Economy
-
సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల అస్థిరత, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, సామాన్య వినియోగదారుడికి మాత్రం బంకుల వద్ద ధరల్లో తక్షణ ఉపశమనం లభించలేదనే వాదనలున్నాయి. చమురు విక్రయ సంస్థల (ఓఎంసీ) నష్టాలను పూడ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.సుంకాల కోత.. మారని ధరలు!కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించింది. అలాగే, గతంలో లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి బదిలీ కావడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకోవడానికి, చమురు సంస్థల ఆర్థిక రికవరీకి సహాయపడటానికే ఈ సుంకాల కోత ఉపయోగపడనుంది.నయారా ఎనర్జీ ధరల పెంపుదేశంలో ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపై ధరల భారాన్ని మోపింది. అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన సేకరణ ఖర్చులను భర్తీ చేసేందుకు పెట్రోల్ లీటరుకు రూ.5 పెంచింది. డీజిల్ లీటరుకు రూ.3 పెంచింది. రోస్నెఫ్ట్ మద్దతు గల ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన 6,967 ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ పెంపును అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉండే వ్యాట్ వ్యత్యాసాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.5.30 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలు (మార్చి 27)ప్రభుత్వ రంగ సంస్థల (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) ఇంధన ధరల్లో మార్పులు లేనప్పటికీ నగరాల వారీగా ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.నగరంపెట్రోల్ (లీటరుకు)డీజిల్ (లీటరుకు)ఢిల్లీరూ. 94.72రూ. 87.62ముంబైరూ. 104.21రూ. 92.15బెంగళూరురూ. 102.84రూ. 88.95హైదరాబాద్రూ. 107.41రూ. 95.65చెన్నైరూ. 100.75రూ. 92.34 గమనిక: పైన పేర్కొన్నవి ప్రభుత్వ రంగ సంస్థల ధరలు. ప్రైవేట్ బంకుల్లో (నయారా వంటివి) ఈ ధరలు రూ.3 నుంచి రూ.5 వరకు ఎక్కువగా ఉండవచ్చు.ఎందుకీ అస్థిరత?ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల బ్యారెల్ ముడిచమురు ధర అమాంతం పెరిగింది. ప్రైవేట్ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలను పెంచగా ప్రభుత్వ సంస్థలు ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాయి. వెరసి, సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు.ఇదీ చదవండి: విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది? -
60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం
దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్లో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా, నియంత్రణలో ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని భరోసా ఇచ్చింది.వదంతులు నమ్మొద్దు..సోషల్ మీడియాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల్లోని క్యూలైన్లు, పాత లాక్డౌన్ దృశ్యాలను వాడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి వార్తలను నమ్మి పౌరులు ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని పేర్కొంది.కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురును కంపెనీలు ఇప్పటికే సేకరించాయి. రిటైల్ అవుట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా పెట్రోల్ బంకులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి 8,00,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు సముద్ర మార్గంలో భారత్కు వస్తోంది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ ఇంధన భద్రతలో పటిష్టంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకప్పుడు కేవలం పశ్చిమాసియాపైనే ఆధారపడిన భారత్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 41కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల హార్మూజ్ జలసంధి వంటి ప్రాంతాల్లో అంతరాయాలు కలిగినా దేశీయ సరఫరాకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసింది.తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలునిత్యావసర వస్తువుల లభ్యతపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, డీలర్లకు క్రెడిట్ పరిమితులను కూడా పెంచామని, కావున ప్రజలు సంయమనం పాటించాలని కోరింది.విశాఖ తీరానికి ‘ఎంటీ జంబో’ రాక!రష్యా నుంచి సుమారు 1,36,728 మెట్రిక్ టన్నుల ముడి చమురును మోసుకొస్తూ ‘ఎంటీ జంబో’ నౌక నేడు విశాఖ తీరానికి చేరుకుంది. ఈ భారీ కంటైనర్ రాకతో స్థానిక రిఫైనరీలకు ముడి సరుకు లభ్యత పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాలో స్థిరత్వం ఏర్పడనుంది. నిన్న బీడబ్ల్యూ బ్రిచ్ నౌక 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (వంట గ్యాస్)తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఎంటీ పెట్రాయిట్ నౌక కూడా భారీ స్థాయిలో ముడి చమురును తీసుకువచ్చింది. అయితే, ఎంటీ జంబో ద్వారా వచ్చిన లక్షన్నర టన్నుల ముడి చమురును పైప్లైన్ల ద్వారా రిఫైనరీలకు తరలించే అన్లోడింగ్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. వంట గ్యాస్ నిల్వలను మరింత పెంచే దిశగా ఈ నెల 30వ తేదీన మరో రెండు ఎల్పీజీ నౌకలు విశాఖ తీరానికి చేరుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?
ఉమాంగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ అందులో ఏకంగా 2400 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవి చాలా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ యాప్ను యూజర్లకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొత్త సర్వీసులు ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2400 సేవలను అందిస్తోంది. ఇప్పుడు యూజర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఉన్నచోటనే తమకు కావలసిన సేవలను పొందవచ్చు.ఉమాంగ్ యాప్ వేలాది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి చేర్చి, మల్టిపుల్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. 2026 నాటికి ఈ యాప్ గూగుల్ ప్లేలో 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను, లక్షలాది మంది రిజిస్ట్రేషన్ వినియోగదారులను, బిలియన్ల కొద్దీ సంచిత లావాదేవీలను కలిగి ఉంది.UMANG యాప్ ఆండ్రాయిడ్, iOS, వెబ్, SMS, KaiOS ద్వారా ఫీచర్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఇది బహుళ భాషలకు, బయోమెట్రిక్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇది సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. గ్యాస్ బుకింగ్, ఈపీఎఫ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నో సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సంయుక్తంగా డిజిటల్ ఇండియా చొరవ కింద 2017లో UMANG యాప్ను (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) ప్రారంభించాయి. ఆ తరువాత వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్ఫారమ్గా UMANG ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందింది. ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి! -
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?
భారత్కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) 7.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. పూర్వపు అంచనా కంటే 0.20 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం గతంలో పేర్కొన్న అంచనాలతో పోల్చితే 0.4 శాతం పెంచి 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం కారణంగా అధిక ఇంధన ధరలు ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడి కలిగించొచ్చని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరమైన అనిశ్చితులు కారణంగా ఏర్పడే రిస్కులు భారత్పై ప్రభావం చూపించొచ్చని (కమోడిటీ ధరలు, ఎగుమతులు, పెట్టుబడుల రాకపై) పేర్కొంది.చమురు ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగితే భారత్లో విక్రయ ధరలు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. అయితే ధరల పెరుగుదల భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపే అవకాశం లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2026–27లో 4.3 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. అధిక చమురు ధరలు వాణిజ్యలోటు పెరిగేందుకు కారణం కావొచ్చంటూ.. సేవల ఎగుమతుల రూపంలో మిగులు ఈ లోటును పరిమితం చేస్తుందని వివరించింది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా, స్థిరంగా కొనసాగించొచ్చని అంచనా వేసింది.చమురు ధరల సెగలు.. జూన్ త్రైమాసికంలో బ్రెంట్ బ్యారెల్కు సగటున 92 డాలర్ల స్థాయిలో, 2026లో సగటున 80 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే జూన్ త్రైమాసికంలో బ్రెంట్ చమురు బ్యారెల్కు 185 డాలర్ల స్థాయికి, 2026 వ్యాప్తంగా 130 డాలర్ల స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది. -
పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..
అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నిమిషాల్లోనే బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), డీలర్ అసోసియేషన్లు మాత్రం ‘కంగారు వద్దు.. సరిపడా నిల్వలు ఉన్నాయి’ అని భరోసా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం బైకులు, కార్లకే కాకుండా.. అసలు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ఏయే రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారో తెలుసుకుందాం.డీజిల్: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంభారతదేశంలో చమురు వినియోగంలో సింహభాగం డీజిల్దే. ఇది కేవలం లారీలు, బస్సులకే పరిమితం కాదు. దేశీయంగా రవాణా రంగంలో (సుమారు 70 శాతం) దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులను చేరవేసే భారీ ట్రక్కులు, గూడ్స్ వాహనాలు పూర్తిగా డీజిల్పైనే ఆధారపడి ఉన్నాయి. రైల్వే ఇంజిన్లలో కూడా గణనీయమైన భాగం ఇంకా డీజిల్తోనే నడుస్తున్నాయి.వ్యవసాయ రంగం (సుమారు 13%): రైతులకు డీజిలే ఆధారం. పొలం దున్నే ట్రాక్టర్లు, నీటిని తోడే పంపు సెట్లు, హార్వెస్టర్లు (కోత యంత్రాలు) పెట్రోల్ కంటే డీజిల్నే ఎక్కువగా వాడుతాయి. ముఖ్యంగా సాగు సీజన్లో ఈ వినియోగం రెట్టింపు అవుతుంది.పరిశ్రమలు, విద్యుత్ (సుమారు 10%): భారీ ఫ్యాక్టరీల్లోని జనరేటర్లు, విద్యుత్ గ్రిడ్ ఫెయిల్ అయినప్పుడు వాడే బ్యాకప్ పవర్ ప్లాంట్లకు డీజిల్ కీలకం. ఐటీ కంపెనీలు, మల్టీప్లెక్స్లు, ఆసుపత్రుల్లోని పవర్ బ్యాకప్ వ్యవస్థలు దీనిపైనే నడుస్తాయి.పెట్రోల్: వ్యక్తిగత ప్రయాణాలకే పరిమితమా?ద్విచక్ర వాహనాలు (సుమారు 60%): భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో అత్యధిక వాటా టూ-వీలర్లదే. మధ్యతరగతి ప్రజల ప్రధాన రవాణా సాధనం కావడంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ప్రైవేట్ కార్లు (సుమారు 35%): వ్యక్తిగత వినియోగం కోసం వాడే కార్లు పెట్రోల్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నాయి.ఇతర రంగాలు: చిన్నపాటి గార్డెనింగ్ పరికరాలు, కొన్ని రకాల పడవలు (ఫిషింగ్ బోట్లు), కొన్ని జనరేటర్లలో తక్కువ మొత్తంలో పెట్రోల్ వాడుతుంటారు.ప్రజలు ఏం చేయాలి?ప్రస్తుతానికి దేశంలో చమురు నిల్వలు పటిష్టంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తోంది. యుద్ధ భయంతో అవసరం లేకున్నా డబ్బాల్లో, బాటిళ్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంధనం పొదుపు చేయడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే. అనవసర భయాందోళనలకు లోనై బంకుల వద్ద రద్దీ పెంచకుండా సంయమనం పాటించడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరం.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
ఆర్బీఐ పాలసీ మీటింగుల షెడ్యూల్ వచ్చేసింది..
ముంబై: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ షెడ్యూల్ను ఆర్బీఐ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి సమీక్ష ఏప్రిల్ 6–8 తేదీల మధ్య ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ మొత్తం మీద 2026–27లో ఆరుసార్లు సమావేశం కానుంది. ద్వితీయ ద్వైమాసిక సమీక్షా సమావేశం జూన్ 3–5 తేదీల మధ్య ఉంటుంది. ఆ తర్వాత ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్, 2027 ఫిబ్రవరి నెలల్లో తదుపరి ఎంపీసీ భేటీలు ఉంటాయి.ప్రతీ సమీక్ష మూడు రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ మీడియాకు వెల్లడిస్తుంటారు. ఆరుగురు సభ్యుల్లో ఆర్బీఐ గవర్నర్తోపాటు మరో ఇద్దరు ఆర్బీఐ అధికారులు, కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యులు భాగంగా ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరిగా ఫిబ్రవరిలో ఎంపీసీ సమీక్ష ముగియడం తెలిసిందే. ఆ సందర్భంగా కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. -
మూడు నెలల్లో 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెబ్సైట్పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది. అయితే, అత్యాధునిక రక్షణ వ్యవస్థల కారణంగా ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.మూడొంతులు పెరిగిన దాడుల తీవ్రతగత ఏడాది కాలంగా ఆర్బీఐ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్ ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో అర్థమవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జూన్ మధ్య 1.9 కోట్లు, జులై - సెప్టెంబర్ మధ్య 3.1 కోట్లు, అక్టోబర్ - డిసెంబర్ మధ్య 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు జరిగాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దాడుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. దేశ కేంద్ర బ్యాంక్ కావడంతో దీని ప్రాముఖ్యత దృష్ట్యా హ్యాకర్లు నిరంతరం సాఫ్ట్వేర్లలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఫైర్వాల్లు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.రక్షణ వ్యవస్థలో ఏఐ విప్లవంపెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ తన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను అనుసంధానించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం.. వెబ్సైట్లోకి వచ్చే ప్రతి విజిటర్ డేటాను ఏఐ విశ్లేషిస్తుంది. సాధారణ వినియోగదారులకు, హ్యాకర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే బ్లాక్ చేస్తుంది. దాడి తీవ్రరూపం దాల్చకముందే దాని మూలాలను గుర్తించి అడ్డుకుంటుంది.భవిష్యత్తు ప్రణాళికలురాబోయే రోజుల్లో వ్యవస్థలో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. కేవలం భద్రతకే పరిమితం కాకుండా.. మోసపూరిత లావాదేవీలను క్షణాల్లో గుర్తించడం. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఏఐ చాట్బాట్లను మరింత అభివృద్ధి చేయడం వంటి విధానలు తీసుకురానున్నారు.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
ఆర్థిక వ్యవస్థలోకి ‘బంగారం’ తేవాలి
న్యూఢిల్లీ: దేశంలో గృహాలు, ఆలయాల్లో ఉన్న 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌధరి అన్నారు. భౌతిక బంగారాన్ని నిల్వ (స్టోర్) రూపంలో ఉంచడం వల్ల అది ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడటం లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ స్థాయి సంఘం (ఆర్థిక) సభ్యుడైన చౌధరి, బంగారానికి బదులు ఆర్థిక సాధనాల వైపు వినియోగదారులను మళ్లించాలని సూచించారు. దీనివల్ల బంగారం దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి దిగొస్తుందని అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్.. దేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద సుమారు 50,000 టన్నుల బంగారం ఉందని, దీని విలువ 10 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ బంగారం అంతా అధికారిక ఆర్థిక వ్యవస్థకు బయటే ఉందని చెప్పారు. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ద్వారా బంగారాన్ని డీమ్యాట్ చేసి షేర్ల మాదిరి ట్రేడ్ చేయడానికి దేశంలో అవసరమైన సాంకేతికత, వేదికలు ఉన్నాయని కృష్ణన్ తెలిపారు. అయితే, ఈజీఆర్ సమయంలో బంగారం డిపాజిట్పై విధించే 3 శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టు చెప్పారు. దీనిపై తాము పరిష్కారాన్ని సూచించినట్టు తెలిపారు. ఈజీఆర్ అన్నది సెబీ ఆమోదిత పథకం. వినియోగదారులు తమవద్దనున్న భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో షేర్ల మాదిరి ట్రేడ్ చేసుకోవచ్చు. -
ధర దడ!
ఇళ్లలో వినియోగించే ముఖ్యమైన ఎల్రక్టానిక్ వస్తువుల ధరలు ప్రియంగా మారుతున్నాయి. ఒకవైపు కొత్త ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమల్లోకి రావడం, మరోవైపు ముడిసరుకుల ధరల పెరుగుదలతో కంపెనీలు ఒక విడత రేట్లను పెంచగా.. ఇప్పుడు ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో వ్యయాల భారం పెరిగిపోయిందంటూ మరో విడత రేట్ల పెంపునకు తెరతీరాయి. దీంతో ఏసీలు, టీవీలు తదితర ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీలో శ్లాబుల కుదింపు ఫలితంగా వీటి ధరలు దిగిరాగా.. తాజాగా వీటి ధరలు పూర్వపు స్థాయిలను మించుతున్నాయి. మెమొరీ చిప్ల ధరల పెరుగుదలతో ఇప్పటికే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల ధరలు ప్రియం కావడం తెలిసిందే. కమోడిటీ ధరల్లో అస్థిరతలు, రూపాయి క్షీణత, అధిక రవాణా, ఇంధన వ్యయాలను రేట్ల సవరణకు కారణాలని పంపిణీదారులు, డీలర్లకు కంపెనీలు తెలియజేస్తున్నాయి. ధరల పెంపు విషయమై తమ వాణిజ్య భాగస్వాములకు ఎల్జీ, శామ్సంగ్, పానాసోనిక్, డైకిన్, లాయిడ్స్ తాజాగా సమాచారమిచ్చాయి. ఏసీల ధరలు 10 శాతం వరకు, ఇతర ఉత్పత్తుల ధరలు 5 శాతం వరకు పెంచుతున్నట్టు ఎల్జీ ప్రకటించింది. ఏసీల ధరలను 8–12 శాతం మధ్య పెంచుతున్నట్టు పానాసోనిక్ తెలిపింది. డైకిన్, బ్లూస్టార్ సైతం 12 శాతం పెంపు దిశగా నిర్ణయాన్ని ప్రకటించింది. లాయిడ్స్ ఇప్పటికే ధరలను పెంచింది. శామ్సంగ్ సైతం ధరలను పెంచనున్నట్టు తెలిపింది. మెమొరీ చిప్లు ధరల పెరుగుదలతో టీవీల విక్రయ ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాస్తవానికి తయారీ వ్యయాల భారం పేరుతో ఏసీలు, టీవీల ధరలను 5–9% మధ్య కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు జనవరిలో పెంచడం గమనార్హం. ఈ వరుస పెంపులతో డిమాండ్కు విఘాతం కలగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాహన ధరలు సైతం.. తయారీ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలు సైతం తమ వాహన విక్రయ ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్ తన ప్యాసింజర్, వాణిజ్య వాహనాల (ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్) ధరలను 0.5–1.5% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి రానుంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సెడెజ్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ సైతం తమ వాహనాల ధరలను వచ్చే నెల నుంచి 2% వరకు పెంచుతున్నట్టు ప్రకటించాయి. హోండా సైతం ఈ దిశగా ఆలోచన చేస్తుండగా, మిగిలిన కంపెనీలూ ఇదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. డిమాండ్పై ప్రభావం.. తాజా ధరల పెంపుతో గతేడాది జీఎస్టీ సవరణల కారణంగా తగ్గిన ధరల ప్రయోజనం పూర్తిగా ఆవిరైపోతోందని, ఇది డిమాండ్ను బలహీనం చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి వరుస ధరల పెంపు దురదృష్టకరమని, వినియోగ సెంటిమెంట్పై ప్రభావం చూపిస్తుందని ప్రముఖ ఎల్రక్టానిక్ రిటైల్ చైన్ ‘గ్రేట్ ఈస్టర్న్ రిటైల్’ డైరెక్టర్ పులకిత్ బైద్ పేర్కొన్నారు. ‘‘జీఎస్టీ తగ్గింపు అనంతరం అధిక ముడి సరుకుల ధరల పేరుతో బ్రాండ్లు రేట్లను పెంచేశాయి. ప్రస్తుత అనిశి్చతుల్లో తరచుగా ధరల పెంపు డిమాండ్పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’అని బైద్ అన్నారు. డిమాండ్ కోలుకోవడం మొదలైందంటూ, అయితే వరుస ధరల పెంపు డిమాండ్ను దెబ్బతీయొచ్చని ప్రముఖ ఎల్రక్టానిక్స్ బ్రాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సైతం అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశాల్లో పెట్రోల్ మంటలు.. దారుణంగా ధరలు!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలుయుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ధర ఏకంగా 119 డాలర్లకు చేరుకోవడంతో, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి పలు దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరా మార్గాలను వెతుక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.ధరల పెంపులో ముందంజలో ఉన్న దేశాలుగ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డేటా ప్రకారం, మార్చి రెండో వారం నాటికి దాదాపు 85 దేశాలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. ఫిబ్రవరి 23 నుంచి నమోదైన గణాంకాల ప్రకారం ఇంధన ధరల పెరుగుదల ఇలా ఉంది..దేశంపెరుగుదల శాతంమయన్మార్55.4%ఫిలిప్పీన్స్54.2%కంబోడియా52.8%లెబనాన్28.6%కెనడా25.0%పాకిస్తాన్24.4%చైనా23.2%జపాన్19.6%పొరుగు దేశాలైన పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 1.15 డాలర్లు, శ్రీలంకలో 1.45 డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్లో 0.98 డాలర్లుగా నమోదైంది.ధరలలో ఈ వ్యత్యాసం ఎందుకు?ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు ముడి చమురు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ధరలు మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..పంపిణీ వ్యయం: చమురును శుద్ధి చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు. ఇది ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే.పన్నుల ప్రభావం: ఇంధన ధరలను నిర్ణయించడంలో ఎక్సైజ్ సుంకం (Excise Duty), స్థానిక పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన పన్ను విధానాన్ని అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తోంది. -
సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిన్నటి నుంచి వాహనదారులు బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళన, చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను తగ్గించాయన్న వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, ఈ పరిణామాలపై తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టతనిచ్చింది.ఓఎంసీలు - డీలర్లు.. క్రెడిట్ విధానం అంటే ఏమిటి?ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి ప్రధాన కారణం చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ (అప్పు) సౌకర్యంపై జరుగుతున్న చర్చ. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినప్పుడు దానికి సంబంధించిన సొమ్ము చెల్లించడానికి కొంత సమయం (క్రెడిట్ పీరియడ్) ఇస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత వల్ల ఓఎంసీలు తమ రిస్క్ను తగ్గించుకోవడానికి డీలర్ల క్రెడిట్ పరిమితులను తగ్గించడం లేదా ‘క్యాష్ అండ్ క్యారీ’ (నగదు చెల్లించి స్టాక్ తీసుకోవడం) విధానాన్ని అమలు చేస్తున్నాయి. చేతిలో నగదు లభ్యత తక్కువగా ఉన్న చిన్న డీలర్లు క్రెడిట్ దొరకకపోవడంతో స్టాక్ను తక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి తప్ప కంపెనీల వద్ద స్టాక్ లేక కాదని నిపుణులు చెబుతున్నారు.యుద్ధ ప్రభావం ఎంతవరకు?పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. అయితే, భారత ప్రభుత్వం వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు ఉండటం వల్ల తక్షణమే ఇంధన సరఫరా నిలిచిపోయే అవకాశం లేదు. డీలర్లకు, కంపెనీలకు మధ్య ఉన్న అంతర్గత చెల్లింపుల వ్యవహారాలను వాహనదారులు కొరతగా భావించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి సమయాన్ని వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరఫరా సజావుగానే సాగుతోందని అధికారులు నిర్ధారించారు.కొరత లేదు.. ఆందోళన వద్దుతెలంగాణలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్) డిపోల వద్ద రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల సరఫరా ఆగిపోతుందనేది కేవలం ఊహాగానమేనని, ప్రస్తుతానికి దిగుమతులకు ఎలాంటి ఆటంకం లేదని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, ఆందోళనతో కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కంపెనీల స్పందన..వదంతులను నమ్మొద్దు: బీపీసీఎల్భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. భారత్లో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. మా రిఫైనరీలు, సరఫరా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి’ అని సంస్థ పేర్కొంది.చమురు కంపెనీల ఉమ్మడి ప్రకటనబీపీసీఎల్, హెచ్పీసీఎల్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ (ఎల్పీజీ) సరఫరా కూడా సుస్థిరంగా ఉందని వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత డిమాండ్ను తట్టుకోవడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. లాజిస్టిక్స్, రవాణా నెట్వర్క్ ఎక్కడా ఆగకుండా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఇరాన్ నుంచి రిలయన్స్ చమురు కొనుగోలుమరోవైపు, అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్! -
మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. దీని స్థానంలో ఆధునికమైన, పారదర్శకమైన ‘ఆదాయపు పన్ను చట్టం 2025’, ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ మార్పులు అమలు కానున్న నేపథ్యంలో వేతన జీవులు తమ పన్ను ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.కొత్త చట్టం వస్తోంది కదా అని ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పాత, కొత్త చట్టాల మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసింది.2025-26 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు మీరు సంపాదించిన ఆదాయంపై పాత చట్టం (1961) ప్రకారమే పన్ను విధిస్తారు. దీనికి సంబంధించిన రిటర్నులను 2026 జూలైలో సమర్పించాల్సి ఉంటుంది.2026-27 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2026 తర్వాత సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వర్తిస్తుంది.ఆటోమేటెడ్ రిటర్న్స్: తప్పులకు తావులేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ కానుంది.ఇకపై మీ జీతం, బ్యాంక్ వడ్డీలు, షేర్ల లావాదేవీల వివరాలను మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. కంపెనీలు, బ్యాంకుల నుంచి డేటా నేరుగా సిస్టమ్లోకి వస్తుంది.సిస్టమ్ ఆటోమేటిక్గా వివరాలను సేకరించినప్పటికీ ఆ సమాచారం సరైనదేనని ధ్రువీకరించే బాధ్యత పన్ను చెల్లింపుదారుడిదే.ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం-16, ఫారం-26AS స్థానంలో మరింత పారదర్శకమైన కొత్త డాక్యుమెంట్ ఫార్మాట్లు రానున్నాయి.హెచ్ఆర్ఏ, అలవెన్సులపై నిఘాపన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే విషయంలో కొత్త నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) విషయంలో యజమాని వివరాలు, పాన్ కార్డు, సంబంధిత పత్రాలను సమర్పించడం తప్పనిసరి కానుంది.సీటీసీలో మార్పులుకొత్త చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక వేతనం(బేసిక్ పే) అతని మొత్తం సీటీసీలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఫలితంగా చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ దీర్ఘకాలిక పొదుపు, పదవీ విరమణ ప్రయోజనాలు మెరుగుపడతాయి.కొత్త వ్యవస్థ పన్ను ఎగవేతను అరికట్టడమే కాకుండా నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే, ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్ వల్ల చిన్న తప్పు జరిగినా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, 2026 ఏప్రిల్ నుంచి ప్రతి పైసా ఖర్చుకు, ప్రతి మినహాయింపునకు సరైన రికార్డులు కలిగి ఉండటం ముఖ్యం.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
త్వరలో బీటీ పత్తి విత్తనాల గరిష్ట ధరల ప్రకటన!
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ట విక్రయ ధరను (ఎంఆర్పీ) కేంద్ర వ్యవసాయ శాఖ త్వరలోనే ఖరారు చేయనుంది. 2026-27 సీజన్కు సంబంధించి బోల్గార్డ్-1 (బీజీ-1), బోల్గార్డ్-2 (బీజీ-2) రకాల ధరలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. అయితే, ప్రభుత్వం పత్తి విత్తనాలపై ప్రకటించేది గరిష్ట ధర మాత్రమే. కంపెనీలు లేదా డీలర్లు అంతకంటే తక్కువ ధరకే విక్రయించవచ్చు కానీ, ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.ధరల్లో మార్పు ఉంటుందా?గత కొన్నేళ్ల ధోరణిని పరిశీలిస్తే ఈ ఏడాది విత్తన ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, తుది నిర్ణయం ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది (2025-26) బీజీ-2 450 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.900గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు 2024-25లో ఇది రూ.864గా ఉండేది. 2016లో ధరల నియంత్రణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీజీ 1 ధర రూ.635 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.2019-20లో కూడా ప్రభుత్వం ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచిన దాఖలాలు ఉన్నాయి. గత ఏడాది సుమారు 4 శాతం మేర ధరలు పెరిగినందున ఈసారి పెంచకపోయినా విత్తన పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.ధరల నియంత్రణపై భిన్నాభిప్రాయాలుకాటన్ సీడ్స్ ప్రైస్ ఆర్డర్-2015 ప్రకారం, ధర పెంచినా పెంచకపోయినా ఏటా ప్రభుత్వం ఎంఆర్పీని నోటిఫై చేయడం చట్టపరమైన బాధ్యత. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2016కు ముందు విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విత్తనాలను విక్రయించి రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ప్రభుత్వం గరిష్ట ధరను (క్యాప్) నిర్ణయిస్తోంది. ఇది రైతులకు రక్షణ కవచం లాంటిదని అధికారులు పేర్కొంటున్నారు.బీటీ పత్తి విత్తనాల ధరల నిర్ణయాన్ని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) వ్యతిరేకిస్తోంది. బీటీ విత్తనాలకు ధర నిర్ణయించడం వల్ల నాన్-జీఎం (సాధారణ) పత్తి విత్తనాలు కేవలం రూ.300-400కే లభిస్తున్నాయని, అలాగే గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి బీటీ విత్తనాలకు తగ్గిపోతోందని వారు వాదిస్తున్నారు.సాగులో బీటీ పత్తిదే హవా..కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ గత నెల లోక్సభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశంలోని మొత్తం పత్తి సాగు విస్తీర్ణంలో 95 శాతం బీటీ పత్తిదే. అయితే, బీటీ పత్తిలోని ప్రొటీన్ను తట్టుకునే సామర్థ్యాన్ని గులాబీ రంగు పురుగు పెంచుకోవడం ఇప్పుడు శాస్త్రవేత్తలను, రైతులకు ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి పండించే అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పురుగు ఉధృతి పెరగడం సాగు ఖర్చును పెంచుతోంది.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
వంటగ్యాస్ కష్టాలకు చెక్.. పెరిగిన ఉత్పత్తి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పెరిగిన స్వదేశీ ఉత్పత్తిఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాకముందు వరకు భారతదేశ అవసరాల్లో స్వదేశీ ఎల్పీజీ ఉత్పత్తి వాటా 40% మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో దీన్ని 50-60%కి పెంచినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.గత కొద్ది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు అవసరం ఉన్నా, లేకపోయినా బుకింగ్స్ చేశారు. అయితే, ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ నిలకడగా ఉందని, ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బుకింగ్స్ కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘మేము నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాం. దేశవ్యాప్తంగా సిలిండర్ల డెలివరీ సాధారణంగానే సాగుతోంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సుజాత శర్మ చెప్పారు.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్
సరిగ్గా పాతికేళ్ల క్రితం, అంటే 2000వ సంవత్సరంలో కాందహార్ విమాన హైజాక్ ఉదంతం తర్వాత.. వాషింగ్టన్-న్యూఢిల్లీ-టెల్ అవీవ్ (అమెరికా-భారత్-ఇజ్రాయెల్) మధ్య సెక్యూరిటీ ట్రైయాంగిల్ ఏర్పడాలని అంతర్జాతీయ నిపుణులు సూచించారు. పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లెబనాన్ మీదుగా గాజా వరకు విస్తరించి ఉన్న ఉగ్రవాద కారిడార్ను అడ్డుకోవడానికి భారత్, ఇజ్రాయెల్ రెండు వైపులా రక్షణ కవచాలుగా నిలుస్తాయన్నది ఆనాటి ఆలోచన. కానీ, 2026 నాటికి అంతర్జాతీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. అప్పటి సెక్యూరిటీ ట్రైయాంగిల్కు సపోర్ట్గా ఉన్న అమెరికా ఇప్పుడు తన పట్టు కోల్పోతుంటే భారత్ అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన శక్తిగా ఆవిర్భవించింది.అమెరికా వ్యూహాత్మక వైఫల్యం - ఇరాన్ సంక్షోభంప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఒక అస్థిరమైన సూపర్ పవర్గా కనిపిస్తోంది. సరైన నిష్క్రమణ వ్యూహం లేకుండా ఇరాన్పై యుద్ధం ప్రకటించడం, ప్రపంచ ఇంధన సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగలదని అంచనా వేయకపోవడం వాషింగ్టన్ చేసిన అతిపెద్ద పొరపాట్లు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటిపోయింది. అటు రష్యాపై ఆంక్షల విషయంలోనూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడు మిత్రదేశాలకే మింగుడుపడటం లేదు.భారత్-ఇజ్రాయెల్ బంధంభారత్, ఇజ్రాయెల్ సంబంధాలు నిన్న మొన్నటివి కావు. 1962 చైనా యుద్ధం సమయంలోనే ఇజ్రాయెల్ రహస్యంగా భారత్కు సైనిక సాయం అందించింది. ఇందిరా గాంధీ హయాంలో 1968 నుంచే ‘రా’, ‘మొసాద్’(ఇజ్రాయెల్) మధ్య నిఘా సంబంధాలు ఉన్నాయి. నేడు ఇజ్రాయెల్ సాంకేతికత భారత రక్షణ వ్యవస్థలో అంతర్భాగమైపోయింది. నెతన్యాహు అన్నట్లు ఇది స్వర్గంలో కుదిరిన బంధం అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది.వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిభారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఇప్పుడు ప్రపంచానికే ఒక పాఠం. ఇరాన్ తన జలాల్లో పాశ్చాత్య దేశాల నౌకలను అడ్డుకుంటున్నా భారత నౌకలకు మాత్రం ‘ప్రివిలేజ్డ్ న్యూట్రల్’(విశిష్ట తటస్థ దేశం) హోదా ఇచ్చి అనుమతిస్తోంది. దీని వెనుక దశాబ్దాల నాటి దౌత్య నీతి ఉంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇరాన్లోని చాబహార్ ఓడరేవును కాపాడుకుంటూ వచ్చింది. ముంబై నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వరకు ఇరాన్ మీదుగా సాగే అంతర్జాతీయ రవాణా కారిడార్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.మెరుగైన సంబంధాలుప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ, ఎస్.జైశంకర్ నాయకత్వంలో భారత్ ‘యాక్టివ్ మల్టీ-వెక్టర్ ఎంగేజ్మెంట్’ను అనుసరిస్తోంది. అంటే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాలతో ఏకకాలంలో మెరుగైన సంబంధాలను కొనసాగించగల ఏకైక దేశంగా భారత్ నిలిచింది. నేటి భౌగోళిక రాజకీయాల్లో అమెరికా కేవలం పెట్టుబడి, సాంకేతికతకు మాత్రమే పరిమితమవుతోంది. ఇజ్రాయెల్కు లేని ఇరాన్ ఛానల్, రష్యా ఛానల్ భారత్ వద్ద ఉన్నాయి. 50 ఏళ్లుగా నిశ్శబ్దంగా సిద్ధమైన భారత్ ఇప్పుడు ప్రపంచ యుద్ధ మేఘాల మధ్య ఒక శాంతి వారధిగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
ప్రకటనల హోరు.. స్పాన్సర్షిప్ జోరు
భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి దేశీయ క్రీడా ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థ డబ్ల్యూపీపీ మీడియా విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ నివేదిక ప్రకారం, భారత క్రీడా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.18,864 కోట్లకు (2.13 బిలియన్ డాలర్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగేళ్ల కాలంలోనే (2021లో రూ.9,530 కోట్లు) ఈ రంగం రెట్టింపు వృద్ధిని సాధించడం గమనార్హం.నివేదికలోని ముఖ్యాంశాలుక్రీడా రంగం మొత్తం ఆదాయంలో 51 శాతం వాటా ప్రకటనలదే. గత ఏడాదితో పోలిస్తే ఇవి 19.8 శాతం పెరిగి రూ.9,571 కోట్లకు చేరాయి.టీమ్, లీగ్ స్పాన్సర్షిప్ల ద్వారా రూ.7,943 కోట్లు (42% వాటా) సమకూరాయి.క్రీడాకారుల బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాల విలువ 10.3 శాతం పెరిగి రూ.1,350 కోట్లకు చేరింది.‘భారత క్రీడా రంగం సుస్థిరత, విస్తరణ దశకు చేరుకుంది. 2021 నుంచి చూస్తే 19 శాతం చక్రవడ్డీ రేటుతో (సీఏజీఆర్) ఈ వృద్ధి కొనసాగుతోంది’ అని డబ్ల్యూపీపీ మీడియా ఎండీ (కంటెంట్, స్పోర్ట్స్) వినీత్ కర్ణిక్ తెలిపారు.ఎదురులేని రారాజు క్రికెట్భారత మార్కెట్లో క్రికెట్ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం క్రీడా ఆదాయంలో 89 శాతం వాటా (రూ.16,704.2 కోట్లు) ఒక్క క్రికెట్ ద్వారానే లభిస్తోంది. లీనియర్ టీవీ (సాధారణ ఛానెళ్లు) కంటే డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనల వ్యయం వేగంగా పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం స్పాన్సర్షిప్ ఆదాయం మొదటిసారిగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రియల్ మనీ గేమింగ్ యాప్లపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ లోటును సంప్రదాయ బ్రాండ్లు భర్తీ చేశాయని నివేదిక పేర్కొంది.ఇతర క్రీడల పరిస్థితి ఏమిటి?క్రికెట్ దూసుకుపోతున్నా ఇతర క్రీడల ఆదాయం 2025లో 12.2 శాతం క్షీణించి రూ.2,159.9 కోట్లకు పరిమితమైంది. ఇండియన్ సూపర్ లీగ్ వాయిదా పడటం, ఇతర భారీ అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్, మెస్సీ ఇండియా టూర్ వంటి ఈవెంట్లతో పాటు పికిల్ బాల్ వంటి కొత్త క్రీడలకు ఆదరణ పెరుగుతుండటం సానుకూలాంశం.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
ఉగ్రదేశంలో ఇంధన సెగ
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ బ్లెండెడ్ ఫ్యూయల్ (హెచ్ఓబీసీ) ధరను ఏకంగా లీటరుకు రూ.200 పెంచుతూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆర్థిక క్రమబద్ధీకరణప్రధాని షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు 9 బిలియన్ పాకిస్థానీ రూపాయల (పీకేఆర్) ఆదాయం మిగులుతుందని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలకు మళ్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.సాధారణ పెట్రోల్తో పోలిస్తే హెచ్ఓబీసీ ఫ్యుయెల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 87 నుంచి 92 మధ్య ఉంటే, హై-ఆక్టేన్ ఇంధనం 95 నుంచి 100 వరకు ఉంటుంది. కేవలం లగ్జరీ కార్లు, ఖరీదైన వాహనాలు వాడే ఉన్నత ఆదాయ వర్గాలపైనే ఈ పెరిగిన ధరల భారం పడుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలు ఉపయోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం అదనపు భారం వేయలేదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ లేదా విమాన ప్రయాణ ఖర్చులపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాక్ ప్రభుత్వం ఇప్పటికే మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. మారిన ధరల ప్రకారం..ఇంధనం రకంపాత ధర (లీటరుకు)ప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 266.17రూ. 321.17డీజిల్రూ. 280.86రూ. 335.86 విమాన ప్రయాణికులకు షాక్ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడదని చెబుతున్నప్పటికీ జెట్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై అప్పుడే మొదలైంది. పాకిస్థాన్లోని ఏఆర్వై మీడియా కథనం ప్రకారం, మార్చి 10 నుంచి పాకిస్థాన్ ఎయిర్లైన్స్ ఛార్జీలను భారీగా పెంచాయి. దేశీయ ప్రయాణం(కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ రూట్లు)పై టికెట్ ధరలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి. విదేశీ ప్రయాణాలపై రూ.10,000 నుంచి రూ.28,000 వరకు అదనపు భారం పడింది.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
పార్లమెంట్లో నేడు ‘సీఏపీఎఫ్ బిల్లు-2026’
దేశ అంతర్గత భద్రతలో కీలకమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) నిర్వహణలో కీలక మార్పులు లక్ష్యంగా రూపొందించిన ‘కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026’ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్, క్యాడర్ సంస్కరణలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది.ఏకీకృత చట్టం.. లక్ష్యం ఇదే!ప్రస్తుతం సీఆర్పీఎప్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి దళాలు వేర్వేరు చట్టాల ద్వారా నడుస్తున్నాయి. దీనివల్ల నియామకాలు, పదోన్నతులు, సేవా నిబంధనల్లో వ్యత్యాసాలు ఉండి పరిపాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తొలగించి సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉన్న ఈ దళాలన్నింటికీ ఒకే విధమైన చట్టపరమైన చట్రాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.బిల్లులోని కీలక అంశాలుఅధికారుల నియామకం, పదోన్నతి, డిప్యుటేషన్లపై నిబంధనలు రూపొందించే పూర్తి అధికారం కేంద్రానికి ఉంటుంది. అవసరమైతే ఇతర చట్టాలను ఇది నియంత్రించవచ్చు.అత్యున్నత స్థాయి పదవుల్లో ఐపీఎస్ అధికారుల ప్రాబల్యాన్ని ఈ బిల్లు చట్టబద్ధం చేస్తోంది.ఐజీ స్థాయిలో.. 50 శాతం పోస్టులు ఐపీఎస్ డిప్యుటేషన్ ద్వారా భర్తీ.ఏడీజీ స్థాయిలో.. కనీసం 67 శాతం పోస్టులు ఐపీఎస్ అధికారులకే.స్పెషల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ పదవులన్నీ పూర్తిగా డిప్యుటేషన్ ద్వారానే భర్తీ అవుతాయి.కోర్టు తీర్పుకు విరుద్ధమా?మే 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ బిల్లు వివాదాస్పదంగా మారింది. సీఏపీఎఫ్ అధికారులను ‘ఆర్గనైజ్డ్ గ్రూప్-A సర్వీస్’గా గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం, ఉన్నత స్థాయిల్లో ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ను క్రమంగా తగ్గించాలని, క్యాడర్ రివ్యూ చేపట్టాలని ఆదేశించింది. అక్టోబర్ 2025లో కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు కోర్టు ఆదేశాలను నీరుగార్చేలా ఉందని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిరసనలుబిల్లులోని నిబంధనలపై మాజీ సీఏపీఎఫ్ అధికారులు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఐపీఎస్ అధికారుల లేటరల్ ప్రవేశం వల్ల సొంత క్యాడర్ అధికారుల పదోన్నతులు నిలిచిపోతున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పని చేసే జవాన్లకు స్పష్టమైన కెరీర్ వృద్ధి ఉండాలి. నాయకత్వ బాధ్యతల్లో అంతర్గత అధికారులకు ప్రాధాన్యత ఇస్తేనే క్షేత్రస్థాయి నిర్ణయాలు సమర్థవంతంగా ఉంటాయి’ అని హెచ్.ఆర్. సింగ్, ఎస్.కె. సూద్ (రిటైర్డ్ అధికారులు) చెబుతున్నారు.కేంద్రం వాదనరాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే కేంద్ర దళాల స్వభావాన్ని కాపాడాలంటే ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్లు అత్యవసరమని కేంద్రం వాదిస్తోంది. ఈ కొత్త చట్టం వల్ల నిబంధనల్లో స్పష్టత వస్తుందని, అనవసరమైన లిటిగేషన్లు తగ్గి పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నేడు రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. కోర్టు తీర్పులను అధిగమిస్తూ కేంద్రం తీసుకువస్తున్న ఈ నిబంధనలపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
యుద్ధ సంక్షోభం.. రంగంలోకి మంత్రుల బృందం..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యులపై దాని ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంక్షోభం వల్ల ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడానికి మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఈ సమావేశానికి హోం, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులతో సహా మొత్తం 13 మంది మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏకతాటిపై పని చేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు.ఆహార, ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టిపశ్చిమాసియా పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సామాన్యుడి అవసరాలకు విఘాతం కలగకుండా కొన్ని అంశాలపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు.ముడి చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటంపై చర్చించారు. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న బఫర్ స్టాక్ వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేదని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.దిగుమతుల వైవిధ్యం - ఎగుమతుల విస్తరణరసాయనాలు, ఫార్మాసూటికల్స్, పెట్రోకెమికల్స్ వంటి కీలక పారిశ్రామిక రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కోసం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను వైవిధ్యీకరించాలని సమావేశం నిర్ణయించింది. అలాగే, భారతీయ వస్తువుల కోసం కొత్త ఎగుమతి గమ్యస్థానాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు.రాష్ట్రాలతో సమన్వయం..ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని మోదీ ఆదేశించారు. ‘నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్ను (మిడిల్ ఇన్కమ్ ట్రాప్) దాటేయగలదు.భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.వికసిత భారత్ - మోదీ కలభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా.. -
మైక్రోఫైనాన్స్ సంస్థలకు కేంద్రం ఆసరా
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మైక్రోఫైనాన్స్ రంగానికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ’క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్–2.0’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంఎఫ్ఐలకు సుమారు రూ. 20 వేల కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణాల లభ్యత పెరగనుంది. ఫలితంగా అట్టడుగు వర్గాలకు చెందిన సుమారు 36 లక్షల మంది చిన్న తరహా రుణ గ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎంఎఫ్ఐలకు ఇచ్చే రుణాలకు కేంద్రం గ్యారెంటీ కలి్పస్తుంది. సంస్థల పరిమాణాన్ని బట్టి (చిన్న, మధ్య, పెద్ద) ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు 70 శాతం నుంచి 80 శాతం వరకు గ్యారెంటీ కవరేజీ లభిస్తుంది. → సామాన్యులకు వడ్డీ భారం తగ్గించేలా కేంద్రం ఇందులో కీలక నిబంధన చేర్చింది. ఎంఎఫ్ఐలు చిన్న తరహా రుణ గ్రహీతలకు ఇచ్చే వడ్డీ రేటును.. గత ఆరు నెలల సగటు వడ్డీ రేటు కంటే కనీసం 1 శాతం తక్కువకు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి వచ్చే చిన్న రుణ గ్రహీతలందరూ దీనికి అర్హులే. మైక్రోఫైనాన్స్ రంగం నిధుల లేమితో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే ఈ స్కీమ్ను తీసుకొచ్చారు. 2026 జూన్ 30 వరకు లేదా రూ.20 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ పూర్తయ్యే వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యారంటీ స్కీమును మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఎంఎఫ్ఐఎన్ స్వాగతించింది. సవాళ్లెదుర్కొంటున్న తమ రంగానికి తోడ్పాటునిచ్చేలా సకాలంలో తీసుకున్న సరైన చర్యగా అభివరి్ణంచింది. → మరోవైపు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎగుమతిదారులకు మరింత మద్దతునిచ్చేలా మ్యుచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (ఎంసీజీఎస్–ఎంఎస్ఎంఈ)లో సవరణలు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సరీ్వసుల రంగాన్ని కూడా ఇందులో చేర్చినట్లు పేర్కొంది. -
మొండి బకాయిదారుల తీరుపై ఆగ్రహం
దివాలా, రుణ పరిష్కార చట్టం (ఐబీసీ)లోని లొసుగులను అడ్డు పెట్టుకునే మొండి బకాయిదారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని రక్షణ కవచంగా వాడుకుంటూ అప్పులు ఎగ్గొట్టే ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. జస్టిస్ మనీష్ పితాలే, జస్టిస్ శ్రీరామ్ శిర్సత్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఏమిటీ ఆందోళనకర ధోరణి?రుణ ఎగవేతదారులు అనుసరిస్తున్న వ్యూహాలను కోర్టు ‘డిస్టర్బింగ్ ట్రెండ్’(ఆందోళనకర ధోరణి)గా అభివర్ణించింది. సాధారణంగా బ్యాంకులు తాకట్టు పెట్టిన ఆస్తులను రికవరీ చేయడానికి ‘సర్ఫేసీ’ (SARFAESI) చట్టం కింద వేలం ప్రక్రియ చేపడతాయి. అయితే, ఈ ప్రక్రియ ముగిసి వేలంలో ఆస్తులు కొనుగోలు చేసిన వారు రంగంలోకి వచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండే డిఫాల్టర్లు చివరి నిమిషంలో ఎన్సీఎల్టీని(వివాద పరిష్కారాల ట్రిబ్యునల్) ఆశ్రయిస్తున్నారు.‘ఐబీసీ కింద తప్పుడు మార్గాల్లో మొరటోరియం(చట్టబద్ధంగా కొంతకాలం పాటు వేలం వాయిదా వేయడం) పొందడం ద్వారా వారు అప్పటివరకు జరిగిన చట్టబద్ధమైన వేలం ప్రక్రియను స్తంభింపజేస్తున్నారు. ఇది కేవలం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా దేశ వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది’ అని బాంబే హైకోర్టు తెలిపింది. ‘కొన్ని సంస్థల తీరువల్ల ఐబీసీ లక్ష్యం దెబ్బతింటోంది. ఐబీసీ అసలు ఉద్దేశం రుణ పరిష్కారం, కానీ ఇక్కడ అది రికవరీని అడ్డుకోవడానికి వాడుతున్నారు. ఇటువంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. నిజాయితీ గల రుణదాతల హక్కులను కాపాడటంలో కఠినంగా వ్యవహరించాలి’ అని చెప్పింది.కేసు నేపథ్యం ఇదే..రోజినా ఫిరోజ్ హజియాని, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సంస్థ రూ.6.25 కోట్ల రుణ సౌకర్యాన్ని పొందింది. అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు ముంబైలోని తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసింది. వేలం ప్రక్రియ పూర్తయి పిటిషనర్లు ఆ ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత.. సదరు రుణగ్రహీతలు ఒక్కసారిగా ఐబీసీని తెరపైకి తెచ్చి ఎన్సీఎల్టీ ద్వారా స్టే పొందారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) సేల్ రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది. దీన్ని సవాలు చేస్తూ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు.దేశంలో మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బలమైన ఆయుధం ఐబీసీ. అయితే, కొందరు విల్ఫుడ్ డిఫాల్టర్లు(ఉద్దేశపూర్వక ఎగవేతదారులు) దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని బ్యాంకుల చేతులు కట్టేస్తున్నారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టంలోని లొసుగులను వాడుకుని కాలయాపన చేసే వారికి గట్టి హెచ్చరిక. ఇది భవిష్యత్తులో వేలం కొనుగోలుదారులకు భరోసానివ్వడమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణను పెంచుతుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం
సాధారణంగా జీడి తోటలంటే కేవలం జీడిపిక్కల కోసమేననే భావన రైతుల్లో బలంగా ఉంది. కానీ, ఆ పిక్కకు అనుబంధంగా ఉండే ‘జీడిపండు’ రైతు ఆర్థిక స్థితిగతులను మార్చేయగల అద్భుత శక్తి అని వ్యవసాయ రంగ నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా లక్షలాది టన్నుల జీడిపండు వృథాగా నేలపాలవుతోందని, దీన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుత్తూరులోని ఐకార్-జీడి పరిశోధన డైరెక్టరేట్ (డీసీఆర్) నిర్వహించిన పరిశ్రమల ముఖాముఖి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.గణాంకాలు ఇలా..డీసీఆర్ డైరెక్టర్ జె.దినకర అడిగా సమర్పించిన వివరాల ప్రకారం, దేశంలో జీడిపండు వినియోగం అత్యల్పంగా ఉంది. భారతదేశంలో ఏటా సుమారు 60 లక్షల టన్నుల జీడిపండు ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం 1 శాతం మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి వాడుతున్నారు. ఒక హెక్టారు జీడి తోటలో సగటున 1 టన్ను జీడిపిక్కలు లభిస్తే ఏకంగా 8 టన్నుల జీడిపండు లభిస్తుంది. అంటే మనం ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న పిక్కల కంటే 8 రెట్లు ఎక్కువగా పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన, సాంకేతికత లేక వాటిని వృథా చేస్తున్నాం. జీడిపండు నుంచి రసం తీసిన తర్వాత మిగిలే పిప్పితోనూ ఆదాయం పొందే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ సహకారంతో జీడిపండు పిప్పి పొడితో చేపల మేతను తయారు చేసే సాంకేతికతను డీసీఆర్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛమైన జీడిపండు రసం, పాశ్చరైజ్డ్ జ్యూస్, లిక్విడ్ స్వీటెనర్, జీడిపండు పిప్పి టీ వంటి వినూత్న ఉత్పత్తుల సాంకేతికతను డైరెక్టరేట్ సిద్ధం చేసింది.బ్రెజిల్ ఆదర్శంబ్రెజిల్ వంటి దేశాల్లో జీడిపండును అత్యధికంగా వినియోగించుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. భారతదేశంలో చిన్న స్థాయిలోనైనా ఈ ప్రయత్నం మొదలుపెడితే భవిష్యత్తులో ఇది పెద్ద పరిశ్రమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభుత్వ సంస్థలు తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను బదిలీ చేసేటప్పుడు వసూలు చేసే రాయల్టీలు స్టార్టప్లను నిరుత్సాహపరిచేలా ఉండకూడదు. నామమాత్రపు ధరలకే సాంకేతికతను అందిస్తే యువత ఈ రంగంలోకి వస్తారు’ అని చెబుతున్నారు.కేవలం జీడిపిక్కల అమ్మకానికే పరిమితం కాకుండా జీడిపండును కూడా ఒక వాణిజ్య పంటగా గుర్తిస్తే రైతులకు ఇది బోనస్ ఆదాయం అవుతుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపిరి పోయడం ఖాయం.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సాగుకు ముందస్తు భరోసా
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. రానున్న ఖరీఫ్-2026 సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తూ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.యూరియా ఉత్పత్తికి ప్రాధాన్యతదేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొరత కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్న ప్లాంట్లకు ఊరటనిస్తూ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.ఎల్పీజీ(వంటగ్యాస్) అవసరాల తర్వాత గ్యాస్ సరఫరాలో ఎరువుల ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత కల్పించారు. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ్ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే(ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్లాంట్లకు అందుతున్న గ్యాస్ సరఫరా 32 ఎంఎంఎస్సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్సీఎండీకి (23 శాతం) పెరుగుతుంది. అమోనియాను విడిగా విక్రయించవద్దని దాన్ని పూర్తిగా యూరియా తయారీకే ఉపయోగించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.ప్రస్తుతం ప్లాంట్లకు అవసరమైన గ్యాస్లో 62 శాతం మాత్రమే అందుతుండగా కొత్త ఒప్పందంతో అది 76 శాతానికి చేరనుంది. దీనివల్ల దేశీయ యూరియా ఉత్పత్తి రోజుకు 54,500 టన్నుల నుంచి 67,000 టన్నులకు పెరుగుతుందని అంచనా.ఖరీఫ్ 2026.. అందుబాటులో భారీ నిల్వలుజూన్ 1న నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటికే సరిపడా నిల్వలను సిద్ధం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గా ఉన్నాయన్నారు.మార్చి 19 నాటికి ఎరువుల నిల్వల వివరాలు (లక్షల టన్నుల్లో)ఎరువు రకంప్రస్తుత నిల్వలు (2026)గతేడాది నిల్వలు (2025)యూరియా61.1455.22డీఏపీ24.2411.85కాంప్లెక్స్57.2134.44ఎస్ఎస్పీ24.823.15ఎంఓపీ12.6514.13 వ్యూహాత్మక అడుగులుయుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ రష్యా, బెలారస్, మొరాకో, కెనడా వంటి దేశాలు ఎరువుల సరఫరాకు ముందుకొచ్చాయి. అయితే, ప్రభుత్వం ప్రస్తుతం దేశీయంగా యూరియా ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించింది. రాబోయే 1-2 వారాల్లో అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడితే అవసరానికి అనుగుణంగా దిగుమతులపై తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ఇంధన భద్రతలో భారత్ ముందున్న సవాలు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసులో అంతరాయాలు భారత్ వంటి భారీ వినియోగ క్రూడ్ దేశాలకు హెచ్చరిక లాంటిది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలవాల్సిన వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు భారత్లో ఏ స్థాయిలో ఉన్నాయి? మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.వ్యూహాత్మక నిల్వలు ఎందుకు కీలకం?ఇంధన నిల్వలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వం నిర్వహించే వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు నిర్వహించే వాణిజ్య నిల్వలు. వీటి ప్రాముఖ్యత ఆర్థిక పరంగానే కాకుండా దేశ రక్షణకు కూడా సంబంధించింది కావడం గమనార్హం.భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరంతర ఇంధన సరఫరాకు ఇవి అండగా నిలుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఈ నిల్వలు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. ఇంధనాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే దేశాల ముందు భారత్ తలవంచకుండా ఉండేందుకు ఈ బఫర్ స్టాక్ రక్షణ కవచంగా పనిచేస్తుంది.ఆందోళనకరంగా ఎల్పీజీ నిల్వలుభారత్ వంటగ్యాస్ పంపిణీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ, నిల్వ సామర్థ్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉంది. విశాఖపట్నం కేవర్న్(హెచ్పీసీఎల్, టోటల్ఎనర్జీస్ జేవీ) సామర్థ్యం 60,000 టన్నులు, మంగళూరు కేవర్న్(హెచ్పీసీఎల్) 80,000 టన్నులతో మొత్తం సామర్థ్యం 1,40,000 టన్నులుగా ఉంది.దేశవ్యాప్తంగా రోజువారీ ఎల్పీజీ డిమాండ్ సుమారు 90,000 టన్నులు అని అంచనా. అంటే మన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వలు కనీసం రెండు రోజులకు కూడా సరిపోవు. ప్రస్తుతం మన మౌలిక సదుపాయాలన్నీ గ్యాస్ను పోర్టుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరవేసే ‘ఆపరేషనల్ ఫ్లో’ మోడల్లోనే ఉన్నాయి తప్ప దీర్ఘకాలిక నిల్వ కోసం ఉద్దేశించినవి కావని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎందుకీ పరిస్థితి?ముడి చమురు నిల్వల విషయంలో భారత్ ఇప్పటికే భారీ వ్యూహాత్మక నిల్వలను నిర్మించుకుంది. కానీ గ్యాస్ విషయంలో మాత్రం ఆ పురోగతి కనిపించలేదు. దీనికి కొన్ని కారణాలున్నాయి.గతంలో గ్యాస్ సరఫరా సులభంగా, తక్కువ ధరకే లభించడంతో నిల్వల కంటే సరఫరా వ్యవస్థపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.గ్యాస్ను భూగర్భంలో నిల్వ చేయడానికి తగిన సహజ కేవర్లు గుర్తించడం సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రక్రియ.గ్యాస్ స్టోరేజ్ టెర్మినల్స్ నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది.కొత్త వ్యూహం: ప్రభుత్వం ఏం చేస్తోంది?పశ్చిమాసియా సంక్షోభం తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ భద్రతపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వ్యూహాత్మక గ్యాస్ నిల్వల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు పెట్రోలియం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎల్ఎన్జీ/ఎల్పీజీ టెర్మినల్స్లో అదనంగా 10 శాతం నిల్వ సామర్థ్యాన్ని తప్పనిసరి చేసే నిబంధనను సమీక్షిస్తున్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఆరు కొత్త ప్రాంతాల్లో నిల్వ కేంద్రాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో ఉన్న ‘సాల్ట్ కేవర్లు’ గ్యాస్ నిల్వకు అత్యంత అనువైనవిగా భావిస్తున్నారు.అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోవాలంటే భారత్ కేవలం సరఫరాపైనే కాకుండా నిల్వపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. విధానపరమైన వేగం, సాంకేతిక తోడ్పాటు తోడైతేనే ఇంధన భద్రతలో భారత్ స్వయంసమృద్ధి సాధించగలదు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
రూపీ.. ‘లో’బీపీ
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్ రేట్లు పెరిగిపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ మరింతగా పడిపోతోంది. డాలర్తో పోలిస్తే శుక్రవారం 64 పైసలు క్షీణించి కొత్త ఆల్టైమ్ కనిష్టం 93.53 వద్ద క్లోజయ్యింది. రిస్కు తీసుకోవడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవడం, ముడిచమురు ధరలు ఎగియడంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొందని ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ అనిశ్చితి రిసు్కల వల్ల ఇంధన రేట్లు పెరుగుతుండటంతో వాణిజ్య లోటు, ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఎగిసే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో పోలిస్తే రూపాయి ట్రేడింగ్ 92.92 వద్ద ప్రారంభమైంది. తర్వాత తొలిసారిగా 93 మార్కు దిగువకు పడిపోయింది. చివరికి 64 పైసల నష్టంతో ముగిసింది. రాబోయే రోజుల్లో రూపాయి మారకం 93.75–92.90 శ్రేణిలో తిరుగాడొచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
పన్ను ఎగవేతలకు టెక్నాలజీతో చెక్
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులు విరోధులుకాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. సక్రమ పన్ను చెల్లింపుదారులకు నిబంధనలు భారంకాకుండా ఆదాయపన్ను శాఖ అధికారులు వ్యవహరించవలసి ఉన్నదని సలహా ఇచ్చారు. అయితే టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్దేశపూర్వక పన్ను ఎగవేతలను అడ్డుకోవాలని సూచించారు. 2025 ఆదాయపన్ను శాఖ చట్టంపై జాతీయస్థాయి అవగాహన పెంచేందుకు ఉద్దేశించిన 2026 ప్రారంభ్ సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగించారు. ఏప్రిల్ 1 నుంచి అమలుకానున్న కొత్త చట్టం ద్వారా భారత్ స్నేహపూర్వక పన్ను దేశంగా అవతరించనున్నట్లు పేర్కొన్నారు. -
కొత్త ఐటీ చట్టం రెడీ!
