breaking news
Economy
-
పటిష్టంగా భారత్ ఆర్థిక వ్యవస్థ
ముంబై: అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా నిలబడినట్టు ఆర్బీఐ అక్టోబర్ బులెటిన్ తెలిపింది. ‘‘అమెరికాలో వాణిజ్య, ఆర్థిక పరమైన అనిశ్చితులు పెరిగాయి. అయినప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కుదురుగా ఉంది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తలెత్తడం, అమెరికా ప్రభుత్వం షట్డౌన్ కొనసాగుతుండడంతో అక్టోబర్లో పెట్టుబడిదా రుల సెంటిమెంట్ దెబ్బతిన్నది. ఇలాంటి పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపించింది. పట్టణ డిమాండ్ కోలుకుంటున్నట్టు, గ్రామీణ వినియోగం బలంగా ఉన్నట్టు ముఖ్యమైన సూచికలు తెలియజేస్తున్నాయి. అయినప్పటికీ భా రత ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్త ప్రతికూలతలకు దూరంగా ఉండలేదు. కానీ, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉండడం, ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి చేరడం, బ్యాంకులు, కార్పొరేట్ల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగా ఉండడం, తగినంత విదేశీ మారక నిల్వలు, విశ్వసనీయమైన ద్రవ్య, పరపతి కార్యాచరణతో భారత్ గట్టిగా నిలబడగలిగింది’’అని ఆర్బీఐ తన బులెటిన్లో పేర్కొంది. సంస్కరణల మద్దతు అక్టోబర్ 1 నాటి మానిటరీ పాలసీ కమిటీ తీర్మానం ప్రకారం వృద్ధి అవకాశాలు బలంగానే ఉన్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ.. దేశీ చోద కాలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. దేశీయంగా చేపడుతున్న సంస్కరణలను ప్రస్తావించింది. ప్రస్తుత పరిస్థితుల్లో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డాలర్తో రూపాయి విలువ ఇటీవల క్షీణించినట్టు పే ర్కొంటూ.. వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు స్థిరంగా బయ టకు వెళుతుండడాన్ని ప్రస్తావించింది. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు వరుసగా మూడో నెల సెపె్టంబర్లో ప్రతికూలంగా నమోదైనట్టు తెలిపింది. ఈ బులెటిన్లోని అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమే కానీ, అధికారికమైనవి కావని ఆర్బీఐ పేర్కొంది. -
బస్సులో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్యాసింజర్లు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి కింది భద్రతా వ్యవస్థలు, సదుపాయాలు ఎంతో అవసరం అవుతాయి.ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత)అగ్నిప్రమాదాల వల్ల బస్సుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏసీ, స్లీపర్ బస్సుల్లో కిటికీలు తెరవడానికి వీలులేకపోవడం, తక్కువ ఎంట్రీ/ ఎక్జిట్ మార్గాలు ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పొగ వచ్చినప్పుడు వెంటనే డ్రైవర్ను, ప్రయాణికులను అప్రమత్తం చేసే సెన్సార్ ఆధారిత అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించగలిగే కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైర్ ఎక్స్టింగ్యుషర్లు ఉండాలి.ఎమర్జెన్సీ ఎక్జిట్సాధారణ ఎంట్రీ/ ఎక్జిట్ ద్వారాలు కాకుండా బస్సులో కనీసం రెండు సులభంగా తెరవగలిగే అత్యవసర ద్వారాలు (కిటికీలు లేదా హాచ్లు) తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఇంధన సరఫరాను ఆటోమేటిక్గా నిలిపివేసే వ్యవస్థ ఉండాలి.ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కిట్ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వైప్స్, కత్తెర, పట్టీలు, నొప్పి నివారణ మందులు (చిన్న గాయాలు, తలనొప్పి, వాంతులు మొదలైన వాటికి), బర్న్ క్రీమ్స్ వంటి ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలి. డ్రైవర్, అటెండర్లు ఈ పరికరాలను ఉపయోగించడంపై శిక్షణ పొంది ఉండాలి.ఇతర భద్రతా అంశాలుఅత్యవసర పరిస్థితుల్లో (ముఖ్యంగా అగ్నిప్రమాదం లేదా బస్సు నీటిలో పడినప్పుడు) కిటికీల అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే సేఫ్టీ హ్యామర్లు బస్సులో కనీసం 4-6 చోట్ల ఏర్పాటు చేయాలి.స్లీపర్ బెర్త్ల్లో ఇవి లేకపోయినా సీటింగ్ విధానం ఉన్న బస్సుల్లో కచ్చితంగా సీట్ బెల్ట్లు ఉండాలి.ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్ను, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే అత్యవసర బటన్ ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు కూడా మార్గాలు కనిపించేలా అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉండాలి.భద్రతా వ్యవస్థలను ఉపయోగించే విధానంఅగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదట డ్రైవర్ను, తోటి ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయాలి. అత్యవసర బటన్ను నొక్కాలి. అగ్ని ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యుషర్ను ఉపయోగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే బయటకు వెళ్లాలి. ప్రమాద సమయాల్లో అత్యవసర ద్వారాలు లేదా కిటికీలు (సేఫ్టీ హ్యామర్తో పగలగొట్టి) ద్వారా బయటకు రావాలి.బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉన్న యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేసి, బ్యాండేజీ వేయాలి. ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డ లేదా ప్యాడ్తో గాయంపై గట్టిగా నొక్కి పట్టుకోవాలి. వీలైనంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి.ఇదీ చదవండి: భారత్లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో.. -
నిజాయితీగా పన్ను చెల్లించేవారితో మర్యాదగా మెలగండి: సీతారామన్
ఘజియాబాద్: నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగలాని, వారికి పన్ను నిబంధనల అమలును సులభతరం చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ అధికారులకు సూచించారు. అదే సమయంలో పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఘజియాబాద్లో సెంట్రల్ జీఎస్టీ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. అధికారులపై క్రమశిక్షణ చర్యలను సకాలంలో ముగించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తద్వారా విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అనైతిక, దు్రష్పవర్తనను సహించేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) పంపించాలని కోరారు. వేగవంతమైన రిజి్రస్టేషన్కు, ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా టెక్నాలజీని వినియోగించుకోవాలని క్షేత్ర స్థాయి అధికారులకు సూచించారు. టెక్నాలజీ సాయంతో స్మార్ట్ విచారణలు చేయొచ్చు. అవసరమైతే పన్ను చెల్లింపుదారులను సంప్రదించొచ్చు. అంతేకానీ, ఆ పత్రం ఇవ్వండి, ఈ పత్రం ఇవ్వండి అంటూ పన్ను చెల్లింపుదారులపై భారం వేయొద్దు. వర్తకులకు మీకు మధ్య ఎలాంటి ఉక్కు గోడ లేదు. సమస్యను పెంచడానికి బదులు అది ఎక్కడ ఉందన్నది మీరు అర్థం చేసుకోవాలి. నిజాయితీపరులైన పన్ను చెల్లింపుదారులతో మర్యాదగా మెలగాలి. కొత్త తరం జీఎస్టీ కింద వారిని గౌరవిస్తున్నట్టు భావించేలా మసులుకోవాలి. పన్ను చెల్లింపుదారుల్లో ఎవరిలో అయినా నిజాయితీ లోపిస్తే నిబంధనల మేరకు వారిని నిలువరించండి. అంతేకానీ, ప్రతి ఒక్కరినీ అనుమానించొద్దు’’అంటూ మంత్రి జీఎస్టీ అధికారులకు హితవు పలికారు. కొత్త జీఎస్టీ అన్నది కేవలం రేట్లు, శ్లాబులు, సులభతరానికే పరిమితం కాదంటూ, తమను భిన్నంగా చూస్తున్నారన్న భావన పన్ను చెల్లింపుదారుల్లో కలిగేలా ఉండాలన్నారు. -
అమెరికాతో త్వరలో డీల్..!
బెర్లిన్/న్యూఢిల్లీ: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయంలో మరింత చేరువ అయినట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. సమీప భవిష్యత్తులోనే రెండు దేశాలు పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఆధ్వర్యంలోని బృందం గత వారంలో వాషింగ్టన్కు వెళ్లి చర్చలు నిర్వహించడం తెలిసిందే. అయితే, భారత్ హడావిడిగా వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదని . అమెరికా, ఐరోపా సహా పలు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తలకు తుపాకీ గురిపెట్టినట్టు లేదా నిరీ్ణత గడువులోపే ముగించేయాలన్న హడావిడితో భారత్ వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోదన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో మంత్రి బెర్లిన్లో పర్యటిస్తున్న సందర్భంగా మాట్లాడారు. దీర్ఘకాల దృష్టితోనే.. వాణిజ్య ఒప్పందాలను దీర్ఘకాల దృష్టితోనే భారత్ చూస్తుందని గోయల్ పేర్కొన్నారు. అమెరికా భారత ఉత్పత్తులపై అధిక టారిఫ్లు విధించిన నేపథ్యంలో కొత్త మార్కెట్లలో అవకాశాలపైనా దృష్టి సారించినట్టు చెప్పారు. భారత్ షరతులతో కూడిన పారదర్శక దీర్ఘకాల ఒప్పందాన్ని పొందుతోందా? అంటూ ఎదునైన ఒక ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. జాతి ప్రయోజనాలు తప్పించి మరే ఇతర కోణంలోనూ భారత్ తన మిత్రులను నిర్ణయించుకోదు. ఈయూకి మిత్రుడి కాలేరంటూ నాతో ఒకరు అన్నారు. దాన్ని నేను అంగీకరించను. అలాగే, రేపు మరొకరు కెన్యాతో కలసి పనిచేయలేరని అంటారు. అది కూడా ఆమోదనీయం కాదు అని అన్నారాయన -
ఈ–20 ప్రణాళికపై స్పష్టతనివ్వండి
ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ–20 (పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ మేళవింపు) ఇంధనానికి సంబంధించి తదుపరి మార్గదర్శ ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి ఇథనాల్ పరిశ్రమ విజ్ఞప్తి చేసింది. అలాగే బయోఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలపై (ఎఫ్ఎఫ్వీ) ట్యాక్స్లను తగ్గించాలని కోరింది. ఎఫ్ఎఫ్వీలు, స్మార్ట్ హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని క్రమబద్ధీకరించాలని, ఫేమ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలకి ఇచ్చినట్లే వినియోగదారులకు కూడా ప్రోత్సాహకాలివ్వాలని భారతీయ చక్కెర, బయో–ఎనర్జీ తయారీదార్ల అసోసియేషన్ (ఐఎస్ఎంఏ), భారతీయ గ్రీన్ ఎనర్జీ సమాఖ్య (ఐఎఫ్జీఈ) కలిసి విన్నవించాయి. అయిదేళ్ల కన్నా ముందుగానే ఈ–20 లక్ష్యాన్ని సాధించేసిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఇథనాల్ లక్ష్యాల సాధనలో చక్కెర పరిశ్రమ గణనీయంగా కృషి చేసిందని, ఈ విప్లవాన్ని ఇలాగే కొనసాగించాలంటే పాలసీలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని ఐఎస్ఎంఏ డైరెక్టర్ జనరల్ దీపక్ బల్లాని తెలిపారు. అయిల్ మార్కెటింగ్ కంపెనీలు 10.50 బిలియన్ లీటర్లు కోరితే, మిశ్రమ స్థాయిని 27 శాతానికి తీసుకెళ్లేందుకు సరిపడేంతగా పరిశ్రమ 17.76 బిలియన్ లీటర్లు ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. ఏటా 900 కోట్ల లీటర్ల పైగా ఇథనాల్ను ఉత్పత్తి చేసే సామర్థ్యాలను సాధించేందుకు చక్కెర పరిశ్రమ రూ.40,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని వివరించారు.ఈ–20 తదుపరి స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక లేకపోతే ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని, పెట్టుబడులు వృధా అవుతాయని ఆయన తెలిపారు. మరోవైపు, స్పష్టమైన లక్ష్యాలతో ప్రభుత్వం జాతీయ ఇథనాల్ మొబిలిటీ రోడ్మ్యాప్ 2030ని ప్రకటించాలని ఐఎఫ్జీఈ ప్రెసిడెంట్ ప్రమోద్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 5 శాతమే ఉండగా, వాటితో పోలిస్తే భారీ స్థాయిలో 43 శాతం జీఎస్టీ విధిస్తుండటమనేది ఎఫ్ఎఫ్వీలు, స్మార్ట్ హైబ్రిడ్ల కొనుగోళ్లకు ప్రతికూలంగా ఉంటోందని పేర్కొన్నారు. ఎఫ్ఎఫ్వీలకు సహాయకరంగా ఉండే పాలసీలతో భారత్ వార్షిక చమురు దిగుమతుల బిల్లును రూ.50,000–75,000 కోట్ల మేర తగ్గించుకోవచ్చని తెలిపారు.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
ఎంఎస్ఎంఈ రుణాలకు టారిఫ్ల దెబ్బ
ముంబై: బ్యాంకింగ్ వ్యవస్థలో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) రుణాల పోర్ట్ఫోలియోలో మొండిబాకీల (ఎన్పీఏ) పరిమాణం ఈ ఆరి్థక సంవత్సరం ఆఖరు నాటికి ఒక మోస్తరుగా పెరగనుంది. గత ఆరి్థక ఆఖరులో 3.59 శాతంగా ఉండగా, ఈసారి 3.7–3.9 శాతానికి పెరిగే అవకాశం ఉంది. భారత ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించడం ఇందుకు కారణం కానుంది. క్రిసిల్ రేటింగ్స్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టెక్స్టైల్స్, గార్మెంట్స్..కార్పెట్స్, రత్నాభరణాలు, రొయ్యలు తదితర ఎగుమతుల ఆధారిత ఎంఎస్ఎంఈలపై టారిఫ్ల ప్రభావం ఉంటుందని సంస్థ డైరెక్టర్ శుభ శ్రీ నారాయణన్ తెలిపారు. ఆరి్థక వృద్ధికి ఊతమిచ్చేందుకు చిన్న వ్యాపారాలకు మరింతగా రుణాలివ్వాలంటూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దీనివల్ల రిసు్కలు కూడా ఉంటాయని గుర్తించాలని నివేదిక సూచించింది. గతంలో కూడా ఎంఎస్ఎంఈలు వేగంగా వృద్ధి చెందినప్పుడు, కొన్నాళ్ల తర్వాత ఎన్పీఏలు భారీగా పెరిగాయని పేర్కొంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంఎస్ఎంఈల రుణాలు సుమారు 17 శాతంగా, కార్పొరేట్ రుణాలు 38 శాతంగా ఉంటాయి. రిటైల్ లోన్లకు సంబంధించి అన్సెక్యూర్డ్ విభాగంలోనూ రుణ నాణ్యతపై ఓ కన్నేసి ఉంచాల్సి వస్తుందని తెలిపింది. -
బ్యాంక్ ఖాతాకు ఇక నలుగురు నామినీలు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఖాతాదారులు, డిపాజిటర్లు ఇకపై నలుగురు వ్యక్తులను నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ సవరణ చట్టం, 2025ను ఈ ఏడాది ఏప్రిల్ 15న నోటిఫై చేయగా, నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో మొత్తం 19 సవరణలు చేశారు. వీటి ప్రకారం బ్యాంక్ ఖాతాదారులు ఒకేసారి నలుగురిని నామినీగా (ప్రతినిధి/నియమితుడు) నమోదు చేసుకోవచ్చు. ఖాతాదారుడు/డిపాజిటర్ మరణానంతరం క్లెయిమ్ సమయంలో ఎవరికి ఎంత శాతం చెందాలన్నది నిర్దేశించొచ్చు. ఒకే విడత నలుగురు లేదంటే ఒకరి తర్వాత ఒకరి నామినీ అమల్లోకి వచ్చేలా (సక్సెసివ్) ప్రతిపాదించొచ్చు. సేఫ్టీ లాకర్లలో ఉంచిన వస్తువులకు సంబంధించి ఒకే విడత నలుగురిని కాకుండా, ఒకరి తర్వాత ఒకరి నామినీ అమల్లోకి వచ్చేలా నమోదు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. అంటే మొదటి నామినీ మరణించిన తర్వాతే రెండో నామినీ అమల్లోకి వస్తుంది. ఒక్కరినే నామినీగా ప్రతిపాదించిన సందర్భాల్లో, సదరు వ్యక్తి కూడా అందుబాటులో లేకపోతే క్లెయిమ్ పరంగా ఇబ్బందులు రాకుండా ఈ సవరణ తీసుకొచి్చనట్టు తెలుస్తోంది. ‘‘ఈ కొత్త నిబంధనల అమలుతో నామినేషన్ల విషయంలో డిపాజిటర్లకు సౌలభ్యం ఏర్పడుతుంది. తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా నామినీలను ప్రతిపాదించొచ్చు. దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ అంతటా క్లెయిమ్ల పరిష్కారాల విషయంలో పారదర్శకత, ఏకరూపత, సమర్థత నెలకొంటుంది’’అని ఆర్థిక శాఖ తన ప్రకటనలో పేర్కొంది. బ్యాంకుల్లో పాలన పటిష్టం బ్యాంకింగ్ రంగంలో పాలనా ప్రమాణాలను పటిష్టం చేయడం, ఆర్బీఐకి వెల్లడించే సమాచారం విషయంలో ఏకరూపత, డిపాజిటర్లు, పెట్టుబడిదారుల ప్రయోజనాల రక్షణ, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యత పెంచడం, నామినీ సదుపాయం పరంగా కస్టమర్లకు సౌకర్యవంతమైన సేవలు అందించే లక్ష్యాలతో బ్యాంకింగ్ చట్టంలో సవరణలను కేంద్రం ప్రతిపాదించింది. -
భారతీయ మహిళల వద్ద ఇంత బంగారం ఉందా?
భారతీయులు అలంకార ప్రియులనే విషయాన్ని చరిత్ర కారులు కొన్నేళ్ల క్రితమే తమ రచనల్లో పేర్కొన్నారు. అలంకారమంటే.. కేవలం కట్టు, బొట్టు మాత్రమే కాదు.. ఆభరణాలు కూడా. భారతీయులు ధరించినన్ని నగలు.. ప్రపంచంలోనే చాలా దేశాల ప్రజలు ధరించరనే విషయం ఇప్పటికే చాలామంది వెల్లడించారు. ఇప్పుడు వరల్డ్ అప్డేట్స్ తన ఎక్స్ ఖాతాలో ఇదే విషయాన్ని వెల్లడించింది.బంగారం అంటే.. ఒకప్పుడు కేవలం అలంకారం. ఈ రోజు అది అలంకారం మాత్రమే కాదు, ఒక మనిషి ఆర్ధిక స్థితి కూడా. వరల్డ్ అప్డేట్స్ ప్రకారం సుమారు 10 దేశాల్లో ఉన్న బంగారం కంటే.. ఇండియాలోని మహిళల దగ్గరే ఎక్కువ ఉందని పేర్కొంది.➤భారతీయ మహిళల దగ్గరున్న బంగారం: 25,488 టన్నులు➤యూఎస్ఏ: 8,133 టన్నులు➤జర్మనీ: 3,351 టన్నులు➤ఇటలీ: 2,451 టన్నులు➤ఫ్రాన్స్: 2,437 టన్నులు➤రష్యా: 2,332 టన్నులు➤చైనా: 2,279 టన్నులు➤స్విట్జర్లాండ్: 1,039 టన్నులు➤జపాన్: 845 టన్నులు➤నెదర్లాండ్స్: 612 టన్నులు➤పోలాండ్: 448 టన్నులుBreaking:🇮🇳Indian women hold more Gold than 10 countries combined. - 🇮🇳 Indian Women: 25,488 tonnes- 🇺🇸 USA: 8,133 tonnes- 🇩🇪 Germany: 3,351 tonnes- 🇮🇹 Italy: 2,451 tonnes- 🇫🇷 France: 2,437 tonnes- 🇷🇺 Russia: 2,332 tonnes- 🇨🇳 China: 2,279 tonnes- 🇨🇭 Switzerland: 1,039… pic.twitter.com/64cyZNePUh— World updates (@itswpceo) October 21, 2025 -
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల రుణ పరిమితి రెట్టింపు..?
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs) కీలకమైన నియంత్రణ మార్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ని సంప్రదించాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న రుణ పరిమితిని రెట్టింపు చేయాలని, సహ-రుణాలలో (co-lending బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలతో కలిసి వచ్చే రుణాలు) పాల్గొనడానికి అనుమతించాలని, పోర్ట్ఫోలియో నిర్మాణంలో సడలింపులు కల్పించాలని కోరుతున్నాయి.ప్రస్తుతం వినియోగదారులకు గరిష్టంగా ఇచ్చే రుణ పరిమితిని రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు రెట్టింపు చేయాలని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆర్బీఐని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ పరిమితిని 2014లో నిర్ణయించారు. ఇది రెట్టింపు అయితే చిన్న వ్యాపారాలకు, మైక్రో ఎంటర్ప్రైజెస్కు పెద్ద మొత్తంలో రుణాలు అందించేందుకు వీలు అవుతుందని అధికారులు చెబుతున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల వ్యాపార పరిధిని పెంచుకోవడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని భావిస్తున్నారు.సెప్టెంబర్లో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వచ్చి ఇటీవల ఆర్బీఐని సంప్రదించాయి. ఈ సమావేశంలో వారి వ్యాపార వృద్ధికి అడ్డుగా ఉన్న అంశాలపై చర్చించినట్లు తెలిసింది. దీంతో పాటు ఎస్ఎఫ్బీలు తమ రుణ పోర్ట్ఫోలియో నిర్మాణంలో మార్పులు కోరుతూ నిబంధనలను సులభతరం చేయాలని ఆర్బీఐని అభ్యర్థించాయి.ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి సహ-రుణాలలో (co-lending) పాల్గొనడానికి ఎస్ఎఫ్బీలను అనుమతించాలని కోరుతున్నాయి. సహ-రుణాల ద్వారా విస్తృత స్థాయి కస్టమర్లకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఇది వారి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ అభ్యర్థనలు బ్యాంకుల వృద్ధికి, ప్రస్తుత వ్యాపార నమూనా సామర్థ్యాన్ని పెంచడానికి, చిన్న తరహా వ్యాపారాలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి దోహదపడతాయని నమ్ముతున్నారు.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
ప్రతిభను ఆకర్షించడంపై కెనడా దృష్టి
నైపుణ్యం కలిగిన ప్రతిభను ఆకర్షించడం, శ్రామిక శక్తిని పెంచడంపై దృష్టి సారించేలా కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ఆవిష్కరించారు. రాబోయే బడ్జెట్లో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. అమెరికా హెచ్1బీ వీసా ఫీజు పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కెనడా చర్యలు కీలకంగా మారనున్నాయి.ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ.. ‘దేశ అవసరాలకు సరిపోలేలా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా బడ్జెట్లో కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికకు కేటాయింపులుంటాయి. ఈ ప్రణాళికలో ప్రతిభ, నైపుణ్యాల శిక్షణ, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన అప్రెంటిస్షిప్లు ఉంటాయి’ అని చెప్పారు.అమెరికన్ హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో కార్నీ గ్లోబల్ టెక్ టాలెంట్పై దృష్టి సారించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా ఛార్జీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్లో సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో హెచ్-1బీ వీసాలపై 1,00,000 డాలర్ల రుసుము విధిస్తామని చెప్పారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ వంటి రంగాలలో విదేశీ ప్రతిభపై ఆధారపడే యూఎస్ కంపెనీల్లో అనిశ్చితిని సృష్టించింది. దీన్ని ఆసరాగా చేసుకుని కెనడా తమ దేశంలోకి ప్రతిభను ఆకర్షించే విధానాలు రూపొందిస్తుంది.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు
భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న గౌరవం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ దేశ శాంతిభద్రతల పరిరక్షణకు వెన్నెముకగా నిలిచే ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అత్యంత గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన వృత్తిగా ఉంది. ఇది కేవలం ఉద్యోగం మాత్రమే కాదు.. ప్రజలకు సేవ చేయడానికి, సరైన న్యాయం అందించడానికి వీలు కల్పిస్తుంది. చదువు పూర్తి చేసుకొని సివిల్స్ పరీక్షలో మెరిట్ సాధించిన చాలామంది యువత ప్రజలకు సర్వీసు అందించడంతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలు పొందుతున్నారు. ఐపీఎస్ స్థాయి అధికారుల నెలవారీ జీతం, ర్యాంక్ వారీగా వేతన నిర్మాణం ఎలా ఉంటుందో చూద్దాం.(రాష్ట్రాలు ప్రత్యేకంగా అందించే అలవెన్స్లనుబట్టి వారి వేతనాల్లో మార్పులుంటాయని గమనించాలి)ఐపీఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ తరహాలో వేతన స్కేల్ను అందిస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సుల తర్వాత ఐపీఎస్ అధికారుల వేతనాలను పే మ్యాట్రిక్స్ విధానం ద్వారా నిర్ణయిస్తున్నారు. జూనియర్ స్కేల్లో నియమితులైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) నెలవారీ ప్రాథమిక వేతనం సుమారు రూ.56,100తో ప్రారంభమవుతుంది. అధికారి అనుభవం, సర్వీస్, ర్యాంక్ పెరిగే కొద్దీ వారి జీతం కూడా అధికమవుతుంది. దేశంలో అత్యున్నత పోలీస్ పదవి అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) స్థాయిలో జీతం అత్యధికంగా ఉంటుంది.ర్యాంకుల వారీగా పే స్కేల్ (నెలవారీ ప్రాథమిక వేతనం)ర్యాంక్ నెలవారీ ప్రాథమిక వేతనండిప్యూటీ ఎస్పీ (DSP) / ఏసీపీ (ACP)రూ. 56,100అడిషనల్ ఎస్పీరూ. 67,700పోలీసు సూపరింటెండెంట్ (SP)రూ. 78,800డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (DIG)రూ. 1,31,000ఇన్స్పెక్టర్ జనరల్ (IG)రూ. 1,44,200అడిషనల్ డీజీపీ (ADGP)రూ. 2,05,000డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)రూ. 2,25,000 ఐపీఎస్ అధికారులకు అలవెన్సులు, సౌకర్యాలుఐపీఎస్ అధికారులు ప్రాథమిక జీతంతో పాటు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడే వివిధ రకాల భత్యాలు, సౌకర్యాలను కూడా పొందుతారు. ద్రవ్యోల్బణం రేటును బట్టి ఎప్పటికప్పుడు డియర్నెస్ అలవెన్స్ ఇస్తారు. ఇది ద్రవ్యోల్బణం ప్రభావాలకు వ్యతిరేకంగా అధికారుల జీతాలను సమతుల్యంగా ఉంచుతుంది.పోస్టింగ్ నగరాన్ని బట్టి HRA మారుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో ఇది అత్యధికంగా ఉంటుంది.అధికారిక పర్యటనల కోసం ప్రయాణ భత్యం ఇస్తారు. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు కూడా ఉంటాయి.ఐపీఎస్ అధికారులు వారి కుటుంబాలకు ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఉచిత చికిత్స, వైద్య సదుపాయాలు కల్పిస్తారు.సీనియర్ ర్యాంక్ అధికారులకు భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిని అందిస్తారు.ప్రభుత్వ గృహాలు (క్వార్టర్స్), విద్యుత్, సబ్సిడీలు, టెలిఫోన్ బిల్లులపై రాయితీలు కూడా ఉంటాయి.ఇదీ చదవండి: 3డీ సెన్సార్లతో రహదారి లోపాలు గుర్తింపు -
ఆర్బీఐ పసిడి నిల్వలు 880 టన్నులు!
న్యూఢిల్లీ: ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల కాలంలో 600 కిలోల బంగారాన్ని ఆర్బీఐ కొనుగోలు చేసింది. దీంతో సెప్టెంబర్ చివరికి ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. వీటి విలువ 95 బిలియన్ డాలర్లు (సుమారు రూ.8.36 లక్షల కోట్లు)గా ఉంటుందని ఆర్బీఐ డేటా తెలియజేస్తోంది. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 200 కిలోలు, జూలై–సెప్టెంబర్ కాలంలో మరో 400 కిలోల చొప్పున బంగారం నిల్వలను ఆర్బీఐ పెంచుకుంది. అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో, డాలర్ రిస్క్ ను తగ్గించుకునేందుకు ఆర్బీఐ ఇటీవలి సంవత్సరాల్లో తన విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుతోంది. 2025 మార్చి చివరికి ఆర్బీఐ వద్ద 879.58 మెట్రికల్ టన్నుల పసిడి నిల్వలు ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఆర్బీఐ 54.13 మెట్రిక్ టన్నుల మేర బంగారం కొనుగోలు చేసింది. ఇటీవలి కాలంలో ఆర్బీఐ పసిడికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ డేటా స్పష్టం చేస్తోంది. -
వైట్హౌస్ను కూల్చేస్తున్న ట్రంప్
అమెరికాలోని వైట్హౌస్లో 250 మిలియన్ల (సుమారు రూ.2,000 కోట్లు) భారీ వ్యయంతో కొత్త బాల్రూమ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్ట్లో భాగంగా వైట్హౌస్ తూర్పు విభాగం (ఈస్ట్ వింగ్)ను పాక్షికంగా కూల్చివేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లో తన కలల ప్రాజెక్టుగా భావించే ఈ బాల్రూమ్ నిర్మాణం కోసమే ఈస్ట్ వింగ్లో కొంత భాగాన్ని కూల్చివేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం వైట్హౌస్లో అతిపెద్ద హాల్ ‘ఈస్ట్ రూమ్’. దీనిలో సుమారు 200 మంది మాత్రమే కూర్చునే సామర్థ్యం ఉంది. స్టేట్ డిన్నర్లు, ఇతర పెద్ద ఈవెంట్లకు ఇది సరిపోవడం లేదని ట్రంప్ చాలాకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అతిథులను, ప్రపంచ నాయకులను వైట్హౌస్లోనే సౌకర్యవంతంగా ఆహ్వానించడానికి ప్రత్యేకంగా బాల్రూమ్ అవసరమని ఆయన తెలిపారు.తాత్కాలికంగా టెంట్లలో..స్టేట్ డిన్నర్లు వంటి అతిపెద్ద కార్యక్రమాలను గత అధ్యక్షులు తరచుగా వైట్హౌస్ దక్షిణ ప్రాంగణంలో (సౌత్ లాన్లో) తాత్కాలికంగా వేసిన టెంట్లలో నిర్వహించేవారు. దీనిపై ట్రంప్ అయిష్టంగా ఉన్నారు. ట్రంప్ ప్రతిపాదించిన కొత్త, సువిశాలమైన 90,000 చదరపు అడుగుల (సుమారు 8,300 చ.మీ.) బాల్రూమ్ 1000 మంది కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుందని, అవసరమైతే భవిష్యత్తులో అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం వంటి కార్యక్రమాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం లేదని దీన్ని ప్రైవేట్ వ్యక్తుల నుంచి సమకూర్చిన ఫండింగ్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.ఈస్ట్ వింగ్ కూల్చివేతఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించిన సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కొత్త బాల్రూమ్ వైట్హౌస్కు సమీపంలో ఉంటుందని, ఏమీ కూల్చివేతలు ఉండవని తెలిపారు. అయితే నిర్మాణ పనులు ప్రారంభమవగానే ఈస్ట్ వింగ్ ముఖభాగంలో కొంత భాగం కూల్చివేశారు. వైట్హౌస్ ఇచ్చిన వివరణ ప్రకారం కొత్త బాల్రూమ్ ప్రాజెక్ట్లో భాగంగా దేశ ప్రథమ మహిళ కార్యాలయం వంటి ఆఫీసులు ఉండే ఈస్ట్ వింగ్ను కూడా ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని తెలిసింది. ఈస్ట్ వింగ్ సంప్రదాయబద్ధంగా ప్రథమ మహిళ కార్యాలయాలకు, సందర్శకుల ప్రవేశానికి కేంద్రంగా ఉండేది. 1942లో ప్రపంచ యుద్ధం సమయంలో దీనికి రెండో అంతస్తు, బంకర్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఇదీ చదవండి: అమెరికాలోని విదేశీ విద్యార్థులకు ఊరట.. H-1B వీసా ఫీజు రద్దు -
భారత్ పథకాలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు
ఎలక్ట్రిక్ వాహనాలు (EV), అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) బ్యాటరీ స్టోరేజ్, ఆటోమొబైల్స్ విభాగంలో భారత్ కంపెనీలకు అందిస్తున్న ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాలకు వ్యతిరేకంగా చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఉన్న ఈ పథకాలను డబ్ల్యూటీఓ వేదికపై సమర్థించుకోవాల్సిన అవసరం భారత్కు ఏర్పడింది.చైనా ఆరోపణలుచైనా తన ఫిర్యాదులో భారతదేశం ఈవీ ప్రోత్సాహకాలు, పీఎల్ఐ పథకాలు చైనీస్ కోర్ వస్తువులపై వివక్ష పూరితంగా ఉన్నట్లు ఆరోపించింది. ఈ పథకాల కింద దేశీయ విలువ జోడింపునకు సంబంధించిన అంశాలు WTO కీలక ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా పేర్కొంది. అందులో సబ్సిడీలు, కౌంటర్వైలింగ్ చర్యలపై ఒప్పందం (SCM అగ్రిమెంట్-రాయితీలకు వ్యతిరేకం), సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (GATT 1994), వాణిజ్య సంబంధిత పెట్టుబడి చర్యల ఒప్పందం (TRIM)ను భారత్ బేఖాతరు చేసినట్లు చైనా తెలిపింది.భారతదేశం వైఖరిఈ పథకాలను అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. ‘ఆత్మనిర్భర్ భారత్’కు అనుగుణంగా ఈ పథకాలు ఉన్నాయని భారత్ చెబుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశీయ ప్రోత్సాహకాలు డబ్ల్యూటీఓ చట్టంలో ‘గ్రే ఏరియా’(పారిశ్రామిక రాయితీలు, టెక్నాలజీ ప్రమోషన్ పథకాలు, పర్యావరణ, అభివృద్ధి లక్ష్యాలను పేర్కొంటూ చట్టంలో స్పష్టంగా నిషేధించబడని విధాన చర్యలను సూచిస్తుంది)లో ఉన్నాయి. అందువల్ల పారిశ్రామిక అభివృద్ధి కోసం విధానాలు రూపొందించే హక్కు భారత్కు ఉంది.డబ్ల్యూటీఓ వివాద ప్రక్రియడబ్ల్యూటీఓ వివాద పరిష్కార విధానంలో భాగంగా సమస్యను పరిష్కరించేందుకు భారత్, చైనాలు ముందుగా ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంటుంది. సంప్రదింపులు విఫలమైతే చైనా తీర్పు ఇవ్వడానికి విధాన ప్యానెల్ను అభ్యర్థించవచ్చు. భారతదేశానికి ప్రతికూల తీర్పు వస్తే అప్పీల్ చేసే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం -
ఎరువుల ఎగుమతులపై చైనా నిషేధం
చైనా ప్రత్యేక ఎరువుల ఎగుమతులను మళ్లీ నిలిపివేయడం ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా భారతదేశ వ్యవసాయ రంగం ఈ నిర్ణయంతో ఇబ్బందిపడే అవకాశం ఉంది. చైనా చర్యల వల్ల భారత్లో ఎరువుల లభ్యత, ధరలపై ప్రభావం పడునుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.చైనా ఎగుమతి నిలిపివేతఅక్టోబర్ 15, 2025 నుంచి టెక్నికల్ మోనోఅమ్మోనియం ఫాస్ఫేట్ (TAMP), యాడ్ బ్లూ (యూరియా సొల్యూషన్), డి-అమ్మోనియం ఫాస్ఫేట్ (DAP), సాంప్రదాయ యూరియా వంటి ప్రత్యేక ఎరువుల ఎగుమతులను చైనా నిలిపివేసింది. ఈ సస్పెన్షన్ సుమారు 5-6 నెలల పాటు ఉంటుంది. అంటే ఈ నిలిపివేత మార్చి 2026 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ చర్య వల్ల అంతర్జాతీయ ఎరువుల మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని అనుసరించి సరఫరా గొలుసులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.భారతదేశంపై దీని ప్రభావంభారతదేశం ఈ ప్రత్యేక ఎరువుల్లో దాదాపు 95% చైనా నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇది ఏటా సుమారు 2.5 లక్షల టన్నులు, అంటే 60-65% రబీ సీజన్లో ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎరువుల దిగుమతులపై ఆధారపడుతుండడం వల్ల చైనా ఏకపక్ష నిర్ణయాలు భారతదేశ వ్యవసాయ భద్రతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.చైనా నిర్ణయం వల్ల కఠినమైన ప్రపంచ సరఫరా, అనిశ్చితి ఫలితంగా ఎరువుల ధరలు 10-15% వరకు పెరిగే అవకాశం ఉంది. ధరల పెరుగుదలతో అంతిమంగా రైతులపై భారం పడనుంది. దాంతో పంట ఉత్పత్తి వ్యయం పెరుగనుంది. కొందరు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుత రబీ సీజన్ (అక్టోబర్-మార్చి) కోసం భారతీయ వ్యాపారుల వద్ద ఇప్పటికీ నిల్వలున్నాయి. కాబట్టి తక్షణ ఎరువుల కొరత లేనప్పటికీ భవిష్యత్తులో వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.గతంలో ఇలా..చైనా గతంలో కూడా 2023 మధ్యలో, మే-జూన్ 2025లో (భారతదేశ ఖరీఫ్ సీజన్ను ప్రభావితం చేస్తూ) ఎగుమతులను నిలిపివేసింది. ఆగస్టు 2025లో దౌత్య చర్చల తర్వాత తాత్కాలికంగా వీటిపై నిషేధం ఎత్తివేశారు. తిరిగి అక్టోబర్ 15 నుంచి మళ్లీ నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సస్పెన్షన్ మార్చి 2026 తర్వాత కూడా కొనసాగితే భారతదేశం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. దేశీయ ఉత్పత్తిని పెంచడం, స్థిరమైన ప్రత్యామ్నాయ సరఫరాదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకోవడం, ఎరువుల వినియోగంలో సామర్థ్యాన్ని పెంచే విధానాలను అమలు చేయడం వంటి చర్యలు అత్యవసరం.ఇదీ చదవండి: పాకిస్థాన్లో కేజీ టమాటా రూ.700 -
నెమ్మదించిన మౌలికం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి వృద్ధి, నెలలవారీగా చూస్తే, ఈ ఏడాది సెప్టెంబర్లో నెమ్మదించింది. 3 శాతానికి పరిమితమైంది. ఆగస్టులో ఇది 6.5 శాతంగా ఉండగా, గతేడాది సెప్టెంబర్లో 2.4 శాతంగా నమోదైంది. బొగ్గు, క్రూడాయిల్, రిఫైనరీ ఉత్పత్తులు .. సహజ వాయువు ఉత్పత్తి తగ్గడంతో 3 నెలల కాలవ్యవధిలో సెప్టెంబర్లోనే అత్యల్పంగా మౌలిక వృద్ధి నమోదైంది.సమీక్షాకాలంలో ఎరువులు, సిమెంటు ఉత్పత్తి వృద్ధి రేటు వరుసగా 1.9 శాతం నుంచి 1.6 శాతానికి, 7.6 శాతం నుంచి 5.3 శాతానికి తగ్గింది. అయితే, ఉక్కు, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– సెప్టెంబర్ మధ్యకాలంలో 8 మౌలిక రంగాల వృద్ధి గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 4.3% నుంచి 2.9 శాతానికి నెమ్మదించింది. -
పాకిస్థాన్లో కేజీ టమాటా రూ.700
నిత్యావసర కూరగాయల్లో ముఖ్యమైన టమాటా ధర పాకిస్థాన్లో సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. అక్కడ కిలో టమాటా ధర రూ.700 పలుకుతుందంటే ఆ దేశంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది నెలలుగా పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి టమాటా ధరలను ఆకాశానికి చేర్చాయి. టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా ఈ క్రింది కారణాలు దోహదపడుతున్నాయి.ప్రకృతి వైపరీత్యాలు (వరదలు, వాతావరణ మార్పులు)పాకిస్థాన్లో చుట్టూ ఉన్న సింధ్, బలూచిస్థాన్, దక్షిణ పంజాబ్ ప్రాంతాల్లో గతంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది ఎకరాల్లో టమాటా పంట నాశనమైంది. దీని ఫలితంగా దేశీయ మార్కెట్లోకి టమాటా సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. వరదలు, వాతావరణ మార్పుల వల్ల రహదారులు దెబ్బతినడం, రవాణా ఆలస్యం కావడం వంటి కారణాల వల్ల కూడా పంట ఉన్న ప్రాంతాల నుంచి మార్కెట్లకు సరుకు చేరడంలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంపాకిస్థాన్ రూపాయి విలువ(భారత రూపాయితో పోలిస్తే పాక్ రూపాయి విలువ 0.31 పైసలుగా ఉంది) ఇతర కరెన్సీలతో పోలిస్తే భారీగా పడిపోతోంది. దీనివల్ల దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయంగా పంట నష్టం జరగడంతో టమాటా కొరతను తీర్చడానికి పాకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే పాక్ రూపాయి విలువ తగ్గడం, సరిహద్దుల్లో అనిశ్చితులు పెరగడం వల్ల దిగుమతి చేసుకునే టమాటా ధరలు అధికమయ్యాయి. గతంలో టమాటాకు సరైన ధరలు లభించకపోవడం, వాతావరణ మార్పుల వల్ల తరచుగా పంట నష్టాలు వాటిల్లడం వంటి కారణాల వల్ల రైతులు పంట సాగును తగ్గించారు.సీజనల్ కొరతటమాటా ధరలు సీజన్ను బట్టి తరచుగా మారుతుంటాయి. ముఖ్యంగా రెండు ప్రధాన పంటల సీజన్ల మధ్య కొద్దిపాటి కొరత ఏర్పడటం సర్వసాధారణం. అయితే ప్రస్తుత ఆర్థిక, వాతావరణ పరిస్థితులు ఈ సాధారణ కొరతను మరింత తీవ్రతరం చేశాయి. సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు కొంతమంది వ్యాపారులు పర్యవేక్షణ లోపాన్ని ఆసరాగా తీసుకుని కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.ఇదీ చదవండి: ప్రమోషన్ రావాలంటే 4 చిట్కాలు.. -
చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే..
ప్రపంచ వాణిజ్య వేదికపై అమెరికా (US), చైనాల మధ్య టారిఫ్లు, వాణిజ్యపరమైన ఆంక్షల రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరుదైన అయస్కాంత లోహాల సరఫరాను అడ్డుకోవద్దని అమెరికా చైనాకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతిచర్యగా ఈ కీలక లోహాల ఎగుమతులను నియంత్రించాలని చైనా చూస్తోంది. ఈ అరుదైన లోహాల ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలో చైనా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.ప్రపంచంలోని అరుదైన ఖనిజాల తవ్వకంలో దాదాపు 70%, వాటి శుద్ధిలో 90% వరకు చైనా నియంత్రిస్తోంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా ఈ లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధిస్తే అమెరికాపై చైనా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. ఈ నేపథ్యంలో చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి, టారిఫ్లను తగ్గించుకోవడానికి ఈ లోహాల నియంత్రణను ఒక ‘ట్రంప్ కార్డ్’గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.అరుదైన అయస్కాంత లోహాల ఉపయోగాలుఅరుదైన అయస్కాంత లోహాల్లో ముఖ్యంగా నియోడైమియం (Neodymium), ప్రెసోడైమియం (Praseodymium), డిస్ప్రోసియం (Dysprosium) వంటి మిశ్రమాలతో తయారైన శాశ్వత అయస్కాంతాలు (Permanent Magnets) కీలకంగా ఉన్నాయి. ఇవి ఆధునిక సాంకేతికతకు, డిఫెన్స్ రంగానికి వెన్నెముకగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవిగా, తేలికగా ఉండి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో, పవన విద్యుత్ టర్బైన్ల జనరేటర్లలో కీలకం. ఇవి అధిక సామర్థ్యంతో శక్తి మార్పిడిని సాధ్యం చేస్తాయి.కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, స్పీకర్లు, హెడ్ఫోన్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇవి తప్పనిసరి.అధునాతన ఆయుధ వ్యవస్థలైన ఫైటర్ జెట్లు, క్షిపణులు, ఇతర స్మార్ట్ బాంబులు వంటి వాటిలో ఉపయోగించే మోటార్లు, సెన్సార్లకు ఈ అయస్కాంత లోహాలు ఎంతో అవసరం. ఈ కారణం వల్లనే ఈ లోహాలను వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.ఎంఆర్ఐ యంత్రాలు (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్), పేస్మేకర్లు, హియరింగ్ ఎక్విప్మెంట్లు వంటి వైద్య పరికరాల్లో వీటిని ఉపయోగిస్తారు.పవర్ టూల్స్, రోబోటిక్స్, హై-పెర్ఫార్మెన్స్ ఏసీ సర్వో మోటార్లతో సహా అనేక పారిశ్రామిక అనువర్తనాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.అరుదైన అయస్కాంత లోహాల వివాదం కేవలం వాణిజ్య పరమైన సమస్య కాకుండా ప్రపంచ భద్రత, సాంకేతిక ఆధిపత్యం, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ లోహాలపై చైనాకున్న పట్టు దాన్ని ఒక శక్తివంతమైన భౌగోళిక రాజకీయ ఆయుధంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇతర దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ సొంత అరుదైన లోహాల సరఫరా గొలుసులను బలోపేతం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే.. -
దీనదయాళ్ పోర్ట్లో తగ్గిన రష్యా చమురు సరఫరా
ప్రపంచ దేశాల ఒత్తిడి, యూఎస్, ఈయూల సెకండరీ ఆంక్షల(రష్యాతో వ్యాపారం సాగిస్తున్న దేశాలు, కంపెనీలపై పరోక్షంగా విధించి ఆంక్షలు) ప్రభావం కారణంగా రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు తెలుస్తుంది. దాంతో దేశంలోని 13 ప్రధాన ఓడరేవుల్లో అత్యంత ముఖ్యమైన దీనదయాళ్ పోర్ట్(Deendayal Port)లో గణనీయంగా సరఫరా దెబ్బతింది. రష్యన్ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ నౌకాశ్రయం తాజా గణాంకాల ప్రకారం క్రూడ్ వాల్యూమ్ క్షీణతను నమోదు చేసింది.2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దీనదయాళ్ పోర్ట్ నిర్వహించిన ముడి చమురు, ఎల్పీజీ/ఎల్ఎన్జీ మొత్తం వాల్యూమ్ 30.07 లక్షల టన్నులకు తగ్గింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 32.5 లక్షల టన్నుల వాల్యూమ్తో పోలిస్తే దాదాపు 6% క్షీణతను సూచిస్తుంది. భారతదేశంలోని ప్రధాన ఓడరేవుల్లో దీనదయాళ్ పోర్ట్ రష్యన్ చమురును అధికంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ తగ్గుదల ఆందోళన కలిగిస్తోంది.తగ్గుదలకు కారణాలుభారతదేశంపై రష్యా చమురు దిగుమతులకు సంబంధించి ప్రత్యక్ష ఆంక్షలు లేనప్పటికీ అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU) విధించిన ద్వితీయ పరిమితుల (Secondary sanctions) ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రష్యన్ చమురు సరఫరాపై పడింది. రవాణా, బీమా, ఆర్థిక లావాదేవీలు కఠినతరం కావడంతో దిగుమతిదారులు రష్యన్ చమురును నిలిపేస్తున్నారు. ఇతర ప్రత్యామ్నాయ వనరుల వైపు మళ్లుతున్నారు.భారత్పై ఒత్తిడిభారతదేశం తన ఇంధన అవసరాల కోసం రష్యా ముడి చమురుపై భారీగా ఆధారపడటాన్ని తగ్గించాలని యూఎస్, ఈయూ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో అమెరికా, పశ్చిమ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్కు ఉంది. రష్యా చమురు దిగుమతులను కొనసాగించడం ఈ సంబంధాలకు ఇబ్బంది కలిగిస్తుంది. రష్యా చమురుతో సంబంధం ఉన్న సంస్థలు, బ్యాంకులపై భవిష్యత్తులో అమెరికా సెకండరీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.రిఫైనరీలపై ప్రభావందీనదయాళ్ పోర్ట్ ద్వారా సాగే ముడి చమురు సరఫరా ప్రధానంగా నయారా ఎనర్జీ (Nayara Energy- రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ మద్దతు కలిగిన సంస్థ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) వంటి రిఫైనరీలపై పడుతుంది. నయారా ఎనర్జీకి రష్యాకు చెందిన రోస్నెఫ్ట్తో 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందం ఉంది. అయితే ఈ ఒత్తిళ్ల మధ్య కూడా నయారా చమురు సరఫరా ప్రస్తుతానికి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి 6,700కు పైగా ఫ్యూయల్ స్టేషన్లకు ఇంధనాన్ని నింపుతూ దేశీయ సరఫరాను కొనసాగిస్తున్నాయి. తాత్కాలికంగా ఐఓసీకి చెందిన వదినార్ రిఫైనరీలో నిర్వహణ పనులు కూడా ముడి చమురు వినియోగం తగ్గడానికి మరో కారణంగా నిలిచింది.ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు.. -
రైతులకు బ్యాంకులు రుణాలు ఎందుకు ఇవ్వవంటే..
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, గ్రామీణ అభివృద్ధిని పెంచడానికి వ్యవసాయ రుణాలు చాలా ముఖ్యం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను వ్యవసాయ రుణాలు పెంచాలని తరచుగా ఆదేశిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సకాలంలో రుణం అందడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతుల జీవనోపాధికి కీలకం. అయితే ఈ దిశగా కేంద్రం చేస్తున్న కృషికి అనుగుణంగా బ్యాంకులు వీటి పంపిణీని ఆశించినంతగా పెంచడం లేదు. అందుకు కొన్ని సవాళ్లను ఎదురవుతున్నాయనే వాదనలున్నాయి.నాన్-పెర్ఫార్మింగ్ అసెట్స్(NPA) భయంవ్యవసాయ రంగంలో అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల రుణమాఫీ పథకాల ప్రకటన కారణంగా రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని ఫలితంగా బ్యాంకులకు మొండి బకాయిలు (NPA) పెరిగే అవకాశం ఉంది. పెద్ద పరిశ్రమల మొండి బకాయిలతో పోలిస్తే రైతుల మొండి బకాయిలు తక్కువగా ఉన్నప్పటికీ బ్యాంకులకు ఇది ఆందోళనగా మిగిలిపోతుంది.రుణాల దుర్వినియోగంకొందరు రుణగ్రహీతలు వ్యవసాయం పేరుతో బంగారం తాకట్టు రుణాలు తీసుకుని వాటిని రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం (ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో) బ్యాంకు అధికారులు తనిఖీల్లో గుర్తిస్తున్నారు. దీనివల్ల రుణం పొందిన ప్రయోజనం నెరవేరకపోవడం, రాయితీ వడ్డీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ కఠిన మార్గదర్శకాలు తీసుకువచ్చింది.పూచీకత్తు సమస్యలుచిన్న, సన్నకారు రైతులకు, కౌలు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. కౌలు రైతుల విషయంలో సరైన ధ్రువీకరణ వ్యవస్థ లేకపోవడంతో వారికి రుణాలు అందడం లేదు.వ్యవసాయ క్షేత్రాల పరిశీలన సవాళ్లుగ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల పంపిణీ తర్వాత అవి నిజంగా వ్యవసాయ అవసరాలకు వాడుతున్నారా లేదా అని తనిఖీ చేయాలి. అందుకు బ్యాంకులకు తగినంత మానవ వనరులు, మౌలిక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్యగా ఉంది.రుణమాఫీ జాప్యంగత ప్రభుత్వాల హయాంలో రుణమాఫీ పథకాలు ప్రకటించినప్పటికీ వాటి అమలులో జాప్యం జరుగుతుంది. దానివల్ల రైతులు పాత రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.ఇదీ చదవండి: భారత రైల్వేలో అపార అవకాశాలు -
అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్
యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాల రూపకల్పన, వాటి నిర్వహణ, వాటిని భద్రపరచడానికి బాధ్యత వహించే కీలక ఏజెన్సీ అయిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) సిబ్బందికి సామూహిక లేఆఫ్స్ తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఏజెన్సీ తన ఉద్యోగుల్లో అధికశాతం మందిని తాత్కాలికంగా తొలగించవలసి వస్తుంది. దీంతో అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘NNSA వద్ద ఉన్న నిధులు త్వరలో అయిపోనున్నాయనే సమాచారం ఉంది. దీని కారణంగా ఏజెన్సీలోని ఉద్యోగుల్లో 80 శాతం మందిని తొలగించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్ఎన్ఎస్ఏపై షట్ డౌన్ ప్రభావాల గురించి మాట్లాడుతూ..‘త్వరలో ఏజెన్సీలో పని చేస్తున్న సుమారు పదివేల మందికి లేఆఫ్స్ ఇస్తాం. మా జాతీయ భద్రతకు వారు కీలకమైన సిబ్బంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చర్యలు తప్పడం లేదు’ అని తెలిపారు.జాతీయ భద్రతపై ఆందోళన?‘ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిని నిర్వహిస్తున్నారు. అందులో భద్రత, అత్యవసర సిబ్బంది విధుల్లో ఉంటారు. మేము ఇప్పటికే ఉన్న ఆయుధాగారాన్ని చెక్కుచెదరకుండా, సురక్షితంగా ఉంచబోతున్నాం. జాతీయ భద్రతపై ఎలాంటి ఆందోళన వద్దు’ అని రైట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
పేద దేశమైనా రూపాయి కంటే బలమైన కరెన్సీ.. ఎలా?
