Economy
-
ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని తగ్గించొచ్చు
దేశ జీడీపీ వృద్ధి రేటు బలంగా ఉండడంతోపాటు స్థిరమైన ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్ల పాటు కొనసాగితే ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని, నియంత్రిత శ్రేణిని ఆర్బీఐ తగ్గించొచ్చని డిప్యూటీ గవర్నర్ (డీజీ) పూనమ్ గుప్తా తెలిపారు. అంతర్జాతీయ అనుభవాల ఆధారంగా చూస్తే కొంత తక్కువ లక్ష్యాన్ని, మరింత పరిమిత శ్రేణిని నిర్ణయించే అవకాశం ఉందన్నారు. ఒకవేళ గత ఆరేళ్ల కాలంలో మాదిరి అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఇక మీదటా కొనసాగితే అది సౌలభ్యతను, స్పష్టతను తగ్గించొచ్చన్నారు.ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2031 మార్చి 31 వరకు ఐదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని 4 శాతంగా.. ప్రతికూల పరిస్థితుల్లో కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 6 శాతం (ప్లస్, మైనస్ 2 శాతం) మించకుండా చూడాలని నిర్దేశించడం గమనార్హం. ఎన్సీఏఈఆర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడారు. ప్రస్తుత పరిస్తితుల్లో ఈ లక్ష్యం, పరిమిత శ్రేణిని మార్చడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. ధరల నియంత్రణ, వృద్ధి రేటుపైనే భవిష్యత్తు ద్రవ్యోల్బణం కార్యాచరణ ఆధారపడి ఉంటుందన్నారు. ఇందుకు అంతర్జాతీయ షాక్లను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చన్నారు.ఆర్బీఐ డీజీగా జైన్ బాధ్యతలు స్వీకరణనలుగురు డీజీలకు పోర్ట్ఫోలియోల కేటాయింపుఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా (డీజీ) రోహిత్ జైన్ బాధ్యతలు స్వీకరించారు. ఫారెక్స్, ఫిన్టెక్ సహా 10 విభాగాలను ఆయన పర్యవేక్షించనున్నారు. టి.రవి శంకర్ స్థానంలో జైన్ నియమితులయ్యారు. ఇంతకుముందు వరకు ఆయన ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. మూడేళ్ల కాలానికి డీజీగా జైన్ను ప్రభుత్వం నియమించింది. 1991లో ఆయన ఆర్బీఐలో చేరడం గమనార్హం. గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ (ఫైనాన్స్), ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ నుంచి ఎంకామ్ కోర్సులను పూర్తి చేశారు. అందరిలోకి సీనియర్ డీజీ అయిన స్వామినాథన్ జానకీరామన్ 11 విభాగాల వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇందులో న్యాయ, డీఐసీజీసీ, తనిఖీ తదితర విభాగాలున్నాయి. అలాగే, సమన్వయ వ్యవహరాలను కూడా ఆయనే చూడనున్నారు. మానిటరీ పాలసీ నిర్వహణ సహా ఆరు విభాగాలను పూనమ్ గుప్తా పర్యేవేక్షిస్తారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
భారత్ వృద్ధికి యుద్ధం బ్రేక్
పశ్చిమాసియా ఘర్షణలతో నౌకల రవాణాకు అటంకాలు, ఇంధన ధరల పెరుగుదల భారత జీడీపీ వృద్ధికి జోరుకు అవరోధాలు కలి్పంచొచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 6.5 శాతంలోపునకు తగ్గిపోవచ్చని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో యుద్ధంతో ఏర్పడిన ఇంధన సంక్షోభం ఎక్కువ కాలం పాటు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వృద్ధితోపాటు భారత్ వృద్ధికీ అతిపెద్ద రిస్క్గా పేర్కొన్నారు. ఒకవేళ సకాలంలో పరిష్కారమైతే అప్పుడు వృద్ధి పుంజుకుంటుందన్నారు. అప్పుడు 6.5–7 శాతం మధ్య వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది 6.5 శాతం కంటే తక్కువగా ఉండొచ్చన్నారు.పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారమయ్యేంత వరకు జీడీపీపై, వడ్డీ రేట్లపై ఒక నిర్ణయాత్మక అభిప్రాయానికి రాలేమన్నారు. చమురు ధరలు అధిక స్థాయిల్లో (100 డాలర్లకు పైన) ఉంటే, అది వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందన్నారు. కాకపోతే గత 10–12 ఏళ్లలో ఏవో కొన్ని సందర్భాలను మినహాయిస్తే దాదాపు చమురు ధరలు కనిష్టాల్లోనే ఉన్నాయంటూ.. అది దేశ వృద్ధికి సాయపడినట్టు చెప్పారు. గత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చు..వడ్డీ రేట్లు సమీప కాలంలో కిందకు దిగొచ్చే పరిస్థితుల్లేవని రాజీవ్ మెమానీ పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలకు మద్దతుగా లక్ష్యిత చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. ముఖ్యంగా రుణసాయం విషయంలో సమస్యలున్నట్టు చెప్పారు. వ్యాపార సులభతర నిర్వహణ, చిన్న తప్పులను నేరాలుగా చూడకపోవడం, న్యాయ సంస్కరణల విషయంలో వేగవంతమైన చర్యలు అవసరమన్నారు. ఈ దిశగా గత 12–18 నెలల్లో పభుత్వం చేసిన కృషిని అభినందించారు. వివాదాల సంఖ్యను సాధ్యమైనంత తగ్గించాలని, పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని మెమానీ పేర్కొన్నారు. ఈ దిశగా ప్రభుత్వానికి సీఐఐ సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. వృద్ధి 6.3 శాతమే: ఏడీబీపశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 0.6 శాతం తగ్గి 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ముఖ్య ఆర్థికవేత్త ఆల్బర్ట్ పార్క్ అంచనా వేశారు. అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందన్నారు. 2025–26లో భారత్ జీడీపీ బలంగా 6.9 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని, 2027–28లో 7.3 శాతానికి పుంజుకుంటుందని.. 2026–27లో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని ఏడీబీ ఏప్రిల్లో అంచనాలు ప్రకటించడం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం ఏప్రిల్ అంచనా కంటే 2.4 శాతం పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతానికి చేరుకోవచ్చని పార్క్ తెలిపారు. చమురు, గ్యాస్ కోసం దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేశారు.ఎల్నినో ప్రభావంఎల్నినో ప్రభావంపై మాట్లాడుతూ.. భారత్లో సాగుపై ప్రభావం పడినప్పుడల్లా ధరల పరమైన సమస్యలు ఉంటాయన్నారు. ప్రపంచంలో బియ్యం ఎగుమతుల్లో పెద్ద వాటా కలిగి ఉన్నందున, భారత్లో సాగుకు ఇబ్బందులు ఏర్పడితే ప్రపంచ దేశాలపైనా దాని ప్రభావం ఉంటుందన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోవడం వల్ల రైతులు తక్కువగా వినియోగిస్తారని.. దీంతో దిగుమతి తగ్గి ఆ తర్వాత ఆహార లభ్యత తగ్గుతుందన్నారు. ధరలపై దీని ప్రభావం కచి్చతంగా ఉంటుందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లడం, ఇతర ఇంధన వనరుల దిగుతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం అవసరమన్నారు. అయితే భారత్లో ఎన్నో సంస్కరణలు కొనసాగుతున్నాయంటూ, వృద్ధి అవకాశాలు దీర్ఘకాలానికి ఇప్పటికీ ఆశావహంగానే ఉన్నట్టు పార్క్ చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) మెరుగుపడతాయని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు సాయపడతాయన్నారు.ఇదీ చదవండి: కాగ్నిజెంట్ 15 వేల మందికి ఉద్వాసన -
వ్యాపారాలకు కేంద్రం అభయం
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ వ్యాపార రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య లభ్యత కొరతను అధిగమించి వ్యాపారాలు సజావుగా సాగేందుకు వీలుగా ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్’ (ఈసీఎల్జీఎస్) 5.0కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ పథకానికి పచ్చజెండా ఊపింది. ఈ స్కీమ్ ద్వారా అర్హత కలిగిన వ్యాపార సంస్థలతో పాటు విమానయాన రంగానికి మొత్తం రూ.2,55,000 కోట్ల మేర అదనపు రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో విమానయాన రంగానికి ప్రత్యేకంగా రూ.5,000 కోట్లు కేటాయించారు. అర్హతలు, రుణ హామీ వివరాలుమార్చి 31, 2026 నాటికి వర్కింగ్ క్యాపిటల్ పరిమితులు కలిగి ఉండి, ఎకౌంట్లు స్టాండర్డ్గా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), నాన్–ఎంఎస్ఎంఈలు, షెడ్యూల్డ్ ప్యాసింజర్ ఎయిర్లైన్స్ ఈ పథకానికి అర్హత పొందుతాయి. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (ఎన్సీజీటీసీ) ద్వారా ఎంఎస్ఎంఈలకు వంద శాతం రుణ హామీ కల్పిస్తారు. నాన్–ఎంఎస్ఎంఈలకు, విమానయాన రంగానికి 90 శాతం గ్యారెంటీ ఉంటుంది. ఈ రుణాలకు సంబంధించి సంస్థల నుంచి ఎలాంటి గ్యారెంటీ ఫీజు వసూలు చేయరు. పథకంలో రుణ పరిమితులు2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఉపయోగించిన గరిష్ట వర్కింగ్ క్యాపిటల్లో 20 శాతం వరకు అదనపు రుణం మంజూరు చేస్తారు. దీనికి గరిష్ట పరిమితిని రూ.100 కోట్లుగా నిర్దేశించారు. విమానయాన సంస్థలకు కొన్ని ప్రత్యేక నిబంధనలకు లోబడి వంద శాతం వరకు అదనపు రుణం అందిస్తారు. అయితే ఒక సంస్థకు గరిష్టంగా రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయిస్తారు. మార్చి 31, 2027 వరకు బ్యాంకులు మంజూరు చేసే రుణాలకు ఈ పథకం మార్గదర్శకాలు వర్తిస్తాయి. రుణ కాలపరిమితి ముగిసే వరకు ఈ గ్యారెంటీ కవర్ అందుబాటులో ఉంటుంది. తిరిగి చెల్లించే గడువులురుణం తిరిగి చెల్లించేందుకు ఎంఎస్ఎంఈ, నాన్–ఎంఎస్ఎంఈలకు మంజూరైన తేదీ నుంచి ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఇందులో ఒక ఏడాది మారటోరియం (అసలు చెల్లించాల్సిన అవసరం లేని సమయం) కలిసి ఉంటుంది. విమానయాన రంగానికి రెండేళ్ల మారటోరియంతో కలిపి మొత్తం ఏడేళ్ల కాలపరిమితి ఇస్తారు.ఉపాధి రక్షణే లక్ష్యంగా..పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా తలెత్తే స్వల్పకాలిక ద్రవ్య లభ్యత సమస్యలను అధిగమించడానికి ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని కేంద్రం వెల్లడించింది. సంస్థల వ్యాపార కార్యకలాపాలు సాఫీగా సాగేలా చూడటం, ఉద్యోగాలను కాపాడటం, సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా చూడటమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. సకాలంలో అదనపు వర్కింగ్ క్యాపిటల్ అందించడం ద్వారా దేశీయ ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
విజయ్(య)ఢంకా : సవాళ్లు, హామీల భారం ఎంతో తెలుసా?