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు నిబంధనలను మరింత సరళతరం చేస్తూ ఇక కొత్త ఆదాయపన్ను (ఐటీ) చట్టం అమల్లోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం–2025 నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) శుక్రవారం నోటిఫై చేసింది. ‘ఆదాయ పన్ను నిబంధనలు–2026గా వ్యవహరించే ఈ కొత్త రూల్స్ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి’ అని గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పాన్ విషయంలో భారీ ఊరటతో పాటు హెచ్ ఆర్ఏ క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని మధ్య సంబంధాన్ని తప్పనిసరిగా వెల్లడించడం వరకు అనేక మార్పులు కొత్త చట్టంలో చోటు చేసుకోనున్నాయి. అనవసర సెక్షన్లు తొలగింపు... పాత ఆదాయపన్ను చట్టం–1961 స్థానంలో తీసుకొస్తున్న కొత్త చట్టానికి 2025 ఆగస్టు 12న పార్లమెంటు ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. కొత్త పన్ను రేట్ల ప్రతిపాదనల వంటివేవీ ఇందులో లేనప్పటికీ ఆరు దశాబ్దాల నాటి సంక్లిష్టమైన పాత చట్టాన్ని మరింత సరళమైన, అందరికీ అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశం. 1961 నాటి ఐటీ చట్టంలో ఉన్న 819 సెక్షన్లను ఇప్పుడు 536కు కుదించడంతో పాటు చాప్టర్ల సంఖ్యను కూడా 47 నుంచి 23కు తగ్గించారు. అలాగే చట్టంలోని మొత్తం పదాలను 5.12 లక్షల నుంచి సగానికి అంటే 2.6 లక్షల పదాలకు తగ్గించడం గమనార్హం. అంతేకాకుండా మరింత మెరుగైన స్పష్టత కోసం 39 కొత్త టేబుల్స్, 40 కొత్త ఫార్ములాలను కూడా కొత్త చట్టంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పాన్ వెసులుబాటు.. బ్యాంకుల్లో నగదు డిపాజిట్/ఉపసంహరణ నుంచి కొత్త వాహనాలు, ప్రాపర్టీ కొనుగోళ్లు, హోటల్ బిల్స్ చెల్లింపు దాకా శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) వెల్లడికి సంబంధించి లావాదేవీల పరిమితి భారీగా పెరుగుతుంది. బ్యాంకుల్లో ఇప్పుడు రూ.50,000కు మించి నగదు డిపాజిట్కు పాన్ కాపీ తప్పనిసరి నిబంధన ఉంది. కొత్త రూల్స్ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్, ఉపసంహరణల లావాదేవీల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే (ఒకటి లేదా మరిన్ని ఖాతాలకు) పాన్ ఇస్తే సరిపోతుంది. ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు/విక్రయం, జాయింట్ డెవలప్మెంట్ లావాదేవీలు రూ.20 లక్షలు దాటితేనే (ప్రస్తుతం రూ.10 లక్షలు) పాన్ సమర్పించాలన్న నిబంధన వర్తిస్తుంది. అలాగే, ఏ వాహన కొనుగోలుకైనా విలువ రూ.5 లక్షలకు మించితేనే పాన్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు, బాంక్వెట్ హాల్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వ్యక్తులకు చేసే చెల్లింపులు రూ. లక్షకు మించితే ఇకపై పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50 వేలు మించితేనే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమల్లో ఉంది.ఇతర ముఖ్యాంశాలివీ..→ ఇంటి అద్దెపై ఐటీ మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వారు ఇకపై కిరాయిదారు–యజమాని సంబంధాన్ని వెల్ల డించాల్సి ఉంటుంది. ఇంటి యజమానితో చేసుకున్న ఒప్పంద రుజువును చూపించాల్సి ఉంటుంది. → ఇకపై ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు.. ఈ ఎనిమిది నగరాలు 50% హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితి జాబితాలోకి రానున్నాయి. మిగతా చోట్ల 40% పరిమితి కొనసాగుతుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నైలో వేతన జీవులకు మాత్రమే 50% నిబంధన వర్తిస్తోంది. → షేర్లు, బాండ్లు, డిబెంచర్లు, డిపాజిట్ సర్టిఫికెట్ల వంటి కన్వర్టెడ్ సెక్యూరిటీలకు సంబంధించి నిర్దిష్ట కేసుల్లో మూలధన లాభాలు స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా అనేది నిర్ణయించడానికి హోల్డింగ్ వ్యవధి లెక్కింపుపై మరింత స్పష్టత. మార్పిడికి ముందు అవి ఎంత కాలం పాటు ఉన్నాయనే దాన్ని కూడా హోల్డింగ్ పీరియడ్లో చేర్చుతారు. → పన్ను రిటర్నుల దాఖలు మరింత సులభతరం కానుంది. సులభతర పత్రాలు, ఆదాయపన్ను శాఖ వద్దకు చేరిన సమాచారం ముందుగానే ఆయా పత్రాల్లో నింపి ఉంటుంది. → యాజమాన్యాలు ఉద్యోగులకు ఇచ్చే ప్రో త్సాహకాల విషయంలోనూ పన్ను మినహాయింపు పరిమితులు పెరగనున్నాయి. → క్రిప్టో ఎక్సే్చంజీలు ఐటీ శాఖతో సమాచారం పంచుకోవడం ఇకపై తప్పనిసరి. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) సైతం ఆమోదనీయమైన ఎల్రక్టానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. -
ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కీలక అప్డేట్ అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి.కొత్త ధరల వివరాలుప్రస్తుతం చలామణిలో ఉన్న వార్షిక పాస్ ధర రూ.3,000 ఉండగా దీన్ని రూ.3,075కు పెంచుతూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. అంటే నేరుగా రూ.75 భారం పడనుంది. నేషనల్ హైవేస్ ఫీ (రేట్ల నిర్ధారణ, వసూలు) నిబంధనలు, 2008 ప్రకారం ఈ వార్షిక ధరల సవరణ జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.వార్షిక పాస్ ప్రయోజనాలు.. నిబంధనలుఈ వార్షిక పాస్ ముఖ్యంగా తరచుగా హైవేలపై ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు (కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్-కమర్షియల్ వాహనాలు) ఎంతో లాభదాయకమని అధికారులు చెబుతున్నారు. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్ల వరకు (ఏది ముందు పూర్తయితే అది) చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ప్రతి ట్రిప్పుకు విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది.రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్ప్రెస్వేలు (ఉదాహరణకు యమునా ఎక్స్ప్రెస్వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే వంటివి) ఈ పాస్ పరిధిలోకి రావు. అక్కడ సాధారణ ఫాస్టాగ్ చార్జీలే వర్తిస్తాయి.పాస్ ఎలా పొందాలి?వాహనదారులు తమ ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్కే ఈ వార్షిక పాస్ను లింక్ చేసుకోవచ్చు. ఎన్హెచ్ఏఐ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. నగదు చెల్లించిన కొద్దిసేపట్లోనే పాస్ యాక్టివేట్ అవుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మందికి పైగా వాహనదారులు ఈ వార్షిక పాస్ సేవలను వినియోగించుకుంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
ముంచుకొస్తున్న నీటి గండం!
దేశవ్యాప్తంగా ఎండలు ముదురుతున్న వేళ భారత్ తీవ్రమైన జల సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) విడుదల చేసిన తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలోని 166 ప్రధాన జలాశయాల్లో 40 శాతానికి పైగా రిజర్వాయర్లు వాటి పూర్తి సామర్థ్యంలో సగం కంటే తక్కువ నీటి నిల్వను కలిగి ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలోని అన్ని ఆనకట్టల సగటు నీటి మట్టం 51 శాతానికి పడిపోయింది.ప్రస్తుత పరిస్థితికేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం, ఈ 166 జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 183.565 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం) కాగా, ప్రస్తుతం కేవలం 94.063 బీసీఎం (51 శాతం) మాత్రమే నీరు నిల్వ ఉంది. వాటిలో..39 జలాశయాలు: 40 శాతం కంటే తక్కువ నిల్వ.33 జలాశయాలు: 50 శాతం కంటే తక్కువ నిల్వ.కేవలం 1 జలాశయం: ఝార్ఖండ్లోని జఖేత్ హిల్ రిజర్వాయర్ మాత్రమే ప్రస్తుతం 100 శాతం నిండి ఉంది.18 జలాశయాలు: 80 శాతానికి పైగా నిల్వను కలిగి ఉన్నాయి.లోటు వర్షపాతంఈ జల సంక్షోభానికి ప్రధాన కారణం.. లోటు వర్షపాతమని నివేదికలు చెబుతున్నాయి. ఐఎండీ అందించిన 726 జిల్లాల డేటా ప్రకారం, మార్చి 1 నుంచి దేశంలోని 78 శాతం ప్రాంతాల్లో వర్షపాతం అసలు లేకపోవడం అధిక భారీ లోటు నమోదైంది. ఏడాది ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా వర్షపాతంలో 70 శాతానికి పైగా లోటు ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.ఈ పరిణామాలకు దారితీసిన కారణాలురుతుపవనాల అనంతర కాలంలో, ఈ ఏడాది ప్రారంభంలో కురవాల్సిన వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలోకి ఇన్-ఫ్లో నిలిచిపోయింది. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు కావడంతో బాష్పీభవనం పెరిగి నీటి మట్టాలు వేగంగా తగ్గుతున్నాయి. వేసవి పంటల సాగుకు, తాగునీటి అవసరాలకు డిమాండ్ పెరగడంతో నిల్వలు వేగంగా ఖర్చవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో పరిస్థితులు భారత వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపి వర్షపాతాన్ని తగ్గించాయి.ప్రాంతంజలాశయాల సంఖ్యప్రస్తుత నిల్వ శాతంస్థితిగతులుదక్షిణ భారతం4241%తెలంగాణ (35% దిగువకు), కర్ణాటక (40% కంటే తక్కువ) ఆందోళనకరంగా ఉన్నాయి.ఉత్తర భారతం1145.5%హిమాచల్ప్రదేశ్ 40% లోపు ఉండగా, పంజాబ్, రాజస్థాన్లలో 55% పైగా ఉంది.తూర్పు భారతం2750%అస్సాం (20%), పశ్చిమ బెంగాల్ (25%) కనిష్ట స్థాయిలో ఉన్నాయి.పశ్చిమ భారతం5362%గోవా, మహారాష్ట్ర, గుజరాత్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.మధ్య భారతం2857%ఛత్తీస్గఢ్ (71%) మెరుగ్గా ఉండగా, ఉత్తరాఖండ్ (43%) తక్కువగా ఉంది. గడిచిన 10 ఏళ్ల సగటుతో పోలిస్తే ప్రస్తుతం దేశవ్యాప్త నీటి నిల్వలు సాంకేతికంగా కొంత ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ (గత ఏడాది కంటే 13.5 శాతం పాయింట్లు ఎక్కువ), లోటు వర్షపాతం రాబోయే రోజుల్లో సవాలుగా మారనుంది. అయితే, సమీప భవిష్యత్తులో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దాంతో రిజర్వాయర్ల మట్టం తగ్గే వేగం కొంత నిమ్మదిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
దాపరికాలుంటే ఊరుకోం..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కలవరపెడుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశీయ ఇంధన భద్రతను పటిష్టం చేసేందుకు వీలుగా స్థానికంగాఉన్న అన్ని చమురు, సహజ వాయువు కంపెనీలు తమ నిల్వలు, ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను ప్రభుత్వంతో పంచుకోవాలని కేంద్రం కఠిన ఆదేశాలు జారీ చేసింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ)కు ఈ డేటాను క్రమం తప్పకుండా అందించాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.ఈ కొత్త నిబంధనల ద్వారా సమాచార సేకరణకు చట్టపరమైన బలాన్ని చేకూర్చామని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఓ సమావేశంలో వెల్లడించారు. ‘గతంలోనూ పీపీఏసీ సమాచారాన్ని సేకరించేది, కానీ తాజా నోటిఫికేషన్తో దీనికి పూర్తిస్థాయి చట్టపరమైన శక్తి లభించింది. ఇప్పుడు ప్రతి సంస్థ కచ్చితంగా సమాచారాన్ని వెల్లడించాల్సిందే. దీనివల్ల పర్యవేక్షణ మరింత పకడ్బందీగా అమలు అవుతుంది’ అని ఆమె పేర్కొన్నారు.ఎవరు వివరాలు వెల్లడించాలి?ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఈ కింది కార్యకలాపాల్లో నిమగ్నమైన సంస్థలన్నీ నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది.ముడి చమురు ఉత్పత్తి, రిఫైనింగ్ సంస్థలు.సహజ వాయువు ప్రాసెసింగ్, రవాణా సంస్థలు.పెట్రోలియం ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్, పంపిణీదారులు.దిగుమతిదారులు, టెర్మినల్ ఆపరేటర్లు.ఈ సంస్థలు తమ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం, కేటాయింపులు, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని రోజువారీ, వారం లేదా నెలవారీ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా అందించాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా ఉన్న భారత్ తన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండటమే ఈ తాజా ఆదేశాల ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.‘గోప్యత’ సాకు చెల్లదుచమురు సంస్థలు తాము కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు లేదా గోప్యతా నిబంధనలను సాకుగా చూపి సమాచారాన్ని దాచడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. సమాచారం ‘వాణిజ్యపరంగా సున్నితమైనది’ అనే కారణంతో ఏ సంస్థ కూడా నిరాకరించడానికి వీలులేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న ఇతర నిబంధనలకు అదనంగా ఈ కొత్త ఆదేశాలు అమలులో ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
చమురు భగభగ..
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా గల్ఫ్ ఇంధన క్షేత్రాలు, నిల్వలపై దాడులకు తెరతీయడంతో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం జంప్చేసి 117 డాలర్లకు చేరింది. దేశీయంగా ఎంసీఎక్స్లో ఏప్రిల్ డెలివరీ కాంట్రాక్ట్ రూ. 74 పెరిగి రూ. 9,067ను తాకింది. యూఎస్ నైమెక్స్లోనూ లైట్ స్వీట్ చమురు పీపా 1.6 శాతం బలపడి 97 డాలర్లకు చేరింది. హార్మూజ్ మూసివేతకుతోడు.. ఖతార్లోని గ్యాస్ సౌకర్యాలు, కువైట్లోని చమురు రిఫైనరీలు దాడులకు గురికావడం తదితర అంశాలు ఇంధన సరఫరాలను దెబ్బతీయనున్న ఆందోళనలు ధరలను ఎగదోస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో భారత్ చమురు బాస్కెట్ 145 డాలర్లను అధిగమించనున్నట్లు వెలువడిన అంచనాలు దేశీయంగా ఇంధన రంగ దిగ్గజ షేర్లలో భారీ అమ్మకాలకు దారి చూపాయి. -
2033 నాటికి అందరికీ బీమా
దేశంలోని ప్రతి పౌరుడికీ ఆరోగ్య బీమా రక్షణ కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. 2033 నాటికి దేశ ప్రజలందరికీ ఆరోగ్య బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈమేరకు పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో బీమా రంగంపై అడిగిన ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చారు.గ్రామ పంచాయతీలే ప్రామాణికంగ్రామీణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంటూ మంత్రి కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 25,000 గ్రామ పంచాయతీలను కవర్ చేసేలా భారీ ‘రూరల్ అవుట్రీచ్’ ప్రణాళికను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) 2024లో కొత్త నిబంధనలను నోటిఫై చేసిందని గుర్తు చేశారు. దీని ప్రకారం, బీమా కవరేజీ, గ్రామీణ బాధ్యతలను కొలవడానికి ఇకపై గ్రామ పంచాయతీనే ప్రాథమిక యూనిట్గా పరిగణిస్తారు. ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్లో బీమా పొందడం (Insurance Penetration) తక్కువగా ఉందని మంత్రి అంగీకరించారు.ఆరోగ్య బీమా మార్కెట్ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తోందని మంత్రి గణాంకాలతో వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం రూ.1,17,505 కోట్ల ప్రీమియం నమోదు చేసింది. వివిధ పథకాల ద్వారా ప్రస్తుతం దేశంలో 58 కోట్ల మందికి ఆరోగ్య బీమా రక్షణ లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ మద్దతు గల బీమా సంస్థలు సమన్వయంతో కవరేజీని విస్తరిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.పీఎం జీవన్ జ్యోతి బీమా యోజనపేద, బలహీన వర్గాలకు బీమాను చేరువ చేసేందుకు ప్రీమియం రేట్లను అత్యంత సరసమైన ధరల్లో ఉంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి నొక్కి చెప్పారు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన సాధించిన విజయాన్ని ఆమె ఉదహరించారు. ‘కేవలం రూ.436 వార్షిక ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత బీమా కవరేజీని ఈ పథకం అందిస్తోంది. ఇప్పటివరకు ఇందులో 26.79 కోట్ల మంది నమోదు చేసుకోవడం సామాజిక భద్రతపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.సామాజిక రక్షణే పరమావధికేంద్రం తీసుకుంటున్న ఈ బహుళ విధాన చర్యలు కేవలం బీమా రంగాన్ని వృద్ధి చేయడమే కాకుండా ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక, సామాజిక రక్షణ కవచాన్ని నిర్ధారించడానికి దోహదపడతాయని ఆర్థిక మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
డాలర్ ఆధిపత్యానికి గండి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ప్రపంచ భౌగోళిక రాజకీయాలతోపాటు అంతర్జాతీయ ఆర్థిక ముఖచిత్రాన్ని కూడా వేగంగా మారుస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు అమెరికా డాలర్ ఏకఛత్రాధిపత్యానికి సవాలు విసురుతున్నాయి.డీ-డాలరైజేషన్ వేగవంతం?హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచంలోని 20% పైగా చమురు రవాణా జరుగుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఇరాన్, దానికి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు చమురు వ్యాపారాన్ని డాలర్లకు బదులు చైనా కరెన్సీ ‘యువాన్’లో జరపాలని యోచిస్తున్నాయి.అంతర్జాతీయ వాణిజ్యంలో 80% పైగా చమురు లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. ఇప్పుడు యువాన్ వైపు మొగ్గు చూపడం వల్ల డాలర్కు ఉన్న గ్లోబల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతింటే సురక్షితమైన కరెన్సీగా డాలర్ను కాకుండా ప్రత్యామ్నాయాల వైపు దేశాలు చూడటం అమెరికా ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం కలిగిస్తుంది.భారత రూపాయిపై ప్రభావంప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ కరెన్సీ మార్పుల ప్రభావం భారత రూపాయిపై ద్వంద్వ ప్రభావం చూపే అవకాశం ఉంది.చైనా ఆధిపత్యం పెరగడంఅంతర్జాతీయ చమురు మార్కెట్లో యువాన్ పట్టు సాధిస్తే అది ఆసియాలో చైనా ఆర్థిక శక్తిని మరింత పెంచుతుంది. భారత్కు చైనాతో సరిహద్దు వివాదాలు, వాణిజ్య పోటీ ఉన్న నేపథ్యంలో మన పొరుగు దేశం కరెన్సీ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా మారడం భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లావేదేవీలు సర్వసాధారణం. ఒకవేళ యువాన్ వాడకం పెరిగితే భారత్ తన చమురు దిగుమతుల కోసం యువాన్ను భారీగా కొనాల్సి ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో యువాన్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ దానికి సాపేక్షంగా తగ్గే ప్రమాదం ఉంది. దాంతో మన విదేశీ మారక నిల్వలలో డాలర్ల కంటే యువాన్ నిల్వలను ఎక్కువగా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర ప్రభావిత అంశాల గురించి కింద చూద్దాం.ఇదీ చదవండి: ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం! -
లేబర్ ఫోర్స్ సర్వే: నిరుద్యోగం రేటు ఇలా..
దేశీయంగా 15 ఏళ్లు పైబడిన వారిలో నిరుద్యోగం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గింది. జనవరిలో నిరుద్యోగిత రేటు (యూఆర్) 5 శాతంగా ఉండగా, గత నెల 4.9 శాతానికి నెమ్మదించినట్లు కార్మిక శక్తి సర్వే (పీఎల్ఎఫ్ఎస్) నివేదికలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో ఇది 6.6 శాతంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేకుండా 4.2 శాతంగా కొనసాగింది.గత నెలలో మహిళల్లో (15 సంవత్సరాలు పైబడిన వారు) యూఆర్ జనవరిలో 5.6 శాతంగాను ఉండగా, గత నెల 5.1 శాతానికి దిగివచి్చంది. పట్టణ ప్రాంతాల్లో 9.8 శాతం నుంచి 8.7 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 4.3 శాతం నుంచి 4 శాతానికి తగ్గింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,74,879 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ప్రజల్లో ఉద్యోగాలు, నిరుద్యోగాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే పీఎల్ఎఫ్ఎస్ని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహిస్తుంది. -
ప్రకృతి వ్యవసాయం.. అనివార్యం!
మానవ మనుగడకు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుత రోజుల్లో రసాయన ఎరువులపై మితిమీరి ఆధారపడటం, మారుతున్న వాతావరణ పరిస్థితులు, అస్థిరమైన గ్లోబల్ మార్కెట్లు మన ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ వ్యవసాయ రంగం ప్రకృతి సాగువైపు అడుగులు వేయడం కేవలం పర్యావరణ హితం మాత్రమే కాదు.. దేశ ఆర్థిక, ఆరోగ్య భద్రతకు అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.ప్రస్తుత ఆధునిక వ్యవసాయం శిలాజ ఇంధనాలతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది. ఐపీఈఎస్-ఫుడ్ 2024-25 నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లభించే పెట్రోకెమికల్స్లో 40%, శిలాజ ఇంధనాల్లో 15 కేవలం ఆహార వ్యవస్థలకే వినియోగిస్తున్నారు. అంటే, అంతర్జాతీయ ఇంధన ధరల్లో వచ్చే స్వల్ప మార్పు కూడా సామాన్యుడి కంచంలోని ఆహార ధరను ప్రభావితం చేస్తోంది.రసాయన ఎరువుల సెగప్రపంచవ్యాప్త ప్రోటీన్ వినియోగంలో 40% కేవలం ‘హేబర్-బోష్’(గాలిలో ఉండే నైట్రోజన్ను మొక్కలకు ఉపయోగపడే అమ్మోనియాగా మార్చే పద్ధతి) ప్రక్రియ ద్వారా తయారయ్యే సింథటిక్ నైట్రోజన్ ఎరువులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం యూరియా ధర టన్నుకు 585 డాలర్ల వద్ద ఉండగా భవిష్యత్తులో ఇది 650-700 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం తన అమ్మోనియా, సల్ఫర్ దిగుమతుల్లో 2/3 వంతు గల్ఫ్ దేశాల నుంచే పొందుతోంది. అక్కడ తలెత్తే రాజకీయ అనిశ్చితి మన పొలాల్లో ఎరువుల కొరతకు దారితీస్తోంది.శాస్త్రీయ వాస్తవాలుఐపీసీసీ(ఇంటర్గవర్న్మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ చేంజ్) హెచ్చరికల ప్రకారం పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంట కాలాలను కుదించేస్తున్నాయి. దేశంలో ఇది ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల గోధుమల దిగుబడి తగ్గుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వరిసాగులో గింజ గట్టిపడే ప్రక్రియ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యాంత్రాంగం స్పందించి వరి, గోధుమలపైనే కాకుండా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల వైపు సాగును మళ్లించాల్సిన సమయం ఆసన్నమైంది.రసాయన సాగు వల్ల నేలతోపాటు మానవులు రోగాల బారిన పడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ నివేదికల ప్రకారం, ఆహారంలో రసాయన అవశేషాల వల్ల అంటువ్యాధులు కాని రోగాలు (ఎన్సీడీ) వేగంగా పెరుగుతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల పరాగ సంపర్కం చేసే కీటకాలు అంతరించిపోతున్నాయి. ఇది దిగుబడుల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది.మార్పు కోసం వ్యూహంప్రకృతి సాగు వైపు మార్పు అనేది ఒక్కరోజులో జరిగే పనికాదు. ఇది క్రమబద్ధంగా శాస్త్రీయంగా జరగాలి. దీనికోసం ప్రభుత్వం అనుసరించాల్సిన కొన్ని సూత్రాలను నిపుణులు సూచిస్తున్నారు.రసాయన ఎరువుల స్థానంలో జీవ ఎరువులను ప్రోత్సహించాలి.నేల ఆరోగ్యం, సూక్ష్మజీవుల పాత్ర, చెట్లు-పశువులు-పంటల కలయికపై వ్యవసాయ పరిశోధనా సంస్థలు దృష్టి సారించాలి.ఎరువుల కోసమే కాకుండా నేల ఆరోగ్యాన్ని కాపాడే రైతులకు, జీవవైవిధ్యాన్ని పెంపొందించే వారికి ప్రోత్సాహకాలు అందించాలి.ప్రకృతి సాయంతో తయారైన ఉత్పత్తులకు ప్రత్యేక సరఫరా గొలుసును నిర్మించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలి.యుద్ధాలను, అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను వెంటనే నియంత్రించలేకపోవచ్చు. కానీ, మన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో మనం నిర్ణయించుకోగలం. పెట్టుబడి తగ్గించి, ప్రకృతితో మమేకమయ్యే సాగు ద్వారానే మన భూమిని, భావితరాల ఆరోగ్యాన్ని కాపాడుకోగలమని గుర్తుంచుకోవాలి. -
ముదురుతోన్న సంక్షోభం.. కీలక రంగాలకు ముప్పు
పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణ పదకొండో రోజుకు చేరుకోవడంతో.. కేవలం చమురు, సహజ వాయువు సరఫరా మాత్రమే కాకుండా, నిత్యవసర రంగాలు సైతం సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా ఎరువులు, అల్యూమినియం, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో పాటు ధరలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అన్నదాతపై ఎరువుల సెగభారతదేశంలో విత్తనాల సీజన్ (ఖరీఫ్) ప్రారంభంకానున్న తరుణంలో ఎరువుల కొరత ఆందోళన కలిగిస్తోంది. దేశీయ ఎరువుల అవసరాల్లో 30% దిగుమతుల ద్వారానే తీరుతుండగా అందులో 40% వాటా ఒక్క మధ్యప్రాచ్య దేశాలదేనని క్రిసిల్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది.మెరుగైన రుతుపవనాల కారణంగా డిమాండ్ పెరగడంతో 2026 ఆర్థిక సంవత్సరంలో ఎరువుల దిగుమతులు 41% పెరిగి 22.3 మిలియన్ టన్నులకు చేరుకుంటాయని ఫెర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎరువుల సబ్సిడీని కేంద్రం తొలుత రూ.1.67 లక్షల కోట్లుగా అంచనా వేసినప్పటికీ అది రూ.1.86 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అయితే, 2027 ఆర్థిక సంవత్సరానికి దీన్ని రూ.1.71 లక్షల కోట్లుగా కేటాయించడం గమనార్హం.చైనా ఆంక్షలుచైనా విధిస్తున్న సరఫరా పరిమితులతో గత నెలలోనే యూరియా ధరలు 20% పెరిగాయని కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. ఇప్పుడు యుద్ధం తోడవడంతో ఈ ఖర్చు మరింత భారమవ్వనుంది.అల్యూమినియం రంగంలోనూ అస్థిరతప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 8-9% వాటా కలిగిన గల్ఫ్ దేశాల నుంచి సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. యుద్ధం మొదలైన వారంలోపే ‘హైడ్రో’, ‘ఆల్బా’ వంటి దిగ్గజ సంస్థలు ఫోర్స్ మేజర్ (అనివార్య కారణాల వల్ల ఒప్పందాలను అమలు చేయలేకపోవడం) ప్రకటించాయి. అల్యూమినియం స్మెల్టర్లు ముడి పదార్థాల కోసం హార్మూజ్ జలసంధిపైనే ఆధారపడతాయి. యుద్ధం కారణంగా అటు ముడి పదార్థాలు, ఇటు ఇంధన లభ్యత రెండూ ప్రశ్నార్థకంగా మారాయి.ప్యాకేజింగ్ పరిశ్రమకు దెబ్బయుద్ధం కారణంగా పాలిమర్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది నేరుగా ప్యాకేజింగ్ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. ప్యాకేజింగ్ తయారీదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్న బ్రాండ్లు కొంతవరకు తట్టుకోగలిగినా స్పాట్ మార్కెట్లో కొనుగోలు చేసే చిన్న సంస్థలు అధిక ధరల అస్థిరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘సరఫరా అంతరాయాలు కలగకుండా కస్టమర్లతో కలిసి పనిచేస్తున్నాం. ఈ సవాళ్లను అధిగమిస్తామనే నమ్మకం ఉంది’ అని ఆల్టర్నిక్ ఎండీ, సీఈఓ తిమ్మయ్య ఎన్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గకపోతే రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం పడే ప్రమాదం పొంచి ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే దౌత్యపరమైన, ఆర్థికపరమైన చర్యలే కీలకం కానున్నాయి. -
గ్యాస్ సరఫరాలో ఎగుమతి యూనిట్లకు ప్రాధాన్యం
ఎగుమతి ఆధారిత తయారీ యూనిట్లకు ప్రాధాన్య ప్రాతిపదికన ఎల్పీజీ, సహజ వాయువును కేటాయించాలని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇంధన కొరత ఏర్పడితే భారతీయ సంస్థలు సకాలంలో ఎగుమతుల లక్ష్యాలను పూర్తి చేయలేవని.. దీంతో అంతర్జాతీయ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ దేశాల వైపు మళ్లే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా చైనా ప్రయోజనం పొందొచ్చని పేర్కొంది. కనుక ఎగుమతి ఆధారిత తయారీ పరిశ్రమలకు గ్యాస్ సరఫరా కొనసాగేలా చూడడం ఎంతో అవసరమని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ తెలిపారు.ఈ విషయమై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖలకు లేఖ రాసినట్టు చెప్పారు. ఎగుమతులపై ఆధారపడిన చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్ఎంఈ) సైతం గ్యాస్ కేటాయింపుల్లో ప్రాధాన్యం చూపించాలని కోరారు. ఎగుమతిదారులు సమస్యలు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత.. పశి్చమాసియాలో సంక్షోభ వాతావరణం నెలకొనడం తెలిసిందే. దీంతో చమురు, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగాయి.గ్యాస్ కొరత ఏర్పడడంతో వంటగ్యాస్కే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. పరిశ్రమలకు ఇప్పటికే 50 శాతానిక పైనే గ్యాస్ కోత విధించడం గమనార్హం. జలంధర్ కేంద్రంగా పనిచేసే హ్యాండ్ ఉపకరణాల తయారీదారులు, ఎగుమతిదారుల సమాఖ్య ప్రెసిడెంట్ అశ్వినీ కుమార్ సైతం ఇదే మాదిరి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తమ ఉత్పత్తి కోసం రోజువారీ 425 కిలోల ఎల్పీజీ, కార్మికుల ఆహార తయారీకి వీలుగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ల సరఫరా ఎంతో అవసరమని చెప్పారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
పేపర్ పరిశ్రమకు ‘పశ్చిమాసియా’ సెగ
పశ్చిమాసియా సంక్షోభంతో దేశీ పేపర్ పరిశ్రమను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇంధన వ్యయాలు పెరిగిపోవడం, ఎగుమతులకు అవరోధాలతో వ్యాపారాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన పేపర్ పరిశ్రమకు కీలక ఎగుమతి మార్కెట్లలో పశ్చిమాసియా కూడా ఒకటిగా ఉంటోంది. 2024–25లో దేశీ పరిశ్రమ 980 మిలియన్ డాలర్ల పేపర్, పేపర్బోర్డును ఎగుమతి చేయగా అందులో పశ్చిమాసియా దేశాల వాటా 290 మిలియన్ డాలర్లుగా (సుమారు 30 శాతం) ఉన్నట్లు పేపర్ తయారీ సంస్థల సమాఖ్య ఐపీఎంఏ తెలిపింది.అన్కోటెడ్ రైటింగ్..ప్రింటింగ్ పేపర్, కోటెడ్ పేపర్..పేపర్బోర్డ్, క్రాఫ్ట్ పేపర్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. తమ పరిశ్రమలో ప్రధానంగా ఇంధన వినియోగం ఎక్కువగా ఉంటుందని, దీనితో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం తమపైనా ఉంటోందని ఐపీఎంఏ వివరించింది. ఇంధన రేట్లు పెరిగిపోవడం, సరఫరాపరమైన అవరోధాల వల్ల దేశీ పేపర్ మిల్లుల ఉత్పత్తి వ్యయాలపై నేరుగా ప్రభావం పడుతోందని వివరించింది. పేపర్ తయారీ ప్రక్రియకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్..బైండర్స్లాంటి ఉత్పత్తులను సమకూర్చుకోవడంలో మిల్లులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.మరో వైపు, పేపర్ని ఉత్పత్తి చేసే చైనా, ఇండొనేషియాలాంటి దేశాలు ఎగుమతి కోసం పశ్చిమాసియాపై ఆధారపడతాయని, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల, సదరు ఉత్పత్తులను ఇప్పుడు అవి భారత్ వైపు మళ్లించే అవకాశం ఉందని ఐపీఎంఏ తెలిపింది. దీనితో చౌక దిగుమతులు వెల్లువెత్తి, దేశీ తయారీ సంస్థలపై ఒత్తిడి పెరిగిపోయే ముప్పు ఉందని వివరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే డిమాండ్పై ప్రతికూల ప్రభావం పడే ముప్పు నెలకొందని ఐపీఎంఏ ప్రెసిడెంట్ పవన్ అగర్వాల్ చెప్పారు.ఇదీ చదవండి: దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు -
దేశంలోనే టాప్ 10 రుణ ఎగవేతదారులు
దేశంలో బ్యాంకులకు టాప్–10 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల నుంచి రూ.40,635 కోట్ల బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ జాబితాలో ఏబీజీ షిప్యార్డ్ (రూ.6,695 కోట్లు), గీతాంజలి జెమ్స్ (రూ.6,236 కోట్లు), బీటా నాప్తాల్ (రూ.5,268 కోట్లు), రాకేష్ కుమార్ కుల్దీప్ సింగ్ వాధ్వాన్ (రూ.4,291 కోట్లు) ఉన్నట్లు లోక్సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆమె వెల్లడించారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, బడా ఎగవేతదారుల (డిఫాల్టర్ల)పై చర్యలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆదేశాల ప్రకారం.. బ్యాంకులు ఈ మొత్తం జాబితాను అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ (సీఐసీ)లకు నెలవారీగా సమర్పించాల్సి ఉంటుందని, అలాగే ఆయా సీఐసీలు దీన్ని తమ వెబ్సైట్లలో ప్రదర్శించాలని కూడా ఆమె వివరించారు.సెటిల్మెంట్ చేసుకోవచ్చు కానీ...ఆర్బీఐ నిబంధనల మేరకు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల కేటగిరీలో చేర్చిన ఖాతాలకు సంబంధించి బ్యాంకులు రాజీ సెటిల్మెంట్లు చేసుకోవచ్చని, అయితే ఆయా రుణగ్రహీతలపై కొనసాగుతున్న నేర విచారణలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూసుకోవాలని సీతారామన్ పేర్కొన్నారు. డిఫాల్ట్ సొమ్మును తీవ్రమైన జాప్యాలు లేకుండా రికవరీ చేసుకోవడంలో రుణదాతలకు వెసులుబాటు కల్పించడమే దీని ఉద్దేశమని చెప్పారు.డిజిటల్ పేమెంట్స్ జోరు..గడిచిన కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ పేమెంట్ లావాదేవీలు అసాధారణరీతిలో ఎగబాకాయని, దీనికి ప్రధానంగా ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సమన్వయంతో చేపట్టిన చర్యలే కారణమని మరో ప్రశ్నకు సమాధానంగా సీతారామన్ బదులిచ్చారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ డిజిటల్ చెల్లింపుల విలువ రూ.457.44 లక్షల కోట్లు కాగా, 2024–25 నాటికి ఇది రూ.849.12 లక్షల కోట్లకు దూసుకెళ్లిందని ఆమె చెప్పారు. వీటిలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) 81 శాతం వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద రియల్టైమ్ రిటైల్ పేమెంట్ వ్యవస్థగా ఆవిర్భవించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.డిజిటల్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, ఎన్పీసీఐ పలు చర్యలు చేపడుతున్నాయన్నారు. కస్టమర్ మొబైల్ నంబర్, పరికరం మధ్య అనుసంధానం, పిన్ ద్వారా రెండంచెల ధృవీకరణ, రోజువారీ లావాదేవీల పరిమితి, ఇంకా కొన్ని రకాల వినియోగాలపై నియంత్రణలు ఇందులో ఉన్నాయని వివరించారు. అనుమానాస్పద లావాదేవీల విషయంలో అలెర్ట్లు పంపడం, వాటిని తిరస్కరించడానికి బ్యాంకులన్నింటికీ ఏఐ/ఎంఎల్ ఆధారిత ఫ్రాడ్–మానిటరింగ్ పరిష్కారాన్ని ఎన్పీసీఐ అందిస్తోందని కూడా ఆర్థిక మంత్రి తెలిపారు.11 ఏళ్లలో రూ.9.75 లక్షల కోట్లు రైటాఫ్గత 11 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.9.75 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ (రైటాఫ్) చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. 2019–20లో గరిష్టంగా రూ.1.59 లక్షల కోట్లను రైటాఫ్ చేయగా... 2024–25లో ఈ మొత్తం రూ.47,568 కోట్లకు దిగొచ్చిందని లోక్సభకు ఇచి్చన రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. ‘ఆర్బీఐ మార్గదర్శకాలు, బ్యాంకు బోర్డులు ఆమోదించిన పాలసీ ప్రకారం, నాలుగేళ్లపాటు పూర్తి ప్రొవిజనింగ్ (కేటాయింపులు) జరిపిన మొండి బకాయిల (ఎన్పీఏ)తో సహా, ఎన్పీఏలను బ్యాంకులు రైటాఫ్ చేస్తాయి.ఈ చర్యల వల్ల రుణగ్రహీతలు చెల్లించాల్సిన అప్పులు మాఫీ కావు, అందువల్ల ఇది వారికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చదు. రుణగ్రహీతలు బకాయిల చెల్లింపును కొనసాగించాల్సిందే. ఆయా ఖాతాలపై బ్యాంకులు చేపట్టిన రికవరీ చర్యలు కూడా కొనసాగుతుతాయి’ అని ఆయన వివరించారు.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష -
వాణిజ్య లోటు ఊరట
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మెర్కండైజ్) ఎగుమతులు వార్షికంగా 0.8 శాతం క్షీణించి 36.61 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతేకాకుండా ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 27.1 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కావడంతో ఈ ప్రభావం మార్చి నెల వాణిజ్య గణాంకాలపై కనిపించనుంది.మార్చి గణాంకాలు మే నెల మధ్యలో విడుదలవుతాయి. కాగా.. రవాణాపై రాజకీయ, భౌగోళిక సవాళ్లు ప్రభావం చూపడంతో మార్చిలో ఎగుమతులు క్షీణించనున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ఫిబ్రవరిలో దిగుమతులు 24 శాతంపైగా ఎగసి 63.71 బిలియన్ డాలర్లను తాకాయి. ఇందుకు పసిడి, వెండి దిగుమతులు కారణమయ్యాయి.గోల్డ్ షిప్మెంట్స్ 219 శాతం జంప్చేసి 7.44 బిలియన్ డాలర్లకు చేరగా.. సిల్వర్ దిగుమతులు 285 శాతంపైగా ఎగసి 1.66 బిలియన్ డాలర్లయ్యాయి. మరోపక్క ముడిచమురు దిగుమతులు 9 శాతం అధికమై 12.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే జనవరిలో నమోదైన 34.68 బిలియన్ డాలర్లతో పోలిస్తే గత నెలలో వాణిజ్య లోటు తగ్గింది. వార్షికంగా అంటే 2025 ఫిబ్రవరిలో నమోదైన 14.05 బిలియన్ డాలర్లతో చూస్తే భారీగా పెరిగింది. 11 నెలల్లో..: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి కాలంలో దేశ ఎగుమతులు దాదాపు 2 శాతం పుంజుకుని 402.93 బిలియన్ డాలర్లను తాకాయి. ఇదే కాలంలో దిగుమతులు 8.5 శాతం పెరిగి 713.53 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఈ ఏడాది(2025–26) తొలి 11 నెలల్లో వాణిజ్య లోటు 310.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో ఈ లోటు 261.8 బిలియన్ డాలర్లు మాత్రమే.అమెరికాకు ఎగుమతులు డౌన్అధిక టారిఫ్ల భారం కారణంగా అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు ఫిబ్రవరిలో 6.88 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.88 శాతం తగ్గాయి. భారత్పై అమెరికా 50% పైగా సుంకాలు విధించడం, తర్వాత అక్కడి సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయడంతో తిరిగి 150 రోజుల వ్యవధికి 10% విధించడం తెలిసిందే. సుంకాల తగ్గుదల ప్రభావం మార్చి ఎగుమతుల గణాంకాల్లో తెలియనుంది. 11 నెలల వ్యవధిలో..: ఇక ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల వ్యవధిలో అమెరికాకు ఎగుమతులు 3.84% పెరిగి 79.29 బి.డాలర్లకు, దిగుమతులు 15.65% పెరిగి 48.4 బి.డాలర్లకు చేరాయి. మరోవైపు, చైనాకు ఎగుమతులు 37.66% పెరిగి 17.54 బి. డాలర్లకు, దిగుమతులు 119.55 బి. డాలర్లకు ఎగిశాయి. -
కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల కేటాయింపు షురూ
దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్ విభాగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ ప్రక్రియను వివిధ రాష్ట్రాలు ప్రారంభించాయి. ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కేటాయింపులు అమల్లోకి వచ్చాయి.ప్రాధాన్యత క్రమంలో పంపిణీప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) రోజువారీ సగటు వినియోగంలో 20 శాతం మేర నియంత్రిత పంపిణీ కోసం కేటాయించాయి. ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో రోజుకు సుమారు 1,800 సిలిండర్లను ఈ విధానం కింద పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంపిణీలో ఐదు స్థాయిల ప్రాధాన్యతను నిర్ణయించారు:స్థాయి 1, 2: విద్యాసంస్థలు, ఆసుపత్రులు, రైల్వేలు, విమానాశ్రయాలకు అత్యున్నత ప్రాధాన్యత.స్థాయి 3: రెస్టారెంట్లు, భోజనశాలలకు 42 శాతం వాటా.స్థాయి 4: హోటళ్లు, గెస్ట్ హౌస్లు, ట్రస్టులకు 4 శాతం కేటాయింపు.స్థాయి 5: డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు 11 శాతం కేటాయింపు.రాష్ట్రాల వారీగా..కేంద్ర మార్గదర్శకాలను అనుసరించి ఇప్పటికే ఢిల్లీ, బిహార్, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. గృహ వినియోగ గ్యాస్ మళ్లింపును అరికట్టడానికి, వాణిజ్య అవసరాలకు అంతరాయం కలగకుండా చూడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల పండుగల సీజన్లో, రద్దీ సమయాల్లో వాణిజ్య గ్యాస్ కొరత తలెత్తకుండా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.ఇదీ చదవండి: కార్పొరేట్ సారథులకు అగ్నిపరీక్ష -
భారత ఆర్థిక వ్యవస్థ ప్రోగ్రెస్ రిపోర్ట్
భారతదేశం కేవలం అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు, ప్రపంచ వృద్ధికి దిక్సూచిగా మారుతోందని ఎన్ఎక్స్టీ ఫౌండేషన్ తాజా నివేదిక స్పష్టం చేసింది. ‘భారత్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2025-26’ పేరుతో విడుదలైన విశ్లేషణలో గడిచిన ఏడాది కాలంలో దేశం సాధించిన 101 చారిత్రాత్మక విజయాలను ఆవిష్కరించింది. డిజిటల్ విప్లవం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు, మౌలిక సదుపాయాల కల్పన నుంచి హరిత ఇంధనం వరకు భారత్ వృద్ధిలో వేగంగా దూసుకుపోతోందని చెప్పింది.జపాన్ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా..ఎన్ఎక్స్టీ నివేదిక ప్రకారం.. 2025లో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త చరిత్ర సృష్టించింది. సుమారు 4.18 ట్రిలియన్ డాలర్ల నామమాత్రపు జీడీపీతో జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 8.2 శాతం బలమైన వృద్ధి రేటుతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదే వేగం కొనసాగితే అతి త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమని నివేదిక విశ్లేషించింది.విదేశీ పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 1.15 ట్రిలియన్ డాలర్లను దాటాయి. దేశ ఆర్థిక వృద్ధిని ప్రతిబింబించేలా పలు కీలక సూచీలు రికార్డులను సృష్టించాయని నివేదిక తెలిపింది. ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లు మునుపెన్నడూ లేని విధంగా రూ.2.17 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ పొదుపు సంస్కృతి పెరగడంతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.80 లక్షల కోట్లను దాటింది.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షంనివేదికలోని కొన్ని అంశాలు..యూపీఐ నెలవారీ లావాదేవీల విలువ రూ.21 లక్షల కోట్లు దాటడం దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యాప్తికి అద్దం పడుతోంది.ఒక బిలియన్ మార్కును దాటిన ఆధార్ అప్డేషన్లు ప్రభుత్వ సేవలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరవేయడంలో పారదర్శకతను పెంచాయి.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన (చీనాబ్ బ్రిడ్జ్) పూర్తి కావడం భారతీయ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం.దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వందే భారత్ రైళ్లు రవాణా ముఖచిత్రాన్ని మారుస్తున్నాయి.జాతీయ రహదారుల విస్తరణతో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి సరఫరా గొలుసు బలోపేతమైంది.ఇస్రో నిర్వహించిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ విజయవంతం కావడంతో అంతరిక్షంలో సొంత స్టేషన్ ఏర్పాటు దిశగా భారత్ కీలక అడుగు వేసింది.చైనాకు ప్రత్యామ్నాయంగా ‘గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్’గా ఎదిగే క్రమంలో సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్లో భారత్ స్వయం సమృద్ధిని సాధిస్తోంది.సౌర, పవన, హైడల్ పవర్ రంగాల్లో భారత్ అసాధారణ వృద్ధిని కనబరిచింది. -
ప్రపంచంలోనే అధికంగా వంటగ్యాస్ ఉత్పత్తి చేసే దేశం
భారతదేశంలో సగటు సామాన్యుడి వంటింటి బడ్జెట్ను తలకిందులు చేసే ప్రధాన అంశాల్లో గ్యాస్ ధర ఒకటి. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు నేరుగా భారతీయులపై ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నడుస్తున్న ఈ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తిదారులు అని భావిస్తారు. కానీ అసలు వాస్తవం ఏమిటో.. ప్రపంచంలో ఏ దేశం ఎక్కువగా వంటగ్యాస్ ఉత్పత్తి చేస్తుందో కింద చూద్దాం.గ్యాస్ సరఫరాకు కీలకంగా హార్మూజ్ జలసంధిప్రపంచవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా ఈ షిప్పింగ్ కారిడార్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. రవాణా ఖర్చులు పెరగడం, ఇన్సూరెన్స్ ప్రీమియంలు అధికం కావడంతో భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో సిలిండర్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.అమెరికానే నంబర్ వన్చాలామంది సౌదీ అరేబియా లేదా రష్యా అతిపెద్ద ఉత్పత్తిదారులు అని భావిస్తారు, కానీ వాస్తవం వేరు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అగ్రగామి ఎల్పీజీ ఉత్పత్తిదారుగా అవతరించింది. అమెరికా ఏటా సుమారు 84 మిలియన్ టన్నుల ఎల్పీజీని ఉత్పత్తి చేస్తోంది. అంటే ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 26% వాటా ఒక్క అమెరికాదే.చైనా 32 మిలియన్ టన్నులు, సౌదీ అరేబియా 26 మిలియన్ టన్నులతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రష్యా నాలుగో స్థానంలో ఉంది. కెనడా, ఇరాన్, ఖతార్, యూఏఈలు కూడా ఈ జాబితాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.ఎల్పీజీ అసలు ఎలా తయారవుతుంది?ఎల్పీజీ అంటే ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. ఇది ప్రధానంగా రెండు మార్గాల్లో లభిస్తుంది. భూమి లోపలి నుంచి సహజ వాయువును వెలికితీసేటప్పుడు ప్రొపేన్, బ్యూటేన్లను వేరు చేస్తారు. ఇతర మార్గాల్లో రిఫైనరీల్లో ముడి చమురును పెట్రోల్, డీజిల్గా మార్చే ప్రక్రియలో ఎల్పీజీ ఒక ఉప ఉత్పత్తిగా వస్తుంది.భారత్ పరిస్థితి ఏమిటి?భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుల్లో ఒకటి. ఉజ్వల యోజన వంటి పథకాలతో గ్యాస్ వినియోగం పెరిగినప్పటికీ మన దేశీయ ఉత్పత్తి డిమాండ్కు సరిపోవడం లేదు. భారత్ తన అవసరాల కోసం ప్రధానంగా పశ్చిమ ఆసియా దేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు లేదా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పుడు దాని ప్రభావం నేరుగా దేశీయ సిలిండర్ ధరలపై పడుతోంది.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