ఆఫ్ఘనిస్తాన్ అంటే ప్రపంచంలో అత్యంత పేద, అస్థిర దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఎప్పుడూ యుద్ధం లేదా ఉగ్రవాద ఘటనలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు దాని కరెన్సీ బలం వల్ల ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్న ఈ దేశం కరెన్సీ పరంగా మాత్రం అత్యంత స్థిరమైన దేశాల్లో ఒకటిగా అవతరించడమంటే నిజంగా ఆశ్చర్యమే.ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ విలువ ఎంత?ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ (Afghanistan Currency) ఆఫ్ఘనీ (AFN). ప్రస్తుతం ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ.. భారత రూపాయి (Indian Rupee) కంటే బలంగా ఉంది. కరెన్సీ ఎక్స్ఛేంజ్ వెబ్సైట్ XE.com ప్రకారం.. 1 ఆఫ్ఘన్ ఆఫ్ఘనీ విలువ రూ.1.33 భారతీయ రూపాయలతో సమానం. ఇది అర్థం ఏమిటంటే, ఆఫ్ఘనిస్తాన్లో 1 లక్ష ఆఫ్ఘనీలను సంపాదించడం, భారతదేశంలో సుమారు రూ.1.33 లక్షలకు సమానమవుతుంది. ఇది ఆర్థికంగా పోరాటం చేస్తున్న దేశానికి పెద్ద విషయమే.ఆఫ్ఘన్ కరెన్సీ బలానికి కారణం2021లో అధికారంలోకి వచ్చిన తాలిబన్ ప్రభుత్వం, దేశీయ కరెన్సీని బలోపేతం చేసే చర్యలు తీసుకుంది. అవి..విదేశీ కరెన్సీ వినియోగంపై నిషేధం: ముఖ్యంగా అమెరికన్ డాలర్, పాకిస్తాన్ రూపాయి వాడకాన్ని ఆపివేశారు.ఆఫ్ఘన్ కరెన్సీలో లావాదేవీలు తప్పనిసరి నిబంధన: ఇది స్థానిక కరెన్సీకి డిమాండ్ను పెంచింది.ద్రవ్య విధానాల పటుత్వం: కఠిన ద్రవ్య విధానాల ద్వారా ద్రవ్యపు ప్రవాహాన్ని నియంత్రించారు.కరెన్సీ స్థిరత్వం వెనుక వాస్తవంఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చిన్నదిగా ఉండవచ్చు. కానీ పరిమిత దిగుమతులు, చాలా తక్కువ విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం కారణంగా దాని కరెన్సీ స్థిరంగా ఉంది. దాదాపు ప్రతి దేశీయ లావాదేవీ స్థానిక కరెన్సీలో నిర్వహించడంతో, ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ విలువ పడిపోవడానికి బదులుగా స్థిరంగా ఉంటుంది. -
బంగారం @ 1,31,800
న్యూఢిల్లీ: దేశీ మార్కెట్లో పసిడి ధరలు మరో సరికొత్త రికార్డును సృష్టించాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి బుధవారం మరో రూ.1,000 పెరిగి రూ.1,31,800 (పన్నులు సహా) స్థాయికి చేరింది. మరోవైపు వెండి ధర కాస్తంత దిగొచ్చింది. కిలోకి రూ.3,000 తగ్గి రూ.1,82,000 (పన్నులు సహా) వద్ద స్థిరపడింది. మంగళవారం వెండి కిలోకి రూ.6,000 పెరిగి ఆల్టైమ్ గరిష్ట ధర రూ.1,85,000ను నమోదు చేయడం తెలిసిందే. పండుగల సీజన్ కావడంతో రిటైలర్లు, జ్యుయలర్ల కొనుగోళ్లతో పసిడి ధరలు పెరిగినట్టు ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ తెలిపింది. ‘‘అంతర్జాతీయంగా బలమైన ర్యాలీ, దేశీయంగా భౌతిక బంగారం కొనుగోళ్లు, పెట్టుబడుల డిమాండ్ తోడవడంతో బంగారం ధర మరో నూతన రికార్డు గరిష్టానికి చేరింది. రూపాయి బలపడడం ధరల ర్యాలీకి కీలక అవరోధంగా వ్యవహరించింది. దీంతో దేశీ మార్కెట్లో ధరల పెరుగుదల పరిమితమైంది. మొత్తం మీద బుల్లిష్ ధోరణి కొనసాగుతోంది. పండుగల కొనుగోళ్లతో ఇదే ధోరణి కొనసాగుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు’’అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. -
‘ఆ సుంకాల ప్రభావం ఊహించినంత తీవ్రమేమీ కాదు’
ప్రపంచ వృద్ధి మందగమనానికి "అనిశ్చితి, రక్షణవాదం" వంటి హెడ్విండ్స్ (ప్రతికూల ప్రభావాలు) కారణమని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) పేర్కొంది. అయినప్పటికీ, వాణిజ్య సుంకాల వల్ల వచ్చే ప్రభావం "మొదట భావించిన దానికంటే తక్కువగా ఉందని" సంస్థ విశ్లేషించింది."ప్రధాన విధాన మార్పులు ఉన్నప్పటికీ, ప్రపంచ వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. సుంకాల పెరుగుదల ప్రభావం ఊహించిన దానికంటే తక్కువగా ఉండటం వెనుక, కొత్త వాణిజ్య ఒప్పందాలు, బహుళ మినహాయింపులు, సరఫరా గొలుసులను పునఃఆయోజనం చేయడంలో ప్రైవేట్ రంగం చురుకుదనం ముఖ్య పాత్ర పోషించాయి" అని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియరీ-ఒలివర్ గౌరించాస్ పేర్కొన్నారు.భారత జీడీపీ అంచనాలు పెంచిన ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.6 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజా అంచనా ప్రకటించింది. గత అంచనా అయిన 6.4 శాతాన్ని ఎగువకు పెంచింది. 2026–27 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 0.20 శాతం తగ్గిస్తూ 6.2 శాతంగా ఉండొచ్చని తెలిపింది.అమెరికా టారిఫ్ల ప్రభావాలకు మించి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) బలమైన వృద్ధి నమోదు కావడాన్ని తమ అంచనాల పెంపునకు కారణంగా పేర్కొంది. జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధి చెందడం గమనార్హం.ప్రపంచ వృద్ధి 2024లో నమోదైన 3.3 శాతం నుంచి 2025లో 3.2 శాతానికి, 2026లో 3.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. వర్ధమాన, అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వృద్ధి సైతం 2024లో నమోదైన 4.3 శాతం నుంచి 2025లో 4.2 శాతానికి, 2026లో 4 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. -
నక్సల్స్పై రివార్డుకు పన్ను మినహాయింపు ఉంటుందా?
భారతదేశంలో నక్సల్స్/ మావోయిస్టులు లొంగిపోవడం అనేది నిరంతర ప్రక్రియ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానాలు, ఇతర కొన్ని కారణాల వల్ల చాలా మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోతున్నారు. అయితే ముఖ్య నేతలపై ఉండే భారీ నజరానా (రివార్డు)ను లొంగిపోయిన తర్వాత వారికి అందిస్తారు. ఈ నేపథ్యంలో లొంగిపోయిన నక్సల్స్కు ఇచ్చే నజరానాపై ఆదాయపు పన్ను (Income Tax) ఉంటుందా? అనే అనుమానం సహజంగా ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. తొలితరం మావోయిస్టు అగ్రనేత, పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను గడ్చిరోలి(మహారాష్ట్ర) పోలీసులకు లొంగిపోయారు. ఆయనపై రూ.6 కోట్ల వరకు రివార్డు ఉంది. తనతోపాటు మరో 60 మంది మావోయిస్టులు లొంగిపోయారు.నక్సల్స్ లొంగుబాటు, నజరానానక్సల్స్కు ప్రభుత్వాలు ప్రకటించే లొంగుబాటు విధానంలో భాగంగా సాయుధ దళాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి పునరావాసం కల్పిస్తారు. ఈ విధానంలో లొంగిపోయిన నక్సల్స్కు, ముఖ్యంగా కీలక స్థానాల్లో ఉండి లొంగిపోయేవారికి వారి స్థాయి, హింసాత్మక చర్యల తీవ్రత ఆధారంగా ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతి (నజరానా/రివార్డు) ఇస్తుంది. లొంగిపోయిన తర్వాత సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు, ఇల్లు కట్టుకోవడానికి, వృత్తిపరమైన శిక్షణ పొందడానికి వారికి ఇది ఆర్థిక సాయంగా ఉంటుంది.ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?భారతదేశ ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ప్రభుత్వాల నుంచి పొందే కొన్ని రకాల అవార్డులు లేదా నజరానాలపై పన్ను మినహాయింపు ఉంటుంది.సెక్షన్ 10(17A): ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(17A) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా సంస్థ ద్వారా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేసిన అవార్డు లేదా నజరానా కింద నగదు రూపంలో, ఇతర రూపంలో పొందిన ఏదైనా చెల్లింపులపై పన్ను మినహాయింపు ఉంటుంది.ప్రభుత్వ లక్ష్యం: నక్సల్స్ లొంగుబాటు అనేది ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన ఒక కార్యక్రమం. నక్సలిజాన్ని అంతం చేయడానికి, శాంతిని పునరుద్ధరించడానికి, హింసను విడిచిపెట్టినవారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి ఈ రివార్డులు, పునరావాస విధానాలు రూపొందించారు. ఈ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటే నక్సల్స్ లొంగుబాటుపై ఇచ్చే నజరానా ప్రజా ప్రయోజనం కిందకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం కోసం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల పునరావాస విధాన మార్గదర్శకాలు, కేంద్ర ఆదాయపు పన్ను శాఖ అధికారిక నోటిఫికేషన్లను పరిశీలించవలసి ఉంటుంది.ఇదీ చదవండి: ధన త్రయోదశికి ముందే అంతులేని ధరలు -
నేటి నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు మళ్లీ షురూ
అమెరికాకు అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులను ఇండియా పోస్ట్ అక్టోబర్ 15 నుంచి (నేడు) పునప్రారంభిస్తున్నట్లు పోస్టల్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) మార్గదర్శకాల ప్రకారం భారత్ నుంచి వెళ్లే షిప్మెంట్స్ కన్సైన్మెంట్ విలువలో 50 శాతం కస్టమ్స్ డ్యూటీ వర్తిస్తుందని పేర్కొంది.పోస్టల్ ఐటమ్లపై ప్రోడక్టును బట్టి సుంకాలు విధించడంలాంటివి ఉండదని వివరించింది. దీనితో చిన్న వ్యాపారులు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లు మొదలైన వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని పోస్టల్ శాఖ తెలిపింది. జులై 30, 2025న యూఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేసింది. దాని ప్రకారం.. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు సుంకం రహిత మినహాయింపులను ఉపసంహరించుకుంది. 100 డాలర్ల లోపు బహుమతులు మినహా దాదాపు అన్ని షిప్మెంట్లపై తప్పనిసరి కస్టమ్స్ సుంకాలు విధించారు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ద్వారా అధికారం పొందిన రవాణా క్యారియర్లు, అర్హత కలిగిన పార్టీల కోసం కొత్త నియమాలను ప్రవేశపెట్టారు. దాంతో ఇండియా పోస్ట్ ఆగస్టు 25, 2025 నుంచి యూఎస్కు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది.ఇదీ చదవండి: ఓ మై గోల్డ్! -
రత్నాభరణాల ఎగుమతులు సానుకూలమే
ముంబై: అమెరికా నుంచి టారిఫ్ పరమైన సవాళ్లు నెలకొన్నప్పటికీ, పండగలు, వివాహ సీజన్ డిమాండ్ కలసిరావడంతో సెప్టెంబర్లో రత్నాభరణాల పరిశ్రమ మంచి పనితీరు సాధించింది. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.55 శాతం అధికంగా 2,914 మిలియన్ డాలర్ల (రూ.25,737 కోట్లు) మేర ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఎగుమతులు రూ.22,925 కోట్లుగా ఉన్నాయి. ఈ వివరాలను రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.66 శాతం పెరిగి 14.09 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 13.60 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరిగాయి. 50 శాతం ప్రతీకార సుంకాల ఫలితంగా అమెరికాకు మాత్రం ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఆరు నెలల కాలంలో యూఎస్కు ఎగుమతులు 40 శాతం క్షీణించి 2,770 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కట్ చేసిన, సానబెట్టిన వజ్రాల ఎగుమతులు అయితే 54 శాతం తగ్గి 1,175 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. భారత రత్నాభరణాల ఎగుమతులకు అమెరికా చాలా కాలం నుంచి కీలక మార్కెట్గా ఉండగా, ప్రతీకార సుంకాలతో ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. బలమైన డిమాండ్ కొనసాగుతుంది.. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్యకాలంలో కట్, పాలిష్డ్ వజ్రాల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 6 శాతం మేర పెరిగి 1,368 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం ఆభరణాల ఎగుమతులు 2.4 శాతం పెరిగి 1,092 మిలియన్ డాలర్లకు చేరాయి. ‘‘2025–26 మొదటి అర్ధభాగంలో పరిశ్రమ కోలుకుందన్న దానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. కీలక మార్కెట్లు యూఏఈ, హాంగ్కాంగ్, యూకేలో రత్నాభరణాల ఉత్పత్తులకు డిమాండ్ బలపడింది. ఈ మార్కెట్లకు ఎగుమతులు స్థిరంగా పెరుగుతున్నాయి. రానున్న వివాహాల సీజన్ సమయంలో ప్రవాస భారతీయులు ఉన్న చోట డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.కనుక ఈ వృద్ధి మరో త్రైమాసికం పాటు స్థిరంగా కొనసాగుతుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. అమెరికా మార్కెట్కు ఎగుమతి చేసే తయారీదారులు సమస్యలను ఎదుర్కొంటున్నందున ప్రభుత్వంతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ రంగం స్థిరత్వం కోసం ఉపశమన చర్యలను ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రభావిత కార్మికుల కుటుంబాలకు రాయితీపై రుణాలు, వ్యక్తిగత రుణాల పునరుద్ధరణ, ఒక్కో కుమార్తెకు రూ.1,000 చొప్పున విద్యా సాయం, ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్మికులను తాత్కాలికంగా చేర్చాలని కోరినట్టు చెప్పారు. -
తగ్గిన ఆహార ధరలు
న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల ధరలు, తయారీ వస్తువుల ధరలు శాంతించడంతో టోకు ద్రవ్యోల్బణం సెప్టెంబర్ మాసంలో 0.13 శాతానికి పరిమితమైంది. టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూటీఐ) ఈ ఏడాది ఆగస్ట్లో 0.52 శాతంగా ఉంటే, గతేడాది సెప్టెంబర్లో 1.91 శాతంగా ఉండడం గమనార్హం. ⇒ ఆహార వస్తువుల్లో మైనస్ 5.22 శాతం ప్రతికూల ద్రవ్యోల్బణం నమోదైంది. ఆగస్ట్లో ఇది 3.06 శాతంగా ఉంది. ⇒ ముఖ్యంగా కూరగాయల ధరలు తగ్గాయి. ఈ విభాగంలో మైనస్ 24.41 శాతం ప్రతికూల ద్రవ్యోల్బణం నెలకొంది. ఆగస్ట్లో ఇది 14.18 శాతంగా ఉంది. ⇒ తయారీ వస్తువుల విభాగంలో 2.33 శాతానికి ద్రవ్యోల్బణం శాంతించింది. ఆగస్ట్లో ఇది 2.55 శాతంగా ఉంది. ⇒ ఇంధనం, విద్యుత్ విభాగంలోనూ మైనస్ 2.58 శాతం ద్రవ్యోల్బణం నెలకొంది. ఆగస్ట్లో ఇది 3.17 శాతంగా ఉంది. కనిష్ట స్థాయిలోనే కొంత కాలం అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు గణనీయంగా తగ్గడంతో, టోకు ద్రవ్యోల్బణం దీర్ఘకాలం పాటు కనిష్ట స్థాయిల్లోనే కొనసాగొచ్చని బార్క్లేస్ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ఆస్తా గుడ్వాణీ అభిప్రాయపడ్డారు. -
యూఎస్ ట్రెజరీ సెక్యూరిటీలను తగ్గించిన భారత్..
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రముఖ ఆర్థిక వ్యవస్థల్లో బ్రిక్స్ (BRICS) కూటమికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇందులోని కొన్ని సభ్య దేశాలు అమెరికాలోని తమ పెట్టుబడులను గణనీయంగా తగ్గిస్తున్నాయి. భారతదేశం, చైనా, బ్రెజిల్ అమెరికా ట్రెజరీ బాండ్లలో తమ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డీ-డాలరైజేషన్ దిశగా జరుగుతున్న మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.యూఎస్ ట్రెజరీ విభాగం జారీ చేసిన డేటా విశ్లేషణ ప్రకారం.. భారతదేశం, చైనా, బ్రెజిల్, సౌదీ అరేబియా సహా పలు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు (ఎమర్జింగ్ మార్కెట్స్) జులై 2024 నుంచి జులై 2025 మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీల్లో తమ వాటాలను తగ్గించుకున్నాయి.వ్యూహాత్మక మార్పుఇండియా విషయంలో ఇది కీలకమైన పరిణామం. జులై 2025 నాటికి భారత్ వద్ద ఉన్న అమెరికా ప్రభుత్వ బాండ్ల విలువ 219 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది జులై 2024లో ఉన్న 238.8 బిలియన్ల డాలర్లతో పోలిస్తే 8 శాతం తక్కువ. గతంలో భారత్ అమెరికా ట్రెజరీ సెక్యూరిటీల నిల్వలను క్రమంగా పెంచింది. జులై 2018లో ఉన్న 142.6 బిలియన్ డాలర్ల నుంచి ఏటా 7 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (CAGR)తో పెంచుతూ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విదేశీ మారక ద్రవ్య వ్యూహంలో యూఎస్ ట్రెజరీ సెక్యూరిటీలను తగ్గించుకోవడానికి మూడు ప్రధాన కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.బలహీనపడిన డాలర్: డొనాల్డ్ ట్రంప్ యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి డాలర్ బాగా బలహీనపడింది. ఈ సంవత్సరంలో డాలర్ ఇండెక్స్ దాదాపు 9 శాతం పడిపోయింది.రూపాయికి రక్షణ: డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయి విలువ క్షీణించకుండా కాపాడటానికి డాలర్ నిల్వలను ఉపయోగించారు.నిల్వల వైవిధ్యత: ఆర్బీఐ తన నిల్వలను వైవిధ్యపరచడంలో భాగంగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. బంగారం నిల్వలు పెరగడం వల్ల జులై 2024 నుంచి జులై 2025 మధ్య మొత్తం ఫారెక్స్ నిల్వలు 4 శాతం పెరిగాయి.బ్రిక్స్, ఎమర్జింగ్ మార్కెట్స్ దూకుడు..భారతదేశం మాత్రమే కాకుండా ఇతర ఎమర్జింగ్ మార్కెట్లు ఇదే ధోరణిని అనుసరిస్తున్నాయి. చైనా తన బాండ్ హోల్డింగ్లను 5.9 శాతం తగ్గించింది. ఈ విభాగంలో బ్రెజిల్ అత్యధికంగా 12 శాతం తగ్గింపును నమోదు చేసింది. సౌదీ అరేబియా తన హోల్డింగ్లను 7.7 శాతం తగ్గించుకుంది. అయితే ఇందుకు విరుద్ధంగా యూఏఈ అసాధారణంగా తన హోల్డింగ్లను 56.5 శాతం పెంచి 107.8 బిలియన్ డాలర్లకు చేర్చింది.కొన్ని దేశాలు మాత్రం..బలహీనపడిన డాలర్, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీల బలహీనత వంటి అంశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను డీ-డాలరైజేషన్ వైపు నెడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చాలా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు అమెరికా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం కొనసాగించాయి. డాలర్పై తమ విశ్వాసాన్ని కొనసాగిస్తూ జపాన్ (5.3 శాతం), జర్మనీ (2.7 శాతం), ఫ్రాన్స్ (34.7 శాతం), యూకే (22.6 శాతం) వంటి దేశాలు అదే కాలంలో తమ యూఎస్ ప్రభుత్వ బాండ్ హోల్డింగ్లను పెంచాయి.ఇదీ చదవండి: ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు! -
‘ఫిషింగ్’ వసతులు మెరుగుపరచాలి
మత్స్య పరిశ్రమ అభివృద్ధికి వీలుగా నీతి ఆయోగ్ కీలక సూచనలు చేసింది. చేపలు పట్టేందుకు ఉద్దేశించిన వసతులు, సామర్థ్యాల విస్తరణ (బోట్లు, పడవలు), ఆధునికీకరణకు పిలుపునిచ్చింది. తద్వారా బ్లూ ఎకానమీ (సముద్ర ఉత్పత్తులకు సంబంధించి)ని ప్రోత్సహించాలని కోరింది. చేపల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఒక కార్యాచరణను రూపొందించుకోవాలని, కీలకమైన మౌలిక వసతుల అంతరాన్ని భర్తీ చేయాలని పేర్కొంది.పెంపకానికి ఉద్దేశించిన చేపల రకాల ఎంపిక జాగ్రత్తగా ఉండాలని, సుస్థిరమైన పెంపకం విధానాలను ప్రోత్సహించాలని సూచించింది. మన దేశానికి 11,098 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. 2023–24లో చేపలు, చేపల ఉత్పత్తుల ఎగుమతుల రూపంలో ఆర్థిక వ్యవస్థకు రూ.60,523 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ చేసిన సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంతంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ 12 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్లు నికరంగా రూ.11.89 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన రూ. 11.18 లక్షల కోట్లతో పోలిస్తే 6 శాతం పెరిగాయి. కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం, రిఫండ్లు నెమ్మదించడం ఇందుకు కారణం. ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 12 వరకు రిఫండ్ల జారీ 16 శాతం తగ్గి రూ. 2.03 లక్షల కోట్లకు పరిమితమైంది.నికర కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ. 4.92 లక్షల కోట్ల నుంచి రూ. 5.02 లక్షల కోట్లకు చేరాయి. కార్పొరేట్యేతర పన్ను వసూళ్లు రూ. 5.94 లక్షల కోట్ల నుంచి రూ. 6.56 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక సమీక్షాకాలంలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ) వసూళ్లు రూ. 30,630 కోట్ల నుంచి రూ. 30,878 కోట్లకు చేరాయి. రిఫండ్లను సర్దుబాటు చేయకముందు స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2.36 శాతం పెరిగి రూ. 13.92 లక్షల కోట్లకు చేరాయి.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
ఎనిమిదేళ్ల కనిష్టానికి తగ్గిన ధరల దూకుడు
కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాల ధరలు నెమ్మదించడంతో సెప్టెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.54 శాతంగా నమోదైంది. ఇది ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి. చివరిసారిగా 2017 జూన్లో 1.46 శాతంగా రికార్డు కాగా, గతేడాది సెప్టెంబర్లో 5.49 శాతంగా, ఈ ఏడాది ఆగస్టులో 2.07 శాతంగా నమోదైంది. ఈ ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం రెండు శాతం లోపే రికార్డు కావడం ఇది రెండోసారి.రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్లో 53 బేసిస్ పాయింట్లు తగ్గిందని, 2017 జూన్ తర్వాత ఇదే కనిష్టమని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. ‘బేస్ ఎఫెక్ట్తో పాటు కూరగాయలు, నూనెలు, పండ్లు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, గుడ్లు, ఇంధనం మొదలైన ఉత్పత్తుల ధరలు నెమ్మదించడమనేది రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు కారణం‘ అని పేర్కొంది. గతేడాది సెపె్టంబర్లో 9.24%గా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం ఈసారి ఆగస్టులో మైనస్ 0.64%గా, సెప్టెంబర్లో మైనస్ 2.28%గా నమోదైంది.ఇదీ చదవండి: ఇక 100% ఈపీఎఫ్ విత్డ్రా! -
త్వరలో అమెరికాతో ఒప్పందం!
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) తొలి దశ సాకారానికి వీలుగా అమెరికా, భారత్ మధ్య ఈ వారంలో మరో విడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం భారత వాణిజ్య బృందం అమెరికాకు వెళ్లనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్ నాటికి తొలి దశ ఒప్పందం కుదుర్చుకోవాలన్నది ప్రణాళిక కాగా, ఇప్పటి వరకు ఐదు విడతలుగా రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగాయి. అనుకున్న సమయానికి తొలి దశ బీటీఏపై చర్చలను ముగించేందుకు రెండు దేశాలు సానుకూల దృక్పథంతో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన అధికారుల బృందం గత నెలలో న్యూయార్క్లో చర్చలు నిర్వహించడం తెలిసిందే. వీలైనంత త్వరలో పరస్పర ఆమోదయోగ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలను కొనసాగించాలని నిర్ణయించడం గమనార్హం. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, యూఎస్ రాయబారి సెర్గియో గోర్తో మంత్రి గోయల్ చర్చలు నిర్వహించారు. 2030 నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ప్రధాని మోదీ, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అంగీకారానికి రావడం తెలిసిందే. కీలక అంశాలపై చర్చలు కీలక ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు, నియంత్రణపరమైన సహకారం, ఇందనం, టెక్నాలజీ రంగాల్లో సహకారం పెంపుపై ఈ విడతలో చర్చలు ఉంటాయని తెలుస్తోంది. అమెరికా నుంచి మరింతగా సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన వనరుల సాంకేతికతలను దిగుమతి చేసుకునేందుకు భారత్ ఆసక్తి చూపిస్తోంది. ఇంధన సహకారం కీలక అంశంగా ఉందని, అమెరికా నుంచి దీర్ఘకాలానికి ఎల్ఎన్జీ దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
ఏపీలో దేశంలోనే అత్యధిక పెట్రోల్ ధర ఎంతంటే..
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్ ధరలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లో లీటరు పెట్రోల్ రూ.109.46గా నమోదైంది. ఇది దేశంలోనే అత్యధిక ధర కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం క్రూడాయిల్ కొనుగోళ్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాల వారీగా వీటి ధరల్లో ఇంత వ్యత్యాసం ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ అధిక ధరలకు ప్రధాన కారణాలుగా ఉన్న పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల స్వరూపాన్ని కింద చూద్దాం.రాష్ట్రాల వారీగా ధరల్లో వ్యత్యాసానికి కారణాలుముడి చమురు (Crude Oil) కొనుగోలు ధర అంతర్జాతీయ మార్కెట్పై, డాలర్తో రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉన్నప్పటికీ తుది వినియోగదారునికి చేరే పెట్రోల్ ధర రాష్ట్రాల వారీగా గణనీయంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ను వస్తు, సేవల పన్ను (GST) పరిధి నుంచి మినహాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (VAT)ను విధిస్తున్నాయి. ఈ వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధిక వ్యాట్ విధించడం వల్ల ఇక్కడ పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా ఉంది. తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా వ్యాట్ అధికంగా ఉండటం వల్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా..కేంద్ర ప్రభుత్వం గతంలో పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర వ్యాట్ను తగ్గించలేదు. దీని ఫలితంగా కేంద్రం ఇచ్చిన తగ్గింపు ప్రయోజనం వాహనదారులకు పూర్తి స్థాయిలో అందడంలేదు. చమురు రిఫైనరీల నుంచి పెట్రోల్, డీజిల్ రవాణా చేసే దూరాన్ని బట్టి ఖర్చులు కూడా ధరను ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ ప్రధాన వ్యత్యాసానికి కారణం రాష్ట్రాల పన్ను విధానాలేనని గుర్తుంచుకోవాలి. డీలర్ల కమిషన్ కూడా తుది ధరలో భాగమే. ఇది రిఫైనరీల నుంచి డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినందుకు గాను చమురు కంపెనీలు చెల్లిస్తాయి.పన్నుల స్వరూపంపెట్రోల్ తుది ధరలో దాదాపు 50% నుంచి 60% వరకు పన్నుల రూపంలోనే ఉంటుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఉంటాయి.కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులుకేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్పై ఒక నిర్ణీత మొత్తం (Fixed Amount)లో ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం తన ఖజానాకు జమ చేసుకుంటుంది. సెస్ (Cess), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED)పేరుతో కూడా కేంద్రం పన్నులను విధిస్తుంది. వీటిలో చాలా వరకు రాష్ట్రాలతో పంచుకోకుండా కేంద్రమే తీసుకుంటోంది.రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులురాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్పై విలువ ఆధారిత పన్ను (VAT)ను విధిస్తున్నాయి. ముఖ్యంగా ఇది డీలర్లకు అమ్మే ధర, కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్తో సహా మొత్తం ధరపై విధిస్తారు. దీని కారణంగా ఇంధనం బేస్ ధర పెరిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కూడా పెరుగుతుంది.🚨 Petrol prices per litre as of today. (High to Low)Andhra Pradesh – ₹109.46Kerala – ₹107.49Telangana – ₹107.46Madhya Pradesh – ₹106.52Bihar – ₹105.60West Bengal – ₹105.41Rajasthan – ₹104.72Maharashtra – ₹103.50Sikkim – ₹103.30Karnataka – ₹102.92Ladakh –…— Indian Tech & Infra (@IndianTechGuide) October 13, 2025ఈ రోజు లీటరు పెట్రోల్ ధరలు (వివిధ రాష్ట్రాల్లో)..ఆంధ్రప్రదేశ్ రూ.109.46కేరళ రూ.107.49తెలంగాణ రూ.107.46మధ్యప్రదేశ్ రూ.106.52బీహార్ రూ.105.60పశ్చిమ బెంగాల్ రూ.105.41రాజస్థాన్ రూ.104.72మహారాష్ట్ర రూ.103.50కర్ణాటక రూ.102.92ఢిల్లీ రూ.94.77అండమాన్ నికోబార్ దీవులు రూ.82.46ఇదీ చదవండి: 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం.. -
పర్యాటక రంగంలో ఏటా 25 శాతం వృద్ధి
భారత జీడీపీకి పర్యాటక రంగం రూ.20 లక్షల కోట్లు సమకూరుస్తున్నట్టు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. ఏటా 25 శాతానికి మించి వృద్ధి చెందుతూ, 8.4 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పారు. పర్యాటక రంగాన్ని అనుబంధ పరిశ్రమగా కాకుండా జాతీయ ప్రాధాన్యంగా చూస్తున్నట్టు పేర్కొన్నారు.భోపాల్లో నిర్వహించిన ‘ఎంపీ ట్రావెల్ మార్ట్’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘గతేడాది 2 కోట్ల మంది పర్యాటకులు భారత్ను సందర్శించారు. దేశీ ట్రావెలర్ల ద్వారా 294 కోట్ల పర్యటనలు చోటుచేసుకున్నాయి. ఈ రంగం ఏటా 25 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధిని (సీఏజీఆర్) నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం’’అని మంత్రి చెప్పారు.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా -
రూ.16 లక్షల కోట్లకు ఎన్పీఏస్, ఏపీవై ఆస్తులు
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల కింద నిర్వహణ ఆస్తులు రూ.16 లక్షల మార్క్ను అధిగమించాయి. ఈ రెండూ పింఛను పథకాలే. ఎన్పీఎస్ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సహా అందరికీ అందుబాటులో ఉంది. ఏపీవై అన్నది ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన పథకం. ఎన్పీఎస్ 2004లో ప్రారంభం కాగా, ఏపీవై 2015 నుంచి మొదలైంది. ఈ రెండింటి కింద చందాదారుల సంఖ్య 9 కోట్లు దాటినట్టు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది.గిగ్ వర్కర్లకు (తాత్కాలిక కార్మికులు/ డెలివరీ సిబ్బంది తదితర) సైతం పింఛను ప్రయోజనాలు అందించే ఎన్పీఎస్ ప్లాట్ఫామ్ వర్కర్స్ నమూనాను కూడా పీఎఫ్ఆర్డీఏ ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ తర్వాత ఎన్పీఎస్ నిధి నుంచి క్రమంగా చెల్లింపులు, సౌకర్యవంతమైన యాన్యుటీ ప్రయోజనాలపై ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. రైతులు, ఎంఎస్ఎంఈలు, స్వయం సహాయక బృందాల సభ్యులకూ పెన్షన్ ప్రయోజనాలు విస్తృతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది.ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా -
మన ఎగుమతిదార్లకు మంచి చాన్స్..
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో భారతీయ ఎగుమతిదార్లు లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనితో అగ్రరాజ్యానికి ఎగుమతులను మరింతగా పెంచుకోవడానికి చాన్స్ లభించవచ్చని పేర్కొన్నారు. 2024–25లో అమెరికాకు భారత్ సుమారు 86 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. చైనాపై భారీ టారిఫ్ల వల్ల అమెరికన్ కొనుగోలుదారులు భారత్వైపు మొగ్గు చూపవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ఆ విధంగా ఈ వాణిజ్య యుద్ధం ద్వారా మనం లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 1 నుంచి చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్లు విధించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో చైనా దిగుమతులపై మొత్తం సుంకాలు 130 శాతానికి చేరతాయి. అమెరికా డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి కీలమైన రేర్ ఎర్త్ ఎగుమతులపై అక్టోబర్ 9న చైనా తాజాగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం చైనాపై అమెరికా 30 శాతం సుంకాలు విధిస్తుండగా, భారత్పై అంతకన్నా ఎక్కువగా 50 శాతం వేస్తోంది. దీనితో మన ఉత్పత్తుల కన్నా చైనా ఉత్పత్తులే చౌకగా లభించే పరిస్థితి నెలకొంది. అయితే, చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికన్ మార్కెట్లో చైనా ఉత్పత్తుల ధరలు, మిగతా దేశాలతో పోటీపడలేనంతగా పెరిగిపోతాయని ఓ ఎగుమతిదారు తెలిపారు. దీంతో సుంకాలు తక్కువగా ఉన్న దేశాల వైపు అమెరికన్ కొనుగోలుదారులు మొగ్గు చూపుతారని బొమ్మల ఎగుమతిదారు మను గుప్తా తెలిపారు. ఇప్పటికే టార్గెట్లాంటి రిటైల్ దిగ్గజాలు కొత్త ఉత్పత్తుల కోసం తమను సంప్రదించినట్లు వివరించారు. ఈవీల రేట్లకు రెక్కలు.. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), విండ్ టర్బైన్లు, సెమీకండక్టర్ల విడిభాగాల రేట్లకు రెక్కలొచి్చనట్లు మేథావుల సంఘం జీటీఆర్ఐ తెలిపింది. ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, పాదరక్షలు, వైట్ గూడ్స్, సోలార్ ప్యానెళ్ల కోసం అమెరికా ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోందని పేర్కొంది. వరుసగా నాలుగో ఏడాది 2024–25లో కూడా భారత్కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలి్చంది. ఇరు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా, దిగుమతుల్లో 6.22 శాతంగా ఉంటోంది. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నాయి. -
నిమిషాల్లో లోన్.. ఎస్బీఐ కీలక ప్రకటన
చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ. 5 కోట్ల వరకు రుణాల కోసం.. 2023-24లో ప్రారంభించిన ఎస్ఎంఈ డిజిటల్ బిజినెస్ లోన్స్కి గణనీయంగా స్పందన లభిస్తోందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది.రుణ మంజూరీకు సంబంధించి టర్నెరౌండ్ సమయం కేవలం 45 నిమిషాలకు తగ్గిందని పేర్కొంది. వచ్చే అయిదేళ్లపాటు వృద్ధి, లాభదాయకత కోసం ఎంఎస్ఎంఈ రు ణాలపై మరింతగా దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు వివరించింది. సుమారు రూ. 3,242 కోట్ల విలువ చేసే 67,299 ఎంఎస్ఎంఈ ముద్రా రుణాలు కూడా ఇందులో భాగంగా ఉన్నట్లు వివరించింది.అవసరమైన వివరాలన్నీ సమర్పించాక, 10 సెకన్ల వ్యవధిలోనే, మానవ జోక్యం లేకుండా, కేవలం పది సెకన్ల వ్యవధిలోనే రుణ మంజూరు నిర్ణయాలు తీసుకునే డేటా ఆధారిత క్రెడిట్ అసెస్మెంట్ ఇంజిన్ను రూపొందించినట్లు తెలిపింది. రూ. 50 లక్షల వరకు రుణాల మదింపు కోసం లావాదేవీల చరిత్ర, జీఎస్టీ రిటర్నులనే పరిగణనలోకి తీసుకుంటూ, ఆర్థిక పత్రాలు సమర్పించాల్సిన నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది.ఇదీ చదవండి: 'రేటు మరింత పెరగకముందే.. కొనేయండి': రాబర్ట్ కియోసాకి -
డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే పెద్ద పాత్ర
న్యూఢిల్లీ: దేశంలో శరవేగంగా పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులపై జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ గణనీయమైన ప్రభావం చూపించనున్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. యూపీఐ ఇకపైనా కీలకంగా ఉంటుందంటూ.. అదే సమయంలో తదుపరి దశ డిజిటల్ చెల్లింపులను క్రెడిట్కార్డులు, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) నడిపించొచ్చని అంచనా వేసింది. ఫిన్టెక్, చెల్లింపుల రంగంలో కీలక స్థానాల్లో ఉన్న 175 మంది అభిప్రాయాలను పీడబ్ల్యూసీ ఇండియా తన సర్వేలో భాగంగా తెలుసుకుంది. క్రెడిట్ కార్డు కీలక విభాగంగా ఉంటుందని 65 శాతం మంది చెప్పారు. కార్డు చెల్లింపులు బలంగా వృద్ధి చెందుతాయని 95 శాతం మంది భావిస్తున్నారు. చెల్లింపుల వ్యవస్థ ముఖచిత్రంపై జెనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ఎంతో ప్రభావం చూపించనున్నట్టు 73 శాతం మంది చెప్పారు. ఐదేళ్లలో మూడింతలు భారత్లో డిజిటల్ చెల్లింపులు ఇక మీదట అధిక వృద్ధి వేగంతో కొనసాగుతాయని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. 2030 మార్చి నాటికి మూడింతలు అవుతాయని అంచనా వేసింది. ఆవిష్కరణలకుతోడు రుణ సేవల విస్తరణ, నియంత్రణ సంస్థల మద్దతు, సరికొత్త టెక్నాలజీలను స్వీకరించడం, మారుతున్న వినియోగదారుల వైఖరి డిజిటల్ చెల్లింపుల వేగాన్ని నడిపిస్తాయని పేర్కొంది. ‘‘భారత్లో చెల్లింపుల ఎకోవ్యవస్థ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. వచ్చే ఐదేళ్లలో యూపీఐ ఆవిష్కరణలు, సేవల విస్తరణ కొనసాగుతుంది. రుణాల్లో వృద్ధి, బీమా, సంపద కలయికతో డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్నర్ మిహిర్గాంధీ తెలిపారు. వివిధ సాధనాల మధ్య అనుసంధానత ద్వారా ఆవిష్కరణలు–విస్తరణ మధ్య సమతూకం ఉండేలా చూడడం అవసరమన్నారు. 90% చెల్లింపులవే..భారత డిజిటల్ చెల్లింపులకు యూపీఐ వెన్నెముకగా నిలుస్తున్నట్టు, 2024–25లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం యూపీఐ రూపంలోనే ఉన్నట్టు పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక తెలిపింది. క్రెడిట్ కార్డు లావాదేవీలు 2023–24లో 100 మిలియన్ దాటగా, 2030 మార్చి నాటికి 200 మిలియన్కు చేరుకుంటాయని పేర్కొంది. వినియోగదారులు యూపీఐ, క్రెడిట్కార్డులకు ప్రాధాన్యం ఇస్తుండడంతో డెబిట్ కార్డుల వినియోగం ఇకమీదటా తగ్గనున్నట్టు తెలిపింది. -
భారీగా తగ్గిపోయిన ఫారెక్స్ నిల్వలు
ముంబై: విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు రెండో వారమూ కరిగిపోయాయి. అక్టోబర్ 3వ తేదీతో ముగిసిన వారంలో 276 మిలియన్ డాలర్లు తగ్గి 699.96 బిలియన్ డాలర్లకు పరిమితయ్యాయి. అంతకుముందు వారంలో ఇవి 2.334 బిలియన్ డాలర్లు తగ్గి 700.236 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ డేటా తెలిపింది.సమీక్షా వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు 4.049 బిలియన్ డాలర్లు తగ్గి 577.708 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బంగారం నిల్వల విలువ 3.753 బిలియన్ డాలర్లు పెరిగి 98.77 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) 25 మిలియన్లు పెరిగి 18.814 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వద్ద భారత ద్రవ్య నిల్వలు 4 మిలియన్ డాలర్లు తగ్గి 4.6669 బిలియన్ డాలర్లుగా నమోదైంది. -
చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు.. కుప్పకూలిన స్టాక్మార్కెట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త సుంకాల యుద్ధాన్ని ప్రకటించడంతో ప్రపంచ వాణిజ్య సంబంధాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై నవంబర్ 1 నుంచి 100% కొత్త సుంకం విధించనున్నట్లు, అదే తేదీన చైనా సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే చైనాపై యూఎస్ 30 శాతం సుంకాలు విధించింది. తాజా పరిణామం అమెరికా స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. శుక్రవారం రోజునే నాస్డాక్, డోజోన్స్, ఎస్అండ్పీ సూచీలు భారీగా నష్టపోయి, మదుపర్ల సంపద 1.5 ట్రిలియన్ డాలర్ల మేర ఆవిరైంది.ప్రతీకార చర్యలు, అరుదైన ఖనిజాల అస్త్రంఅమెరికా తీసుకున్న ఈ తాజా చర్యకు ముఖ్య కారణం.. అరుదైన భూ ఖనిజాలపై (Rare Earth Magnets) చైనా విధించిన కొత్త ఎగుమతి నియంత్రణలకు ప్రతీకారం తీర్చుకోవడమే. అరుదైన భూ ఖనిజాల ప్రపంచ సరఫరాలో చైనా దాదాపు 70% ఆధిపత్యం చెలాయిస్తోంది. ఆటోమొబైల్స్, డిఫెన్స్, సెమీకండక్టర్లతో సహా హైటెక్ పరిశ్రమలకు ఈ ఖనిజాలు అత్యంత కీలకం. ఈ ఖనిజాలు తమ అధునాతన సాంకేతిక, రక్షణ రంగాలకు ఎంత ముఖ్యమో అమెరికాకు తెలుసు. చైనా వీటి సరఫరాను నియంత్రించడం ద్వారా అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో తమకు అనుకూలంగా ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. చైనా ఎగుమతి నియంత్రణలు, అమెరికాపై చైనా ఉపయోగించే ఒక కీలకమైన ఆర్థిక అస్త్రంగా మారింది.మార్కెట్లపై ప్రభావంఈ వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగడం స్టాక్ మార్కెట్ల పతనానికి దారితీసింది. అధిక సుంకాలు, ఎగుమతి నియంత్రణలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తాయని, తద్వారా అంతిమంగా అమెరికాలోని వినియోగదారులపై ధరల భారం పెరుగుతుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. చైనాపై 100% సుంకం, చైనా సాఫ్ట్వేర్లపై ఎగుమతి నియంత్రణలు వంటి చర్యలు కేవలం వాణిజ్య లోటుకు సంబంధించిన అంశాలే కాకుండా, సాంకేతిక, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలుగా మారాయి.భవిష్యత్తుపై..ఈ తాజా ఉద్రిక్తతలు అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాన్ని మరింత తగ్గిస్తున్నాయి. ఇరు దేశాలు పరస్పరం ప్రతీకార చర్యలకు దిగడం వల్ల ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయనే భయాలు పెరుగుతున్నాయి. అరుదైన ఖనిజాల సరఫరాపై చైనాకున్న ఏకచ్ఛత్రాధిపత్యం పరిస్థితులను మరింత జటిలం చేస్తుంది. అమెరికాను చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను, దేశీయ ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టేలా ఒత్తిడిని పెంచుతోంది.మొత్తంమీద ఈ వాణిజ్య ఉద్రిక్తతలు కేవలం సుంకాల పెరుగుదలకు సంబంధించినవి మాత్రమే కాదు. ఇవి ప్రపంచ ఆర్థిక ఆధిపత్యం, కీలకమైన సాంకేతికతలపై నియంత్రణ, జాతీయ భద్రతా ప్రయోజనాలకు సంబంధించిన వ్యూహాత్మక పోటీగా మారాయి. ఈ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతూ సమీప భవిష్యత్తులో కూడా మార్కెట్లలో అనిశ్చితిని కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: ‘ప్రపంచానికి 200 మంది ఎలాన్ మస్క్లు అవసరం’ -
రుణమే.. బంగారమాయెనే!
బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగిపోతున్న తరుణంలో వాటిపై రుణం తీసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అతి తక్కువ వడ్డీకి రుణ సాయం లభిస్తుండడంతో ఎక్కువ మంది పసిడి రుణాలవైపు అడుగులు వేస్తున్నారు. దీంతో సంఘటిత రంగంలో (ఆర్బీఐ కింద నమోదైన బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు) బంగారం రుణాల మార్కెట్ 2026 మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది.నిజానికి 2027 మార్చి నాటికి సంఘటిత పసిడి రుణాల మార్కెట్ ఈ స్థాయికి చేరుకుంటుందని 2024 సెప్టెంబర్లో ఇక్రా అంచనా వేయగా.. ఇప్పుడు ఏడాది ముందుగానే ఇది సాధ్యపడుతుందని పేర్కొంది. 2027 మార్చి నాటికి రూ.18 లక్షల కోట్లకు చేరుకోవచ్చని పేర్కొంది. 2025 మార్చి నాటికి మొత్తం మీద బంగారం రుణాల మార్కెట్ రూ.11.8 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. ‘బంగారం ధరలు స్థిరంగా పెరుగుతుండడం వల్లే మా అంచనాను సవరించాల్సి వచ్చింది. ధరలు కొత్త గరిష్టాలకు చేరుకోవడంతో బంగారం రుణాల మార్కెట్ అంచనాలకు మించి వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ విభాగంలో బ్యాంకులు తమ ఆధిక్యాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. వృద్ధిలో ఎన్బీఎఫ్సీలను వెనక్కి నెట్టేస్తున్నాయి’ అని ఇక్రా తన నివేదికలో పేర్కొంది. బ్యాంకుల ఆధిపత్యం..సంఘటిత బంగారం రుణ మార్కెట్లో బ్యాంకులు మరింత బలంగా మారుతున్నాయి. 2025 మార్చి నాటికి తమ వాటాను 82 శాతానికి పెంచుకున్నట్టు ఇక్రా తెలిపింది. 2019–20 నుంచి 24–25 కాలంలో బ్యాంకుల వాటా ఏటా 26% చొప్పున కాంపౌండెడ్గా పెరిగినట్టు వెల్లడించింది. ఇదే కాలంలో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీల) వాటా ఈ మార్కెట్లో ఏటా 20% వృద్దిని చూసినట్టు తెలిపింది. బ్యాంకుల రుణ పోర్ట్ఫోలియోలోనూ కీలక మార్పును ఈ నివేదిక ప్రస్తావించింది. 2025 మార్చి నాటికి రిటైల్/వ్యక్తిగత పసిడి రుణాలు బ్యాంకుల మొత్తం పసిడి రుణాల్లో 18%కి చేరాయని, ఏడాది ముందు ఇవి 11%గానే ఉన్నట్టు తెలిపింది. బంగారంపై తీసుకునే సాగు, ఇతర అవసరాలకు ఉద్దేశించిన రుణాలు 70% నుంచి 63%కి తగ్గినట్టు పేర్కొంది. ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని బంగారం రుణ ఆస్తుల విలువ 2025–26లో 30–35 శాతం పెరగొచ్చని ఇక్రా అంచనా వేసింది. బంగారం ధరలు పెరిగిపోవడం, అన్సెక్యూర్డ్ రుణాల్లో వృద్ధి తగ్గడాన్ని ప్రస్తావించింది. 2025 జూన్ నాటికి ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని బంగారం రుణాల విలువ రూ.2.4 లక్షల కోట్లుగా ఉండొచ్చని తెలిపింది.వడ్డీ రేట్లు ఇలా..బంగారం రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తున్న ఆరంభ వడ్డీ రేటు 8 శాతం (వార్షిక)గా ఉంది. వ్యక్తిగత రుణాల్లో ఇంత తక్కువ రేటుకు మరే రుణం కూడా లభించడం లేదు. ఎన్బీఎఫ్సీలు మాత్రం బంగారం రుణాలపై 12 శాతం నుంచి వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. దీంతో కస్టమర్లు బ్యాంకుల్లో బంగారంపై రుణం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పైగా ఎన్బీఎఫ్సీలతో పోల్చినప్పుడు బ్యాంకులపై ఎక్కువ మందిలో విశ్వాసం ఉండడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. బంగారం, ఆధార్, పాన్ డాక్యుమెంట్లతో వెళితే అరగంట, గంట–గంటలోపే బ్యాంకుల్లో రుణం మంజూరవుతుంది.సిల్వర్ రూ.8,500 జంప్వెండి ధర రాకెట్ వేగాన్ని తలపిస్తోంది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం కిలోకి రూ.8,500 ఎగసి రూ.1,71,500 స్థాయికి చేరింది. ముఖ్యంగా గత మూడు పనిదినాల్లోనే వెండి కిలోకి రూ.17,500 పెరగడం డిమాండ్ను తెలియజేస్తోంది. ప్రధానంగా పెట్టుబడిదారుల నుంచి ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. మరోవైపు బంగారం ధర (99.9 శాతం స్వచ్ఛత) 10 గ్రాములకు రూ.600 నష్టపోయి రూ.1,26,000 వద్ద స్థిరపడింది. సురక్షిత సాధనాల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపించడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ధరల పెరుగుదలకు మద్దతుగా నిలుస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పార్మర్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ధర ఔన్స్కు 51 డాలర్లకు చేరుకోగా, స్పాట్ గోల్డ్ ఔన్స్కు 17 డాలర్ల మేర పెరిగి 3,993 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.ఇదీ చదవండి: ఇళ్ల ధరలు ఎంత పెరిగాయంటే.. -
ఒక్క పండుగ.. రూ.28,000 కోట్ల వ్యాపారం
దేశంలో ఒక్క పండుగ.. వేల కోట్ల రూపాయాల కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది. ఈసారి కర్వా చౌత్ (Karwa Chauth 2025) సందర్భంగా దేశవ్యాప్తంగా సుమారు రూ.28,000 కోట్లు వాణిజ్యం జరిగింది. ఒక్క ఢిల్లీ ప్రాంతంలోనే దాదాపు రూ.8,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఉత్తర, పశ్చిమ భారతదేశాల్లో ప్రధానంగా జరుపుకునే ఈ పండుగ ఇప్పుడు ఒక గొప్ప ఆర్థిక కార్యకలాపంగా మారింది.ప్రధాన వ్యాపార రంగాలుఆభరణాలు, దుస్తులు, సౌందర్య సాధనాలు: బంగారు/వెండి ఆభరణాలు, డిజైనర్ చీరలు, జాతి దుస్తులు, బ్యూటీ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.బహుమతులు & పూజా సామగ్రి: కర్వా కుండలు, దీపాలు, స్వీట్లు, అలంకరణ వస్తువులు అధికంగా అమ్ముడయ్యాయి.గోరింటాకు & బ్యూటీ పార్లర్లు: మెహెందీ అపాయింట్మెంట్లు, బ్యూటీ సేవలతో స్థానిక కళాకారుల ఆదాయం పెరిగింది.మార్కెట్లు & ఆన్లైన్ అమ్మకాలు: మాల్స్, రిటైల్ షాపులు రికార్డు ఫుట్ఫాల్ ను చూసాయి. ఆన్లైన్లో బహుమతులు, పర్సనలైజ్డ్ ఉత్పత్తులపై భారీ డిమాండ్ ఉంది.వోకల్ ఫర్ లోకల్: లోకల్ ఉత్పత్తులకు ఆదరణ పెరిగి, చైనా దిగుమతులు తగ్గాయి.సోషల్ మీడియాలో ట్రెండ్స్ డిజిటల్ ఎంగేజ్మెంట్ పెంచాయి. బాలీవుడ్ ప్రచారం కూడా అమ్మకాలపై ప్రభావం చూపింది. గత కొన్ని ఏళ్లలో కర్వా చౌత్ వ్యాపారం దాదాపు 50 శాతం పెరిగి రూ.15,000 కోట్ల నుంచి రూ.28,000 కోట్లకు చేరింది. కర్వా చౌత్, సంప్రదాయం మాత్రమే కాదు.. భారత రిటైల్ రంగానికి కీలక ఆర్థిక చొరవగా మారింది. -
25 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రూ.6లక్షల కోట్లతో 10,000 కిలోమీటర్ల పొడవైన 25 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేలను నిర్మిస్తున్నట్టు కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఎక్స్ప్రెస్ రహదారులు, ఆర్థిక నడవాల నిర్మాణంతో దేశంలో లాజిస్టిక్స్ (రవాణా) వ్యయాలు గతంలో ఉన్న 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్టు చెప్పారు. డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని, అప్పుడు భారత్ పోటీతత్వం మరింత పెరుగుతుందన్నారు. పీహెచ్డీసీసీఐ వార్షిక సమావేశంలో భాగంగా మంత్రి ప్రసంగించారు. లాజిస్టిక్స్ వ్యయాలు యూఎస్, ఐరోపా దేశాల్లో 12 శాతం మేర ఉండగా, చైనాలో 8–10 శాతం మధ్య ఉండడం గమనార్హం. ఈ వ్యయం ఎంత కనిష్టానికి తగ్గితే, అంతర్జాతీయ వాణిజ్యంలో అంతగా పోటీపడొచ్చు. దీంతో దీన్ని సాధ్యమైనంత తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. నంబర్ 1 స్థానానికి ఆటోమొబైల్ రంగం భారత ఆటోమొబైల్ రంగం వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంటుందని మంత్రి గడ్కరీ మరోసారి పునరుద్ఘాటించారు. ‘‘రవాణా మంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లుగా ఉంటే, ఇప్పుడు రూ.22 లక్షల కోట్ల కు చేరుకుంది. 4 లక్షల మందికి పరిశ్రమ ఉపాధి కల్పించడమే కాకుండా, కేంద్ర, రాష్ట్రాలకు జీఎస్టీ రూపంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని అందిస్తోంది. ప్రస్తుతం యూఎస్ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.78 లక్షల కోట్లుగా, చైనా రూ.47 లక్షల కోట్లుగా ఉంది’’అని మంత్రి వివరించారు. వ్యూహా త్మకమైన జోజిలా టన్నెల్ (సొరంగ మార్గం) నిర్మాణం పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయని చెబుతూ.. ఇది అందుబాటులోకి వస్తే అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో లద్దాక్ ప్రాంతానికి అనుసంధానత ఏర్పడుతుందన్నారు. దేశ ప్రగతికి గ్రీన్ ఇంధనాలు కీలకం శిలాజ ఇంధనాల (పెట్రోలియం ఉత్పత్తులు) దిగుమతుల కోసం ఏటా రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తున్నట్టు మంత్రి గడ్కరీ తెలిపారు. పైగా వీటి వల్ల పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందన్నారు. భారత ప్రగతికి శుద్ధ ఇంధనాల వినియోగం కీలకమని చెప్పారు. దేశ జీడీపీ వృద్ధికి వ్యవసాయ రంగంపైనా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారీతో రైతులకు రూ.45వేల కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరినట్టు చెప్పారు. ‘‘మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేయాలని నిర్ణయించినప్పుడు.. క్వింటా మొక్కజొన్న మార్కెట్ ధర రూ.1,200 ఉంటే, మద్దతు ధర రూ.1,800గా ఉంది. పెట్రోల్లో ఇథనాల్ కలపాలని నిర్ణయించిన తర్వాత మొక్కజొన్న ధర రూ.2,800కు పెరిగింది. దీనివల్ల రైతులకు రూ.45,000 కోట్లు అదనంగా సమకూరింది’’అని మంత్రి వివరించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో 80 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగించినట్టు వెల్లడించారు. ఢిల్లీలో పర్యావరణ కాలుష్యం ఎంతో పెరిగిపోయిందని చెబుతూ, దీన్ని తగ్గించడం ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. -
యూకే ఒప్పందంతో ఎంఎస్ఎంఈలకు బూస్ట్
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంతో (సెటా) చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఊతం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. సెటా దన్నుతో 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యాన్ని సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి సీఈవోల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. రెండు పెద్ద దేశాల ఉమ్మడి పురోగతికి, ప్రజల శ్రేయస్సుకు సెటా తోడ్పడుతుందన్నారు. అలాగే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పగలిగే రంగాలను గుర్తించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు. పాలసీపరంగా స్థిరత్వం, అంచనాలకు అనుగుణమైన నియంత్రణ విధానాలు, భారీ స్థాయి డిమాండ్ లాంటివి భారత్కు సానుకూలాంశాలని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఫార్మా, ఇన్ఫ్రా, ఎనర్జీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలని బ్రిటన్ కంపెనీలను ఆహ్వానించారు.ఇరు దేశాల బంధం బలోపేతం.. ప్రస్తుతం అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ సెటాతో భారత్–యూకే మధ్య బంధం మరింత పటిష్టమైందని ప్రధాని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం భారత్–యూకే ద్వైపాక్షిక వాణిజ్యం 56 బిలియన్ డాలర్లుగా ఉంది. నిర్దేశించుకున్న డెడ్లైన్ 2030 నాటికి దీన్ని రెట్టింపు చేసుకోగలమనే నమ్మకం ఉంది‘ అని చెప్పారు. ‘టెలికం, ఏఐ, బయోటెక్, క్వాంటమ్, సెమీకండక్టర్, సైబర్, స్పేస్ తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే కీలక లోహాలు, రేర్ ఎర్త్ మొదలైన విభాగాల్లోనూ నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలి. భారత్–యూకే ఉమ్మడిగా ప్రపంచంలో అగ్రగాములుగా నిల్చేందుకు అవకాశమున్న రంగాలను రెండు దేశాల వ్యాపార దిగ్గజాలు గుర్తించాలి. ఫిన్టెక్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ లేదా స్టార్టప్లు.. ఇలా ఏ రంగంలోనైనా సరే ఇరు దేశాలు కలిసి అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పాలి‘ అని మోదీ పేర్కొన్నారు. యూకేకి చెందిన తొమ్మిది యూనివర్సిటీలు భారత్లో క్యాంపస్లు ప్రారంభిస్తాయని ఆయన తెలిపారు.పరిశ్రమకు పూర్తి సహకారం: స్టార్మర్ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో ఎదురవుతున్న అవరోధాలను తొలగించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు తీసుకోతగిన చర్యలను సూచించాలని పరిశ్రమ దిగ్గజాలను స్టార్మర్ కోరారు. వాణిజ్య ఒప్పందం ప్రయోజనాలను పొందేందుకు పరిశ్రమకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన చెప్పారు. జూలైలో సెటాపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య 6 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం, పెట్టుబడులు నమోదయ్యాయని పేర్కొన్నారు.భారత్లో ఇన్వెస్ట్ చేయండి..ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులు పెట్టాలని గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను మోదీ ఆహ్వానించారు. తద్వారా భారత్ వృద్ధి గాథలో పాలుపంచుకోవాలని సూచించారు. బ్యాంకింగ్ వ్యవస్థ గతంలో కొందరికే పరిమితమై ఉండేదని, దాన్ని అందరికీ సాధికారత కల్పించే సాధనంగా డిజిటల్ టెక్నాలజీ మార్చిందన్నారు. జేఏఎం (జన్ధన్, ఆధార్, మొబైల్) వ్యూహం ఇందుకు ఉపయోగపడిందని చెప్పారు. ‘సాంకేతికత, ప్రజలు, భూమి.. ఇలా అన్నింటికీ ప్రయోజనం చేకూర్చగలిగే ఫిన్టెక్ ప్రపంచాన్ని సృష్టించాలి. ఇన్నోవేషన్ లక్ష్యమనేది వృద్ధి మాత్రమే కాకూడదు, మేలు చేసేదిగా ఉండాలి. ఫైనాన్స్ అంటే కేవలం అంకెలు కాదు.. మానవాళి పురోగతికి దోహదకారిగా ఉండాలి‘ అని ప్రధాని చెప్పారు. భారత్ విషయంలో ఏఐ అంటే సమ్మిళితత్వానికి సంక్షిప్త రూపమని చెప్పారు. -
భారత్-యూకే ఎఫ్టీఏ.. ఆర్థిక వృద్ధికి కొత్త ఆశలు
భారత్-యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) రెండు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుంది. 2025 జులై 24న ఈ ఒప్పందం కుదిరింది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తాజాగా భారత్ పర్యటన సందర్భంగా దీని అమలును త్వరగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి ఎంతో తోడ్పడుతుందని చెప్పారు.ఈ ఒప్పందం వల్ల భారత్లో అద్భుతమైన అవకాశాలు వస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న సంకల్పానికి ఇది శక్తివంతమైన చోదకశక్తిగా పనిచేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని సుమారు 34 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు.ఎగుమతులు, దిగుమతులుఎఫ్టీఏ ప్రధాన ఆకర్షణల్లో ఎగుమతులు ముందంజలో ఉన్నాయి. ఈ ఒప్పందం 90% టారిఫ్ లైన్లపై తగ్గింపులు అందిస్తుంది. యూకే నుంచి భారత్కు విమాన భాగాలు, శాస్త్రీయ సాధనాలు, చాక్లెట్, జింజర్బ్రెడ్, మెడికల్ డివైసెస్ వంటివి టారిఫ్రహితంగా ఉంటాయి. విస్కీ, జిన్పై 150% నుంచి 75%కి సుంకాలు తగ్గింపు ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది 40%కు చేరుతుంది.ప్రొఫెషనల్ మొబిలిటీప్రొఫెషనల్ మొబిలిటీలో ఈ ఒప్పందం యూకే పాయింట్స్-బేస్డ్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ఉల్లంఘించకుండా తాత్కాలిక ప్రయాణాలను సులభతరం చేస్తుంది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ వంటి రంగాల్లో ప్రొఫెషనల్స్ కాన్ఫరెన్సులు, ఇంట్రా-కంపెనీ ట్రాన్స్ఫర్లు, కాంట్రాక్ట్ సర్వీసెస్ కోసం వీసా ప్రక్రియలు సమానంగా ఉంటాయి. అకౌంటెంట్స్, ఆడిటర్స్, ఆర్కిటెక్ట్స్, లాయర్స్, ఇంజినీర్లకు మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ప్రోత్సహిస్తుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులను తగ్గిస్తుంది. దాంతో భారత IT, ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొఫెషనల్స్కు యూకే మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులువ్యవసాయ రంగంలో యూకే నుంచి భారత్కు ఫ్రెష్/ఫ్రోజెన్ సాల్మన్, లాంబ్ మీట్ వంటి ఉత్పత్తులపై టారిఫ్లుండవు. 10 సంవత్సరాల తర్వాత చాక్లెట్, బిస్కట్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి ఇందులో చేరుతాయి. షుగర్, రైస్, పోర్క్, చికెన్, ఎగ్స్ వంటి సున్నిత రంగాలను ఇందులో నుంచి మినహాయించారు.ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహంఎంఎస్ఎంఈలకు ఇన్ఫర్మేషన్ షేరింగ్, పారదర్శకత పెంచుతూ అడ్డంకులను తగ్గించడం ద్వారా చేయూతని అందిస్తారు. కాంటాక్ట్ పాయింట్లు, మార్కెట్ ఎంట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్, ఆన్లైన్ ట్రేడ్ ఇన్ఫో, ఫైనాన్స్ యాక్సెస్పై సహకారం అందుతుంది. డిజిటల్ ట్రేడ్ ద్వారా ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ ఎంఎస్ఎంఈలకు సహాయపడుతుంది.విద్య, పరిశోధనవిద్యా రంగంలో నేరుగా కమిట్మెంట్స్ లేకపోయినా సర్వీసెస్ సెక్టార్ ద్వారా యూకే యూనివర్సిటీలు (అక్స్ఫర్డ్, కేమ్బ్రిడ్జ్) భారత్లో క్యాంపస్లు ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఇది భారత విద్యార్థులకు (ప్రతి సంవత్సరం 1.5 లక్షల మంది యూకే వెళ్తారు) మరింత సౌలభ్యం అందిస్తుంది. ఇన్నోవేషన్ విభాగంలో యూకే-భారత్ పరిశోధన, అభివృద్ధి సహకారాన్ని పెంచుతుంది. ఇన్నోవేషన్ వర్కింగ్ గ్రూప్ రెగ్యులేటరీ అప్రోచెస్, టెక్నాలజీ కమర్షలైజేషన్పై పనిచేస్తుంది.పారిశ్రామికీకరణపారిశ్రామికీకరణలో ఆటోమోటివ్స్ (కారు టారిఫ్లు 10%), ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెడికల్ డివైసెస్, ఎయిర్క్రాఫ్ట్ పార్ట్స్పై టారిఫ్లు ఉండవు. భారత మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 21% (2031 నాటికి) పెరగడానికి యూకే ఇన్వెస్ట్మెంట్స్ (లైఫ్ సైన్సెస్, క్లీన్ ఎనర్జీ) సహాయపడతాయి. ఎన్విరాన్మెంట్ పరంగా గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొక్యూర్మెంట్ను ప్రోత్సహిస్తుంది.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
వైజాగ్ అభివృద్ధికి జగన్ ఏం చేశారంటే..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు తన పాలనా కాలంలో రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాను ఆర్థిక శక్తిస్థావరంగా మలచడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు సృష్టించారు. విశాఖపట్నం దక్షిణాసియాలోని ముఖ్యమైన ఓడరేవు నగరంగా ఉండటం వల్ల దీన్ని ఐటీ, ఫార్మా, టూరిజం, ఇండస్ట్రీలకు హబ్గా మార్చడానికి జగన్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జగన్ నేడు విశాఖ పర్యటన సందర్భంగా తన పాలనా కాలంలో జిల్లాలో నిర్వహించిన కార్పొరేట్ కార్యక్రమాలను తెలుసుకుందాం. భవిష్యత్ వ్యాపార అభివృద్ధి కోసం సిద్ధం చేసిన ప్రణాళికలను చూద్దాం.కార్పొరేట్ కార్యక్రమాలుజగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత 2019-2024 మధ్యకాలంలో విశాఖపట్నం జిల్లాను పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యంగా మార్చడానికి అనేక కార్పొరేట్ కార్యక్రమాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) వంటి పెద్ద ఈవెంట్లు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఫార్మా, ఐటీ, ఇండస్ట్రియల్ పార్కులు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలపై దృష్టి సారించాయి. 2023 మార్చిలో విశాఖపట్నంలోనే నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (GIS) ఒక మైలురాయి. ఈ సమ్మిట్లో 352 ఒప్పందాలు జరిగాయి. దాంతో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల చేరాలనే లక్ష్యం నిర్ణయించుకున్నారు. వీటిలో సుమారు 39% ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. GIS వేదిక నుంచి జగన్ 14 పరిశ్రమలను భౌతికంగా ప్రారంభించారు. ఈ పరిశ్రమలకు మొత్తం రూ.3,841 కోట్ల పెట్టుబడితో 9,108 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది.విశాఖపట్నం జిల్లాలో నేరుగా ప్రారంభించిన కార్పొరేట్ కార్యక్రమాలలో 2023 అక్టోబర్లో ఐదు కంపెనీల ప్రారంభం ముఖ్యమైనది. మొత్తం రూ.1,371 కోట్ల పెట్టుబడితో ఈ కంపెనీలు 2,950 ఉద్యోగాలు సృష్టించాయి. వీటిలో..ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్: రూ.500 కోట్ల పెట్టుబడితో 1,000 ఉద్యోగాలు. జావా, J2EE, SAP, డేటా సైన్స్ వంటి టెక్నాలజీలపై దృష్టి, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ, రిటైల్ రంగాలకు సేవలు అందిస్తుంది.ఈజియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫార్మా సిటీలో): రూ.500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. సంవత్సరానికి 300 మిలియన్ ఇంజెక్టబుల్ యూనిట్లు ఉత్పత్తి.లారస్ ల్యాబ్స్ (అచ్చుతపురం సెజ్లో): రూ.440 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు.లారస్ సింథటిక్స్: రూ.191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు.మరో లారస్ ల్యాబ్స్ యూనిట్: రూ.240 కోట్ల పెట్టుబడి, 400 ఉద్యోగాలు (ఫౌండేషన్ స్టోన్).అనకాపల్లిలో ఫార్మా సిటీ అభివృద్ధి జగన్ పాలనలో వేగవంతమైంది. 2023 అక్టోబర్లో మూడు ఫార్మా కంపెనీలను ప్రారంభించి రెండు బల్క్ డ్రగ్ యూనిట్లకు శంకుస్థాపన వేశారు. ఈ ప్రాజెక్టులకు మొత్తం రూ.1,611 కోట్ల పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 2019 నుంచి 107 పెద్ద పరిశ్రమలు రూ.46,002 కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా 1,06,249 ఉద్యోగాలు వచ్చాయి. వీటిలో విశాఖపట్నం జిల్లా భాగస్వామం అధికంగానే ఉంది. అలాగే 88 ఒప్పందాలతో రూ.44,963 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. వీటిలో రూ.38,573 కోట్లు ఇప్పటికే పెట్టుబడులుగా మారాయి. ఈ కార్యక్రమాలు విశాఖపట్నంను ఫార్మా, ఐటీ హబ్గా మార్చాయి.భవిష్యత్ ప్రణాళికలుజగన్ పాలనలో విశాఖపట్నంను భవిష్యత్తులో గ్లోబల్ మెట్రోపాలిస్గా మార్చడానికి ‘విజన్ విశాఖ’ (Vision Visakha) ప్రణాళికను 2024 మార్చి 5న ప్రకటించారు. 10 సంవత్సరాల ప్లాన్కు మొత్తం రూ.1.05 లక్ష కోట్ల పెట్టుబడిని నిర్ణయించారు. ఈ పెట్టుబడులు ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఉపయోగపడతాయి. 5 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తాయి. విశాఖను హైదరాబాద్, చెన్నైలతో పోటీపడేలా మార్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ల మధ్య సహకారం నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ప్రణాళికలు ఇలా..ఇండస్ట్రియల్ డెవలప్మెంట్: 30 ప్రాజెక్టులకు రూ.33,080 కోట్లు (విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో). ఇందులో NTPC హైడ్రోజన్ పార్క్ (రూ.20,225 కోట్లు), TVS లాజిస్టిక్స్ పార్కులు (రూ.1,500 కోట్లు), JSW ఇండస్ట్రియల్ పార్క్ (రూ.532 కోట్లు), ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్, ఇన్క్యుబేషన్ ఫెసిలిటీలు (APIS, STPI, NASSCOM, ఆంధ్ర యూనివర్సిటీ).ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్: భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ (రూ.4,727 కోట్లు), విశాఖ మెట్రో రైల్ (రూ.14,000-14,309 కోట్లు), హై-స్పీడ్ రైల్ కారిడార్లు (హైదరాబాద్-విశాఖ, విజయవాడ-బెంగళూరు). స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కు రూ.1,906.15 కోట్లు. బీచ్ కారిడార్ (భోగాపురం నుంచి నగరం వరకు 6-లేన్ రోడ్)కు రూ.960 కోట్లు.ఎనర్జీ, గ్రీన్ టెక్: అదానీ డేటా సెంటర్ (రూ.27,000 కోట్లు), NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ (రూ.27,000 కోట్లు).ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
ప్రతీ కార్మికుడికి ఏఐ ఫలాలు
‘మిషన్ డిజిటల్ శ్రమసేతు’ కార్యక్రమం కింద కృత్రిమ మేధ (ఏఐ) ప్రతీ కార్మికుడికి అందుబాటులో ఉండేలా తగిన కార్యాచరణను రూపొందించాలని నీతి ఆయోగ్ పిలుపునిచ్చింది. ‘సమ్మిళిత సామాజికాభివృద్ధికి ఏఐ’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఏఐ, బ్లాక్చైన్, ఇమ్మర్సివ్ లెర్నింగ్(వీఆర్, ఏఆర్ సాధనాల సాయంతో), ఇతర టెక్నాలజీల ద్వారా.. ఆర్థిక అభద్రత, పరిమిత మార్కెట్ అవకాకాశాలు, నైపుణ్యాలలేమి వంటి వాటిని అధిగమించొచ్చని పేర్కొంది.అసంఘటిత రంగ కార్మికులు పరికరాలు, ప్లాట్ఫామ్ల సాయంతో తమ నైపుణ్యాలు పెంచుకునేందుకు, అధిక ఉత్పాదకతకు మిషన్ డిజిటల్ శ్రమసేతు వీలు కల్పిస్తుందని తెలిపింది. ఈ కార్యక్రమం ప్రభుత్వం, విద్యా సంస్థలు, పౌర సమాజం మధ్య సహకారాన్ని పెంచుతుందని వివరించింది. తద్వారా లక్షలాది మందిని దేశ అభివృద్ధి పథకంలో భాగస్వాములను చేయడం ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడం సాధ్యపడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.ప్రస్తుత మాదిరే కొనసాగితే అసంఘటిత రంగంలో ప్రతీ కార్మికుడి వార్షిక ఆదాయం 2047 నాటికి 6,000 డాలర్లకు మించకపోవచ్చని, 14,500 డాలర్ల లక్ష్యానికి ఇది ఎంతో తక్కువని పేర్కొంది. కనుక దేశ అభివృద్ధికి లక్షలాది మంది దూరంగా ఉండకుండా వెంటనే సమిష్టి చర్యలు అవసరమని నివేదికలో సూచించింది. ‘దేశంలోని 49 కోట్ల అసంఘటిత రంగ కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునేట్టు అయితే సహకారం అన్నది తప్పనిసరి’ అని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణియన్ తెలిపారు.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
సౌర ఇంధనంలో మూడో స్థానానికి భారత్
సోలార్ విద్యుదుత్పత్తి పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. ఉత్పాదక సామర్థ్యం 125 గిగావాట్ల సామర్థ్యాన్ని అధిగమించినట్టు కేంద్ర పనరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అంతర్జాతీయ సోలార్ కూటమి (ఐఎస్ఏ) కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.‘కాప్28 అంగీకారం మేరకు ప్రపంచ పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యం మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 11,000 గిగావాట్లకు చేరుకోవాలి. ఈ లక్ష్య సాధనలో సోలార్ విద్యుత్ అన్నది కీలక పాత్ర పోషిస్తుంది. నేడు 125 గిగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద సోలార్ విద్యుదుత్పత్తిదారుగా ఉంది’ అని మంత్రి తెలిపారు.దేశ ఆకాంక్ష క్షేత్రస్థాయిలో ఎంత ప్రభావం చూపించగలదన్నది దానికి ఈ పురోగతి నిదర్శనమని పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజ్లీ యోజన పథకం కింద ఇప్పటికే 20 లక్షలకు పైగా గృహాలకు రూఫ్టాప్ సోలార్ విద్యుత్ వసతులు సమకూర్చినట్టు చెప్పారు. ఈ నెల 27 నుంచి 30 వరకు అంతర్జాతీయ సోలార్ కూటమి సదస్సు ఢిల్లీలో జరగనుంది. సోలార్ ఇంధన పరిష్కారాల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఐఎస్ఏని ఏర్పాటు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూనే కోట్లు సంపాదించే మార్గాలు.. -
సులభమైన ప్రోడక్టులను తీసుకురండి
ముంబై: అందరూ సులభంగా ఉపయోగించగలిగే, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రోడక్టులు, సర్వీసులను డిజైన్ చేయాలని ఫిన్టెక్ సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సూచించారు. సంపన్నులకు సరీ్వసులు అందించడం లాభసాటి వ్యాపారమే అయినప్పటికీ, అంతగా సేవలందని వారిపైనా చిన్న కంపెనీలు దృష్టి పెట్టాలని చెప్పారు. తద్వారా ఆరి్థక సమ్మిళితత్వం సాధించేందుకు, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదిగేందుకు తమ వంతు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘కస్టమర్ల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ, వారు సులభంగా ఉపయోగించగలిగేలా ఉత్పత్తులు, సర్వీసులను డిజైన్ చేయాలి. అవి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలి. సీనియర్ సిటిజన్లు, డిజిటల్ అక్షరాస్యత అంతగా లేని వారు, దివ్యాంగులు కూడా ఉపయోగించగలిగేలా అసిస్టివ్ టెక్నాలజీలను పొందుపర్చాలి‘ అని మల్హోత్రా చెప్పారు. విశ్వసనీయత, నిబంధనలను పాటించడానికి భారతీయ ఫిన్టెక్లు అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. ప్రతి ప్రోడక్టు, సరీ్వసులోను వినియోగదారుల డేటా గోప్యతను పరిరక్షిస్తూ, పారదర్శకతకు పెద్ద పీట వేయాలని పేర్కొన్నారు. గ్లోబల్ రేంజ్లో... లోకల్గా ఉంటూనే గ్లోబల్ స్థాయిలో ఆలోచించాలని, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేయాలని, ఉత్తమ విధానాలను అమలు చేయాలని మల్హోత్రా సూచించారు. ఫిన్టెక్ సంస్థలు డిజిటల్ తారతమ్యాలను చెరిపివేయగలవని, నవకల్పనలకు ఊతమివ్వగలవని ఆయన పేర్కొన్నారు. ఆరి్థక సేవలను తక్కువ ఖర్చులతో భారీ స్థాయిలో అందించడాన్ని ఫిన్టెక్ సాధ్యం చేసిందని తెలిపారు. ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న డిజిటల్ మోసాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మల్హోత్రా తెలిపారు. ఈ దిశగా ఆర్బీఐ విభాగం రూపొందించిన మ్యూల్హంటర్ సొల్యూషన్ని ప్రస్తుతం 21 బ్యాంకులు ఉపయోగిస్తున్నాయని చెప్పారు. మోసగాళ్లు ఉపయోగించే ఖాతాలను ట్రాక్ చేయడంలో 90 శాతం సక్సెస్ రేటు ఉంటోందని తెలిపారు. కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియలను, యూజర్ ఇంటర్ఫేస్లను మెరుగుపర్చేందుకు, డేటా భద్రతను పటిష్టం చేసేందుకు నిర్దిష్ట ప్రమాణాలను ప్రవేశపెట్టడంపై ఆర్బీఐ కసరత్తు చేస్తోందని మల్హోత్రా వివరించారు. పదేళ్లలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. గత దశాబ్దకాలంగా సుమారు 10,000 ఫిన్టెక్ సంస్థలు 40 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులను దక్కించుకున్నాయని మల్హోత్రా వివరించారు. రాబోయే రోజుల్లోనూ ఈ రంగం గణనీయంగా వృద్ధి చెందనుందని చెప్పారు. సుశిక్షితులైన టెక్నాలజీ నిపుణుల లభ్యత, చెల్లింపులు.. బీమా .. మొదలైన విభాగాలవ్యాప్తంగా ఆ ర్థిక వ్యవస్థ క్రియాశీలకంగా ఉండటం ఫిన్టెక్లో కొత్త ఆవిష్కరణలకు దోహదపడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు కూడా పరిశ్రమకు చేయూతనిచ్చేలా చర్యలు తీసుకుంటున్నాయని మల్హోత్రా తెలిపారు. మరోవైపు, తాను కొన్నాళ్లుగా ప్రస్తావిస్తున్న ’ఫిన్టర్నెట్’ వ్యవస్థ వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకని చెప్పారు. స్థలాలు, ప్రాపరీ్టలు, బాండ్లు, ఆర్థిక పెట్టుబడులు మొదలైన అసెట్స్ అన్నీ ఒకే ప్లాట్ఫాంపైకి తెచ్చేందుకు, లావాదేవీలను సులభతరం చేసేందుకు ఉపయోగపడేలా ఇది ఉంటుంది. -
భారత్ అభివృద్ధిని ఏ శక్తీ నిలువరించలేదు
ముంబై: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని, భూమిపై ఏ శక్తి దీన్ని అడ్డుకోలేదని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. దేశీ ఆరి్థక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎన్నో చర్యలను ప్రభు త్వం తీసుకుందన్నారు. మౌలిక వసతుల కల్పనతోపాటు అంతర్జాతీయ వాణిజ్య విస్తరణకు చేపడుతున్న చర్యలను ప్రస్తావించారు. గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 6వ ఎడిషన్ను ఉద్దేశించి మంత్రి గోయల్ మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం భారత్ను విశ్వసిస్తోంది. అత్యున్నత నాణ్యమైన నిపుణులు, వస్తు, సేవలకు భారత్ హామీ ఇస్తోంది. 100 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. టెక్నాలజీతో కలసి సాగకుంటే ఇది సాధ్యం కాదు. 2047 నాటికి 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని భారత్ ఆకాంక్షిస్తున్నప్పుడు ఆరి్థక ప్రపంచంలో మన మిత్రులు తమదైన అంచనాలు వేసుకుంటారు. కానీ, ఇది సాధ్యమేనని మీరు చూ స్తారు. మనందరం సమిష్టిగా ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని మంత్రి పేర్కొన్నారు. వినియోగంపై ఆధారపడిన ఆరి్థక వ్యవస్థను ఉరకలెత్తించేందుకు ప్రభుత్వం తన వంతుగా కీలక చర్యలు చేపట్టినట్టు చెప్పారు. అంతర్జాతీయంగా ఎన్నో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ విదేశీ వాణిజ్యం విస్తరణకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో ఎగుమతులు 4–5% మేర పెరుగుతాయన్న అంచనాను వ్యక్తం చేశారు. -
వద్దు పొమ్మంటే ఎవరికి నష్టం..
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలను కఠినతరం చేయడం లేదా ఉన్న ఉద్యోగులను తిరిగి పంపించే నిర్ణయాలు స్వల్పకాలికంగా అమెరికన్ ఉద్యోగులకు మేలు చేస్తాయనే వాదనలున్నాయి. కానీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచంలో ఆ దేశ పోటీతత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వలస వచ్చిన నిపుణులు (Immigrant professionals) అమెరికా ఆవిష్కరణకు మూల స్తంభాలుగా ఉన్నారు. పేటెంట్లు (Patents), సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (STEM) రంగాల్లో గ్రాడ్యుయేట్లు, వెంచర్ క్యాపిటల్-ఫండ్ పొందిన సంస్థల్లో కీలక స్థానాల్లో విదేశీ నిపుణుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.వారంతా విరమించుకుంటే అమెరికన్ కంపెనీల్లో నైపుణ్యాల కొరత (Talent Crunch) ఏర్పడుతుంది. ముఖ్యంగా సాంకేతిక రంగంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఆవిష్కరణ రేటు తగ్గి, ఉత్పాదకత దెబ్బతింటుంది. కొన్ని అంచనాల ప్రకారం, కఠినమైన వలస విధానాలు దీర్ఘకాలంలో అమెరికా స్థూల జాతీయోత్పత్తి (GDP)ని గణీనయంగా తగ్గించవచ్చు.శ్రామిక శక్తి పెరుగుదలపై ప్రతికూలతఅమెరికన్ స్థానిక జనాభా వయసు పెరుగుతున్న నేపథ్యంలో గత 20 ఏళ్లుగా శ్రామిక శక్తి వృద్ధికి (Labor Force Growth) వలసదారులు ప్రధాన చోదక శక్తిగా ఉన్నారు. 2000 నుంచి 2022 మధ్య 25-54 ఏళ్ల వయసున్న శ్రామికుల్లో దాదాపు మూడు వంతుల పెరుగుదలకు విదేశీయులే కారణం. కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలు శ్రామిక శక్తి వృద్ధిని తగ్గిస్తాయి. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే సామర్థ్యాన్ని తీవ్రంగా పరిమితం చేస్తుంది.పోటీ దేశాలకు లాభంఅమెరికాలో ఉద్యోగం కోల్పోయిన లేదా ప్రవేశం దొరకని అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు (Highly Skilled Professionals) వేరే మార్గాలను అన్వేషిస్తారు. ఈ సమయంలో కెనడా, జర్మనీ వంటి దేశాలు వీరికి స్వాగతం పలుకుతున్నాయి. అమెరికా కోల్పోయిన ఈ మేధాసంపత్తి (Talent) ఇతర దేశాలకు బదిలీ అవుతుంది. తద్వారా ఆ దేశాల ఆవిష్కరణ, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయి. అమెరికాను కాదని ఇతర దేశాలకు వెళ్లే వలసదారులు అక్కడ వ్యాపారాలను స్థాపిస్తారు. వినియోగాన్ని పెంచుతారు.ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి! -
అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!
అమెరికా హెచ్1బీ వీసాపై పెంచిన ఫీజులు, ‘యూఎస్ ఫస్ట్’ వైఖరితో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన చాలామంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాంతోపాటు అమెరికా వెళ్లాలని భావిస్తున్న ఇతర దేశాల్లోని వారు ఆలోచనలో పడ్డారు. ఈనేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ శ్రామిక శక్తి లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయడానికి నియామకాలను ముమ్మరం చేస్తున్నాయి.నైపుణ్యం కలిగిన వారికి అవకాశాలు..కెనడాఅత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానం కెనడా తన టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ (TFWP) ద్వారా గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (Global Talent Stream - GTS) విధానంలో నిపుణులను వేగంగా రిక్రూట్ చేసుకుంటోంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ (Express Entry), గ్లోబల్ టాలెంట్ స్ట్రీమ్ (GTS), ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్స్ (PNP) వంటి విధానాలు అనుసరిస్తోంది. ముఖ్యంగా IT/టెక్నాలజీ (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, నెట్వర్క్ టెక్నీషియన్లు), ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్, సివిల్), ఆరోగ్యం (నర్సులు, డాక్టర్లు), నిర్మాణం (Construction) వంటి విభాగాల్లో నియామకాలు చేపడుతున్నారు.కెనడా GTS ద్వారా అర్హతగల అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వర్క్ పర్మిట్ దరఖాస్తులను కేవలం రెండు వారాల్లో ప్రాసెస్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అత్యంత వేగవంతమైన ప్రక్రియ.జర్మనీయూరప్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ తన కార్మిక లోటును పూడ్చుకోవడానికి చురుగ్గా వలసదారులను ఆకర్షిస్తోంది. అందుకోసం ఈయూ బ్లూ కార్డ్ (EU Blue Card), ఎంప్లాయ్మెంట్ వీసా, జాబ్ సీకర్ వీసా, ఆపర్చునిటీ కార్డ్ (Opportunity Card) పాలసీలను అనుసరిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమోటివ్, ఎలక్ట్రికల్), IT (సాఫ్ట్వేర్ డెవలపర్లు, డేటా సైంటిస్టులు), ఆరోగ్యం (డాక్టర్లు, నర్సింగ్), ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలంటే జర్మన్ భాషా నైపుణ్యం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.ఆస్ట్రేలియా (Australia)ఆస్ట్రేలియా పాయింట్స్-ఆధారిత (Points-based) వ్యవస్థను ఉపయోగిస్తుంది. నైపుణ్యాల కొరత ఉన్న ఉద్యోగాల జాబితాను క్రమం తప్పకుండా ప్రకటిస్తుంది. హెల్త్కేర్ (నర్సింగ్, ఇతర వైద్య నిపుణులు), IT, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం(Construction Management)లో అవకాశాలున్నాయి. ఆస్ట్రేలియాలో కనీస వేతనంగా భారీ మొత్తాన్ని చెల్లిస్తారు.యూకే (United Kingdom)యూకే కూడా పాయింట్స్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మారింది. నైపుణ్యం కలిగిన కార్మికులకు (Skilled Workers), ఆరోగ్య కార్యకర్తలకు వీసా ప్రక్రియను సులభతరం చేసింది. IT, హెల్త్కేర్ (నర్సులు, వైద్య నిపుణులు), విద్యలో అవకాశాలున్నాయి.స్వీడన్ (Sweden)స్వీడన్ అధిక నాణ్యత గల జీవన ప్రమాణాలు, బలమైన సామాజిక భద్రత, వర్క్-లైఫ్ సమతుల్యత (Work-Life Balance)కు ప్రసిద్ధి చెందింది. టెక్నాలజీ, హెల్త్కేర్, ఇంజినీరింగ్, పునరుత్పాదక శక్తి (Renewable Energy) రంగాల్లో భారీగా అవకాశాలున్నాయి. నైపుణ్యం కలిగిన నిపుణులకు వర్క్ పర్మిట్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది.నెదర్లాండ్స్ (Netherlands)నెదర్లాండ్స్ ఒక అంతర్జాతీయ వాణిజ్య కేంద్రం. హై-టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రసిద్ధి చెందింది. హైలీ స్కిల్డ్ మైగ్రెంట్ (HSM) వీసా, ఈయూ బ్లూ కార్డ్ పాలసీలు పాటిస్తుంది. IT, ఫైనాన్స్, ఇంజినీరింగ్, హెల్త్కేర్, లాజిస్టిక్స్ (Logistics) వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలున్నాయి.సింగపూర్, యూఏఈఆసియాలో ఈ దేశాలు ఉన్నత స్థాయి జీతాలు, తక్కువ పన్నులు, శక్తివంతమైన వ్యాపార వాతావరణాన్ని అందిస్తున్నాయి. సింగపూర్లో ఫైనాన్స్, ఫిన్టెక్ (FinTech), ఐటీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువులున్నాయి. ఇక్కడ జారీ చేసే ఉద్యోగ పాస్లు (Employment Passes) అత్యంత నైపుణ్యం కలిగిన వారికి మార్గాన్ని సుగమం చేస్తాయి. యూఏఈ (దుబాయ్, అబుదాబి)లో నిర్మాణ నిర్వహణ, పర్యాటకం, రియల్ ఎస్టేట్, ఐటీ, ఎనర్జీ వంటి విభాగాల్లో అవకాశాలున్నాయి. ఇక్కడ అందించే గోల్డెన్ వీసాల (Golden Visas) ద్వారా దీర్ఘకాల నివాస అవకాశాలను పొందవచ్చు.ఇదీ చదవండి: పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర -
భారత్తో భాగస్వామ్యంపై ఖతార్ కంపెనీల్లో ఆసక్తి
భారత కంపెనీలతో భాగస్వామ్యానికి ఖతార్ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, ఇతర దేశాల్లో ప్రాజెక్టులను భారత కంపెనీల భాగస్వామ్యంతో చేపట్టేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు. ఒక్క రోజు పర్యటన కోసం వ్యాపార ప్రతినిధి బృందంతో మంత్రి గోయల్ ఖతార్కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు.ఖతార్కు చెందిన ఆల్ బలఘ్ ఎల్అండ్టీ భాగస్వామిగా ఉందన్న ఉదాహరణను ప్రస్తావించారు. ఈ ఇరు సంస్థలు కలసి ఖతార్లో ప్రాజెక్టులను పూర్తి చేశాయని, ఇతర దేశాల్లోనూ సంయుక్తంగా ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు చెప్పారు. ఖతార్ ప్రభుత్వం మూడో పక్ష దేశాల్లో ప్రాజెక్టులపై దృష్టి పెట్టిందని, ఇదే విషయాన్ని తనకు చెప్పినట్టు పేర్కొన్నారు. ఖతారీ డెవలప్మెంట్బ్యాంక్ నిధులు సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కనుక భారత కంపెనీలు ఈ అవశాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఖతార్తో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25లో 14.15 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం.అమెరికాతో ఒప్పందంపై చర్చలుప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికా–భారత్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నవంబర్ చివరికి చర్చలు ముగించాలన్న లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని అవకాశాలున్నట్టు చెప్పారు. తదుపరి విడత చర్చలు భౌతికంగా జరిగేందుకు ఉన్న అవకాశాలను తోసిపుచ్చలేదు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ షట్డౌన్ (మూసివేత)ను ఎదుర్కొంటున్నందున, తదుపరి దశ చర్చలు ఎలా, ఎక్కడ నిర్వహించేదీ చూడాల్సి ఉందన్నారు. నిధుల మంజూరునకు కాంగ్రెస్ ఆమోదం పొందలేకపోవడంతో అక్టోబర్ 1 నుంచి అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడం తెలిసిందే.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
ఆవిష్కరణలను అణగదొక్కేలా నిబంధనలు ఉండకూడదు..
నిబంధనలు, నియంత్రణలనేవి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉండాలే తప్ప అణగదొక్కేలా ఉండకూడదని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. వాటిని అణగదొక్కే పరిస్థితి ఉంటే ఇంకో దగ్గరెక్కడో ఆవిష్కరణలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నియంత్రణలనేవి సంస్థ ప్రాతిపదికగా కాకుండా కార్యకలాపాల ప్రాతిపదికన ఉండాలని సుబ్రహ్మణ్యం గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.‘ఒకవేళ నేను బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంటే, నన్ను బ్యాంకరుగా పరిగణించి, దానికి తగ్గ నిబంధనలు వర్తింపచేయాలి. అదే ఏదైనా ఫండ్ను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే, బ్యాంకరుగా కాకుండా ఫండ్ డిస్ట్రిబ్యూటరు నిబంధనలను వర్తింపచేయాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా విధానంపై ఆర్థిక శాఖ, నియంత్రణ సంస్థలు లోతుగా చర్చిస్తున్నట్లు వివరించారు. మరోవైపు, జీఎస్టీ 2.0 తర్వాత, దీపావళికన్నా ముందే మరో విడత సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉందని సుబ్రహ్మణ్యం చెప్పారు. నీతి ఆయోగ్ సభ్యుడు రాజీవ్ గౌబా సారథ్యంలోని కమిటీ ఇప్పటికే వీటికి సంబంధించిన నివేదికల తొలి సెట్ను సమర్పించినట్లు పేర్కొన్నారు. పొరుగుదేశాలతో పటిష్ట సంబంధాలు ఉండాలి..చైనాతో పాటు ఇతర పొరుగు దేశాలతో భారత్కి పటిష్టమైన వాణిజ్య సంబంధాలు ఉండాలని సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. మొత్తం యూరోపియన్ యూనియన్ వాణిజ్యంలో 50 శాతం భాగం.. అంతర్గతంగా ఆయా దేశాల మధ్యే జరుగుతుందని ఆయన చెప్పారు. భారత్ విషయానికొస్తే బంగ్లాదేశ్ 6వ అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగాను, టాప్ 10లో నేపాల్ ఉండేదని తెలిపారు. చైనా పెట్టుబడులపై ఆంక్షలు ఎత్తివేస్తారా అనే ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకపోయినప్పటికీ, భారత్కి ఆ దేశం కీలక సరఫరాదారని సుబ్రహ్మణ్యం చెప్పారు. 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని విస్మరించజాలమని పేర్కొన్నారు. అలాంటి దేశానికి మరింతగా విక్రయించలేకపోతే అర్థరహితమైన విషయం అవుతుందని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: కేంద్రం చెంతకు పంచాయితీ! -
సేవల రంగంలో నిదానించిన వృద్ధి
సేవల రంగంలో కార్యకలాపాల వృద్ధి సెప్టెంబర్ నెలలో కాస్తంత నిదానించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సేవల రంగం పీఎంఐ ఆగస్ట్లో 15 ఏళ్ల గరిష్ట స్థాయి 62.9 పాయింట్లకు చేరగా, సెప్టెంబర్లో 60.9కు తగ్గింది. అయినప్పటికీ 50 పాయింట్లకు పైన నమోదు కావడాన్ని వృద్ధి కిందే పరిగణిస్తుంటారు. వేగం తగ్గినప్పటికీ, వృద్ధి ధోరణికి ఢోకా లేదని హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు.అంతర్జాతీయంగా భారత సేవలకు డిమాండ్ కొంత నిదానించడంతో వృద్ధి వేగానికి కాస్త బ్రేక్లు పడినట్టయింది. సెప్టెంబర్లో ఎగుమతుల్లో వృద్ధి నెలకొన్నప్పటికీ, ఈ ఏడాది మార్చి తర్వాత నుంచి చూస్తే తక్కువకు పరిమితమైనట్టు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే గుర్తించింది. సెప్టెంబర్లో ఉపాధి కల్పన సైతం మోస్తరు స్థాయికి నిదానించిందని, కేవలం 5 శాతానికంటే కొంచెం ఎక్కువ కంపెనీలు నియామకాల్లో వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది.ఇక భవిష్యత్తు కార్యకలాపాలకు సంబంధించిన సూచీ మాత్రం ఈ ఏడాది మార్చి తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. భవిష్యత్తులో వ్యాపార కార్యకలాపాల పరంగా సేవల రంగ కంపెనీల్లో ఆశాభావం బలపడినట్టు ఈ సర్వే పేర్కొంది. సెప్టెంబర్ నెలకు సంబంధించి హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ (తయారీ, సేవల రంగం కలిపి) 61గా నమోదైంది. ఆగస్ట్లో ఇది 63.2 పాయింట్లుగా ఉంది. ఈ ఏడాది జూన్ తర్వాత తక్కువ వృద్ధి రేటు ఇదే కావడం గమనార్హం.ఇదీ చదవండి: దేశం విడిచిన కుబేరులు.. కారణాలు.. -
భవిష్యత్తులో పాలసీ రేట్ల కోతకు మరింత చాన్స్: క్రిసిల్
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ అంచనాలను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్, భవిష్యత్తులో పాలసీ రేట్లను మరింత తగ్గించేందుకు అవకాశాలను తెరిచి ఉంచిందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ ఒక నివేదికలో తెలిపింది. అమెరికా టారిఫ్లపరమైన అనిశి్చతుల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ద్వితీయార్థంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తిరోగమించే రిస్కులు ఉన్నట్లు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కూడా పేర్కొందని గుర్తు చేసింది. అయితే, ఇటీవల జీఎస్టీ రేట్లను క్రమబదీ్ధకరించడం వల్ల టారిఫ్లపరమైన ప్రతికూల ప్రభావం కొంత తగ్గొచ్చని క్రిసిల్ ఇంటెలిజెన్స్ తెలిపింది. కారి్మక శక్తి అధికంగా ఉండే నిర్దిష్ట రంగాలపై టారిఫ్ల ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుందని, వాటికి పాలసీపరమైన మద్దతును అందించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణంపరమైన ఆందోళన కొంత తగ్గే అవకాశం ఉందని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపు ప్రభావంతో ఆర్బీఐ కూడా పాలసీ రేట్లను తగ్గించడానికి కాస్త ఆస్కారం ఉంటుందని వివరించింది. 2025 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను 100 బేసిస్ పాయింట్లు (1%) తగ్గించింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, ఎంపీసీ సిఫార్సుల మేరకు, పాలసీ రేట్లను ఆర్బీఐ ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్లో మరో 25 బేసిస్ పాయింట్లు, జూన్లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఇది ప్రస్తుతం 5.5 శాతానికి చేరింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న 4 శాతం లోపే కొనసాగుతోంది. -
ఎలక్ట్రానిక్స్ తయారీకి రాష్ట్రాలూ చేయూతనివ్వాలి
న్యూఢిల్లీ: నాన్ సెమీకండక్టర్ ఎల్రక్టానిక్ విడిభాగాల తయారీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్పాదక అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం స్థానిక తయారీకి జోన్నివ్వనుంది. తుది ఉత్పత్తుల విలువలో స్థానిక తయారీ విలువ 40 శాతానికి పెరుగుతుందని ఎల్రక్టానిక్స్ పరిశ్రమల సంఘం (ఎల్సినా) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ‘ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం’ (ఈసీఎంఎస్)కు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈసీఎంఎస్ కింద రూ.1.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం గమనార్హం. రూ.59,000 కోట్ల పెట్టుబడులు రాబట్టుకోవాలని కేంద్రం ఆశించగా, అంతకు రెట్టింపు మేర స్పందన వచి్చంది. మొత్తం 249 కంపెనీలు పెట్టుబడుల ప్రతిపాదనలు సమరి్పంచాయి. కేంద్ర ప్రభుత్వ కమిటీ వీటిని పరిశీలించిన అనంతరం, అర్హత కలిగిన వాటికి ఆమోదం లభించనుంది. ‘‘దేశ ఎల్రక్టానిక్స్ తయారీ వ్యవస్థలో స్థానిక విలువ జోడింపును ప్రస్తుతమున్న 15–20 శాతం నుంచి 35–40 శాతానికి వచ్చే ఐదేళ్లలో పెరిగేందుకు ఈ పథకం దోహదం చేస్తుంది’’ అని ఎల్సినా సెక్రటరీ జనరల్ రాజు గోయల్ తెలిపారు. రూ.10.34 లక్షల కోట్ల తయారీ తాము రూ.4,56,500 కోట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటే, రూ.10.34 లక్షల కోట్ల ఉత్పత్తికి సంబంధించిన ప్రతిపాదనలు వచి్చనట్టు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నెల 2న ప్రకటించడం గమనార్హం. ఇందులో ప్రధానంగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులకు సంబంధించి రూ.16,542 కోట్లు, ఎలక్ట్రో మెకానికల్ విడిభాగాలకు సంబంధించి రూ.14,362 కోట్లు, మల్టీ లేయర్ పీసీబీలకు సంబంధించి రూ.14,150 కోట్లు, డిస్ప్లే మాడ్యూల్ సబ్ అసెంబ్లీకి సంబంధించి రూ.8,642 కోట్లు, కెమెరా మాడ్యూల్ సబ్ అసెంబ్లీకి సంబంధించి రూ.6,205 కోట్లు, లిథియం అయాన్ సెల్స్కు సంబంధించి రూ.4,516 కోట్ల చొప్పున ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఎలక్ట్రో మెకానికల్స్, ఐటీ ఉత్పత్తులకు సంబంధించి ఎన్క్లోజర్లు, మల్టీ లేయర్ పీసీబీలు, ఫ్లెక్సిబుల్ పీసీబీలకు ంసబంధించి పెద్ద మొత్తంలో, అధిక విలువ మేర ప్రతిపాదనలు వచి్చనట్టు ఎల్సినా తెలిపింది. తయారీ కేంద్రంగా భారత్పై పెరుగుతున్న విశ్వాసానికి ఈ స్పందన నిదర్శనమని ఎల్సినా ప్రెసిడెంట్ శశి గంధనం పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులను కల్పించడం ద్వారా ఈ ధోరణికి రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రాలు సైతం తమవంతు ప్రోత్సాహకాలు కల్పిస్తే మరిన్ని పెట్టుబడులు రావడంతోపాటు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కల్పన సాధ్యపడుతుందన్నారు. -
బ్యాంకులకు డిపాజిట్ సవాళ్లు
ముంబై: ఫిక్స్డ్ డిపాజిట్లలో క్షీణత, కరెంట్–సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు (కాసా) తగ్గుదలతో బ్యాంక్లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి సవాళ్లను ఎదుర్కోనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. గృహ పొదుపులు అధిక రాబడులను ఆకాంక్షిస్తూ క్యాపిటల్ మార్కెట్లకు మళ్లుతుండడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతున్నాయంటూ కొంత కాలంగా ఆందోళనలు నెలకొనడం తెలిసిందే. వ్యవస్థ పరిణతిలో భాగంగా ఇలాంటి పరిణామం చూస్తున్నట్టు నిపుణుల అభిప్రాయంగా ఉంది. ‘‘టర్మ్ డిపాజిట్లు, కాసా నిష్పత్తిలో గృహాల వాటా తగ్గుతోంది. డిపాజిట్ కూర్పులో నిర్మాణాత్మక మార్పును ఇది సూచిస్తోంది. డిపాజిట్ స్థిరత్వానికి ఇది సవాలుగా మారొచ్చు. మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో బ్యాంకుల నిధుల వ్యయాలపైనా ప్రభావం చూపిస్తుంది. 2025 మార్చి నాటికి బ్యాంకుల డిపాజిట్లలో గృహాల వాటా 60 శాతానికి తగ్గింది. 2020 మార్చి నాటికి ఇది 64 శాతంగా ఉంది’’అని క్రిసిల్ నివేదిక వివరించింది. డిపాజిట్లలో వృద్ధి బ్యాంకులకు ఎంతో కీలకమని, స్థిరత్వం, వ్యయాలను ఇది ప్రభావితం చేయగలదని పేర్కొంది. రానున్న కాలంలో బ్యాంక్ డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుందని అంచనా వేసింది. పెరుగుతున్న ఆర్థికేతర సంస్థల వాటా ఆర్థికేతర సంస్థలు తమ వాటా పెంచుకుంటున్నట్టు క్రిసిల్ డైరెక్టర్ శుభ శ్రీనారాయణన్ ఎత్తిచూపుతూ.. కార్పొరేట్ డిపాజిటర్లు రేటుకు సున్నితంగా ఉంటారని, వారు స్వల్పకాలానికి ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పారు. ‘‘నగదు లభ్యత పరిస్థితులు (లిక్విడిటీ) కఠినంగా ఉన్నప్పుడు ఈ తరహా పరిస్థితుల్లో మరిన్ని డిపాజిట్లు బయటకు వెళ్లిపోతాయి. దీంతో బ్యాంకులకు నిధుల వ్యయాలు పెరుగుతాయి. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు మరింత ఆదరణకు నోచుకుంటాయి. దీంతో బ్యాంకు డిపాజిట్లలో గృహాల వాటా మరింత తగ్గుతుంది’’అని నారాయణన్ వివరించారు. బ్యాంకులకు సేవింగ్స్, కరెంటు ఖాతాల్లోని డిపాజిట్లపై వ్యయాలు చాలా తక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. సేవింగ్స్ ఖాతాల్లోని డిపాజిట్లపై 3 శాతం వరకు బ్యాంకులు వడ్డీ కింద చెల్లిస్తుంటాయి. ఇక కరెంటు ఖాతా డిపాజిట్లపై ఎలాంటి వడ్డీని ఇవ్వవు. దీంతో వాటికి తక్కువ వ్యయాలకు పెద్ద మొత్తంలో నిధులు సమకూరుతుంటాయి. అందుకే బ్యాంకుల వృద్ధికి కాసా డిపాజిట్లను కీలకంగా పరిగణిస్తుంటారు. 2025 జూన్ చివరికి బ్యాంకుల కాసా డిపాజిట్ల నిషపత్తి 36 శాతానికి తగ్గిపోయినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. 2022 మార్చిలో నమోదైన 42 శాతం చారిత్రక గరిష్ట స్థాయి నుంచి తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా సేవింగ్స్ డిపాజిట్లు తగ్గుముఖం పడుతున్నట్టు పేర్కొంది. ఇటీవలి కాలంలో బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై రేట్లను తగ్గించడం దీన్ని మరింత వేగవంతం చేస్తుందని అంచనా వేసింది. సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీని ఎస్బీఐ సహా పలు ప్రముఖ బ్యాంకులు ఇటీవల 2.5 శాతానికి తగ్గించడం గమనార్హం. లిక్విడిటీ పెంపు దిశగా ఆర్బీఐ పలు చర్యలు తీసుకున్నందున సమీప కాలానికి ఈ డిపాజిట్లు స్థిరంగా వృద్ధి చెందాల్సి ఉందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. -
సర్ క్రిక్ వివాదం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?