సాక్షి, చెన్నై: తమిళనాట నటుడు, టీవీకే అధినేత విజయ్ సంచలనం విజయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన స్టార్ పవర్తోపాటు, ఆకర్షణీయమైన హామీలతో ప్రజలను ఆకట్టుకుని గెలుపు సాధించాడు. కానీ ఇంతకుముందు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని విజయ్ ముందు సవాళ్లు ఏంటి? పరిపాలన ఎంత విజయవంతంగా నిర్వహించగలడు? అనేది ప్రధాన చర్చ. అధికార పగ్గాలను చేపట్టిన తరువాత హామీలను నెరవేర్చడం తక్షణ ఆర్థిక సవాల్. విశ్లేషకుల అంచనాల ప్రకారం తొలి ఏడాదిలోనే అదనంగా రూ. 42,000 కోట్లు అవసరమవుతాయని అంచనాలు సూచిస్తున్నాయి.విజయ్ ఇచ్చిన సంక్షేమ హామీలను అమలు చేయాలంటే మొదటి ఏడాదిలోనే సుమారు రూ. 42,000 కోట్ల అదనపు నిధులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక లోటు 2026-27 నాటికి రూ. 1.22 లక్షల కోట్లు (GSDPలో 3శాతం) ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో ఇది పెద్ద సవాలుగా మారనుంది.రూ. 42,000 కోట్ల అదనపు భారంమహిళల సాయం, వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, వెనుకబడిన వర్గాల చదువు లాంటి హామీలను విజయ్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించారు. విజయ్ ప్రకటించిన హామీలు ప్రజలను ఆకట్టుకున్నప్పటికీ, వాటిని అమలు చేయడం అనేది కత్తి మీద సాము వంటిదే. ఈ హామీలను నెరవేర్చాలంటే రాష్ట్రం కొత్త ఆదాయ మార్గాలను వెతుకుతారా? లేదా అప్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. గ్రాడ్యుయేట్లకు రూ. 4,000, డిప్లొమా హోల్డర్లకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే దీనికి కఠిన నిబంధనలు అమలు చేస్తే ఆర్థిక భారం తక్కువగానే ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.మరీ ముఖ్యంగాప్రధానంగా మహిళలకు నెలవారీ సహాయాన్ని రూ. 1,000 నుండి రూ. 2,500కి పెంపు. దీని వల్ల ఏటా అదనంగా రూ. 21,617 కోట్లు ఖర్చవుతుంది. దీనివల్ల మొత్తం వ్యయం రూ. 36,029 కోట్లకు చేరుతుంది.వృద్ధాప్య పింఛన్ను రూ. 1,200 నుండి రూ. 3,000కి పెంచడం వల్ల రూ. 6,549 కోట్ల అదనపు భారం పడుతుంది. విడో పెన్షన్ల కోసం రూ. 1,829 కోట్లు, వికలాంగుల పెన్షన్ల కోసం రూ. 504 కోట్లు అదనంగా అవసరం. ఏడాదికి 6 ఉచిత LPG సిలిండర్ల హామీ వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 7,074 కోట్ల భారం పడుతుంది. ఇక రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి రూ. 15,000 సాయం కింద (కేంద్రం ఇచ్చే రూ. 6,000 కాకుండా) రాష్ట్రం అదనంగా రూ. 1,941 కోట్లు భరించాలి. అలాగు కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ కోసం మరో రూ. 382 కోట్లు అవసరం.పరిమిత ప్రభావంమరోవైపు కొన్ని పథకాల వల్ల ఆర్థిక భారం పరిమితంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న వివాహ పథకాల కింద సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 8 గ్రాముల బంగారం సహాయం అందిస్తోంది. అంటే విజయ్ ప్రకటించిన పెళ్లిచేసుకునే యువతులకు ప్రకటించిన 8 గ్రాముల బంగారం, పట్టుచీర వల్ల అదనపు ఖర్చుల భారం పెద్దగా ఉండక పోవచ్చు.ఇదీ చదవండి: ఆమె ఆత్మకు శాంతి : కడుపు శోకం నుంచి శాసనసభ దాకాప్రతిపాదిత నిరుద్యోగ భృతి,గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,000, డిప్లొమా హోల్డర్లకు రూ.3,000, కఠినమైన అర్హత నిబంధనలను కొనసాగిస్తే, ఆర్థిక వ్యవస్థపై పెద్దగా భారం పడకపోవచ్చు. కఠినమైన ఆదాయ పరిమితులతో ఉన్న ప్రస్తుత పథకానికి కేవలం రూ.2.37 కోట్ల వ్యయం మాత్రమే కాగా, దీనిని విస్తరించినా కూడా వ్యయం రూ.16 కోట్లలోపే ఉండవచ్చు.తమిళనాడు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే దేశ సగటు సామాజిక వ్యయం 42 శాతంగా ఉంటే, తమిళనాడులో ఇది 2025-26 బడ్జెట్ అంచనాల ప్రకారం 34 శాతానికి పడి పోయింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో ఖర్చు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రం తన సొంత పన్ను రాబడి వ్యయాన్ని మెరుగు పరుచుకున్నప్పటికీ, దాని కట్టుదిట్టమైన వ్యయం (వేతనాలు, పింఛన్లు, వడ్డీ చెల్లింపులు) 35 శాతంతో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉంది. కాగా తమిళగ వెట్రి కజగం (టీవీకే) 2026 తమిళనాడు ఎన్నికలలో తొలిసారిగా ఘన విజయం సాధించింది. బూటకపు పార్టీ, పొలిటికల్ డ్రామా ఆడుతున్న సినిమా స్టార్ అన్న వెక్కిరింపులకు ధీటుగా రాష్ట్రంలోని 234 స్థానాలకు గాను 108 స్థానాలను కైవసం చేసుకుని విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: మహిళా ఫ్రొఫెసర్ రహస్య ప్రేమ, వీకెండ్లో ఔటింగ్... కట్ చేస్తే! -
భారతీయ కార్మికులపై తైవాన్ నిరసన
వృద్ధాప్య జనాభా, తగ్గుతున్న జనన రేట్ల కారణంగా కార్మిక కొరతను అధిగమించాలని చూస్తున్న తైవాన్కు సొంత ప్రజల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భారతీయ కార్మికులను నియమించుకోవాలనే ప్రభుత్వ నిర్ణయంపై తైవాన్ సమాజంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో 40,000 మందికి పైగా తైవానీయులు ఆన్లైన్ పిటిషన్పై సంతకాలు చేస్తూ భారతీయ కార్మికులను తీసుకురావాలనే ప్రణాళికను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.తైవాన్ తన తయారీ రంగం, వృద్ధుల సంరక్షణ విభాగంలో నెలకొన్న ఖాళీలను భర్తీ చేయడానికి ఫిబ్రవరి 2024లో భారతదేశంతో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది. ప్రస్తుతం ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, థాయ్లాండ్ల మీద ఎక్కువగా ఆధారపడుతున్న తైవాన్ తన వలస కార్మిక వనరులను వైవిధ్యపరచాలని భావించింది. ఇందులో భాగంగా కేవలం 1,000 మంది కార్మికులతో ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది.మార్చి 2026 నాటికి, తైవాన్ సుమారు 8 లక్షల మంది చట్టబద్ధమైన వలస కార్మికులకు ఆతిథ్యం ఇస్తోంది. కొత్త కార్మిక వనరులు చేకూరకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత ప్రమాదంలో పడుతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పదేపదే హెచ్చరిస్తోంది.ప్రభుత్వ నిర్ణయానికి ప్రజా ప్రతిఘటనతైవాన్ కార్మిక మంత్రి హంగ్ సున్-హాన్ ఈ ఏడాది చివరి నాటికి మొదటి విడత భారతీయ కార్మికులు వస్తారని ప్రకటించిన కొద్ది కాలంలోనే సోషల్ మీడియా వేదికగా, స్థానికంగా అక్కడి వీధుల్లో నిరసనలు భగ్గుమన్నాయి. భారతీయ పురుషులపై నెలకొన్న ప్రతికూల అభిప్రాయం, భద్రత, లింగ హింసకు సంబంధించిన భయాలు ఈ పిటిషన్కు దారితీశాయి. ప్రతిపక్ష కుమింటాంగ్ (కేఎంటీ) చట్టసభ సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తైవాన్ వాసులు భారతీయుల పట్ల జాత్యహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం, సామాజిక మాధ్యమాల్లో భారతీయ పురుషులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు చేయడం ఆందోళనకరంగా మారింది.ప్రభుత్వ వాదన - వాస్తవాలుఈ అంశంపై ప్రజా ఆందోళనలను ఎదుర్కొంటున్నప్పటికీ కార్మిక మంత్రిత్వ శాఖ మాత్రం భారతీయ కార్మికులను లైంగిక నేరాలతో ముడిపెట్టడం నిరాధారమైనదని స్పష్టం చేసింది. గతంలో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులతో పోలిస్తే నేరాల రేటు స్థిరంగా ఉంటుందని, పైగా రిక్రూట్ అయ్యే ప్రతి కార్మికుడు భారత ప్రభుత్వం నుంచి మెరుగైన ప్రవర్తన సర్టిఫికేట్ (Good Conduct Certificate) సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తైవాన్ కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియలో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది.దౌత్యం వైపు అడుగులుప్రస్తుతానికి, తైపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కఠినమైన పర్యవేక్షణ, భద్రతా హామీలు ఉంటేనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని సంకేతాలు ఇచ్చింది. అయితే కార్మిక కొరతకు సామాజిక భద్రతకు మధ్య సమతుల్యత సాధించడమే ఇక్కడ అసలైన సమస్య. అంతర్జాతీయంగా ఎంతో మంది భారతీయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నప్పటికీ ఒక దేశంపై ఏర్పడిన ప్రతికూల ముద్ర దౌత్యపరమైన సంబంధాలతోపాటు అవసరమైన ఆర్థిక అవసరాలకు కూడా ఆటంకం కలిగిస్తుందని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐలో ఎందుకో వెనకబడ్డాం! -
ఇండియాతో పోలిక.. పాకిస్తాన్ పరువు తీసిన కియోసాకి
ఇరాన్ యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతుంటే, పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్ల మధ్య ఉన్న ఆర్థిక వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఇంధన సంక్షోభంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర విశ్లేషణ చేశారు. భారత్ తన దూరదృష్టితో సంక్షోభాన్ని తట్టుకుంటుంటే, పాకిస్తాన్ అబద్ధపు ప్రచారాలతో పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిందని ఆయన ఎత్తిచూపారు.పాక్ వద్ద ఒక్క రోజు నిల్వలు కూడా లేవు!పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కియోసాకి తన ఫేస్బుక్ పోస్ట్లో ప్రస్తావించారు. ఇస్లామాబాద్ వద్ద కనీసం ఒక్క రోజుకు సరిపడా ‘వ్యూహాత్మక చమురు నిల్వలు’ కూడా లేవని మాలిక్ అంగీకరించారు.కియోసాకి ఏమన్నారంటే‘న్యూఢిల్లీ తన అత్యవసర నిల్వలను పెంచుకోవడంలో నిమగ్నమైతే, ఇస్లామాబాద్ మాత్రం తమ చమురు సరఫరా సురక్షితంగా ఉందని ప్రపంచాన్ని నమ్మించే పనిలో ఉంది. కానీ వాస్తవం వేరు. భారత్లో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటే, పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి’పాక్లో భగ్గుమంటున్న ధరలుఏప్రిల్ ప్రారంభం నుండి పాకిస్తాన్లో ఇంధన ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.321 నుండి ఏకంగా రూ.458కి (43% పెరుగుదల) చేరింది. డీజిల్ లీటరుకు రూ.335 నుండి రూ.520కి (55% పెరుగుదల) పెరిగింది. ఈ అస్థిరత వల్ల దేశంలో సరఫరా గొలుసు విచ్ఛిన్నమై, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు దీనిని ‘జాతీయ అత్యవసర పరిస్థితి’గా అభివర్ణిస్తున్నాయి.భారత్ విజయం వెనుక రహస్యం..భారత్ ఈ స్థాయి సంక్షోభాన్ని ఎలా తట్టుకోగలుగుతుందో వివరిస్తూ కియోసాకి కీలక విషయాలు వెల్లడించారు. భారత్ నిర్మించున్న వ్యూహాత్మక నిల్వలు 60 నుండి 70 రోజులకు సరిపోతాయి. ప్రభుత్వం కేవలం ‘ఒక సంతకం’తో ఈ అత్యవసర చమురును విడుదల చేసి మార్కెట్ను స్థిరీకరించగలదు.భారత్ కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా రష్యా, వెనిజులా వంటి దేశాల నుండి చమురు దిగుమతులను పెంచుకుని తన నెట్వర్క్ను విస్తరించింది. ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద చమురు శుద్ధి దేశంగా ఉన్న భారత్, ఎగుమతి సుంకాలను సర్దుబాటు చేస్తూ దేశీయ ధరలు పెరగకుండా అడ్డుకోగలిగింది.పాక్ మంత్రి నిస్సహాయతపాకిస్తాన్ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ కూడా భారత్ సన్నద్ధతను ప్రశంసించక తప్పలేదు. "భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉండటమే కాకుండా, వారు ఐఎంఎఫ్ (IMF) కఠిన నిబంధనల కింద లేరు. అందుకే వారు పన్నులు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించగలుగుతున్నారు. కానీ మేము ప్రతి పైసా కోసం ఐఎంఎఫ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది" అని ఆయన వాపోయారు.యుద్ధం ఈ ఆర్థిక అంతరాన్ని సృష్టించలేదని, కేవలం ఇరు దేశాల మధ్య ఉన్న సన్నద్ధత లోపాన్ని బయటపెట్టిందని కియోసాకి విశ్లేషించారు. హోర్ముజ్ జలసంధి మూతపడితే, దిగుమతులపైనే ఆధారపడ్డ పాకిస్తాన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. -
రిలయన్స్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్కు బిగ్ డీల్
భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కీలక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా అండర్గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ (యూసీజీ) సాంకేతికతకు వీలు కల్పించేలా రూపొందించిన వాణిజ్య బొగ్గు గనులను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. ఈ మేరకు నాలుగు బొగ్గు గనులకు సంబంధించిన ‘కోల్ మైన్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ అగ్రిమెంట్స్’ (సీఎంపీడీఏ)పై సంస్థలు సంతకాలు చేశాయి.ఎవరికి ఏ గనులు?రిలయన్స్ ఇండస్ట్రీస్: ఆంధ్రప్రదేశ్లోని రెచెర్ల, చింతలపూడి సెక్టార్ ఏ1 బొగ్గు గనులను సొంతం చేసుకుంది.యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్: ఒడిశాలోని బెల్పహార్, తంగార్దిహి ఈస్ట్ బొగ్గు గనులను దక్కించుకుంది.ఈ నాలుగు గనుల్లో రెండు పాక్షికంగా నిర్వహిస్తున్నావి కాగా, మరో రెండు పూర్తిగా కార్యకలాపాలు సాగిస్తున్నవి.ఏమిటీ యూసీజీ ప్రత్యేకత?సాధారణంగా బొగ్గును గనుల నుంచి వెలికితీసి ఆపై విద్యుత్ లేదా ఇంధనం కోసం ఉపయోగిస్తారు. అయితే, యూసీజీ సాంకేతికత అందుకు భిన్నం. ఇది బొగ్గును నేరుగా సీమ్ (నేల లోపల బొగ్గు పొర)లోనే సింథటిక్ వాయువు (సిన్గ్యాస్)గా మారుస్తుంది. దీనివల్ల సంప్రదాయ మైనింగ్ అవసరం ఉండదు. సాధారణ పద్ధతుల్లో దీన్ని వెలికితీయడం కష్టసాధ్యం. ఈ పద్ధతి ద్వారా లోతైన బొగ్గు పొరల నుంచి కూడా సింథటిక్ వాయువును తయారు చేయవచ్చు.బొగ్గు మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం, ఈ గనులలో సాంప్రదాయ మైనింగ్తో పాటు యూసీజీ పద్ధతిని కూడా అనుసరించే వెసులుబాటును ఆపరేటర్లకు కల్పించారు. ఇది దేశంలోని ఇంధన వనరులను గణనీయంగా పెంచుతుంది. ఈ ప్రాజెక్టులు కేవలం ఇంధన ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయ పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ద్వారా వెలువడే సిన్గ్యాస్ యూరియా, అమ్మోనియా తయారీకి కీలకంగా మారుతుంది. ఇది ఎరువుల దిగుమతులపై భారత్కున్న ఆధారపడటాన్ని తగ్గించి ఆహార భద్రతకు ఊతమిస్తుంది.కెమికల్స్, పెట్రోకెమికల్స్ తయారీలో సహజ వాయువు, నాఫ్తా స్థానంలో ఈ సిన్గ్యాస్ను ఉపయోగించి మిథనాల్, డైమిథైల్ ఈథర్ (డీఎంఈ), ఇతర సింథటిక్ ఇంధనాలను స్వదేశంలోనే తయారు చేసే అవకాశం లభిస్తుంది. ఈ నాలుగు ఒప్పందాలతో కలిపి ఇప్పటివరకు వాణిజ్య బొగ్గు వేలం ద్వారా జరిగిన మొత్తం ఒప్పందాల సంఖ్య 138కి చేరుకుంది.తాజా ఒప్పందంలోని ముఖ్యాంశాలుగరిష్ట సామర్థ్యం: 331.544 ఎంటీపీఏ.ఆర్థికాభివృద్ధి: ఏడాదికి సుమారు రూ.42,980 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం.పెట్టుబడులు: రూ.48,231 కోట్ల మేర మూలధన పెట్టుబడులు.ఉపాధి: సుమారు 4,34,175 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు.ఇదీ చదవండి: నమ్మావో ముంచేస్తారు! -