బ్రిక్స్లో ఏకాభిప్రాయ గండం!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న వివాదంపై బ్రిక్స్ కూటమిలో ఉమ్మడి వైఖరిని రూపొందించడం సవాలుగా మారింది. ఈ ప్రాంతంలోని భౌగోళిక రాజకీయ పరిణామాల్లో బ్రిక్స్ సభ్య దేశాలకు నేరుగా ప్రమేయం ఉండటమే దీనికి ప్రధాన కారణమని విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.జైశంకర్తో ఇరాన్ విదేశాంగ మంత్రి చర్చలుఇటీవల ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి, భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడంలో భారత్ నాయకత్వంలోని బ్రిక్స్ కూటమి చురుకైన పాత్ర పోషించాలని అరాగ్చి ఈ సందర్భంగా ఆకాంక్షించినట్లు చెప్పారు. ఈ పోన్ సంభాషణ తర్వాత జైశంకర్ స్పందిస్తూ.. పశ్చిమాసియా పరిస్థితులపై బ్రిక్స్ సభ్య దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని స్పష్టం చేశారు. అయితే, కూటమిలోని కొన్ని దేశాలు ఈ వివాదంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములు కావడమే ఉమ్మడి ప్రకటనకు అడ్డంకిగా మారినట్లు తెలుస్తుంది.ఏకాభిప్రాయానికి ఆటంకాలు ఇవే..బ్రిక్స్ వేదికగా యుద్ధం పరంగా ఒకే మాట వినిపించడం ప్రస్తుతం కష్టతరంగా మారింది. దీనికి కొన్ని అంశాలు అంశాలు కారణమవుతున్నాయి. జనవరి 2024లో బ్రిక్స్లో చేరిన ఇరాన్ ఈ వివాదంలో ప్రధాన పక్షంగా ఉంది. మరో సభ్య దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఈ ప్రాంతీయ పరిణామాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. (2023 ఆగస్టులో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగిన 15వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఇరాన్తో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యూఏఈలకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించారు) సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక ప్రయోజనాలు వేర్వేరుగా ఉండటంతో ఈ సంఘర్షణపై ఒకే రకమైన వైఖరిని తీసుకోవడంలో ప్రతిష్టంభన నెలకొంది.భారత్ సారథ్యంబ్రిక్స్ అధ్యక్ష హోదాలో భారతదేశం ఈ సంక్షోభ పరిష్కారానికి తీవ్రంగా కృషి చేస్తోంది. సభ్య దేశాల మధ్య చర్చలను భారత్ సమన్వయం చేస్తోంది. ‘మార్చి 12న జరిగిన వర్చువల్ బ్రిక్స్ షెర్పా సమావేశంలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. పశ్చిమాసియాలోని సభ్య దేశాల నాయకులతో భారత అగ్రనాయకత్వం నిరంతరం టచ్లో ఉంది’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న వేళ, శాంతి మంత్రం కన్నా శతఘ్నుల మోతకే ప్రాధాన్యత పెరుగుతోంది. దేశాల మధ్య సరిహద్దు వివాదాలు, అంతర్యుద్ధ భయాలు సామాన్యుడిని భయపెడుతుంటే.. ఆయుధాలు ఎగుమతి చేసే దేశాలకు మాత్రం ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా 2021-2025 మధ్య కాలానికి సంబంధించి ఎస్ఐపీఆర్ఐ(స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) తాజాగా వెలువరించిన గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచ ఆయుధ మార్కెట్ ఏ విధంగా అగ్రరాజ్యాల గుప్పిట్లోకి వెళ్తోందో స్పష్టమవుతోంది.అమెరికా ఏకఛత్రాధిపత్యంప్రపంచ ఆయుధ విక్రయాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం ఎగుమతుల్లో 42% వాటాను సొంతం చేసుకోవడం ద్వారా తన సమీప ప్రత్యర్థి కంటే నాలుగు రెట్లు అధికంగా ఆయుధాల వ్యాపారం చేస్తోంది. అమెరికా ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి కొన్ని కారణాలున్నాయి.అత్యాధునిక యుద్ధ విమానాలు (ఎఫ్-35 వంటివి), క్షిపణి రక్షణ వ్యవస్థలు, నిఘా సాంకేతికతలో అమెరికాకు సాటిలేదు.నాటో దేశాలతో పాటు ఆసియా, మిడిల్ఈస్ట్ దేశాలతో ఉన్న రక్షణ ఒప్పందాలు అమెరికా ఆయుధాలకు నిరంతర డిమాండ్ను కల్పిస్తున్నాయి.రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాలు తమ రక్షణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవడానికి అమెరికా వైపు మొగ్గు చూపడం వల్ల ఈ వ్యాపారంలో మరింత వృద్ధి నమోదైంది.ఎస్ఐపీఆర్ఐ నివేదిక ప్రకారం.. ప్రపంచ దేశాల ఆయుధ ఎగుమతుల వాటా (2021–25)దేశంఎగుమతుల వాటా (%)యూఎస్42ఫ్రాన్స్10రష్యా7జర్మనీ6చైనా6ఇటలీ5ఇజ్రాయెల్4యూకే3దక్షిణ కొరియా3స్పెయిన్2ఇతర దేశాలు12 చైనాను వెనక్కి నెట్టిన జర్మనీ.. యూరప్ జోరుఆయుధ ఎగుమతుల్లో జర్మనీ చాలా పురోగతి సాధిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. మొత్తంగా 6% వాటాతో జర్మనీ ఇప్పుడు చైనాను అధిగమించి నాలుగో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్లో భద్రతా ఆందోళనలు పెరగడం, నాటో దేశాలు స్వదేశీ (యూరోపియన్) పరికరాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వడం జర్మనీకి కలిసొచ్చింది. మరోవైపు, చైనా తన ఎగుమతులను ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, మిడిల్ఈస్ట్ దేశాలకే పరిమితం చేస్తోంది. భౌగోళిక రాజకీయ కారణాల వల్ల పాశ్చాత్య దేశాలు చైనా ఆయుధాల పట్ల విముఖత చూపడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.దక్షిణ కొరియాప్రస్తుతం ఆయుధ మార్కెట్లో దక్షిణ కొరియా చాలా దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తంగా కేవలం 3% వాటా ఉన్నప్పటికీ అది వేగంగా వృద్ధి చెందుతోంది. ఇతర దేశాల కంటే తక్కువ సమయంలో ఆయుధాలను డెలివరీ చేయగల సామర్థ్యాన్ని ఇది సొంతం చేసుకుంటోంది. అత్యాధునిక ట్యాంకులు, ఫిరంగి వ్యవస్థలను తక్కువ ధరకు అందిస్తోంది. తూర్పు యూరప్, ఆగ్నేయాసియా దేశాలు దక్షిణ కొరియా ఆయుధాల కోసం ఆర్టర్లు పెడుతున్నాయి.ఆయుధాల ఎగుమతి కేవలం వ్యాపారం మాత్రమే కాదు, అది ఒక దేశం భౌగోళిక రాజకీయ ప్రాబల్యానికి నిదర్శనం. అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటుండగా, దక్షిణ కొరియా వంటి కొత్త శక్తులు పుట్టుకొస్తున్నాయి. శాంతి చర్చల కంటే ఆయుధ ఒప్పందాలే వేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ ‘మారణాయుధాల వ్యాపారం’ ప్రపంచాన్ని ఏ తీరాలకు చేరుస్తుందో చూడాలి.ఇదీ చదవండి: ఏఐ వైద్యం.. జాగ్రత్త సుమీ! -
చిన్న చిట్కాలతో ప్రయోజనాలెన్నో!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత ప్రభావం దేశీయంగా ఎల్పీజీ సరఫరాపై పడుతోంది. దాంతో పలు ప్రాంతాల్లో సిలిండర్ల కొరత తలెత్తుతోంది. ఈ తరుణంలో సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే గ్యాస్ పొదుపు ఒక్కటే మార్గమని కొందరు చెబుతున్నారు.వంట పద్ధతుల్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా 25 శాతం వరకు గ్యాస్ ఆదా చేయవచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు సూచిస్తున్నాయి. నిపుణులు చెబుతున్న స్మార్ట్ చిట్కాలు కింద చూద్దాం.మంటను తగ్గించండి..చాలామంది నీళ్లు మరిగే వరకు లేదా వంట పూర్తయ్యే వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోనే ఉంచుతారు. కానీ, నీరు ఒకసారి మరిగిన తర్వాత వేడిని తగ్గించడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పు ఉండదు. దాంతో గ్యాస్ వృధా కాదు. ఇలా సిమ్లో వండటం వల్ల 25 శాతం వరకు గ్యాస్ ఆదా అవుతుందని ఇండియన్ ఆయిల్ తన అధికారిక సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది.ప్రెజర్ కుక్కర్..సాంప్రదాయ పాత్రలతో పోలిస్తే ప్రెజర్ కుక్కర్ వాడకం వల్ల చాలా సమయం, గ్యాస్ కలిసొస్తుంది. బియ్యంతో అన్నం వండేప్పుడు 20% ఆదా, పప్పు ధాన్యాలు.. 46% ఆదా, మాంసాహారం.. 41.5% ఆదా అవుతుంది.నానబెట్టడం మర్చిపోవద్దుపప్పులు, బియ్యం లేదా శనగలు వంటి గట్టి పదార్థాలను వండే ముందు కనీసం గంట సేపు నానబెట్టాలి. ఉదాహరణకు, శనగలను రాత్రిపూట నానబెట్టడం వల్ల వండేటప్పుడు 22 శాతం గ్యాస్ వినియోగం తగ్గుతుంది.మీ గ్యాస్ బర్నర్ మంట నీలి రంగులో ఉంటే అది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు లెక్క. ఒకవేళ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తుంటే బర్నర్ రంధ్రాల్లో చెత్త లేదా కార్బన్ పేరుకుపోయిందని అర్థం. వెంటనే వాటిని శుభ్రం చేయాలి.పాత్రలను కడిగిన వెంటనే తడిగా ఉన్నప్పుడే పొయ్యి మీద పెట్టకండి. ముందుగా పొడి గుడ్డతో పాత్రలు తుడిచి ఆ తర్వాతే స్టవ్ మీద పెట్టండి. ఆ నీటిని ఆవిరి చేయడానికి కూడా గ్యాస్ వృధా అవుతుందని గుర్తుంచుకోండి.చిన్న పాత్రలకు పెద్ద బర్నర్ వాడటం వల్ల వేడి పక్కల నుంచి వృధాగా పోతుంది. చిన్న బర్నర్లను ఉపయోగించడం వల్ల పెద్ద వాటితో పోలిస్తే 6% నుంచి 10% తక్కువ గ్యాస్ ఖర్చవుతుంది.పొయ్యి వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం, మసాలాలు వెతుక్కోవడం వంటివి చేయకండి. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే స్టవ్ వెలిగిస్తే అనవసరపు వేచి చూసే సమయం తగ్గుతుంది.అంతర్జాతీయ పరిణామాలు గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతున్న తరుణంలో బుకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులను గమనిస్తూనే ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో ఇంటి బడ్జెట్ను కాపాడుకోవచ్చు.ఇదీ చదవండి: రూ.582 కోట్ల అనిల్ అంబానీ ఆస్తుల జప్తు -
ట్రంప్ కోరిక నెరవేరుతుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని సైన్యం ఇజ్రాయెల్తో కలిసి ఫిబ్రవరి 2026 చివరి వారంలో ఇరాన్పై భారీ దాడులకు దిగింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని, అది ప్రపంచ శాంతికి ముప్పు అని వైట్ హౌస్ వాదిస్తున్నప్పటికీ తెర వెనుక అసలు కథ వేరే ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అణ్వాయుధాలు ఇప్పటికే తమవద్ద ఉన్నాయని బాహాటంగా చెబుతున్న ఉత్తర కొరియా విషయంలో అమెరికా మెతక వైఖరి అవలంబిస్తూ ఇరాన్ను లక్ష్యం చేసుకోవడం వెనుక ‘చమురు రాజకీయాలు’ బలంగా పనిచేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.అణుసాకుతో చమురుపై కన్ను?ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని చెబుతోంది. అయితే, తాజాగా జరిగిన దాడుల వల్ల ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్ వంటి అణు కేంద్రాలతో పాటు ఆ దేశ నౌకాదళం, క్షిపణి వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఇరాన్ వద్ద భారీ చమురు నిల్వలు ఉన్నాయి. రోజుకు సుమారు 3.5 మిలియన్ బారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇరాన్ సొంతం.హర్మూజ్ జలసంధిప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హర్మూజ్ జలసంధిపై ఇరాన్కు పట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం సాధించడం ద్వారా అటు చైనాకు చమురు సరఫరాను అడ్డుకోవడం, ఇటు ప్రపంచ ఇంధన మార్కెట్ను నియంత్రించడం అమెరికా వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఉత్తర కొరియాకు అభయహస్తం?మరోవైపు, కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ఇప్పటికే డజన్ల కొద్దీ అణ్వాయుధాలను, ఎకాఎకి అమెరికాను చేరుకోగల ఐసీబీఎం క్షిపణులను కలిగి ఉంది. ఇటీవల జరిగిన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్లో కిమ్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటామని స్పష్టం చేశారు.కిమ్కు ఎందుకు మినహాయింపు?నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఉత్తర కొరియా దగ్గర ఎటువంటి చమురు నిల్వలు లేవు. అక్కడ యుద్ధం చేస్తే ప్రాణ, ఆస్తి నష్టం తప్ప అమెరికాకు లభించే ఆర్థిక ప్రయోజనం శూన్యం. గతంలోనూ కిమ్ను ట్రంప్ గొప్ప నాయకుడుగా అభివర్ణించారు. తాజాగా కూడా ఉత్తర కొరియా అణు హోదాను గుర్తిస్తే చర్చలకు సిద్ధమని కిమ్ సంకేతాలిచ్చారు. ఇరాన్పై కఠినంగా ఉండే ట్రంప్, ఉత్తర కొరియా విషయంలో మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.‘ప్రస్తుతం ఒక దేశం దగ్గర చమురు ఉంటే అది ఆ దేశానికి వరమో లేక అగ్రరాజ్యాల దాడులకు కారణమయ్యే శాపమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అణ్వాయుధాల కంటే చమురు నిల్వలే అమెరికా యుద్ధ ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నాయని ఇరాన్ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: డబుల్ రిలీఫ్.. పసిడి, వెండి ప్రియులకు ఊరట -
సరళీకరణ సరిహద్దు దేశాలకుకాదు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) నిబంధనల సరళీకరణ విదేశీ సంస్థలకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి శివహరి పేర్కొన్నారు. 10 శాతంలోపు చైనీస్ వాటా కలిగిన ఇతర దేశాలకు చెందిన సంస్థలు దేశీయంగా ఎంపిక చేసిన రంగాలలో పెట్టుబడులు చేపట్టేందుకు ఆటోమాటిక్ మార్గంలో అనుమతి లభిస్తుందని తెలియజేశారు. అయితే చైనా, హాంకాంగ్ లేదా ఏ ఇతర సరిహద్దు పంచుకుంటున్న దేశాని(ఎల్బీసీ)కైనా తాజా సవరణలు వర్తించవని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య శాఖ(డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ జై ప్రకాష్ శివహరి వెల్లడించారు.ఇప్పటివరకూ సరిహద్దు దేశాల వాటాదారులుగా ఉన్న విదేశీ సంస్థలు దేశీయంగా ఇన్వెస్ట్ చేయాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవలసి ఉండేదని వివరించారు. ఈ నెల 10న కేంద్ర కేబినెట్ 2020 ప్రెస్ నోట్ 3లో సవరణలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిపై శివహరి తాజా వివరణ ఇచ్చారు. వెరసి సరిహద్దు దేశాలన్నిటికీ ఎఫ్డీఐ ఆంక్షలు అమల్లో ఉన్నట్లు తెలియజేశారు. నాన్ఎల్బీసీ సంస్థలు 10 శాతంలోపు ఎల్బీసీ వాటాదారులుగా ఉన్నప్పుడు కొన్ని రంగాలలో ప్రత్యక్ష పెట్టుబడులకు తాజా సవరణల ద్వారా ఆటోమాటిక్ అనుమతి లభిస్తుందని వివరించారు. -
చమురు, గ్యాస్.. తర్వాత దీని వంతే!
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య గత 12 రోజులుగా సాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ యుద్ధ తంత్రాన్నే మార్చేశాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న అసమాన దాడులు భారత్ వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ప్రమాదంగా మారుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు చాలామంది చమురు, గ్యాస్ ధరల గురించే చర్చిస్తున్నారు, కానీ నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న ‘ఎరువుల సెగ’ భారత ఆహార భద్రతను, 147 కోట్ల మంది జీవనోపాధిని ప్రశ్నార్థకం చేయనుందనే సంగతి విస్మరిస్తున్నారు.భారత వ్యవసాయానికి కీలకంగా హార్ముజ్ జలసంధి..భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎంతగా గల్ఫ్ దేశాలపై ఆధారపడుతుందో, ఎరువుల కోసం కూడా అంతే స్థాయిలో ఆధారపడి ఉంది. ఇరాన్ వైఖరి కారణంగా హార్ముజ్ జలసంధిపై ఏర్పడిన ప్రతిష్టంభన భారత్కు సవాలుగా మారింది.లెక్కలివే..భారత్ దిగుమతి చేసుకునే నత్రజని సంబంధిత ఎరువుల్లో (యూరియా, అమ్మోనియా) 63 శాతం, డీఏపీలో 32 శాతం కేవలం గల్ఫ్ దేశాల (యూఏఈ, ఖతార్, సౌదీ, ఒమన్) నుంచే వస్తాయి. దేశానికి కావాల్సిన పొటాష్ దిగుమతుల్లో 42 శాతం వాటా ఒక్క సౌదీ అరేబియాదే. ఇరాన్ నుంచి నేరుగా కొనుగోళ్లు తక్కువగా ఉన్నప్పటికీ (కేవలం 2.59 మిలియన్ డాలర్లు) ఇతర గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నౌకలు హార్ముజ్ జలసంధి గుండానే ప్రయాణించాలి. యుద్ధం వల్ల బీమా ప్రీమియంలు పెరగడం, నౌకల రాకపోకలు నిలిచిపోవడం రైతన్నపై భారాన్ని పెంచుతున్నాయి.ఆహార భద్రతపై ప్రభావంభారతదేశంలో ఖరీఫ్, రబీ సీజన్లు వ్యవసాయానికి కీలకం. జూన్/ జులైలో విత్తనాలు వేసే సమయానికి ఎరువుల కొరత ఏర్పడితే అది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి ఎరువుల దిగుమతి బిల్లు 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.5 లక్షల కోట్లు) రికార్డు స్థాయికి చేరుతుందని అంచనా. ఇందులో యూరియా వాటానే 61 శాతంగా ఉండనుంది.అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీ భారం భారీగా పెరగనుంది.‘మేక్ ఇన్ ఇండియా’కు సహజ వాయువు సెగఎరువుల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలని, యూరియా దిగుమతులను నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (38 మిలియన్ టన్నుల లక్ష్యం). అయితే, యూరియా తయారీకి ప్రధాన ముడిసరుకు అయిన సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరా ఇప్పుడు భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. గత వారం రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఖతార్, యూఏఈల నుంచి సరఫరా తగ్గడంతో భారత అగ్రశ్రేణి గ్యాస్ దిగుమతిదారు ‘పెట్రోనెట్’ మార్కెటింగ్ కంపెనీలకు 30 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశీయ ఎరువుల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది.ప్రత్యామ్నాయ మార్గాలురష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత సరఫరా గొలుసులో మార్పులు వచ్చాయి. ఇప్పుడు మిడిల్ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంది. ఎరువుల దిగుమతికి సంబంధించి చైనాపై ఆధారపడటం తగ్గించాలని భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, చైనాలే ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలుగా తోస్తున్నాయి. ఇవి హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా సరఫరా చేయగలవు. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా వంటి దేశాల నుంచి దిగుమతులు పెంచుకోవాలి (ప్రస్తుతం వీటి వాటా 5% కంటే తక్కువ).ప్రభుత్వ ధీమాపరిస్థితి తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ఎరువుల శాఖ మార్చి 6న ఒక ప్రకటన విడుదల చేస్తూ.. దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గానే ఉన్నాయని స్పష్టం చేసింది. రైతుల్లో అసంతృప్తి కలగకుండా ప్రభుత్వం ఎంతటి ప్రీమియం చెల్లించైనా ఎరువుల సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముడి చమురు కోసం రష్యా వైపు మొగ్గు చూపినట్లుగానే ఎరువుల భద్రత కోసం భారత్ త్వరలో మరిన్ని కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు! -
వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోంది. దీనివల్ల ఇన్నాళ్లూ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం వేచి చూసిన సామాన్యులకు, పెట్టుబడిదారులకు కేంద్ర బ్యాంకులు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం పక్కన పెట్టి ఈ ఏడాది చివరి నాటికి మరింత పెంచే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.అంచనాలు తలకిందులుఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది ఒకటి లేదా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రేట్ల తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రేట్ల కోత ఉంటుందని ఊహించిన మార్కెట్ వర్గాలకు ఇది పెద్ద మలుపు.గత తప్పిదాల నుంచి పాఠాలు2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకులు ఆలస్యంగా స్పందించాయనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమని, అధిక ధరల వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని బ్యాంకర్లు భావిస్తారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆలస్యం చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్ బ్యాంకులు భావిస్తున్నాయి.బ్రిటన్లో సంక్లిష్ట పరిస్థితియూకేలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 3% వద్ద ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) లక్ష్యం (2%) కంటే ఎక్కువ. యుగోవ్/ సిటీగ్రూప్ సర్వే ప్రకారం, ఇరాన్ యుద్ధానికి ముందే వినియోగదారుల ధరల పెరుగుదల 3.3%గా ఉంది. దీంతో బీఓఈ తన అంచనాలు మారుస్తోంది.ఇదీ చదవండి: చికెన్, పిజ్జా, బర్గర్.. కంపెనీలకు కష్టాలు -
ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.హోటల్ పరిశ్రమలోనూ ఆందోళనహాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.25 రోజుల వెయిటింగ్ పీరియడ్మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు?
రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల లేవనెత్తిన అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్న పన్నులు, విమానాశ్రయాల్లో ఆహార ధరలు, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనంపై ఆయన సంధించిన ప్రశ్నలు ఆలోచింపజేశాయి. ఈ నేపథ్యంలో ఆయన అడిగిన ప్రశ్నలు, వాటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయో కింద తెలియజేస్తున్నాం.పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తూ వార్తల్లో నిలిచారు. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా తనకున్న ఆర్థిక అవగాహనతో బడ్జెట్ లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, రోజువారీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారికంగా కేంద్రం నుంచి సమాధానాలు రాబట్టారు.పన్నుల భారంతో మధ్యతరగతి విలవిలబడ్జెట్ 2026-27పై జరిగిన చర్చలో రాఘవ్ చద్దా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘రికార్డు స్థాయిలో పన్ను వసూళ్లు జరుగుతున్నా, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఎందుకు లేదు? జీతాలు పెరగకపోయినా ద్రవ్యోల్బణం (సుమారు 6.8%) కారణంగా కొనుగోలు శక్తి పడిపోతోంది. కనీసం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) పన్నును ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.ప్రభుత్వ స్పందన: ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. దేశ మౌలిక సదుపాయాల కల్పన (క్యాపెక్స్) కోసం నిధుల సేకరణ అవసరమని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నామని పేర్కొంది. అయితే నేరుగా ఆదాయపు పన్ను తగ్గింపుపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు.రైట్ టు రీకాల్.. ఓటర్లకే ఆ అధికారం ఇవ్వాలి!ఇటీవల రాఘవ్ చద్దా రాజ్యసభలో లేవనెత్తిన ‘రైట్ టు రీకాల్’ (ఎన్నికైన ప్రతినిధులు పనితీరు నచ్చకపోతే అధికారం తొలగించే హక్కు) అంశం సభ్యుల మధ్య తీవ్ర చర్చకు దారితీసింది. ‘ఎన్నికైన ప్రతినిధుల ఐదేళ్ల కాలపరిమితి ముగిసే వరకు వేచి చూడకుండా, పనితీరు సరిగ్గా లేని అభ్యర్థులను ఓటర్లే తొలగించేలా చట్టం తీసుకురావాలి’ అని చద్దా కోరారు. ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో ఈ విధానం ఉందని గుర్తుచేశారు.ప్రభుత్వ స్పందన: ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ విధివిధానాల ప్రకారం దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలులో ఉందని తెలిపింది. ఇటువంటి మార్పులు రాజకీయ అస్థిరతకు దారితీసే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది.విమానాశ్రయాల్లో ఆహార ధరలు..విమానాశ్రయాల్లో కనీస ఆహార ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సభలో తెలిపారు. సాధారణంగా లీటర్ వాటర్ బాటిల్ రూ.20 ఉంటే.. ఎయిర్పోర్ట్ల్లో మాత్రం ఇది సుమారు రూ.100గా ఉంటుంది. ఇదే కాకుండా వివిధ ఆహార పదార్థాల ధరలు ఎయిర్పోర్ట్ల్లో అధిక ధరలుంటాయి. ఈ నేపథ్యంలో ‘విమానాశ్రయాల్లో సామాన్య ప్రయాణికులకు తక్కువ ధరలో స్నాక్స్, పానీయాలు లభించే ఉడాన్ యాత్రి కేఫ్ల సంఖ్యను పెంచాలి. వాటిని సెక్యూరిటీ చెక్ దాటిన తర్వాత కూడా అందుబాటులో ఉంచాలి’ అని కోరారు.ప్రభుత్వ స్పందన: పౌర విమానయాన శాఖ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తామని, ప్రయాణికుల సౌకర్యార్థం విమానాశ్రయాల్లో సరసమైన ధరలకు ఆహారం అందించే అవుట్లెట్లను పెంచే దిశగా చర్యలు చేపడతామని తెలిపింది.సిమ్ కార్డులు - ఇన్కమింగ్ కాల్స్..రాఘవ్ చద్దా రాజ్యసభలో టెలికాం కంపెనీల దోపిడీని ఎండగట్టారు. ‘ప్రస్తుతం దేశంలోని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అవుట్గోయింగ్ మాత్రమే కాకుండా, ఇన్కమింగ్ కాల్స్ కూడా నిలిపివేస్తున్నాయి. దీనివల్ల సామాన్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. వారి వద్ద రీఛార్జ్ చేసుకునే డబ్బు లేకపోయినా తమకు వచ్చే ఫోన్ కాల్స్ కూడా అందుకోలేకపోతున్నారు. ఇది ఒక రకమైన దోపిడీ కాదా?’ అని ప్రశ్నించారు.బ్యాంకింగ్, రేషన్, ప్రభుత్వ పథకాలు.. ఓటీపీ ద్వారా ఫోన్ నంబర్కే లింక్ అయి ఉన్న తరుణంలో ఇన్కమింగ్ ఆపేయడం వల్ల సామాన్యులు ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం, ట్రాయ్ స్పందన: డేటా (ఇంటర్నెట్) అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉండే చౌకైన ప్లాన్లను తీసుకురావాలని కంపెనీలను ఆదేశించింది. గతంలో ఉన్న 90 రోజుల పరిమితిని సడలించి వినియోగదారులు ఏకకాలంలో 365 రోజుల (ఒక ఏడాది) వరకు వాలిడిటీని పొందేలా స్పెషల్ టారిఫ్ వోచర్స్ తీసుకురావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.రాఘవ్ చద్దా లేవనెత్తిన ప్రశ్నలు కేవలం రాజకీయ కోణం నుంచి కాకుండా సామాన్యుడి ఆర్థిక, సామాజిక ప్రయోజనాల చుట్టూ ఉండడం విశేషం. ముఖ్యంగా పన్నుల సంస్కరణలు, వర్కర్ల రక్షణపై ఆయన అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం రాతపూర్వక సమాధానాలు భవిష్యత్తు విధాన నిర్ణయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కొనుగోలుదారులను ఆడేసుకుంటున్న బంగారం.. -
8వ పే కమీషన్: జీతం మాత్రమే కాదు..
ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో.. 8వ పే కమీషన్ అనేది ప్రతిసారీ ఒక కీలక పరిణామాన్ని సూచిస్తుంది. ఇది కేవలం జీతం పెంపు మాత్రమే కాదు, ఉద్యోగ జీవన విధానాన్ని, ప్రమోషన్స్, పెన్షన్లను కూడా ప్రభావితం చేసే నిర్ణయం అవుతుంది. ప్రతి కొత్త పే కమీషన్ ప్రవేశపెట్టబడినప్పుడు, ఉద్యోగులు & పింఛన్ గ్రహీతల ఆకాంక్షలు పెరుగుతాయి.ఈసారి కూడా 8వ పే కమీషన్ పరిణామాలపై ఉద్యోగులలో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడినట్లు తెలుస్తోంది. జీతం, ప్రమోషన్లు, పెన్షన్లపై ముఖ్యమైన మార్పులు రావచ్చని ఊహలు వినిపిస్తున్నాయి.ఇటీవలి ఒక ముఖ్యమైన సమావేశంలో.. ఉద్యోగ సంస్థలు స్పష్టం చేసిన విధంగా, ఈసారి జీతమే కాకుండా ఉద్యోగుల కెరీర్ వృద్ధి కూడా అత్యంత ప్రాముఖ్యం కలిగిందని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులు అనేక సంవత్సరాలు ఒకే పదవిలో కొనసాగుతుండటం, వారి మానసిక శక్తిని తగ్గిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, కనీసం ఐదు ప్రమోషన్లను నిర్ధారించాలన్న డిమాండ్ ఉంది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగుల కెరీర్లో కొత్త ఉత్సాహాన్ని పుంజగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.సమావేశంలో.. ప్రమోషన్లతో పాటు, కనీస మూల జీతం, వార్షిక జీతం పెంపు వంటి అంశాలపై కూడా చర్చ జరిగింది. ఉద్యోగ సంస్థలు అభిప్రాయపడుతున్న విధంగా, పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో, జీతం నిర్మాణం సౌకర్యవంతంగా ఉండే విధంగా సర్దుబాటు చేయడం అవసరం.పే కమీషన్ ప్రభావం కేవలం సర్వీసులో ఉన్న ఉద్యోగులకే పరిమితం కాదు. పింఛన్ గ్రహీతల పైన కూడా ప్రభావం ఉంటుంది. కొత్త సిఫార్సులు జీతాలు & భత్యాలను మెరుగుపరిస్తే, పింఛన్ కూడా పెరుగుతుంది. అందువల్ల, రిటైర్డ్ ఉద్యోగులు కూడా దీనిని శ్రద్దగా గమనిస్తారు.ఉద్యోగ సంస్థలు త్వరలో తమ డిమాండ్లను ఒక ప్రపోజల్ రూపంలో కమీషన్కు సమర్పించనున్నారు. ఆ ప్రపోజల్ ఆధారంగా మరింత చర్చలు జరగటం, ఆఖరికి తుది సిఫార్సులు రూపొందించబడటం జరుగుతుంది. ఆ తర్వాతే ఉద్యోగులు & పింఛన్ గ్రహీతలు ఎంత లాభం పొందతారో స్పష్టత ఏర్పడుతుంది. -
జీడీపీకి చిల్లు.. నెలకు 8 బిలియన్ డాలర్లు!
అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదలతో ఇంధనాల కొనుగోలు కోసం భారత్ ప్రతి నెలా 7–8 బిలియన్ డాలర్ల మేర అదనంగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి రానుందని విశ్లేషకులు తెలిపారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు 66 డాలర్లుగా ఉన్న ధర దాదాపు 120 బిలియన్ డాలర్లకు ఎగిసిందని, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) రేట్లు దాదాపు రెట్టింపై యూనిట్కి (ఎంబీటీయూ) 24–25 డాలర్లకు చేరాయని పేర్కొన్నారు. ఇలా ఇంధనాల రేట్లు ఎగియడం వల్ల రవాణా, తయారీ, ఆహారోత్పత్తులు, కమోడిటీల ధరలన్నీ పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేఠి చెప్పారు.భారీ రేట్లు కొనసాగే వ్యవధి, డిమాండ్, పాలసీపరమైన చర్యలను బట్టి ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ఇక క్రూడ్ రేటు సగటున 10 డాలర్లు పెరిగితే కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) 30–40 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ చెప్పారు. ముడిచమురు ధర సగటున 100–105 డాలర్లుగా ఉంటే జీడీపీలో క్యాడ్ 1.9–2.2 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.క్రూడాయిల్ ధరలు 10 శాతం పెరిగితే టోకు ద్రవ్యోల్బణం 80–100 బేసిస్ పాయింట్లు, వినియోగదారుల ద్రవ్యోల్బణం 40–60 బేసిస్ పాయింట్లు పెరగొచ్చని ఇక్రా అంచనా వేసింది. దేశీయ అవసరాలకు సంబంధించి భారత్ 85 శాతం క్రూడాయిల్ను దిగుమతి చేసుకొంటుండగా, ప్రతి రోజూ 50 లక్షల బ్యారెళ్ల ఆయిల్ వినియోగం ఉంటోంది.ఐఈఏకి ఇండియా నో..ఆయిల్ ధరలకి కళ్లెం వేసేందుకు వివిధ దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేసేలా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) చేపట్టిన కార్యక్రమంలో భారత్ భాగం కాబోదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంక్షోభాన్ని సృష్టించిన వారిపైనే, పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా ఉందనేది ప్రభుత్వ అభిప్రాయమని పేర్కొన్నాయి.దేశీయంగా 5.33 మిలియన్ టన్నుల ఆయిల్ని నిల్వ చేశారు. సరఫరాపరమైన సవాళ్లు తలెత్తితే, వాటిని ముందుగా దేశీయంగా ప్రజల అవసరాల కోసమే వినియోగించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 2021లో అమెరికా సారథ్యంలో ఇలాంటి కార్యక్రమమే చేపట్టినప్పుడు భారత్ 5 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ను విడుదల చేసింది. -
గ్యాస్ కష్టాలు.. మూతపడుతున్న రెస్టారెంట్లు!
అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయం కారణంగా దేశీయంగా వాణిజ్య ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఫలితంగా ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే ముంబయిలో 20 శాతం హోటళ్లు మూసివేశారు. పరిస్థితి చక్కబడకపోతే మరికొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని హోటళ్లు స్తంభించే ప్రమాదం ఉంది.నగరాల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితిదేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఏహెచ్ఏఆర్) అధ్యక్షుడు విజయ్ శెట్టి తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే నగరంలోని 20% హోటళ్లు మూతపడ్డాయి. మరో రెండు రోజుల్లో సరఫరా పునరుద్ధరించకపోతే కనీసం 50% రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేయక తప్పదని హెచ్చరించారు. ప్రస్తుతం ఒక కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,950 పలుకుతుండటం అదనపు భారంగా మారింది.సిలిండర్ల సరఫరా నిలిచిపోతుందనే పుకార్ల మధ్య బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ స్పందించింది. ప్రస్తుతానికి రెస్టారెంట్లు తెరిచే ఉంటాయని, అయితే అనిశ్చితిని తట్టుకోవడానికి పనివేళలు తగ్గించాలని, మెనూలో వంటకాలను పరిమితం చేయాలని సూచించింది.హైదరాబాద్లో గ్యాస్ పంపిణీదారులు ఉన్నస్టాక్ను రేషనింగ్ పద్ధతిలో విడుదల చేస్తున్నారు. ఇక పంజాబ్లో ఎల్పీజీ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల సరఫరాను దాదాపు నిలిపివేశాయి. జైపూర్లో వెడ్డింగ్ క్యాటరింగ్ సేవలకు కనీసం 7 రోజుల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.అసలు కారణం ఏమిటి?భారతదేశం ఏటా 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుండగా అందులో 62 శాతం దిగుమతుల ద్వారానే వస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడటంతో సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి రావాల్సిన 85-90 శాతం దిగుమతులు నిలిచిపోయాయి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న పరిమిత స్టాక్ను గృహ వినియోగానికి, ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మళ్లిస్తుండటంతో వాణిజ్య రంగం తీవ్రంగా నష్టపోతోంది.రంగంలోకి చమురు మంత్రిత్వ శాఖవాణిజ్య ఎల్పీజీ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఓఎంసీల ద్వారా సరఫరా పునరుద్ధరణను పర్యవేక్షించనుంది.ఆతిథ్య రంగం కేవలం ఆహార అవసరాలనే కాక లక్షలాది మందికి ఉపాధిని కూడా కల్పిస్తోంది. గ్యాస్ సరఫరాలో జాప్యం జరిగితే అది ఆహార ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతులను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు -
బంగ్లాదేశ్కు భారత్ ఆపన్నహస్తం
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు దక్షిణ ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్ తన అవసరాల కోసం ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు చూస్తోంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో తలెత్తిన కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి అత్యవసరంగా డీజిల్ దిగుమతులను వేగవంతం చేసింది.బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) ఛైర్మన్ ముహమ్మద్ రెజానుర్ రెహ్మాన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా 5,000 టన్నుల డీజిల్ సరుకు బంగ్లాదేశ్కు చేరుతోంది. భారత్ నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్ను పైప్లైన్ ద్వారా దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు నెలల్లో కనీసం 90 వేల టన్నుల డీజిల్ను దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుతున్న 5,000 టన్నులతో పాటు రాబోయే రెండు నెలల్లో ఆరు నెలలకు సరిపడా కోటాను పూర్తిగా భారత్ నుంచి దిగుమతి చేస్తామని రెహమాన్ తెలిపారు.మూతపడుతున్న యూనివర్సిటీలుబంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఇంధన పరిమితులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేసింది. ల్యాబ్లు, ఏసీలు, హాళ్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండటమే దీనికి కారణం. ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేయకుండా ఉండేందుకు రోజువారీ విక్రయాలపై పరిమితులు విధించారు. స్పాట్ మార్కెట్ నుంచి అత్యధిక ధరలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) కొనుగోలు చేస్తోంది.భారత్ పాత్ర కీలకంఅంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండుతున్న వేళ పొరుగు దేశానికి భారత్ అందిస్తున్న ఈ సహకారం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘వినియోగాన్ని తగ్గించడానికి, ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మరింత కాలం కొనసాగితే బంగ్లాదేశ్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారత్ వంటి దేశాలు భరోసాగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు -
ఏడాది కాలంలోనే సీన్ రివర్స్!
అమెరికా రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న భారత సంతతి ప్రజలు (ఇండో అమెరికన్లు) డొనాల్డ్ ట్రంప్ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారా? భారత్తో సంబంధాలను నెరపడంలో ట్రంప్ కంటే అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాలు మెరుగని భావిస్తున్నారా? అంటే అవుననే అంటోంది ప్రతిష్టాత్మక ‘కార్నెగీ ఎండోమెంట్’ సర్వే. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే ఇండో-అమెరికన్లలో ఆయనపై వ్యతిరేకత పెరగడం చర్చనీయాంశమైంది.సర్వే ఏం చెబుతోంది?‘ఇండియన్–అమెరికన్ యాటిట్యూడ్ సర్వే’ పేరుతో ‘కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్’ చేసిన ఈ సర్వేలో ఫలితాల ప్రకారం.. దాదాపు 71 శాతం మంది భారత సంతతి ప్రజలు ట్రంప్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్తో సంబంధాల విషయంలోనూ 55 శాతం మంది ఆయన తీరును తప్పుబడుతున్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే ట్రంప్ విదేశాంగ విధానాన్ని సమర్థిస్తుండటం గమనార్హం.బైడెన్ ఎందుకు మెరుగనిపిస్తున్నారు?జో బైడెన్ తన పదవీ కాలంలో భారత్తో సంబంధాలను కేవలం వ్యాపార కోణంలో కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యంగా చూశారని మెజారిటీ ఇండో-అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ (ఐ-సీఈటీ) ద్వారా రక్షణ, అంతరిక్ష రంగాల్లో భారత్కు బైడెన్ అండగా నిలిచారు. బైడెన్ హయాంలో వీసా విధానాలు (హెచ్1బీ), కమలాహారిస్ వంటి వారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టడం ద్వారా భారత సంతతికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు.ట్రంప్ 2.0.. పెరిగిన ఆందోళనలుట్రంప్ మొదటి హయాంతో పోలిస్తే ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండో-అమెరికన్లలో అసహనాన్ని పెంచుతున్నాయి.భారతీయ ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుపై భారత్ను హెచ్చరించడం వంటి అంశాలు కేవలం ఇచ్చిపుచ్చుకోవడమనే ధోరణిని ప్రతిబింబిస్తున్నాయి.‘అమెరికా ఫస్ట్’ నినాదంతో ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం భారతీయ టెక్కీలను ఆందోళనకు గురిచేస్తోంది.ట్రంప్ హయాంలో ఆన్లైన్ విద్వేషం, వర్ణ వివక్ష పెరిగిందని సగం మందికి పైగా భారత సంతతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు -
‘ఆమె’తోనే వికసిత్ భారత్ సాధ్యం
వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమని యాక్సిస్ బ్యాంక్ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా చెల్లింపు పనుల్లో కార్మికుల భాగస్వామ్యం ప్రస్తుతమున్న 47 శాతం నుంచి 60 శాతానికి పెరగాలని సూచిస్తూ, ఈ విషయంలో మహిళల పాత్ర ఎంతో అవసరమని సూచించింది. జీ–20 దేశాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు భారత్లోనే చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. అందులోనూ వ్యవసాయం, స్వయం ఉపాధి లేదా చెల్లింపుల్లేని పనుల్లోనే మహిళలు ఎక్కువగా భాగస్వాములై ఉన్నట్టు తెలిపింది.దేశవ్యాప్తంగా 42 పట్టణాల్లో కాలేజీ విద్య అర్హత కలిగిన 11,000 మందిని సర్వే చేసి ఈ వివరాలను యాక్సిస్ బ్యాంక్ విడుదల చేసింది. చదువుకున్న 12.5 కోట్ల మంది మహిళలు ఉద్యోగాలకు దూరంగా ఉన్నారని, 60 శాతం పట్టభద్రులు పారితోíÙకంతో కూడిన పనుల్లో పాలు పంచుకోవడం లేదని ఈ అధ్యయన నివేదిక తెలిపింది. భద్రతా సవాళ్లు..ఉద్యోగాలకు వెళ్లకపోవడానికి భద్రత, రవాణా పరమైన సవాళ్లను మహిళలు ప్రధానంగా ప్రస్తావించారు. ‘‘వచ్చే 25 ఏళ్ల పాటు జీడీపీ వృద్ధి రేటును 7 శాతం స్థాయిలో కొనసాగేందుకు వీలుగా పారితోíÙకం ఇచ్చే పనుల్లో కారి్మకుల భాగస్వామ్యం తప్పనిసరిగా 47 శాతం నుంచి 60 శాతానికి పెరగాల్సిందే. ఇందుకు గాను మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం’’అని ఈ నివేదిక వెల్లడించింది. వచ్చే దశాబ్దంలో వృద్ధి అన్నది మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరే విధంగా కెరీర్లను తీర్చిదిద్దే సంస్థలకే చెందుతుందని యాక్సిస్ బ్యాంక్ మానవ వనరుల విభాగం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ రాజ్కమల్ వెంపటి పేర్కొన్నారు. 22 శాతం మహిళా కారి్మకుల భాగస్వామ్యం అన్నది సామాజిక లక్ష్యమే కాదని, అత్యంత కీలకమైన ఆర్థిక చోదకమన్నారు.వివాహం, తల్లికావడం వల్ల మహిళలు కెరీర్ అవకాశాలను కోల్పోతున్నారని, ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది. కనుక ఈ సమస్యలకు పరిష్కారంగా ఉద్యోగాలను రూపొందించాలని సూచించింది. పిల్లల సంరక్షణ విషయంలో మద్దతునిస్తూ, తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు వీలుగా వారిని ప్రోత్సహించాలని అభిప్రాయపడింది. ‘‘ఉద్యోగాలకు డిమాండ్ను పెంచాలి. పట్టణ మౌలిక వసతులను మెరుగుపరచాలి. కాలం చెల్లిన చట్టపరమైన అవరోధాలను తొలగించాలి. పిల్లల సంరక్షణ వసతులు, పని ప్రదేశాల్లో సౌకర్యాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే మహిళల భాగస్వామ్యాన్ని పెంచగలం’’అని యాక్సిస్ బ్యాంక్ ముఖ్య ఆర్థికేవత్త నీలకాంత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. మహిళలు మరింతగా పనిచేయగలిగిన రంగాల్లో వారికి అవకాశాలు పెంచాలని, పార్ట్టైమ్ అవకాశాలు కలి్పంచాలని ఈ నివేదిక సూచించింది.ఇదీ చదవండి: బెంగళూరులో హోటళ్లు బంద్!? -
రూపాయి రికార్డు కనిష్టం 39 పైసలు తగ్గి 92.21కు
చమురు ధరల పెరుగుదలతో దిగుమతుల బిల్లు పెరగనుంది. ఇందుకు డాలర్లలో చెల్లింపుల కారణంగా రూపాయి విలువకు చిల్లు పడింది. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ 39 పైసలు క్షీణించి సరికొత్త కనిష్టం 92.21 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో యుద్ధ భయాలు, ప్రధాన కరెన్సీలతో మారకంలో పుంజుకున్న డాలరు దేశీయంగా రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. రూపాయి ఒక దశలో 92.35కు చేరింది. ఇది ఇంట్రాడేలో రికార్డ్ కనిష్టం. కాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.3% బలపడి 99.27కు చేరింది. -
పీపా 100 డాలర్ల పైకి..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ ముడిచమురు రేట్లు మరింతగా మండుతున్నాయి. అంతర్జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లో 2022 తర్వాత తొలిసారిగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 100 డాలర్ల పైకి ఎగసింది. నైమెక్స్ క్రూడ్ (డబ్ల్యూటీఐ) ఏప్రిల్ డెలివరీ ధర ఒక దశలో 31.44 శాతం పెరిగి 120 డాలర్లకు దాదాపు దగ్గరగా 119.48 డాలర్లను తాకింది. అటు బ్రెంట్ క్రూడ్ కూడా 28.82 శాతం పెరిగి 119.46 డాలర్లకు ఎగిసింది. హర్ముజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు తగ్గిపోవడం, ప్రాంతీయంగా పలు దేశాలు ఉత్పత్తిని తగ్గించడంతో విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయని ఇండస్ఇండ్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ జిగర్ త్రివేది తెలిపారు.ఉద్రిక్తతల కారణంగా కీలక షిప్పింగ్ మార్గంలో నౌకలను ఇరాన్ టార్గెట్ చేసుకుంటూ ఉండటంతో గ్లోబల్గా దాదాపు అయిదో వంతు ముడిచమురు, సహజ వాయువు సరఫరా నిలి్చపోయినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా పరిస్థితులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. ‘హర్ముజ్ జలసంధిలో రాకపోకలకు అంతరాయం కలిగించడం తొలి దశ. ప్రస్తుతం అదే జరుగుతోంది. రెండో దశలో మరింత తీవ్రమైన రిసు్కలు ఉండొచ్చు. ప్రాంతీయంగా ఆయిల్, గ్యాస్ మౌలిక సదుపాయాలపై నేరుగా దాడులు చేయొచ్చు. మూడో దశలో కీలకమైన నీటి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ఉండొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ఎంసీఎక్స్లో భగ్గు.. అంతర్జాతీయ పరిణామాలతో దేశీ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజీలో కూడా ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. మార్చి డెలివరీ కాంట్రాక్టు ఎకాయెకిన 26 శాతం ఎగిసి (రూ. 2,186) జీవితకాల గరిష్ట స్థాయి రూ. 10,549ని తాకింది. మార్చి కాంట్రాక్టు అప్పర్ సర్క్యూట్ తాకిందని, ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే సెషన్లలో రూ. 11,300కి కూడా పెరిగే అవకాశం ఉందని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అండ్ కరెన్సీ అనలిస్ట్ ఆమిర్ మక్డా చెప్పారు.బ్యారెల్ ధర ఒక డాలరు పెరిగేతే ఏటా భారత్పై 1.8 బిలియన్ డాలర్ల భారం యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ నీలకంఠ మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయిల్ రేటు 50 డాలర్లు పెరిగి, ఏడాది పాటు కొనసాగితే 90 బిలియన్ డాలర్ల ప్రభావం ఉంటుందని, ఇది స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతమని మిశ్రా పేర్కొన్నారు.సంక్షోభాలు.. యుద్ధాలతో ఆజ్యం..సుమారు దశాబ్దంన్నర కాలంగా వివిధ సంక్షోభాలు, యుద్ధాలతో ముడిచమురు మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో కమోడిటీల బూమ్ ఏర్పడింది. ఆయిల్ ధరలు ఆ ఏడాది జూలై 11న ఆల్టైం గరిష్టస్థాయి 147.50కి ఎగిశాయి. ఆ తర్వాత 2011లో పశి్చమాసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు తిరుగుబాట్లతో దద్దరిల్లినప్పుడు 127 డాలర్ల స్థాయిని చూశాయి.అమెరికన్ షేల్ ఆయిల్, గ్యాస్ మార్కెట్లను ముంచెత్తడంతో 2015 తొలినాళ్లలో 50 డాలర్లకు పడిపోయాయి. ఆ తర్వాత 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో ఇంధనానికి డిమాండ్ పడిపోయి, చమురు ఉత్పత్తి దేశాలు నిల్వలను వదిలించుకునే ప్రయత్నాలు చేసినప్పుడు బ్రెంట్ క్రూడ్ రికార్డు కనిష్టం 15.98 డాలర్లకు కూడా పతనమైంది. నైమెక్స్ ఫ్యూచర్స్ మైనస్ 40.32 డాలర్లను తాకింది. మళ్లీ 2022 రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో ఆయిల్ రేట్లకు రెక్కలొచ్చాయి. 2022 తొలినాళ్లలో 139 డాలర్లకు ఎగబాకాయి. -
బెంగళూరులో హోటళ్లు బంద్!?