భారతదేశంలోని గుజరాత్కు, పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్కు మధ్య రాన్ ఆఫ్ కచ్ (Rann of Kutch) ప్రాంతంలో ఉన్న సర్ క్రిక్ (Sir Creek) అంశం సముద్ర సరిహద్దు వివాదానికి కేంద్రంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల ట్రంప్ పాకిస్థాన్లో భారీగా చమురు నిల్వలున్నట్లు ప్రకటించారు. అవసరమైతే భారత్కు సైతం చమురు సరఫరా చేయగల సామర్థ్యం పాక్కు వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో అసలు సర్ క్రిక్ వద్ద ఎలాంటి పరిస్థితులున్నాయో.. అవి భారత వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుందో తెలుసుకుందాం.సర్ క్రిక్ వివాదంసర్ క్రిక్ అనేది గుజరాత్, పాకిస్థాన్లోని సింధ్ రాష్ట్రాల మధ్య రాన్ ఆఫ్ కచ్లోని చిత్తడినేల సరిహద్దులో 96 కిలోమీటర్ల పొడవు గల సముద్ర ప్రాంతం. ఈ ప్రాంతం స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. 1947 తర్వాత దేశ విభజన జరిగినప్పుడు సర్ క్రిక్ సరిహద్దు రేఖను నిర్ణయించడంలో భారత్, పాకిస్థాన్ల మధ్య వివాదం మొదలైంది.పాక్ వాదనపాకిస్థాన్ 1914 నాటి బాంబే గవర్నమెంట్ రెజల్యూషన్ను ఆధారం చేసుకొని క్రిక్కు తూర్పు వైపున ఉన్న ఒడ్డు (ఈస్టర్న్ బ్యాంక్) వెంబడి సరిహద్దును గుర్తించాలని వాదిస్తుంది.ఇండియా వాదనభారతదేశం అంతర్జాతీయ చట్టంలోని ‘థాల్వెగ్ సూత్రం’ (Thalweg Principle) ప్రకారం నది లేదా కయ్య మధ్యలో అత్యంత లోతైన ప్రాంతం గుండా సరిహద్దు నిర్ణయించాలని వాదిస్తుంది. భారత్ వాదన ప్రకారం సరిహద్దు మధ్యలో ఉంటే భారతదేశానికి ప్రత్యేక ఆర్థిక మండలి (Exclusive Economic Zone - EEZ) పరిధిలో ఎక్కువ సముద్ర ప్రాంతం లభిస్తుంది. ఈ వివాదం కారణంగా సర్ క్రిక్ ప్రాంతంలో సముద్ర సరిహద్దు రేఖ (International Maritime Boundary Line)పై స్పష్టత కొరవడింది.చమురు నిల్వల అంచనాలుఈ ప్రాంతంలోని సముద్ర భాగంలో భారీగా చమురు, సహజవాయు నిల్వలు ఉన్నట్లు శాస్త్రీయ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాల వల్లే ఈ ప్రాంతం భౌగోళిక-రాజకీయంగా మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ఏ దేశం సరిహద్దుగా గుర్తించబడుతుందో ఆ దేశానికి ఈ నిల్వలను వెలికితీసే హక్కు లభిస్తుంది.ట్రంప్ వ్యాఖ్యలుపాకిస్థాన్లో భారీ చమురు నిక్షేపాలు ఉన్నట్లు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాంతాన్ని ఉద్దేశించే అయ్యి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారికంగా స్పష్టమైన సమాచారం లేదు. సర్ క్రిక్ సమీపంలోని ప్రాంతాల్లో చమురు నిల్వలు ఉన్నట్లయితే ఆ నిల్వలు ఎవరి సరిహద్దులో ఉన్నాయనే దానిపై చర్చ కీలకమవుతుంది. ఒకవేళ ఇరుప్రాంతాల్లో తీవ్ర సైనిక ఘర్షణ తలెత్తితే అది భారతదేశ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై వివిధ రూపాల్లో ప్రభావం చూపుతుంది.సముద్ర వాణిజ్యంపై ప్రభావంసర్ క్రిక్ గుజరాత్లోని కీలక నౌకాశ్రయాలకు (కాండ్లా (Kandla), ముంద్రా (Mundra)) దగ్గరగా ఉంది. ఈ నౌకాశ్రయాలు భారతదేశంలోని పశ్చిమ ప్రాంత వాణిజ్యానికి, ముడి చమురు దిగుమతులు, ఎగుమతులకు కీలకంగా ఉంది. యుద్ధం జరిగితే ముంద్రా, కాండ్లా నౌకాశ్రయాల గుండా వెళ్లే వాణిజ్య నౌకల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, గగనతల ఆంక్షల కారణంగా సముద్ర మార్గాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. నౌకల రాకపోకలు ఆగిపోతే ముడిసరుకు, తయారైన వస్తువుల సరఫరా గొలుసు (Supply Chain) తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది భారతదేశంలోని పశ్చిమ ప్రాంత పారిశ్రామిక ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.శక్తి వనరుల భద్రతభారతదేశం తన చమురు అవసరాలలో అధిక భాగాన్ని పశ్చిమాసియా దేశాల నుంచి సముద్ర మార్గంలో దిగుమతి చేసుకుంటుంది. ఈ నౌకలు గుజరాత్ తీరం గుండానే ప్రయాణిస్తాయి. క్రిక్ ప్రాంతంలో అనిశ్చితి నెలకొంటే చమురు ట్యాంకర్లకు ముప్పు వాటిల్లి దిగుమతులకు అంతరాయం కలుగుతుంది. క్రూడ్ సరఫరాలో ఆటంకం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు (Crude Oil Prices) పెరిగి అది భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు, ద్రవ్యోల్బణం (Inflation) పెరగడానికి దారితీస్తుంది.మత్స్య పరిశ్రమపై ప్రభావంసర్ క్రిక్ ప్రాంతం మత్స్య సంపదకు కేంద్రం. ఈ సరిహద్దు వివాదం కారణంగా ఇరు దేశాల మత్స్యకారులు తరచుగా ఒకరి జలాల్లోకి మరొకరు ప్రవేశించడం, అరెస్టులు జరగడం సాధారణం. యుద్ధ వాతావరణం ఏర్పడితే మత్స్యకారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడి, ఈ ప్రాంతంలోని మత్స్య పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోతుంది.వివాదం పరిష్కారానికి చేపట్టాల్సిన కీలక చర్యలుదౌత్యపరమైన చర్చలుఈ వివాదాన్ని పరిష్కరించడానికి రెండు దేశాలు అన్ని స్థాయిలలో నిరంతరంగా, విశ్వసనీయంగా దౌత్య చర్చలు కొనసాగించాలి. సరిహద్దు అంశాలతో పాటు చమురు నిల్వలపై ఉమ్మడి ప్రయోజనాలు, మత్స్యకారుల సమస్యలు మొదలైనవాటిని చర్చించాలి. సర్ క్రిక్ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేకంగా అత్యున్నత స్థాయి దౌత్య ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఇది రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం లేకుండా చర్చలను కొనసాగించడానికి వీలు కల్పిస్తుంది.అంతర్జాతీయ చట్టాల అమలుఈ ప్రాంతం సరిహద్దును గుర్తించడానికి అంతర్జాతీయ జలాల చట్టంలో (International Law of the Sea) ఉన్న థాల్వెగ్ సూత్రాన్ని (ప్రవాహంలోని లోతైన కాలువ మధ్య రేఖ) ప్రామాణికంగా స్వీకరించడంపై చర్చించాలి. ఇది సముద్ర సరిహద్దు సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన సూత్రం. సముద్ర సరిహద్దులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు (EEZ), ఖండాంతర తీరం (Continental Shelf) పరిధిని నిర్ణయించడానికి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒడంబడిక (UNCLOS) నిబంధనలను పాటించడంపై ఏకాభిప్రాయం సాధించాలి.శాస్త్రీయ, సాంకేతిక పరిశోధనరెండు దేశాల నిపుణులు సంయుక్తంగా ఈ ప్రాంతంలో కచ్చితమైన జల సర్వే (Hydrographic Survey) నిర్వహించాలి. ఈ సర్వే ద్వారా క్రిక్లోని కాలువ లోతు, ప్రవాహ మార్పులు, వాస్తవ భౌగోళిక మార్పులను నిర్ధారించాలి. ద్వైపాక్షిక చర్చలు విఫలమైతే రెండు దేశాలు ఆమోదించిన అంతర్జాతీయ ట్రిబ్యునల్ లేదా అంతర్జాతీయ న్యాయస్థానానికి (ICJ) వివాదాన్ని అప్పగించడం ఒక పరిష్కార మార్గం. మధ్యవర్తిత్వంలో మూడవ పక్షం సహాయం తీసుకుంటే, నిష్పక్షపాతమైన పరిష్కారం లభించే అవకాశం ఉంది.ఇదీ చదవండి: క్రిప్టోకరెన్సీ.. ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు -
క్రిప్టోకరెన్సీ.. ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
సమకాలీన ఆర్థిక సాంకేతిక పరిజ్ఞానం (FinTech) పెరుగుతున్న నేపథ్యంలో స్టేబుల్ కాయిన్ల (Stablecoins) గురించి భారత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్ ప్రారంభ సెషన్లో ఆమె ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్టేబుల్ కాయిన్ల అవసరాన్ని నొక్కి చెప్పారు. కొన్ని దేశాలు వాటిని స్వాగతించినా లేదా వ్యతిరేకించినా స్టేబుల్ కాయిన్ల వాడకానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ద్రవ్య ఆవిష్కరణలకు అనుగుణంగా ఎంత త్వరగా మారాల్సిన అవసరం ఉందో ఆమె వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.స్టేబుల్ కాయిన్స్ అంటే ఏమిటి?స్టేబుల్ కాయిన్లు అనేవి క్రిప్టోకరెన్సీలో ఒక ప్రత్యేక కేటగిరీకి చెందినవి. వీటిని ధరల అస్థిరతను తగ్గించడానికి రూపొందించారు. బిట్ కాయిన్ లేదా ఎథీరియం వంటి సాంప్రదాయ క్రిప్టోకరెన్సీల ధరలు విపరీతంగా మారే అవకాశం ఉంటుంది. అందుకు భిన్నంగా స్టేబుల్ కాయిన్లు సాధారణంగా యూఎస్ డాలర్ వంటి స్థిరమైన ఫియట్ కరెన్సీకి లేదా బంగారం వంటి వస్తువులతో ముడిపడి ఉంటాయి. ఈ మెకానిజం క్రిప్టోకరెన్సీ మాదిరిగా అస్థిరతకు లోనుకాకుండా వినియోగదారులకు డిజిటల్ కరెన్సీ ప్రయోజనాలను అందించడానికి ఉద్దేశించబడింది.కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధాన రూపకర్తల ఆలోచనలను ప్రతిబింబిస్తున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ కరెన్సీల పెరుగుదలను, స్టేబుల్ కాయిన్లను ఇకపై విస్మరించలేమని చెబుతున్నారు. క్రిప్టో రంగంలో భారతదేశం జాగ్రత్తగా వ్యవహరిస్తున్న సమయంలో ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దేశీయంగా ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు చట్టపరమైన గుర్తింపును ఇవ్వకపోయినప్పటికీ అది వర్చువల్ డిజిటల్ ఆస్తి లావాదేవీల కోసం పన్ను ఫ్రేమ్వర్క్ను (30% పన్ను, 1% టీడీఎస్) అమలు చేస్తోంది. చాలామంది దీన్ని ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో ఉనికిని అంగీకరించే చర్యగా చూస్తున్నారు.ఆర్బీఐ వైఖరిరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలపై సందేహాస్పదంగా ఉంది. ఆర్థిక స్థిరత్వం, వినియోగదారుల రక్షణ, ద్రవ్య విధానానికి ప్రమాదాలు సంభవించవచ్చని పేర్కొంటూ గతంలో పూర్తి నిషేధాన్ని సమర్థించింది. అదే సమయంలో తన సొంత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) కోసం పైలట్ ప్రోగ్రామ్లను ప్రారంభించింది. దీన్ని ప్రైవేట్ డిజిటల్ కరెన్సీలకు సురక్షితమైన, నియంత్రిత ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. సీబీడీసీలు కేంద్ర బ్యాంకులచే జారీ చేయబడతాయి. సాంప్రదాయ కరెన్సీ మాదిరిగానే చట్టపరమైన హోదాను పొందుతాయి. చైనా, స్వీడన్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కూడా తమ CBDCలను పరీక్షించి అమలు చేస్తున్నాయి.సూక్ష్మ నియంత్రణ చర్చలకు దారిఇదిలాఉండగా, సీతారామన్ నిర్దిష్ట విధాన మార్పులను వివరించకపోయినా స్టేబుల్ కాయిన్లను పరివర్తన శక్తిగా గుర్తించడం భారతదేశ క్రిప్టో విధానంలో కీలకమైన క్షణాన్ని సూచిస్తుంది. ఈ ప్రకటన మరింత సూక్ష్మమైన నియంత్రణ చర్చలకు దారితీస్తుందని కొందరు భావిస్తున్నారు. డిజిటల్ ఆస్తుల కేటగిరీల మధ్య తేడాను చూపే భవిష్యత్తు ఫ్రేమ్వర్క్కు ఇది మార్గం సుగమం చేయవచ్చని చెబుతున్నారు. ఆ ఫ్రేమ్వర్క్లో స్టేబుల్ కాయిన్లు, ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలు, CBDCలను స్పష్టంగా పరిగణించే అవకాశం కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
నవరాత్రుల్లో విక్రయాలకు జీఎస్టీ జోష్
వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) తగ్గింపుతో పండగ సీజన్లో అమ్మకాలకు బూస్ట్ ఇచ్చినట్లయింది. ఈసారి నవరాత్రుల్లో దశాబ్దకాలంలోనే అత్యధికంగా విక్రయాలు నమోదయ్యాయి. వాహనాలు, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది నవరాత్రులతో పోలిస్తే మారుతీ సుజుకీ సేల్స్ రెట్టింపయ్యాయి. 3.5 లక్షల బుకింగ్స్ నమోదయ్యాయి. నవరాత్రుల్లో తొలి ఎనిమిది రోజుల్లో కంపెనీ 1.65 లక్షల వాహనాలను డెలివరీ చేసింది.మారుతీ సుజుకీ గతేడాది ఇదే వ్యవధిలో సుమారు 85,000 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల అమ్మకాలు 60 శాతం పెరిగాయి. క్రెటా, వెన్యూలాంటి మోడల్స్కి డిమాండ్ నెలకొనడంతో హ్యుందాయ్ వాహన విక్రయాల్లో ఎస్యూవీల వాటా దాదాపు 72 శాతంగా నమోదైంది. టాటా మోటర్స్ 50,000కు పైగా వాహనాలను విక్రయించింది. ఆ్రల్టోజ్, పంచ్, నెక్సాన్, టియాగోలాంటి మోడల్స్కి డిమాండ్ నెలకొంది. ఇక ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ షోరూంలను సందర్శించే వారి సంఖ్య రెట్టింపు కాగా, బజాజ్ ఆటో విక్రయాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఎల్జీ, హయర్ రెండంకెల స్థాయి వృద్ధి..కన్జూమర్ ఎల్రక్టానిక్స్ విభాగంలో ఎల్జీ, హయర్, గోద్రెజ్ అప్లయెన్సెస్ మొదలైన సంస్థల విక్రయాలు రెండంకెల స్థాయిలో పెరిగాయి. హయర్ అమ్మకాలు 85 శాతం ఎగిశాయి. 65 అంగుళాల టీవీలను రోజుకు 300–350 మేర విక్రయించింది. రూ. 2.5 లక్షల పైగా ఉండే 85 అంగుళాలు, 100 అంగుళాల టీవీలకు సంబంధించి దీపావళి స్టాక్ దాదాపుగా అమ్ముడైపోయింది. అతిపెద్ద రిటైల్ సంస్థ రిలయన్స్ రిటైల్ విక్రయాలు 20–25 శాతం పెరిగాయి. పెద్ద స్క్రీన్ టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఫ్యాషన్ మొదలైన విభాగాల్లో భారీగా అమ్మకాలు నమోదయ్యాయి. విజయ్ సేల్స్ విక్రయాలు కూడా 20 శాతం పెరిగాయి.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
అనిశ్చితులకు బంగారం సరికొత్త కొలమానం
ప్రపంచ అనిశ్చితులకు సరికొత్త కొలమానంగా బంగారం ధరలు వ్యవహరిస్తుట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ముడి చమురు ధరలు ఎలా ఉండేవో బంగారం ధరలు కూడా అలాగే మారినట్టు చెప్పారు. ద్రవ్యపరంగా నేడు ప్రతి దేశం ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న వాణిజ్య విధాపరమైన వాతావరణం కొన్ని ఆర్థిక వ్యవస్థల వృద్ధికి నష్టం కలిగించనున్నట్టు తెలిపారు.ఈ పరిస్థితుల్లో కొన్ని స్టాక్ మార్కెట్లు కరెక్షన్ను చూడొచ్చని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అవకాశాలను ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటూ.. ఈక్విటీ మార్కెట్లు సైతం ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా పలు మార్కెట్లలో ర్యాలీ వెనుక టెక్నాలజీ స్టాక్స్ పాత్రను ప్రస్తావిస్తూ.. త్వరలో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చన్నారు.‘భౌగోళిక రాజకీయపరమైన ఉద్రిక్తతలు మునుపటి దశాబ్దంలో చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ఆ తర్వాత ఒక శ్రేణికి పరిమితమయ్యాయి. కొన్ని ఆర్థిక వ్యవస్థల్లో చమురు అవసరాలు తగ్గడం ఇందుకు కారణం. గతంలో ప్రపంచ అనిశ్చితులను చమురు ధరలు ఎలా అయితే కొలమానంగా పనిచేశాయో.. ఇప్పుడు బంగారం ధరలు తీరు కూడా అలాగే ఉంది’ అని మల్హోత్రా వివరించారు.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
విదేశీ కంపెనీలకూ ప్రిజంప్టివ్ పన్ను పథకం
విదేశీ కంపెనీలకు సైతం ప్రిజంప్టివ్ పన్ను పథకాన్ని ప్రవేశపెట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ కీలక సూచన చేసింది. దీనివల్ల సులభత్వం, స్పష్టత ఏర్పడుతుందని పేర్కొంది. శాశ్వత ఏర్పాటుకు సంబంధించి వివాదాలకు ఐచ్ఛిక ప్రిజంప్టివ్ పన్ను విధానం ముగింపు పలుకుతుందని అభిప్రాయపడింది. ప్రిజంప్టివ్ పన్ను పథకం కింద.. కంపెనీల వాస్తవ లాభాలు, వ్యయాలతో సంబంధం లేకుండా స్థిర, ముందస్తుగా నిర్ణయించిన రేటుపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల కంపెనీలపై నిబంధన అమలు భారం తగ్గుతుంది.అకౌంట్ పుస్తకాలను నిర్వహించే భారం ఉండదు. విదేశీ కంపెనీలకు సైతం దీన్ని అమలు చేయడం వల్ల నిబంధనల అమలు భారం తగ్గుతుందన్నది నీతి ఆయోగ్ అభిప్రాయం. దీర్ఘకాలిక సమస్యకు ఇది ఆచరణాత్మక పరిష్కారం కాగలదని పేర్కొంది. అంతర్జాతీయంగా వ్యాపార సూచీల్లో భారత్ స్థానం మెరుగుపడుతుందని పేర్కొంది. ఈ సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ‘స్థిరమైన, స్పష్టమైన, ఊహించతగిన పన్ను విధానం అన్నది పెట్టుడులకు, ఆర్థిక వృద్ధికి ఎంతో అవసరం. పెట్టుబడిదారులకు లేదా వ్యాపారాలకు అనిశ్చితి అన్నది ఎంత మాత్రం మంచిది కాదు. 2047 నాటికి వికసిత్ భారత్గా అవతరించాలన్నది లక్ష్యం. ఇందుకు గాను వేగంగా వృద్ధి చెందాల్సి ఉంటుంది. ప్రజలకు తగినన్ని ఉపాధి అవకాశాలు చూపించాలి. వీటన్నింటికీ పెట్టుబడులు, ఊహాత్మక వ్యాపార వాతావరణం అవసరం’అని సుబ్రమణ్యం పేర్కొన్నారు.ఇదీ చదవండి: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల తగ్గింపునకు ప్రోత్సాహకం
బ్యాంకుల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను (గడువు తీరినా క్లెయిమ్ చేయకుండా ఉండిపోయినవి) తగ్గించేందుకు ఆర్బీఐ(RBI) ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఒక ఖాతా కార్యకలాపాల్లేకుండా (ఇనాపరేటివ్) ఉండిపోయిన కాలం, అందులో ఉన్న డిపాజిట్ ఆధారంగా బ్యాంకులకు ప్రోత్సాహకం చెల్లించనుంది. 4 ఏళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించి 5 శాతం లేదా రూ.5,000, అలాగే పదేళ్లకు పైగా కార్యకలాపాల్లేని ఖాతాలకు సంబంధించిన డిపాజిట్ల విలువలో 7.5 శాతం లేదా రూ.25,000 ఏది తక్కువ అయితే ఆ మేరకు బ్యాంకులకు ప్రోత్సాహంగా అందనుంది.ప్రస్తుతమున్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను అలాగే.. నిర్ణీత కాలం దాటిన తర్వాత డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ (డీఈఏ) ఫండ్కు బదిలీ అయ్యే ఇలాంటి డిపాజిట్లను తగ్గించడం లక్ష్యంగా పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. కస్టమర్లు/ డిపాజిటర్లు తమ ఖాతాలను తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు.. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను వారికి చెల్లించేందుకు వీలుగా బ్యాంకులను చురుగ్గా పనిచేయించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. ప్రస్తుత నిబంధనల కింద బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ లేకుండా 10 ఏళ్లకు మించిన డిపాజిట్లను డీఈఏ ఫండ్కు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇలా డీఈఏ కిందకు బదిలీ అయిన తర్వాత కూడా వాటిని డిపాజిటర్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.67,000 కోట్లుగా ఉన్నాయి. బంగారం తయారీదారులకు మూలధన రుణాలుబంగారం, వెండి ముడి పదార్థంగా వినియోగించే తయారీదారులకు సైతం మూలధన రుణాలను (అవసరం మేరకు) అందించేందుకు బ్యాంక్లను ఆర్బీఐ అనుమతించింది. ఇప్పటి వరకు జ్యుయలర్లకే ఈ వెసులుబాటు ఉండేది.ఇదీ చదవండి: తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు -
ఒడిదుడుకుల ప్రపంచానికి లంగరుగా భారత్
న్యూఢిల్లీ: ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచాన్ని స్థిరపర్చే లంగరుగా భారత్ కీలక పాత్ర పోషిస్తోందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండటం, విదేశీ మారక నిల్వలు సమృద్ధిగా ఉండటం, కరెంటు అకౌంటు లోటు నెమ్మదించడం, బ్యాంకులు..కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉండటం తదితర అంశాల దన్నుతో దేశ ఆర్థిక స్థితి పటిష్టంగా ఉందని ఆయన చెప్పారు. ‘ప్రభుత్వంలోని విధానకర్తలు, నియంత్రణ సంస్థలు, నియంత్రిత సంస్థల సమిష్టి కృషితో ఇది సాధ్యపడింది. ఇటీవల ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, పటిష్టమైన వృద్ధి బాటలో ఎకానమీ కుదురుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇదొక గొప్ప ఫీట్లాంటిదే‘ అని ఆయన పేర్కొన్నారు. కౌటిల్య ఎకనమిక్ కాంక్లేవ్ 2025లో పాల్గొన్న సందర్భంగా మల్హోత్రా ఈ విషయాలు చెప్పారు. అనేక దశాబ్దాలుగా నిర్మితమైన భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు మారినా సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు, ధరల కట్టడి, ఆర్థికాంశాలు, స్థిరమైన విధానాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ఇందుకు దోహదపడిందని ఆయన వివరించారు. ఇటీవలి పరపతి సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచిన ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనాలను 3.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గించింది. వర్షపాతం సాధారణంగా కన్నా అధిక స్థాయిలో ఉండటం, జీఎస్టీ రేట్లను క్రమబద్ధీకరించడం తదితర సానుకూలాంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. సెపె్టంబర్ 26తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 700.236 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
టెక్స్టైల్స్ పీఎల్ఐ స్కీమ్ గడువు పెంపు
న్యూఢిల్లీ: టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కేంద్రం పొడిగించింది. ఆగస్టులో మొదలుపెట్టిన మలి విడతలో మ్యాన్–మేడ్ ఫైబర్ (ఎంఎంఎఫ్) దుస్తులు, ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్ సహా వివిధ విభాగాల నుంచి దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమలో గణనీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ స్కీములో పాల్గొనేందుకు భావి ఇన్వెస్టర్లకు మరో అవకాశం కలి్పస్తున్నట్లు టెక్స్టైల్స్ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జౌళి పరిశ్రమ వృద్ధికి తోడ్పడటం, పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించడం లక్ష్యంగా 2021 సెపె్టంబర్ 24న ప్రభుత్వం ఈ స్కీమును ప్రకటించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద రూ. 28,711 కోట్ల పెట్టుబడుల హామీలతో 74 సంస్థలు ఎంపికయ్యాయి. -
ప్రపంచ ఆర్థిక స్థిరీకరణ శక్తిగా భారత్
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయని, ఆర్థిక ఆంక్షలు–టారిఫ్లు ప్రపంచ సరఫరా వ్యవస్థలను మార్చేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ తరుణంలోనూ భారత్ 8 శాతం వృద్ధిరేటును ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ‘కౌటిల్య ఆర్థిక సమావేశం 2025’ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. వాణిజ్యం, ఇంధన భద్రత పరంగా ప్రపంచం ఎంతో అసమతుల్యతలను చూస్తోందని, నిర్మాణాత్మక పరివర్తనం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఈ తరుణంలో భారత్ స్థిరీకరణ శక్తిగా నిలుస్తున్నట్టు చెప్పారు. వెలుపలి షాక్లను తట్టుకోగలదన్నారు. ‘‘2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు 8 శాతం మేర స్థిరమైన జీడీపీ వృద్ధికి చేరుకోవడం అవసరం. మనం చూస్తున్నది తాత్కాలిక అస్థిరతలు కాదు. నిర్మాణాత్మక మార్పు. ఒకప్పుడు బలమైన కూటములు అనుకున్నవి నేడు కాల పరీక్షను ఎదుర్కొంటున్నాయి. కొత్త కూటములు అవతరిస్తున్నాయి. కనుక కేవలం ప్రపంచ అస్థిరతలను ఎదుర్కోవడమే కాదు. వాణిజ్యం, ఇంధనం, ఆర్థిక అస్థిరతలతోనూ పోరాడాల్సి రావడం మనముందున్న సవాలు’’అని అని పేర్కొన్నారు. ప్రపంచ సంస్థలు బలోపేతం కావాలి.. అంతర్జాతీయ సంస్థలు (డబ్ల్యూటీవో, ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్ తదితర) బలోపేతం కావాల్సిన అవసరాన్ని మంత్రి సీతారామన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అవి నిరీ్వర్యమవుతుండడంతో ప్రపంచ విశ్వాసం సన్నగిల్లుతున్నట్టు చెప్పారు. ఇవి నేటి వాస్తవాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందన్నారు. దేశీయంగా సంస్కరణలు అమలు చేయడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమన్వయం చేసుకోవడం ద్వారా భారత్ పెరుగుతున్న సుంకాల అవరోధాలను, వాణిజ్య కూటముల్లో మార్పులను అధిగమించగలదని చెప్పారు. పెరిగిపోయిన ఉద్రిక్తతలు, అధిక సుంకాలు, విధానపరమైన తీవ్ర అనిశి్చతులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు మంత్రి తెలిపారు. అలాగే, పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం, పెరిగిపోయిన నిధుల వ్యయాలు, ఇంధన ధరల్లో అస్థిరతలు సైతం వేధిస్తున్నట్టు చెప్పారు. వీటన్నింటి మధ్య భారత్ స్థిరీకరణ శక్తిగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో భారత్ ద్రవ్య స్థిరీకరణ, మూలధన వ్యయాల నాణ్యతపై దృష్టి సారించినట్టు మంత్రి సీతారామన్ చెప్పారు. ‘‘జీడీపీలో వినియోగం, పెట్టుబడుల వాటా ఈ కాలంలో స్థిరంగా కొనసాగింది. భారత్ వృద్ధి దేశీ అంశాలపై బలంగా ఆధారపడి ఉంది. ఇది వెలుపలి షాక్లను పరిమితం చేస్తోంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది’’అని వివరించారు. -
గిఫ్ట్గా రూ.33 లక్షల కారు: అభిషేక్ శర్మపై పడే ట్యాక్స్ ఎంత?
2025 ఆసియా కప్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కింద భారత యువ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మకు 'హవల్ హెచ్9' అనే లగ్జరీ కారు గిఫ్ట్గా లభించింది. ఈ కారు ధర సుమారు రూ. 33 లక్షలు అని సమాచారం. క్రికెటర్లు గిఫ్ట్గా స్వీకరించే కార్లు, ఇతర విలాసవంతమైన వస్తువులు పూర్తిగా పన్ను రహితం కాదు. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. వాటి విలువపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ కథనంలో క్రికెటర్లు గిఫ్ట్గా అందుకునే కార్లపై ఎంత పన్ను చెల్లించాలి.. నియమాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం.భారతదేశంలోని క్రికెటర్లు తరచుగా విలాసవంతమైన గిఫ్ట్స్ అందుకుంటారు. టోర్నమెంట్ గెలిచినప్పుడు లేదా అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినప్పుడు కంపెనీలు, బ్రాండ్లు లేదా పారిశ్రామికవేత్తలు వారికి కార్లు, బైక్లు లేదా ఇతర విలాసవంతమైన వస్తువులను గిఫ్ట్గా ఇస్తారు. చాలా మంది ఈ గిఫ్ట్స్ పూర్తిగా ఉచితం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆదాయపు పన్ను నియమాలు వీటికి కూడా వర్తిస్తాయి.ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక వస్తువును గిఫ్ట్గా స్వీకరిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే దగ్గరి బంధువు నుంచి.. అంటే వారి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా తోబుట్టువుల నుంచి గిఫ్ట్ తీసుకుంటే, దానిపై పన్ను విధించబడదు. కానీ.. అదే గిఫ్ట్ కంపెనీ, బ్రాండ్, వ్యాపారవేత్త నుంచి వస్తే దానిపై పన్ను విధించబడుతుంది.ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!ఇక ట్యాక్స్ విషయానికి వస్తే.. చాలా మంది క్రికెటర్లు ఎక్కువగా సంపాదిస్తారు. కాబట్టి వీరు అత్యధిక పన్ను పరిధి(30 శాతం)లోకి వస్తారు. ఇది కాకుండా సెస్ కూడా యాడ్ అవుతుంది. మొత్తంగా 31.2 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి వీరు తీసుకునే గిఫ్ట్కు అదే పన్ను విధించబడుతుంది. ఉదాహరణకు, ఒక క్రికెటర్ రూ. 20 లక్షల విలువైన కారును గిఫ్ట్గా అందుకుంటే, అతను ఆ గిఫ్ట్పై సుమారు రూ. 6 లక్షల కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే అభిషేక్ శర్మ.. హవల్ హెచ్9 కారుకు రూ. 9 లక్షల కంటే ఎక్కువ ట్యాక్స్ చెల్లిచాలి. -
తయారీ రంగంలో వృద్ధికి వ్యూహాలు
ప్రపంచంలోనే చైనాను వెనక్కినెట్టి అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుంది. 2023 ఏప్రిల్ నాటికి భారతదేశ జనాభా చైనాను అధిగమించినట్లు కొన్ని నివేదికలు ధ్రువీకరించాయి. ఈ పరిణామం భారతదేశానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని సృష్టిస్తుంది. ఒకప్పుడు జనాభా పెరుగుదల ఆర్థికాభివృద్ధికి భారంగా కనిపించినప్పటికీ సరైన వ్యూహాలతో వ్యవహరిస్తే దేశ ఆర్థిక వృద్ధికి, వస్తు వినియోగానికి (Consumption), వాణిజ్య విస్తరణకు అనుకూలంగా దీన్ని మలచుకోవచ్చు.భారతదేశంలోని దాదాపు 145 కోట్ల జనాభాలో అధిక శాతం యువ జనాభా (సుమారు 47% మంది 25 ఏళ్ల లోపు వారు) ఉండటం దేశానికి అతిపెద్ద బలం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్గత వినియోగదారుల మార్కెట్ (Domestic Consumer Market)ను అందిస్తుంది. అనేక అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తుల విక్రయాల కోసం ఇప్పటికే భారత్పై ఆధారపడుతున్నాయి. ఎందుకంటే, భారతదేశంలో వస్తువులకు డిమాండ్ నిరంతరాయంగా ఉంటుంది. ఈ భారీ డిమాండ్ అంతర్జాతీయ వాణిజ్యపరమైన ఆటుపోట్లను తట్టుకోవడానికి దేశానికి ఒక స్థిరమైన ఆధారాన్ని ఇస్తుంది.జనాభా అధికంగా ఉన్న మరో దేశం చైనా ప్రారంభంలో తయారీ రంగంపై దృష్టి సారించి ప్రపంచ మార్కెట్ను ఆకర్షించింది. అయితే భారత్ మాత్రం మొదట్లో సేవల రంగం (Services Sector)పై ఆసక్తి చూపింది. ముఖ్యంగా ఐటీ, ఐటీ-బీపీఎం రంగాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించింది. ప్రస్తుతం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సేవల రంగం వాటా 55% కంటే ఎక్కువగా ఉంది. ఈ సేవల రంగం సాధించిన ప్రగతిని ఇప్పుడు తయారీ రంగం (Manufacturing Sector) వృద్ధికి అనుసంధానించడం తక్షణావసరంగా తోస్తుంది.తయారీ రంగం బలోపేతానికి చర్యలుఅధిక జనాభాను వస్తు వినియోగానికి తోడ్పడేలా, దీని ద్వారా వాణిజ్య పరంగా దేశం అభివృద్ధి చెందేందుకు భారతదేశం వ్యూహాత్మక చర్యలను చేపట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’పై పెట్టుబడులు పెంచాలి. అంతర్గత మార్కెట్తో పాటు, చైనా తరహాలో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ ఎదగాలి. దీనికి ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు (Production Linked Incentive - PLI Schemes)’ను మరింత విస్తృతం చేయాలి.గ్లోబల్ సరఫరా చెయిన్లో (Global Supply Chain) వైవిధ్యం కోరుకునే ప్రపంచ కంపెనీలను ఆకర్షించేలా స్థిరమైన, పారదర్శకమైన విధానాలను అమలు చేయాలి. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్ వంటి అధిక విలువ కలిగిన రంగాలపై దృష్టి సారించాలి.భారత్లో తయారయ్యే ఉత్పత్తులు ప్రపంచ స్థాయి నాణ్యత (Global Quality Standards) కలిగి ఉండేలా కఠినమైన ప్రమాణాలను అమలు చేయాలి.వినియోగం నుంచి ఉత్పత్తి వైపు..భారతదేశంలోని అధిక జనాభా కేవలం వినియోగదారులుగా కాకుండా, అత్యంత సమర్థవంతమైన ఉత్పాదక శక్తి (Productive Force)గా మారాలి. తయారీ రంగం అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడం, సాంకేతిక విద్య (Vocational Training)పై ఎక్కువ పెట్టుబడి పెట్టడం అవసరం. యువ జనాభా వరం కావాలంటే, వారికి ఉపాధి కల్పన (Employment Generation) జరగాలి. తక్కువ రవాణా ఖర్చులు, వేగవంతమైన వస్తు రవాణా కోసం మెరుగైన రోడ్లు, పోర్టులు, లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ఇది తయారీ రంగ ఖర్చులను తగ్గించి గ్లోబల్ మార్కెట్లో పోటీ పడేందుకు వీలు కల్పిస్తుంది.వాణిజ్యపరమైన సవాళ్లను ఎదుర్కోవడంయూఎస్ వంటి దేశాలు భారత్పై సుంకాలు విధించినప్పటికీ అధిక జనాభా ఉన్న చైనాపై ఆ చర్యలు తీసుకోకపోవడం అనేది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో భారత్ ఎదుర్కొంటున్న సంక్లిష్టతను సూచిస్తుంది. ప్రపంచ ఆర్థిక శక్తులతో (యూఎస్, యూరోపియన్ యూనియన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (Free Trade Agreements - FTAs) చర్చించి వాణిజ్య అవరోధాలను తగ్గించుకోవాలి. ప్రపంచ కంపెనీలు చైనాకు ప్రత్యామ్నాయంగా చూస్తున్న ‘చైనా ప్లస్ వన్’ వ్యూహాన్ని భారత్ అనుకూలంగా మలచుకోవాలి. రాజకీయంగా స్థిరమైన, ఆర్థికంగా ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా భారత్ తనను తాను నిరూపించుకోవాలి.గ్రామీణ వినియోగాన్ని పెంచడంభారతదేశ జనాభాలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. గ్రామీణ ఆదాయం పెరిగితే, అంతర్గత వస్తు వినియోగం అమాంతం పెరుగుతుంది. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పాదకతను, రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా గ్రామీణ డిమాండ్ ఊపందుకునేలా చేయాలి. ఇది తయారీ రంగ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ను అందిస్తుంది.భారతదేశానికి అధిక జనాభా అనేది ఒక భారీ సామర్థ్యం ఉన్న వనరుగా గుర్తుంచుకోవాలి. ఈ జనాభా శక్తిని కేవలం వినియోగంగానే కాకుండా ఉత్పాదకత, వాణిజ్య శక్తిగా మార్చగలగాలి. తయారీ రంగంపై దృష్టి సారించి, యువతకు సరైన నైపుణ్యాలు అందించి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. చైనా తయారీ రంగాన్ని ఎంచుకున్నట్లుగా భారత్ కూడా తన సేవల రంగాన్ని బలంగా ఉంచుతూనే తయారీ రంగానికి కొత్త ఊపిరి పోయడం ద్వారా సుస్థిరమైన, సమ్మిళిత వృద్ధి సాధిస్తుంది.ఇదీ చదవండి: టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే.. -
టూరిస్టు వీసాపై సౌదీ వెళ్తున్నారా? ఇవి తెలియకపోతే అంతే..
ముస్లింలు పవిత్రంగా భావించే మక్కా యాత్రలో ఉమ్రాహ్కు ప్రత్యేకత ఉంది. రంజాన్ పర్వదినం తర్వాత హజ్ యాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో తబాబ్, అరాఫత్ పర్వత సందర్శన.. సైతానుపై రాళ్లను విసరడం.. అక్కడే ఒక నిద్ర చేయడం వంటి క్రతువులు ఉంటాయి. హజ్ సీజన్లో కాకుండా.. మక్కా యాత్ర చేయడాన్ని ఉమ్రాహ్ అంటారు. ఇప్పుడు ఉమ్రాహ్ విషయంలో సౌదీ సర్కారు కొత్త నిబంధనలను ప్రకటించింది. టూరిస్టు వీసాపై వచ్చేవారికి ఉమ్రాహ్కు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.ఏమిటీ ఉమ్రాహ్హజ్లో మాదిరిగానే ఉమ్రాహ్లోనూ క్రతువులుంటాయి. అయితే.. అరాఫత్ సందర్శన, సైతానుపై రాళ్లు వేయడం ఉండదు. ఉమ్రాహ్కు వెళ్లేవారు దోవతి, ఉత్తరీయం మాదిరి తెలుపురంగు దుస్తులను ధరించాలి. దీన్ని దీక్షగా భావిస్తారు. నిజానికి మక్కాకు 30కిలోమీటర్ల దూరంలోనే ఈ రీతిలో వస్త్రధారణ చేసి.. యాత్రను ప్రారంభించాలి. భారతీయులు మాత్రం విమానాశ్రయంలోనే ఈ దుస్తులను ధరిస్తారు. మక్కాలోని కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశాక.. బయటకు వచ్చి, శిరోముండనం చేయించుకుంటే.. ఉమ్రాహ్ పూర్తవుతుంది. మహిళా భక్తులు శిరోముండనం చేయించుకోరు. కానీ, మూడు లేదా ఐదు కత్తెరలు ఇస్తారు.ఉమ్రాహ్ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి విదేశాల నుంచి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన మార్పులను అసా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ కైసర్ మహమూద్ తెలిపారు.వీసా దరఖాస్తు చేసేటప్పుడే వసతి బుకింగ్యాత్రికులు ఇకపై వసతిని ధ్రువీకరించకుండా ఉమ్రాహ్ వీసా కోసం దరఖాస్తు చేసుకోలేరు. నుసుక్ యాప్కు అనుసంధానించబడిన మసర్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు వీసా దరఖాస్తు సమయంలో ఆమోదించిన హోటల్ను ఎంచుకోవాలి. లేదా వారు సౌదీ అరేబియాలోని బంధువులతో ఉంటారని ధ్రువీకరించుకోవాలి. హోటళ్లు, రవాణా మసర్ అని పిలువబడే సౌదీ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. టాక్సీలను కూడా పోర్టల్ ద్వారానే బుక్ చేసుకోవాలి.బంధువులతో ఉండటానికి హోస్ట్ ఐడీ అవసరంప్రయాణికులు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఉండాలని ప్లాన్ చేస్తే హోస్ట్ ఏకీకృత సౌదీ ఐడీ నంబర్ను అందించాలి. ఈ ఐడీ మీ వీసాకు డిజిటల్కు అటాచ్ చేస్తారు. ప్లాన్లో ఏదైనా మార్పు ఉంటే వసతి రుజువుగా అదే ఐడీతో సిస్టమ్లో అప్ డేట్ చేయాలి.టూరిస్ట్ వీసాలపై ఉమ్రాహ్ చేయకూడదు..టూరిస్ట్ వీసాపై ఉమ్రాహ్ చేయడం నిషేధించారు. ఒకవేళ ఇందుకోసం ప్రయత్నించే యాత్రికులను మదీనాలోని రియాజ్ ఉల్ జన్నా వంటి కీలక ప్రదేశాల్లో ప్రవేశం నిరాకరిస్తారు.డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా తప్పనిసరినుసక్ ప్లాట్ఫామ్ ద్వారా లేదా లైసెన్స్ పొందిన ఆపరేటర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న డెడికేటెడ్ ఉమ్రాహ్ వీసా మాత్రమే చెల్లుబాటు అవుతుంది.ప్రయాణ మార్పులు అనుమతించరు..వీసా దరఖాస్తు సమయంలో యాత్రికులందరూ వివరణాత్మక ప్రయాణ ప్రణాళికను అప్లోడ్ చేయాలి. దీన్ని సబ్మిట్ చేసిన తరువాత ఎలాంటి మార్పులు లేదా వాయిదాలకు అవకాశం ఉండదు. ప్రయాణ తేదీలను మార్చడం కుదరవు. తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేస్తే ఏజెంట్లకు ఒక్కొక్కరికి కనీసం 734(రూ.18 వేలు) దిర్హమ్లు జరిమానా విధిస్తారు.వీసా ఆన్ అరైవల్యూకే, యూఎస్, కెనడా లేదా షెంజెన్ వీసాలు కలిగి ఉన్నవారు లేదా ఆ దేశాల్లో నివాసితులుగా ఉన్నవారు వీసా ఆన్ అరైవల్ కోసం అర్హులు. ఈ వీసా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది.హోటల్, ట్రాన్స్పోర్ట్ బుకింగ్స్ కోసం తనిఖీలుసౌదీ విమానాశ్రయాల్లో అధికారులు నుసక్ లేదా మసార్ వ్యవస్థల ద్వారా చేసిన అన్ని బుకింగ్లను ధ్రువీకరిస్తారు. చెల్లని బుకింగ్లు తిరస్కరిస్తారు. దాంతోపాటు అక్కడికక్కడే జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.అధీకృత రవాణాకు మాత్రమే అనుమతియాత్రికులు రవాణాను ముందస్తుగా బుక్ చేసుకోవాలి. టాక్సీలు, బస్సులు లేదా హరమైన్ రైలుతో సహా అధీకృత ఛానెళ్ల ద్వారా ముందే బుక్ చేయాలి. రిజిస్టర్ కాని సర్వీసులు అనుమతించరు.హరామైన్ రైలు టైమింగ్స్మక్కా, మదీనా మధ్య సులువైన రవాణా మార్గం అయిన హరామైన్ హై-స్పీడ్ రైలు ప్రతిరోజూ రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తుంది. దీని తర్వాత వచ్చే ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ రవాణాను ఏర్పాటు చేయాలి.భారీ జరిమానాలుఈ కొత్త నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే.. అంటే ఎక్కువ కాలం ఉండటం, అనధికార రవాణాను ఉపయోగించడం లేదా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేయడం.. వంటి వాటికి కనీసం 734 దిర్హమ్ల నుంచి జరిమానాలు ఉంటాయి. ఏజెంట్లను కూడా సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది.ఇదీ చదవండి: లద్ధాఖ్లో వాణిజ్య అవకాశాలు ఇవే.. -
లద్ధాఖ్లో వాణిజ్య అవకాశాలు ఇవే..
లద్ధాఖ్లో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2019లో జమ్మూ కశ్మీర్ రాష్ట్రం నుంచి లద్ధాఖ్ను వేరు చేసి కేంద్రపాలిత ప్రాంతంగా (Union Territory - UT) ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి ప్రజల్లో ఆందోళనలు పెరిగాయి. ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలు, ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు ఈ ప్రాంతంలోని అసంతృప్తి తీవ్రతను సూచిస్తున్నాయి.ఇటీవల పరిణామాలులద్ధాఖ్లోని లేహ్ అపెక్స్ బాడీ (LAB), కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ (KDA) వంటి పౌర సమాజ సంస్థల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ నాయకత్వంలో కూడా నిరసనలు ఉధృతమయ్యాయి.నిరసనలకు కారణాలేమిటి?లద్ధాఖ్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth Schedule) కింద రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శనలు జరిగాయి. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో పోలీసు కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు మరణించారు. ఆందోళనకారులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు (సోనమ్ వాంగ్చుక్ వంటి వారిని అరెస్ట్ చేయడం వంటివి) లద్ధాఖ్లో ఉద్రిక్తతను పెంచాయి. కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత శాసనసభ (Legislature) లేకపోవడం, స్థానిక పాలనపై లెఫ్టినెంట్ గవర్నర్ (LG) ఆధ్వర్యంలోని అధికారుల నియంత్రణ పెరగడం పట్ల స్థానిక ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.రాజ్యాంగ రక్షణ లేదనే వాదనలులద్ధాఖ్ జనాభాలో 97% పైగా గిరిజనులే (Tribal Population). ఆర్టికల్ 370 రద్దు తర్వాత బయటి వ్యక్తులు ఇక్కడ భూమిని కొనుగోలు చేస్తారనే భయం స్థానికుల్లో ఉంది. లద్ధాఖ్ను ఆరో షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది వారికి భూమి వినియోగం, వనరుల నిర్వహణ, సాంప్రదాయ చట్టాలపై నియంత్రణను ఇచ్చేందుకు అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కు (Autonomous District Councils - ADCs) అధికారం కల్పిస్తుంది. తద్వారా పర్యావరణాన్ని, సాంస్కృతిక గుర్తింపును పరిరక్షించవచ్చు.ప్రభుత్వం ప్రతిపాదించిన మెగా సోలార్ పార్కులు, సొరంగాల నిర్మాణం (tunnels), విస్తృతమైన రహదారులు వంటి పెద్ద పారిశ్రామిక ప్రాజెక్టుల వల్ల లద్ధాఖ్ సున్నితమైన పర్యావరణ వ్యవస్థకు, మంచు పర్వతాలకు నష్టం జరుగుతుందని ప్రజలు భయపడుతున్నారు.శాసనసభ లేకపోవడం వల్ల స్థానిక రాజకీయ శక్తి తగ్గిపోయిందని, తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, చట్టాలను రూపొందించుకోవడానికి రాష్ట్ర హోదా అవసరమని డిమాండ్ చేస్తున్నారు.యువతలో నిరుద్యోగం (Unemployment) అధికంగా ఉంది. స్థానిక ఉద్యోగాల్లో డొమిసైల్ (Domicile) ఆధారంగా పూర్తిస్థాయి రక్షణ లేకపోవడం, ప్రభుత్వం నుంచి సరైన నియామక విధానాలు రూపొందించకపోవడం అసంతృప్తికి దారితీసింది.కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత లేహ్, కార్గిల్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ (LAHDCs) అధికారాలు తగ్గిపోయాయని, కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన అధికారులు స్థానిక పాలనలో ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.ఎలాంటి చర్యలు చేపట్టాలి?లద్ధాఖ్ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడానికి కేంద్ర ప్రభుత్వం, స్థానిక నాయకుల మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడం చాలా ముఖ్యమని కొందరు భావిస్తున్నారు.ఆరో షెడ్యూల్ అమలులద్ధాఖ్ డిమాండ్ చేసిన విధంగా ఆరో షెడ్యూల్ను అమలు చేయడం లేదా దానికి సమానమైన ప్రత్యేక రాజ్యాంగ రక్షణను (ఉదాహరణకు, ఆర్టికల్ 371 తరహాలో) రూపొందించడం. ఇది భూమి, వనరులు, సాంస్కృతిక అంశాలపై స్థానిక కౌన్సిల్స్కు చట్టబద్ధమైన అధికారాన్నిస్తుంది. రాష్ట్ర హోదా డిమాండ్పై పారదర్శకమైన చర్చలు ప్రారంభించాలని కొందరు చెబుతున్నారు.స్థానిక సాధికారతఅటానమస్ హిల్ కౌన్సిల్స్కు శాసనపరమైన, ఆర్థికపరమైన అధికారాలను పెంచాలి. తద్వారా స్థానిక ప్రజల భాగస్వామ్యం పెరిగి అభివృద్ధి నిర్ణయాలు వారి అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. స్థానికుల కోసం ఉద్యోగాలను రిజర్వ్ చేయడంతోపాటు, లద్ధాఖ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేయాలి.సుస్థిర అభివృద్ధిభారీ ప్రాజెక్టులను చేపట్టే ముందు పర్యావరణ ప్రభావ అంచనా (Environmental Impact Assessment)ను పారదర్శకంగా, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలి. పర్యావరణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగంలో పరిమితులను విధించడం, స్థానికులను ప్రోత్సహించే పర్యావరణ పర్యాటక (Ecotourism) విధానాలను అమలు చేయాలి.వాణిజ్యం పరంగా ఎలాంటి అవకాశాలున్నాయి?రంగంవాణిజ్య అవకాశాలుపర్యాటకంసాహస పర్యాటకంలో భాగంగా ట్రెక్కింగ్, పర్వతారోహణ కీలకంగా ఉంది. బౌద్ధ ఆశ్రమాలు, సాంప్రదాయ ఉత్సవాలు ఉన్నాయి. దాంతో పర్యావరణ అనుకూల గెస్ట్హౌజ్లు వ్యాపారం సాగుతోంది.పునరుత్పాదక శక్తిలద్దాఖ్లో అధిక సూర్యరశ్మి ఉంటుంది. కాబట్టి భారీ సోలార్ పార్కులు, సోలార్ ప్యానెల్ తయారీ పరిశ్రమలకు అపారమైన అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో పవన విద్యుత్ ఉత్పత్తికి కూడా అవకాశం ఉంది.వ్యవసాయం, ఉద్యానవనంపండ్ల ప్రాసెసింగ్ యూనిట్లు (జామ్లు, జ్యూస్లు, నూనెలు)కు అవకాశం. బెర్రీల ప్రాసెసింగ్ ద్వారా జ్యూస్లు, నూనెలు తయారు చేయడం.చేనేత, హస్తకళలుప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యమైన పష్మినా ఉన్ని లద్దాఖ్ నుంచి లభిస్తుంది. పష్మినా ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ ఎగుమతికి అవకాశం. బుద్ధ విగ్రహాలు, థాంకా పెయింటింగ్లు వంటి సాంప్రదాయ హస్తకళల మార్కెటింగ్ ప్రధానంగా ఉంది. చివరగా..లద్ధాఖ్ సమస్యల పరిష్కారం కేవలం పాలనాపరమైన చర్యలతోనే సాధ్యం కాదు. స్థానిక ప్రజల అభీష్టాన్ని గౌరవించి, వారి ప్రత్యేక సంస్కృతిని, సున్నితమైన పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా సుస్థిర అభివృద్ధి నమూనాను (Sustainable Development Model) రూపొందించడం ద్వారానే ఈ ప్రాంతంలో శాంతి, పురోగతి సాధ్యమవుతాయి.ఇదీ చదవండి: అప్పు చేసి పప్పుకూడు! -
విదేశీ రుణం 747 బిలియన్ డాలర్లు
ముంబై: భారత్ విదేశీ రుణ భారం (ఎక్స్టర్నల్ డెట్) 2025 జూన్ నాటికి 747.2 బిలియన్ డాలర్లకు చేరింది. 2025 మార్చి నుంచి 11.2 బిలియన్ డాలర్లు పెరిగింది. జీడీపీలో విదేశీ రుణ భారం నిష్పత్తి మాత్రం 2025 మార్చి నాటికి ఉన్న 19.1 శాతం నుంచి 18.9 శాతానికి తగ్గినట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది.డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించడం విదేశీ రుణ భారం అధికంగా పెరగడానికి దారితీసింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి జూన్ చివరికి రూపాయి మారకం విలువ ప్రభావాన్ని మినహాయించి చూస్తే నికరంగా పెరిగిన విదేశీ రుణ భారం 6.2 బిలియన్ డాలర్లుగానే ఉంది.మొత్తం విదేశీ రుణ భారంలో స్వల్పకాల రుణం 18.3 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది. మొత్తం విదేశీ రుణ భారంలో డాలర్ రూపంలో తీసుకున్నది 53.8 శాతంగా ఉంది. రూపాయి మారకంలో రుణ భారం 30.6 శాతం, యెన్ రూపంలో 6.6 శాతం, సింగపూర్ డాలర్ రూపంలో 4.6 శాతం, యూరో మారకం రూపంలో 3.5 శాతం చొప్పున ఉంది. -
జీఎస్టీ సంస్కరణలు వృద్ధిని బలపరుస్తాయ్
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ తాజా సంస్కరణలు సానుకూల ప్రభావం చూపిస్తాయని ఆర్బీఐ బులెటిన్ అభిప్రాయపడింది. వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని, రిటైల్ ధరలు దిగొస్తాయని, వినియోగం బలపడుతుందని పేర్కొంది. అమెరికా విధించిన ప్రతీకార సుంకాలతో అనిశ్చితులు ఏర్పడినట్టు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో (క్యూ1) జీడీపీ వృద్ధి ఐదు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరి తన బలాన్ని చాటినట్టు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో స్వల్పంగా పెరిగినప్పటికీ ఆర్బీఐ లక్ష్యానికంటే ఎంతో దిగువనే ఉన్నట్టు గుర్తు చేసింది. వ్యవస్థలో లిక్విడిటీ (నగదు లభ్యత) మిగులు ఉన్నట్టు తెలిపింది. క్యూ1లో కరెంట్ ఖాతా లోటు గతేడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే మోస్తరు స్థాయికి చేరినట్టు, సేవల ఎగుమతులు బలంగా ఉండడం, రెమిటెన్స్లు (విదేశాల నుంచి నగదు బదిలీలు) ఇందుకు సాయపడినట్టు బులెటిన్లో పేర్కొంది. జీఎస్టీ తాజా సంస్కరణలు చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు, జీఎస్టీలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గిస్తుందని, పన్ను నిబంధనల అమలును పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ల నుంచి 45 శాతం ఎగుమతులకు మినహాయింపు కల్పించడాన్ని ప్రస్తావించింది. సుంకాల ప్రభావం రంగాలవారీగా ఉండొచ్చని పేర్కొంది. వాణిజ్య అనిశ్చితులు నెలకొన్నప్పటికీ ఎగుమతులు బలంగా ఉండడాన్ని గుర్తు చేసింది. తయారీ, సేవల రంగాల పనితీరు దశాబ్ద గరిష్టానికి చేరినట్టు తెలిపింది. -
మళ్లీ ముకేశ్ నంబర్ వన్!