జీఎస్టీ వసూళ్ల రికార్డ్.. ఒక్క నెలలో రూ.2.43 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఏప్రిల్ నెలలో రూ.2.43 లక్షల కోట్ల స్థూల ఆదాయం వసూలైంది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూళ్లు రూ.2.23 లక్షల కోట్లతో పోల్చిచూస్తే 8.7 శాతం పెరుగుదల నమోదైంది. ఇది ఒక నెలలో అత్యధిక వసూళ్ల రికార్డు. దేశీ విక్రయాలపై జీఎస్టీతో పోల్చి చూస్తే, దిగుమతులపై పన్ను ఆదాయమే ఎక్కువ వృద్ధి చూపించడం గమనార్హం. దేశీ విక్రయాలపై జీఎస్టీ 4.3 శాతం పెరిగి రూ.1.85 లక్షల కోట్లకు చేరింది.దిగుమతులపై జీఎస్టీ 25.8 శాతం పెరిగి రూ.57,580 కోట్లు వసూలైంది.సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.52,140 కోట్లు రాగా, స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) రూ.61,331 కోట్లుగా ఉంది.ఐజీఎస్టీ రూ.1.29 లక్షల కోట్లు వసూలైంది.రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 19.3 శాతం పెరిగి రూ.31,793 కోట్లకు చేరాయి.రిఫండ్లు సర్దుబాటు అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్లో రూ.2.11 లక్షల కోటు.ఈ ఏడాది మార్చి నెలకు స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,00,064 కోట్లుగా ఉండడం గమనార్హం.7–8 శాతం వృద్ధి సాధారణమేజీఎస్టీ 2.0 అనంతరం ప్రతి నెలా పన్నుల ఆదాయం 7–8 శాతం మేర వృద్ధి చెందడం సాధారణంగా మారినట్టు ప్రైస్ వాటర్హౌస్ అండ్ కో ఎల్ఎల్పీ పార్ట్నర్ ప్రతీక్జైన్ పేర్కొన్నారు. ఇది బడ్జెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్టు చెప్పారు. దిగుమతులపై ఆదాయం దేశీ లావాదేవీలను మించడం అన్నది దేశీ వినియోగం కొంత నిదానించడాన్ని తెలియజేస్తోందని జైన్ చెప్పారు. -
‘జాతీయత ఆధారంగా వివక్ష చూపకూడదు’
అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకువచ్చిన వివాదాస్పద నిర్ణయాలకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని నిర్దిష్ట దేశాలకు చెందిన వారి గ్రీన్ కార్డులు, వర్క్ పర్మిట్లు, దరఖాస్తులను నిలిపివేస్తూ తీసుకున్న చర్యలు వివక్షతో కూడుకున్నవని, అవి చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి తేల్చిచెప్పారు.కేసు నేపథ్యంఇరాన్, హైతీ, వెనిజులా, సిరియా సహా సుమారు 20 దేశాలకు చెందిన దాదాపు 200 మంది వలసదారులు తమ దరఖాస్తుల ప్రాసెసింగ్ నిలిపివేతను సవాలు చేస్తూ బోస్టన్ కోర్టులో దావా వేశారు. నవంబర్ 2025లో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అవలంబించిన విధానాన్ని వీరు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విధానం ప్రకారం, ప్రయాణ నిషేధం ఉన్న 39 దేశాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల జాతీయతను, వారి అప్లికేషన్లను తిరస్కరించడానికి ‘ముఖ్యమైన ప్రతికూల కారకం’ (significant negative factor)గా పరిగణించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఆదేశించింది. భద్రతా కారణాలను సాకుగా చూపుతూ ఈ ఏజెన్సీ దరఖాస్తులను ప్రాసెస్ చేయకుండా నిలిపివేసింది.న్యాయమూర్తి తీర్పులోని ముఖ్యాంశాలుఈ కేసును విచారించిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జూలియా కోబిక్ కీలక తీర్పును వెలువరించారు. జాతీయత ఆధారంగా వివక్ష చూపడం ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్కు విరుద్ధమని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆశ్రయ(అకామిడేషన్) దరఖాస్తులపై నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఏజెన్సీ వాటిని నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఆమె పేర్కొన్నారు. ఈ విధానం వల్ల పిటిషన్దారులు తీవ్రంగా నష్టపోయారని భావించిన న్యాయమూర్తి వారి దరఖాస్తులపై యూఎస్సీఐఎస్ నిబంధనలను నిలిపేయాలని చెప్పారు.న్యాయ నిపుణుల స్పందనఈ తీర్పును పిటిషన్దారుల తరఫు న్యాయవాది జిమ్ హ్యాకింగ్ స్వాగతించారు. ‘యూఎస్సీఐఎస్ కేవలం ఫలానా దేశం నుంచి వచ్చారన్న కారణంతో ఎవరికీ ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు దక్కకుండా చేయాలని చూస్తోంది. కానీ దీనికి కాంగ్రెస్ ఎప్పుడూ అనుమతి ఇవ్వలేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఈ తీర్పు ప్రధానంగా 22 మంది వాదులకు వర్తిస్తుండగా మిగిలిన 200 మందికి కూడా ఈ ఉత్తర్వులు వర్తింపజేసే అంశంపై చర్చించాలని ఇరుపక్షాలకు న్యాయమూర్తి సూచించారు.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి..
ఒకప్పుడు పట్టణ రవాణా వ్యవస్థను శాసించిన యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసుల నమూనా ప్రస్తుతం గందరగోళ పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు వేల రూపాయల ఆదాయం, విలాసవంతమైన జీవితం అంటూ ఊరించిన ఈ వ్యవస్థ నేడు వేలాది మంది డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టి ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. తీసుకున్న అప్పులు కట్టకపోవడంతో వెహికిల్ లోన్లు ఇచ్చిన బ్యాంకులు 30,000లకు పైగా క్యాబ్లను జప్తు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వెనుక ఉన్న చేదు నిజాలు ఏమిటో విశ్లేషిద్దాం.ఓలా/ ఉబెర్ నమూనాయాప్-ఆధారిత క్యాబ్ కంపెనీల వృద్ధిని నిశితంగా పరిశీలిస్తే అవి నాలుగు దశల్లో తమ నెట్వర్క్ను విస్తరించాయి.1. నగదు వెల్లువ: ప్రారంభంలో భారీగా ఇన్సెంటివ్లు ఇచ్చి మార్కెట్ను ఆక్రమించాయి.2. నమ్మకం: డ్రైవర్లకు నెలకు రూ.70,000 నుంచి రూ.80,000 వరకు ఆదాయం వస్తుందనే ఆశ కల్పించాయి.3. ఆధారపడటం: డ్రైవర్లు ఆ ఆదాయాన్ని నమ్మి భారీగా కార్ లోన్లు తీసుకుని సొంత వాహనాలు కొనుగోలు చేశారు.4. నియంత్రణ: మార్కెట్ను గుప్పిట్లోకి తెచ్చుకున్నాక ఇన్సెంటివ్లను తగ్గించి కమిషన్లను పెంచాయి.అప్పుల ఊబిలో డ్రైవర్లుకంపెనీల వ్యూహాలు మారడంతో డ్రైవర్ల ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నిర్వహణ ఖర్చులకు తోడు ఇన్సెంటివ్లు తగ్గడంతో డ్రైవర్ల చేతికి వచ్చే ఆదాయం రూ.30,000 నుంచి రూ.35,000కు పరిమితమైంది. దీంతో తీసుకున్న కార్ లోన్ల ఈఎంఐలు కట్టడం డ్రైవర్లకు భారమైంది.కొవిడ్ సంక్షోభం ఈ పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. ఆదాయం లేక, అప్పులు తీర్చలేక దాదాపు 30,000కు పైగా క్యాబ్లను బ్యాంకులు జప్తు చేశాయి. వాహనాల జప్తుతోపాటు లక్షలాది కుటుంబాల జీవనోపాధి దెబ్బతింది.మారుతున్న ధోరణిప్రస్తుతం డ్రైవర్ల ఆలోచనా ధోరణి మారింది. అప్పుల భారం లేని, రిస్క్ తక్కువగా ఉండే డెలివరీ పార్టనర్ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదాయం తక్కువైనా సొంత వాహనంపై అప్పుల బాధ్యత లేకపోవడమే వారికి ఇప్పుడు ఊరటనిస్తోంది.ప్రయాణికులపై భారంమరోవైపు, ప్రయాణికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇప్పుడు ఒక సామాన్య ప్రయాణికుడు ప్రధాన నగరాల్లో సరాసరి నెలవారీ క్యాబ్ ప్రయాణాల కోసం దాదాపు రూ.27,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది సొంత కారును కొని మెయింటెనెన్స్ చేసుకునే ఖర్చు కంటే ఎక్కువ కావడం గమనార్హం.క్యాబ్-హెయిలింగ్ ఎకోసిస్టమ్ కేవలం డ్రైవర్లకే కాకుండా కంపెనీలకు, ప్రయాణికులకు కూడా నష్టదాయకంగా మారింది. కేవలం గ్రోత్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ మోడల్ స్థిరత్వం వైపు దృష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థపై పునసమీక్షించుకోకపోతే ఈ సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్! -
యూపీఐ లావాదేవీలు @ రూ. 314 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు గత ఆర్థిక సంవత్సరం (2025–26)లో రికార్డు స్థాయికి చేరాయి. రూ. 314 లక్షల కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2016–17లో కేవలం రూ. 0.07 లక్షల కోట్లుగా ఉన్న ఈ విలువ, పదేళ్లలో 4,000 రెట్లు పెరగడం విశేషం. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. → 2016–17లో 2 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. 2025–26లో 24,162 కోట్లకు పెరిగాయి. → 2025 ఆగస్టులో తొలిసారిగా నెలవారీ లావాదేవీలు 2,000 కోట్ల సంఖ్యను దాటాయి. 2025 డిసెంబర్లో గరిష్టంగా 2,163 కోట్ల లావాదేవీలు జరిగాయి. → 2025 క్యాలెండర్ ఇయర్లో రోజుకు సగటున 60 కోట్ల లావాదేవీలు నమోదవగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 66 కోట్లు దాటింది. → ప్రారంభంలో యూపీఐ నెట్వర్క్ పరిధిలో 44 బ్యాంకులు మాత్రమే ఉండగా, 2025–26 నాటికి ఆ సంఖ్య 703 బ్యాంకులకు చేరింది. → ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్ టైమ్ చెల్లింపుల్లో 49 శాతం వాటా యూపీఐదేనని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) సైతం తన 2025 నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
ఎకానమీకి పశ్చిమాసియా సవాళ్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. దీనివల్ల వస్తువుల సరఫరాలో ఆటంకాలు ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అలాగే, ఎగుమతులు, పెట్టుబడులపైనా ప్రభావం చూపించొచ్చని తెలిపింది. అయితే, బలమైన దేశీ వినియోగం, విధానపరమైన వెసులుబాట్లు, బలమైన ఆర్థిక వ్యవస్థలు, ప్రభుత్వ మూలధన వ్యయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని తాజా నివేదికలో పేర్కొంది. అనిశ్చితులు ఎక్కువ కాలం పాటు కొనసాగితే.. ముఖ్యంగా ఇంధనం, ఎరువుల సరఫరాపై ప్రభావం పడితే అది దేశ స్థూల ఆర్థిక పరిస్థితుల బలాన్ని పరీక్షించొచ్చని తెలిపింది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతిలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనాను ప్రస్తావించింది. ఇది వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ నివేదిక అభిప్రాయపడింది. చమురు, ఎరువుల సరఫరాలో అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగితే, ముడి సరుకుల కోసం వాటిపై ఆధారపడే ఇతర పరిశ్రమల ఉత్పత్తి వ్యయం పెరిగి సామాన్యులపై భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేసింది. దేశీ ద్రవ్యోల్బణానికి రూపాయి బలహీనత సైతం ఒత్తిళ్లను పెంచుతున్నట్టు తెలిపింది. కనుక ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు పెరిగి, వృద్ధి తగ్గే రిస్క్లు ఉన్నాయని వివరించింది. పశ్చిమాసియా సంక్షోభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసినట్టు వివరించింది. ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు కృషి చేస్తూనే.. మధ్య కాలానికి ద్రవ్యలోటు, వెలుపలి స్థిరత్వాన్ని (కరెంట్ ఖాతా లోటు, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ తదితర) కొనసాగించేందుకు విధానపరమైన చర్యలతో భరోసా అవసరమని పేర్కొంది. బలమైన వృద్ధి.. ప్రస్తుత పరిస్థితుల్లో భారత వృద్ధి రేటు 7 నుండి 7.4 శాతం మధ్య ఉండవచ్చన్న అంచనాలు ఉత్సాహానిస్తున్నట్టు ఆర్థిక శాఖ నివేదిక పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ వృద్ధి రేటుగా నిలుస్తుందని తెలిపింది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల వల్ల రూపాయి విలువ బలహీనపడితే, దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరగొచ్చని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వం దిశగా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న పలు చర్యలను ప్రస్తావించింది. ఎరువుల ఉత్పత్తికి సహజ వాయువు కేటాయింపులను పెంచడంతోపాటు ఖరీఫ్ సీజన్ కోసం ఎరువులపై ఇచ్చే రాయితీలను 12 శాతం పెంచడం, ఎగుమతులు, దిగుమతుల్లో జాప్యాన్ని తగ్గించేందుకు పరిపాలనాపరమైన చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది. అవకాశాలు.. ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం భారత్కు ఒక సవాలు మాత్రమే కాదని.. గొప్ప అవకాశమని ఈ నివేదిక అభిప్రాయపడింది. బలమైన దేశీయ మార్కెట్, స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థ వల్ల భారత్ సురక్షితంగా ఉంటుందని పేర్కొంది. ప్రపంచ దేశాలు తమ సరఫరా వ్యవస్థలను వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్న తరుణంలో, భారత్ ఒక నమ్మకమైన తయారీ, సేవల కేంద్రంగా ఎదిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ నివేదిక తెలిపింది. పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకోవడం, వ్యూహాత్మక ఇంధన నిల్వలను సిద్ధం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని అభిప్రాయపడింది. -
పెట్రోల్ ధరల పెంపు?: క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.10, రూ.12.50 పెరిగినట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పదించింది.పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ (MoPNG) పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వు జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ స్పష్టం చేసింది. ''ఇంధన ధరల పెంపునకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఉత్తర్వు నకిలీది. భారత ప్రభుత్వం అటువంటి ఉత్తర్వు ఏదీ జారీ చేయలేదు" అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ 'X' లోని ఒక పోస్ట్లో పేర్కొంది.పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇంధన కొరత ఉన్న సమయంలో.. ఫ్యూయెల్ ధరల పెరుగుదల వార్త, ప్రజల్లో ఆందోళన కలిగించింది. అంతే కాకుండా పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జరుగుతున్న సమయంలో.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల నిజమే అని చాలామంది భావించారు. అయితే ధరల పెరుగుదల నిజం కాదని, పీఐబీ అధికారికంగా వెల్లడించింది.🚨FAKE NEWS!An order circulating on social media claims to be issued by the Ministry of Petroleum and Natural Gas, stating that petrol and diesel prices have been increased by ₹10 and ₹12.50, respectively.#PIBFactCheck:❌ This order is #FAKE .✅ The Government of India… pic.twitter.com/tMmJa0Y4qA— PIB Fact Check (@PIBFactCheck) April 29, 2026కాగా.. మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉంటాయని తెలిపారు. నిత్యావసర ఇంధనాలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, ఆమె వినియోగదారులకు హామీ ఇచ్చారు. ఎల్పీజీ, పెట్రోలియం, డీజిల్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి, ధరలు కూడా పెరగలేదు. కాబట్టి దయచేసి ఆందోళన చెందవద్దని శర్మ అన్నారు. -
భారత్ నెత్తిన చమురు ధరల భారం
ముడి చమురు ధర బ్యారెల్కు సగటున 120 డాలర్లకు చేరితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి 6 శాతానికి పరిమితం అవుతుందని ఈవై ఇండియా అంచనా వేసింది. అంతేకాదు ద్రవ్యోల్బణం అర్బీఐ గరిష్ట లక్ష్యమైన 6 శాతానికి పెరిగిపోతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో విధానపరమైన జోక్యానికి పరిమిత అవకాశాలే ఉన్నట్టు ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ పేర్కొన్నారు.పశ్చిమాసియా సంక్షోభం అలాగే కొనసాగితే భారత్ క్రూడ్ బాస్కెట్ ధరలు (ఐసీబీ) మరింత పెరగొచ్చని.. దీంతో విధానకర్తలు చమురు కొనుగోళ్లను వైవిధ్యం చేసుకోవచ్చని తెలిపారు. రెపో రేటును సైతం పెంచే అవకాశం ఉందన్నారు. చమురు ధర 120 డాలర్లకు ఎగసి, ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావాన్ని ద్రవ్యలోటుపై తగ్గించుకోవాలంటే.. ప్రభుత్వం ఇంధన ధరలను పెంచి వినియోగదారులపై పెద్ద మొత్తంలో భారాన్ని మోపాల్సి ఉంటుందని అంచనా వేశారు. యూఎస్ ఇంధన సమాచార యంత్రాంగం 2026 క్యూ2లో (ఏప్రిల్–జూన్) బ్రెంట్ బ్యారెల్ ధర 115 డాలర్లకు చేరొచ్చని అంచనా వేయడాన్ని ఈవై నివేదిక ప్రస్తావించింది.భారత్ వృద్ధి 2026–27లో 6.9 శాతంగా ఉండొచ్చన్ని ఆర్బీఐ అంచనా కాగా, 6.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొనడం తెలిసిందే. పశ్చిమాసియా సంక్షోభం అంచనాలకు మించి ఎక్కువ కాలం కొనసాగొచ్చని శ్రీవాస్తవ అంచనా వేశారు. ఒకవేళ ఇది సమీప కాలంలో పరిష్కారమైనా, ఆ తర్వాత ఇంధన సరఫరా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందన్నారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ఆయిల్ కంపెనీలకు ‘పశ్చిమాసియా’ కష్టాలు..