వంటగ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం బెంగళూరు నగరంలోని హోటళ్లను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా ‘బెంగళూరు హోటల్స్ అసోసియేషన్’ సోమవారం కీలక ప్రకటన చేసింది. నగరంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోతుండడంతో మంగళవారం బెంగళూరులోని హోటళ్లు మూతపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో రోజువారీ ఆహారం కోసం హోటళ్లపై ఆధారపడే వేలాది మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు, సీనియర్ సిటిజన్లు, వైద్య సిబ్బందిపై తీవ్ర ప్రభావం పడనుంది.గతంలో చమురు కంపెనీలు కనీసం 50 రోజుల పాటు గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చాయని, కానీ ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపివేయడం పరిశ్రమను కోలుకోలేని దెబ్బ తీసిందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర మంత్రులు వెంటనే జోక్యం చేసుకుని, సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల ప్రభావంఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మిడిల్ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఎల్పీజీ సరఫరా గొలుసును దెబ్బతీసింది. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రిఫైనరీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గృహ వినియోగ ఎల్పీజీ సరఫరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కలగకుండా చూడాలని, ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం తెలిపింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు భారత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, నార్వే, యూఏఈ వంటి దేశాల నుంచి ఎల్పీజీని దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.Bengaluru Hotels to Shut Down From Tomorrow Amid Sudden Commercial Gas Supply CrisisBengaluruIn a major blow to the city’s food industry and daily commuters, the Bangalore #Hotels Association has announced a city-wide shutdown of hotels starting tomorrow. The decision comes… pic.twitter.com/h48xEbBHjh— Yasir Mushtaq (@path2shah) March 9, 2026పెరిగిన ధరల భారంమరోవైపు, సామాన్యుడిపై ధరల భారం మరింత పెరిగింది. శనివారం గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. సౌదీ అరేబియా ముడి చమురు ధరల కారణంగా వాణిజ్య సిలిండర్ల ధరలు కూడా అధికమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఎల్పీజీ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.ఇదీ చదవండి: డేటా అక్కర్లేని వారి కోసం జియో ప్రత్యేక ప్లాన్లు! -
బహ్రెయిన్ చమురు కేంద్రంపై ఇరాన్ దాడి
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రతరం అవుతోంది. గల్ఫ్ ప్రాంతంలో కీలకమైన ఇంధన కారిడార్ లక్ష్యంగా ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. బహ్రెయిన్లోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రమైన ‘అల్-మామీర్’పై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ పరిణామంతో బహ్రెయిన్ ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ ‘బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ’ (బాప్కో) తన చమురు రవాణాపై ‘ఫోర్స్ మేజర్’(అదుపు చేయలేని అసాధారణ పరిస్థితులు) ప్రకటించింది.బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ అధికారిక సమాచారం ప్రకారం.. అల్-మామీర్ చమురు సముదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడిలో రిఫైనరీలో భారీగా మంటలు చెలరేగాయి. ఆస్తి నష్టం భారీగానే జరిగినప్పటికీ అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు ధ్రువీకరించారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర రక్షణ దళాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.‘ఫోర్స్ మేజర్’ అంటే ఏమిటి?చమురు వ్యాపార ఒప్పందాల్లో ఫోర్స్ మేజర్ అనేది అత్యంత కీలకమైన అంశం. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు లేదా నియంత్రించలేని అసాధారణ పరిస్థితులు సంభవించినప్పుడు.. ఒక కంపెనీ తన క్లయింట్లకు ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వస్తువులను (చమురు) సరఫరా చేయలేకపోతే ఈ నిబంధనను వాడుకుంటుంది. దీనివల్ల డెలివరీలో జాప్యం జరిగినా లేదా సరఫరా ఆగిపోయినా కంపెనీ(బాప్కో)పై ఎలాంటి చట్టపరమైన చర్యలు లేదా జరిమానాలు పడే అవకాశం ఉండదు.అంతర్జాతీయ సరఫరాలకు అంతరాయం కలిగినప్పటికీ బహ్రెయిన్ అంతర్గత మార్కెట్కు ఇంధన కొరత లేకుండా అత్యవసర ప్రణాళికల ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.స్తంభించిన హార్ముజ్ జలసంధి..ఈ దాడి ప్రభావం కేవలం బహ్రెయిన్పైనే కాకుండా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే చమురులో ఐదో వంతు రవాణా అయ్యే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ట్యాంకర్లు నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర భారీగా పెరిగింది. ఇది ఇటీవల ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మొదలైనప్పటి ధరల కంటే 60 శాతం అధికం కావడం గమనార్హం.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం! -
‘కోటి మంది భారతీయుల క్షేమమే మా ప్రాధాన్యత’
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతకంతకూ క్షీణిస్తున్న భద్రతా వాతావరణంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా, భారత ఇంధన భద్రత, కోటి మంది ప్రవాస భారతీయుల జీవనానికి ముప్పుగా పరిణమించిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత తొలి రోజైన సోమవారం ఆయన రాజ్యసభలో పశ్చిమాసియా పరిణామాలపై మాట్లాడారు.క్షీణించిన భద్రత.. ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థపశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు దిగజారాయని మంత్రి పేర్కొన్నారు. ‘మేము అక్కడి పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఈ సంఘర్షణ ఆ ప్రాంతంలో సాధారణ జనజీవనాన్ని, ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది ఇప్పటికే పొరుగు దేశాలకు వ్యాపించి విధ్వంసానికి దారితీస్తోంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సభ తరఫున ఆయన సంతాపం ప్రకటించారు.సరఫరా గొలుసుపై ప్రభావంభారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం ప్రధానంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలు ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని జైశంకర్ అన్నారు. ముడిచమురుకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత, సరఫరాలో అంతరాయాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు ఈ ప్రాంతంలోనే ఉండటంతో సరఫరా గొలుసు దెబ్బతినడం భారత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుందని పేర్కొన్నారు.కోటి మంది భారతీయుల భద్రతపశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారని, వారి శ్రేయస్సు అత్యంత ప్రధానమైన అంశమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, వారి భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారతీయుల రక్షణే తమ మొదటి ప్రాధాన్యతని పునరుద్ఘాటించారు.ఇరాన్ నౌకల అభ్యర్థనపై స్పష్టతసముద్ర లాజిస్టిక్స్ విషయంలో ఇరాన్ ఇటీవల భారతదేశాన్ని సంప్రదించిందని జైశంకర్ వెల్లడించారు. భారత తీరాల్లో మూడు ఇరాన్ నౌకలు లంగరు వేయడానికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. అయితే, ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం తన జాతీయ ప్రయోజనాలను, అంతర్జాతీయ నిబంధనలను బేరీజు వేసుకుంటూ నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.చర్చలు ముఖ్యం‘ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు. చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ నమ్ముతోంది. ఇటీవల కూడా మేము ఇదే విషయాన్ని చెప్పాం’ అని జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడం భారతదేశ ఆర్థిక పురోగతికి, ప్రాంతీయ భద్రతకు అత్యవసరమని సభకు వివరించారు.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం! -
నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో మారుతున్న యుద్ధ సమీకరణాలు సామాన్యుడి వంటింటిపై ప్రభావం చూపే దశకు చేరాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి, వంటగ్యాస్ కొరత పెరిగినట్లు కొందరు భావిస్తున్నారు.వేచి ఉండే సమయం పెంపు.. పెరిగిన ఆందోళనగ్యాస్ రీఫిల్ బుక్ చేసిన వినియోగదారులు మునుపటిలా వెంటనే సిలిండర్ పొందే పరిస్థితి లేదు. సరుకు రవాణాలో ఆలస్యం కారణంగా బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ కోసం రెండు నుంచి ఎనిమిది రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో సోమవారం ఉదయం నుంచే డీలర్ల వద్ద బుకింగ్లు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా రెండు సిలిండర్లు ఉన్న కుటుంబాలు, స్టాక్ అయిపోతుందనే భయంతో డీలర్ అవుట్లెట్ల వద్ద క్యూ కడుతున్నారు.కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేతహోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను డీలర్లు పూర్తిగా నిలిపివేశారు. ‘కనీసం 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్లు అయినా అందుబాటులో ఉన్నాయి. కానీ వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోవడం వల్ల హోటల్స్ తీవ్ర సంక్షోభంలో పడుతున్నాయి’ అని ఒక సబర్బన్ డీలర్ పేర్కొన్నారు. దీనివల్ల హోటల్ యజమానులు బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసే ప్రమాదం ఉందని, అది చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పెరిగిన ధరలు.. కొత్త నిబంధనలుసంక్షోభం చాలదన్నట్లు ధరల పెరుగుదలతో వినియోగదారుడిపై మరింత భారం మోపినట్లయింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర రూ.115, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 చొప్పున పెరిగింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై దేశీయ వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే తదుపరి రీఫిల్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. గతంలో ఇది 15 రోజులుగా ఉండేది. గతంలో ఉన్న సరళమైన బుకింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం నియంత్రించడం గమనార్హం.క్షేత్రస్థాయిలో భయాందోళనలుముంబయిలోని అంధేరీ వంటి రద్దీ ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే వినియోగదారులు డీలర్ల కార్యాలయాలకు పరుగులు తీశారు. ‘గ్యాస్ అయిపోకముందే ఒక సిలిండర్ తెచ్చి పెట్టుకోవాలని చూస్తున్నాం. యుద్ధం ఎటు దారితీస్తుందో, సరఫరా ఎప్పుడు ఆగుతుందో తెలియడం లేదు’ అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్తో చేయం’ -
దగ్గరపడుతున్న డెడ్లైన్.. పన్ను చెల్లింపులపై కీలక సూచనలు!
ఆర్ధిక సంవత్సరంలో మార్చి నెల అత్యంత క్లిష్టం.. అత్యంత కీలకం. అలాంటిదే ఈ 2026 మార్చి కూడా. వ్యక్తులుగా మీ ఇన్కంట్యాక్స్ వ్యవహారాల్లో మీరు చేయవలసిన ముఖ్యమైన బాధ్యతలను తెలుసుకుని వాటిని సకాలంలో పూర్తి చేసే పని చేపడదాం.ఆర్థిక వ్యవహారాల్లో కూడా మార్చి ముఖ్యమైనది. వ్యవహారాలు పూర్తి దశకి రావడానికి, బడ్జెట్ ప్రకారం నిధులు ఖర్చు పెట్టడానికి, గ్రాంట్లను పూర్తి చేయడానికి, ప్రాజెక్టుల పూర్తికి.. ఇలా ఎన్నో పన్నుయేతర వ్యవహారాలకు మార్చి కటాఫ్లాంటిది. ఈ గడువు ఓ గండంలాంటిది. బుక్స్ క్లోజ్ చేయాలి. మీరు బుక్స్ రాయకపోయినా, వాటి నిర్వహణ కంపల్సరీ. రాయకపోయినా ఒకసారి వ్యవహారాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి.ఏప్రిల్ నుంచి మీ బ్యాంకు అకౌంటు స్టేట్మెంట్లు, లోన్ చెల్లింపులు, ఇన్సూరెన్స్ చెల్లింపులు, ఇంటి మున్సిపల్ పన్నుల చెల్లింపులు, మెడిక్లెయిమ్, మీ దగ్గర పని చేసే ఉద్యోగులకు సంబంధించి చట్టబద్ధమైన చెల్లింపులు, పిల్లల చదువులకు సంబంధించిన ట్యూషన్ ఫీజులు, 80సీ కింద అర్హత ఉన్న చెల్లింపులు.. ఇలా ఎన్నో ఉంటాయి. తెలుసుకోండి. తేల్చుకోండి. ఇందులో ఎక్కువ చెల్లింపులకు పాత పద్ధతిలోనే మినహాయింపు దొరుకుతుంది. అయినా చెల్లింపులు చేయడం.. ఒక మంచి అలవాటు. క్రమశిక్షణకు దారి తీస్తుంది.ఆర్ధిక చెల్లింపులలో ముందు, వెనుకలు కాకుండా నిలకడకు దారి తీస్తుంది. ఒక నిశ్చితి పరిస్థితికి దోహదపడుతుంది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రావాల్సిన ప్రయోజనాలు వస్తాయి. కాబట్టి, అశ్రద్ధ చేయవద్దు. మీ వ్యాపారం చిన్నదే కావొచ్చు. జీఎస్టీ పరిమితులలోపు ఉండొచ్చు. ఆడిట్ అవసరం లేకపోవచ్చు. కానీ అకౌంట్స్ విషయంలో బద్ధకం వద్దు. ముఖ్యంగా క్యాపిటల్ ఖర్చు, రెవెన్యూ ఖర్చు, సరుకుల నిల్వ మొదలైనవి ముఖ్యమైనవి.జీఎస్టీ టర్నోవరు రిటర్నులతో మీ ఇన్వాయిస్ల ప్రకారం టర్నోవరు, మీ బుక్స్ ప్రకారం టర్నోవరు చెక్ చేసుకోండి. స్థూల ఆదాయం పూర్తిగా పన్నుకి గురికాదు. ఆదాయం కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్గా వచ్చి, జరగాల్సిన పని ఏప్రిల్లో జరగొచ్చు. ఈ వ్యవహారాల్లో టీడీఎస్ అంశం ఉంటుంది. అనుమానం ఉంటే అటు పక్క వెండార్స్తో ఉత్తరప్రత్యుత్తరాలు జరపండి. ఇద్దరి రికార్డుల్లో అంకెలు, వివరణ, అకౌంటింగ్ సర్దుబాటు, సమన్వయం ఒకేలాగా ఉండాలి. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించండి. 2026 మార్చి 31 నాటికి మీ ఆదాయం విషయంలో టీడీఎస్ సరిపోతే సరే సరి. లేదంటే కొన్ని సందర్భాల్లో అడ్వాన్స్ ట్యాక్స్ బాధ్యత ఏర్పడుతుంది.ఆదాయం అంచనాల్లో వ్యత్యాసాలు ఏర్పడవచ్చు. పన్ను భారం పెరగొచ్చు. గత మూడు వాయిదాల్లో షార్ట్ఫాల్ ఉండొచ్చు. అలాంటి వాటిని మళ్లీ లెక్కించి, కచ్చితమైన లెక్కలు తేల్చండి. రివైజ్ చేసిన లెక్కల ప్రకారం అడ్వాన్స్ ట్యాక్స్ మార్చి 15 లోపల చెల్లించండి. పాత సంవత్సరాల విషయంలో నోటీసులు రావచ్చు. మిమ్మల్ని హెచ్చరిస్తారు. సూచనలు చేస్తారు. ఒక రాయి విసురుతారు. వాటి సారాంశాన్ని బట్టి మీరు రిటర్నులను రివైజ్ చేసుకోవచ్చు. ముందు రాబోయే ఆపదల కన్నా, ఎంక్వైరీలకన్నా, అసెస్మెంట్ కన్నా, పెనాల్టీల కన్నా ఉత్తమమైనది, శాంతియుతంగా క్లోజ్ అయ్యేది.. రివైజ్ రిటర్ను వేయడం. అనివార్యమైతే వెంటనే రంగంలోకి దూకండి.ఇవి కాకుండా జీఎస్టీలోని కొన్ని స్కీములకు, టీడీఎస్ల డిపాజిట్లకు, టీసీఎస్ఐ చెల్లింపులకు, వృత్తి పన్ను చెల్లింపులకు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపులు, రిటర్నులకు, ముఖ్యంగా టీడీఎస్ తక్కువ రేట్లతో వర్తింప చేసేందుకు లేదా వద్దనుకునేందుకు ఫారం 13 వేయాలి. అది కూడా 2026 మార్చి 15లోగా దాఖలు చేయాలి. 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టం, కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. కొత్త ఫారాలు వాడుకలోకి వస్తాయి. కొత్త ఫారంలో సమాచారం ఇవ్వడానికి 2026 మార్చి ముగిసేలోగా సర్వం సిద్ధం చేసుకోండి. -
పాకిస్తాన్లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్.. డీజిల్!
పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు 20 శాతం వరకు పెంచినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఆ దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు పెట్రోల్, డీజిల్ పెంపు విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 55 పాకిస్తాన్ రూపాయలు పెంచి 321.17 రూపాయలకు నిర్ణయించింది. అలాగే డీజిల్ ధరను లీటరుకు 335.86 రూపాయలకు పెంచింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇది అతిపెద్ద ధర సర్దుబాట్లలో ఒకటిగా భావిస్తున్నారు.ద్రవ్యోల్బణంపై ప్రభావంఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇంధన ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరగడం, దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం సాధారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలుధరల పెంపు ప్రకటనకు ముందే లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొరత వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ముందుగానే ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.ప్రభుత్వం హెచ్చరికఇంధన నిల్వలు చేసుకునే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. దేశంలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ మధ్యప్రాచ్య పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియకపోవడంతో వాటిని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.చమురు దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్పాకిస్తాన్ తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాలు ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ఇకపై అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షిస్తామని పాకిస్తాన్ చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
వ్యవసాయ ఎగుమతులకు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం వల్ల భారత వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వెల్లడించింది. జలరవాణా మార్గాల్లో ఆటంకాలు, పెరుగుతున్న బీమా వ్యయాలు, లాజిస్టిక్స్కి సంబంధించి అనిశ్చితితో దాదాపు 11.8 బిలియన్ డాలర్ల ఎగుమతులకు రిస్క్లు నెలకొన్నాయని పేర్కొంది.భౌగోళికంగా భారత్కి దగ్గరగా ఉండటంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు ఉంటుండటంతో ఆ ప్రాంతం చారిత్రకంగా మన ఎగుమతులకు కీలక మార్కెట్గా నిలుస్తోందని జీటీఆర్ఐ పేర్కొంది. 2025లో పశ్చిమాసియాకు భారత్ దాదాపు 11.8 బిలియన్ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యవసాయ, ఆహారోత్పత్తులను ఎగుమతి చేసింది. ఈ విభాగంలో మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 21.8 శాతంగా నిల్చింది. వీటిలో 7.48 బిలియన్ డాలర్ల విలువ చేసే తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి.పశ్చిమాసియా దేశాలకు బియ్యం, అరటిపళ్లు, ఉల్లి, పప్పు ధాన్యాలు, కాఫీ, టీ మొదలైన వాటిని కూడా భారత్ ఎగుమతి చేస్తోంది. ‘అత్యధికంగా బియ్యం మీద ప్రభావం పడొచ్చు. పశ్చిమాసియాకు భారత్ 4.43 బిలియన్ డాలర్ల బియ్యం ఎగుమతి చేసింది. ఇది అంతర్జాతీయంగా మన దేశం నుంచి బియ్యం ఎగుమతుల్లో 36.7 శాతం. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్లాంటి రాష్ట్రాలకు గల్ఫ్ దేశాలు కీలక మార్కెట్గా ఉంటున్నాయి‘ అని జీటీఆర్ఐ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ తెలిపారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల షిప్పింగ్ రూట్లలో ఆటంకాలు ఏర్పడి, బీమా వ్యయాలు పెరిగిపోయి ఎగుమతిదారులకు సందిగ్ధ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. ఇది దేశీయంగా పలు రాష్ట్రాల్లోని రైతులు, ఫుడ్ ప్రాసెసర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. నివేదికలోని మరిన్ని వివరాలు.. గత దశాబ్దకాలంగా వ్యవసాయ ఎగుమతుల కోసం పశ్చిమాసియా మార్కెట్పై భారత్ ఆధారపడటం పెరిగింది. బియ్యం, అరటిపళ్లు, సుగంధ ద్రవ్యాలు, డెయిరీ ఉత్పత్తులు మొదలైనవి వీటిలో ఉన్నాయి. 2025లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇరాన్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలకు 396.5 మిలియన్ డాలర్ల విలువ చేసే అరటిపళ్లు, 111 మిలియన్ డాలర్ల ఉల్లి, వెల్లుల్లి ఎగుమతయ్యాయి. యాలకులు, జాజికాయలాంటివి (295.5 మిలియన్ డాలర్లు), జీలకర్ర–ధనియాల్లాంటివి (163 మిలియన్ డాలర్లు), అల్లం–పసుపు (173 మిలియన్ డాలర్లు), కాఫీ (240.7 మిలియన్ డాలర్లు), టీ (410.1 మిలియన్ డాలర్లు), ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ తదితరాలు (1.35 బిలియన్ డాలర్లు), చేపలు, మాంసం, ఫ్రోజెన్–ప్రాసెస్డ్ ఉత్పత్తులు (1.81 బిలియన్ డాలర్లు) మొదలైనవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. 281.1 మిలియన్ డాలర్ల డెయిరీ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. ఇవి భారత్ నుంచి మొత్తం డెయిరీ ఎగుమతుల్లో 28.9 శాతం. 197.5 మిలియన్ డాలర్ల విలువ చేసే ఆల్కహాలిక్, నాన్–ఆల్కహాలిక్ పానీయాలను పశ్చిమాసియాకి భారత్ ఎగుమతి చేసింది. -
‘చైనాతో చేసిన పొరపాటు భారత్తో చేయం’
రెండు దశాబ్దాల క్రితం చైనా విషయంలో చేసిన వాణిజ్యపరమైన తప్పులను భారత్ విషయంలో పునరావృతం చేయబోమని అమెరికా స్పష్టం చేసింది. భారత్తో వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకున్న తరుణంలో అమెరికా డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘రైసినా డైలాగ్ 2026’ వేదికగా ఆయన ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై ప్రసంగం చేశారు.చైనా అనుభవాలే గుణపాఠం‘20 ఏళ్ల క్రితం చైనాకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించి ఆ దేశాన్నే మాకు పోటీగా మార్చిన పొరపాటును భారత్ విషయంలో చేయం’ అని లాండౌ కుండబద్ధలు కొట్టారు. అమెరికా ప్రభుత్వం తన ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, అందుకే భారత్తో కుదుర్చుకోబోయే ఏ ఒప్పందమైనా పరస్పర ప్రయోజనం ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు. తానేమీ ఇక్కడ సామాజిక సేవ చేయడానికి రాలేదని, అమెరికా ప్రయోజనాలే తమకు పరమావధి అని వ్యాఖ్యానించారు.ఊగిసలాటలో వాణిజ్య ఒప్పందం?భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ముగింపు దశలో ఉందని లాండౌ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇటీవలి పరిణామాలు ఒప్పందాన్ని మరింత జాప్యం చేసే దిశగా ఉన్నాయి. ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ట్రంప్ విధించిన రెసిప్రోకల్ టారిఫ్లు చెల్లవని తీర్పునిచ్చింది. దీనికి ప్రతిస్పందనగా ట్రంప్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్త దిగుమతులపై 10% నుంచి 15% వరకు అదనపు సర్ఛార్జీని విధించింది. గతంలో భారతీయ వస్తువులపై ఉన్న 25% సుంకాన్ని ఒప్పందం ద్వారా 18%కి తగ్గిస్తామని అమెరికా ఆశ చూపేది. కానీ ప్రస్తుతం అందరికీ వర్తించే సుంకం 10%కి తగ్గడంతో అమెరికా ఆఫర్కు ఉన్న ప్రాధాన్యత తగ్గింది. -
భారత్కు ఇంధన సవాలు
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం భారతదేశ ఇంధన భద్రతకు పెను సవాలుగా మారాయని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా కూడా పనిచేస్తున్న ఆయన భారత ఆర్థిక గమనం, రాష్ట్రాల పురోగతిపై తన విశ్లేషణను పంచుకున్నారు.అంచనాలను మించి ఆర్థిక వృద్ధిప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని పనగారియా స్పష్టం చేశారు. ‘2025-26తో ముగిసిన మూడేళ్ల కాలంలో భారత వాస్తవ జీడీపీ సగటున 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పాదక రంగం ఏకంగా 11.2 శాతం సగటు వృద్ధితో దూసుకుపోతోంది. ఇది పారిశ్రామికాభివృద్ధిలో ఒక సానుకూల సంకేతం’ అని ఆయన విశ్లేషించారు.అమెరికా వాణిజ్య విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లను భారత్ చాకచక్యంగా అవకాశాలుగా మలుచుకుందని ప్రశంసించారు. ఇటీవల కొన్ని దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వాణిజ్య పరిధి పెరుగుతుందన్నారు.తక్షణమే దృష్టి సారించాల్సిన అంశాలుదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన ప్రధానాంశాలను పనగారియా సూచించారు.దిగుమతి సుంకాలు, నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను హేతుబద్ధీకరించడం.1956 నాటి యూజీసీ చట్టం స్థానంలో పార్లమెంటు పరిశీలనలో ఉన్న కొత్త చట్టాన్ని తీసుకురావడం.2013 నాటి ఎల్ఏఆర్ఆర్ చట్టాన్ని సవరించి భూసేకరణ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడం.రాష్ట్రాలకు సూచనలు‘విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్) నష్టాల వల్ల రాష్ట్రల ఖజానా ఖాళీ అవుతోంది. రాబోయే 5-7 ఏళ్లలో వీటిని క్రమ పద్ధతిలో ప్రైవేటీకరించాలి. కార్మిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత వంటి అంశాల్లో సరళీకృత విధానాలను అవలంబించాలి. పట్టణ భూ విపణిని వ్యాపార అనుకూలంగా మార్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారికి అనువైన వాతావరణం కల్పించాలి. భారతదేశం తన యువ శక్తిని, విస్తారమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుతుంది’ అని అరవింద్ పనగారియా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అమెరికాలో పెరిగిన నిరుద్యోగం -
అమెరికాలో పెరిగిన నిరుద్యోగం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న అమెరికా జాబ్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్ఎస్) తాజాగా విడుదల చేసిన తాజా గణాంకాలు అంతర్జాతీయ మార్కెట్లను విస్మయానికి గురిచేశాయి. ఈ ఏడాది ఆరంభంలో బలంగా కనిపించిన యూఎస్ ఉపాధి రంగంలో ఫిబ్రవరి నెలలో అనూహ్యంగా 92,000 ఉద్యోగాల కోత నమోదైంది. ఈ పరిణామంతో అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.4 శాతానికి పెరిగింది.ఆరోగ్య రంగంపై సమ్మెల ప్రభావంబ్లూమ్బెర్గ్ విశ్లేషణ ప్రకారం, ఇంత భారీగా పేరోల్స్ నమోదు కావాడానికి ప్రధాన కారణం ఆరోగ్య సంరక్షణ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలే. ఆసుపత్రులు, వైద్య సేవల విభాగాల్లో కొనసాగుతున్న సమ్మె వల్ల ఉపాధి గణనీయంగా క్షీణించింది. జనవరిలో భారీ నియామకాలతో జోరు మీద ఉన్న అమెరికా కంపెనీలు ఫిబ్రవరిలో నియామకాలను ఒక్కసారిగా తగ్గించడం ఆశ్చర్యపరిచింది.ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగానా?నిరుద్యోగిత రేటు పెరగడం, నెగటివ్ పేరోల్ గణాంకాలు వెలువడటంతో ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఫిబ్రవరి నివేదికతో నీరుగారిపోయిందని కొందరు భావిస్తున్నారు.ఆరోగ్య సంరక్షణ రంగంలో సమ్మె ఎందుకు?వైద్య రంగంలోని కార్మికులు ప్రధానంగా ‘సేఫ్ స్టాఫింగ్’ (సరైన నిష్పత్తిలో సిబ్బంది ఉండటం) కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో తగినంత మంది నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవడం వల్ల ఒక్కో నర్సుపై రోగుల భారం పెరుగుతోంది. ఇది రోగుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని, వైద్య సేవల్లో జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుత వేతనాలు తమ జీవన వ్యయానికి సరిపోవడం లేదని నర్సులు, ఇతర హెల్త్కేర్ ప్రొఫెషనల్స్ వాదిస్తున్నారు.కొన్ని సంస్థల్లో కార్మికులు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 25% వేతన పెంపు కావాలని కోరుతున్నారు.పెరుగుతున్న ఇంటి అద్దెలు, నిత్యావసర ధరల నేపథ్యంలో పాత వేతన ఒప్పందాలు సరిపోవని స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష -
డిజిటల్ మోసాల బాధితులకు ఊరట
డిజిటల్ బ్యాంకింగ్ విభాగంలో శరవేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఖాతాదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. అనధికార లావాదేవీల వల్ల నష్టపోయే వినియోగదారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా కస్టమర్ బాధ్యత (కస్టమర్ లయబిలిటీ) ఫ్రేమ్వర్క్లో సవరణలను ప్రతిపాదిస్తూ ఆర్బీఐ ముసాయిదా జారీ చేసింది.ముసాయిదాలోని ప్రధానాంశాలుమోసపూరిత లావాదేవీలకు సంబంధించి ఫిర్యాదు అందిన వెంటనే బ్యాంకులు స్పందించే సమయాన్ని భారీగా తగ్గించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న జాప్యాన్ని తగ్గించి నిర్ణీత కాలవ్యవధిలోగా సమస్యను పరిష్కరించేలా నిబంధనలను కఠినతరం చేశారు.2017లో ప్రవేశపెట్టిన ప్రస్తుత నిబంధనలు అప్పటి డిజిటల్ వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు మారిన టెక్నాలజీ నేపథ్యంలో కొత్త తరహా మోసాలను కూడా ఈ పరిధిలోకి చేర్చారు.తక్కువ విలువ గల మోసపూరిత లావాదేవీల విషయంలో వినియోగదారులకు వేగంగా నగదు వాపసు అందేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రతిపాదించారు.భవిష్యత్తులో మోసాలకు సంబంధించి బ్యాంకులు భరించే పరిహారం వాటాను పెంచే దిశగా ఆర్బీఐ యోచిస్తోంది.ఎందుకు ఈ మార్పు?గత ఎనిమిదేళ్లలో దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ గణనీయమైన వృద్ధిని సాధించింది. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు సైతం సరికొత్త పద్ధతుల్లో ఖాతాదారులను మోసం చేస్తున్నారు. ఫిబ్రవరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ప్రకటించిన విధంగానే ఆర్బీఐ ఈ సమీక్షా ప్రక్రియను చేపట్టింది. ‘2017 నుంచి డిజిటల్ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుత సవరణలు వినియోగదారుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని మరింత పారదర్శకంగా మారుస్తాయి’ అని ఆర్బీఐ ప్రతినిధి తెలిపారు.ఈ కొత్త మార్గదర్శకాలపై వాటాదారులు, ప్రజలు తమ అభిప్రాయాలను, సూచనలను ఏప్రిల్ 6, 2026 లోపు సమర్పించాలని ఆర్బీఐ కోరింది. కొత్త ఆదేశాలు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఏడాది పాటు ఈ పరిహార ఏర్పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత క్షేత్రస్థాయి అనుభవాల ఆధారంగా నిబంధనలను మరింత సమీక్షించనున్నారు.ఇదీ చదవండి: ఫ్లిప్కార్ట్లో పనితీరుపై సమీక్ష -
రూపాయి, ఇంధన రేట్లపై పశ్చిమాసియా ఎఫెక్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం సుదీర్ఘకాలం కొనసాగితే పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ ఒక నివేదికలో హెచ్చరించింది. పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడంలాంటి అంశాలు కూడా దీనికి తోడైతే రూపాయి మారకం విలువ, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావాలు పడొచ్చని ఫిబ్రవరికి సంబంధించిన నెలవారీ ఆర్థిక సమీక్షలో తెలిపింది. అయితే, క్రూడాయిల్ కోసం దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్నప్పటికీ భారత్ వద్ద తగినంత స్థాయిలో విదేశీ మారక నిల్వలు ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు తక్కువ స్థాయిలో కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం మొదలైన సానుకూలాంశాలు, పెరిగే చమురు ధరల ప్రతికూల ప్రభావం నుంచి రక్షణ కల్పించగలవని ఆర్థిక శాఖ తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరంలో భారత ఎకానమీ పటిష్టమైన వృద్ధి బాటలోనే ముందుకు సాగిందని పేర్కొంది. -
మళ్లీ మనకి రష్యా క్రూడ్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో అమెరికా అనుమతి మేరకు, రష్యా నుంచి మళ్లీ క్రూడాయిల్ కొనుగోలు చేసేందుకు భారత్కి అవకాశం లభించింది. ఇందుకు సంబంధించి 30 రోజుల పాటు భారత్కి వెసులుబాటునిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది.‘‘అధ్యక్షుడు ట్రంప్ ఎజెండాతో చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో చమురును అందుబాటులో ఉంచే దిశగా రష్యా ఆయిల్ని భారత రిఫైనరీలు కొనుగోలు చేసేందుకు తాత్కాలికంగా 30 రోజుల పాటు మినహాయింపునిస్తున్నాం. ఇంధనాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను నిలువరించేందుకు ఇది తోడ్పడుతుంది. కీలక భాగస్వామి అయిన భారత్, ఈ వ్యవధి ముగిసిన తర్వాత మా దగ్గర్నుంచే మరింతగా ఆయిల్ కొనుగోలు చేస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్లో పేర్కొన్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యన్ ట్యాంకర్ల నుంచి మాత్రమే కొనుగోళ్లకు అనుమతించినందున, ఈ తాత్కాలిక వెసులుబాటుతో రష్యాకి భారీగా ఆర్థిక ప్రయోజనాలేమీ చేకూరవని బెసెంట్ తెలిపారు. సముద్ర జలాల్లో 130 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ఆంక్షలు వర్తించని సంస్థల నుంచి దేశీ రిఫైనింగ్ సంస్థలు ఇప్పటికే దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి, అమెరికా మినహాయింపునివ్వడానికి ముందే, పశ్చిమాసియా నుంచి సరఫరా దెబ్బతిన్నప్పటి నుంచే కొనుగోళ్లు మొదలయ్యాయని వివరించాయి. ఆంక్షలు ఎదుర్కొంటున్న సంస్థల నుంచి కొనుగోళ్లకు కూడా మినహాయింపు వర్తిస్తుందా లేదా అనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్తో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతంలో రష్యన్ ట్యాంకర్లు నిల్చి ఉండగా, మరో 7 మిలియన్ బ్యారెళ్ల ట్యాంకర్లు సింగపూర్ దగ్గర్లో ఉన్నాయి. వీటికి తోడు కొద్ది రోజుల వ్యవధిలోనే భారత్కి చేరుకునేంత దూరంలో, సింగపూర్ సమీపంలో మరో ఎనిమిది ట్యాంకర్లు ఉన్నాయి. ఇవే కాకుండా నెల రోజుల వ్యవధిలో భారత్కి రాగలిగేలా మధ్యధరా సముద్రం, సూయెజ్ కెనాల్లో మరిన్ని నౌకలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దాదాపు 50 శాతం క్రూడ్ దిగుమతుల కోసం హార్మూజ్ జలసంధిపై ఆధారపడటంతో సరఫరా సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్కి 30 రోజుల వెసులుబాటు భారీ ఊరటనిచ్చే విషయమని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ ’కెప్లర్’ అనలిస్ట్ సుమీత్ రితోలియా తెలిపారు. ప్రస్తుతం 130 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ క్రూడ్, సముద్ర జలాల్లో ఉందని, సరైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే అది దేశీ పోర్టులకు మళ్లడానికి వీలవుతుందని వివరించారు. దేశీ రిఫైనర్లు ఇప్పుడు రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ఆయిల్ కొంటున్నాయని, తాజాగా దాన్ని మరింతగా పెంచేందుకు వీలు చిక్కిందని వివరించారు. అయితే, అదే ఆయిల్ కోసం చైనా కూడా పోటీపడుతున్నందున డిస్కౌంట్లపరంగా భారత్కి పెద్దగా ప్రయోజనం లభించకపోవచ్చని పేర్కొన్నారు. 25 రోజులకు సరిపడా నిల్వలు...ఉక్రెయిన్ మీద దాడికి శిక్షగా పాశ్చాత్య దేశాలు రష్యాపై 2022లో ఆంక్షలు విధించడం, అటుపైన ఆ దేశం భారత్కి భారీ డిస్కౌంటుపై చమురును ఆఫర్ చేయడం తెలిసిందే. దీనితో మిగతా దేశాల నుంచి కొనుగోళ్లు తగ్గించుకున్న భారత్ 2023 మేలో రోజుకు ఏకంగా 2.15 మిలియన్ బ్యారెళ్ల స్థాయిలో రష్యన్ ఆయిల్ కొనుగోలు చేసింది. కానీ అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గించుకోవాల్సి వచి్చంది. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 25 రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా దాడులు తీవ్రమై.. క్రూడ్ రేట్లు కొండెక్కుతున్న నేపథ్యంలోనే అమెరికా మినహాయింపునివ్వడం కొంత ఊరటనిచ్చే అంశమని విశ్లేషకులు తెలిపారు. -
వార్ ఎఫెక్ట్.. భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు!
పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధ పరిస్థితులతో భారత ఆర్థిక వ్యవస్థకు సమీప కాలంలో సవాళ్లు ఎదురుకావొచ్చని.. దీర్ఘకాల వృద్ధికి ఎలాంటి విఘాతం ఉండదని ఆర్బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో జీడీపీని అధిక వృద్ధి క్రమంలో నడిపించేందుకు వీలుగా ద్రవ్య, పరపతి విధానాల మధ్య సమన్వయం అవసరమన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరలు పెరుగుదల, ఎగుమతులకు ఆటంకాలు, గల్ఫ్ దేశాల నుంచి భారత్కు రెమిటెన్స్లు (నగదు బదిలీ) వృద్ధికి తక్షణ ప్రధాన సవాళ్లుగా గుర్తించినట్టు చెప్పారు. పశి్చమాసియా ప్రాంతంతో ప్రపంచానికి ఆర్థిక సంబంధాలు ముడిపడి ఉన్న దృష్ట్యా ఈ సంక్షోభం త్వరలోనే పరిష్కారమవుతుందన్నారు. ఇదే జరిగి, ఇరాన్పై ఆంక్షలు తొలగిపోతే చౌక చమురు సరఫరాల ద్వారా భారత్ ప్రయోజనం పొందుతుందని నగేష్ చెప్పారు.చమురు వనరులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా రిస్క్లను అధిగమించొచ్చని పేర్కొన్నారు. వెనెజులా చమురు నిల్వలను భారత్కు తెరవడం సాయపడుతుందన్నారు. భౌగోళిక రాజకీయ సమస్యలు ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంటుందన్నారు. బలమైన అవకాశాలు, నియంత్రణలోనే ద్రవ్యోల్బణం భారత్ దీర్ఘకాలం పాటు మెరుగైన వృద్ధిని కొనసాగించే సానుకూల స్థితిలో ఉన్నట్టు చెప్పారు. 7 శాతం నుంచి 8 శాతానికి వృద్ధి రేటు మెరుగుపడేందుకు తగినన్ని అవకాశాలున్నట్టు పేర్కొన్నారు. -
రష్యా చమురు కొనుగోలుకు యూఎస్ ఓకే
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశానికి అమెరికా నుంచి ఊరట లభించింది. రష్యన్ ముడి చమురును సేకరించడానికి భారతీయ రిఫైనరీలకు అమెరికా ట్రెజరీ విభాగం 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు మంజూరు చేసింది.గతంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో భారత్ తక్కువ ధరకే రష్యా చమురును పొందింది. ఫిబ్రవరి 28 నాటి గణాంకాల ప్రకారం, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ సంస్థలు బ్యారెల్కు 13 డాలర్ల భారీ తగ్గింపుతో చమురును కొనుగోలు చేశాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ ప్రారంభంలో భారత నౌకాశ్రయాలకు చేరబోయే రష్యన్ చమురుపై వ్యాపారులు ఇప్పుడు బ్రెంటు క్రూడ్ ధర కంటే బ్యారెల్కు 4 నుంచి 5 డాలర్ల ప్రీమియం వసూలు చేస్తున్నారు. మిడిల్ఈస్ట్ ప్రాంతంలో సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వల్ల రష్యా చమురుకు డిమాండ్ విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.యుద్ధ సంక్షోభం.. భారత్ వ్యూహంభారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 40 శాతం మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ప్రధానంగా హార్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. ఇరాన్ వివాదం కారణంగా ఈ సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో భారత రిఫైనర్లు రష్యా వైపు మొగ్గు చూపుతున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్లో ధర కంటే కూడా చమురు లభ్యత అత్యంత కీలకంగా మారింది. ఇంధన భద్రత దృష్ట్యా భారత రిఫైనర్లు తిరిగి రష్యా మార్కెట్లోకి ప్రవేశించాయి’ అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఇప్పటికే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం , హిందుస్థాన్ పెట్రోలియం, ఎంఆర్పీఎల్ సంస్థలు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురును కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది.అమెరికా మినహాయింపు ఎందుకు?ప్రపంచ చమురు ధరల నియంత్రణను దృష్టిలో ఉంచుకొని భారత్ వంటి భారీ వినియోగదారు రష్యా చమురును ఒక్కసారిగా నిలిపివేస్తే గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటే ప్రమాదం ఉంది. ఇది అమెరికాలో కూడా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి ద్వారా సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయంగా రష్యా చమురు అందుబాటులో ఉండటం ప్రపంచ ఇంధన భద్రతకు అవసరం.యూఎస్ను సంప్రదించకుండా నేరుగా కొనుగోలు చేస్తే..ఒకవేళ భారత్ అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యాతో నేరుగా లావాదేవీలు జరిపితే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందో చూద్దాం.అంతర్జాతీయ వాణిజ్యం ఎక్కువగా డాలర్లలో జరుగుతుంది. అమెరికా అనుమతి లేకపోతే రష్యాకు డబ్బు చెల్లించే భారతీయ బ్యాంకులపై అమెరికా ఆంక్షలు విధిస్తుంది. దీనివల్ల ఆ బ్యాంకులు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతోనూ లావాదేవీలు జరపలేవు (స్విఫ్ట్ వ్యవస్థ నుంచి తొలగించడం వంటివి).చమురు మోసుకొచ్చే నౌకలకు అంతర్జాతీయంగా బీమా అందించే సంస్థలు ఎక్కువగా పాశ్చాత్య దేశాలవే. అమెరికా ఆగ్రహిస్తే రష్యా చమురు తెచ్చే నౌకలకు బీమా లభించదు. ఏదైనా ప్రమాదం జరిగితే అది భారీ నష్టానికి దారితీస్తుంది.రష్యాతో వ్యాపారం చేసే భారతీయ కంపెనీలను అమెరికా తన బ్లాక్ లిస్ట్లో పెడుతుంది. దీనివల్ల ఆ కంపెనీలు అమెరికాలో వ్యాపారం చేయలేవు, అమెరికా సాంకేతికతను పొందలేవు. ఉదాహరణకు, రిలయన్స్ లేదా నయారా వంటి సంస్థలు తమ ఎగుమతుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.క్వాడ్ (QUAD) వంటి కూటముల్లో భారత్ ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. రక్షణ రంగంలో అమెరికా నుంచి అందుతున్న కీలక సాంకేతికత (డ్రోన్లు, జెట్ ఇంజిన్లు) నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది.భారత్ ప్రస్తుతం వ్యూహాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. అంటే రష్యాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే అమెరికా ఆంక్షల పరిధి దాటకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే నేరుగా ఘర్షణకు వెళ్లకుండా ఇలాంటి మినహాయింపుల ద్వారా తన అవసరాలను తీర్చుకుంటోంది.ఇదీ చదవండి: కక్కలేక.. మింగలేక.. -
కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదరడంతో భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం కారణంగా సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో భారతీయ ఓడరేవుల్లో సుమారు 38,000 కంటైనర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు సరుకు పంపలేక, ఇటు పోర్టుల్లో ఉంచితే పెరిగే భారీ అద్దెలను భరించలేక ఎగుమతిదారులు ఇప్పుడు తమ కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్నారు.సగానికి పైగా కంటైనర్లు వెనక్కి!తాజా అధికారిక సమాచారం ప్రకారం, నిలిచిపోయిన కంటైనర్లలో దాదాపు 50 శాతం అంటే సుమారు 19,000 కంటైనర్లను ఎగుమతిదారులు వెనక్కి రప్పించుకుంటున్నారు. దీనికోసం కస్టమ్స్ శాఖకు ‘బ్యాక్ టు టౌన్’ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు, ఔషధాల విషయంలో ఎగుమతిదారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు.వీటిని ఏం చేస్తారు?విదేశాలకు వెళ్లాల్సిన ఉల్లి, అరటి, ద్రాక్ష, బాస్మతీ బియ్యం ఇప్పుడు భారతీయ మార్కెట్లలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల దేశీయంగా వీటి ధరలు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎగుమతిదారులకు మాత్రం ప్యాకేజింగ్, రవాణా ఖర్చుల రూపంలో నష్టం తప్పదనే అభిప్రాయాలున్నాయి. పోర్టుల్లో కంటైనర్ నిలిచి ఉంటే నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. షిప్పింగ్ లైన్లు కూడా 2,000 డాలర్ల వరకు అదనపు సర్ఛార్జీలు విధిస్తుండటంతో ఎగుమతి లాభదాయకం కాదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కింద తెలియజేశాం.ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం -
పెరిగిన కరెంట్ ఖాతా లోటు
కరెంటు ఖాతా లోటు డిసెంబర్ త్రైమాసికంలో 13.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 11.3 బిలియన్ డాలర్లుగానే ఉంది. అమెరికాకు ఎగుమతులు క్షీణించడం, దిగుమతులు పెరిగిపోవడంతో ఏర్పడిన వాణిజ్య లోటు ఇందుకు దారితీసింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య (మూడు త్రైమాసికాలు) కరెంటు ఖాతా లోటు 30.1 బిలియన్ డాలర్లకు చేరింది. జీడీపీలో ఇది 1 శాతానికి సమానం. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరికి 36.6 బిలియన్ డాలర్లు (జీడీపీలో 1.3 శాతం)గా ఉంది. ఈ మేరకు బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది. వస్తు వాణిజ్య లోటు డిసెంబర్ త్రైమాసికంలో 93.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఇది 79.3 బిలియన్ డాలర్లుగానే ఉంది.సేవల దిగుమతులు 51.2 బిలియన్ డాలర్ల నుంచి 57.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి.విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రూ.3.7 బిలియన్ డాలర్ల మేర డిసెంబర్ క్వార్టర్లో వెనక్కి వెళ్లాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 2.8 బిలియన్ డాలర్లు వెనక్కి మళ్లడం గమనార్హం.విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఫీఐ) 0.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను భారత్ నుంచి నికరంగా ఉపసంహరించుకున్నారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉపసంహరణ 11.4 బిలియన్ డాలర్లతో పోలి్చతే గణనీయంగా తగ్గింది. ఎన్ఆర్ఐ డిపాజిట్లు నికరంగా 5.1 బిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ఈసీబీలు) రూపంలో 3.3 బిలియన్ డాలర్ల నిధులు దేశీ సంస్థలకు అందాయి.విదేశీ మారకం నిల్వలు 24.4 బిలియన్ డాలర్ల మేర డిసెంబర్ త్రైమాసికంలో తగ్గాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి ఎఫ్డీఐ నికరంగా 3 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే కాలంలో ఎఫ్పీఐ పెట్టుబడులు మాత్రం 4.3 బిలియన్ డాలర్లు బయటకు వెళ్లిపోయాయి. విదేశీ మారకం నిల్వలు ఈ కాలంలో 30.8 బిలియన్ డాలర్ల మేర తగ్గాయి. -
ఆతిథ్యం అదరహో
ఆతిథ్య పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన పనితీరు నమోదు చేయనుంది. ఆదాయం 9 నుంచి 12 శాతం వరకు పెరుగుతుందని రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా వేసింది. అన్ని విభాగాల్లో స్థిరమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. దేశీ విహార పర్యటనలు, ఎంఐసీఈ (సమావేశాలు, సదస్సులు, ప్రదర్శనలు) కార్యకలాపాలు, వివాహాలు, కార్పొరేట్ డిమాండ్ మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. 2024–25లో ఈ రంగం పనితీరు గణనీయమైన వృద్ధిని చూసినప్పటికీ.. అక్కడి నుంచి మెరుగైన వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదు కానుందని తెలిపింది.దేశవ్యాప్తంగా ప్రీమియం హోటళ్లలో ఆక్యుపెన్సీ (భర్తీ) 72–74 శాతం స్థాయిలో ఉంటుందని.. మొదటి 11 నెలల్లో (ఫిబ్రవరి నాటికి) 71–73 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. గదుల సగటు రేటు (ఏఆర్ఆర్) గత ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.8,000–8,200 నుంచి 8,200–8,500కు పెరగనున్నట్టు అంచనా వేసింది. స్థిరమైన డిమాండ్ పరిస్థితులతో ధరలను పెంచుకునే స్వేచ్ఛ ఉన్నట్టు వివరించింది. ప్రీమియం గదుల లభ్యత దేశవ్యాప్తంగా 12 ముఖ్య పట్టణాల్లో 5–6 శాతం మేర పెరుగుతుందని పేర్కొంది. డిమాండ్–సరఫరా మధ్య అంతరం వచ్చే 2–3 ఏళ్ల పాటు కొనసాగుతుందని తెలిపింది.టైర్–2, 3 పట్టణాల్లో కార్పొరేట్ ప్రయాణాలు, వివాహాలు, సామాజిక కార్యక్రమాలు, ఎంఐసీఈ కార్యక్రమాలు, కచేరీలు, క్రీడా కార్యక్రమాలతో డిమాండ్ వైవిధ్యంగా ఉన్నట్టు వివరించింది. దీంతో అంతర్జాతీయ, సైక్లికల్ షాక్ల రిస్క్ తగ్గినట్టు పేర్కొంది. ఫ్రాంచైజీలు, నిర్వహణ కాంట్రాక్టులతో అస్సెట్ లైట్ (లీజు వసతులతో) విధానంలో హోటల్ కంపెనీలు విస్తరణపై దృష్టి పెడుతున్నట్టు తెలిపింది. దీంతో పెద్దగా పెట్టుబడులు అవసరం లేకుండానే ఫీజుల ఆదాయం, బలమైన నగదు ప్రవాహాలకు ఈ నమూనాలు దోహదపడతాయని వివరించింది.ఇదీ చదవండి: పల్లె మహిళల్లోనూ యూపీఐ పరిమళాలు -
వార్ ఎఫెక్ట్.. భారత్కు తప్పని ఇబ్బందులు!
అమెరికా, ఇజ్రాయిల్ - ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం చాలా దేశాలతోపాటు.. భారతీయ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది. ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన బాస్మతి బియ్యం.. ఇప్పుడు ఢిల్లీలోని గిడ్డంగుల్లో నిలిచిపోయింది. దీంతో ఎగుమతులు నిలిచిపోయాయి.ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతి ఆగిపోవడం అనేది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తోంది. దాదాపు 4,00,000 మెట్రిక్ టన్నుల భారతీయ బాస్మతి బియ్యం ఓడరేవులు, గిడ్డంగుల్లో ఉన్నట్లు సమాచారం. సుమారు 2,00,000 టన్నుల బాస్మతి బియ్యం రవాణాలో చిక్కుకుపోయినట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ (AIREA) అధ్యక్షుడు సతీష్ గోయెల్ పేర్కొన్నారు. ఎగుమతిదారులు ఇప్పటికే స్టాక్లను పోర్టులకు తరలించారు, కానీ పెరుగుతున్న కంటైనర్ సరుకు రవాణా ఖర్చుల కారణంగా మధ్యప్రాచ్యానికి రవాణా చేయలేకపోతున్నారని ఆయన వెల్లడించారు.భారతదేశం ప్రపంచంలోనే ఎక్కువ సుగంధ ద్రవ్యాలు కలిగిన, ప్రీమియం బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసే అతిపెద్ద దేశం. మన దేశం సౌదీ అరేబియా, ఇరాన్ & యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా మధ్యప్రాచ్యంలో సగానికి పైగా వాటా కలిగి ఉంది.తగ్గిన ధరలు2026 ప్రారంభం నుంచి బాస్మతి బియ్యం డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఫిబ్రవరిలో మాత్రమే ధరలు 5-10 శాతం పెరిగాయి. కాగా ఇప్పుడు యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లకు రవాణా నిలిచిపోయింది. దీంతో ధరలు 10 శాతం పడిపోయింది. మన దేశంలో కూడా బాస్మతి బియ్యం రేటు 5-6 శాతం తగ్గింది. యుద్ధం ముగిస్తేగానీ.. మళ్లీ ఎగుమతులు ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఎగుమతులు మొదలైతే ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఒకేరోజు 40 శాతం ఉద్యోగుల తొలగింపు! -
92 దాటేసిన రూపాయి!
ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో క్రూడాయిల్ ధరలకు రెక్కలు రావడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా పతనమైంది. డాలర్ మారకంలో 56 పైసలు క్షీణించి జీవితకాల కనిష్ట స్థాయి 92.05 వద్ద స్థిరపడింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ‘రిస్క్ –ఆఫ్’ పరిస్థితులు నెలకొనడంతో స్టాక్స్, బాండ్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలు బంగారం, వెండి ధరల్లో అస్థిరత నెలకొంది. ఈ నేపథ్యంలో డాలర్లకు డిమాండ్ పెరగడంతో డాలర్ ఇండెక్స్ 98 స్థాయిని సులభంగా ఛేదించింది.మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా సరఫరా ఆందోళనలతో బ్రెంట్ క్రూడాయిల్ ధర సైతం 1.29% పెరిగి 82.46 డాలర్లకు చేరుకోవడంతో ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు భయాలు తలెత్తాయి. ఈ పరిణామాలు రూపాయి కరిగిపోయేందుకు కారణమయ్యాయి’’ అని నిపుణులు తెలిపారు. ఒక దశలో ఏకంగా 86 పైసలు కరిగిపోయి 92.35 వద్ద రికార్డు కనిష్టాన్ని తాకింది.2 రోజుల్లో రూ.16.32 లక్షల కోట్లు ఆవిరిస్టాక్ సూచీల వరుస నష్టాలతో రెండు రోజుల్లో ఇన్వెస్టర్లకు రూ.16.32 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.447.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. బుధవారం ఒక్కరోజే రూ.10 లక్షల కోట్ల మేర సంపద గల్లంతైంది.ఇదీ చదవండి: ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం! -
సేవల్లో పనితీరు.. ఫ్లాట్
న్యూఢిల్లీ: సేవల రంగ కార్యకలాపాలు ఫిబ్రవరిలో కాస్తంత నిదానించాయి. ఈ రంగంలో కార్యకలాపాలను సూచించే హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ 58.1 పాయింట్లుగా నమోదైంది. జనవరిలో ఇది 58.5గా ఉంది. 50 పాయింట్లకు పైన ఉన్నంత వరకు విస్తరణగానే పరిగణిస్తుంటారు. డిమాండ్ స్వల్పంగా మెరుగుపడడం, ద్రవ్యోల్బణం పెరగడం ఫలితంగా సేవల రంగం పనితీరు 13 నెలల కనిష్ట వృద్ధికి పరిమితమైనట్టు హెచ్ఎస్బీసీ ఇండియా తెలిపింది. ‘‘జనవరితో పోలి్చతే దాదాపు అదే స్థాయిలో ఫిబ్రవరిలోనూ సేవల రంగ పీఎంఐ నమోదు కావడం.. బలమైన పనితీరును సూచిస్తోంది. కొత్త ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి తగ్గింది. సేవల రంగం విక్రయాలు అంతర్జాతీయంగా పుంజుకున్నాయి. నిర్వహణ అవసరాల దృష్ట్యా కంపెనీలు నియామకాలు పెంచుకోవడం కనిపించింది’’అని హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. పోటీ పెరిగిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించినట్టు కొన్ని కంపెనీల పర్చేజింగ్ మేనేజర్లు ఈ సర్వేలో భాగంగా వెల్లడించారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి కాంపోజిట్ పీఎంఐ (తయారీ, సేవలు కలిసిన) అవుట్పుట్ ఇండెక్స్ 58.9కి పుంజుకుంది. జనవరిలో 58.4 పాయింట్లుగానే ఉంది. -
గ్యాస్కు యుద్ధం సెగ
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్, అమెరికా–ఇరాన్ యుద్ధం, భారత్కి తలనొప్పి వ్యవహారంగా మారింది. కీలకమైన రస్ లఫాన్ ప్లాంటుపై ఇరాన్ డ్రోన్ల దాడుల దెబ్బతో ఖతర్ ఉత్పత్తిని నిలిపివేయడంతో భారత్కి ఎల్ఎన్జీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనితో దేశీయంగా పరిశ్రమలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) కంపెనీలకు ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాలో 40 శాతం వరకు కోత పడింది. ఫలితంగా ఆయా పరిశ్రమలు గగ్గోలు పెడుతున్నాయి. కొన్ని సంస్థలు ఇతర ప్రత్యామ్నాయాలకు మళ్లే అవకాశం ఉన్నప్పటికీ, అది ఖరీదైన వ్యవహారంగా మారింది. ఖతర్తో కుదుర్చుకున్న కాంట్రాక్టు రేటుతో పోలిస్తే స్పాట్ మార్కెట్లో రెట్టింపు రేటుకి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు సరఫరాలో కోత పడగా మరోవైపు స్పాట్ మార్కెట్లో కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో ప్రాధాన్యత రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని గ్యాస్ సరఫరా దిగ్గజం గెయిల్ సీఎండీకి సీజీడీ సంస్థల సమాఖ్య ఏసీఈ లేఖ రాసింది. గృహాలు, సీఎన్జీ కస్టమర్లు, చిన్న పరిశ్రమలకు నిరాటంకంగా గ్యాస్ సరఫరా చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, కాకపోతే గ్యాస్ లభ్యతపై స్పష్టతనివ్వాలని కోరింది. ప్రత్యామ్నాయాలపై దృష్టి.. కీలక రవాణా మార్గమైన హర్మూజ్ జల సంధిలో నౌకలు ప్రయాణించే పరిస్థితి లేకపోవడం వల్ల సరఫరా దాదాపు నిలిచిపోయినట్లు ఖతర్ ఎనర్జీ, పెట్రోనెట్ వెల్లడించాయి. యుద్ధ సమయం కావడం వల్ల కాంట్రాక్టు నిబంధనల ఉల్లంఘనలపరమైన వివాదాలేమీ తలెత్తకుండా లాంఛనంగా ఫోర్స్ మెజూర్ నోటీసులను పరస్పరం ఇచ్చుకున్నాయి. అటు గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియంలకు కూడా ఈ నోటీసులు జారీ చేసినట్లు పెట్రోనెట్ తెలిపింది. దీనితో గెయిల్, ఐవోసీ ప్రత్యామ్నాయంగా స్పాట్ మార్కెట్లో కొనుగోళ్ల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, టర్మ్ కాంట్రాక్టు రేట్లకు రెట్టింపు స్థాయిలో స్పాట్ మార్కెట్లో యూనిట్ (ఎంబీటీయూ) ఎల్ఎన్జీ ధర 10 డాలర్ల నుంచి 25 డాలర్లకు ఎగిసినట్లు పేర్కొన్నాయి. గ్యాస్ సరఫరాపరమైన సవాళ్ల వల్ల ఎరువులు, విద్యుత్ తదితర పరిశ్రమలు ఖరీదైన ప్రత్యామ్నాయాలకు మళ్లితే వ్యయాల భారంతో ధరలు పెరిగిపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎరువుల విషయం తీసుకుంటే ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింతగా పెరుగుతుందని పేర్కొన్నాయి. సగం అవసరాలకు దిగుమతులే ఆధారం.. దేశీయంగా గ్యాస్ను ఎరువులు, విద్యుదుత్పత్తి మొదలైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు. భారత్లో కూడా సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్నప్పటికీ డిమాండ్లో సగానికి మాత్రమే సరిపోతోంది. దీనితో ఎల్ఎన్జీని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. భారత్కి ఏటా వచ్చే 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీలో ఖతర్ వాటా 40 శాతం పైగా ఉంటోంది. దేశీయంగా పెట్రోనెట్ ఎల్ఎన్జీ సంస్థ అత్యధికంగా దిగుమతి చేసుకుని ఇక్కడ మిగతా కస్టమర్లకు సరఫరా చేస్తోంది. ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీని కొనుగోలు చేసేందుకు ఖతర్తో పెట్రోనెట్కి ఒప్పందం ఉంది. స్పాట్ మార్కెట్లో కూడా పెట్రోనెట్ కొనుగోలు చేస్తోంది. ఖతర్తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చే క్రూడాయిల్ మొదలైన వాటికి కూడా హర్మూజ్ జల సంధి కీలక రవాణా మార్గంగా ఉంటోంది. ఇది ఇరాన్ నియంత్రణలో ఉంది. సగటున రోజుకు 91–135 నౌకలు దీని గుండా రాకపోకలు సాగిస్తాయని, కానీ ప్రస్తుతం ఈ సంఖ్య 26కి పడిపోయిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఇంధన సంక్షోభం.. చైనా రిఫైనరీల కీలక నిర్ణయం!
పశ్చిమాసియా ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారు అయిన చైనా తన వ్యూహాన్ని మార్చుకుంది. సౌదీ ఆరామ్కో మద్దతు ఉన్న చైనాలోని చమురు రిఫైనరీలు తమ కార్యకలాపాలను భారీగా తగ్గించుకుంటున్నట్లు ప్రకటించాయి.హార్ముజ్ జలసంధి దిగ్బంధం.. క్రూడ్ సరఫరాకు బ్రేక్ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా ప్రస్తుతం సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ క్రూడాయిల్ అవసరాల్లో 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. యుద్ధ వాతావరణం కారణంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ సరఫరా ఒత్తిడి ఇతర దేశాల రిఫైనర్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.రంగంలోకి చైనా రిఫైనరీ దిగ్గజాలుసౌదీ ఆరామ్కో భాగస్వామ్యం కలిగిన చైనా ప్రధాన రిఫైనరీ జెజియాంగ్ పెట్రోకెమికల్ కార్పొరేషన్ (జీపీసీ) రోజుకు 2 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న తన యూనిట్ను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. వాస్తవానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో జరగాల్సిన ప్లాంట్ నిర్వహణ పనులను ప్రస్తుత సరఫరా సంక్షోభం దృష్ట్యా ముందే చేపడుతున్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు రాయిటర్స్కు తెలిపారు.రోజుకు 8 లక్షల బ్యారెళ్ల ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ చైనాలోనే అతిపెద్దది. తాజా నిర్ణయంతో మార్చి నెలలో ఉత్పత్తి 20 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, ఫుజియాన్ రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ కో (ఫ్రెప్) కూడా తన 80,000 బీపీడీ సామర్థ్యం గల చిన్న ముడి చమురు యూనిట్ను తాత్కాలికంగా మూసివేసింది.ఇదీ చదవండి: ఏజీఆర్ బకాయిలు ఎలా రాబట్టాలో ఏమో! -
భారత్ క్రూడాయిల్, ఎల్పీజీ నిల్వలు ఇలా..
పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు) మారుతున్న యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఎదుర్కోవడానికి దేశం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన వద్ద 50 రోజులకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.నిల్వల లభ్యత ఇలా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారత్ వద్ద ప్రస్తుతం ముడి చమురు 25 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు మరో 25 రోజులకు సరిపోతాయి. మొత్తంగా 50 రోజుల వరకు ఎటువంటి సరఫరా అంతరాయం లేకుండా దేశ అవసరాలను తీర్చవచ్చు. ఇవి కాకుండా విశాఖపట్నం, మంగళూరు, పాడూరులోని వ్యూహాత్మక నిల్వల్లో 4.094 మిలియన్ టన్నుల ముడి చమురు సిద్ధంగా ఉంది. ఇది మన మొత్తం సామర్థ్యంలో (5.33 మెట్రిక్ టన్నులు) సుమారు 77 శాతానికి సమానం.స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్..భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోంది. ప్రతిరోజూ సుమారు 5.6 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులను దేశం వినియోగిస్తోంది. గతంలో దిగుమతుల్లో 40% స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వచ్చేవి. ప్రస్తుతం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈల నుంచి దిగుమతులు పెరగడంతో ఈ వ్యూహాత్మక జలసంధి గుండా వచ్చే చమురు వాటా 50 శాతానికి చేరింది. యుద్ధం తీవ్రమైతే ఈ మార్గం ద్వారా సరఫరా సవాలుగా మారే అవకాశం ఉంది.ప్రభుత్వ చర్యలుపరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. ‘మేము అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యామ్నాయంగా చమురును సేకరిస్తున్నాం. రిఫైనరీలు అవసరమైనప్పుడు ఇతర వనరుల నుంచి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నాయి’ అని ఒక అధికారి తెలిపారు.ధరల పెంపు ఉంటుందా?ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. అయితే, యుద్ధం 10-15 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 82 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎల్పీజీ పరిస్థితి ఏమిటి?వంట గ్యాస్ విషయంలోనూ భారత్ ఊరటనిచ్చే సమాచారమే ఇచ్చింది. భారత్ వద్ద 25-30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. మనం 80-85% ఎల్పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నాం. 2025 ఆర్థిక సంవత్సరంలో 20.67 మిలియన్ టన్నుల ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంది. వచ్చే రెండు వారాల్లో పశ్చిమ ఆసియాలో పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతరాయాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇదివరకే రాజ్యసభలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు -
క్రూడ్ కల్లోలం.. గ్లోబల్ మార్కెట్లు కుదేల్
అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. ఒక దశలో అమెరికాలో కీలకమైన సూచీలైన డోజోన్స్ 2.5 శాతం (1,232 పాయింట్లు), నాస్డాక్ 2.7 శాతం మేర క్షీణించాయి. ఎస్అండ్పీ 500లోని 95 శాతం స్టాక్స్ నష్టపోవడం గమనార్హం. పెరిగే ఇంధన భారం, ఫ్లయిట్ల రద్దుపరమైన సవాళ్లతో అమెరికాలో యునైటెడ్ ఎయిర్లైన్స్ షేరు 5.4 శాతం, అమెరికన్ ఎయిర్లైన్స్ 5.8 శాతం పతనమయ్యాయి.అటు ఆసియా, యూరప్ సూచీలు కూడా తగ్గాయి. దక్షిణ కొరియా కోస్పి స్టాక్ ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్ నిల్వలున్నప్పటికీ జపాన్ నికాయ్ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో బుధవారం (నేడు) గ్యాప్ డౌన్తో ప్రారంభం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఆయిల్ అప్.. గోల్డ్ డౌన్..అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్కి 7% పైగా పెరిగి 83.33 డాలర్ల వద్ద, నైమెక్స్ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.ఇదీ చదవండి: పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు? -
రూ. 2,000 నోట్లు.. 98.44% వెనక్కి: ఆర్బీఐ
ముంబై: మార్కెట్ నుంచి 98.44 శాతం మేర రూ.2,000 నోట్లు వెనక్కి వచ్చినట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం తెలిసిందే. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ.2,000 నోట్లు చలామణిలో ఉండగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి రూ.5,551 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది.అంటే, ఇంకా 1.56 శాతానికి సమానమైన పెద్ద నోట్లు వ్యవస్థలోనే ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2,000 నోట్ల డిపాజిట్, మార్పిడికి ఆర్బీఐ అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసుల్లో రూ.2,000 నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. -
చమురు సమస్యకు చాన్స్ లేదు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో స్వల్పకాలికంగా ఇంధనాల సరఫరాలో ఆటంకాలేర్పడినా భారత్కి ఇబ్బందేమీ ఉండదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన దగ్గర 6–8 వారాల డిమాండ్కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని వివరించాయి. ప్రభుత్వం రోజువారీగా, ప్రతి గంటకు పరిస్థితిని సమీక్షిస్తోందని చమురు శాఖ అధికారి ఒకరు తెలిపారు. వారం పది రోజుల్లో ఈ సంక్షోభం ముగిసిపోయే అవకాశం ఉందనే అంచనాలు నెలకొన్నట్లు వివరించారు. దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడాయిల్, ఇంధనాల నిల్వలు ఉన్నాయని, ఒకవేళ సంక్షోభం మరింత కాలం కొనసాగినా దాదాపు అంతే కాలానికి సరిపడేంతగా ఆయిల్ సరఫరా అమెరికా, రష్యా మొదలైన దేశాల నుంచి వస్తోందని పేర్కొన్నారు. దేశీయంగా వైజాగ్, మంగళూరు, పాదూర్ నిల్వ కేంద్రాల్లో 100 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం రిజర్వ్లు ఉన్నాయి. ధరలు పెరిగితే దిగుమతుల బిల్లులు భారం .. తక్షణమైతే ఇంధనాలకు కొరత ఏర్పడకపోవచ్చు కానీ క్రూడాయిల్ ధరలు, రవాణా.. బీమా వ్యయాలు పెరగడమనేది భారత దిగుమతుల బిల్లు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇరాన్ సంక్షోభం మొదలైనప్పటి నుంచి సుమారు 10 శాతం పెరిగి బ్యారెల్కి 80 డాలర్ల స్థాయిని దాటింది. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ క్రూడాయిల్ దిగుమతుల కోసం 137 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో 206.3 మిలియన్ టన్నుల క్రూడాయిల్ దిగుమతుల కోసం 100.4 బిలియన్ డాలర్లు వెచ్చించింది. మరోవైపు, పశ్చిమాసియాలో అనిశ్చితుల వల్ల స్వల్పకాలికంగా తలెత్తే సవాళ్లను పరిష్కరించుకునేలా దేశీయంగా పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్) సహా కీలక పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, నిల్వలను నిరంతరం సమీక్షించేందుకు ఆయిల్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది వారంలో ఏడు రోజులూ, ఇరవై నాలుగు గంటలు పని చేస్తుందని చెప్పారు. అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో, రిఫైనింగ్లో నాలుగో స్థానంలో, పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతుల్లో అయిదో స్థానంలో ఉంది. -
హార్మూజ్ హీట్.. ఎగుమతులకు షాక్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులతో భారత వాణిజ్యంపై అనిశ్చితులు నెలకొన్నాయి. దేశ వాణిజ్యం (ఎగుమతులు–దిగుమతులు)పై ఏ మేర కు ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు ఎగుమతిదారులు, లాజిస్టిక్స్ భాగస్వాములతో కేంద్ర వాణిజ్య శాఖ అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎగుమతిదారులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెట్టారు. రెమిషన్ ఆఫ్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ (రాడ్టెప్) పథకం కింద.. ఎగుమతిదారుల రవాణా వ్యయాలపై ఇప్పటి వరకు అధిక శాతం రీయింబర్స్మెంట్ సదుపాయం ఉండేది.దీన్ని ఇటీవలే సగానికి తగ్గించడం గమనార్హం. అలా చేయకుండా ఇంతకుముందు మాదిరే అధిక రేట్లను అమలు చేయాలని ఎగుమతిదారులు డిమాండ్ చేశారు. యుద్ధం పేరుతో సరుకు రవాణాపై ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెంచకుండా ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను (ఈసీజీసీ)ను ఆదేశించాలని, మరిన్ని ఉత్పత్తులను బీమా కవరేజీలో చేర్చాలని కోరారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై ప్రభావం తగ్గించే చర్యలు అవసరమని సూచించారు.సరుకు రవాణాపై స్పష్టత ఉండాలని, అనవసర జాప్యాన్ని నివారించాలని, డాక్యుమెంటేషన్ ప్రక్రియ సాఫీగా, సజావుగా ఉండాలని ఎగుమతిదారులు కోరారు. ఇరాన్పై ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త సైనిక చర్యలు చేపట్టడం, ప్రతిగా ఇరాన్ పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా ఎయిర్బేస్లపై దాడులు చేస్తుండడం తెలిసిందే. అంతేకాదు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ప్రపంచ చమురు రవాణాలో 15 శాతం, గ్యాస్ సరఫరాలో 20 శాతం రవాణాకు ఈ మార్గమే ఆధారం. ముడి చమురు ఇప్పటికే బ్యారెల్ 85 డాలర్లకు పెరిగిపోవడం గమనార్హం. పోటీతత్వానికి గండి హార్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల చమురు వాణిజ్యంపై ప్రభావం పడి ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఎగుమతిదారు లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు వ్యయాలు పెరిగిపోతాయని.. దీంతో భారత వస్తువుల పోటీతత్వం తగ్గిపోతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విమాన రాకపోకల అంతరాయం వల్ల ఎయిర్పోర్టుల్లో నిలిచిపోయిన సరుకుపై అదనపు చార్జీలు రద్దు చేయాలని అప్పారెల్ ఎక్స్పోర్టర్స్ కౌన్సిల్ ఏఈపీసీ కోరింది.ఎగుమతులపై ప్రభావం.. దేశ ఎగుమతుల్లో సుమారు 15 శాతం విమానాల ద్వారానే జరుగుతుంటాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా పలు దేశాలు గగనతలాలను మూసివేయడం వల్ల పండ్లు, కూరగాయలు, ఆభరణాల రవాణా భారంగా మారనుంది.ఎంఎస్ఎంఈలకు భరోసా..పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వాణిజ్య శాఖ పేర్కొంది. భారత ఎగుమతులు, దిగుమతులు స్థిరంగా కొనసాగించేందుకు (సరఫరా వ్యవస్థ).. ఎగమతిదారులు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచి్చంది. కస్టమ్స్ అనుమతులు, చెల్లింపులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. దేశ ఉత్పత్తికి అవసరమైన కీలక దిగుమతులపై ఎలాంటి తీవ్ర ప్రభావం లేదని స్పష్టం చేసింది. త్వరగా పాడయ్యే వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, అధిక విలువ కలిగిన తయారీ ఉత్పత్తుల ఎగుమతులు సాఫీగా సాగేందుకు ఉన్న మార్గాలపైనా చర్చించినట్టు తెలిపింది. -
పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్.. తన క్షిపణులను నేరుగా వారిపై ప్రయోగించాల్సింది పోయి, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాల వైపు మళ్లించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇది ఇరాన్ బలహీనతా? లేక వ్యూహాత్మక చర్యలో భాగంగా వేస్తున్న ఒక ఎత్తగడా? అసలు పొరుగు దేశాలే ఇరాన్ టార్గెట్గా ఎందుకు అయ్యాయి? అనే అంశాలు చూద్దాం.మిత్రదేశాల ముసుగులో శత్రు స్థావరాలుఇరాన్ తన క్షిపణులను ఇరుగుపొరుగు దేశాల వైపు మళ్లించడానికి ప్రధాన కారణం.. ఆయా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు. బహ్రెయిన్, కతార్, కువైట్.. వంటి ప్రాంతాల్లో అమెరికాకు చెందిన భారీ నౌకాదళ, వైమానిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడుల్లో ఈ స్థావరాలే వేదికలయ్యాయి. దాంతో నేరుగా వాషింగ్టన్పై దాడి చేయలేని ఇరాన్, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్లను లక్ష్యంగా చేసుకుంది.ప్రాంతీయ ఆధిపత్యంగతంలో ఇరాన్ తన పరోక్ష యుద్ధాన్ని (ప్రాక్సీ వార్) హమాస్, హిజ్బుల్లా ద్వారా నడిపించేది. కానీ 2024-25 మధ్య జరిగిన పరిణామాల్లో ఇజ్రాయెల్ ఈ గ్రూపులను తీవ్రంగా దెబ్బతీసింది. సిరియాలో అస్సాద్ ప్రభుత్వం కూలిపోవడం, హిజ్బుల్లా నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో ఇరాన్ కొంత బలహీనపడింది. దీంతో తన ఉనికిని చాటుకోవడానికి పొరుగున ఉన్న ఇజ్రాయెల్ అనుకూల దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.ఇంధన మార్కెట్ అతలాకుతలంయుద్ధం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. అందుకే, గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందని అభిప్రాయాలున్నాయి.హోర్ముజ్ జలసంధి మూసివేత: ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ ప్లాన్. పొరుగు దేశాలపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తే తమ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయనే హెచ్చరికను ఇరాన్ పంపాలని చూస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.అంతర్గత అశాంతి నుంచి దృష్టి మళ్లింపు2026 జనవరి నుంచి ఇరాన్ తీవ్రమైన దేశీయ నిరసనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బయటి దేశాలపై దాడులు చేయడం ద్వారా జాతీయవాదాన్ని రగిల్చి ప్రజల దృష్టిని అంతర్గత సమస్యల నుంచి మళ్లించాలని ఇరాన్ పాలకులు చూస్తున్నారు.అధికార మార్పు భయంప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్లో పాలన మార్పును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, కీలక నాయకత్వంపై కూడా జరుగుతున్నాయి. తమ మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఒక గాయపడిన సింహంలా ఇరాన్ తన పక్కనున్న చిన్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఇది అమెరికాను చర్చల వైపు మళ్లించే ప్రయత్నం కూడా కావచ్చని కొందరి అభిప్రాయం. -
ఇరాన్ సంక్షోభం.. ఎగుమతులు, దిగుమతులపై నీలినీడలు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటనూనెల విభాగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, అటు నూనె గింజల దిగుమతులపై.. ఇటు ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.భారతదేశం తన వంటనూనె అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్; అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్; రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ భారత్కు వస్తుంటాయి. అయితే, ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ గుండానే సాగుతాయి.ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే, ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే రవాణా, బీమా ఖర్చులు పెరిగి అది దేశీయంగా వినియోగదారుడిపై భారం మోపుతుందని అంచనా వేస్తున్నారు.ఎగుమతులపై దెబ్బకేవలం దిగుమతులే కాకుండా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఆయిల్ మీల్స్(నూనె గింజల నుంచి నూనెను తీసేసిన తర్వాత మిగిలే ఉప ఉత్పత్తి ) ఎగుమతులు కూడా ప్రతిష్టంభనను ఎదుర్కోవచ్చు. భారత ఆయిల్ మీల్స్ ఎగుమతుల్లో ఆగ్నేయాసియా వాటా 65% కాగా, పశ్చిమాసియా (గల్ఫ్) 20%, యూరప్ 15% వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం ముదిరితే గల్ఫ్, యూరప్ దేశాలకు జరిగే ఎగుమతుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది.క్రూడాయిల్ ధరల పెరుగుదల కేవలం రవాణా ఖర్చులనే కాకుండా గ్లోబల్ బయోఫ్యూయల్ మార్కెట్ ద్వారా వంటనూనెల ధరలను కూడా ప్రభావితం చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులు కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతాయని అంటున్నాయి. -
ట్రావెల్.. క్యాన్సిల్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులతో అటువైపు వెళ్లాల్సిన వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఫ్లయిట్లను డైవర్ట్ చేసే రిసు్కలు ఉండటం, ప్రయాణాలకు పట్టే వ్యవధిపై అనిశ్చితి నెలకొనడం, బీమా నిబంధనలపై సందేహాలు మొదలైన అంశాలు ట్రావెలర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దీనితో 20–25% బుకింగ్స్ రద్దు లేదా రీషెడ్యూల్ అవుతున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) వెల్లడించింది. గల్ఫ్ ట్రాన్సిట్ హబ్లు, సమీప ప్రాంతాల్లోని రూట్లకు ఇవి పరిమితమైనట్లు వివరించింది. గగనతలంపై ఆంక్షలు కొనసాగినా, పరిస్థితి మరింత తీవ్ర రూపు దాల్చినా వేసవి సీజన్లో ప్రయాణాలపై కూడా ప్రభావం పడొచ్చని ఐఏటీవో ప్రెసిడెంట్ రవి గొసెయిన్ తెలిపారు. సమీప భవిష్యత్తులో పశ్చిమాసియా దేశాలకు, లేదా ఆ ప్రాంతం మీదుగా ఇతర దేశాలకు బుక్ చేసుకున్న వారు తమ ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నట్లు ట్రావెల్ బుకింగ్ అగ్రిగేటర్ మేక్మైట్రిప్ తెలిపింది. ఆయా ఎయిర్లైన్స్ పాలసీల ప్రకారం తేదీలను మార్చుకునే విషయంలో సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించింది. అలాగే, అబుదాబి, దుబాయ్లో ప్రస్తుతం ఉన్న ట్రావెలర్లకు స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే నోటిఫికేషన్ల ఆధారంగా అప్డేట్స్ని అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టీ తెలిపారు. ప్రభావిత ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఒమన్ నుండి భారత్కి చార్టర్ ఫ్లయిట్స్ నడిపే యోచనలో ఉన్నట్లు వివరించారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను బట్టి అంతర్జాతీయ ట్రావెల్కి స్వల్పకాలిక సవాళ్లు ఎదురైనా, దేశీయంగా మాత్రం టూరిజానికి డిమాండ్ పటిష్టంగానే కొనసాగవచ్చన్నారు.చమురు భగ్గు.. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల దెబ్బతో ముడిచమురు సరఫరాపై నీలినీడలు కమ్ముకోవడంతో క్రూడాయిల్ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ రేటు బ్యారెల్కి 8.6 శాతం ఎగిసి 79.11 డాలర్లకు, నైమెక్స్ ఆయిల్ ధర 7.6 శాతం పెరిగి 72.12 డాలర్లకు ఎగిసింది. ప్రధాన సరఫరాదారైన ఖతర్ ఉత్పత్తి నిలిపివేయడంతో యూరప్లో సహజ వాయువు ధర 40 శాతం పైగా పెరిగింది. క్రూడాయిల్, గ్యాస్ రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో ట్యాంకర్ల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడటంతో రేట్లు మరింత భారీగా పెరగొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. హార్ముజ్ని పూర్తిగా మూసివేస్తే ఆయిల్ ధర 90 డాలర్లు, అటు పైన 100 డాలర్లకి కూడా ఎగియొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే అమెరికా సహా చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుందని విశ్లేషకులు తెలిపారు. ముడిచమురు ధరలు స్థిరంగా 15 డాలర్లు పెరిగితే, యూరప్లో ద్రవ్యోల్బణం అర శాతం మేర పెరుగుతుందని బెరెన్బర్గ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ పరిణామాలన్నీ ప్రపంచ వృద్ధిని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే, అమెరికాలో నవంబర్లో మిడ్–టర్మ్ ఎన్నికల ముందు ప్రతికూల పరిస్థితులను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టపడకపోవచ్చు కాబట్టి ఇంధన రేట్లను మళ్లీ కిందికి దింపేందుకు ప్రయతి్నంచవచ్చని తెలిపింది. -
విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు
దేశీయ విద్యుత్ రంగాన్ని ఆధునీకరించడమే కాకుండా, మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ (ఎన్ఈపీ) 2026’ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలు ఈ రంగాన్ని సమూలంగా మార్చనున్నాయి. జనవరిలో విడుదలైన ఈ ముసాయిదాపై మార్చి 19 వరకు ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను కోరారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న వినూత్న పద్ధతులను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశపెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం.ప్రస్తుతం మన దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) తాము ఒప్పందం చేసుకున్న ప్లాంట్ల నుంచే విద్యుత్ పొందుతున్నాయి. కానీ కొత్త విధానం ప్రకారం, మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ డెస్పాచ్ (ఎంబీఈడీ) అమలులోకి రానుంది. దీని ప్రకారం.. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి అంతా ఒకే పూల్కు చేరుతుంది. అత్యంత తక్కువ ధరకు విద్యుత్ అందించే ప్లాంట్లకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గుతుంది.ఈ క్రమంలో వచ్చే ఆర్థిక లావాదేవీల చిక్కులను పరిష్కరించేందుకు ‘బైలేటరల్ కాంట్రాక్ట్ సెటిల్మెంట్’(బీసీఎస్)ను ప్రతిపాదించారు. ఉదాహరణకు, ఒక డిస్కమ్ యూనిట్కు రూ.4 చొప్పున ఒప్పందం చేసుకున్నా మార్కెట్ ధర రూ.3 ఉంటే.. డిస్కమ్ మార్కెట్ పూల్కు రూ.3 చెల్లించి మిగిలిన రూ.1 ఒప్పందం ప్రకారం సదరు ఉత్పత్తి సంస్థకు చెల్లిస్తుంది.కెపాసిటీ మార్కెట్స్తో నిరంతర సరఫరాసౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు ప్రకృతిపై ఆధారపడతాయి. ఒకవేళ గాలి తగ్గినా లేదా ఎండ లేకపోయినా విద్యుత్ కొరత రాకుండా బ్యాకప్గా ఉండే ప్లాంట్లను సిద్ధం చేయడమే ‘కెపాసిటీ మార్కెట్స్’ ఉద్దేశం. ఎనర్జీ మార్కెట్లో సరఫరా చేసిన విద్యుత్తుకు డబ్బులు చెల్లిస్తే, కెపాసిటీ మార్కెట్లో విద్యుత్ అందుబాటును అనుసరించి రిటైనర్ ఫీజు తరహాలో చెల్లింపులు జరుగుతాయి. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ను తట్టుకోవడానికి, గ్రిడ్ స్థిరత్వం దెబ్బతినకుండా ఉండటానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.క్లౌడ్ ఎనర్జీ స్టోరేజ్ఇప్పటివరకు విద్యుత్ నిల్వ అనేది కేవలం పెద్ద కంపెనీలకు, భారీ ప్రాజెక్టులకే పరిమితం. కానీ ఎన్ఈపీ 2026 ముసాయిదా క్లౌడ్ ఎనర్జీ స్టోరేజ్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇది ‘స్టోరేజ్-యాజ్-ఏ-సర్వీస్’ తరహాలో పనిచేస్తుంది. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే చిన్న వినియోగదారులు కూడా తమ వద్ద ఉన్న అదనపు విద్యుత్తును ఈ క్లౌడ్ వ్యవస్థలో నిల్వ చేసుకోవచ్చు లేదా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇది రిటైల్ స్థాయిలో నిల్వ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది.పీర్-టు-పీర్ ట్రేడింగ్మీ ఇంటి సోలార్ ప్యానెల్ ద్వారా తయారైన విద్యుత్తును పక్కింటి వారికో లేదా దగ్గర్లోని చిన్న దుకాణానికో నేరుగా అమ్ముకునే వీలు కల్పించడమే పీర్-టు-పీర్ ట్రేడింగ్. ఈ లావాదేవీల కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ప్రోటోకాల్ను ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనివల్ల గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో గ్రిడ్పై ఒత్తిడి తగ్గుతుంది.ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే విద్యుత్ రంగం కేవలం ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థగా కాకుండా ఒక డైనమిక్ మార్కెట్గా మారుతుంది. ఇది వినియోగదారులకు చౌకగా విద్యుత్ అందించడంతో పాటు దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.ఇదీ చదవండి: భారత చమురు మార్కెట్పై ‘యుద్ధ’ సెగ -
భారత చమురు మార్కెట్పై ‘యుద్ధ’ సెగ
పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి భారత్పై ముఖ్యంగా చమురు మార్కెట్, రూపాయి విలువపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.పెరగనున్న దిగుమతి భారంభారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు 90 డాలర్ల మార్కును దాటే ప్రమాదం ఉందని అంచనాలున్నాయి. ప్రస్తుతం ఇది 77 డాలర్ల వద్ద ఉంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో క్రూడ్ సరఫరా గొలుసు దెబ్బతినే అవకాశం ఉంది. పరిమితంగా రష్యా నుంచి అందుతున్న రాయితీ చమురు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఇది అంతిమంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది.రూపాయి పతనం - ఆర్థిక సవాళ్లుయుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపుతారు. ఫలితంగా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కనిష్టానికి చేరుకోవచ్చు. చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లను వెచ్చించాల్సి రావడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరుగుతుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం వల్ల భారత మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే ప్రమాదం ఉంది.భారత్ - ఇరాన్ వాణిజ్య సంబంధాలుఖమేనీ మరణం తర్వాత ఇరాన్లో ఏర్పడే అంతర్గత రాజకీయ మార్పులు భారత్తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపుతాయి. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల భారత్ వ్యూహాత్మకంగా నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవు భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారవచ్చు. ఇరాన్ కొత్త నాయకత్వం భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాలను ఎలా ముందుకు తీసుకెళ్తుందనే అంశంపైనే ఈ ప్రాజెక్టు పురోగతి ఆధారపడి ఉంటుంది. మధ్య ఆసియా దేశాలతో వాణిజ్య సంబంధాలను బలపరుచుకోవడానికి భారత్కు ఈ పోర్ట్ అత్యంత కీలకం కావడంతో అక్కడి రాజకీయ మార్పులు మన వ్యూహాత్మక ప్రయోజనాలపై నేరుగా ప్రభావం చూపనున్నాయి.వ్యవసాయ ఎగుమతులురెండు దేశాల మధ్య జరుగుతున్న వ్యవసాయ ఎగుమతులపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ నుంచి ఇరాన్కు పెద్ద మొత్తంలో ఎగుమతి అయ్యే బాస్మతీ బియ్యం, టీ, చక్కెర వంటి ఉత్పత్తులకు సంబంధించి చెల్లింపుల సమస్యలు తలెత్తవచ్చు. యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ ఆంక్షల తీవ్రత పెరిగితే భారతీయ ఎగుమతిదారులు తమ బకాయిలను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.అప్రమత్తతే మార్గంఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ ఎకానమీలో భాగమైన భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవడం, దౌత్యపరంగా అడుగులు వేయడం కీలకం.ఇదీ చదవండి: 2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు! -
మెరుగ్గా జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో ఫిబ్రవరిలో రూ.1.83 లక్షల కోట్లు స్థూలంగా వసూలైంది. దేశీ విక్రయాలపై ఆదాయం 5.3 శాతం పెరిగి రూ.1.36 లక్షల కోట్లుగా ఉంటే, దిగుమతులపై జీఎస్టీ 17.2 శాతం పెరిగి రూ.47,837 కోట్లుగా నమోదైంది. రిఫండ్లు 10.2 శాతం పెరిగి రూ.22,595 కోట్లుగా ఉన్నాయి. దీంతో నికర పన్ను వసూళ్లు రూ.1.61 లక్షల కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 7.9 శాతం పెరిగాయి. సెస్సు రూపంలో ఆదాయం రూ.13,481 కోట్ల నుంచి రూ.5,063 కోట్లకు తగ్గింది. గతేడాది సెప్టెంబర్ 26 నుంచి జీఎస్టీలో కీలక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. 5, 12, 18, 28 శ్లాబులను విలీనం చేసి.. 5, 18, 40 శాతం (పొగాకు, విలాస ఉత్పత్తులు) ఖరారు చేశారు. దీంతో 375 ఉత్పత్తులపై పన్ను రేట్లు దిగొచ్చాయి. అనంతరం నవంబర్లో వసూళ్లు రూ.1.70 లక్షల కోట్లుగా ఉంటే, డిసెంబర్లో రూ.1.74 లక్షల కోట్లు, 2026 జనవరిలో రూ.1.93 లక్షల కోట్లకు పెరిగింది. పొగాకు ఉత్పత్తులపై అంతకుముందు కాంపన్సేషన్ ఉండగా, దాన్ని తొలగించి అధిక పన్ను రేటు పరిధిలోకి చేర్చారు. దీంతో ఈ పన్ను ఆదాయం తగ్గుతూ వస్తోంది. వినియోగం పెరిగినట్టు జీఎస్టీ వసూళ్ల గణాంకాలు తెలియజేస్తున్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి పేర్కొన్నారు. తమిళనాడులో మైనస్ 6 శాతం, మధ్యప్రదేశ్లో మైనస్ 8 శాతం, రాజస్థాన్లో మైనస్ 1% చొప్పున ఆదాయం తగ్గిందని.. పశి్చమబెంగాల్లో ఒక శాతం, హరియాణాలో 2 శాతం, యూపీలో 5 శాతం, మహారాష్ట్రలో 6% చొప్పున ఆదాయం వచి్చనట్టు చెప్పారు. ఇది జాతీయ సగటు ఆదాయం 8 శాతం కంటే తక్కువని చెప్పారు. -
ద్రవ్యలోటు రూ.9.8 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జనవరి చివరికి (10 నెలల్లో) రూ.9.8 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సం బడ్జెట్ అంచనాలో ఇది 63 శాతానికి సమానం. క్రితం ఆర్థిక సంవత్సరం జనవరి చివరికి ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 74.5 శాతంగా ఉండడం గమనార్హం. 2025–26 సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది బడ్జెట్ అంచనా. ఈ వివరాలను కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. జనవరి చివరికి ప్రభుత్వానికి రూ.27.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో రూ.20.94 లక్షల కోట్లు పన్ను ఆదాయం కాగా, పన్నేతర రూపంలో రూ.5.57 లక్షల కోట్లు, రుణేతర మార్గాల్లో రూ.57,129 కోట్ల ఆదాయం సమకూరింది. -
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య గొడవేంటి?
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా తెరచాటున సాగుతున్న షాడో వార్ ఇప్పుడు బాహాటంగా రణక్షేత్రంలోకి మారింది. ఒకప్పుడు మిత్రదేశాలుగా ఉన్న ఇరాన్, ఇజ్రాయెల్ నేడు బద్ధశత్రువులుగా మారాయి. అసలు ఈ రెండు దేశాల మధ్య సమస్య ఎక్కడ మొదలైంది? అగ్రరాజ్యం అమెరికా ఈ గొడవలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందో చూద్దాం.శత్రుత్వానికి పునాదులురెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1979 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. కానీ, ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవం సమీకరణాలను మార్చేసింది. ఇరాన్లో రాజు మహమ్మద్ రెజా షా పహ్లవీ అమెరికా మద్దతుతో దేశాధినేత పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నించారు. ఇది సంప్రదాయ ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. షా తన రహస్య పోలీసు దళంతో తనపై వ్యతిరేక స్వరాలను అణచివేసేవారు. దీంతో స్థానికంగా అసంతృప్తి పెరిగింది. దేశంలో చమురు సంపద పెరిగినప్పటికీ, అది సామాన్య ప్రజలకు చేరడం లేదని, కేవలం సంపన్నులకే లాభం చేకూరుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మొసాద్దెగ్ను అమెరికా తొలగించి షాను గద్దెనెక్కించడంపై ఇరానియన్లలో తీవ్ర వ్యతిరేకత ఉండేది.అప్పటి విప్లవం ఎలా జరిగింది?ఈ విప్లవంలో ప్రధాన నాయకుడు అయాతొల్లా రుహొల్లా ఖొమేనీ.. షా విధానాలను విమర్శించినందుకు ఆయనను 1964లో దేశం నుంచి బహిష్కరించారు. తాను ఫ్రాన్స్ నుంచి ఆడియో క్యాసెట్ల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలు పంపేవారు. 1978లో దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, సమ్మెలు మొదలయ్యాయి. సైన్యం ప్రజలపై కాల్పులు జరిపినా ఉద్యమం ఆగలేదు. పరిస్థితి చేజారిపోవడంతో 1979 జనవరిలో షా పహ్లవీ దేశం విడిచి పారిపోయారు. 1979 ఫిబ్రవరిలో ఖొమేనీ ఇరాన్ చేరుకున్నారు. ఏప్రిల్లో జరిగిన రెఫరెండం ద్వారా ఇరాన్ అధికారికంగా ఇస్లామిక్ రిపబ్లిక్గా మారింది.విప్లవం తర్వాత ఏం జరిగింది?దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ (మత పెద్ద) చేతిలోనే తుది నిర్ణయ అధికారం ఉండేలా రాజ్యాంగం మారింది. 1979 నవంబర్లో టెహ్రాన్లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడి చేసి 52 మంది దౌత్యవేత్తలను చాలా రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారు. అప్పటి నుంచి అమెరికా-ఇరాన్ సంబంధాలు తెగిపోయాయి. ముస్లిం పవిత్ర స్థలమైన అల్-అక్సా మసీదు ఉన్న జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించిందని, దాన్ని విముక్తి చేయడమే తమ లక్ష్యమని ఖొమేనీ ప్రకటించారు. ఇజ్రాయెల్ ఒక అక్రమ దేశం అన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరిస్తోంది. ఇరాన్ నేరుగా యుద్ధం చేయకుండా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న హమాస్ (గాజా), హిజ్బుల్లా (లెబనాన్), హూతీలు (యెమెన్) వంటి సంస్థలకు ఆయుధాలు, ఆర్థిక సాయం చేస్తోందనే వాదనలున్నాయి. ఇది ఇజ్రాయెల్ భద్రతకు పెను సవాలుగా మారింది.అణు బాంబు భయంఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని ఇజ్రాయెల్ బలంగా నమ్ముతోంది. ఇరాన్ చేతిలో అణు బాంబులు ఉంటే తమ మనుగడకే ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ గతంలోనే ఇరాన్ శాస్త్రవేత్తలను, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.అమెరికా ఎందుకు మధ్యలోకి వచ్చింది?పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామి. అయితే, అమెరికా జోక్యానికి కేవలం స్నేహం మాత్రమే కారణం కాదు, దీని వెనుక బలమైన భౌగోళిక రాజకీయ కారణాలు ఉన్నాయి.చమురు సంక్షోభంఇరాన్ తన క్షిపణులతో ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గాలను మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. దీన్ని అడ్డుకోవడం అమెరికాకు కీలకం.ప్రాంతీయ ఆధిపత్యంఇరాన్ విస్తరణ వాదాన్ని అడ్డుకోకపోతే సౌదీ అరేబియా వంటి ఇతర అరబ్ మిత్రదేశాల భద్రత ప్రమాదంలో పడుతుంది. ఇది రష్యా, చైనాల ప్రభావం ఆ ప్రాంతంలో పెరగడానికి దారితీస్తుంది.అణ్వాయుధ నియంత్రణఇరాన్ అణు సామర్థ్యం సాధిస్తే పశ్చిమాసియాలో అణ్వాయుధాల పోటీ మొదలవుతుంది. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై కఠిన ఆంక్షలు విధిస్తోంది.తాజాగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్లోని క్షిపణి కేంద్రాలపై భారీ దాడులు ప్రారంభించింది. ఇరాన్ అణు కార్యక్రమం వేగవంతం కావడంతో ఘర్షణ తారాస్థాయికి చేరింది. అమెరికా తన నావికా దళాలను గల్ఫ్ ప్రాంతంలో మోహరించి ఇజ్రాయెల్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఈ యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య భూభాగం కోసం జరుగుతున్నది కాదు. ఇది సిద్ధాంతాలకు, ప్రాంతీయ ఆధిపత్యానికి, భవిష్యత్ అణు భద్రతకు మధ్య జరుగుతున్న పోరాటమని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు -
సాగు విప్లవం దిశగా నాబార్డ్ అడుగులు
భారతీయ వ్యవసాయ రంగంలో నిర్మాణాత్మక మార్పులకు సమయం ఆసన్నమైందని, సంప్రదాయ కనీస మద్దతు ధర విధానం నుంచి మార్కెట్ ఆధారిత ధరల వైపు మళ్లడం ద్వారానే రైతులకు శాశ్వత ఆర్థిక భరోసా లభిస్తుందని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజీ స్పష్టం చేశారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ‘అగ్రి, కమోడిటీ సమ్మిట్ 2026’లో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ రంగాన్ని ఆర్థికంగా, సామాజికంగా, వాతావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను వివరించారు.ఖజానాపై భారం తగ్గేలా.. రైతుకు లాభం కలిగేలా..ప్రస్తుత కనీస మద్దతు ధర విధానం ప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోందని షాజీ విశ్లేషించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘మార్కెట్ డిటర్మైన్డ్ ప్రైసెస్’ (మార్కెట్ నిర్ణయించిన ధరలు) విధానాన్ని ఆయన ప్రతిపాదించారు. ‘ఎంఎస్పీ నుంచి మార్కెట్ ఆధారిత మద్దతు ధరలకు మళ్లాలి. ఇందులో కమోడిటీ డెరివేటివ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ఇందుకోసం మేము ఎన్సీడీఈఎక్స్తో కలిసి పని చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.రైతులకు ధరల రక్షణ కవచంరైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్పీఓ) ద్వారా రైతులకు ‘పుట్ ఆప్షన్స్’ అనే సరికొత్త ఆర్థిక సాధనాన్ని పరిచయం చేస్తున్నట్లు చైర్మన్ వెల్లడించారు. రైతులు స్వల్ప రుసుము చెల్లించి తమ పంట ధరకు ముందే లాక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ధరలు పెరిగితే ఆ పెరిగిన ధరల ప్రయోజనాన్ని రైతులు పొందవచ్చు. ఒకవేళ మార్కెట్ పడిపోతే రైతుకు కేవలం తాను చెల్లించిన రుసుము మాత్రమే నష్టం తప్ప, పంటపై కనీస ధర గ్యారెంటీగా ఉంటుంది.ఇది ఎలా పనిచేస్తుంది?ఉదాహరణకు ఒక రైతు క్వింటాల్ మిర్చిని రూ.10,000కు అమ్ముకోవాలని అనుకున్నాడనుకుందాం. రైతు కొంత రుసుము (ఉదాహరణకు రూ.200) చెల్లించి రూ.10,000 వద్ద ఎన్సీడీఈఎక్స్లో పుట్ ఆప్షన్ కొనుగోలు చేస్తారు. అంటే తన ధరను రూ.10,000 వద్ద లాక్ చేశారు.ధరలు పడిపోతే.. పంట చేతికి వచ్చేసరికి మార్కెట్లో ధర రూ.8,000 కి పడిపోయింది. అప్పుడు రైతు ఆందోళన చెందక్కర్లేదు. అతను ముందే చేసుకున్న ఒప్పందం ప్రకారం తన పంటను రూ.10,000కే అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతుకు రూ.2,000 నష్టం తప్పుతుంది.ధరలు పెరిగితే.. ఒకవేళ మార్కెట్లో ధర రూ.12,000కి పెరిగింది. అప్పుడు రైతు తన ‘ఆప్షన్’ను వదులుకుని నేరుగా మార్కెట్లోనే రూ.12,000కి అమ్ముకోవచ్చు. ఇక్కడ రైతుకు పెరిగిన ధర ప్రయోజనం లభిస్తుంది. అతను నష్టపోయేది కేవలం తను కట్టిన రూ.200 రుసుము మాత్రమే. మార్కెట్ కుప్పకూలినా రైతుకు కనీస గ్యారెంటీ ధర లభిస్తుంది. ఇది ఎంఎస్పీకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఎంఎస్పీలో ధర స్థిరంగా ఉంటుంది. కానీ పుట్ ఆప్షన్లో మార్కెట్ ధరలు పెరిగితే ఆ అదనపు లాభం రైతుకే చెందుతుంది.నాబార్డ్, ఎన్సీడీఈఎక్స్ సహకారంఈ విధానాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి నాబార్డ్, ఎన్సీడీఈఎక్స్తో కలిసి పైలట్ ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. గిడ్డంగులను ఈ మార్కెట్ ప్లాట్ఫారమ్లతో అనుసంధానించడం ద్వారా రైతులు తమ పంటను వేర్హౌజ్లో పెట్టి అక్కడి నుంచే ఈ ఆప్షన్ల ద్వారా ధరను లాక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. వ్యక్తిగతంగా రైతులు మార్కెట్ ట్రేడింగ్ చేయడం కష్టం కాబట్టి, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్పీఓ) రైతుల తరపున ఈ లావాదేవీలు నిర్వహిస్తాయి. దీనివల్ల రైతులకు సాంకేతిక పరిజ్ఞానంతో పనిలేకుండా భరోసా లభిస్తుంది.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్! -
రూ.58 వేల కోట్లతో 15 మంది ఆర్థిక నేరగాళ్లు పరారు!