ముంబై: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి దేశంలోకెల్లా ధనవంతుడిగా నిలిచారు. 2025 ఎం3ఎం హురున్ ఇండియా బిలియనీర్ జాబితా ప్రకారం అంబానీ సంపద 6 శాతం క్షీణించి రూ. 9.55 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ 2025లో దేశీయంగా అపర కుబేరుడిగా అవతరించారు. దీంతో అదానీ గ్రూప్ చీఫ్ గౌతమ్ అదానీ రూ. 8.14 లక్షల కోట్ల సంపదతో దేశీ బిలియనీర్లలో రెండో ర్యాంకుకు పరిమితమయ్యారు. గతేడాది అదానీ సంపద 95 శాతం జంప్చేసి రూ. 11.6 లక్షల కోట్లను తాకడంతో అంబానీని అధిగమిస్తూ టాప్ చెయిర్ను పొందిన సంగతి తెలిసిందే. నిజానికి యూఎస్ షార్ట్సెల్లర్ హిండెన్బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ షేర్లు పతనమైనప్పటికీ తిరిగి నష్టాలు రికవర్ అయ్యాయి. కాగా.. తొలిసారి హెచ్సీఎల్ గ్రూప్ రోష్నీ నాడార్ మల్హోత్రా టాప్–3లో చోటు సాధించారు. రూ. 2.84 లక్షల కోట్ల సంపదతో మూడో ర్యాంకులో నిలవగా.. సైరస్ పూనావాలా, ఆయన కుటుంబం రూ. 2.46 లక్షల కోట్లతో నాలుగో ర్యాంకులో కొనసాగుతున్నారు. ఈ బాటలో కుమార మంగళం బిర్లా రూ. 2.32 లక్షల కోట్ల సంపదతో ఐదో ర్యాంకులో నిలిచారు. నీరజ్ బజాజ్, ఆయన కుటుంబం సంపద 43 శాతం జంప్చేసి రూ. 2.33 లక్షల కోట్లకు చేరడం ద్వారా నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకుకు చేరుకున్నారు. దేశ జీడీపీలో హురున్ జాబితాలో చోటుచేసుకున్న బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ. 167 లక్షల కోట్లుగా నమోదైంది. ఇది దేశ జీడీపీలో దాదాపు సగానికి సమానం. జాబితాలో రూ. 1,000 కోట్ల సంపదతో 1,687 మంది వ్యక్తులు స్థానం పొందగా.. ఈ సంఖ్య 284 పెరిగింది. వీరిలో 148 కొత్తగా చోటు సాధించారు. గత రెండేళ్లుగా భారత్లో ప్రతీ వారం ఒక బిలియనీర్ ఆవిర్భవిస్తున్నట్లు హురున్ పేర్కొంది. దీంతో జాబితాలో చోటు పొందినవారిద్వారా ప్రస్తుతం రోజుకి రూ. 1,991 కోట్ల సంపద జమవుతున్నట్లు తెలియజేసింది. కాగా.. పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ రూ. 21,190 కోట్లతో జాబితాలో స్థానాన్ని పొందారు. తద్వారా యువ బిలియనీర్గా నిలిచారు. యువ బిలియనీర్లలో ఓయో వ్యవస్థాపకుడు 31 ఏళ్ల రితేష్ అగర్వాల్ సైతం రూ. 14,400 కోట్ల నెట్వర్త్తో పిన్నవయస్కుడిగా జాబితాలో చోటు సాధించారు.జెప్టో వ్యవస్థాపకులకు చోటుహురున్ తాజా జాబితాలో ఈకామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో సహవ్యవస్థాపకులు 23 ఏళ్ల ఆదిత్ పాలిచా, 22 ఏళ్ల కైవల్య వోహ్రా చోటు సంపాదించారు. బిలియనీర్లలో పిన్న వయసు్కలు(జెన్ జెడ్)గా నిలిచారు. 2021లో ఏర్పాటైన జెప్టో వేగంగా వృద్ధి చెందడంతో వోహ్రా సంపద రూ. 4,480 కోట్లకు చేరగా, పాలిచా నెట్వర్త్ రూ. 5,380 కోట్లను తాకింది. కంపెనీ విలువ 5.9 బిలియన్ డాలర్లకు చేరింది. రూ. 1,140 కోట్ల సంపదతో ఎస్జీ ఫిన్సర్వ్ వ్యవస్థాపకుడు రోహన్ గుప్తా, ఆయన కుటుంబం సైతం చోటు సాధించారు. -
జీఎస్టీ వసూళ్లు 9 శాతం అప్
న్యూఢిల్లీ: గత నెల(సెప్టెంబర్)లో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు 9 శాతం ఎగశాయి. రూ. 1.89 లక్షల కోట్లను తాకాయి. గత నెల 22 నుంచి జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచి్చన నేపథ్యంలో తాజా వసూళ్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతక్రితం నెల(ఆగస్ట్)తో పోలిస్తే 1.5 శాతం పుంజుకోగా.. 2024 సెప్టెంబర్తో చూస్తే 9%పైగా వృద్ధి నమోదైంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం స్థూల వసూళ్లు 1.89 లక్షల కోట్లకు చేరాయి. 2024 సెప్టెంబర్లో రూ. 1.73 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ రేట్లు, శ్లాబులను క్రమబదీ్ధకరించడంతో వసూళ్లలో వృద్ధి నమోదైంది. రేట్ల మార్పు ప్రభావంతో కిచెన్ అప్లయెన్సెస్తోపాటు.. ఎల్రక్టానిక్స్వరకూ 375 వస్తువుల ధరలు చౌకయ్యాయి. వీటిలో ఔషధాలు, ఆటోమొబైల్స్ సైతం చేరాయి. జీఎస్టీ తగ్గడంతో పలు ప్రొడక్టులకు డిమాండ్ పుంజుకుంది. -
మల్హోత్రా.. మరో‘సారీ’!
ముంబై: ఒకవైపు అమెరికా విధించిన 50 శాతం టారిఫ్లతో ఎగుమతులకు ఏర్పడిన అవరోధాలు, హెచ్1బీ వీసా నిబంధనల కట్టడి.. మరోవైపు గతంలో చేపట్టిన రేట్ల తగ్గింపు ఫలితం పూర్తి స్థాయిలో కనిపించాల్సి ఉండడం, ఇటీవలి జీఎస్టీ రేట్ల తగ్గింపు, రూపాయి విలువ పతనం నేపథ్యంలో ఆర్బీఐ వరుసగా రెండో విడత కీలక రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను గతంలో వేసిన 6.5% నుంచి 6.8 శాతానికి పెంచింది. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగిరావడం రేట్ల తగ్గింపు పరంగా వెసులుబాటు కలి్పంచినప్పటికీ.. దీనికంటే ముందు గతంలో తీసుకున్న చర్యల తాలూకూ ఫలితంపై పూర్తి స్థాయి స్పష్టత అవసరమని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలసీ భేటీ తర్వాత మీడియాకు తెలిపారు. అమెరికా టారిఫ్ల నుంచి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు ఎదురైతే రానున్న నెలల్లో రేట్ల తగ్గింపుతో మద్దతుగా నిలుస్తామని సంకేతం ఇచ్చారు. ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు సైతం రేట్ల తగ్గింపునకు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఆర్థిక స్థిరత్వంతో పాటు, వృద్ధికి విఘాతం ఉండకూడదన్నారు. యూపీఐ లావాదేవీలపై ఎలాంటి చార్జీలు వసూలు చేసే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. వృద్ధి బలంగా..: ఎగుమతుల డిమాండ్ బలహీనంగా ఉన్నప్పటికీ.. వర్షాలు సమృద్ధిగా కురవడం, తక్కువ ద్రవ్యోల్బణం, గతంలో రెపో రేటు తగ్గింపు, జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా ఏర్పడే సానుకూల ప్రయోజనంతో దేశ వృద్ధి అవకాశాలు బలంగా ఉన్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. 2025–26 సంవత్సరంలో జీడీపీ 6.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆగస్ట్ సమీక్షలో ఈ అంచనా 6.5 శాతంగా ఉంది. వాణిజ్యపరమైన అనిశ్చితుల నేపథ్యంలో క్యూ3 (అక్టోబర్–డిసెంబర్), ఆ తర్వాతి కాలానికి వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. 2025–26 క్యూ1లో (జూన్ త్రైమాసికం) జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం తెలిసిందే. క్యూ2లో (సెపె్టంబర్ త్రైమాసికం) 7%, క్యూ3లో 6.4%, క్యూ4లో 6.2 శాతం చొప్పున ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. అమెరికా విధించిన టారిఫ్లతో ఎగుమతులు మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఎగుమతిదారులకు అండ.. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఎగుమతిదారులకు అండగా ఆర్బీఐ పలు చర్యలు ప్రకటించింది. ‘ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్’ (ఐఎఫ్ఎస్సీ)లోని ఫారిన్ కరెన్సీ అకౌంట్ల నుంచి నిధులను స్వదేశానికి బదిలీ చేసేందుకు ఇప్పటి వరకు ఉన్న నెల గడువును మూడు నెలలకు పొడిగించింది. వస్తు వాణిజ్య లావాదేవీలకు సంబంధించి చెల్లింపుల గడువును నాలుగు నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. ఇక చిన్న తరహా ఎగుమతి/దిగుమతిదారులకు నిబంధనల అమలు భారాన్ని తగ్గించే చర్యలను సైతం ప్రకటించింది. రూపాయి అంతర్జాతీయం అంతర్జాతీయంగా రూపాయి ప్రాతినిధ్యాన్ని పెంచే చర్యలను సైతం ఆర్బీఐ ప్రకటించింది. భూటాన్, నేపాల్, శ్రీలంక దేశ వాసులకు ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి మారకంలో రుణాల మంజూరుకు బ్యాంక్లను అనుమతించింది.ముఖ్యాంశాలు..→ రెపో రేటును 5.5 శాతం వద్ద కొనసాగించేందుకు ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రివర్స్ రెపో రేటు సైతం 3.35 శాతంగా కొనసాగుతుంది. → భవిష్యత్తులో పరిస్థితులకు అనుగుణంగా రేట్లపై ఎటువంటి చర్యను అయినా చేపట్టేందుకు వీలుగా తటస్థ విధానాన్నే కొనసాగించింది. → ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఆర్బీఐ 1 శాతం రెపో రేటును తగ్గించింది. ఆగస్ట్ సమీక్ష నుంచి యథాతథ స్థితిని కొనసాగిస్తోంది. → 2025–26 సంవత్సరానికి ద్రవ్యోల్బణం అంచనాను 2.6 శాతానికి తగ్గించింది. 4 శాతం నిర్దేశిత లక్ష్యం కంటే ఇది తక్కువే. లోగడ ఇది 3.1 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా. ఆగస్ట్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా ఉంది. → సేవల ఎగుమతులు, విదేశాల నుంచి స్వదేశానికి నిధుల బదిలీ (రెమిటెన్స్లు) దన్నుతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోనే ఉంటుంది.→ ఆర్బీఐ తదుపరి సమీక్ష సమీక్ష డిసెంబర్ 3–5 వరకు జరుగుతుంది. -
ఉద్యోగులకు డీఏ పెంపు?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ఈ రోజు జరుగుతున్న సమావేశంలో పరిశీలించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సవరించిన డీఏ ఆమోదం పొందితే జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దాంతో దాదాపు కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నారు.కరువు భత్యం(డీఏ) అనేది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల గృహ ఖర్చులపై ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పూడ్చడానికి చెల్లించే జీవన వ్యయ సర్దుబాటు. ఈ రోజు జరుగుతున్న సమావేశంలో కేబినెట్ దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై నిర్ణయం వెలువడితే ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బంది ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుంది.పారిశ్రామిక కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) డేటా ఆధారంగా సిఫార్సులకు అనుగుణంగా ఈ పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. సంవత్సరానికి రెండుసార్లు డీఏ సవరణలను లెక్కిస్తారు. పెరుగుతున్న ధరలను నిర్వహించడానికి ఉద్యోగులకు సహాయపడటానికి డీఏను సాధారణంగా ఏటా జనవరి, జులైలో సవరిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం మార్చిలో మూల వేతనం, పింఛన్లలో డీఏ 2% పెంపునకు ఆమోదం తెలిపింది. దీన్ని 53% నుంచి 55%కి పెంచింది. ఉదాహరణకు రూ.50,000 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగికి చివరి పెంపు తర్వాత రూ.26,500 డీఏ చెల్లిస్తున్నారు.ఇదీ చదవండి: సైబర్ నేరాలకు చెక్ పెట్టేలా ఆర్బీఐ చర్యలు -
అమెరికా షట్డౌన్తో భారత వాణిజ్యంపై ప్రభావం ఎంత?
అమెరికా ప్రభుత్వం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలో ఆరేళ్ల తర్వాత షట్డౌన్లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో భారత వాణిజ్యంపై పడే ప్రభావాల గురించి చర్చ జరుగుతోంది. అమెరికా షట్డౌన్ ప్రభావం భారత వాణిజ్యంపై తప్పకుండా ఉంటుంది. అయితే ఆ ప్రభావం తీవ్రత షట్డౌన్ ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అంటే ఏమిటి?అమెరికా ప్రభుత్వం షట్డౌన్ (Government Shutdown) అంటే ఫెడరల్ ప్రభుత్వానికి తాత్కాలికంగా నిధులు నిలిచిపోవడం అని అర్థం. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు కేటాయించడానికి అక్కడి పార్లమెంట్ (కాంగ్రెస్) ‘బడ్జెట్ బిల్లులు’ లేదా ‘అప్రాప్రియేషన్ బిల్లులు’ ఆమోదించాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ నిధుల బిల్లులు ఆమోదం పొందాలి.ఒకవేళ కాంగ్రెస్ (సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) తమలో తాము విభేదాల కారణంగా లేదా రాజకీయ కారణాల వల్ల ఆ గడువులోపు ఈ బిల్లులను ఆమోదించడంలో విఫలమైతే, ప్రభుత్వం వద్ద ఖర్చు చేయడానికి చట్టబద్ధంగా నిధులు ఉండవు. నిధులు లేకపోవడంతో అమెరికాలోని అత్యవసరం కాని (Non-Essential) అన్ని ప్రభుత్వ విభాగాలు, సర్వీసులు నిలిచిపోతాయి (షట్డౌన్ అవుతాయి).ఎందుకు ఇలా జరుగుతుంది?ప్రధానంగా పాలక పార్టీలు, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ విభేదాలు తీవ్రంగా ఉన్నప్పుడు షట్డౌన్ ఏర్పడుతుంది. ఆరోగ్య సంరక్షణ, రక్షణ, సరిహద్దు భద్రత లేదా వలస విధానాల వంటి అంశాలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేయాలనే విషయంలో రాజీ కుదరకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి. నిధుల బిల్లు ఆమోదాన్ని అడ్డుకుని తమకు కావాల్సిన ఇతర రాజకీయ డిమాండ్లు లేదా విధాన మార్పులను బడ్జెట్లో చేర్చాలని ఏదైనా ఒక పార్టీ పట్టుబడితే కూడా షట్డౌన్ వస్తుంది.ఈ సమయంలో ఏం జరుగుతుంది?అత్యవసరం కాని సేవలు నిలిపేస్తారు. జాతీయ పార్కులు మూసివేస్తారు. మ్యూజియంలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి. పరిశోధన, గ్రాంట్ల జారీ, కొన్ని రకాల నియంత్రణ (Regulatory) తనిఖీలు నిలిచిపోతాయి. అయితే అత్యవసర సేవలను మాత్రం కొనసాగిస్తారు. జాతీయ భద్రత, సైనిక కార్యకలాపాలు, విమాన రాకపోకల నియంత్రణ (Air Traffic Control), సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయి.ఉద్యోగులపై ప్రభావంఅత్యవసరం కాని విభాగాల్లోని లక్షలాది మంది ఉద్యోగులకు జీతాలు లేకుండా సెలవు (Furlough) ఇస్తారు. అత్యవసర విధుల్లో ఉన్న ఉద్యోగులు జీతం లేకుండా పనిచేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ షట్డౌన్ తర్వాత ఆమోదాన్నిబట్టి వారికి తర్వాత జీతాలు చెల్లిస్తారు. షట్డౌన్ అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ దేశాలకు అనిశ్చితిని కలిగించే ఒక అరుదైన రాజకీయ సంక్షోభం.భారత వాణిజ్యంపై ప్రభావంసాధారణంగా షట్డౌన్ కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు మాత్రమే ఉంటే భారత వాణిజ్యంపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఈ వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు, డాలర్ విలువలో అస్థిరత ఏర్పడవచ్చు. దీని ఫలితంగా భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు లోనుకావచ్చు. షట్డౌన్ కారణంగా కీలకమైన అమెరికా ఆర్థిక డేటా (ఉదాహరణకు ఉద్యోగాల నివేదికలు, ద్రవ్యోల్బణం లెక్కలు) విడుదల ఆలస్యం కావచ్చు. ఈ డేటా ఆధారంగానే పెట్టుబడిదారులు, సెంట్రల్ బ్యాంకులు (ఫెడ్) నిర్ణయాలు తీసుకుంటాయి. కాబట్టి ఈ అనిశ్చితి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.వీసా, ఇమ్మిగ్రేషన్ సేవల్లో ఆలస్యంఅమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు నెమ్మదిస్తే భారతీయ వృత్తి నిపుణులకు లేదా వ్యాపారవేత్తలకు సంబంధించిన వీసా, ఇమ్మిగ్రేషన్ సేవల్లో ఆలస్యం జరగవచ్చు. భారతీయ కంపెనీలకు అమెరికాలో అవసరమైన కొన్ని నియంత్రణ అనుమతులు (Regulatory Approvals) లేదా లైసెన్సుల జారీలో ఆలస్యం ఏర్పడవచ్చు.ఇదీ చదవండి: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ -
కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఈసారి రెపో రేటును మార్చకుండా స్థిరంగా ఉంచింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆగస్టులో జరిగిన సమావేశంలో వడ్డీరేట్లను స్థిరంగా ఉంచారు. సెప్టెంబర్ 29న ప్రారంభమైన ఎంపీసీ అక్టోబర్ 1న ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందులోని అంశాలను పేర్కొన్నారు. రెపో రేటును 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు చెప్పారు.స్థిరమైన రేట్లకు కారణాలు..రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయిలోనే ఉంది. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాలు సహా మునుపటి కోతలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావాన్ని అంచనా వేయాలని ఆర్బీఐ భావిస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో లోన్ ఈఎంఐలు ప్రస్తుతానికి నిలకడగా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నేతృత్వంలోని అంతరాయాల నుంచి వచ్చే ప్రమాదాలపై విధాన నిర్ణేతలు జాగ్రత్త వహించినట్లు తెలుస్తుంది.ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన అనంతరం, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు ఐదో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రెపో రేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్లోనూ మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. ఆగస్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో బెంచ్మార్క్ రుణ రేటు 5.5 శాతానికి చేరింది.రెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది.ఇదీ చదవండి: నవరాత్రులు.. పెట్టుబడి పాఠాలు -
అంచనాల్లో 38 శాతానికి ద్రవ్యలోటు
కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ చివరికి రూ.5,98,153 కోట్లకు చేరింది. 2025–26 జీడీపీలో ద్రవ్యలోటు (ఆదాయం– వ్యయాల మధ్య అంతరం) 4.4 శాతం, అంటే రూ.15.69 లక్షల కోట్లుగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. తొలి ఐదు నెలల్లో ద్రవ్యలోటు మొత్తం అంచనాల్లో 38 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ఈ వివరాలు విడుదల చేసింది.ఆగస్ట్ చివరికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన నికర ఆదాయం రూ.8.1 లక్షల కోట్లు. ఇందులో రూ.4.4 లక్షల కోట్లు పన్నేతర రూపంలో, రూ.31,970 కోట్లు రుణాల రూపంలో ఉన్నాయి. పన్నుల్లో వాటా కింద రాష్ట్రాలకు రూ.5.3 లక్షల కోట్లను కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.74,431 కోట్లు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.18.8 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.14.49 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయాలు కాగా, రూ.4.31 లక్షల కోట్లు మూలధన వ్యయాల కింద ఖర్చు అయింది. రెవెన్యూ వ్యయంలోనూ రూ.5,28,668 కోట్లు వడ్డీ చెల్లింపులకు పోగా, రూ.1,50,377 కోట్లు సబ్సిడీలకు వెచ్చించారు.ఇదీ చదవండి: గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే.. -
గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. ఎంతంటే..
చమురు మార్కెటింగ్ కంపెనీలు అక్టోబర్ 1, 2025 నుండి ఇంధన ధరలను సవరించాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.15.50 పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) కిలోలీటరుకు రూ.3,052.50 పెరిగింది. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం ఢిల్లీలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,595.50 ఉంది. ఇది గతంలో రూ.1,580 ఉంది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలలో మార్పు లేదు.కమర్షియల్ ఎల్పీజీ ధరలు (19 కిలోల సిలిండర్)ఢిల్లీ: రూ.1,595.50కోల్కతా: రూ.1,700.50ముంబై: రూ.1,547.00చెన్నై: రూ.1,754.50ఏటీఎఫ్ ధరలు (అక్టోబర్ 1, 2025 నుంచి కిలోలీటర్కు)ఢిల్లీ: రూ.93,766.02కోల్కతా: రూ.96,816.58ముంబయి: రూ.87,714.39చెన్నై: రూ.97,302.14ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్వహిస్తున్న ఇంధన ధరల సాధారణ నెలవారీ సమీక్షలో భాగంగా ఈ సవరణలు జరిగాయి.ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే -
ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లపై ధరలు తగ్గాయా?
జీఎస్టీలో శ్లాబుల క్రమబద్దీకరణ ద్వారా నిత్యావసరాల నుంచి ఖరీదైన ఎల్రక్టానిక్ ఉత్పత్తుల వరకు రేట్లను తగ్గించగా.. ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఈ–కామర్స్ సంస్థలు అందించడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేస్తున్నాయా? అన్నది తెలుసుకునేందుకు కేంద్ర సర్కారు ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లపై నిఘా పెట్టింది.వస్తు, సేవల పన్నులో (జీఎస్టీ) 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేసి, వీటిల్లోని వస్తువులను 5, 18 శాతం శ్లాబుల్లోకి మార్చడం తెలిసిందే. దీనివల్ల 375కు పైగా వస్తువుల రేట్లు తగ్గాల్సి ఉంది. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పాత రేట్లతో మార్కెట్లో ఉన్న వస్తువులను సైతం తగ్గించిన రేట్లపైనే విక్రయించాల్సి ఉంటుందని కేంద్ర సర్కారు ఆదేశించింది. అయినప్పటికీ ధరల తగ్గింపు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా తెలుస్తోంది.కొన్ని ఈ–కామర్స్ వేదికలపై విక్రయించే రోజువారీ వస్తువుల రేట్లును తగ్గించలేదంటూ ఫిర్యాదులు వస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో జీఎస్టీ రేట్ల కోతను ఈ–కామర్స్ సంస్థలు సాఫీగా, సజావుగా బదిలీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం పర్యవేక్షణ మొదలు పెట్టింది. పన్ను రేట్లను తగ్గించారా? లేదా అన్నది రెవెన్యూ శాఖ పరిశీలిస్తోందని చెప్పాయి. జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చినా, రేట్లలో మార్పులు చేయకపోవడాన్ని సాంకేతిక సమస్యలుగా ఈ–కామర్స్ సంస్థలు పేర్కొంటున్నట్టు సమాచారం.నెలవారీ నివేదిక..సాధారణంగా వినియోగించే 54 వస్తువుల రేట్లలో మార్పులపై నెలవారీ నివేదిక ఇవ్వాలంటూ సెంట్రల్ జీఎస్టీ అధికారులకు కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించడం గమనార్హం. వీటిల్లో వెన్న, షాంపూ, టూత్పేస్ట్, టమాటా కెచప్, జామ్, ఐస్క్రీమ్, ఏసీ, టీవీలు, డయగ్నోస్టిక్స్ కిట్లు, గ్లూకోమీటర్లు, బ్యాండేజ్లు, థర్మోమీటర్లు, ఎరేజర్లు, క్రేయాన్లు, సిమెంట్ ఉన్నాయి.ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే -
చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు యథాతథం
అక్టోబర్ 1తో ప్రారంభమయ్యే త్రైమాసికానికి సంబంధించి, పబ్లిక్ ప్రావి డెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్తో పాటు వివిధ చిన్న మొత్తాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక నోటిఫికేషన్లో తెలిపింది. దీనితో వరుసగా ఏడు త్రైమాసికాలుగా వడ్డీ రేట్లను మార్చకుండా కొనసాగించినట్లవుతుంది.నోటిఫికేషన్ ప్రకారం సుకన్య సమృద్ధి స్కీమ్లో డిపాజిట్లపై 8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్లు.. పీపీఎఫ్పై 7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్ స్కీములపై 4%, కిసాన్ వికాస పత్రపై 7.5%, ఎన్ఎస్సీపై 7.7% వడ్డీ రేట్లు ఉంటాయి. కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి స్మాల్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లను నోటిఫై చేస్తుంది.ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే -
భారత్ ఎగుమతులపై టారిఫ్ల ప్రభావం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ జూన్ త్రైమాసికంలో (క్యూ1) బలమైన వృద్ధి రేటు (7.8 శాతం)ను నమోదు చేసినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) మరోసారి తన అంచనాలను ప్రకటించింది. భారత్పై అమెరికా మోపిన 50 శాతం టారిఫ్లు వృద్ధి అవకాశాలకు విఘాతం కలిగిస్తాయని, ముఖ్యంగా ద్వితీయ ఆరు నెలలపై ఈ ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఏడీబీ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించిన అంచనాల్లో భారత జీడీపీ 7 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని ప్రకటించడం గమనార్హం. భారత్పై టారిఫ్లు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో జూలైలో వృద్ధి రేటు అంచనాను 6.5శాతానికి తగ్గించింది. ఇప్పుడు కూడా అదే అంచనాను కొనసాగించింది. ‘‘వినియోగం పెరగడం, ప్రభుత్వం అధికంగా వ్యయం చేయడంతో క్యూ1లో భారత్ జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత ఎగుమతులపై అమెరికా అదనంగా టారిఫ్లు విధించడం వృద్ధి రేటును తగ్గిస్తుంది. ముఖ్యంగా 2025–26 ద్వితీయార్ధం, 2026–27 వృద్ధిపై ఈ ప్రభావం ఉంటుంది. అదే సమయంలో స్థిరమైన దేశీ వినియోగం, సేవల ఎగుమతులు ఈ ప్రభావాన్ని తగ్గిస్తాయి’’అని ఏడీబీ తాజా నివేదిక వెల్లడించింది. ప్రభావం పరిమితమే.. జీడీపీలో ఎగుమతుల వాటా తక్కువగా ఉండడం, అదే సమయంలో ఇతర దేశాలకు ఎగుమతులు పెరగడంతో వృద్ధి రేటుపై అమెరికా టారిఫ్ల కారణంగా పడే ప్రభావం పరిమితంగానే ఉంటుందని ఏడీబీ తెలిపింది. సేవల ఎగుమతులు బలంగా ఉన్నాయంటూ, వాటిపై టారిఫ్లు లేని విషయాన్ని గుర్తు చేసింది. పరపతి విధాన పరంగా దేశీ వినియోగానికి ఊతమివ్వడాన్ని సైతం ప్రస్తావించింది. ఇక ప్రభుత్వం అంచనా వేసిన 4.4 శాతం కంటే అధికంగా ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉండొచ్చని ఏడీబీ నివేదిక పేర్కొంది. జీఎస్టీ శ్లాబుల కుదింపు కారణంగా పన్ను ఆదాయం తగ్గనుందని, 2025–26 బడ్జెట్ అంచనాలు ప్రకటించే నాటికి ఈ ప్రతిపాదన లేకపోవడాన్ని గుర్తు చేసింది. అదే సమయంలో 2024–25 ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.7 శాతం కంటే తక్కువే ఉండొచ్చని అంచనా వేసింది. కరెంట్ ఖాతా లోటు మాత్రం జీడీపీలో 0.9 శాతానికి ఎగబాకొచ్చని తెలిపింది. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది 0.6 శాతంగా ఉంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) కరెంటు ఖాతా లోటు 1.1 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంచనాలకు మించి ఆహార ధరలు వేగంగా తగ్గడాన్ని ప్రస్తావించింది. 2025–26 మొదటి నాలుగు నెలల్లో కేంద్ర ప్రభుత్వ వ్యయాలు ఆదాయానికి మించి బలంగా ఉన్నట్టు, దీంతో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ద్రవ్యలోటు పెరిగినట్టు వివరించింది. -
నిధుల వేటలో 4 కంపెనీలు
సెప్టెంబర్లో సందడే సందడిగా సాగిన ప్రైమరీ మార్కెట్లు ఈ నెల(అక్టోబర్)లోనూ మరింత దూకుడు చూపనున్నాయి. దిగ్గజాలు టాటా క్యాపిటల్, వియ్వర్క్ ఇండియా, ఎల్జీఎల్రక్టానిక్స్ ఐపీవోలు ప్రారంభంకానుండగా.. మరో 4 కంపెనీలు నిధుల సమీకరణ బాట పట్టాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి 2 కంపెనీలు తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. జాబితాలో హైదరాబాద్ కంపెనీలు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, విరూపాక్ష ఆర్గానిక్స్ చేరాయి. మరోపక్క సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా లిస్టింగ్కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బాటలో గోప్యతా మార్గంలో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్కు అప్డేటెడ్గా ఏక్వస్ మరోసారి సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. షేర్ల జారీ, ఆఫర్.. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఇన్ఫ్రా కన్సల్టెన్సీ సేవల సంస్థ ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఐపీవోలో భాగంగా రూ. 202.5 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 67.5 లక్షల షేర్లను విక్రయించనుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ. 76 కోట్లను రుణాల చెల్లింపునకు, దేశీ అనుబంధ సంస్థ ఎస్ఆర్ఏ ఓఎస్ఎస్లో రూ. 21.9 కోట్లు, విదేశీ అనుబంధ సంస్థలైన ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్లో రూ. 34.8 కోట్లు, బ్రిటన్ సంస్థ ఆర్వీ అసోసియేట్స్లో రూ. 20.8 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, డెడికేటెడ్ ఫ్రైట్ రైల్ కారిడార్ మొదలైన ప్రాజెక్టులకు ఆర్వీ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ సేవలు అందించింది. ఫార్మా రంగ కంపెనీ ఫార్మాస్యూటికల్ రంగ హైదరాబాద్ కంపెనీ విరూపాక్ష ఆర్గానిక్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 740 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా సమీకరించనున్న నిధులలో రూ. 360 కోట్లు సామర్థ్య విస్తరణపై వెచి్చంచనుంది. మరో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. ఆర్అండ్డీ ఆధారిత ఫార్మా కంపెనీ విరూపాక్ష ప్రధానంగా ఏఐపీలు, ఇంటరీ్మడియేట్స్ను తయారు చేస్తోంది. 2025 మార్చి31కల్లా 54 ప్రొడక్టుల పోర్ట్ఫోలియోను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 811 కోట్ల ఆదాయం, రూ. 78 కోట్ల నికర లాభం ఆర్జించింది. హైదరాబాద్లో నాలుగు, కర్ణాటకలోని హమ్నాబాద్లో రెండు చొప్పున తయారీ యూనిట్లను కలిగి ఉంది. లారస్, న్యూలాండ్, దివీస్ ల్యాబ్స్, ఆర్తి డ్రగ్స్ తదితరాలను ప్రత్యర్ధి సంస్థలుగా భావించవచ్చు.సాస్ సేవలతో.. సాస్ సేవల కంపెనీ క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇండియా ఐపీవోకు సెబీ అనుమతించింది. జూన్లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూలో భాగంగా రూ. 430 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.83 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 120 కోట్లు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయాలకు, రూ. 152 కోట్లు ప్రొడక్టులు, ప్లాట్ఫామ్ డెవలప్మెంట్కు వెచ్చించనుంది. మిగిలిన నిధులను ఇతర సంస్థల కొనుగోళ్లకు వినియోగించనుంది. కంపెనీ గతంలో 2021 డిసెంబర్లో సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసినప్పటికీ అనుమతి లభించకపోవడం గమనార్హం! కంపెనీ ఏఐ ఆధారిత క్లౌడ్లో భాగమైన సాఫ్ట్వేర్ ప్రొడక్టులు, సొల్యూషన్లు అందిస్తోంది. గతేడాది(2024–25) రూ. 598 కోట్ల ఆదాయం, రూ. 13 కోట్ల నికర లాభం ఆర్జించింది.లిస్టింగ్కు ఏక్వస్ రెడీ కన్జూమర్ డ్యురబుల్ గూడ్స్, ఏరోస్పేస్ పరికరాల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఏక్వస్ సెబీకి తాజాగా అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. దీంతో ఐపీవో చేపట్టేందుకు వీలు చిక్కనుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 720 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 3.17 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థలు ఏరోస్ట్రక్చర్స్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా, ఏక్వస్ కన్జూమర్ ప్రొడక్ట్స్ రుణ చెల్లింపులకు, మెషీనరీ, ఎక్విప్మెంట్ కొనుగోలుకి వెచ్చించనుంది. అంతేకాకుండా ఇతర సంస్థల కొనుగోళ్లకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం నిధులను వినియోగించనుంది. కంపెనీ గోప్యతా మార్గంలో సెబీకి జూన్లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీంతో ఐపీవోకు వీలుగా మరోసారి అప్డేటెడ్ పత్రాలు అందించింది. కంపెనీలో అమికస్, అమన్సా, స్టెడ్వ్యూ క్యాపిటల్తోపాటు.. కాటమారన్, స్పర్ట గ్రూప్లు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ క్లయింట్లలో బోయింగ్, బోయింగ్, బంబార్డియర్, జీకేఎన్ ఏరోస్పేస్, హనీవెల్, ఈటన్ తదితర దిగ్గజాలున్నాయి. -
ఇక స్విస్ చాక్లెట్లు.. వాచీలు చౌక
న్యూఢిల్లీ: ఇకపై చాక్లెట్లు, వైన్స్, దుస్తులు, వాచీల్లాంటి పలు స్విట్జర్లాండ్ ఉత్పత్తులు భారత మార్కెట్లో చౌకగా లభించనున్నాయి. అలాగే మన దేశానికి చెందిన పలు ఎగుమతి సంస్థలకు మరింత విస్తృత మార్కెట్ అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి నాలుగు యూరప్ దేశాల కూటమి ఈఎఫ్టీఏతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (టీఈపీఏ) అక్టోబర్ 1 నుంచి (నేడు) అమల్లోకి రానుంది. ఐస్ ల్యాండ్, లీషె్టన్స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్ సభ్యదేశాలుగా ఉన్న యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో 2024 మార్చి 10న ఈ ఒప్పందం కుదిరింది. దీని కింద, వచ్చే 15 ఏళ్లలో భారత్లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు ఈఎఫ్టీఏ హామీ ఇచ్చింది. ఒప్పందం అమల్లోకి వచి్చన పదేళ్ల వ్యవధిలో 50 బిలియన్ డాలర్లు, ఆ తర్వాత అయిదేళ్లలో 50 బిలియన్ డాలర్ల మేర కూటమి దేశాలు భారత్లో ఇన్వెస్ట్ చేయనున్నాయి. దీనితో భారత్లో ప్రత్యక్షంగా పది లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. ఒకవేళ ఏదైన కారణం వల్ల ప్రతిపాదిత పెట్టుబడులు రాకపోతే ఆ నాలుగు దేశాలకు ఇస్తున్న సుంకాలపరమైన వెసులుబాట్లను సర్దుబాటు చేసే లేదా పూర్తిగా ఎత్తివేసేందుకు వీలుగా సదరు ఒప్పందంలో నిబంధన ఉంది. ఈఎఫ్టీఏ దేశాలనేవి యూరోపియన్ యూనియన్లో (ఈయూ) భాగం కావు. ఈయూ తో కూడా భారత్ విడిగా వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తోంది. వివిధ దేశాలతో, అలాగే కూటము లతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో టీఈపీఏ పదా్నలుగోది. మోదీ సారథ్యంలోని ప్ర భుత్వం కుదుర్చుకున్న వాటిల్లో మారిషస్, యూఏఈ, యూకే, ఆ్రస్టేలియా తర్వాత అయిదోది.ప్రయోజనాలు ఇలా.. ఈ ఒప్పందం కింద స్విస్ వాచీలు, చాక్లెట్లు, కట్..పాలిష్డ్ డైమండ్లలాంటి వాటిపై సుంకాల భారం తగ్గుతుంది. కార్మిక శక్తి ఎక్కువగా ఉండే తేయాకు..కాఫీ, టెక్స్టైల్స్, మెరైన్ ఉత్పత్తులు, లెదర్, స్పోర్ట్స్ గూడ్స్, పండ్లు, రత్నాభరణాలు మొదలైన మన దేశ పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులకు విస్తృత మార్కెట్ లభిస్తుంది. సుంకాల తగ్గింపుతో ఇంజనీరింగ్ గూడ్స్, ఎల్రక్టానిక్ ఐటమ్స్, రసాయనాలు, ప్లాస్టిక్ గూడ్స్ తదితర ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. లీగల్, ఆడియో–విజువల్, కంప్యూటర్, అకౌంటింగ్లాంటి సేవలందించే భారతీయ సంస్థలకు లబ్ధి చేకూరనుంది. ఒప్పందం ప్రకారం భారత్ నుంచి వచ్చే దాదాపు 99.6 శాతం దిగుమతులపై సుంకాలను తగ్గించేందుకు లేదా పూర్తిగా తొలగించేందుకు ఈఎఫ్టీఏ అంగీకరించింది. అలాగే ఈఎఫ్టీఏ నుంచి వచ్చే 95 శాతం దిగుమతులపై సుంకాలను భారత్ తగ్గిస్తుంది. డెయిరీ, సోయా, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు మాత్రం ఈ పరిధిలోకి రావు. దశలవారీగా కొన్ని రకాల బొగ్గు, చాలామటుకు ఔషధా లు, అద్దకపు రంగులు, టెక్స్టైల్స్, దుస్తులు, ఇనుము..ఉక్కు వంటి ఉత్పత్తుల దిగుమతులపై భారత్లో టారిఫ్లు సున్నా స్థాయికి తగ్గిపోతాయని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) తెలిపింది. ప్రాసెస్డ్ కూరగాయలు, బాస్మతి బియ్యం, తాజా పండ్లు మొదలైన వాటిని ఈఎఫ్టీఏ దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది. 2023–24లో ఈఎఫ్టీఏ కూటమికి భారత్ నుంచి 1.94 బిలియన్ డాలర్లుగా ఉండగా 2024–25లో 1.97 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 22.05 బిలియన్ డాలర్ల నుంచి 22.44 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
యూఎస్ బెదిరించినా తగ్గేదేలే
రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మరోసారి స్పష్టమైన వైఖరి ప్రకటించింది. రష్యా చమురు కొనుగోళ్లపై యూఎస్ నుంచి పదేపదే హెచ్చరికలు, ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ధరలు అనుకూలంగా ఉన్నంత వరకు రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపడానికి భారత్ సుముఖంగా లేదని తేల్చి చెప్పింది. ఈ వైఖరిని భారత్ తన జాతీయ ప్రయోజనాలు, ఇంధన సార్వభౌమాధికారంగా చూస్తుందని తెలిపింది. దీన్ని ఇతర దేశాలు భౌగోళిక రాజకీయ ధిక్కారంగా కాకుండా ఆర్థిక అవసరంగా చూడాలని పేర్కొంది.ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) క్లిష్టతరంరష్యా చమురుపై భారతదేశం తీసుకున్న వైఖరి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) చర్చలను మరింత క్లిష్టతరం చేసింది. భారత్ మధ్య వాణిజ్య చర్చల్లో పురోగతిని యూఎస్ రష్యా ఇంధన సంబంధాలతో ముడిపెట్టింది. దీని ఫలితంగా భారత్ నుంచి యూఎస్ వచ్చే కొన్ని వస్తువులపై ఈ సంవత్సరం ప్రారంభంలో విధించిన భారీ సుంకాలను 50% వరకు పెంచింది. వీటిని తగ్గించేందుకు అమెరికా నిరాకరిస్తోంది. రష్యా చమురు సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ సుంకాలు కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: పండుగ వేళ ఆర్డర్లున్నా డెలివరీ కష్టతరం!యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ వంటి అధికారులు రష్యాతో ఆర్థిక సంబంధాలను కొనసాగించే దేశాలపై మరింత కఠినమైన ప్రకటనలు చేస్తూ భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాలకు ‘ఫిక్సింగ్’ అవసరమని హెచ్చరించారు. ఈ ఒత్తిడికి ప్రతిస్పందనగా భారతదేశం తన దౌత్యపరమైన, ఆర్థిక ఎంపికలను విస్తరిస్తోంది. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ న్యూయార్క్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రులకు ఆతిథ్యం ఇచ్చారు. ఇండియా ఆర్థిక నిబద్ధతను బలోపేతం చేయడం ఈ వ్యూహంలో భాగం. భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలను పెంపొందించడం, కొత్త వాణిజ్య కారిడార్లను అన్వేషించడం ద్వారా యూఎస్ ఒత్తిళ్లను అధిగమించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఆర్బీఐ రూటెటు..?