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా రిటైల్ రేట్లను పెంచకపోవడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) నష్టపోతున్నాయి. పెట్రోల్పై లీటరుకు రూ. 14, డీజిల్పై రూ. 18 మేర నష్టం వాటిల్లుతోంది. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వంట గ్యాస్ ఎల్పీజీపై ఆయిల్ కంపెనీలు రూ. 80,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయి. బడ్జెట్లో ఎరువులపై సబ్సిడీకి రూ. 1.71 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ.. భారం దానికన్నా అధికంగా రూ. 2.05 – 2.25 లక్షల కోట్లకు ఎగియనుంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు ఓ నివేదికలో అంచనాలు వెలువరించింది.హార్మూజ్ జలసంధి మార్గం గుండా ఇంధన సరఫరా దెబ్బతినడంతో ఇంధనాలు, ఎరువులు, రసాయనాల కొరత ఏర్పడి, ధరలు పెరిగిపోతున్నాయని వివరించింది. రెణ్నెల్ల క్రితం పశి్చమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పుడు బ్యారెల్కి 70–72 డాలర్లుగా ఉన్న క్రూడ్ ధరలు ఆ తర్వాత 120–125 డాలర్లకు ఎగిసినట్లు ఇక్రా పేర్కొంది. అయినప్పటికీ దేశీయంగా బంకుల్లో రేట్లు పెంచకపోవడం వల్ల ఓఎంసీల లాభదాయకతపై ప్రభావం పడుతోందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ వశిష్ట తెలిపారు.మరిన్ని ముఖ్య వివరాలు..భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదించి, గ్లోబల్ సరఫరా వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తే తప్ప సమీప భవిష్యత్తులో ఓఎంసీల మార్జిన్లు, రుణ పరపతిపై ఒత్తిడి కొనసాగవచ్చు. ముడి వస్తువుల ధరలు గణనీయంగా పెరిగి, సబ్సిడీ ఆ స్థాయిలో పెరగకపోవడం వల్ల యూరియా సంస్థల లాభదాయకత నెమ్మదించవచ్చు. వాతావరణ రిసు్కలను ఎదుర్కొనాల్సి రావడం వల్ల, పెరిగే ధరలను భరించే సామర్థ్యం రైతుల్లో తగ్గొచ్చు.వాణిజ్యానికి ఆటంకాలు, అధిక ఇంధన ధరలతో రసాయనాలు, పాలిమర్స్ ధరలు పెరిగాయి. దీంతో తయారీ సంస్థలు, వినియోగదారులు భారీగా నిల్వ చేసుకుంటున్నారు. అయితే, నిర్దిష్ట సెగ్మెంట్లలో అంతర్జాతీయంగా సరఫరా గణనీయంగా పెరిగితే, నిల్వ చేసుకునే ధోరణి తగ్గి, డిమాండ్ నెమ్మదిగా సాధారణ స్థాయికి రావొచ్చు.గ్యాస్ రేట్ల పెరుగుదల, కరెన్సీ క్షీణతతో సిటీ గ్యాస్ డి్రస్టిబ్యూషన్ సంస్థల మార్జిన్లపై ఒత్తిడి పెరగొచ్చు. కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉండటంతో గృహాలకు సరఫరా చేసే పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) విభాగం లాభదాయకత స్థిరంగానే ఉన్నా, ధరల పెంపు పాక్షికంగానే బదలాయించడం వల్ల కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) మార్జిన్లు మాత్రం నెమ్మదించవచ్చు. ఇంధనాలు, ముడివస్తువుల ధరలు పెరగడం వల్ల పలు రంగాల్లోని సంస్థల మార్జిన్లపై ప్రభావం పడనుంది. దీంతో కొన్ని సంస్థల రుణ పరపతి కూడా దెబ్బతినొచ్చు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్ -
ఈపీఎఫ్వో పాత ఖాతాల యాక్టివేషన్
న్యూఢిల్లీ: ఈపీఎఫ్వో పాత ఖాతాలు, కార్యకలాపాల్లేని వాటిని గుర్తించడంతోపాటు పునరుద్ధరించుకునేందుకు (యాక్టివేషన్) త్వరలోనే ఒక పోర్టల్ అందుబాటులోకి రానుంది. ఇ–ప్రాప్తి పోర్టల్పై ఆధార్ ధ్రువీకరణతో, పాత ఈపీఎఫ్ ఖాతా వివరాలను పొందొచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) లేని ఖాతాలను లింక్ చేసుకుని, యాక్టివేట్ చేసుకోవచ్చని కేంద్ర కార్మిక మంత్రి మాండవీయ తెలిపారు. 2014 నుంచి ఈపీఎఫ్వో సభ్యులకు 12 అంకెలతో కూడిన యూఏఎన్ను జారీ చేస్తుండడం గమనార్హం. -
గోల్డ్కు గ్లోబల్ జోష్
ముంబై: దేశంలో బంగారానికి గిరాకీ గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) గతేడాది ఇదే కాలంతో పోలిస్తే బంగారం డిమాండ్ 10 శాతం వృద్ధి చెంది 151 టన్నులకు చేరింది. ముఖ్యంగా ఆభరణాల కంటే పెట్టుబడి రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికే ఎక్కువ మంది ప్రాధాన్యం చూపిస్తున్నారు. నివేదికలోని అంశాలు.. → బంగారం కడ్డీలు, నాణేలు, ఈటీఎఫ్ (గోల్డ్ ఈటీఎఫ్లు) రూపంలో పెట్టుబడి డిమాండ్ మార్చి క్వార్టర్లో 54 శాతం పెరిగి 82 టన్నులకు చేరుకుంది. ఇందులో కడ్డీలు, కాయిన్ల డిమాండ్ వరకే చూస్తే 34 శాతం పెరిగి 62 టన్నులుగా ఉంది. 2013 తర్వాత తొలి త్రైమాసికంలో అత్యధిక డిమాండ్ ఇదే కావడం విశేషం. → అధిక ధరల కారణంగా ఆభరణాల డిమాండ్ 19 శాతం తగ్గి 66 టన్నులకు పరిమితమైంది. పెరిగిన ధరలు సామాన్యుల బడ్జెట్పై ప్రభావం చూపించడమే దీనికి కారణం. → ధరల పెరుగుదలతో బంగారం డిమాండ్ విలువ పరంగా రెట్టింపయ్యింది. మార్చి త్రైమాసికంలో కొనుగోళ్ల విలువ రూ.2,27,500 కోట్లుగా నమోదైంది. → మార్చి క్వార్టర్లో బంగారం ధర ఎంసీఎక్స్లో 81 శాతం పెరిగింది. 10 గ్రాముల బంగారం సగటు ధర 1,51,108 రూపాయల స్థాయిలో కొనసాగింది. 2025 మొదటి త్రైమాసికంలో ఇది రూ.83,375గా ఉంది. ప్రపంచవ్యాప్తంగానూ ఇదే ధోరణి.. ప్రపంచవ్యాప్తంగా 2026 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) బంగారానికి గిరాకీ(డిమాండ్) 2 శాతం పెరిగి 1,231 టన్నులకు చేరిందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు ధరలు రికార్డు స్థాయికి చేరిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడికి సురక్షిత సాధనంగా భావించి కడ్డీలు, నాణేల కొనుగోలుకు మొగ్గు చూపించినట్టు తెలిపింది. కడ్డీలు, నాణేల రూపంలో పెట్టుబడి డిమాండ్ ఏకంగా 42 శాతం పెరిగి 474 టన్నులకు చేరింది. విలువ పరంగా డిమాండ్ 193 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 74 శాతం అధికం. ధరలు పెరగడమే ఇంత వృద్ధికి కారణం. 2025లో ఔన్సు బంగారం ధర సగటున 2,860 డాలర్లు ఉండగా, 2026 మొదటి త్రైమాసికంలో అది 81 శాతం పెరిగి 4,873 డాలర్లకు చేరింది. జనవరిలో ధరలు 5,400 డాలర్ల రికార్డు గరిష్టాన్ని కూడా నమోదు చేయడం గమనార్హం. అధిక ధరలతో ప్రపంచవ్యాప్తంగా ఆభరణాల డిమాండ్ 23 శాతం తగ్గి 300 టన్నులకు పరిమితమైంది. చైనాలో 32 శాతం, భారత్లో 19 శాతం చొప్పున విక్రయాలు తగ్గాయి. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు మార్చి త్రైమాసికంలో అదనంగా 244 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఆర్బీఐ సైతం ఈ కాలంలో 300 కిలోల బంగారాన్ని సమకూర్చుకుంది. గనుల నుంచి బంగారం ఉత్పత్తి మోస్తరుగా పెరగొచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పెట్టుబడి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. రీసైక్లింగ్కూ డిమాండ్ ధరలు భారీగా పెరగడంతో పాత బంగారాన్ని విక్రయించి లాభాలు పొందే ధోరణి కూడా పెరిగింది. బంగారం రీసైక్లింగ్ 20 శాతం పెరిగి 31.2 టన్నులకు చేరింది. అలాగే, దేశీ అవసరాల కోసం దిగుమతులు 39 శాతం పెరిగి 186 టన్నులకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా పసిడి సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతోందని డబ్ల్యూజీసీ భారత్ సీఈవో సచిన్ జైన్ తెలిపారు. రాబోయే వివాహాల సీజన్, పండుగలు ఆభరణాల డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయంటూ.. ఈ ఏడాది మొత్తం మీద డిమాండ్ 650 నుంచి 750 టన్నుల మధ్య ఉండొచ్చని అంచనా వ్యక్తం చేశారు. -
ఇంధన దాహం.. జల వినాశం!