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవాల్సిన బ్యాంకింగ్ రంగాన్ని కొందరు బడా బాబులు కుప్పకూల్చుతున్నారు. సామాన్యుడు తీసుకున్న చిన్నపాటి రుణానికి వడ్డీ మీద వడ్డీ వేసి వసూలు చేసే బ్యాంకులు, వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరగాళ్ల విషయంలో మాత్రం నిస్సహాయ స్థితిలో కనిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 31 నాటికి అందిన గణాంకాల ప్రకారం దేశంలో 15 మందిని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లుగా గుర్తించగా, అందులో 9 మంది బ్యాంకింగ్ వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీశారు.గణాంకాలు ఏం చెబుతున్నాయి?విదేశాలకు పారిపోయిన ఈ నేరగాళ్ల నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం అక్షరాలా రూ.58,082 కోట్లు. అయితే, ఇప్పటి వరకు రికవరీ అయింది కేవలం రూ.19,187 కోట్లు మాత్రమే. అంటే సుమారు 67% నిధులు ఇంకా ఎగ్గొట్టిన వారి చేతుల్లోనే ఉన్నాయి.బ్యాంకుల వారీగా బకాయిలు - వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో)బ్యాంక్రావాల్సింది (వడ్డీతో)వసూలైందిఎస్బీఐ22,06711,412పంజాబ్ నేషనల్ బ్యాంక్10,9281,619బ్యాంక్ ఆఫ్ ఇండియా5,5891,450యూనియన్ బ్యాంక్4,9511,316ఇండియన్ బ్యాంక్3,062453బ్యాంక్ ఆఫ్ బరోడా3,0501,167కెనరా బ్యాంక్2,43547యూకో బ్యాంక్2,346882ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్2,219581 మోసగాళ్ల మాస్టర్ ప్లాన్బ్యాంకుల నుంచి భారీ రుణాలు పొందేందుకు, ఆపై వాటిని ఎగ్గొట్టేందుకు నేరగాళ్లు ప్రధానంగా కొన్ని మార్గాలను అనుసరిస్తున్నారు. షెల్ కంపెనీలు(కాగితాల మీద మాత్రమే ఉండే కంపెనీలు) సృష్టించి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి నిధులను మళ్లించడం ద్వారా అసలు డబ్బు ఎక్కడికి పోయిందో తెలియకుండా మనీ లాండరింగ్ చేస్తున్నారు.నాసిరకం భూములు లేదా తక్కువ విలువ గల ఆస్తులను బ్యాంకులకు కుదువ పెట్టి అధికారుల అండదండలతో వాటి విలువను భారీగా చూపి వందల కోట్ల రుణాలు పొందుతున్నారు.దిగుమతుల పేరుతో బ్యాంకులను గ్యారెంటీగా ఉంచి విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు(లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ దుర్వినియోగం). పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ తరహాలో ఈ పద్ధతిని ఎక్కువగా వాడుతున్నారు.బ్యాంకులు, ప్రభుత్వం ఏం చేస్తోంది?పరారీలో ఉన్న నేరగాళ్లపై పట్టు బిగించేందుకు కేంద్రం ‘ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, 2018’ని తీసుకువచ్చింది. నేరగాళ్లకు సంబంధించిన దేశీ, విదేశీ ఆస్తులను అటాచ్ చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా విదేశాల్లో ఉన్న ఆస్తుల జప్తు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఇంటర్పోల్ సహాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి సంబంధిత దేశాల నుంచి వారి అప్పగింత కోసం దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు.మరింత సమర్థంగా వసూళ్లు జరగాలంటే..?కేవలం చట్టాలు ఉంటే సరిపోదు.. వాటి అమలులో వేగం పెరగాలి. ఫోరెన్సిక్ ఆడిట్ విధిగా నిర్వహించాలి. రుణం తీసుకున్న కంపెనీ నిధులు మళ్లిస్తుందనే అనుమానం రాగానే ముందస్తుగా ఫోరెన్సిక్ ఆడిట్ చేయడం వల్ల వారు దేశం విడిచి పారిపోకముందే అడ్డుకోవచ్చు. పన్ను ఎగ్గొట్టి తలదాచుకునేందుకు వెళ్లే విదేశాలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకోవాలి. తద్వారా నిందితులు దాచుకున్న రహస్య ఖాతాల సమాచారం త్వరగా లభిస్తుంది. ఆర్థిక నేరాలకు సంబంధించి విచారణ ఏళ్ల తరబడి సాగకుండా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలి. లోపభూయిష్టమైన డాక్యుమెంట్లతో రుణాలు మంజూరు చేసిన బ్యాంకు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.సామాన్యుడి సొమ్మును కొల్లగొట్టి విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న ఆర్థిక నేరగాళ్ల విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, బ్యాంకింగ్ రంగాలు సమన్వయంతో పనిచేస్తేనే ఈ బకాయిల వసూలు సాధ్యమవుతుంది.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్! -
కొత్త జీడీపీ సిరీస్లో జీఎస్టీ, ఈ-వాహన్ డేటా
2022-23 బేస్ ఇయర్గా ఉండే కొత్త జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) సిరీస్లో ఈ-వాహన్, వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) డేటాతో పాటు వంటవాళ్లు, డ్రైవర్లు, పనిమనుషులు అందించే ఇంటి పనులకు సంబంధించిన సేవల గణాంకాలు మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.గణాంకాలు, పథకాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన వివరణ ప్రకారం, కాలక్రమేణా ఎకానమీలో చోటు చేసుకున్న మార్పులను ప్రతిబింబించేలా బేస్ ఇయర్ని ప్రతి ఐదేళ్లకోసారి మారుస్తారు. అయితే కోవిడ్ పరిణామాలు, జీఎస్టీ అమలు తదితర అంశాల కారణంగా కొన్నాళ్లుగా మార్చలేదు. ప్రస్తుతం 2011-12గా ఉన్న బేస్ ఇయర్ని 2022-23కి మారుస్తున్నారు.కార్మిక శక్తి సర్వే, కంపెనీల చట్టం కింద నమోదు చేసుకోని సంస్థలపై నిర్వహించే అధ్యయనాలను ఈ గణాంకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, రహదారి రవాణా సర్వీసులకు సంబంధించి ప్రైవేట్ వినియోగ వ్యయాలను అంచనా వేసేందుకు ఈ-వాహన్ పోర్టల్ డేటాను ఉపయోగిస్తారు. జీడీపీలో రాష్ట్రాలవారీగా ప్రైవేట్ కంపెనీల వాటాను అంచనా వేసేందుకు జీఎస్టీ డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి (అక్టోబర్–డిసెంబర్ 2025) సంబంధించి కొత్త సిరీస్ ప్రాతిపదికగా ఉండే జీడీపీ డేటాను శుక్రవారం (నేడు) విడుదల చేస్తారు. -
విమాన ప్రయాణికులకు ఊరట
విమాన ప్రయాణికుల కోరికను నెరవేరుస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల లోపు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా టికెట్ను రద్దు చేసుకోవడానికి లేదా మార్పులు చేసుకోవడానికి వీలు కల్పిస్తూ ‘లుక్-ఇన్ ఆప్షన్’ను తప్పనిసరి చేస్తూ కొత్త సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ (సీఏఆర్)ను జారీ చేసింది.ఎందుకీ నిర్ణయం?గత కొంతకాలంగా విమానయాన సంస్థల కఠినమైన విధానాలు, టికెట్ రద్దు చేసినప్పుడు రిఫండ్ ఇవ్వడంలో జరుగుతున్న జాప్యంపై ప్రయాణికుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల హక్కులను కాపాడేందుకు డీజీసీఏ ఈ నిబంధనలను రూపొందించింది. నవంబర్ 2025లోనే ఈ ప్రతిపాదనలపై ప్రాథమిక నివేదికలు వచ్చినప్పటికీ ఇప్పుడు ఇది అధికారికంగా అమలులోకి రానుంది.‘లుక్-ఇన్’ సదుపాయంఈ కొత్త నిబంధన ప్రకారం ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన 48 గంటల లోపు రద్దు చేసుకుంటే ఎటువంటి క్యాన్సిలేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.ప్రయాణ తేదీ లేదా సమయాన్ని మార్చుకోవాలనుకుంటే ఎయిర్లైన్స్ ఎటువంటి అదనపు సవరణ ఛార్జీలు వసూలు చేయవు.అయితే, కొత్తగా ఎంచుకున్న విమాన టికెట్ ధరలో వ్యత్యాసం ఉంటే మాత్రం ప్రయాణికుడే భరించాల్సి ఉంటుంది.డొమెస్టిక్ ఫ్లైట్స్ పరంగా ప్రయాణ తేదీకి కనీసం ఏడు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుంది.ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పరంగా ప్రయాణానికి కనీసం 15 రోజుల ముందు బుకింగ్ చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.ఈ సౌకర్యం ప్రస్తుతం నేరుగా ఎయిర్లైన్ వెబ్సైట్ల ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకే అమలవుతుంది.రిఫండ్ ప్రక్రియపై గడువుకేవలం రద్దు సదుపాయమే కాకుండా ప్రయాణికులకు రావాల్సిన నగదును తిరిగి చెల్లించే విషయంలో కూడా డీజీసీఏ కఠినమైన కాలపరిమితిని నిర్ణయించింది. విమానయాన సంస్థలు ప్రయాణికుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, రిఫండ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఈ కొత్త సీఏఆర్ స్పష్టం చేస్తోంది. విమాన ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికల్లో అనివార్య కారణాల వల్ల మార్పులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది.ఇదీ చదవండి: షాపింగ్ బిల్లుకు నో ఫోన్నెంబర్! -
ఆర్బీఐ కీలక ప్రకటన.. కొత్త రూల్!
భారతదేశంలో డిజిటల్ బ్యాంకింగ్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం మొబైల్ యాప్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ప్రజల రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే కొన్నిసార్లు బ్యాంక్ యాప్లు లేదా వెబ్సైట్లు వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా రూపకల్పన చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని నిర్మూలించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటనలు జారీ చేసింది.సాధారణంగా కొన్నిసార్లు బ్యాంక్ యాప్లు లేదా వెబ్సైట్లు ఉపయోగిస్తున్నప్పుడు.. చివరి దశలో కొన్ని అదనపు ఛార్జీలు కనిపిస్తుంటాయి. అవసరం లేని సేవలను కొనుగోలు చేయమని పదేపదే వచ్చే కొన్ని సూచనలు కూడా కనిపిస్తుంటాయి. స్పష్టంగా అర్థం కాని కొన్ని విషయాలు వినియోగదారులను కొంత గందరగోళానికి గురి చేస్తాయి. ఇలాంటి మోసపూరిత రూపకల్పనలను డార్క్ ప్యాటర్న్స్ అని అంటారు. వీటిని నిర్మూలించడానికి ఆర్బీఐ కీలక చర్యలు చేపట్టింది.2026 సంవత్సరానికి సంబంధించిన 'రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్ అమెండ్మెంట్ డైరెక్షన్ 2026' అనే ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసి, బ్యాంకులు తమ వెబ్సైట్లు & మొబైల్ యాప్లలో ఉన్న అన్ని డార్క్ ప్యాటర్న్స్ను 2026 జూలై నాటికి తొలగించాలని ఆర్బీఐ ఆదేశించింది.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బ్యాంకులు తమ ఆర్థిక ఉత్పత్తులను ప్రచారం చేసే విధానంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. కస్టమర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. ఏదైనా కొత్త సేవను అందించే ముందు వినియోగదారుల నుంచి అనుమతి తీసుకోవాలి. అంటే.. కస్టమర్లకు పూర్తి సమాచారం ఇచ్చి, వారి అంగీకారం పొందిన తరువాత మాత్రమే అలాంటివి తెలియజేయాల్సి ఉంటుంది.రిజర్వ్ బ్యాంక్ చేసిన ఈ ప్రకటన వల్ల.. వినియోగదారులకు చాలా లాభాలున్నాయి. ముందుగా వారు చెల్లించాల్సిన ఛార్జీలు, తీసుకునే సేవల గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. బ్యాంకులపై ప్రజల నమ్మకం పెరుగుతుంది. పారదర్శకత & బాధ్యతాయుతమైన వ్యాపార ప్రవర్తన బ్యాంకింగ్ రంగాన్ని మరింత బలపరుస్తాయి.ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్ను చేసిన కియోసాకి బుక్ -
అతిపెద్ద ఆర్థిక మార్పు ఎదుర్కొంటున్నాం: కియోసాకి
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఫెడరల్ రిజర్వ్ విధానాలు, ద్రవ్యోల్బణం, బిట్కాయిన్ భవిష్యత్తు వంటి అంశాలపై లోతైన విశ్లేషణతో రూపొందిన డాక్యుమెంటరీ ‘మనీ డిస్రప్టెడ్’ (Money Disrupted) ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ డాక్యుమెంటరీని ఫ్రూషన్ ప్రొడక్షన్స్ తరఫున క్రిస్టఫర్ డాడ్జ్ నిర్మించారు. ప్రముఖ ఇన్వెస్టర్, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ఈ డాక్యుమెంటరీని తన సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రోత్సహించడంతో ఇది మరింత ప్రచారం పొందింది. దీంట్లో ఆయన మాట్లాడినదానికి సంబంధించి చిన్న వీడియో క్లిప్ను జోడిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో కియోసాకి పోస్ట్ చేశారు.చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మార్పును ప్రపంచం ఎదుర్కొంటోందని వీడియోలో చెప్పుకొచ్చిన రాబర్ట్ కియోసాకి.. దీన్ని తాను ముందే ఊహించానన్నారు. అందుకే ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తకాన్ని రచించానన్నారు. ఆ తర్వాత తన జీవితమే మారిపోయిందన్నారు. ఇంకా ఆయన ఏమేమి మాట్లాడారన్నది పూర్తి డాక్యుమెంటరీ విడుదలయ్యాక తెలుస్తుంది. ఫెడరల్ రిజర్వ్ నుంచి బిట్కాయిన్ వరకూ...డాక్యుమెంటరీలో ముఖ్యంగా అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (Federal Reserve) స్థాపన తర్వాతి ఆర్థిక పరిణామాలు, 1971లో గోల్డ్ స్టాండర్డ్ ముగింపు, పెరుగుతున్న జాతీయ అప్పులు, ద్రవ్యోల్బణ ప్రభావాలను విశ్లేషించారు.నిపుణుల అభిప్రాయాలతో పాటు, సంప్రదాయ ఫియాట్ కరెన్సీ వ్యవస్థపై విమర్శాత్మక దృష్టికోణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. బ్లాక్చెయిన్ సాంకేతికత, బిట్కాయిన్ వంటి డిజిటల్ ఆస్తులు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ మార్గాలుగా మారవచ్చని చిత్ర బృందం సూచిస్తోంది.ప్రముఖుల అభిప్రాయాలుఈ డాక్యుమెంటరీలో మాజీ అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాన్ పాల్, ఆర్థిక విశ్లేషకులు లినెట్ జాంగ్, ఆండి షెక్ట్మన్ తదితరులు తమ అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు. ద్రవ్య విధానాలపై వీరి విమర్శలు, “సౌండ్ మనీ” అవసరంపై వారి వాదనలు ఈ డాక్యుమెంటరీకి వైవిధ్యాన్ని తీసుకురానున్నాయి.Check out the full documentary Money Disrupted by Christopher Dodge of Fruition Productions - here is a short clip https://t.co/uojn89SCoS— Robert Kiyosaki (@theRealKiyosaki) February 23, 2026 -
సెమీకండక్టర్లకు దశాబ్దాలపాటు మద్దతు
సంపన్న దేశాల తరహాలోనే వచ్చే 20–25 ఏళ్ల పాటు సెమీకండక్టర్ల వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ (మెయిటీ) అదనపు కార్యదర్శి అమితేష్ సిన్హా తెలిపారు. చిప్ల తయారీ యూనిట్లలోని వెండార్లకు సింగిల్ విండో క్లియరెన్స్ సౌలభ్యం కోసం త్వరలో పోర్టల్ ప్రారంభించనున్నట్లు చెప్పారు.‘పరిశ్రమకు కావాల్సిన మద్దతు గురించి ప్రభుత్వానికి అవగాహన ఉంది. ఇదేదో కొన్నేళ్ల వ్యవహారం కాదు.. కనీసం 20–25 ఏళ్ల పాటు అవసరమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతన సెమీకండక్టర్ వ్యవస్థలు ఉన్న దేశాల్లో రెండు నుంచి అయిదు దశాబ్దాల పాటు ప్రభుత్వాలు వాటికి మద్దతునిచ్చాయి. ఇది టీ20 కాదు. మారథాన్లాంటిది. మేము దీని కోసం సర్వసన్నద్ధంగా ఉన్నాం’ అని ఐఈఎస్ఏ విజన్ సదస్సు 2026లో వర్చువల్గా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. వచ్చే నెలలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్ఎం) 1.0 కింద మరికొన్ని సెమీకండక్టర్ ప్రాజెక్టులు ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత ఐఎస్ఎం 2.0ని ఆవిష్కరించనున్నట్లు సిన్హా పేర్కొన్నారు.ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్ -
సోలార్పై సుంకాల మోత
న్యూఢిల్లీ: భారత సోలార్ ఉత్పత్తులపై అమెరికా చర్యలకు దిగింది. భారత్ నుంచి వచ్చే సోలార్ విడిభాగాలపై 125.87 శాతం ప్రాథమిక కౌంటర్ వెయిలింగ్ (వ్యతిరేకంగా) సుంకం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్పత్తులకు భారత్ అనుచితంగా సబ్సిడీలు సమకూరుస్తున్నట్టు ఆరోపించింది. భారత్తోపాటు ఇండోనేసియా, లావోస్ నుంచి వచ్చే క్రిస్టలిన్ సిలికాన్ ఫొటోవోల్టాయిక్ సెల్స్పై (సోలార్ మాడ్యూళ్లలో అసెంబుల్ అయినా, కాకపోయినా) సుంకాలు విధిస్తూ అమెరికా వాణిజ్య శాఖ 24న ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్షుడు ట్రంప్ విధించిన 10 శాతం సార్వత్రిక సుంకాలకు ఇది అదనమని పేర్కొంది. ఈ దేశాల నుంచి చౌకగా వస్తున్న దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ విచారణలు సైతం నిర్వహించనున్నట్టు తెలిపింది. భారత్ నుంచి అమెరికాకు సోలార్ ఎగుమతులు 2022లో 83.86 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2024లో 792.6 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు ప్రస్తావించింది. విదేశీ చౌక ఉత్పత్తుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు ఈ చర్యకు ఉపక్రమించింది. సంప్రదాయ విద్యుత్ వనరులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలమైన సోలార్, పవన ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించడం తెలిసిందే. సోలార్ విడిభాగాల కోసం చైనా తదితర దేశాలపై ఆధారపడడాన్ని తగ్గించి, దేశీయంగానే వాటి తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) సైతం ప్రకటించింది. దీంతో 26.6 గిగావాట్ల సోలార్ పీవీ మాడ్యూళ్లు, 10.5 గిగావాట్ల సోలార్ పీవీ సెల్స్, 2 గిగావాట్ల ఇన్గాట్ వేఫర్ తయారీ సామర్థ్యాలు దేశీయంగా ఏర్పాటు కావడం గమనార్హం. దీంతో 2023–24లో 4.35 బిలియన్ డాలర్లుగా ఉన్న దిగుమతులు 2024–25లో 2.15 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ప్రభావం పరిమితమే.. భారత సోలార్ ఉత్పత్తులపై అమెరికా విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం పరిమితమేనని విక్రమ్ సోలార్, వారీ ఎనర్జీస్, ప్రీమియర్ ఎనర్జీస్ తెలిపాయి. ‘‘యూఎస్ ఏడీ/సీవీడీ సుంకాలు ప్రత్యేకంగా భారత తయారీ సెల్స్కు ఉద్దేశించినవి. అమెరికా ఆర్డర్లకు సంబంధించి చేసే సరఫరాల్లో భారత సెల్స్ను వినియోగించడం లేదు. తక్కువ టారిఫ్లున్న భౌగోళిక ప్రాంతాల నుంచి వాటిని సమకూర్చుకుంటున్నాం. కనుక ఈ సుంకాల వల్ల పడే ప్రత్యక్ష ప్రభావం పరిమితం’’అని విక్రమ్ సోలార్ సీఎండీ జ్ఞానేష్ చౌదరి స్పష్టం చేశారు. దేశీయంగా డిమాండ్ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆయిల్–ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఇటీవలే 378.75 మెగావాట్ల మాడ్యూళ్ల ఆర్డర్ను గెలుచుకోవడాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత యూఎస్ ఆర్డర్ల సరఫరాలపై తాజా సుంకాల ప్రభావం ఉంటుందని భావించడం లేదని వారీ ఎనర్జీస్ గ్రూప్ హెడ్ అభిõÙక్ పరీక్ తెలిపారు. మరోవైపు వారీ ఎనర్జీస్ అమెరికాలోనే తన సోలార్ సెల్స్ తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే ప్రణాళికతోనూ ఉంది. ‘‘మా వ్యాపారంలో ఎగుమతుల వాటాను పూర్తిగా సున్నాకు తగ్గించుకున్నాం. కనుక అమెరికా సుంకాల ప్రభావం మాపై ఏమీ ఉండదు’’అని ప్రీమియర్ ఎనర్జీస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ వినయ్ రస్తోగి తెలిపారు. -
వినియోగంలో లేని పీఎఫ్ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్
వినియోగంలో లేని (ఇనాపరేటివ్) దాదాపు ఏడు లక్షల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాల్లోని సుమారు రూ.30.52 కోట్ల మొత్తాన్ని రిఫండ్ చేయడంపై ఈపీఎఫ్వో దృష్టి పెడుతోంది. సదరు ఖాతాదారులు లేదా వారి లీగల్ వారసులకు త్వరలో బదిలీ చేయనున్నట్లు కార్మిక శాఖ వర్గాలు తెలిపాయి. రూ.1,000 వరకు బ్యాలెన్స్ ఉన్న 7.11 లక్షల ఖాతాలను సెటిల్ చేయాలని కార్మిక, ఉపాధి శాఖ ఒక సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు వివరించాయి.ఉద్యోగి లేదా కంపెనీ నుంచి 36 నెలలకు పైగా ఎలాంటి జమ లేని పీఎఫ్ ఖాతాలను ఇనాపరేటివ్గా పరిగణిస్తారు. సంబంధిత వర్గాల ప్రకారం 31.86 లక్షల ఇనాపరేటివ్ ఖాతాల్లో మొత్తం రూ. 10,903 కోట్లు ఉన్నాయి. వాటిలో రూ. 1,000 లేదా అంతకన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లు ఏడు లక్షలు ఉన్నాయి. ఆధార్తో అనుసంధానమైన ఈపీఎఫ్ ఖాతాలున్న వారి బ్యాంకు ఖాతాలకు ఈ మొత్తాలను తక్షణం బదిలీ చేయనున్నారు. ఇదీ చదవండి: పీఎఫ్పై లోన్ తీసుకోవచ్చా?ఖాతాదారు చనిపోతే..ఒకవేళ ఖాతాదారు మరణించిన పక్షంలో నామినీ లేదా చట్టబద్ధ వారసులకు చెల్లిస్తారు. అటు, సభ్యులు, సంస్థలకు మెరుగైన సర్వీసులు అందించేందుకు ఈపీఎఫ్వో 3.0 ప్రాజెక్టుపై కేంద్రం కసరత్తు చేస్తోంది. (EPFO 3.0: పీఎఫ్ విత్డ్రా మరింత సులభం!)ఇదీ చదవండి: ఈపీఎఫ్ వడ్డీ.. ఈసారైనా పెరుగుతుందా? -
రిటైల్ రుణాలు రూ.162 లక్షల కోట్లు
రిటైల్ రుణాలు గణనీయమైన వృద్ధిని చూస్తున్నాయి. 2025 డిసెంబర్ త్రైమాసికంలో 18 శాతం పెరిగి రూ.162 లక్షల కోట్లకు చేరాయి. ముఖ్యంగా బంగారం ధరలు పెరగడంతో, వాటిపై రుణాలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడం.. అలాగే, పండగల సీజన్, జీఎస్టీ రేట్ల తగ్గింపు రుణ వితరణ పెరిగేందుకు దారితీసింది. ఈ వివరాలను క్రెడిట్ సమాచార సంస్థ క్రిఫ్ హై మార్క్ విడుదల చేసింది. రిటైల్ రుణాల్లో అతిపెద్ద విభాగమైన గృహ రుణాలు 10.5 శాతం పెరిగి రూ.43 లక్షల కోట్లకు చేరాయి. ఈ విభాగంలో యాక్టివ్ రుణాలు నికరంగా 3.3 లక్షలు పెరిగాయి. వ్యక్తిగత రుణాలు సైతం 11.6 శాతం వృద్ధితో రూ.15.9 లక్షల కోట్లుగా ఉన్నాయి.ఆటో రుణాలు 14.6 శాతం, ద్విచక్ర వాహన రుణాలు 12.3 శాతం, కన్జ్యూమర్ డ్యురబుల్ రుణాలు 14.3 శాతం చొప్పున పెరిగాయి. సోల్ పొప్రైటర్ సంస్థలు (ఒక్కరే యజమానిగా ఉన్న) తీసుకున్న రుణాలు 26.2 శాతం పెరిగాయి. రిటైల్ రుణాల వసూలు కూడా మెరుగుపడింది. 30 నుంచి 180 రోజుల వరకు చెల్లింపుల్లేనివి (మొండి బకాయిలు) డిసెంబర్ చివరికి 2.8 శాతానికి తగ్గాయి. సరిగ్గా అంతక్రితం ఏడాది డిసెంబర్ చివరికి ఇవి 3.2 శాతంగా ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో గృహ రుణాలు ఎక్కువ వృద్ధిని చూడగా, ఢిల్లీ మార్కెట్లో వృద్ధి తగ్గుమఖం పట్టింది. డిసెంబర్ త్రైమాసికంలో నికరంగా జారీ అయిన మొత్తం రుణాల్లో సగం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉన్నాయి.ఇదీ చదవండి: మార్కెట్ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి? -
ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత: ఆర్బీఐ
జీడీపీలో ప్రభుత్వ నికర రుణభారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గనుండడంతో.. ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరగనున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం స్థూల రుణ సమీకరణను రూ.17.3 లక్షల కోట్లుగా.. నికర రుణ సమీకరణ జీడీపీలో 3 శాతంగా పేర్కొనడాన్ని ప్రస్తావించింది. ఇది క్రమంగా కరోనా ముందస్తు స్థాయిలకు తగ్గించుకోవడంగా ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది. రూ.17.3 లక్షల కోట్ల స్థూల రుణ సమీకరణ అంచనాలకు మించి ఉందని, ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత తగ్గుతుందంటూ ఓ వర్గం ప్రజల్లో నెలకొన్న ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించింది.ఆర్బీఐ డేటా ప్రకారం 2019–20లో జీడీపీలో ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ రూ.4.73 లక్షల కోట్లు (2.4 శాతం)గా ఉండడం గమనార్హం. 2020–21లో కరోనా విపత్తు కారణంగా ఏకంగా రూ.10.33 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా ముందస్తు స్థాయిలకు నికర మార్కెట్ రుణ సమీకరణ తగ్గించుకుంటున్నందున ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్బీఐ బులెటిన్ స్పష్టం చేసింది. ఇక 2024–25 ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ జీడీపీలో 3.5 శాతం (రూ.11.63 లక్షల కోట్లు), 2025–26లో 3.2 శాతం (రూ.11.32 లక్షల కోట్లు) చొప్పున ఉండడం గమనార్హం. -
ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత
జీడీపీలో ప్రభుత్వ నికర రుణభారం 2026–27 ఆర్థిక సంవత్సరంలో 3 శాతానికి తగ్గనుండడంతో.. ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరగనున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. 2026–27 బడ్జెట్లో ప్రభుత్వం స్థూల రుణ సమీకరణను రూ.17.3 లక్షల కోట్లుగా.. నికర రుణ సమీకరణ జీడీపీలో 3 శాతంగా పేర్కొనడాన్ని ప్రస్తావించింది. ఇది క్రమంగా కరోనా ముందస్తు స్థాయిలకు తగ్గించుకోవడంగా ఆర్బీఐ బులెటిన్ పేర్కొంది.రూ.17.3 లక్షల కోట్ల స్థూల రుణ సమీకరణ అంచనాలకు మించి ఉందని, ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత తగ్గుతుందంటూ ఓ వర్గం ప్రజల్లో నెలకొన్న ఆందోళలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆర్బీఐ డేటా ప్రకారం 2019–20లో జీడీపీలో ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ రూ.4.73 లక్షల కోట్లు (2.4 శాతం)గా ఉండడం గమనార్హం. 2020–21లో కరోనా విపత్తు కారణంగా ఏకంగా రూ.10.33 లక్షల కోట్లకు పెరిగింది. కరోనా ముందస్తు స్థాయిలకు నికర మార్కెట్ రుణ సమీకరణ తగ్గించుకుంటున్నందున ప్రైవేటు రంగానికి నిధుల లభ్యత పెరుగుతుందని, ఆర్థిక మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని ఆర్బీఐ బులెటిన్ స్పష్టం చేసింది. ఇక 2024–25 ప్రభుత్వ నికర మార్కెట్ రుణ సమీకరణ జీడీపీలో 3.5 శాతం (రూ.11.63 లక్షల కోట్లు), 2025–26లో 3.2 శాతం (రూ.11.32 లక్షల కోట్లు) చొప్పున ఉండడం గమనార్హం.ఇదీ చదవండి: 4 కంపెనీల లిస్టింగ్కు ఓకే -
పదిలంగానే అమెరికా వాణిజ్య ఒప్పందాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన సుంకాల విధానంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఏ దేశమూ అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల నుంచి వైదొలగాలనుకోవడం లేదని చెప్పారు.నిర్మాణాత్మక చర్చలు - స్థిరమైన బంధాలుఓ కార్యక్రమంలో గ్రీర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములతో అమెరికా జరుపుతున్న చర్చలు అత్యంత నిర్మాణాత్మకంగా సాగుతున్నాయని వెల్లడించారు. అమెరికా వాణిజ్య విధానాలపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతర్జాతీయంగా దృష్టిని ఆకర్షించినప్పటికీ దాని ప్రభావం వల్ల భాగస్వామ్య దేశాలు తమ ఒప్పందాల నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు. ‘ఇప్పటివరకు ఏ దేశం కూడా మా వద్దకు వచ్చి ఒప్పందాన్ని నిలిపివేస్తున్నామని చెప్పలేదు’ అని గ్రీర్ పేర్కొన్నారు.ఈయూ, ఇతర దేశాలతో సమన్వయంప్రస్తుత వాణిజ్య ఒప్పందాలకు అమెరికా కట్టుబడి ఉందనే అంశాన్ని బలోపేతం చేయడానికి గ్రీర్ ఇప్పటికే ఈయూలోని తన సహచరులతో చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఇతర కీలక దేశాల అధికారులతో కూడా ఇలాంటి చర్చలు జరపడానికి షెడ్యూల్ ఖరారైంది. అంతర్జాతీయ వాణిజ్య అంశాల్లో స్థిరత్వాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ షెడ్యుల్ను రూపొందించినట్లు అమెరికా చెప్పింది.విశ్లేషకుల అభిప్రాయంఅమెరికాలోని అంతర్గత చట్టపరమైన మార్పులు లేదా రాజకీయ పరిణామాలు అంతర్జాతీయ ఒప్పందాలను ప్రభావితం చేయవనే నమ్మకం వాణిజ్య భాగస్వాముల్లో ఉందని గ్రీర్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. యూఎస్ అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితిని తగ్గించడమే కాకుండా మిత్రదేశాల మధ్య విశ్వాసాన్ని పటిష్టం చేస్తుంది. వాణిజ్య విధానంలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అమెరికా తన గ్లోబల్ ట్రేడ్ లీడర్షిప్ను నిలబెట్టుకోవాలని చూస్తోంది.ఇదీ చదవండి: ఏఐ ఏజెంట్లతో షాపింగ్.. మాస్టర్ కార్డ్ ఏజెంటిక్ కామర్స్ విప్లవం! -
ఫారెక్స్ ఆల్టైమ్ హై.. బంగారం 128.46 బిలియన్ డాలర్లు
ముంబై: విదేశీ మారకం నిల్వలు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో 8.66 బిలియన్ డాలర్ల మేర పెరిగి 725.72 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. అంతుకుముందు ఫిబ్రవరి6తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 6.71 బిలియన్ డాలర్ల మేర తగ్గి 717.06 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో నమోదైన 723.77 బిలియన్ డాలర్లు పూర్వపు గరిష్ట స్థాయిగా ఉంది. ఫిబ్రవరి 13తో ముగిసిన వారంలో కరెన్సీ ఆస్తులు (విదేశీ మారకం నిల్వల్లో అధిక భాగం) నికరంగా 3.55 బిలియన్ డాలర్లు పెరిగి 573.60 బిలియన్ డాలర్లకు చేరాయి. డాలర్లతోపాటు, యూరో, పౌండ్, యెన్ రూపంలో విదేశీ కరెన్సీ ఆస్తులున్నాయి. బంగారం రూపంలో మారకం నిల్వలు 4.99 బిలియన్ డాలర్ల మేర పెరిగి 128.46 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 103 మిలియన్ డాలర్లు పెరిగి 18.92 బిలియన్ డాలర్లకు చేరాయి. -
డీ-డాలరైజేషన్ ఊహాగానాలకు బ్రెజిల్ చెక్
అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యం, బ్రిక్స్ కూటమి సొంత కరెన్సీపై జరుగుతున్న సుదీర్ఘ చర్చకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తెరదించారు. సరైన అవగాహన లేకపోవడంతోనే డీ-డాలరైజేషన్పై ప్రచారం జరుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భారత్-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాలపై వ్యాఖ్యలు చేశారు.బ్రిక్స్ కరెన్సీపై స్పష్టతబ్రిక్స్ దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తున్నాయనే వార్తలను లూలా డా సిల్వా పూర్తిగా కొట్టిపారేశారు. కొత్త కరెన్సీని సృష్టించాలనే ప్రతిపాదన గానీ, ఆ దిశగా చర్చలు గానీ బ్రిక్స్లో జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాత్రికి రాత్రే మారదన్నారు. డాలర్ ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ అని అంగీకరించారు. ఇతర కరెన్సీల ఎదుగుదలను అమెరికా సహజంగానే ప్రతిఘటిస్తుందని చెప్పారు. ఆ వాస్తవాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం.. డాలర్ వ్యతిరేకత కాదుడాలర్ వినియోగాన్ని తగ్గించడం అంటే అది అమెరికాపై కక్ష కట్టడం కాదని, దేశాలకు మరిన్ని వ్యాపార ఎంపికలు చూపడమేనని లూలా వివరించారు. భారత్, బ్రెజిల్ మధ్య వాణిజ్యం కేవలం డాలర్లపైనే ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక కరెన్సీల (రూపాయి-రియల్) వాడకాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ ప్రయత్నించడం అవసరమని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: ఏఐ గ్లోబల్ గవర్నెన్స్కు అమెరికా పూర్తి వ్యతిరేకం -
ఏప్రిల్ 2026 నుంచి ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’తో తగ్గుదల!
భారత బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్కరణలు చేపడుతోంది. ఏప్రిల్ 1, 2026 నుంచి డిపాజిట్ ఇన్సూరెన్స్ కోసం ‘రిస్క్ బేస్డ్ ప్రీమియం’ ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల మెరుగైన రిస్క్ మేనేజ్మెంట్ పాటించే బ్యాంకులకు ఆర్థిక వెసులుబాటు కలగడమే కాకుండా ఖాతాదారుల డిపాజిట్లకు మరింత భద్రత చేకూరనుంది.ప్రస్తుత విధానం vs కొత్త విధానంప్రస్తుతం అమలులో ఉన్న ఫ్లాట్ ప్రీమియం పద్ధతిలో బ్యాంకు స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి రూ.100 అసెసబుల్ డిపాజిట్లకు (ఒక బ్యాంకు తన వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లపై డీఐసీజీసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఏ మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ ప్రీమియంను లెక్కిస్తారో దాన్ని అసెసబుల్ డిపాజిట్లు అంటారు) 12 పైసలను ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 6, 2026న విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ ధరలను డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నిర్ణయించే రిస్క్ స్కోర్ల ఆధారంగా వర్గీకరిస్తారు.ముఖ్యమైన అంశాలుబ్యాంకుల అంతర్గత రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా ప్రీమియం మారుతుంది. పటిష్టమైన ఆర్థిక స్థితి ఉన్న బ్యాంకులు తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.ఐసీఆర్ఏ అంచనా ప్రకారం క్లెయిమ్లు లేని, సుదీర్ఘ హిస్టరీ కలిగిన బ్యాంకులు తమ అసెట్స్ పై రిటర్న్ (ఆర్ఓఏ)లో దాదాపు 4 బేసిస్ పాయింట్ల వృద్ధిని చూడవచ్చు.దేశంలోని మొత్తం డిపాజిట్లలో 80 శాతం వాటా కలిగిన బ్యాంకులు ఈ రాయితీ ప్రీమియంల వల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకింగ్ రంగానికి మొత్తంగా 3 బేసిస్ పాయింట్లు లాభం చేకూరవచ్చు.టైర్-1 బ్యాంకులపై ప్రభావంషెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు (ఆర్ఆర్బీలు మినహా) వర్తించే టైర్-1 మోడల్ ప్రకారం ‘ఏ’ కేటగిరీ బ్యాంకుల ప్రీమియం రూ.100కి 8 పైసలకు తగ్గుతుంది. అంటే గతంలో కంటే నేరుగా 33.33 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా, వింటేజ్ ఆధారిత ప్రోత్సాహకం కింద మరో 25 శాతం వరకు ప్రీమియం తగ్గే అవకాశం ఉంది.రూ. 5 లక్షల పరిమితి పెరుగుతుందా?ప్రస్తుతం ఒక బ్యాంకులో ఖాతాదారుడికి గరిష్టంగా రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంది. కొత్త ధరల నిర్మాణం వల్ల భవిష్యత్తులో ఈ బీమా పరిమితిని మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. రిస్క్ ఆధారిత ప్రీమియం వల్ల బ్యాంకులపై పడే అదనపు భారాన్ని ఈ రాయితీలు భర్తీ చేస్తాయని ఐసీఆర్ఏ పేర్కొంది.ఇదీ చదవండి: బంగారం ధరలు యూటర్న్! తులం ఎంతంటే.. -
ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు
దేశంలో ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు గుప్పిస్తున్న ‘ఉచితాల’ సంస్కృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అసలైన లబ్ధిదారులకు, సంపన్నులకు మధ్య తేడా చూడకుండా ప్రజా ధనాన్ని ఇష్టానుసారంగా పంపిణీ చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ఇలాంటి విధానాలు పాటిస్తారా అని ప్రశ్నించింది.ఖజానా ఖాళీ అవుతున్నా ఆగని కానుకలుప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం (జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం.పంచోలి) ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రాలైనా, లోటు బడ్జెట్తో నడుస్తున్న రాష్ట్రాలైనా.. అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుల్లో ఉన్న రాష్ట్రాలు సైతం ఎన్నికల ముందు స్కూటీలు, బట్టలు, ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయడానికి వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నాయి?’ అని ధర్మాసనం నిలదీసింది.ఈ ప్రస్తావనకు సందర్భం ఏమిటి?తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎన్పీడీసీఎల్) దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ చర్చ మొదలైంది. విద్యుత్ (సవరణ) చట్టం-2024లోని రూల్ 23 రాజ్యాంగ బద్ధతను తమిళనాడు ప్రభుత్వం సవాలు చేసింది. ఈ క్రమంలో సీజేఐ స్పందిస్తూ.. ‘విద్యుత్ రంగంలో సంపన్నుల నుంచి వసూలు చేసి లాభాలు గడించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రాలు ఎందుకు ఆ పని చేయడం లేదు? హరియాణా, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్ లేదా ఈశాన్య రాష్ట్రాలు ఏదైనా కావచ్చు.. ఎన్నికలు రాగానే పథకాల వెల్లువ ఎందుకు వస్తోంది?’ అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు, సిద్ధాంతకర్తలు ఈ సంస్కృతిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.కోర్టు పరిమితులుఒక దశలో సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారో అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు భావించింది. అయితే న్యాయవ్యవస్థ పరిమితులను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోకూడదని ధర్మాసనం నిర్ణయించుకుంది. కానీ, సంక్షేమానికి, విచ్చలవిడి ఖర్చుకు మధ్య సమతుల్యత లేకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది.టీఎన్పీడీసీఎల్ వాదన ఏమిటి?తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ప్రధానంగా విద్యుత్ (సవరణ) నియమావళి, 2024లోని రూల్ 23 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైంది.రూల్ 23 అంటే..కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్) తాము సరఫరా చేసే విద్యుత్తుకు అయ్యే ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేయాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వర్గానికి (ఉదాహరణకు రైతులకు లేదా గృహ వినియోగదారులకు) ఉచిత విద్యుత్ లేదా సబ్సిడీ ఇవ్వాలనుకుంటే ఆ సబ్సిడీ మొత్తాన్ని ముందుగానే డిస్కమ్ సంస్థలకు చెల్లించాలి.తమిళనాడు ప్రభుత్వం ఏమంటుంది?తమిళనాడు ప్రభుత్వం ఈ నిబంధనను కొన్ని కారణాలతో వ్యతిరేకిస్తోంది. విద్యుత్ అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఉమ్మడి జాబితాలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజల అవసరాలకు అనుగుణంగా సబ్సిడీలు ఇచ్చే స్వతంత్ర అధికారం ఉంటుంది. కేంద్రం ఇలాంటి కఠిన నిబంధనలు పెట్టడం రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడమేనని వారి వాదన. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యయాలు పెరిగినప్పుడు ఆ భారాన్ని తక్షణమే వినియోగదారులపై వేయడం సాధ్యం కాదని, అది సామాన్యులపై భారం చూపుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అనేది దశాబ్దాలుగా వస్తున్న విధానం. రూల్ 23 వల్ల ఈ సంక్షేమ పథకాల అమలు కష్టతరమవుతుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించినప్పుడు ఉచితాల అంశాన్ని లేవనెత్తింది. ఒకవైపు డిస్కమ్లు భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్తూ, మరోవైపు సంపన్నులకు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని కోర్టు ప్రశ్నించింది. సంపన్నుల నుంచి సరైన ధర వసూలు చేస్తే ఆ ఆదాయాన్ని పేదలకు మెరుగైన విద్యుత్ అందించడానికి లేదా మౌలిక సదుపాయాల కల్పనకు వాడవచ్చు కదా అని సీజేఐ సూచించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
భారత ఆర్థిక భవిష్యత్తుకు పెన్షన్లు కీలకం
భారతదేశ ఆర్థికాభివృద్ధి గురించి చర్చ వచ్చినప్పుడల్లా సాధారణంగా జీడీపీ వృద్ధి, తయారీ రంగం, మౌలిక సదుపాయాలు లేదా స్టార్టప్ల గురించి మాట్లాడుకుంటాం. కానీ, దేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ణయించే అత్యంత కీలకమైన అంశం ‘పెన్షన్’ గురించి చాలా తక్కువగా చర్చిస్తాం. నేడు యువ భారత్గా ఉన్న మన దేశం భవిష్యత్తుల్లో వృద్ధాప్యం వైపు అడుగులు వేయాల్సిందే. ఈ తరుణంలో పెన్షన్లు కేవలం వ్యక్తిగత పొదుపు మాత్రమే కాదు, దేశ ఆర్థిక గమనానికి ఒక బలమైన పునాదిగా మారుతున్నాయి.ప్రస్తుతం భారతదేశం యువ జనాభాతో ప్రపంచంలోనే ప్రత్యేక స్థానంలో ఉంది. పని చేసే వయస్సు గల జనాభా ఎక్కువగా ఉండటం వల్ల వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే, ఈ అనుకూలత ఎల్లకాలం ఉండదు. కొన్ని సర్వేల ప్రకారం.. 2050 నాటికి భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య సుమారు 32 కోట్లకు చేరుకోనుంది. గతంలో వృద్ధులకు కుటుంబాలే ఆసరాగా ఉండేవి. కానీ నేడు పెరుగుతున్న పట్టణీకరణ, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం కారణంగా వృద్ధాప్యంలో ఆర్థిక స్వావలంబన తప్పనిసరి అవుతోంది.అవగాహన పెరుగుతున్నా.. సన్నద్ధత కరవుభారతీయులు రిటైర్మెంట్ ప్లానింగ్ను ముఖ్యమైనదిగా భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు వెనుకబడి ఉన్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. పీజీఐఎం ఇండియా రిటైర్మెంట్ రెడీనెస్ రిపోర్ట్ 2025 నివేదిక ప్రకారం, కేవలం 37% మంది భారతీయుల వద్ద మాత్రమే నిర్దిష్టమైన రిటైర్మెంట్ ప్లాన్ ఉంది. ఇది 2023లో ఉన్న 67% తో పోలిస్తే తగ్గింది. పట్టణ ప్రాంతాల్లోని 24% మంది భారతీయులు ఇప్పటివరకు రిటైర్మెంట్ కోసం రూపాయి కూడా పొదుపు చేయలేదు. కేవలం 11% మంది మాత్రమే తమ ప్రస్తుత పెట్టుబడులు భవిష్యత్తు అవసరాలకు సరిపోతాయని నమ్ముతున్నారు.పెన్షన్ వ్యవస్థ: దేశ ఆర్థిక వ్యవస్థకు బలంపెన్షన్లు కేవలం వ్యక్తిగత ప్రయోజనాలకే కాకుండా స్థూల ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని ఇస్తాయి. ఇవి దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించడంతోపాటు ప్రభుత్వంపై భవిష్యత్తులో పడే సామాజిక భద్రతా వ్యయాన్ని తగ్గిస్తాయి.దేశ పెన్షన్ నిర్మాణంఆర్గనైజ్డ్ సెక్టర్: ఈపీఎఫ్, ఈపీఎస్ ద్వారా ఉద్యోగులకు భద్రత.నేషనల్ పెన్షన్ సిస్టమ్: తక్కువ ఖర్చు, పన్ను ప్రయోజనాలు, మార్కెట్ ఆధారిత రిటర్నులతో ఇది నేడు ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి పొందే వారికి ప్రధాన ఎంపికగా మారింది.లైఫ్ ఇన్సూరెన్స్ రంగం: కేవలం పొదుపు చేయడమే కాకుండా పొదుపు చేసిన సొమ్మును జీవితాంతం వచ్చే యాన్యుటీ లేదా పెన్షన్గా మార్చడంలో బీమా కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి రక్షణ కల్పిస్తూ వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తాయి.అసంఘటిత రంగం: అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలు గిగ్ వర్కర్లు, రైతులు, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్నాయి.ఏం చేయాలంటే..భారతదేశ శ్రామిక శక్తిలో కేవలం 15–25% మందికి మాత్రమే అధికారిక పెన్షన్ సౌకర్యం అందుతోంది. మెజారిటీ జనాభా ఇప్పటికీ సామాజిక భద్రతకు దూరంగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదగాలంటే పెన్షన్ల పరిధిని విస్తరించడం అత్యవసరం. ఆర్థిక అక్షరాస్యతను పెంచడం ద్వారా, క్రమశిక్షణతో కూడిన పొదుపును ప్రోత్సహించడం ద్వారా మాత్రమే వృద్ధాప్యాన్ని ఒక రిస్క్ లాగా కాకుండా ఆర్థిక వృద్ధిలో భాగంగా మార్చుకోగలం. బలమైన పెన్షన్ వ్యవస్థ ఉన్నప్పుడే రేపటి భారతం ఆర్థికంగా మరింత పటిష్టంగా ఉంటుంది.- కమల్ భరద్వాజ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, బ్యాంకస్యూరెన్స్ఇదీ చదవండి: ‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’ -
‘భారత్లో ఏఐ స్పీడ్ చూస్తే విస్మయం కలుగుతుంది’
భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఒకప్పుడు సాధారణ తీరప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గ్లోబల్ ఏఐ హబ్గా రూపాంతరం చెందడం అద్భుతమని చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఏఐ పర్యావరణ వ్యవస్థలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన విశ్లేషించారు.కార్యక్రమంలో భాగంగా తన బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్పూర్ వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవాడిని. ఆ ప్రయాణంలో విశాఖపట్నం ఒక నిరాడంబరమైన తీరప్రాంత నగరంగా కనిపించేది. కానీ ప్రస్తుతం అదే నగరంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా ఏఐ హబ్ను ఏర్పాటు చేస్తోంది. ఆనాడు రైలులో కూర్చున్న ఏ విద్యార్థి కూడా వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్గా మారుతుందని ఊహించి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.డ్రైవర్లెస్ కార్లపై పని..టెక్నాలజీ రంగంలో గూగుల్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ తన తండ్రి రేగునాథ పిచాయ్తో జరిగిన సరదా సంభాషణను ఆయన పంచుకున్నారు. ‘శాన్ ఫ్రాన్సిస్కోలో మా ‘వేమో’ డ్రైవర్లెస్ టాక్సీలో నా తల్లిదండ్రులను తీసుకెళ్లాను. అయితే, భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై ఈ కారు విజయవంతంగా నడిస్తే అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను అని నాన్న అన్నారు. దానిపై ఇంకా పని చేస్తూనే ఉన్నాను నాన్న!’ అని చెప్పారు.భారత ప్రభుత్వ కృషికీ ప్రశంసలుగత వేసవిలో లక్షలాది మంది రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలను పంపడంలో భారత ప్రభుత్వం చూపిన చొరవను పిచాయ్ అభినందించారు. గూగుల్ ‘న్యూరల్ జీసీఎం’ మోడల్ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.యూఎస్-ఇండియా కనెక్ట్ఈ సదస్సులో పిచాయ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.అమెరికా-ఇండియా కనెక్ట్ చొరవలో భాగంగా రెండు దేశాల మధ్య నాలుగు కొత్త వ్యవస్థలతో కూడిన భారీ నెట్వర్క్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ సరికొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.‘20 ఏళ్ల క్రితం యూట్యూబ్ క్రియేటర్ అనే వృత్తి లేదు, కానీ నేడు లక్షలాది మంది అందులో రాణిస్తున్నారు’ అని ఉదాహరించారు.‘భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించుకోవడమే కాదు, ప్రపంచానికి ఏఐ పరిష్కారాలను చూపే స్థాయికి చేరుకుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే.. -
యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా సెగలు రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న చమురు ధరలు ఇటీవలి అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. తాజా ట్రేడింగ్ సెషన్ల ప్రకారం అంతర్జాతీయ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ఒక్కరోజే సుమారు 4.35% పెరిగి బ్యారెల్కు 70.35 డాలర్ల వద్దకు చేరింది. యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ 4.59% లాభపడి 65.19 డాలర్లకు వద్దకు చేరుకుంది. సెప్టెంబర్ 2025 తర్వాత ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.ధరల పెరుగుదలకు కారణాలుచమురు ధరలు ఉన్నపలంగా పెరగడానికి భౌగోళిక రాజకీయ, ఆర్థిక అంశాలు కారణంగా ఉన్నాయి. ఇరాన్లోని అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయవచ్చనే వార్తలు మార్కెట్లలో భయాందోళనలు సృష్టించాయి. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20- నుంచి 30% వాటా హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఇరాన్ ఈ జలసంధిని మూసివేస్తుందన్న హెచ్చరికలు మార్కెట్ అంచనా వేస్తోంది. ఇది చమురు సరఫరా నిలిచిపోతుందనే భయాన్ని పెంచుతున్నాయి.సరఫరాలో అంతరాయాలుఉత్తర అమెరికాలో కొనసాగుతున్న తీవ్రమైన చలి వాతావరణం కారణంగా చమురు ఉత్పత్తి, రిఫైనరీ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. దీనివల్ల ఇటీవల ప్రపంచ చమురు సరఫరా రోజుకు 1.2 మిలియన్ బ్యారెళ్ల మేర తగ్గింది. సౌదీ అరేబియా, రష్యాతో కూడిన ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తి కోతలను పొడిగించడం కూడా ధరల పెరుగుదలకు కారణమైంది.పెరుగుతున్న డిమాండ్అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనాల ప్రకారం, 2026లో ప్రపంచ చమురు డిమాండ్ రోజుకు 8,50,000 బ్యారెళ్లు పెరగనుంది. ముఖ్యంగా చైనా, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వస్తున్న డిమాండ్ చమురు ధరల పెరుగుదలకు మద్దతునిస్తోంది.భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావంభారతదేశం తన చమురు అవసరాలలో 85% పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర పెరిగితే దాని ప్రభావం నేరుగా కనిపిస్తుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. చమురు దిగుమతుల కోసం ఎక్కువ డాలర్లు వెచ్చించాల్సి రావడంతో రూపాయి విలువ ఒత్తిడికి గురవుతుంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం వద్ద తగినంత చమురు నిల్వలు ఉన్నట్లు సమాచారం ఉన్నప్పటికీ అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్! -
ఆహారోత్పత్తిలో లోటు నుంచి మిగులుకు
భారత్ ఆహార లోటు నుంచి మిగులు స్థానానికి పురోగమించిందని.. ఆహార భద్రతా సవాళ్లను ఎదుర్కొనే దేశాలకు అవసరమైతే సాయం చేసే స్థితిలో ఉందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అన్నారు. అమిటీ వర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని ధీమాగా చెప్పారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందంటూ. వికసిత్ భారత్ సాకారాన్ని వారు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు.ఈ శతాబ్దంలో మొదటి 25 ఏళ్లు ముగిశాయని, వచ్చే 25 ఏళ్లు ఎంతో కీలకమని.. యువత భుజాలపై ఎంతో బాధ్యత ఉందన్నారు. దేశ యువత త్వరలో కీలక నాయకత్వ స్థానాలను అధిరిహోస్తుందని, ఈ సందర్భంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనుందని చెప్పారు. సవాళ్లు ఎదురైనప్పుడు వాటిని వదులుకోవడం, లేదంటే అవకాశాలుగా మలుచుకోవడం అనే రెండు ఎంపికలే ఉంటాయన్నారు. అంతర్జాతీయ సవాళ్లకు భారత్ సిద్ధమైందని, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడమే కాకుండా, టెక్నాలజీలో అంతర్జాతీయ దిగ్గజంగా అవతరిస్తుందని చెప్పారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్! -
భారత్ పెట్టుబడులకు విశ్వసనీయ గమ్యస్థానం
వాణిజ్యం, పారిశ్రామిక సహకారం, దీర్ఘకాల పెట్టుబడులకు భారత్ స్థిరమైన, నమ్మకమైన వాతావరణం కలి్పస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య సంఘం (ఈఎఫ్టీఏ), ఐరోపా, యూకే, యూఎస్తో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను ప్రస్తావించారు. నార్వే పర్యటనలో భాగంగా మంత్రి సీతారామన్ ప్రముఖ కంపెనీల సీఈవోలు, ఇన్వెస్టర్లతో ఓస్లోలో సమావేశమయ్యారు. భారత్లో పెట్టుబడులు, వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థపై ఈ సందర్భంగా సానుకూల చర్చలు జరిగినట్టు మంత్రి చెప్పారు.పౌరులు, కంపెనీలకు నిబంధనల అమలు భారాన్ని తగ్గించే దిశగా 2026–27 బడ్జెట్లో సంస్కరణలపై దృష్టి పెట్టినట్టు గుర్తు చేశారు. విధానాల్లో స్పష్టత, స్థూల ఆర్థిక వాతావరణం, ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను ఈ సందర్భంగా అక్కడి సీఈవోలు, ఇన్వెస్టర్లు అభినందించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొంది. భారత్లో సంస్కరణలు, వృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఇన్వెస్టర్లకు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) సీఈవో తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సీతారామన్ నార్వే ప్రధాని జోనాస్ గార్స్టోర్తోనూ భేటీ అయ్యారు. భారత ప్రధాని మోదీ నార్వే పర్యటన (ఈ ఏడాది చివర్లో) కోసం వేచి చూస్తున్నామని.. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య సహకారం మరింత విస్తృతమవుతుందన్న ఆశాభావాన్ని జోనాస్ వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్! -
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు
అమెరికా నుంచి నాణ్యమైన కోకింగ్ కోల్ దిగుమతి పట్ల ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. చమురు, బొగ్గు కొనుగోలును భారత్ మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్నట్టు చెప్పారు. వీటి కోసం రెండు మూడు భౌగోళిక ప్రాంతాలపైనే ఆధారపడి ఉన్నట్టు, దీని కారణంగా ధరల్లో అస్థిరతలు ఉంటున్నట్టు పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధికి అవసరమైన వస్తువులు కొన్నింటిని అమెరికా అందించగలదన్నారు.ఏఐ అప్లికేషన్లకు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు), డేటా సెంటర్ల ఎక్విప్మెంట్, అత్యధిక పనితీరుతో కూడిన కంప్యూటింగ్ అవసరాన్ని ప్రస్తావించారు. అమెరికా పోటీ పడలేని ఉత్పత్తులను భారత్ తయారు చేయగలదని, పెట్టుబడులు, టెక్నాలజీ వనరుల పరంగా అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు.వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 100 బిలియన్ డాలర్ల విమానాలకు ఇప్పటికే డిమాండ్ ఉందని.. స్థానిక సామర్థ్యాలను మరింత పెంచాల్సి ఉందని చెప్పారు. ఇటీవలే భారత్–అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక ఒప్పందానికి అంగీకారం కుదరడం తెలిసిందే. దీని కింద వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల వస్తువులను భారత్ కొనుగోలు చేయనుంది. వచ్చే వారంలో భారత బృందం అమెరికా పర్యటనకు వెళ్లనుంది. ఒప్పందానికి సంబంధించి తుది పత్రాలను ఖరారు చేయనుంది. దీనిపై మార్చిలో ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అమెరికాతో ఒప్పందం వల్ల భారత సంస్థలకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నట్టు మంత్రి గోయల్ చెప్పారు. ముఖ్యంగా కారి్మక ఆధారిత రంగాలు, టెక్నాలజీ సేవలకు డిమాండ్ ఉంటుందన్నారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్! -
రూపే కార్డు వినియోగం పెంచాలి
చెల్లింపులకు యూపీఐ ప్రధాన సాధనంగా మారిందని.. నగదు లావాదేవీలను మించిపోయాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రకటించింది. రూపే డెబిట్ కార్డు వాడకం లక్ష్యిత చర్యలు అవసరమని పేర్కొంది. ఇందుకు సంబంధించి ఒక సర్వే చేసింది. 15 రాష్ట్రాల్లో 10,378 మంది అభిప్రాయాలను స్వీకరించింది. భిన్న సామాజిక ఆర్థిక విభాగాల్లో డిజిటల్ చెల్లింపుల ఆమోదం పెరిగినట్టు తెలిసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 57 శాతం మంది చెల్లింపులకు యూపీఐ సాధనాన్ని వినియోగిస్తున్నారు. నగదు వినియోగం 38 శాతాన్ని ఇది అధిగమించినట్టు ఈ నివేదిక తెలిపింది. సులభంగా, చెల్లింపులు అప్పటికప్పుడు పూర్తయిపోతుండడాన్ని ఇందుకు అనుకూలంగా పేర్కొంది. 65 శాతం మంది రోజులో ఒకటికి మించిన లావాదేవీలను యూపీఐ ద్వారానే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రూపే డెబిట్ కార్డు వినియోగాన్ని, ముఖ్యంగా గ్రామీణ, చిన్న పట్టణాల్లో పెంచాలంటూ.. వర్తకులు ఈ కార్డులను ఆమోదించే విధంగా ప్రోత్సాహక కార్యక్రమాలను అమలు చేయాలని సూచించింది.ఇదీ చదవండి: డిజిటల్ రాజ్యంలోనూ.. క్యాషే కింగ్ -
డిజిటల్ రాజ్యంలోనూ.. క్యాషే కింగ్
దేశంలో ఒకవైపు యూపీఐ ఆధారిత డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతుండగా.. మరోవైపు వ్యవస్థలో నగదు చలామణి సైతం ఆసక్తికరంగా విస్తరిస్తోంది. జనవరి చివరికి చలామణిలో ఉన్న నగదు రూ.40లక్షల కోట్లకు చేరినట్టు ఎస్బీఐ పరిశోధన విభాగం నివేదిక వెల్లడించింది. 2025 జనవరి నుంచి చూస్తే ఏడాదిలో 11.1 శాతం పెరిగింది. ఏడాది కాలంలో నికరంగా రూ.2.76 లక్షల కోట్ల నగదు వినియోగం అధికమైంది. ప్రజల వద్దనున్న నగదు కూడా ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో 97.6 శాతంగా ఉంది. విలువ పరంగా రూ.39 లక్షల కోట్లు. 2020–21 (కరోనా అనంతరం) నాటి నుంచి ప్రజల వద్ద నగదు నికరంగా రూ.4.6 లక్షల కోట్లు పెరిగినట్టు ఎస్బీఐ పరిశోధన నివేదిక ఆధారంగా తెలుస్తోంది. అంతేకాదు, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు, ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో (కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్) పెరుగుతుండడం గమనార్హం. నగదు వినియోగం పెరుగుతున్నప్పటికీ.. జీడీపీలో నగదు నిష్పత్తి మాత్రం 2021 మార్చి నాటికి ఉన్న 14.4 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. నగదు ఉపసంహరణలు.. ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణలు దీర్ఘకాల సగటు రూ.2.5 లక్షల కోట్లను అధిగమించినట్టు తాజా డేటా స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, తమిళనాడు, పశి్చమబెంగాల్ రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలు పెరిగాయి. కర్ణాటకలో జీఎస్టీ విభాగం గతేడాది జూలైలో ఏకంగా 18,000 మంది చిన్న వర్తకులకు పన్ను నోటీసులు జారీ చేసింది. వీరి యూపీఐ లావాదేవీలు ఏడాదిలో రూ.40 లక్షలు దాటడమే ఇందుకు కారణం. ఈ పరిమితి దాటితే వారు జీఎస్టీ కింద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ చర్య యూపీఐ చెల్లింపులను నిరుత్సాహపరిచి ఉండొచ్చని ఈ నివేదిక అభిప్రాయపడింది. జీఎస్టీ విభాగం నోటీసులు జారీ తర్వాత కర్ణాటక రాష్టంలోని ఆయా జిల్లాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ రూ.37 కోట్ల మేర అదనంగా పెరిగినట్టు తెలిసింది. పశి్చమబెంగాల్, కేరళలలోనూ ఇదే ధోరణి కనిపించింది. నగదు పెరగడం వెనుక.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వద్ద నగదు కలిగి ఉండడం కూడా పెరిగింది. జీడీపీ వృద్ధికి అనుగుణంగా కరెన్సీకి సైతం డిమాండ్ పెరగడం సహజమేనని... వడ్డీ రేట్లు తక్కువలో ఉండడం కూడా ప్రజల వద్ద నగదు పెరగడానికి ఒక కారణమని ఈ నివేదిక పేర్కొంది. బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగిపోవడం కూడా మార్కెట్లో నగదు లభ్యత అధికం కావడానికి దారితీసినట్టు విశ్లేషించింది. ధరలు పెరగడంతో ఇళ్లల్లోని పాత బంగారం, వెండిని విక్రయించడం ద్వారా ప్రజల వద్ద సొమ్ము పెరిగినట్టు తెలిపింది. 2025 మార్చి నాటికి వినియోగంలోని రూ.500 నోట్ల విలువ 8.9 శాతం పెరిగి మొత్తం నగదులో 89 శాతానికి చేరింది. పరిమాణం పరంగా 3 శాతం పెరిగి మొత్తం వినియోగ నోట్లలో 40.9 శాతానికి చేరింది. విలువ పరంగా రూ.100 నోట్ల వినియోగం ఒక శాతం పెరిగి 4.7 శాతానికి చేరగా, రూ.200 నోట్ల వినియోగం మొత్తం కరెన్సీలో 0.8 శాతానికి చేరింది. ముఖ్యంగా రూ.500 నోట్ల వినియోగం అధికంగా ఉండడం వెనుక.. రూ.500 లోపు చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తుండడం కారణం. వినియోగంలో నగదు చలామణి రూ.40 లక్షల కోట్లకు చేరినప్పటికీ.. ఒక్క నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.28 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం గమనార్హం. 2025 అక్టోబర్లో నెలవారీ రూ.2.1 లక్షల కోట్ల విలువ మేర యూపీఐ లావాదేవీలు నికరంగా పెరిగి రూ.27.3 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. నవంబర్లో రూ.26.3 లక్షల కోట్లకు తగ్గినప్పటికీ.. తిరిగి డిసెంబర్లో రూ.28 లక్షల కోట్లు, 2026 జనవరిలో రూ.28.3 లక్షల కోట్ల చొప్పున నమోదయ్యాయి. -
రష్యా డాలర్లలో వ్యాపారం? భారత్పై ప్రభావం..
గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని శాసిస్తున్న అమెరికన్ డాలర్ స్థానాన్ని మార్చేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగాయి. అంతర్జాతీయంగా రష్యా-అమెరికా మధ్య జరుగుతున్న ఈ కరెన్సీ గేమ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారీగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా పరిణామాలు, కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం రష్యా అమెరికా డాలర్లలో వ్యాపారం సాగిస్తుందనే వార్తలొస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే అంతర్జాతీయంగా, భారత్పై ఎలాంటి ప్రభావం పడనుందో తెలుసుకుందాం.డాలర్ వైపు రష్యా మొగ్గు ఎందుకు?2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పశ్చిమ దేశాలు రష్యాను స్విఫ్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి బహిష్కరించాయి. దీంతో రష్యా తన చమురు, గ్యాస్ వ్యాపారాలను డాలర్లకు బదులు రూబుల్స్, యువాన్, రూపాయిల్లోకి మార్చింది. అయితే, 2026 ప్రారంభంలో వచ్చిన కొన్ని రిపోర్టుల ప్రకారం రష్యా తిరిగి అమెరికన్ డాలర్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థలోకి రావడానికి ఆసక్తి చూపుతోంది.ఇందుకు కారణాలుఅమెరికాలో ట్రంప్ మరోసారి అధ్యక్షడయ్యాక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రష్యాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించే దిశగా చర్చలు జరుపుతోంది. ఇంధన రంగాలు, ఖనిజాల వ్యాపారంలో తిరిగి డాలర్లను అనుమతించడం ద్వారా ఆంక్షల నుంచి ఉపశమనం పొందాలని రష్యా భావిస్తోంది. చైనా యువాన్ లేదా ఇతర కరెన్సీల కంటే డాలర్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆమోదం కలిగి ఉండటం రష్యాకు అంతర్జాతీయ మార్కెట్లో లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఇది కూడా రష్యా డాలర్లలో వ్యాపారం కొనసాగించాలనుకోవడానికి ఒక కారణంగా ఉంది.ప్రపంచ వాణిజ్యంపై ప్రభావంరష్యా వంటి అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు తిరిగి డాలర్ జోన్లోకి వస్తే అది ‘డీ-డాలరైజేషన్’ ప్రక్రియకు బ్రేక్ వేస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డిమాండ్ మళ్లీ పెరుగుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఊతాన్నిస్తుంది. డాలర్కు ప్రత్యామ్నాయంగా సొంత కరెన్సీని తీసుకురావాలనుకుంటున్న బ్రిక్స్ దేశాల ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగించవచ్చు. అయితే, చమురు వ్యాపారం తిరిగి డాలర్లలో జరిగితే ధరల్లో అనిశ్చితి తగ్గి గ్లోబల్ మార్కెట్ స్థిరపడే అవకాశం ఉంది.భారత్పై ప్రభావమెంత?రష్యా-అమెరికా మధ్య మారుతున్న ఈ ఆర్థిక సమీకరణాలు భారతదేశంపై మిశ్రమ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు దిగుమతుల విషయానికి వస్తే ఇప్పటివరకు రష్యా నుంచి రూపాయిల్లో చమురు కొనుగోలు చేస్తూ భారత్ కొంత లబ్ధి పొందింది. అయితే, రష్యా తిరిగి డాలర్ల వైపు మళ్లితే భారత్పై అమెరికా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తాజా ట్రేడ్ డీల్స్ ప్రకారం భవిష్యత్తులో భారత్ రష్యా నుంచి చేసే దిగుమతులను తగ్గించి అమెరికా నుంచి చమురు కొనుగోళ్లను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ తిరిగి పట్టు సాధిస్తే అది భారత కరెన్సీ విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలపడటం వల్ల రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉంది. ఇది దిగుమతుల వ్యయాన్ని పెంచి దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు.రష్యా తీసుకునే ఈ నిర్ణయం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, భౌగోళిక రాజకీయ వ్యూహంతో కూడుకున్నది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల దెబ్బతిన్న తన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించుకోవడానికి పుతిన్ డాలర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇది అధికారికంగా అమలైతే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు, పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని గమనించాలి. బంగారం, ఎగుమతుల రంగంలో ఈ నిర్ణయం ప్రభావం ఎలా ఉంటుందో కింద తెలియజేశాం.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
వాణిజ్య లోటు సెగ
పసిడి, వెండి దిగుమతులు దేశ వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. జనవరిలో వస్తు ఎగుమతులు 0.61 శాతం పుంజుకుని 36.56 బిలియన్ డాలర్లకు చేరాయి. కానీ, దిగుమతులు 19.2 శాతం ఎగసి 71.24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. బంగారం, వెండి దిగుమతులు గణనీయంగా పెరగడమే ఈ పరిస్థితికి కారణం. ఫలితంగా వాణిజ్య లోటు మూడు నెలల గరిష్ట స్థాయిలో 34.68 బిలియన్ డాలర్లకు చేరింది. టారిఫ్ల కారణంగా జనవరిలో అమెరికాకు మన దేశ వస్తు ఎగుమతులు తగ్గాయి. క్రితం ఏడాది జనవరితో పోలి్చతే 21.77 శాతం తగ్గి 6.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. బంగారం దిగుమతులు జనవరిలో 349 శాతం పెరిగి 12 బిలియన్ డాలర్లుకాగా, వెండి దిగుమతులు సైతం 127 శాతం జంప్చేసి 2 బిలియన్ డాలర్లకు చేరాయి.చమురు దిగుమతులు మాత్రం 0.24 శాతం తగ్గి 13.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఏడాది (2025–26) ఏప్రిల్ నుంచి జనవరి వరకు వస్తు ఎగుమతులు 2.22 శాతం పెరిగి 366.63 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ కాలంలో దిగుమతులు 7 శాతానికి పైగా పెరిగి 649.86 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీంతో వాణిజ్య లోటు మొదటి పది నెలల్లో 247.38 బిలియన్ డాలర్లకు చేరింది. జనవరిలో సేవల ఎగుమతులు 43.90 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2025 జనవరిలో ఇవి 34.75 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. సేవల దిగుమతులు 19.60 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఏప్రిల్–జనవరి మధ్య వస్తు, సేవల ఎగుమతులు కలసి 720.76 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 679 బిలియన్ డాలర్లు. -
రూ.215 లక్షల కోట్లకు రిటైల్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశ రిటైల్ మార్కెట్ వేగవంతమైన వృద్ధి దిశగా పరుగులు తీస్తోంది. 2025 నాటికి భారత రిటైల్ మార్కెట్ రూ.90–95 లక్షల కోట్ల పరిమాణంతో ఉండగా, 2035 నాటికి అంటే వచ్చే పదేళ్లలో రూ.210–215 లక్షల కోట్ల స్థాయికి విస్తరిస్తుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) అంచనా వేసింది. ప్రపంచంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మించి భారత్ మంచి పనితీరు చూపిస్తుండడంతోపాటు, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకోనున్నట్టు గుర్తు చేసింది. భారత రిటైల్ రంగం తదుపరి వృద్ధి దశలోకి ప్రవేశించిందంటూ.. స్పష్టత, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, ఏఐ ఆధారిత పరివర్తనపై దృష్టి సారించిన సంస్థలను విజయం వరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను బీసీజీ, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేశాయి. వినియోగదారులతో అనుబంధం, నిర్వహణ నమూనాలు, నైపుణ్యాల విషయంలో నిర్మాణాత్మక మార్పులను స్వీకరించే సంస్థలు రూ.200 లక్షల కోట్ల రిటైల్ మార్కెట్లో గణనీయమైన విలువను సొంతం చేసుకుంటాయని ఈ నివేదిక తెలిపింది. కస్టమర్లకు ప్రత్యేకమైన విలువను అందించడం, స్థిరమైన లాభదాయకతను కొనసాగించేందుకు క్రమశిక్షణతో కూడిన నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొంది. వినియోగదారుల నిర్ణయాలను, ముఖ్యంగా ఏఐ ప్రభావితం చేస్తుండడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. టెక్నాలజీ పాత్ర కీలకం.. ‘‘భారత రిటైల్ ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం. వచ్చే దశాబ్ద కాలంలో రూ.200 లక్షల కోట్లకు విస్తరించనుంది. ఆఫ్లైన్, ఆన్లైన్ రిటైల్ సంస్థల నగదు ప్రవాహాలు స్పష్టమైన పురోగతిని చూపిస్తున్నాయి. విస్తరణలో ఏఐ వంటి టెక్నాలజీల విస్తృత వినియోగం, అత్యుత్తమ నిర్వహణ, ప్రత్యేకమైన విలువను అందించే సంస్థలే విజేతలుగా నిలుస్తాయి’’అని బీసీజీ ఎండీ అభీక్సింఘి తెలిపారు. ఏజెంటింక్ కామర్స్ అన్నది ప్రయోగాత్మక దశ నుంచి ఆచరణ దశకు వచ్చేసిందని.. పరిశోధన, కొనుగోలు నిర్ణయాలను జెన్ఏఐ ప్రభావితం చేస్తోందని ఈ నివేదిక తెలిపింది. అమెరికాలో ఇప్పటికే 42 శాతం మంది వినియోగదారులు జెన్ఏఐని వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘వినియోగదారులు ఉత్పత్తిని గుర్తించడం, పరిశీలించడం, కొనుగోలు చేయడాన్ని అంతర్జాతీయంగా ఏజెంటిక్ కామర్స్ ప్రభావితం చేస్తోంది. భారత్లో డిజిటల్ వినియోగం బలంగా ఉంది. కనుక పట్టణ ప్రాంతాల్లో ఏఐ ఆధారిత షాపింగ్, ముఖ్యంగా జెన్ జెడ్లో వేగవంతం అవుతుంది’’అని బీసీజీ ఎండీ, పార్ట్నర్ భారత్ మిమానీ తెలిపారు. ఉత్పత్తులు, సరఫరా చైన్, మార్కెటింగ్, సేవలు ఇలా అన్నింటా ఏఐ వినియోగంతో 40–60 శాతం అధిక ప్రయోజనాలను రిటైలర్లు పొందగలరని ఈ నివేదిక తెలిపింది. ‘‘డిమాండ్ బలంగా ఉంది. వినియోగదారులు వివేకంతో వ్యవహరిస్తున్నారు. రిటైలర్లు ఆవిష్కరణలకు ఆసక్తి చూపిస్తున్నారు. డిజిటల్ పరివర్తనను ఒక ప్రాజెక్టుగా కాకుండా క్రమశిక్షణగా పరిగణించే సంస్థలు, అన్ని ఫార్మాట్లలో స్థిరమైన సేవలు అందించేవి వచ్చే దశాబ్దంలో విజేతలుగా నిలుస్తాయి’’ అని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీఈవో కుమార్ రాజగోపాలన్ అభిప్రాయపడ్డారు. -
వంటింటిపై ధరల దాడి.. రెట్టింపైన ఖర్చుల వేడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ధరల పెరుగుదల మళ్లీ ఆందోళన రేకెత్తిస్తోంది. గడచిన కొన్ని నెలలుగా కాస్త శాంతించినట్లు కనిపించిన టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కొత్త ఏడాది ఆరంభంలోనే సామాన్యుడికి షాక్ ఇచ్చింది. 2026 జనవరి నెలకు టోకు ద్రవ్యోల్బణం రేటు ఏకంగా 1.81 శాతానికి ఎగబాకింది. డిసెంబర్ 2025లో ఇది కేవలం 0.83 శాతంగా ఉండగా.. ఒక్క నెల వ్యవధిలోనే 1%‡ పెరగడం గమనార్హం. నవంబర్లో మైనస్లో ఉన్న ద్రవ్యోల్బణం, ఇప్పుడు వేగంగా పెరుగుతుండటం ఆర్థిక వర్గాలను సైతం కలవరపెడుతోంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గణాంకాలను విడుదల చేసింది. తయారీ రంగం, ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఈ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొంది. ఎందుకింతలా పెరిగింది? ప్రధానంగా తయారీ రంగంలో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది జనవరితో పోలి్చతే ఈసారి ’బేసిక్ మెటల్స్’ (లోహాలు), టెక్స్టైల్స్ (వ్రస్తాలు), రసాయనాలు, మోటారు వాహనాలు, యంత్ర పరికరాల ధరలు ప్రియమయ్యాయి. ఫ్యాక్టరీ గేటు వద్దే ధరలు పెరగడంతో, అది అంతిమంగా వినియోగదారుడిపై భారం మోపే అవకాశముంది. అలాగే ఆహారేతర వస్తువులు, ఆహార పదార్థాల ధరలు కూడా పెరగడంతో ద్రవ్యోల్బణం సూచీ పైకి ఎగసింది. రంగాలవారీగా పరిస్థితి ఇలా.. టోకు ధరల సూచీలో అత్యధిక వాటా కలిగిన తయారీ రంగం విభాగంలో ద్రవ్యోల్బణం 2.86 శాతానికి చేరింది. ప్రధానంగా లోహాలు, వ్రస్తాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరగడం ఇందుకు కారణం. ఆహార పదార్థాలు, ఖనిజాలు ఉండే ప్రాథమిక వస్తువులు విభాగంలో ద్రవ్యోల్బణం 2.21 శాతంగా నమోదైంది. డిసెంబర్తో పోలి్చతే (3.12%) ఇది కాస్త తగ్గినప్పటికీ, ఇప్పటికీ ధరలు ఎగువ స్థాయిలోనే ఉన్నాయి. సామాన్యుడికి నేరుగా సంబంధమున్న ఆహార ద్రవ్యోల్బణం డిసెంబర్లో సున్నా (0.00%) వద్ద ఉండగా, జనవరి నాటికి 1.41 శాతానికి పెరిగింది. పప్పుధాన్యాలు, గోధుమలు, పండ్లు, కూరగాయల ధరల్లో కదలికలు ఇందుకు కారణమయ్యాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, విద్యుత్ వంటి అంశాలున్న ఇంధనం, విద్యుత్ విభాగం మాత్రం ప్రజలకు కాస్త ఊరటనిచి్చంది. ఇందులో ద్రవ్యోల్బణం –4.01 శాతం (మైనస్)గా నమోదైంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో మార్పులు దీనికి కారణమని భావిస్తున్నారు. గత మూడు నెలల ట్రెండ్.. టోకు ధరల సూచీ గమనాన్ని గమనిస్తే.. స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. నవంబర్ 2025: –0.13% (ధరల తగ్గుదల) డిసెంబర్ 2025: 0.83% (స్వల్ప పెరుగుదల) జనవరి 2026: 1.81% (భారీ పెరుగుదల) నవంబర్, డిసెంబర్ 2025 నెలలకు సంబంధించిన తుది గణాంకాలను కేంద్రం సవరించింది. నవంబర్ రేటును –0.13 శాతంగా ఖరారు చేసింది. మొత్తం మీద టోకు ధరల పెరుగుదల ప్రభావం రానున్న రోజుల్లో చిల్లర ధరలపై పడే అవకాశం లేకపోలేదు. -
ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ప్రారంభం
భారత ప్రభుత్వ ఆహార సబ్సిడీ పథకంలో పారదర్శకతను పెంచేందుకు, అవినీతిని నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆధారిత ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) పైలట్ ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభించారు. దీనితో పాటు 24x7 సేవలందించే ‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంను కూడా ఆయన ఆవిష్కరించారు.ఈ-రూపీ ఆధారిత రేషన్ పంపిణీ ఎలా పనిచేస్తుంది?ప్రస్తుతానికి గుజరాత్లోని అహ్మదాబాద్, సూరత్, ఆనంద్, వల్సాద్ జిల్లాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. దీని ప్రత్యేకతలు..లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో ఆర్బీఐ (ఆర్బీఐ) ద్వారా ‘ఈ-రూపీ’ క్రెడిట్ అవుతుంది. ఇందులో సరకు రకం, పరిమాణం, రాయితీ ధర ముందే పరిగణలోకి తీసుకుంటారు. ఈ డిజిటల్ టోకెన్లను కేవలం అధీకృత రేషన్ షాపుల్లో తమకు కేటాయించిన సరుకుల కోసం మాత్రమే వాడాలి. ఇతర అవసరాలకు వీటిని ఖర్చు చేయడం సాధ్యపడదు. స్మార్ట్ఫోన్ ఉన్నవారు క్యూఆర్ కోడ్ ద్వారా, సాధారణ ఫీచర్ ఫోన్లు ఉన్నవారు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా ఈ లావాదేవీలను పూర్తి చేయవచ్చు.సాధారణంగా పాత పద్ధతిలో డీలర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి సమయం పట్టేది. కానీ ఈ-రూపీ విధానంలో లబ్ధిదారుడు వౌచర్ను రిడీమ్ చేయగానే ఆ టోకెన్ విలువకు సమానమైన నగదు డీలర్ బ్యాంక్ ఖాతాలో తక్షణమే జమ అవుతుంది. ప్రతి కిలో ధాన్యం ఎవరికి అందింది, ఏ సమయంలో అందింది అనే సమాచారం రియల్ టైమ్లో ప్రభుత్వానికి అందుతుంది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. తూకంలో మోసాలకు తావుండదు.‘అన్నపూర్తి’ గ్రెయిన్ ఏటీఎంసామాన్యులకు రేషన్ సేకరణను మరింత సులభతరం చేస్తూ ‘అన్నపూర్తి’ పేరుతో ఆటోమేటెడ్ గ్రెయిన్ డిస్పెన్సింగ్ మెషీన్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏటీఎంలు రోజులో 24 గంటలు పనిచేస్తాయి. కేవలం 35 సెకన్లలో 25 కిలోల ధాన్యాన్ని పంపిణీ చేయగలవు. మార్చి 2026 నాటికి ఈ యంత్రాల ద్వారా గోధుమలు, బియ్యంతో పాటు (25 కిలోల వరకు), ఒక కిలో ప్యాకెట్లలో కందిపప్పు, శనగలు, చక్కెర, ఉప్పును లబ్ధిదారులు పొందవచ్చు. ఈ ఏటీఎం యంత్రాలను పూర్తిగా గుజరాత్లోనే తయారు చేయడం విశేషం.ఈ ఏటీఎంలను ఉపయోగించడానికి ‘స్మార్ట్ రేషన్ కార్డ్’ లేదా ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక డిజిటల్ కార్డ్ అవసరం ఉంటుంది. లబ్ధిదారుడు తన రేషన్ కార్డును ఏటీఎం మిషీన్ వద్ద ఉన్న రీడర్ ద్వారా స్కాన్ చేయాలి. కార్డుతో పాటు భద్రత కోసం వేలిముద్ర లేదా కంటిపాప(ఐరిస్) స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల కార్డు వేరే వారు దొంగిలించినా ధాన్యం తీసుకోలేరు. కొన్ని సందర్భాల్లో కార్డు లేకపోయినా ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా కూడా లావాదేవీ పూర్తి చేయవచ్చు.ఏటీఎం పనిచేసే విధానంపైన చెప్పినట్లుగా కార్డ్ లేదా బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారుడిని మిషీన్ గుర్తిస్తుంది. ఆ నెలలో వారికి ఎంత కోటా మిగిలి ఉందో స్క్రీన్ మీద కనిపిస్తుంది. స్క్రీన్ మీద మీకు కావాల్సిన వస్తువును (ఉదాహరణకు: బియ్యం లేదా గోధుమలు) పరిమాణాన్ని ఎంచుకోవాలి. ఈ మిషీన్లలో సెన్సార్లు ఉంటాయి. ఇవి ధాన్యాన్ని గ్రాములతో సహా అత్యంత కచ్చితంగా తూకం వేస్తాయి. మాన్యువల్ తూకంలో జరిగే మోసాలకు ఇక్కడ తావుండదు. మీరు ఎంచుకున్న వస్తువు కింద ఉన్న అవుట్లెట్ ద్వారా బయటకు వస్తుంది. పప్పులు, ఉప్పు వంటివి అయితే సీల్డ్ ప్యాకెట్ల రూపంలో వస్తాయి.దేశవ్యాప్త విస్తరణ ప్రణాళికఈ పైలట్ ప్రాజెక్ట్ గుజరాత్లో విజయవంతమైన తర్వాత ఈ పైలట్ ప్రాజెక్టును చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ వంటి కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించనున్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో ఈ సీబీడీసీ ఆధారిత రేషన్ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సామాజిక సంక్షేమ పథకాల్లో ‘ప్రోగ్రామబుల్ డిజిటల్ కరెన్సీ’ని ఉపయోగిస్తున్న ప్రపంచంలోని అగ్రగామి దేశంగా భారత్ నిలవనుంది.ఇదీ చదవండి: నకిలీ రెజ్యూమెతో కంపెనీకి కుచ్చుటోపీ -
అమెరికా-ఇరాన్ యుద్ధం?.. స్టాక్ మార్కెట్లలో టెన్షన్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం సంభవించే అవకాశంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హామర్ ఆపరేషన్’తో పోలిస్తే, ఈసారి అమెరికా మరింత వ్యూహాత్మక సైనిక చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో యూ.ఎస్. విమాన వాహక నౌక బృందాన్ని మోహరించినప్పటి నుంచి, స్థానిక యూఎస్ శిబిరాల్లో కూడా సన్నాహాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి.అమెరికా దళాలు వారాలపాటు సైనిక కార్యకలాపాలకు సన్నద్ధమవుతున్నాయని సైనిక వర్గాలు అంతర్జాతీయ మీడియాకు అనామకంగా తెలియజేశాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊ అనడమే ఆలస్యం.. రంగంలోకి దిగి ఇరాన్పై దాడులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.శాంతి చర్చలు ఫలించేనా?ఇక ఇరాన్-అమెరికా మధ్య రెండో విడత శాంతి చర్చలు జెనీవాలో జరగనుండగా, ఈ నెల 17న ఈ చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతాయని భావిస్తున్నారు. ఇరాన్ తన అణు పరీక్షలను ఆపకపోతే “సైనిక చర్యలు తప్పవు” అని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే, ఇరాన్ తన అణు, క్షిపణి కార్యక్రమాలను ఆపే ఎటువంటి ప్రణాళికలు లేవని ప్రకటించింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై దాడి జరిగితే, ప్రతీకారం తప్పనిసరిగా జరిగుతుందని హెచ్చరిస్తోంది. ఇలా పరిస్థితులు తీవ్రమైతే, ఈ ప్రాంతంలో యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. దీంతో ప్రపంచం అంతటా ముడి చమురు, బంగారం, స్టాక్ మార్కెట్లు ప్రభావితమవుతాయి.చమురు ధరలు పెరిగే అవకాశంఇదిలా ఉండగా, ఇరాన్పై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేయాలని ఇజ్రాయెల్, అమెరికా నిర్ణయించాయి. ఇరాన్-చైనా చమురు అమ్మకాలపై అమెరికా దృష్టి సారించింది. ప్రస్తుతం ఇరాన్ చమురు అమ్మకాలలో 80 శాతం చైనాకు జరుగుతున్నాయి. దీన్ని నివారించగలిగితే ఇరాన్ ఆర్థికంగా మరింత నాశనం అవుతుందని ఇరు దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాపై మరిన్ని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదే జరిగితే, అరుదైన లోహాల ఎగుమతిపై చైనా మళ్లీ ఆంక్షలు విధిస్తుంది. ఇది యూఎస్-చైనా సంబంధాలను మరింత దిగజార్చుతుంది. ప్రధాన చమురు ఉత్పత్తిదారు అయిన ఇరాన్ నుంచి ముడి చమురు ఆగిపోతే మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.బంగారం, వెండి ధరలపై ప్రభావంగత వారం హెచ్చుతగ్గులకు గురైన బంగారం, వెండి ధరలకు రాబోయే రోజుల్లో ఇరాన్-అమెరికా శాంతి చర్చలు కీలకం. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కావడంతో బంగారానికి కొత్త డిమాండ్ ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ కు 5,041 డాలర్ల వద్ద ముగిసింది. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల భయాల మధ్య ధరలు మరింత పెరుగుతాయని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. -
రూ.100, రూ.500 నోట్ల రద్దు!.. నిజమేనా?
కేంద్ర ప్రభుత్వం 2016లో.. అప్పుడు వాడుకలో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఆ తరువాత 2023లో రూ. 2000 నోట్ల ఉపసంహరణ ప్రారంభించింది. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆర్బీఐకు చేరాల్సిన పెద్ద నోట్లు ఇంకా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.100, రూ.500 నోట్లలో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినప్పటికీ నోట్ల అవసరం కూడా ఉంది. ఇప్పటికీ రిటైల్ మార్కెట్లలో, గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో కరెన్సీ నోట్లు కీలకంగా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న 100, 500 రూపాయల నోట్లలో మార్పులు చేయనుంది. ఈ మార్పులలో వాటర్మార్క్లు, మైక్రోప్రింటింగ్, మెరుగైన ఇంక్ వంటివి ఉన్నాయి.నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయడానికి, నోట్లలో మరింత మెరుగైన భద్రతను పెంచడానికి రిజర్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్బీఐ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళా ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లలో ఏమైనా మార్పులు చేస్తే.. పాత నోట్లు రద్దు అవుతాయా? అనేది ఇప్పుడొక ప్రశ్నగా మిగిలింది.కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కొందరు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు సైతం తమ కరెన్సీలను మెరుగు పరుస్తున్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వాట్సాప్ బ్యాన్ చేయడానికే ప్రయత్నం? -
విదేశాలకు వెళుతున్నారా.. ఈ జాగ్రత్తలు మీకోసమే
అంతర్జాతీయ ప్రయాణాలు చేసేటప్పుడు చాలామంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోని కస్టమ్స్ జోన్కు రాగానే ఒక రకమైన ఆందోళనకు గురవుతుంటారు. కస్టమ్స్ అధికారులు కావాలనే కఠినంగా వ్యవహరిస్తారని లేదా కేవలం ఏదైనా వస్తువులు వ్యక్తిగత అవసరాల కోసం అని చెబితే సరిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం దీనికి భిన్నంగా ఉంటుంది. కస్టమ్స్ చట్టాలు ప్రయాణికులను ఇబ్బంది పెట్టడానికి కాదనే విషయం గుర్తుంచుకోవాలి. అక్రమ రవాణాను అరికట్టడానికి, దేశ ఆర్థిక ఆదాయాన్ని కాపాడటానికి నిర్దేశించబడ్డాయి. లేటెస్ట్ అధికారిక సమాచారం ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు కింద ఉన్నాయి.కస్టమ్స్ నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?ముందుగా ఒక ప్రాథమిక విషయాన్ని గమనించాలి. కస్టమ్స్ నిబంధనలు కేవలం అంతర్జాతీయ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తాయి. మీరు భారతదేశం లోపల (డొమెస్టిక్) ప్రయాణిస్తుంటే కేవలం విమానయాన సంస్థల బ్యాగేజీ పరిమితులు మాత్రమే ఉంటాయి తప్ప కస్టమ్స్ డిక్లరేషన్ అవసరం ఉండదు.విదేశీ నివాస కాలం కీలకంమీరు విదేశాల్లో ఎంతకాలం గడిపారు అనే అంశంపైనే మీ బ్యాగేజీ మినహాయింపులు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా బంగారం వంటి వస్తువుల విషయంలో ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉన్నవారికి మాత్రమే ప్రత్యేక రాయితీలు వర్తిస్తాయి. స్వల్పకాలిక పర్యాటకులు, దీర్ఘకాలిక ఉద్యోగులు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీని బట్టి అధికారులు నిబంధనలను పరిశీలిస్తారు.బంగారం నిబంధనలుభారతీయ విమానశ్రయాల్లో బంగారం అత్యంత సున్నితమైన అంశం. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. పురుషులు ఒక ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 20 గ్రాముల(గరిష్ట విలువ రూ.50,000) బంగారు ఆభరణాలను, మహిళలు ఏడాది కంటే ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే 40 గ్రాముల(గరిష్ట విలువ రూ.1,00,000) బంగారు ఆభరణాలను తీసుకురావచ్చు. ఇక్కడ బరువు, విలువ రెండూ పరిగణనలోకి తీసుకుంటారు. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో 20 గ్రాముల బంగారం విలువ రూ.50,000 దాటింది కాబట్టి ఆ పైన ఉన్న విలువకు ప్రయాణికులు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.గోల్డ్ బార్లు.. కాయిన్స్ఆభరణాలకు ఇచ్చే మినహాయింపులు గోల్డ్ బార్లు లేదా నాణేలకు వర్తించవు. వీటిని వాణిజ్య పరమైనవిగా పరిగణిస్తారు కాబట్టి, వీటిపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని డిక్లేర్ చేయకుండా తీసుకురావడం చట్టరీత్యా నేరం.మద్యం, నగదు పరిమితులువిదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు గరిష్టంగా రెండు లీటర్ల మద్యం లేదా వైన్ మాత్రమే తీసుకురావడానికి అనుమతి ఉంది. ఈ పరిమితి దాటితే వాటిని జప్తు చేసే అవకాశం ఉంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ప్రయాణికులు తమ వద్ద గరిష్టంగా రూ.25,000 వరకు నగదును ఉంచుకోవచ్చు. విదేశీ కరెన్సీని తీసుకురావడానికి గరిష్ట పరిమితి లేదు. కానీనగదు రూపంలో 5,000 అమెరికన్ డాలర్లు దాటినా, మొత్తం విదేశీ ఎక్స్ఛేంజ్ (నగదు + ట్రావెలర్స్ చెక్కులు) 10,000 డాలర్లు దాటినా కచ్చితంగా డిక్లేర్ చేయాలి.‘పర్సనల్ యూజ్’ అంటే ఏమిటి?కస్టమ్స్ క్లియరెన్స్లో ప్రయాణికులు తీసుకొస్తున్న వస్తువుల గురించి అధికారులు అడిగినప్పుడు సింపుల్గా పర్సనల్ యూజ్ అంటారు. కేవలం ప్రయాణికులు చెప్పిన మాటపై అధికారులు నమ్మకం ఉంచరు. వస్తువుల సంఖ్య, అవి కొత్తవా లేదా వాడినవా, ప్యాకింగ్ ఎలా ఉంది, మీరు తరచుగా ప్రయాణాలు చేస్తున్నారా అనే అంశాలను బట్టి అది వ్యక్తిగత అవసరమా లేక వాణిజ్య అవసరమా అని నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒకటి రెండు వాడిన మొబైల్ ఫోన్లు వ్యక్తిగతమైనవిగా పరిగణిస్తారు. కానీ డజన్ల కొద్దీ సీల్ చేసిన కొత్త ఫోన్లు ఉంటే అది వాణిజ్య ఉద్దేశంగానే చూస్తారు.సురక్షిత ప్రయాణం కోసం సూచనలుకస్టమ్స్ నిబంధనలు ఉల్లంఘిస్తే 10% నుంచి 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్నిసార్లు జైలు శిక్ష కూడా తప్పకపోవచ్చు. మీ వద్ద ఉన్న వస్తువులపై ఏమాత్రం సందేహం ఉన్నా ఎయిర్పోర్ట్లోని రెడ్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఉన్న ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) వద్దకు వెళ్లి అధికారులను సంప్రదించాలి. నిజాయితీగా డిక్లేర్ చేయడం వల్ల మీరు అనవసరపు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. గ్రీన్ ఛానల్(కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సిన వస్తువులు ఏవీ లేవని భావించే ప్రయాణికుల కోసం ఉద్దేశించింది) ద్వారా దొంగచాటుగా వెళ్లడం వల్ల కలిగే రిస్క్ చాలా ఎక్కువ.-దవనం శ్రీకాంత్ -
ఎస్ఎంఎస్ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు
టెలికాం కంపెనీలు తమ ప్రమోషన్ల కోసం రోజూ వందల కొద్దీ మెసేజ్లను ఉచితంగా పంపిస్తుంటే, మన సొమ్ముకు భద్రతనిచ్చే బ్యాంకులు మాత్రం ప్రతి ఎస్ఎంఎస్కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా అందించిన సేవలే ఇప్పుడు బ్యాంకుల ఆదాయ వనరులుగా మారాయి. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023–25) కేవలం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్ఎంఎస్ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేశాయని పార్లమెంట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.భారీగా వసూళ్లు: టాప్ 6 బ్యాంకుల జాబితాఎస్ఎంఎస్ అలర్ట్ల పేరుతో అత్యధికంగా వసూలు చేసిన బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:బ్యాంక్వసూలు చేసిన సొమ్ము (రూ. కోట్లలో)యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా1,188.14కెనరా బ్యాంక్506.28పంజాబ్ నేషనల్ బ్యాంక్360.45సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా308.72ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్204.89బ్యాంక్ ఆఫ్ బరోడా202.42 గమనిక: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ 2020 నుంచి ఎస్ఎంఎస్ సేవలపై ఛార్జీలను రద్దు చేయడం గమనార్హం.ఉచితం నుంచి ఛార్జీల వైపు.. ఎందుకు?ప్రారంభంలో డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి బ్యాంకులు ఎస్ఎంఎస్ అలర్ట్లను ఉచితంగా అందించాయి. అయితే, ప్రతి ఎస్ఎంఎస్కు టెలికాం కంపెనీలకు బ్యాంకులు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ వ్యయాన్ని కస్టమర్ల నుంచే వసూలు చేయడం బ్యాంకులు ప్రారంభించాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం, కమర్షియల్ ఎస్ఎంఎస్ల నియంత్రణకు ‘డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ’(డీఎల్టీ) అమలులోకి వచ్చింది. దీనివల్ల బ్యాంకులపై నిర్వహణ భారం పెరిగింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల ఏర్పడే ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు బ్యాంకులు సర్వీస్ ఛార్జీలపై దృష్టి పెట్టాయి.కేవలం ఎస్ఎంఎస్లే కాదు.. ఏటీఎంలు కూడా!గతంలో ఉచితంగా లభించి ప్రస్తుతం భారంగా మారిన సేవల్లో ఏటీఎం లావాదేవీలు ప్రధానమైనవి. ఒకప్పుడు ఎన్నిసార్లైనా ఉచితంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి అదనంగా ఛార్జీలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి వస్తోంది. ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేకపోతే జరిమానాల రూపంలో బ్యాంకులు భారీగా వసూలు చేస్తున్నాయి. ఏటా డెబిట్ కార్డ్ మెయింటెనెన్స్ పేరుతో రూ.150 నుంచి రూ.500 వరకు బ్యాంకులు కట్ చేస్తున్నాయి. బ్రాంచ్కు వెళ్లి నగదు జమ చేసినా లేదా విత్డ్రా చేసినా నెలకు నిర్ణీత పరిమితి దాటితే ఛార్జీలు వర్తిస్తున్నాయి.సామాన్యుడి పొదుపుపై బ్యాంకులు ఈ స్థాయిలో ఛార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది. ఒకవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు భద్రత కోసం ఇచ్చే ఎస్ఎంఎస్లపై కూడా భారం మోపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్బీఐ బాటలోనే మిగిలిన బ్యాంకులు కూడా కనీసం ప్రాథమిక ఎస్ఎంఎస్ అలర్ట్లను ఉచితంగా అందిస్తే సామాన్యులకు ఊరట లభిస్తుంది.ఇదీ చదవండి: ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ.. -
ప్రేమలో మునిగి తేలుతూ.. వ్యాపారం పెంచుతూ..
ప్రేమకు భాషతో పనిలేదు అంటారు. అది వాస్తవమే అయినా భాషలకు అతీతంగా యువతీ యువకుల ప్రేమైనా, తల్లిదండ్రుల ప్రేమైనా, అన్నా చెల్లల ప్రేమనా.. మార్కెట్తో కనెక్ట్ అవ్వాల్సిందే. నేటి కాలంలో ప్రేమకు ‘మార్కెట్’తో విడదీయలేని ముడిపడి ఉంది. ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే ఇప్పుడు కేవలం ఒక భావోద్వేగపూరితమైన రోజుగా మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఒక భారీ కమర్షియల్ ఈవెంట్గా అవతరించింది. భారత్లో ఈ ఒక్క రోజున జరిగే వ్యాపారం విలువ సుమారు రూ.25,000 కోట్ల నుంచి రూ.30,000 కోట్ల వరకు ఉంటుందని వాణిజ్య వర్గాల అంచనా.విందులు.. వినోదాలువాలెంటైన్స్ డే ప్రభావం అత్యధికంగా కనిపించేది హోటళ్లు, రెస్టారెంట్లపైనే. క్యాండిల్ లైట్ డిన్నర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘కపుల్ మెనూ’లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే ఈ రోజు రెస్టారెంట్ల ఆదాయం 40-50% పెరుగుతుంది. నగరాల్లోని ఫైవ్స్టార్ హోటళ్లు లవ్ ప్యాకేజీల పేరుతో బస, స్పా, డిన్నర్ కలిపి ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.బహుమతుల్లో కొత్త పోకడలువస్తువుల క్రయవిక్రయాల్లో ఈ సీజన్లో మెరుగైన వృద్ధి కనిపిస్తుంది. గులాబీ పూల ఎగుమతి, దిగుమతులు ఈ వారంలో పీక్ స్టేజ్లో ఉంటాయి. కేవలం ఒక్క రోజులోనే కోట్లాది రూపాయల విలువైన గులాబీలు అమ్ముడవుతాయి. ప్రత్యేకంగా ఫొటోలు ఉన్న బహుమతులు, కస్టమైజ్డ్ జువెలరీ, గాడ్జెట్స్కు యువత ప్రాధాన్యత ఇస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు ప్రత్యేకంగా సేల్స్ నిర్వహించడం వల్ల ఆన్లైన్ షాపింగ్ వృద్ధి నమోదు చేస్తుంది.టూరిజంప్రేమికులు ఏకాంతంగా గడపడానికి పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవడంతో ట్రావెల్ ఇండస్ట్రీకి లాభాలొస్తాయి. దేశీయంగా గోవా, ఉదయ్పూర్, కేరళ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు విమాన టిక్కెట్లు, హోటల్ రూమ్స్ నెల రోజుల ముందే బుక్ అవుతున్నాయి. విదేశీ ప్రయాణాల్లో భాగంగా మాల్దీవులు, థాయిలాండ్, బాలి వంటి దేశాలకు వెళ్లే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ సంస్కృతి నేడు భారత్లో ఒక బలమైన వాణిజ్య శక్తిగా మారింది. వినియోగదారుల ఖర్చు చేసే సామర్థ్యం పెరగడం, సోషల్ మీడియా ప్రభావం వెరసి వాలెంటైన్స్ డేని ఒక బిలియన్ డాలర్ ఇండస్ట్రీగా మార్చేశాయి.ఇదీ చదవండి: రాజ్పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే.. -
డబ్బుఉందా? డెబిట్! లేదా? క్రెడిట్!
భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ మరో కీలక మలుపు తీసుకుంటోంది. అంతర్జాతీయ చెల్లింపుల దిగ్గజం వీసా త్వరలో భారత్లో ఒకే కార్డుతో అటు డెబిట్కి, ఇటు క్రెడిట్కి రెండు విధాలుగా ఉపయోగపడేలా ‘డెబిట్–కమ్–క్రెడిట్ కార్డు’ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త విధానం వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడమే కాకుండా, దేశంలో క్రెడిట్ వినియోగాన్ని విస్తరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో పోలిస్తే ప్రస్తుతం భారత్లో యూపీఐ వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, అది ప్రధానంగా బ్యాంక్ సేవింగ్స్ ఖాతా నుంచి నేరుగా డబ్బు కట్ అయ్యే విధానమే. డెబిట్ కార్డులు కూడా ఖాతాలో డబ్బు ఉంటేనే పనిచేస్తాయి. మరోవైపు, క్రెడిట్ కార్డులు సౌకర్యవంతమే అయినా వాటి వినియోగం డిజిటల్ రూపంలో,యూపీఐ చెల్లింపుల విషయంలో ఇంకా పరిమితంగానే ఉంది. ఈ నేపథ్యంలో వీసా తీసుకొస్తున్న కొత్త కార్డు యూపీఐతో అందే సౌలభ్యం, డెబిట్ కార్డుతో చేయగల నియంత్రణ, క్రెడిట్ కార్డు ఫ్లెక్సిబిలిటీ ఈ మూడింటినీ కలిపిన ఉపయోగకరమైన సాధనంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. బ్యాంకులు, వినియోగదారులకు లాభాలు ఈ కొత్త విధానం ద్వారా బ్యాంకులు తమ రిస్క్ పాలసీలకు అనుగుణంగా క్రెడిట్ వినియోగాన్ని నియంత్రించగలుగుతాయి. వినియోగదారులకు మాత్రం ఒకటి కంటే ఎక్కువ కార్డులని ప్రతిచోటుకూ మోసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా స్థిర ఆదాయం ఉన్నా క్రెడిట్ కార్డు లేని మధ్యతరగతి వర్గానికి ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థపై ప్రభావం నిపుణుల అంచనాల ప్రకారం, ఈ విధానం నగదు వినియోగాన్ని తగ్గించడంలో, టైర్–2, టైర్–3 నగరాల్లో కార్డు వినియోగాన్ని పెంచడంలో, ఫార్మల్ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే, అతిగా క్రెడిట్ వినియోగం వల్ల వినియోగదారుడు అప్పుల ఊబిలో కూరుకునే ప్రమాదం కూడా ఉందని, అందుకే ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వీసా ప్రతిపాదిస్తున్న ఈ డెబిట్–కమ్–క్రెడిట్ కార్డు భారత్ చెల్లింపుల వ్యవస్థను మరింత స్మార్ట్గా, ఫ్లెక్సిబుల్గా మార్చే విధానంగా పరిగణించవచ్చు. ఇది వినియోగదారుల సౌకర్యం, బ్యాంకులకు భద్రత ఈ రెండింటికీ మధ్య సమతుల్యత తీసుకురావచ్చని విశ్లేషకుల అభిప్రాయం. కార్డు కాదు కాంబోప్యాక్ వీసా అభివృద్ధి చేసిన ‘ఫ్లెక్సిబుల్ క్రెడెన్షియల్ (వీసా ఫ్లెక్స్) ’ టెక్నాలజీ ఆధారంగా ఈ కార్డు పనిచేస్తుంది. 16 అంకెల ఒకే కార్డు నంబర్ ద్వారా కస్టమర్ లావాదేవీ చేసే సమయంలో అది అవసరాన్ని బట్టి డెబిట్గా లేదా క్రెడిట్గా వాడుకోవచ్చు. చెల్లింపు ఎలా జరగాలన్నది కస్టమర్ కొనుగోలు చేసే విలువ మొత్తం, లేదా వినియోగదారు ముందుగా ఎంచుకున్న సెట్టింగ్స్ ఆధారంగా ఆటోమేటిక్గా నిర్ణయమవుతుంది.ఉదాహరణకు, రోజువారీ చిన్న ఖర్చులు డెబిట్గా, పెద్ద కొనుగోళ్లు క్రెడిట్లో జరిగేలా ఈ కార్డును సెట్ చేసుకోవచ్చు.భారత్ ఎందుకు కీలక మార్కెట్? భారత్లో క్రెడిట్ కార్డు వినియోగం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే తక్కువ. అదే సమయంలో నగదు లావాదేవీల వాటా చాలా పెద్దది. ఈ పరిస్థితిలో ఒకే కార్డు ద్వారా డెబిట్–క్రెడిట్ సౌకర్యం ఇవ్వడం వల్ల డిజిటల్ చెల్లింపులు మరింత విస్తరించవచ్చని వీసా భావిస్తోంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
పవర్ఫుల్ పాస్పోర్ట్ల్లో భారత్ స్థానం ఎంతంటే..