ఆర్బీఐ పరపతి విధాన కమిటీ (MPC) సమీక్షా సమావేశం సోమవారం మొదలైంది. కీలక రెపో రేటును 5.50 శాతం వద్ద కొనసాగిస్తూ, యథాతథ విధానానికి మొగ్గు చూపించొచ్చని కొందరు విశ్లేషకుల అంచనా. మరికొందరు అయితే పావు శాతం రేటు కోతను చేపట్టొచ్చని భావిస్తున్నారు. ఆర్బీఐ(RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఎంపీసీ తన నిర్ణయాలను 1వ తేదీ ఉదయం ప్రకటించనుంది.భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు విధించడం, అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపించే ప్రభావాన్ని ఎంపీసీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్బీఐ మొత్తం 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) మేర రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ద్రవ్యోల్బణం నియంత్రణల్లోకి రావడంతో నగదు లభ్యత పెంపు దిశగా ఆర్బీఐ ఎన్నో చర్యలు చేపట్టింది. కానీ, ఆగస్ట్ సమీక్షలో మాత్రం యథాతథ స్థితికి మొగ్గు చూపించింది. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో వేచి చూసే ధోరణిని అనుసరించింది. డిసెంబర్లో కోత..ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటు(Repo Rate)ను 5.50 శాతం వద్ద కొనసాగిస్తుందని గోల్డ్మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. తటస్థ విధానాన్ని కొనసాగించొచ్చని పేర్కొంది. గతంలో చేపట్టిన ఒక శాతం రేటు తగ్గింపు పూర్తి స్థాయిలో బదిలీ అయ్యే వరకు వేచి చూడొచ్చని అభిప్రాయపడింది. డిసెంబర్ సమీక్షలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించి రెపో రేటును 5.25 శాతం చేయొచ్చని పేర్కొంది. వాణిజ్య అనిశ్చితులు ఆర్థిక వృద్ధిని కిందకు తీసుకెళతాయని ఎంపీసీ భావిస్తే అప్పుడు.. పావు శాతం రేటు తగ్గింపును అక్టోబర్ సమీక్షలోనే తీసుకోవచ్చని అంచనా వేసింది. డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్ముఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా శిరీష్ చంద్ర ముర్మును కేంద్రం నియమించింది. ఎం.రాజేశ్వరరావు స్థానంలో ఈ నియామకం జరిగింది. రాజేశ్వరరావుకు పొడిగించిన పదవీకాలం అక్టోబర్ 8తో ముగియనుంది. అక్టోబర్ 9 లేదా ఆ తర్వాత బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పదవీకాలంతో ముర్ము నియామకానికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. ముర్ము ప్రస్తుతం ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. -
వాణిజ్య ఒప్పందంపై యూఎస్తో చర్చలు
అమెరికా సహా పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కోసం చర్చలు కొనసాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. న్యూజిలాండ్, ఒమన్, పెరూ, చిలీ, ఐరోపా సమాఖ్య (ఈయూ) ఇందులో ఉన్నాయి. ఖతార్, బహ్రెయిన్ సైతం భారత్తో వాణిజ్య ఒప్పందాల పట్ల సుముఖంగా ఉన్నట్టు గోయల్ చెప్పారు. ఆగస్ట్లో ఆర్మీనియా, బెలారస్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, రష్యాతో కూడిన యూరేషియన్ ఎకనమిక్ యూనియన్ (ఈఏఈయూ) భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంప్రదింపులకు వీలు గా షరతుల కార్యాచరణపై సంతకం చేయడం గమనార్హం. నోయిడాలో జరిగిన యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో సందర్భంగా గోయల్ దీనిపై మాట్లాడారు. 1 నుంచి ఈఎఫ్టీఏతో ఒప్పందం అమలునాలుగు ఐరోపా దేశాలతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో కుదిరిన వాణిజ్య, ఆర్థిక ఒప్పందం (టెపా) అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని గోయల్ చెప్పారు. ఈ ఒప్పందం భారత వర్తకులకు ప్రయోజనం కలిగిస్తుందని చెప్పారు. దీని కింద 15 ఏళ్లలో భారత్కు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నట్టు పేర్కొన్నారు. గత వారం మంత్రి గోయల్ ఆధ్వర్యంలో అధికారిక బృందం చర్చల కోసం న్యూయార్క్కు వెళ్లి రావడం తెలిసిందే. అక్టోబర్–నవంబర్ నాటికి మొదటి దశ ఒప్పందం కోసం రెండు దేశాలు కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఐదు దశల చర్చలు నడిచాయి. 2024–25లో 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులతో వరుసగా నాలుగో ఏడాది భారత్కు అమెరికా అతిపెద్ద మార్కెట్గా నిలిచింది. రెండు దేశాల మధ్య 132 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరడం, ముఖ్యంగా భారత్కు ప్రయోజనం కలిగించనుంది. రష్యాపై చమురు కొంటుందన్న కారణంతో విధించిన 25 శాతం అదనపు టారిఫ్లు తొలగిపోతాయి. ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండి -
పటిష్టంగా ఆర్థిక వృద్ధి
భారత్ దీర్ఘకాలిక రుణ రేటింగ్ను స్థిరమైన ఔట్లుక్తో యథాతథంగా ‘బీఏఏ3’గా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉండటం, అంతర్జాతీయంగా వాణిజ్యం, చెల్లింపులకు సంబంధించి మెరుగైన స్థితిలో ఉండటం, తదితర అంశాలు ఇందుకు కారణమని సంస్థ వివరించింది. ఇవన్నీ కూడా అమెరికా టారిఫ్ల భారం, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ఎదురవుతున్న అవాంతరాలు మొదలైన అంతర్జాతీయ ప్రతికూల పవనాలను ఎదుర్కొనే బలాన్ని అందిస్తున్నాయని పేర్కొంది.దేశీయంగా భారీ మార్కెట్, జనాభా తీరుతెన్నులపరంగా సానుకూలతలాంటి అంశాలు .. అంతర్జాతీయ షాక్ల నుంచి దేశీ ఎకానమీకి రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు, జీడీపీ వృద్ధి అధిక స్థాయిలో ఉండటం, ఆర్థిక స్థిరీకరణ వంటి అంశాలనేవి భారీ స్థాయిలో ఉన్న ప్రభుత్వ రుణభారాన్ని నెమ్మదిగా తగ్గించుకోవడానికే తోడ్పడతాయే తప్ప ఎకాయెకిన తగ్గించుకోవడానికి ఉపయోగపడకపోవచ్చని తెలిపింది. పైగా వినిమయాన్ని పెంచే దిశగా ఇటీవల తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ ఆదాయానికి కొంత గండి పడుతుందని, దీంతో రుణభారాన్ని అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారొచ్చని మూడీస్ వివరించింది.ఇటీవలే ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 18 ఏళ్లలో తొలిసారిగా భారత్ సార్వభౌమ రేటింగ్ను అప్గ్రేడ్ చేసింది. ‘ట్రిపుల్బీ మైనస్’ నుంచి ట్రిపుల్ బీ’కి పెంచింది. అటు జపాన్కి చెందిన రేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ (ఆర్అండ్ఐ) కూడా దీర్ఘకాలిక సావరీన్ రేటింగ్ను ట్రిపుల్ బీ నుంచి ట్రిపుల్ బీ ప్లస్కి పెంచింది. ఇక మారి్నంగ్స్టార్ డీబీఆర్ఎస్ సైతం ట్రిపుల్ బీ (కనిష్ట) నుంచి ట్రిపుల్ బీ స్థాయికి అప్గ్రేడ్ చేసింది. వేగవంతమైన వృద్ధి..2023–24లో 9.2 శాతంగా నమోదైన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2025 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతానికి నెమ్మదించినా కూడా గత రెండు, మూడేళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న జీ20 దేశంగా భారత్ కొనసాగుతోందని మూడీస్ వివరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ వ్యయాలు పెంచడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, ద్రవ్యపరపతి విధానాన్ని సరళతరం చేయడంపై కేంద్రం దృష్టి పెడుతుండటమనేది దేశీయంగా వినియోగం, పెట్టుబడులు పెరగడానికి దన్నుగా నిలుస్తుందని మూడీస్ తెలిపింది.ఇదీ చదవండి: ‘ఆదిలోనే హంసపాదు’ కాకూడదంటే.. ఓ లుక్కేయండిఅమెరికా భారీ టారిఫ్లను విధించడం వల్ల సమీప భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధిపై పడే ప్రతికూల ప్రభావాలు పరిమితంగానే ఉంటాయని పేర్కొంది. అయితే, అధిక విలువను జోడించగలిగే ఎగుమతి ఆధారిత పరిశ్రమగా తయారీ రంగాన్ని తీర్చిదిద్దాలన్న భారత ఆకాంక్షలకి అవరోధాలు కలిగించడం ద్వారా మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపవచ్చని తెలిపింది. ప్రస్తుత దశలో సంప్రదింపుల వల్ల టారిఫ్లు తగ్గే అవకాశం ఉందని, దేశీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం గణనీయంగానే ఉండొచ్చని మూడీస్ పేర్కొంది. -
స్విస్ వాచ్లు, చాక్లెట్లు, సైకిళ్ల ధరలు తగ్గింపు
యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) దేశాలతో ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) ప్రకారం భారతదేశం అక్టోబర్ 1 నుంచి అనేక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను దశలవారీగా తగ్గించనుంది. ఈ చర్యతో దేశీయ వినియోగదారులకు యూరప్లో తయారవుతున్న స్విస్ వాచీలు, చాక్లెట్లు, ఎలక్ట్రానిక్స్, కొన్ని బ్రాండ్లకు చెందిన సైకిళ్లు వంటి వస్తువులు మరింత అందుబాటులోకి రానున్నాయి.మార్చి 10, 2024న సంతకం చేసిన ఇండియా-ఈఎఫ్టీఏ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్ (టీఈపీఏ)ను అక్టోబర్ 1 నుంచి అధికారికంగా అమలు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రధానంగా కింది కీలక అంశాలపై దృష్టి పెట్టింది.సుంకాల తగ్గింపుఈఎఫ్టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, ఐస్ల్యాండ్, నార్వే, లిచెన్స్టెయిన్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యే, రాయితీలు మంజూరు అయిన అన్ని ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. దాంతో భారతదేశం తన టారిఫ్ లైన్లలో 82.7% మెరుగైన మార్కెట్ యాక్సెస్ను అందించనుంది. ఇది యూరప్ నుంచి మన దేశానికి వచ్చే ఈఎఫ్టీఏ ఎగుమతుల్లో 95.3% కవర్ చేస్తుంది. అయితే, ఈ ఎగుమతుల పరిధిలోకి బంగారం, దీని సుంకాలు రావని గమనించాలి.ప్రయోజనం పొందే వస్తువులుస్విస్ గడియారాలుఎలక్ట్రానిక్స్ వస్తువులుచాక్లెట్లుఆలివ్ నూనెబిస్కెట్లుపారిశ్రామిక వస్తువులుసైకిళ్లుకొన్ని వ్యవసాయ ఉత్పత్తులుకాఫీ, ఫార్మాస్యూటికల్స్దశలవారీ అమలుఎఫ్టీఏ నిబంధనల ప్రకారం.. చాలా సుంకాల తొలగింపులు, తగ్గింపులు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు క్రమంగా అమలు చేస్తారు. ఈ దశలవారీ విధానం దేశీయ పరిశ్రమలు అందుకు తగినట్లు సర్దుబాటు అయ్యేందుకు తగిన సమయాన్ని ఇస్తుంది. ఈ ప్రయోజనాలను దిగుమతిదారులు వినియోగదారులకు బదిలీ చేస్తారని భావిస్తున్నారు. స్థానికంగా పెట్టుబడులు ప్రైవేట్ రంగం నుంచి అధికంగా వస్తాయి కాబట్టి ఈఎఫ్టీఏ, ప్రభుత్వాలు తమ కంపెనీలను ప్రోత్సహించడం, పెట్టుబడులను సులభతరం చేయడం ద్వారా ‘అంబాసిడర్లుగా’ వ్యవహరించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీలు తమ లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలమైతే సుంకం రాయితీలను ఉపసంహరించుకోవడానికి భారతదేశం ‘క్లాబ్యాక్ ప్రొవిజన్’ను ఉపయోగించే వీలుంది.ఇదీ చదవండి: ఏఐతో సరిగమలు పలికించేలా రెహమాన్ వినూత్న ప్రాజెక్ట్ -
ఎన్నికల వేళ రాష్ట్ర ఖజానాకు కాసుల గలగల
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇది కేవలం రాజకీయ ప్రక్రియ మాత్రమే కాదు. తాత్కాలికంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపునందించే ముఖ్యమైన పరిణామం. ఈ సమయంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీలు చేసే ఖర్చు, ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం చేసే వ్యయం అనేక చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు, సేవారంగాలకు భారీగా డిమాండ్ను సృష్టిస్తుంది.ఎన్నికల నేపథ్యంలో వ్యాపార అవకాశాలుప్రింటింగ్, ప్రకటనల విభాగం (Printing and Advertising)ఎన్నికల సమయంలో అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి లక్షలాది కరపత్రాలు, పోస్టర్లు ముద్రిస్తారు. దీంతో ప్రింటింగ్ ప్రెస్సులు, డిజైనర్లకు పని పెరుగుతుంది. పట్టణాలు, గ్రామాల్లో హోర్డింగ్ల తయారీ, బ్యానర్ల ముద్రణతో పాటు పార్టీ జెండాల తయారీ వ్యాపారాలు జోరందుకుంటుంది.ఎలక్షన్ సామగ్రి సరఫరా (Election Material Supply)ప్రచార సభలు, రోడ్ షోల కోసం మైక్ సెట్లు, లౌడ్స్పీకర్ల అద్దె వ్యాపారం పెరుగుతుంది. అభ్యర్థుల పర్యటనలు, కార్యకర్తల తరలింపు కోసం కార్లు, వ్యాన్లు, ఆటోలు వంటి వాహనాల అద్దెకు డిమాండ్ పెరుగుతుంది. డ్రైవర్లకు తాత్కాలిక ఉపాధి లభిస్తుంది. కార్యకర్తల కోసం పార్టీ రంగులు, గుర్తులతో కూడిన టి-షర్టులు, టోపీలు, కండువాల తయారీ, సరఫరా వ్యాపారం ఊపందుకుంటుంది.ఆహారం, ఆతిథ్యం (Food and Hospitality)ప్రచార సభలు, కార్యకర్తల సమావేశాల కోసం భారీగా ఆహార సరఫరా అవసరం అవుతుంది. దీని ద్వారా స్థానిక కేటరింగ్ వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు, పార్టీ పరిశీలకుల కోసం హోటళ్లు, ఫంక్షన్ హాళ్ల బుకింగ్లు పెరుగుతాయి.మీడియా, డిజిటల్ ప్రచారం (Media and Digital Campaign)సోషల్ మీడియా మేనేజ్మెంట్, వీడియోల తయారీ, డిజిటల్ ప్రకటనల కోసం ఏజెన్సీలకు, ఫ్రీలాన్సర్లకు పని దొరుకుతుంది. ఇది ఆధునిక ఎన్నికల ప్రచారంలో కీలకమైంది.రాష్ట్ర ఖజానాకు లబ్ధిస్థానిక సంస్థల ఎన్నికల ఖర్చు ద్వారా రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరుతుంది. ఎన్నికల పాంప్లెట్లు, ఎలక్షన్ సామగ్రి, వాహనాల అద్దె, కేటరింగ్ సేవలు వంటి వాటిపై చెల్లించే జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి ఆదాయం లభిస్తుంది. ముద్రణ, మీడియా, ఇతర సేవలపై విధించిన పన్ను రాష్ట్ర ఖజానాకు చేరుతుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు లేదా అనుమతులు లేని ప్రకటనలపై విధించే జరిమానాలు, ఫీజుల ద్వారా కూడా ఖజానాకు తాత్కాలిక ఆదాయం వస్తుంది.ఇదీ చదవండి: యురేనియం అన్వేషణకు ఎన్టీపీసీ ఒప్పందం -
మరో పావు శాతం రేట్ల కోత ఉంటుందా?
రుణ గ్రహీతలకు మరింత ఊరటనిచ్చేలా.. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) పాలసీ వడ్డీరేట్లను మరో పావు శాతం తగ్గించే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ అంచనా వేసింది. ప్రస్తుతానికి ఆర్బీఐకి ఇదే సరైన ఆప్షన్ అని పేర్కొంది. అయితే, మరికొంత మంది ఆర్థిక నిపుణులు మాత్రం పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సారి కూడా రేట్లను యథాతథంగా కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ ఎంపీసీ మూడు రోజుల సమావేశం నేటి నుంచి ప్రారంభమవుతోంది. అక్టోబర్ 1న (బుధవారం) పాలసీ నిర్ణయం వెలువడుతుంది. ఒకపక్క భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరో పక్క, భారత్ ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకం విధించిన నేపథ్యంలో ఆర్బీఐ తాజా పాలసీ సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది.ఫిబ్రవరి నుంచి మూడు సార్లు...ఆర్బీఐ కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ నెల ఫిబ్రవరిలో జరిగిన తొలి ఎంపీసీ భేటీలోనే దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత రెపో రేటును పావు శాతం తగ్గించారు. ఆ తర్వాత ఏప్రిల్లో పావు శాతం మళ్లీ జూన్లో ఏకంగా అర శాతం తగ్గింపుతో ఇప్పటిదాకా 1 శాతం రెపో రేటు దిగొచ్చింది. ప్రస్తుతం 5.5 శాతంగా కొనసాగుతోంది. ఆర్బీఐ చర్యల నేపథ్యంలో బ్యాంకులు కూడా రేట్ల కోత ప్రయోజనాన్ని రుణ గ్రహీతలకు బదలాయించాయి. దీంతో రుణాలపై వడ్డీ రేట్లు కాస్త దిగొచ్చాయి. అయితే, అమెరికా సుంకాల మోత, ఇతర భౌగోళిక రాజీకయ పరిణామాల ప్రభావవంతో ఆగస్టు పాలసీ సమావేశంలో ఆర్బీఐ రేట్లను యథాతథంగా కొనసాగించింది.ద్రవ్యోల్బణం ఊరట...ప్రస్తుతం ధరలు పూర్తిగా అదుపులో ఉండటంతో పాటు వచ్చే ఏడాది కూడా రిటైల్ ద్రవ్యల్బణం కట్టడిలోనే ఉండొచ్చని, ఈ నేపథ్యంలో తాజా పాలసీ సమీక్షలో మరో పావు శాతం రెపో కోతకు ఆస్కారం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07 శాతంగా, టోకు ధరల ద్రవ్యోల్బణం 0.52 శాతం నమోదైన సంగతి తెలిసిందే. ‘రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ టార్గెట్ 4 శాతంగానే (2 శాతం అటు ఇటుగా) ఉంది. జీఎస్టీ 2.0కి ముందు, ఆ తర్వాతా ఇదే పరిస్థితి. మరోపక్క, వృద్ధి రేటు స్థిరంగా 6.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ, టారిఫ్ల ప్రభావంతో తగ్గే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో ప్రస్తుతం యథాతథ స్థితికే చాన్సుంది. మార్కెట్ వర్గాలు మాత్రం మరో పావు శాతం కోతను ఆశిస్తున్నాయి’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ సబ్నవీస్ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!‘జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావంతో రిటైల్ ద్రవ్యోల్బణం రానున్న నాలుగు త్రైమాసికాల్లో పావు శాతం నుంచి అర శాతం దిగిరావచ్చు. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ వల్ల డిమాండ్ భారీగా పుంజుకోనుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆర్బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు‘ అని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. అయితే, జీఎస్టీ రేట్ల మార్పు, ద్రవ్యోల్బణం అంచనాల కంటే దిగువనే కొనసాగుతుండటంతో పావు శాతం రెపో కోతను అంచనా వేస్తున్నట్లు క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మకృతి జోషి పేర్కొన్నారు. -
సంస్కరణలు ఆదుకుంటాయ్
న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల అజెండా వాణిజ్య పరమైన అవాంతరాల కారణంగా ఏర్పడే ప్రతికూలతల నుంచి రక్షణనిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఆటుపోట్లు, షాక్ల పట్ల అప్రమత్తంగా ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ పన్ను, వ్యక్తిగత ఆదాయపన్ను తగ్గింపు అనంతరం చేపట్టిన మూడో సంస్కరణ జీఎస్టీ శ్లాబుల క్రమబదీ్ధకరణగా పేర్కొంది. దీనివల్ల ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుందని, దేశ వృద్ధి అవకాశాలు మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. బలమైన వృద్ధి రేటు, స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వం, ద్రవ్య క్రమశిక్షణ వంటి అంశాలతో భారత సావరీన్ క్రెడిట్ రేటింగ్ను మూడు రేటింగ్ ఏజెన్సీలు అప్గ్రేడ్ చేయడాన్ని ప్రస్తావించింది. ఇటీవల హెచ్1–బి వీసాలపై అమెరికా విధించిన లక్ష డాలర్ల ఫీజును ప్రస్తావిస్తూ.. భవిష్యత్తు రెమిటెన్స్లు (స్వదేశానికి నిధుల బదిలీ), వాణిజ్య మిగులుపై దీని ప్రభావం ఏ మేరకో పర్యవేక్షించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు ప్రభావితం కాని సేవల రంగాన్ని సైతం వాణిజ్య అనిశ్చితులు ప్రభావితం చేస్తాయనడానికి హెచ్–1బి వీసాపై విధించిన ఫీజును నిదర్శనంగా పేర్కొంది. ఇప్పటికైతే ఈ రిస్్కలను ఎదుర్కోగలమన్న దృక్పథంతో ఉన్నట్టు తెలిపింది. టారిఫ్ అనిశ్చితులతో ఉపాధికి రిస్క్ వృద్ధి వేగాన్ని కొనసాగించేందుకు నియంత్రణపరమైన సంస్కరణలు, మౌలిక వసతుల అభివృద్ధి అవసరమని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. రాష్ట్రాలు సైతం తమ పరిధిలో నియంత్రణలను తొలగించినట్టయితే దేశ ఆర్థిక వ్యవస్థను అధిక వృద్ధి పథంలో నడిపించొచ్చని అభిప్రాయపడింది. ‘‘టారిఫ్ పరమైన అనిశ్చితులు కొనసాగితే, ఎగుమతుల రంగాలపై ప్రభావం పడుతుంది. అది దేశీ ఉపాధి అవకాశాలను, ఆదాయం, వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. కొత్త మార్కెట్లకు మనకు తగిన అవకాశాలు కలి్పంచేందుకు, ఎగుమతుల వృద్ధికి కొంత సమయం పడుతుంది’’అని వివరించింది. -
అమెరికా ఆంక్షలపై ద్వంద్వ వైఖరి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన టారిఫ్లతో చెలరేగిపోతున్నారు. గతంలో పెంచిన 25 సుంకాలకు అదనంగా ఇటీవలే భారత్పై మరోసారి భారీగా 25 శాతం సుంకాలు పెంచారు. అందుకు రష్యా చమురును భారత్ దిగుమతి చేసుకుంటోందనే సాకు చెప్పారు. భవిష్యత్తులో ఈ దిగుమతులను తగ్గించుకుంటే సుంకాల నిలిపివేతపై ఆలోచిస్తామని ఉద్ఘాటించారు. అయితే రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులు, వాటి వ్యాపారంపై మాత్రం నోరు మెదపడంలేదు.ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యంతో యూఎస్ అనేక ఆంక్షలను, వాణిజ్య పరిమితులను విధించింది. ఇందులో కొన్ని కీలకమైన రష్యా వస్తువులపై టారిఫ్లు పెంచినట్లు కూడా తెలిపింది. అయితే, రష్యా నుంచి ప్రస్తుతం అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల జాబితాను పరిశీలిస్తే ఈ టారిఫ్ల ఎఫెక్ట్ ఎంతమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాకు రష్యా నుంచి చేసే వస్తువుల నుంచి లబ్ధి చేకూరుతుందనే భావిస్తే ట్రంప్ శత్రువునైనా ముద్దాడేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది. కానీ, భారత్ మాత్రం తనకు చమురు తక్కువ ధరకు ఇచ్చే రష్యా నుంచి కొనుగోలు చేస్తే యూఎస్కు కంటగింపుగా ఉంది.అమెరికా కొన్ని ఆంక్షలు, వాణిజ్య నిషేధాలు ఉన్నప్పటికీ కీలకమైన వస్తువులు ఇంకా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇటీవల కొన్ని సర్వేల ప్రకారం.. అత్యధిక విలువ కలిగిన ఎగుమతుల్లో కొన్ని కింది విధంగా ఉన్నాయి.ఎరువులు (Fertilizers): అత్యంత ముఖ్యమైన దిగుమతుల్లో ఒకటి. వ్యవసాయ రంగంలో కీలకమైన భాస్వరం (Phosphorus), పొటాషియం (Potassium) ఆధారిత ఎరువులు ఇందులో ప్రధానం.విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు (Precious Stones, Metals, Coins): వజ్రాలు, విలువైన లోహాలు వంటివి ఇందులో ఉన్నాయి.కర్బనేతర రసాయనాలు (Inorganic Chemicals): వివిధ పరిశ్రమలకు అవసరమైన ముఖ్యమైన రసాయనాలను దిగుమతి చేసుకుంటోంది.యంత్రాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు (Machinery, Nuclear Reactors, Boilers): న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించిన విడి భాగాలు ఇందులో ఉన్నాయి.ప్రాథమిక లోహాలు (Other Base Metals): పల్లాడియం, అల్యూమినియం వంటి లోహాలు.అమెరికా అవసరాలపై ప్రభావంఎరువుల కొరత, ధరల పెరుగుదలరష్యా నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తువుల్లో ఎరువులు అత్యంత ముఖ్యమైనవి. వీటిపై టారిఫ్లు లేదా ఆంక్షలు పెంచితే, అమెరికాలోని రైతులు ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. ఎరువుల ధరలు పెరిగితే, ఆహార ధాన్యాల ఉత్పత్తి వ్యయం పెరిగి, అంతిమంగా అమెరికన్ వినియోగదారులకు ద్రవ్యోల్బణం (Inflation) రూపంలో భారం పడుతుంది. రష్యాను దెబ్బతీయడానికి విధించిన టారిఫ్లు, అమెరికా ప్రజల జేబులకే చిల్లు పెట్టే అవకాశం ఉంది. ఇది గ్రహించి యూఎస్ చాకచక్యంగా వ్యవహరిస్తోంది.కీలక లోహాలు, రసాయనాలుపల్లాడియం వంటి కొన్ని లోహాలు, రసాయనాలు రష్యా నుంచే ప్రధానంగా యూఎస్కు దిగుమతి అవుతున్నాయి. వీటిని ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఇతర కీలక పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. సరఫరా గొలుసు (Supply Chain)లో ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయాలు దొరికే వరకు ఈ దిగుమతులను నిలిపివేయడం లేదా టారిఫ్లు పెంచడం కష్టమైన పని.ఎంపిక చేసిన టారిఫ్లు..ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి ముందు అమెరికాకు రష్యా ప్రధానంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ముడిచమురు, గ్యాస్ వంటి ఎనర్జీ ఉత్పత్తులు ప్రధానంగా ఉండేది. యుద్ధం నేపథ్యంలో మొదట్లోనే వాటిపై సంపూర్ణ నిషేధం విధించారు. కానీ, అమెరికా పరిశ్రమలకు నిత్యావసరంగా ఉన్న ఎరువులు, న్యూక్లియర్ ఇంధనం (యురేనియం) వంటి వాటిపై మాత్రం టారిఫ్లు, ఆంక్షల అమలులో కొంతమేరకు సడలింపు ఇచ్చారనే చెప్పాలి. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే అమెరికా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినని వ్యవస్థల్లో మాత్రమే కఠిన ఆంక్షలు విధించారనే వాదనకు తావిస్తోంది.ఇతర దేశాలపై సెకండరీ టారిఫ్ల బెదిరింపులురష్యా నుంచి చమురు లేదా ఇతర వస్తువులు కొనుగోలు చేస్తున్న దేశాలపై ‘సెకండరీ టారిఫ్లు’ విధిస్తామని యూఎస్ బెదిరింపులకు పాల్పడుతోంది. ఇది అంతర్జాతీయంగా విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై ఇటువంటి బెదిరింపులు వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో సంబంధం లేకుండా అమెరికన్ విదేశాంగ విధానాన్ని అడ్డంగా పెట్టుకుని అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ప్రయత్నంగా కనిపిస్తోంది.చివరగా..రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగంగా టారిఫ్లను మరింత కఠినతరం చేస్తే అంతర్జాతీయ సరఫరా గొలుసులకు మరింత ఆటంకం ఏర్పడుతుందని యూఎస్ గుర్తెరుగాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలు పెరిగేందుకు దోహదం చేస్తుందని గ్రహించాలి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి టారిఫ్లపై కాకుండా, మరింత పటిష్టమైన, ప్రపంచ భాగస్వామ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి! -
జీఎస్టీ కోతతో షాపింగ్ సందడి
జీఎస్టీ శ్లాబుల క్రమబద్దీకరణతో నిత్యావసర వస్తువల దగ్గర్నుంచి ఖరీదైన ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల వరకు ధరలు దిగిరావడం పండుగల సమయంలో ఈ–కామర్స్ మార్కెట్లో కొనుగోళ్ల సందడి నెలకొంది. మెట్రోపాలిటన్, కీలక మార్కెట్లలో ఈ–కామర్స్ అమ్మకాలు 23–25 శాతం వరకు పెరిగినట్టు మార్కెట్ పరిశోధన సంస్థ రెడ్సీర్ నిర్వహించిన అధ్యయనంలో తెలిసింది. 32 అంగుళాలకు మించిన టీవీలు, ఫర్నీచర్, ఫ్యాషన్ ఉత్పత్తులపై రేట్ల తగ్గింపు ప్రయోజనాలను కంపెనీలు వినియోగదారులకు బదలాయించాయి. ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరావడంతో సంప్రదాయ డిస్కౌంట్ తగ్గింపులకు పరిమితం కాకుండా, తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఖరీదైన కొనుగోళ్లకు వినియోగదారులు మొగ్గు చూపిస్తున్నట్టు రెడ్సీర్ నివేదిక తెలిపింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో విచక్షణారహిత కొనుగోళ్లకు జీఎస్టీ సంస్కరణలు ప్రేరణనిచ్చినట్లు పేర్కొంది. 8 శాతం తగ్గిన టీవీ ధరలుపెద్ద సైజు టీవీలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో వీటి విక్రయ ధరలు 6–8 శాతం వరకు తగ్గినట్టు, ప్రీమియం మోడళ్లకు డిమాండ్ పెరిగినట్టు రెడ్సీర్ నివేదిక తెలిపింది. ఫ్యాషన్ వ్రస్తాలపై (రూ.2,500లోపు ఉన్నవి) జీఎస్టీని 5 శాతానికి తగ్గించడంతో మధ్య శ్రేణి ధరల దుస్తుల అమ్మకాలు పెరిగినట్టు పేర్కొంది. ఫరి్నచర్పైనా జీఎస్టీ 5 శాతానికి దిగి రావడంతో వినియోగదారులు తమ షాపింగ్ కార్టుల్లో వీటికీ చోటిస్తున్నట్టు వెల్లడించింది. జీఎస్టీలో 12 శాతం, 28 శాతం శ్లాబులను ఎత్తివేసి వాటిల్లోని ఉత్పత్తులను 5 శాతం, 18 శాతం కిందకు తీసుకురావడం తెలిసిందే. పొగాకు ఉత్పత్తులు, విలాస వస్తువులు కొన్నింటిపై మాత్రం 40 శాతం జీఎస్టీని ప్రతిపాదించారు. కొత్త రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి వచ్చాయి.అనూహ్య డిమాండ్..‘మొదటి రెండు రోజులు అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 23–25 శాతం వరకు పెరిగాయి. జీఎస్టీ 2.0కి, పండుగల డిమాండ్ తోడైంది. ప్రీమియం స్మార్ట్ఫోన్లు, టీవీల కొనుగోళ్లు పెరిగాయి. డిమాండ్ బలంగా ఉందని యూజర్ల అభిప్రాయాల ఆధారంగా తెలుస్తోంది. కొనుగోలుకు ఒకేసారి ఎక్కువ మంది ఆసక్తి చూపించడంతో కొన్ని యాప్లు క్రాష్ కావడం, నిదానించడం కనిపించింది. ఫ్లాష్ డీల్స్కు తోడు ముందస్తు డిస్కౌంట్లను సొంతం చేసుకునేందుకు యూజర్లు ఆసక్తి చూపించారు’ అని రెడ్సీర్ నివేదిక తెలిపింది. అమెజాన్ ఈ నెల 23 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాలు ప్రారంభించగా, మొదటి రెండు రోజుల్లోనే 38 కోట్ల కస్టమర్లు తమ ప్లాట్ఫామ్ను సందర్శించినట్టు ప్రకటించింది. 70 శాతం డిమాండ్ టాప్–9 పట్టణాలకు వెలుపలి నుంచే ఉన్నట్టు పేర్కొంది.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాలు, ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులు, క్యూఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ టీవీలు, అత్యాధునిక వాషింగ్ మెషిన్లు, ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ బలంగా ఉన్నట్టు తెలిపింది. టైర్ 2, 3 పట్టణాలకు చెందిన చిన్న, మధ్యస్థాయి సంస్థల అమ్మకాలు (అమెజాన్ ద్వారా) మూడు రెట్లు పెరిగినట్టు అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. మరో ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో విక్రయాలు మొదలు పెట్టగా, మొదటి 48 గంటల్లో 21 శాతం అధికంగా యూజర్లు తమ ప్లాట్ఫామ్కు విచ్చేసినట్టు ప్రకటించింది. మొబైళ్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లకు డిమాండ్ 26 శాతం పెరిగినట్టు తెలిపింది. మెట్రోలతోపాటు ఇండోర్, సూరత్, వారణాసి తదితర పట్టణాల నుంచి సైతం డిమాండ్ కనిపించినట్టు పేర్కొంది. -
మరణించిన వారి ఖాతాలకు ఇక సత్వర పరిష్కారం
ముంబై: మరణించిన వ్యక్తులకు సంబంధించి డిపాజిట్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్లను 15 రోజుల్లోగా పరిష్కరించాలంటూ ఆర్బీఐ కొత్త నిబంధనలు ప్రకటించింది. ఆలస్యం చేస్తే నామినీలకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. మరణించిన వ్యక్తుల ఖాతాల క్లెయిమ్ల విషయంలో బ్యాంకులు భిన్నమైన పద్ధతులను అనుసరిస్తుండడంతో సేవల నాణ్యతను పెంచే దిశగా ఆర్బీఐ ఏకరూప నిబంధనలు తీసుకొచి్చంది. వీటిని సాధ్యమైనంత త్వరగా, 2026 మార్చి 31లోపు అమలు చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. నామినేషన్ లేదా సరై్వవర్షిప్ తో డిపాజిట్ ఖాతా తెరిచినట్టయితే.. సంబంధిత డిపాజిటర్ మరణానంతరం నామినీ లేదా సర్వైవర్షిప్కు బ్యాలన్స్ను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖాతాలకు నామినీ లేదా సర్వైవర్షిప్ క్లాజు లేకపోతే.. నిర్దేశిత మొత్తం లోపు బ్యాలన్స్ ఉన్న సందర్భాల్లో సులభతర చెల్లింపుల నిబంధనలు పాటించాలని ఆర్బీఐ పేర్కొంది. కోఆపరేటివ్ బ్యాంకులకు ఈ పరిమితిని రూ.5 లక్షలు, ఇతర బ్యాంక్లకు ఇది రూ.15 లక్షలుగా నిర్ణయించింది. అంటే మరణించిన వ్యక్తి ఖాతాలకు సంబంధించిన బ్యాలన్స్ ఇంతకులోపు ఉండి, నామినేషన్ లేదా సర్వైవర్షిప్ నమోదు లేని సందర్భాల్లో బ్యాంకులు వారసులకు సులభతర క్లెయిమ్కు వీలు కల్పించాల్సి ఉంటుంది. ఈ పరిమితికి మించి బ్యాలన్స్ ఉంటే అప్పుడు సక్సెషన్ సరి్టఫికెట్ లేదా లీగల్ హైయిర్ (చట్టబద్ధ వారసులుగా ధ్రువీకరణ) సర్టిఫికెట్ను బ్యాంక్లు అడగొచ్చు. క్లెయిమ్ నమోదు చేసి, డాక్యుమెంట్లు సమరి్పంచిన నాటి నుంచి 15 రోజుల్లో బ్యాంకులకు పరిష్కరించాలి. జాప్యానికి కారణాలు బ్యాంకుల వైపు ఉంటే, డిపాజిట్ ఖాతాలోని బ్యాలన్స్పై బ్యాంక్ రేటుకు అదనంగా 4% చొప్పున వార్షిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. లాకర్కు సంబంధించి క్లెయిమ్ను జాప్యం చేస్తే రోజుకు రూ.5,000 చొప్పున చెల్లించాలని ఆర్బీఐ పేర్కొంది. -
అనిశ్చితిలోనూ పటిష్టంగా భారత్: నిర్మలా సీతారామన్
అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల పలు దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ పటిష్టంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. యువ జనాభా, దేశీయంగా డిమాండ్ మెరుగ్గా ఉండటం, స్థిరమైన ఆర్థిక విధానాలు ఎకానమీ వృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు.బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 91వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ 7.8 శాతం వృద్ధి సాధించిందని, ఎస్అండ్పీలాంటి రేటింగ్ ఏజెన్సీలు కూడా దేశ రేటింగ్ను పెంచాయని మంత్రి చెప్పారు. భారత్పై ప్రపంచానికి గల నమ్మకానికి ఇది నిదర్శనమని వివరించారు. వృద్ధి సాధనలో కీలక పాత్ర పోషించే బ్యాంకులు, కస్టమర్ల నమ్మకాన్ని చూరగొనడం, ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. -
జీఎస్టీ క్రమబద్ధీకరణతో విజయం చేకూరిందా?
ప్రభుత్వం ఇటీవల చేపట్టిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) హేతుబద్ధీకరణపై కొందరిలో ఆందోళనలు నెలకొంటుంటే, ఇంకొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులున్న సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచకుండా ఇటువంటి క్రమబద్ధీకరణకు పూనుకొని ఒకింత ప్రజల మన్ననలు పొందడంపై ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పాలి.గందరగోళం నుంచి స్థిరత్వం వైపు..2017లో ప్రారంభించిన జీఎస్టీలో ప్రాథమికంగా సాంకేతిక లోపాలు, గందరగోళం, రాజకీయ విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాష్ట్రాలకు చెల్లించే పరిహారంపై తీవ్ర దుమారమే రేగింది. కేంద్రం రాష్ట్రాల పన్ను వాటాను హరిస్తుందనే వాదనలొచ్చాయి. కానీ కాలక్రమేణా జీఎస్టీ వ్యవస్థ బలపడుతూ వారిని కట్టడి చేయగలిగింది. తాజాగా జీఎస్టీ నిర్మాణంపై కీలక సూచికలు పాజిటివ్గా స్పందిస్తున్నాయి. ఏటా నెలవారీ జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల సంఖ్య 2018లో 1 కోటి(యాక్టివ్ రిజిస్ట్రేషన్స్) నుంచి 2025 నాటికి 1.5 కోట్లకు విస్తరించింది. ఈ-ఇన్వాయిసింగ్, ఈ-వే బిల్లులు, డిజిటల్ రిటర్న్ ఫైలింగ్స్.. వంటి వ్యవస్థల ద్వారా మద్దతు లభించింది.గృహ వినియోగదారులకు ఉపశమనంజీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణతో విస్తృతంగా వినియోగించే వస్తువులు, అవసరమైన సేవలపై భారాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. తద్వారా గృహాలకు ప్రత్యక్ష ఉపశమనం కలిగిస్తుంది. గృహ వినియోగ వ్యయ సర్వే అంచనాల ప్రకారం.. టాప్ 30 గృహ వినియోగ వస్తువులపై సాధారణ సగటు జీఎస్టీ రేటు 11% నుంచి 9%కి పడిపోయింది. ముఖ్యంగా పండుగ సీజన్కు ముందు ప్రభుత్వ నిర్ణయం పెద్ద ఉపశమనాన్ని కలిగించింది. అదే సమయంలో లగ్జరీ వస్తువులు, సిన్గూడ్స్, ప్రీమియం ఉత్పత్తులు ఉపయోగించే వర్గాలకు అధిక జీఎస్టీ రేట్లను విధించింది.ఆదాయ నష్టం..రేట్ల తగ్గింపు ఆదాయ నష్టానికి, ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే గృహాలు, నిత్యావసరాలపై తక్కువ పన్ను ఉండడంతో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధిక వాల్యూమ్లు క్రియేట్ అవుతుండడంతో ద్రవ్యోల్బణం కూడా సానుకూలంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారీగా వినియోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించడం ద్వారా రిటైల్ ధరల సూచిక సానుకూలంగా స్పందిస్తుందనే అభిప్రాయలున్నాయి.అయినా కొందరు..ఇదిలా ఉండగా, ప్రభుత్వ నిర్ణయం మెజారిటీ వర్గానికి మేలు చేసేదైనప్పటికీ కొన్నిచోట్ల రిటైలర్లు, దుకాణాదారులు ఇంకా కొత్త రేట్లను వినియోగదారులకు అందించడం లేదు. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, నిత్యం తనిఖీలు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు జీఎస్టీపై ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే వ్యవస్థను పటిష్టపరచాలని చెబుతున్నారు.ఇదీ చదవండి: మస్క్ కుమార్తె వద్ద డబ్బు లేదంటా..! -
సమస్యగా కాదు... సదావకాశంగా చూద్దాం!
హెచ్–1బీ వీసా రుసుమును పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తాత్కాలికంగా మనల్ని నిస్పృహకు గురి చేసినా... దీర్ఘ కాలంలో మేలు చేస్తుంది. నిజానికి మన ‘ఆత్మనిర్భర్’ నినాదానికీ, ‘అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా చేయడ’మనే ట్రంప్ పిలుపునకూ మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. మరి దానిమీద మనం ఇంతగా స్పందించడం దేనికి? అమెరికా నిర్ణయం సుశిక్షితులైన, ప్రజ్ఞావంతులు, ప్రతిభావంతులు అయిన భారతీయ వృత్తినిపుణుల సంఖ్యను ఆ దేశంలో తగ్గిస్తుంది. కొత్తగా కాలుమోపబోయే వారి సంఖ్య పరిమితమవుతుంది. అమెరికాకు వెళ్ళడాన్ని నిరుత్సాహపరుస్తుంది. కానీ, ఆ కోవకు చెందినవారికి అమెరికాలో కొరత ఉందన్నది కూడా వాస్తవం. అమెరికా కోణం నుంచి చూస్తే అది న్యాయబద్ధమైనదే. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు గైకొనే హక్కు ట్రంప్కు ఉంది. దానిపై మన స్పందన తార్కికమైనదిగా ఉండాలి.భారత నిపుణులను యూరప్ బలవంతంగా..భారతీయ పత్తి పరిశ్రమను 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు నాశనం చేశారు. నేతపనివారినీ, పత్తి పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మందినీ బ్రిటన్కు తీసుకెళ్ళారు. మాంచెస్టర్ రాత్రికి రాత్రి పత్తి మార్కెట్ కేంద్రంగా అవతరించింది. భారతీయుల్లో చాలా మంది దాన్ని న్యాయవిరుద్ధమైన చర్యగానే పరిగణించారు. ఇంగ్లండ్ ఒక కిలో పత్తిని కూడా ఎన్నడూ పండించకపోయినా, యూరప్లోనే వస్త్ర పరిశ్రమకు చాలా ముఖ్యమైన కేంద్రంగా మాంచెస్టర్ రూపుదిద్దు కుంది. నిపుణులైన కార్మికులను భారత్ నుంచి బలవంతంగా తీసుకెళ్ళిన కారణంగానే అది సాధ్యమైంది. వాస్తవానికి, ట్రంప్ ఇపుడు దానికి విరుద్ధమైన పని చేస్తున్నారు. సాంకేతిక నిపుణులను లేదా నిపుణులైన సిబ్బందిని తమ దేశం నుంచి పంపించేయాలని చూస్తున్నారు. అమెరికాకు రాకుండా నివారిస్తున్నారు. కానీ, మనవారిని తీసుకెళ్ళడం వల్ల బ్రిటిష్ వారు బాగు పడినంతగా, మనవారిని పంపించేయడం వల్ల అమెరికా లబ్ధి పొందబోవడం లేదు.ప్రతిభావంతులను ఆకర్షించే వ్యవస్థ..ట్రంప్ నిర్ణయం ఆత్మనిర్భర్ భావనను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేందుకు పురికొల్పినదవుతుంది. ఇందుకు మన ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, నియంత్రణలపై దృష్టి పెట్టి కీలక రంగాల్లో సత్వర సంస్కరణలు తీసుకురావాలి. సర్వవిధాలా ప్రతిభావంతులను ఆకర్షించి, అండగా నిలిచి, నిలబెట్టుకుని ప్రోత్సహించే సరైన పర్యావరణ వ్యవస్థను సృష్టించాలి. విశ్వవిద్యాలయాలను పటిష్ఠపరచాలి. హెచ్–1బీతో ట్రంప్ తాజా దాడి, ఐఐటీలు, ఐఐఎస్సీలు తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి తాజా గ్రాడ్యుయేట్లు తండోపతండాలుగా అమెరికాకు తరలిపోకుండా తగ్గించడానికి, ఇంకా చెప్పాలంటే ఆగిపోవడానికి కూడా తోడ్పడవచ్చు.కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం..అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను భారతదేశంలోనే అట్టిపెట్టుకునేందుకు, వారు భారతీయ ప్రయోజనాలకు ఉపయోగపడేటట్లు చేసుకునేందుకు ఇది స్పష్టంగా నిజమైన అవకాశం కల్పిస్తోంది. విద్యార్థుల చదువు, శిక్షణలకు ప్రతి ఐఐటీ పైనా భారత్ రూ.1000 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. కానీ, వాటి నుంచి దేశం పూర్తి ఫలాలను నిజంగానే పొందడం లేదు. అమెరికా, యూరప్లకు చెందిన అనేక సంస్థల సీఈఓలుగా మన ఐఐటీ మెరికలు పని చేస్తూంటే వారి పేర్లు, పాత్రలను గొప్పగా చెప్పుకుంటూ గర్విస్తున్నాం. భారతీయుల ఆలోచనా శక్తి, వారసత్వం, ప్రజ్ఞాపాటవాలను ప్రపంచంలోని మిగిలిన దేశాలకు వినమ్రంగా, బలంగా, ఆత్మ విశ్వాసంతో చాటి చెప్పేందుకు, నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైంది.– ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి, మాజీ వైస్ చాన్సలర్, యోగి వేమన యూనివర్సిటీ -
అమెరికాకు స్మార్ట్ఫోన్ల ఎగుమతులు అప్
భారత్ నుంచి ఆగస్టులో స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 1.53 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 39 శాతం పెరిగాయి. అటు అమెరికాకు ఎగుమతులు రెట్టింపై ఏకంగా 148 శాతం మేర ఎగిశాయి. ఇండియా సెల్యూలార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ICEA) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల్లో అమెరికాకు స్మార్ట్ఫోన్ల(Smart Phones) ఎగుమతులు దాదాపు మూడు రెట్లు పెరిగాయి. 2.88 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 8.43 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.2025 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 10.56 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నమోదు కాగా, ఈ ఏడాది ఏప్రిల్–ఆగస్టు మధ్య కేవలం అయిదు నెలల వ్యవధిలోనే అందులో 80 శాతం ఎగుమతులను సాధించినట్లు ఐసీఈఏ తెలిపింది. ‘అందరూ చెబుతున్న దానికి భిన్నంగా ఆగస్టులో స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 39 శాతం పెరిగాయి. 2024 ఆగస్టులో ఇవి 1.09 బిలియన్ డాలర్లుగా ఉండగా తాజా ఆగస్టులో 1.53 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక అమెరికాకు ఎగుమతులు 148 శాతం ఎగిశాయి. 388 మిలియన్ డాలర్ల నుంచి 965 మిలియన్ డాలర్లకు చేరాయి’ అని పేర్కొంది.మొబైల్ ఫోన్లు, ఎల్రక్టానిక్స్, సెమీకండక్టర్ల(Semi Conductors) తయారీ సంస్థల సమాఖ్య అయిన ఐసీఈఏ తరచుగా ఉత్పత్తి, ఎగుమతుల డేటాను ప్రచురిస్తుంది. కొన్ని వర్గాలు తమ వాదనలకు మద్దతునిచ్చే డేటాను తీసుకుని స్మార్ట్ఫోన్ల ఎగుమతులు తగ్గాయనే తప్పుడు అభిప్రాయానికి రావడం సరికాదని ఐసీఈఏ పేర్కొంది. అతి పెద్ద మార్కెట్ అయిన అమెరికాకు భారత స్మార్ట్ఫోన్ల ఎగుమతులు మే నెలలో 2.29 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఆగస్టులో 964.8 మిలియన్ డాలర్లకు (సుమారు 58 శాతం తగ్గుదల) పడిపోయినట్లు మేధావుల సంఘం జీటీఆర్ఐ వెల్లడించిన నేపథ్యంలో ఐసీఈఏ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈసారి ట్రెండ్కి భిన్నం..సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్ ప్రథమార్ధంలో స్మార్ట్ఫోన్ ఎగుమతులు నెమ్మదిస్తాయని, కానీ ఈసారి ట్రెండ్కి భిన్నమైన ధోరణి కనిపించిందని ఐసీఈఏ తెలిపింది. పండుగల సీజన్కి సరిగ్గా ముందు సెప్టెంబర్ ఆఖర్లోను, అక్టోబర్లోను కంపెనీలు కొత్త మోడల్స్ను ఆవిష్కరిస్తుంటాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు ఆగస్టులో స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లను తగ్గించుకుంటారని వివరించింది. దీనితో ఎగుమతులు కూడా తగ్గిపోతుంటాయని పేర్కొంది. పాత మోడల్స్ను కొందామనుకునే వారు కూడా కొత్త మోడల్స్ వచ్చే వరకు నిరీక్షిస్తారని, కొత్తవి వస్తే పాత వాటిపై మరింతగా డిస్కౌంట్లు వస్తాయనే ఆలోచనే ఇందుకు కారణమని ఐసీఈఏ పేర్కొంది. దీని ఫలితంగా పాత మోడల్స్ ఎగుమతులు కూడా తగ్గుతాయని, అక్టోబర్లో మళ్లీ పుంజుకుంటాయని వివరించింది.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?కొత్త మోడల్స్ కోసం ఆగస్టు, సెప్టెంబర్ తొలినాళ్లలో ప్లాంట్లు, యంత్రాలను సిద్ధం చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టడం వల్ల ఉత్పత్తి, అలాగే ఎగుమతులు కూడా నెమ్మదిస్తాయని ఐసీఈఏ పేర్కొంది. దీపావళి, ఇతరత్రా పండగల తేదీలను బట్టి దేశీయంగా డిమాండ్కి తగ్గట్లు సరఫరా చేసేందుకు వీలుగా ఉత్పత్తులను మళ్లించడం వల్ల అక్టోబర్ మధ్య వరకు ఎగుమతులు కాస్త తగ్గుతాయని వివరించింది. దీపావళి తర్వాత మాత్రం పాశ్చాత్య దేశాల్లో థాంక్స్గివింగ్ హాలిడేలు, బ్లాక్ ఫ్రైడే, క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా అంతర్జాతీయంగా అన్ని మోడల్స్కి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఎగుమతులు కూడా పుంజుకుంటాయని ఐసీఈఏ తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రవేశపెట్టాక గత అయిదేళ్ల నుంచి దేశీయంగా స్మార్ట్ఫోన్ సెగ్మెంట్ అత్యంత మెరుగ్గా రాణిస్తున్న ఎగుమతి పరిశ్రమగా నిలుస్తున్నట్లు వివరించింది. -
వెండి దిగుమతులపై ఆంక్షలు.. వచ్చే మార్చి వరకు..
బయటి దేశాల నుంచి వచ్చే వెండి దిగుమతులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రత్నాలు లేని సాధారణ వెండి ఆభరణాల (Silver jewellery) దిగుమతులను పరిమితం చేసింది. ఈ ఆంక్షలు తక్షణం అమల్లోకి వచ్చి 2026 మార్చి చివరి వరకు కొనసాగుతాయి.వెండి దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. "స్వేచ్ఛా విధానం నుంచి పరిమిత విధానానికి దిగుమతి విధానాన్ని తక్షణమే మార్పు చేశాం. ఈ మార్పు మార్చి 31, 2026 వరకు అమలులో ఉంటుంది" అని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దీని ప్రకారం.. దీనిపై ఇకపై వెండి ఆభరణాలు దిగుమతి (Imports) చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.ఆంక్షలకు కారణాలు ఇవే..2024-25 ఏప్రిల్-జూన్ నుండి 2025-26 ఏప్రిల్-జూన్ వరకు ప్రిఫరెన్షియల్ డ్యూటీ మినహాయింపుల కింద వెండి ఆభరణాల దిగుమతులు గణనీయంగా పెరిగాయి. ఇలా దిగుమతి చేసుకున్న వెండి వస్తువులను పూర్తయిన ఆభరణాలుగా చూపించి దిగుమతి సుంకాలను ఎగ్గొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం భారతదేశ ఆభరణాల తయారీదారులకు సమాన అవకాశాలను అందిస్తుందని, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ప్రయోజనాలను పరిరక్షించగలదని, ఈ రంగంలోని కార్మికులకు జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రభుత్వం విశ్వసిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: బంగారం ధరలు: మరింత గుడ్న్యూస్! -
జీఎస్టీ ఇంకా తగ్గిస్తాం: యూపీ వేదికపై మోదీ ప్రకటన
జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో నిత్యావసర వస్తువులు, ఔషధాల ధరలు మాత్రమే కాకుండా.. కార్లు, ఎలక్ట్రానిక్స్ ధరలు కూడా తగ్గాయి. ఈ పన్నులు భవిష్యత్తులో మరింత తగ్గుతాయని దేశ ప్రధాని వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025 కార్యక్రమంలో నరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2025కు రష్యా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో నరేంద్ర మోదీ.. రష్యా, భారత్ బంధం గురించి కూడా ప్రస్తావించారు. స్వదేశీ రక్షణ ఉత్పత్తిని పెంచడంలో ఉత్తరప్రదేశ్ గణనీయమైన పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. రష్యా సహకారంతో ఏర్పాటు చేసిన కర్మాగారంలో ఏకే-203 రైఫిల్స్ ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు.భారతదేశ స్వయం సమృద్ధిలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా ఉంది. దేశంలో తయారవుతున్న మొత్తం ఫోన్లలో 50 శాతం కంటే ఎక్కువ యూపీ నుంచే వస్తున్నాయి. అంతే కాకుండా మన దేశంలోనే అన్నింటిని ఉత్పత్తి చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్లో ఒక రక్షణ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నామని, అక్కడ బ్రహ్మోస్ క్షిపణులు, ఇతర ఆయుధ వ్యవస్థల తయారీ ఇప్పటికే ప్రారంభమైందని మోదీ వెల్లడించారు.ఇదీ చదవండి: 'జీఎస్టీ తగ్గినా.. ధరలు తగ్గలేదు': ఫిర్యాదులపై స్పందించిన కేంద్రంపన్నులను తగ్గిస్తూనే ఉంటాముజీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను కూడా ఈ సందర్భంగా మోదీ హైలైట్ చేశారు. కొత్త జీఎస్టీ అమలులోకి రావడంతో.. సాధారణ కుటుంబాలు ప్రతినెలా కొంత ఎక్కువ పొదుపు చేసుకోగలుగుతారని అన్నారు. కాగా జీఎస్టీ సంస్కరణల ప్రచారంపై కాంగ్రెస్ విమర్శలు చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూనే.. పన్నులను తగ్గిస్తూనే ఉంటాము. జీఎస్టీ సంస్కరణల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన అన్నారు. -
చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!?
భారతదేశంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం చాలా ముఖ్యం. బైక్లో వెళ్లినా, కారు నడుపుతున్నా.. ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే. నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ట్రాఫిక్ రూల్స్ను సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు ప్రజలు సాధారణ ట్రాఫిక్ నియమాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. చెప్పులు ధరించి డ్రైవింగ్ చేయడంపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో భిన్న అభిప్రాయాలతో పోస్టులు వైరల్గా మారుతున్నాయి.చెప్పులు ధరించి కారు లేదా ద్విచక్ర వాహనం నడపడం భారతదేశంలో చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని కొందరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఇది నిజం కాదు. మోటారు వాహన చట్టం ప్రకారం చెప్పులు ధరించి ఎవరైనా వాహనం నడుపుతున్నట్లయితే జరిమానా విధించడం లేదా చలానా వేసే నిబంధన ఏదీ లేదు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకోవడం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ట్వీట్ చేశారు.చెప్పులు ధరించి డ్రైవింగ్ చేయడం సురక్షితమేనా?చెప్పులు ధరించి డ్రైవ్ చేయడం అంత సురక్షితం మాత్రం కాదని కొందరు రోడ్డు, రవాణా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అవి పెడల్స్, గేర్ లీవర్పై పట్టుతప్పే అవకాశం ఉందంటున్నారు. అందువల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు షూ ధరిస్తే మేలని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడితే అంతే.. -
జీఎస్టీఏటీని ప్రారంభించిన ఆర్థిక మంత్రి
వ్యాపారవర్గాలు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ మధ్య వివాదాల సత్వర పరిష్కారానికి ఉపయోగపడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా జీఎస్టీ అపీలేట్ ట్రిబ్యునల్ (gstat)ని ప్రారంభించారు. వ్యాపార సంస్థలు ఈ పోర్టల్లో తమ కేసులను ఫైల్ చేయొచ్చు. డిసెంబర్ నుంచి వాటిపై విచారణ ప్రారంభమవుతుంది.భారత్లో సంస్కరణలు పురోగమించే తీరుకు ఇది నిదర్శనంగా నిలుస్తుందని నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman.) చెప్పారు. మరింత మెరుగుపడాలన్న దృఢ సంకల్పాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. వివాదాల పరిష్కారానికి ఈ పోర్టల్ను ఉపయోగించుకోవాలని వ్యాపార సంఘాలకు ఆమె సూచించారు. అప్పీళ్ల ఫైలింగ్కి వ్యవధిని 2026 జూన్ 30 వరకు పొడిగించినట్లు వివరించారు.ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!జీఎస్టీఏటీ ట్రిబ్యునల్ ముఖ్యాంశాలుప్రారంభ తేదీ: సెప్టెంబర్ 24, 2025పన్ను చెల్లింపుదారులు, అధికారుల మధ్య పెండింగ్లో ఉన్న 4.83 లక్షలకు పైగా జీఎస్టీ వివాదాలను పరిష్కరించడం దీని ఉద్దేశం.డిజిటల్ ఫైలింగ్ ద్వారా జీఎస్టీఏటీ పోర్టల్లో పన్ను చెల్లింపుదారులు అప్పీళ్లను దాఖలు చేయవచ్చు. కేసులను ట్రాక్ చేయవచ్చు. వర్చువల్ విచారణలకు హాజరు కావచ్చు.దీని ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీలో ఉంటుంది.దేశవ్యాప్తంగా 45 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేశారు. -
ప్రపంచ ఎకానమీ డీలా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది(2026) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డీలా పడనున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) తాజాగా అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీన వృద్ధి, వ్యవస్థాగత సవాళ్ల దశలోకి ప్రవేశించినట్లు ‘చీఫ్ ఎకానమిస్టుల’ ఔట్లుక్ నివేదికలో పేర్కొంది. అయితే భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు తెలియజేసింది. 2025లో ఎకానమీ 6.5 శాతం పురోగతి సాధించనున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) అంచనాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. కాగా.. దేశ ఎగుమతులపై యూఎస్ 50 శాతం అదనపు టారిఫ్ల విధింపు కారణంగా భారత్ తయారీ లక్ష్యాలకు విఘాతం కలగనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో మొత్తం దక్షిణాసియా ప్రాంత ఔట్లుక్పై ప్రభావం పడనున్నట్లు తెలియజేసింది. 72 శాతం తీరిలా డబ్ల్యూఈఎఫ్ సర్వే ప్రకారం 72 శాతం ప్రధాన ఆర్థికవేత్త(చీఫ్ ఎకనమిస్ట్)లు 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనపడనున్నట్లు అంచనా వేయగా.. వాణిజ్య అవరోధాలు పెరగడం, విధానాలలో అనిశి్చతులు, సాంకేతికతలలో వేగవంత మార్పులు ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. అయితే వర్ధమాన మార్కెట్లు ప్రధాన వృద్ధి చోదకాలుగా నిలవనున్నట్లు తెలియజేసింది. ఈ దిశలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా(ఎంఈఎన్ఏ), దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా, పసిఫిక్ వెలుగు రేఖల్లా కనిపిస్తున్నట్లు పేర్కొంది. సర్వేలో పాల్గొన్న ప్రతీ ముగ్గురు ప్రధాన ఆర్థికవేత్తలలో ఒకరు ఈ ప్రాంతాలు అత్యంత పటిష్ట వృద్ధిని సాధించనున్నట్లు అభిప్రాయపడినట్లు వెల్లడించింది. చైనా ఔట్లుక్పై మిశ్రమ స్పందన కనిపించగా.. 56 శాతంమంది చీఫ్ ఎకనమిస్ట్లు అంతంతమాత్ర వృద్ధిని అంచనా వేసినట్లు తెలియజేసింది. ధరల(ద్రవ్యోల్బణ) తగ్గుదల ఒత్తిళ్లు మరింత పెరగనున్నట్లు అభిప్రాయపడ్డారని వివరించింది. -
భారత్కు యూఏఈ వీసా నిలిపేసిందా?