భారతదేశం ఇంధన స్వయంసమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. పెట్రోల్లో ఇథనాల్ను కలిపి విదేశీ ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే, ఈ గ్రీన్ ఎనర్జీ ప్రస్థానం దేశాన్ని మరో పెను ప్రమాదంలోకి నెట్టేస్తోందా? అనే ప్రశ్న ప్రస్తుతం పర్యావరణవేత్తలను వేధిస్తోంది. ఒక లీటరు ఇథనాల్ తయారీకి దాదాపు 10,000 లీటర్ల నీరు ఖర్చవుతోందన్న వాస్తవం ఇప్పుడు దేశ జల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.బియ్యం నుంచి ఇంధనంప్రభుత్వం 2024-25లో ఇథనాల్ ఉత్పత్తి కోసం 52 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయించింది. రాబోయే 2025-26 నాటికి ఈ లక్ష్యాన్ని 90 లక్షల టన్నులకు పెంచాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఆహార సరఫరా శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే విరిగిన బియ్యం వాటాను 25% నుంచి 10%కి తగ్గించనున్నారు. దీనివల్ల మిగిలిన బియ్యాన్ని నేరుగా ఇథనాల్ తయారీ డిస్టిలరీలకు మళ్లిస్తారు. అయితే, ఆహార భద్రత కంటే ఇంధన అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వడంపై కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.నీటి వినియోగం గణాంకాలు ఇలా..ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇథనాల్ తయారీకి పంటల వారీగా నీటి వినియోగం కింది విధంగా ఉంది.పంట రకంఒక లీటరు ఇథనాల్కు అవసరమయ్యే నీరుబియ్యం (వరి)10,790 లీటర్లుమొక్కజొన్న4,670 లీటర్లుచెరకు3,630 లీటర్లు ఒక కిలో బియ్యం పండించడానికి సుమారు 3,000 లీటర్ల నీరు అవసరమైతే ఒక టన్ను బియ్యం నుంచి కేవలం 470 లీటర్ల ఇథనాల్ మాత్రమే లభిస్తుంది. అంటే, మనం వాహనాల్లో వాడే ఇంధనం ఎంత భారీ స్థాయిలో జల వనరులను హరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.పెరుగుతున్న కాలుష్యంనీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2030 నాటికి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా 21 ప్రధాన నగరాల్లో భూగర్భ జలాలు నిండుకునే ప్రమాదం ఉంది. ఇటువంటి తరుణంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోనే ఇథనాల్ ప్లాంట్లు కేంద్రీకృతమవ్వడం గమనార్హం. మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో తాగునీటికే కటకటలాడుతున్న స్థితిలో అక్కడ 396 కోట్ల లీటర్ల ఇథనాల్ సామర్థ్యం గల ప్లాంట్లు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్, కర్ణాటకలో కూడా భూగర్భ జలాలు అడుగంటుతున్న ప్రాంతాల్లోనే ఇథనాల్ తయారీ జోరుగా సాగుతోంది. ఇథనాల్ మిల్లులు విడుదల చేసే వినాస్సే (Vinasse) అనే వ్యర్థ జలాలు భూమిలోకి చేరితే భూగర్భ జలాలు, ఉపరితల జలాలు పూర్తిగా కలుషితమవుతాయని కొందరు చెబుతున్నారు.వైరుధ్యాల వలయంఒకప్పుడు పంజాబ్, హరియాణా వంటి ప్రాంతాల్లోని రైతులు వరి పండించి భూగర్భ జలాలను తోడేస్తున్నారని విమర్శించిన వ్యవస్థే ఇప్పుడు అదే ధాన్యాన్ని పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పేరుతో ఇంధనంగా మారుస్తోంది. పర్యావరణాన్ని కాపాడటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం భవిష్యత్తులో దేశాన్ని మంచినీటి చుక్క కోసం అల్లాడేలా చేసేలా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.క్లీన్ ఎనర్జీ లక్ష్యం గొప్పదే అయినా అది దేశ జల వనరులను బలిపెట్టేదిగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యం, చెరకు వంటి నీటి తీవ్రత పంటల కంటే ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: ‘మస్క్ దొంగ ఏడుపు దేనికి?’ -
ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. భారత్కు మేలే!
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక మార్పు చోటు చేసుకుంది. ముడిచమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ‘ఒపెక్’ నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం చమురు ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళనల మధ్య భారతదేశం తన ఇంధన వనరులపై దృష్టి సారించాలని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన ‘ది ఎకనామిస్ట్ ఇంపాక్ట్ రెసిలెంట్ ఫ్యూచర్స్ సమ్మిట్’లో ఆయన ప్రసంగిస్తూ గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్కు ఇది సానుకూల పరిణామంగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఒపెక్ పట్టు సడలుతోందా?1960లో ఏర్పాటైన ఒపెక్ అంతర్జాతీయంగా చమురు ధరలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం 12 దేశాల సభ్యత్వం ఉన్న ఈ కూటమిలో యూఏఈ 1967 నుంచి (మొదట అబుదాబిగా, తర్వాత 1971 నుంచి యూఏఈగా) కీలక భాగస్వామిగా ఉంది. మే 1 నుంచి యూఏఈ ఈ కూటమి నుంచి వైదొలుగుతుందన్న నిర్ణయం చమురు సరఫరా, ధరలపై ఒపెక్కు ఉన్న పట్టును బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.‘యూఏఈ నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లను అతలాకుతలం చేస్తుందా లేదా స్థిరీకరిస్తుందా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే, భారత్-యూఏఈల మధ్య ఉన్న అసాధారణ భౌగోళిక రాజకీయ సంబంధాలు, నాయకత్వాల మధ్య ఉన్న పరస్పర నమ్మకం దృష్ట్యా ఇది భారత్కు మేలు చేస్తుందని భావిస్తున్నాను’ అని అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ అన్నారు.యూఏఈ తన వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాల కోసం ఒపెక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మార్కెట్ను ఒక్కసారిగా ప్రభావితం చేసే అవకాశం లేదు. క్రమంగా చమురు ఉత్పత్తిని పెంచడం ద్వారా తన మార్కెట్ వాటాను పెంచుకోవాలని యూఏఈ భావిస్తోంది. ఈ అనిశ్చితి కాలంలో దేశీయంగా ఇంధన వనరులను బలోపేతం చేసుకోవడమే భారత్కు అత్యంత కీలకమైన రక్షణ కవచం.ఇదీ చదవండి: ఆఫర్ లెటర్ ఇచ్చాక రూ.36 లక్షల డిమాండ్.. -
జోరు మీదున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం జీడీపీలో 1 శాతం వాటా కలిగి ఉండగా, 2030 నాటికి ఇది 4 శాతానికి చేరుకుంటుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేసింది. చరిత్రాత్మక మార్పు మలుపు దశలో భారత్ ఉన్నట్టు పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ డిజిటల్ వ్యవస్థలు సామాజిక, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని తెలిపింది.ఈ లక్ష్యాలను చేరుకోవడానికి నీతి ఆయోగ్ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. రాష్ట్రాల నాయకత్వంలో సాగే వినూత్న కార్యక్రమాల ద్వారానే డీపీఐ 2.0 విజయవంతమవుతుందంటూ.. దీనికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ మార్గదర్శకులుగా వ్యవహరిస్తాయని పేర్కొంది. రంగాల వారీ మార్పులు తీసుకురావడానికి రెండేళ్ల కార్యాచరణను అనుసరించాలని సూచించింది. తొలి ఏడాది ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టి, వాటి ఫలితాలను విశ్లేషించాలని పేర్కొంది. మొదటి ఏడాది సాధించిన విజయాలను రెండో ఏడాది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని సూచించింది. ఉపాధి కల్పన కీలకం.. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించే అభివృద్ధి మార్గాలు అవసరమని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ ఈ నివేదికను విడుదల చేసిన సందర్భంగా పేర్కొన్నారు. ‘‘గత దశాబ్ద కాలంలో సేవలను ప్రజలకు చేరవేయడంలో, ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో డిజిటల్ వ్యవస్థలు అద్భుతమైన పనితీరు చూపించాయి. రాబోయే దశలో డిజిటల్ అనుసంధానానికే పరిమితం కాకుండా, ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం, సామర్థ్యాలను పెంచడంతోపాటు.. రంగాలు, ప్రాంతాల వారీ కొత్త చోదక కేంద్రాలను సృష్టించడంపై దృష్టి సారించాలి’’అని సూచించారు. -
పీపీఐల్లో ప్రతి నెలా రూ.10,000 జమ
ముంబై: ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (పీపీఐ)ను మరింత బలోపేతం చేసేందుకు, లావాదేవీల భద్రతను పెంచేందుకు ఆర్బీఐ కీలక ప్రతిపాదనలు చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, నగదు తిరిగి చెల్లింపుల (రిఫండ్) ప్రక్రియల్లో స్పష్టత తెస్తూ కొత్త ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ముందుగానే నగదును జమ చేసి, ఆ తర్వాత వివిధ అవసరాలకు చెల్లింపులు చేసే సాధనాలను పీపీఐలుగా చెబుతారు. → డెబిట్ కార్డులకు అనుమతి ఉన్న బ్యాంక్లు పీపీఐలను జారీ చేయొచ్చు. దీనికంటే ముందే డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ (డీపీఎస్ఎస్)కు ముందస్తు సమాచారం ఇవ్వాలి. → ఆర్బీఐ నుంచి అనుమతితో నాన్ బ్యాంకింగ్ సంస్థలు సైతం పీపీఐలు జారీ చేయొచ్చు. → పీపీఐలలో ఏ సమయంలో అయినా గరిష్టంగా రూ. 2 లక్షల వరకే బ్యాలన్స్ ఉండాలి. → ఒక నెలలో గరిష్టంగా రూ.10,000 లోడ్ చేసుకోవచ్చు. → బహుమతి కార్డుల విలువ రూ. 10,000, ప్రయాణ కార్డుల విలువ రూ. 3,000 మించి ఉండకూడదు. → ప్రవాస భారతీయులు భారత్లో పర్యటించే సమయంలో వారి పాస్పోర్ట్, వీసా ధ్రువీకరణ తర్వాత పీపీఐ వాలెట్లు పొందొచ్చు. నెలకు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు. → కేవైసీ పూర్తి చేసిన వారికి కార్డు నెట్వర్క్ లేదా యూపీఐ నెట్వర్క్ ద్వారా పీపీఐ లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యం కలి్పంచాలి. → ఫెయిల్ అయిన లేదా రద్దయిన లావాదేవీలకు సంబంధించిన నగదును వెంటనే సంబంధిత పీపీఐ ఖాతాలో జమ చేయాలి. → ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను 2026 మే 22 లోపు తెలియజేయాలని ఆర్బీఐ కోరింది. -
కల్లోల మార్కెట్లకు క్రమశిక్షణే జవాబు
ఒక్క ట్వీట్తో మార్కెట్లు ఒకటిరెండు శాతం పడిపోవటం... అలాగే పెరిగిపోవటం జరుగుతోంది. అసలు మార్కెట్ల డైరెక్షన్ ఎటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సాగిస్తున్న యుద్ధం ఎలా ముగుస్తుందో, ఎప్పటికి ముగుస్తుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. చమురు ధరలు బీభత్సంగా పెరుగుతున్నాయి. రూపాయి దారుణంగా పడిపోయింది. చాలామంది ఇన్వెస్టర్లు ఇప్పటికే నష్టపోయారు. ఈ తరహా ఊగిసలాటలో సొమ్ము చేసుకోవాలనుకుంటే చిన్న ఇన్వెస్టర్లకది సాధ్యం కాదు. మరేం చెయ్యాలి? దీన్నుంచి పోర్టుఫోలియోను కాపాడుకోవటమెలా? దీనిపై ఫోకస్ చేస్తున్నదే ఈ ‘సాక్షి వెల్త్’ స్టోరీ...మ్యూచ్వల్ ఫండ్ల ద్వారా కావచ్చు... నేరుగా కావచ్చు. మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారు గుర్తుంచుకోవాల్సిందొక్కటే. ఊగిసలాటలు, కల్లోలాలు మార్కెట్కు సహజం. అసాధారణమేమీ కాదు. మనం ఆలోచించాల్సిందేంటంటే మార్కెట్లు ఇంకా ఎంత పడతాయనేది కాదు. దానికి మనమెలా స్పందించాలనేదే. మార్కెట్లు శాశ్వతం... హెచ్చుతగ్గులు తాత్కాలికం మార్కెట్ కరెక్షన్లు నాటకీయంగా ఉంటాయి. ఇక కోలుకోవేమో అనేంత భయం పుట్టిస్తాయి. పోర్టుఫోలియో విలువ పడిపోతుంది. వార్తలన్నీ నిరాశాజనకంగానే ఉంటాయి. ఇదిగో... ఇలాంటి దశలోనే చాలామంది ఇన్వెస్టర్లు తమ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను (సిప్) తాత్కాలికంగానో, శాశ్వతంగానో నిలిపేస్తుంటారు. కాకుంటే ఇది చాలా ఖరీదైన పొరపాటు. ఎందుకంటే తెలివైన ఇన్వెస్టరుకు ఇవన్నీ తాత్కాలికమని, సంపద సృష్టి అనేది దీర్ఘకాలికమని స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎందుకంటే మార్కెట్లు పతనమైనపుడే సిప్ బలంగా మారుతుంది. → అదే మొత్తానికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. → దీనివల్ల సగటు ఖరీదు ధర తగ్గుతుంది. → మార్కెట్లు రికవరీ అవుతున్నపుడు పెరుగుదల వేగంగా ఉంటుంది. → ఈ రుపీ కాస్ట్ యావరేజింగ్ అనేదే దీర్ఘకాలిక సంపద సృష్టికి ఇంజిన్లా పనిచేస్తుంది.