇది ఎంతో దూరంలో ఉంది.ఇతర దేశాలు ఇలా..ఇదే బాటలో నడిచిన సింగపూర్ 2001లో ‘బేబీ బోనస్’ పథకాన్ని తెచ్చింది. పదేపదే రాయితీలు పెంచినా అక్కడా జననాల రేటు ప్రపంచంలోనే అత్యల్ప స్థాయిలోనే ఉంది. జపాన్, చైనా, హంగేరీ, రష్యా, పోలాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలు పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చినా తాత్కాలిక ఉపశమనం తప్ప శాశ్వత మార్పును సాధించలేకపోయాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు కేవలం కొంతవరకు మాత్రమే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయని, పిల్లలను కనడం అనేది కేవలం డబ్బుతో ముడిపడిన అంశం కాదని ఈ దేశాల అనుభవాలు నిరూపిస్తున్నాయి.డబ్బు మాత్రమే ఎందుకు సరిపోవట్లేదు?ప్రభుత్వాల ఆలోచన ప్రకారం.. పిల్లల పెంపకం ఖరీదైనది, కాబట్టి నగదు ఇస్తే ప్రజలు పిల్లలను కంటారు. కానీ నిజ జీవితంలో ఈ తర్కం పనిచేయడం లేదు. ‘సంతానోత్పత్తి నిర్ణయాలు అనేవి వన్-టైమ్ ఫైనాన్షియల్ లావాదేవీలు కావు. పిల్లలను కలిగి ఉండటం అనేది గృహనిర్మాణం, ఉపాధి భద్రత, లింగ సమానత్వం, ఆరోగ్య సంరక్షణ, తల్లిదండ్రుల మానసిక, ఆర్థిక సామర్థ్యాలతో ముడిపడి ఉన్న సుదీర్ఘమైన ప్రక్రియ. ప్రభుత్వాలు ఇచ్చే తాత్కాలిక బేబీ బోనస్లు తల్లిదండ్రులు ఎదుర్కొనే వ్యవస్థాగత ఒత్తిళ్లను దూరం చేయలేవు’ అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా అన్నారు.నిజమైన ఖర్చులు ఇవే..పరిశోధకుల ప్రకారం.. సమస్య ప్రసవానికి అయ్యే ఖర్చు కాదు, ఒక కుటుంబాన్ని సగర్వంగా సమాజంలో నిలబెట్టడానికి అయ్యే విస్తృత సామాజిక-ఆర్థిక ఖర్చులు.పెరుగుతున్న గృహాల ధరలుకుటుంబం ఏర్పడటానికి ప్రధాన అడ్డంకి గృహ స్థోమత. UNFPA (ఐక్యరాజ్యసమితి జనాభా నిధి) 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 19% మంది తమకు కావలసిన సంఖ్యలో పిల్లలు లేకపోవడానికి గృహ సంబంధిత సమస్యలే కారణమని తేల్చారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ (ఓఈసీడీ) మార్చి 2025 నివేదిక సైతం దక్షిణ కొరియా, చైనా (బీజింగ్, షాంఘై), సింగపూర్ల్లో విపరీతంగా పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలు యువత పెళ్లిళ్లను వాయిదా వేయడానికి, తక్కువ సంతానోత్పత్తికి దారితీస్తున్నాయని స్పష్టం చేసింది.ఆలస్యమవుతున్న వివాహాలుఆసియా సంస్కృతిలో ప్రసవం అనేది వివాహ బంధంతో ముడిపడి ఉంది. ప్రస్తుతం యువత ఉన్నత విద్య, స్థిరమైన కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఫలితంగా వివాహ వయస్సు పెరుగుతోంది. వివాహ రేట్లు పడిపోతున్నాయి. తక్కువ వివాహాలు అంటే తక్కువ జననాలే కదా!ఆధునిక మహిళ - పని వాతావరణంనేటి మహిళలు విద్యావంతులు, ఆర్థిక స్వతంత్రులు. వారు తమ ఆకాంక్షలను త్యాగం చేయాల్సి వచ్చే కుటుంబ ఏర్పాట్లకు దూరంగా ఉంటున్నారు. ‘కార్యాలయాల్లో ఫ్లెక్సిబిలిటీ లేనప్పుడు పిల్లల పెంపకం భారం మహిళలపైనే పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతిని, చాలామంది మహిళలు పిల్లలను వద్దు అనుకుంటున్నారు’ అని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సీఈఓ శోభిత్ అగర్వాల్ అన్నారు.ఇంటెన్సివ్ పేరెంటింగ్నేటి కాలంలో పిల్లల సంఖ్య కంటే, ఉన్న ఒక్క బిడ్డకు బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనే ధోరణి పెరిగింది. విద్యా ఖర్చులు పెరగడం, పోటీ ప్రపంచంలో సీట్ల కోసం పడే పాట్లు చూసి ఇద్దరు పిల్లల కంటే ఒకరికే పరిమితమవుతున్నారు లేదా పేరెంట్హుడ్ను పూర్తిగా వాయిదా వేస్తున్నారు.గ్లోబల్ సర్వే ఏం చెబుతోంది? (UNFPA 2025 డేటా)యంగ్ జనరేషన్ కేవలం పిల్లల కోసం కాకుండా కెరీర్ గ్రోత్, వ్యక్తిగత స్వేచ్ఛ, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తోంది. వారు ఆశించే కుటుంబ పరిమాణాన్ని అడ్డుకుంటున్న కారకాలను కింది పట్టిక వివరిస్తుంది.అడ్డంకులు/కారణాలుశాతం (%)ఆర్థిక పరిమితులు39%ఉద్యోగ అభద్రత21%గృహ సమస్యలు19%సరిపోని పిల్లల సంరక్షణ సదుపాయాలు12%మనం నేర్చుకోవాల్సిన పాఠాలుభారతదేశం ప్రస్తుతం తూర్పు ఆసియా తరహా తీవ్ర జనాభా క్షీణతను ఎదుర్కోవడం లేదు కానీ, మన దేశ సంతానోత్పత్తి సరళి వేగంగా మారుతోంది. ఎన్ఎఫ్హెచ్ఎస్-6 (2023-24) నివేదిక ప్రకారం..భారతదేశ సగటు సంతానోత్పత్తి రేటు(టీఎఫ్ఆర్) 2.0 గా నమోదైంది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2024 సర్వే ప్రకారం.. దేశ జాతీయ టీఎఫ్ఆర్ 1.9 కు పడిపోయింది.1960లలో ఒక భారతీయ మహిళకు సగటున ఆరుగురు పిల్లలు ఉండగా నేడు విద్యా ప్రమాణాలు పెరగడం, గర్భనిరోధక సాధనాల లభ్యత వల్ల కుటుంబాలు చిన్నవయ్యాయి. అయితే ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఒకేలా లేదు. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో జననాల రేటు పడిపోయి వృద్ధాప్య జనాభా సమస్యను ఎదుర్కొంటుంటే, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంకా జనన రేట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్ ఏం చేయాలి?సంతానోత్పత్తి తగ్గడాన్ని ఒక సంక్షోభంగా చూడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం కంటే సరసమైన చైల్డ్ కేర్, మెరుగైన ప్రసూతి/పితృత్వ సెలవులు, సురక్షితమైన పని వాతావరణం కల్పించడంపై పాలకులు దృష్టి పెట్టాలి. భారతదేశంలో ఇంకా వివాహ బంధ వ్యవస్థ బలంగానే ఉంది. అయితే వంధ్యత్వం (Infertility), గృహాల ధరలు, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ సవాలుగా మారుతున్నాయి. సంతానోత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి పడిపోయే వరకు వేచి ఉండకుండా ఇప్పుడే ఫ్యామిలీ-ఫ్రెండ్లీ విధానాలు రూపొందించాలి.ఇదీ చదవండి: మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం -
మరిన్ని ఆర్థిక సంస్కరణలకు కేంద్రం సిద్ధం
గ్లోబల్ మార్కెట్లో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశీయంగా విదేశీ మూలధన ప్రవాహాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంయుక్తంగా కీలక చర్యలు ప్రారంభించాయి. విదేశీ నిధులను తిరిగి భారత మార్కెట్ వైపు ఆకర్షించేందుకు తీసుకుంటున్న ఈ చర్యల్లో ఇది మొదటి అడుగని, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్కరణలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ‘మైండ్ మైన్ సమ్మిట్ 2026’లో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించారు.ముడి చమురు, ఎరువులు, కీలక ముడి పదార్థాల దిగుమతుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ప్రపంచ పరిస్థితుల నుంచి ఉత్పన్నమయ్యే ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి మన బాండ్ మార్కెట్ ‘మంచి అయస్కాంతం’లా పనిచేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్త విశ్లేషణలో తేలిందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనలను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తు చేశారు.ఎఫ్ఏఆర్ పరిధి విస్తరణప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ ఇన్వెస్టర్లకు సమ్మతి భారాన్ని తగ్గించేందుకు గానూ, ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్ఏఆర్) కింద నిర్దిష్ట సెక్యూరిటీల జాబితాను జూన్ 5న ప్రభుత్వం మరింత విస్తరించింది. ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడుల ద్వారా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) ఆర్జించే వడ్డీ, మూలధన లాభాల ఆదాయానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కల్పించారు.‘ప్రస్తుతానికి ఈ సంస్కరణలు బాండ్ మార్కెట్కే పరిమితమైనప్పటికీ దీని పరిధి విస్తరించనుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దేశంలోకి మరిన్ని విదేశీ నిధులు రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం’ అని సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు.బ్యాంకులకు ఊరటవిదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచడంతో పాటు కరెన్సీ హెడ్జింగ్ రిస్క్ను తగ్గించడానికి ఆర్బీఐ జూన్ 5న బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. 3 నుంచి 5 సంవత్సరాల మెచ్యూరిటీ గల ‘విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్’ (ఎఫ్సీఎన్ఆర్-బీ) డిపాజిట్ల కోసం ఆర్బీఐ స్వాప్ సదుపాయాన్ని యాక్సెస్ చేయడానికి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. దీని ద్వారా బ్యాంకులు తమ యూఎస్ డాలర్ డిపాజిట్లను ఆర్బీఐతో మార్చుకోవచ్చు. తద్వారా మారకపు విలువల్లో వచ్చే కరెన్సీ ప్రమాదాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చు. అలాగే, విదేశీ మూలధన ప్రవాహాన్ని పెంచడానికి, సెప్టెంబర్ 30 వరకు బాహ్య వాణిజ్య రుణాలను (ఈసీబీ) పెంచుకునేలా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడానికి ఆర్బీఐ ఫారెక్స్ స్వాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.ఇదీ చదవండి: మల్టీప్లెక్స్ల టార్గెట్.. జెన్ జీ ఆడియన్స్! -
ఇంధన కొరతపై కేంద్ర మంత్రి క్లారిటీ!
దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని, ముడిచమురు, ఎల్జీ, సహజ వాయువు సరఫరా పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం స్పష్టం చేశారు. దేశీయంగా 60 రోజులకు పైగా సరిపడా ముడిచమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఎల్పీజీ సరఫరా కూడా చాలా మెరుగ్గా ఉందన్నారు. గరిష్టంగా 75 నుంచి 80 రోజులకు సరిపోయేలా నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.ఎల్పీజీ కనెక్షన్ దారులు క్రమంగా పైప్డ్ గ్యాస్ (పీఎన్జీ) వైపు మారాలని ఆయన కోరారు. ఇక డీజిల్ విక్రయాలపై రోజుకు 200 లీటర్ల పరిమితి విధించడంపై స్పందిస్తూ.. బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.అమెరికా దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంఒమన్ గల్ఫ్లో ఒక వాణిజ్య నౌకపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది మరణించిన ఘటనపై భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసిందని మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఈ విషయమై భారత్లోని అమెరికా రాయబార ప్రతినిధిని రెండుసార్లు పిలిపించి మాట్లాడామని చెప్పారు. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో నేరుగా మాట్లాడి తమ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి వివరించారు.పెరగనున్న ‘ఈ85’ ఇంధన పంపులుపర్యావరణ అనుకూల ఇంధన రంగం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో 47 ‘ఈ85’ (85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధన పంపులు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాబోయే డిసెంబర్ 2026 నాటికి వీటి సంఖ్యను 500కు, డిసెంబర్ 2027 నాటికి ఏకంగా 5,000 పంపులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. -
మధ్యతరగతిపై ధరల భారం
సాధారణ మధ్యతరగతి కుటుంబానికి నెలవారీ బడ్జెట్ను నిర్వహించడం సవాలుగా మారింది. వచ్చే ఆదాయానికి, అయ్యే ఖర్చులకు పొంతన కుదర్చడానికి సామాన్యుడు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే కిరాణా సామాగ్రి, ఇంధన ధరలు, పిల్లల పాఠశాల ఫీజులు, ఈఎంఐలు, కరెంట్ బిల్లులు లాంటి యుటిలిటీ బిల్లులు గృహ ఆదాయంలో అత్యధిక భాగాన్ని మింగేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఊహించని ఖర్చుల కోసం రూపాయి దాచుకుందామన్నా సాధ్యపడటం లేదు.ఈక్రమంలో తాజా ద్రవ్యోల్బణ గణాంకాలు సామాన్యుడు మరింత ఆందోళన చెందేలా ఉన్నాయి. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో నమోదైన 3.48 శాతం నుంచి మే నెల నాటికి 3.93కి పెరిగింది. ప్రధానంగా ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరగడమే ఇందుకు కారణం. కాగితంపై ఈ పెరుగుదల స్వల్పంగానే కనిపించవచ్చు. అలాగే ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత పరిమితిలోనే ఉండవచ్చు. కానీ, ఒక స్థిరమైన జీతంపై ఆధారపడే కుటుంబాలకు మాత్రం రాబోయే రోజుల్లో నిత్యావసరాలు మరింత ప్రియం కానున్నాయా అనే ఆందోళన మొదలైంది.మళ్లీ పెరిగిన ఆహారం, ఇంధనం మంట!సాధారణ వినియోగదారుడికి ద్రవ్యోల్బణం లెక్కలు, ఆర్థిక అంచనాలతో పెద్దగా పనిలేదు. మార్కెట్కు వెళ్తే కూరగాయలు, వంటనూనె ఎంతకు వస్తున్నాయి, బండిలో పెట్రోల్ కొట్టించడానికి ఎంతవుతోంది అనేదే వారి లెక్క. ఏప్రిల్లో 4.20 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం, మే నెలలో 4.78కు ఎగబాకింది. రవాణా ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 0.01గా ఉన్న ఉంటే మే నాటికి ఏకంగా 1.75 శాతానికి పెరిగింది.ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నెలలోనే నాలుగు సార్లు ఇంధన ధరలను సవరించడం దీనికి ప్రధాన కారణం. రవాణా ఖర్చులు పెరిగినప్పుడు ఆ భారాన్ని వ్యాపారాలు వినియోగదారులపైకే నెట్టేస్తాయి. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు అంతకంతకూ పెరుగుతాయి. ‘మే నెలలో రిటైల్ వినియోగదారులు టోకు ద్రవ్యోల్బణ తీవ్రత నుంచి కొంతవరకు తప్పించుకున్నప్పటికీ.. రెస్టారెంట్లు, వంట గ్యాస్, రవాణా వంటి రంగాలలో అప్పుడే ధరల ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది’ అని పిరమల్ గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ దేబోపమ్ చౌధురి అన్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఇది పట్టణ మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని హరిస్తూ మార్కెట్లో డిమాండ్ను తగ్గిస్తోంది.భవిష్యత్తు మరింత భారమేనా?ప్రస్తుత ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు లోబడే ఉన్నప్పటికీ ధరల ఒత్తిడి మాత్రం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలారా క్యాపిటల్ డిప్యూటీ హెడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎకనామిస్ట్ గరిమా కపూర్ మాట్లాడుతూ.. ‘ఇంధనం, ఆహార ధరల ప్రభావం ఉన్నప్పటికీ మే నెల సీపీఐ ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొంచెం తక్కువగానే నమోదైంది. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారం దిశగా అడుగులు పడటం, ఆర్బీఐ-ప్రభుత్వ చర్యల వల్ల స్థూల ఆర్థిక నేపథ్యం ప్రస్తుతం కాస్త అనుకూలంగా మారింది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిని అదుపు చేయడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది’ అని విశ్లేషించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
మేలోనూ ధరల మంటే!
న్యూఢిల్లీ: రిటైల్ ధరలు మే నెలలో మరికొంత ఎగిశాయి. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) ఏప్రిల్లో ఉన్న 3.48 శాతం నుంచి 3.93 శాతానికి పెరిగింది. ఆహార ధరలు, ఇంధన ధరలు ఈ పెరుగుదలకు దోహదం చేసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్త్నుాయి. → ఆహార విభాగంలో సీపీఐ ఏప్రిల్లో 4.2 శాతంగా ఉంటే, మేలో 4.78 శాతానికి పెరిగింది. → మేలో పసిడి, వెండి ఆభరణాలు, టమాటోలు, అల్లం, కిస్మిస్ ధరలు అధికంగా పెరిగాయి. → ఆలుగడ్డలు, బఠానీ, మోటారు కార్లు, జీలకర్ర, మోటార్ సైకిళ్లు, స్కూటర్ల ధరలు తగ్గాయి. → మే నుంచి చూస్తే పెట్రోల్ ధర 7.4 శాతం, డీజిల్ ధర రూ.8.4 శాతం చొప్పున పెరగడం తెలిసిందే. → పట్టణాల్లో ద్రవ్యోల్బణం తక్కువగా 3.93 శాతంగా ఉంటే, పల్లెల్లో 4.25 శాతంగా నమోదైంది. → దేశంలో అత్యధికంగా తెలంగాణలోనే 6.15 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. మిజోరంలో అత్యల్పంగా 1.03 శాతం ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా ఉండొచ్చంటూ ఆర్బీఐ ఎంపీసీ ఇటీవలి సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. ఆహారంతోపాటు, ఆహారేతర వస్తువుల ధరలు పెరగడం ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించినట్టు క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త దీప్తి దేశ్పాండే తెలిపారు. ‘‘తయారీదారులకు ముడిసరుకుల ధరలు ప్రియంగా మారాయి. టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్లో 8.3 శాతానికి చేరడం ఇదే సూచిస్తోంది. ఇప్పుడు ఈ భారం రిటైల్ ధరలపైనా క్రమంగా ప్రతిఫలిస్తోంది’’అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్బీఐ లకి‡్ష్యత పరిధిలోనే (2–6 శాతం) ద్రవ్యోల్బణం ఉండొచ్చని అసోచామ్ ప్రెసిడెంట్ నిర్మల్ కే మిండా అంచనా వేశారు. -
పెరిగిన భారత్ బంగారం నిల్వల విలువ
భారత విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో (Forex Reserves) స్వల్ప తగ్గుదల నమోదైనప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వద్ద ఉన్న బంగారం నిల్వల విలువ గణనీయంగా పెరిగింది. ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జూన్ 5తో ముగిసిన వారంలో దేశ బంగారం నిల్వల విలువ 1.98 బిలియన్ డాలర్లు పెరిగి 114.58 బిలియన్ డాలర్లకు చేరుకుంది.అదే సమయంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు 711 మిలియన్ డాలర్లు తగ్గి 681.61 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఫారెక్స్ రిజర్వుల్లో అతిపెద్ద వాటా కలిగిన విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) 2.70 బిలియన్ డాలర్లు తగ్గి 543.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఎఫ్సీఏలను అమెరికా డాలర్ విలువలో లెక్కిస్తారు. అయితే ఈ నిల్వల్లో యూరో, పౌండ్ స్టెర్లింగ్, జపాన్ యెన్ వంటి ఇతర ప్రధాన కరెన్సీలు కూడా ఉండటంతో, వాటి మారకపు విలువల్లో చోటుచేసుకునే మార్పులు ఎఫ్సీఏపై ప్రభావం చూపుతాయి.గత వారంలో భారత విదేశీ మారక నిల్వలు సుమారు 938 మిలియన్ డాలర్లు పెరిగిన విషయం తెలిసిందే. రూపాయి మారకపు విలువలో అధిక ఒడిదుడుకులు కనిపించినప్పుడు లేదా మార్కెట్లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నప్పుడు ఆర్బీఐ ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుంటూ నిల్వలను వినియోగిస్తుంది.ఇటీవల అమెరికా డాలర్ నిల్వలను బలోపేతం చేయడం, రూపాయి స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఎఫ్సీఎన్ఆర్-బీ (FCNR-B) డిపాజిట్ల హెడ్జింగ్ ఖర్చును భరించనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.ప్రస్తుతం భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే 95 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది ఈ ఏడాది ప్రారంభంలో నమోదైన 97 స్థాయితో పోలిస్తే మెరుగైన స్థితిగా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ 94.70 నుంచి 95.60 మధ్య కదలాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: టాటా కారు కొనుగోలుదారులకు షాక్! -
పేపర్ నోట్ల స్థానే ప్లాస్టిక్ నోట్లు! ప్రభుత్వం వివరణ
‘జూన్ 30 తర్వాత మీ జేబులోని కాగితపు కరెన్సీ నోట్లు చెల్లవు.. వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయి’— ఇటీవల సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల్లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్ సారాంశం ఇది. 2016 నాటి నోట్ల రద్దు (డీమానిటైజేషన్) జ్ఞాపకాలను గుర్తుచేస్తూ ఈ వార్త వ్యాపార వర్గాల్లో తీవ్ర గందరగోళాన్ని, భయాందోళనలను రేకెత్తించింది. అయితే, ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిజంగానే కాగితపు నోట్లను నిషేధిస్తోందా? కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏమంటోంది? అనే అంశాలను కింద చూద్దాం.వైరల్ అవుతున్న పోస్ట్లో ఏముంది?సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న పోస్టుల ప్రకారం.. జూన్ 30, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. అదే తేదీ నుంచి వాటి స్థానంలో సరికొత్త ప్లాస్టిక్ కరెన్సీ (పాలిమర్ నోట్లు) అమల్లోకి వస్తుందని ఆ పోస్టుల సారాంశం.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ఈ వైరల్ వార్తలపై కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ వాదనను పూర్తిగా నకిలీ (ఫేక్ న్యూస్) అని కొట్టిపారేసింది. ‘జూన్ 30, 2026 నాటికి కాగితపు నోట్లను దశలవారీగా తొలగించే లేదా వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే ఎలాంటి ప్రణాళికలు ఆర్బీఐ వద్ద లేవు. వివిధ సామాజిక గ్రూపుల్లో వచ్చే ధ్రువీకరించని సమాచారాన్ని, ఫార్వార్డ్ మెసేజ్లను గుడ్డిగా నమ్మవద్దు’ అని ప్రభుత్వం కోరింది. కరెన్సీకి సంబంధించిన ఎలాంటి వివరాల కోసమైనా నేరుగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.Several social media posts are falsely claiming that RBI will withdraw paper currency notes and replace them with plastic currency notes from June 30, 2026.#PIBFactCheck❌ This claim is #Fake✅ According to @RBI, there are no plans to withdraw paper currency notes or… pic.twitter.com/dhZqANjip9— PIB Fact Check (@PIBFactCheck) June 9, 2026పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలుఇటీవల (జూన్ 5, 2026న) జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం అనంతరం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్లాస్టిక్ నోట్లపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ‘పాలిమర్ నోట్ల ప్రవేశపెట్టే అంశం ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మాట వాస్తవమే. మేము దాని వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేస్తున్నాం. అయితే, ఈ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు’ అన్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్.. తెలుగు రాష్ట్రాల్లో.. -
ట్రంప్ వ్యాఖ్యలు వైరల్! ప్రత్యర్థులకు ఫుల్ జోష్
అమెరికాలో నిత్యావసరాలు, ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం (సీపీఐ) మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరడంపై ఆందోళనలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. పైగా ‘ఆర్థిక గణాంకాలు చాలా బాగున్నాయి... నేను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ విలేకరులతో ట్రంప్ అనడం ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే నవంబర్లో జరగబోయే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో ఈ ధరల పెరుగుదలనే ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకున్న డెమొక్రాట్లకు ట్రంప్ వ్యాఖ్యలు వరంగా మారుతాయని కొందరు చెబుతున్నారు.డెమొక్రాట్ల ఎదురుదాడిట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష డెమొక్రాట్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ సందర్భంగా యూఎస్ సెనేట్ డెమొక్రాటిక్ మైనారిటీ నేత చక్ షూమర్ మాట్లాడుతూ.. ‘అమెరికన్ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై ట్రంప్నకు ఉన్న నిర్లక్ష్యానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. తాను ద్రవ్యోల్బణాన్ని ప్రేమిస్తున్నానని పబ్లిక్గా ఒప్పుకున్నారు. అమెరికా ప్రజల పట్ల ఆయనకున్న ధిక్కారానికి హద్దులు లేవు’ అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు.డెమొక్రాటిక్ పార్టీ వ్యూహంట్రంప్ మాట్లాడిన వీడియో క్లిప్ను జోడిస్తూ డెమొక్రాటిక్ పార్టీ సామాజిక మాధ్యమాల్లో కొత్త ప్రచార ప్రకటనను విడుదల చేసింది. ‘ట్రంప్ తన మనసులోని నిశ్శబ్దాన్ని బయటపెట్టేశారు. ఆయనకు ద్రవ్యోల్బణం అంటే ఇష్టం. ప్రతి అమెరికన్ దీనిని గమనించాలి’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు. మరోవైపు హౌస్ రిపబ్లికన్ స్పీకర్ మైక్ జాన్సన్ అధ్యక్షుడి వ్యాఖ్యలను సమర్థిస్తూ.. ట్రంప్ అన్న మాటలను అంసందర్భంగా మారుస్తూ రాజకీయం చేస్తున్నారని వాదించారు.మూడేళ్ల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణంతాజా గణాంకాల ప్రకారం, మే నెలలో వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) వార్షిక ప్రాతిపదికన 4.2 శాతానికి పెరిగింది. ఇది ఏప్రిల్ నెలలోని 3.8 శాతం కంటే ఎక్కువ మాత్రమే కాకుండా, ఏప్రిల్ 2023 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి కావడం గమనార్హం. కిరాణా సామగ్రి, ఇంధనంతో పాటు వైద్య సంరక్షణ, వ్యక్తిగత సంరక్షణ సేవల ఖర్చులు, విమాన ప్రయాణ ఛార్జీలు, వినోద రంగాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి.ధరల పెరుగుదలకు కారణంకొవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి కోలుకోకముందే.. వరుస అంతర్జాతీయ పరిణామాలు ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ విధించిన అంతర్జాతీయ సుంకాలు ఇప్పటికే ఆర్థికవ్యవస్థను దెబ్బతీయగా ఫిబ్రవరి చివరలో ప్రారంభమైన యూఎస్-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధం చమురు మార్కెట్ను కోలుకోలేని దెబ్బతీసింది.ప్రపంచ చమురు, వాయువు రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో అంతర్జాతీయంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. అయితే, ఈ పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే ద్రవ్యోల్బణం ఒక్కసారిగా తగ్గుతుందని ట్రంప్ అంచనా వేస్తున్నారు. కానీ, ఆర్థికవేత్తలు మాత్రం యుద్ధం ముగిసినా చమురు ధరలు పూర్వస్థితికి రావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుందని స్పష్టం చేస్తున్నారు.ఆశాజనకమైన సంకేతాలుకొంతకాలంగా గ్యాసోలిన్ ధరలు స్వల్పంగా స్థిరపడుతుండటం మార్కెట్ విశ్లేషకులలో ఆశలు రేకెత్తిస్తోంది. ‘అధిక ఇంధన ధరలు గత నెలలో ద్రవ్యోల్బణాన్ని మళ్లీ పెంచిన మాట వాస్తవమే. కానీ, ద్రవ్యోల్బణం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని మా అంచనా. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఇది తగ్గుముఖం పడుతుంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్తో చర్చలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’ అని నేషన్ వైడ్ చీఫ్ ఎకనామిస్ట్ కాథీ బోస్ట్జోన్సిక్ అన్నారు.వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనా?అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి పరిమితం చేయాలని భావిస్తోంది. వచ్చే వారం ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణాయక కమిటీ సమావేశం కానుంది. గత నెలలోనే పగ్గాలు చేపట్టిన కొత్త ఛైర్మన్ కెవిన్ వార్ష్ నేతృత్వంలో జరగబోయే మొదటి సమావేశం ఇది కావడం విశేషం. వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడ్ రేట్లను యథాతథంగా ఉంచేందుకే మొగ్గు చూపవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం కూడా లేకపోలేదనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
ఎరువుల సబ్సిడీ రెట్టింపు
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, వాతావరణ మార్పులు, సాంకేతిక విప్లవం (ఏఐ) అంతర్జాతీయ వ్యాపార రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఎరువుల సబ్సిడీ బిల్లు ఏకంగా రూ.3.4 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.భారత్పై సబ్సిడీ భారంయూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం 100 రోజులు కావస్తుండడం, హార్మూజ్ జలసంధిలో రవాణా అంతరాయాలు, ఉత్పత్తి కేంద్రాల దెబ్బతినడం వల్ల అంతర్జాతీయంగా ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో ఎరువుల సబ్సిడీ కోసం రూ.1.71 లక్షల కోట్లు కేటాయించగా ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇది రెట్టింపై రూ.3.4 లక్షల కోట్లకు చేరేలా ఉంది.రైతాంగానికి ఊరటప్రభుత్వానికి భారం పెరిగినప్పటికీ రైతులపై పైసా భారం పడకుండా చర్యలు తీసుకున్నారు. 2018 నుంచి యూరియా ధర (45 కిలోల బస్తా) రూ.266.5 వద్దే స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఒక్కో బస్తాపై సబ్సిడీ రూ.4,000 దాటింది. డీఏపీ (50 కిలోల బస్తా) ధర కూడా రూ.1,350 వద్దే కొనసాగుతోంది.ఆయిల్ కంపెనీలకు మద్దతుగత 78 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.1.23 లక్షల కోట్ల మద్దతును అందిస్తోంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 తగ్గించడం ఇందులో భాగమే.బడ్జెట్ పరిమితులు దాటని ద్రవ్యలోటుఈ అదనపు వ్యయాలు దేశ ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీయవని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2026-27 బడ్జెట్ రూపకల్పనలోనే ఇలాంటి అంతర్జాతీయ అనిశ్చితులను ముందే అంచనా వేసి వ్యూహాత్మకంగా నిధులను కేటాయించారు. బడ్జెట్లో నిర్దేశించుకున్న జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు లక్ష్యానికే ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అదనపు రుణాలు లేదా అనుబంధ గ్రాంట్ల అవసరం రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు.రూ.1 లక్ష కోట్ల స్థిరీకరణ నిధిఊహించని ప్రపంచ పరిస్థితులను తట్టుకోవడానికి గత ఏడాది ఏర్పాటు చేసిన రూ.1 లక్ష కోట్ల ఆర్థిక స్థిరీకరణ నిధి ప్రస్తుతం కేంద్రానికి రక్షణ కవచంగా మారింది. దీని నుంచే విమానయాన సంస్థల కోసం రూ.10,000 కోట్ల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరల స్థిరీకరణ నిధిని కేటాయించారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి దేశీయ యూరియా ప్లాంట్లకు తగినంత ఎల్ఎన్జీ సరఫరాను ప్రభుత్వం నిర్ధారించింది. ఇది సబ్సిడీ భారాన్ని కొంతవరకు తగ్గించనుంది.ఆదాయ సమీకరణపై ప్రత్యేక దృష్టిఅదనపు సబ్సిడీల భారాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం పన్నుయేతర ఆదాయాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం, పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణ ప్రక్రియను ముమ్మరం చేసింది. ‘డీఐపీఏఎం(దీపమ్) , డీపీఈ విభాగాలు రాబోయే ఏడాది కాలానికి స్పష్టమైన కార్యాచరణతో ఉన్నాయి. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బడ్జెట్ లక్ష్యం రూ.80,000 కోట్లను మించి ఆదాయం వస్తుందని భావిస్తున్నాం’ అని ప్రభుత్వ ఉన్నత అధికార వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో! -
డార్క్ ప్యాటర్న్స్తో ఏటా రూ.28,000 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన డిజిటల్ ప్లాట్ఫారమ్లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్ ప్యాటర్న్స్’ (మోసపూరిత డిజైన్ విధానాలు) కారణంగా భారతీయ ఆన్లైన్ కొనుగోలుదారులు ఏటా రూ.25,000 కోట్ల నుంచి రూ.28,000 కోట్ల వరకు నష్టపోతున్నట్లు మార్కెట్ పరిశోధనా సంస్థ డేటమ్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. సంస్థ మంగళవారం విడుదల చేసిన ‘డార్క్ ప్యాటర్న్స్ ఇన్ ఇండియాస్ ఆన్లైన్ మార్కెట్ప్లేసెస్’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2026 తొలి త్రైమాసికంలో దేశంలోని 50 నగరాలకు చెందిన 2,590 మంది వినియోగదారులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ–కామర్స్, క్విక్ కామర్స్, ఆన్లైన్ ట్రావెల్ రంగాలకు చెందిన 12 ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫారమ్లను ఇందులో విశ్లేషించారు. డార్క్ పాటర్న్స్ అంటే: ఉత్పత్తులు లేదా సేవలను అంటగట్టేందుకు అనుసరించే వివిధ పద్ధతులే డార్క్ పాటర్న్స్గా వ్యవహరిస్తారు. వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్ చేయించడమే వీటి లక్ష్యం. నివేదికలో మరిన్ని అంశాలు: → రహస్య ఛార్జీలు, బలవంతపు యాడ్–ఆన్లు, డ్రిప్ ప్రైసింగ్, ఫాల్స్ అర్జెన్సీ, సబ్్రస్కిప్షన్ ఉచ్చులు వంటి విధానాల కారణంగా దేశంలోని 30.4 కోట్ల మంది ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 88 శాతం మంది నెలకు సగటున రూ.78 నుంచి రూ.87 వరకు అదనపు భారం భరిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. → ప్రారంభంలో ఒక ధర చూపించి, చెల్లింపు దశలో అదనపు రుసుములు జోడించే ‘డ్రిప్ ప్రైసింగ్’ లేదా ‘హిడెన్ ఛార్జీలు’ ఎదురవుతున్నాయని 63 % మంది డిజిటల్ చెల్లింపుల వినియోగదారులు తెలిపారు. 2024లో ఈ సంఖ్య 52 శాతంగా ఉండగా, ప్రస్తుతం 63 శాతానికి పెరగడం ఆందోళన కలిగించే అంశమని నివేదిక పేర్కొంది → అధ్యయనంలో భాగమైన 73 శాతం ప్లాట్ఫారమ్లు వినియోగదారులకు ఇష్టం లేకపోయినా.., కొనుగోలు చేసేలా బలవంతపు వ్యూహాలు (ఫోర్డ్స్ యాక్షన్) అమలు చేస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. → ఆన్లైన్ కొనుగోలుదారులలో 81 శాతం మందికి ఇలాంటి మోసపూరిత టెక్నిక్స్ (డార్క్ ప్యాటర్న్స్) గురించి అవగాహన ఉన్నప్పటికీ, వారిలో 85 శాతం మంది డార్క్ ప్యాటర్న్స్ వల్ల ఏదో ఒక రూపంలో తప్పుదోవ పట్టించబడినట్లు వెల్లడించారు. దీనిని నివేదిక ‘అవగాహన వైరుధ్యం’ గా అభివరి్ణంచింది. → ఈ–కామర్స్ విభాగంలో 50 శాతం మంది వినియోగదారుల మద్దతుతో అమెజాన్ అత్యంత విశ్వసనీయ వేదికగా నిలిచింది. మరోవైపు, ఫ్లిప్కార్ట్ విషయంలో నమ్మకం (37 శాతం) కంటే అపనమ్మకమే (41 శాతం) ఎక్కువగా నమోదైంది. ఇక్కడ ప్రతి లావాదేవీలోనూ వినియోగదారుల నుంచి ‘అదనపు సొమ్ము’ వసూలు చేసే ప్రక్రియ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది. → ఆన్లైన్ ట్రావెల్ రంగంలో మేక్మైట్రిప్ అత్యంత సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. కాగా క్లియర్ట్రిప్ వినియోగదారులకు ఎక్కువ నష్టం చేకూరుస్తున్నట్లు రేటింగ్ పొందింది. → క్విక్ కామర్స్ రంగంలో బిగ్బాస్కెట్ యాప్ తీవ్రమైన డార్క్ ప్యాటర్న్స్ స్కోరును నమోదు చేసింది. → ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఈ డిజిటల్ మోసాలను అరికట్టడంలో పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాయని నివేదిక అభిప్రాయపడింది. అయితే, ఆన్లైన్ కొనుగోలుదారుల్లో 74 శాతం మంది పారదర్శకమైన, న్యాయబద్ధమైన డిజైన్ విధానాలను అనుసరించే ప్లాట్ఫారమ్ల కోసం అవసరమైతే కొంత ఎక్కువ ధర చెల్లించేందుకూ సిద్ధంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. -
వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తగ్గించింది. గతంలో 6.7 శాతంగా ప్రకటించిన అంచనాను 6.4 శాతానికి సవరిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా–ఇరాన్ యుద్ధంతో సెపె్టంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు నిదానించనున్నట్టు తెలిపింది. ప్రజల ఆదాయం, వినియోగ వ్యయాలపై ధరల పెరుగుదల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదు కావడం తెలిసిందే. ‘‘జీడీపీ వృద్ధి రేటు 2026–27లో 6.4 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం. మార్చిలో ప్రకటించిన అంచన కంటే 0.3 శాతం తక్కువ. వృద్ధిలో దేశీ డిమాండ్ కీలక పాత్ర పోషిస్తుంది. నికర దిగుమతులు తక్కువగా ఉండడం వృద్ధికి అనుకూలించనుంది’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చన్నది ఆర్బీఐ తాజా అంచనా. ద్రవ్యోల్బణం 5.1 శాతంగా ఉంటుందని జూన్ సమీక్ష అనంతరం ప్రకటించడం తెలిసిందే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇటీవలి కాలంలో పెంచడాన్ని ఫిచ్ తన నివేదికలో ప్రస్తావించింది. 2027–28లో జీడీపీ వృద్ధి 6.7%కి పుంజుకుంటుందని అంచనా వేసింది. ధరలు పెరుగుతాయ్.. భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలో పెరగలేదంటూ, రానున్న నెలల్లో ధరలు క్రమంగా పెరుగుతాయని ఫిచ్ తెలిపింది. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 8.3%కి పెరగ్గా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.5%గా ఉండడాన్ని ప్రస్తావించింది.అంతర్జాతీయ వృద్ధి 2.4 శాతం 2026 సంవత్సరానికి అంతర్జాతీయ వృద్ధి రేటు అంచనాలను సైతం 0.2 శాతం తగ్గించి 2.4 శాతంగా ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. -
ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో మిగులు నిధుల బదిలీ (సర్ప్లస్ ట్రాన్స్ఫర్) ఊపందుకుంది. ఆర్థిక సంవత్సరం 2025-26లో ఆర్బీఐ ఏకంగా రూ.2,86,588.46 కోట్ల భారీ మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేసింది. ఇది మన దేశ జీడీపీలో 0.83 శాతానికి సమానం. గడచిన మూడేళ్లుగా ఈ బదిలీలు నిరంతరాయంగా భారీ స్థాయిలో సాగుతున్నాయి.గత మూడేళ్ల బదిలీల గణాంకాలను పరిశీలిస్తే..2023-24: రూ.2,10,873.99 కోట్లు (జీడీపీలో 0.99%)2024-25: రూ.2,68,590.07 కోట్లు (జీడీపీలో 0.90%)2025-26: రూ.2,86,588.46 కోట్లు (జీడీపీలో 0.83%)ఈ నిధుల బదిలీ ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో ఊరటనిస్తున్నప్పటికీ దేశ ద్రవ్య వ్యవస్థ(మానిటరీ సిస్టమ్), లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై నిపుణులు కొన్ని అంశాలు పంచుకుంటున్నారు.చట్టబద్ధమైన నిబంధనలు - ఆదాయ వ్యయాలుఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 47 ప్రకారం.. రిజర్వ్ బ్యాంక్ తన మొత్తం ఆదాయం నుంచి నిర్వహణ వ్యయాలు, అవసరమైన నిధుల కేటాయింపులు పోను మిగిలిన నికర ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది.ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది?ఆర్బీఐకి దేశీయ వనరులతో పాటు విదేశీ వనరుల నుంచి వచ్చే వడ్డీలు, పెట్టుబడుల అమ్మకాలు/రిడెంప్షన్ ద్వారా లభించే లాభాల రూపంలో ఆదాయం వస్తుంది. 2025-26లో ఆర్బీఐ స్థూల ఆదాయం 26.42 శాతం పెరిగి రూ.4,27,684.15 కోట్లకు చేరింది. ఇందులో అత్యధికంగా 76.53 శాతం ఆదాయం విదేశీ వనరుల నుంచే రావడం గమనార్హం.మరోవైపు ఆర్బీఐ మొత్తం వ్యయం (ఉద్యోగుల జీతాలు, కరెన్సీ ముద్రణ ఛార్జీలు, ఏజెన్సీ ఛార్జీలు మొదలైనవి) రిస్క్ ప్రొవిజన్లకు ముందు 27.60 శాతం పెరిగి రూ.1,41,091.69 కోట్లుగా నమోదైంది. రిస్క్ ప్రొవిజన్ల(భవిష్యత్తులో రాబోయే ఊహించని నష్టాలు లేదా ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్బీఐ తన లాభాల నుంచి ముందుగానే పక్కన పెట్టే రక్షణ నిధి)కు ముందు నికర ఆదాయం రూ.3,95,972.10 కోట్లుగా ఉండగా, మార్చి 31, 2026 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ సైజ్ 20.61 శాతం వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ నిర్వహణసవరించిన ఆర్థిక మూలధన చట్రం (ఎకానామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్-ECF) ప్రకారం.. ఆర్బీఐ తన బ్యాలెన్స్ షీట్ సైజులో 4.5% నుంచి 7.5% వరకు కంటింజెంట్ రిస్క్ బఫర్ (సీఆర్బీ-ఊహించని అత్యవసర ఖర్చులు) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ 2025-26లో ఏకంగా రూ.1,09,379.64 కోట్లను సీఆర్బీకి మళ్లించింది (గత ఏడాది ఇది రూ.44,861.70 కోట్లు మాత్రమే). ప్రస్తుతం ఈ రిస్క్ బఫర్ లెక్కింపు ప్రకారం 6.5 శాతంగా ఉంది.ద్రవ్య వ్యవస్థపై పర్యవసానాలుఆర్బీఐ వద్ద మిగులు నిధుల బదిలీ కేవలం అకౌంటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు, దీనికి తీవ్రమైన ద్రవ్య ప్రాధాన్యత ఉంది. ఇది దేశ ద్రవ్య విధానంపై ప్రభావం చూపుతుంది.రిజర్వ్ మనీ పెరగడం: దేశంలో ద్రవ్య సృష్టికి మూలమైన రిజర్వ్ మనీ లేదా బేస్ మనీతో దీనికి ప్రత్యక్ష సంబంధం ఉంది. ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీల వైపు కరెన్సీ, బ్యాంకుల డిపాజిట్లు ఉంటే.. అసెట్స్ వైపు నెట్ డొమెస్టిక్ అసెట్స్ (ఎన్డీఏ-ప్రభుత్వానికి ఇచ్చే క్రెడిట్), నెట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎన్ఎఫ్ఏ) ఉంటాయి.లిక్విడిటీ: ఆర్బీఐ వద్ద ఈ మిగులు ఉన్నంత కాలం నిధులు ‘నాన్-మానిటరీ లయబిలిటీ’గా రిజర్వుల్లో ఉంటాయి. ఎప్పుడైతే వీటిని ప్రభుత్వానికి బదిలీ చేస్తారో అప్పుడు ఇవి ప్రభుత్వ డిపాజిట్లుగా మారతాయి. ప్రభుత్వం ఈ నిధులను వివిధ పథకాలు, అభివృద్ధి పనుల కోసం మార్కెట్లో ఖర్చు చేసినప్పుడు.. ఆ డబ్బు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుంది. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) భారీగా పెరుగుతుంది. ఇది వ్యవస్థలోకి శాశ్వత లిక్విడిటీని ప్రవేశపెట్టడంతో సమానం.రాబడిలో పెరుగుదలకేంద్ర బడ్జెట్లో ఈ నిధులను పన్నేతర రాబడి కింద ‘డివిడెండ్లు, లాభాలు’ అనే పద్దులో చూపిస్తారు.2025-26 బడ్జెట్ అంచనాలుసవరించిన అంచనాలుతుది సంఖ్యరూ.3,25,000 కోట్లురూ.3,75,590 కోట్లురూ.3,80,136 కోట్లుఈ పెరిగిన రూ.55,136 కోట్లకు ప్రధాన కారణం ఆర్బీఐ బదిలీ చేసిన మిగులు నిధులే. 2025-26లో బదిలీ అయిన రూ.2,86,588.46 కోట్లు.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ పన్నేతర రాబడిలో ఏకంగా 43.01 శాతంగా నిలవనుంది. ఇది ఆర్బీఐ నిధులపై ప్రభుత్వ డిపెండెన్సీ ఏ స్థాయిలో పెరుగుతుందో సూచిస్తోంది. సాధారణ ప్రభుత్వ రంగ సంస్థల లాభాల బదిలీకి, ఆర్బీఐ మిగులు బదిలీకి చాలా తేడా ఉంటుంది. ఆర్బీఐ బదిలీ నేరుగా ప్రాథమిక ద్రవ్య విస్తరణకు దారితీస్తుంది.ద్రవ్యోల్బణాన్ని పెంచుతుందా?సాంకేతిక కోణంలో చూస్తే ఇది ద్రవ్యోల్బణానికి దారితీసే అంశాలాగా తోస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ బదిలీల వల్ల వ్యవస్థలోకి వచ్చే అదనపు ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ సులువుగా విస్మరించలేదు. ప్రభుత్వానికి ఇది ఆర్థికంగా వెసులుబాటు కల్పించే అవకాశం అయినప్పటికీ, మార్కెట్లో మితిమీరిన ద్రవ్య లభ్యత వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణ ముప్పును అదుపు చేయడం ఆర్బీఐకి సవాలుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
క్యూ4లో 7.1 బిలియన్ డాలర్లు
ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికం(క్యూ4)లో దేశీ కరెంట్ ఖాతా 7.1 బిలియన్ డాలర్ల మిగులును సాధించింది. ఇది దేశ జీడీపీలో 0.7 శాతంకాగా.. ఇందుకు సరీ్వసుల ఎగుమతులు, అధిక రెమిటెన్సులు సహకరించాయి. అయితే అంతక్రితం ఏడాది(2024–25) జనవరి–మార్చి(క్యూ4)లో 13.7 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. ఇది జీడీపీలో 1.4 శాతానికి సమానం. ఆర్బీఐ బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్(బీవోపీ)పై తాజాగా విడుదల చేసిన గణాంకాలివి. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) 25.2 బిలియన్ డాలర్లుగా ఉంది. జీడీపీలో ఇది 0.6 శాతంకాగా.. 2024–25లోనూ 22.9 బిలియన్ డాలర్ల(0.6 శాతం) క్యాడ్ నమోదైంది. క్యూ4 వివరాలిలా గతేడాది క్యూ4లో మెర్కండైజ్ వాణిజ్య లోటు 83.4 బిలియన్ డాలర్లుకాగా.. 2024–25 చివరి త్రైమాసికంలో నమోదైన 59.3 బిలియన్ డాలర్లకంటే భారీగా పెరిగింది. సర్వీసుల నికర వసూళ్లు (రిసీప్్ట్స) 53.3 బిలియన్ డాలర్ల నుంచి 60.4 బిలియన్ డాలర్లకు ఎగశాయి. వార్షికంగా సరీ్వసుల ఎగుమతులు ప్రధాన కేటగిరీలైన కంప్యూటర్ సరీ్వసులు, ఇతర బిజినెస్ సరీ్వసులలో బలపడ్డాయి. ఈ కాలంలో సెకండరీ ఆదాయ ఖాతాకింద వ్యక్తిగత బదిలీ రిసీప్్ట్స(రెమిటెన్స్లు) 33.9 బిలియన్ డాలర్ల నుంచి 43.5 బిలియన్ డాలర్లకు జంప్చేశాయి. ఫైనాన్షియల్ ఖాతాలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) నికరంగా 0.4 బిలియన్ డాలర్ల నుంచి 4.2 బిలియన్ డాలర్లకు ఎగశాయి. మరోపక్క విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్(ఎఫ్పీఐ) నుంచి 12 బిలియన్ డాలర్ల నికర పెట్టుబడులు లభించాయి. అయితే అంతక్రితం ఏడాది క్యూ4లో 5.9 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి మళ్లాయి. బీవోపీ ప్రాతిపదికన విదేశీ మారక నిల్వలు 7.2 బిలియన్ డాలర్లమేర బలపడ్డాయి. అంతక్రితం క్యూ4లో ఇవి 7.2 బిలియన్ డాలర్లమేర పుంజుకున్నాయి. పూర్తి ఏడాదికి గతేడాది నికర ఎఫ్డీఐ పెట్టుబడులు 6.9 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 16.4 బిలియన్ డాలర్ల ఎఫ్పీఐ పెట్టుబడులు తరలిపోయాయి. 2024–25లో 3.6 బిలియన్ డాలర్ల ఎఫ్పీఐ పెట్టుబడులు లభించాయి. విదేశీ మారక నిల్వలు 23.6 బిలియన్ డాలర్లమేర క్షీణించాయి. అంతక్రితం ఏడాదిలో ఈ క్షీణత 5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
గణాంకాలపై మార్కెట్ ఫోకస్!
దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా పలు దేశ, విదేశీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోపక్క రోజుకో మలుపు తీసుకుంటున్న పశ్చిమాసియా పరిస్థితులు కీలకం కానున్నాయి. గత వారాంతాన యూఎస్ మార్కెట్లతోపాటు.. పసిడి, వెండి తదితర కమోడిటీలలో అమ్మకాలు వెల్లువెత్తాయి. యూఎస్ స్టాక్ మార్కెట్లు 1.5–4% మధ్య క్షీణించగా.. బంగారం 3 శాతం, వెండి 6.5% చొప్పున పతనమయ్యాయి. ముడిచమురు, కాపర్, నేచురల్ గ్యాస్ సైతం 2–4 శాతం మధ్య నీరసించాయి. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. యూఎస్ లీజర్, హెల్త్కేర్, ఆతిథ్య రంగాల దన్నుతో మే నెలలో ఉపాధి గణాంకాలు అంచనాలను మించాయి. దీంతో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపవచ్చన్న అంచనాలు పెరిగి ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 100కు బలపడింది. మరోపక్క ఏఐ సవాళ్లతో టెక్నాలజీ స్టాక్స్లో తలెత్తిన భారీ అమ్మకాలు నాస్డాక్ను 4% పడగొట్టినట్లు తెలిపా రు. కాల్పుల విరమణ అంటూనే యూఎస్, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతుండటంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. నేడు అటూఇటుగా గత వారం చివర్లో యూఎస్ మార్కెట్లు, కమోడిటీలలో నమోదైన అమ్మకాల ప్రభావం నేడు దేశీయంగా కనిపించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే గత వారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు, ఆర్బీఐతోపాటు ప్రభుత్వం చేపట్టిన విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహకాల నిబంధనల సవరణలు కొంతమేర ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు వివరించారు. రాజకీయ, భౌగోళిక అనిశ్చితి, చమురు ధరల కారణంగా ఎదురవుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ తగ్గించడం కొంతమేర ప్రతికూలమేనని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు ఆర్బీఐ దన్ను, బలపడిన డాలరు.. రూపాయిపై ప్రభావం.. ఇవన్నీ కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. వెరసి నేడు మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాలపై దృష్టిఇటీవల ఆశలు రేపుతున్న రుతుపవనాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. మే నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు 12న వస్తాయి. ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గ్లోబల్ ఐటీ దిగ్గజాల్లో అమ్మకాలు దేశీయంగానూ ప్రభావం చూపవచ్చని లివ్లాంగ్ వెల్త్ రీసెర్చ్ నిపుణులు కె.హరిప్రసాద్ చెప్పారు.సాంకేతికంగా చూస్తే.. సాంకేతిక నిపుణుల అంచనాల ప్రకారం గత వారం సెన్సెక్స్ మద్దతు స్థాయిలకు సమీపంలో నిలిచినప్పటికీ బలహీనంగానే కనిపిస్తోంది. మరోపక్క 23,500 పాయింట్లను దాటలేకపోతున్న నిఫ్టీ మరింత బలహీనపడే వీలుంది. వెరసి ఈ వారం నిఫ్టీ 23,000 పాయింట్ల దిగువకు 22,900కు చేరవచ్చు. బలపడితే 23,500 వద్ద రెసిస్టెన్స్కు అవకాశముంది. గత వారం డీలా విదేశీ ఇన్వెస్టర్ల నిరంతర విక్రయాల నేపథ్యంలో గత వారం(1–5) హెచ్చుతగ్గుల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్ నికరంగా 532 పాయింట్లు(0.7%) నష్టపోయి 74,243 వద్ద ముగిసింది. నిఫ్టీ 181 పాయింట్లు(0.76%) క్షీణించి 23,367 వద్ద స్థిరపడింది. ఎఫ్పిఐ అమ్మకాల దెబ్బ కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలు చేపడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) ఈ నెల తొలి వారంలోనూ ఇదే ధోరణి కొనసాగించారు. వెరసి జూన్ తొలి వారంలో రూ. 43,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ కేలండర్ ఏడాది(2026)లో ఇప్పటివరకూ రూ. 2.67 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఎన్ఎస్డీఎల్ వివరాల ప్రకారం 2025లో వెనక్కి తీసుకున్న పెట్టుబడులు రూ. 1.66 లక్షల కోట్లను ఇవి దాటేశాయి. బలహీన కార్పొరేట్ ఫలితాలు, రూపాయి క్షీణత, గ్లోబల్ మార్కెట్లలో ఆకర్షణీయ అవకాశాలు తదితర అంశాలు ప్రభావం చూపుతున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మినహా అన్ని నెలల్లోనూ ఎఫ్పీఐలు నికర అమ్మకందారులుగానే నిలవడం గమనార్హం! మార్చిలో అత్యధికంగా రూ. 1.17 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత ఆర్థిక వ్యవస్థ భేష్
ముంబై: రాజకీయ, భౌగోళిక సవాళ్ల నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడను చూపుతున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జే. స్వామినాథన్ ఇటీవల పేర్కొన్నారు. ఇందుకు పారిశ్రామిక, సరీ్వసుల రంగాలు దన్నుగా నిలుస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా విస్తృత డిమాండ్, మెరుగుపడుతున్న కార్పొరేట్ ఫలితాలు తదితర అంశాలు వ్యవస్థ ప్రగతిశీలతకు మద్దతిస్తున్నట్లు వివరించారు.ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్షిత పరిధిలోనే ఉన్నట్లు కొలంబియా యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్(ఎస్ఐపీఏ) వద్ద ప్రసంగంలో సోమవారం ప్రస్తావించారు. విదేశీ ఆటుపోట్లను తట్టుకోగలమని ఈ సందర్భంగా తెలియజేశారు. జియోపాలిటిక్స్, వాతావరణ మార్పులు, ఏఐ, టెక్నాలజీ సవాళ్లపై ప్రపంచ పాలసీలు ఆధారపడుతున్న సందర్భంలో సమావేశంకానున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రసంగాన్ని ఆర్బీఐ తాజాగా వెబ్సైట్లో పోస్ట్ చేసింది. -
అంచనాలను మించిన భారత జీడీపీ
న్యూఢిల్లీ: దేశీయంగా వినియోగానికి డిమాండ్ పటిష్టంగా ఉండటం, ప్రభుత్వం కూడా గణనీయంగా వ్యయాలు చేయడంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలకు మించి వృద్ధి చెందింది. 7.8 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది 7 శాతంగాను, తాజా క్యూ3లో 8 శాతంగాను నమోదైంది. ఇక వినియోగం, పెట్టుబడులు మెరుగ్గా ఉండటంతో పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ 7.7 శాతం మేర వృద్ధి చెందింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 7.1 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడితే 2028 ఆర్థిక సంవత్సరంలో భారత్ మళ్లీ 7 శాతానికి పైగా వృద్ధి సాధించవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఆర్బీఐ అంచనా వేస్తున్నట్లుగా 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 7 శాతం లోపునకు నెమ్మదించినా, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ప్రభుత్వం తీసుకునే పాలసీపరమైన చర్యలనేవి ఎకానమీ మళ్లీ 7 శాతం పైగా వృద్ధి రేటువైపు మళ్లేందుకు దోహదపడగలవని పేర్కొన్నారు. స్థిర ధరల ప్రాతిపదికన వాస్తవ జీడీపీ 2025–26లో రూ. 323.12 లక్షల కోట్ల స్థాయిలో ఉంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) పేర్కొంది. ప్రస్తుత ధరల్లో నామినల్ జీడీపీ రూ. 346.36 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని వివరించింది. 2025–26లో నిర్మాణం, తయారీ, ట్రేడ్, హోటల్స్, రియల్ ఎస్టేట్, ఐటీ తదితర సెకండరీ, టర్షరీ రంగాలు వరుసగా 8.8 శాతం, 9.3 శాతం వృద్ధి చెందాయి. వ్యవసాయం, ఫిషరీ రంగాల దన్నుతో ప్రైమరీ సెక్టార్ 3.6 శాతం వృద్ధి చెందింది. పశ్చిమాసియా ప్రభావం క్యూ1లో .. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం జనవరి–మార్చి త్రైమాసికంలో ఒక నెలలోనే కనిపించింది. కీలకమైన ముడి చమురు, నేచురల్ గ్యాస్, ఎల్పీజీపరంగా సంక్షోభ పూర్తి ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) కనిపించనుంది. ఇంధనాలు, కమోడిటీల ధరలు భారీ స్థాయిలో తిరుగాడుతుండటం, సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తదితర సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను రిజర్వ్ బ్యాంక్ 6.9% నుంచి 6.6 శాతానికి తగ్గించింది. సంస్కరణల ఎక్స్ప్రెస్ దూకుడు.. గ్లోబల్ సవాళ్ల నడుమ ఆర్థిక ప్రగతి సాధించే దిశగా పాలసీలపరంగా నిర్ణయాత్మక చర్యలతో సంస్కరణల ఎక్స్ప్రెస్ దూకుడుని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్స్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేశారు. -
బంగారం ‘బరువు’ తగ్గినా రికార్డే!
దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, బంగారం పట్ల భారతీయుల మక్కువ ఏమాత్రం తగ్గలేదని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశానికి దిగుమతైన బంగారం పరిమాణం (టన్నుల పరంగా) స్వల్పంగా తగ్గినా, దిగుమతుల విలువ మాత్రం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2025-26లో భారత్ 721 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకోగా, దీని విలువ రూ.6.89 లక్షల కోట్లకు (సుమారు 72 బిలియన్ డాలర్లు) చేరింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే విలువ పరంగా దాదాపు 24 శాతం పెరుగుదల.ధరల పెరుగుదలే ప్రధాన కారణం2024-25లో 757 టన్నుల బంగారం దిగుమతి కాగా, విలువ రూ.5.54 లక్షల కోట్లుగా నమోదైంది. అయితే 2025-26లో దిగుమతి పరిమాణం 4.8 శాతం తగ్గినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడంతో మొత్తం దిగుమతుల విలువ రికార్డు స్థాయికి చేరింది. గత ఏడాదితో పోలిస్తే కిలో బంగారం దిగుమతి ధర గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.వాణిజ్య లోటుపై ప్రభావంబంగారం, వెండి దిగుమతుల పెరుగుదల దేశ వాణిజ్య లోటుపై కూడా ప్రభావం చూపుతోంది. 2025-26లో బంగారం దిగుమతులు మొత్తం దిగుమతుల్లో 5 శాతానికి పైగా వాటాను ఆక్రమించాయి. అధిక దిగుమతుల కారణంగా దేశ వాణిజ్య లోటు మరింత విస్తరించినట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి.దిగుమతులను కట్టడి చేసే చర్యలుఇటీవల కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడం, అధిక దిగుమతులను నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. అయినప్పటికీ పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడి అవసరాల కారణంగా దేశీయ డిమాండ్ బలంగానే కొనసాగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
పెట్రోల్ రూ.26, గ్యాస్ రూ.157: పాతికేళ్లలో ఎంతలా అంటే..
గత రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, జీవన వ్యయం కూడా అదే స్థాయిలో పెరిగింది. ప్రజల ఆదాయాలు పెరిగినప్పటికీ.. నిత్యావసరాలైన పెట్రోల్, వంటగ్యాస్, పాలు, ఇతర వినియోగ వస్తువుల ధరలు కూడా గణనీయంగా పెరగడం ప్రతి కుటుంబంపై ప్రభావం చూపుతోంది. 2000 సంవత్సరంతో పోలిస్తే.. 2026 నాటికి ధరల్లో వచ్చిన మార్పులు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.పెట్రోల్ ధరలు2000 సంవత్సరంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో ఒక లీటర్ పెట్రోల్ ధర సుమారు 26 రూపాయలుగా ఉండేది. అయితే 2026 నాటికి ఈ ధర సుమారు 102 రూపాయలకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. పాతికేళ్లలో పెట్రోల్ ధరలు ఎంతలా పెరిగాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల.. కేంద్ర, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు వంటి అంశాలు పెట్రోల్ ధరలను ప్రభావితం చేశాయి. పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వ్యక్తిగత ప్రయాణ ఖర్చులతో పాటు వస్తువుల రవాణా ఖర్చులు కూడా పెరిగి, ఇతర వస్తువుల ధరలపై ప్రభావం చూపింది.ఎల్పీజీ (వంటగ్యాస్) ఖర్చువంటగ్యాస్ ప్రతి ఇంటికి అవసరం. 2000వ సంవత్సరంలో ఒక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర సుమారు రూ.157 మాత్రమే. 2026 నాటికి అది దాదాపు రూ.912కు చేరుకుంది. ప్రభుత్వం వివిధ సబ్సిడీలను అందించినప్పటికీ, గ్యాస్ ధరల పెరుగుదల మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు భారం మోపుతోంది. అమెరికా - ఇరాన్ యుద్ధం తరువాత గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి.పాల ధరల పెరుగుదలభారతదేశంలో దాదాపు అన్ని కుటుంబాలకు పాలు ఒక ప్రధాన ఆహార పదార్థం. గత ఇరవై ఏళ్లలో పాల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. పశువుల మేత ఖర్చులు, రవాణా వ్యయాలు, ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడం వల్ల పాల ఉత్పత్తి వ్యయం అధికమైంది. దీనివల్ల పాల ధరలు కూడా భారీగా పెరిగాయి.జీవన వ్యయాన్ని నిర్ణయించే ఇతర అంశాలుపెట్రోల్, గ్యాస్, పాలు వంటి కొన్ని వస్తువుల ధరల పెరుగుదల మాత్రమే జీవన వ్యయాన్ని పూర్తిగా నిర్ణయించవు. ఇంటి అద్దెలు, విద్య, వైద్యం, కరెంట్ చార్జీలు, రవాణా, వినోదం వంటి అనేక అంశాలు కూడా జీవన వ్యయంలో భాగమే. ముఖ్యంగా మెట్రో నగరాలు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య ఖర్చుల్లో గణనీయమైన తేడాలు ఉంటాయి.2000 నుంచి 2026 వరకు భారతదేశంలో అనేక నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే.. జీవన వ్యయాన్ని పూర్తిగా అంచనా వేయాలంటే కేవలం కొన్ని వస్తువుల ధరలతో కాకుండా, ప్రజల మొత్తం ఖర్చులు, ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ.. పెరుగుతున్న ఆదాయాలు, జీవన వ్యయాల మధ్య సమతుల్యతను కాపాడటం ప్రభుత్వం, ప్రజల ముందున్న ప్రధాన సవాలుగా మిగిలింది.ఇదీ చదవండి: వైభవ్ సూర్యవంశీ ట్యాక్స్ ఎవరు కట్టాలి?: రూల్స్ ఏం చెబుతున్నాయ్! -
గ్లోబల్ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లు
దేశీయ ఆర్థిక వృద్ధిని మరింత పరుగులు పెట్టించడమే కాకుండా, విదేశీ కరెన్సీ ప్రవాహాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జూన్ సమీక్షలో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ఆర్థిక సమీకరణల నేపథ్యంలో భారతదేశంలో విదేశీ పెట్టుబడులకు అడ్డంకులను తొలగిస్తూ నిబంధనలను సరళీకృతం చేస్తున్నట్లు చెప్పింది. ముఖ్యంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ), ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఊరటనిచ్చేలా కేంద్ర బ్యాంక్ కొన్ని రాయితీలను ప్రకటించింది.ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించిన కీలక చర్యల వివరాలు ఇవీ..గ్లోబల్ ఇండెక్స్ల్లో భారత ప్రభుత్వ బాండ్లుప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎఫ్పీఐ పెట్టుబడుల నిబంధనలను ఆర్బీఐ సరళీకరించింది. ఇందులో భాగంగా.. ఇకపై కొత్తగా జారీ చేయబోయే 15 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల కాలపరిమితి గల ప్రభుత్వ బాండ్లు అన్నీ ‘ఫుల్లీ యాక్సెసబుల్ రూట్’ (ఎఫ్ఏఆర్) కిందకు వస్తాయి.గ్లోబల్ ఇండెక్స్ల్లో స్థానం: ఈ బాండ్లు అంతర్జాతీయ గ్లోబల్ ఇండెక్స్ల్లో భాగం కానున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు భారత్కు తరలివచ్చే అవకాశం ఉంది.పరిమితుల తొలగింపు: ఇతర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులపై ఉన్న పాత పరిమితులను కూడా సెంట్రల్ బ్యాంక్ ఎత్తివేసింది.ఎన్ఆర్ఐ పెట్టుబడి పరిమితుల పెంపుప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ) దేశీయ మార్కెట్లో పెట్టే పెట్టుబడుల పరిమితులను భారీగా పెంచింది. అంతేకాకుండా, ఈ సదుపాయాన్ని భారతదేశం వెలుపల నివసిస్తున్న వ్యక్తులందరికీ విస్తరింపజేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల విదేశీ నిధుల ప్రవాహం మరింత సులభతరం కానుంది.ఫారెక్స్ మార్పిడిపై రాయితీలువిదేశీ మారక నిల్వలను స్థిరీకరించేందుకు ఆర్బీఐ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. సెప్టెంబర్ 30 వరకు (నాలుగు నెలల పాటు) రాయితీతో కూడిన ఫారెక్స్ మార్పిడి సదుపాయాన్ని కల్పించనుంది. బ్యాంకులు 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల ఎఫ్సీఎన్ఆర్-బీ డిపాజిట్లను సేకరించడానికి, వాటి పూర్తి హెడ్జింగ్ ఖర్చును భరించేందుకు సెప్టెంబర్ 30 వరకు ఆర్బీఐ ఇదే తరహా సదుపాయాన్ని అనుమతించింది.బాహ్య వాణిజ్య రుణాలుప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూ) విదేశాల నుంచి బాహ్య వాణిజ్య రుణాలు (ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్-ఈసీబీ) సేకరించేలా ఆర్బీఐ తగిన ప్రోత్సాహకాలను అందించనుంది. ఎగుమతిదారులు తాము విదేశాలకు పంపిన సరుకుల ఆదాయాన్ని తిరిగి భారతదేశానికి రాబట్టే సమయాన్ని తొమ్మిది నెలలకు పునరుద్ధరిస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు రూపాయి విలువను స్థిరీకరించడానికి, దేశీయ మార్కెట్లలోకి విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఎంతో దోహదపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ బాండ్ సూచీల్లో భారత బాండ్ల చేరిక, ఎఫ్పీఐ నిబంధనల సరళీకరణ వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్! -
కీలక రేట్లలో ఎలాంటి మార్పుల్లేవ్!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం జూన్ 3 నుంచి 5 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది రెండో విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.#WATCH | RBI keeps policy repo rate unchanged at 5.25%, maintains a neutral stance pic.twitter.com/8pZgzxmSim— ANI (@ANI) June 5, 20262025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్బీఐ.. గడిచిన రెండు సమావేశాలతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సమావేశంలోని ముఖ్యాంశాలు..పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కూడా దేశీయ ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయి.అంతర్జాతీయ సంఘర్షణల ప్రభావాలను తట్టుకుని భారత ఆర్థిక వ్యవస్థ ముందుకుసాగుతోంది.ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉన్నప్పటికీ వ్యయ ఒత్తిళ్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఇంధన, ఇతర ఇన్పుట్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ సరఫరా గొలుసు అంతరాయాలు భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలపై భారం చూపే అవకాశం ఉంది.అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ ధరలపై వాటి ప్రభావం పరిమితంగా ఉండటం వల్ల సీపీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం కంటే తక్కువగానే నమోదైంది.2027 ఆర్థిక సంవత్సరానికి భారత ద్రవ్యోల్బణం 5.1%గా ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది.ఇందుకు కమర్షియల్ ఎల్పీజీ, బేస్ మెటల్స్, ప్లాస్టిక్, రబ్బరు.. వంటి కీలక వస్తువుల ధరలు పెరగడమే దీనికి కారణం. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల సాధారణ కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గుతుందని గవర్నర్ అన్నారు.భారతదేశ వాస్తవ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఆర్బీఐ గతంలో ఉన్న 6.9% నుంచి 6.6%కి తగ్గించింది. 2027 ఆర్థిక సంవత్సరం త్రైమాసికాల వారీగా అంచనాలు ఇలా ఉన్నాయి.త్రైమాసికంజీడీపీ వృద్ధి అంచనాQ1 (మొదటి త్రైమాసికం)6.6%Q2 (రెండో త్రైమాసికం)6.3%Q3 (మూడో త్రైమాసికం)6.5%Q4 (నాలుగో త్రైమాసికం)6.8%పట్టణ వినియోగంద్రవ్యోల్బణం భారం ఉన్నప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వినియోగం స్థిరంగా సాగడానికి కొన్ని సానుకూల అంశాలు తోడ్పడతాయని గవర్నర్ పేర్కొన్నారు.-సేవల రంగంలో కనిపిస్తున్న నిరంతర వృద్ధి.-జీఎస్టీ హేతుబద్ధీకరణ వల్ల వస్తున్న సానుకూల మార్పులు.-మార్కెట్లో స్థిరంగా ఉన్న ఉపాధి అవకాశాలు ఇందుకు దోహదపడుతాయన్నారు.ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’ -
ఐపీఎల్ ముగిసింది.. ఇక అసలు ఆట షురూ
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ముగిసిందని.. అసలు ఆట షురూ అయ్యిందని.. ఇకనైనా భారత కంపెనీలు వినోదాన్ని పక్కనపెట్టి వ్యాపార రంగంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో గూగుల్ తాజా పెట్టుబడుల ప్రకటనను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. వినోదం నుంచి దృష్టి మళ్లించి భవిష్యత్ సాంకేతికతలు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సుపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని దేశీయ కంపెనీలకు ఉదయ్ కొటక్ సూచించారు. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ AI రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్ఫాబెట్ సంస్థ ఏఐ విస్తరణ కోసం సుమారు 80 బిలియన్ డాలర్లు సమీకరించనున్నట్లు ప్రకటించగా.. ఈ ఏడాది మొత్తం ఏఐపై 180 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని ఉదయ్ కొటక్ ఓ “వేక్ అప్ కాల్”గా అభివర్ణించారు.సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘X’లో స్పందించిన ఆయన.. గూగుల్ వంటి సంస్థకు భారీ లాభాలు, భారీ మార్కెట్ విలువ ఉన్నప్పటికీ భవిష్యత్ టెక్నాలజీల కోసం మరింత పెట్టుబడులు పెడుతోందని పేర్కొన్నారు. గూగుల్ వార్షిక లాభాలు సుమారు 160 బిలియన్ డాలర్లు, మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లు అని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో భారత కంపెనీలు తక్షణ లాభాలు, వినోద కేంద్రిత దృష్టి నుంచి బయటకు వచ్చి దీర్ఘకాలిక ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని ఆయన పరోక్షంగా సూచించారు.ప్రపంచవ్యాప్తంగా ఏఐ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ఐటీ రంగం కూడా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోందని విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉడయ్ కొటక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. చాలా మంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తూ భారత వ్యాపార రంగం ఇప్పుడు పెట్టుబడులు, టెక్నాలజీ ఆవిష్కరణలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే కొందరు మాత్రం అమెరికాలో పెద్ద స్పోర్ట్స్ లీగ్స్ కొనసాగుతున్నప్పటికీ అక్కడి ఆర్థిక వ్యవస్థ ఇన్నోవేషన్లో వెనుకడుగు వేయలేదని గుర్తు చేస్తూ.. భారతదేశం కూడా వినోదం–వ్యాపారం మధ్య సమతుల్యం సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ప్రభావం ఎలాగంటే.. ఈ తరహా భారీ పెట్టుబడులు ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (AI), డేటా సెంటర్లు, చిప్ టెక్నాలజీ వంటి భవిష్యత్ ఆధారిత రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. గూగుల్ వంటి సంస్థలు ఇప్పటికే భారీ లాభాలు ఉన్నప్పటికీ మరింతగా పెట్టుబడులు పెడుతుండటం వల్ల.. కొత్త AI మోడళ్ల అభివృద్ధి వేగవంతమవుతుంది. ఉత్పత్తుల నాణ్యత మెరుగవుతుంది. అలాగే గ్లోబల్ టెక్ పోటీ మరింత తీవ్రంగా మారుతుంది. దీని ప్రభావంగా సాఫ్ట్వేర్ సేవలు, క్లౌడ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ రంగాల్లో కొత్త అవకాశాలు సృష్టించబడతాయి.కానీ అదే సమయంలో సంప్రదాయ ఐటీ సేవలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో ప్రపంచ వ్యాపార రంగంలో ఇక “కొత్త ఆవిష్కరణలు చేయాలి లేదా పోటీలో వెనుకబడిపోవాలి” అనే పరిస్థితి మరింత స్పష్టంగా మారే అవకాశం ఉంది. -
విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఉపశమనం!
దేశీయ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న విదేశీ పెట్టుబడిదారుల (ఎఫ్పీఐ) నిష్క్రమణకు, రికార్డు స్థాయిలో పతనమవుతున్న రూపాయి విలువకు బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొన్ని వర్గాల సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడిదారులకు పన్ను నిబంధనలను సడలించేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ కీలక ఆర్డినెన్స్ను సిఫారసు చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడటంతో త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ మార్కెట్లను కాపాడుకునేందుకు ప్రభుత్వం వేసిన వ్యూహాత్మక అడుగు ఇది.రికార్డు స్థాయిలో నిధుల ఉపసంహరణప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయంగా పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 6 శాతం మేర బలహీనపడటం విధాన నిర్ణేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి తోడు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) జనవరి నుంచి భారతీయ ఈక్విటీల నుంచి రికార్డు స్థాయిలో రూ.2.25 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ భారీ అవుట్ఫ్లోల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనవుతుండటంతో విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు పన్ను సడలింపులే ఏకైక మార్గమని ప్రభుత్వం భావించింది.ప్రధాన డిమాండ్లుగత కొన్నేళ్లుగా ప్రభుత్వం దీర్ఘకాలిక (ఎల్టీసీజీ), స్వల్పకాలిక (ఎస్టీసీజీ) మూలధన లాభాల పన్నును పెంచడంతో పాటు సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (ఎస్టీటీ)ను కూడా విధించింది. పన్ను నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ ద్వంద్వ పన్ను విధానం వల్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులకు భారతదేశం అంతగా ఆకర్షణీయమైన మార్కెట్గా అనిపించడం లేదు. కేంద్ర బడ్జెట్కు ముందే ఎఫ్పీఐ ప్రతినిధులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు.లిస్టెడ్ సెక్యూరిటీల కోసం మూలధన లాభాల పన్ను విధానాన్ని పూర్తిగా సమీక్షించాలి.క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రెండింటినీ కలిపి విధించడాన్ని నిలిపివేయాలి.ప్రస్తుతం ప్రభుత్వ బాండ్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై విదేశీ పెట్టుబడిదారులు 20 శాతం విత్హోల్డింగ్ పన్ను (టీడీఎస్) చెల్లిస్తున్నారు. (గమనిక.. జులై 1, 2023 వరకు ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర అభివృద్ధి రుణాలు, రూపాయి విలువ కలిగిన బాండ్లపై ఈ పన్ను 5 శాతం మాత్రమే ఉండేది. దీనిని తిరిగి సవరించాలని వారు కోరుతున్నారు).ఎంపీసీ నిర్ణయాలపైనే అందరి దృష్టికొన్ని సంస్థల అంచనా ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్డినెన్స్ నిర్ణయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ముందస్తుగా కుదుర్చుకున్న సమన్వయ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. నిన్న ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్షా సమావేశం శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు, మార్కెట్లో లిక్విడిటీని పెంచేందుకు సెంట్రల్ బ్యాంక్ కూడా శుక్రవారం కొన్ని కీలక చర్యలను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.ఇదీ చదవండి: గేదె హెయిర్ స్టైల్కు ఫుల్ క్రేజ్! -
ఎంఎస్ఎమ్ఈలో మందగించిన రుణ వృద్ధి
ముంబై: అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావంతో దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగంలో రుణాల వృద్ధి మందగించింది. ముఖ్యంగా సూక్ష్మ వ్యాపారాలు, తయారీ రంగ అనుబంధ విభాగాల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నట్లు క్రెడిట్ సమాచార సంస్థ క్రిఫ్ హైమార్క్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఎంఎస్ఎంఈల రుణ బకాయిలు సుమారు రూ.46 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 12.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, వివిధ రంగాల భాగస్వామ్యం పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. అయితే రుణాల వృద్ధి వేగం గణనీయంగా మందగించింది. 2025 డిసెంబర్–2026 ఏప్రిల్ మధ్య రుణ బకాయిల వృద్ధి 3.1 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 9.7 శాతంగా నమోదైంది. ఇదే వ్యవధి (2025 డిసెంబర్–2026 ఏప్రిల్)లో క్రియాశీల రుణాల సంఖ్య 3.5 శాతం తగ్గింది. కాగా, 2024 డిసెంబర్–2025 ఏప్రిల్ మధ్య కాలంలో అవి 3 శాతం పెరిగాయి. సూక్ష్మ వ్యాపారాలపై అధిక ప్రభావం భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ డిమాండ్, రుణాల ప్రవాహం మద్దతుతో ఎంఎస్ఎంఈ రంగం నిలకడగా కొనసాగుతోందని నివేదిక పేర్కొంది. అయితే కొన్ని నిర్దిష్ట విభాగాల్లో ఒత్తిడి సంకేతాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల్లో దాదాపు 86 శాతం వాటా కలిగిన సూక్ష్మ వ్యాపారాలు ఎక్కువ ప్రభావానికి గురయ్యాయి. 31–90 రోజుల ఆలస్య చెల్లింపుల సూచిక (పీఏఆర్) ఏప్రిల్ 2026 నాటికి 2.7 శాతానికి చేరింది. 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య సూక్ష్మ వ్యాపారాలకు చెందిన క్రియాశీల రుణాలు 4.6 శాతం క్షీణించాయి. తయారీ రంగంలో తగ్గిన జోరు ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియోలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ, వాణిజ్య రంగాల్లో రుణ వృద్ధి మందగించింది. తయారీ రంగ రుణ వృద్ధి 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య 4.3 శాతానికి పరిమితమైంది. దీనికి సీజనల్ మార్పులే ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. సప్లై చైన్తో ముడిపడి ఉన్న షిప్పింగ్, రవాణా, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో అనుబంధ రంగాల్లో రుణ బకాయిలు 10–15 శాతం మేర తగ్గాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వెనకడుగు ఎంఎస్ఎంఈలకు రుణాల పంపిణీలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల వేగం కూడా తగ్గింది. 2025 డిసెంబర్–2026 మార్చి మధ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎంఎస్ఎంఈ రుణాలు 0.2 శాతం తగ్గాయి. కాగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 3.5 శాతం వృద్ధి నమోదైంది. ఎన్బీఎఫ్సీల రుణాలు 1.6 శాతం క్షీణించగా, గత ఏడాది ఇదే కాలంలో 6.4 శాతం పెరిగాయి. దేశీయ డిమాండ్, విభిన్న రుణదాతల భాగస్వామ్యం, ప్రభుత్వ మద్దతు చర్యలతో ఎంఎస్ఎంఈ రంగం ప్రపంచ అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కొంటోందని నివేదిక పేర్కొంది. అయితే ఇప్పుడిప్పుడే పుట్టుకొస్తున్న ఒత్తిడి సంకేతాలపై నిశిత పర్యవేక్షణ అవసరమని నివేదిక సూచించింది. -
పాలసీ రేట్ల పాజ్తో వృద్ధికి ఊతం
ముంబై: ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకు కట్టుబడితే నిలకడైన ఆర్థిక వృద్ధికి వీలుంటుందని పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్(ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ పాలసీ రేట్ల విషయంలో స్టేటస్ కో అమలు చేయవచ్చని అత్యధిక శాతంమంది అంచనా వేస్తున్నట్లు సిటీ 2026 ఇండియా సదస్సులో పాల్గొన్న శెట్టి పేర్కొన్నారు. వృద్ధి, ద్రవ్యోల్బణ పరిస్థితులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. అయితే పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తే నిలకడైన వృద్ధికి కచ్చితంగా ఇది సహకరిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ పబ్లిక్ ఇష్యూపై స్పందిస్తూ ప్రస్తుత క్యాలండర్ ఏడాది(2026)లో లిస్టింగ్ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అనుమతుల కోసం నిరీక్షిస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంకింగ్పై.. అన్ని విభాగాలకూ బ్యాంకింగ్ సర్వీసులను విస్తరించడం, సంస్థాగత నైపుణ్యం పెంచుకోవడం, మారుతున్న కస్టమర్ల అవసరాలను లోతుగా అర్ధం చేసుకోవడం, టెక్నాలజీ, డేటా, ఏఐను వినియోగించుకోవడం తదితర కొన్ని కీలక అంశాల ఆధారంగా భవిష్యత్ బ్యాంకింగ్ విధానం ఉండాలని శెట్టి సూచించారు. తద్వారా దేశ ఆశయాలకు బ్యాంకింగ్ వ్యవస్థ మద్దతివ్వగలుగుతుందని తెలియజేశారు. కాగా.. వార్తా సంస్థ పీటీఐ ఇటీవల ఆర్బీఐ పాలసీ సమీక్షపై 15 మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులతో నిర్వహించిన సర్వేలో 11 మంది రేట్ల పాజ్నే అంచనా వేయడం గమనార్హం! ద్రవ్యోల్బణ రిసు్కల నేపథ్యంలో ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో రేట్ల పెంపును చేపట్టే వీలున్నట్లు సర్వేలో అత్యధిక శాతం మంది భావించారు. -
పరిశ్రమలకు ‘పశ్చిమాసియా’ గండం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయంగా చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) సంస్థల ఆదాయాలు, లాభాలపై గణనీయంగా ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాటి ఆదాయాలు 100 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వరకు (1 శాతం) తగ్గి 7.5 – 8.5 శాతం శ్రేణికి పరిమితం కానున్నాయి. ఇక ఎబిటా సైతం 50–100 బేసిస్ పాయింట్లు క్షీణించి 5–5.5 శాతానికి నెమ్మదించవచ్చునని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తాజాగా ఎంఎస్ఎంఈ రిపోర్టులో అంచనా వేసింది. దీని ప్రకారం మోర్బి, ఫిరోజాబాద్, సూరత్, వదోదరలాంటి క్లస్టర్లపై తీవ్ర ప్రభావం ఉండనుంది. ఏడాదికి రెండుసార్లు వెలువరించే ఈ నివేదికలో 69 రంగాలు, 147 క్లస్టర్లను పరిగణనలోకి తీసుకుంటారు. వీటి ఆదాయం రూ. 75 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 20–25 శాతం, ఎంఎస్ఎంఈ పరిశ్రమలో మూడింట రెండొంతులు ఉంటుంది. మూడు కేటగిరీలు.. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావానికి గురయ్యే ఎంఎస్ఎంఈలను మూడు కేటగిరీలుగా నివేదికలో వర్గీకరించారు. గ్యాస్లాంటి ఇంధన సంబంధ ముడిసరుకుపై ఆధారపడినవి, ఇంధన సంబంధ డెరివేటివ్స్పై ఆధారపడినవి, వ్యాపారపరంగా అవరోధాల ప్రభావం ఎక్కువగా ఎదుర్కొనేవి వీటిలో ఉన్నాయి. గ్యాస్లాంటి ఇంధనాలపై ఆధారపడే యూనిట్లపై అత్యధిక ప్రభావం పడనుంది. మోర్బి క్లస్టర్ ఇందుకు ఉదాహరణ. దేశీయంగా సెరామిక్ టైల్స్ ఉత్పత్తిలో దీని వాటా 80 శాతం పైగా ఉంటుంది. ఇందులో 80–85 శాతం తయారీ .. గ్యాస్ ఆధారంగానే ఉంటోంది. క్లస్టర్లోని సెరామిక్ రంగం ఆదాయంలో దీని వాటా 85 శాతంగా ఉంటుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ క్లస్టర్ ఆదాయ వృద్ధి 9–11 శాతంగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1–3 శాతానికి పడిపోనుంది. ఇక్కడ ప్రధానంగా ఎగుమతుల కోసమే ఉత్పత్తి (80–90 శాతం) జరుగుతుండటం ఇందుకు కారణం. ఇందులో 20–25 శాతం ఉత్పత్తి.. పశ్చిమాసియాకే ఎగుమతి అవుతోంది. మోర్బి క్లస్టర్ సెరామిక్ పరిశ్రమ ఎబిటా మార్జిన్ ఈ ఆర్థిక సంవత్సరం 300–400 బేసిస్ పాయింట్లు క్షీణించి 4–6 శాతానికి పరిమితం కానుంది. అదే విధంగా ఫిరోజాబాద్లోని గ్లాస్ సెక్టార్ ఉత్పత్తి 40 శాతం తగ్గడంతో పరిశ్రమ ఆదాయ వృద్ధి 1–3 శాతానికి పరిమితం కానుంది. పశ్చిమాసియా నుంచి మిథనాల్లాంటి వాటిని 90 శాతం మేర దిగుమతి చేసుకునే కెమికల్ రంగానికి ముడిసరుకు వ్యయాలు 1.2–1.4 రెట్లు పెరిగిపోయాయి. ఇందులో కొంత భారాన్ని అవి బదలాయించినప్పటికీ 2027 ఆర్థిక సంవత్సరంలో వదోదరలోని కెమికల్ ఎంఎస్ఎంఈల మార్జిన్లు 150–250 బీపీఎస్ మేర తగ్గొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఇక రోడ్ల నిర్మాణంలాంటి రంగాలపై డీజిల్ రేట్ల పెరుగుదల ప్రభావం పడే అవకాశం ఉంది. సదరు సంస్థల మొత్తం వ్యయాల్లో ఇంధన వ్యయాల వాటా 8–10 శాతం ఉంటుంది. దీంతో వాటి మార్జిన్లు 50–100 బేసిస్ పాయింట్లు తగ్గి 8–10 శాతానికి పరిమితం కావచ్చు. అలాగే, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వ్యాపార సంస్థల ఖర్చులో 10–15 శాతం ప్యాకింగ్ వ్యయాలు ఉంటాయి. ఫలితంగా వాటి మార్జిన్లు కూడా 50–100 బేసిస్ పాయింట్లు తగ్గి 6–6.5 శాతానికి నెమ్మదించనున్నాయి.కొత్తేమీ కాదు.. పరిశ్రమకు ఇలాంటి పరిస్థితి కొత్తేమీ కాదని నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో 2020, 2021 ఆర్థిక సంవత్సరాల్లో పెద్ద కంపెనీల ఆదాయాలు 1 శాతం వరకు, ఎంఎస్ఎంఈల రెవెన్యూ 3–5 శాతం మేర క్షీణించినట్లు తెలిపింది. అలాగే ఎంఎస్ఎంఈల ఎబిటా మార్జిన్లు 2021 ఆర్థిక సంవత్సరంలో 80 బీపీఎస్ క్షీణించి 4.7 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం తీరుతెన్నులు కూడా అదే తరహాలో ఉన్నట్లు తెలిపింది. చిన్న వ్యాపారాలపై ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోందని నివేదిక వివరించింది. ఎంఎస్ఎంఈలు రెండు రకాల సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. గ్యాస్లాంటి ముడి సరుకు లభ్యత తగ్గిపోవడం వల్ల ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చి, ఆ కారణంగా ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటోందని వివరించింది. ఇక రెండో అంశం విషయానికొస్తే వ్యాపారానికి అవరోధాలు, పెరిగిన కమోడిటీ..ఇంధన వ్యయాలను కస్టమర్లకు బదలాయించేలా, రేట్లను పెంచలేని పరిస్థితి వల్ల మార్జిన్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటోందని నివేదిక పేర్కొంది. -
అసలు సమస్య...రూపాయి పతనం కాదు
→ 1991లో భారత్ ఎదుర్కొన్న చెల్లింపుల (విదేశీ మారకం–ఫారెక్స్) సంక్షోభం లాంటిదేదీ ఇప్పుడు తలెత్తే అవకాశం లేదు. మన దగ్గర పుష్కలంగా ఫారెక్స్ నిల్వలున్నాయి. ప్రస్తుతం ధరల సర్దుబాటే అతిపెద్ద సమస్య. → మన ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలకు సంబంధించి చర్చ మొత్తం డాలరుతో రూపాయి విలువ పతనం, ఫారెక్స్ నిల్వల చుట్టూనే తిరుగుతోంది. విదేశీ పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి? కరెన్సీ స్పెక్యులేషన్కు అడ్డుకట్ట ఎలా వేయాలి వంటి పరిష్కార మార్గాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. కానీ, ప్రధానంగా ప్రస్తుతం నెలకొన్న సమస్యను రెండు కోణాల్లో చూడాలి. → పశ్చిమాసియా యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రికత్తల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కొండెక్కినప్పుడు దానికనుగుణంగా దేశీయంగానూ ధరలు సర్దుబాటు అవ్వాల్సిందే. కాబట్టి, పెట్రో రేట్లతో సహా కొన్ని ఉత్పత్తుల రేట్ల పెంపు అనివార్యం. → ఇక రెండోది, అసలు రూపాయి క్షీణత అనేది సమస్యే కాదు. ఎందుకంటే, పశ్చిమాసియాలో యుద్ధం మొదలవ్వకముందే అత్యంత బలహీన కరెన్సీల్లో ఒకటిగా మన రూపాయి ఉంది. అంటే ఎకానమీలో మరింత విస్తృతమైన నిర్మాణాత్మక సమస్యలు కూడా ఉన్నాయని అర్థం. → భారీ ఇంధన, ఎరువుల సబ్సిడీలు అనేక ఏళ్లుగా ఉన్నాయి. వాటిని ప్రభుత్వం నిరవధికంగా కొనసాగించం సాధ్యం కాదు. మార్కెట్కు అనుగుణంగా ధరలను పెరగనివ్వాలి. అయితే, ఆ షాక్కు తగలకుండా పేదలను ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఆదుకోవాల్సిందే. → జనధన్, ఆధార్, మొబైల్(జామ్) ద్వారా డిజిటల్ రంగంలో మనం భారీగా పురోగతి సాధించాం, భారత్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నగదు బదిలీ పథకాలను అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ అసలైన డీబీటీ వ్యవస్థ ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు. → ఉదాహరణకు, ఎరువులనే తీసుకుందాం. యూరియాపై కేంద్రం భారీ సబ్సిడీ భరిస్తోంది. అలాగే దాన్ని ఉపయోగించే రైతులకు నగదు సాయం (పీఎం కిసాన్) కూడా ఇస్తోంది. ఆ రెండింటినీ అనుసంధానించే పథకం కొరవడింది. యూరియా ధరలు పెరిగితే, మీరు అధిక రేట్లు చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఆ అదనపు భారాన్ని ఆదాయ బదిలీల రూపంలో ప్రభుత్వం మీకు తిరిగి చెల్లిస్తుందని చెప్పే వ్యవస్థ మన దగ్గర లేదు. → విద్యుత్, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు తదితర రంగాల్లో సబ్సిడీలను తగ్గించుకుంటూ... ఆర్థికంగా అత్యంత బలహీన వర్గాలకు రక్షణ కల్పించే విధంగా డీబీటీ వ్యవస్థను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ మార్పులు క్రమంగా జరగాలి. మన విధానకర్తల మందున్న అసలైన సవాలు ఇదే. – అరవింద్ సుబ్రమణియన్, ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) -
అంతా అబద్ధం.. ఏవీ నమ్మొద్దు!
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ పతనాన్ని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సుమారు 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించిందంటూ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బ్లూమ్బెర్గ్ ప్రచురించిన కథనాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారం నకిలీదని (ఫేక్ న్యూస్) స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా వాస్తవాలను వెల్లడించింది. బంగారం భౌతిక నిల్వలపై ఆర్బీఐ విడుదల చేసిన తాజా బులెటిన్ను పరిశీలించాలని ప్రజలను కోరింది.పెరిగిన బంగారం నిల్వలుబ్లూమ్బెర్గ్ ఎకనామిక్స్ సీనియర్ ఆర్థికవేత్త అభిషేక్ గుప్తా అంచనా ప్రకారం.. మే 22తో ముగిసిన రెండు వారాల్లో రూపాయిని కాపాడేందుకు ఆర్బీఐ 12 బిలియన్ డాలర్ల బంగారాన్ని విక్రయించి ఉండవచ్చని పేర్కొన్నారు. అయితే ఈ వాదన పూర్తిగా తప్పని ఆర్బీఐ గణాంకాలు రుజువు చేస్తున్నాయి.భారత విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా వివరాలుసెప్టెంబర్ 2025 చివరి నాటికి: 13.92%మార్చి 31, 2026 నాటికి: 16.70%మే 22, 2026 నాటికి: 16.85%గణాంకాలను పరిశీలిస్తే విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా నిరంతరం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గలేదని స్పష్టమవుతోంది. ఆర్బీఐ తన నెలవారీ బులెటిన్లో భౌతిక బంగారం నిల్వల స్థితిని స్పష్టంగా పొందుపరిచిందని, తాజా ఎడిషన్ ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉందని కేంద్ర ఫ్యాక్ట్ చెకింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, ప్రామాణిక సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.A news report published by @Bloomberg states that RBI may have sold gold amounting to approximately USD 12 billion.#PIBFactCheck❌ This claim is FAKE✔️ According to @RBI, the share of gold in India's foreign exchange reserves rose from 13.92% at end-September 2025 to 16.70%… pic.twitter.com/eVjxPxEv1i— PIB Fact Check (@PIBFactCheck) June 3, 2026‘రూపాయి విలువ తగ్గినా నష్టం లేదు’మరోవైపు, రూపాయి మారకం విలువపై 16వ ఆర్థిక సంఘం చైర్మన్, నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక సంవత్సరం ఫార్వర్డ్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 100 మార్కును తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఈ తరుణంలో రూపాయి విలువ క్షీణించడానికి ఆర్బీఐ అనుమతించాలని, కేవలం 100 అనే అంకెను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా చమురు కొరత స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా.. రూపాయి విలువ సహజంగా క్షీణించడమే ప్రస్తుతానికి సరైన ప్రతిస్పందనేనన్నారు.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా? -
నేటి నుంచి ఆర్బీఐ పాలసీ సమీక్ష
నేటి నుంచి ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) పరపతి విధాన సమీక్షను చేపట్టనుంది. మూడు రోజులపాటు నిర్వహించనున్న సమావేశాల్లో భాగంగా శుక్రవారం(5న) పాలసీ నిర్ణయాలు ప్రకటించనుంది. అయితే అత్యధిక శాతం మంది ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు ఈసారి యథాతథ పాలసీ అమలుకే ఎంపీసీ కట్టుబడవచ్చని అంచనా వేస్తున్నారు. వెరసి వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్దే కొనసాగించే వీలున్నట్లు భావిస్తున్నారు.మరోపక్క ద్రవ్యోల్బణ రిస్క్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) చివర్లో కేంద్ర బ్యాంకు(ఆర్బీఐ) కఠిన పరపతి విధానాలకు తెరతీసే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. పాలసీ సమీక్షపై పీటీఐ వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో 11 మంది స్టేటస్ కోకు వీలున్నట్లు పేర్కొనగా.. నలుగురు మాత్రం 0.25% రెపో రేటు పెంపును అంచనా వేశారు.4 శాతానికి దిగువనే..ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతం దిగువనే కొనసాగుతుండటంతో రేట్ల పాజ్ను చేపట్టవచ్చని ఆర్థికవేత్తలు, ట్రెజరీ నిపుణులు పేర్కొన్నారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆర్బీఐ మరికొంతకాలం వేచిచూసేందుకు అవకాశమున్నదని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎకానమిస్ట్ గౌర సేన్గుప్తా అభిప్రాయపడ్డారు. గతేడాది వృద్ధికి మద్దతుగా ఎంపీసీ రెపో రేటులో మొత్తం 1.25 శాతం కోత పెట్టిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్కు హక్కు దక్కేనా? -
సామాన్యుడిపై ఇంధన భారం..
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనున్నాయి. రవాణా, తయారీ రంగాల వ్యయాలు పెరిగిపోతుండటం వల్ల రాబోయే రోజుల్లో నిత్యావసరాల ధరలు మరింత ప్రియం కావొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో తెలిపింది. గత నెల 15 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 7.5 మేర పెరిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలోనే ఉంటే దేశీయంగా ఇంధనాల రేట్లు మరింత పెరగవచ్చని క్రిసిల్ పేర్కొంది.చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో ధరల పెంపు క్రమంగా లీటరుకు రూ. 10 స్థాయికి చేరొచ్చని అంచనా వేసింది. దీనితో రవాణా ఖర్చులు పెరిగి ఆహార పదార్ధాలతో పాటు ఇతరత్రా నిత్యావసరాల రేట్లు కూడా పెరిగి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 7.5 చొప్పున పెరగడం వల్ల వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంపై 36 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉంటుందని, అదే రూ. 10 స్థాయిలో ఇంధనాల ధరలు పెరిగితే 48 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం పడుతుందని వివరించింది. రోడ్ రవాణాపై భారీ ఎఫెక్ట్..దేశీయంగా రవాణాలో సింహభాగం వాటా (71 శాతం) ఉంటున్న రోడ్ ట్రాన్స్పోర్ట్పై ఇంధన ధరల పెరుగుదల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. రవాణా వాహనాల నిర్వహణ వ్యయాల్లో 42 శాతం వాటా ఇంధనాలదే ఉండటం ఇందుకు కారణం. రిటైల్ ఇంధన రేట్లు పెరగడం వల్ల రాబోయే నెలల్లో రవాణా వ్యయాలు, అంతిమంగా వివిధ ఉత్పత్తుల ధరలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని నివేదిక వివరించింది. వీటిపై ఎక్కువగా ప్రభావం..రవాణా కీలకంగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, తేయాకు, కాఫీ, పండ్లు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, గుడ్లు, మాంసం, చేపలు మొదలైన ఆహారోత్పత్తులపై అధికంగా ప్రభావం పడనుంది. సానుకూల బేస్ ఎఫెక్ట్ కూడా తగ్గడం వల్ల రాబోయే త్రైమాసికాల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత వేగంగా పెరిగే అవకాశం ఉంది. దుస్తులు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, కలప ఉత్పత్తులు, సిమెంటు.. సెరామిక్స్ సహా నిర్మాణ రంగ మెటీరియల్స్కి కూడా రవాణా ప్రధానమైన అంశం కావడం వల్ల వాటిపై కూడా ప్రభావం పడనుంది. జీఎస్టీ ఉపశమనం కొంతే..గతేడాది సెప్టెంబర్లో వస్తు, సేవల పన్నులను (జీఎస్టీ) తగ్గించిన నేపథ్యంలో తాజా ద్రవ్యోల్బణంపరమైన ప్రభావం నుంచి కొంత ఉపశమనం లభించవచ్చు. కానీ పూర్తి స్థాయిలో ఊరట లభించకపోవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న 4 శాతం లోపే ఉంటున్నప్పటికీ, రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే తక్కువ వర్షపాతం, ఎల్ నినో పరిస్థితులు మొదలైన వాటన్నింటినీ ఆర్బీఐ నిశితంగా పరిశీలించి, విధాన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది.ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా! -
ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోంది..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో తీవ్రమైన ఎరువుల సంక్షోభం ముంచుకొస్తోందని ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త డాక్టర్ అశోక్ గులాటి హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు. త్వరలోనే ఖరీఫ్ సాగు సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ప్రస్తుతానికి మన దగ్గర తగినన్ని ఎరువుల నిల్వలు ఉండటం రైతులకు ఊరట కలిగించే శుభవార్త అని ఆయన పేర్కొన్నారు. అయితే, దీర్ఘకాలికంగా చూస్తే ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై, సబ్సిడీలపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేశారు. డా. అశోక్ గులాటి తెలిపిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తనున్న ఎరువుల సంక్షోభాన్ని ప్రధానంగా రెండు కోణాల్లో చూడాలి. ఖరీఫ్ సాగు సీజన్ త్వరలో మొదలవనున్న నేపథ్యంలో మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయన్నది రైతులకు శుభవార్త.ఇక రెండోది మన వ్యవసాయానికి అత్యంత కీలకమైన యూరియా. మనం ఏటా సుమారు 40 మిలియన్ టన్నుల యూరియా వాడుతున్నాం. గతేడాది 11 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకున్నాం. ఇటీవలే ప్రభుత్వం యూరియా దిగుమతి కోసం టన్నుకు 935 డాలర్ల కనీస ధరతో టెండర్లు ఆహ్వానించింది. రైతులకు విక్రయిస్తున్న ధర సుమారు 65 డాలర్లు.ఒకవేళ ధరలు పెరగకుంటే ఈ ఏడాది బడ్జెట్లో రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించిన ఎరువుల సబ్సిడీ తడిసిమోపడవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది రూ.2.5 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా చల్లారకపోతే, సబ్సిడీ మొత్తం ఏకంగా రూ. 3 లక్షల కోట్లను కూడా దాటిపోవచ్చనేది ఎరువుల శాఖ అధికారుల తాజా లెక్క.హార్మూజ్ జలసంధిలో దిగ్బంధనం మరో 2–3 నెలలు పాటు కొనసాగితే, రాయితీల విషయంలో ప్రభుత్వానికి గడ్డు పరిస్థితులు తలెత్తుతాయి. ఇంతకు మించిన ఆందోళన ఏంటంటే, ఎరువుల కోసం మనం 70% దిగుమతులపైనే ఆధారపడుతున్నాము.దేశీయంగా యూరియా ఉత్పత్తి కూడా తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే, దీనికి అవసరమైన గ్యాస్ (ఎల్ఎన్జీ)లో 85% దిగుమతి చేసుకోవాల్సిందే. దీనివల్ల ఉత్పత్తి వ్యయం భారీగా ఎగబాకుతుంది, మొత్తంమీద ఖరీఫ్ సీజన్ మధ్యలోనో, లేదంటే చివర్లోనో తీవ్రమైన ఎరువుల సంక్షోభం పొంచి ఉంది.ఎరువుల ధరలు పెంచకపోతే, సబ్సిడీల భారం పెరిగి ద్రవ్యలోటు ఎగబాకుతుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాయి. విదేశీ పెట్టుబడుల తగ్గుదల, రూపాయి మరింత పతనం వంటి దుష్ర్పభావాలు తీవ్రమవుతాయి.ఈ సంక్షోభాన్ని సదవకాశంగా మలచుకొని సంస్కరణలకు నడుంబిగించాలి. ఎరువుల ధరల సబ్సిడీ విధానం నుంచి ఆదాయ మద్దతు విధానానికి మారాలి. రైతులతో మాట్లాడి, ఎరువుల ధర రాయితీలకు బదులు ఆదాయపరమైన రాయితీలతో ఆదుకుంటామన్న భరోసా కల్పించాలి. దీనికి ఒక వ్యవస్థ ఉండాలి. అవసరమైతే ‘పీఎం కిసాన్’ పథకంలో విలీనం చేయవచ్చు. దీని ద్వారా కూడా రైతులకు రూ. 2 లక్షల కోట్ల రాయితీలను నేరుగా ఇవ్వొచ్చు. తద్వారా కనీసం రూ. 40,000 కోట్లు ఆదా చేయగలుగుతారు.ప్రభుత్వం ఇంత భారీ సబ్సిడీలను ఇప్పుడున్నట్లే ఇవ్వాలనుకుంటే, వినియోగ పరిమితులను విధించాల్సి ఉంటుంది. అంటే, పొలం విస్తీర్ణాన్ని బట్టి, పండించే పంట ఆధారంగా రైతుకు అందించే ఎరువుల పరిమాణాన్ని కేటాయించాలి.15 ఏళ్లుగా వరి, గోధుమలు.. ఇలా అనేక ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. కానీ యూరియా ధరలు మాత్రం అక్కడే ఉండిపోయాయి. ఈ విధానం సరికాదు. ఎరువుల సరఫరా వ్యవస్థలో లీకేజీల (వృథా/అక్రమాలు) కారణంగా సబ్సిడీ నిథులు పక్కదారి పడుతున్నాయి. ఎరువుల ధరలు సహజ మార్కెట్ స్థాయికి చేరుకుంటే, లీకేజీలన్నీ వాటంతటవే మాయమైపోతాయి.– డా. అశోక్ గులాటి, వ్యవసాయ ఆర్థికవేత్త -
రికార్డ్ బ్రేకింగ్: యూపీఐ పేమెంట్లు.. రూ.29.90 లక్షల కోట్లు
దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మరోసారి కొత్త రికార్డును సృష్టించింది. 2026 మే నెలలో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.29.90 లక్షల కోట్లకు చేరగా, మొత్తం లావాదేవీల సంఖ్య 23.2 బిలియన్లుగా నమోదైంది. విలువ, వాల్యూమ్ రెండింటి పరంగా ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం.నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో నమోదైన రూ.29.03 లక్షల కోట్లతో పోలిస్తే మేలో లావాదేవీల విలువ మరింత పెరిగింది. గత ఏడాది మేలో నమోదైన రూ.25.14 లక్షల కోట్లతో పోల్చితే ఇది సుమారు 19 శాతం వృద్ధిని సూచిస్తోంది.ట్రాన్సాక్షన్లూ రికార్డే..లావాదేవీల సంఖ్య పరంగా కూడా యూపీఐ కొత్త గరిష్ఠాన్ని తాకింది. మే నెలలో 23.2 బిలియన్ల ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి. ఇది గత ఏప్రిల్లో నమోదైన 22.35 బిలియన్లను అధిగమించడమే కాకుండా, గత ఏడాది మేలో నమోదైన 18.67 బిలియన్లతో పోలిస్తే దాదాపు 24 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తోంది.డిజిటల్ పేమెంట్స్ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవి సెలవుల ప్రయాణాలు, ఐపీఎల్ నేపథ్యంలో పెరిగిన వినియోగదారుల ఖర్చులు, ఆన్లైన్ కొనుగోళ్లు యూపీఐ లావాదేవీల వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. వినియోగదారుల నుంచి వస్తున్న సహజమైన డిమాండ్ యూపీఐ వృద్ధిని మరింత బలోపేతం చేస్తోందని వారు పేర్కొంటున్నారు. -
పెట్రోల్, డీజిల్పై ఎగుమతులపై పన్ను తగ్గింపు
న్యూఢిల్లీ: ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్ఫాల్ గెయిన్స్ పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్లలో ధరల మార్పులు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజా సవరణలు అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.తాజా నిర్ణయం ప్రకారం పెట్రోల్పై విండ్ఫాల్ గెయిన్స్ పన్నును లీటరుకు రూ.3 నుంచి రూ.1.50కు తగ్గించారు. డీజిల్పై ఈ పన్నును లీటరుకు రూ.16.50 నుంచి రూ.13.50కు సవరించారు. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్)పై విండ్ఫాల్ పన్నును లీటరుకు రూ.16 నుంచి రూ.9.50కు తగ్గించినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.దేశీయ వినియోగదారులపై ప్రభావం లేదుదేశీయ మార్కెట్లో వినియోగానికి విడుదల చేసే పెట్రోల్, డీజిల్పై ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ సుంకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో దేశీయ వినియోగదారులపై ఈ నిర్ణయం ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం లేదని భావిస్తున్నారు.ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ల సగటు అంతర్జాతీయ ధరలను ఆధారంగా చేసుకుని విండ్ఫాల్ పన్ను రేట్లను నిర్ణయిస్తారు. ఈ రేట్లను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి సవరిస్తుంటారు. చివరిసారిగా 2026 మే 16న రేట్లలో మార్పులు అమలులోకి వచ్చాయి.ముడి చమురు ధరలపై భౌగోళిక ఉద్రిక్తతల ప్రభావంఅమెరికా–ఇరాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న తర్వాత ప్రపంచ ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాల భయాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో ముడి చమురు ధరల్లో అస్థిరత కొనసాగుతోంది.విండ్ఫాల్ ట్యాక్స్ ఉద్దేశం ఇదే..అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు దేశీయ ధరల కంటే అధికంగా ఉన్న సమయంలో ఎగుమతిదారులు పొందే అదనపు లాభాలను నియంత్రించేందుకు విండ్ఫాల్ ట్యాక్స్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. మార్కెట్లో అసాధారణ పరిస్థితుల కారణంగా ఏర్పడే అనూహ్య లాభాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ ఆదాయంగా మళ్లించడం ఈ పన్ను ప్రధాన ఉద్దేశం.ఇదీ చదవండి: పండుగలా దిగివచ్చిన పసిడి, వెండి.. -
పత్తి దిగుమతులకు సుంకాల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: పత్తి దిగుమతులకు అయిదు నెలల పాటు అన్ని రకాల కస్టమ్స్ సుంకాల నుంచి మినహాయింపునిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. దేశీయంగా టెక్స్టైల్ పరిశ్రమకు కాటన్ లభ్యతను పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని వివరించింది. టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమకు ముడి సరుకు వ్యయాలు తగ్గడానికి, దేశీయ రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే తయారీ సంస్థలు, వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు దోహదపడగలదని తెలిపింది. టెక్స్టైల్ పరిశ్రమ ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. దేశీయ మార్కెట్లో పత్తి లభ్యతపై ఒత్తిడి ఉండటంతో పాటు ముడి సరుకు ధరలు పెరగడం వల్ల స్పిన్నింగ్, గార్మెంట్ తయారీ యూనిట్లు వ్యయభారం ఎదుర్కొంటున్నాయని వారు పేర్కొన్నారు. దిగుమతి సుంకాల మినహాయింపుతో విదేశాల నుంచి తక్కువ ఖర్చుతో పత్తిని దిగుమతి చేసుకునే అవకాశం లభిస్తుందని, ముఖ్యంగా చిన్న, మధ్యతరహా టెక్స్టైల్ సంస్థలకు ఇది ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు. అలాగే భారత టెక్స్టైల్, అపారెల్ ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడంతో పాటు ఉత్పత్తి చక్రం అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
విమానం ఎగిరితే.. కోట్లాది రూపాయలు ఇలా కురుస్తాయ్?