యూఏఈ(UAE) విదేశాల నుంచి తమ దేశం వస్తున్న టూరిస్ట్లు, వర్కింగ్ వీసాదారులను తాత్కాలికంగా నిలిపేసిందని(Suspension) కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే దీనిపై యూఏఈ అధికారికంగా వివరణ ఇవ్వాల్సి ఉంది. కథనాల్లోని వివరాల ప్రకారం.. యూఏఈ తొమ్మిది దేశాల టూరిస్ట్ వీసాలు, వర్కింగ్ వీసాల(tourist and work visas) జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ జాబితాలో భారత్ లేదని గమనించాలి. యూఏఈ వీసాలు నిలిపేసిన దేశాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.అఫ్గానిస్థాన్లిబియాయెమెన్సోమాలియాలెబనాన్బంగ్లాదేశ్కామెరూన్సూడాన్ఉగాండాఈ సస్పెన్షన్ కొత్త వీసా దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. పైన తెలిపిన దేశాల నుంచి వచ్చి ప్రస్తుతం యూఏఈలో ఉంటున్న వీసా హోల్డర్లకు ఎలాంటి సమస్య లేదు.ఈ నిర్ణయానికి కారణం..భద్రతా ఆందోళనలు: ఇంటెలిజెన్స్ నివేదికలు ఉగ్రవాదానికి సంబంధించిన సంభావ్య ప్రమాదాలను సూచిస్తున్నాయి.దౌత్యపరమైన ఉద్రిక్తతలు: కొన్ని దేశాలకు యూఏఈ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలతో ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇది వీసా విధాన నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.ప్రజారోగ్య ప్రోటోకాల్స్: కరోనా నియంత్రణలో ఉన్నప్పటికీ యూఏఈ కఠినమైన ఆరోగ్య పరీక్షలు, ప్రయాణ భద్రతా చర్యలను అమలు చేస్తూనే ఉంది. తక్కువ టీకా రేట్లు లేదా అస్థిరమైన ఆరోగ్య డేటా రిపోర్టింగ్ ఉన్న దేశాలు దీని వల్ల ప్రభావితం అవుతున్నాయి.మైగ్రేషన్ మేనేజ్మెంట్: కార్మికుల రాకపోకలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి యూఏఈ తన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పునసమీక్షిస్తోంది.ఇదీ చదవండి: హెచ్-1బీ వీసా నిపుణులకు మైక్రోసాఫ్ట్ వేతనాలు ఇలా.. -
వడ్డీ రేట్ల కోతపై ఎస్బీఐ అంచనా
ఆర్బీఐ తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును పావు శాతం మేర (25 బేసిస్ పాయింట్లు) తగ్గించే అవకాశం ఉందని ఎస్బీఐ(SBI) పరిశోధన విభాగం (ఎస్బీఐ రీసెర్చ్) అంచనా వేసింది. రెపో రేటు తగ్గింపునకు కీలకమైన ద్రవ్యోల్బణం సమీప కాలంలోనే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నియంత్రణలోనే ఉంటుందని పేర్కొంది.ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగి రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటు(Repo Rate)ను ఒక శాతం తగ్గించడం తెలిసిందే. ఆగస్ట్లో జరిగిన చివరి సమీక్షలో మాత్రం రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశం జరగనుంది. అక్టోబర్ 1న నిర్ణయాలు వెలువడనున్నాయి. తదుపరి సమీక్షలోనూ రేట్ల కోతకు వెళ్లేందుకు హేతుబద్దత ఉన్నట్టు ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఆ సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ వ్యక్తం చేసే అభిప్రాయాలు భవిష్యత్తు మానిటరీ పాలసీకి కీలకమవుతాయని, ఈల్డ్స్పై ప్రభావం చూపుతాయని తెలిపింది.ద్రవ్యోల్బణం నియంత్రణల్లో ఉన్నందున, తటస్థ విధానంతో మరో విడత రేటు కోతను చేపట్టకపోవడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఉండదని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. జీఎస్టీలో రేట్లను క్రమబద్దీకరించడం ఫలితంగా ద్రవ్యోల్బణం మరో 65–75 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అధ్యయన నివేదికను రూపొందించిన, ఎస్బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ అంచనా వేశారు. కొత్త సీపీఐ సిరీస్తో ద్రవ్యోల్బణం మరో 20–30 బేసిస్ పాయింట్లు దిగొస్తుందని చెప్పారు. దీంతో 2025–26లో, 2026–27లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యిత స్థాయిలో దిగువనే ఉండొచ్చని (4 శాతానికి మైనస్, ప్లస్ 2 శాతం.. అంటే 2 శాతం) పేర్కొన్నారు.ఇదీ చదవండి: సీఆర్పీఎఫ్కు రైఫిల్స్ సరఫరా -
జీడీపీ వృద్ధి 6.5 శాతం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) భారత జీడీపీ 6.5% వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న గత అంచనాలను కొనసాగిస్తున్నట్టు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ (అంతర్జాతీయ రేటింగ్ సంస్థ) ప్రకటించింది. వర్షాలు సమృద్ధిగా పడడం, ఆదాయపన్ను, జీఎస్టీ రేట్ల తగ్గింపుతో దేశీ వినియోగం బలంగా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ పెట్టుబడులు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంత్సరంలో 3.2 శాతానికి పరిమితం అవుతుందని, దీంతో ఆర్బీఐ మరో విడత పావు శాతం మేర రెపో రేటును తగ్గించొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. అంచనాలకు మించి ఆహార ధరలు తగ్గడం.. ప్రస్తుత ఏడాదిలో ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలోనే కొనసాగేందుకు మద్దతుగా ఉంటుందని తెలిపింది. ఇది తదుపరి రేట్ల కోతకు వెసులుబాటునిస్తుందని అభిప్రాయపడింది. ఆసియా దేశాల ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లు.. వాటి ఎగుమతులు, ప్రాంతీయ సరఫరా పరిస్థితులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. ‘‘యూఎస్ టారిఫ్లపై జూన్లో వేసిన మా అంచనాల తర్వాత పరిణామాలను గమనిస్తే.. ఇప్పటి వరకు ఇతర దేశాల కంటే చైనా మెరుగ్గా వ్యవహరించింది. ఆగ్నేయాసియా అభివృద్ధి మార్కెట్లపై ప్రభావం పడగా, భారత్పై ఇది మరింత ఎక్కువగా ఉంది’’ అని ఎస్అండ్పీ వివరించింది. -
జులైలో 21.04 లక్షల మందికి ఉపాధి
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో ఉపాధి కల్పన జూలైలో బలంగా నమోదైంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) కింద 21.04 లక్షల మంది సభ్యులు నికరంగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలో సభ్యుల చేరికతో పోల్చి చూస్తే 5.5 శాతం పెరుగుదల కనిపించింది. ఇందులో 9.79 లక్షల మంది కొత్తగా చేరిన సభ్యులు ఉన్నారు. ఉపాధి అవకాశాల పెరుగుదలను, ఉద్యోగుల భవిష్యనిధి ప్రయోజనాల పట్ల పెరుగుతున్న అవగాహనకు ఇది నిదర్శనమని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. జూలైలో నమోదైన కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసు వారు 5.98 లక్షల మంది ఉన్నారు. మొత్తం కొత్త సభ్యుల్లో (9.79 లక్షలు) వీరు 61 శాతంగా ఉన్నారు. ఇదే వయసు నుంచి చేరిన నికర సభ్యులు మొత్తంగా 9.13 లక్షల మంది ఉన్నారు. 2024 జూలై నెలతో పోల్చి చూస్తే 4 శాతం పెరిగారు. జూలైలో 45 శాతం సభ్యులు 18–25 ఏళ్ల నుంచి ఉండడం సంఘటిత రంగంలో ఉపాధి పెరుగుదలను సూచిస్తోంది. సుమారు 16.43 లక్షల మంది ఒక సంస్థలో ఉద్యోగం మానేసి, మరొక సంస్థలో చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతేడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూస్తే 12 శాతం మంది అధికంగా సంస్థలను మార్చినట్టు తెలుస్తోంది. 2.80 లక్షల మంది మహిళలు జూలై నెలలో చేరిన నికర సభ్యుల్లో మహిళలు 4.42 లక్షల మంది కాగా, ఇందులో కొత్త సభ్యులు 2.80 లక్షలుగా ఉన్నారు. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే నికర సభ్యుల్లో పెరుగుదల కేవలం 0.17 శాతంగానే ఉంది. మొత్తం నికర సభ్యుల్లో మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 20.47 శాతం మంది ఉన్నారు. తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ, యూపీ.. ఇలా ఒక్కో రాష్ట్రం నుంచి 5 శాతానికిపైనే సభ్యులు చేరారు. ఐరన్ ఓర్ మైనింగ్, యూనివర్సిటీలు, బీడీల తయారీ, వ్రస్తాల తయారీ, ఆస్పత్రులు, ట్రావెల్ ఏజెన్సీలు ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించాయి. -
రూపాయి క్షీణతతో ఎగుమతులు ఖుషీ
న్యూఢిల్లీ: దేశీ కరెన్సీ యూఎస్ డాలరుతో మారకంలో తాజాగా చరిత్రాత్మక కనిష్టం 88.75ను తాకడంతో ఎగుమతులు పుంజుకునేందుకు వీలు చిక్కుతుంది. రూపాయి బలహీనపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో దేశీ ప్రొడక్టులు చౌకగా మారి పోటీలో బలపడనున్నాయి. దీంతో ఎగుమతిదారులకు లబ్ది చేకూరనుంది. అయితే కరెన్సీ మారకంలో హెచ్చుతగ్గుల కారణంగా దిగుమతులకు సవాళ్లు ఎదురుకానున్నట్లు ఎగుమతిదారులు పేర్కొంటున్నారు. ముడివ్యయాలు పెరిగిపోవడంతో ప్రధానంగా రత్నాలు, బంగారు ఆభరణాలు, పెట్రోలియం, ఎల్రక్టానిక్స్ తదితర దిగుమతి ఆధారిత రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు తెలియజేశారు. మంగళవారం(23న) ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో రూపాయి 47 పైసలు పతనమై 88.75 వద్ద నిలిచింది. విదేశీ ఫండ్స్ పెట్టుబడులు వెనక్కిమళ్లడానికితోడు.. హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడంతో దేశీ ఐటీ సరీ్వసుల ఎగుమతులకు దెబ్బతగలనున్నట్లు ఫారెక్స్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రూపాయి పతనం స్వల్పకాలంలో ఎగుమతిదారులకు లబ్దిని చేకూర్చనున్నట్లు భారత ఎగుమతిదారుల సమాఖ్య(ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ పేర్కొన్నారు. అయితే డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ విలువ స్థిరత్వాన్ని సాధించవలసి ఉన్నట్లు తెలియజేశారు. టారిఫ్ల నేపథ్యంలో.. యూఎస్ అధిక టారిఫ్లు అమలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి బలహీనత దేశీ ఎగుమతులకు దన్నుగా నిలవనున్నట్లు ముంబై సంస్థ టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ ఎస్కే సరఫ్ పేర్కొన్నారు. రానున్న 4–5 నెలల్లో డాలరుతో మారకంలో రూపాయి విలువ 100ను చేరనున్నట్లు అంచనా వేశారు. డాలరుతో రూపాయి మారక విలువ 100కు చేరడం సాధారణ విషయంగా మారిపోవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా.. రూపాయి పతనం ముడిచమురు, బంగారం, ఎల్రక్టానిక్ వస్తువుల దిగుమతుతోపాటు.. విదేశీ చదువు, పర్యాటకాన్ని భారంగా మార్చనున్నట్లు మరొక ట్రేడర్ వివరించారు. ఎగుమతిదారులకు లబ్ది చేకూర్చనున్నప్పటికీ, దిగుమతిదారులు అదేపరిమాణంలోని వస్తువులకు అధిక ధరను చెల్లించవలసి వస్తుందని తెలియజేశారు. దేశీ అవసరాలకు వినియోగించే చమురులో 85 శాతంవరకూ దిగుమతులనుంచి సమకూరుతున్న సంగతి తెలిసిందే. దీంతో చమురు, బంగారంతోపాటు.. ఎలక్ట్రానిక్స్, కోల్, ప్లాస్టిక్ మెటీరియల్స్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, మెషీనరీ తదితర దిగుమతులకు అధికంగా చెల్లించవలసి వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) ఏప్రిల్– ఆగస్ట్ మధ్య కాలంలో ఎగుమతులు 184 బిలియన్ డాలర్లను అధిగమించగా.. దిగుమతులు 306.52 బిలియన్ డాలర్లను తాకాయి. వెరసి ఈ అంతరం వాణిజ్య లోటుకు దారితీస్తున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. -
'జీఎస్టీ తగ్గినా.. ధరలు తగ్గలేదు': ఫిర్యాదులపై స్పందించిన కేంద్రం
జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. సెప్టెంబర్ 22 నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. అయితే కొన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఆ ప్రయోజనాలను బదిలీ చేయడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. కొత్త జీఎస్టీ ప్రకారం.. ధరలు తగ్గించడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేంద్రం స్పందించింది.మేము ధరల మార్పులను పర్యవేక్షిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఫిర్యాదులపై వెంటనే స్పందించలేము. సెప్టెంబర్ 30 నాటికి జీఎస్టీ అమలుకు సంబంధించిన నివేదిక అందుతుంది. నివేదిక అందిన తరువాత.. ఏవైనా సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రెండు అమెరికా కంపెనీల నిర్ణయం: సీఈఓలుగా ఇండియన్స్ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వ శాఖ.. కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ అధికారులకు లేఖ రాసింది. సాధారణంగా ఉపయోగించే వస్తువుల ధరల మార్పులపై నెలవారీ నివేదికను సమర్పించాలని కోరింది. బ్రాండ్ వారీగా ఈ వస్తువుల గరిష్ట రిటైల్ ధర (MRP) తులనాత్మక వివరాలపై మొదటి నివేదికను సెప్టెంబర్ 30లోపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC)కి సమర్పించాలని వెల్లడించింది. ఈ నివేదిక తరువాత తదుపరి చర్యలు తీసుకోనుంది. -
పెరుగుతోన్న యూపీఐ లావాదేవీలు
దేశంలో యూపీఐ వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. నేడు ఏ చిన్న వస్తువు కొనాలన్నా.. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. దీంతో యూపీఐ లావాదేవీల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేవలం భారత్లోనే కాకుండా బ్రెజిల్, సింగపూర్లోనూ వీటి సంఖ్య పెరుగుతోంది. ఇటీవల గణాంకాల ప్రకారం ఇండియాలో ఆగస్టులో గరిష్టంగా 20 బిలియన్ లావాదేవీలు దాటినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెల్లడించింది. ఆగస్టులో జరిగిన మొత్తం లావాదేవీలు 20.01 బిలియన్స్.. జులైలో 19.47 బిలియన్స్ కంటే 2.8 శాతం ఎక్కువ.అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 34 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. విలువ పరంగా ఆగస్టులో యూపీఐ లావాదేవీలు రూ. 24.85 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 24 శాతం ఎక్కువ అని డేటా చెబుతోంది. సగటున రోజువారీ లావాదేవీల సంఖ్య 645 మిలియన్లకు పెరిగింది. NPCI డేటా ప్రకారం రోజువారీ లావాదేవీ విలువ రూ. 80,177 కోట్లు కావడం గమనార్హం. ఆగస్టు 2న UPI ఒకే రోజులో 700 మిలియన్ లావాదేవీలను దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. రియల్ మనీ గేమింగ్ ప్లాట్ఫామ్లపై నిషేధం ఉన్నప్పటికీ ఆగస్టులో ఈ పెరుగుదల నమోదైంది.ఇదీ చదవండి: ఒకేరోజు భారీగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..వివిధ దేశాల్లో యూపీఐ నెలవారీ లావాదేవీలు ఇలా..యూపీఐ ఇండియాలో ప్రారంభం: 2016నెలవారీ లావాదేవీలు: 19 బిలియన్+బ్రెజిల్లో ప్రారంభం: 2020నెలవారీ లావాదేవీలు: సుమారు 5 బిలియన్+సింగపూర్లో ప్రారంభం: 2017నెలవారీ లావేదేవీలు: సుమారు: 0.5 బిలియన్+ -
దీపావళికి గిఫ్ట్ ఇచ్చే కంపెనీలకు ఆదేశాలు
దీపావళి(Divali) లేదా మరే ఇతర పండుగల సందర్భంగా బహుమతుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయవద్దని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థలను ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) ఆదేశించింది. సెప్టెంబర్ 19, 2025న ప్రకటించిన ఈ మెమోరాండం సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, అనవసరమైన ఖర్చులను పరిమితం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్(వ్యయ శాఖ) జారీ చేసిన మెమోరాండం ప్రకారం.. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇదే తరహాలో గతంలో ఆదేశాలు జారీ చేశామని, ప్రభుత్వ నిధులను జాగ్రత్తగా వినియోగించుకునేలా ప్రభుత్వ విధానానికి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. ‘ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం, అనవసరమైన వ్యయాలను అరికట్టడం లక్ష్యంగా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది. ఈ ప్రదీపావళి లేదా మరే ఇతర పండుగల సందర్భంగా బహుమతుల కోసం ప్రజాధనాన్ని వృథా చేయవద్దని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ సంస్థలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సెప్టెంబర్ 19, 2025న ప్రకటించిన ఈ మెమోరాండం సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను అమలు చేయడానికి, అనవసరమైన ఖర్చులను పరిమితం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్(వ్యయ శాఖ) జారీ చేసిన మెమోరాండం ప్రకారం.. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇదే తరహాలో గతంలో ఆదేశాలు జారీ చేశామని, ప్రభుత్వ నిధులను జాగ్రత్తగా వినియోగించుకునేలా ప్రభుత్వ విధానానికి కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్క్యులర్ పేర్కొంది. ‘ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం, అనవసరమైన వ్యయాలను అరికట్టడం లక్ష్యంగా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తోంది. ఈ ప్రయత్నాలకు కొనసాగింపుగా ప్రజా వనరులను వివేకవంతంగా, న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దీపావళి, ఇతర పండుగల బహుమతుల కోసం మంత్రిత్వ శాఖలు / విభాగాలు, ఇతర అనుబంధ సంస్థలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదు’ అని నిర్ణయించారు.ఈ మెమోరాండంను వ్యయ కార్యదర్శి ఆమోదించగా, భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పి.కె.సింగ్ సంతకం చేశారు. ఇది అన్ని మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాల ఆర్థిక సలహాదారులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆర్థిక సేవల విభాగానికి పంపినట్లు తెలిపారు.యత్నాలకు కొనసాగింపుగా ప్రజా వనరులను వివేకవంతంగా, న్యాయబద్ధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో దీపావళి, ఇతర పండుగల బహుమతుల కోసం మంత్రిత్వ శాఖలు / విభాగాలు, ఇతర అనుబంధ సంస్థలు ప్రజాధనాన్ని దుర్వినియోగం(Gift Ban) చేయకూడదు’ అని నిర్ణయించారు.ఈ మెమోరాండంను వ్యయ కార్యదర్శి ఆమోదించగా, భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి పి.కె.సింగ్ సంతకం చేశారు. ఇది అన్ని మంత్రిత్వ శాఖలు, సంబంధిత విభాగాల ఆర్థిక సలహాదారులు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఆర్థిక సేవల విభాగానికి పంపినట్లు తెలిపారు.ఇదీ చదవండి: రూ.15 వేలులోపు 5జీ స్మార్ట్ఫోన్లు -
యూఎస్కు స్మార్ట్ఫోన్ ఎగుమతులు డీలా
గత నెల(ఆగస్ట్)లో భారత్ నుంచి యూఎస్కు స్మార్ట్ఫోన్(Smart Phone) ఎగుమతులు భారీగా క్షీణించాయి. మే నెలతో పోలిస్తే 58 శాతం పడిపోయి 96.48 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. మే నెలలో ఇవి 229 కోట్ల డాలర్లుగా నమోదైనట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్(GTRI) పేర్కొంది. ఇది ఆందోళనకరమని, నిజానికి స్మార్ట్ఫోన్ ఎగుమతులపై టారిఫ్లు లేవని తెలియజేసింది. వెరసి స్మార్ట్ఫోన్ ఎగుమతులు భారీగా క్షీణించడం వెనుక వాస్తవికర కారణాలను వెంటనే అన్వేషించవలసి ఉన్నట్లు అభిప్రాయపడింది. యూఎస్కు భారత్ నుంచి స్మార్ట్ఫోన్లు అత్యధికంగా ఎగుమతి అవుతుంటాయని, అయితే 2025 మే నుంచీ చూస్తే నెలవారీగా తగ్గుతూ వస్తున్నట్లు వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం..ఇదీ తీరు..2025 మే నెలలో యూఎస్కు 2.29 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేసిన భారత్, జూన్లో 2 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. ఈ బాటలో జూలైకల్లా ఇవి 1.52 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆగస్ట్లో ఇవి మరింత నీరసించి 96.48 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2024–25)లో భారత్ నుంచి స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో 10.6 బిలియన్ డాలర్ల విలువతో యూఎస్ టాప్ ర్యాంకులో నిలిచింది. భారత్ నుంచి గ్లోబల్ ఎగుమతుల విలువ 24.1 బిలియన్ డాలర్లుకాగా.. 44 శాతం వాటాతో యూఎస్ తొలి ర్యాంకును ఆక్రమిస్తోంది. ఈ బాటలో ఈయూకు 7.1 బిలియన్ డాలర్ల విలువైన(29.5 శాతం వాటా) ఎగుమతులు జరుగుతున్నాయి. ఆగస్ట్ ఎగుమతుల్లో టారిఫ్లులేని ప్రొడక్టుల వాటా 28.5 శాతంకాగా.. దాదాపు 42 శాతం క్షీణించి 1.96 బిలయన్ డాలర్లకు పడిపోయాయి. మే నెలలో ఇవి 3.37 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫార్మా సైతం..మే నెలతో పోలిస్తే ఆగస్ట్లో ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులు సైతం బలహీనపడ్డాయి. 13.3 శాతం క్షీణించి 64.66 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. మే నెలలో ఇవి 74.5 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. మరోవైపు అధిక టారిఫ్లను ఎదుర్కొంటున్న దేశీ వస్తువుల ఎగుమతులు(Exports) సైతం డీలాపడినట్లు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఆగస్ట్లో జ్యువెలరీ ఎగుమతులు 9.1 శాతం నీరసించి 22.82 కోట్ల డాలర్లకు చేరాయి. పాలి‹Ùడ్ వజ్రాలు, వజ్రాలతోకూడిన బంగారు ఆభరణాల ఎగుమతులు సైతం బలహీనపడ్డాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు 44 శాతం పడిపోయి 16.27 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. మే నెలలో ఇవి 28.97 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. టెక్స్టైల్స్, దుస్తులు తదితర ఎగుమతులు 9.3 శాతం తక్కువగా 85.55 కోట్ల డాలర్లకు చేరాయి. మేలో ఇవి 94.37 కోట్ల డాలర్లుకాగా.. కెమికల్ ఎగుమతులు 16 శాతం క్షీణించి 45.19 కోట్ల డాలర్లను తాకాయి.ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు -
పాకిస్తాన్కు చీప్గా అప్పు ఇస్తున్నది ఈ దేశమే..
నగదు కొరతతో బాధపడుతున్న పాకిస్తాన్ (Pakistan) ఇతర దేశాలు, అంతర్జాతీయ సంస్థల సహాయంపై తీవ్రంగా ఆధారపడుతుంది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, చైనా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కీలక భూమిక వహిస్తున్నా, మరో ముస్లిం దేశమైన సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కు స్థిరమైన ఆర్థిక మద్దతును అందిస్తోంది.తక్కువ వడ్డీకే రుణాలుసౌదీ అరేబియా (Saudi Arabia) పాకిస్తాన్కు కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు అందిస్తోంది. ఇది చైనా, ఇతర అంతర్జాతీయ రుణదాతలతో పోల్చితే చాలా తక్కువ. సౌదీ రుణాల వడ్డీ రేటు చైనాకు చెల్లించే నగదు డిపాజిట్ వడ్డీ కంటే మూడింట ఒక వంతు మాత్రమే. విదేశీ వాణిజ్య రుణాల ఖర్చుతో పోలిస్తే కూడా సౌదీ రుణ ఖర్చు సగం కంటే తక్కువ.పాకిస్తాన్ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోయినా, సౌదీ అరేబియా అదనపు రుసుములు లేకుండా ప్రతి సంవత్సరం రుణ గడువును పొడిగిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్కు సౌదీ అరేబియా ఇచ్చిన 2 బిలియన్ డాలర్ల రుణం గడువు డిసెంబర్లో ముగియనుంది. అయితే సౌదీ ఆర్థిక మంత్రిత్వ శాఖ దీన్ని మళ్లీ పొడిగించాలనే యోచనలో ఉంది.ఐఎంఎఫ్ ప్రోగ్రాం కింద పాకిస్తాన్కు సౌదీ అరేబియా ఇచ్చిన మరో 3 బిలియన్ డాలర్ల రుణానికి వచ్చే ఏడాది జూన్లో గడువు ముగుస్తుంది. పాకిస్తాన్ తన బాహ్య ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ఈ రుణాన్ని తీసుకుంది.ఇదీ చదవండి: అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..! -
కొత్త జీఎస్టీ అమలు.. వైఎస్ జగన్ స్పందన
జీఎస్టీ కొత్త శ్లాబులు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. జీఎస్టీ క్రమబద్ధీకరణ సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు. సామాన్య ప్రజానీకానికి ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈమేరకు ఎక్స్లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు.‘జీఎస్టీ పునర్నిర్మాణం సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. వస్తువులు, సేవలను ప్రతి పౌరుడికి మరింత సరళంగా, సరసమైనదిగా మార్చడానికి ఈ చర్యలు ఎంతో తోడ్పడుతాయి. ప్రాథమికంగా కొన్ని ఫిర్యాదుల నిర్వహణలో లోపాలు ఉండొచ్చు. కానీ ఇది ఒక ప్రక్రియ. దీని ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరుకుంటాయని నేను ఆశిస్తున్నాను. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి, మరింత పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.The GST restructuring is a revolutionary step towards a simpler, fairer tax system It is a commendable move to make goods & services more simpler and affordable to every citizen. Here and there ,there might be a few glitches with a few complaints but it’s a process and I am…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 22, 2025ఇక 12 శాతం; 28 శాతం ఉండవు..సేల్స్ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ సహా పలు రకాల పరోక్ష పన్నులన్నిటినీ తొలగిస్తూ 2017 జులై నుంచీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. తక్కువ పన్నురేట్లుండాలని మొదట లక్ష్యించినా సాధ్యం కాలేదు. తాజా సవరణలతో అది సాధ్యమై జీఎస్టీ శ్లాబ్లు 3కు తగ్గాయి. తక్కువ శ్లాబ్లుంటే పాలన, ధరల నిర్ణయం, బిల్లింగ్ సులువవుతుంది. పన్ను అధికారులపైనా భారం తగ్గుతుంది. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది.. 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను పూర్తిగా తొలగించటం.కొన్ని విలాస, అనారోగ్య (సిన్) వస్తువుల కోసం 40 శాతం పన్ను రేటును చేర్చటం. వాస్తవంగా చూస్తే చాలావరకూ ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ 5% పరిధిలోకి వచ్చాయి. కొన్నింటిపై పన్నే లేకుండా చేశారు. గతంలో వీటిపై 12, 28 శాతం పన్ను రేట్లుండేవి. ఇది అత్యధికులకు ఊరటే. ఇక కొన్ని విలాస వస్తువులు, కూల్డ్రింక్స్, టొబాకో ఉత్పత్తులు, పాన్ మసాలా వంటివి మాత్రం 28 శాతం పన్ను పరిధిలో ఉండగా ఇపుడు 40 శాతం శ్లాబ్లోకి వెళ్లాయి.ఇదీ చదవండి: ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే.. -
రేపటి నుంచే కొత్త జీఎస్టీ: ధరలు తగ్గే వస్తువులు ఇవే..
జీఎస్టీ సంస్కరణలు రేపటి (సెప్టెంబర్ 22) నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో వంటగదిలో ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, మందుల (మెడిసిన్స్) దగ్గర నుంచి ఆటోమొబైల్స్ వరకు చాలా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. వినియోగదారులకు వరంలాగా.. జీఎస్టీ కౌన్సిల్.. నవరాత్రి మొదటి రోజు నుంచి రేట్లను తగ్గించాలని నిర్ణయించింది.రేపటి నుంచి ధరలు తగ్గనున్న వస్తువుల జాబితాలో నెయ్యి, పనీర్, వెన్న, నామ్కీన్, కెచప్, జామ్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, ఐస్ క్రీములు వంటివాటితో పాటు.. టీవీ, ఏసీ, వాషింగ్ మెషీన్స్ కూడా ఉన్నాయి.ఔషధాలు, గ్లూకోమీటర్లు, డయాగోనిస్టిక్ కిట్ల ధరలు తగ్గనున్నాయి. సిమెంట్ 18 శాతం జీఎస్టీ పరిధిలోకి రావడంతో.. గృహనిర్మాణదారులు ప్రయోజనం పొందుతారు. GST తగ్గింపు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఫార్మసీలు తమ MRPని సవరించాలని లేదా తక్కువ రేటుకు మందులను విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.జీఎస్టీ రేటు తగ్గింపు వల్ల.. ఆటోమొబైల్ కొనుగోలుదారులు లాభపడతారు.ఇప్పటికి దాదాపు అన్ని కార్ల కంపెనీలు తగ్గిన ధరలను వెల్లడించాయి. ఇవి రేపటి నుంచే అమలులోకి రానున్నాయి. జీఎస్టీ సంస్కరణలు మాత్రమే కాకుండా.. ఫెస్టివల్ ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ కూడా ఇప్పుడు వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా మారనున్నాయి.హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బు బార్లు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్టు, టాల్కమ్ పౌడర్, ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, ఆఫ్టర్-షేవ్ లోషన్ వంటి ఇతర రోజువారీ వినియోగ వస్తువుల ట్యాక్స్ తగ్గడంతో.. ధరలు మరింత చౌకగా మారనున్నాయి.ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు -
ఉత్పాదకత నష్టం రూ.131 లక్షల కోట్లు
వాతావరణ సంబంధిత ఆరోగ్య రిస్క్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 1.5 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.131 లక్షల కోట్లు) మేర ఉత్పాదక నష్టం వచ్చే 25 ఏళ్లలో ఎదురవుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. అరోగ్య సమస్యలు పెరుగుతుండడం కీలక రంగాల్లో కార్మికుల కొరతకు కారణమవుతుందని పేర్కొంది.ఆహారం, వ్యవసాయం, పర్యావరణం–నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, బీమా రంగాల్లో వాతావరణ మార్పుల కారణంగా పడే ప్రభావాన్ని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్తో కలసి డబ్ల్యూఈఎఫ్ అధ్యయనం చేసింది. రూ.131 లక్షల కోట్ల ప్రభావం అన్నది మొదటి మూడు రంగాలపై మధ్యస్తంగా పడే ప్రభావంతో వేసిన అంచనా అని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ భారం మరింత ఎక్కువగా ఉండొచ్చని డబ్ల్యూఈఎఫ్ నివేదిక తెలిపింది. కనుక కంపెనీలు తమ సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చురుగ్గా స్పందించాలని, వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిమితం చేసేందుకు, ఉత్పాదకతకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. వాతావరణ మార్పులతో తీవ్రమైన వేడి పరిస్థితులు, ఇన్ఫెక్షన్ల తీవ్రత, ఇతర ఆరోగ్య సమస్యల రిస్క్ పెరుగుతుందని అంచనా వేసింది. ‘వ్యాపార కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు, దీర్ఘకాలం పాటు బలంగా నిలబడేందుకు వీలుగా సిబ్బంది ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన దశకంలోకి ప్రవేశించాం. ఉద్యోగుల ఆరోగ్యం పరిరక్షణ, ఉత్పాదకత రిస్క్లు, వ్యయాలు పెరుగుతున్నాయి’ అని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. ఆహార భద్రతకు రిస్క్ఆహారం, వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పుల ఫలితంగా 740 బిలియన్ డాలర్ల మేర ఉత్పాదక నష్టం ఏర్పడుతుందన్నది డబ్ల్యూఈఎఫ్ అంచనా. దీంతో ప్రపంచ ఆహార భద్రతకు రిస్క్ ఏర్పడుతుందని పేర్కొంది. పర్యావరణం–నిర్మాణ రంగంలో 570 బిలియన్ డాలర్ల ఉత్పాదకతన నష్టం వాటిల్లుతుందని తెలిపింది. వాతావరణ మార్పుల ఫలితంగా బీమా కంపెనీలు పెద్ద సంఖ్యలో ఆరోగ్య క్లెయిమ్లు ఎదుర్కోవాల్సి రావచ్చొని అంచనా వేసింది. ‘‘ఉష్ణోగత్రలు పెరిగితే లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయి. లేదా తగ్గిపోవచ్చు. దీంతో కుటుంబాలు పేదరికంలోకి వెళతాయి. ఇది ప్రజల మనుగడకు ముప్పుగా మారుతుంది’’అని ఈ అధ్యయానికి సహకరించిన రాక్ఫెల్లర్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్రావు తెలిపారు.ఇదీ చదవండి: ఈ-పాస్పోర్ట్ అర్హులు, దరఖాస్తు వివరాలు..వాతావరణ మార్పుల ఫలితంగా ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని అధిగమించేందుకు ముందస్తు పెట్టుబడులు పెట్టే కంపెనీలు ప్రయోజనం పొందుతాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. అలాగే, సవాళ్లకు తగిన పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ప్రతీ రంగం భిన్నమైన స్థితిలో ఉన్నట్టు పేర్కొంది. వాతావరణ మార్పులను తట్టుకుని నిలిచే పంటల రకాలు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని నిలిచే ఔషధాల అభివృద్ధి, నిర్మాణ రంగ కార్మికుల భద్రత దృష్ట్యా శీతల పరిష్కారాలు, వాతావరణ మార్పుల షాక్ల నుంచి రక్షించే బీమా నమూనాల అవసరాన్ని ప్రస్తావించింది. -
సహకార బ్యాంకుల్లోనూ ఆధార్ చెల్లింపుల సేవలు
కోఆపరేటివ్ బ్యాంకులు ఇకపై ఆధార్ ఆధారిత చెల్లింపుల సేవలను అందించొచ్చని కేంద్ర సహకార శాఖ కార్యదర్శి ఆశిష్ కుమార్ భుటానీ తెలిపారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సవరించిన కార్యాచరణ కింద ఇది సాధ్యపడుతుందన్నారు. నూతన కార్యాచరణపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.తాజా చర్యతో సహకార బ్యాంకులు మరింత సమర్థవంతంగా, స్వయం సమృద్ధిగల ఆర్థిక సంస్థలుగా మారగలవని అభిప్రాయపడ్డారు. దీంతో సమ్మిళిత వృద్ధిపై ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, చిన్న పట్టణాలకు ఆర్థిక సేవలు మరింత చేరువ అవుతాయని చెప్పారు. ఆధార్ ధ్రువీకృత ఎకోసిస్టమ్కు కోపరేటివ్ బ్యాంక్లు ఇప్పటి వరకు దూరంగా ఉండగా, కొత్త కార్యాచరణ దీనికి పరిష్కారం చూపించినట్టు తెలిపారు.సహకార శాఖ, నాబార్డ్, ఎన్పీసీఐ, కోపరేటివ్ బ్యాంకులతో సంప్రదింపుల అనంతరం యూఐడీఏఐ సులభతర వ్యవస్థను అభివృద్ధి చేయడం గమనార్హం. దీంతో యూఐడీఏఐ కింద 34 రాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్లు (ఎస్టీసీబీలు) ఆధార్ ధ్రువీకరణ కోసం నమోదు కావొచ్చు. దీంతో ఆయా రాష్ట్ర కోపరేటివ్ బ్యాంకుల పరిధిలోని 351 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు సైతం ఆధార్ కేవైసీ ధ్రువీకరణలను చేపట్టడానికి వీలు పడుతుంది.ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్! -
పన్నుల భారం తగ్గుతుంది
జీఎస్టీలో శ్లాబులను కుదిస్తూ ప్రభుత్వం ప్రకటించిన నూతన సంస్కరణలతో వినియోగదారులపై పన్ను భారం తగ్గుతుందని.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈలు) సాధికారతకు తోడ్పడుతుందని, ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితంగా మారుతుందని ఫిక్కీ కమిటీ అభిప్రాయపడింది. అంతేకాదు భారత్ను ఏకీకృత పన్ను విధానానికి జీఎస్టీ 2.0 చేరువ చేస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.జీఎస్టీలో సంస్కరణలతో 5 శాతం పన్ను పరిధిలోని వస్తువులు మూడింతలు అవుతాయని.. 54 వినియోగ విభాగాలు కాస్తా 149కు చేరతాయని తెలిపింది. గ్రామీణులకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు, యోగ్యత విభాగంలోని వస్తువులు 56.3 శాతం నుంచి 73.5 శాతానికి పెరుగుతాయని, పట్టణాల్లో వీటి వాటా 50.5 శాతం నుంచి 66.2 శాతానికి చేరుతుందని వెల్లడించింది. ‘‘దీంతో గ్రామీణ వినియోగదారులపై నికర జీఎస్టీ అన్నది ఇప్పుడున్న 6.03 శాతం నుంచి 4.27 శాతానికి దిగొస్తుంది. పట్టణ వాసులపై ఇది 6.38 శాతం నుంచి 4.38 శాతానికి తగ్గుతుంది. దీనివల్ల వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఇది విచక్షణారహిత వినియోగం, సేవలు, రిటైల్, స్థానిక వ్యాపారాలకు చోదకంగా మారుతుంది’’ అని ఫిక్కీ కమిటీ నివేదిక వివరించింది. వ్యాపారస్థులకూ ప్రయోజనమే..జీఎస్టీ 2.0లో రేట్ల క్రమబద్దీకరణతో వ్యాపారస్థులకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ (తుది ఉత్పత్తి కంటే ముడి పదార్థాలపై అధిక రేటు) కారణంగా ఏర్పడిన గందరగోళానికి పరిష్కారం లభిస్తుందని ఈ నివేదిక తెలిపింది. ‘‘2017లో జీఎస్టీ ప్రవేశపెట్టడం మన పన్నుల వ్యవస్థలో మార్పునకు దారితీసింది. ఇప్పుడు జీఎస్టీ 2.0 అమలుతో సులభతర పన్నుల రేటు నిర్మాణం మరింత బలోపేతం అవుతుంది. సమర్థతను పెంచుతుంది. ఒకే దేశం, ఒకే పన్ను రేటు అన్న దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది’’అని నకిలీ ఉత్పత్తులకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఫిక్కీ కమిటీ (క్యాస్కేడ్) చైర్మన్ అనిల్ రాజ్పుత్ పేర్కొన్నారు. జీఎస్టీ తాజా సంస్కరణలతో స్వల్పకాలంలో ఆదాయం తగ్గినప్పటికీ.. వినియోగం పెరగడం, నిబంధనల అమలుతో కొంత కాలానికి భర్తీ అవుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.ఇదీ చదవండి: మారుతీ కార్ల ధరలు తగ్గాయ్!జీఎస్టీ 1.0 కింద 2018–19లో పరోక్ష పన్నుల ఆదాయం రూ.11.78 లక్షలుగా ఉంటే.. 2024–25 నాటికి రెట్టింపై రూ.22.09 లక్షలకు చేరినట్టు గుర్తు చేసింది. జీఎస్టీ చెల్లింపుదారులు 66.5 లక్షల నుంచి 1.51 కోట్లకు విస్తరించడాన్ని ప్రస్తావించింది. ఇప్పుడు జీఎస్టీ 2.0 అమలుతో మరిన్ని వ్యాపార సంస్థలు దీని కిందకు వస్తాయని.. ఆర్థిక వ్యవస్థ మరింత సంఘటితంగా మారుతుందని, అంతిమంగా ఇది మరింత ఆదాయానికి దారితీస్తుందని అంచనా వేసింది. జీఎస్టీ 1.0లో అధిక పన్ను రేట్ల కారణంగా చట్ట వ్యతిరేక మార్కెట్ విస్తరించినట్టు, ముఖ్యంగా అక్రమ ఎఫ్ఎంసీజీ మార్కెట్ 70 శాతం పెరిగినట్టు తెలిపింది. అలాగే, పన్నులు చెల్లించని ప్యాకేజ్డ్ ఫుడ్స్ మార్కెట్ 100 శాతం, పొగాకు రూ.41,000 కోట్లను దాటినట్టు పేర్కొంది. ఈ తరహా సమాంతర ఆర్థిక వ్యవస్థ అన్నది తక్కువ, మధ్యాదాయ వర్గాల వారిపై ప్రభావం చూపించినట్టు, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్టు తెలిపింది. చట్టబద్ధమైన వస్తువులపై వెచ్చించే ప్రతి రూపాయి సంఘటిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పేర్కొంది. -
పట్టణాల్లోని మౌలిక సదుపాయాలపై కాగ్ అసంతృప్తి
భారత పట్టణ మౌలిక సదుపాయాలు, పాలనా వ్యవస్థలను అప్గ్రేడ్ చేయాల్సిన తక్షణ అవసరాన్ని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపింది. ఇప్పుడున్న పట్టణ సర్వీసులు, మౌలిక సదుపాయాలు ప్రస్తుత భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని వెనక్కి నెట్టివేసేలా ఉన్నాయని కాగ్ చీఫ్ కె.సంజయ్ మూర్తి హైలైట్ చేశారు. దేశం వికసిత్ భారత్ 2047 విజన్ వైపు ముందుకు సాగుతున్నప్పుడు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతుండడం ఆందోళన రేకిత్తిస్తున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.కాగ్ డేటాలోని ముఖ్యాంశాలు..పట్టణ కేంద్రాలు భారతదేశ ఆర్థిక వృద్ధికి ఇంజిన్లుగా మారాయి. అయినప్పటికీ వాటి వృద్ధికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలు ప్రమాదకరంగా వెనుకబడి ఉన్నాయి.కేవలం 15 భారతీయ నగరాలు జాతీయ జీడీపీలో 30% వాటాను కలిగి ఉన్నాయి.దేశంలో మూడింట ఒక వంతు జనాభాకు నిలయమైన పట్టణ ప్రాంతాలు ఇప్పటికే జీడీపీలో మూడింట రెండో వంతుకు సహకరిస్తున్నాయి.ఈ వాటా 2030 నాటికి 75%కి పెరుగుతుందని అంచనా.పట్టణాలకు ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ, భారతదేశ నగరాలు పేలవమైన మౌలిక సదుపాయాలు, నమ్మశక్యం కాని సర్వీసులు, మితిమీరిన మునిసిపల్ వ్యవస్థలతో నెట్టుకొస్తున్నాయి.భారతదేశంలో దాదాపు 5,000 పట్టణ స్థానిక పరిపాలన వ్యవస్థలు (యూఎల్జీ) జనాభాలో 35% మందికి సేవలందించాయి. ఈ సంఖ్య 2031 నాటికి 41%కు చేరుకుంటుందని అంచనా.యూఎల్జీలు మొత్తంగా రూ.5.5–6 లక్షల కోట్ల సామూహిక వనరుల పూల్ను నిర్వహిస్తున్నాయి.పట్టణ పరిపాలన వ్యవస్థల్లో మెరుగైన ఆర్థిక ప్రణాళికలు, పారదర్శకత, సకాలంలో ఆడిట్లు, ప్రామాణిక పనితీరు కొలమానాల అవసరం ఉంది.ఎన్ఎంఏఎం 2.0 ప్రారంభంఈ వ్యవస్థల సంస్కరణ కోసం కాగ్ నేషనల్ మునిసిపల్ అకౌంట్స్ మాన్యువల్ (ఎన్ఎంఏఎం) పునరుద్ధరణను సూచించింది. ఇది మొదట 2004లో రూపొందించారు. కానీ దీన్ని సమర్థంగా అమలు చేయడంలో యంత్రాంగాలు ఆసక్తి చూపలేదు. ‘ఎన్ఎంఏఎం కొత్త వెర్షన్ నగరాల్లో సమయానుకూలమైన, ప్రామాణిక ఆర్థిక రిపోర్టింగ్ను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది’ అని సంజయ్ మూర్తి చెప్పారు. నవీకరించిన ఎన్ఎంఏఎం 2.0 యూఎల్జీల ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, పనితీరు ట్రాకింగ్ను మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లో బీఎస్ఎన్ఎల్ సిమ్లు అమ్మకం -
టారిఫ్లకు పది వారాల్లో పరిష్కారం
కోల్కతా: అమెరికా టారిఫ్లకు వచ్చే ఎనిమిది, పది వారాల్లో పరిష్కారం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ చెప్పారు. 25 శాతం ప్రతీకారం సుంకం, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 శాతంతో కలిపి భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు అమలు చేస్తుండడం తెలిసిందే. భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగేశ్వరన్ మాట్లాడారు. భారత ఉత్పత్తులపై టారిఫ్లను అమెరికా వెనక్కి తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయంటూ, వచ్చే 8–10 వారాల్లో పరిష్కారం లభించొచ్చన్నారు. ‘‘భారత్పై విధించిన 25 శాతం పీనల్ టారిఫ్ను నవంబర్ చివరి నాటికి అమెరికా ఉపసంహరించుకోవచ్చు. నవంబర్ 30 తర్వాత ఉండకపోవచ్చు. ఇటీవలి పరిణామాల ఆధారంగా ఇది కేవలం నా అంచనాయే. ప్రస్తుతమున్న 25 శాతం ప్రతీకార సుంకం సైతం 10–15 శాతానికి తగ్గొచ్చు’’అని సీఈవో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒకవేళ టారిఫ్లు కొనసాగితే అమెరికాకు ఎగుమతులు తగ్గుతాయన్నారు. భారత్ మధ్యస్థ ఆదాయ దేశమని, మొదటి త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు చెప్పారు. కరోనా విపత్తు తర్వాత ఎన్నో దేశాలతో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో వేగవంతమైన వృద్ధిని సాధించినట్టు తెలిపారు. తయారీ, వ్యవసాయం, సేవల పాత్ర వచ్చే రెండేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో తయారీ, సేవలు, వ్యవసాయ రంగంలో గొప్ప పాత్ర పోషిస్తాయని నాగేశ్వరన్ చెప్పారు. అలాగే, వినియోగం, పెట్టుబడులు వృద్ధికి ఊతంగా నిలుస్తాయన్నారు. జీడీపీలో భారత రుణ నిష్పత్తి సహేతక స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ఇతర దేశాల కంటే మెరుగైన వృద్ధిని సాధిస్తున్నామని, నిధులను సమర్థవంతంగా వినియోగించుకుంటున్న దానికి ఇది సంకేతంగా పేర్కొన్నారు. గ్రామీణ వినియోగం బలంగా ఉందంటూ, అదే సమయంలో పట్టణ డిమాండ్ పుంజుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవలి జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారుల చేతుల్లో ఖర్చు చేసే ఆదాయం మిగులు పెరుగుతుందని, దీంతో పట్టణ వినియోగం సైతం ఇతోధికం అవుతుందని అంచనా వేశారు. ఎంఎస్ఎంఈ రంగానికి రుణ సాయం పెరుగుతోందని, పెద్ద పరిశ్రమలకు రుణాల్లో నిర్మాణాత్మక మార్పు కనిపిస్తోందన్నారు. నేటి రోజుల్లో నిధుల సమీకరణకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచి్చనట్టు చెప్పారు. ఎగుమతులు బలంగా కొనసాగుతున్నట్టు నాగేశ్వరన్ తెలిపారు. మొదటి త్రైమాసికంలో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 0.2 శాతానికి పరిమితమైనట్టు చెప్పారు. ‘‘డాలర్తో రూపాయి విలువ క్షీణిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్గతంగా ఉన్న బలం దృష్ట్యా దీర్ఘకాలంలో రూపాయి తన విలువను కాపాడుకుని, బలంగా నిలబడుతుంది’’అని నాగేశ్వరన్ దేశ ఆర్థిక వ్యవస్థను విశ్లేíÙంచారు. దేశ ప్రైవేటు రంగం పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులను మరింతగా పెంచాలని, మరిన్ని ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కృత్రిమ మేథ (ఏఐ) ఉపాధి పరంగా పెద్ద అవరోధం కాదన్నారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. -
భారత్లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్ పెట్టుబడులకు అనుకూలమైన అనేక విధానాలను అమలు చేస్తోందని, దేశీయంగా సుశిక్షితులైన నిపుణుల లభ్యత పుష్కలంగా ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని ఐసీసీ గ్లోబల్ సమిట్ 2025లో వర్చువల్గా పాల్గొన్న సందర్భంగా గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆయన ఆహా్వనించారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యూయల్స్ అభివృద్ధిలో భారత్ విశేషంగా రాణిస్తోందని చెప్పారు. ఇంజినీరింగ్ నిపుణుల లభ్యత, మెరుగైన మౌలిక సదుపాయాల, రాజకీయంగా పటిష్టమైన మద్దతు వంటి సానుకూలాంశాల కారణంగా ఇన్వెస్టర్లకు భారత్ అత్యుత్తమ గమ్యస్థానం కాగలదన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో ముడి వస్తువుల ధరలు తక్కువగా ఉండటంతో పాటు ఉత్పత్తులు అత్యంత నాణ్యమైనవిగా ఉంటాయని గడ్కరీ వివరించారు. ‘మేము నాణ్యతకు కట్టుబడి ఉన్నాం. ఆ విషయంలో రాజీపడకుండా ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాలనుకుంటున్నాం. ఇది ప్రపంచ ప్రజలందరికీ మేలు చేస్తుంది‘ అని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించాలని, ఆత్మనిర్భర్ భారత కలను సాకారం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. హైడ్రోజన్పై మరింత దృష్టి.. లాజిస్టిక్స్ వ్యయాలను తగ్గించేందుకు, పర్యావరణహిత ఇంధనాలను అభివృద్ధి చేసేందుకు, పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహించేందుకు, రహదారి..రైలు..జలమార్గాల కనెక్టివిటీని పటిష్టం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను అభివృద్ధి చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు గడ్కరీ చెప్పారు. ‘మేము ఇథనాల్, మిథనాల్, బయోడీజిల్, ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్స్పై ఏకకాలంలో పని చేస్తున్నాం. అదే సమయంలో హైడ్రోజన్పై కూడా టాటా మోటర్స్, అశోక్ లేల్యాండ్, రిలయన్స్, హెచ్పీసీఎస్, ఐవోసీఎల్, ఎన్టీపీసీలాంటి కంపెనీలు పని చేస్తున్నాయి. హైడ్రోజన్ తయారీకి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. అయితే, 1 కేజీ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి 50 యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. భారత్లో (హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు) ఖర్చు సుమారు రూ. 250–200గా (కేజీకి) ఉంటుంది. దీన్ని 1 డాలర్ స్థాయికి (సుమారు రూ. 88) తీసుకురావాలనేది నా లక్ష్యం‘ అని వివరించారు. ఇది చాలా కష్టమే అయినప్పటికీ, భారత్ ప్రయతి్నస్తోందని గడ్కరీ చెప్పారు. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి ప్రైవేట్ రంగం ద్వారా దేశీయంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమను పటిష్టం చేయడంపై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోందని డిఫెన్స్ ప్రొడక్షన్ కార్యదర్శి సంజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి పాలసీలు, ప్రక్రియల గురించి అర్థవంతమైన సలహాలను సంబంధిత నిబంధనల్లో పొందుపర్చేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. స్వావలంబన సాధనే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దీన్ని సాధించాలంటే తయారీలోనే కాకుండా డిజైన్తో పాటు మనం ఉపయోగించే అన్ని ప్లాట్ఫాంలపై మనకు పూర్తి నియంత్రణ ఉండాలని, బైటి ఏజెన్సీలపై ఆధారపడే పరిస్థితి ఉండకూడదని కుమార్ వివరించారు. -
సంస్కరణలను అందిపుచ్చుకోండి..