అసలైన మంత్రం... అసెట్ అలొకేషన్ డైవర్సిఫైడ్ పోర్టుఫోలియో ఉంటే రిస్కు పూర్తిగా పోకున్నా తగ్గుతుంది. ఎందుకంటే ఈ అసెట్లు రకరకాలుగా పనిచేస్తాయి. ఈక్విటీ వృద్ధికి తోడయితే డెట్ ఫండ్లు స్థిరత్వాన్ని ఇస్తాయి. బంగారం అనేది ఈ రెండింటికీ హెడ్జ్గా పనిచేస్తుంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఈ డైవర్సిఫికేషన్ అనేది ఆప్షనల్ కాదు. తప్పనిసరి. లైఫ్సైకిల్ ఫండ్స్లో క్రమశిక్షణే ‘పెట్టుబడి’ లైఫ్సైకిల్ ఫండ్స్... ఇవి ఏం చేస్తాయనేది వీటి పేరులోనే ఉంది. ఇవి మన జీవితానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. అంటే.. తొలినాళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ మొత్తాన్ని పెడతాయి. మెల్లగా తగ్గించుకుంటూ వెళతాయి. లక్ష్యానికి చేరువయ్యే కొద్దీ... డెట్లో మొత్తాన్ని పెంచుకుంటూ వెళతాయి. ఉదాహరణకు... → లక్ష్యంలోని తొలి 20–30 ఏళ్లలో ఈక్విటీల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాయి. → తరువాతి 5–10 ఏళ్లు బ్యాలెన్స్డ్గా ముందుకెళతాయి. → మెచ్యూరిటీకి దగ్గరయ్యేటపుడు డెట్పై ఫోకస్ పెంచుతాయి. → ఇలా ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ల సమయంలో భావోద్వేగాలకు తావుండదు. → అలాగని ఇవేమీ రిసు్కలేకుండా ఉండవు. లైఫ్సైకిల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ అలొకేషన్ నిర్ణయాలను ఇన్వెస్టర్లు గమనిస్తూ ఉండాలి. ఖర్చుల నిష్పత్తిని, పన్ను ప్రభావాన్ని, మెచ్యూరిటీకి దగ్గర పడుతున్నపుడు పోర్టుఫోలియో తీరును నిశితంగా పరిశీలించాలి. ఎందుకంటే ఒకేరకమైన స్ట్రక్చర్ ఉన్నా... ఫండ్ మేనేజర్ల కారణంగా ఫండ్ల పనితీరు మాత్రం వేరుగా ఉండొచ్చు. సిప్ నిలిపేయటమే అసలు తప్పుఅన్నిటికన్నా సంపద సృష్టికి అడ్డంపడేది మార్కెట్ల పతనం కాదు. ఇన్వెస్టర్ల వైఖరే. ఎందుకంటే భయం తారస్థాయికి వెళ్లినపుడు... → ఇన్వెస్టర్లు సిప్ను నిలిపేస్తారు. → ఈక్విటీ ఫండ్ల నుంచి పూర్తిగా వైదొలుగుతారు. క్లారిటీ కోసం దీర్ఘకాలం వేచిచూస్తారు. కాకపోతే... ఈ క్లారిటీ వచ్చేసరికి మార్కెట్లు పెరిగిపోయి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే సాధారణ ఇన్వెస్టర్లెపుడూ తక్కువ ఖరీదులో అమ్మేసి బాగా పెరిగాక కొంటుంటారు. తెలివైన ఇన్వెస్టర్లు మాత్రం దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అదే తేడా.మార్కెట్ టైమింగ్ ముఖ్యమేనా? చాలామంది ఇన్వెస్టర్లు మార్కెట్లలో ఎంట్రీ, ఎగ్జిట్ల కోసం సరైన సమయం కోసం చూస్తుంటారు. నిజానికి నిపుణులకు కూడా ఇవి సరిగ్గా తెలుసుకోవటం సాధ్యం కాదు. అందుకే ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూ ఉండటం... క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ పోవటం... మన అసెట్ అలొకేషన్కు కట్టుబడి ఉండటం తప్పనిసరి. నిపుణులు చెప్పేదేంటంటే మార్కెట్లలో సమయం కోసం ఎదురుచూడటం కన్నా... ఎక్కువ సమయం ఉండటమే లాభాన్నిస్తుందని.ఇన్వెస్టర్లు ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు పరిస్థితులేమీ అంత స్థిరంగా లేవు. క్రమశిక్షణతోనే దీనికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. అందుకని చేయాల్సిందేంటంటే... → సిప్లను ఆపేయకుండా నిరంతరం కొనసాగించండి. → పోర్టుఫోలియో విలువను చూడకుండా... అసెట్ అలొకేషన్ను సమీక్షించుకోండి. → భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే భయం, ఆశ సంపద సృష్టికి శత్రువులుగా మారతాయి. → లక్ష్యాలకు తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్లు కొనసాగించండి. షార్ట్టర్మ్ ట్రెండ్ను బట్టి కాకుండా దీర్ఘకాల పనితీరు ఆధారంగా ఫండ్లను ఎంచుకోండి. → మీకు క్రమశిక్షణ లేదని మీరు భావిస్తే లైఫ్సైకిల్ ఫండ్స్ను ఎంచుకోండి. వాటిలో ఆటోమేటిక్ రీబ్యాలెన్సింగ్ ఉంటుంది... భావోద్వేగాల పరమైన తప్పులు జరగవు. -
మళ్లీ పెరిగిన బంగారం, ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు రెండో వారమూ పెరిగాయి. ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో 2.362 బిలియన్ డాలర్లు పెరిగి 703.308 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు(ఏప్రిల్ 10) వారంలో ఇవి 3.825 బిలియన్ డాలర్లు పెరిగి 700.946 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది. ఏప్రిల్ 17తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.481 బిలియన్ డాలర్లు పెరిగి, 557.463 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 790 మిలియన్ డాలర్లు పెరిగి 122.133 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
చైనా చమురు దిగ్గజంపై ట్రంప్ ఆంక్షలు
ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇరాన్ నుంచి అక్రమంగా చమురు దిగుమతి చేసుకుంటున్న చైనాకు చెందిన ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం ‘హెంగ్లీ పెట్రోకెమికల్’పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. దీనితో పాటు ఇరాన్ చమురు రవాణాలో పాలుపంచుకుంటున్న సుమారు 40 షిప్పింగ్ కంపెనీలు, ట్యాంకర్లపై కూడా వేటు వేసింది.ఆంక్షల వెనుక ప్రధాన ఉద్దేశంఇరాన్ సైన్యానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవడమే ఈ నిర్ణయం ఉద్దేశం. తాజా చర్యతో ఇరాన్తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, కంపెనీలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామన్న తన హెచ్చరికను ట్రంప్ ప్రభుత్వం అమలు చేసి చూపింది. దాంతో చైనాలోని డాలియన్ నగరంలో ఉన్న హెంగ్లీ పెట్రోకెమికల్ సదుపాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. రోజుకు సుమారు 4,00,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేసే ఈ పెసిలిటీ ఉత్పాదకత తగ్గిపోయే ప్రమాదముంది. అయితే, 2023 నుంచి ఈ సంస్థ ఇరాన్ ముడి చమురును స్వీకరిస్తూ తమ సైన్యానికి వందల మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని చేకూర్చినట్లు అమెరికా ట్రెజరీ విభాగం నిర్ధారించింది.ప్రపంచ ఇంధన మార్కెట్లో అలజడిఒకవైపు ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే మరోవైపు భౌగోళికంగా కూడా అమెరికా ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనాన్ని విధించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడం, చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో ప్రపంచ ఇంధన వాణిజ్యం ప్రస్తుతం గందరగోళంలో ఉంది.ఇదీ చదవండి: ‘మూన్లైటింగ్’ టెక్కీ కన్నీటి గాథ! -
దేశీ వినియోగమే వృద్ధికి దన్ను
పుణె: దేశీ వినియోగం వృద్ధి వేగాన్ని నిలబెడుతోందని, ఇక మీదటా జీడీపీ మెరుగ్గా వృద్ధి చెందేందుకు స్పష్టమైన విధానపర మద్దతు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన వృద్ధిని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఎస్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. దేశీ తయారీ, వ్యవసాయ రంగం బలమైన పనితీరు, పర్యాటకం, ఐటీ, అనుబంధ సేవల రంగాల నుంచి స్థిరమైన, విధానపరమైన మద్దతు లేకపోతే భారత్ వృద్ధి ప్రయాణం క్లిష్టంగా మారుతుందన్నారు. ఎగుమతులు సైతం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియలో ఘర్షణలతో దెబ్బతిన్న రంగాలకు ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందా? అన్న ప్రశ్నకు.. ప్రభుత్వం తనవంతు మెరుగ్గా ఏం చేయగలదో చూస్తుందని చెప్పారు. యూఎస్ టారిఫ్ల ప్రభావిత సంస్థలకు ప్యాకేజీని ప్రకటించడాన్ని గుర్తు చేశారు. థర్డ్ పార్టీ (వేరే సంస్థకు చెందిన) ఉత్పత్తుల పంపిణీకి ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకునేలా బ్యాంక్లను అనుమతించాలా? లేదా? అన్న దానిపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) పరిధిలోని కమిటీ అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ లావాదేవీలు పెరిగిన∙తరుణంలో కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధాలపై దృష్టి సారించాలని బ్యాంక్లకు సూచించారు. ఐడీబీఐలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐపై లోతైన అధ్యయనం.. ఆంథ్రోపిక్ సంస్థ తీసుకొచ్చిన ‘మైథోస్’ కృత్రిమ మేధ (ఏఐ) నమూనాపై ఆందోళనల నేపథ్యంలో.. గురువారం ఢిల్లీలో బ్యాంక్లతో సమావేశం నిర్వహించినట్టు ఆర్థిక మంత్రి సీతారామన్ తెలిపారు. ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి నాయకత్వంలో (ఐబీఏ చైర్మన్ కూడా) పనిచేయాలని అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్లను కోరినట్టు చెప్పారు. -
గల్ఫ్ దేశాలకు తగ్గిపోయిన ఇంజనీరింగ్ ఎగుమతులు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్ ఎగుమతులను 250 బిలియన్ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం.గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్ డాలర్లు, కొరియాకి 3 బిలియన్ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. ఇవి ఎక్కువ – ఇవి తక్కువ గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్టరిక్ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్క్రాఫ్ట్, స్పేస్క్రాఫ్ట్ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి. -
పశ్చిమాసియా యుద్ధంతో ఆర్థిక సవాళ్లు
పశ్చిమాసియాలో ఘర్షణలు, సరఫరా వ్యవస్థలో అవరోధాలతో ఇంధన ధరలు, తయారీ వ్యయాల పెరుగుదల రూపంలో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురవుతున్నట్టు ఆర్బీఐ బులెటిన్ తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలతో మార్చి నెలలో అంతర్జాతీయ సరఫరా వ్యసవ్థపై ఒత్తిడులు పెరిగిపోయినట్టు పేర్కొంది. కాకపోతే ఏప్రిల్ మొదటి భాగంలో ఇవి కాస్తంత సడలినట్టు తెలిపింది. చాలా విభాగాల్లో ఆర్థిక కార్యకలాపాలు బలంగానే ఉన్నప్పటికీ.. కొన్ని రంగాల్లో నిదానించినట్టు వివరించింది.పశ్చిమాసియాలో ఘర్షణ పరిస్థితుల తీవ్రత, అవి ఎంత కాలం పాటు కొనసాగుతాయి.. దీని ఫలితంగా ఇంధన, ఇతర మౌలిక వసతులకు వాటిల్లే నష్టం ద్రవ్యోల్బణం, వృద్ధికి రిస్క్లు కాగలవని పేర్కొంది. ‘‘ఘర్షణలు కొనసాగి, సరఫరా వ్యవస్థలు వేగంగా పునరుద్ధరణకు నోచుకోకపోతే అధిక ఇంధన ధరలు, అధిక తయారీ వ్యయాలు, వాణిజ్య ఎగుమతుల రూపంలో సవాళ్లకు దారితీయొచ్చు’’అని ఆర్బీఐ బులెటిన్ తెలిపింది.ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉన్నప్పటికీ, సరఫరా వైపు సమస్యలు, వాతావరణ సంబంధిత సమస్యలతో పెరిగే రిస్క్లు నెలకొన్నట్టు వెల్లడించింది. అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల తాత్కాలిక సంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కొంత ఉపశమనంగా పేర్కొంది. దేశ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నందున షాక్లకు తట్టుకుని నిలబడగలదని ఈ బులెటిన్ను రూపొందించిన ఆర్బీఐ అధికారులు అభిప్రాయపడ్డారు. -
గల్ఫ్ దేశాలకు ఇంజనీరింగ్ ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ఇంజనీరింగ్ ఎగుమతులపై ప్రభావం చూపిస్తోంది. ఇంజనీరింగ్ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఈఈపీసీ)గణాంకాల ప్రకారం.. మార్చి నెలలో యూఏఈకి ఎగుమతులు 237 మిలియన్ డాలర్లకు తగ్గాయి. 2025 మార్చిలో ఎగుమతులు 715 మిలియన్ డాలర్లతో పోల్చితే 66.8 శాతం పడిపోయాయి. సౌదీ అరేబియాకు సైతం మార్చి నెలలో ఎగుమతులు 248 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఈ దేశానికి ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 450 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే 45 శాతం తగ్గినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మార్చి నెలలో దేశ ఇంజనీరింగ్ ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చిచూసినప్పుడు 1 శాతం పెరిగి 10.94 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం మీద ఇంజనీరింగ్ ఎగుమతులు అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 5 శాతం వృద్ధితో 122.43 బిలియన్ డాలర్లకు చేరాయి. 2030 నాటికి ఇంజనీరింగ్ ఎగుమతులను 250 బిలియన్ డాలర్లకు (రెట్టింపు) చేర్చాలన్నది లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం వస్తు ఎగుమతుల్లో ఇంజనీరింగ్ వాటా 27.71 శాతంగా ఉంది. అమెరికా టారిఫ్లు బాదేసినా ఆ దేశానికి గత ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 2.3 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరాయి. జర్మనీకి 14.6 శాతం అధికంగా 4.96 బిలియన్ డాలర్లు, యూకేకి 18.2 శాతం అధికంగా 4.74 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. చైనాకు 32 శాతం అధికంగా 3.53 బిలియన్ డాలర్లు, కొరియాకి 3 బిలియన్ డాలర్లు (16.7 శాతం అధికం) చొప్పున ఎగుమతులు వెళ్లాయి. ఇవి ఎక్కువ – ఇవి తక్కువ గత ఆర్థిక సంవత్సరంలో మోటారు వాహనాలు, కార్లు, టూ వీలర్లు, రాగి, ఐరన్ అండ్ స్టీల్, ఎలక్టరిక్ మెషినరీ ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. అదే సమయంలో ఎయిర్క్రాఫ్ట్, స్పేస్క్రాఫ్ట్ విడిభాగాలు, మెడికల్, సైంటిఫిక్ ఇనుస్ట్రుమెంట్ల ఎగుమతులు తగ్గాయి. -
బిలియనీర్ల హబ్గా భారత్!