అంతర్జాతీయ ప్రయాణ విభాగంలో భారత పాస్పోర్ట్ తన ప్రభావాన్ని చాటుతోంది. తాజాగా విడుదలైన 2026 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో ఇండియా గతేడాదితో పోలిస్తే ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 75వ స్థానానికి చేరుకుంది. భారతీయ పౌరుల అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛ గణనీయంగా పెరిగిందని ఈ ర్యాంకింగ్ స్పష్టం చేస్తోంది.హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) అందించే అధికారిక డేటా ఆధారంగా రూపొందుతుంది. ఒక దేశ పాస్పోర్ట్ హోల్డర్లు ముందస్తు వీసా అవసరం లేకుండా ఎన్ని దేశాలకు వెళ్లగలరు అనే అంశంపై ఈ ర్యాంకింగ్స్ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుత నివేదిక ప్రకారం, భారతీయ పాస్పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలకు వీసా-ఫ్రీ, వీసా-ఆన్-అరైవల్ లేదా ఇ-వీసా సౌకర్యంతో సులభంగా ప్రయాణించవచ్చు.ప్రయాణికులకు ప్రయోజనాలుఈ మెరుగైన ర్యాంకింగ్ వల్ల సెలవులు, వ్యాపార పర్యటనలు లేదా సాంస్కృతిక సందర్శనల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవాంతరాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆసియా, ఓషియానియా, కరేబియన్ దీవులు, ఆఫ్రికా ఖండంలోని దేశాల్లో భారతీయులకు మెరుగైన ప్రవేశ సౌకర్యాలు లభిస్తాయి.భారత్ ఈ ర్యాంకింగ్స్లో గత దశాబ్ద కాలంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. 2006లో 71వ ర్యాంకులో ఉన్న భారత్ గత ఏడాది 85వ స్థానానికి పడిపోయింది. అయితే, 2026 ప్రారంభంలో 80వ స్థానానికి, ఇప్పుడు ఏకంగా 75వ స్థానానికి చేరుకోవడం గమనార్హం.ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లు..ర్యాంకుదేశంవీసా రహిత పర్యటన(దేశాల సంఖ్య)1సింగపూర్1922జపాన్, దక్షిణ కొరియా1873స్వీడన్, యూఏఈ1864జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్ (మరో 8 ఐరోపా దేశాలు)1855ఆస్ట్రియా, గ్రీస్, పోర్చుగల్, మాల్టా184 టాప్ 10లో ఇతర దేశాలు..ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు టాప్ 10 జాబితాలో కొనసాగుతున్నాయి. అమెరికా పాస్పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 179 దేశాలకు ముందస్తు వీసా లేకుండా ప్రయాణించగలరు.75వ ర్యాంకు అనేది భారత పాస్పోర్ట్ చరిత్రలో అత్యుత్తమ స్థానం కాకపోయినప్పటికీ, గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న వృద్ధి రేటు సానుకూల ధోరణిని సూచిస్తోంది. ప్రపంచ దేశాలతో భారత్ కుదుర్చుకుంటున్న ద్వైపాక్షిక ఒప్పందాలు, దౌత్య సంబంధాల మెరుగుదల కారణంగా భవిష్యత్తులో భారత పాస్పోర్ట్ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రాజ్పాల్ యాదవ్ గ్యారేజీలోని కార్ల లిస్ట్ ఇదే.. -
ఇక ధరల లెక్క కొత్తగా
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణ సూచీ.. క్షేత్రస్థాయిలో వాస్తవ ధరలను ప్రతిఫలించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటికి సమాధానంగానా అన్నట్టు.. కేంద్ర ప్రభుత్వం వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ)లో కీలక మార్పులు, చేర్పులు చేసింది. సీపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం (రిటైల్)కు ఇప్పటివరకు 2012 బేస్ ఇయర్గా ఉండగా దీన్ని 2024కు మార్చింది. గృహ వినియోగ, వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) 2023–24ను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. సీపీఐలో కొన్ని వినియోగ వస్తువులను, సేవలను చేరుస్తూ.. అదే సమయంలో కొన్నింటిని తొలగించింది. కొన్నింటి వెయిటేజీ తగ్గిస్తూ.. కొన్నింటికి పెంచింది. కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా చూస్తే ఈ ఏడాది జనవరిలో నిత్యావసర ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతానికి ఎగిసింది. 2012 బేస్ సంవత్సరం ప్రకారం డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.33 శాతమే. సీక్వెన్షియల్గా (నెలవారీ) పెరగ్గా.. 2025 జనవరిలో ఉన్న 4.26 శాతంతో పోలి్చనప్పుడు తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జనవరిలో 2.77 శాతంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 2.73 శాతంగా నమోదైంది. ముఖ్యంగా ఆహారం, మెటల్స్ ధరలు పెరగడం ద్రవ్యోల్బణం ఎగిసేందుకు దారితీసింది. దీంతో ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలలోనూ పెరిగినట్టయింది. అయినప్పటికీ ఆర్బీఐ నియంత్రిత లక్ష్యం 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది. → కొత్త సిరీస్ ప్రకారం దేశంలో అత్యధికంగా 4.92 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. ఆ తర్వాత కేరళ, తమిళనాడులో అధిక ద్రవ్యోల్బణం కనిపించింది. → జనవరిలో ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 2.13 శాతంగా, హౌసింగ్లో 2.05 శాతం చొప్పున నమోదైంది. వ్రస్తాలు, పాదరక్షల విభాగంలో 2.98 శాతంగా ఉంది. → వెల్లుల్లి, ఉల్లి, ఆలుగడ్డలు, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గాయి. → వెండి, బంగారం, వజ్రం, ప్లాటినం ఆభరణాలు, టమాటాలు, కొబ్బరి, కొబ్బరి నూనె ధరలు పెరిగాయి. → కొత్త సిరీస్లో వస్తువులు 259 నుంచి 308కి పెరిగాయి. సేవలు సైతం 40 నుంచి 50కు చే రాయి. ధరల ప్రభావం మరింత వాస్తవికంగా ఉండేందుకు ఈ చేరికలు సాయపడనున్నాయి. → సూచీలో ఆహారం, పానీయాలకు ఇప్పటి వరకు 45.86 శాతం వాటా ఉంటే, కొత్త సిరీస్లో 36.75 శాతానికి తగ్గింది. సీపీఐలో చేరినవి → గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు (అద్దెలు, నిర్వహణ వ్యయాలు) → ఆన్లైన్ మీడియా సర్వీస్ ప్రొవైడర్లు/స్ట్రీమింగ్ సేవలు → విలువ ఆధారిత పాడి ఉత్పత్తులు → బార్లీ, సంబంధిత ఉత్పత్తులు → పెన్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ → వ్యాయామ పరికరాలు → అటెండెంట్, బేబీ సిట్టర్ (ఇళ్లలో సహాయకులు)సీపీఐ నుంచి తొలగించినవి → వీసీఆర్/వీసీడీ/డీవీడీ ప్లేయర్లు → రేడియో, టేప్రికార్డర్ → వినియోగించిన వ్రస్తాలు → సీడీ/డీవీడీలు, ఆడియా/వీడియో క్యాసెట్లు → కాయిర్/రోప్ → హైరింగ్ చార్జీలు (బాడుగకు తీసుకున్న వాటికి చెల్లించేవి) -
జనవరిలోనూ ఎగుమతులు సానుకూలమే
భారత వస్తు, సేవల ఎగుమతులు ఈ ఏడాది ఇప్పటి వరకు సానుకూల వృద్ధిని నమోదు చేసిట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ జనవరిలోనూ సానుకూలంగానే ఉన్నట్టు తెలిపారు. జనవరి నెలకు సంబంధించి అధికారిక డేటా ఈ నెలలో విడుదల అవుతుందన్నారు. బయోఫాచ్ 2026 కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన జర్మనీలోని న్యూరెమ్బర్గ్కు వచ్చిన సందర్భంగా మాట్లాడారు.భారత్లోని 20 రాష్ట్రాలకు చెందిన 100 మంది ఎగ్జిబిటర్లు ఆర్గానిక్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనగా ఉంచారు. ఐరోపా సమాఖ్య వీటికి పెద్ద మార్కెట్గా ఉంది. దేశ వస్తు ఎగుమతులు గత డిసెంబర్లో 2 శాతం పెరిగి 38.5 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. అదే నెలలో దిగుమతులు 8.7 శాతం పెరిగి 63.55 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు (9 నెలల్లో) వస్తు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలి్చతే 2.44 శాతం పెరిగి 330.29 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వస్తు, సేవల ఎగుమతులు 850 బిలియన్ డాలర్లకు మించి నమోదవుతాయని వాణిజ్య శాఖ అంచనాగా ఉంది.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట -
స్వచ్ఛ విద్యుత్కి పెట్టుబడుల పవర్
న్యూఢిల్లీ: భారత్ సమ్మిళిత, సుస్థిర వృద్ధి సాధించడంలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషించనుంది. జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడనుంది. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధనాలను వినియోగించని, పర్యావరణహితమైన స్వచ్ఛ విద్యుత్, తటస్థ స్థాయి ఉద్గార (నెట్ జీరో) లక్ష్యాల సాధనకు భారీ పెట్టుబడులు అవసరం కానున్నాయి. 2070 నాటికి రెన్యువబుల్స్, స్టోరేజ్, పంపిణీ మొదలైన విభాగాలకు సంబంధించి విద్యుత్ రంగానికి 14.23 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్ ఒక నివేదికలో ఈ విషయాలు వివరించింది. దేశాభివృద్ధి, వాతావరణ లక్ష్యాలన్నీ కూడా విద్యుత్పైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. 2047 నాటికి నిర్దేశించుకున్న వికసిత భారత్ లక్ష్యాలకు సంబంధించి ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్ జీరో లక్ష్యాల సాధనకు తోడ్పడే విధానాలను అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే కోణాల్లో నివేదిక రూపొందింది. దీని ప్రకారం .. → 2025 డిసెంబర్ నాటికి 258 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంతో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రెన్యువబుల్ ఎనర్జీ మార్కెట్గా భారత్ నిలి్చంది. → తదుపరి దశ మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పట్టణీకరణ, కూలింగ్, డిజిటలీకరణ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హరిత హైడ్రోజన్ మొదలైన వాటితో విద్యుత్కి డిమాండ్ భారీగా పెరగనుంది. వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్ విభాగాల నుంచి పెరిగే డిమాండ్ని తట్టుకునే విధంగా వ్యవస్థ పటిష్టం కావాలి. → ఇందుకోసం నిల్వ సామర్థ్యాలను, పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవాలి. గ్రిడ్ కార్యకలాపాలను ఆధునీకరించాలి. విశ్వసనీయమైన విధంగా, చౌకగా స్వచ్ఛ విద్యుత్ లభించేలా చూసేందుకు పంపిణీ అనేది ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చూడాలి. → దేశవ్యాప్తంగా విద్యుదీకరణ వేగవంతం కావడాన్ని బట్టి భారతదేశ విద్యుత్ పరివర్తన ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. → తలసరి విద్యుత్ వినియోగం 2025లో 1,400 కిలోవాట్అవర్ స్థాయి నుంచి 2070 నాటికి 7,000–10,000 కిలోవాట్అవర్కి పెరగనుంది. ఫ్రాన్స్, కొరియాలాంటి సంపన్న దేశాల స్థాయికి చేరనుంది. → ప్రస్తుత పాలసీలు ఇలాగే కొనసాగితే 2070 నాటికి మొత్తం స్థాపిత సామర్థ్యం తొమ్మిది రెట్లు పెరుగుతుంది. అదే తటస్థ ఉద్గారాల లక్ష్యాలకు అనుగుణమైన నెట్–జీరో విధానాలను అమలు చేస్తే 14 రెట్లు పెరుగుతుంది. → సోలార్ పీవీ సామర్థ్యం 5,500 గిగావాట్లకు చేరుతుంది. ప్రస్తుత పాలసీలను కొనసాగిస్తే ఇప్పుడు నామమాత్రంగా ఉన్న బ్యాటరీ స్టోరేజీ 1,400 గిగావాట్లకు చేరుతుంది. నెట్ జీరో విధానాలతో 3,000 గిగావాట్లకు చేరుతుంది. → దీర్ఘకాలికంగా విద్యుత్ పరివర్తనలో అణు విద్యుత్ వ్యూహాత్మక పాత్ర పోషించనుంది. 2025లో 8.8 గిగావాట్లుగా ఉన్న సామర్థ్యం 2070 నాటికి 300 గిగావాట్లకు పెరుగుతుంది. → ప్రస్తుత పాలసీల ప్రకారం 2070 నాటికి మొత్తం పెట్టుబడులు దాదాపు 8.79 లక్షల కోట్ల డాలర్లకు చేరనుండగా, నెట్ జీరో విధానాలతో 14.23 లక్షల కోట్ల డాలర్లకు చేరతాయి. -
ఖజానా హౌస్ఫుల్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోరుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 10 వరకు (2025 ఏప్రిల్ 1 నుంచి) ప్రత్యక్ష పన్నుల నికర ఆదాయం.. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.4 శాతం పెరిగి రూ.19.44 లక్షల కోట్లకు చేరింది. ఆదాయపన్ను శాఖ డేటా ప్రకారం రిఫండ్లు తగ్గడం, కార్పొరేట్ పన్ను (కంపెనీలు చెల్లించే) వసూళ్లు బలంగా ఉండడం ఇందుకు అనుకూలించింది. ఈ కాలంలో కార్పొరేట్ పన్నుల వసూలు 14.51% పెరిగి రూ.8.90 లక్షల కోట్లుగా ఉంటే.. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాల (హెచ్యూఎఫ్లు) నుంచి ఆదాయం 5.91 శాతం పెరిగి రూ.10.03 లక్షల కోట్లుగా ఉన్నట్టు ఆదాయపన్ను శాఖ డేటా తెలియజేస్తోంది. సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో ఖజానాకు రూ.50,279 కోట్లకు సమకూరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే ఎలాంటి వృద్ధి లేదు. పన్ను రిఫండ్లు (తిరిగి చెల్లింపులు) 18.82 శాతం తగ్గి రూ.3.34 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇక ఫిబ్రవరి 10 నాటికి స్థూల పన్ను వసూళ్లు 4.09 శాతం పెరిగి రూ.22.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో కార్పొరేట్ పన్నుల స్థూల ఆదాయం రూ.10.88 లక్షల కోట్లుగా, నాన్ కార్పొరేట్ పన్నుల ఆదాయం రూ.11.39 లక్షల కోట్లుగా ఉంది. -
జీఎస్టీ అంటే భయమేలా?
దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చి ఏడేళ్లు దాటినా సామాన్య పన్ను చెల్లింపుదారులు, చిరు వ్యాపారుల్లో దీనిపై నెలకొన్న ఆందోళనలు తగ్గడం లేదు. జీఎస్టీ అంటే కేవలం పన్ను విధానం మాత్రమే కాదు, అది ఒక క్లిష్టమైన సవాల్ అనే భావన బలంగా నాటుకుపోయింది. నిజాయితీగా వ్యాపారం చేసే వారు కూడా నోటీసులు వస్తాయేమోనని భయపడే పరిస్థితి ఎందుకు ఉంది? ప్రభుత్వం నుంచి అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇక్కడ చూద్దాం.జీఎస్టీ ఎందుకు భారంగా అనిపిస్తోంది?చాలా మంది వ్యాపారులు జీఎస్టీ వ్యవస్థను తమకు సహకరించే వ్యవస్థగా కాకుండా కేవలం పన్ను వసూలు చేసే యంత్రాంగంగా మాత్రమే చూస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు..ఆదాయపన్ను రిటర్న్ దాఖలులో చిన్న పొరపాటు జరిగినా లేదా ఆలస్యమైనా ఏటా 18% వడ్డీ భారం పడుతుంది. ఇది చిన్న వ్యాపారుల లాభాలను దెబ్బతీస్తోంది.కొనుగోలుదారు, విక్రేత ఇచ్చే లెక్కల్లో స్వల్ప తేడాలున్నా (జీఎస్టీఆర్-2బీ vs 3బీ) సిస్టమ్ వెంటనే అప్రమత్తం చేయడం వల్ల ఒత్తిడి పెరుగుతోంది.క్షేత్రస్థాయిలో తప్పులు జరిగినప్పుడు సరిదిద్దే మార్గాల కంటే శిక్షించే నిబంధనలే ఎక్కువగా ప్రచారంలో ఉండటం భయానికి కారణం.నోటీసు అంటే భయపడాలా?వ్యాపారులకు జీఎస్టీ నోటీసు అందగానే అదొక క్రిమినల్ కేసులా భావిస్తుంటారు. అధిక శాతం నోటీసులు అధికారులు స్వయంగా పంపేవి కావు. సాఫ్ట్వేర్ ద్వారా డేటాలో తేడాలను గుర్తించి జారీ అయ్యే స్క్రూటినీ నోటీసులు ఎక్కువగా ఉంటాయి. నోటీసు అంటే కేవలం వివరణ కోరడం మాత్రమే. సరైన ఆధారాలు చూపిస్తే చాలా వరకు సమస్యలు అక్కడితోనే ముగుస్తాయి. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం.. జీఎస్టీ ప్రారంభ దశలో (2017-19) జరిగిన చిన్న పొరపాట్లకు వడ్డీ, జరిమానాల నుంచి మినహాయింపులు కూడా ఇచ్చారు.జీఎస్టీ చట్టం కింద విధించే జరిమానాల విషయంలో పన్ను చెల్లింపుదారులు అనవసర ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే చట్టం పొరపాట్లకు, మోసాలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. సాధారణంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా అవగాహన లోపం వల్ల జరిగే సాధారణ తప్పుల విషయంలో శిక్షలు తక్కువగా ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 10 శాతం లేదా రూ.10,000.. వీటిలో ఏది ఎక్కువగా ఉంటే ఆ మొత్తాన్ని జరిమానాగా విధిస్తారు. ఇది కేవలం పన్ను చెల్లింపుదారుడిని క్రమశిక్షణలో ఉంచడానికి ఉద్దేశించిన చర్య మాత్రమే.అయితే, పన్నును ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టాలని చూసినా లేదా తప్పుడు లెక్కలతో వ్యవస్థను మోసం చేయాలని ప్రయత్నించినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పన్ను మొత్తంలో 100 శాతం వరకు, అంటే పన్నుకు సమానమైన మొత్తాన్ని జరిమానాగా విధించే అధికారం ఉంటుంది. దీనివల్ల నిజాయితీగా ఉండే వ్యాపారులకు రక్షణ కలుగుతుండగా, అక్రమాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అందుతుంది.చాలా మందిలో ఉన్న మరొక ప్రధాన అపోహ ఏమిటంటే.. అధికారులు విధించిన జరిమానాపై అప్పీల్కు వెళ్తే అది మరింత పెరుగుతుందని భయపడుతుంటారు. కానీ ఇది వాస్తవం కాదు. పన్ను చెల్లింపుదారుడి వద్ద సరైన ఆధారాలు ఉండి, చట్టబద్ధంగా వారి వాదన బలంగా ఉంటే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ద్వారా ఉపశమనం పొందే హక్కు వారికి ఉంటుంది. కాబట్టి చట్టంపై సరైన అవగాహన కలిగి ఉండటం వల్ల ఇటువంటి అపోహల నుంచి బయటపడవచ్చు.తెర వెనుక ఏం జరుగుతుంది?జీఎస్టీ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తోంది. ఒక వ్యాపారి నిరంతరం తప్పుడు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేస్తున్నా లేదా పదే పదే రిటర్న్లు ఎగ్గొడుతున్నా వారిని మాత్రమే వ్యవస్థ హై రిస్క్ కేటగిరీలో ఉంచుతుంది. అధికారుల జోక్యం తగ్గించేందుకు ‘ఫేస్లెస్ అసెస్మెంట్’(పన్ను చెల్లింపుదారుడు, పన్ను అధికారి ప్రత్యక్షంగా ముఖాముఖి కలవాల్సిన అవసరం లేకుండానే పన్ను మదింపు ప్రక్రియను పూర్తి చేసే ఒక ఆధునిక విధానం) వంటి విధానాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.అవగాహనే రక్షణజీఎస్టీ అనేది చట్టం కంటే దానిపై సమాచార లోపం వల్లే ఎక్కువగా క్లిష్టంగా కనిపిస్తోంది. సకాలంలో రిటర్న్లు దాఖలు చేయడం, నోటీసులకు వెంటనే స్పందించడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా చాలా సమస్యలను నివారించవచ్చు. వ్యవస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.- దవనం శ్రీకాంత్ -
బ్యాంకులకు లాభాల కళ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో లాభాల మోత మోగించాయి. ఎస్బీఐ సహా 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉమ్మడిగా రూ.52,603 కోట్ల నికర లాభాన్ని నమోదు చేశాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ.44,473 కోట్లతో పోల్చి చూస్తే 18 శాతం మేర (రూ.8,130 కోట్లు) పెంచుకున్నాయి. → అన్నింటిలోకి ఎస్బీఐ వాటా అధికంగా ఉంది. డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఎస్బీఐ రూ.21,028 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలి్చతే 24 శాతం పెరిగింది. → చెన్నై కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 35 శాతం అధికంగా రూ.1,365 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. → సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 32 శాతం పెరిగి రూ.1,263 కోట్లుగా ఉంది. → లాభంలో అధిక వృద్ధిని చూపించిన వాటిల్లో ఎస్బీఐతోపాటు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (27 శాతం), కెనరా బ్యాంక్ (26 శాతం) ఉన్నాయి. → పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (19 శాతం) యూకో బ్యాంక్ (16 శాతం), పీఎన్బీ 13 శాతం చొప్పున లాభాన్ని డిసెంబర్ త్రైమాసికంలో పెంచుకున్నాయి. → 12 ప్రభుత్వరంగ బ్యాంక్ల ఉమ్మడి లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 11 శాతం పెరిగి రూ.44,218 కోట్లుగా ఉంది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9 శాతం తక్కువగా రూ.49,456 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. → ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ చివరి వరకు తొమ్మిది నెలల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం రూ.1,46,277 కోట్లకు చేరింది. అంక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1,29,994 కోట్లుగా ఉంది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీఎస్బీల లాభం రూ.2లక్షల కోట్లను అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు వ్యక్తం చేశారు. -
ఏప్రిల్ 1 విడుదల
న్యూఢిల్లీ: ప్రాపర్టీ, వాహన కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు ఇకపై ప్రతిసారీ పాన్ సమర్పించాల్సిన అవసరం రాదు! ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఆదాయపన్ను చట్టం కింద పాన్ విషయమై పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కనుంది. ఇందుకు సంబంధించి ముసాయిదా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) సోమవారం విడుదల చేసింది. సంప్రదింపుల అనంతరం తుది నిబంధనలను మార్చి మొదటి వారంలో సీబీడీటీ నోటిఫై చేస్తుంది. క్రిప్టో ఎక్సే్ఛంజ్లు ఆదాయపన్ను శాఖతో సమాచారం పంచుకోవడాన్ని తప్పనిసరి కానుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఆమోదనీయమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల మాధ్యమంగా మారనుంది. కొత్త నిబంధనలు ఇవే.. → ప్రస్తుతం బ్యాంకుల్లో ఒకరోజులో రూ.50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తుంటే పాన్ కాపీ ఇవ్వడం తప్పనిసరి. అలాగే, ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జమలు, ఉపసంహరణలు రూ.20 లక్షలు మించినప్పుడు కూడా ఇవ్వాల్సి వచ్చేది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు డిపాజిట్, ఉపసంహరణల మొత్తం రూ.10 లక్షలకు మించినప్పుడే శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) ఇస్తే సరిపోతుంది. ఒక వ్యక్తికి ఒకటికి మించిన ఖాతాలున్నా సరే.. అన్నింటికీ ఉమ్మడిగా రూ.10 లక్షల పరిమితే వర్తిస్తుంది. → ప్రాపర్టీ (ఇల్లు లేదా భూమి) కొనుగోలు లేదా విక్రయం లేదా బహుమతిగా ఇవ్వడం లేదంటే ఉమ్మడిగా అభివృద్ధి చేసేందుకు చేసుకునే ఒప్పందం విలువ రూ.10 లక్షలకు మించితే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఇకపై (ఏప్రిల్ 1 నుంచి) రూ.20 లక్షలకు మించినప్పుడే ఈ నిబంధన అమలవుతుంది.→ వాహనం కొనుగోలు విలువ రూ.5లక్షల్లోపు ఉంటే ఇకపై పాన్ అవసరం పడదు. కొనుగోలు ధర రూ.5లక్షలకు మించినప్పుడే పాన్ సమర్పించాల్సి ఉంటుంది. అన్ని వాహనాలకూ ఇకపై ఇదే అమలుకానుంది. ప్రస్తుతం ద్విచక్ర వాహన కొనుగోళ్లకు పాన్ నుంచి మినహాయింపు ఉంది. ఇతర అన్ని వాహనాల కొనుగోళ్ల సమయంలో ధరతో సంబంధం లేకుండా ప్రస్తుతం పాన్ ఇవ్వాలన్న నిబంధన అమల్లో ఉంది. → హోటల్/రెస్టారెంట్ బిల్లు, కన్వెన్షన్ సెంటర్లు లేదా బాంక్వెట్ హాళ్ల (వేడుకల కేంద్రాలు)కు చేసే చెల్లింపులు రూ.లక్షకు మించితే ఇక మీదట పాన్ తప్పనిసరి. హోటల్/రెస్టారెంట్ బిల్లు రూ.50వేలు మించినప్పుడే ప్రస్తుతం పాన్ ఇవ్వాల్సి వస్తోంది. → ఇకపై జీవిత బీమా పాలసీ కొనుగోలు సమయంలో పాన్ ఇవ్వడం తప్పనిసరి. ప్రస్తుతం వార్షిక ప్రీమియం రూ.50,000 మించిన పాలసీలకే ఇది అమలవుతోంది. → ప్రథమ శ్రేణి మెట్రోలుగా హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్లను సైతం గుర్తించింది. ఈ నగరాల్లో నివసించే వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ)పై మినహాయింపుల పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెరగనుంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలకే ఈ గుర్తింపు ఉంది. → అధికారిక వాహనాలు, ఉద్యోగులకు సంస్థలు సమకూర్చే భోజనాలకు సైతం పన్ను మినహాయింపుల పరిమితులు పెరగనున్నాయి. వాహనం కోసం ప్రతి నెలా రూ.8,000, ప్రతి భోజనం రూ.200కు పన్ను ఉండదు. → కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి వచి్చన తర్వాత పన్ను రిటర్నుల దాఖలు కూడా సులభతరం కానుంది. → ప్రస్తుతం రూ.2 లక్షలకు మించి చేసే బంగారం కొనుగోళ్లకు (ఆభరణాలు, కాయిన్లు, ఇతర రూపాల్లోని బంగారం) పాన్ తప్పనిసరి. దీనితోపాటు జాబితాలో లేని ఇతర అన్ని లావాదేవీలకు ప్రస్తుత నిబంధనలే కొత్త చట్టం కింద అమలు కానున్నాయి. -
EPFO 3.0: పీఎఫ్ విత్డ్రా మరింత సులభం!
ఈపీఎఫ్ఓ చందాదారులు.. తమ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవడానికి ఉపయోగపడే ఫీచర్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు.. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయా గతంలోనే వెల్లడించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన కొత్త మొబైల్ అప్లికేషన్ను 2026 ఏప్రిల్ నాటికి ప్రారంభించనున్నారు.ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రారంభించనున్న మొబైల్ అప్లికేషన్ ద్వారానే.. 8 కోట్ల మంది సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)ను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా నేరుగా విత్డ్రా చేసుకోవచ్చు. EPFO 3.0 అప్గ్రేడ్లో భాగంగా తీసుకొస్తున్న ఈ కొత్త విధానం వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ప్రస్తుతం పీఎఫ్ విత్డ్రా చేసుకోవాలనుంటే.. అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం పడుతుంది. దీనిని మరింత సులభతరం చేయడానికి యూపీఐ విత్డ్రా తీసుకురావడం జరుగుతోంది. కాగా ఇప్పటికే ఆటో సెటిల్మెంట్ మోడ్ లిమిట్ రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచారు.ఈపీఎఫ్ఓ సభ్యులు తమ బ్యాంక్ ఖాతాలకు యూపీఐ పిన్ ఉపయోగించి ఎంత మొత్తం విత్డ్రా చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారో ఆ మొత్తాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు.ఒకసారికి కేవలం రూ. 25వేలు విత్డ్రా చేసుకోవచ్చు.యాప్లో మీరు ఎంత మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది.ప్రస్తుతం ఈ విధానం ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ట్రయల్ రన్స్ చేస్తున్నారు. తద్వారా ఏదైనా సాంకేతిక సమస్యలు ముందే గుర్తించి పరిష్కరించవచ్చు. కొత్త యాప్ ప్రధాన మొబైల్ ఇంటర్ఫేస్గా యూపీఐ విత్డ్రా కోసం ఉపయోగిస్తారు. అయితే అధికారిక వెబ్సైట్, ఉమాంగ్ యాప్ కూడా ఇతర సేవల కోసం ఉపయోగించుకోవచ్చు. -
ఆదాయపు పన్ను చట్టంలో కొత్త మార్పులు!
కేంద్ర ప్రభుత్వం.. ఆదాయ పన్ను చట్టం 2025ను.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ తరుణంలో డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫారమ్స్ విడుదల చేసింది. ఇందులో అనేక కొత్త నిబంధనలను ప్రతిపాదించారు.కొత్త నిబంధనలలో ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. ఆదాయపు పన్ను ఫారమ్లకు కొత్త సంఖ్యలు ఇవ్వడం. పాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం ఉపయోగించిన అనేక ఫారమ్లకు.. ఇప్పుడు కొత్త సంఖ్యలు కేటాయిస్తున్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడం, గందరగోళాన్ని తగ్గించడం, కొత్త చట్టానికి అనుగుణంగా ఒకే విధమైన నిర్మాణం తీసుకురావడం.కొత్త మార్పులు➤టాక్స్ ఆడిట్కు సంబంధించిన పాత ఫారమ్లు 3CA, 3CB, 3CD ఇకపై విడివిడిగా ఉండవు. వీటన్నింటిని కలిపి ఫారమ్ 26గా మార్చారు.➤ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆడిట్కు ఉపయోగించే ఫారమ్ 3CEB ఇప్పుడు ఫారమ్ 48గా మారుతుంది.➤ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ (TRC) కోసం ఉపయోగించే ఫారమ్ 10FAను ఫారమ్ 42గా మార్చారు.➤ఎమ్ఏటీ సర్టిఫికేషన్ కోసం ఉన్న ఫారమ్ 29B ఇప్పుడు ఫారమ్ 66 అవుతుంది.➤డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) సంబంధిత సమాచారానికి ఉపయోగించే ఫారమ్ 10F ఇకపై ఫారమ్ 41గా ఉంటుంది.TDS & TCSకు సంబంధించిన మార్పులు➤TCS రిటర్న్ కోసం ఉన్న ఫారమ్ 27EQ ఇప్పుడు ఫారమ్ 143 అవుతుంది.➤తక్కువ లేదా నిల్ TDS సర్టిఫికేట్ కోసం ఉపయోగించే ఫారమ్ 13ను ఫారమ్ 128గా మార్చారు.➤నాన్-రెసిడెంట్లకు సంబంధించిన TDS రిటర్న్ (ఫారమ్ 27Q) ఇప్పుడు ఫారమ్ 144గా మారుతుంది.➤జీతభత్యాలపై TDS రిటర్న్ అయిన ఫారమ్ 24Q ఇకపై ఫారమ్ 138 అవుతుంది.➤ఉద్యోగులకు ఇచ్చే శాలరీ టీడీఎస్ సర్టిఫికెట్ (ఫారమ్ 16) ఇప్పుడు ఫారమ్ 130గా మారుతుంది.➤రెసిడెంట్లకు సంబంధించిన టీడీఎస్ రిటర్న్ (ఫారమ్ 26Q)ను ఫారమ్ 140గా మారుతుంది.చారిటబుల్ ట్రస్టులు & NGOలకు ఫారమ్ మార్పులు➤తాత్కాలిక నమోదు కోసం ఇప్పటివరకు ఉపయోగించిన ఫారమ్ 10Aను ఇప్పుడు ఫారమ్ 104గా మార్చారు.➤తుది నమోదు లేదా రెన్యువల్ కోసం ఉన్న ఫారమ్ 10AB.. ఇకపై ఫారమ్ 105 అవుతుంది.➤ఆదాయం నిల్వ కోసం ఉన్న ఫారమ్ 10ను ఫారమ్ 109గా మార్చారు.➤ఆడిట్ రిపోర్టుల కోసం ఉపయోగించే ఫారమ్ 10B, 10BB స్థానంలో ఇప్పుడు ఒకే ఫారమ్ 112 ఉంటుంది.➤డోనీ స్టేట్మెంట్ కోసం ఉన్న ఫారమ్ 10BD ఇప్పుడు ఫారమ్ 113గా మారుతుంది.➤డోనర్ సర్టిఫికేట్ కోసం ఉన్న ఫారమ్ 10BEను.. ఫారమ్ 114గా మార్చారు.ఇతర ముఖ్యమైన ఫారమ్ మార్పులు➤విదేశీ రిమిటెన్సుల కోసం సీఏ సర్టిఫికేట్ అయిన ఫారమ్ 15CB ఇప్పుడు ఫారమ్ 146 అవుతుంది.➤యాన్యువల్ ట్యాక్స్ స్టేట్మెంట్గా ఉపయోగించే ఫారమ్ 26AS ఇకపై ఫారమ్ 168గా మారుతుంది.➤ఆర్థిక లావాదేవీల వివరాల కోసం ఉన్న స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ ఫారమ్ 61Aను ఫారమ్ 165గా మార్చారు.➤విదేశీ రిమిటెన్స్ డిక్లరేషన్కు సంబంధించిన ఫారమ్ 15CA ఇప్పుడు ఫారమ్ 145గా ఉంటుంది.ఈ మార్పుల వల్ల పన్ను వ్యవస్థ మరింత సరళంగా ఉంటుందని.. డిజిటల్కు అనుకూలంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, వ్యాపార సంస్థలు ఈ కొత్త ఫారమ్ సంఖ్యలను ముందుగానే అవగాహన చేసుకుని, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త చట్టానికి సిద్ధంగా ఉండటం చాలా అవసరం.ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే? -
దేశవ్యాప్తంగా కోటి మందికి ఆధార్ అప్డేట్ పూర్తి
దేశంలోని పాఠశాల విద్యార్థుల ఆధార్ డేటా అప్డేట్ ప్రక్రియలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా సుమారు 83,000 పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా విద్యార్థులకు ‘తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్స్’ (ఎంబీయూ) పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.ఎందుకు ఈ అప్డేట్ తప్పనిసరి?సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం ఫొటో, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో పిల్లల వేలిముద్రలు, కనుపాప (ఐరిస్) గుర్తులు పూర్తిగా పరిపక్వం చెందవు కాబట్టి వాటిని తీసుకోరు. అయితే 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు తమ బయోమెట్రిక్ వివరాలను ఆధార్లో అప్డేట్ చేయడం అత్యవసరం. ఈ వివరాలు అప్డేట్ చేయకపోతే భవిష్యత్తులో నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి కూడా ఈ అప్డేట్ తప్పనిసరి.ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశంవిద్యార్థులకు వీలుగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు ఈ బయోమెట్రిక్ అప్డేట్ను ఉచితంగా అందిస్తోంది. పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కేంద్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇప్పటికే కేంద్రాల ద్వారా సుమారు 1.3 కోట్ల అప్డేట్లు పూర్తయ్యాయి.సాంకేతికతతో వేగవంతంసెప్టెంబర్ 2025లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ+) అప్లికేషన్తో ఆధార్ డేటాను అనుసంధానం చేయడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీని ద్వారా ఏ విద్యార్థికి అప్డేట్ అవసరమో సులభంగా గుర్తించి నేరుగా పాఠశాలల్లోనే శిబిరాలు నిర్వహిస్తున్నారు. ‘దేశంలోని అన్ని పాఠశాలలు కవర్ అయ్యే ఈ ప్రక్రియ కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉడాయ్ సీఈఓ భువనేష్ కుమార్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాస్తూ పాఠశాలల్లో శిబిరాల నిర్వహణకు సహకరించాలని కోరారు.ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు! -
రికార్డు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు
భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) అద్భుతమైన ఆర్థిక ప్రగతితో పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటుతుందని ఆయన అంచనా వేశారు.ఆర్థిక బలం - వృద్ధి గణాంకాలుతాజాగా ఓ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్యాంకింగ్ రంగ వృద్ధిని విశ్లేషించారు. ‘ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతంగా నమోదైంది. డిపాజిట్ల వృద్ధి కూడా 10 శాతం వద్ద ఆశాజనకంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు ఉన్న లాభం, 2023-24లో రూ.1.41 లక్షల కోట్లకు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే దాదాపు రూ. 1 లక్షల కోట్లు లాభాన్ని బ్యాంకులు ఆర్జించాయి’ అన్నారు.‘ఆర్బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సురక్షితంగా ఉంది. అంతర్జాతీయ అంశాలు మన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందడం లేదు’ అని నాగరాజు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
‘అమెరికాకు భారత్ తలొగ్గలేదు’
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వస్తున్న విమర్శలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. 18 శాతం సుంకానికి అంగీకరించడం ద్వారా భారత్ అమెరికాకు తలొగ్గిందన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. చైనా ఎగుమతులు 35 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత ఎగుమతులకు లభించే 18 శాతం సుంకం దేశానికి పెద్ద ఊరటనిస్తుందని విశ్లేషించారు. ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గోయల్ కొన్ని అంశాలను వెల్లడించారు.బలమైన ఆర్థిక శక్తిగా భారత్ప్రస్తుతం భారత్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎంతో ఆత్మవిశ్వాసంతో చర్చల్లో పాల్గొంటోందని గోయల్ అన్నారు. ‘2047 నాటికి భారత్ 30-35 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మనం అందించే భారీ మార్కెట్ అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో దేశానికి అతిపెద్ద బలం’ అని ఆయన అభివర్ణించారు.అమెరికా నుంచి కొనుగోళ్లువచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయడంపై భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ‘భారతదేశం పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఈ లక్ష్యం చాలా తక్కువ. మొత్తం రెండు ట్రిలియన్ డాలర్ల దిగుమతి డిమాండ్లో అమెరికా వాటా కొంత భాగమే. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి కొంటున్న 300 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను, పోటీతత్వాన్ని బట్టి అమెరికా సరఫరాదారుల నుంచి తీసుకునే అవకాశం ఉంది. విమానయాన రంగం, ఇంధనం, సాంకేతిక ఉత్పత్తులు, కోకింగ్ కోల్ వంటి వాటికి భారత్ ప్రాధాన్యత ఇస్తుంది’ అన్నారు.వ్యూహాత్మక చర్చలువాణిజ్య చర్చలంటే కేవలం అంకెలు కాదని, అవి దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని గోయల్ పేర్కొన్నారు. ‘మేము వివిధ దేశాలతో ఇప్పటివరకు కుదుర్చుకున్న తొమ్మిది ఒప్పందాల్లో ఎక్కడా జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు. చర్చల్లో ప్రశాంతత ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం’ అని ఆయన వెల్లడించారు.భారత్-ఈయూ ఒప్పందంపై మాట్లాడుతూ, ప్రధాని మోదీకి ప్రపంచ దేశాధినేతలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కూటమిలోని 27 దేశాల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. ప్రధాని మార్గదర్శకత్వంలో హోం మంత్రి అమిత్ షా, కేబినెట్ సహకారంతో గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లో భారత్ కీలకంగా మారుతుందని గోయల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం -
భారత్-యూఎస్ ట్రేడ్ డీల్పై రైతు సంఘాల ఆగ్రహం
భారత్-యూఎస్ మధ్య ప్రతిపాదిత మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై దేశంలోని కొన్ని రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), దాని రాజకీయేతర విభాగం, ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) సహా పలు సంఘాలు ఈ ఒప్పందాన్ని భారత వ్యవసాయ రంగాన్ని అమెరికన్ బహుళజాతి సంస్థలకు అప్పగించే చర్యగా అభివర్ణించాయి. దీనికి నిరసనగా వచ్చే వారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ప్రకటించాయి.ప్రధానాంశాలు.. ఆరోపణలుఇటీవల విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో రైతు నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ఒప్పందంలోని నిబంధనలు భారతీయ రైతులకు గొడ్డలిపెట్టుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకటనలోని అంశాలు కింది విధంగా ఉన్నాయి.మధ్యంతర ఒప్పందం ప్రకారం, అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని పారిశ్రామిక వస్తువులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తొలగించడం లేదా భారీగా తగ్గించాల్సి ఉంటుంది.భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్, యంత్రాలు వంటి వస్తువులపై అమెరికా 18 శాతం పరస్పర సుంకాన్ని వర్తింపజేయనుంది. ఇది భారతీయ ఎగుమతిదారులపై భారం మోపుతుంది.కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టారని ఆరోపిస్తూ.. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్కేఎం డిమాండ్ చేసింది.ఫిబ్రవరి 12న నిరసనరైతు సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయని ప్రకటనలో తెలిపారు. అదే రోజు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సాధారణ సమ్మెకు ఎస్కేఎం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.వ్యవసాయంపై ప్రభావంఏఐకేఎస్ నేత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అమెరికా నుంచి సోయాబీన్ నూనె, ఎర్ర జొన్న, పశువుల దాణా వంటివి భారత్లోకి వెల్లువలా వస్తాయి. దీనివల్ల స్థానిక మార్కెట్ దెబ్బతింటుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రైతులు ఈ ఒప్పందం వల్ల మరింత సంక్షోభంలోకి వెళ్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ వాదనమరోవైపు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. పాల ఉత్పత్తులు, పౌల్ట్రీ, మాంసం, ధాన్యాలు, పండ్లు (నారింజ, స్ట్రాబెర్రీ వంటివి) వంటి సున్నితమైన రంగాల్లో భారత్ ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే పరమావధిగా చర్చలు సాగుతున్నాయని, ఎక్కడా లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక -
ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాలా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సామాన్య పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన ‘ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్’ మొబైల్ యాప్ భారతీయ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు. గతంలో కేవలం బ్యాంకులు, పెద్ద సంస్థలకే పరిమితమైన ప్రభుత్వ సెక్యూరిటీల మార్కెట్ను సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశం. దీన్ని ప్రారంభించి చాలా రోజులైనా దీని గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. దీర్ఘకాలంలో కచ్చితమైన రాబడులను ఇస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలోని బాండ్లను కొనుగోలు చేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది.ఈ యాప్ ద్వారా పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, రాష్ట్ర ప్రభుత్వ బాండ్లు (ఎస్డీఎల్), ట్రెజరీ బిల్లులు (T-Bills), సావరిన్ గోల్డ్ బాండ్ల (SGB)లో నేరుగా పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం ఆర్బీఐ వద్ద ‘రిటైల్ డైరెక్ట్ గిల్ట్’ ఖాతాను తెరవాల్సి ఉంటుంది.లాభాలుఇవి ప్రభుత్వ బాండ్లు కాబట్టి మీ పెట్టుబడికి ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది. అంటే అసలు, వడ్డీ తిరిగి వస్తుందనే నమ్మకం ఉంటుంది.ఈ ఖాతా తెరవడానికి, దాన్ని నిర్వహించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. బ్రోకరేజ్ ఛార్జీలు కూడా ఉండవు.మధ్యవర్తులు లేకుండా నేరుగా ఆర్బీఐ నిర్వహించే ప్రైమరీ మార్కెట్ వేలంలో సామాన్యులు కూడా బిడ్లు దాఖలు చేయవచ్చు.ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కొన్నిసార్లు మెరుగైన వడ్డీ రేట్లను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఇది సాధ్యమవుతుంది.సావరిన్ గోల్డ్ బాండ్ల ద్వారా ఫిజికల్ గోల్డ్ కంటే తక్కువ ధరకు, అదనపు వడ్డీతో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. (ఇటీవల కాలంలో బంగారం భారీగా పెరగడంతో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను నిలిపేసిందని గమనించాలి)పరిమితులుషేర్ మార్కెట్తో పోలిస్తే ప్రభుత్వ బాండ్లలో సెకండరీ మార్కెట్ లావాదేవీలు తక్కువగా ఉంటాయి. అంటే అత్యవసరంగా అమ్మాలనుకున్నప్పుడు కొనుగోలుదారులు త్వరగా దొరక్కపోవచ్చు.మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగితే, మీరు గతంలో తక్కువ వడ్డీకి కొన్న బాండ్ల విలువ తగ్గుతుంది. దీన్ని మార్కెట్ రిస్క్ అంటారు.బాండ్ల ద్వారా వచ్చే వడ్డీపై మీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎఫ్డీల మాదిరిగానే దీనికి పన్ను మినహాయింపులు తక్కువ.యాప్ను వాడటం, బిడ్డింగ్ వేయడం వంటి ప్రక్రియలు గ్రామీణ లేదా తక్కువ అవగాహన ఉన్నవారికి కొంచెం క్లిష్టంగా అనిపించవచ్చు.ఎవరికి మేలు?రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి, తమ డబ్బు సురక్షితంగా ఉండాలనుకునే వారికి ఇది మెరుగైన వేదిక.నెలవారీ లేదా వార్షిక ఆదాయం కోసం దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరం.కేవలం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్పైనే ఆధారపడకుండా తమ పెట్టుబడులను వైవిధ్యపరచాలనుకునే ఇన్వెస్టర్లకు ఇది సరైనది.పిల్లల చదువులు లేదా పెళ్లిళ్ల కోసం 10-30 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టేవారికి ఇది ఉత్తమం. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే ప్రభుత్వ బాండ్లు తక్కువ మొత్తాన్ని సమకూర్చే అవకాశం ఉంది.ప్రభుత్వ సెక్యూరిటీల రకాలుట్రెజరీ బిల్లులు.. ఇవి స్వల్పకాలిక పెట్టుబడులు (మెచ్యురిటీ పీరియడ్ 91 రోజులు, 182 రోజులు లేదా 364 రోజులు).ప్రభుత్వ బాండ్లు.. ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులు (5 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటాయి). వీటికి స్థిరమైన వడ్డీ వస్తుంది.రాష్ట్ర అభివృద్ధి రుణాలు.. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అవసరాల కోసం జారీ చేసే బాండ్లు.వడ్డీ ఎంత?ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ రేటు స్థిరంగా ఉండదు. ఇది మార్కెట్ పరిస్థితులు, ఆర్బీఐ రెపో రేటు, కాలపరిమితిపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. సాధారణంగా వీటిపై వడ్డీ 7% నుంచి 7.5% మధ్యలో ఉండే అవకాశం ఉంది (ఇది మారుతూ ఉండవచ్చు). దీర్ఘకాలిక బాండ్లపై వడ్డీని (దీన్ని కూపన్ అంటారు) సాధారణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ట్రెజరీ బిల్లులపై నేరుగా వడ్డీ ఉండదు. ఉదాహరణకు రూ.100 విలువైన బిల్లును ప్రభుత్వం రూ.98 కి అమ్ముతుంది. గడువు తీరాక మీకు రూ.100 ఇస్తుంది. ఆ రూ.2 మీ లాభం.ఇదీ చదవండి: ఆండ్రాయిడ్ యూజర్లకు హెచ్చరిక -
చైనా దూకుడు.. ఆపకుండా బంగారం కొంటున్న డ్రాగన్!
బంగారం, వెండి ధరలు ఇటీవల రికార్డు స్థాయిలను తాకిన అనంతరం తగ్గుముఖం పట్టాయి. ఈ పరిణామం ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో కొత్త కదలికలకు దారితీసింది. ధరలు తీవ్ర అస్థిరతను చూపుతున్నప్పటికీ, చైనా మాత్రం బంగారం కొనుగోలును దూకుడుగా కొనసాగిస్తోంది. చైనా కేంద్ర బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) వరుసగా 15వ నెల కూడా తన బంగారం నిల్వలను పెంచుకుంది.2,307 మెట్రిక్ టన్నుల బంగారంపీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా విడుదల చేసిన డేటా, రాయిటర్స్ నివేదికల ప్రకారం.. గత జనవరి నెలలో కూడా చైనా బలమైన బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. జనవరి చివరి నాటికి చైనా మొత్తం బంగారం నిల్వలు 74.19 మిలియన్ ఫైన్ ట్రాయ్ ఔన్సులకు (ఒక ఫైన్ ట్రాయ్ ఔన్సు అంటే 31.1035 గ్రాములు మొత్తం 2,307.56 మెట్రిక్ టన్నులు) చేరాయి. ఇది డిసెంబర్ చివర్లో నమోదైన 74.15 మిలియన్ ట్రాయ్ ఔన్సులతో పోలిస్తే స్వల్ప పెరుగుదలే అయినప్పటికీ, నిల్వల మొత్తం విలువ మాత్రం గణనీయంగా పెరిగింది.ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకే?జనవరి చివరి నాటికి చైనా బంగారం నిల్వల మొత్తం విలువ 369.58 బిలియన్ డాలర్లకు చేరింది. గత నెలలో ఇది 319.45 బిలియన్ డాలర్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెరుగుదలకి ప్రధాన కారణాలుగా నెల ప్రారంభంలో ఉన్న అధిక బంగారం ధరలు, అలాగే చైనా నిరంతర కొనుగోలు వ్యూహాన్ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక ప్రమాదాల నేపథ్యంలో చైనా తన ఆర్థిక వ్యవస్థను రక్షించుకునే భాగంగా బంగారం నిల్వలను పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చైనా నుంచి వచ్చిన బలమైన డిమాండ్, అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో జరిగిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణంగా జనవరిలో బంగారం ధరలు ఔన్సుకు 5,600 డాలర్ల చారిత్రక గరిష్టాన్ని తాకాయి. అయితే ఈ ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్లో తదుపరి కీలక నాయకత్వ పాత్రకు కెవిన్ వార్ష్ను పరిగణనలోకి తీసుకుంటున్నారన్న వార్తలు వెలువడడంతో మార్కెట్ సెంటిమెంట్ ఒక్కసారిగా మారిపోయింది. ఫలితంగా స్పాట్ గోల్డ్ ధరలు గణనీయంగా పడిపోయాయి.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,887 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ దిద్దుబాటు కొనుగోలుదారులకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, రాబోయే రోజుల్లో ధరల దిశపై అనేక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చైనా సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం కొనుగోలు చేస్తుండగా, అదే సమయంలో దేశీయ వినియోగదారుల బంగారం వినియోగం మాత్రం వరుసగా రెండో ఏడాది కూడా తగ్గుముఖం పట్టింది.భారత్ పసిడి నిల్వలు ఇలా..జనవరి 2026 నాటికి, భారతదేశ కేంద్ర బ్యాంకు తన విదేశీ మారక నిల్వలలో సుమారు 880 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. తాజా విదేశీ నిల్వల డేటా ప్రకారం జనవరి చివరి నాటికి భారతదేశ మొత్తం రిజర్వ్ వాల్యుయేషన్కు ఆర్బీఐ బంగారం హోల్డింగ్స్ సుమారు 123 బిలియన్ డాలర్లు దోహదపడ్డాయి. ప్రపంచ ధరల లాభాలతో భారతదేశ బంగారం నిల్వ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ తాజా పసిడి కొనుగోళ్లు గణనీయంగా మందగించాయి. -
ఎంఎస్ఎంఈలకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు
న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈలు)కు అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి, సరఫరా, మార్కెటింగ్ వ్యవస్థల్లో అవకాశాలు లభిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తెలిపారు. వ్యాపారాలు, కస్టమర్లపై వ్యయాల భారం గణనీయంగా తగ్గుతుందన్నారు. ట్రేడ్ డీల్తో పశుపోషణ, మసాల, ప్రధాన ఆహార ఉత్పత్తులకు పూర్తి రక్షణ కలి్పంచడంతో భారతీయ రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఇరు దేశాల మధ్య పరస్పర సాంకేతిక సహకారం ద్వారా కృత్రిమ మేధ (ఏఐ), డేటా, డిజిటల్ సేవల కేంద్రంగా భారత్ స్థానం మరింత సుస్థిరం అవుతుందని సీతారామన్ అభిప్రాయపడ్డారు.