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు, సంస్కరణల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని కార్పొరేట్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు, సామర్థ్యాలను పెంచుకునేందుకు సందేహించకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువతకు నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంలో ప్రభుత్వంతో కలిసి పని చేయాలన్నారు. బడ్జెట్ ముందు మాత్రమే కాకుండా ఏడాది పొడవునా, ఎప్పుడైనా సరే ప్రభుత్వంతో మాట్లాడాలని ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (ఐఎఫ్క్యూఎం) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. పరిశ్రమ నుంచి ప్రభుత్వం ఏం ఆశిస్తోందనే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. పరిశ్రమ అంచనాలకు అనుగుణంగా ప్రభుత్వం స్థిరంగా ముందుకెళ్తోందని వివరించారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా తగు పాలసీలను రూపొందించడం, పన్నులపరమైన ప్రయోజనాలివ్వడం, మరింతగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) రాకకు అవకాశాలు కల్పించడం తదితర చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంస్కరణల అమలుకు ఎన్నడూ వెనుకాడలేదని, పరిశ్రమ విజ్ఞప్తులను వింటూనే ఉన్నారని ఆమె తెలిపారు. ‘మరింతగా ఇన్వెస్ట్ చేయడం, సామర్థ్యాలను పెంచుకోవడం, భారత్లో మరింతగా ఉత్పత్తి చేయడంపై ఇక మీదట సందేహాలు ఉండబోవని ఆశిస్తున్నాను‘ అని చెప్పారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) చిన్న పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకంగా ఉంటున్నాయని మంత్రి తెలిపారు. వాటి అవసరాలను గుర్తించే, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ (సిడ్బి) ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ప్రైవేట్ పెట్టుబడుల ఆవశ్యకత.. అధిక వృద్ధి సాధన దిశగా, ఎకానమీకి దన్నుగా చర్యలు తీసుకునే క్రమంలో కేంద్రం 2025–26లో రూ. 11.21 లక్షల కోట్ల మూలధన వ్యయాలను బడ్జెట్లో ప్రతిపాదించింది. అయితే, సామర్థ్యాల పెంచుకోవాలంటూ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రైవేట్ పెట్టుబడులు అంతగా రావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) శాఖ విడుదల చేసిన సర్వే నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ పెట్టుబడులు 26 శాతం తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి. 2022, 2023, 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ కంపెనీలు వరుసగా రూ. 3.95 లక్షల కోట్లు, రూ. 5.72 లక్షల కోట్లు, రూ 4.22 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.. దేశీయ మార్కెట్లోనూ, ఎగుమతులపరంగానూ ప్రభుత్వం చక్కని అవకాశాలు కల్పిస్తోందని చంద్రశేఖరన్ చెప్పారు. మరింత మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, చిన్న..మధ్యతరహా సంస్థలు, పెద్ద కార్పొరేట్లు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తాయని తాను గట్టిగా విశ్వసిస్తున్నట్లు వివరించారు. సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకునేలా ప్రపంచం ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేíÙస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టకపోతే అవకాశాలను అందిపుచ్చుకోలేమని ఆయన పేర్కొన్నారు. -
కొత్త జీఎస్టీ శ్లాబులను నోటిఫై చేసిన సీబీఐసీ
జీఎస్టీ శ్లాబుల సవరణకు ఆమోదించిన కేంద్ర నిర్ణయానికి అనుగుణంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) జీఎస్టీ రేటు నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే సవరించిన రేట్ల నిర్మాణం ఏడు షెడ్యూళ్లలో సుమారు 1,200 వస్తువులపై ప్రభావం చూపుతుందని తెలిపింది.సీబీఐసీ నోటిఫికేషన్లోని ముఖ్యమైన మార్పుల్లో బాల్పాయింట్ పెన్నులు, స్కూల్ బ్యాగులు, ముద్రించిన పుస్తకాలు, మార్కర్లు, ఫౌంటెన్ పెన్నులు, స్టైలోగ్రాఫ్ పెన్నులు వంటి రోజువారీ ఎడ్యుకేషన్ నిత్యావసరాలు 18% జీఎస్టీ శ్లాబ్ కింద ఉంచారు. ఇది కొంతమంది పరిశ్రమ వర్గాల్లో ఆందోళనను రేకెత్తించింది. దీనికి విరుద్ధంగా పెన్సిల్స్, క్రేయాన్లు, పాస్టెల్స్, డ్రాయింగ్ చాక్స్, టైలర్ చాక్స్ను జీఎస్టీ నుంచి మినహాయించారు. ఇవి గతంలో 12% శ్లాబులో ఉండేవి.‘జీఎస్టీ హేతుబద్ధీకరణ విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకు, ప్రాథమిక విద్యా సాధనాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించింది’ అని ఒక ట్యాక్స్ ఎక్స్పర్ట్ అన్నారు.సీబీఐసీ నోటిఫికేషన్ కింది వస్తువులను 18% జీఎస్టీ రేటు కింద వర్గీకరించింది.స్కూలు బ్యాగులుట్రంక్లు, సూట్ కేసులు, వ్యానిటీ కేసులు, ఎగ్జిక్యూటివ్, బ్రీఫ్ కేసులుస్పెక్టాకిల్ కేసులు, బైనాక్యులర్, కెమెరా కేసులుట్రావెల్ బ్యాగులు, కంటైనర్లుఎక్సర్సైజ్ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, ల్యాబ్ నోట్బుక్లు, సారూప్య వస్తువులపై స్పష్టంగా జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది.ఇదీ చదవండి: కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు? -
కేంద్ర బ్యాంకులకు బంగారు నిల్వలు ఎందుకు?
బంగారానికి భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భరోసానిచ్చే సాధనంగా సాధారణ ప్రజలు పసిడిని కొనుగోలు చేస్తూంటారు. దాంతోపాటు శుభకార్యాలు, ప్రత్యేక ఈవెంట్ల కోసం ఖరీదు చేస్తారు. వీరితోపాటు భారీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగా కొనుగోలు చేస్తున్నాయి. ఇండియాతోపాటు చాలా దేశాలు ఎందుకు ఇలా భారీగా పసిడిని కొనుగోలు చేస్తాయో తెలుసుకుందాం.కరెన్సీకి అండగా..ద్రవ్యోల్బణం పెరుగుతూ, దేశ కరెన్సీ విలువ తగ్గుతుంటే దాన్ని కాపాడేందుకు బంగారం హెడ్జింగ్గా పని చేస్తుంది. ముద్రించిన కరెన్సీ(ఫియట్ కరెన్సీ) విలువ తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం విలువ బలపడుతుంది. ఇది దిగుమతులకు ఆసరాగా ఉంటుంది. అస్థిరత సమయాల్లో బంగారం జాతీయ కరెన్సీలను కాపాడుతుంది. దేశం ద్రవ్య విధాన చట్రానికి విశ్వసనీయతను అందిస్తుంది.రిస్క్ వైవిధ్యంకేంద్ర బ్యాంకులు రిస్క్ను డైవర్సిఫై చేసేందుకు బంగారం నాన్-కోరిలేటెడ్ ఆస్తిగా ఉపయోగపడుతుంది. దీని విలువ ఈక్విటీలు లేదా బాండ్లతో అనుగుణంగా పడిపోదు. యూఎస్ డాలర్ పడిపోయినప్పుడు ఇది పెరుగుతుంది. ఇది రిజర్వ్ పోర్ట్ ఫోలియోల్లో స్మార్ట్ డైవర్సిఫికేషన్ హెడ్జ్గా మారుతుంది.భౌగోళిక రాజకీయ పరిస్థితులుబంగారం ఏ ఒక్క దేశానికి పరిమితమైంది కాదు. కాబట్టి దీన్ని నియంత్రించడం ఏ ఒక్క దేశంలో వల్లనో సాధ్యం కాదు. దీని విలువపై ఎన్నో అంతర్జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి విదేశీ కరెన్సీ నిల్వల మాదిరిగా కాకుండా, బంగారాన్ని స్తంభింపజేయడం లేదా దానిపై రాజకీయం చేయడం సాధ్యం కాదు. రష్యా, చైనా వంటి దేశాలు అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు బంగారం నిల్వలను పెంచాయి.లిక్విడిటీబంగారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత లిక్విటిటీ ఆస్తుల్లో ఒకటి. దీన్ని దాదాపు ఏ ఆర్థిక మార్కెట్లోనైనా ఆమోదిస్తారు. ఆర్థిక సంక్షోభాలు లేదా యుద్ధాల సమయంలో దీన్ని త్వరగా నగదుగా మార్చవచ్చు లేదా అత్యవసర నిధుల కోసం తాకట్టుకు ఉపయోగించవచ్చు.టాప్ 8 దేశాల్లోని బంగారు నిల్వలు..దేశంబంగారం నిల్వలు (టన్నులు)అమెరికా8,133.46జర్మనీ3,350.25ఇటలీ2,451.84ఫ్రాన్స్2,437.00రష్యా2,329.63చైనా2,279.60స్విట్జర్లాండ్1,040.00భారతదేశం880.00 -
బ్యాంక్ రుణాల్లో వృద్ధి ఎంతంటే..
బ్యాంకుల రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 శాతంగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. ముఖ్యంగా ద్వితీయ ఆరు నెలల కాలంలో (అక్టోబర్ నుంచి) రుణ వృద్ధి వేగాన్ని అందుకోవచ్చని తెలిపింది. కార్పొరేట్ రుణాలు నిదానిస్తాయంటూ.. రిటైల్ రుణాలు వృద్ధిని నడిపించనున్నట్టు వెల్లడించింది. డిపాజిట్లలో గృహాల వాటా తగ్గుతుండడం ఆందోళనకరమంటూ, డిపాజిట్లలో స్థిరత్వం సమస్యలకు దారితీయొచ్చని పేర్కొంది.‘2025–26 క్యూ1లో (ఏప్రిల్–జూన్) రుణ వృద్ధి 9.5 శాతానికి నిదానించింది. ఆ తర్వాత 10 శాతానికి పెరిగింది. ద్వితీయ ఆరు నెలల్లో రుణాల్లో వృద్ధి వేగవంతమై పూర్తి ఆర్థిక సంవత్సరానికి 11–12 శాతానికి చేరుకోవచ్చు’ అని క్రిసిల్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. ప్రభుత్వం, ఆర్బీఐ చర్యలు ఇందుకు అనుకూలిస్తాయన్నారు. ఆర్బీఐ రెపో రేట్ల తగ్గింపు ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాలపై ఇంకా పూర్తిగా ప్రతిఫలించాల్సి ఉందన్నారు. బ్యాంకు రుణ రేట్లు తగ్గుముఖం పడితే అప్పుడు డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేశారు. ప్రైవేటు మూలధన వ్యయాలు పుంజుకోవడానికి కొంత సమయం పట్టొచ్చని చెప్పారు. డిపాజిట్లు కీలకం..బ్యాంక్ డిపాజిట్లలో గృహాల వాటా ఐదేళ్ల క్రితం 64 శాతంగా ఉంటే, అది 60 శాతానికి తగ్గడం పట్ల క్రిసిల్ రేటింగ్స్ ఆందోళన వ్యక్తం చేసింది. స్థిరమైన రుణ వృద్ధికి డిపాజిట్లు కీలకమని పేర్కొంది. వ్యవస్థలో లిక్విడిటీ పెంచే దిశగా ఆర్బీఐ తీసుకున్న చర్యలతో (సీఆర్ఆర్ తగ్గింపు, లిక్విడిటీ కవరేజీ నిబంధనలు) డిపాజిట్లలో వృద్ధి తగినంత ఉన్నట్టు తెలిపింది. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2026 మార్చి నాటికి 2.3–2.5 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది.ఇదీ చదవండి: త్వరలో ఈ-ఆధార్ యాప్ ప్రారంభం -
ఈ-పాస్పోర్ట్ అర్హులు, దరఖాస్తు వివరాలు..
దేశంలో అన్ని వ్యవస్థలూ డిజిటల్ వైపు పయనిస్తున్నాయి. ఇదే ఒరవడిలో ఇప్పటికే కొత్త పాస్పోర్ట్లు వచ్చేశాయి. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0 కింద ఈ-పాస్పోర్ట్లను జూన్ 24, 2025 నుంచి ప్రవేశపెడుతున్నారు. ఈ-పాస్పోర్ట్లకు సంబంధించిన కొన్ని అంశాలను కింద తెలుసుకుందాం.ఇంటిగ్రేటెడ్ చిప్ఈ-పాస్పోర్ట్ ఇంటిగ్రేటెడ్ చిప్తో వస్తుంది. సంబంధిత వ్యక్తికి చెందిన బయోమెట్రిక్ డేటా (ఫొటోగ్రాఫ్, వేలిముద్రలు) ఇందులో నిక్షిప్తమై ఉంటాయి. దీని వల్ల భద్రత మెరుగుపడుతుందని, అంతర్జాతీయ సరిహద్దుల్లో పాస్పోర్టులను నకిలీ చేయడం కష్టతరం అవుతుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ చొరవ తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఎవరు అర్హులుకొత్త పాస్పోర్ట్ లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ పౌరులందరూ అర్హులు. చెన్నై, హైదరాబాద్, సూరత్, జైపూర్.. వంటి ఎన్నో నగరాల్లో ఎంపిక చేయబడిన పాస్పోర్ట్ సేవా కేంద్రాలు(పీఎస్కే)ల్లో ప్రాథమికంగా జారీ చేస్తారు.దరఖాస్తు ప్రక్రియఆన్లైన్ ద్వారా పాస్పోర్ట్ సేవా అధికారిక పోర్టల్ ఓపెన్ చేయాలి.వ్యక్తిగత వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకొని, లాగిన్ అవ్వాలి.కొత్త ఈ-పాస్పోర్ట్ దరఖాస్తు ఫారమ్ను నింపాలి.డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అపాయింట్మెంట్ నిమిత్తం ఆన్లైన్లోనే మీ దగ్గరల్లో ఉన్న పీఎస్కే లేదా పీఓఎస్కేని ఎంచుకోవాలి.ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి.అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలి.తదుపరి బయోమెట్రిక్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పీఎస్కేను సందర్శించాలి.ప్రయోజనాలుఈ-గేట్ల ద్వారా ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ వేగవంతం అవుతుంది.ట్యాంపరింగ్, ఐడెంటిఫికేషన్ థెఫ్ట్ ఉండదు. మెరుగైన భద్రతను నిర్ధారిస్తుంది.ఎన్క్రిప్టెడ్ చిప్ యాక్సెస్తో కాంటాక్ట్ లెస్ వెరిఫికేషన్.డూప్లికేషన్ లేదా మోసాలని తగ్గిస్తుంది.మొదట ఫిన్లాండ్లో..అవాంతరాలు లేని అంతర్జాతీయ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి డిజిటల్ పాస్పోర్ట్లను ప్రారంభించిన మొదటి దేశం ఫిన్లాండ్. ఆ దేశ ప్రయాణికులు భౌతిక పాస్పోర్ట్లకు బదులుగా ఈ-పాస్పోర్ట్లను ఉపయోగించి యూకేకి ప్రయాణించవచ్చు. ఫిన్లాండ్ మాదిరిగానే యూకే, యూఎస్, దక్షిణ కొరియా, పోలాండ్ కూడా డిజిటల్ పాస్పోర్ట్ ప్రాజెక్ట్లపై పని చేస్తున్నాయని ఒక నివేదిక తెలిపింది.ఇదీ చదవండి: మరో నాలుగు రోజులు ఇంతే.. -
5 ఏళ్లలో రూ.70 లక్షల కోట్లు
మధ్య, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధి సాధించేందుకు అత్యుత్తమ అవకాశాలున్నట్లు గ్లోబల్ రేటింగ్ సంస్థ ఎస్అండ్పీ తాజాగా అభిప్రాయపడింది. దీంతో రానున్న ఐదేళ్లలో ప్రయివేట్ రంగం నుంచి 800 బిలియన్ డాలర్ల(రూ. 70 లక్షల కోట్లు) పెట్టుబడులకు వీలున్నట్లు అంచనా వేసింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ప్రయివేట్ పెట్టుబడులు ఊపందుకునే చాన్స్ లేనట్లు పేర్కొంది.ప్రయివేట్ రంగంలో భారీస్థాయి సామర్థ్య విస్తరణలో అప్రమత్తత కనిపిస్తున్నట్లు సంస్థ అధికారి గీతా చుగ్ తెలియజేశారు. కాగా.. ప్రయివేట్ రంగంలో పెట్టుబడులు కనిపిస్తున్నప్పటికీ నామినల్ జీడీపీ వృద్ధి రేటుకంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నట్లు ఎస్అండ్పీ దేశీ రేటింగ్స్ యూనిట్ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషీ పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాలు, టారిఫ్లలో మార్పులు, తదితర తీవ్ర అనిశ్చితులు కార్పొరేట్ సంస్థల పెట్టుబడి నిర్ణయాలలో ఆలస్యానికి కారణమవుతున్నట్లు వివరించారు.పలు కంపెనీలు పెట్టుబడులను సమకూర్చుకోవడంలో బ్యాంకులకు బదులుగా సొంత అంతర్గత వనరులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. బ్యాంక్ రుణాలు లేదా క్యాపిటల్ మార్కెట్ల నుంచి రుణ సమీకరణ ద్వారా కనీసస్థాయిలోనే నిధులను సమీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి పరిస్థితులు మెరుగుపడనుండటంతో బ్యాంకింగ్ వ్యవస్థలో 12–13 శాతం రుణ వృద్ధికి వీలున్నట్లు అంచనా వేశారు.ఇదీ చదవండి: దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్? -
ఫెడ్ వడ్డీ రేటు పావు శాతం కోత
వాషింగ్టన్ డీసీ: యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గించేందుకు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) తాజాగా వడ్డీ రేటులో 0.25 శాతం కోతకు ఓటు వేసింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4–4.25%కి దిగివచ్చింది. గత ఐదు పాలసీ సమీక్షలలో యథాతథ వడ్డీ రేటు (4.25–4.5%) అమలుకే మొగ్గు చూపిన ఫెడ్ 9 నెలల తదుపరి రేట్ల కోతకు నిర్ణయించింది. తదుపరి నిర్వహించే విలేకరుల సమావేశంలో వచ్చే ఏడాది జూన్కల్లా మరో రెండుసార్లు రేట్లను తగ్గించే సంకేతాలివ్వనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరగడానికితోడు ఉపాధి మార్కెట్ క్షీణించడం రేట్ల కోతకు కారణమైనట్లు విశ్లేíÙంచారు. కాగా.. గత కేలండర్ ఏడాది (2024)లో ఫెడ్ 3 సార్లు వడ్డీ రేటులో కోత పెట్టిన సంగతి తెలిసిందే. -
కొత్త జీఎస్టీ రేట్లపై కేంద్రం నోటిఫికేషన్
న్యూఢిల్లీ: ఈ నెల 22 నుంచి వివిధ ఉత్పత్తులపై కొత్తగా అమల్లోకి వచ్చే సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రేట్లను కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్జీఎస్టీ రేట్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లు, సెపె్టంబర్ 22 నుంచి రెండు శ్లాబులుగా ఉంటాయి. మెజారిటీ ఉత్పత్తులకు 5 శాతం, 18 శాతం ట్యాక్స్ రేట్లే వర్తిస్తాయి. విలాసవంతమైన ఉత్పత్తులపై మాత్రం 40 శాతం శ్లాబు ఉంటుంది. చాలా మటుకు ఉత్పత్తులపై పన్ను రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదలాయించాల్సిన బాధ్యత పరిశ్రమపై ఉంటుందని నిపుణులు తెలిపారు. నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా వివిధ ఉత్పత్తులకు వర్తించే రేట్లపై ప్రభుత్వం స్పష్టతనిచి్చందని ఏఎంఆర్జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ పార్ట్నర్ రజత్ మోహన్ తెలిపారు. -
దీపావళి ముందు ఉద్యోగులకు డబుల్ ఆఫర్?
దీపావళి పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు రెండు బంపర్ ఆఫర్లు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు కరవు భత్యం (డీఏ) పెంచాలని చూస్తుండడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తీసుకునే ఈ రెండు నిర్ణయాల వల్ల ఉద్యోగుల వేతనాలు పెరుగనున్నాయి.8వ పే కమిషన్8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 2025 జనవరి 16న స్పష్టం చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి దీపావళి లోపు నిబంధనలు ఖరారు చేస్తారని కొందరు విశ్వసిస్తున్నారు. ఈమేరకు ఏర్పాటు చేయనున్న ప్యానెల్లో ఆరుగురు సభ్యులు ఉంటారు. వారు 15-18 నెలల్లో తమ నివేదికను సమర్పిస్తారు. అయితే, ఈసారి 8 నెలల్లోనే నివేదికను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. తద్వారా కొత్త సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలు చేసేందుకు వీలవుతుంది.నిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.కొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.డీఏ పెంపుకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జులై 2025 నుంచి కరవు భత్యం (డీఏ) 3 శాతం పెరిగే అవకాశం ఉందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలి ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ఈమేరకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 55 శాతం డీఏను 58 శాతానికి పెంచాలని యోచిస్తోంది. ఈ పెంపు జులై నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దీపావళి ముందు అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కస్టమర్ సర్వీస్ కోసం ప్రీమియం చెల్లించాల్సిందే!? -
మూడు కేటగిరీలుగా పేమెంట్ అగ్రిగేటర్లు
ముంబై: చెల్లింపుల సేవలకు మధ్యవర్తులుగా వ్యవహరించే అగ్రిగేటర్లను (పేమెంట్ అగ్రిగేటర్లు) మూడు కేటగిరీలుగా వర్గీకరిస్తూ, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఇందులో భౌతికంగా సేవలు అందించే (పీవోఎస్ మెషీన్ల ద్వారా) వాటిని పీఏ–పీగా, సీమాంతర చెల్లింపుల్లోని వాటిని పీఏ–సీబీలుగా, ఆన్లైన్ చెల్లింపుల సేవల అగ్రిగేటర్లను ఆన్లైన్ పీఏలుగా వర్గీకరించింది.పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపార నిర్వహణ విషయమై బ్యాంక్లకు ఎలాంటి అనుమతి అక్కర్లేదు. నాన్ బ్యాంక్లకు మాత్రం నిర్ణీత మూలధనం అవసరమని ఈ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘‘పేమెంట్ అగ్రిగేటర్ వ్యాపారం ప్రారంభించాలనుకునే సంస్థ దరఖాస్తు చేసుకునే నాటికి కనీసం రూ.15 కోట్ల నెట్వర్త్ (నికర విలువ) కలిగి ఉండాలి. అనుమతి పొందిన మూడో ఏడాదికి రూ.25 కోట్ల నెట్వర్త్ను సాధించాల్సి ఉంటుంది’’ అని ఆర్బీఐ పేర్కొంది. -
యూఎస్లో శ్రామిక కొరతను అందిపుచ్చుకునేలా..
ఐటీ జాబ్స్ కాకుండా విదేశీయుల కోసం యూఎస్లో చాలానే ఉద్యోగాలు ఉన్నాయి. యూఎస్లో పెరుగుతున్న శ్రామిక కొరత దృష్ట్యా భారత యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఐటీ కాకుండా అమెరికాలో ప్రస్తుతం నర్సింగ్, హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ), స్కిల్డ్ ట్రేడ్ ఉద్యోగాలు (వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వంటివి), వ్యవసాయ రంగాల్లో భారతీయ యువతకు అవకాశాలు ఉన్నాయి.కొన్ని సంస్థల సర్వేల ప్రకారం.. భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయసు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్గా ఎదగడానికి భారత్కు అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన యూఎస్ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా యువ జనాభా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని భారత్ భర్తీ చేస్తుంది.యూఎస్లో ఐటీయేతర ఉద్యోగ అవకాశాలునర్సింగ్, ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సులకు, ఇతర ఆరోగ్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ): హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ వంటి హాస్పిటాలిటీ రంగాల్లో కూడా భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయి.నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలు: వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, గృహ నిర్మాణ కార్మికులు.. వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్ల్లో కూడా అమెరికాలో కొరత ఉంది. దీనికి తగిన శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయి.వ్యవసాయం: అమెరికా వ్యవసాయ రంగంలో కూడా వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ముఖ్యంగా హెచ్-1బీ వీసా వంటి వాటికి ఎంతో పోటీ ఉంది. భారత యువత వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి. విద్యార్హతలు సంపాదించాలి. అమెరికా వీసా నిబంధనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.వీసా విధానాలువీసా పేరుఉపయోగం / లక్ష్యంH‑2Aవ్యవసాయ రంగంలో సీజనల్ వర్కర్ల కోసం ఈ వీసా పని చేస్తుంది.H‑2Bవ్యవసాయేతర సీజనల్ / తాత్కాలిక ఉద్యోగాలు (హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, పార్క్స్, రిసోర్ట్స్ మొదలైనవి)L‑1కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వర్కర్లుO‑1అత్యుత్తమ ప్రతిభ (ఆర్ట్స్, అథ్లెటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్సెస్) ఉన్నవారికీ ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
నాలుగు నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
ఆహార, తయారీ వస్తు రేట్ల పెరుగుదలతో ఆగస్ట్ నెలలో టోకు ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్ట స్థాయిలో 0.52 శాతంగా నమోదైంది. గత రెండు నెలల పాటు నమోదైన క్షీణత (మైనస్) నుంచి బయటపడింది. జూలైలో మైనస్ 0.58 శాతం, జూన్లో మైనస్ 0.19 శాతం చొప్పున టోకు ద్రవ్యోల్బణం నమోదైంది. 2024 ఆగస్ట్ నెలలో ఇది 1.25 శాతంగా ఉంది. టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) వివరాలను పరిశ్రమల శాఖ విడుదల చేసింది. ఆహార, తయారీ వస్తువులు, నాన్ మెటాలిక్ మినరల్ ఉత్పత్తులు, రవాణా ఎక్విప్మెంట్ ధరలు పెరగడం వల్లే టోకు ద్రవ్యోల్బణం సానుకూల స్థితిలోకి వచ్చినట్లు తెలిపింది. ఆహార విభాగంలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 3.06 శాతంగా నమోదైంది. జూలైలో ఇది మైనస్ 6.29 శాతంగా ఉంది.కూరగాయల విభాగంలో మైనస్ 14.18 శాతంగా, పప్పుల్లో మైనస్ 14.85 శాతంగా ద్రవ్యోల్బణం ఉంది. జూలైలో ఇవి వరుసగా 28.96%, 15.12% చొప్పున ఉన్నాయి.ఆలుగడ్డల విభాగంలో మైనస్ 44.11 శాతం, ఉల్లిగడ్డల విభాగంలో మైనస్ 50.46 శాతం చొప్పున ద్రవ్యోల్బణం నమోదైంది. విద్యుత్, ఇంధన విభాగంలో మైనస్ 3.17 శాతం ద్రవ్యోల్బణం నెలకొంది. జూలైలో ఇది మైనస్ 2.43 శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల విభాగంలో టోకు ద్రవ్యోల్బణం జూలైలో 2.05 శాతంగా ఉంటే, ఆగస్ట్లో 2.55 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
ఆగస్టులో ఎగుమతులు జంప్
ఎగుమతులు ఆగస్ట్లో మెరుగైన వృద్ధిని చూశాయి. 35.1 బిలియన్ డాలర్ల విలువైన (సుమారు రూ.3.09 లక్షల కోట్లు) వస్తు ఎగుమతులు నమోదయ్యాయి. అదే సమయంలో దిగుమతులు 10.12 శాతం తగ్గి 61.59 బిలియన్ డాలర్లు (రూ.5.42 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో ఆగస్ట్ నెలలో వాణిజ్య లోటు 26.49 మిలియన్ డాలర్లకు (రూ.2.33 లక్షల కోట్లు) పరిమితమైంది. క్రితం ఏడాది ఆగస్ట్లో వాణిజ్య లోటు 35.64 బిలియన్ డాలర్లతో పోల్చితే గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్ట్లో బంగారం దిగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 56 శాతం తగ్గడం అనుకూలించింది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్ట్లో వస్తు, సేవల ఎగుమతులు అన్నీ కలిపి 69.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఇవి 63.25 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్లో వస్తు, సేవల దిగుమతులు 79.04 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు 9.88 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. భారత ఉత్పత్తులపై అమెరికా రెండు విడతల్లో విధించిన మొత్తం 50 శాతం టారిఫ్లు ఆగస్ట్ నుంచి అమల్లోకి రాగా, ఇదే నెలలో ఆ దేశానికి 6.86 బిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. భారత ఎగుమతుల్లో అమెరికాయే మొదటి స్థానంలో నిలిచింది.యూఏఈకి 3.24 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్కు 1.83 బిలియన్ డాలర్లు, చైనాకి 1.21 బిలియన్ డాలర్లు, యూకేకి 1.14 బిలియన్ డాలర్ల చొప్పున ఎగుమతులు వెళ్లాయి.ఇక చైనా నుంచి అత్యధికంగా 10.91 బిలియన్ డాలర్ల వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంది. ఆ తర్వాత రష్యా నుంచి 4.83 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి 4.66 బిలియన్ డాలర్లు, యూఎస్ నుంచి 3.6 బిలియన్ డాలర్లు, సౌదీ నుంచి 2.5 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి. బంగారం దిగుమతులు 56.67 శాతం తగ్గి 5.43 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సేవల ఎగుమతుల వరకే చూస్తే 34.06 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2024 ఆగస్ట్లో సేవల ఎగుమతులు 30.36 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 13 శాతం పెరిగాయి. ఎల్రక్టానిక్స్ వస్తు ఎగుమతులు 2.93 బిలియన్ డాలర్లు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు 9.9 బిలియన్ డాలర్లు, రత్నాభరణాలు 2.31 బిలియన్ డాలర్లు, పెట్రోలియం ఉత్పత్తులు 4.48 బిలియన్ డాలర్లు, ఫార్మా ఎగుమతులు 2.51 బిలియన్ డాలర్ల చొప్పున ఆగస్ట్లో నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు ఐదు నెలల్లో వస్తు సేవల ఎగుమతులు 349.35 బిలియ్ డాలర్లుగా ఉన్నట్టు వాణిజ్య శాఖ అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న 329 బిలియన్ డాలర్ల కంటే 6.18 శాతం అధికం.ఆగస్ట్ చివరి నాటికి వాణిజ్య మిగులు 80.97 బిలియన్ డాలర్లకు పెరిగింది.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
ఐటీఆర్ దాఖలుకు మరొక రోజు గడువు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్లు) దాఖలుకు చివరి రోజు (సెపె్టంబర్ 15) అయిన సోమవారం ఈ–ఫైలింగ్ పోర్టల్పై భారీ రద్దీ కనిపించింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో ఎకరవు పెడుతూ, గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎలాంటి సమస్యల్లేవన్న ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ).. సెపె్టంబర్ 16వ తేదీ వరకు (మరొక రోజు) గడువు పొడిగిస్తున్నట్టు రాత్రి 11 గంటల తర్వాత ఎక్స్ ప్లాట్ఫామ్పై ప్రకటించింది. ఐటీ పోర్టల్లో సమస్యలు ఎదురవుతున్నట్టు గత కొన్ని రోజులుగా వ్యక్తులు, చార్టర్డ్ అకౌంటెంట్లు సోషల్ మీడియా ద్వారా ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. పన్ను చెల్లింపులు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) డౌన్లోడ్లో సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొంటూ, గడువు పొడిగించాలని కోరారు. ముఖ్యంగా ఇ–ఫైలింగ్ పోర్టల్పై లాగిన్ కాలేకపోయామంటూ పలువురు అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. పెద్ద సంఖ్యలో రిటర్నులు..7 కోట్లకు పైగా ఐటీఆర్లు దాఖలైనట్టు సీబీడీటీ ప్రకటించింది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరానికి (2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఇంకా రిటర్నులు దాఖలు చేయని వారు వెంటనే ఆ పని పూర్తి చేయాలని సూచించింది. గత ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్లు) రిటర్నుల సమర్పణకు జూలై 31 గడువు తేదీ కాగా, దీన్ని సెపె్టంబర్ 15 వరకు పొడిగించడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్లు దాఖలయ్యాయి. -
జీడీపీకి ఏఐ దన్ను!
న్యూఢిల్లీ: పరిశ్రమలవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో ఉత్పాదకత, సిబ్బంది పని సామర్థ్యాలు గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో 2035 నాటికి భారత స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) 500–600 బిలియన్ డాలర్ల మేర విలువ జత కాగలదని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. వచ్చే దశాబ్దకాలంలో వివిధ రంగాలవ్యాప్తంగా ఏఐ వినియోగంతో గ్లోబల్ ఎకానమీకి 17–26 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల విలువ జతవుతుందని పేర్కొంది. భారీ సంఖ్యలో స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) నైపుణ్యాలున్న సిబ్బంది లభ్యత, పరిశోధన..అభివృద్ధి వ్యవస్థ విస్తరిస్తుండటం, డిజిటల్..సాంకేతిక సామర్థ్యాలు మెరుగుపడుతుండటం తదితర అంశాలు అంతర్జాతీయ ఎకానమీలో భారత్ కీలకపాత్ర పోషించేందుకు తోడ్పడగలవని నివేదిక తెలిపింది. గ్లోబల్ ఏఐ విలువలో భారత్ 10–15 శాతం వాటాను దక్కించుకోవచ్చని వివరించింది. ఆవిష్కరణలను ప్రోత్సహించాలి: నిర్మల అందరికీ మేలు చేసే టెక్నాలజీ ఆవిష్కరణలను ప్రోత్సహించే విధంగా నియంత్రణలు ఉండాలే తప్ప వాటిని అణచివేసే విధంగా ఉండకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఏఐ టెక్నాలజీలను వినియోగించడమే కాకుండా వాటిని వివిధ రంగాలు బాధ్యతాయుతంగా ఉపయోగించుకునేలా చూడటంపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నీతి ఆయోగ్ నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఏఐ అనేక మార్పులకు లోనవుతూ, చాలా వేగంగా పురోగమిస్తోందని మంత్రి చెప్పారు. టెక్నాలజీ పరుగుకు అనుగుణంగా నియంత్రణలు కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధి వేగం పుంజుకోవాలంటే ఉత్పాదకత పెరగాలని, ఇందుకోసం పరిశ్రమలు ఏఐని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు, మన జీవన విధానాన్ని కృత్రిమ మేధ గణనీయంగా మార్చేయనున్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీలో భారత్ ముందుండాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.నివేదికలో మరిన్ని విశేషాలు..→ నిర్ణయాలు తీసుకోవడం, వసూళ్లు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ రూపురేఖలను ఏఐ సిస్టమ్లు మార్చివేయగలవు. ప్రత్యామ్నాయ డేటా వనరులను ఉపయోగించి బ్యాంకులు రుణాలపై మరింత కచి్చతత్వంతో, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. వివిధ పరిశ్రమలవ్యాప్తంగా ఏఐ వినియోగం ద్వారా ఉత్పాదకత, సామర్థ్యాలకు సంబంధించిన సవాళ్లు సుమారు మూడో వంతు పరిష్కారం కాగలవు. → టెక్నాలజీ సరీ్వసుల్లో కొత్త ఆవిష్కరణలు.. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి. → ప్రస్తుత 5.7 శాతం వృద్ధి రేటు ప్రకారం 2035 నాటికి భారత జీడీపీ 6.6 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ భారత్ ఆకాంక్షిస్తున్నట్లుగా 8 శాతం వృద్ధి సాధిస్తే మరో 1.7 ట్రిలియన్ డాలర్లు పెరిగి 8.3 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చు. → ఏఐతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు రానున్నప్పటికీ, దీనితో ప్రస్తుతం ఉన్న అనేక ఉద్యోగాలు తగ్గుతాయి. ప్రధానంగా క్లరికల్, రొటీన్ పనులు, నైపుణ్యాలు అంతగా అవసరంలేని ఉద్యోగాలు ఈ జాబితాలో ఉంటాయి. ఆర్థిక సేవలు, తయారీ రంగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 2035 నాటికి ఆయా రంగాల జీడీపీ విలువలో కృత్రిమ మేథ వాటా దాదాపు 20–25 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఏఐ ఆధారిత ఉత్పాదకత, సామర్థ్యాల మెరుగుదలతో ఫైనాన్షియల్ సరీ్వసుల్లో 50–55 బిలియన్ డాలర్ల అవకాశాలు లభిస్తాయని రిపోర్ట్ వివరించింది. -
జీఎస్టీ తగ్గింపుతో 140 కోట్ల మందికి ప్రయోజనం
కొత్త జీఎస్టీ సవరణల్లో భాగంగా 350కు పైగా వస్తువుల ధరలు తగ్గించేలా చర్యలు తీసుకున్నామని, దీనివల్ల 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ తగ్గింపు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. చెన్నై ఆళ్వార్పేటలోని మ్యూజిక్ అకాడమీలో ఆదివారం ‘జీఎస్టీ సంస్కరణలు – రైజింగ్ ఇండియా కోసం పన్ను సంస్కరణలు’ అనే అంశంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. దీపావళికి ముందు జీఎస్టీ తగ్గింపు వల్ల వస్తువుల కొనుగోళ్లు మరింత వేగం పుంజుకుంటాయన్నారు. నిత్యావసర వస్తువులకు జీఎస్టీని తగ్గించడం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలకు మరింత లాభం చేకూరుతుందన్నారు. జీఎస్టీ పన్ను సంస్కరణల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి సంస్థ ఈ తగ్గింపును ప్రజల్లో తీసుకెళ్తుందన్న నమ్మకం ఉందన్నారు.ఇదీ చదవండి: సెస్ల లక్ష్యం నీరుగారుతోందా? -
సెస్ల లక్ష్యం నీరుగారుతోందా?
కేంద్రం సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులను అమలు చేస్తున్న నేపథ్యంలో సెస్లను సవ్యంగా ఉపయోగించుకోవడం పట్ల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సెస్లు.. నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం విధించే అదనపు పన్నులు. అయితే వీటి వినియోగంపై పారదర్శకత చాలా కాలంగా చర్చకు దారితీస్తోంది. విద్య, ఆరోగ్యం లేదా మౌలిక సదుపాయాలు వంటి ప్రజా సంక్షేమం కోసం నిధులకు ఉద్దేశించినవే ఈ సెస్లు. చాలా సేవలపై ప్రభుత్వం విధిస్తున్న సెస్లు వాటికి ఉద్దేశించిన ప్రయోజనాన్ని అందించడంలో విఫలమవుతున్నాయనే వాదనలున్నాయి.రాష్ట్రాలను పక్కదారి పట్టించే సాధనంగా..ఇతర పన్నుల మాదిరిగా కాకుండా, ఆదాయశాఖ నియమాల ప్రకారం.. సెస్లు, సర్ఛార్జీలు రాష్ట్రాలతో పంచుకునేందుకు వీలుండదు. వీటిపై పూర్తి అధికారం కేంద్రానిదే. వాస్తవానికి దశాబ్దాల నుంచి సెస్లు వివిధ విభాగాల్లో పెరుగుతూ వస్తున్నాయి. 2018 అధ్యయనం ప్రకారం.. 1944 నుంచి 44 విభిన్న సెస్లను గుర్తించారు. 2017లో జీఎస్టీని ప్రారంభించినప్పుడు 26 సెస్లను రద్దు చేసి, ఉన్నవాటిలో కొన్నింటి రేట్లను పెంచారు. ఈ సెస్ల్లో రాష్ట్రాల ఆదాయ లోటును భర్తీ చేయడానికి సిన్ గూడ్స్, లగ్జరీ వస్తువులపై వసూలు చేసే పరిహార సెస్ (జీసీసీ) ఒక్కదాన్ని మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటున్నారు.పర్యవేక్షణ కరవు..రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271 సెస్లను ప్రస్తావించినప్పటికీ వాటి వినియోగం అస్పష్టంగా ఉంది. సెస్ల నుంచి సమకూరే నిధులు కన్సాలిడేటెడ్ ఫండ్కు కాకుండా పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియాకు వెళ్తున్నాయి. ఈ యంత్రాంగం ద్వారా సెస్ నిధులను ఆయా విభాగాలు, విద్య, వైద్య, ఇతర మౌలిక సదపాయాలు సృష్టించేందుకు కేటాయించాలి. కానీ బడ్జెట్ పరిశీలనలో వీటి ఊసే ఎత్తడం లేదనే వాదనలున్నాయి.ఆడిట్ చేయకపోతే అంతే సంగతులు..కన్సాలిడేటెడ్ ఫండ్ కేటాయింపులతోపాటు పబ్లిక్ అకౌంట్ ఫండ్స్పై కఠినమైన పర్యవేక్షణ ఉండదనే అభిప్రాయాలున్నాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఆడిట్ చేయకపోతే వీటిపై అసలు రివ్యూనే చేయరని కొందరు భావిస్తున్నారు. ఇటీవల కాగ్ నివేదిక ఈ సమస్యను హైలైట్ చేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సెస్లు, సర్ఛార్జీల నుంచి రూ.4.88 లక్షల కోట్లు సేకరించింది. ఇది స్థూల పన్ను ఆదాయంలో 14 శాతంగా ఉంది. అయితే ఇందులో రూ.3.57 లక్షల కోట్లు సెస్ ద్వారానే సమకూరింది. అయినప్పటికీ ఈ నిధులను నిబంధనల ప్రకారం ఉద్దేశించిన ప్రయోజనాల కోసం ఉపయోగించారా.. లేదా.. అనే దానిపై పారదర్శకత లోపించిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చమురుపై విధిస్తోన్న సెస్ ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.95 లక్షల కోట్లు సమకూరింది. అందులో కేవలం రూ.902 కోట్లు మాత్రమే చమురు పరిశ్రమ అభివృద్ధి నిధి (OIDB)కు బదిలీ చేశారు.ఇదీ చదవండి: వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు -
వారం రోజులుగా ఖాళీగా ఉంటున్న ట్రక్కు డ్రైవర్లు
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ నిర్ణయం ట్రక్కు డ్రైవర్ల పాలిట శాపంగా మారింది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తున్న నేపథ్యంలో కీలక రంగాల్లోని తయారీదారులు, డీలర్లు.. ముఖ్యంగా ఆటోమొబైల్స్, వైట్ గూడ్స్ పంపిణీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది ట్రక్కులు ఖాళీగా ఉన్నాయి. కొత్త జీఎస్టీ అమలు తర్వాత వస్తువుల ధరలు తగ్గుతాయని నమ్ముతున్న తరుణంలో ఈమేరకు సరఫరా స్తంభించినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 22 తర్వాత తిరిగి ఈ వస్తువుల రవాణా ప్రారంభమవుతుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.వేచి ఉండాల్సిందే..జీఎస్టీ 2.0 అమలు దగ్గరపడుతుండడం, త్వరలో ధరలు తగ్గుతాయనే భావనతో కొత్త కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో గత వారంలో సరుకు రవాణా రేట్లు 30-35% పడిపోయాయి. సాధారణంగా చెన్నై తయారీ కేంద్రాల నుంచి భారతదేశం అంతటా కొన్ని కంపెనీల కార్ల రవాణా జరుగుతోంది. ఇది గతవారం రోజులుగా గణనీయంగా తగ్గుముఖం పట్టిందని జోగిందర్ సింగ్ అనే ట్రక్కు డ్రైవర్ తెలిపారు. ‘కంపెనీ ఉత్పత్తుల డెలివరీలు నిలిపేశారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే వరకు వేచి ఉండాలని రవాణా ఏజెన్సీలు చెప్పాయి’ అన్నారు.సరుకు రవాణా పెరిగే అవకాశందిల్లీకి చెందిన ప్రముఖ లాజిస్టిక్స్ సంస్థ చేతక్ గ్రూప్ డైరెక్టర్ సచిన్ జేకేఎస్ హరితాష్ మాట్లాడుతూ..‘త్వరలో కొత్త జీఎస్టీ అమలు నేపథ్యంలో దాదాపు 90 శాతం ట్రక్కులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సరఫరాదారులు, రిటైలర్లు వస్తువుల ఇన్వాయిస్లను నిలిపేశారు. నవరాత్రి-దీపావళి సీజన్లో వాహన తయారీదారులు, రిటైలర్లు బ్యాక్లాగ్లను క్లియర్ చేయడానికి, వస్తువులను పంపిణీ చేయడానికి వేగంగా పని చేస్తారు. దాంతో సెప్టెంబర్ 22 నుంచి వస్తు సరఫరాలో రష్ మొదలవుతుంది. డిమాండ్ అకస్మాత్తుగా పెరగడం, వాహనాల పరిమిత లభ్యత కారణంగా జీఎస్టీ అమలు తర్వాత సరుకు రవాణా రేట్లు 30-40 శాతం పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.డీలర్ల ఎదురుచూపుడీలర్లు సవరించిన జీఎస్టీ బిల్లింగ్ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నందున ఆటోమొబైల్, కన్జూమర్ డ్యూరబుల్స్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. బుకింగ్స్ కొనసాగుతున్నప్పటికీ ఈ వారం డెలివరీలు జరగడం లేదని ఒక ప్రధాన ఆటో డీలర్ షిప్ ప్రతినిధి ధ్రువీకరించారు. ‘ఈ రోజు బుకింగ్ చేసినప్పటికీ కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం బిల్లింగ్ ప్రారంభిస్తాం. సెప్టెంబర్ 22 తర్వాత డెలివరీలు షెడ్యూల్ అవుతున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: సాఫ్ట్ డ్రింక్స్పై ‘హార్డ్’ నిర్ణయం.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన -
తీసుకున్న రుణాలపై వడ్డీ మాఫీ?
అమెరికా సుంకాలు భారత వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న దృష్ట్యా కొన్ని సడలింపులు కావాలని దేశీయ ఎగుమతిదారులు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరుతున్నారు. యూఎస్ సుంకాలతో దెబ్బతింటున్న ఉత్పాదకత, సరఫరా సవాళ్లకు తాత్కాలిక పరిష్కారంగా ఇప్పటికే తీసుకున్న రుణాలపై వడ్డీని తొలగించాలంటున్నారు. డిసెంబర్ 2024లో ముగిసిన వడ్డీ ఈక్వలైజేషన్ స్కీమ్ (ఐఈఎస్)ను పునరుద్ధరించాలని లేదా ఎగుమతి ప్రోత్సాహక రూపంలో డ్యూటీ క్రెడిట్ స్క్రిప్లను(దిగుమతి చేసుకునే ముడి సరుకుపై సుంకాల సడలింపు) తిరిగి ప్రవేశపెట్టాలని చెబుతున్నారు. అయితే అందుకు మంత్రిత్వశాఖ సుముఖంగా లేదని తెలుస్తుంది. ఈ అంశం ఇంకా చర్చల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.ఎగుమతిదారులు ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) డిసెంబర్ 2024లో ముగిసిన ఐఈఎస్ను కొనసాగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గతంలో ఈ పథకం కింద ప్రభుత్వం ఎగుమతి రుణంపై వడ్డీ రేట్లను మాఫీ చేసింది. భారతీయ ఎగుమతిదారులు వారి రుణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని, దాని ద్వారా కొత్త మార్కెట్ల్లో ఎగుమతులను పెంచే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.‘ఐఈఎస్ లేదా డ్యూటీ క్రెడిట్ స్క్రిప్స్ ద్వారా నేరుగా ఎగుమతులు పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నమ్మడం లేదు. దీనిపై ఎగుమతిదారులు, వాణిజ్య విభాగం మధ్య చర్చలు జరుగుతున్నాయి’ అని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. 2026 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్లో రూ.2,250 కోట్ల వార్షిక వ్యయంతో ఎగుమతి ప్రోత్సాహక మిషన్ను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది గతంలో ఐఈఎస్ కింద చేసిన పంపిణీల కంటే చాలా తక్కువగా ఉంది.ఇదీ చదవండి: స్మాల్క్యాప్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ మంచిదా? -
ఏసీలు, ఎల్ఈడీ లైట్లకు పీఎల్ఐ పథకం
వైట్ గూడ్స్ (ఏసీలు, ఎల్ఈడీ లైట్లు) తయారీకి సంబంధించి ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ)ను కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14 వరకు అందుబాటులో ఉంటుందని వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈ పథకం కింద మరిన్ని పెట్టుబడులకు పరిశ్రమ ఆసక్తి చూపిస్తుండడంతో తిరిగి ప్రారంభించినట్టు తెలిపింది.వైట్ గూడ్స్ పీఎల్ఐ పథకం కింద ఎంపికైన దరఖాస్తుదారులు రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలకు అర్హులని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రూ.10,406 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలతో 83 దరఖాస్తులు వచి్చనట్టు తెలిపింది. ఈ పెట్టుబడులతో ఏసీలు, ఎల్ఈడీ లైట్లకు సంబంధించి విడిభాగాలు దేశీయంగా తయారవుతాయని వెల్లడించింది. ఇందులో కొన్ని విడిభాగాలు దేశీయంగా తయారవుతున్నప్పటికీ తగినంత పరిమాణంలో లేనట్టు పేర్కొంది. మొదటిసారి వైట్ గూడ్స్ రంగానికి పీఎల్ఐ పథకాన్ని కేంద్రం 2021 ఏప్రిల్ 7న ప్రకటించడం గమనార్హం. 2021–22 నుంచి 2028–29 వరకు అమలు చేయాలని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: ఎవరైనా సులువుగా డబ్బు సంపాదించవచ్చు! -
జీఎస్టీ సంస్కరణలు దీపావళి ముందే ఎందుకంటే..
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న జీఎస్టీ సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి ప్రశంసించారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికీ భారీ విజయమని ఆమె అభివర్ణించారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడారు.దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలు ఎందుకన్నదానిపైనా ఆర్థిక మంత్రి వివరణ ఇచ్చారు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి వారి సొంత పండుగలు ఉంటాయన్న నిర్మలా సీతారామన్.. దీపావళి పండుగకు ముందు జీఎస్టీ సంస్కరణల అమలును ప్రారంభించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు ముందే నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.చెన్నై సిటిజన్స్ ఫోరం నిర్వహించిన 'ట్యాక్స్ రిఫార్మ్స్ ఫర్ రైజింగ్ భారత్' కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ, దేశ ప్రజలు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అన్ని ఉత్పత్తులపైనా జీఎస్టీ ప్రయోజనకరమైన ప్రభావం ఉంటుందని ఆమె అన్నారు.జీఎస్టీ కింద గతంలో 12 శాతం పన్ను విధించిన 99 శాతం వస్తువులను ఇప్పుడు 5 శాతానికి తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా ఇప్పటివరకు ఉన్న శ్లాబులను రెండు శ్లాబులకే జీఎస్టీ కౌన్సిల్ కుదించింది. ఇకపై 5, 28 శాతం పన్ను శ్లాబులు మాత్రమే కొనసాగనున్నాయి. తాజా జీఎస్టీ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు పొడిగిస్తారా? వెల్లువెత్తుతున్న విజ్ఞప్తులు -
ఆరు కోట్లు దాటిన ఐటీ రిటర్నులు
న్యూఢిల్లీ: 2025–26 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి సెపె్టంబర్ 13 (శనివారం) నాటికి ఆరు కోట్ల పైగా రిటర్నులు దాఖలైనట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. తుది గడువు (సెపె్టంబర్ 15 గడువు) దగ్గర పడుతుండడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పేర్కొంది. ‘‘ఆరు కోట్ల మైలురాయిని చేరుకునేందుకు సహకరించిన పన్ను చెల్లింపుదారులు, పన్ను నిపుణులకు ధన్యవాదాలు. రిటర్నుల ఫైలింగ్లో పన్ను చెల్లింపుదారులకు సాయంగా హెల్ప్ డెస్్కలు, వారమంతా ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తాయి. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ఎక్స్ సెషన్లు, ఎక్స్ ద్వారా హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది’’ అని తన ఎక్స్ అకౌంట్ పోస్ట్ ద్వారా తెలిపింది. రిటర్నులు ఇంకా సమర్పించని పన్ను చెల్లింపుదారులు వెంటనే దాఖలు చేయాలని సూచించింది. చివరి నిమిషం వరకు వేచిచూడొద్దని కోరింది. ఆదాయపన్ను శాఖ ఇప్పటికే జూలై 31వ తేదీ నుంచి సెపె్టంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. గత అసెస్మెంట్ సంవత్సరంలో 2024 జులై 31 నాటికి 7.28 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయి. అంతకుముందు ఏడాది 6.77 కోట్ల రిటర్నుల ఫైలింగ్తో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 7.5% పెరిగాయి. -
'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్
డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో వెల్లడించారు.రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అని అన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు.