ఆకాశంలో ఫ్లైట్స్ ఎన్నో ఎగురుతూ ఉంటాయి. విమానాల వల్లే సుదూర ప్రాంతాలకు తొందరగా చేరుకోగలుగుతున్నాం. ఏ రంగమైనా రెవెన్యూతో ముడిపడి ఉంటుంది. మరి ఫ్లైట్ రెవెన్యూ అంటే అసలుఏంటి? ఒక ఎయిర్లైన్ సంస్థకు విమాన ప్రయాణాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఫ్లైట్ రెవెన్యూ అంటారు.ప్రధానంగా రెవెన్యూ వచ్చే మార్గాలుప్రయాణికుల టికెట్ బుకింగ్స్ నుంచి అంటే.. బిజినెస్ క్లాస్ లేదా ఫస్ట్ క్లాస్ టికెట్స్ నుంచి అదనపు లగేజ్ చార్జీలు ఫుడ్ అండ్ బెవరేజ్ సేల్స్ కార్గో అండ్ పార్సల్ సర్వీసులు, ఇన్ఫ్లైట్ వైఫై లేదా ప్రీమియం సేవలు అంటే ఇది దాదాపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఫ్యూయల్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పైలట్ అండ్ సిబ్బంది జీతాలు, ఎయిర్పోర్ట్ చార్జీలు, విమాన మెయింటెనెన్స్, ట్యాక్సీలు ఇవన్నీ కలిపి కూడా ఫ్లైట్ రెవెన్యూ కిందకు వస్తుంటాయి.ఎగరడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకుందాం..ఉదాహరణకు.. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్యాసింజర్ ప్లేన్ ఒక ఎయిర్ బస్ A380 ఒక సింగల్ ఫ్లైట్ లో ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఫ్లైట్ దుబాయ్ నుంచి లండన్ వెళ్తుంది అనుకుందాం. ప్రయాణం 7 గంటలు పడుతుందనుకుందాం. దీంట్లో 506 సీట్స్ ఉంటాయి. ఫుల్లీ బుక్డ్ అనుకుందాం.. ఈ ఫ్లైట్ మొత్తం మరి దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందులో 14 ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్స్ ఉంటే అందులో నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం అక్షరాల ఒకటిన్నర కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇక మిగిలిన సీట్లు ఉంటాయి కదా.. 76 బిజినెస్ క్లాట్స్ ప్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. మరి అందులో నుంచి వారికి 86 అంటే 86.2 లాక్స్ ఆదాయం వస్తుంది. అలాగే 416 ఎకానమీ ప్యాసెంజర్ సీట్స్ ఉంటాయి.అంటే ఫస్ట్ క్లాస్ తర్వాత మిగిలిన సీట్స్ తర్వాత ఎకానమీ ప్యాసెంజర్స్ సీట్స్ ఉంటాయి. వాళ్ల నుంచి వీళ్లకు వచ్చే ఆదాయం 1/2 కోట్లు ఉండొచ్చు. మరి ఇక టికెట్ రెవెన్యూ రఫ్ గా చూసుకున్నట్లయితే వీళ్లకి రూ.3.16 కోట్లు. అలాగే మన కార్గో చార్జీలు అన్నీ ఉంటాయి కదా వాటికి కూడా వాళ్లకి వచ్చే ఆదాయం 67 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇక టోటల్ రెవెన్యూ మాత్రం దగ్గర దగ్గరగా 3.83 కోట్ల వరకు వస్తుంది.ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చు?ఒకవేళ ఈ ఫ్లైట్ నే తీసుకుందాం A380. ఈ ఫ్లైట్ అసలు నడవడానికి కొంతవరకు బర్న్ అయ్యే ఫ్యూయల్ ఉంటుంది కదా.. ఒకవేళ 2600 గలోన్స్ ఆఫ్ ఫ్యూయల్ పర్ అవర్ ఉంటే ఒక ఫ్లైట్ కి కావాల్సింది 27600 గెలోన్స్ దీనికి కాస్ట్ ఎంత పడుతుందనుకుంటున్నారు? నియర్లీ 60,000 డాలర్.. అంటే అక్షరాల రూ.57 లక్షలు అవుతుంది. మరి ల్యాండింగ్ ఫీస్ సెక్యూరిటీ బ్యాగేజ్ హ్యాండిలింగ్ ఫీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వీటికి కూడా 12.45 లక్ష అవుతుంది. ఇక ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ ఫీస్ ఉంటుంది 11.5 లాక్స్ అవుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే క్రూ ఉంటారు ఫ్లైట్ లో మరి వాటికి కూడా వాళ్లకు కూడా చార్జీలు ఉంటాయి. ఇక క్రూ మొత్తం కలుపుకుంటే ఆ పెద్ద ఫ్లైట్ లో 22 ఫ్లైట్ అటెండెన్స్ ఉంటాయి. అంటే 22 ఫ్లైట్ అటెండెన్స్ ప్లస్ఫోర్ పైలట్స్ చూసుకున్నట్లయితే వాళ్లకి కూడా శాలరీస్ ఉంటాయి. మరి దానికి ఖర్చు రూ.14.36 లక్షలు ఉండొచ్చు. ఇక ఇంజన్ సిస్టం మెయింటనెన్స్ కాస్ట్లు పడుతూ ఉంటాయి. మరి దానికి అయ్యే ఖర్చు రూ.4.78 లక్షలు. ఇక వేరియబుల్ కాస్ట్ అన్ని కలిపి ఒక కోటి రూపాయల వరకు అవ్వచ్చు. మరి అలాగే డిప్రిసియేషన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఖర్చులు ఉంటాయి. వాటికి కూడా 47.87 లక్షల రూపాయలు అవుతుంది. అంత స్మూత్ గా వెళ్తుంటే రూ.2.35 క్రోర్స్ వరకు వాళ్లకు ఆదాయం వస్తుంది. అంటే ఒక ఫ్లైట్ నడపడానికి అయ్యే ఖర్చులు ఆదాయాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం చూసే ప్రతి ఫ్లైట్ కేవలం ప్రయాణం మాత్రమే కాదు. వేలాది ఉద్యోగాలు కోట్ల రూపాయల బిజినెస్, బారి ప్లానింగ్ తో నడిచే ఒక పెద్ద ఇండస్ట్రీ ఆకాశంలో ఎగిరేది విమానం మాత్రమే కాదు.. దాని వెనక ఉన్న రెవెన్యూ కూడా... -
సవాళ్లున్నాయి, కానీ సంక్షోభం లేదు
పశ్చిమాసియా సంక్షోభం, ఇతరత్రా విదేశీ షాక్ల కారణంగా ఆర్థిక వ్యవస్థ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. దీని తీవ్రత మన కళ్ల ముందు స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా విదేశీ మారక నిల్వల తగ్గుముఖం, దిగుమతుల భారం, రూపాయి పతనం, ఎరువుల రాయితీలు భారీగా ఎగబాకడం, పెట్రో ధరల పెంపు వంటివి చూస్తున్నాం. అయితే, ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందన్నదే అసలు ప్రశ్న. విదేశీ షాక్ల విషయంలో ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ సరైన దిశలోనే ఉన్నాయి. పలు రంగాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిరావచ్చు. అయితే, కొంతమంది భయాందోళనలకు గురిచేస్తున్నట్లుగా మన ఎకానమీలో ఏదో సంక్షోభం నెలకొందని అనిపించడం లేదు. చాలా పటిష్టంగానే ఉందని భావిస్తున్నా. గత మూడేళ్లుగా జీడీపీ సగటున 7.3% వృద్ధి చెందింది. మూడేళ్లలో ద్రవ్యోల్బణం సగటున సుమారు 4.3%గా నమోదైంది. కరెంట్ ఖాతా లోటు కూడా జీడీపీలో 1% పరిధిలోనే కొనసాగింది. ఆర్థిక వ్యవస్థలో కొత్తగా నిర్మాణాత్మక సమస్యలేవీ లేవు. మన శ్రామిక శక్తిలో ఇప్పటికీ 46% వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. పట్టణీకరణ వేగం పుంజుకోవడం లేదు. రాబోయే దశాబ్దంలో వీటిని చక్కదిద్దాల్సి ఉంది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయన్న విషయంలో గందరగోళం నెలకొంది. నిజానికి కీలకమైన స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (గ్రాస్ ఎఫ్డీఐలు) చాలా బలంగా ఉన్నాయి. 2024–25లో ఇవి 81 బిలియన్ డాలర్లు కాగా, 2025–26లో 94 బిలియన్ డాలర్లు. సమస్యేమిటంటే, విదేశీ ఇన్వెస్టర్లు గతంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీనివల్ల గతేడాది సుమారు 20 బిలియన్ డాలర్లు వెనక్కి వెళ్లాయి. అలాగే, విదేశీ పరిణామాల కారణంగా స్టాక్ మార్కెట్లలో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు దెబ్బతిన్నాయి. భారత్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లలో సానుకూల దృక్పథం మారలేదు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారీ సంస్కరణల్లో చాలా వరకు పూర్తయ్యాయి. అయితే, నియంత్రణపరమైన కొన్ని అడ్డంకులు ఇంకా కొనసాగుతున్నాయి. న్యాయపరమైన సంస్కరణలల్లో పెద్దగా పురోగతి లేదు. రాబోయే దశాబ్దాల్లో వీటితో సహా మరిన్ని భారీ సంస్కరణలు అవసరం. ప్రధాని పొదుపు చర్యలను ఒక నైతిక సూచనగానే చూడాలి. అయితే, వీటిని ప్రభుత్వాలు ఆచరించి ఆదర్శంగా నిలవాలన్న వాదనతో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా ఉచిత పథకాలను ఎడాపెడా ఇవ్వడం మంచిది కాదు, కేంద్రంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం దీనికి మినహాయింపు. కోవిడ్ తర్వాత ఆర్థిక క్రమశిక్షణ మెరుగ్గానే ఉంది. రానున్న కాలంలో కేవలం ఉచితాలతోనే ఎన్నికల్లో గెలవలేమని రాజకీయ పార్టీలన్నీ గ్రహిస్తాయని భావిస్తున్నా. ప్రజాస్వామ్య వ్యవస్థలో వాటిని ఆపడం సాధ్యం కాదు. మెరుగైన పాలన, సేవలతోనే విజయం లభిస్తుంది. కాలక్రమేణా ఉచిత పథకాలు వాటంతటవే కనుమరుగవుతాయి. పశ్చిమాసియా సంక్షోభం నేడోరేపో ముగిసినా చమురు సరఫరా వ్యవస్థ మునుపటి స్థాయికి చేరడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది(2026–27) అర శాతం తగ్గి 6.5 శాతానికి చేరవచ్చు. ఒకవేళ ఏడాదంతా ఉద్రిక్తతలు కొనసాగితే 6 శాతానికి తగ్గే అవకాశం ఉంది.– డా. అరవింద్ పనగారియా, ఆర్థికవేత్త, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ -
కరెన్సీ నోటు మీద ట్రంప్.. డిజైన్ రెడీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావడానికి సంబంధించిన చర్చ అమెరికా రాజకీయాల్లో హాట్టాపిక్గా మారింది. ఈ నోటుకు సంబంధించిన డిజైన్ను సిద్ధం చేశామని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. అయితే దీనికి తుది ఆమోదం కాంగ్రెస్ చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.వైట్హౌస్లో మాట్లాడిన బెస్సెంట్, “మేము బిల్లు డిజైన్ను సిద్ధం చేశాం. అవసరమైతే వెంటనే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి” అని పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక స్మారక నోటుగా దీనిని తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిపారు.కాంగ్రెస్లో పెండింగ్లో బిల్లుఈ ప్రతిపాదనకు సంబంధించి రిపబ్లికన్ ప్రతినిధి జో విల్సన్ కాంగ్రెస్లో బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుత చట్టం ప్రకారం సజీవ వ్యక్తుల చిత్రాలు అమెరికా కరెన్సీపై ముద్రించరాదు. అయితే ట్రంప్ కోసం ఆ నిబంధనకు మినహాయింపు ఇవ్వాలని ఈ బిల్లు కోరుతోంది. ట్రెజరీ విభాగం ప్రకారం, కాంగ్రెస్ ఆదేశిస్తే “అమెరికా 250వ వార్షికోత్సవాన్ని ప్రతిబింబించే స్మారక 250 డాలర్ల నోటు” విడుదలకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటికే ప్రారంభించారు.డిజైన్లో ట్రంప్ చిత్రం, సంతకంవాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, ఈ నోటు డిజైన్లో ట్రంప్ చిత్రపటంతో పాటు 250వ వార్షికోత్సవ లోగో, ఆయన సంతకం కూడా ఉండనున్నాయి. బ్రిటిష్ కళాకారుడు ఇయాన్ అలెగ్జాండర్ ఈ డిజైన్ను రూపొందించినట్లు సమాచారం. అమెరికా బ్యూరో ఆఫ్ ఎంగ్రేవింగ్ అండ్ ప్రింటింగ్లో ఈ ప్రతిపాదనపై అంతర్గత చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ట్రంప్ నియమిత యూఎస్ ట్రెజరర్ బ్రాండన్ బీచ్ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.ట్రంప్ బ్రాండ్ విస్తరణ2025లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తన పేరు, చిత్రాన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ చిత్రంతో 250వ వార్షికోత్సవ స్మారక నాణేలు రూపొందించగా, ఫెడరల్ భవనాలపై కూడా ఆయన చిత్రపటాలు ప్రదర్శిస్తున్నారు. అయితే 250 డాలర్ల నోటు విడుదల కావాలంటే కాంగ్రెస్ బిల్లు ఆమోదం పొందడంతో పాటు ట్రంప్ సంతకం కూడా అవసరం. “మేము చట్టానికి కట్టుబడి ఉంటాం. ఇక నిర్ణయం క్యాపిటల్ హిల్ చేతుల్లోనే ఉంది” అని బెస్సెంట్ స్పష్టం చేశారు. -
రూపాయిని మరింత పడనివ్వాలి
ముంబై: విదేశీ ఆర్థిక అనిశ్చితి, ఒత్తిళ్లను తట్టుకునేందుకు వీలుగా డాలరుతో రూపాయి మారకం విలువను మరింత క్షీణించేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలు మరింత పెరిగితే, వడ్డీ రేట్ల పెంపునకు బదులు ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) నియంత్రణ చర్యలను ఎంచుకోవడం మంచిదని సూచించారు. పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడ్ ధరలు దూసుకెళ్లడం, రూపాయి భారీగా పతనం కావడం, దేశీయంగా పెట్రో రేట్ల పెంపుతో ద్రవ్యోల్బణానికి రెక్కలొస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూన్ 5న ఆర్బీఐ కీలక పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ద్రవ్యోల్బణం మరీ ఆందోళనకంగా ఉందని భావిస్తే ఆర్బీఐ పరపతి విధానాన్ని కఠినతరం చేయొచ్చు. అయితే, కరెన్సీ రేటు పడిపోకుండా అడ్డుకోవడానికి మాత్రం మానిటరీ పాలసీని చివరి అస్త్రంగా మాత్రమే ప్రయోగించాలి. బలహీన రూపాయి అనేది తటస్థ షాక్ అబ్జార్బర్లా పని చేస్తుంది. కాబట్టి, అది మరింత పడిపోకుండా అడ్డుకోవడం కంటే, పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు వీలు కల్పించాలి’ అని ఆయన పేర్కొన్నారు. నిర్ణయాత్మక చర్యలు అవసరం... ‘రూపాయి మరింత పడిపోతుందని ఇన్వెస్టర్లు, దిగుమతిదారులు, ప్రజలు భావించడం మొదలైతే అది మరింత బలహీనపడుతుంది. కరెన్సీ ఇంకా పడిపోయే విధంగా వారి చర్యలుంటాయి. ఎగుమతిదారులు తమ డాలర్లను సొమ్ము చేసుకోవడం ఆలస్యం చేస్తారు. దిగుమతిదారులు డాలర్ల కోసం ఎగబడతారు. ప్రజలు బంగారం కొనేందుకు మరింత మొగ్గుచూపుతారు. అలాగే ఇన్వెస్టర్లు హెడ్జింగ్ను తీవ్రతరం చేస్తారు. అందుకే జోక్యం చేసుకోవడం కంటే వారి ఆందోళనలను తగ్గించేలా వివరించడం చాలా ముఖ్యం’ అని దువ్యూరి చెప్పారు. పాలసీ రూపకర్తలు ఆత్మరక్షణలో పడినట్లు లేదా భయాందోళనలకు గురైనట్లు కాకుండా నిర్ణయాత్మకంగా చర్యలు తీసుకోవాలన్నారు. వేచిచూడటం మంచిది... జీడీపీకి మద్దతివ్వడం కోసం వడ్డీ రేట్లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణం ఎగబాకి.. మారకం రేటు ఒత్తిళ్లు తీవ్రమవుతాయి. ఒకవేళ వడ్డీ రేట్లను భారీగా పెంచితే ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిని, జీడీపీ వృద్దిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ‘వృద్ధి, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ స్థిరీకరణ విషయంలో సమతూకం పాటించడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంక్లిష్టమైన అంశం. కాబట్టి ద్రవ్యోల్బణం పెరుగుదల రిసు్కలను అంచనా వేసేందుకు, తక్షణం పాలసీ రేట్లను పెంచకుండా ఆర్బీఐ కొంతకాలం వేచిచూసే ధోరణితో వ్యవహరిస్తే మంచిదని దువ్వూరి తెలిపారు. -
ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచాలి
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఎగుమతుల పోటీతత్వం పెంచేందుకు పన్నుల తగ్గింపు, అవసరం లేని, అనర్ధదాయక వస్తువుల దిగుమతులపై నిషేధం విధించడంతోపాటు.. తగిన రక్షణ చర్యలు అవసరమని ఒక నివేదిక సూచించింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్టు తెలిపింది. దీనివల్ల ఇంధనం, వ్యవసాయం, ఉత్పాదక రంగాలలో వ్యయాలు పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీస్తున్నట్టు ‘థింక్ చేంజ్ ఫోరమ్’ నివేదిక పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి సబ్సిడీలపై ఆధారపడటం పరిష్కారం కాదని సూచించింది. సబ్సిడీలు ఇవ్వడం వల్ల పరిశ్రమలు అంతర్జాతీయ సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని, సమర్థతను కోల్పోతాయంటూ.. వీటికి బదులు ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచడానికి పన్నుల నిర్మాణంలో మార్పులు చేయాలని, దేశీయ పరిశ్రమలకు మేలు జరిగేలా దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సవరించాలని, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి అనవసరమైన వస్తువుల దిగుమతులను అడ్డుకోవాలని సూచించింది. అవసరం లేని వస్తు దిగుమతులను తగ్గించడం అన్నది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, అది దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ఎంతో ముఖ్యమైందన్న ప్రధాని మోదీ ఇటీవలి పిలుపును ప్రస్తావించింది. గత ఆర్థిక సంవత్సరంలో దిగుమతులు 774.98 బిలియన్ డాలర్లకు పెరగ్గా.. ఎగుమతులు 441.78 బిలియన్ డాలర్లుగా నమోదవడం తెలిసిందే. దీనివల్ల దేశ వాణిజ్య లోటు 333 బిలియన్ డాలర్లు దాటిపోయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ డేటాను ఉదహరించింది. రూపాయిని కాపాడుకోవాలి.. → అంతర్జాతీయంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో భారత్ తన కరెన్సీ (రూపాయి) విలువను కాపాడుకునేందుకు తక్కువ విలువ జోడించే విడిభాగాలను కట్టడి చేయాలి. వీటి తయారీకి సంబంధించి దేశీయంగా తగిన తయారీ వ్యవస్థ ఉంది. → హానికారక వస్తు దిగుమతులను సైతం నిషేధించాలి. తక్కువ విలువతో కూడిన విచక్షణారహిత దిగుమతులను అనుమతించడం వల్ల విదేశీ మారకం నిల్వలపై ఒత్తిళ్లు పడుతున్నాయి. అదే సమయంలో దేశీయంగా బలమైన విలువ జోడింపు అవకాశాలు, సామర్థ్య విస్తరణ, ఉపాధి కల్పన అవకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. → పొగాకు ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో అతిపెద్ద దేశమైనప్పటికీ.. 116 మిలియన్ డాలర్ల విలువైన సిగరెట్లు, సిగార్లు, టుబాకో, టుబాకో ప్రత్యామ్నాయాలను దిగుమతి చేసుకుంటోంది. → ఖరీదైన కన్ఫెక్షనరీలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, విలాసవంతమైన వాచీలు, కార్ల దిగుమతులను సాధారణ అనుమతుల జాబితా నుంచి తొలగించి, కఠినమైన నిబంధనలతో కూడిన ప్రత్యేక లైసెన్స్ పరిధిలోకి తీసుకురావాలి. → విదేశీ వస్తు దిగుమతులతో దేశీ పరిశ్రమలు నష్టపోతున్నప్పుడు, వాటిని రక్షించడానికి తగిన వాణిజ్య చర్యలను తగిన కాలపరిమితితో తక్షణమే అమలు చేయాలి. -
మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి
కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నప్పటి కంటే సంకీర్ణ సర్కార్లు ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్, వాజ్పేయి ప్రభుత్వాలు దీనిని నిదర్శనం. ఇందిర, మోదీ సారథ్యంలో ఎకానమీ తీవ్ర సమస్యల్లోకి జారిపోవడం చూస్తున్నాం. → రాజకీయంగా బలమైన మెజారిటీ ఉన్నప్పుడే ఆర్థికంగా బలహీన పనితీరు ఉంటుంది. ఎందుకంటే, వారు తమ పొలిటికల్ బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తారు తప్ప, ఆర్థిక సవాళ్లపై పెద్దగా ఫోకస్ చేయరు. → కొంత మంది ఆర్థిక వేత్తలు చెబుతున్నట్టు, భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందనడంలో అర్థం లేదు. ఎందుకంటే, గతంతో పోలిస్తే భారత్ పనితీరు ఎలా ఉందో చూడాలి. ఈ శతాబ్దం తొలి పదేళ్లలో సగటు ఎకానమీ వృద్ధి రేటు 7–7.5 శాతంగా ఉంది. మరిప్పుడు సగటు వృద్ధి 6 శాతానికి పడిపోయింది. → 2020 కల్లా మన జీడీపీని 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నదే లక్ష్యమని ప్రధాని మోదీ 2017లో ప్రకటించారు. ఆ టార్గెట్ తర్వాత 2022కి, ఆపై 2025కి మారింది. ఇప్పుడు 2026లో కూడా మనం ఇంకా 4 ట్రిలియన్ డాలర్ల వద్దే ఉన్నాం. లక్ష్యం మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. సమస్యలు గుర్తించి, తగిన పాలసీ చర్యలు చేపట్టాలి. → ప్రైవేటు పెట్టుబడులు పెరగకపోవడానికి 3 కారణాలున్నాయి. చాలా రంగాల్లో ఉత్పత్తులకు డిమాండ్ పుంజుకోవడం లేదు. దీన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వ పెట్టుబడులు పెంచుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019లో చెప్పారు. దీనివల్ల డిమాండ్ పెరిగి, ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అదేమీ జరగలేదు. → సంపన్నులు దేశాన్ని విడిచిపోతున్నారు. కొంత మంది బడా కార్పొరేట్లు సైతం విదేశాల్లో తమ ఫ్యామిలీ ఆఫీసులు తెరుస్తున్నారు. దీనివల్ల దేశం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఇక మూడోది ఎఫ్డీఐలు మందగిస్తున్నాయి. గణాంకాలే దీనికి నిదర్శనం. → తయారీ రంగం, వృద్ధి రేటు, ఎగుమతులు, ఉద్యోగ కల్పన ఇలా ఏ డేటా చూసినా.. 1990– 2015 మధ్య అంటే పాతికేళ్ల పాటు ఎకానమీకి స్వర్ణ యుగం అనే చెప్పొచ్చు. ఇందిగా గాంధీ హయాంలో, ఇప్పుడు మోదీ జమానాలో ఆర్థిక వ్యవస్థ పనితీరు అసలేం బాగోలేదు. అయితే, బీజేపీ పీఎం అటల్జీ పాలనలో మాత్రం సంస్కరణల పరంగా, పెట్టుబడుల పరంగా కూడా మంచి నాయకత్వం లభించింది. → ప్రధాని మోదీ పొదుపు మంత్రం జపిస్తే సరిపోదు. మరింత ఫోకస్ అవసరం. గతంలో 1991లో ఫారెక్స్ సంక్షోభాన్ని పీవీ, 1998లో అణు పరీక్షల కారణంగా అమెరికా విధించిన ఆంక్షలను అటల్జీ ఎదుర్కొన్న తీరును గమనించండి. ప్రస్తుతం మాటలే తప్ప అలాంటి చేతలు కనిపించడం లేదు. ఎకానమీ మందగమనానికి గల్ఫ్ వార్, క్రూడ్ ధరల పెరుగుదల మాత్రమే కాదు, చాలా అంశాలు ప్రభావం చూపుతున్నాయి. – డా. సంజయ బారు, పాలసీ ఎనలిస్ట్ -
వికసిత్ భారత్కు బ్యాంకింగ్ దన్ను
న్యూఢిల్లీ: వికసిత్ భారత్ లక్ష్య సాకారంలో బ్యాంకింగ్ రంగం కీలకపాత్ర పోషిస్తుందని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. మూలధన సమీకరణ, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో బ్యాంకింగ్ ప్రధానంగా ఉంటోందన్నారు. వార్షిక నివేదికలో షేర్హోల్డర్లకు ఇచ్చిన సందేశంలో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ‘‘దేశంలోనే అతి పెద్ద బ్యాంకు కావడం వల్ల మాకు అవకాశాలూ, బాధ్యత.. రెండూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తెరిగి, భారత్ వృద్ధి ఆకాంక్షలు సాకారం కావడానికి అవసరమైన తోడ్పాటు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని తెలిపారు. డిజిటల్ మాధ్యమం, కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చేలా ‘డిజిటల్ ఫస్ట్, కస్టమర్ ఫస్ట్’ విధానాలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో బ్యాంకింగ్ సేవలను బలోపేతం చేసేలా టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, కృత్రిమ మేథ, సైబర్సెక్యూరిటీ, డిజిటల్ ఇన్ఫ్రాపై పెట్టుబడులను కొనసాగిస్తామని శెట్టి చెప్పారు.కొత్త ఆవిష్కరణలపై ఫోకస్.. కొత్త ఆవిష్కరణలకు తెరతీస్తూ, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకుంటూ, మరింత నాణ్యమైన సేవలు అందించేలా వివిధ ప్రక్రియలను సరళతరం చేయడంపై దృష్టి పెడుతున్నట్లు శెట్టి తెలిపారు. ఇందుకు ప్రాజెక్ట్ సరళ్ కింద ఆటోమేషన్, కృత్రిమ మేథ (ఏఐ)ని మరింత వినియోగించుకోనున్నట్లు వివరించారు. -
గోల్డ్ లోన్ కంపెనీలు బంగారు గనులు!
న్యూఢిల్లీ: పసిడి ధర, రుణాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం రుణాల కంపెనీల దగ్గర హోల్డింగ్స్ భారీగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మూడు లిస్టెడ్ గోల్డ్ కంపెనీలైన ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ దగ్గర మొత్తం బంగారం 20 టన్నులు పెరిగి రికార్డు స్థాయిలో 334 టన్నులకు చేరింది. పలు దేశాల దగ్గరున్న నిల్వల కన్నా ఇది అధికం కావడం గమనార్హం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం బ్రిటన్ దగ్గర 310 టన్నులు, బ్రెజిల్ వద్ద 172 టన్నులు, సింగపూర్ దగ్గర 194 టన్నుల బంగారం ఉంది. ఈ మూడు సంస్థల దగ్గరున్న హోల్డింగ్స్ భారతదేశపు వార్షిక పసిడి దిగుమతుల్లో దాదాపు సగం (46 శాతం). కేంద్ర వాణిజ్య శాఖ డేటా ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు దాదాపు 5 శాతం తగ్గి 721 టన్నులకు పరిమితమయ్యాయి. 2026 మార్చి ఆఖరు నాటికి రిజర్వ్ బ్యాంక్ వద్ద గతేడాది నమోదైన 879.6 టన్నుల స్థాయికి దాదాపు దరిదాపుల్లో మొత్తం 880.5 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. ఇందులో 680 టన్నులను దేశీయంగా నిల్వ చేస్తుండగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్ల్లండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద 197.7 టన్నులు నిల్వ చేస్తున్నారు. గోల్డ్ డిపాజిట్ల రూపంలో మరో 2.8 టన్నులు ఉన్నాయి. ఐఐఎఫ్ఎల్ ః 19 టన్నులు .. గత ఆర్థిక సంవత్సరంలో ఐఐఎఫ్ఎల్ వద్ద పసిడి అత్యధికంగా 19 టన్నులు పెరిగింది. దాదాపు 60 టన్నులకు చేరింది. వాస్తవానికి 2024 మార్చి నుంచి ఆరు నెలల పాటు పసిడి రుణాలివ్వకుండా రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ గోల్డ్ లోన్ వ్యాపార విభాగంపై గణనీయంగా ప్రభావం పడింది. అయితే, ఆంక్షలను ఎత్తివేసిన తర్వాత వ్యాపారం క్రమంగా పుంజుకుంది. మరోవైపు, గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా ఏడు శాతం తగ్గినప్పటికీ ముత్తూట్ ఫైనాన్స్ దగ్గర పసిడి హోల్డింగ్స్ అత్యధికంగా 209 టన్నులు ఉన్నాయి. ధర అధిక స్థాయిలో ఉన్నప్పుడు తక్కువ పరిమాణంలోనే బంగారాన్ని తనఖా పెట్టి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకునేందుకు వీలుండటం ఇందుకు కారణమని విశ్లేషకులు తెలిపారు. అటు మూడో లిస్టెడ్ గోల్డ్ లోన్ కంపెనీ అయిన మణప్పురం ఫైనాన్స్ వద్ద పసిడి హోల్డింగ్స్ ఏడు టన్నులు (11.7 శాతం) పెరిగాయి. రికార్డు స్థాయిలో 63 టన్నులకు చేరాయి. మైక్రోఫైనాన్స్ రంగంలో మొండిబాకీల ఒత్తిడి కనిపిస్తున్న నేపథ్యంలో మణప్పురం తమ పసిడి రుణాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతుండటమనేది కంపెనీ దగ్గర బంగారం హోల్డింగ్స్ పెరుగుదలకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఐఐపీ లెక్కల్లో భారీ మార్పులు
దేశ పారిశ్రామిక వృద్ధి రేటును అంచనా వేసే ‘పారిశ్రామిక ఉత్పత్తి సూచీ’ (ఐఐపీ-ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) లెక్కింపు పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. మారుతున్న ఆర్థిక ముఖచిత్రానికి అనుగుణంగా మరింత పారదర్శకంగా పారిశ్రామిక ప్రగతిని ప్రతిబింబించేలా ఐఐపీ పరిధిని విస్తరిస్తోంది. ‘బేస్ ఇయర్ రివిజన్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ’ (టీఏసీ-ఐఐపీ) చేసిన ప్రతిపాదనల మేరకు సరికొత్త ఐఐపీ సిరీస్ను జూన్ 1వ తేదీన ప్రభుత్వం అధికారికంగా విడుదల చేయనుంది.ఈ కొత్త సిరీస్లో ఇప్పటివరకు ఉన్న బేస్ ఇయర్ 2011-12 స్థానంలో 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని నూతన ఆధారిత సంవత్సరంగా (బేస్ ఇయర్) ఖరారు చేశారు. ఇటీవల మార్చిన దేశ జీడీపీ బేస్ ఇయర్ 2022-23, వినియోగదారుల ధరల సూచీ - సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ ఇయర్ 2024ల తర్వాత వాస్తవిక ఆర్థిక పరిస్థితులను ప్రతిబింబించేలా మారుస్తున్న మూడో కీలక ఆర్థిక సూచిక ఇదే కావడం గమనార్హం.కొత్తగా చేరిన రంగాలుగణాంకాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. పారిశ్రామిక రంగంలో వస్తున్న నూతన మార్పులను అందిపుచ్చుకునేలా ఐఐపీ పరిధిని పెంచారు. అరుదైన ఖనిజాల విభాగంలో మైనింగ్, క్వారీయింగ్ విభాగం కింద రేర్ ఎర్త్ మెటల్స్, మైనర్ మినరల్స్ను కొత్తగా ఈ సూచీలో చేర్చారు. అంతేకాకుండా, సాంప్రదాయ (నాన్ రెన్యువబుల్), పునరుత్పాదక (రెన్యువబుల్) ఇంధన వనరుల ద్వారా జరిగే విద్యుత్ ఉత్పాదనను ఇకపై విడివిడిగా చూపిస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నల్లా కనెక్షన్ల సంఖ్య ఆధారంగా నీటి సరఫరా విభాగాన్ని అంచనా వేస్తారు. అమృత్ పథకం కింద ఉన్న 500 నగరాల్లోని డ్రైనేజీ కనెక్షన్ల ఆధారంగా మురుగునీటి నిర్వహణను, పట్టణాల్లో సేకరించి ప్రాసెస్ చేసిన వ్యర్థాల ఆధారంగా వేస్ట్ మేనేజ్మెంట్ రంగాన్ని ట్రాక్ చేస్తారు.ఆరు విభాగాల వర్గీకరణ యథాతథంబేస్ ఇయర్ మారినప్పటికీ.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు రకాల వర్గీకరణలను కమిటీ యథాతథంగా కొనసాగించింది. ఇందులో ప్రాథమిక వస్తువులు, మూలధన వస్తువులు, మధ్యంతర వస్తువులు, మౌలిక సదుపాయాలు-నిర్మాణ రంగ వస్తువులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, కన్స్యూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉన్నాయి.జూన్ 1న తొలి నివేదికజూన్ 1న విడుదలయ్యే తొలి నివేదికలో ఏప్రిల్ 2023 నుంచి గణాంకాలను పొందుపరుస్తారు. ఇందులో ఏప్రిల్ 2026కి సంబంధించిన ముందస్తు అంచనాలు కూడా ఉంటాయి. ఆల్ ఇండియా జనరల్ ఇండెక్స్తో పాటు.. మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి రంగాల వారీ సూచీలను కూడా ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. ఈ నూతన సంస్కరణల ద్వారా దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించిన మరింత స్పష్టమైన, వాస్తవిక లెక్కలు అందుబాటులోకి వస్తాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
పెడచెవిన పెట్టడంతో రూ.12వేల కోట్ల నష్టం!
చౌక దిగుమతులను అడ్డుకునేందుకు యాంటీ డంపింగ్ డ్యూటీ (సుంకాలు) విధించాలన్న సిఫారసులను కేంద్రం అమలు చేయకపోవడంతో.. దేశీ పరిశ్రమకు రూ.11,938 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్టు తేలింది. అంతేకాదు ఒకవేళ ఈ యాంటీ డంపింగ్ సుంకాలు విధించినట్టయితే, దిగుమతులను నివారించడం రూపంలో ఏటా రూ.28,450 కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చుకునే అవకాశం కూడా ఉంటుందని కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) నిర్వహించిన అధ్యయనంలో తేలింది.చౌక దిగుమతులు దేశీ పరిశ్రమకు ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితుల్లో డీజీటీఆర్ అధ్యయనం చేసి, సిఫారసులు చేస్తుంది. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుంది. 56 ఉత్పత్తులకు సంబంధించి యాంటీ డంపింగ్ సుంకాలు విధించాలంటూ ఇప్పటి వరకు డీజీటీఆర్ సిఫారసు చేయగా, వీటిని అమలు చేయని కారణంగా దేశీ పరిశ్రమ ఏటా రూ.11,938 కోట్లను నష్టపోతున్నట్టు తెలిసింది.ఉపాధికీ నష్టమే..33 ఉత్పత్తుల దిగుమతుల రూపంలోనే రూ.1.54 లక్షల కోట్ల ఆర్థిక నష్టం ఏర్పడినట్టు డీజీటీఆర్ గుర్తించింది. 2030 నాటికి ఈ నష్టం రూ.2.70 లక్షల కోట్లకు పెరగొచ్చని పేర్కొంది. ప్రస్తుతం 24,000 ఉద్యోగాలు నష్టపోయే పరిస్థితి ఉండగా, 2030 నాటికి ఇది 38,000–42,000కు పెరగొచ్చని అంచనా వేసింది. దేశీ సామర్థ్యాలు, పెట్టుబడులు, ద్రవ్యోల్బణం తదితర అంశాలనూ డీజీటీఆర్ తన అధ్యయనంలో భాగంగా పరిగణనలోకి తీసుకుంది.విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి దేశీ పరిశ్రమను రక్షించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూటీవో సభ్య దేశాలు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించడం సర్వసాధారణం. ఒక ఉత్పత్తిని సాధారణ విలువ కంటే తక్కువ ధరకు ఎగుమతి చేయడాన్ని డంపింగ్ (కుమ్మరించడం)గా భావిస్తుంటారు. చారిత్రకంగా చూస్తే 2020 వరకు డీజీటీఆర్ సిఫారసుల్లో 99.5 శాతం అమలయ్యాయి. కానీ, ఇటీవలి కాలంలో తిరస్కరణ రేటు పెరిగిపోయింది. 2025 ఏప్రిల్–నవంబర్ కాలంలో 16 శాతం సిరఫారసులనే తిరస్కరించగా, 2025 నవంబర్ నుంచి 2026 ఏప్రిల్ కాలంలో 81 శాతానికి పెరిగినట్టు డీజీటీఆర్ అధ్యయనంలో వెల్లడైంది. రూపాయి విలువ క్షీణత, తగ్గిపోతున్న విదేశీ మారకం నిల్వలు కాపాడుకునేందుకు ఇటీవలి కాలంలో కేంద్ర సర్కారు పలు చర్యలు తీసుకుంటున్న క్రమంలో డీజీటీఆర్ నివేదికలోని విషయాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
రూపాయి పతనాన్ని అడ్డుకోకూడదు..
ప్రస్తుత అంతర్జాతీయ, దేశీయ పరిస్థితుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సబబేనని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఇది తప్పనిసరి చర్య అని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకోకపోతే మనకు ఎకానమీని ఎలా నిర్వహించాలో తెలియదనే తప్పుడు సంకేతాలు వెళ్లేవని ఆయన అభిప్రాయపడ్డారు.అహ్లూవాలియా ఏమన్నారంటే..ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రో ధరల పెంపు సబబే. తప్పదు కూడా. లేదంటే మనకు ఎకానమీని ఎలా చక్కదిద్దాలో తెలియదనే అభిప్రాయం కలిగేది. గతంలో మేము కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాము, ప్రస్తుత ప్రభుత్వమూ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది.పశ్చిమాసియా సంక్షోభం ఇంకెంత తీవ్ర రూపం దాల్చుతుందో మనకు కచ్చితంగా తెలియదు, కాబట్టి దూరదృష్టితో ఆలోచించాలి. హార్మూజ్ జలసంధి తెరుచుకునే విషయంలో స్పష్టత లేదు. నిజానికి క్రూడ్ ధరలు మరింత పెరిగితే, రానున్న రోజుల్లో పెట్రో ధరలను ఇంకా పెంచాల్సి వస్తుంది. ఎరువుల రేట్లు కూడా భారీగా ఎగబాకే అవకాశం ఉంది.మొదట్లో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపు (రూ.10) రూపంలో ప్రజలకు కాస్త ఉపశమనం కల్పించింది. ఇంకా భరిస్తే, ద్రవ్యలోటు ఎగబాకుతుంది. పెట్రో ధరలపై ప్రభుత్వ నియంత్రణ రద్దయి చాలా ఏళ్లయినా, నిజానికి అది ఇంకా కొనసాగుతూనే ఉంది.ఎకానమీ గురించి ప్రజలను భయాందోళనలకు గురి చేయను కానీ, మన ఆర్థిక వ్యవస్థకు కొన్ని బలాలతో పాటు బలహీనతలూ ఉన్నాయి. క్రూడ్ ధర పెరుగుదల ఒక్కటే దీనికి కారణం కాదు. కొన్నేళ్లుగా ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతున్నాయి, ఎగుమతుల పనితీరు అశించిన స్థాయిలో లేదు. ఇది ఎకానమీని దెబ్బతీసే ప్రమాదం ఉంది.డాలరుతో రూపాయి మారకం విలువ 100ను తాకుతుందా అనే చర్చ జరుగుతోంది. ఈ నంబర్లకు నేను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వను. అధిక క్రూడ్ ధరలు, దిగుమతుల భారం కారణంగా రూపాయి క్షీణత అనివార్యమే. తగ్గడానికి అనుమతించడం మంచిదే. కరెన్సీ విలువ అనేది మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది, కాబట్టి దాన్ని మార్కెట్ వర్గాలకే వదిలేయాలి. రూపాయి మరీ క్షీణించిందని భావిస్తే, మార్కెట్లే తిరిగి సరైన స్థాయి చేర్చి, గాడిలో పెడతాయి. కరెన్సీ పతనాన్ని అడ్డుకోవడానికి విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలను వాడటం సరికాదు.యూకే, ఈయూలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం మంచి ఆలోచన. అలాగే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆధార్ మరింత బలోపేతం అయింది. భారీ డిజిటల్ ఇన్ఫ్రాగా తీర్చిదిద్దారు. తొలుత జీఎస్టీని వ్యతిరేకించినా.. తర్వాత అమల్లోకి తెచ్చారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ వంటివి చాలా కీలకమైనవి. చాలా కఠిన నిర్ణయాలు పెండింగ్లో ఉన్నాయి.జీడీపీ వృద్ధి విషయంలో మనం గమ్యానికి చాలా దూరంలో ఉన్నాం. మరిన్ని సంస్కరణలు అవసరమని ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రధాన మంత్రే స్వయంగా రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే నినాదం ఇచ్చారు. కాబట్టి, సబ్సిడీలు, సంస్కరణల విషయంలో పునఃసమీక్షకు ఇది మంచి తరుణం, అత్యవసరం కూడా. నీతి ఆయోగ్ ద్వారా లేదా ఏదైనా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి, విస్తృతంగా చర్చించాలి. ఈ మార్పుల ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.ఇదీ చదవండి: కాసుల వేటలో.. కరుగుతోన్న బంధాలు -
ద్రవ్యోల్బణానికి పెట్రో మంట
న్యూఢిల్లీ: ఇంధన (పెట్రోల్, డీజిల్, గ్యాస్) ధరల పెంపు, బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం పెంపుతో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో 5 శాతానికి చేరుకోవచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఇంధన ధరల ప్రభావం పూర్తి స్థాయిలో కనిపించేంత వరకు ఆర్బీఐ రేట్ల పెంపు విషయమై వేచిచూడొచ్చని పేర్కొన్నారు. మే 15 నుంచి విడతల వారీగా లీటర్ పెట్రోల్ ధరను రూ.7.38, లీటర్ డీజిల్ ధరను రూ.7.48 వరకు కేంద్రం పెంచడం తెలిసిందే. దీంతో పెట్రోల్, డీజిల్ను ముడిసరుకుగా వినియోగించే రవాణా తదితర రంగాలపై ఈ ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనికితోడు బంగారం, వెండి దిగుమతులపై 6 శాతంగా ఉన్న బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్రం 15 శాతానికి పెంచడం తెలిసిందే. 5 శాతం దాటితే పెంచడమే! ‘‘పెట్రోలియం ఇంధన ధరలను లీటర్కు రూ.7.5 వరకు పెంచడంతో వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 75 బేసిస్ పాయింట్లు (0.75 శాతం) వరకు పెరగొచ్చు. మే నెలకు 4–4.5 శాతం స్థాయిలో, జూన్లో 4.5–5 శాతం స్థాయిలో నమోదు కావొచ్చు. సీపీఐ పెరుగుదల అన్నది ధరల ఆధారితం. రెపో రేటులో మార్పులు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంపై పరిమిత ప్రభావమే చూపిస్తుంది. కనుక పెట్రోల్ ధరల పెంపు ప్రభావం ఒక త్రైమాసిక కాలంలో ఎలా ఉంటుందో ఆర్బీఐ పరిశీలించొచ్చు. ఒకవేళ సీపీఐ ద్రవ్యోల్బణం 5 శాతం మించిపోతుంటే ఆర్బీఐ వేచి చూడకుండా రేట్ల కఠినతరాన్ని మొదలు పెట్టొచ్చు’’ అని ఈవై ఇండియా ముఖ్య ఆర్థిక సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. ఎలాంటి నిర్ణయం ఉండకపోవచ్చు.. జూన్ సమీక్షలో రేట్ల పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని బార్క్లేస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ఆస్థా గుడ్వాణి సైతం పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంధన ధరల పెంపుతో రవాణా ధరలు ఎగసి పలు రంగాల్లోని ఉత్పత్తులు ప్రియంగా మారతాయని.. ద్వితీయార్ధంలో ద్రవ్యోల్బణం ఎగిసిపడొచ్చన్నారు. దీంతో రేట్ల పెంపు తప్పకపోవచ్చని అభిప్రాయపడ్డారు.జూన్లో యథాతథమే.. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతాన్ని మించొచ్చని, అయినప్పటికీ ఆర్బీఐ గరిష్ట పరిమితి 6 శాతంలోపే ఉంటుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ మేఘా అరోరా అంచనా వేశారు. ఇంధన ధరల పెంపుతో 38 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని తెలిపారు. జూన్ 5 నాటి ఆర్బీఐ ఎంపీసీ సమావేశం రేట్లపై యథాతథ స్థితికే మొగ్గుచూపొచ్చని అరోరా సహా ఇతర ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) 42 నెలల గరిష్ట స్థాయి 8.3%కి ఎగిసింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలకు స్వల్పంగా పెరిగి 3.48% స్థాయిలో ఉంది. ఇటీవల పెట్రో ధరల పెంపు, బంగారం, వెండి దిగుమతులపైనా సుంకాల పెంపుతో మే, జూన్ నెలలకు ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్ ఏర్పడింది. దీంతో ఆర్బీఐ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. -
పెట్రోల్ ధరలు రూ.10 పెరగాల్సింది!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రజలపై అదనపు భారం పడకుండా 76 రోజుల పాటు ఇంధన ధరలను నియంత్రించేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ప్రస్తుతం పెరిగిన ధరలు, చాలా రోజులకు ముందే పెరగాల్సి ఉండగా.. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల కొంతకాలం వరకు ప్రజలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు.ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం ద్వారా.. ఈ ఏడాది లక్ష కోట్ల రూపాయలకుపైగా ఉపశమనం కల్పించిందని సీతారామన్ చెప్పారు. ప్రభుత్వం ఆ సమయంలో పన్ను తగ్గింపులు చేయకపోయి ఉంటే, అప్పుడే లీటరుకు రూ.10 వరకు ధరలు పెరిగేవని వెల్లడించారు. ప్రస్తుతం జరుగుతున్న ధరల పెంపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నిర్ణయమని, ఎందుకంటే ఆయా సంస్థలే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురును కొనుగోలు చేసి విక్రయిస్తున్నాయని వివరించారు.ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొంటోందని, దీని ప్రభావం భారతదేశంపై కూడా పడుతోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ముఖ్యంగా 'మూడు ఎఫ్లు' - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు) విషయంలో దేశం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ ఖర్చులు కూడా అధికమవుతున్నాయని ఆమె హెచ్చరించారు.ఇక విదేశీ మారక నిల్వలను ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక స్థిరత్వం కోసం విదేశీ కరెన్సీ నిల్వలను కాపాడుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.ఇంధనంతో పాటు.. ఎరువుల ధరలు కూడా ఊహించని స్థాయిలో పెరిగాయని సీతారామన్ తెలిపారు. అలాగే బంగారం ధరలు భారీగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. భారతదేశం బంగారం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఇది ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.రూపాయి విలువ పడిపోవడంపై కూడా ఆర్థిక మంత్రి స్పందించారు. రూపాయి బలహీనత, పెట్టుబడుల పరిస్థితులపై ప్రజల నుంచి, వివిధ విభాగాల నుంచి అనేక సూచనలు వచ్చాయని తెలిపారు. వాటన్నింటినీ ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తోందని, దేశ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్! -
పెట్రోల్ మంటలు.. వంటింటికి సెగలు!
గత రెండు వారాలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో.. ద్రవ్యోల్బణంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. మే 15 తర్వాత నాలుగు సార్లు ఇంధన ధరలు పెరగడంతో ప్రజల రోజువారీ ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.94.77 నుంచి రూ.102.12కు చేరగా, డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.95.2కు పెరిగింది. అదే సమయంలో సీఎన్జీ ధరలు కూడా కేజీపై సుమారు రూ.4 వరకు పెరిగింది.ధరల పెరుగుదలకు ప్రధాన కారణం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు. ముఖ్యంగా అక్కడి యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడటంతో.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారులపై మాత్రమే కాదు, సాధారణ కుటుంబాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సరుకుల రవాణాకు ఇంధనం కీలకం. రైతుల నుంచి నగరాలకు వచ్చే కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరగడంతో వాటి ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి.ఇప్పటికే వంటింటి ఖర్చులు పెరుగుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సన్ఫ్లవర్ ఆయిల్ ధర కేజీకి రూ.11.2 పెరిగింది. సోయా ఆయిల్, పామ్ ఆయిల్ ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. టమోటా ధర కిలోకు రూ.7కిపైగా పెరగగా, నెయ్యి ధరలు కూడా పెరిగాయి. ముఖ్యంగా వంటనూనెల విషయంలో భారత్ దిగుమతులపై ఆధారపడటం వల్ల ప్రపంచ మార్కెట్ ప్రభావం నేరుగా కనిపిస్తోంది.ఈ పరిస్థితుల్లో ప్రజలు ఒకేసారి రెండు రకాల భారాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ప్రయాణ ఖర్చులు పెరుగుతుండగా, మరోవైపు వంటింటి ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే సాధారణ జీవనం మరింత ఖరీదుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: గడ్కరీ కీలక ప్రకటన.. వచ్చేస్తోంది కొత్త రకం స్టవ్! -
నిర్మలా సీతారామన్ హెచ్చరిక!
అమెరికా-ఇరాన్ యుద్ధం.. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తూ, దేశంలో ఖర్చులను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు ఎఫ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మూడు ఎఫ్లు - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు).పెరిగిన ధరలు - ప్రజలపై భారం!ముంబైలో జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎరువుల ధరలు ఊహకందని స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజలపై భారం మరింత పెరుగుతోంది. కేవలం 11 రోజుల్లోనే పెట్రోల్ ధర లీటర్కు రూ.7.38 వరకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు.ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా దెబ్బతింటోంది. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85-90 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే.. భారత్పై నేరుగా ప్రభావం పడుతుంది.మోదీ పిలుపుప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పారు. కాబట్టి, కొంతకాలం పాటు అవసరం లేని దిగుమతులను తగ్గించడం, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయడం, కొంతకాలం బంగారం కొనుగోళ్లను తగ్గించడం వంటి సూచనలు ప్రజలకు, పరిశ్రమలకు ప్రధాని ఇచ్చారని సీతారామన్ గుర్తుచేశారు.ప్రస్తుతం భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల మాత్రమే సమస్య కాదు. ఎరువుల ధరలు భారీగా పెరగడం వల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు బంగారం ధరలు పెరగడం కూడా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతోందని ఆర్ధికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను సృష్టిస్తున్నాయని ఆమె వివరించారు.అనేక సమస్యలు ఒకేసారి!అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం కేవలం రాజకీయ లేదా దౌత్య పరమైన అంశం కాదు, ఇది సాధారణ ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ హెచ్చరించారు. ఇంధన ధరలు పెరగడం, సరుకు రవాణా ఆలస్యం కావడం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల కొరత, ఎగుమతి ఆర్డర్లలో అనిశ్చితి వంటి అనేక సమస్యలు ఒకేసారి ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు.పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆదాయ నష్టాన్ని భరించిందని సీతారామన్ చెప్పారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం వచ్చినప్పటికీ ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) చెల్లింపుల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోపు బకాయిలను చెల్లించాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: ఉద్యోగాలపై AI ప్రభావం.. యువతకు పిచాయ్ సందేశం! -
‘వచ్చే పదేళ్లు మామూలుగా ఉండదు’
రాబోయే దశాబ్దం ప్రపంచ వాణిజ్యం, పరిశ్రమలకు అత్యంత సవాలుతో కూడుకున్నదని అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ముంబైలో జరిగిన టెక్స్ప్రోసిల్ ఎక్స్పోర్ట్స్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల కాలంలోనే అత్యంత అనిశ్చిత స్థితిని ఎదుర్కొంటోందని, పెరుగుతున్న రక్షణవాదం, సుంకం రహిత అడ్డంకులు, వాతావరణ మార్పులు, సరఫరా గొలుసుల అస్థిరత వంటివి ఎగుమతిదారులు, తయారీదారులకు ప్రధాన ఆందోళనలుగా మారాయని ఆమె పేర్కొన్నారు.అయితే, ఇలాంటి సంక్షోభ సమయాలు భారతదేశానికి కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తాయని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, సుస్థిరత, క్రాఫ్ట్ ఆధారిత తయారీ వంటి పోకడలు భారత్కు అనుకూలంగా ఉన్నాయన్నారు. గ్లోబల్ రిటైలర్లు తమ సోర్సింగ్ నిబంధనల్లో స్థిరత్వ ప్రమాణాలను తప్పనిసరి చేస్తున్నందున, ఎగుమతిదారులకు సుస్థిరత అనేది ఇకపై ఒక ఎంపిక కాదని, ఒక బాధ్యత అని ఆమె స్పష్టం చేశారు.మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వంటి సాంకేతికత ప్రపంచ వస్త్ర పరిశ్రమను వేగంగా మారుస్తూ, కార్మిక ఖర్చులను తగ్గిస్తోందని మంత్రి గుర్తుచేశారు. ఈ మారుతున్న వాతావరణంలో భారతీయ వస్త్ర ఎగుమతిదారులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే... నైపుణ్యాల పెంపు, ఆవిష్కరణలు, డిజైన్ సామర్థ్యాలపై దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయ పరిశ్రమలు ప్రపంచ డిమాండ్కు అనుగుణంగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని సీతారామన్ నొక్కి చెప్పారు. -
అమెరికా డాలర్కు చావేనా? ఇరాన్ ఏం చేసిందంటే..
ప్రముఖ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో రాబోయే ఒక భారీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అమెరికా డాలర్కు పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు.ఇరాన్ దేశం తన చమురు విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ 'యువాన్' (Yuan)లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించిందని, ఇది "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థ అంతానికి నాంది కానుందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.'పెట్రో డాలర్'కు మరణ శాసనం?రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని అభివర్ణించారు."ఇరాన్ చమురు కోసం చైనా యువాన్ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇరాన్తో యుద్ధం కంటే ఇది అత్యంత ఘోరమైన పరిస్థితి. అమెరికా డాలర్ అంతం కాబోతోందా?" అని కియోసాకి ప్రశ్నించారు.ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల సామాన్యులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. మన పాఠశాలల్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ నేర్పరని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన “ఇరాన్ జస్ట్ కిల్డ్ ది పెట్రో డాలర్” అనే పాడ్కాస్ట్ను తప్పకుండా వినాలని కియోసాకి ప్రజలకు సూచించారు."మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి ట్వీట్లో స్పష్టం చేశారు.అసలు ఏమిటీ పెట్రో డాలర్ సంక్షోభం?గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అంతా అమెరికా డాలర్లలోనే సాగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్కు తిరుగులేని ఆధిక్యత లభించింది. అయితే, ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, రష్యా వంటి దేశాలతో పాటు చైనా కూడా డాలర్ రహిత వ్యాపారానికి (De-dollarization) తెరలేపాయి. చమురు వ్యాపారంలో చైనా యువాన్ వాడకం పెరిగితే, అది అమెరికా డాలర్ పతనానికి దారితీస్తుందనే ఆందోళనలు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలనే రాబర్ట్ కియోసాకి తాజాగా తన ట్వీట్ ద్వారా మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.WORSE THAN WAR in IRANDeath of the US Dollar?Iran began accepting payment for oil in Chinese Yuan. What does that mean to you and your future and the future of the US dollar?I strongly encourage you to invest about and hour in your financial education. I strongly…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2026 -
ఉగ్రదేశంలో ఊరట!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ పొరుగు దేశం పాకిస్థాన్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పాక్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా సవరణ ప్రకారం, పెట్రోల్ ధర లీటరుకు రూ.6, హై-స్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ) ధర లీటరుకు రూ.6.80 మేర తగ్గాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించడం ఇది వరుసగా రెండో వారం కావడం గమనార్హం. గత వారం కూడా అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 మేర తగ్గించారు.సవరించిన కొత్త ధరల పట్టికప్రభుత్వ తాజా నిర్ణయం తర్వాత పాకిస్థాన్లో లీటర్ ఇంధన ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.ఇంధనం రకంపాత ధర (లీటరుకు)తగ్గిన ధరప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 409.78రూ. 6.00రూ. 403.78హై-స్పీడ్ డీజిల్రూ. 409.58రూ. 6.80రూ. 402.78గమనిక: విలువ ఆధారంగా భారత రూపాయి, పాకిస్థాన్ రూపాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి.(మే 25న 1 భారత రూపాయి=రూ.2.91 పాకిస్థాన్ రూపాయి)అంతకుముందు ఆకాశాన్నంటిన ధరలుఫిబ్రవరిలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ ఇంధన మార్కెట్ తీవ్ర అస్థిరతకు గురైంది. అప్పటి నుంచి పాక్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ధరలను సమీక్షిస్తోంది. గత కొన్ని నెలలుగా అక్కడ ధరలు ఏ స్థాయిలో పెరిగాయంటే..మార్చి 6: ఇరాన్ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.55 పెంచారు.ఏప్రిల్ 2: అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా పెట్రోల్ ధరల్లో 43 శాతం, డీజిల్ ధరల్లో 55 శాతం మేర భారీ వృద్ధిని ప్రకటించారు.ఈ వరుస పెంపుదల కారణంగా ఒకానొక దశలో ఇంధన ధరలు దాదాపు మూడు రెట్లు(గరిష్టంగా రూ.445 వరకు) పెరిగి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపాయి.భారత్లో పరిస్థితి ఏంటి?అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం భారతదేశంపై కూడా పడింది. అయితే, పాకిస్థాన్తో పోలిస్తే భారత్లో ఈ ధరల పెరుగుదల చాలా స్వల్పంగా, నియంత్రణలోనే ఉంది. ఇటీవలి కాలంలో నాలుగు విడతల సవరణల ద్వారా ఇంధన ధరలను మొత్తంగా సుమారు రూ.7 మేర పెంచారు. సోమవారం జరిగిన తాజా సవరణలో పెట్రోల్ ధరపై రూ.2.61, డీజిల్ ధరపై రూ.2.71 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులను బట్టి రానున్న రోజుల్లో దేశీయ చమురు కంపెనీలు మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
రూపాయి విలువ తగ్గింది కానీ.. బలహీనంగా లేదు!