న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత్లో ప్రస్తుతం 207 మంది బిలియనీర్లు ఉంటే, 2031 నాటికి 51 శాతం పెరిగి 313కి చేరుకోనున్నట్టు నైట్ఫ్రాంక్ తెలిపింది. అత్యంత ధనవంతులు (అల్ట్రా హెచ్ఎన్ఐలు) 19,877గా ఉంటే, 2031 నాటికి వీరి సంఖ్య 25,217కు చేరుకోనుంది. బిలియన్ డాలర్లు, అంతకుమించి సంపద కలిగిన వారిని బిలియనీర్లు (కుబేరులు)గా, 30 మిలియన్ డాలర్లు, అంతకుమించి ఆస్తులు కలిగిన వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా చెబుతారు. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అయిన నైట్ఫ్రాంక్ ఈ మేరకు 20వ ఎడిషన్ ‘ద వెల్త్ రిపోర్ట్, 2026’ను విడుదల చేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతోపాటు, వడ్డీ రేట్ల పెరుగుదల, అసమాన ఆర్థిక పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నప్పటికీ.. సంపద సృష్టి వేగంగా జరుగుతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. భారత్లో టెక్నాలజీ, ఇండ్రస్టియల్స్, క్యాపిటల్ మార్కెట్స్ రంగాల్లో అసాధారణ సంపద సృష్టి జరుగుతున్నట్టు తెలిపింది. రాజధానిగా ముంబై.. దేశంలోని అల్ట్రా హెచ్ఎన్ఐలలో 35.4 శాతం మందికి ముంబై చిరునామాగా ఉంది. అల్ట్రా హెచ్ఎన్ఐల జనాభా పరంగా భారత్ ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగానూ అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 2021లో ఉన్న 5,51,435 నుంచి 7,13,626కు పెరిగింది. గత ఐదేళ్లలో భారత్లో బిలియనీర్ల సంఖ్య 58 శాతం పెరిగి 2026లో 207కు చేరింది. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. అత్యధికంగా అమెరికాలో 914 మంది ఉండగా, చైనాలో 485 మంది ఉన్నారు. ‘‘భారత్లో సంపన్నుల సంఖ్య పెరుగుతుండటం ఆర్థిక పరిణామ క్రమానికి అద్దం పడుతోంది. పారిశ్రామిక స్ఫూర్తితో ఎదుగుతూ.. బలమైన మూలధన నిల్వలు, అత్యాధునిక ఆర్థిక మార్కెట్లతో రాణిస్తోంది. వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల సమూహం పెరుగుతోంది. డిజిటలైజేషన్, లిస్టెడ్ కంపెనీలు, ప్రైవేటు క్యాపిటల్, కుటుంబ వ్యాపారాలు ఈ దిశగా కీలక పాత్ర పోషిస్తున్నాయి’’ అని నైట్ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. -
ప్రభుత్వ పథకాలకు ‘కొత్త రూపాయి’
దేశ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సరికొత్త అధ్యాయం మొదలైంది. లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడమే కాకుండా, ఆ నిధులు నిర్దేశించిన పనికే ఖర్చయ్యేలా చూసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ 'ఈ-రూపాయి' (e-Rupee) అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహారాష్ట్రలోని ఫూలేనగర్కు చెందిన సమధన్ సోనావానే అనే రైతు కథే దీనికి నిదర్శనం.రైతులకు వరం.. డ్రిప్ ఇరిగేషన్కు ఊతంసాధారణంగా ప్రభుత్వ సబ్సిడీలు అందాలంటే రైతులు ముందుగా తమ జేబులోంచి డబ్బు ఖర్చు చేసి యంత్రాలు కొనుగోలు చేయాలి. ఆ తర్వాతే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇస్తుంది. కానీ, ఈ-రూపాయి పైలట్ ప్రాజెక్ట్ కింద సోనావానేకు ప్రభుత్వం నేరుగా డిజిటల్ వాలెట్లోకి నిధులను బదిలీ చేసింది. రూ. 1,03,000 ఖరీదైన డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కోసం 80% నిధులను ప్రభుత్వం ఈ-రూపాయి రూపంలో అందించింది. ఈ నిధులను కేవలం ప్రభుత్వం అనుమతించిన విక్రేతల వద్ద, నిర్దేశించిన పరికరాల కోసమే వాడేలా 'ప్రోగ్రామ్' చేశారు. దీనివల్ల నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండదు.చైనాకు ధీటుగా భారత్ అడుగులుప్రపంచవ్యాప్తంగా దాదాపు 49 దేశాలు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పై ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే, కేవలం భారత్, చైనాలు మాత్రమే 'ప్రోగ్రామబుల్' (నిర్దిష్ట అవసరాలకే వాడేలా రూపొందించిన) డిజిటల్ కరెన్సీని కలిగి ఉన్నాయి. చైనాలో 20 కోట్ల మంది ఈ-యువాన్ వాడుతుండగా, భారత్ తన 80 బిలియన్ డాలర్ల సంక్షేమ బడ్జెట్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ టెక్నాలజీని వాడుతోంది. ప్రస్తుతం భారత్లో కోటి మంది ఈ పైలట్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్నట్లు అంచనా.పైలట్ ప్రాజెక్టుల విస్తరణభారతదేశం అంతటా ప్రస్తుతం 10 రకాల ప్రయోగాత్మక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మహారాష్ట్రలో వ్యవసాయ సబ్సిడీలు, సాగు నీటి పరికరాల కోసం ఈ-రూపాయి వినియోగిస్తున్నారు. గుజరాత్లో రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ఆహార పంపిణీ కోసం 15,000 మంది లబ్ధిదారులతో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. జూన్ నాటికి దీన్ని 75 లక్షల కుటుంబాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.సవాళ్లు, విశ్లేషణలుఈ-రూపాయి భవిష్యత్తుపై నిపుణులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. "నిధులు దుర్వినియోగం కాకుండా చూడటమే కాకుండా, అట్టడుగు వర్గాల రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు ఇది 'కిల్లర్ అప్లికేషన్' లాంటిది" అని డిజిటల్ కరెన్సీ సలహాదారు జాన్ కిఫ్ అభిప్రాయపడ్డారు. అయితే డబ్బును ఎలా ఖర్చు చేయాలో ప్రభుత్వం నియంత్రించడం వల్ల ప్రజలు దీని పట్ల ఆసక్తి చూపకపోవచ్చని ఎంఐటీ (MIT) నిపుణురాలు నేహా నరులా హెచ్చరించారు. ఇది వ్యక్తిగత ఆర్థిక స్వేచ్ఛకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్ ఆయిల్ షాక్’
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, హార్వర్డ్ ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సంక్షోభం 1970ల నాటి చమురు సంక్షోభం కంటే భీకరమైనదని, దీన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆయిల్ షాక్గా ఆమె అభివర్ణించారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం, ఎదురయ్యే సవాళ్లను విశ్లేషించారు.వృద్ధి రేటుపై నీలినీడలుసంక్షోభం కొనసాగే కాలాన్ని బట్టి ప్రపంచ వృద్ధి రేటు దెబ్బతింటుందని గోపీనాథ్ స్పష్టం చేశారు. ఆమె విశ్లేషణ ప్రకారం.. రాబోయే వారం రోజుల్లో సమస్య సర్దుమణిగితే ప్రపంచ వృద్ధిపై ప్రభావం తక్కువగా (సుమారు 0.3% శాతం పాయింట్లు) ఉంటుంది. ఒకవేళ ముడి చమురు ధర బ్యారెల్కు 100 డాలర్ల మార్కును చేరితే ప్రపంచ వృద్ధి రేటు ప్రస్తుత అంచనా 3.4% నుంచి 2.5%కి పడిపోయే ప్రమాదం ఉంది.భారత్పై ద్వంద్వ ప్రభావంఇరాన్ వివాదం భారత్కు ప్రతికూల అంశమే అయినప్పటికీ దేశీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఊరటనిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘ఒకవైపు ఇరాన్ వివాదం నెగిటివ్ ప్రభావం చూపుతుంటే మరోవైపు దిగుమతి సుంకాలు 50% నుంచి 10%కి తగ్గడం సానుకూల పరిణామం. ఈ రెండూ ఒకదానికొకటి భర్తీ చేసుకోవడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.5% వరకు ఉండవచ్చు’ అని ఆమె అంచనా వేశారు.ఎరువులు, ఎల్పీజీ ముప్పుకేవలం ధరల పెరుగుదలే కాకుండా, సరఫరా లేకపోవడం అనేది అసలైన సమస్య అని గోపీనాథ్ హెచ్చరించారు. ఒకవేళ హార్మూజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోతే భారత్కు ఎరువులు, ఎల్పీజీ సరఫరా నిలిచిపోతుంది. ఇది దేశీయ ఉత్పత్తిని కుంటుపరుస్తుంది. ప్రస్తుతం దీర్ఘకాలిక ఒప్పందాలు ఉన్నప్పటికీ రవాణా మార్గాలు మూసుకుపోతే సాగుపై ఎరువుల తయారీపై తీవ్ర ప్రభావం పడుతుంది.సబ్సిడీలపై కీలక వ్యాఖ్యలుపెరుగుతున్న ఇంధన ధరల భారాన్ని ప్రభుత్వం నిరవధికంగా భరించలేదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘చమురు ధరలపై సబ్సిడీలు ఇస్తూ పోతే ద్రవ్యలోటు పెరుగుతుంది. ఏదో ఒక దశలో పెరిగిన ధరలలో కొంత భాగాన్ని వినియోగదారులకు బదిలీ చేయక తప్పదు’ అని ఆమె చెప్పారు. ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ భారత దేశీయ మార్కెట్ బలంగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని గోపీనాథ్ పేర్కొన్నారు. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎంత త్వరగా ముగిస్తే అంత త్వరగా ఆర్థిక వ్యవస్థలు కుదుటపడతాయని ఆమె స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కుర్చీని బట్టి కాదు చేసే పనిని బట్టే గౌరవం -
ఆన్లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహక, నియంత్రణ చట్టాన్ని అమలు చేయడానికి వీలుగా చట్టపరమైన ప్రక్రియలు, కొత్త నిబంధనలను కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ నోటిఫై చేసింది. ఈ నిబంధనలు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటుకు కూడా వీలు కల్పిస్తాయి. ఆన్లైన్ మనీ గేమ్స్ను నిషేధిస్తూ.. ఈస్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్ను ప్రోత్సహించడం ఈ చట్టం ఉద్దేశం. చట్ట ప్రకారం ఇప్పటికే నిషేధించిన రియల్ మనీ గేమ్స్ కాకుండా చాలా వరకు ఆన్లైన్ గేమింగ్ సంస్థలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తెలిపారు.కేవలం నిర్ధిష్ట కేసుల్లోనే పర్యవేక్షణ ఉంటుందన్నారు. చట్టం కింద ఈస్పోర్ట్స్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ‘‘వీలున్నంత వరకు నియంత్రణలను సులభతరంగా ఉంచాలన్నదే మా ఉద్దేశం. మనీ గేమ్స్ కాని చాలా వరకు గేమ్స్ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ఆన్లైన్ మనీ గేమ్ లేదా ఆన్లైన్ సోషల్ గేమ్ లేదా ఈస్పోర్ట్స్లో ఏదన్నది నిర్ధారించుకోవాలంటూ ఎవరినీ బలవంతం చేయడం లేదు’’అని కృష్ణన్ పేర్కొన్నారు. కొత్త నిబంధనల్లో యూజర్ల భద్రతా సదుపాయాలను సైతం నిర్వచించినట్టు చెప్పారు.ఇదీ చదవండి: టిమ్ కుక్పై ట్రంప్ ప్రశంసల జల్లు -
భారత వాణిజ్యానికి పశ్చిమాసియా ముప్పు..
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో భారత వాణిజ్యం, స్థూల ఆర్థిక స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని నీతి ఆయోగ్ ఒక నివేదికలో తెలిపింది. కరెంటు అకౌంటు లోటు, రూపాయి మారకం విలువపై ఒత్తిడి పెరగడం వల్ల ప్రభావం పడుతుందని 2025–26 అక్టోబర్, డిసెంబర్ ట్రేడ్ వాచ్ రిపోర్టులో నీతి ఆయోగ్ ఈ విషయాలు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ఇండియా–గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) పురోగతి నెమ్మదించి, డైవర్సిఫికేషన్పై ప్రభావం పడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనేవి వన్–వే మార్గం కాదని, దీని వల్ల కొత్త మార్కెట్ లభిస్తుందని మనం అనుకున్నట్లే అటువైపు దేశాలు కూడా అలాగే ఆలోచిస్తాయని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బెరి తెలిపారు. కఠినతరమైన పరిస్థితుల్లోను భారత్ వాణిజ్య కార్యకలాపాలు మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. నివేదిక ప్రకారం.. → స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తూ గత 20 ఏళ్లుగా భారత్ సగటున 6 శాతం వృద్ధి చెందింది. → రత్నాభరణాల రంగం మిడ్–వేల్యూ ఉత్పత్తుల నుంచి అధిక విలువ చేసే ఎగుమతులవైపు మళ్లాలి. → డిజైన్ ఆధారిత తయారీ, క్లస్టర్ ఆర్అండ్డీ, జీఐ బ్రాండెడ్ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. → డ్యూటీ డ్రాబ్యాక్/ రీఫండ్స్ను క్రమబదీ్ధకరించాలి. ముడి సరుకుల వ్యయాల భారాన్ని తగ్గించేందుకు, చిన్న సంస్థల (ఎంఎస్ఎంఈ) మార్జిన్లను పెంచేందుకు, సరఫరాను మెరుగుపర్చాలి. → రుణ లభ్యతను పెంచాలి. పెట్టుబడుల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండాలి. క్రెడిట్ గ్యారంటీలు, వడ్డీ రాయితీ, సప్లై చెయిన్ ఫైనాన్స్ను మెరుగుపర్చాలి. → 2026 ఏప్రిల్–డిసెంబర్ మధ్య వ్యవధిలో ఉత్పత్తులు, సేవల వాణిజ్యం 5.3 శాతం పెరిగి 1.37 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. → మొత్తం వాణిజ్యంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద (ఎఫ్టీఏ) భాగస్వాముల వాటా పెరిగింది. → రత్నాభరణాల రంగంలో భారత్ కీలకంగా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ఎగుమతుల్లో అమెరికా, యూఏఈ, హాంకాంగ్ వాటా 73 శాతంగా ఉంది. దిగుమతుల్లో యూఏఈ, స్విట్జర్లాండ్, హాంకాంగ్ వాటా 60 శాతంగా ఉంది. -
మసులుతున్న భూమి.. మగ్గుతున్న ఆహార వ్యవస్థ!