గ్లోబల్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ వరుసగా క్షీణిస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి తరుగుదల తర్వాత రూపాయి విలువ వాస్తవానికి అది ఉండాల్సిన దానికంటే తక్కువ విలువకే (అండర్ వాల్యూ) ట్రేడ్ అవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు.నామినల్, రీర్ పరంగా తగ్గిన రూపాయి!పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మానసికంగా అత్యంత కీలకమైన డాలర్కు 100 మార్కు వైపు రూపాయి పరుగెడుతున్న తరుణంలో గవర్నర్ మల్హోత్రా మాట్లాడుతూ.. ‘ఇటీవలి క్షీణతను గమనిస్తే రూపాయి విలువ అధికంగా లేదు(అండర్ వాల్యూ). నామమాత్రపు (నామినల్), రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్ (రీర్) పరంగా చూస్తే రూపాయి ఇప్పుడు తక్కువ వాల్యూయేషన్లో ఉంది. అంతేగానీ బలహీనంగా లేదు’ అన్నారు.రీర్ అంటే..భారత వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల సమూహంతో (బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్) పోల్చి ద్రవ్యోల్బణాన్ని కూడా సర్దుబాటు చేసిన తర్వాత రూపాయి అసలు బలాన్ని లెక్కించేదే ఈ రీర్ (రియల్ ఎఫెక్టివ్ ఎక్స్ఛేంజ్ రేట్). దీని ప్రకారం ప్రస్తుతం రూపాయి బలహీనంగా లేదు, కేవలం తక్కువ విలువలో లభ్యమవుతోంది.ఆర్బీఐ లక్ష్యం స్థిరత్వమే!విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో సెంట్రల్ బ్యాంక్ పాత్రపై గవర్నర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ఆర్బీఐ ఎప్పుడూ రూపాయికి ఒక నిర్దిష్ట స్థాయిని లేదా మార్పిడి రేటును లక్ష్యంగా పెట్టుకోదని ఆయన పునరుద్ఘాటించారు. మార్కెట్లో విపరీతమైన అస్థిరత (హై-వొలటాలిటీ)ను అరికట్టడానికి, ఊహాజనిత కదలికల వల్ల రూపాయి తీవ్రంగా నష్టపోకుండా కాపాడటానికి మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రికార్డు కనిష్ట స్థాయిలకు రూపాయి పడిపోతున్న తరుణంలో దానిని స్థిరీకరించేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయిస్తూ మార్కెట్లో తన జోక్యాన్ని వేగవంతం చేసినట్లు గత వారమే రాయిటర్స్ సంస్థ కూడా నివేదించింది.బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్(బొప్)పై ధీమాపశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ భారతదేశ విదేశీ రంగానికి ఎలాంటి ఢోకా లేదని మల్హోత్రా భరోసా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థపై అనవసర ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘ప్రభుత్వం, ఆర్బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండటం అవసరమే కానీ దేశ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (బొప్-ఒక దేశం ప్రపంచంలోని ఇతర దేశాలతో జరిపే ఆర్థిక లావాదేవీలన్నింటినీ నమోదు చేసే వార్షిక లెక్కల చిట్టా) పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదు’ అన్నారు.ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి -
ఇంధన ధరల్లో వ్యత్యాసాలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్), అదనపు పన్నుల కారణంగా లీటర్ ఇంధనానికి వివిధ రాష్ట్రాల్లో వినియోగదారులు చెల్లిస్తున్న ధరల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఇంధన ధరలను విశ్లేషించగా.. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర అత్యధికంగా ఉండగా గుజరాత్లో అత్యల్పంగా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు సంక్షోభాలు వెంటాడుతున్నప్పటికీ, ప్రపంచంలోనే భారత్లో ఇంధన ధరల పెంపు తక్కువగా ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.రూ.115 దాటిన మూడు రాష్ట్రాలుఇటీవలి ధరల సవరణ తర్వాత దేశంలోని మూడు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.115 మార్కును దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఈ జాబితాలో ముందున్నాయి.ఆంధ్రప్రదేశ్ (రూ.117/లీటర్): దేశంలోనే ఇక్కడ ఇంధన ధరలు అత్యధికం. ఏపీ ప్రభుత్వం 31 శాతం వ్యాట్తో పాటు లీటరుకు రూ.4 చొప్పున అదనపు పన్ను, రోడ్ డెవలప్మెంట్ సెస్ విధిస్తోంది. దీనివల్ల ఇక్కడ ఎఫెక్టివ్ పన్ను రేటు దాదాపు 35 శాతానికి చేరుతోంది.తెలంగాణ (రూ.116కు చేరువుగా): తెలంగాణలో కూడా భారీగా వ్యాట్ వసూలు చేస్తుండటంతో లీటర్ పెట్రోల్ ధర రూ.116కు చేరువైంది. కేరళలో బేస్ వ్యాట్తో పాటు సామాజిక భద్రతా సెస్ (సోషల్ సెక్యూరిటీ సెస్) అదనంగా విధిస్తుండటంతో ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. మరోవైపు గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, గోవా, అస్సాం వంటి ఆరు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.104 లేదా అంతకంటే తక్కువగా ఉంది. ఈ ఆరు రాష్ట్రాలూ బీజేపీ పాలిత ప్రాంతాలు కావడం గమనార్హం.తాజాగా రేట్లు (ఈరోజు పెరిగిన పెట్రోల్పై రూ.2.61, డీజిల్ రూ.2.71పై కలిపి) ఢిల్లీ: పెట్రోల్ రూ.102.11, డీజిల్ రూ.95.12 ముంబై: పెట్రోల్ రూ.110.88, డీజిల్ రూ.97.48 హైదరాబాద్: పెట్రోల్ రూ.115.84, డీజిల్ రూ.103.76 కోల్కతా: పెట్రోల్ రూ.112.79, డీజిల్ రూ.99.47 చెన్నై: పెట్రోల్ రూ.108.14, డీజిల్ రూ.99.84 బెంగళూరు: పెట్రోల్ రూ.110.30, డీజిల్ రూ.98.44 పాట్నా: పెట్రోల్ రూ.112.88, డీజిల్ రూ.99.23 జైపూర్: పెట్రోల్ రూ.112.37, డీజిల్ రూ.97.94 తిరువనంతపురం: పెట్రోల్ రూ.114.72, డీజిల్ రూ.103.71 చండీగఢ్: పెట్రోల్ రూ.101.64, డీజిల్ రూ.89.90 విజయవాడ (ఏపీ): పెట్రోల్ రూ.117.96, డీజిల్ రూ.105.79 విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ రూ.116.44, డీజిల్ రూ.103.94 తిరుపతి(ఏపీలో): పెట్రోల్ రూ. 117.08పై, డీజిల్ రూ. 104.75 గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు -
ఆర్థిక వ్యవస్థపై కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
పెట్టుబడులకు సంబంధించిన విషయాలను గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. కొంతమంది ఆర్ధిక నిర్ణయాలు, సాధారణ ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?, చివరికి వాళ్ల ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుంది? అనే విషయాలను వివరాయించారు.ప్రపంచంలో అత్యంత ధనవంతులైన లేదా శక్తివంతులైన కొంతమంది వ్యక్తులు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు సాధారణ ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావం చూపుతాయి. చాలామంది చిన్నప్పటి నుంచి చదువుకోవడం, మంచి ఉద్యోగం చేయడం, పన్నులు చెల్లించడం వంటి నియమాలను పాటిస్తూ జీవితం సాగిస్తారు. ఇవన్నీ పాటించినప్పటికీ.. ఆర్థికంగా స్వేచ్ఛ ఉండదు.డబ్బు వ్యవస్థపై నియంత్రణ ఉన్నవారు.. ఉదాహరణకు, బ్యాంకులు, పెద్ద పెట్టుబడిదారులు, ఆర్థిక సంస్థలు సాధారణ ప్రజల ఆదాయం, పొదుపు, అద్దె, రిటైర్మెంట్ వంటి విషయాలను పరోక్షంగా ప్రభావితం చేస్తారు. ఈ వ్యవస్థలో రెండు రకాల నియమాలు ఉన్నాయి. ఒకటి డబ్బును నియంత్రించే వారు, మరొకటి కష్టపడి పనిచేసే సాధారణ ప్రజలు.ఇదీ చదవండి: అందుకే 'వెండి'కి డిమాండ్: కొత్త ధరలు ఇలా..సాధారణ ప్రజలు చిన్ననాటి నుంచే ఒక వ్యవస్థలోకి ప్రవేశించి, దాని నియమాలను ప్రశ్నించకుండా అనుసరిస్తారు. ఇలా జీవితం గడిపి దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినా.. ఎక్కడ మొదలయ్యారో దాదాపు అక్కడే ఉంటారని కియోసాకి అభిప్రాయపడ్డారు. నిజానికి పెట్టుబడులు, ఇతర వ్యాపారాలు చేసేవాళ్లు తొందరగా ధనవంతులు అవుతారు. ఉద్యోగం చేసి సాఫీగా జీవితం సాగించేవాళ్లకు, ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన నమ్మకం. -
ఆర్బీఐ నుంచి రికార్డు స్థాయిలో డివిడెండ్ బదిలీ!
దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేసేందుకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ భారీ బదిలీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణకు అండగా నిలవనుంది.గత ఏడాది బదిలీ చేసిన రూ.2.68 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువైనప్పటికీ మార్కెట్ నిపుణుల అంచనాల కంటే స్వల్పంగా తక్కువ కావడం గమనార్హం. అదే సమయంలో, పెరిగిపోతున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా తన కంటింజెంట్ రిస్క్ బఫర్ (భవిష్యత్తులో వచ్చే ఊహించని ఆర్థిక నష్టాలు, మార్కెట్ ఒడిదుడుకులు లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి ఆర్బీఐ పక్కన పెట్టే అత్యవసర నిధి) కూడా ఆర్బీఐ గణనీయంగా పెంచింది.ఆర్థిక ఒత్తిళ్ల నడుమ వెసులుబాటుప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరల అస్థిరత, సబ్సిడీల భారం, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి రేటు వంటి సవాళ్లను కేంద్రం ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఆర్బీఐ నుంచి అందిన ఈ రికార్డు డివిడెండ్ ప్రభుత్వ ఖజానాకు గట్టి ఉపశమనాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (ముఖ్యంగా ఇరాన్పై అమెరికా యుద్ధం) కమ్ముకుంటున్న వేళ ద్రవ్యలోటును అదుపులో ఉంచడానికి ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయనే అంశంపై ఆర్థికవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: మిడిల్ మేనేజ్మెంట్ అంతం? -
మూడు రిస్క్ లు పొంచి ఉన్నాయ్..
→ పశ్చిమాసియా సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడేలా లేదు. ఉద్రిక్తతలు మరింత ముదిరితే ముడి చమురు రేటు ఇప్పుడున్న 100 డాలర్ల స్థాయి నుంచి 140 డాలర్లకు ఎగబాకే ప్రమాదం ఉంది. బహుశా జూన్లోనే ఇది జరగవచ్చు. → దీనివల్ల భారత్ ఎకానమీపై తీవ్ర ప్రభావం తప్పదు. ముఖ్యంగా పెట్రో ధరలు మరింత ఎగబాకుతాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. మరోపక్క వృద్ధి మందగిస్తుంది. అయితే, ఈ సమస్య ఒక్క భారత్కే పరిమితం కాదు, ప్రపంచమంతా ఎదుర్కొంటున్నదే. వాస్తవానికి మన ఎకానమీ కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది. → ప్రస్తుతం అధిక చమురు ధరల కంటే సరఫరాపరమైన అడ్డంకుల వల్లే భారత్కు అధిక నష్టం వాటిల్లుతోంది. క్రూడ్ ఒక్కటే కాదు, వంట గ్యాస్, ఎల్ఎన్జీ, ఎరువులు ఇలా అన్నింటికీ సప్లై షాక్ తగులుతోంది. ఒకవేళ పశ్చిమాసియా ఉద్రిక్తతలు త్వరలో శాంతించినప్పటికీ, సరఫరా వ్యవస్థ కుదుటపడేందుకు రెండు మూడు నెలలు పడుతుంది. → క్రూడ్ సెగతో ప్రభుత్వం పెట్రో ధరలను మరింత పెంచాల్సి వస్తుంది. రవాణా, తయారీ వ్యయాలు దూసుకెళ్తాయి. రాబోయే నెలల్లో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. రూపాయి మరింత బలహీనపడుతుంది. → డాలరుతో రూపాయి మారకం విలువ 100 స్థాయికి పడిపోతుండటంపై మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక సైకలాజికల్ నంబర్ మాత్రమే. ఎందుకంటే, కొన్ని అనవసర దిగుమతులను తగ్గించుకోవడం ద్వారా సర్దుబాటు చేసుకోవడానికి వీలుంది. → క్రూడ్ షాక్సహా భౌగోళిక రాజకీయ అనిశ్చితులను తట్టుకునేందుకు భారత్ వద్ద తగినన్ని విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు (దాదాపు 700 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. అధిక దిగుమతుల బిల్లు వల్ల ఇవేమీ తరిగిపోవు, ఒకవేళ ఆర్బీఐ రూపాయి పతనాన్ని (తాజాగా 96.95ని తాకింది) అడ్డుకోవడం కోసం ఉపయోగిస్తేనే అవి వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. → కాబట్టి, రూపాయికి దన్నుగా నిలిచేందుకు ఆర్బీఐ ఎట్టిపరిస్థితుల్లోనూ ఫారెక్స్ నిల్వలను వాడకూడదు. ఎగుమతులకు మద్దతివ్వాలంటే కరెన్సీ విలువను మార్కెట్ వర్గాలే నిర్ణయించేలా చూడాలి. → పశ్చిమాసియా సంక్షోభం తీవ్రమైతే ఆర్థికంగా బలహీన వర్గాలు, చిన్న వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలి. నగదు బదిలీలను మరింత పెంచడం, చిన్న సంస్థలకు మరిన్ని రుణాలివ్వడం, నగదు సరఫరా పెంపు ద్వారా మద్దతివ్వాలి. – గీతా గొపీనాథ్, హార్వర్డ్ యూనివర్సిటీ ఆర్థికవేత్త, ఐఎంఎఫ్ మాజీ డిప్యూటీ ఎండీ -
ఆర్బీఐ డివిడెండ్ బొనాంజా
ముంబై: అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో ద్రవ్య ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న కేంద్ర సర్కారుకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) రికార్డు స్థాయిలో భారీ డివిడెండ్ను ప్రకటించింది. 2024–25 సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ను అందించగా, 2025–26 సంవత్సరానికి 6.7 శాతం పెంచి రూ.2,86,588 కోట్లను ఇవ్వనుంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో సరఫరాలకు ఆటంకాలు ఏర్పడి, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారంగా మారి, రూపాయి బలహీనపడిన తరుణంలో ఆర్బీఐ డివిడెండ్ ప్రభుత్వానికి ఊరటనివ్వనుంది. ఏటా ఆర్బీఐ తన మిగులు నిల్వల నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ను ప్రకటిస్తుండడం తెలిసిందే. బడ్జెలో కేంద్ర సర్కారు పేర్కొన్న పన్నేతర ఆదాయం లక్ష్యంలో ఒక్క ఆర్బీఐ డివిడెండే ఈ ఏడాది 91 శాతంగా ఉండనుంది. అంతర్జాతీయంగా, దేశీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులను, రిస్క్ లను విశ్లేషించిన అనంతరం ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు డివిడెండ్పై నిర్ణయం తీసుకున్నారు. రూ.91.97 లక్షల కోట్లకు బ్యాలెన్స్ షీట్: రిస్క్ లకు, చట్టబద్ధమైన ఖాతాలకు కేటాయింపులు చేయడానికి ముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025–26లో రూ.3.96 లక్షల కోట్లకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.3.13 లక్షల కోట్లుగా ఉంది. బ్యాలెన్స్ షీటు 20.61% పెరిగి రూ.91,97,121 కోట్లకు చేరింది. ‘ఆకస్మిక రిస్క్లను ఎదుర్కొనే నిధి’ (సీఆర్బీ) కోసం బ్యాలెన్స్ షీటులో 4.5–7.5% మధ్య కేటాయింపులు నిర్వహించేందుకు సవరించిన ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ వీలు కల్పిస్తుందని ఆర్బీఐ తెలిపింది. దీంతో 2024–25లో సీఆర్బీకి 7.5%గా ఉన్న కేటాయింపులు 2025–26లో 6.5%కి తగ్గాయి. ఆర్బీఐ ప్రకటించిన రూ.2.87 లక్షల కోట్ల డివిడెండ్ ఈ ఏడాది ప్రభుత్వానికి ఊరటనిస్తుందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ఫలితంగా ప్రస్తుత సవాళ్లను ఇది పూర్తిగా భర్తీ చేయలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కేంద్ర ప్రభుత్వానికి రూ.2.87 లక్షల కోట్లు..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు వేడి తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఊరటనిచ్చే వార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి రూ.2.86,588.46 కోట్ల మిగులు నిధులను (డివిడెండ్) బదిలీ చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అందుకున్న రూ.2.7 లక్షల కోట్ల డివిడెండ్ కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో ఈ నిధుల బదిలీకి బోర్డు ఆమోదం తెలిపింది.అంచనాల కంటే స్వల్పంగా తక్కువ..బ్లూమ్బెర్గ్ వంటి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థలు ఈసారి ఆర్బీఐ దాదాపు రూ.3 లక్షల కోట్ల (31.2 బిలియన్ డాలర్లు) రికార్డు స్థాయి మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయవచ్చని అంచనా వేశాయి. అయితే, ప్రస్తుత బదిలీ ఆ అంచనాల కంటే స్వల్పంగా తక్కువగా నమోదైంది.ఆదాయంలో భారీ వృద్ధిమే 22న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక మీడియా ప్రకటన ప్రకారం.. కేంద్ర బ్యాంక్ స్థూల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 26.42% పెరిగింది. రిస్క్ నిబంధనలకు ముందు ఆర్బీఐ ఖర్చులు 27.60% పెరిగాయి. రిస్క్ ప్రొవిజన్, చట్టబద్ధమైన నిధులకు బదిలీ చేయకముందు ఆర్బీఐ నికర ఆదాయం 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.3,13,455.77 కోట్లు ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరంలో అది రూ.3,95,972.10 కోట్లకు చేరింది. మార్చి 31, 2026 నాటికి రిజర్వ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం 20.61% వృద్ధితో రూ.91,97,121.08 కోట్లకు చేరుకుంది.రిస్క్ బఫర్ పెంపుప్రభుత్వానికి బదిలీ చేసే డివిడెండ్ను పెంచినప్పటికీ, భవిష్యత్తు సవాళ్లను తట్టుకునేందుకు ఆర్బీఐ తన 'కంటింజెంట్ రిస్క్ బఫర్' (ఆకస్మిక ప్రమాదాల నిధి) పరిమాణాన్ని భారీగా పెంచింది. 2026 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యవసర నిధి కింద రూ.1,09,379.64 కోట్ల బదిలీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మునుపటి సంవత్సరంలో ఈ కేటాయింపు కేవలం రూ.44,861.70 కోట్లుగా మాత్రమే ఉండటం విశేషం.ప్రస్తుతం దేశంలో ఇంధన ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లులు భారంగా మారాయి. దీనికి తోడు కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPIs) నిధులను ఉపసంహరించుకోవడం వంటి అంశాలు దేశ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆర్బీఐ నుంచి అందుతున్న ఈ భారీ డివిడెండ్.. కేంద్ర ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక బలమైన రక్షణ కవచంలా (బఫర్గా) ఉపయోగపడనుంది.ఆర్బీఐకి ఈ ఆదాయం ఎలా వస్తుంది?సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం తన వివిధ రకాల పెట్టుబడులు, విదేశీ మారక నిల్వల (Forex Reserves) నిర్వహణ, కరెన్సీ నోట్ల ముద్రణ ద్వారా వచ్చే ఆదాయం నుండి తన ఖర్చులు, రిస్క్ నిధులను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తుంది. ఈ నిధులు ప్రభుత్వ బడ్జెట్ లోటును పూడ్చుకోవడానికి, సంక్షేమ కార్యక్రమాలకు ఎంతో కీలకంగా ఉంటున్నాయి. -
రూ.100 అనేది కేవలం సంఖ్యే.. ఒత్తిడి వద్దు!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోతోంది. ఈ క్రమంలోనే డాలర్కు రూపాయి విలువ ఏకంగా 97 మార్కుకు చేరువ కావడంతో దేశీయ ఆర్థిక వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు.డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 100 మార్కును తాకుతుందనే మానసిక ఒత్తిడి లేదా భయంతో ఆర్బీఐ తన విధానపరమైన నిర్ణయాలను తీసుకోకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్(గతంలో ట్విట్టర్)లో ఆయన పోస్ట్ చేశారు.‘డాలర్ ధర రూ.100 చేరుతుందనే కంగారుతో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 99, 101 లాగే 100 కూడా ఒక మామూలు సంఖ్య మాత్రమే. ప్రస్తుతం ఉన్న చమురు సమస్యల నేపథ్యంలో రూపాయి విలువ సహజంగానే తగ్గడానికి అనుమతించడమే దేశానికి మంచిది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.స్వల్పకాలికం.. దీర్ఘకాలికంచమురు కొరత లేదా ధరల పెరుగుదల సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందనే అంశాన్ని బట్టి ఆర్బీఐ వ్యూహం ఉండాలని, అయితే ఏ పరిస్థితిలోనైనా రూపాయిని బలవంతంగా రక్షించే ప్రయత్నం చేయకూడదని పనగారియా స్పష్టం చేశారు. ఆయన విశ్లేషణ ప్రకారం..సంక్షోభం స్వల్పకాలికమైతే (3 నెలల నుంచి ఏడాది)..చమురు సంక్షోభం తాత్కాలికమే అయితే ఇప్పుడు రూపాయి క్షీణించినప్పటికీ భవిష్యత్తులో చమురు దిగుమతి బిల్లు తగ్గినప్పుడు అది మళ్లీ పుంజుకుంటుంది. పైగా, రూపాయి విలువ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విదేశీ పెట్టుబడులు భారత మార్కెట్ వైపు వేగంగా తరలివస్తాయి. దీనివల్ల కరెన్సీ విలువ సహజంగానే గణనీయంగా కోలుకుంటుంది.సంక్షోభం దీర్ఘకాలికమైతే (కొన్నేళ్ల పాటు సాగితే)..ఒకవేళ ఈ అంతరాయం ఎక్కువ కాలం కొనసాగితే ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్ రిజర్వ్స్) ఖర్చు చేసి రూపాయిని రక్షించాలని చూడటం సరైన నిర్ణయం కాదని పనగారియా అన్నారు. ‘ఇలాంటి స్థితిలో రూపాయి పడిపోవడాన్ని అంగీకరించకుండా వేరే ఏ మార్గాన్ని ఎంచుకున్నా అది నష్టపోవడమే అవుతుంది. రూపాయిని కాపాడుకునే ప్రయత్నంలో నిల్వలు పూర్తిగా అడుగంటిపోయేలా చేస్తే భవిష్యత్తులో మరింత నష్టపోవాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు.‘బ్యాండ్-ఎయిడ్’ పరిష్కారాలు వద్దు..రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి గతంలో ఉపయోగించిన డాలర్ డినామినేటెడ్ బాండ్లు లేదా ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) డిపాజిట్లపై అధిక వడ్డీ ఇవ్వడం వంటి చర్యలను పనగారియా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవి కేవలం తాత్కాలిక ‘బ్యాండ్ ఎయిడ్’ పరిష్కారాలు మాత్రమేనని కొట్టిపారేశారు. ఇవి అత్యంత ఖరీదైన సాధనాలని, వీటి వల్ల వచ్చే లాభాలు కేవలం సంపన్న విదేశీ భారతీయులకే బదిలీ అవుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పెరుగుతుందని విమర్శించారు. ఎప్పటికైనా రూపాయి విలువ రూ.100 మార్కు దాటక తప్పదని, దానికి ఇప్పుడే సిద్ధం కావాలని సూచించారు.Dear @RBI: Do not let the psychology of Rs 100 per dollar determine your policy response. 100 is just a number, like 99 and 101. Whether the oil shortage is short-lived or long-lived, the right response at this moment is to let the rupee depreciate. 1/6— Arvind Panagariya (@APanagariya) May 21, 2026ఇది 2013 నాటి సంక్షోభం కాదు!దేశం తీవ్ర స్థూల ఆర్థిక ఒత్తిడిని, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొన్న 2013 నాటి పరిస్థితులతో ప్రస్తుత పరిస్థితిని పోల్చలేమని పనగారియా స్పష్టం చేశారు. అప్పట్లో దేశంలో ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో (10% పైగా) ఆందోళనకరంగా ఉంది. ఆర్బీఐ తీసుకున్న వివేకవంతమైన ద్రవ్య విధానాల వల్ల ప్రస్తుతం ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంది. అందువల్ల, కరెన్సీ విలువ తరుగుదల (డిప్రిసీయేషన్) కారణంగా వచ్చే స్వల్ప ద్రవ్యోల్బణ ఒత్తిడిని లేదా షాక్ను తట్టుకునే బలమైన స్థితిలో ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ ఉందని ఆయన భరోసా ఇచ్చారు.ఇదీ చదవండి: ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు! -
లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్.. ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ రూల్
ఢిల్లీ: బ్యాంక్ వినియోగదారులకు ఆర్బీఐ శుభవార్త చెప్పింది. లోన్ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెడుతూ ఆర్బీఐ కొత్త డ్రాఫ్ట్ బిల్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులపై ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకోనుంది. రికవరీ ఏజెంట్లు, బ్యాంకు ఉద్యోగుల ప్రవర్తనపై కఠిన నియమాలు అమలు చేయాలని ఆర్బీఐ సూచించింది.బ్యాంకులు బోర్డు ఆమోదించిన రికవరీ, కలెక్షన్ పాలసీని అమలు చేయాలితప్పుగా రికవరీ చేస్తే నష్టపోయిన రుణం తీసుకున్న వారికి బ్యాంకులు పరిహారం చెల్లించాలిరికవరీ ఏజెంట్లకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ సర్టిఫికేషన్ తప్పనిసరిబ్యాంకులు తమ వెబ్సైట్, యాప్లలో రికవరీ ఏజెన్సీల వివరాలు ప్రకటించాలిమొదటి రికవరీ ఏజెంట్ సందర్శనకు ముందు రుణదాతలకు (లోన్ ఎవరైతే తీసుకుంటారో వారికి) సమాచారం ఇవ్వాలిరికవరీ ఏజెన్సీ మార్పు లేదా రద్దు జరిగితే వెంటనే లోన్ తీసుకున్న వినియోగదారులకు తెలపాలిఫిర్యాదులు పరిష్కారం కాని పరిస్థితిలో రికవరీ కేసులు ముందుకు కొనసాగించకూడదు రికవరీ ఏజెంట్ల కాల్స్ రికార్డు చేసి కనీసం ఆరు నెలలు భద్రపరచాలికఠిన రికవరీ పద్ధతులను ప్రోత్సహించే ఇన్సెంటివ్లు నిషేధంరుణగ్రహిత ఆస్తి స్వాధీనం చేసుకునే ముందు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలిఫైనాన్స్ చేసిన డివైస్ను ఫోన్,ల్యాప్ట్యాప్ ఇతర వస్తువులు 90 రోజుల బకాయి తర్వాత మాత్రమే డిసేబుల్ చేయాలిడివైస్ యాక్సెస్ పరిమితం చేయడానికి 21 రోజుల నోటీసు, అదనంగా 7 రోజుల నోటీసు తప్పనిసరితప్పుగా డివైస్ బ్లాక్ చేస్తే గంటకు రూ.250 పరిహారం చెల్లించాలి.రికవరీ ఏజెంట్లు ఐడీ కార్డు, అనుమతి డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలి.రికవరీ కాల్స్, లోన్ తీసుకున్న వ్యక్తులను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే కలవాలిరికవరీ ఫిర్యాదుల కోసం ప్రత్యేక గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేయాలి.మరణం లేదా వివాహం వంటి సందర్భాల్లో రుణదాతల్ని సంప్రదించరాదు’ అని ఆర్బీఐ తన కొత్త డ్రాఫ్ట్ బిల్లులో పేర్కొంది. కాగా, ఆర్బీఐ తాజా డ్రాఫ్ట్ లోన్ రికవరీ నియమాలు మే 20, 2026న విడుదలయ్యాయి. ఈ డ్రాఫ్ట్పై ప్రజలు, బ్యాంకులు, ఇతర స్టేక్హోల్డర్లు తమ అభిప్రాయాలను మే 31, 2026లోపు సమర్పించాలి. తుది అమలు జూలై 1, 2026 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది -
IPL వెలుగులో బెట్టింగ్ ‘చీకటి ఆట’!
ఐపీఎల్ (IPL) సీజన్ను ఆసరాగా చేసుకుని భారతీయ క్రికెట్ అభిమానులను పెద్ద ఎత్తున ముంచేస్తున్న ఒక భారీ అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ను ప్రముఖ సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ 'క్లౌడ్సెక్' (CloudSEK) బట్టబయలు చేసింది. క్లోన్-స్క్రిప్ట్ ప్లాట్ఫారమ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్ఫేక్స్, హ్యాక్ చేసిన ప్రభుత్వ వెబ్సైట్లు, మనీ లాండరింగ్ నెట్వర్క్ల సహాయంతో ఈ ముఠా ఇంతటి భారీ దోపిడీకి పాల్పడుతున్నట్లు సంస్థ తన తాజా పరిశోధనలో వెల్లడించింది.గత వారమే ఐపీఎల్ వీక్షకులను లక్ష్యంగా చేసుకుని నడుస్తున్న నకిలీ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లను గుర్తించిన క్లౌడ్సెక్, తాజాగా ఈ అక్రమ బెట్టింగ్ ఎకానమీ వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని పూర్తిగా మ్యాప్ చేసింది.పరిశోధనలో తేలిన దిగ్భ్రాంతికర నిజాలు1,200కు పైగా నకిలీ డొమైన్లు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫారమ్లను ప్రోత్సహించడానికి 1,200 కంటే ఎక్కువ వెబ్సైట్ డొమైన్లు యాక్టివ్గా పనిచేస్తున్నట్లు క్లౌడ్సెక్ గుర్తించింది.ఒక్క బ్యాకెండ్.. 25 వెబ్సైట్లు: పరిశోధకులు ఒక అక్రమ ప్లాట్ఫారమ్ అడ్మిన్ ప్యానెల్ను యాక్సెస్ చేయగా, కేవలం ఒకే ఒక్క బ్యాకెండ్ సిస్టమ్ నుండి 25కు పైగా వేర్వేరు బెట్టింగ్ వెబ్సైట్లను నడుపుతున్నట్లు తేలింది. దీని ద్వారా యూజర్ల డిపాజిట్లు, బెట్టింగులు, విత్డ్రా రిక్వెస్ట్లను నిందితులు పూర్తిగా నియంత్రిస్తున్నారు.రూ. 4.65 కోట్ల విత్డ్రా నిరాకరణ: మే 2025 నుండి మే 2026 మధ్య కాలంలో, ఈ ఒక్క ప్లాట్ఫారమ్లోనే వినియోగదారులు చేసుకున్న 9,300 లకు పైగా డబ్బు విత్డ్రా రిక్వెస్ట్లను ఏజెంట్లు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు. ఇది సాంకేతిక లోపం కాదు, కేవలం ఒకే ఒక్క క్లిక్తో యూజర్ల సొమ్మును నొక్కేసే ప్రక్రియ. దీని విలువ సుమారు రూ.4.65 కోట్లు ఉంటుందని అంచనా.మనీ మ్యూల్ నెట్వర్క్: నిందితులు బిజినెస్ పేరుతో రిజిస్టర్ అయిన కొన్ని బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్నారు. యూజర్లు డిపాజిట్ చేసే డబ్బును ఈ ఖాతాల ద్వారా ఇతర చోట్లకు మళ్లించి, అసలు సూత్రధారులు ఎవరో దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు.క్రికెటర్ల పేరిట డీప్ఫేక్ వీడియోలు: భారతీయ క్రికెటర్లు, ప్రముఖ కంటెంట్ క్రియేటర్ల ముఖాలను, వాయిస్లను ఏఐ (AI) డీప్ఫేక్ టూల్స్ ద్వారా క్లోన్ చేసి.. వారు ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు నకిలీ వీడియోలను సృష్టిస్తున్నారు. వీటిని ఇన్స్టాగ్రామ్ రీల్స్, టెలిగ్రామ్ ఛానల్స్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు.ప్రభుత్వ వెబ్సైట్ల హ్యాకింగ్: ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనడానికి పలు భారతీయ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను (.gov.in) కూడా హ్యాక్ చేసి, వాటిలో ఈ అక్రమ బెట్టింగ్ లింకులను (Backlinks) చొప్పించారు. గూగుల్ సెర్చ్లో ప్రభుత్వ సైట్లకు ఉండే గుర్తింపును వాడుకుని యూజర్లను బురిడీ కొట్టిస్తున్నారు.ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనంలో పడి సామాన్యులు భారీగా నష్టపోవడమే కాకుండా, ఆ తర్వాత వారిని టార్గెట్ చేస్తూ నకిలీ లోన్ యాప్ల ద్వారా కూడా వేధింపులకు గురిచేస్తున్నట్లు క్లౌడ్సెక్ నివేదిక స్పష్టం చేసింది. క్రికెట్ అభిమానులు ఇలాంటి అనధికారిక, అక్రమ బెట్టింగ్ సైట్లకు దూరంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పునరుత్పాదక ఇంధన రంగంలోకి భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ పునరుత్పాదక ఇంధన రంగం (సోలార్, పవన విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపన) పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించనుంది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలోకి 110–120 బిలియన్ డాలర్ల (రూ.11.52 లక్షల కోట్లు) మేర పెట్టుబడులు రానున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 7 లక్షల ఎకరాల భూ సమీకరణ కోసమే సుమారు 10–15 బిలియన్ డాలర్ల (రూ.96,000–1,44,000 కోట్లు) పెట్టుబడులు అవసరమని తెలిపింది. 2025 చివరికి పునరుత్పాదక విద్యుదుత్పత్తి కేంద్రాల స్థాపిత సామర్థ్యం 250 గిగావాట్లకు చేరుకున్నట్టు తెలిపింది. 2015 నాటికి ఉన్న 80 గిగావాట్లతో పోలి్చతే మూడు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. 2026 మార్చి నాటికి స్థాపిత సామర్థ్యం 275 గిగావాట్లకు చేరినట్టు పేర్కొంది. 2030 నాటికి 270–300 గిగావాట్ల సోలార్, పవన విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా తోడు కానున్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. 2026–2030 కాలంలో 6.5 లక్షల ఎకరాలు ఒక్క సోలార్ ఇన్స్టాలేషన్లకే అవసరమవుతుందని.. మిగిలిన 50వేల ఎకరాలు పవన విద్యుత్కు కావాల్సి వస్తుందని పేర్కొంది. 500 మెగావాట్ల లక్ష్యం సాధ్యమే సోలార్ ప్రాజెక్ట్ల ఏర్పాటు కోసం ఒక్కో మెగావాట్కు రూ.3–4 కోట్లు, పవన విద్యుత్ ప్రాజెక్ట్ల (భూమిపై)కు సంబంధించి ఒక మెగావాట్ సామర్థ్యం కోసం రూ.8–9 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని కొలియర్స్ ఇండియా తెలిపింది. దేశీయంగా తయారీ సామర్థ్యాలు మరింత మెరుగుపడుతున్నందున 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని సులభంగానే చేరుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. అప్పటికి ఒక్క సోలార్ ప్రాజెక్టుల సామర్థ్యమే 400–450 గిగావాట్ల మేర ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం 146 గిగావాట్ల సామర్థ్యం మేర ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతున్నట్టు తెలిపింది. పునరుత్పాదక విద్యుత్ రంగం శరవేగంగా విస్తరిస్తుండడం రియల్ ఎస్టేట్ రంగానికి అవకాశాలు కలి్పస్తుందని.. ముఖ్యంగా భూ సమీకరణ, పునరుత్పాదక ఆధారిత పారిశ్రామిక పార్కుల్లో అవకాశాలు ఉంటాయని అంచనా వేసింది. -
భారత్ వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో 2026 సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి (యూఎన్) స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గత అంచనా 6.6 శాతాన్ని 6.4 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా సంక్షోభం మరో షాక్గా ఈ నివేదిక అభివరి్ణంచింది. ఇది ప్రపంచ వృద్ధిని మందగింపజేయడంతోపాటు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను, అనిశ్చితులను పెంచినట్టు వివరించింది. ప్రస్తుత ప్రపంచ ప్రతికూల సవాళ్ల నుంచి భారత్కూ మినహాయింపు లేదని యూఎన్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ విభాగం సీనియర్ ఆర్థికవేత్త ఇంగో పిట్టర్లే వ్యాఖ్యానించారు. ‘‘భారత్ ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లపై ప్రభావం తదతర ఒత్తిళ్లు సైతం నెలకొన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల కఠినతరంతో మానిటరీ పాలసీ మరింత సంక్లిష్టంగా మారింది’’ అని పిట్టర్లే వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఎలా స్పందిస్తాయన్నదే కీలకమన్నారు. ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనా సైతం తగ్గింపు 2026 సంవత్సరానికి గాను ప్రపంచ స్థూల జీడీపీ వృద్ధి రేటు అంచనాను సైతం 2.5 శాతానికి యూఎన్ తగ్గించింది. జనవరిలో వేసిన అంచనా కంటే 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, కరోనా మహమ్మారికి ముందున్న సాధారణ వృద్ధి రేటు కంటే ఇది చాలా తక్కువని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బలంగానే ఆర్థిక మూలాలు.. భారత్ వృద్ధి 2025లో ఉన్న 7.5 శాతం నుంచి 2026లో 6.4 శాతం తగ్గడమన్నది ప్రధానంగా ఇంధన దిగుమతి వ్యయాలు పెరిగిపోవడం వల్లేనంటూ.. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దేశీయంగా వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు, సేవల రంగ ఎగుమతుల్లో చక్కని పనితీరు కారణంగా భారతదేశంలో నిర్మాణాత్మకంగా బలమైన వృద్ధి కనిపిస్తున్నట్టు పేర్కొంది. తిరిగి 2027 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకునే దేశాలకు వ్యయాలు పెరిగినప్పుడు ఎగుమతులు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చని యూఎన్ డైరెక్టర్ ఆఫ్ ఎకనమిక్ అనలైసిస్ శంతను ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు, డీజిల్ వంటి ఇంధన ధరలు పెరిగినప్పుడు వ్యాపార వ్యయాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లాగే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్కు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉందన్నారు. అయితే, ప్రస్తుతమున్న మిగులు నిల్వలు కరిగిపోయే లోపే ఈ షాక్లను ఎంత సమర్థవంతంగా అధిగమించగలదన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. -
మ్యూచువల్ ఫండ్స్పై రుణాలిస్తాం
సాక్షి, బిజినెస్ డెస్క్: యువ రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ రిటర్నులు వచ్చే బ్యాంకు డిపాజిట్ల కన్నా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. దీనితో బ్యాంకులకు వస్తున్న డిపాజిట్లపరమైన వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. ప్రజల పొదుపు విధానాలు మారుతున్న నేపథ్యంలో యువ కస్టమర్లను ఆకర్షించేందుకు, రుణాల వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కొత్త రూటును ఎంచుకుంటున్నాయి. డిజిటల్ విధానంలో ఫండ్స్పై రుణాలివ్వడం మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం కెనరా బ్యాంక్ గతేడాదే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యాపార విభాగాన్ని మరింతగా విస్తరిస్తోంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇటీవల మార్చిలో దీన్ని ప్రవేశపెట్టింది. అటు కరూర్ వైశ్యా బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్ కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేవడంపై కసరత్తు చేస్తున్నాయి. నెలా, రెణ్నెల్లలో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలా ఫండ్స్పై లోన్ విధానంలో అధిక వడ్డీ రేట్లు ఉండే వ్యక్తిగత రుణాలను తీసుకోవాల్సిన అవసరం లేకుండా రుణగ్రహీతలు తమ దగ్గరున్న ఫండ్ యూనిట్లను తనఖాగా ఉంచి లోన్ తీసుకోవచ్చు. అదే సమయంలో తమ పెట్టుబడులను నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం కూడా ఉండదు. 35 ఏళ్ల లోపు వారి పొదుపులో సింహభాగం వాటా మ్యూచువల్ ఫండ్స్దే ఉంటోందని కరూర్ వైశ్యా బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్థిక అత్యవసరాల కోసం ఇలా ఫండ్స్పై రుణాలు లభిస్తే, తక్కువ లాభాలకో లేదా నష్టాలకో యూనిట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి కస్టమర్లు ఈ విధానం వైపు మళ్లుతున్నారని పేర్కొన్నాయి. మ్యూచువల్ ఫండ్స్పై రుణాలనేవి ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్నాయని, మార్కెట్ ఆధారిత ఫండ్స్కి ప్రాధాన్యం పెరిగే కొద్దీ వీటికి మరింత ఆదరణ లభించగలదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సంక్లిష్ట ప్రక్రియ .. ఫండ్స్పై రుణాలివ్వడమనేది సంక్లిష్టమైన ప్రక్రియ. తనఖా ఉంచిన ఫండ్ యూనిట్లను పక్కన పెట్టేలా మార్క్ చేసేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలతో బ్యాంకులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ వ్యవస్థలను అనుసంధానం చేసేందుకు బ్యాంకులు డిజిటల్ మౌలిక సదుపాయాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. సాధారణంగా డిపాజిట్ల విలువలో 80–90% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. ఫండ్ యూనిట్లు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి. కాబట్టి వాటి విలువ లో 50 శాతమే రుణం ఇచ్చే అవకాశం ఉంటోంది.రూ. 82 లక్షల కోట్లకు ఫండ్స్.. దేశీ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) గత దశాబ్దకాలంగా అనేక రెట్లు పెరిగింది. మ్యుచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాల ప్రకారం 2016లో ఏప్రిల్ ఆఖరు నాటికి రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఏయూఎం ఈ ఏడాది ఏప్రిల్ ఆఖరు నాటికి దాదాపు ఆరు రెట్లు ఎగిసి రూ. 82 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సర్వే ప్రకారం కుటుంబాల వార్షిక పొదుపులో ఈక్విటీ, మ్యుచువల్ ఫండ్స్ వాటా 2012 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతమే ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది ఏకంగా 15.2 శాతానికి పెరిగింది. అదే సమయంలో బ్యాంకు డిపాజిట్ల వాటా 58 శాతం నుంచి 35 శాతానికి తగ్గింది. -
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
భారతదేశం తన అవసరానికి మించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికి పరిష్కారం ప్రభుత్వ విధానాల్లో కంటే, ప్రజల లాకర్లలోనే ఉందని ఆనంద్ రాథి వెల్త్ జాయింట్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 2 నుండి 4 శాతం వరకు విక్రయించాలని ఆయన కోరారు. ఇది త్యాగం కాదు, దేశం కోసం చేసే ఒక రకమైన "ఆర్థిక దేశభక్తి" అని ఆయన అభివర్ణించారు.భారత్లో సమస్యగా బంగారం భారతీయ కుటుంబాల వద్ద సమిష్టిగా దాదాపు 4 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.4 కోట్ల కోట్లు) విలువైన బంగారం ఉంది. ఇందులో చాలా వరకు వాడకుండా లాకర్లలో ఖాళీగా పడి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం వరకు 35 బిలియన్ డార్లుగా ఉన్న భారతదేశ వార్షిక బంగారం దిగుమతులు, ఇప్పుడు ఏకంగా 75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడానికి, రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణమవుతోంది.పోయిన విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత మార్కెట్ నుండి రూ.1,68,000 కోట్లు (17–18 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ, మన దేశ బంగారం దిగుమతి బిల్లు దీని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.100 గ్రాముల విక్రయంతో వచ్చే మార్పుఈ ప్రతిపాదన ఎంత ఆచరణాత్మకమైనదో చెప్పడానికి అజీజ్ కొన్ని లెక్కలను వివరించారు. ఒక కుటుంబం తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 100 గ్రాములను (ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.15-16 లక్షలు) విక్రయిస్తే ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.. ఆనంద్ రాథి సంస్థ పరిధిలోని 13,800 కుటుంబాలు ఇలా చేస్తేనే దాదాపు రూ.2,500–3,000 కోట్ల బంగారం తిరిగి మార్కెట్లోకి వస్తుంది.ఇదే విధంగా దేశంలోని సంపన్న కుటుంబాలన్నీ చేస్తే, బంగారం దిగుమతులను సులభంగా 40 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు. ప్రజలు విక్రయించే బంగారం ఆభరణాలు, పారిశ్రామిక అవసరాల కోసం మార్కెట్లో పునర్వినియోగంలోకి వస్తుంది. తద్వారా కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.ఇది త్యాగం కాదు... లాభాల స్వీకరణ !బంగారం ధరలు ప్రస్తుతం చారిత్రక గరిష్టాల వద్ద ఉన్నాయి. ఈ సమయంలో కొంత బంగారాన్ని విక్రయించడం అనేది దేశానికి మేలు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా స్మార్ట్ పోర్ట్ ఫోలియో నిర్వహణ (లాభాలను ఖాతాలో వేసుకోవడం) అవుతుందని అజీజ్ పేర్కొన్నారు."ఈక్విటీ మార్కెట్లలో లాభాలు స్వీకరించినట్లే, బంగారంలోనూ భారీ ర్యాలీ వచ్చింది. కాబట్టి మీ బంగారంపై 3-4% లాభాలను దేశం కోసం బుక్ చేసుకోండి" అని ఆయన పిలుపునిచ్చారు.గడిచిన 10 ఏళ్ల కాలంలో బంగారం రూపాయి పరంగా కేవలం 8.5% వార్షిక రాబడిని మాత్రమే ఇచ్చింది. దీని కంటే 'సుకన్య సమృద్ధి యోజన' (8.25% వడ్డీ, పన్ను రహితం) వంటి ఇతర పొదుపు పథకాలు పన్నులన్నీ పోనూ మెరుగైన లేదా సమానమైన లాభాలను అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ప్రభుత్వానికీ విజ్ఞప్తిఈ ప్రచారంలో భాగంగా బంగారం విక్రయించిన రశీదులను సమర్పించాలని అజీజ్ ప్రజలను కోరుతున్నారు. దీని ద్వారా తగినంత మద్దతును కూడగట్టి, బంగారం విక్రయాలపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నుండి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ వేయాలని ఆయన భావిస్తున్నారు. -
ఆరు నెలల గరిష్టానికి నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగం ఏప్రిల్లో స్వల్పంగా పెరిగింది. మార్చిలో ఉన్న 5.1 శాతం నుంచి 5.2 శాతానికి చేరింది. 2025 ఏప్రిల్లోనూ 5.1 శాతంగానే ఉండడం గమనార్హం. 15 ఏళ్ల వయసుకు మించి పనిచేసే జనాభాకు సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ శుక్రవారం విడుదల చేసింది. చివరిగా 2025 అక్టోబర్లోనూ 5.2 శాతం స్థాయిలో నిరుద్యోగం నమోదైంది. ⇒ పట్టణాల్లో నిరుద్యోగం కాస్తంత దిగొచ్చింది. మార్చిలో ఉన్న 6.8 శాతం నుంచి ఏప్రిల్లో 6.6 శాతానికి తగ్గింది. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4.6 శాతానికి పెరిగింది. ⇒ 2025 ఏప్రిల్తో పోల్చితే మాత్రం గ్రామీణ, పట్టణ నిరుద్యోగంలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ⇒ పట్టణ పురుషుల్లో నిరుద్యోగం మార్చిలో 5 శాతంగా ఉంటే, ఏప్రిల్లో 5.1 శాతానికి చేరింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గింది. ⇒ దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు 5.3 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. గ్రామీణ మహిళల్లో 4.4 శాతం నుంచి 4.1 శాతానికి తగ్గగా.. పట్టణ మహిళల్లోనూ 9 శాతం నుంచి 8.5 శాతానికి తగ్గుముఖం పట్టింది. ⇒ కార్మికుల భాగస్వామ్య రేటు ఏప్రిల్లో 55 శాతానికి పరిమితం అయింది. మార్చిలో ఇది 55.4 శాతంగా ఉంది. -
రూపాయి మరో కొత్త కనిష్టం..
ముంబై: భగ్గుమంటున్న క్రూడాయిల్ రేట్లు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, డాలరు బలపడుతుండటం లాంటి ప్రతికూల పరిణామాలతో రూపాయి మారకం విలువ వేగంగా కరిగిపోతోంది. మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 50 పైసలు క్షీణించి సరికొత్త ఆల్టైమ్ కనిష్టం 96.70కి పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 96.20తో పోలిస్తే మరింత తక్కువగా 96.38 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ .. ఇంట్రాడేలో 96.27కి పెరిగింది. కానీ అది నిలబెట్టుకోలేక చివరికి 50 పైసలు క్షీణతతో ముగిసింది. దీనితో గత ఎనిమిది సెషన్లలో 2.64 శాతం (రూ. 2.48) మేర పతనమైనట్లయింది. తద్వారా ఆసియాలోనే అత్యధికంగా పతనమైన కరెన్సీగా నిల్చింది. డాలరు బలపడటం, అమెరికా ట్రెజరీ ఈల్డ్లు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటంలాంటి అంశాలు రూపాయిపై ఒత్తిడిని పెంచుతున్నాయని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. అయితే, పసిడి, వెండిపై దిగుమతులపై ఆంక్షలు, ఆర్బీఐ జోక్యంతో కనిష్ట స్థాయిల్లో రూపాయికి కొంత మద్దతు లభించవచ్చని పేర్కొన్నారు. స్పాట్ మార్కెట్లో 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు. -
పెరిగిన వంట నూనె ధరలు.. కారణం ఇదే!
వంటనూనెల దిగుమతులు 2025–26 నూనెల సీజన్లో (నవంబర్–ఏప్రిల్) 13 శాతం పెరిగి 7.94 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. ముఖ్యంగా పామాయిల్ దిగుమతులు భారీగా పెరిగినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) ప్రకటించింది. అంతక్రితం సంవత్సరం ఇదే కాలంలో దిగుతులు 7.04 మిలియన్ టన్నులుగా ఉన్నాయి.విలువ పరంగా చూస్తే రూ.73,000 కోట్ల నుంచి రూ.87,000 కోట్లకు చేరాయి. మొత్తం నూనెల దిగుమతుల్లో వంటనూనెలు 7.82 మిలియన్ టన్నులుగా ఉంటే, 1,21,000 టన్నులు నాన్ ఎడిబుల్ నూనెలు ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు దాదాపు రెట్టింపై 3.97 మిలియన్ టన్నులకు చేరాయి. సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెల దిగుమతులు 3.85 మిలియన్ టన్నులకు తగ్గాయి.పామాయిల్ ధరలు 14–15 శాతం, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెల ధరలు 17–22 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా డాలర్తో రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి. మే చివరికి దేశంలో మొత్తం నూనె నిల్వలు 2.12 మిలియన్ టన్నులకు చేరాయి. -
డేటా ఆధారంగా చర్యలు
అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో.. సరఫరా పరమైన సమస్యలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయా? మానిటరీ పాలసీ పరమైన చర్య అవసరమా? అన్నది పరిశీలిస్తూ ఉంటామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025 నుంచి ఆర్బీఐ తటస్థ విధానాన్ని అనుసరిస్తున్నట్టు గుర్తు చేస్తూ, డేటా విషయంలో తగిన విధంగా స్పందించడానికి ఇది వీలు కల్పిస్తుందన్నారు.ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ అంశంపై మాట్లాడారు. భారత్కు తరచుగా సరఫరా సమస్యలు ఎదురవుతున్నట్టు చెప్పారు. ‘‘ధరలు అదే పనిగా పెరుగుతూ, వేతన భారానికి, ఉత్పత్తి, రవాణా వ్యయాలకు దారితీస్తే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లకు కారణమవుతుంటే అప్పుడు విధానాన్ని కఠినతరం చేయాల్సి వస్తుంది’’అని మల్హోత్రా వివరించారు. ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యానికి మరో 2 శాతం వరకు వెసులుబాటు ఉన్న నేపథ్యంలో స్వల్పకాలంలో సరఫరా సమస్యలను ఆర్బీఐ సర్దుబాటు చేసుకోగలదన్నారు.అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఇంకా కొనసాగుతున్న తరుణంలో, స్థూల ఆర్థిక పరమైన ప్రభావాలు ఇంకా పూర్తి స్థాయిలో వెలుగుచూడాల్సి ఉందన్నారు. మానిటరీ పాలసీ కఠినతరం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే వాటిని తెలియజేసే విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆర్బీఐ ఎంపీసీ తదుపరి పాలసీ సమీక్ష జూన్ 3 నుంచి 5 వరకు జరగనుంది.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
జారిపోతున్న రూపాయి..
ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల పరిణామాల ప్రభావాలతో రూపాయి మారకం విలువ గణనీయంగా పతనమవుతోంది. డాలరుతో పోలిస్తే మరో 39 పైసలు క్షీణించి 96.20కి పడిపోయింది. సోమవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 95.81తో పోలిస్తే మరింత తక్కువగా 96.19 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 96.39కి కూడా క్షీణించి చివరికి 96.20 వద్ద క్లోజయ్యింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో క్రూడాయిల్ రేట్లు పెరుగుతుండటం, డాలరు బలోపేతం కావడం తదితర అంశాలతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. రాబోయే రోజుల్లోను ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, అయితే, బంగారం, వెండి దిగుమతులపై ఆంక్షలతో పాటు ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ గానీ జోక్యం చేసుకోవడంలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే కనిష్ట స్థాయిల్లో రూపాయికి మద్దతుగా నిలవొచ్చని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. స్పాట్ మార్కెట్లో రూపాయి 96–96.60 శ్రేణిలో తిరుగాడవచ్చని వివరించారు. -
బులియన్ బ్యాంక్ కావాలి
న్యూఢిల్లీ: పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు, అదే సమయంలో ఆభరణాల తయారీకి అవసరమైన పసిడిని దేశీయంగానే సమకూర్చుకునేందుకు జ్యుయలరీ పరిశ్రమ ఓ ఆసక్తికరమైన ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెట్టింది. బులియన్ బ్యాంక్ను ఏర్పాటు చేయాలని కోరింది. తద్వారా దేశంలోపలే నిరుపయోగంగా ఉన్న పసిడిని వినియోగంలోని తీసుకురావచ్చని సూచించింది. ఆల్ ఇండియా జ్యుయలర్స్ అండ్ గోల్డ్స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ఇళ్లు, సంస్థలు, పెట్టుబడి వాహకాలు కలిగి ఉన్న బంగారాన్ని సమీకరించి జ్యుయలరీ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని ఆభరణాల పరిశ్రమ మంత్రిని కోరింది. బులియన్ బ్యాంక్ ప్రతిపాదనపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటును పరిశీలిస్తామని ఈ సందర్భంగా మంత్రి నుంచి హామీ లభించింది. ఈ కమిటీని కనుక ఏర్పాటు చేస్తే అందులో ప్రభుత్వం, ఆభరణాల రంగం, బులియన్ మార్కెట్, ఆర్థిక సంస్థలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని ఆ వర్గాలు తెలిపాయి.బ్యాంక్ మాదిరే.. ప్రతిపాదిత బులియన్ బ్యాంక్ అన్నది కేంద్రీకృత సంస్థగా పనిచేయనుంది. ఈ బ్యాంక్ దేశీయంగా ఉన్న పసిడిని సమీకరించి, అరువు కింద పరిశ్రమకు ఇస్తుంది. ఇళ్లలోని, సంస్థల నిర్వహణలోని (గోల్డ్ ఈటీఎఫ్లు) బంగారాన్ని సమీకరించి.. ఆభరణాల సంస్థలు, ఎగుమతిదారులు, రిఫైనరీలు, తయారీదారులకు సరఫరా చేయనుంది. ఇళ్లు, సంస్థల వద్ద 25,000–35,000 టన్నుల పసిడి ఉంటుందని అంచనా. గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) సైతం పెద్ద మొత్తంలో భౌతిక బంగారాన్ని (పెట్టుబడులకు బ్యాకెండ్గా) ఖజానాల్లో కలిగి ఉన్నాయని ఏఐజేజీఎఫ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈటీఎఫ్ల్లోకి వచ్చే ప్రతి రూపాయి తాజా పెట్టుబడికి అనుగుణంగా పసిడి దిగుమతులకు అదనపు డిమాండ్ ఏర్పడుతుందని పేర్కొంది. కనుక బులియన్ బ్యాంక్ ద్వారా ఈటీఎఫ్లు తమ నిర్వహణలోని భౌతిక బంగారంలో 20–30 శాతాన్ని బాడుగ కింద ఇచ్చేందుకు అనుమతించాలని సూచించింది. దీనివల్ల ఆభరణాల వినియోగానికి సంబంధించి పసిడి దిగుమతుల డిమాండ్ను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది పరిశ్రమ సూచన. రూపాయి విలువను, ఫారెక్స్నిల్వలను కాపాడుకునేందుకు పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం ఇటీవలే 6 శాతం నుంచి 15 శాతానికి పెంచడం తెలిసిందే. అలాగే, ఆభరణాల ఎగుమతిదారులకు అడ్వాన్స్డ్ అథరైజేషన్ స్కీమ్ కింద పసిడి దిగుమతులను కఠినతరం చేయడంతో పరిశ్రమ ఈ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఎన్ఎస్ఈలో ఈజీఆర్ల ట్రేడింగ్ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్లు)లో లైవ్ ట్రేడింగ్ ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. నియంత్రిత స్పాట్ గోల్డ్ మార్కెట్ను అభివృద్ధి చేసేందుకు ఇది సాయపడుతుందని పేర్కొంది. అహ్మదాబాద్, ముంబైలో సేకరణ, ఖజానా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు.. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరులోనూ కొత్త కేంద్రాలను సోమవారం నుంచి యాక్టివేట్ చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 120 కేంద్రాలకు నెట్వర్క్ను విస్తరించనున్నట్టు తెలిపింది. సెబీ నమోదిత ఖజానాల్లో భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, ఆ రిసీట్స్పై స్టాక్ ఎక్సే్ఛంజ్లో ట్రేడింగ్కు వీలుగా అందుబాటులోకి వచ్చిందే ఈజీఆర్. -
డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!
తాజాగా నెదర్లాండ్స్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు దేశ ఆర్థిక స్థితిగతులపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘సామూహిక పేదరికం తిరిగి రావడం’, ‘విపత్తుల దశాబ్దం’ (డికేడ్ ఆఫ్ డిజాస్టర్స్) అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ముందే దేశీయంగా చమురు, బంగారం దిగుమతులను తగ్గించుకోవాలని, విదేశీ వస్తువులపై ఆధారపడటం మానుకోవాలని ఆయన భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితిపై కొంతమంది నిపుణుల మనోగతం కింది విధంగా ఉంది.ఈ వ్యాఖ్యలు వినగానే మనకు పాత రోజులు గుర్తొస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ ఒక రకమైన సంక్షోభంలోకి ప్రవేశించినప్పుడల్లా.. ప్రధానులు దేశభక్తిని మేల్కొలిపి విదేశీయుల నుంచి కొనుగోళ్లు తగ్గించుకోమని కోరడం పరిపాటిగా మారింది.70 ఏళ్లలో 9 సార్లు!మన ఆర్థిక చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. 1955, 1965, 1974, 1980, 1991, 1998, 2012, 2020.. ఇప్పుడు 2026. గడిచిన 70 ఏళ్లలో ఏకంగా తొమ్మిది సార్లు దేశం ఇదే తరహా డాలర్ల కొరతను, చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దేశీయంగా ఉన్న సప్లై గ్యాప్ (సరఫరా లోటు)ను భర్తీ చేయడానికి అవసరమైన డాలర్లు మన వద్ద లేకపోవడమే వీటికి మూలకారణం.1972 వరకు ప్రధాన లోటు ఆహార ధాన్యాల్లో ఉండేది. క్రమంలో దాన్ని అధిగమించే స్థాయికి చేరుకోగలిగాం. 1980 తర్వాత ఈ లోటు ఇంధనం (చమురు, గ్యాస్) రూపంలోకి మారింది. మన పొరుగు దేశమైన చైనాకు కూడా ఈ రెండు లోటూ ఉన్నాయి. కానీ, వారు ఈ డాలర్ల సంక్షోభాన్ని మనకంటే మెరుగ్గా నిర్వహించగలిగారు. ఈ పరిస్థితిలో.. మన దేశంలో ఈ సరఫరా లోటు దశాబ్దాలుగా ఎందుకు కొనసాగుతోంది? మనం ఈ డాలర్ల కొరతను ఎందుకు అధిగమించలేకపోతున్నాం? అనే కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.హరిత విప్లవం విజయం.. పారిశ్రామిక రంగంలో ఎందుకు సాధ్యం కాలేదు?వ్యవసాయ రంగంలో ఉన్న లోటును మనం హరిత విప్లవం ద్వారా విజయవంతంగా అధిగమించాం. స్వయంసమృద్ధిని సాధించాం కాబట్టే, 1979లో వచ్చిన తీవ్ర కరువు ప్రభావం 1980 నాటికి దేశంపై పడకుండా నిలిచింది. కానీ, ఇంధన లోటును మాత్రం గత 45 ఏళ్లుగా మనం పరిష్కరించలేకపోయాం. చమురు కొనడానికి డాలర్లు కావాలి, ఆ డాలర్లు రావాలంటే ఎగుమతులు పెరగాలి. కానీ మన ఎగుమతులు ఎప్పుడూ అంతంత మాత్రమే.ఇంధన విధానంలో లోపంమన దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ పర్యావరణ కారణాల వల్ల దాన్ని పక్కనబెట్టి చమురు, గ్యాస్ వంటి ఇతర హైడ్రోకార్బన్లపై ఆధారపడ్డాం. ఇది మన ఇంధన సంక్షోభాన్ని మరింత పెంచింది. దీనికంటే ముఖ్యమైన మరో కారణం.. గత 60 ఏళ్లుగా మన పాలకులు అనుసరించిన అస్తవ్యస్త పారిశ్రామిక విధానాలు. పారిశ్రామిక వస్తువులను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాల్సింది పోయి, వాటిని భారీగా దిగుమతి చేసుకునే స్థితికి చేరుకున్నాం. ఫలితంగా డాలర్ల సంపాదన తగ్గిపోయింది.సంక్షోభం రావడం.. మళ్లీ మర్చిపోవడం!ప్రతిసారీ సంక్షోభం తీవ్రమైనప్పుడు ప్రభుత్వం డాలర్లను పొదుపు చేయమని చెప్తుంది. ఆ సమయానికి ఆ నిర్ణయం సరైనదే అనిపించినా దీర్ఘకాలికంగా చూస్తే ఇది అత్యంత హాస్యాస్పదమైన వ్యూహం. సంక్షోభం తొలిగిపోగానే మనం ఆ సమస్యను పూర్తిగా మర్చిపోయి విజయం సాధించామంటూ వీధుల్లో వేడుకలు చేసుకుంటాం. మళ్లీ కొన్నాళ్లకు అదే తప్పు చేస్తాం. ఈ దుస్థితి చూసి చాలా మంది ఆర్థికవేత్తలు తలలు పట్టుకుంటున్నారు.ఈ సమస్య పరిష్కారానికి గతంలో డజనుకు పైగా ఉన్నత స్థాయి కమిటీలు వేయడంతో చాలా సిఫార్సులు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో సాధించింది శూన్యం. దీనికి ఎవరిని నిందించాలి? రాజకీయ నాయకులనా, బ్యూరోక్రాట్లనా, పారిశ్రామికవేత్తలనా, గత వ్యూహకర్తలనా? సమాధానం ఒక్కటే.. వ్యవస్థలో అందరూ భాగస్వాములే అయినప్పుడు ఎవరి ఒక్కరినో బాధ్యులను చేయలేం.ప్రజాస్వామ్యం వర్సెస్ ఆర్థిక వృద్ధిఆర్థికవేత్త వాల్టర్ రోస్టో 1960లో తన ‘స్టేజెస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్’ పుస్తకంలో రాజకీయ వ్యవస్థల గురించి ప్రస్తావించలేదు. కానీ, రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు ఆర్థిక ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. చరిత్రను పరిశీలిస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. దశాబ్దాల తరబడి అత్యధిక ఆర్థిక వృద్ధి రేటును మూటగట్టుకున్న దేశాల్లో ప్రజాస్వామ్య పద్ధతులు ఉండవు. అవి ప్రజాస్వామ్య దేశాలుగా మారిన మరుక్షణమే వాటి వృద్ధి రేటు మందగిస్తుంది.ఆర్థిక నమూనాప్రధాన లక్షణంవృద్ధి రేటుహక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థప్రజల హక్కులు, ఉచితాలు, రాయితీలకు ప్రాధాన్యతతక్కువ, అస్థిరమైన వృద్ధిబాధ్యతల ఆధారిత ఆర్థిక వ్యవస్థజాతీయ ప్రయోజనాలు, ఉత్పత్తి, క్రమశిక్షణకు ప్రాధాన్యతస్థిరమైన, అత్యధిక వృద్ధిభారతదేశం ఎప్పటికీ ‘హక్కుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ’ గానే కొనసాగుతుంది. అలాంటప్పుడు గత 70 ఏళ్ల తప్పులను పునరావృతం చేయకుండా ఎలా ఉండాలన్నదే మన ముందున్న ప్రశ్న.ఆలోచన విధానం మారకపోతే..ఈ గందరగోళాన్ని ఎలా చక్కదిద్దాలో అందరికీ తెలుసు. గత నాలుగు దశాబ్దాలుగా పరిష్కారాలు మన కళ్లముందే ఉన్నాయి. కానీ వాటిలో కొన్నింటిని మాత్రమే అమలు చేసి, మెజారిటీ సూచనలను పక్కనబెట్టాం. ఒకేసారి డజన్ల కొద్దీ భిన్నమైన లక్ష్యాలను పెట్టుకుని అన్నింటికీ సమాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. కుక్క తన తోకను తాను పట్టుకోవడానికి తిరిగినట్లు ఉంది. శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ.ప్రస్తుత దశాబ్దం విపత్తులతోనే సాగుతోంది, మున్ముందు మరిన్ని సవాళ్లు రావచ్చు. కానీ, మన పాలకుల ఆలోచనా విధానం, ఆర్థిక విధానాలు సరైన దిశలో ఉండి ఉంటే.. ఈ విపత్తులు దేశాన్ని సామూహిక పేదరికం వైపు నెట్టేంత ప్రమాదకరంగా మారేవి కావు. ఇప్పటికైనా తాత్కాలిక ఉపశమన చర్యలు పక్కనపెట్టి ఎగుమతులను పెంచే దీర్ఘకాలిక పారిశ్రామిక, ఇంధన సంస్కరణలపై దృష్టి పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో డాలర్ మన ఆర్థిక వ్యవస్థకు ఒక శాపంగానే మిగిలిపోతుంది.ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి! -
ద్రవ్యోల్బణం తప్పదా.. EMIలు పెరుగుతాయా?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా దెబ్బతినడంతో.. అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు కేవలం విదేశీ మార్కెట్లకే పరిమితం కాకుండా, భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇది దేశీయంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈఎంఐలు కట్టేవారిపై భారం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇరాన్ సంక్షోభం కారణంగా.. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్ పెరగడం.. సరఫరా తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగం దిగుమతులపై ఆధారపడటంతో.. ఈ ధరల పెరుగుదల నేరుగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి.చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI)పై ఒత్తిడి పెంచుతుంది. ఫలితంగా నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా పెరిగిపోతాయి. ఇలాంటి సమయంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ (RBI) రెపో రేటును పెంచే అవకాశం ఉంది.నెలవారీ బడ్జెట్పై ప్రభావం!ఆర్బీఐ రేపో రేటును పెంచితే.. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతాయి. ఫలితంగా హోమ్ లోన్, వెహికల్ లోన్, పర్సనల్ లోన్ తీసుకున్న వారి ఈఎంలు పెరుగుతాయి. ఇది వారి నెలవారీ బడ్జెట్ను ప్రభావితం చేసే అవకాశం ఉంది.అంతర్జాతీయ ఇంధన సంక్షోభం ఒక వైపు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుండగా, మరోవైపు దేశీయ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేసే పరిస్థితిని తీసుకొస్తోంది. ఇంధన సరఫరా త్వరగా స్థిరపడకపోతే.. రాబోయే దీపావళి నాటికి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: చైనా తరహాలో భారత్!: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే? -
పశ్చిమాసియా, క్రూడ్పై కన్ను!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే భారీగా ఎగబాకిన క్రూడ్ ధరలకు తోడు విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి ఈ వారం మన సూచీలకు కీలకంగా నిలుస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘తుపాను ముందు ప్రశాంతత’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్తో పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ భయాలు మొదలయ్యాయి. హార్మూజ్ జలసంధిలో అడ్డంకుల కారణంగా క్రూడాయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 109 డాలర్లకు ఎగబాకింది. ఈ రెండు అంశాలపైనే ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టిసారిస్తారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చమురు సెగ కారణంగా రోజుకో సరికొత్త కనిష్టాలకు పడిపోతున్న రూపాయి, మరోపక్క, ద్రవ్యల్బణం భారీగా పెరిగిపోవడం కూడా ట్రేడింగ్ సెంటిమెంట్పై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ‘అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, క్రూడ్ ధరలపై దాని ప్రభావం, ద్రవ్యోల్బణం, ప్రపంచవ్యాప్తంగా రిస్క్ సెంటిమెంట్ను మార్కెట్ వర్గాలు నిశింతంగా గమనిస్తాయి. సమీప కాలంలో మార్కెట్లకు ఇంధన ధరలు, రూపాయి కదలికలే కీలకం’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వ్యాఖ్యానించారు. భారీ ఒడిదుడుకులు... ‘ఇరాన్–అమెరికా ఉద్రిక్తలపైనే అందరి కళ్లూ ఉన్నాయి. దీనిపైనే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఆధారపడి ఉంది. ఈ నేథ్యంలో చర్చల పురోగతి, క్రూడ్ రేట్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చు’ అని ఎన్రిచ్ మనీ సీఈఓ ఆర్. పోన్ముడి పేర్కొన్నారు. రూపాయిపై ఫోకస్... యుద్ధ భయాలకు తోడు, పెట్రో ధరల పెంపు, ప్రధాని పొదుపు చర్యల ప్రభావంతో గతవారం రూపాయి మరింత క్షీణించిన సంగతి తెలిసిందే. డాలరు మారకంలో ఏకంగా 96 స్థాయిని కూడా దాటేసి, కొత్త ఆల్టైమ్ కనిష్టానికి జారిపోయింది. క్రూడ్ ధరలు మరింత ఎగబాకితే రూపాయి క్షీణత కొనసాగవచ్చని, ఇది మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపుందని పోన్ముడి తెలిపారు. గణాంకాలు, ఫలితాలపైనా దృష్టి... అమెరికా, చైనా, భారత్లలో విడుదలయ్యే కీలక స్థూల ఆర్థిక గణంకాలు, అలాగే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమావేశ వివరాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నారు. క్యూ4 ఫలితాల సీజన్ చివరి దశ నేపథ్యంలో రంగాల వారీగా స్టాక్స్లో హెచ్చుతగ్గులకు ఆస్కారం ఉంది. ఈ వారం ఐఓసీ, బీపీసీఎల్, గెయిల్, ఎన్టీపీసీ తదితర ఫలితాలు ఉన్నాయి.గతవారమిలా... ప్రధాని పొదుపు పిలుపు ఎఫెక్ట్తో పాటు క్రూడ్ ధరల జోరు, రూపాయి పతనం వంటి ప్రతికూలతలతో గత వారం మార్కె ట్లు భారీ నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2,090 పాయింట్లు (2.7%) పడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 533 పాయింట్లు (2.2%) క్షీణించింది.తిరోగమనంలోనే విదేశీ ఇన్వెస్టర్లు... భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, క్రూడ్ సెగలు, రూపాయి పతన ప్రభావంతో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) మన మార్కెట్లో అమ్మకాల జోరు మరింత పెంచారు. వరుసగా మూడో నెలలోనూ రివర్స్గేర్లోనే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,048 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది మొత్తం రూ.2,2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ను నికరంగా విక్రయించినట్లు ఎన్ఎస్డీఎల్ డేటా వెల్లడించింది. 2025 మొత్తం ఏడాదిలో నికర విక్రయాలు రూ.1.66 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాదిæ దీనికి రెట్టింపు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశాలున్నాయనేది మార్కెట్ వర్గాలు అంచనా.సాంకేతికంగా చూస్తే... ఈ వారం కూడా దేశీ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో నిఫ్టీ పడితే, 23,500 వద్ద తొలి మద్దతు, 23100 స్థాయిలో రెండో మద్దతు ఉండొచ్చు. పెరిగితే 23,800 వద్ద తక్షణ నిరోధం ఉంటుంది. దానిపైన నిలదొక్కుకుంటే 24,000–24,100 వరకు పెరగవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గోల్డ్ కొనాలా.. వద్దా..
‘కొంతకాలం బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోండి’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మోదీ పిలుపుతో కొనుగోళ్లు ఆపాలని కొందరు , ఏడాది పాటు వాయిదా వేయాలని మరికొందరు చర్చలకు దిగారు ఇప్పటికే కొనేశాంగా మరి అమ్మేయాలా అని అనేకమంది సందిగ్ధంలో పడ్డారు. సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఈటీఎఫ్లుగా కొంటున్నవారు ఏంచేయాలో తోచక అయోమయంలో పడ్డారు. అయితే ప్రధాని పిలుపు ఒక రకమైన కొనుగోలుదారులకు పూర్తిగా వర్తిస్తుంది. మరొక వర్గం కొనుగోలుదారులకు అంతగా సంబంధం ఉండకపోవచ్చు. కానీ చాలా మందికి తాము ఏ రకమైన బయ్యర్లో తెలీదు. అది తెలిస్తే మీరు బంగారం కొనాలో, అమ్మాలో, కొనసాగించాలో నిజంగా ఏంచేయాలో స్పష్టమవుతుంది. క్రూడ్, చమురు దిగుమతుల కారణంగా విదేశీ మారకద్రవ్యంపై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు ప్రధాని మోదీ గత వారం చేసిన బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలన్న పిలుపును బాధ్యత గల పౌరులుగా సీరియస్గా తీసుకోవాల్సిందే. పతనమవుతున్న రూపాయి , పశ్చిమ ఆసియాలో అస్థిర పరిస్థితి, పెరుగుతున్న దిగుమతి బిల్లు వంటి కారణాలను ప్రధాని ప్రస్తావించారు. అయితే ఈ పిలుపునకు అందరూ ఒకేరకంగా స్పందించాల్సిన అవసరంలేదు. సరదాగా, ఆడంబరం కోసం, ఫ్యాషన్గా ప్రదర్శించుకునేందుకు మీరు నగలు కొనేవారైతే ఈ పిలుపు మీకు పూర్తిగా వర్తిస్తుంది. కానీ పెట్టుబడి కోసం బంగారం కొనాలి అనుకుంటే ఆపడానికి ఆలోచించాల్సిందే. అదెలాగో తెలుసుకుందాం...ప్రధాని పిలుపు అసలు అర్థం ఏమిటి?భారతదేశం వినియోగించే బంగారంలో 99 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే వస్తుంది. దేశంలో గణనీయమైన స్థాయిలో బంగారం తవ్వకం జరగదు. నగలు, నాణేలు, బార్లు ఏ రూపంలో అయినా బంగారం కొనడానికి ఖర్చు చేసే ప్రతి రూపాయి డాలర్ల రూపంలో దిగుమతులకే వెళ్తుంది. డాలరు మారకంలో రూపాయి విలువ 96 స్థాయికి పతనమై ఒకవైపు దిగుమతి బిల్లు పెరుగుతున్న సమయంలో బంగారం డిమాండ్ పెరగడం ఆర్థిక పరిస్థితిని మరింత కఠినతరం చేస్తోంది. ఎందుకంటే బంగారం దిగుమతులకు ప్రభుత్వం డాలర్లలోనే చెల్లిస్తుంది. డిమాండ్ పెరిగితే డాలర్లు భారీగా బయటకు వెళ్తాయి. దాంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే కీలకమైన దిగుమతులైన చమురు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు అన్నీ ఖరీదవుతాయి. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అది చివరికి సాధారణ కుటుంబాలపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రధాని పిలుపులో భావోద్వేగం కన్నా గణాంకాలకే మనం ప్రాధాన్యం ఇవ్వాలి.ఎవరి కోసం...ఈ పిలుపు అత్యంత ప్రభావం చూపేది జ్యువెలరీ కొనుగోలుదారులపైనే. ఎందుకంటే నగలలో బంగారం విలువతో పాటు 10 నుంచి 15 శాతం వరకు మేకింగ్ చార్జీలు, జీఎస్టీ కూడా ఉంటాయి. ఇవి తిరిగి రికవర్ కాని ఖర్చులు. అంటే నగలను పెట్టుబడిగా భావించే వారు , కొనుగోలు చేసిన క్షణం నుంచే తమ సంపదను అంతకన్నా ఎక్కువ శాతంగా అంచనా వేస్తారు. నగలు అనేవి వినియోగం కోసమే. పెట్టుబడి కోసం కాదు. అందుకే ప్రధాని పిలుపు వీరిని ఉద్దేశించి చేసిందిగా గమనించాలి.బంగారం పని సంపద పెంచడం కాదు ...రక్షణ ఇవ్వడంప్రధాని పిలుపును పాటించాలా వద్దా అనుకునే ముందు, మీ పోర్ట్ఫోలియోలో బంగారం అసలు ఏ పని చేస్తుందో ముందుగా అర్థం చేసుకోవాలి. బంగారంపై పెట్టుబడి పోర్ట్ఫోలియోలో 5 నుంచి 10 శాతం వరకు ఉండటం సరైనదిగా పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు భావిస్తారు. అది సంపదను వేగంగా పెంచడానికి కాదు. ఒక రకమైన ఇన్సూరెన్స్లా పనిచేయడానికి. ఈక్విటీలు దీర్ఘకాలంలో సంపదను పెంచుతాయి. డెట్ ఇన్స్ట్రుమెంట్లు మూలధనాన్ని కాపాడి వడ్డీ ఇస్తాయి. బంగారం పని మాత్రం వేరు. రూపాయి బలహీనపడినప్పుడు లేదా ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు, బంగారం సాధారణంగా తన విలువను నిలబెట్టుకుంటుంది. ఆసమయంలో ఇతర పెట్టుబడులను కాపాడేది బంగారం. ఆ పరిస్థితులకు హెడ్జింగ్గా బంగారాన్ని అలొకేషన్లో ఉంచుతారు.నగలు, ఈటీఎఫ్లు ఎస్జీబీలు పూర్తిగా భిన్నందిగుమతుల స్థాయిలో చూస్తే బంగారం అంటే బంగారమే. దేశంలో జ్యువెలరీ తయారీ దారులు గోల్డ్ బార్లు దిగుమతి చేసుకుని నగలుగా మారుస్తారు. గోల్డ్ ఈటీఎఫ్లు , గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా తమ యూనిట్లకు బ్యాకింగ్గా ఫిజికల్ గోల్డ్ కొనాల్సి ఉంటుంది. కాబట్టి దిగుమతి భారంలో పెద్ద తేడా ఉండదు. ఇక్కడ అసలు తేడా దిగుమతుల్లో కాదు. దానికి చేసే వ్యయంలో ఉంది.గోల్డ్ఈటీఎఫ్లు – మ్యూచువల్ ఫండ్లు గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు కూడా ఫిజికల్ గోల్డ్ దిగుమతులపైనే ఆధారపడతాయి. వీటి విషయంలో మేకింగ్ చార్జీలు ఉండవు. గోల్డ్ విలువపై జీఎస్టీ ఉండదు. తిరిగి అమ్ముకోవడం కూడా తేలిక.ఎస్జీబీలే నిజమైన మినహాయింపుసావరిన్ గోల్డ్ బాంండ్ల (ఎస్జీబీ)కు మాత్రమే నిజమైన ప్రత్యేక మినహాయింపు వర్తిస్తుంది. బాండ్ల విషయంలో ప్రభుత్వం బంగారం ధరలకు అనుసంధానమైన ఒక పేపర్ ఇన్స్ట్రుమెంట్ను జారీ చేస్తుంది. ఇందులో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు లేదా దిగుమతి అవసరం ఉండదు. ఇష్యూ సమయంలో కొనుగోలు చేసిన వారు ఎనిమిదేళ్లు హోల్డ్ చేస్తే, 2.5 శాతం వార్షిక వడ్డీతో పాటు మెచ్యూరిటీ సమయంలో ట్యాక్స్ ఫ్రీ లాభాన్ని పొందేవారు. అయితే ఇప్పుడు కొత్త సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూలు ఆగిపోయాయి. చివరిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు సంవత్సరాల క్రితం కొత్త ట్రాంచ్ను విడుదల చేసింది.ఇప్పుడు చేయాల్సింది ఏమిటి?మీ గోల్డ్ ఈటీఎఫ్లు గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లను కలిపి లెక్కించండి. నగలను లెక్కలోకి తీసుకోకండి. ఎందుకంటే అవి వినియోగానికి ఉద్దేశించినవి. మొత్తం పెట్టుబడుల్లో బంగారం శాతం ఎంత ఉందో చూడండి. అది 5 నుంచి 10 శాతం మధ్యలో ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 శాతం కంటే తక్కువైతే పోర్ట్ఫోలియో సమతుల్యత కోసం కొంత కొని పెంచుకోవచ్చు.10 శాతం దాటితే కొంత తగ్గించి ఆవచ్చే డబ్బును ఈక్విటీ, డెట్ లేదా క్యాష్ వైపు మార్చడం మంచిది. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి మార్కెట్ టైమింగ్ వల్ల ఈ పనిచేయడంలేదు. రీబ్యాలెన్సింగ్ మాత్రమే చేస్తున్నాం. బంగారాన్ని ఇన్సూరెన్స్లా చూడండి. ఇన్సూరెన్స్ను ఎవరైనా అవసరం వచ్చినప్పుడు కాదు, ముందుగానే కొనుగోలు చేస్తారు. బంగారంపై పెట్టుబడి కూడా అంతే.. పెరుగుతున్నపుడు కొనడం సరైన పెట్టుబడి విధానం కాదు. ప్రధాని పిలుపు బంగారం వినియోగం కోసం కొనేవారి విషయంలో సరైనదే. ముఖ్యంగా నగలు కొనేవారు దానిని సీరియస్గానే తీసుకోవాలి. ఇప్పటికే 5 నుంచి 10 శాతం సరైన గోల్డ్ అలొకేషన్ కలిగిన పెట్టుబడిదారు తన పోర్ట్ఫోలియోను కదిలించాల్సిన పనిలేదు. మొదటి నుంచి పెట్టుబడి ప్రణాళిక సరైనదైతే ఇప్పుడు చేయాల్సింది దానికి కట్టుబడి ఉండటమే.చరిత్ర ఏం చెబుతోంది?2013లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తమ బాండ్ కొనుగోళ్లను తగ్గిస్తామని సంకేతాలు ఇచ్చింది. దాంతో రూపాయి సహా అనేక ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీలు బలహీనపడ్డాయి. 2020 కరోనా సంక్షోభం, 2022 ఎనర్జీ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరిగింది. ప్రతి సందర్భంలో రూపాయి బలహీనపడగా, ఈక్విటీలు నష్టపోగా, గోల్డ్ ధరలు మాత్రం పెరిగాయి. ఆ సమయంలో కొంత బంగారం కలిగి ఉన్న పోర్ట్ఫోలియోలు మాత్రమే సంక్షోభాన్ని తట్టుకుని నిలబడ్డాయి. ఇక్కడ గమనించాల్సింది ఒకటే బంగారం మిమ్మల్ని ధనవంతులను చేయడానికి కాదు, మీ సంపద పెంచడానికి కాదు మార్కెట్ కష్టకాలంలో మీ ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని.– సాక్షి, వెల్త్ డెస్క్ -
నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం!
బంగారం అనేది భారతదేశంలో కేవలం విలువైన లోహం మాత్రమే కాదు,.. అది కుటుంబ గౌరవానికి ప్రతీక, భద్రతకు సంకేతం, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తిగా పరిగణిస్తారు. అలాంటి బంగారాన్ని.. ప్రభుత్వం రహస్యంగా దేశం దాటించింది అంటే?.. ఎవరైనా నమ్ముతారా?, కానీ 1991లో ఇదే జరిగింది. ఇంతకీ మన దేశం బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది?, ఎంత బంగారం పంపింది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1991లో దేశం దివాలా తీసే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారాన్ని బ్రిటన్కు తరలించింది. సుమారు 46,910 కేజీల బంగారాన్ని రహస్యంగా తరలించి.. బదులుగా 405 మిలియన్ డాలర్ల అత్యవసర రుణం సమీకరించింది. భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచిన ఈ సంఘటన, తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన విదేశీ బ్యాంకులు!1980ల చివరి దశ నుంచి 1990ల ప్రారంభం వరకు భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు కూడా గణనీయంగా తగ్గిపోయింది.ఫలితంగా భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా క్షీణించి, 1991 మే నాటికి కేవలం ఒక వారం రోజుల దిగుమతులకు సరిపడే డాలర్లు మాత్రమే మిగిలాయి. ఈ పరిస్థితిని గమనించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత క్రెడిట్ రేటింగ్ను తగ్గించేశాయి. దీంతో విదేశీ బ్యాంకులు భారత్కు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభ అంచుకు చేరుకుంది.సాహసోపేతమైన నిర్ణయం!దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కున్న సమయంలో.. అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ నాయకత్వంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ట కంటే ముందు ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండటం అవసరమని భావించిన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారు నిల్వలను తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేశారు.మొదటి దశలో.. 1991 మే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల స్వాధీనం చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్లోని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 215 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని సమీకరించారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో.. రెండో దశలో 1991 జూలైలో ఆర్బీఐ తన సొంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు రహస్యంగా తరలించి అత్యవసర రుణాన్ని పొందింది.రహస్యంగా తరలింపు!1991 జూలై 4న బంగారం రవాణా విమానం ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి రహస్యంగా బయలుదేరింది. ఆర్బీఐ భద్రగారాల నుంచి ప్రత్యేక భద్రత మధ్య భారీ ట్రక్కులలో బంగారాన్ని విమానాశ్రయానికి తరలించారు. ఈ ఆపరేషన్ను అత్యంత గోప్యంగా నిర్వహించేందుకు కస్టమ్స్ నిబంధనల్లో కూడా ప్రత్యేక మినహాయింపులు పొందారు.సాయుధ భద్రతా బలగాల పర్యవేక్షణలో బంగారాన్ని కార్గో విమానాల్లో ఎక్కించి విదేశాలకు పంపించారు. అయితే ఈ రహస్య ఆపరేషన్ ఎక్కువకాలం దాచిపెట్టలేకపోయారు. 1991 జూలై 8న ‘ది ఇండియన్ ఎక్స్ప్రెస్’లో జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ ఈ వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. భారతదేశం తన బంగారాన్ని విదేశాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆ నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ!ఆ సమయంలో దేశాన్ని ఆర్థిక పతనం నుంచి కాపాడిన ఈ కఠిన నిర్ణయం, తరువాత భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పునాది వేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేసింది. విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, మార్కెట్ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ లభించింది.బంగారాన్ని విదేశాలకు పంపాల్సి రావడం అప్పట్లో చాలామందికి అవమానంగా అనిపించినప్పటికీ, ఆ నిర్ణయం తీసుకోకపోతే భారత్ అంతర్జాతీయ అప్పులు చెల్లించలేని పరిస్థితికి చేరుకునేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ రోజున చేపట్టిన ఆ రహస్య గోల్డ్ ఆపరేషన్నే.. నేటి భారత ఆర్థిక పురోగతికి కీలక మలుపు అని చెబుతున్నారు.మోదీ పిలుపు1991లో గల్ఫ్ యుద్ధం కారణంగా భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ప్రస్తుతం 2026లో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ చమురు ధరలను పెంచుతూ భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం విదేశీ మారకద్రవ్యంపై మరింత భారం మోపుతోంది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలను ఉద్దేశించి అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. కాబట్టి దేశ పౌరులు కూడా.. 1991 నాటి సంఘటన గుర్తు చేసుకుంటూ, నేటి తరం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
పసిడి దిగుమతులు భారం
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులు ఏప్రిల్లో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 81.69 శాతం పెరిగి 5.62 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.53,390 కోట్లు) చేరాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వెండి దిగుమతులు సైతం 157 శాతం పెరిగి 411 మిలియన్ డాలర్లకు (రూ.3,904 కోట్లు) చేరాయి. అయితే, మే 13 నుంచి పసిడి, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన నేపథ్యంలో రానున్న నెలల్లో ఇవి తగ్గుముఖం పడతాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. వెండిని పారిశ్రామిక అవసరాలకు సైతం వినియోగిస్తున్నందున సుంకం పెంపు ప్రభావం దిగుమతులపై తక్కువే ఉండొచ్చన్నారు. కాకపోతే వినియోగ ఆధారిత అవసరాలు దిగొస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద యూఏఈ నుంచి పసిడి దిగుమతులు గణనీయంగా తగ్గినట్టు చెప్పారు. యూఈఏతో మన దేశానికి వాణిజ్య ఒప్పందం ఉండడంతో అక్కడి నుంచి వచ్చే పసిడిపై సుంకాల్లో 1% రాయితీ ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) బంగారం దిగుమతులు విలువ పరంగా అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 24%పెరిగి 71.98 బిలి యన్ డాలర్లకు చేరడం గమనార్హం. పరిణామం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులుగా ఉన్నా యి. వెండి దిగుమతులు కూడా విలువ పరంగా 150% ఎగసి 12 బిలియన్ డాలర్లకు, పరిమాణంపరంగా 42%పెరిగి 7,335 టన్నులకు చేరాయి. పుంజుకున్న వస్తు ఎగుమతులు అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అనిశి్చతుల మధ్య దేశ ఎగుమతుల రంగం ఏప్రిల్లో బలమైన పనితీరు చూపించింది. వస్తు ఎగుమతులు 43.56 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది నాలుగేళ్లలోనే నెలవారీ గరిష్ట రికార్డు. → వస్తు దిగుమతులు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 10 శాతం ఎగసి 71.94 బిలియన్ డాలర్లకు చేరాయి. → వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం) 28.38 బిలియన్ డాలర్లకు విస్తరించింది. → ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఎగుమతులు 40 శాతం (క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) పెరిగి 5.17 బిలియన్ డాలర్లకు చేరాయి. → పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు సైతం 34.66 శాతం ఎగసి 9.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. → ఇంజనీరింగ్ ఎగుమతులు 8.76 శాతం, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు 7.12 శాతం చొప్పున పెరిగాయి. → యూఎస్–ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి ద్వారా రవాణాకు ఆటంకాలు ఏర్పడడంతో.. పశ్చిమాసియా ప్రాంతానికి ఎగుమతులు ప్రభావితమయ్యాయి. 28 శాతం తగ్గి 4.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఆ ప్రాంతం నుంచి మన దేశానికి దిగుమతులు సైతం 31.64% తగ్గి 10.47 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → ముడి చమురు దిగుమతులు ఏప్రిల్లో 10 శాతం క్షీణించి 18.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → సేవల ఎగుమతులు 37.24 బిలియన్ డాలర్లకు చేరాయి. 2025 ఏప్రిల్లో ఉన్న 32.85 బిలియన్ డాలర్లతో పోల్చితే 14 శాతం వరకు పెరిగాయి. సేవల దిగుమతులు 16.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
వాహనదారుల్లో ఆందోళన.. ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
‘రాబోయే ఆదివారం నుంచి పెట్రోల్ బంకులు పనిచేయవు...’ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఒక వైరల్ పోస్ట్ సారాంశం ఇది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, హరియాణా, పుదుచ్చేరి వంటి ప్రముఖ రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్ పంపులు పూర్తిగా మూసివేస్తారనేది ఆ సందేశం సారాంశం. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులా కనిపించేలా సృష్టించిన ఈ నకిలీ పోస్ట్ వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లో వేలాది సార్లు షేర్ కావడంతో వాహనదారుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఇంధన ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ సున్నితమైన అంశాన్ని ఆసరాగా చేసుకుని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు చెప్పింది.పీఐబీ ఫ్యాక్ట్ చెక్ఈ వైరల్ సందేశం ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వ అధికారిక సమాచార సంస్థ పీఐబీ ఫ్యాక్ట్-చెక్ బృందం రంగంలోకి దిగింది. ఈ వాదనపై సమగ్ర దర్యాప్తు జరిపిన సంస్థ ఇదొక తప్పుడు ప్రచారమని తేల్చిచెప్పింది.‘దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనూ ఆదివారాల్లో పెట్రోల్ పంపులను మూసివేయాలని ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమే. పౌరులెవరూ ఇలాంటి ధ్రువీకరించని సమాచారాన్ని నమ్మవద్దు. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయవద్దు’ అని పీఐబీ విజ్ఞప్తి చేసింది.అకస్మాత్తుగా ఎందుకిలా?ప్రస్తుతం పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరుడుగట్టిన ఇంధన లభ్యత కొరత ఏర్పడింది. భారతదేశం తన ముడి చమురు అవసరాల్లో సింహభాగం దిగుమతుల పైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తగా ఇంధనాన్ని పొదుపుగా వాడటం ఎంతో కీలకం. ప్రధాని పిలుపు వెనుక ఉన్న అసలు ఉద్దేశం సంసిద్ధత మాత్రమే కానీ, భయాందోళనలు సృష్టించడం కాదు.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
డాలర్తో పోలిస్తే 96 మార్కు.. కారణాలివే..
భారత కరెన్సీ రూపాయి విలువ పతనం ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మునుపెన్నడూ లేని విధంగా అత్యంత దిగువ స్థాయికి పడిపోయింది.ఈ రోజు (మే 15, 2026) ట్రేడింగ్ సెషన్లో రూపాయి విలువ 96 మార్కును దాటి రికార్డు స్థాయిలో 96.07 కనిష్ఠ స్థాయికి పతనమైంది. గడిచిన సెషన్లో 95.95 వద్ద ముగిసిన రూపాయి, నేడు ఉదయం డాలర్తో పోలిస్తే 95.74 స్థాయిల వద్ద బలహీనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత ముడి చమురు ధరల పెరుగుదల, ఇరాన్-యూఎస్ ఉద్రిక్తతల కారణంగా మరింత క్షీణించి 0.3% నష్టంతో 96.05 వద్ద కొనసాగుతోంది. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు రూపాయి విలువ దాదాపు 7% మేర క్షీణించడం గమనార్హం.రూపాయి పతనానికి గల కారణాలు..బ్యారెల్ 110 డాలర్లకు చేరిన ముడి చమురుపశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్ను కుదిపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా సాగే కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేయడంతో గత 11 వారాలుగా చమురు ధరలు గరిష్ట స్థాయిల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 109 డాలర్ల వద్ద కదులుతుండగా యూఎస్ బెంచ్మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూఐటీ) బ్యారెల్కు 105 డాలర్ల స్థాయికి చేరుకుంది. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. చమురు వ్యాపారం అంతా డాలర్లలోనే జరుగుతుంది కాబట్టి, ధరలు పెరిగినప్పుడల్లా భారత్కు డాలర్ల అవసరం పెరిగి రూపాయిపై తీవ్ర ఒత్తిడి పడుతోంది.ఆగని ఎఫ్పీఐల విక్రయాలు..దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ/ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ఈ ఏడాది 2026లో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఇది గత ఏడాది (రూ.1.54 లక్షల కోట్లు) అవుట్ఫ్లో రికార్డును సైతం అధిగమించింది.మే 14 ఎన్ఎస్ఈ డేటా ప్రకారం: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నికరంగా రూ.146 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు.ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు విదేశీ పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. తైవాన్, దక్షిణ కొరియా వంటి టెక్నాలజీ హబ్లుగా ఉన్న మార్కెట్లలోకి ఈ నిధులు మళ్లుతుండటంతో భారత రూపాయి విలువ మరింత బలహీనపడుతోంది.ఫలితాన్ని ఇవ్వని ట్రంప్, జిన్పింగ్ సమావేశంహార్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించే విషయంలో చైనా మధ్యవర్తిత్వం వహిస్తుందని, తద్వారా అమెరికా-ఇరాన్ సంక్షోభం సద్దుమణుగుతుందని మార్కెట్లు ఆశగా ఎదురుచూశాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య జరిగిన రెండు గంటల సుదీర్ఘ శిఖరాగ్ర సమావేశం ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. చర్చలు నమ్మశక్యం కాని విధంగా సాగాయని ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ యుద్ధ ప్రతిష్టంభనపై స్పష్టత రాకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లు నిరాశ అలుముకుంది. అమెరికా విధాన నిర్ణేతల (యూఎస్ ఫెడ్) వ్యాఖ్యలు, అక్కడ వెలువడిన ఆర్థిక గణాంకాలు డాలర్ను మరింత బలోపేతం చేశాయి.భారత్పై పడే ప్రభావం ఏమిటి?రూపాయి విలువ ఇలాగే 96 దిగువన కొనసాగితే దేశీయంగా ‘ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్’ (దిగుమతి చేసుకున్న ద్రవ్యోల్బణం) ముప్పు పొంచి ఉంది. ఇంధన ధరలతో పాటు రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారం కానున్నాయి. విదేశీ విద్య, ప్రయాణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. అయితే, రూపాయి విలువ విపరీతంగా పడిపోకుండా అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన విదేశీ నిల్వల (ఫారెక్స్ రిజర్వ్స్) ద్వారా మార్కెట్లో జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు తిరిగి రావడంపైనే రూపాయి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: ఇరవై ఏళ్లలో మారిన ఇంధన సమీకరణాలు! -
లీటర్ రూ.47 నుంచి రూ.110.. ఎందుకిలా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. అయితే, ఈ అభివృద్ధికి ఊతమిచ్చేది మాత్రం ముడి చమురే. అంతర్జాతీయంగా ఇంధన ధరల్లో వచ్చే ప్రతి చిన్న మార్పు సామాన్యుడి జేబుపైనే కాకుండా దేశ బడ్జెట్పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మే 15, 2026 నాటి తాజా పరిణామాల నేపథ్యంలో గత రెండు దశాబ్దాల (2006-2026) చమురు విపణిని, దేశీయ ధరల ఒడిదొడుకులను విశ్లేషిద్దాం.2006 నాటి ఇంధన ముఖచిత్రంసరిగ్గా రెండు దశాబ్దాల క్రితం అంటే 2006లో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు సగటున 60 నుంచి 65 డాలర్ల మధ్య ఊగిసలాడేవి. ఆ సమయంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నేటితో పోలిస్తే చాలా తక్కువగా ఉండేవి.2006లో ధరలు (న్యూఢిల్లీలో)..పెట్రోల్ లీటర్: సుమారు రూ.47.51డీజిల్ లీటర్: సుమారు రూ.32.472006వ సంవత్సరంలో ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ సగటున రూ.45.30గా ఉండేది. అప్పట్లో చమురు మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీ) ధరల నిర్ణయాధికారం పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. అంతర్జాతీయంగా క్రూడ్ ధర పెరిగినప్పటికీ ప్రభుత్వం రాయితీలు ఇస్తూ దేశీయంగా ధరలను అదుపులో ఉంచేది.నేటి పరిస్థితిపశ్చిమాసియా సంక్షోభం, ఇరాన్ యుద్ధ వాతావరణం, వ్యూహాత్మక చమురు రవాణా మార్గమైన హార్మూజ్ జలసంధిలో నెలకొన్న అడ్డంకుల కారణంగా అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా భగ్గుమంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 106 నుంచి 107 డాలర్ల వద్ద కొనసాగుతోంది.గత 11 వారాలుగా నష్టాలను భరిస్తూ ఇంధన ధరలను స్థిరంగా ఉంచిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆర్థికంగా భారం ఎక్కువ కావడంతో నేడు (మే 15, 2026) లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.నాటికీ నేటికీ తేడా ఏమిటి?2006తో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ధర దాదాపు 70% పెరిగితే దేశీయంగా రిటైల్ ధరలు మాత్రం 100% పైగా పెరిగాయి. ఈ తీవ్రమైన వ్యత్యాసానికి వెనుక బలమైన ఆర్థిక, అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి.డాలర్తో రూపాయి విలువ క్షీణత2006లో ఒక అమెరికన్ డాలర్ విలువ సుమారు రూ.45గా ఉండేది. కానీ నేడు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా తగ్గింది. ముడి చమురును డాలర్లలోనే కొనుగోలు చేయాల్సి రావడం వల్ల క్రూడ్ ధరతో సంబంధం లేకుండా భారత్ చెల్లించే మొత్తం విపరీతంగా పెరిగింది.నియంత్రణ లేకపోవడం2010లో పెట్రోల్, 2014లో డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తొలగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలే స్వయంగా ధరలను సవరించే పద్ధతి అమల్లోకి వచ్చింది.పన్నుల నిర్మాణంప్రస్తుతం కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే వ్యాట్ పన్నులు ఇంధన ధరల్లో సింహభాగాన్ని ఆక్రమిస్తున్నాయి. చమురు కంపెనీల నివేదికల ప్రకారం.. తాజా పెంపునకు ముందు కూడా కంపెనీలు పెట్రోల్పై లీటరుకు రూ.14, డీజిల్పై లీటరుకు రూ.16 వరకు నష్టపోవాల్సి వచ్చింది.వృద్ధి పథంలో భారత్భారతదేశం ప్రస్తుతం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉంది. పారిశ్రామికీకరణ, రవాణా రంగాలు ఊపందుకున్నాయి. అయితే మన అవసరాలకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 85 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారత అంతర్గత ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏప్రిల్ 2026లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరగా హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఇంధన ధరల కారణంగా 42 నెలల గరిష్టానికి (8.3 శాతం) చేరింది.చమురు సంక్షోభంఈ అంతర్జాతీయ చమురు సంక్షోభం భారత్కు ఒక హెచ్చరిక లాంటిది. ఇంధన ఒడిదొడుకుల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలంటే కేవలం దిగుమతులపైనే ఆధారపడితే సరిపోదు. రాబోయే రోజుల్లో వ్యూహాత్మక చమురు నిల్వలను మరింత పెంచుకోవడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్, ఇథనాల్ బ్లెండింగ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు భారత్ మరింత వేగంగా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది. అప్పుడే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా భారత వృద్ధి సాగిపోతుంది.ఇదీ చదవండి: పసిడి ధరల్లో కుదుపు.. తులం ఎంతంటే.. -
సామాన్యుడి నెత్తిన వరుస పిడుగులు!
దాదాపు నాలుగేళ్ల తర్వాత మన దేశంలో.. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. అమెరికా-ఇరాన్ యుద్ధంతో నెలకొన్న చమురు సంక్షోభం కారణంగా కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని అటు కేంద్రం ఇటు ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే ఈ పెరుగుదల కేవలం పెట్రోల్ బంకుల వద్దే ఆగిపోతుందనుకుంటే మన పొరపాటే!. పెట్రో వడ్డనతో సామాన్యుడి నెత్తి మీద వరుస పిడుగులు పడే అవకాశం ఉంది. రవాణా మొదలు వంటింటి దాకా.. అన్నింటిపైనా ప్రభావం చూపించే స్పష్టంగా అవకాశం కనిపిస్తోంది. తద్వారా ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి సవాలు విసరనుంది. ఈ ప్రభావంతో ఏయే రేట్లు పెరుగుతాయంటే.. టికెట్ రేట్లు?పెట్రోలు ధరలు పెరగడం వల్ల కార్లు, బైకులు వాడే ప్రజలకు రోజువారీ ప్రయాణం ఖరీదు అయ్యింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల బస్సులు, లారీలు, సరుకు రవాణా ఖర్చులు పెరిగే చాన్స్ ఉంది. ఫలితంగా ఆటో, క్యాబ్, మోటర్ ట్యాక్సీల ఛార్జీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే.. రవాణా ఖర్చులు అన్ని రంగాలపై ప్రభావం చూపుతాయి. కుటుంబాలు వినోదం, అదనపు ఖర్చులను తగ్గించుకోవాల్సి రావొచ్చు!.గెట్ రెడీ..బంగారం, వెండి బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధరలు పెరిగాయి. కూరగాయలు, నిత్యావరాల రేట్లు పెరుగుతూ పోతున్నాయి. పాలు, పెరుగు ధరలనూ పెంచేశారు. ఇక రేపోమాపో వంటింటి గ్యాస్ ధర.. ఆ వెంటనే సబ్బులు, షాంపుల రేట్లు కూడా పెరిగే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. మన దేశంలో కూరగాయలు, పండ్లు, పాలు, ధాన్యాలు అన్నీ రోడ్డు రవాణా ద్వారా సరఫరా అవుతాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈ వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి, ఆ భారం వినియోగదారులపై పడనుంది.సో.. వాటి రేట్లు పెరగడం దాదాపు ఖరారైనట్లే!.ఈ-కామర్స్ ద్వారా.. లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడంతో ఫుడ్ డెలివరీ యాప్లు, ఈ-కామర్స్ కంపెనీలు డెలివరీ ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. డిస్కౌంట్లను వీలైనంతగా తగ్గించడం.. కనీస ఆర్డర్ విలువ పెరగడం వంటి మార్పులు జరగవచ్చు. ఇది ఇంతటితోనే ఆగిపోలేదు.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు డీజిల్ ఆధారిత ట్రాక్టర్లు, పంపులు వాడాల్సిన పరిస్థితి రావొచ్చు. దీంతో వ్యవసాయ ఖర్చులు పెరిగి, ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల తయారీ, వ్యవసాయం, రిటైల్, సేవలన్నింటిలో ఖర్చులు పెరుగుతాయి. అంతిమంగా.. దీర్ఘకాలంలో ఇంధన ధరలు స్థిరపడకపోతే.. ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ప్రజల జీవన ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. -
భగ్గుమన్న టోకు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఏప్రిల్లో భగ్గుమంది. ముడి చమురు, ఇంధన ధరలు పెరగడంతో 8.3 శాతానికి ఎగబాకినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇది 42 నెలల గరిష్ట స్థాయి. మార్చిలో ఉన్న 3.88 శాతంతో పోల్చితే ఒక్క నెల వ్యవధిలోనే భారీగా పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పశి్చమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరిగిపోవడం, మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్ ధరలు ఎగసిపడడం ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరేందుకు దారితీసింది. 2025 ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 0.85 శాతంగా ఉండడం గమనార్హం. రంగాల వారీగా ద్రవ్యోల్బణం తీరిది.. ∙అన్ని ప్రధాన రంగాల్లోనూ టోకు ధరలు పెరిగాయి. ప్రధానంగా ఇంధనం, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం అత్యధికంగా 24.71 శాతంగా నమోదైంది. మార్చిలో కేవలం 1.05 శాతమే ఉండటం గమనార్హం. -
బయటి నుంచి బంగారం.. ఇక 100 కేజీలే..!
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని పెంచిన మరుసటి రోజే.. పసిడి దిగుమతులపైనా పరిమితులు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ కింద ఆభరణాల ఎగుమతిదారులకు సున్నా సుంకంపై పసిడి దిగుమతిని 100కిలోలకు పరిమితం చేస్తున్నట్టు వాణిజ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రకటించింది.ఈ పథకం కింద 100 కిలోలకు మించి తదుపరి పసిడి దిగుమతుల కోసం అనుమతి కావాలంటే.. అప్పటికే కనీసం 50 శాతం ఎగుమతులను పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంతకుముందు వరకు ఈ పథకం కింద ఆభరణాల ఎగుమతిదారులు సున్నా సుంకంపై అపరిమితంగా పసిడి దిగుమతులకు అనుమతి ఉంది. ఆభరణాల ఎగుమతులకు ప్రోత్సాహకంగా దీన్ని తీసుకొచ్చారు. ఆభరణాల ఎగుమతులకు వినియోగించే ప్యాకేజింగ్ మెటీరియల్, ఇంధనం, ఆయిల్ తదితర వాటికీ సున్నా సుంకం ప్రయోజనాలున్నాయి.తాజా చర్యతో ఆభరణాల ఎగుమతులకు సంబంధించిన బంగారం దిగుమతులను సైతం క్రమబద్దీకరించేందుకు కేంద్రం నడుం బిగించినట్టు తెలుస్తోంది. అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ పథకం కింద మొదటిసారి దిగుమతులకు దరఖాస్తు చేసుకుంటే, తయారీ ప్లాంట్, సామర్థ్యాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వనున్నట్టు డీజీఎఫ్టీ స్పష్టం చేసింది. దిగుమతి చేసుకున్న పసిడిని నిబంధనలకు అనుగుణంగా కచి్చతంగా ఆభరణాల ఎగుమతులకు వినియోగించేలా చూడడం, దుర్వినియోగాన్ని కట్టడి చేయడమే తాజా చర్యల ఉద్దేశంగా కనిపిస్తోంది. -
కీలక నిర్ణయం దిశగా ఆర్బీఐ బోర్డు!
ఆర్బీఐ నుంచి ఈ ఏడాదీ కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో డివిడెండ్ వర్షం కురవనుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో ఎన్నో సవాళ్లు ఎరువుతుండడం తెలిసిందే. కరెంట్, ద్రవ్యలోటు పెరిగిపోనున్న నేపథ్యంలో ఆర్బీఐ నుంచి పెద్ద మొత్తంలో డివిడెండ్ రావొచ్చని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ నెలలో జరిగే బోర్డు సమావేశంలో డివిడెండ్పై ఆర్బీఐ నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పాయి.గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రూ.2.69 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ కింద పంపిణీ చేసింది. 2024–25లో రూ.2.11 లక్షల కోట్లతో పోల్చితే 27 శాతం పెరిగింది. ఆర్బీఐ, ప్రభుత్వరంగ బ్యాంక్లు, సంస్థల నుంచి డివిడెండ్ల రూపంలో రూ.3.16 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని 2026–27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 3.75 శాతం అధికం. ఇందులో రూ.75,000 కోట్లు ప్రభుత్వరంగ సంస్థల డివిడెండ్లు, పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో వస్తుందని అంచనా వేసింది. -
ఉగాండా గతి మార్చిన భారత్
అది 1972... గడియారపు ముళ్లు వేగంగా తిరుగుతున్నాయి. చేతిలో కేవలం తొంభై రోజుల గడువు. కళ్ల ముందే తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలుతుంటే కట్టుబట్టలతో, కన్నీటి మూటలతో ఒక జాతి పరాయి దేశాల వైపు అడుగులు వేసింది. ఆనాడు ఉగాండా నేల విడిచి వెళ్లిన చాలా మందిలో తీరని వేదన. కానీ, కాలం పగ తీర్చుకోలేదు.. ఆ గాయాన్ని మాన్పేసింది.అర్ధ శతాబ్దం గడిచింది. నాడు బహిష్కరించిన అదే మనుషులు, నేడు ఎర్ర తివాచీ పరిచారు. అప్పుడు అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారే, ఇప్పుడు ఆ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారు. చక్కెర మిల్లులు, స్టీలు పరిశ్రమలు, బ్యాంకింగ్ వ్యవస్థ... ఇలా అన్ని రంగాల్లో భారతీయులు వ్యాపారం సాగిస్తూ దేశ వృద్ధికి తోడ్పడుతున్నారు.90 రోజుల గడువు.. తరాల కష్టం బుగ్గిపాలు1972 ఆగస్టులో ఉగాండా సైనిక పాలకుడు ఇడి అమీన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. స్థానికులను దోపిడీ చేస్తున్నారనే సాకుతో దాదాపు 80,000 మంది భారత సంతతి ప్రజలను కేవలం 90 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న వ్యాపారాలు, చక్కెర మిల్లులు, బ్యాంకులు, ఆస్తులను వదిలి వారంతా బ్రిటన్, కెనడా, భారత్లకు శరణార్థులుగా వెళ్లారు. ఫలితంగా ఉగాండాలో 90 శాతం వ్యాపారాలు మూతపడ్డాయి. సరఫరా గొలుసు కుప్పకూలి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది.గణాంకాలు ఇలా..1972-75 మధ్య ఉగాండా జీడీపీ 5% మేర పడిపోయింది.1972లో 740 మిలియన్ షిల్లింగ్లుగా ఉన్న ఉత్పత్తి 1979 నాటికి 254 మిలియన్లకు దిగజారింది.ముసెవెని పిలుపుతో మారిన దశ1986లో యోవేరి ముసెవెని అధికారం చేపట్టాక పరిస్థితి తలకిందులైంది. అమీన్ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించిన ఆయన, భారతీయులను తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారి ఆస్తులను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. ‘మనం పోగొట్టుకున్నది కేవలం వ్యక్తులను కాదు, దేశ ఆర్థిక పునాదులను. భారతీయులు ఉగాండా రక్తంలో భాగం’ అని యోవేరి ముసెవెని (అధ్యక్షుడు) అన్నారు.ఆర్థిక సామ్రాజ్యాల పునరుద్ధరణతిరిగి వచ్చిన భారతీయులు వ్యాపారాలు చేయడంతోపాటు దేశ భవిష్యత్తును మార్చేశారు. ప్రస్తుతం ఉగాండా జనాభాలో కేవలం 1 శాతం కంటే తక్కువగా ఉన్న భారతీయులు దేశ ఆదాయపు పన్నులో 65 శాతం వాటాను అందిస్తున్నారంటే వారి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.సుధీర్ రుపారేలియాబహిష్కరణ సమయంలో లండన్కు పారిపోయి చిన్న ఉద్యోగాలు చేసిన సుధీర్ కేవలం 25,000 డాలర్లతో తిరిగి వచ్చి నేడు ఉగాండాలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. బ్యాంకింగ్, విద్య, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయనది తిరుగులేని ముద్ర.మధ్వానీ గ్రూప్గుజరాత్ నుంచి వలస వచ్చిన ముల్జీభాయ్ మాధ్వానీ స్థాపించిన ఈ సంస్థ నేడు తూర్పు ఆఫ్రికాలోనే అతిపెద్ద వ్యవసాయ-పారిశ్రామిక సంస్థగా ఎదిగింది. ‘కకీరా షుగర్ వర్క్స్’ ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ 70,000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఈ గ్రూప్ జీవనాధారంగా ఉంది.మెహతా, ముక్వానో గ్రూప్స్మెహతా గ్రూప్ అధినేత మహేంద్ర మెహతాకు భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’ పురస్కారం ఇచ్చి గౌరవించింది. అలాగే ముక్వానో గ్రూప్ సబ్బులు, నూనెలు వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో ఎంతో ఎదిగింది.భారత్ - ఉగాండా సంబంధాలుప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1.2 బిలియన్ డాలర్లను దాటింది. ఫార్మా, మౌలిక సదుపాయాలు, ఉక్కు, విద్య వంటి రంగాల్లో భారతీయ సంస్థల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. చైనా పెట్టుబడులతో పోలిస్తే భారతీయ వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలతో మమేకమై పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మిస్తూ అక్కడ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు.అయితే, ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారతీయుల ఆర్థిక ఆధిపత్యంపై కొన్ని వర్గాల్లో అసహనం ఉన్నప్పటికీ, ఇండియన్స్ లేని ఉగాండా ఆర్థిక వ్యవస్థను ఊహించడం అసాధ్యమని మెజారిటీ ప్రజల నమ్మకం. ఒకప్పుడు బహిష్కరణకు గురైన ఒక జాతి, అదే దేశానికి ఆర్థిక రక్షకులుగా మారడం అనేది ప్రపంచ చరిత్రలోనే అరుదైన దృశ్యం.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య -
ఈజీగా ఈపీఎఫ్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత భవిష్యనిధి (ఈపీఎఫ్)ని మరింత సులభంగా ఉపసంహరించుకునే విధానం త్వరలో అమల్లోకి రానుంది. ఉపసంహరణ క్లెయిమ్లను ఆటోమేట్ చేయనున్నట్టు సెంట్రల్ ప్రావిడెండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి తెలిపారు. అసోచామ్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ పరిధిలోని 7 కోట్ల మందికి ప్రయోజనం కలగునుంది.ప్రస్తుతం ఈపీఎఫ్వో సభ్యులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ముందస్తు ఉపసంహరణ క్లెయిమ్లు ఆటోమేటిగ్గా ప్రాసెస్ చేస్తుండడం తెలిసిందే. క్లెయిమ్ దాఖలు చేసిన తర్వాత మూడు పనిదినాల్లో ప్రాసెస్ చేయాలన్నది గడువు. ఉద్యోగి సంస్థను మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతా బదిలీ సైతం ఆటోమేటిగ్గా జరిగే విధానాన్ని తీసుకురానున్నట్టు, దీంతో సభ్యులు బదిలీకి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. నాలుగో ఏటా లాభాలే: ప్రభుత్వ బ్యాంకులపై ఆర్థిక శాఖ ప్రకటనన్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) వరుసగా నాలుగో ఏడాది లాభాలు ఆర్జించినట్లు ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ పేర్కొంది. గతేడాది(2025–26)లో నికర లాభాలు 11 శాతం ఎగసి రూ. 1.98 లక్షల కోట్లను తాకినట్లు వెల్లడించింది. ఇది పీఎస్బీల చరిత్రలోనే అత్యధికంకాగా.. రుణ నాణ్యత మెరుగుపడటం, రుణాల వృద్ధి, అధిక ఆదాయం ఇందుకు తోడ్పడినట్లు తెలియజేసింది.పీఎస్బీల మొత్తం నిర్వహణ లాభం 3.21 లక్షల కోట్లకు చేరగా.. బిజినెస్ 13 శాతం పుంజుకుని రూ. 283.3 లక్షల కోట్లను తాకినట్లు తెలియజేసింది. ఈ వివరాల ప్రకారం వీటి డిపాజిట్లు 10.6 శాతం వృద్ధితో రూ. 156.3 లక్షల కోట్లకు చేరాయి. స్థూల అడ్వాన్సులు 16 శాతం జంప్చేసి రూ. 127 లక్షల కోట్లను తాకాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.93 శాతానికి, నికర ఎన్పీఏలు 0.39 శాతానికి దిగివచ్చాయి. చదవండి: రష్యా నుంచి తగ్గిన చమురు దిగుమతులు -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు కేవలం ముడి చమురు ధరలే కాదు అంతకుమించిన పెను సంక్షోభం ముంచుకొస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హార్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన రంగంతోపాటు ప్రపంచ ఆహార భద్రతను, పారిశ్రామిక ఉత్పత్తిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎరువులు, సల్ఫర్, పారిశ్రామిక లోహాల సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.1,150 శాతం పెరిగిన ధరలుప్రపంచ పారిశ్రామిక రంగానికి లైఫ్ లైన్ వంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్గస్ ప్రైసింగ్, యూఎస్ జియోలాజికల్ సర్వే గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లతో పోలిస్తే చైనా సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఏకంగా 1,150 శాతం పెరిగాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సల్ఫర్ ధరల్లో 750 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారు అయిన చిలీలో ధరలు 230 శాతం పెరిగాయి.సల్ఫ్యూరిక్ యాసిడ్ లేకుండా ఎరువుల ఉత్పత్తి, రాగి ప్రాసెసింగ్, బ్యాటరీల తయారీ, సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్ అసాధ్యం. ప్రపంచ సల్ఫర్ ఎగుమతుల్లో సగానికి పైగా పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటంతో హార్మూజ్ జలసంధి మూసివేత ఈ సరఫరాను పూర్తిగా స్తంభింపజేసింది.చమురు సంక్షోభంసౌదీ ఆరామ్కో సీఈఓ అమిన్ నాసర్ ఈ పరిస్థితిని ‘ప్రపంచం ఇప్పటివరకు చూడని అతిపెద్ద ఇంధన సరఫరా షాక్’గా అభివర్ణించారు. గతంలో రోజుకు 70 నౌకలు ప్రయాణించే హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు కేవలం 2 నుంచి 5 నౌకలు మాత్రమే వెళ్తున్నాయి. సుమారు 240 నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి.ప్రతి వారం ప్రపంచ మార్కెట్లు 100 మిలియన్ బ్యారెళ్ల చమురును కోల్పోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1 బిలియన్ బ్యారెళ్ల సరఫరాకు అంతరాయం కలిగింది. అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలు 1982 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది.ఎరువుల కొరతతో ఆహార సంక్షోభంచమురు కంటే ఎరువుల సంక్షోభమే అత్యంత భయంకరంగా ఉండబోతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో మూడింట ఒక వంతు హార్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఖతార్ ఫెర్టిలైజర్ కంపెనీ ఇప్పటికే ‘ఫోర్స్ మేజర్’(నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితుల వల్ల పనిని పూర్తి చేయలేకపోవడం) ప్రకటించగా, నెలకు 3-4 మిలియన్ టన్నుల ఎరువుల సరఫరా నిలిచిపోయింది.భారత్ ఇప్పటికే మూడు యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించగా బంగ్లాదేశ్ ఐదు ప్లాంట్లలో నాలుగింటిని మూసివేసింది. బ్రెజిల్లో యూరియా దిగుమతులు 33 శాతం పడిపోయాయి. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే వచ్చే కొద్ది నెలల్లోనే 4.5 కోట్ల మంది తీవ్ర ఆకలి బారిన పడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఆందోళన వ్యక్తం చేసింది.పారిశ్రామిక రంగంపై ప్రభావంకేవలం వ్యవసాయమే కాదు, హైటెక్ పరిశ్రమలు కూడా చిక్కుల్లో పడ్డాయి. సెమీకండక్టర్లకు అవసరమైన హీలియం సరఫరా నిలిచిపోయింది. సల్ఫర్ కొరత కారణంగా ఇండోనేషియాలో నికెల్ ప్రాసెసింగ్ నిలిచిపోయింది. ఇది నేరుగా ఈవీ బ్యాటరీల తయారీపై దెబ్బకొడుతోంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలుఒకవైపు ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంటే, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య దౌత్యపరమైన వేడి పెరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలను తోసిపుచ్చడం, అమెరికా అణు జలాంతర్గామి జిబ్రాల్టర్ చేరుకోవడం వంటి పరిణామాలు యుద్ధ మేఘాలను సూచిస్తున్నాయి. మే 14-15 తేదీల్లో ట్రంప్ బీజింగ్ పర్యటనపైనే ఇప్పుడు ప్రపంచం ఆశలు పెట్టుకుంది.మార్కెట్లు కేవలం చమురు ధరల పెరుగుదలను మాత్రమే అంచనా వేస్తున్నాయి. కానీ తెరవెనుక ఎరువులు, సల్ఫర్ కొరత సృష్టిస్తున్న విధ్వంసం ఇంకా అంచనాలకు అందడం లేదు. ఒకవేళ జూన్ మధ్య నాటికి హార్మూజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2027 వరకు కోలుకోవడం కష్టమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
రష్యా నుంచి తగ్గిన చమురు దిగుమతులు
రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు ఏప్రిల్లో 15 శాతం తగ్గినట్లు ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’ (సెరా) వెల్లడించింది. మార్చిలో €5.3 బిలియన్ యూరోల విలువైన ముడి చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోగా, ఏప్రిల్లో €4.5 బిలియన్ల యూరోలకు తగ్గాయి. నయారా ఎనర్జీకి చెందిన వాదినార్ రిఫైనరీలో ఉత్పత్తిని నిర్వహణ పనుల వల్ల నిలిపివేయడం ఇందుకు ప్రధాన కారణమని సెరా తెలిపింది. ఏప్రిల్లో రష్యా చమురు విషయంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది.మొత్తం మీద ఏప్రిల్లో రష్యా నుంచి హైడ్రోకార్బన్ల కొనుగోలు (ముడి చమురు, గ్యాస్) 5 బిలియన్ యూరోలుగా ఉంది. ఇరాన్తో అమెరికా యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడమే కాకుండా హర్మూజ్ జలసంధి మూసివేతతో సరఫరాలు తగ్గిపోవడం తెలిసిందే. దీంతో ధరలను తగ్గించేందుకు గాను రష్యా చమురు నౌకలపై అమెరికా ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వ రంగ రిఫైనరీలు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించాయి.రష్యా యూరల్స్ ముడి చమురు ధర ఏప్రిల్లో బ్యారెల్కు 112.3 డాలర్లకు చేరింది. ఐరోపా నిర్దేశించిన గరిష్ట ధర 44.1 డాలర్లు కంటే రెండింతలు ఎక్కువ కావడం గమనార్హం. భారత్, టర్కీ వంటి దేశాల్లో శుద్ధి చేసిన రష్యా చమురు ఉత్పత్తులు తిరిగి ఐరోపా దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలకే ఎగుమతి అవుతున్నట్టు సెరా తెలిపింది.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్పై జోహో ప్రకటన -
కేంద్రం తీపి కబురు, అయినా.. ఆందోళనే!
భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార ఎగుమతులపై సెప్టెంబర్ దాకా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ మార్కెట్లో ధరలు పెరగకుండా ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అమెరికా, ఈయూలకు మాత్రం ఈ బ్యాన్ వర్తించబోదని స్పష్టం చేసింది. అయితే కేంద్రం తాజా ప్రకటనపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారులలో ఒకటి. ఇటీవల వర్షాభావం, పంట ఉత్పత్తి తగ్గుదల, నిల్వలపై ఒత్తిడి కారణంగా దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. పండుగల సీజన్లో వినియోగం అధికంగా ఉండే అవకాశం ఉండటంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యగా ఎగుమతులను నిలిపివేసింది.ముడి, శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై సెప్టెంబర్ 30వ తేదీ వరకు కేంద్రం నిషేధం విధిస్తూ సంచలన ప్రకటన చేసింది. సెప్టెంబర్ తర్వాత పరిస్థితిని సమీక్షించి, ఎగుమతులపై కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వర్షాకాలం తర్వాత పంట ఉత్పత్తి స్థాయిలు, నిల్వలు, ధరలపై ఆధారపడి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని సమాచారం. అయితే.. ఈ చర్య దేశీయ మార్కెట్లో ధరలను నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్లో చక్కెర కొరతకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో.. దేశీయంగా ధరలు తగ్గే అవకాశం ఉంది. వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభించవచ్చు. అయితే అంతర్జాతీయంగా భారతదేశం చక్కెర ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో.. ఎగుమతులు నిలిపివేయడం వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా తగ్గి ధరలు పెరగవచ్చు. అలాగే వ్యాపారాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎగుమతులపై ఆధారపడిన వ్యాపారులు, ట్రేడర్లు నష్టపోవచ్చు. కేంద్రం తాజా నిర్ణయంపై ఆర్థిక విశ్లేషకులు ఏం చెబుతున్నారంటే.. ఈ నిర్ణయం తాత్కాలికంగా దేశీయ మార్కెట్కు మేలు చేస్తుంది. కానీ ప్రపంచ మార్కెట్లో అస్థిరతను పెంచుతుంది. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా దేశాలు భారత చక్కెరపై ఆధారపడుతున్నందున, అక్కడ ధరలు పెరగడం ఖాయం. -
బంగారానికి ఇక దుబాయే దిక్కు!
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా దుబాయ్ నుంచి పసిడి, వెండి దిగుమతులు పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ సంస్థ (జీటీఆర్ఐ) తెలిపింది. 2022లో 120 టన్నులతో మొదలైన కోటా 2027లో 200 టన్నులకు పెరగనుంది. ఇది భారత్ పసిడి దిగుమతుల్లో నాలుగో వంతుకు సమానం. కొత్త ఎంఎఫ్ఎన్ టారిఫ్ 15 శాతంగా ఉండగా, దుబాయ్ నుంచి దిగుమతులకి 14 శాతానికి పరిమితమవుతుందని జీటీఆర్ఐ పేర్కొంది. ఒక్క శాతం వ్యత్యాసం ప్రయోజనం పొందేందుకు దుబాయ్ మార్గం ద్వారా వ్యాపారులు పసిడిని మరింతగా దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వివరించింది. సుంకాలు ఇలా .. 2012కి ముందు విలువతో సంబంధం లేకుండా 10 గ్రాములకు రూ. 300 చొప్పున సుంకం ఉండేది. 2012 జనవరిలో బంగారం విలువలో 2 శాతం కస్టమ్స్ సుంకం విధించారు. అదే ఏడాది మార్చిలో బడ్జెట్లో 4 శాతానికి పెంచారు. 2013లో రుపాయి మారకం, విదేశీ మారకం నిల్వలు పడిపోయిన కారణాలతో పసిడిపై దిగుమతి సుంకాలు మూడు సార్లు పెరిగాయి. మొదట 4 నుంచి 6 శాతానికి, తర్వాత 8 శాతానికి, ఆ పైన 10 శాతానికి పెరిగాయి. 2014–18 మధ్యకాలంలో 10 శాతమే అమల్లో ఉండగా, 2019లో దాన్ని 12.5 శాతానికి పెంచారు. 2021 బడ్జెట్లో 10.75 శాతానికి తగ్గించి, మళ్లీ 2022లో 15 శాతానికి పెంచారు. 2024లో దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 6 శాతానికి తగ్గించారు. ప్రత్యామ్నాయాల్లేవా..?2014లో మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ సర్కారు కొలువైన తర్వాత భౌతిక రూపంలో పసిడి దిగుమతులు తగ్గించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసింది అవేంటంటే..ప్రభుత్వ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ఇళ్లలో ఉన్న నిరుపయోగ బంగారాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నది ఈ పథకం లక్ష్యం. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, ఆ విలువపై 2.25–2.5 శాతం రాబడిని ఆఫర్ చేశారు. భౌతిక బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ వల్ల ఆశించిన స్పందన రాలేదు. దీంతో 2025లో ఈ పథకాన్ని నిలిపివేశారు. సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 2015లో సార్వభౌమ బంగారం బాండ్లకు శ్రీకారం చుట్టింది. 8 ఏళ్ల కాలవ్యవధి. బాండ్ కొనుగోలు ధరపై ఏటా 2.5 శాతం వడ్డీ ఎనిమిదేళ్ల పాటు రాబడిగా అందుతుంది. దీంతో ఈ పథకం విజయవంతమైంది. 8 ఏళ్ల కాలవ్యవధి తర్వాత నుంచి బాండ్లు క్రమంగా మెచ్యూరిటీకి రావడం.. ఈ కాలంలో పసిడి ధరలు గణనీయంగా పెరిగిపోవడంతో ప్రభుత్వంపై చెల్లింపుల భారం భారీగా పెగిపోయింది. పెట్టుబడిపై 150–200 శాతం అధికంగా చెల్లించాల్సి వచి్చంది. దీంతో 2025 నుంచి అనధికారికంగా ఈ పథకానికీ ప్రభుత్వం గుడ్బై చెప్పింది. ఈటీఎఫ్లు బంగారం, వెండి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు), డిజిటల్ గోల్డ్ తదితర డిజిటల్ సాధనాల్లోనూ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, కొనుగోలు విలువకు సరిపడా భౌతిక లోహాలను ఫండ్స్ సంస్థలు సమకూర్చుకుని ఖజానాల్లో భద్రపరచాల్సి ఉంటుంది. కనుక ఒక రకంగా భౌతికంగా ఆ మేరకు కొనుగోలు చేయాల్సిందే. కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు దేశీయంగా ఇప్పటికే అందుబాటులో ఉన్న బంగారాన్ని బ్యాకెండ్గా వినియోగించుకుంటే విదేశాల నుంచి అదనంగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. బంగారం, వెండి డిజిటల్ రూపంలో ఉంటే కావాల్సినప్పడు విక్రయించి, కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. దీంతో చలామణి పెరుగుతుంది. పసిడిపై సుంకాల విధింపు దేశీయంగా గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లకి సానుకూలంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దేశ ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాలి
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, దీర్ఘకాలంలో రిసు్కలను ఎదుర్కొనేలా దేశీయంగా ఆర్థిక సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ తెలిపారు. నిధులు, అధికారం కోసం మరొకరిపై ఆధారపడకపోవడమే సిసలైన స్వావలంబన అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. భారత్ అనేక సంవత్సరాలపాటు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులపైనే (ఎఫ్పీఐ) ఆధారపడిందని, కరోనా మహమ్మారి తర్వాతే దేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్ మార్కెట్లలో కీలక పాత్ర పోషించే ధోరణి పెరిగిందని కోటక్ చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా దేశీయంగా ఆర్థిక మూలాలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలు త్రైమాసిక ఫలితాలు, షేర్ల ధరల్లాంటి స్వల్పకాలిక అంశాలపై కాకుండా దీర్ఘకాలికంగా సంస్థను తీర్చిదిద్దుకునే వ్యూహాలపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు.కంపెనీలు తమకొచ్చే లాభాలను తిరిగి వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రస్తుతమిస్తున్న ట్యాక్స్ ఇన్సెంటివ్స్కే పరిమితం కాకుండా అదనంగా మరిన్ని ప్రోత్సాహకాలిస్తే కొత్తగా పెట్టుబడులకు ఊతం లభించగలదని కోటక్ చెప్పారు. దేశీయంగా ఉత్పత్తిని, ఎగుమతులను పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం ద్వారా భారత్ తన బ్యాలెన్స్ షీట్ను పటిష్టం చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలకు మేల్కొలుపు: మంత్రి పీయుష్ గోయల్ ప్రస్తుత పరిస్థితులు దేశీ పరిశ్రమలకు మేల్కొలుపులాంటిదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా దిగుమతులను తగ్గించుకునేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు, ఉత్పాదకతను పెంచుకునేందుకు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సద్వినియోగం చేసుకునేందుకు దీన్నొక అవకాశంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం పడిందని ఆయన చెప్పారు. అయితే, ఈ సంక్షోభ పరిస్థితుల్లో మిగతా దేశాలకన్నా మెరుగ్గా రాణించేందుకు భారత్ ముందు చక్కని అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు విదేశీ విహార యాత్రలపరమైన వినియోగాన్నే మాత్రమే తగ్గించుకోమని ప్రధాని చెప్పారే తప్ప వ్యాపార పర్యటనలను నిలిపివేసుకోవాలనలేదని గోయల్ తెలిపారు. ‘వ్యాపారాన్ని విస్తరించేందుకు పరిశ్రమ వర్గాలు ప్రపంచవ్యాప్తంగా పర్యటించాలి. మరింతగా విదేశీ మారకం వచ్చేలా మరిన్ని ఎగుమతి ఆర్డర్లను దక్కించుకోవాలి. కొంత ఖర్చు చేసి మరింతగా ఆదాయాన్ని పెంచుకోవాలి. మనం 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించాలనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి‘ అని పేర్కొన్నారు. -
మంటెత్తనున్న ఇంధన ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పకపోవచ్చని భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం స్విట్జర్లాండ్లో స్విస్ నేషనల్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పెరుగుతున్న చమురు భారంతో భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కోబోయే సవాళ్లను ఆయన ఈ సందర్భంగా విశ్లేషించారు.వినియోగదారులపై ధరల భారం తప్పదా?ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 107 డాలర్ల గరిష్ట స్థాయి వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఇప్పటివరకు ఆ భారాన్ని వినియోగదారులపై పడకుండా రక్షిస్తూ వస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు.అయితే, ఈ ఉపశమనం శాశ్వతం కాకపోవచ్చని ఆయన పరోక్షంగా సూచించారు. ‘ముడి చమురు ధరలు సుదీర్ఘకాలం పాటు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ధరల పెంపును ఆమోదించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. చమురు కంపెనీలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉంది’ అని మల్హోత్రా వ్యాఖ్యానించారు.సరఫరా గొలుసులో అంతరాయాలుప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, సంఘర్షణల వల్ల సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు ఇప్పటికే భారతదేశాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయని గవర్నర్ అంగీకరించారు. ఇలాంటి భారీ సరఫరా షాక్ ఎదురైనప్పుడు కేవలం ద్రవ్యోల్బణ లక్ష్యాల ఫ్రేమ్వర్క్ మాత్రమే సరిపోదని, ప్రభుత్వ ఆర్థిక విధానాలతో సమన్వయం చేసుకోవడం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలుగతంలోనే ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాలు తగ్గించినందున ప్రస్తుత ధరల పెరుగుదలను చమురు కంపెనీలే భరిస్తున్నాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 6.9 శాతంగా, ద్రవ్యోల్బణం 4.6 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది.ఆర్బీఐ ప్రస్తుతం ప్రతి నెలా వచ్చే గణంకాలను నిశితంగా పరిశీలిస్తోంది. తాత్కాలిక ఒడిదుడుకులను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు స్థిరపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.జూన్ 5న వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం?ఏప్రిల్లో జరిగిన ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ కీలకమైన రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 5న జరగనున్న తదుపరి ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే ఉంటే సామాన్యుడిపై అటు ఇంధన ధరలు, ఇటు బ్యాంక్ ఈఎంఐల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదీ చదవండి: బంగారం షాక్.. దిమ్మతిరిగేలా రేట్లు పెంపు -
మీ ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్?
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు కేంద్రం శుభవార్త. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా త్వరలో కేంద్రం కొత్త ‘గోల్డ్ మానిటైజేషన్’ పాలసీని అందుబాటులోకి తేనుంది. తద్వారా ఇంట్లో ఉన్న బంగారంతో వడ్డీ వచ్చేలా ప్రతిపాదించనుంది. వినియోగదారులు వారి వద్ద ఉన్న కనీసం 10 గ్రాముల బంగారం ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రేటు సుమారు 2శాతం నుంచి 2.5శాతం వరకు పొందవచ్చు. భారతీయుల వద్ద సుమారు 30,000 టన్నుల బంగారం నిల్వగా ఉందని అంచనా. దీన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. రూపాయి విలువను బలోపేతం చేయడానికి బంగారం దిగుమతులను తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకురానున్న ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో డిపాజిట్ చేసిన బంగారంపై వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. సుమారు 2,000 టన్నుల బంగారం డిపాజిట్ అయితే, మూడేళ్ల వరకు దిగుమతుల అవసరం ఉండదని అంచనా. గోల్డ్ పాలసీలో కీలక మార్పులకు ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. ఈ కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలో స్పష్టత ఇవ్వనుంది. -
సామాన్యుడికి భారమా? దేశాభివృద్ధికి మార్గమా?
భారతీయులకి బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్. ఆపత్కాలంలో ఆదుకునే ఆర్థిక భరోసా. అయితే, మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, దేశ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పసిడి దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మార్కెట్లో పెను సంచలనం సృష్టిస్తోంది.బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది (మే 13, 2026 నుంచి అమలు). ఇందులో 10 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, మరో 5 శాతం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు (ఇరాన్-అమెరికా యుద్ధ వాతావరణం), పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.మోదీ పిలుపు: ‘బంగారం కొనుగోళ్లు ఆపండి’ఇటీవల సికింద్రాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక కీలక విన్నపం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ‘బంగారం దిగుమతి కోసం మనం భారీగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను దేశ ప్రయోజనాల కోసం, ఇంధన భద్రత కోసం మళ్లించాల్సిన అవసరం ఉంది’ అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని పిలుపునిచ్చిన రెండు రోజులకే ప్రభుత్వం సుంకాన్ని పెంచడం గమనార్హం. ఇది కేవలం విజ్ఞప్తి మాత్రమే కాదని, కఠిన నిర్ణయాల ద్వారా దిగుమతులను నియంత్రించే వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.మార్కెట్పై ప్రభావంబంగారంపై సుంకం పెరగడం వల్ల తక్షణమే దేశీయ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉంది.ధరల పెరుగుదల: 9 శాతం అదనపు సుంకం భారం నేరుగా వినియోగదారుడిపై పడుతుంది. దీనివల్ల పెళ్లిళ్ల సీజన్లో ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పదు.డిమాండ్ తగ్గుదల: పెరిగిన ధరలు, ప్రధాని పిలుపు వెరసి స్వల్పకాలంలో బంగారం కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇది దేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (సీఏడీ)ను తగ్గించడానికి దోహదపడుతుంది.స్మగ్లింగ్ ముప్పు: సుంకాలు భారీగా పెరిగినప్పుడు అనధికార మార్గాల్లో (స్మగ్లింగ్) బంగారం దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని జ్యువెలరీ అసోసియేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్టాక్ మార్కెట్: ఈ నిర్ణయం వెలువడిన వెంటనే ప్రముఖ జ్యువెలరీ కంపెనీల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిర పరచడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఇది అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముడిచమురు, ఎరువుల దిగుమతుల కోసం విదేశీ కరెన్సీని పొదుపు చేయాల్సిన అనివార్య పరిస్థితిలో భారత్ ఉంది. పసిడి వ్యామోహాన్ని తగ్గించుకుని, పెట్టుబడులను ఇతర ఉత్పాదక రంగాల వైపు మళ్లించడమే ఈ సంక్షోభానికి పరిష్కారంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
బంగారం, వెండిపై కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: బంగారం, వెండి విషయంలో కేంద్రం షాకిచ్చింది. దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ (మే 13) అర్ధరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వల్ల బంగారం, వెండి, ఫ్లాటినం.. ఇతర విలువైన లోహాల ధరలు భారీగా పెరగనున్నాయి. భారత్ ప్రపంచంలో చైనా తర్వాత రెండవ అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం దిగుమతి సుంకం 6 శాతంగా ఉంది. అయితే తాజా నిర్ణయంతో దాన్ని 16 శాతానికి పెంచింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల కోసం ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం బంగారం ధర రూ. 1,53,990 ఉంది. కిలో వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ ధరలు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.రెవెన్యూ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, బంగారం, వెండి, ప్లాటినంతో పాటు ఆభరణాల తయారీలో ఉపయోగించే హుక్స్, క్లాప్స్, క్లాంప్స్, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి వాటిపైనా సుంకాలు పెరిగాయి. బంగారం, వెండి ఫైండింగ్స్పై 5% కస్టమ్స్ సుంకం, ప్లాటినం ఫైండింగ్స్పై 5.4% సుంకం విధించారు. అదే సమయంలో, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఉపయోగించిన ఉత్ప్రేరకాలు, బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. అయితే ఇందుకు నిర్దిష్ట నిబంధనలు, అనుమతులు తప్పనిసరిగా పాటించాలి.2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ బంగారం దిగుమతులు 24% పెరిగి రికార్డు స్థాయిలో 71.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం దిగుమతుల్లో బంగారం వాటా 9 శాతంగా ఉంది. ఇక బంగారం సరఫరాలో స్విట్జర్లాండ్ 40% వాటాతో మొదటి స్థానంలో ఉండగా, యూఏఈ 16%, దక్షిణాఫ్రికా దాదాపు 10% వాటాతో తదుపరి స్థానాల్లో ఉన్నాయి. -
రూపాయి కొత్త కనిష్టానికి
ముంబై: పశ్చిమాసియా ఉద్రిక్తతల దెబ్బతో రూపాయి మారకం విలువ మరింతగా క్షీణిస్తోంది. తాజాగా మంగళవారం డాలరుతో పోలిస్తే మరో 40 పైసలు పడిపోయి సరికొత్త ఆల్టైమ్ కనిష్ట స్థాయి 95.68కి పతనమైంది. ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ లో డాలరుతో పోలిస్తే క్రితం ముగింపు (95.28) కన్నా తక్కువగా 95.57 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఆ తర్వాత ఒక దశలో 95.74కి కూడా పతనమైంది. చివరికి 40 పైసల క్షీణతతో ముగిసింది. సోమవారం నాడు కూడా దేశీ కరెన్సీ 79 పైసలు క్షీణించిన సంగతి తెలిసిందే. -
బంగారం కొనుగోలుపై.. 1967లో ఇదే జరిగిందా?
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో.. దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని సూచించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో 1967లో కూడా ఇందిరా గాంధీ ఇలాంటి ప్రకటన చేశారని, సూచించే ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో ఇటీవల.. ఒక పాత న్యూస్ ఫ్రంట్ పేజీ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఇందులో 1967 జూన్ 6 తేదీకి చెందిన 'ది హిందూ' పత్రికలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ''బంగారం కొనొద్దు, జాతీయ క్రమశిక్షణ పాటించండి'' అని పిలుపునిచ్చినట్లు చూపించారు. కానీ ఇది పూర్తిగా తప్పుదారి పట్టించే, డిజిటల్గా మార్పు చేసిన ఫోటో అని స్పష్టమైంది.నిజం ఏమిటంటే?సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫేక్ ఫోటోపై ది హిందూ స్వయంగా స్పందించింది. ''జూన్ 6, 1967 నాటి ‘ది హిందూ’ పత్రిక ముఖపత్రం అని చెప్పుకుంటున్న, డిజిటల్గా మార్పులు చేసిన ఒక చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇది మా ఆర్కైవ్స్లోని అసలైన పేజీ కాదని మేము స్పష్టం చేస్తున్నాము. పాఠకులు జాగ్రత్త వహించాలని, షేర్ చేసే ముందు సరిచూసుకోవాలని ‘ది హిందూ’ కోరుతోంది'' అని తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.📢 A digitally altered image purporting to be a front page of The Hindu from June 6, 1967, is currently circulating on social media. We wish to clarify that this is not an authentic page from our archives. The Hindu urges readers to exercise caution and verify before sharing.— The Hindu (@the_hindu) May 12, 2026అసలు 1967 జూన్ 6 నాటి పత్రికలో ఉన్న ప్రధాన వార్త ఏమిటంటే.. ''అప్పట్లో మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు''. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఫేక్ అని ది హిందూ క్లారిటీ ఇచ్చింది.ఇందిరా గాంధీ బంగారంపై నియంత్రణలు పెట్టారా?వైరల్ అవుతున్న ఫోటో నకిలీదే అయినప్పటికీ.. అప్పటి ప్రభుత్వం బంగారంపై నియంత్రణలు పెట్టిందనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే 1960లలో భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం, బంగారం స్మగ్లింగ్ సమస్యలు ఉండేవి. ఆ పరిస్థితుల్లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ''గోల్డ్ కంట్రోల్ యాక్ట్'' ప్రవేశపెట్టినట్లు సమాచారం.ఈ చట్టం.. ప్రజలు బంగారు బార్లు, నాణేలు కలిగి ఉండటాన్ని పరిమితం చేసింది. బంగారం కొనుగోలు, నిల్వపై కఠిన నియంత్రణలు అమలు చేసింది. స్మగ్లింగ్ను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. అయితే 1990లో ఈ యాక్ట్ రద్దు అయింది.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
రానున్న రోజుల్లో.. చమురు ధరలు ఇలా!
అంచనాలను మించి దీర్ఘకాలం కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు గరిష్ట స్థాయిలలోనే కొనసాగే వీలున్నట్లు ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) చీఫ్ ఎకనమిస్ట్ అల్బెర్ట్ పార్క్ పేర్కొన్నారు.వెరసి తాజా అంచనాల ప్రకారం.. 2026లో బ్యారల్ ముడిచమురు 96 డాలర్ల స్థాయిలో కొనసాగవచ్చు. 2027లో బ్యారల్ చమురు 80 డాలర్ల స్థాయిలో కదిలే వీలుంది. వెరసి ముడిచమురు ధరలు అధికస్థాయిలలో కొనసాగనున్నట్లు భావిస్తున్నామని వివరించారు.ఈ నేపథ్యంలో స్పాట్ ధరలతో పోలిస్తే ఫ్యూచర్స్ మార్కెట్లో అధిక(ప్రీమియం) ధరలు పలుకుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం చమురు సరఫరాల కొరత ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. చమురు ధరల ఫలితంగా దేశ జీడీపీ వృద్ధిలో 0.6 శాతం కోత పడవచ్చని వెరసి 6.3 శాతానికి ఆర్థిక పురోగతి పరిమితంకావచ్చని అంచనా వేశారు. -
ఈసారి రేట్ల పెంపు తప్పదా?
భారత ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ సెగ తగలనుందా? రాబోయే కాలంలో సామాన్యుడిపై వడ్డీ భారాలు మరింత పెరగనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా ఆర్థిక విశ్లేషణలు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరలు, అస్థిరంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల (ఎల్ నినో) నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ హెచ్ఎస్బీసీ వెల్లడించింది. 2027 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచవచ్చని ఈ నివేదిక స్పష్టం చేసింది.ద్రవ్యోల్బణం గుప్పిట్లో వృద్ధి రేటుద్రవ్యోల్బణ భయాలు గడిచిన కొద్దికాలంగా మార్కెట్లను వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఇంధన ధరలు, వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అంతరాయాలు ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తాయని నివేదిక పేర్కొంది. ‘2027 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 5.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్ నినో వాతావరణ పరిస్థితుల వల్ల ఆహార ద్రవ్యోల్బణానికి అదనంగా 0.5% (50 బేసిస్ పాయింట్లు) తోడయ్యే ప్రమాదం ఉంది’ అని తెలిపింది.‘శక్తి వనరులు, ఎల్ నినో షాక్ల కలయిక వల్ల 2027 ఆర్థిక సంవత్సరం సవాలుగా మారనుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఆర్బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను పెంచి రెపో రేటును 5.75 శాతానికి(ప్రస్తుతం 5.25గా ఉంది) చేర్చే అవకాశం ఉంది’ అని హెచ్ఎస్బీసీ నివేదిక పేర్కొంది.ఆహార భద్రత - వాతావరణ సవాళ్లుగత పదేళ్ల సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే రాబోయే కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగితే అది నేరుగా పంట దిగుబడిపై ప్రభావం చూపుతుంది. 2026 తర్వాత ఎల్ నినో పరిస్థితులు బలపడితే ఆ ప్రభావం 2027లో ఆహార ధరల పెరుగుదలకు దారితీస్తుంది. అయితే, ప్రస్తుతం భారత ప్రభుత్వ గిడ్డంగుల్లో ఉన్న అధిక ఆహార ధాన్యాల నిల్వలు కొంతవరకు ఉపశమనాన్ని కలిగించవచ్చని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది.విధాన రూపకర్తలకు పరీక్షఆర్బీఐ ఒకవైపు పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి. మరోవైపు మందగిస్తున్న వృద్ధిని పరుగులు పెట్టించాలి. గ్రామీణ గృహాలు, చిన్న వ్యాపారాలపై ఈ ధరల పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉండనుంది.వృద్ధి మందగిస్తున్న సమయంలో వడ్డీ రేట్లు పెంచడం వల్ల పెట్టుబడులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం నియంత్రణకే ఆర్బీఐ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
నిధుల సమీకరణే మార్గం
భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, వనరులను సమర్థవంతంగా పునర్నిర్మించడానికి మెరుగైన బాండ్ మార్కెట్ అభివృద్ధి అత్యవసరమని 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్కే సింగ్ స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ వృద్ధి పథంలో బ్యాంకింగ్ రంగం పోషించాల్సిన పాత్ర, మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన నిధుల సమీకరణపై విశ్లేషణ చేశారు.మౌలిక సదుపాయాల రంగానికి ఊతంప్రస్తుతం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల కోసం ప్రధానంగా వాణిజ్య బ్యాంకులపైనే భారం పడుతున్నారు. దీనివల్ల బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు నిల్వలు దీర్ఘకాలిక ప్రాజెక్టులలో చిక్కుకుపోతున్నాయి. మెరుగైన బాండ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అక్కడి నుంచే లభిస్తుందని సింగ్ చెప్పారు. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు తమ వనరులను ఇతర ప్రాధాన్యత కలిగిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలకు మళ్లించే వీలుంటుందన్నారు.‘మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి బాండ్ మార్కెట్ను ఉపయోగించుకోవాలి. అప్పుడే వాణిజ్య బ్యాంకులు తమ ప్రధాన బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించగలవు’ అని ఎన్కే సింగ్ పేర్కొన్నారు.బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలుకేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటును సింగ్ స్వాగతించారు. భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు కేవలం రుణదాతలుగానే కాకుండా ఆర్థిక మధ్యవర్తులుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని పాత నిబంధనల వల్ల భారీగా నిధులు స్తంభించిపోతున్నాయి. వీటిని కమిటీ పునసమీక్షించాలి’ అని సూచించారు.ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి! -
2026–27లో 6.6 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఎస్బీఐ అధ్యయన విభాగం నివేదిక అంచనా వేసింది. రూపాయి విలువ క్షీణిస్తుండడం, అధిక ముడి చమురు ధరల నేపథ్యంలో బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ (బీవోపీ/క్యాడ్)కు సంబంధించి ప్యాకేజీ అవసరమని పేర్కొంది. రూపాయి ఇటీవలి కాలంలో గణనీయంగా నష్టపోవడం తెలిసిందే. డాలర్తో 95 స్థాయి కంటే దిగువకు పడిపోయింది. ‘‘బ్రెంట్ చమురు ధర బ్యారెల్కు 100 డాలర్లు మించిపోవడంతో.. రవాణా, బీమా ఖర్చులు పెరిగిపోయాయి. కనుక బీవోపీ పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు అవసరం. డాలర్తో రూపాయి 95 స్థాయిలోనే కొనసాగితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.04 ట్రిలియన్ డాలర్లకు పడిపోతుంది. దీంతో 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవాలన్న స్వప్నం 2029–30లోనే సాధ్యపడుతుంది’’అని ఈ నివేదిక తెలిపింది. రూపాయి వేగంగా విలువను కోల్పోతుండడానికి తోడు తీవ్ర ఆటుపోట్లు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించింది. 2025–26 చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని, 2025–26 పూర్తి ఆర్థిక సంవత్సరానికి 7.5 శాతం వద్ద ఉండొచ్చని అంచనా వేసింది. వృద్ధి 6 శాతమే: హెచ్ఎస్బీసీ ఇంధన ధరల పెరుగుదల/సరఫరా సంక్షోభానికి తోడు, ఎల్నినోతో వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న అంచనాలు, ద్రవ్యలోటు పెరిగే పరిస్థితులతో భారత్ జీడీపీ వృద్ధి 2026–27లో 6 శాతానికి పరిమితం కావొచ్చని అంతర్జాతీయ బ్రోకరేజీ హెచ్ఎస్బీసీ తెలిపింది. ఈ పరిస్థితులతో ద్రవ్యోల్బణం పెరుగుతుందని.. ఫలితంగా ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను రెండు సార్లు (వచ్చే డిసెంబర్, మార్చి సమీక్షల్లో) పెంచొచ్చని అంచనా వేసింది. ప్రస్తుత సంక్షోభం సంఘటిత రంగం, చిన్న సంస్థలు, గ్రామీణ గృహాలపై భారం మోపుతుందని హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలతో సాగు కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. 2026–27లో ద్రవ్యోల్బణం 5.6 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. రెండు త్రైమాసికాల్లో 6 శాతాన్ని మించొచ్చని పేర్కొంది. చమురు మార్కెటింగ్ సంస్థలపై భారం తగ్గించేందుకు పెట్రోల్ లీటర్పై రూ.7 వరకు పెంచొచ్చని అంచనా వేసింది. పెంపు లేకపోతే మాత్రం అప్పుడు ద్రవ్యోల్బణం 5.3 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. -
ఈక్విటీ ఫండ్స్లోకి రూ.38,440 కోట్లు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదలతో ఈక్విటీల్లో అస్థిరతలు కొనసాగుతున్న తరుణంలోనూ రిటైల్ ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పట్ల నమ్మకం బలంగానే కొనసాగుతుంది. ఏప్రిల్లో రూ.38,440 కోట్ల పెట్టుబడులు నికరంగా ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. మార్చి నెలలో పెట్టుబడులు రూ.40,450 కోట్లతో పోల్చి చూస్తే 5 శాతం తగ్గగా.. 2025 ఏప్రిల్ నెల పెట్టుబడులు రూ.24,269 కోట్ల కంటే 58 శాతం పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన పెట్టుబడులు రూ.25,978 కోట్లుగా ఉన్నాయి. ఈ మేరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఏప్రిల్ నెల గణంకాలను విడుదల చేసింది. → సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్( సిప్) ద్వారా ఈక్విటీ పథకాల్లోకి ఏప్రిల్లో రూ.31,115 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో వచ్చిన రూ.32,087 కోట్లతో పోల్చితే స్వల్పంగా తగ్గాయి. → సిప్ల నిలిపివేత నిష్పత్తి మార్చిలో 101 శాతంగా ఉంటే, ఏప్రిల్లో 97 శాతానికి తగ్గింది. సిప్ నిర్వహణ ఆస్తులు రూ.16.85 లక్షల కోట్లకు చేరాయి. → మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ ఏప్రిల్లో నికరంగా రూ.3.22 లక్షల కోట్లను వివిధ పథకాల్లోకి ఆకర్షించింది. మార్చిలో పరిశ్రమ నుంచి నికరంగా రూ.2.4 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోవడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్లోకి రూ.2.5 లక్షల కోట్లు రావడం ఏప్రిల్లో భారీ వృద్ధికి అనుకూలించింది. → మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 11 శాతం పెరిగి రూ.81.92 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి విలువ రూ.73.73 లక్షల కోట్లుగా ఉంది. మిడ్, స్మాల్క్యాప్ ఫండ్స్ జోరు.. మిడ్క్యాప్ ఫండ్స్ రూ.6,551 కోట్లు, స్మాల్క్యాప్ ఫండ్స్ రూ.6,885 కోట్ల చొప్పున ఆకర్షించాయి. మార్చితో పోల్చితే ఈ రెండు విభాగాల్లోకి 8–10 శాతం మేర అధిక పెట్టుబడులు వచ్చాయి. లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.2,525 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. → డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఏప్రిల్లో రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. ఇందులో లిక్విడ్ ఫండ్స్లోకే రూ.1,65,205 కోట్లు వచ్చాయి. ఓవర్నైట్ ఫండ్స్లోకి రూ.31,240 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్లోకి రూ.20,643 కోట్ల చొప్పున వచ్చాయి. → బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు)లోకి పెట్టుబడులు మళ్లీ పుంజుకున్నాయి. మార్చి నెలలో రూ.2,266 కోట్ల పెట్టుబడులకు పరిమితం కాగా, ఏప్రిల్లో రూ.3,040 కోట్లకు పెరిగాయి. → సిల్వర్ ఈటీఎఫ్ల్లోకి కేవలం రూ.127 కోట్ల పెట్టుబడులే వచ్చాయి. → ఫోకస్డ్ ఫండ్స్ రూ.1,194 కోట్లను ఆకర్షించాయి. → ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.567 కోట్లను ఉపసంహరించుకున్నారు. → హైబ్రిడ్ ఫండ్స్ (ఈక్విటీ, డెట్ కలిసిన)లోకి రూ.20,565 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో ఈ విభాగంలోకి రూ.16,538 కోట్లు రావడం గమనార్హం. → ఏప్రిల్లో 11 కొత్త పథకాలు మార్కెట్లోకి ప్రవేశించి ఇన్వెస్టర్ల నుంచి రూ.828 కోట్లను సమీకరించాయి. -
మోదీ పొదుపు మంత్రం.. ఎకానమీకి శుభసూచకం!
సాక్షి, బిజినెస్ డెస్క్: పశ్చిమాసియా యుద్ధం దెబ్బతో క్రూడ్ రేట్లు భగ్గుమనడంతో మన ఆర్థిక వ్యవస్థకు బాగానే సెగ తగులుతోంది. ముడిచమురు ధరలు 100 డాలర్ల పైకి దూసుకెళ్లడంతో దిగుమతుల బిల్లు తడిసిమోపెడవుతోంది. మరోపక్క, బంగారం రేట్లు కూడా దూసుకెళ్లడంతో విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు దిగుజారుతున్నాయి. దీని ప్రభావంతో రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి దిగజారి నేల చూపులు చూస్తోంది. తాజాగా 95.28 ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన సూచన దేశవ్యాప్తంగా అటు పరిశ్రమ వర్గాల్లో ఇటు ప్రజల్లో సంచనలం రేపుతోంది. ఎకానమీకి దన్నుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసం పొదుపు చర్యలు పాటించాలంటూ మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని.. పెట్రోలు, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని... ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలన్నారు. అలాగే విదేశీ ప్రయా ణాలను వాయిదా వేసుకోవడం, వంటనూనెలు, ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవాలని కూడా పేర్కొన్నారు. ఈ చర్యలతో ఆర్థిక వ్యవస్థకు లాభంతో పాటు నష్టాలు కూడా ఉంటాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. దిగుమతుల భారం తగ్గడంతో కాస్త కరెంట్ ఖాతా లోటు దిగొచ్చి.. రూపాయికి దన్నుగా నిలిచినప్పటికీ, దేశీ యంగా వినిమయం తగ్గడంతో ఎకానమీ మందగించే ప్రమాదం కూడా ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు.బంగారం గుదిబండ...భారతీయులు సహజంగానే పసిడి ప్రియులు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాల కొనుగోళ్లకు తోడు ఇటీవల పెరిగిన పుత్తడి రేట్లతో పెట్టుబడులకు కూడా మనోళ్లు సై అంటున్నారు. దీంతో బంగారం దిగుమతులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఏటా దేశంలోకి 700–800 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్నది కేవలం 1–2 టన్ను లు మాత్రమే. 90% పైగా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. దేశ దిగుమతుల్లో ఇది దాదాపు 10% మరోపక్క, ఆపదలో ఆదుకునే సాధనంగా పసిడికి ప్రాముఖ్యత పెరగడంతో సెంట్రల్ బ్యాంకులు కూడా పొలోమంటూ గోల్డ్ నిల్వలు పెంచుకుంటున్నాయి. మన ఆర్బీఐ కూడా టన్ను ల కొద్దీ పోగేసుకుంటోంది. ప్రస్తుతం నిల్వలు 880 టన్నులకు చేరాయి. 2005–26లో 72 బిలియన్ డాలర్లు విలువైన బంగారం దిగుమతైంది. దీనివల్ల భారీమొత్తంలో ఫారెక్స్ నిల్వలు వెచ్చించాల్సి వస్తోంది. అయితే, రేట్లు భారీగా పెరగడంతో ఇటీవల బంగారం దిగుమతులు బాగానే తగ్గుముఖం పట్టాయి. అయితే, రేటు (అంతర్జాతీయంగా ఔన్స్ ప్రస్తుతం 4700 డాలర్లు) అధిక స్థాయిలోనే కొనసాగుతుండటంతో భారీగా డాలర్లు వెచ్చించాల్సి వస్తోంది. మోదీ చెప్పినట్లుగా బంగారం కొనుగోళ్లు తగ్గించుకుంటే, దిగుమతులు దిగొచ్చి.. ఫారెక్స్ నిల్వలకు దన్నుగా నిలుస్తుంది. దీనివల్ల రూపాయి పతనానికి కూడా అడ్డుకట్టపడుతుంది. బంగారం దిగుమతులు 30–40% తగ్గితే 20–25 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయి. 50% తగ్గితే 36 బిలియన్ డాలర్లు సేవ్ అవుతాయి. అంటే ప్రజలు బంగారం కొనడం తగ్గిస్తే దేశం నుంచి బయటకు వెళ్లే డాలర్ల ప్రవాహం భారీగా తగ్గుతుంది. అయితే, దేశీయంగా కొనుగోళ్లు మందగించడం వల్ల ఆభరణాల విక్రేతలపై ప్రభావం పడుతుందని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, ఫిజికల్ గోల్డ్కు బదులు ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్లు, ఈ–గోల్డ్ రిసీట్స్ వంటి పేపర్ గోల్డ్ రూపంలో కొనుగోలు చేయడం వల్ల అటు దిగుమతుల భారం తగ్గడంతో పాటు పెట్టుబడులకు కూడా కొలిసొచ్చే అంశమని నిపుణులు సూచిస్తున్నారు. ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఒక్కసారిగా క్రూడ్ ధరలు భగ్గుమనడం తెలిసిందే. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ రేటు 119 డాలర్లకు దూసుకెళ్లింది. రెండు నెలలుగా సగటున 100 డాలర్ల పైనే కదలాడుతోంది. దీంతో క్రూడ్ దిగుమతుల భారం భారీగా పెరిగిపోతోంది. భారత్ చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం మేర దిగుమతి చేసుకోవాల్సి రావడం.. హార్మూజ్ జలసంధిలో అడ్డంకులతో సరఫరా తగ్గడంతో రేట్లు పైపైకి చేరి దిగుమతులు గుదిబండగా మారుతున్నాయి. 2025–26లో మనం 134.7 బిలియన్ డాలర్ల విలువైన క్రూడాయిల్ దిగుమతి చేసుకోవడం గమానార్హం. మన మొత్తం దిగుమతులు 775 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో అత్యధిక వాటా క్రూడ్దే. అయితే, ప్రభుత్వం మాత్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచకుండా ప్రజలపై భారం పడకుండా చూస్తోంది. మరోపక్క, ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎంసీలు) కు కొంచెం ఊరటనిచ్చింది. దీనివల్ల కేంద్ర ఖాజానాకు నెలకు రూ.14,000 కోట్ల చిల్లు పడుతోంది. ఇక రేట్లు పెంచకపోవడం వల్ల ఓఎంసీలు రోజుకు సుమారు రూ.1,700 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నట్లు అంచనా. అంటే గత పది వారాల్లో వాటిపై ఏకంగా రూ. లక్ష కోట్లకు పైగానే భారం పడినట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే మోదీ పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకోవాలని, కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని, కార్ పూలింగ్తో పాటు, మెట్రో రైళ్లు ఇతరత్రా ప్రభుత్వ రవాణా సదుపాయాలను వాడాలంటూ సూచించారు. దీనివల్ల అటు క్రూడ్ దిగుమతులకు కాస్త అడ్డుకట్టపడి.. ఫారెక్స్ నిల్వలపై ఒత్తిడి తగ్గుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ పెట్రో పొదుపు మంత్రంతో సోమవారం ఎలక్ట్రిక్ వాహన కంపెనీ షేర్లు రివ్వుమనడం విశేషం. కాగా, క్రూడ్ ధరలు ఇప్పట్లో శాంతించే అవకాశాలు కనిపించకపోవడం.. మోదీ తాజా సూచనలు చూస్తుంటే, సమీప భవిష్యత్తులో పెట్రో ధరలు పెరిగే అవకాశం కూడా లేకపోలేదనేది కొంత మంది పరిశీలకుల మాట! ట్రావెల్ రంగంపై ప్రభావం.. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలంటూ మోదీ సూచించడం కూడా ఫారెక్స్ నిల్వలు కరిగిపోకుండా చూసుకోవడం కోసమే.. ఎందుకంటే, విదేశాలకు వెళ్లాలంటే డాలర్లను కొనుగోలు చేయాల్సి వస్తుంది. హోటళ్లను బుక్ చేసుకోవాలన్నా డాలర్లు వెచ్చించాల్సిందే. 2025లో 3.27 కోట్ల మంది భారతీయులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినట్లు అంచనా. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మనోళ్లు విదేశీ ట్రిప్పుల కోసం వెచ్చించిన మొత్తం 31.7 బిలియన్ డాలర్లు. అంటే ఆ మేరకు దేశం నుంచి డాలర్లు బయటికి వెళ్లిపోయాయి. మోదీ సూచన పాటిస్తే, ఈ భారం తగ్గుతుంది. అయితే, విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ తగ్గడంతో ట్రావెల్, ఏవియేషన్ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. మార్కెట్లో ఇప్పటికే దీని సెగ తగిలింది. యాత్రా, థామస్ కుక్ వంటి ట్రావెల్ సంస్థల షేర్లతో పాటు ఇండిగో షేరు కూడా 5 శాతం పైగా పడిపోయాయి. ఫారెక్స్ నిల్వలు తగ్గుముఖం... క్యాడ్ పైపైకి పశ్చిమాసియా యుద్ధం ప్రారంభానికి ముందు అంటే ఫిబ్రవరి చివరల్లో భారత విదేశీ మారక నిల్వలు 728.5 బిలియన్ డాలర్లకు చేరి ఆల్టైమ్ రికార్డును నమోదు చేశాయి. క్రూడ్ ధరలు భగ్గమనడం.. దిగుమతుల బిల్లు పెరిగిపోవడంతో ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం సుమారు 690.69 బిలియన్ డాలర్లకు చేరాయి. మరోవైపు ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2026లో భారత కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం (ప్రధానంగా డాలర్లు) మధ్య వ్యత్యాసం) 84.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇది మన జీడీపీలో 2 శాతానికి సమానం. అంటే దేశంలోకి వచ్చే డాలర్ల కంటే బయటికి వెళ్లే మొత్తం భారీగా పెరిగిపోతుందన్నమాట! దీనివల్ల రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. -
గిఫ్ట్లపై ఐటీ శాఖ నిఘా.. ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి!
ఒకప్పుడు బహుమతులకంటూ ఓ ప్రత్యేక చట్టం ఉండేది. దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కానీ, కొన్ని వేల కేసులు మిగిలాయి కోర్టుల్లో. పైగా ఈ బాధ్యతలను నిర్వహించేవారు సాక్షాత్తు ఇన్కంట్యాక్స్ అధికారులే. చాలా చాలా ఆచరణాత్మకంగా ఆలోచించి, ఈ చట్టంలోని అంశాలను చట్టం రద్దు చేసిన తర్వాత ఆదాయచట్టంలో అంతర్భాగంగా కలిపారు.1961 చట్టంలోనే బహుమతులపై పన్ను భారానికి సంబంధించినవన్నీ ఇమిడిపోయాయి. వాటన్నింటినీ కొత్త చట్టం 2025లో యథాతథంగా పొందుపర్చారు.కట్నాలనుకోండి, కానుకలు అనుకోండి, వర దక్షిణ .. సంప్రదాయం.. ఆనవాయితీ అనుకోండి. బహుమతులు ఇవ్వడం అనాదిగా వస్తున్న ఒక పరంపర. ఇక నుంచి గిఫ్ట్ అని అందాం. గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి ఎటువంటి పన్నుభారం ఉండదు. అయితే, చాలా మంది ఈ అంశాన్ని ఆసరాగా తీసుకుని ఏదో ఒక దొంగ పేరుతో లేని మనిషిని సృష్టిస్తారు. అయితే, ఇలాంటి గిఫ్టుల విషయంలో మూడు విషయాలను మీరు రుజువులతో నిరూపించవలసి వస్తుంది. నిజంగా దాత ఉన్నాడా లేదా.రెండోది వ్యవహారం జరిగిందా లేదా. అంతే. నాటకం..బూటకం కాదు కదా. బదిలీ కాగితాల పత్రాలు, దస్తావేజులు, రాతలు–కోతలు, బ్యాంకు అకౌంట్లలో పద్దులు అన్నీ ఉండాలి.దాత స్తోమత, ఆదాయ ఆర్జన సామర్థ్యాలు, దానం ఇచ్చేందుకు ‘సోర్స్’ ఉండాలి. ఈ మూడు షరతులు సక్రమంగా ఉన్నట్లయితే, నిరూపిస్తే దాతను వదిలేస్తారు. ఇక బంతి స్వీకర్త చేతిలో పడుతుంది. స్వీకర్త వ్యక్తిగత ఆదాయపు లెక్కల్లో ‘గిఫ్ట్’ గురించి ఆరా తీస్తారు. షరతులకు లోబడి మినహాయింపులిస్తారు లేదా పన్ను భారం వేస్తారు. ఆదాయ వర్గీకరణలో ‘గిఫ్ట్’ని ఇతర ఆదాయం కింద భావిస్తారు.గిఫ్ట్లో వివిధ రకాలు..నగదు, చెక్కు, బ్యాంకు బదిలీకంపెనీలో వాటాలు, బాండ్లు, సెక్యూరిటీలు, బంగారం, వెండి, రత్నాలు, వజ్రాలు, ఆభరణాలు, విలువైన పురాతన వస్తువులు, పెయింటింగ్స్ మొదలైనవిల్యాండ్, బిల్డింగ్, విల్లాలు, అపార్ట్మెంట్స్, ఫ్లాట్లు, మల్గీలు.. ఇలా ఎన్నో స్థిరాస్తులుఎంత వరకు మినహాయింపు..ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 దాటితే, అన్నింటికి కలిపి, పన్ను భారం ఏర్పడుతుంది. రూ. 50,000 లోపల గిఫ్ట్ల మీద ఎటువంటి పన్ను ఉండదు. లిమిట్ దాటితే మొత్తం బహుమతుల మీద పన్ను పడుతుంది. నగదు అయితే నగదు విలువ మీద ఇది ఉంటుంది.ఇక చరాస్తులైతే వాటి మార్కెట్ విలువ, అది కూడా ఫెయిర్ మార్కెట్ వేల్యూని పరిగణనలోకి తీసుకుంటారు. స్థిరాస్తులైతే రిజి్రస్టేషన్ సందర్భంలో స్టాంపు డ్యూటీ ఎంత మీద చెల్లించారో అంత విలువపైన లెక్కిస్తారు. ఇవన్నీ మీకు తెలిసినవే!మినహాయింపులు వర్తించే గిఫ్టులు..బంధువులు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, అనువంశీకుల నుంచి వచ్చే గిఫ్టులు.పెళ్లి సందర్భంలో ఎంత విలువైన గిఫ్టులైనా మినహాయింపు ఇస్తారు. ఒక జాబితా రాసుకోండి. నగదైనా ఫర్వాలేదు. పేరు, బంధుత్వం, విలువ రాయండి. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయండి. కాగితాలు, పత్రాలు భద్రపర్చండి. వీలునామా ద్వారా ఎలాంటి ఆదాయం, ఆస్తి వచ్చినా పన్నుండదు. అయితే, విల్లు ఉండాలి. అది అమల్లోకి రావాలి.చనిపోయే ముందు సెంటిమెంటు, అటాచ్మెంటు, సంప్రదాయం కింద బహుమతులు ఇస్తే పన్ను భారం ఉండదు.గతంలో ఎన్నో ఉదాహరణల ద్వారా మనం ఈ విషయాలు చెప్పాం. తగిన జాగ్రత్త వహించాలి. లాజిక్కులు, మేజిక్కులు వద్దు. అబద్ధాలొద్దు. వ్యవహారాన్ని చక్కగా వ్యక్తపరచి, సరైన పత్రాలతో సంజాయిషీ ఇస్తే, ఎలాంటి చిక్కులూ ఉండవు. వివరణ ఇవ్వకపోతే, మీ ఇన్కం కింద భావించి పన్ను వేస్తారు. బంధువుల మధ్య గిఫ్ట్ వ్యవహారం జరిగినా, కాగితాలు ఉండాలి. ఉదాసీనత వద్దు. మన ఆలోచన ప్రకారమే జరుగుతుందన్న భ్రమ వద్దు. -
కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కరెన్సీ మార్కెట్లో తన జోక్యాన్ని తగ్గించుకోవాలని, రూపాయి విలువలో సహజమైన మార్పులకు అవకాశం కల్పించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సూచించారు. పెరుగుతున్న దిగుమతి ఖర్చులు, విదేశీ నిధుల ప్రవాహం వంటి సవాళ్ల నేపథ్యంలో మార్కెట్ శక్తులకు అనుగుణంగా మారకపు రేటు ఉండటమే సరైన ఆర్థిక సంకేతాలను పంపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దేశ ఆర్థిక పరిస్థితి, రూపాయి ఒడిదుడుకులపై కీలక వ్యాఖ్యలు చేశారు.2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో ఆర్బీఐని నడిపించిన సుబ్బారావు, ప్రస్తుత విధానాలపై స్పందిస్తూ.. ‘భారత్ ఒక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మన మార్కెట్ ప్లేయర్లు రూపాయి విలువలో పెచ్చుతగ్గులను తట్టుకోవడం నేర్చుకోవాలి. ఆర్బీఐ అతిగా జోక్యం చేసుకోవడం కంటే మార్కెట్ తనంతట తాను సర్దుబాటు చేసుకునేలా చూడటం ఉత్తమం’ అని పేర్కొన్నారు.ఆంక్షల వల్ల తాత్కాలిక ఉపశమనమే..ప్రస్తుత గవర్నర్ నేతృత్వంలోని ఆర్బీఐ, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోకుండా అడ్డుకోవడానికి బ్యాంకులపై కొన్ని ఆంక్షలు విధించింది. అయితే, ఇటువంటి దూకుడు చర్యలు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయని సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగడం రూపాయిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ ఏడాది డాలర్తో పోలిస్తే రూపాయి సుమారు 5% బలహీనపడి ఆసియాలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా నిలిచింది.అప్పటి పరిస్థితి వేరు..సుబ్బారావు పదవీకాలంలో (2008-2013) భారతదేశం ఆర్థికంగా బలహీనంగా ఉండేది. తక్కువ విదేశీ మారక నిల్వలతో దేశం ‘ఫ్రెజిల్ ఫైవ్’ దేశాల జాబితాలో ఉండేది. కానీ నేడు పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ‘అప్పడు నిల్వలు తక్కువ, ద్రవ్యోల్బణం ఎక్కువ. ప్రస్తుతం బలమైన వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉంది. ఈ సానుకూల అంశాల వల్ల రూపాయి విలువ కొంత మేర తగ్గినప్పటికీ దేశం తట్టుకోగలదు’ అని ఆయన భరోసా ఇచ్చారు.వడ్డీ రేట్ల పెంపు చివరి ఆయుధంరూపాయిని కాపాడటానికి వడ్డీ రేట్లను పెంచడం అనేది అంతిమ ప్రయత్నంగా మాత్రమే ఉండాలని హెచ్చరించారు. ‘వడ్డీ రేట్లు పెంచితే అది ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాన్ని మార్కెట్లకు ఇస్తుంది. ఇప్పటికే వృద్ధి రేటుపై రకరకాల ఒత్తిళ్లు ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ వృద్ధిని పణంగా పెట్టి రేట్లను పెంచకపోవడమే మంచిది’ అని విశ్లేషించారు. -
వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యం!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో దేశ ఆర్థిక భద్రతను కాపాడుకునేందుకు భారతీయులందరూ ఆర్థిక దేశభక్తిని చాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన రాబోయే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పౌరులను కోరారు. విదేశీ మారక ద్రవ్యాన్ని (ఫారెక్స్) ఆదా చేయడం ద్వారా రూపాయి విలువను స్థిరీకరించి దేశ ఆర్థిక పునాదులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విజ్ఞప్తి చేశారు.సంక్షోభ సమయం.. అప్రమత్తత అవసరంపశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, అంతరాయం కలుగుతున్న సరఫరా గొలుసు వ్యవస్థలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘సరఫరా గొలుసుపై ఒత్తిడి ఉన్నప్పుడు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడం మనందరి బాధ్యత’ అని ప్రధాని పేర్కొన్నారు.ముఖ్యంగా భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధ మేఘాల వల్ల ఎరువులు, చమురు ధరలు పెరగడం వల్ల డాలర్ అవుట్ఫ్లో పెరిగి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బంగారం వంటి ‘అంతగా అవసరం లేని’ (డిస్క్రీషనరీ) దిగుమతులను తగ్గించడం వల్ల వాణిజ్య లోటును అదుపులో ఉంచవచ్చని ఆయన ఆకాంక్షించారు.బలమైన స్థితిలో ఫారెక్స్ నిల్వలుప్రధాని ఈమేరకు విజ్ఞప్తి చేసినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిపై ఆయన పూర్తి భరోసా ఇచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాల ప్రకారం, భారత్ ప్రస్తుతం అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంది. మార్చి 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 691.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ నిల్వలు దాదాపు 11 నెలల పాటు దేశ దిగుమతి అవసరాలను తీర్చగలవు. భారత్ వద్ద ప్రస్తుతం 880.52 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందులో 680.05 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్బీఐ ఇప్పటికే విదేశాల నుంచి స్వదేశానికి రప్పించి భద్రపరిచింది. ఆర్బీఐ వైవిధ్య వ్యూహం వల్ల విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా సెప్టెంబర్ 2025లో 13.92% ఉండగా, అది మార్చి 2026 నాటికి 16.7 శాతానికి పెరిగింది.ప్రధాని సూచించిన మార్గదర్శకాలువిదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి కేవలం బంగారం వాయిదా వేయడమే కాకుండా జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని ప్రధాని సూచించారు.పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు మెట్రో రైలు, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి.సాధ్యమైన చోట ఇంటి నుంచే పని విధానాన్ని అనుసరించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించవచ్చు.విదేశీ వస్తువుల కంటే స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి.వ్యక్తిగత వాహనాల కంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థలను, రైల్వే సరుకు రవాణా సేవలను వినియోగించుకోవాలి.రసాయన ఎరువుల దిగుమతి భారాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి.‘మనం చేసే ప్రతి చిన్న పొదుపు, దేశాన్ని ప్రపంచ ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతుంది’ అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రయోజనాలే పరమావధిగా పౌరులు స్పందించాలని ఆయన కోరారు.ఇదీ చదవండి: నిప్పులపై నీళ్లు చల్లినట్లు.. బంగారం ధరలు -
హెల్త్ క్లెయిమ్ తిరస్కరిస్తే కుదరదిక!
హెల్త్ ఇన్సూరెన్స్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను సకాలంలో దాఖలు చేయకపోతే బీమా సంస్థలు నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంటాయి. కానీ, ఇకపై అలా కుదరదు. నిర్ణీత గడువులోపు సాధ్యపడక, ఆలస్యంగా ఫైల్ చేసినా.. నిబంధనలకు అనుగుణంగా మదింపు చేయాల్సిందే. రూపాయితో సహా చెల్లించాల్సిందే. ఏప్రిల్ 20న బొంబే హైకోర్టు ఈ దిశగా ఇచ్చిన తీర్పు పాలసీదారులకు ఆర్థిక ఉపశమనం కాగా.. నిబంధనలు పాలసీదారులకు అనుకూలంగా ఉన్నా, ఇంతకాలం తమకు అనుకూలంగా మలుచుకుంటున్న బీమా సంస్థలకు కనువిప్పే. అసలైన క్లెయిమ్ దరఖాస్తులను ఆలస్యంగా దాఖలు చేశారని చెప్పి తిరస్కరించడం కుదరదని హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది. కనుక అర్థం పర్థం లేని కారణాలతో హెల్త్ క్లెయిమ్కు తిరస్కారం ఎదురైతే.. మిన్నకుండిపోవక్కర్లేదు. కారణం తెలుసుకుని బీమా సంస్థను నిలదీయొచ్చు. బిల్లు మొత్తాన్ని రాబట్టుకోవచ్చు. బొంబే హైకోర్టు తీర్పు పాలసీదారుల హక్కులను పరిరక్షించేదిగా నిపుణులు అభివరి్ణస్తున్నారు. సీపీ రవీంద్రనాథ్ మీనన్ అనే వ్యక్తి తన హెల్త్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను బీమా సంస్థ పెట్టిన నిర్దేశిత గడువు దాటిన తర్వాత దాఖలు చేశాడు. నిబంధనల్లో పేర్కొన్నట్టు 90 రోజుల్లోగా క్లెయిమ్ దాఖలు చేయనందున దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సమాధానం ఇచ్చింది. దీంతో పాలసీదారుడు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. కేవలం ఆలస్యంగా క్లెయిమ్ దాఖలు చేశారంటూ తిరస్కరించడం చట్టం కింద చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తరహా నిబంధనలు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, 1872లోని సెక్షన్ 28(బి)ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. చట్టపరిధిలో అర్హత కలిగిన క్లెయిమ్ను సాంకేతిక కారణాలతో తిరస్కరించరాదని తేల్చి చెప్పింది. హెల్త్ పాలసీలకు సంబంధించి సమయ నిబంధనలు చెల్లనివి, అమలు చేయరానివిగా పేర్కొంది. ఒప్పంద నిబంధనలు నిజమైన హక్కులను రద్దు చేయలేవంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలో చెప్పిన తీర్పు ఆధారంగా బొంబే హెకోర్టు ఈ కేసులో బీమా సంస్థ వాదనను తోసిపుచ్చింది. పాలసీదారుడి క్లెయిమ్కు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేయాలని, ఆ మొత్తంపై 6 శాతం వడ్డీ కూడా చెల్లించాలని తీర్పు జారీ చేసింది.నగదు రహితం – రీయింబర్స్మెంట్నగదు రహితం: ఇందుకు సంబంధించి ఆస్పత్రులు 2024/2026 ఐఆర్డీఏఐ మాస్టర్ సర్క్యులర్ను అనుసరిస్తున్నాయి. దీని ప్రకారం బీమా సంస్థ నగదు రహిత క్లెయిమ్కు ముందస్తు అనుమతి అన్నది గంటలోపు మంజూరు చేయాలి. డిశ్చార్జ్ క్లెయిమ్కు 3 గంటల్లోపు అనుమతి జారీ చేయాలి. ఆలస్యం చేస్తే.. ఆ సమయంలో ఆస్పత్రిలో ఉండేందుకు అయ్యే వ్యయాలను సైతం బీమా సంస్థ చెల్లించాల్సిందే. రీయింబర్స్మెంట్ క్లెయిమ్: ముందుగా సొంత పాకెట్ నుంచి చెల్లింపులు చేసి, తర్వాత బీమా సంస్థ వద్ద రీయింబర్స్మెంట్ కోసం క్లెయిమ్ దాఖలు చేసుకోవడం. సాధారణంగా 30 రోజులు మించకుండా ఈ క్లెయిమ్ను దాఖలు చేయాల్సి ఉంటుంది.ఎందుకు కాల పరిమితులు? → క్లెయిమ్లకు సంబంధించి బీమా కంపెనీలు కాల పరిమితులు నిర్ణయించడం వెనుక.. వీలైనంత త్వరలో వాటిని మదింపు చేయడం ద్వారా వాస్తవ సమాచారాన్ని గుర్తించడం సులభతరమవుతుందనే. → ఒకవేళ, క్లెయిమ్ దాఖలు ఆలస్యం అవడం వెనుక సహేతుక కారణాలుంటే తిరస్కరించడానికి కుదరదని నిబంధనలు సైతం చెబుతున్నాయి. → ఒంటరి వ్యక్తులు ఐసీయూలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ కావొచ్చు. అలాంటప్పుడు వారు కోలుకుని ఫైల్ దాఖలు చేయడానికి సమయం తీసుకోవచ్చు. అలాంటప్పుడు క్లెయిమ్ తిరస్కరించడం సహేతుకం కానేకాదు. → ఆరు నెలల తర్వాత క్లెయిమ్ దాఖలు చేసినా సరే, అందుకు సరైన కారణం ఉంటే బీమా సంస్థ అర్హతలకు లోబడి మదింపు చేయాలి. అంతేకానీ కాలహరణం పేరుతో తిరస్కరించకూడదు. ఒకవేళ పాలసీదారుడు మోసం చేసేందుకే జాప్యం చేశాడని బీమా సంస్థ నిరూపిస్తే తప్ప క్లెయిమ్కు తిరస్కారం కుదరదు. → బీమా సంస్థలు, థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్లు (టీపీఏలు/బీమా తరఫున క్లెయిమ్ వ్యవహారాలు చూసే సంస్థలు) క్లెయిమ్కు సంబంధించి, ఏవైనా అదనపు డాక్యుమెంట్లు అవసరమైతే నేరుగా ఆస్పత్రుల నుంచి తీసుకోవాలని ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. → ఆరోగ్య బీమా రక్షణ అన్నది అవసరంలో ఆదుకోవడానికే. కానీ, సాంకేతిక కారణాలు చూపి నో చెప్పేందుకు కాదని కోర్టు తీర్పు స్పష్టం చేస్తోంది. ఆలస్యం అయితే..?→ ఆందోళన చెందాల్సిన పనే లేదు. డిలే కండోనేషన్ లెటర్ను క్లెయిమ్ పత్రాలకు జత చేయండి. → అందులో పాలసీ నంబర్, పేషెంట్ పేరు స్పష్టంగా ఉండాలి. → ఆలస్యం అయినందుకు కారణాన్ని వివరించండి. → న్యాయమైన క్లెయిమ్లను సాంకేతిక కారణాల పేరుతో తిరస్కరించరాదన్న ఐఆర్డీఏఐ మార్గదర్శకాలు, బొంబే హైకోర్టు తీర్పును ఉదహరించండి. సకాలంలో స్పందించండి..→ క్లెయిమ్ దాఖలు ఆలస్యం అయినా అర్హత ఉంటుందని చెప్పి నిర్లక్ష్యం పనికిరాదు. → డిశ్చార్జ్ అయిన తర్వాత వీలైనంత త్వరగా క్లెయిమ్ దాఖలుకు ప్రయత్నించండి. → క్లెయిమ్ దాఖలుకు సమయం పట్టేట్టు ఉంటే బీమా సంస్థకు ముందుగానే దానిపై సమాచారం ఇవ్వండి. → ఒంటరి వ్యక్తులు అయితే ఈ విషయంలో మరొకరి సహకారం తీసుకోవడం మంచిది. → డిశ్చార్జ్ సమ్మరీ నుంచి, ప్రతి బిల్లు ఒరిజినల్ కాపీలు, పాలసీదారుడి ఆధార్, పాన్ కాపీల వరకు ఇలా అన్నింటినీ సిద్ధం చేసుకోవాలి. గతంలో తిరస్కరించినవి అయితే..?→ క్లెయిమ్ను ఆలస్యంగా దాఖలు చేశారన్న కారణంతో లోగడ తిరస్కరించినట్టయితే.. తాజాగా మరోసారి రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. → బొంబే హైకోర్టు తీర్పును ప్రస్తావించండి. తన క్లెయిమ్ను తిరిగి మదింపు వేయాలని కోరొచ్చు. → ఇప్పటి వరకు అర్హత కలిగిన దరఖాస్తులను సైతం ఆలస్యంగా దాఖలు చేశారన్న కారణంగా బీమా సంస్థలు తిరస్కరిస్తూ వచ్చాయి. కానీ, ఇకపై కొంత మార్పును ఆశించొచ్చు. పాలసీదారులు సైతం కాల నియమాల గురించి అవగాహనతో, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం మంచిది. తిరస్కరిస్తే..?→ ఆలస్యాన్ని కారణంగా చూపిస్తూ రీయింబర్స్మెంట్ క్లెయిమ్ను తిరస్కరిస్తే బీమా కంపెనీలోని గ్రీవెన్స్ సెల్ను సంప్రదించాలి. → స్పందన లేకపోతే బీమా అంబుడ్స్మన్ దృష్టికి తీసుకెళ్లాలి. → అప్పటికీ ఉపయోగం లేకపోతే కోర్టును ఆశ్రయించడమే మార్గం. – సాక్షి, వెల్త్ డెస్క్ -
వృద్ధి రేటు 6.6తగ్గొచ్చు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ గ్లోబల్ తెలిపింది. గతంలో 7.1 శాతం వృద్ధి అంచనాను ప్రకటించడం గమనార్హం. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంధన, ఆహార భద్రత రంగాల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్అండ్పీ గ్లోబల్, క్రిసిల్ సంయుక్తంగా ఒక నివేదికను విడుదల చేశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల ఇంధన సరఫరాలో అంతరాయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి సవాళ్లను భారత్ ఎదుర్కొంటోందని తెలిపింది. వీటిని అధిగమించేందుకు భారత్ తగినన్ని ఇంధన నిల్వలు సమకూర్చుకోవాలంటూ.. ఇందుకు వీలుగా ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకోవాలని సూచించింది. చమురు ధరలు పెరగడం, రూపాయి బలహీనపడటం ఆర్థిక వృద్ధిపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి పేర్కొన్నారు. ఆహార భద్రతకు రిస్క్ పశ్చిమాసియా సంక్షోభం ఇలాగే కొనసాగితే ఎరువుల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ముఖ్యంగా శీతాకాలం పంటలకు ఎరువుల కొరత ఏర్పడొచ్చని జోషి అంచనా వేశారు. భారత్ ఇంధన, ఆహార భద్రత, ఎరువుల రంగంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. భారత్ వివిధ దేశాలతో ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్టీఏ) ద్వారా తగిన ప్రయోజనాలను అందుకోవాలంటే.. అంతర్జాతీయ స్థాయిలో మరింత పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని.. ఎఫ్టీఏలతో మరిన్ని మార్కెట్ అవకాశాలు లభించినప్పటికీ, వివిధ రంగాల్లో సంస్కరణలు చేపట్టినప్పుడే పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని నివేదిక తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు ఒక దశలో 126 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల స్థాయిలో ఉండడం గమనార్హం. యుద్ధానికి ముందు 60–70 డాలర్ల మధ్యే ఉంది. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చూస్తోంది. ఎక్సైజ్ ట్యాక్స్ వరకు తగ్గించడం తెలిసిందే. టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ), రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ)పై అధిక చమురు ధరల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న ప్రశ్నకు జోషి స్పందిస్తూ.. అంతర్జాతీయంగా అధిక ధరలు ఉన్నప్పటికీ భారత్లో వినియోగదారులకు దాన్ని బదిలీ చేయనట్టు చెప్పారు. దీని కారణంగా టోకు ద్రవ్యోల్బణం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది గరిష్ట స్థాయి అయిన 3.4 శాతానికి పెరగ్గా.. టోకు ద్రవ్యోల్బణం 38 నెలల గరిష్ట స్థాయి 3.88 శాతానికి చేరడం తెలిసిందే. -
కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం
దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం భారంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) ఒక సంజీవనిలా పనిచేస్తోంది. ఈ పథకం ద్వారా లభించే ‘ఆయుష్మాన్ కార్డు’ ఉంటే చాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా చికిత్స పొందే వీలుంది.ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఏమిటి?ఆయుష్మాన్ భారత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి ఇచ్చే డిజిటల్ గుర్తింపు కార్డునే ‘ఆయుష్మాన్ కార్డు’ లేదా ‘పీఎం-జేఏవై కార్డు’ అంటారు.కార్డు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలుఆసుపత్రిలో చేరినప్పుడు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సుమారు 1,900 పైగా వ్యాధులు, శస్త్రచికిత్సలకు ఇందులో కవరేజీ ఉంటుంది. ఆసుపత్రిలో చేరడానికి 3 రోజుల ముందు నుంచి, డిశ్చార్జ్ అయిన 15 రోజుల వరకు అయ్యే పరీక్షలు, మందుల ఖర్చులు కూడా పథకంలో వర్తిస్తాయి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ పథకం కింద నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా (ప్రభుత్వ లేదా ప్రైవేట్) చికిత్స పొందవచ్చు.ఆయుష్మాన్ కార్డు ఎలా పొందాలి?ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సరళతరం చేసింది. మీ స్మార్ట్ఫోన్ ద్వారానే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.ముందుగా ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్సైట్ (https://beneficiary.nha.gov.in) ను సందర్శించండి లేదా ‘Ayushman App’ డౌన్లోడ్ చేసుకోండి.వెబ్సైట్లో ‘Beneficiary’ ఆప్షన్ను ఎంచుకోండి.మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వచ్చిన OTP ద్వారా లాగిన్ అవ్వండి.మీ రాష్ట్రం, పథకం పేరు (పీఎంజేఏఐ) ఎంచుకోండి.మీ జిల్లాను ఎంచుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ ద్వారా మీ పేరును సెర్చ్ చేయండి.లిస్టులో మీ పేరు పక్కన ఉన్న ‘Identify’ లేదా ‘e-KYC’ బటన్పై క్లిక్ చేయండి.ఆధార్ OTP లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేయండి.మీ ప్రస్తుత ఫోటోను లైవ్లో క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయండి. మీ ఆధార్లోని వివరాలు, ప్రస్తుత వివరాలు సరిపోలితే వెంటనే ఆమోదం లభిస్తుంది.అప్రూవల్ అయిన తర్వాత ‘Download Card’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ డిజిటల్ ఆయుష్మాన్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ (వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా) ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరు ప్రత్యేకంగా ‘వయో వందన’ కార్డు కోసం పైన పేర్కొన్న పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు.ఏవైనా సందేహాలుంటే లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వ హెల్ప్లైన్ నంబర్ 14555 కు కాల్ చేయవచ్చు లేదా సమీపంలోని మీ-సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు.ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు -
ఇంధన మంట షురూ!
కొంతకాలంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇకపై పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల కారణంగా ముడి చమురు ధర ఇటీవల బ్యారెల్కు 70 డాలర్ల నుంచి 110 డాలర్లకుపైగా పెరిగింది. ఈ నేపథ్యంలో మే 15 లోపు చమురు కంపెనీలు ధరల పెంపునకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రపంచం అతలాకుతలం.. భారత్ పరిస్థితి ఏంటి?ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిలో వారాల తరబడి నెలకొన్న అంతరాయం గ్లోబల్ ఎనర్జీ షాక్కు దారితీసింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ ఇంధన రేషనింగ్ను ప్రవేశపెట్టగా, శ్రీలంక, పాకిస్థాన్ పనిదినాలను తగ్గించి ఇంధనాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తున్నాయి. దక్షిణ కొరియా దశాబ్దాల తర్వాత ధరలపై పరిమితులు విధించింది. అయితే, భారత్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కొరత లేకుండా పరిస్థితిని అదుపు చేయగలిగింది.చమురు కంపెనీల నష్టాలుప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ధరలు పెరగకపోవడంతో ఇవి నెలకు సుమారు రూ.30,000 కోట్ల మేర నష్టాన్ని భరిస్తున్నాయి. ముడి చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు ప్రభుత్వం, ఈ సంస్థలు కలిసి పెట్రోల్పై రూ.24, డీజిల్పై రూ.30 భారాన్ని వినియోగదారులపై పడకుండా తామే భరించాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ అంతర్జాతీయ ఒత్తిడి దృష్ట్యా ధరల పెంపు అనివార్యంగా కనిపిస్తోంది. సంక్షోభాన్ని తట్టుకొని..ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత్ ఇంధన భద్రతను కాపాడుకోగలగడానికి కారణం ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలే.దేశీయగా ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు యుద్ధ ప్రాతిపదికన పెంచారు.రష్యా, యూఎస్, పశ్చిమ ఆఫ్రికా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచి సరఫరాను స్థిరీకరించారు. ముడి చమురు సోర్సింగ్(మన దేశానికి ఎగుమతులు చేసేవి) దేశాల సంఖ్య 27 నుంచి 40కి పెరిగింది.గత దశాబ్ద కాలంలో ఎల్పీజీ టెర్మినల్స్ రెట్టింపు అవ్వడం, ఇథనాల్ మిశ్రమం 1.5% నుంచి 20%కి పెరగడం భారత్కు రక్షణ కవచంగా నిలిచింది.దేశీయ రిఫైనరీలు ప్రస్తుతం 100% మించిన సామర్థ్యంతో పనిచేస్తూ నిరంతరాయంగా ఇంధనాన్ని అందిస్తున్నాయి.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన ప్రతిసారీ సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. అయితే చమురు కంపెనీల ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండాలంటే రాబోయే వారం రోజుల్లో ధరల సర్దుబాటు తప్పకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప చమురు సెగ తగ్గేలా లేదు.ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు -
ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని తగ్గించొచ్చు
దేశ జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండడంతోపాటు స్థిరమైన ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని, నియంత్రిత శ్రేణిని ఆర్బీఐ తగ్గించొచ్చని డిప్యూటీ గవర్నర్ (డీజీ) పూనమ్ గుప్తా తెలిపారు. అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా చూస్తే కొంత తక్కువ లక్ష్యాన్ని, మరింత పరిమిత శ్రేణిని నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ గత ఆరేళ్ల కాలంలో మాదిరి అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఇక మీదటా కొనసాగితే అది సౌలభ్యతను, స్పష్టతను తగ్గించొచ్చన్నారు.ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2031 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా.. ప్రతికూల పరిస్థితుల్లో కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 6 శాతం (ప్లస్, మైనస్ 2 శాతం) మించకుండా చూడాలని నిర్దేశించడం గమనార్హం. ఎన్సీఏఈఆర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఈ లక్ష్యం, పరిమిత శ్రేణిని మార్చడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. ధరల నియంత్రణ, వృద్ధి రేటుపైనే భవిష్యత్తు ద్రవ్యోల్బణం కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఇందుకు అంతర్జాతీయ షాక్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.ఆర్బీఐ డీజీగా జైన్ బాధ్యతలు స్వీకరణనలుగురు డీజీలకు పోర్ట్ఫోలియోల కేటాయింపుఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా (డీజీ) రోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఫారెక్స్, ఫిన్టెక్ సహా 10 విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. టి.రవి శంకర్ స్థానంలో జైన్ నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఆయన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. మూడేళ్ల కాలానికి డీజీగా జైన్ను ప్రభుత్వం నియమించింది. 1991లో ఆయన ఆర్బీఐలో చేరడం గమనార్హం. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (ఫైనాన్స్), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఎంకామ్ కోర్సులను పూర్తి చేశారు. అందరిలోకి సీనియర్ డీజీ అయిన స్వామినాథన్ జానకీరామన్ 11 విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇందులో న్యాయ, డీఐసీజీసీ, తనిఖీ తదితర విభాగాలున్నాయి. అలాగే, సమన్వయ వ్యవహరాలను కూడా ఆయనే చూడనున్నారు. మానిటరీ పాలసీ నిర్వహణ సహా ఆరు విభాగాలను పూనమ్ గుప్తా పర్యేవేక్షిస్తారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
భారత్ వృద్ధికి యుద్ధం బ్రేక్
పశ్చిమాసియా ఘర్షణలతో నౌకల రవాణాకు అటంకాలు, ఇంధన ధరల పెరుగుదల భారత జీడీపీ వృద్ధికి జోరుకు అవరోధాలు కలి్పంచొచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంలోపునకు తగ్గిపోవచ్చని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధితోపాటు భారత్ వృద్ధికీ అతిపెద్ద రిస్క్గా పేర్కొన్నారు. ఒకవేళ సకాలంలో పరిష్కారమైతే అప్పుడు వృద్ధి పుంజుకుంటుందన్నారు. అప్పుడు 6.5–7 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది 6.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్నారు.పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు జీడీపీపై, వడ్డీ రేట్లపై ఒక నిర్ణయాత్మక అభిప్రాయానికి రాలేమన్నారు. చమురు ధరలు అధిక స్థాయిల్లో (100 డాలర్లకు పైన) ఉంటే, అది వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. కాకపోతే గత 10–12 ఏళ్లలో ఏవో కొన్ని సందర్భాలను మినహాయిస్తే దాదాపు చమురు ధరలు కనిష్టాల్లోనే ఉన్నాయంటూ.. అది దేశ వృద్ధికి సాయపడినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..వడ్డీ రేట్లు సమీప కాలంలో కిందకు దిగొచ్చే పరిస్థితుల్లేవని రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు మద్దతుగా లక్ష్యిత చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా రుణసాయం విషయంలో సమస్యలున్నట్టు చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణ, చిన్న తప్పులను నేరాలుగా చూడకపోవడం, న్యాయ సంస్కరణల విషయంలో వేగవంతమైన చర్యలు అవసరమన్నారు. ఈ దిశగా గత 12–18 నెలల్లో పభుత్వం చేసిన కృషిని అభినందించారు. వివాదాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలని, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని మెమానీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి సీఐఐ సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. వృద్ధి 6.3 శాతమే: ఏడీబీపశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ అంచనా వేశారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందన్నారు. 2025–26లో భారత్ జీడీపీ బలంగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2027–28లో 7.3 శాతానికి పుంజుకుంటుందని.. 2026–27లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ఏప్రిల్లో అంచనాలు ప్రకటించడం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం ఏప్రిల్ అంచనా కంటే 2.4 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకోవచ్చని పార్క్ తెలిపారు. చమురు, గ్యాస్ కోసం దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేశారు.ఎల్నినో ప్రభావంఎల్నినో ప్రభావంపై మాట్లాడుతూ.. భారత్లో సాగుపై ప్రభావం పడినప్పుడల్లా ధరల పరమైన సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నందున, భారత్లో సాగుకు ఇబ్బందులు ఏర్పడితే ప్రపంచ దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు తక్కువగా వినియోగిస్తారని.. దీంతో దిగుమతి తగ్గి ఆ తర్వాత ఆహార లభ్యత తగ్గుతుందన్నారు. ధరలపై దీని ప్రభావం కచి్చతంగా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడం, ఇతర ఇంధన వనరుల దిగుతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం అవసరమన్నారు. అయితే భారత్లో ఎన్నో సంస్కరణలు కొనసాగుతున్నాయంటూ, వృద్ధి అవకాశాలు దీర్ఘకాలానికి ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నట్టు పార్క్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) మెరుగుపడతాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సాయపడతాయన్నారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
వ్యాపారాలకు కేంద్రం అభయం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ వ్యాపార రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య లభ్యత కొరతను అధిగమించి వ్యాపారాలు సజావుగా సాగేందుకు వీలుగా ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్’ (ఈసీఎల్జీఎస్) 5.0కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ పథకానికి పచ్చజెండా ఊపింది. ఈ స్కీమ్ ద్వారా అర్హత కలిగిన వ్యాపార సంస్థలతో పాటు విమానయాన రంగానికి మొత్తం రూ.2,55,000 కోట్ల మేర అదనపు రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో విమానయాన రంగానికి ప్రత్యేకంగా రూ.5,000 కోట్లు కేటాయించారు. అర్హతలు, రుణ హామీ వివరాలుమార్చి 31, 2026 నాటికి వర్కింగ్ క్యాపిటల్ పరిమితులు కలిగి ఉండి, ఎకౌంట్లు స్టాండర్డ్గా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్–ఎంఎస్ఎంఈలు, షెడ్యూల్డ్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ ఈ పథకానికి అర్హత పొందుతాయి. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) ద్వారా ఎంఎస్ఎంఈలకు వంద శాతం రుణ హామీ కల్పిస్తారు. నాన్–ఎంఎస్ఎంఈలకు, విమానయాన రంగానికి 90 శాతం గ్యారెంటీ ఉంటుంది. ఈ రుణాలకు సంబంధించి సంస్థల నుంచి ఎలాంటి గ్యారెంటీ ఫీజు వసూలు చేయరు. పథకంలో రుణ పరిమితులు2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉపయోగించిన గరిష్ట వర్కింగ్ క్యాపిటల్లో 20 శాతం వరకు అదనపు రుణం మంజూరు చేస్తారు. దీనికి గరిష్ట పరిమితిని రూ.100 కోట్లుగా నిర్దేశించారు. విమానయాన సంస్థలకు కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి వంద శాతం వరకు అదనపు రుణం అందిస్తారు. అయితే ఒక సంస్థకు గరిష్టంగా రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయిస్తారు. మార్చి 31, 2027 వరకు బ్యాంకులు మంజూరు చేసే రుణాలకు ఈ పథకం మార్గదర్శకాలు వర్తిస్తాయి. రుణ కాలపరిమితి ముగిసే వరకు ఈ గ్యారెంటీ కవర్ అందుబాటులో ఉంటుంది. తిరిగి చెల్లించే గడువులురుణం తిరిగి చెల్లించేందుకు ఎంఎస్ఎంఈ, నాన్–ఎంఎస్ఎంఈలకు మంజూరైన తేదీ నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇందులో ఒక ఏడాది మారటోరియం (అసలు చెల్లించాల్సిన అవసరం లేని సమయం) కలిసి ఉంటుంది. విమానయాన రంగానికి రెండేళ్ల మారటోరియంతో కలిపి మొత్తం ఏడేళ్ల కాలపరిమితి ఇస్తారు.ఉపాధి రక్షణే లక్ష్యంగా..పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా తలెత్తే స్వల్పకాలిక ద్రవ్య లభ్యత సమస్యలను అధిగమించడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని కేంద్రం వెల్లడించింది. సంస్థల వ్యాపార కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూడటం, ఉద్యోగాలను కాపాడటం, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా చూడటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. సకాలంలో అదనపు వర్కింగ్ క్యాపిటల్ అందించడం ద్వారా దేశీయ ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్ సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్ పవర్తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు. కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని విజయ్ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.రూ. 42,000 కోట్ల అదనపు భారంమహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.మరీ ముఖ్యంగాప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.వృద్ధాప్య పింఛన్ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.పరిమిత ప్రభావంమరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది. అంటే విజయ్ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన 8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకాప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ, పొలిటికల్ డ్రామా ఆడుతున్న సినిమా స్టార్ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! -
భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన
వృద్ధాప్య జనాభా, తగ్గుతున్న జనన రేట్ల కారణంగా కార్మిక కొరతను అధిగమించాలని చూస్తున్న తైవాన్కు సొంత ప్రజల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారతీయ కార్మికులను నియమించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై తైవాన్ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో 40,000 మందికి పైగా తైవానీయులు ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు చేస్తూ భారతీయ కార్మికులను తీసుకురావాలనే ప్రణాళికను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.తైవాన్ తన తయారీ రంగం, వృద్ధుల సంరక్షణ విభాగంలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 2024లో భారతదేశంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ప్రస్తుతం ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్న తైవాన్ తన వలస కార్మిక వనరులను వైవిధ్యపరచాలని భావించింది. ఇందులో భాగంగా కేవలం 1,000 మంది కార్మికులతో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.మార్చి 2026 నాటికి, తైవాన్ సుమారు 8 లక్షల మంది చట్టబద్ధమైన వలస కార్మికులకు ఆతిథ్యం ఇస్తోంది. కొత్త కార్మిక వనరులు చేకూరకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత ప్రమాదంలో పడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది.ప్రభుత్వ నిర్ణయానికి ప్రజా ప్రతిఘటనతైవాన్ కార్మిక మంత్రి హంగ్ సున్-హాన్ ఈ ఏడాది చివరి నాటికి మొదటి విడత భారతీయ కార్మికులు వస్తారని ప్రకటించిన కొద్ది కాలంలోనే సోషల్ మీడియా వేదికగా, స్థానికంగా అక్కడి వీధుల్లో నిరసనలు భగ్గుమన్నాయి. భారతీయ పురుషులపై నెలకొన్న ప్రతికూల అభిప్రాయం, భద్రత, లింగ హింసకు సంబంధించిన భయాలు ఈ పిటిషన్కు దారితీశాయి. ప్రతిపక్ష కుమింటాంగ్ (కేఎంటీ) చట్టసభ సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తైవాన్ వాసులు భారతీయుల పట్ల జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో భారతీయ పురుషులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు చేయడం ఆందోళనకరంగా మారింది.ప్రభుత్వ వాదన - వాస్తవాలుఈ అంశంపై ప్రజా ఆందోళనలను ఎదుర్కొంటున్నప్పటికీ కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం భారతీయ కార్మికులను లైంగిక నేరాలతో ముడిపెట్టడం నిరాధారమైనదని స్పష్టం చేసింది. గతంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులతో పోలిస్తే నేరాల రేటు స్థిరంగా ఉంటుందని, పైగా రిక్రూట్ అయ్యే ప్రతి కార్మికుడు భారత ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రవర్తన సర్టిఫికేట్ (Good Conduct Certificate) సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తైవాన్ కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.దౌత్యం వైపు అడుగులుప్రస్తుతానికి, తైపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కఠినమైన పర్యవేక్షణ, భద్రతా హామీలు ఉంటేనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది. అయితే కార్మిక కొరతకు సామాజిక భద్రతకు మధ్య సమతుల్యత సాధించడమే ఇక్కడ అసలైన సమస్య. అంతర్జాతీయంగా ఎంతో మంది భారతీయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నప్పటికీ ఒక దేశంపై ఏర్పడిన ప్రతికూల ముద్ర దౌత్యపరమైన సంబంధాలతోపాటు అవసరమైన ఆర్థిక అవసరాలకు కూడా ఆటంకం కలిగిస్తుందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం! -
ఇండియాతో పోలిక.. పాకిస్తాన్ పరువు తీసిన కియోసాకి
ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.కియోసాకి ఏమన్నారంటే‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’పాక్లో భగ్గుమంటున్న ధరలుఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.భారత్ విజయం వెనుక రహస్యం..భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్ను స్థిరీకరించగలదు.భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్వర్క్ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.పాక్ మంత్రి నిస్సహాయతపాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. -
రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్కు బిగ్ డీల్
భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) సాంకేతికతకు వీలు కల్పించేలా రూపొందించిన వాణిజ్య బొగ్గు గనులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. ఈ మేరకు నాలుగు బొగ్గు గనులకు సంబంధించిన ‘కోల్ మైన్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అగ్రిమెంట్స్’ (సీఎంపీడీఏ)పై సంస్థలు సంతకాలు చేశాయి.ఎవరికి ఏ గనులు?రిలయన్స్ ఇండస్ట్రీస్: ఆంధ్రప్రదేశ్లోని రెచెర్ల, చింతలపూడి సెక్టార్ ఏ1 బొగ్గు గనులను సొంతం చేసుకుంది.యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్: ఒడిశాలోని బెల్పహార్, తంగార్దిహి ఈస్ట్ బొగ్గు గనులను దక్కించుకుంది.ఈ నాలుగు గనుల్లో రెండు పాక్షికంగా నిర్వహిస్తున్నావి కాగా, మరో రెండు పూర్తిగా కార్యకలాపాలు సాగిస్తున్నవి.ఏమిటీ యూసీజీ ప్రత్యేకత?సాధారణంగా బొగ్గును గనుల నుంచి వెలికితీసి ఆపై విద్యుత్ లేదా ఇంధనం కోసం ఉపయోగిస్తారు. అయితే, యూసీజీ సాంకేతికత అందుకు భిన్నం. ఇది బొగ్గును నేరుగా సీమ్ (నేల లోపల బొగ్గు పొర)లోనే సింథటిక్ వాయువు (సిన్గ్యాస్)గా మారుస్తుంది. దీనివల్ల సంప్రదాయ మైనింగ్ అవసరం ఉండదు. సాధారణ పద్ధతుల్లో దీన్ని వెలికితీయడం కష్టసాధ్యం. ఈ పద్ధతి ద్వారా లోతైన బొగ్గు పొరల నుంచి కూడా సింథటిక్ వాయువును తయారు చేయవచ్చు.బొగ్గు మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ఈ గనులలో సాంప్రదాయ మైనింగ్తో పాటు యూసీజీ పద్ధతిని కూడా అనుసరించే వెసులుబాటును ఆపరేటర్లకు కల్పించారు. ఇది దేశంలోని ఇంధన వనరులను గణనీయంగా పెంచుతుంది. ఈ ప్రాజెక్టులు కేవలం ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా వెలువడే సిన్గ్యాస్ యూరియా, అమ్మోనియా తయారీకి కీలకంగా మారుతుంది. ఇది ఎరువుల దిగుమతులపై భారత్కున్న ఆధారపడటాన్ని తగ్గించి ఆహార భద్రతకు ఊతమిస్తుంది.కెమికల్స్, పెట్రోకెమికల్స్ తయారీలో సహజ వాయువు, నాఫ్తా స్థానంలో ఈ సిన్గ్యాస్ను ఉపయోగించి మిథనాల్, డైమిథైల్ ఈథర్ (డీఎంఈ), ఇతర సింథటిక్ ఇంధనాలను స్వదేశంలోనే తయారు చేసే అవకాశం లభిస్తుంది. ఈ నాలుగు ఒప్పందాలతో కలిపి ఇప్పటివరకు వాణిజ్య బొగ్గు వేలం ద్వారా జరిగిన మొత్తం ఒప్పందాల సంఖ్య 138కి చేరుకుంది.తాజా ఒప్పందంలోని ముఖ్యాంశాలుగరిష్ట సామర్థ్యం: 331.544 ఎంటీపీఏ.ఆర్థికాభివృద్ధి: ఏడాదికి సుమారు రూ.42,980 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం.పెట్టుబడులు: రూ.48,231 కోట్ల మేర మూలధన పెట్టుబడులు.ఉపాధి: సుమారు 4,34,175 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు.ఇదీ చదవండి: నమ్మావో ముంచేస్తారు! -
జీఎస్టీ వసూళ్ల రికార్డ్.. ఒక్క నెలలో రూ.2.43 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఏప్రిల్ నెలలో రూ.2.43 లక్షల కోట్ల స్థూల ఆదాయం వసూలైంది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూళ్లు రూ.2.23 లక్షల కోట్లతో పోల్చిచూస్తే 8.7 శాతం పెరుగుదల నమోదైంది. ఇది ఒక నెలలో అత్యధిక వసూళ్ల రికార్డు. దేశీ విక్రయాలపై జీఎస్టీతో పోల్చి చూస్తే, దిగుమతులపై పన్ను ఆదాయమే ఎక్కువ వృద్ధి చూపించడం గమనార్హం. దేశీ విక్రయాలపై జీఎస్టీ 4.3 శాతం పెరిగి రూ.1.85 లక్షల కోట్లకు చేరింది.దిగుమతులపై జీఎస్టీ 25.8 శాతం పెరిగి రూ.57,580 కోట్లు వసూలైంది.సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.52,140 కోట్లు రాగా, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.61,331 కోట్లుగా ఉంది.ఐజీఎస్టీ రూ.1.29 లక్షల కోట్లు వసూలైంది.రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 19.3 శాతం పెరిగి రూ.31,793 కోట్లకు చేరాయి.రిఫండ్లు సర్దుబాటు అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్లో రూ.2.11 లక్షల కోటు.ఈ ఏడాది మార్చి నెలకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా ఉండడం గమనార్హం.7–8 శాతం వృద్ధి సాధారణమేజీఎస్టీ 2.0 అనంతరం ప్రతి నెలా పన్నుల ఆదాయం 7–8 శాతం మేర వృద్ధి చెందడం సాధారణంగా మారినట్టు ప్రైస్ వాటర్హౌస్ అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ ప్రతీక్జైన్ పేర్కొన్నారు. ఇది బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్టు చెప్పారు. దిగుమతులపై ఆదాయం దేశీ లావాదేవీలను మించడం అన్నది దేశీ వినియోగం కొంత నిదానించడాన్ని తెలియజేస్తోందని జైన్ చెప్పారు. -
‘జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదు’
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకువచ్చిన వివాదాస్పద నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నిర్దిష్ట దేశాలకు చెందిన వారి గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, దరఖాస్తులను నిలిపివేస్తూ తీసుకున్న చర్యలు వివక్షతో కూడుకున్నవని, అవి చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తేల్చిచెప్పారు.కేసు నేపథ్యంఇరాన్, హైతీ, వెనిజులా, సిరియా సహా సుమారు 20 దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు తమ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేతను సవాలు చేస్తూ బోస్టన్ కోర్టులో దావా వేశారు. నవంబర్ 2025లో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అవలంబించిన విధానాన్ని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధానం ప్రకారం, ప్రయాణ నిషేధం ఉన్న 39 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల జాతీయతను, వారి అప్లికేషన్లను తిరస్కరించడానికి ‘ముఖ్యమైన ప్రతికూల కారకం’ (significant negative factor)గా పరిగణించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆదేశించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఈ ఏజెన్సీ దరఖాస్తులను ప్రాసెస్ చేయకుండా నిలిపివేసింది.న్యాయమూర్తి తీర్పులోని ముఖ్యాంశాలుఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జూలియా కోబిక్ కీలక తీర్పును వెలువరించారు. జాతీయత ఆధారంగా వివక్ష చూపడం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్కు విరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆశ్రయ(అకామిడేషన్) దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏజెన్సీ వాటిని నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పిటిషన్దారులు తీవ్రంగా నష్టపోయారని భావించిన న్యాయమూర్తి వారి దరఖాస్తులపై యూఎస్సీఐఎస్ నిబంధనలను నిలిపేయాలని చెప్పారు.న్యాయ నిపుణుల స్పందనఈ తీర్పును పిటిషన్దారుల తరఫు న్యాయవాది జిమ్ హ్యాకింగ్ స్వాగతించారు. ‘యూఎస్సీఐఎస్ కేవలం ఫలానా దేశం నుంచి వచ్చారన్న కారణంతో ఎవరికీ ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు దక్కకుండా చేయాలని చూస్తోంది. కానీ దీనికి కాంగ్రెస్ ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఈ తీర్పు ప్రధానంగా 22 మంది వాదులకు వర్తిస్తుండగా మిగిలిన 200 మందికి కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేసే అంశంపై చర్చించాలని ఇరుపక్షాలకు న్యాయమూర్తి సూచించారు.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి..
ఒకప్పుడు పట్టణ రవాణా వ్యవస్థను శాసించిన యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల నమూనా ప్రస్తుతం గందరగోళ పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు వేల రూపాయల ఆదాయం, విలాసవంతమైన జీవితం అంటూ ఊరించిన ఈ వ్యవస్థ నేడు వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. తీసుకున్న అప్పులు కట్టకపోవడంతో వెహికిల్ లోన్లు ఇచ్చిన బ్యాంకులు 30,000లకు పైగా క్యాబ్లను జప్తు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వెనుక ఉన్న చేదు నిజాలు ఏమిటో విశ్లేషిద్దాం.ఓలా/ ఉబెర్ నమూనాయాప్-ఆధారిత క్యాబ్ కంపెనీల వృద్ధిని నిశితంగా పరిశీలిస్తే అవి నాలుగు దశల్లో తమ నెట్వర్క్ను విస్తరించాయి.1. నగదు వెల్లువ: ప్రారంభంలో భారీగా ఇన్సెంటివ్లు ఇచ్చి మార్కెట్ను ఆక్రమించాయి.2. నమ్మకం: డ్రైవర్లకు నెలకు రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఆదాయం వస్తుందనే ఆశ కల్పించాయి.3. ఆధారపడటం: డ్రైవర్లు ఆ ఆదాయాన్ని నమ్మి భారీగా కార్ లోన్లు తీసుకుని సొంత వాహనాలు కొనుగోలు చేశారు.4. నియంత్రణ: మార్కెట్ను గుప్పిట్లోకి తెచ్చుకున్నాక ఇన్సెంటివ్లను తగ్గించి కమిషన్లను పెంచాయి.అప్పుల ఊబిలో డ్రైవర్లుకంపెనీల వ్యూహాలు మారడంతో డ్రైవర్ల ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు తోడు ఇన్సెంటివ్లు తగ్గడంతో డ్రైవర్ల చేతికి వచ్చే ఆదాయం రూ.30,000 నుంచి రూ.35,000కు పరిమితమైంది. దీంతో తీసుకున్న కార్ లోన్ల ఈఎంఐలు కట్టడం డ్రైవర్లకు భారమైంది.కొవిడ్ సంక్షోభం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఆదాయం లేక, అప్పులు తీర్చలేక దాదాపు 30,000కు పైగా క్యాబ్లను బ్యాంకులు జప్తు చేశాయి. వాహనాల జప్తుతోపాటు లక్షలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది.మారుతున్న ధోరణిప్రస్తుతం డ్రైవర్ల ఆలోచనా ధోరణి మారింది. అప్పుల భారం లేని, రిస్క్ తక్కువగా ఉండే డెలివరీ పార్టనర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదాయం తక్కువైనా సొంత వాహనంపై అప్పుల బాధ్యత లేకపోవడమే వారికి ఇప్పుడు ఊరటనిస్తోంది.ప్రయాణికులపై భారంమరోవైపు, ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఒక సామాన్య ప్రయాణికుడు ప్రధాన నగరాల్లో సరాసరి నెలవారీ క్యాబ్ ప్రయాణాల కోసం దాదాపు రూ.27,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సొంత కారును కొని మెయింటెనెన్స్ చేసుకునే ఖర్చు కంటే ఎక్కువ కావడం గమనార్హం.క్యాబ్-హెయిలింగ్ ఎకోసిస్టమ్ కేవలం డ్రైవర్లకే కాకుండా కంపెనీలకు, ప్రయాణికులకు కూడా నష్టదాయకంగా మారింది. కేవలం గ్రోత్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మోడల్ స్థిరత్వం వైపు దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థపై పునసమీక్షించుకోకపోతే ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
యూపీఐ లావాదేవీలు @ రూ. 314 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రికార్డు స్థాయికి చేరాయి. రూ. 314 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2016–17లో కేవలం రూ. 0.07 లక్షల కోట్లుగా ఉన్న ఈ విలువ, పదేళ్లలో 4,000 రెట్లు పెరగడం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. → 2016–17లో 2 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2025–26లో 24,162 కోట్లకు పెరిగాయి. → 2025 ఆగస్టులో తొలిసారిగా నెలవారీ లావాదేవీలు 2,000 కోట్ల సంఖ్యను దాటాయి. 2025 డిసెంబర్లో గరిష్టంగా 2,163 కోట్ల లావాదేవీలు జరిగాయి. → 2025 క్యాలెండర్ ఇయర్లో రోజుకు సగటున 60 కోట్ల లావాదేవీలు నమోదవగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 66 కోట్లు దాటింది. → ప్రారంభంలో యూపీఐ నెట్వర్క్ పరిధిలో 44 బ్యాంకులు మాత్రమే ఉండగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 703 బ్యాంకులకు చేరింది. → ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ చెల్లింపుల్లో 49 శాతం వాటా యూపీఐదేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం తన 2025 నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
ఎకానమీకి పశ్చిమాసియా సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. దీనివల్ల వస్తువుల సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే, ఎగుమతులు, పెట్టుబడులపైనా ప్రభావం చూపించొచ్చని తెలిపింది. అయితే, బలమైన దేశీ వినియోగం, విధానపరమైన వెసులుబాట్లు, బలమైన ఆర్థిక వ్యవస్థలు, ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని తాజా నివేదికలో పేర్కొంది. అనిశ్చితులు ఎక్కువ కాలం పాటు కొనసాగితే.. ముఖ్యంగా ఇంధనం, ఎరువుల సరఫరాపై ప్రభావం పడితే అది దేశ స్థూల ఆర్థిక పరిస్థితుల బలాన్ని పరీక్షించొచ్చని తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాను ప్రస్తావించింది. ఇది వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ నివేదిక అభిప్రాయపడింది. చమురు, ఎరువుల సరఫరాలో అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగితే, ముడి సరుకుల కోసం వాటిపై ఆధారపడే ఇతర పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరిగి సామాన్యులపై భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. దేశీ ద్రవ్యోల్బణానికి రూపాయి బలహీనత సైతం ఒత్తిళ్లను పెంచుతున్నట్టు తెలిపింది. కనుక ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు పెరిగి, వృద్ధి తగ్గే రిస్క్లు ఉన్నాయని వివరించింది. పశ్చిమాసియా సంక్షోభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసినట్టు వివరించింది. ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తూనే.. మధ్య కాలానికి ద్రవ్యలోటు, వెలుపలి స్థిరత్వాన్ని (కరెంట్ ఖాతా లోటు, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ తదితర) కొనసాగించేందుకు విధానపరమైన చర్యలతో భరోసా అవసరమని పేర్కొంది. బలమైన వృద్ధి.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత వృద్ధి రేటు 7 నుండి 7.4 శాతం మధ్య ఉండవచ్చన్న అంచనాలు ఉత్సాహానిస్తున్నట్టు ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వృద్ధి రేటుగా నిలుస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల వల్ల రూపాయి విలువ బలహీనపడితే, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరగొచ్చని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న పలు చర్యలను ప్రస్తావించింది. ఎరువుల ఉత్పత్తికి సహజ వాయువు కేటాయింపులను పెంచడంతోపాటు ఖరీఫ్ సీజన్ కోసం ఎరువులపై ఇచ్చే రాయితీలను 12 శాతం పెంచడం, ఎగుమతులు, దిగుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు పరిపాలనాపరమైన చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది. అవకాశాలు.. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం భారత్కు ఒక సవాలు మాత్రమే కాదని.. గొప్ప అవకాశమని ఈ నివేదిక అభిప్రాయపడింది. బలమైన దేశీయ మార్కెట్, స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల భారత్ సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ దేశాలు తమ సరఫరా వ్యవస్థలను వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్న తరుణంలో, భారత్ ఒక నమ్మకమైన తయారీ, సేవల కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవడం, వ్యూహాత్మక ఇంధన నిల్వలను సిద్ధం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. -
పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.10, రూ.12.50 పెరిగినట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పదించింది.పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వు జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ''ఇంధన ధరల పెంపునకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఉత్తర్వు నకిలీది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వు ఏదీ జారీ చేయలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ 'X' లోని ఒక పోస్ట్లో పేర్కొంది.పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఉన్న సమయంలో.. ఫ్యూయెల్ ధరల పెరుగుదల వార్త, ప్రజల్లో ఆందోళన కలిగించింది. అంతే కాకుండా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జరుగుతున్న సమయంలో.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నిజమే అని చాలామంది భావించారు. అయితే ధరల పెరుగుదల నిజం కాదని, పీఐబీ అధికారికంగా వెల్లడించింది.🚨FAKE NEWS!An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:❌ This order is #FAKE .✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026కాగా.. మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉంటాయని తెలిపారు. నిత్యావసర ఇంధనాలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, ఆమె వినియోగదారులకు హామీ ఇచ్చారు. ఎల్పీజీ, పెట్రోలియం, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి, ధరలు కూడా పెరగలేదు. కాబట్టి దయచేసి ఆందోళన చెందవద్దని శర్మ అన్నారు. -
భారత్ నెత్తిన చమురు ధరల భారం
ముడి చమురు ధర బ్యారెల్కు సగటున 120 డాలర్లకు చేరితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి 6 శాతానికి పరిమితం అవుతుందని ఈవై ఇండియా అంచనా వేసింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అర్బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతానికి పెరిగిపోతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో విధానపరమైన జోక్యానికి పరిమిత అవకాశాలే ఉన్నట్టు ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు.పశ్చిమాసియా సంక్షోభం అలాగే కొనసాగితే భారత్ క్రూడ్ బాస్కెట్ ధరలు (ఐసీబీ) మరింత పెరగొచ్చని.. దీంతో విధానకర్తలు చమురు కొనుగోళ్లను వైవిధ్యం చేసుకోవచ్చని తెలిపారు. రెపో రేటును సైతం పెంచే అవకాశం ఉందన్నారు. చమురు ధర 120 డాలర్లకు ఎగసి, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావాన్ని ద్రవ్యలోటుపై తగ్గించుకోవాలంటే.. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచి వినియోగదారులపై పెద్ద మొత్తంలో భారాన్ని మోపాల్సి ఉంటుందని అంచనా వేశారు. యూఎస్ ఇంధన సమాచార యంత్రాంగం 2026 క్యూ2లో (ఏప్రిల్–జూన్) బ్రెంట్ బ్యారెల్ ధర 115 డాలర్లకు చేరొచ్చని అంచనా వేయడాన్ని ఈవై నివేదిక ప్రస్తావించింది.భారత్ వృద్ధి 2026–27లో 6.9 శాతంగా ఉండొచ్చన్ని ఆర్బీఐ అంచనా కాగా, 6.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొనడం తెలిసిందే. పశ్చిమాసియా సంక్షోభం అంచనాలకు మించి ఎక్కువ కాలం కొనసాగొచ్చని శ్రీవాస్తవ అంచనా వేశారు. ఒకవేళ ఇది సమీప కాలంలో పరిష్కారమైనా, ఆ తర్వాత ఇంధన సరఫరా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ఆయిల్ కంపెనీలకు ‘పశ్చిమాసియా’ కష్టాలు..
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లను పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) నష్టపోతున్నాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 14, డీజిల్పై రూ. 18 మేర నష్టం వాటిల్లుతోంది. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వంట గ్యాస్ ఎల్పీజీపై ఆయిల్ కంపెనీలు రూ. 80,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయి. బడ్జెట్లో ఎరువులపై సబ్సిడీకి రూ. 1.71 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ.. భారం దానికన్నా అధికంగా రూ. 2.05 – 2.25 లక్షల కోట్లకు ఎగియనుంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు ఓ నివేదికలో అంచనాలు వెలువరించింది.హార్మూజ్ జలసంధి మార్గం గుండా ఇంధన సరఫరా దెబ్బతినడంతో ఇంధనాలు, ఎరువులు, రసాయనాల కొరత ఏర్పడి, ధరలు పెరిగిపోతున్నాయని వివరించింది. రెణ్నెల్ల క్రితం పశి్చమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పుడు బ్యారెల్కి 70–72 డాలర్లుగా ఉన్న క్రూడ్ ధరలు ఆ తర్వాత 120–125 డాలర్లకు ఎగిసినట్లు ఇక్రా పేర్కొంది. అయినప్పటికీ దేశీయంగా బంకుల్లో రేట్లు పెంచకపోవడం వల్ల ఓఎంసీల లాభదాయకతపై ప్రభావం పడుతోందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ట తెలిపారు.మరిన్ని ముఖ్య వివరాలు..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదించి, గ్లోబల్ సరఫరా వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తే తప్ప సమీప భవిష్యత్తులో ఓఎంసీల మార్జిన్లు, రుణ పరపతిపై ఒత్తిడి కొనసాగవచ్చు. ముడి వస్తువుల ధరలు గణనీయంగా పెరిగి, సబ్సిడీ ఆ స్థాయిలో పెరగకపోవడం వల్ల యూరియా సంస్థల లాభదాయకత నెమ్మదించవచ్చు. వాతావరణ రిసు్కలను ఎదుర్కొనాల్సి రావడం వల్ల, పెరిగే ధరలను భరించే సామర్థ్యం రైతుల్లో తగ్గొచ్చు.వాణిజ్యానికి ఆటంకాలు, అధిక ఇంధన ధరలతో రసాయనాలు, పాలిమర్స్ ధరలు పెరిగాయి. దీంతో తయారీ సంస్థలు, వినియోగదారులు భారీగా నిల్వ చేసుకుంటున్నారు. అయితే, నిర్దిష్ట సెగ్మెంట్లలో అంతర్జాతీయంగా సరఫరా గణనీయంగా పెరిగితే, నిల్వ చేసుకునే ధోరణి తగ్గి, డిమాండ్ నెమ్మదిగా సాధారణ స్థాయికి రావొచ్చు.గ్యాస్ రేట్ల పెరుగుదల, కరెన్సీ క్షీణతతో సిటీ గ్యాస్ డి్రస్టిబ్యూషన్ సంస్థల మార్జిన్లపై ఒత్తిడి పెరగొచ్చు. కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉండటంతో గృహాలకు సరఫరా చేసే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) విభాగం లాభదాయకత స్థిరంగానే ఉన్నా, ధరల పెంపు పాక్షికంగానే బదలాయించడం వల్ల కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) మార్జిన్లు మాత్రం నెమ్మదించవచ్చు. ఇంధనాలు, ముడివస్తువుల ధరలు పెరగడం వల్ల పలు రంగాల్లోని సంస్థల మార్జిన్లపై ప్రభావం పడనుంది. దీంతో కొన్ని సంస్థల రుణ పరపతి కూడా దెబ్బతినొచ్చు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ఈపీఎఫ్వో పాత ఖాతాల యాక్టివేషన్
న్యూఢిల్లీ: ఈపీఎఫ్వో పాత ఖాతాలు, కార్యకలాపాల్లేని వాటిని గుర్తించడంతోపాటు పునరుద్ధరించుకునేందుకు (యాక్టివేషన్) త్వరలోనే ఒక పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇ–ప్రాప్తి పోర్టల్పై ఆధార్ ధ్రువీకరణతో, పాత ఈపీఎఫ్ ఖాతా వివరాలను పొందొచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) లేని ఖాతాలను లింక్ చేసుకుని, యాక్టివేట్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మాండవీయ తెలిపారు. 2014 నుంచి ఈపీఎఫ్వో సభ్యులకు 12 అంకెలతో కూడిన యూఏఎన్ను జారీ చేస్తుండడం గమనార్హం. -
గోల్డ్కు గ్లోబల్ జోష్
ముంబై: దేశంలో బంగారానికి గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) గతేడాది ఇదే కాలంతో పోలిస్తే బంగారం డిమాండ్ 10 శాతం వృద్ధి చెంది 151 టన్నులకు చేరింది. ముఖ్యంగా ఆభరణాల కంటే పెట్టుబడి రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం చూపిస్తున్నారు. నివేదికలోని అంశాలు.. → బంగారం కడ్డీలు, నాణేలు, ఈటీఎఫ్ (గోల్డ్ ఈటీఎఫ్లు) రూపంలో పెట్టుబడి డిమాండ్ మార్చి క్వార్టర్లో 54 శాతం పెరిగి 82 టన్నులకు చేరుకుంది. ఇందులో కడ్డీలు, కాయిన్ల డిమాండ్ వరకే చూస్తే 34 శాతం పెరిగి 62 టన్నులుగా ఉంది. 2013 తర్వాత తొలి త్రైమాసికంలో అత్యధిక డిమాండ్ ఇదే కావడం విశేషం. → అధిక ధరల కారణంగా ఆభరణాల డిమాండ్ 19 శాతం తగ్గి 66 టన్నులకు పరిమితమైంది. పెరిగిన ధరలు సామాన్యుల బడ్జెట్పై ప్రభావం చూపించడమే దీనికి కారణం. → ధరల పెరుగుదలతో బంగారం డిమాండ్ విలువ పరంగా రెట్టింపయ్యింది. మార్చి త్రైమాసికంలో కొనుగోళ్ల విలువ రూ.2,27,500 కోట్లుగా నమోదైంది. → మార్చి క్వార్టర్లో బంగారం ధర ఎంసీఎక్స్లో 81 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారం సగటు ధర 1,51,108 రూపాయల స్థాయిలో కొనసాగింది. 2025 మొదటి త్రైమాసికంలో ఇది రూ.83,375గా ఉంది. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ధోరణి.. ప్రపంచవ్యాప్తంగా 2026 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) బంగారానికి గిరాకీ(డిమాండ్) 2 శాతం పెరిగి 1,231 టన్నులకు చేరిందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడికి సురక్షిత సాధనంగా భావించి కడ్డీలు, నాణేల కొనుగోలుకు మొగ్గు చూపించినట్టు తెలిపింది. కడ్డీలు, నాణేల రూపంలో పెట్టుబడి డిమాండ్ ఏకంగా 42 శాతం పెరిగి 474 టన్నులకు చేరింది. విలువ పరంగా డిమాండ్ 193 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 74 శాతం అధికం. ధరలు పెరగడమే ఇంత వృద్ధికి కారణం. 2025లో ఔన్సు బంగారం ధర సగటున 2,860 డాలర్లు ఉండగా, 2026 మొదటి త్రైమాసికంలో అది 81 శాతం పెరిగి 4,873 డాలర్లకు చేరింది. జనవరిలో ధరలు 5,400 డాలర్ల రికార్డు గరిష్టాన్ని కూడా నమోదు చేయడం గమనార్హం. అధిక ధరలతో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 23 శాతం తగ్గి 300 టన్నులకు పరిమితమైంది. చైనాలో 32 శాతం, భారత్లో 19 శాతం చొప్పున విక్రయాలు తగ్గాయి. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు మార్చి త్రైమాసికంలో అదనంగా 244 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆర్బీఐ సైతం ఈ కాలంలో 300 కిలోల బంగారాన్ని సమకూర్చుకుంది. గనుల నుంచి బంగారం ఉత్పత్తి మోస్తరుగా పెరగొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పెట్టుబడి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రీసైక్లింగ్కూ డిమాండ్ ధరలు భారీగా పెరగడంతో పాత బంగారాన్ని విక్రయించి లాభాలు పొందే ధోరణి కూడా పెరిగింది. బంగారం రీసైక్లింగ్ 20 శాతం పెరిగి 31.2 టన్నులకు చేరింది. అలాగే, దేశీ అవసరాల కోసం దిగుమతులు 39 శాతం పెరిగి 186 టన్నులకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోందని డబ్ల్యూజీసీ భారత్ సీఈవో సచిన్ జైన్ తెలిపారు. రాబోయే వివాహాల సీజన్, పండుగలు ఆభరణాల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయంటూ.. ఈ ఏడాది మొత్తం మీద డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉండొచ్చని అంచనా వ్యక్తం చేశారు. -
ఇంధన దాహం.. జల వినాశం!
భారతదేశం ఇంధన స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోల్లో ఇథనాల్ను కలిపి విదేశీ ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే, ఈ గ్రీన్ ఎనర్జీ ప్రస్థానం దేశాన్ని మరో పెను ప్రమాదంలోకి నెట్టేస్తోందా? అనే ప్రశ్న ప్రస్తుతం పర్యావరణవేత్తలను వేధిస్తోంది. ఒక లీటరు ఇథనాల్ తయారీకి దాదాపు 10,000 లీటర్ల నీరు ఖర్చవుతోందన్న వాస్తవం ఇప్పుడు దేశ జల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.బియ్యం నుంచి ఇంధనంప్రభుత్వం 2024-25లో ఇథనాల్ ఉత్పత్తి కోసం 52 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. రాబోయే 2025-26 నాటికి ఈ లక్ష్యాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఆహార సరఫరా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే విరిగిన బియ్యం వాటాను 25% నుంచి 10%కి తగ్గించనున్నారు. దీనివల్ల మిగిలిన బియ్యాన్ని నేరుగా ఇథనాల్ తయారీ డిస్టిలరీలకు మళ్లిస్తారు. అయితే, ఆహార భద్రత కంటే ఇంధన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.నీటి వినియోగం గణాంకాలు ఇలా..ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇథనాల్ తయారీకి పంటల వారీగా నీటి వినియోగం కింది విధంగా ఉంది.పంట రకంఒక లీటరు ఇథనాల్కు అవసరమయ్యే నీరుబియ్యం (వరి)10,790 లీటర్లుమొక్కజొన్న4,670 లీటర్లుచెరకు3,630 లీటర్లు ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీరు అవసరమైతే ఒక టన్ను బియ్యం నుంచి కేవలం 470 లీటర్ల ఇథనాల్ మాత్రమే లభిస్తుంది. అంటే, మనం వాహనాల్లో వాడే ఇంధనం ఎంత భారీ స్థాయిలో జల వనరులను హరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.పెరుగుతున్న కాలుష్యంనీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు నిండుకునే ప్రమాదం ఉంది. ఇటువంటి తరుణంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనే ఇథనాల్ ప్లాంట్లు కేంద్రీకృతమవ్వడం గమనార్హం. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో తాగునీటికే కటకటలాడుతున్న స్థితిలో అక్కడ 396 కోట్ల లీటర్ల ఇథనాల్ సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలో కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్న ప్రాంతాల్లోనే ఇథనాల్ తయారీ జోరుగా సాగుతోంది. ఇథనాల్ మిల్లులు విడుదల చేసే వినాస్సే (Vinasse) అనే వ్యర్థ జలాలు భూమిలోకి చేరితే భూగర్భ జలాలు, ఉపరితల జలాలు పూర్తిగా కలుషితమవుతాయని కొందరు చెబుతున్నారు.వైరుధ్యాల వలయంఒకప్పుడు పంజాబ్, హరియాణా వంటి ప్రాంతాల్లోని రైతులు వరి పండించి భూగర్భ జలాలను తోడేస్తున్నారని విమర్శించిన వ్యవస్థే ఇప్పుడు అదే ధాన్యాన్ని పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పేరుతో ఇంధనంగా మారుస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో దేశాన్ని మంచినీటి చుక్క కోసం అల్లాడేలా చేసేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.క్లీన్ ఎనర్జీ లక్ష్యం గొప్పదే అయినా అది దేశ జల వనరులను బలిపెట్టేదిగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యం, చెరకు వంటి నీటి తీవ్రత పంటల కంటే ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: ‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’ -
ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్కు మేలే!
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ముడిచమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ‘ఒపెక్’ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య భారతదేశం తన ఇంధన వనరులపై దృష్టి సారించాలని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ‘ది ఎకనామిస్ట్ ఇంపాక్ట్ రెసిలెంట్ ఫ్యూచర్స్ సమ్మిట్’లో ఆయన ప్రసంగిస్తూ గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్కు ఇది సానుకూల పరిణామంగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒపెక్ పట్టు సడలుతోందా?1960లో ఏర్పాటైన ఒపెక్ అంతర్జాతీయంగా చమురు ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం 12 దేశాల సభ్యత్వం ఉన్న ఈ కూటమిలో యూఏఈ 1967 నుంచి (మొదట అబుదాబిగా, తర్వాత 1971 నుంచి యూఏఈగా) కీలక భాగస్వామిగా ఉంది. మే 1 నుంచి యూఏఈ ఈ కూటమి నుంచి వైదొలుగుతుందన్న నిర్ణయం చమురు సరఫరా, ధరలపై ఒపెక్కు ఉన్న పట్టును బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.‘యూఏఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లను అతలాకుతలం చేస్తుందా లేదా స్థిరీకరిస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే, భారత్-యూఏఈల మధ్య ఉన్న అసాధారణ భౌగోళిక రాజకీయ సంబంధాలు, నాయకత్వాల మధ్య ఉన్న పరస్పర నమ్మకం దృష్ట్యా ఇది భారత్కు మేలు చేస్తుందని భావిస్తున్నాను’ అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ అన్నారు.యూఏఈ తన వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒపెక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మార్కెట్ను ఒక్కసారిగా ప్రభావితం చేసే అవకాశం లేదు. క్రమంగా చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని యూఏఈ భావిస్తోంది. ఈ అనిశ్చితి కాలంలో దేశీయంగా ఇంధన వనరులను బలోపేతం చేసుకోవడమే భారత్కు అత్యంత కీలకమైన రక్షణ కవచం.ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్.. -
జోరు మీదున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 1 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి ఇది 4 శాతానికి చేరుకుంటుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. చరిత్రాత్మక మార్పు మలుపు దశలో భారత్ ఉన్నట్టు పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ డిజిటల్ వ్యవస్థలు సామాజిక, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని తెలిపింది.ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. రాష్ట్రాల నాయకత్వంలో సాగే వినూత్న కార్యక్రమాల ద్వారానే డీపీఐ 2.0 విజయవంతమవుతుందంటూ.. దీనికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మార్గదర్శకులుగా వ్యవహరిస్తాయని పేర్కొంది. రంగాల వారీ మార్పులు తీసుకురావడానికి రెండేళ్ల కార్యాచరణను అనుసరించాలని సూచించింది. తొలి ఏడాది ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టి, వాటి ఫలితాలను విశ్లేషించాలని పేర్కొంది. మొదటి ఏడాది సాధించిన విజయాలను రెండో ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది. ఉపాధి కల్పన కీలకం.. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించే అభివృద్ధి మార్గాలు అవసరమని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ ఈ నివేదికను విడుదల చేసిన సందర్భంగా పేర్కొన్నారు. ‘‘గత దశాబ్ద కాలంలో సేవలను ప్రజలకు చేరవేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో డిజిటల్ వ్యవస్థలు అద్భుతమైన పనితీరు చూపించాయి. రాబోయే దశలో డిజిటల్ అనుసంధానానికే పరిమితం కాకుండా, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, సామర్థ్యాలను పెంచడంతోపాటు.. రంగాలు, ప్రాంతాల వారీ కొత్త చోదక కేంద్రాలను సృష్టించడంపై దృష్టి సారించాలి’’అని సూచించారు. -
పీపీఐల్లో ప్రతి నెలా రూ.10,000 జమ
ముంబై: ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ)ను మరింత బలోపేతం చేసేందుకు, లావాదేవీల భద్రతను పెంచేందుకు ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, నగదు తిరిగి చెల్లింపుల (రిఫండ్) ప్రక్రియల్లో స్పష్టత తెస్తూ కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ముందుగానే నగదును జమ చేసి, ఆ తర్వాత వివిధ అవసరాలకు చెల్లింపులు చేసే సాధనాలను పీపీఐలుగా చెబుతారు. → డెబిట్ కార్డులకు అనుమతి ఉన్న బ్యాంక్లు పీపీఐలను జారీ చేయొచ్చు. దీనికంటే ముందే డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (డీపీఎస్ఎస్)కు ముందస్తు సమాచారం ఇవ్వాలి. → ఆర్బీఐ నుంచి అనుమతితో నాన్ బ్యాంకింగ్ సంస్థలు సైతం పీపీఐలు జారీ చేయొచ్చు. → పీపీఐలలో ఏ సమయంలో అయినా గరిష్టంగా రూ. 2 లక్షల వరకే బ్యాలన్స్ ఉండాలి. → ఒక నెలలో గరిష్టంగా రూ.10,000 లోడ్ చేసుకోవచ్చు. → బహుమతి కార్డుల విలువ రూ. 10,000, ప్రయాణ కార్డుల విలువ రూ. 3,000 మించి ఉండకూడదు. → ప్రవాస భారతీయులు భారత్లో పర్యటించే సమయంలో వారి పాస్పోర్ట్, వీసా ధ్రువీకరణ తర్వాత పీపీఐ వాలెట్లు పొందొచ్చు. నెలకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. → కేవైసీ పూర్తి చేసిన వారికి కార్డు నెట్వర్క్ లేదా యూపీఐ నెట్వర్క్ ద్వారా పీపీఐ లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం కలి్పంచాలి. → ఫెయిల్ అయిన లేదా రద్దయిన లావాదేవీలకు సంబంధించిన నగదును వెంటనే సంబంధిత పీపీఐ ఖాతాలో జమ చేయాలి. → ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను 2026 మే 22 లోపు తెలియజేయాలని ఆర్బీఐ కోరింది. -
కల్లోల మార్కెట్లకు క్రమశిక్షణే జవాబు
ఒక్క ట్వీట్తో మార్కెట్లు ఒకటిరెండు శాతం పడిపోవటం... అలాగే పెరిగిపోవటం జరుగుతోంది. అసలు మార్కెట్ల డైరెక్షన్ ఎటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం ఎలా ముగుస్తుందో, ఎప్పటికి ముగుస్తుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. చమురు ధరలు బీభత్సంగా పెరుగుతున్నాయి. రూపాయి దారుణంగా పడిపోయింది. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పటికే నష్టపోయారు. ఈ తరహా ఊగిసలాటలో సొమ్ము చేసుకోవాలనుకుంటే చిన్న ఇన్వెస్టర్లకది సాధ్యం కాదు. మరేం చెయ్యాలి? దీన్నుంచి పోర్టుఫోలియోను కాపాడుకోవటమెలా? దీనిపై ఫోకస్ చేస్తున్నదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...మ్యూచ్వల్ ఫండ్ల ద్వారా కావచ్చు... నేరుగా కావచ్చు. మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిందొక్కటే. ఊగిసలాటలు, కల్లోలాలు మార్కెట్కు సహజం. అసాధారణమేమీ కాదు. మనం ఆలోచించాల్సిందేంటంటే మార్కెట్లు ఇంకా ఎంత పడతాయనేది కాదు. దానికి మనమెలా స్పందించాలనేదే. మార్కెట్లు శాశ్వతం... హెచ్చుతగ్గులు తాత్కాలికం మార్కెట్ కరెక్షన్లు నాటకీయంగా ఉంటాయి. ఇక కోలుకోవేమో అనేంత భయం పుట్టిస్తాయి. పోర్టుఫోలియో విలువ పడిపోతుంది. వార్తలన్నీ నిరాశాజనకంగానే ఉంటాయి. ఇదిగో... ఇలాంటి దశలోనే చాలామంది ఇన్వెస్టర్లు తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను (సిప్) తాత్కాలికంగానో, శాశ్వతంగానో నిలిపేస్తుంటారు. కాకుంటే ఇది చాలా ఖరీదైన పొరపాటు. ఎందుకంటే తెలివైన ఇన్వెస్టరుకు ఇవన్నీ తాత్కాలికమని, సంపద సృష్టి అనేది దీర్ఘకాలికమని స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లు పతనమైనపుడే సిప్ బలంగా మారుతుంది. → అదే మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. → దీనివల్ల సగటు ఖరీదు ధర తగ్గుతుంది. → మార్కెట్లు రికవరీ అవుతున్నపుడు పెరుగుదల వేగంగా ఉంటుంది. → ఈ రుపీ కాస్ట్ యావరేజింగ్ అనేదే దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇంజిన్లా పనిచేస్తుంది.అసలైన మంత్రం... అసెట్ అలొకేషన్ డైవర్సిఫైడ్ పోర్టుఫోలియో ఉంటే రిస్కు పూర్తిగా పోకున్నా తగ్గుతుంది. ఎందుకంటే ఈ అసెట్లు రకరకాలుగా పనిచేస్తాయి. ఈక్విటీ వృద్ధికి తోడయితే డెట్ ఫండ్లు స్థిరత్వాన్ని ఇస్తాయి. బంగారం అనేది ఈ రెండింటికీ హెడ్జ్గా పనిచేస్తుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ డైవర్సిఫికేషన్ అనేది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. లైఫ్సైకిల్ ఫండ్స్లో క్రమశిక్షణే ‘పెట్టుబడి’ లైఫ్సైకిల్ ఫండ్స్... ఇవి ఏం చేస్తాయనేది వీటి పేరులోనే ఉంది. ఇవి మన జీవితానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అంటే.. తొలినాళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ మొత్తాన్ని పెడతాయి. మెల్లగా తగ్గించుకుంటూ వెళతాయి. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ... డెట్లో మొత్తాన్ని పెంచుకుంటూ వెళతాయి. ఉదాహరణకు... → లక్ష్యంలోని తొలి 20–30 ఏళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాయి. → తరువాతి 5–10 ఏళ్లు బ్యాలెన్స్డ్గా ముందుకెళతాయి. → మెచ్యూరిటీకి దగ్గరయ్యేటపుడు డెట్పై ఫోకస్ పెంచుతాయి. → ఇలా ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ల సమయంలో భావోద్వేగాలకు తావుండదు. → అలాగని ఇవేమీ రిసు్కలేకుండా ఉండవు. లైఫ్సైకిల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ అలొకేషన్ నిర్ణయాలను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి. ఖర్చుల నిష్పత్తిని, పన్ను ప్రభావాన్ని, మెచ్యూరిటీకి దగ్గర పడుతున్నపుడు పోర్టుఫోలియో తీరును నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఒకేరకమైన స్ట్రక్చర్ ఉన్నా... ఫండ్ మేనేజర్ల కారణంగా ఫండ్ల పనితీరు మాత్రం వేరుగా ఉండొచ్చు. సిప్ నిలిపేయటమే అసలు తప్పుఅన్నిటికన్నా సంపద సృష్టికి అడ్డంపడేది మార్కెట్ల పతనం కాదు. ఇన్వెస్టర్ల వైఖరే. ఎందుకంటే భయం తారస్థాయికి వెళ్లినపుడు... → ఇన్వెస్టర్లు సిప్ను నిలిపేస్తారు. → ఈక్విటీ ఫండ్ల నుంచి పూర్తిగా వైదొలుగుతారు. క్లారిటీ కోసం దీర్ఘకాలం వేచిచూస్తారు. కాకపోతే... ఈ క్లారిటీ వచ్చేసరికి మార్కెట్లు పెరిగిపోయి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సాధారణ ఇన్వెస్టర్లెపుడూ తక్కువ ఖరీదులో అమ్మేసి బాగా పెరిగాక కొంటుంటారు. తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అదే తేడా.మార్కెట్ టైమింగ్ ముఖ్యమేనా? చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఎంట్రీ, ఎగ్జిట్ల కోసం సరైన సమయం కోసం చూస్తుంటారు. నిజానికి నిపుణులకు కూడా ఇవి సరిగ్గా తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూ ఉండటం... క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ పోవటం... మన అసెట్ అలొకేషన్కు కట్టుబడి ఉండటం తప్పనిసరి. నిపుణులు చెప్పేదేంటంటే మార్కెట్లలో సమయం కోసం ఎదురుచూడటం కన్నా... ఎక్కువ సమయం ఉండటమే లాభాన్నిస్తుందని.ఇన్వెస్టర్లు ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు పరిస్థితులేమీ అంత స్థిరంగా లేవు. క్రమశిక్షణతోనే దీనికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. అందుకని చేయాల్సిందేంటంటే... → సిప్లను ఆపేయకుండా నిరంతరం కొనసాగించండి. → పోర్టుఫోలియో విలువను చూడకుండా... అసెట్ అలొకేషన్ను సమీక్షించుకోండి. → భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే భయం, ఆశ సంపద సృష్టికి శత్రువులుగా మారతాయి. → లక్ష్యాలకు తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్లు కొనసాగించండి. షార్ట్టర్మ్ ట్రెండ్ను బట్టి కాకుండా దీర్ఘకాల పనితీరు ఆధారంగా ఫండ్లను ఎంచుకోండి. → మీకు క్రమశిక్షణ లేదని మీరు భావిస్తే లైఫ్సైకిల్ ఫండ్స్ను ఎంచుకోండి. వాటిలో ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ ఉంటుంది... భావోద్వేగాల పరమైన తప్పులు జరగవు. -
మళ్లీ పెరిగిన బంగారం, ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు రెండో వారమూ పెరిగాయి. ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో 2.362 బిలియన్ డాలర్లు పెరిగి 703.308 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు(ఏప్రిల్ 10) వారంలో ఇవి 3.825 బిలియన్ డాలర్లు పెరిగి 700.946 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది. ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.481 బిలియన్ డాలర్లు పెరిగి, 557.463 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 790 మిలియన్ డాలర్లు పెరిగి 122.133 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
చైనా చమురు దిగ్గజంపై ట్రంప్ ఆంక్షలు
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇరాన్ నుంచి అక్రమంగా చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు చెందిన ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం ‘హెంగ్లీ పెట్రోకెమికల్’పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనితో పాటు ఇరాన్ చమురు రవాణాలో పాలుపంచుకుంటున్న సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై కూడా వేటు వేసింది.ఆంక్షల వెనుక ప్రధాన ఉద్దేశంఇరాన్ సైన్యానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ఉద్దేశం. తాజా చర్యతో ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, కంపెనీలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామన్న తన హెచ్చరికను ట్రంప్ ప్రభుత్వం అమలు చేసి చూపింది. దాంతో చైనాలోని డాలియన్ నగరంలో ఉన్న హెంగ్లీ పెట్రోకెమికల్ సదుపాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. రోజుకు సుమారు 4,00,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ పెసిలిటీ ఉత్పాదకత తగ్గిపోయే ప్రమాదముంది. అయితే, 2023 నుంచి ఈ సంస్థ ఇరాన్ ముడి చమురును స్వీకరిస్తూ తమ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని చేకూర్చినట్లు అమెరికా ట్రెజరీ విభాగం నిర్ధారించింది.ప్రపంచ ఇంధన మార్కెట్లో అలజడిఒకవైపు ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భౌగోళికంగా కూడా అమెరికా ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనాన్ని విధించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో ప్రపంచ ఇంధన వాణిజ్యం ప్రస్తుతం గందరగోళంలో ఉంది.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
దేశీ వినియోగమే వృద్ధికి దన్ను
పుణె: దేశీ వినియోగం వృద్ధి వేగాన్ని నిలబెడుతోందని, ఇక మీదటా జీడీపీ మెరుగ్గా వృద్ధి చెందేందుకు స్పష్టమైన విధానపర మద్దతు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఎస్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. దేశీ తయారీ, వ్యవసాయ రంగం బలమైన పనితీరు, పర్యాటకం, ఐటీ, అనుబంధ సేవల రంగాల నుంచి స్థిరమైన, విధానపరమైన మద్దతు లేకపోతే భారత్ వృద్ధి ప్రయాణం క్లిష్టంగా మారుతుందన్నారు. ఎగుమతులు సైతం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియలో ఘర్షణలతో దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ప్రభుత్వం తనవంతు మెరుగ్గా ఏం చేయగలదో చూస్తుందని చెప్పారు. యూఎస్ టారిఫ్ల ప్రభావిత సంస్థలకు ప్యాకేజీని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. థర్డ్ పార్టీ (వేరే సంస్థకు చెందిన) ఉత్పత్తుల పంపిణీకి ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకునేలా బ్యాంక్లను అనుమతించాలా? లేదా? అన్న దానిపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని కమిటీ అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ లావాదేవీలు పెరిగిన∙తరుణంలో కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలపై దృష్టి సారించాలని బ్యాంక్లకు సూచించారు. ఐడీబీఐలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐపై లోతైన అధ్యయనం.. ఆంథ్రోపిక్ సంస్థ తీసుకొచ్చిన ‘మైథోస్’ కృత్రిమ మేధ (ఏఐ) నమూనాపై ఆందోళనల నేపథ్యంలో.. గురువారం ఢిల్లీలో బ్యాంక్లతో సమావేశం నిర్వహించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి నాయకత్వంలో (ఐబీఏ చైర్మన్ కూడా) పనిచేయాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్లను కోరినట్టు చెప్పారు. -
గల్ఫ్ దేశాలకు తగ్గిపోయిన ఇంజనీరింగ్ ఎగుమతులు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్ ఎగుమతులను 250 బిలియన్ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం.గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్ డాలర్లు, కొరియాకి 3 బిలియన్ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. ఇవి ఎక్కువ – ఇవి తక్కువ గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్టరిక్ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్క్రాఫ్ట్, స్పేస్క్రాఫ్ట్ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి. -
పశ్చిమాసియా యుద్ధంతో ఆర్థిక సవాళ్లు
పశ్చిమాసియాలో ఘర్షణలు, సరఫరా వ్యవస్థలో అవరోధాలతో ఇంధన ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో మార్చి నెలలో అంతర్జాతీయ సరఫరా వ్యసవ్థపై ఒత్తిడులు పెరిగిపోయినట్టు పేర్కొంది. కాకపోతే ఏప్రిల్ మొదటి భాగంలో ఇవి కాస్తంత సడలినట్టు తెలిపింది. చాలా విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రంగాల్లో నిదానించినట్టు వివరించింది.పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితుల తీవ్రత, అవి ఎంత కాలం పాటు కొనసాగుతాయి.. దీని ఫలితంగా ఇంధన, ఇతర మౌలిక వసతులకు వాటిల్లే నష్టం ద్రవ్యోల్బణం, వృద్ధికి రిస్క్లు కాగలవని పేర్కొంది. ‘‘ఘర్షణలు కొనసాగి, సరఫరా వ్యవస్థలు వేగంగా పునరుద్ధరణకు నోచుకోకపోతే అధిక ఇంధన ధరలు, అధిక తయారీ వ్యయాలు, వాణిజ్య ఎగుమతుల రూపంలో సవాళ్లకు దారితీయొచ్చు’’అని ఆర్బీఐ బులెటిన్ తెలిపింది.ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, సరఫరా వైపు సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలతో పెరిగే రిస్క్లు నెలకొన్నట్టు వెల్లడించింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల తాత్కాలిక సంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనంగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నందున షాక్లకు తట్టుకుని నిలబడగలదని ఈ బులెటిన్ను రూపొందించిన ఆర్బీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. -
గల్ఫ్ దేశాలకు ఇంజనీరింగ్ ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్ ఎగుమతులను 250 బిలియన్ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్ డాలర్లు, కొరియాకి 3 బిలియన్ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. ఇవి ఎక్కువ – ఇవి తక్కువ గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్టరిక్ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్క్రాఫ్ట్, స్పేస్క్రాఫ్ట్ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి. -
బిలియనీర్ల హబ్గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్లో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉంటే, 2031 నాటికి 51 శాతం పెరిగి 313కి చేరుకోనున్నట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. అత్యంత ధనవంతులు (అల్ట్రా హెచ్ఎన్ఐలు) 19,877గా ఉంటే, 2031 నాటికి వీరి సంఖ్య 25,217కు చేరుకోనుంది. బిలియన్ డాలర్లు, అంతకుమించి సంపద కలిగిన వారిని బిలియనీర్లు (కుబేరులు)గా, 30 మిలియన్ డాలర్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా చెబుతారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అయిన నైట్ఫ్రాంక్ ఈ మేరకు 20వ ఎడిషన్ ‘ద వెల్త్ రిపోర్ట్, 2026’ను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, అసమాన ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. సంపద సృష్టి వేగంగా జరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత్లో టెక్నాలజీ, ఇండ్రస్టియల్స్, క్యాపిటల్ మార్కెట్స్ రంగాల్లో అసాధారణ సంపద సృష్టి జరుగుతున్నట్టు తెలిపింది. రాజధానిగా ముంబై.. దేశంలోని అల్ట్రా హెచ్ఎన్ఐలలో 35.4 శాతం మందికి ముంబై చిరునామాగా ఉంది. అల్ట్రా హెచ్ఎన్ఐల జనాభా పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగానూ అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 2021లో ఉన్న 5,51,435 నుంచి 7,13,626కు పెరిగింది. గత ఐదేళ్లలో భారత్లో బిలియనీర్ల సంఖ్య 58 శాతం పెరిగి 2026లో 207కు చేరింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా అమెరికాలో 914 మంది ఉండగా, చైనాలో 485 మంది ఉన్నారు. ‘‘భారత్లో సంపన్నుల సంఖ్య పెరుగుతుండటం ఆర్థిక పరిణామ క్రమానికి అద్దం పడుతోంది. పారిశ్రామిక స్ఫూర్తితో ఎదుగుతూ.. బలమైన మూలధన నిల్వలు, అత్యాధునిక ఆర్థిక మార్కెట్లతో రాణిస్తోంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల సమూహం పెరుగుతోంది. డిజిటలైజేషన్, లిస్టెడ్ కంపెనీలు, ప్రైవేటు క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి’’ అని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ పథకాలకు ‘కొత్త రూపాయి’
దేశ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం మొదలైంది. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడమే కాకుండా, ఆ నిధులు నిర్దేశించిన పనికే ఖర్చయ్యేలా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ 'ఈ-రూపాయి' (e-Rupee) అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహారాష్ట్రలోని ఫూలేనగర్కు చెందిన సమధన్ సోనావానే అనే రైతు కథే దీనికి నిదర్శనం.రైతులకు వరం.. డ్రిప్ ఇరిగేషన్కు ఊతంసాధారణంగా ప్రభుత్వ సబ్సిడీలు అందాలంటే రైతులు ముందుగా తమ జేబులోంచి డబ్బు ఖర్చు చేసి యంత్రాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాతే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. కానీ, ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్ట్ కింద సోనావానేకు ప్రభుత్వం నేరుగా డిజిటల్ వాలెట్లోకి నిధులను బదిలీ చేసింది. రూ. 1,03,000 ఖరీదైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కోసం 80% నిధులను ప్రభుత్వం ఈ-రూపాయి రూపంలో అందించింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వం అనుమతించిన విక్రేతల వద్ద, నిర్దేశించిన పరికరాల కోసమే వాడేలా 'ప్రోగ్రామ్' చేశారు. దీనివల్ల నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు.చైనాకు ధీటుగా భారత్ అడుగులుప్రపంచవ్యాప్తంగా దాదాపు 49 దేశాలు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పై ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే, కేవలం భారత్, చైనాలు మాత్రమే 'ప్రోగ్రామబుల్' (నిర్దిష్ట అవసరాలకే వాడేలా రూపొందించిన) డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్నాయి. చైనాలో 20 కోట్ల మంది ఈ-యువాన్ వాడుతుండగా, భారత్ తన 80 బిలియన్ డాలర్ల సంక్షేమ బడ్జెట్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ టెక్నాలజీని వాడుతోంది. ప్రస్తుతం భారత్లో కోటి మంది ఈ పైలట్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నట్లు అంచనా.పైలట్ ప్రాజెక్టుల విస్తరణభారతదేశం అంతటా ప్రస్తుతం 10 రకాల ప్రయోగాత్మక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మహారాష్ట్రలో వ్యవసాయ సబ్సిడీలు, సాగు నీటి పరికరాల కోసం ఈ-రూపాయి వినియోగిస్తున్నారు. గుజరాత్లో రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ఆహార పంపిణీ కోసం 15,000 మంది లబ్ధిదారులతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. జూన్ నాటికి దీన్ని 75 లక్షల కుటుంబాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.సవాళ్లు, విశ్లేషణలుఈ-రూపాయి భవిష్యత్తుపై నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. "నిధులు దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, అట్టడుగు వర్గాల రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు ఇది 'కిల్లర్ అప్లికేషన్' లాంటిది" అని డిజిటల్ కరెన్సీ సలహాదారు జాన్ కిఫ్ అభిప్రాయపడ్డారు. అయితే డబ్బును ఎలా ఖర్చు చేయాలో ప్రభుత్వం నియంత్రించడం వల్ల ప్రజలు దీని పట్ల ఆసక్తి చూపకపోవచ్చని ఎంఐటీ (MIT) నిపుణురాలు నేహా నరులా హెచ్చరించారు. ఇది వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్ ఆయిల్ షాక్’
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హార్వర్డ్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభం 1970ల నాటి చమురు సంక్షోభం కంటే భీకరమైనదని, దీన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆయిల్ షాక్గా ఆమె అభివర్ణించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఎదురయ్యే సవాళ్లను విశ్లేషించారు.వృద్ధి రేటుపై నీలినీడలుసంక్షోభం కొనసాగే కాలాన్ని బట్టి ప్రపంచ వృద్ధి రేటు దెబ్బతింటుందని గోపీనాథ్ స్పష్టం చేశారు. ఆమె విశ్లేషణ ప్రకారం.. రాబోయే వారం రోజుల్లో సమస్య సర్దుమణిగితే ప్రపంచ వృద్ధిపై ప్రభావం తక్కువగా (సుమారు 0.3% శాతం పాయింట్లు) ఉంటుంది. ఒకవేళ ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల మార్కును చేరితే ప్రపంచ వృద్ధి రేటు ప్రస్తుత అంచనా 3.4% నుంచి 2.5%కి పడిపోయే ప్రమాదం ఉంది.భారత్పై ద్వంద్వ ప్రభావంఇరాన్ వివాదం భారత్కు ప్రతికూల అంశమే అయినప్పటికీ దేశీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఊరటనిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘ఒకవైపు ఇరాన్ వివాదం నెగిటివ్ ప్రభావం చూపుతుంటే మరోవైపు దిగుమతి సుంకాలు 50% నుంచి 10%కి తగ్గడం సానుకూల పరిణామం. ఈ రెండూ ఒకదానికొకటి భర్తీ చేసుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5% వరకు ఉండవచ్చు’ అని ఆమె అంచనా వేశారు.ఎరువులు, ఎల్పీజీ ముప్పుకేవలం ధరల పెరుగుదలే కాకుండా, సరఫరా లేకపోవడం అనేది అసలైన సమస్య అని గోపీనాథ్ హెచ్చరించారు. ఒకవేళ హార్మూజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోతే భారత్కు ఎరువులు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోతుంది. ఇది దేశీయ ఉత్పత్తిని కుంటుపరుస్తుంది. ప్రస్తుతం దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నప్పటికీ రవాణా మార్గాలు మూసుకుపోతే సాగుపై ఎరువుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతుంది.సబ్సిడీలపై కీలక వ్యాఖ్యలుపెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని ప్రభుత్వం నిరవధికంగా భరించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘చమురు ధరలపై సబ్సిడీలు ఇస్తూ పోతే ద్రవ్యలోటు పెరుగుతుంది. ఏదో ఒక దశలో పెరిగిన ధరలలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పదు’ అని ఆమె చెప్పారు. ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ భారత దేశీయ మార్కెట్ బలంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని గోపీనాథ్ పేర్కొన్నారు. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా ఆర్థిక వ్యవస్థలు కుదుటపడతాయని ఆమె స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం -
ఆన్లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టపరమైన ప్రక్రియలు, కొత్త నిబంధనలను కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నోటిఫై చేసింది. ఈ నిబంధనలు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుకు కూడా వీలు కల్పిస్తాయి. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధిస్తూ.. ఈస్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్ను ప్రోత్సహించడం ఈ చట్టం ఉద్దేశం. చట్ట ప్రకారం ఇప్పటికే నిషేధించిన రియల్ మనీ గేమ్స్ కాకుండా చాలా వరకు ఆన్లైన్ గేమింగ్ సంస్థలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు.కేవలం నిర్ధిష్ట కేసుల్లోనే పర్యవేక్షణ ఉంటుందన్నారు. చట్టం కింద ఈస్పోర్ట్స్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘వీలున్నంత వరకు నియంత్రణలను సులభతరంగా ఉంచాలన్నదే మా ఉద్దేశం. మనీ గేమ్స్ కాని చాలా వరకు గేమ్స్ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ఆన్లైన్ మనీ గేమ్ లేదా ఆన్లైన్ సోషల్ గేమ్ లేదా ఈస్పోర్ట్స్లో ఏదన్నది నిర్ధారించుకోవాలంటూ ఎవరినీ బలవంతం చేయడం లేదు’’అని కృష్ణన్ పేర్కొన్నారు. కొత్త నిబంధనల్లో యూజర్ల భద్రతా సదుపాయాలను సైతం నిర్వచించినట్టు చెప్పారు.ఇదీ చదవండి: టిమ్ కుక్పై ట్రంప్ ప్రశంసల జల్లు -
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యం, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. కరెంటు అకౌంటు లోటు, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభావం పడుతుందని 2025–26 అక్టోబర్, డిసెంబర్ ట్రేడ్ వాచ్ రిపోర్టులో నీతి ఆయోగ్ ఈ విషయాలు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇండియా–గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పురోగతి నెమ్మదించి, డైవర్సిఫికేషన్పై ప్రభావం పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనేవి వన్–వే మార్గం కాదని, దీని వల్ల కొత్త మార్కెట్ లభిస్తుందని మనం అనుకున్నట్లే అటువైపు దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. కఠినతరమైన పరిస్థితుల్లోను భారత్ వాణిజ్య కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ గత 20 ఏళ్లుగా భారత్ సగటున 6 శాతం వృద్ధి చెందింది. → రత్నాభరణాల రంగం మిడ్–వేల్యూ ఉత్పత్తుల నుంచి అధిక విలువ చేసే ఎగుమతులవైపు మళ్లాలి. → డిజైన్ ఆధారిత తయారీ, క్లస్టర్ ఆర్అండ్డీ, జీఐ బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. → డ్యూటీ డ్రాబ్యాక్/ రీఫండ్స్ను క్రమబదీ్ధకరించాలి. ముడి సరుకుల వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ) మార్జిన్లను పెంచేందుకు, సరఫరాను మెరుగుపర్చాలి. → రుణ లభ్యతను పెంచాలి. పెట్టుబడుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. క్రెడిట్ గ్యారంటీలు, వడ్డీ రాయితీ, సప్లై చెయిన్ ఫైనాన్స్ను మెరుగుపర్చాలి. → 2026 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో ఉత్పత్తులు, సేవల వాణిజ్యం 5.3 శాతం పెరిగి 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. → మొత్తం వాణిజ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్టీఏ) భాగస్వాముల వాటా పెరిగింది. → రత్నాభరణాల రంగంలో భారత్ కీలకంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్ వాటా 73 శాతంగా ఉంది. దిగుమతుల్లో యూఏఈ, స్విట్జర్లాండ్, హాంకాంగ్ వాటా 60 శాతంగా ఉంది. -
మసులుతున్న భూమి.. మగ్గుతున్న ఆహార వ్యవస్థ!
ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దాంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని, అది ఆహార ధరలను పెంచుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన రెండు కీలక సంస్థలు ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా విడుదల చేసిన ఉమ్మడి నివేదికలో హెచ్చరికలు జారీ చేశాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు ప్రపంచ ఆహార వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, దీనివల్ల వంద కోట్ల మంది ప్రజల జీవనోపాధి, ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.గ్లోబల్ వార్మింగ్వాతావరణ మార్పుల ధాటికి పంటలు, పశువులు, మత్స్య సంపద, అడవులు విలవిలలాడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వేగవంతం కావడంతో 2025వ సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి కలిగిన మొదటి మూడు సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది.నివేదికలోని అంశాలు..ప్రధాన పంటల దిగుబడిపై ఉష్ణోగ్రత ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్లు దాటితే మొక్కల ఎదుగుదల మందగిస్తుంది.ప్రపంచ సగటు ఉష్ణోగ్రతపై పెరిగే ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ మన ప్రధాన ఆహార వనరులైన మొక్కజొన్న, వరి, సోయా, గోధుమల దిగుబడిని దాదాపు 6% మేర తగ్గిస్తుంది.మొరాకో ఉదాహరణ: ఆరేళ్ల కరువు తర్వాత అక్కడ సంభవించిన వడగాల్పుల వల్ల తృణధాన్యాల దిగుబడి 40% పడిపోయింది. ఆలివ్, సిట్రస్ తోటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.సముద్రాల్లో సెగలునేల మీద మాత్రమే కాదు, సముద్ర గర్భంలోనూ వేడి సెగలు పుడుతున్నాయి. 2024లో ప్రపంచ మహాసముద్రాల్లో 91% భాగానికి పైగా కనీసం ఒక్కసారైనా మెరైన్ హీట్ వేవ్(సముద్రపు వడగాల్పులు) సంభవించింది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి చేపల నిల్వలు క్షీణిస్తున్నాయి. ఇది మత్స్యకారుల పాలిట శాపంగా మారుతోంది.పరిష్కారం ఏమిటి?వాతావరణ మార్పుల సమాచారాన్ని నేరుగా రైతుల చేతుల్లోకి (మొబైల్స్ ద్వారా) చేరవేయాలి. తద్వారా పంటలు వేసే సమయాన్ని, కోత సమయాన్ని సర్దుబాటు చేసుకోగలరు.ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు.కేవలం తాత్కాలిక సర్దుబాట్లు సరిపోవని, గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నివేదిక నొక్కి చెప్పింది.అన్నదాత ఆవేదన, ప్రకృతి ఆగ్రహం కలిసి ప్రపంచ ఆహార భద్రతను అంచుకు నెట్టేస్తున్నాయి. మనం ఇప్పుడే మేల్కొని పర్యావరణ హితమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఆహార కొరత తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరికల సారాంశం.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
నాలుగేళ్ల తర్వాత గోధుమ రైతులకు గుడ్న్యూస్
దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో గోధుమల సేకరణ ప్రక్రియను పునప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ను ఆదేశించింది. 2021-22 సీజన్ నుంచి నిలిచిపోయిన ఈ ప్రక్రియను తక్షణమే తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 24 నుంచి సేకరణ కేంద్రాలు ప్రారంభంతాజా అధికారిక సమాచారం ప్రకారం, 2026 ఏప్రిల్ 24 నుంచి ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సేకరణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. నరేలా, నజాఫ్గఢ్ మండిలో రైతుల కోసం ప్రత్యేక సేకరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులు తమ పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవసరం లేకుండా ఇంటికి సమీపంలోనే కనీస మద్దతు ధరకు విక్రయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.21,000 మంది రైతులకు లబ్ధిరాజధాని ప్రాంతంలో సుమారు 29,000 హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమ సాగు జరుగుతోంది. ఏడాదికి దాదాపు 80,000 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలోని సుమారు 21,000 మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ‘రైతు సోదరులు తమ కష్టార్జితానికి సరైన ధర పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.బలోపేతం కానున్న రేషన్ వ్యవస్థకేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఢిల్లీ ప్రభుత్వం రాసిన లేఖకు తక్షణ స్పందన రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం చేకూరడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లభించే ఆహార ధాన్యాల సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.అవసరమైన పత్రాలుసేకరణ కేంద్రాల్లో తమ పంటను విక్రయించాలనుకునే రైతులు ఈ క్రింది ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.1. భూమి రికార్డులు2. బ్యాంక్ పాస్బుక్3. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి)అప్పుడు ఎందుకు సేకరణ ఆపారంటే..నాలుగేళ్ల క్రితం (2021-22 నుంచి) ఢిల్లీలో గోధుమల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధానంగా కొన్ని పరిపాలనాపరమైన, క్షేత్రస్థాయి కారణాలు ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఢిల్లీలో ఎఫ్సీఐ నేరుగా కొనుగోలు చేసే కేంద్రాల సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల రైతులు తమ పంటను అమ్ముకోవడానికి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్ మండీలకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనుగోలు ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనపై సరైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ స్తంభించిపోయింది.2021-22 సమయంలో బహిరంగ మార్కెట్లో గోధుమలకు మంచి ధర లభించడం, ఎగుమతులకు అవకాశం ఉండటంతో రైతులు కూడా ప్రభుత్వ కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. దీన్ని సాకుగా చూపి అధికారులు కొనుగోలు కేంద్రాలను క్రమంగా తగ్గించారు. రాజధాని ప్రాంతంలో పట్టణీకరణ పెరగడం వల్ల సాగు భూమి తగ్గుతోందన్న కారణంతో సేకరణ ప్రాధాన్యతను తగ్గించారు. కానీ, ఇప్పటికీ సుమారు 29,000 హెక్టార్లలో సాగు జరుగుతూనే ఉంది. ఈ కారణాల వల్ల గత నాలుగేళ్లుగా రైతులు తమ పంటను మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సేకరణ ప్రారంభించడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!