ప్రపంచవ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత పెరుగుతోంది. దాంతో వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని, అది ఆహార ధరలను పెంచుతోందని ఐక్యరాజ్యసమితికి చెందిన రెండు కీలక సంస్థలు ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా విడుదల చేసిన ఉమ్మడి నివేదికలో హెచ్చరికలు జారీ చేశాయి. విపరీతమైన ఉష్ణోగ్రతలు ప్రపంచ ఆహార వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, దీనివల్ల వంద కోట్ల మంది ప్రజల జీవనోపాధి, ఆరోగ్యం ప్రమాదంలో పడ్డాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.గ్లోబల్ వార్మింగ్వాతావరణ మార్పుల ధాటికి పంటలు, పశువులు, మత్స్య సంపద, అడవులు విలవిలలాడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వేగవంతం కావడంతో 2025వ సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి కలిగిన మొదటి మూడు సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది.నివేదికలోని అంశాలు..ప్రధాన పంటల దిగుబడిపై ఉష్ణోగ్రత ప్రభావం తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రత 30 డిగ్రీ సెంటీగ్రేడ్లు దాటితే మొక్కల ఎదుగుదల మందగిస్తుంది.ప్రపంచ సగటు ఉష్ణోగ్రతపై పెరిగే ప్రతి ఒక డిగ్రీ సెల్సియస్ మన ప్రధాన ఆహార వనరులైన మొక్కజొన్న, వరి, సోయా, గోధుమల దిగుబడిని దాదాపు 6% మేర తగ్గిస్తుంది.మొరాకో ఉదాహరణ: ఆరేళ్ల కరువు తర్వాత అక్కడ సంభవించిన వడగాల్పుల వల్ల తృణధాన్యాల దిగుబడి 40% పడిపోయింది. ఆలివ్, సిట్రస్ తోటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.సముద్రాల్లో సెగలునేల మీద మాత్రమే కాదు, సముద్ర గర్భంలోనూ వేడి సెగలు పుడుతున్నాయి. 2024లో ప్రపంచ మహాసముద్రాల్లో 91% భాగానికి పైగా కనీసం ఒక్కసారైనా మెరైన్ హీట్ వేవ్(సముద్రపు వడగాల్పులు) సంభవించింది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గి చేపల నిల్వలు క్షీణిస్తున్నాయి. ఇది మత్స్యకారుల పాలిట శాపంగా మారుతోంది.పరిష్కారం ఏమిటి?వాతావరణ మార్పుల సమాచారాన్ని నేరుగా రైతుల చేతుల్లోకి (మొబైల్స్ ద్వారా) చేరవేయాలి. తద్వారా పంటలు వేసే సమయాన్ని, కోత సమయాన్ని సర్దుబాటు చేసుకోగలరు.ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా నష్టాన్ని కొంతవరకు నివారించవచ్చు.కేవలం తాత్కాలిక సర్దుబాట్లు సరిపోవని, గ్లోబల్ వార్మింగ్ను అరికట్టడానికి ప్రపంచ దేశాలన్నీ సమన్వయంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నివేదిక నొక్కి చెప్పింది.అన్నదాత ఆవేదన, ప్రకృతి ఆగ్రహం కలిసి ప్రపంచ ఆహార భద్రతను అంచుకు నెట్టేస్తున్నాయి. మనం ఇప్పుడే మేల్కొని పర్యావరణ హితమైన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఆహార కొరత తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరికల సారాంశం.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
నాలుగేళ్ల తర్వాత గోధుమ రైతులకు గుడ్న్యూస్
దేశ రాజధాని రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో గోధుమల సేకరణ ప్రక్రియను పునప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)ను ఆదేశించింది. 2021-22 సీజన్ నుంచి నిలిచిపోయిన ఈ ప్రక్రియను తక్షణమే తిరిగి ప్రారంభించాలని ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 24 నుంచి సేకరణ కేంద్రాలు ప్రారంభంతాజా అధికారిక సమాచారం ప్రకారం, 2026 ఏప్రిల్ 24 నుంచి ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో సేకరణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. నరేలా, నజాఫ్గఢ్ మండిలో రైతుల కోసం ప్రత్యేక సేకరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులు తమ పంటను సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే అవసరం లేకుండా ఇంటికి సమీపంలోనే కనీస మద్దతు ధరకు విక్రయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తోంది.21,000 మంది రైతులకు లబ్ధిరాజధాని ప్రాంతంలో సుమారు 29,000 హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమ సాగు జరుగుతోంది. ఏడాదికి దాదాపు 80,000 మెట్రిక్ టన్నుల గోధుమ ఉత్పత్తి అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఢిల్లీలోని సుమారు 21,000 మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. ‘రైతు సోదరులు తమ కష్టార్జితానికి సరైన ధర పొందడంతోపాటు ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.బలోపేతం కానున్న రేషన్ వ్యవస్థకేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ఢిల్లీ ప్రభుత్వం రాసిన లేఖకు తక్షణ స్పందన రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం వల్ల రైతులకు లాభం చేకూరడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లభించే ఆహార ధాన్యాల సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.అవసరమైన పత్రాలుసేకరణ కేంద్రాల్లో తమ పంటను విక్రయించాలనుకునే రైతులు ఈ క్రింది ధ్రువీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని అధికారులు సూచించారు.1. భూమి రికార్డులు2. బ్యాంక్ పాస్బుక్3. గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు వంటివి)అప్పుడు ఎందుకు సేకరణ ఆపారంటే..నాలుగేళ్ల క్రితం (2021-22 నుంచి) ఢిల్లీలో గోధుమల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడానికి ప్రధానంగా కొన్ని పరిపాలనాపరమైన, క్షేత్రస్థాయి కారణాలు ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా ఢిల్లీలో ఎఫ్సీఐ నేరుగా కొనుగోలు చేసే కేంద్రాల సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల రైతులు తమ పంటను అమ్ముకోవడానికి పొరుగు రాష్ట్రాలైన హరియాణా, ఉత్తరప్రదేశ్ మండీలకు వెళ్లాల్సి వచ్చేది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొనుగోలు ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పనపై సరైన ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఈ ప్రక్రియ స్తంభించిపోయింది.2021-22 సమయంలో బహిరంగ మార్కెట్లో గోధుమలకు మంచి ధర లభించడం, ఎగుమతులకు అవకాశం ఉండటంతో రైతులు కూడా ప్రభుత్వ కేంద్రాల వైపు పెద్దగా మొగ్గు చూపలేదు. దీన్ని సాకుగా చూపి అధికారులు కొనుగోలు కేంద్రాలను క్రమంగా తగ్గించారు. రాజధాని ప్రాంతంలో పట్టణీకరణ పెరగడం వల్ల సాగు భూమి తగ్గుతోందన్న కారణంతో సేకరణ ప్రాధాన్యతను తగ్గించారు. కానీ, ఇప్పటికీ సుమారు 29,000 హెక్టార్లలో సాగు జరుగుతూనే ఉంది. ఈ కారణాల వల్ల గత నాలుగేళ్లుగా రైతులు తమ పంటను మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ సేకరణ ప్రారంభించడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా లభించనుంది.ఇదీ చదవండి: టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు! -
టిఫిన్, కర్రీ ప్యాకెట్ ధర 50 శాతం పెంపు!
ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సగటు వేతన జీవి పోరాటం అంతా ఆ నాలుగు మెతుకుల కోసమే. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సామాన్యుడికి భారంగా మారుతోంది. అంతర్జాతీయంగా ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మన కర్రీ పాయింట్లలో కరీ ప్యాకెట్ ధర పెరుగుతుంది. గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకితే రోడ్డు పక్కన బండి మీద ఇడ్లీ ధర మారుతుంది. ధరలు పెరిగిన ప్రతిసారీ సర్దుకుపోవడం సామాన్యుడికి అలవాటైపోయింది. కానీ ఆ సర్దుబాటు ఇప్పుడు అతని ఆకలిని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది.వ్యాపారులకు ఖర్చులు పెరిగాయన్నది నిజమే కావచ్చు, కానీ పరిస్థితులు చక్కబడ్డాక పెంచిన రేట్లను తగ్గించే మనసు మాత్రం ఏ వ్యాపారికీ రాదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే.. ఒక పక్క కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని సాకులు చెబుతూ ఉద్యోగి జీతంలో వందల రూపాయల పెంపునకు కూడా వెనకాడుతుంటే.. అదే కంపెనీల యజమానులు మాత్రం కుబేరుల జాబితాలో పోటీ పడుతున్నారు. ఈ అంతరం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక అశాంతికి పునాది.ఆకాశమే హద్దుగా ధరలుఒకప్పుడు రూ.20 ఉన్న కర్రీ ప్యాకెట్ నేడు రూ.30కి(కొన్ని ప్రదేశాల్లో మారుతుంటుంది) చేరింది. అంటే ఒక్కసారిగా 50 శాతం పెరుగుదల. కేవలం కర్రీ పాయింట్లే కాదు, టిఫిన్ సెంటర్లలో రూ.30 ఉండే ప్లేట్ ఇడ్లీ నేడు రూ.45కి చేరింది. ముఖ్యంగా హైదరాబాద్లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి ఐటీ కారిడార్లలో ఈ ధరల పెరుగుదల మరింత తీవ్రంగా ఉంది. గ్యాస్ సిలిండర్ ధరలు, వంట నూనెలు, కూరగాయల ధరల పెరుగుదలను సాకుగా చూపిస్తూ అటు బడా హోటళ్లు, ఇటు వీధి వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు.అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడి, ముడి చమురు లేదా గ్యాస్ ధరలు తగ్గినా.. పెంచిన ఈ ధరలను మళ్లీ తగ్గించడం అనేది మన మార్కెట్ సంస్కృతిలో దాదాపు అసాధ్యం.పెరగని జీతాలు.. కార్పొరేట్ లాభాలువస్తువుల తయారీ ఇన్పుట్ ఖర్చులు పెరిగాయని సాకు చూపుతున్న కంపెనీలు ధరల భారమంతా వినియోగదారుడిపైనే మోపుతున్నాయి. కానీ, అదే నిష్పత్తిలో తమ దగ్గర పనిచేసే ఉద్యోగుల జీతాలను పెంచుతున్నాయా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. వార్షికంగా ధరల పెరుగుదల 30-50 శాతం ఉంటే సగటు వేతన జీవి జీతాల పెరుగుదల మాత్రం 5 నుంచి 8 శాతం లోపే ఉంటోంది. మరోవైపు, ఇన్పుట్ ఖర్చులు పెరిగాయని వాపోతున్న కంపెనీల యజమానులు మాత్రం ఫోర్బ్స్ వంటి ప్రపంచ ధనవంతుల జాబితాలో తమ ర్యాంకులను మెరుగుపరుచుకుంటున్నారు.సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై అధిక శాతం ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతుంటే అది సామాజిక అశాంతికి దారితీస్తుంది.పరిష్కార మార్గాలుప్రభుత్వాలు చేయాల్సినవి..ధరల నియంత్రణ కమిటీలు: నిత్యావసర వస్తువుల ధరలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం ఉండాలి. ఇన్పుట్ ఖర్చులు తగ్గినా ధరలు తగ్గించని సిండికేట్లపై చర్యలు తీసుకోవాలి.వేతన సవరణ చట్టం: కేవలం కనిష్ట వేతనం మాత్రమే కాకుండా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రైవేటు రంగంలోనూ కనీస వార్షిక ఇంక్రిమెంట్లు ఉండేలా నిబంధనలు తీసుకురావాలి.ప్రజా రవాణా పటిష్ఠం: సామాన్యుడి జేబుకు చిల్లు పడే మరో ప్రధానాంశం రవాణా. ప్రజారవాణాను చౌకగా అందుబాటులోకి తెస్తే కొంత ఊరట లభిస్తుంది.ప్రజలు చేయాల్సినవి..ఆర్థిక క్రమశిక్షణ: అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ సంస్కృతికి దూరంగా ఉండటం శ్రేయస్కరం.నైపుణ్యాభివృద్ధి: మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం జీతంపైనే ఆధారపడకుండా అదనపు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలి.వినియోగదారుల హక్కులు: అన్యాయంగా ధరలు పెంచే వ్యాపార సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండి వినియోగదారుల ఫోరమ్ ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి.అభివృద్ధి అంటే కేవలం జీడీపీ అంకెలు పెరగడం కాదు.. సగటు సామాన్యుడి కొనుగోలు శక్తి పెరగడం. సంపద పంపిణీలో సమతుల్యత లేకపోతే అది దేశ పురోగతికి ఆటంకమవుతుంది. ఇప్పటికైనా పాలకులు, పారిశ్రామికవేత్తలు సామాన్యుడి బతుకు బండిని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్.. -
అనిశ్చితి సమయాల్లో ‘వెయిట్ అండ్ వాచ్’
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా గొలుసులో అంతరాయాలు వంటి అనిశ్చిత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుసరిస్తున్న వేచి చూసే ధోరణి అత్యంత కీలకమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇటీవల అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానంలో చురుకైన మార్పులు చేయడం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రసంగ సారాంశాన్ని తాజాగా ఆర్బీఐ తన వెబ్సైట్లో అధికారికంగా అందుబాటులో ఉంచింది.తటస్థ వైఖరితోనే వెసులుబాటుఆర్బీఐ గవర్నర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని ద్రవ్య విధాన సమీక్షల్లో ఆర్బీఐ తటస్థ వైఖరినే కొనసాగిస్తోంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణం, వృద్ధి గమనానికి అనుగుణంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్కు అవసరమైన సౌలభ్యాన్ని కల్పిస్తుంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మా విధానం పూర్తిగా డేటా ఆధారితంగా ఉంటుంది. ప్రమాదాల సమతుల్యతను మేము నిరంతరం అంచనా వేస్తున్నాం. అందుకే ప్రస్తుతానికి వేచి చూడటం అనే పంథాను ఎంచుకున్నాం’ అని ఆయన తెలిపారు.అంతర్జాతీయ సవాళ్లుపశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ సవాళ్లపై స్పందిస్తూ సరఫరా వ్యవస్థలో తలెత్తే అంతరాయాలు ద్రవ్యోల్బణంపై చూపే ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలని మల్హోత్రా హెచ్చరించారు. సరఫరా అంతరాయాలు దీర్ఘకాలం కొనసాగి అవి ఇతర రంగాలకు వ్యాపించి ద్రవ్యోల్బణ అంచనాలను పెంచితే అది ఆందోళన కలిగిస్తుంది. అటువంటి సమయంలో కఠిన నిర్ణయాలు తప్పవని ఆయన సూచించారు.ప్రపంచ వృద్ధిలో అగ్రగామిగా భారత్గత దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన వృద్ధిని వివరిస్తూ చైనా వంటి అగ్ర దేశాల కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచిందని మల్హోత్రా ప్రకటించారు.భారత సగటు వార్షిక వృద్ధి: 6.1%చైనా: 5.6%ఇండోనేషియా: 4.2%ప్రపంచ ఆర్థిక వృద్ధి: 3.2%భారతదేశ వృద్ధికి అవసరమైన సులభతర పర్యావరణ వ్యవస్థను అందించడంలో రిజర్వ్ బ్యాంక్ తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తోందన్నారు. భవిష్యత్తులోనూ స్థిరత్వమే లక్ష్యంగా ముందడుగు వేస్తామని గవర్నర్ తెలిపారు.ఇదీ చదవండి: చైనాలో రివర్స్ మైగ్రేషన్.. -
నిదానించిన మౌలిక రంగం
న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల పనితీరు మార్చి నెలలో నిదానించింది. ఎనిమిది రంగాల్లో ఉత్పత్తి క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 0.4 శాతం తగ్గింది. ఐదు నెలల్లో మౌలిక రంగం ఉత్పత్తి తగ్గడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా బొగ్గు, ముడి చమురు, ఎరువులు, విద్యుదుత్పత్తి క్షీణించడం మొత్తం మీద పనితీరును పరిమితం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 8 మౌలిక రంగాల పనితీరు నికరంగా 2.8% పెరగడం గమనార్హం. 2025–26 మొత్తం మీద ఈ రంగాలు 2.6% వృద్ధిని నమోదు చేశాయి. 2024–25లో వృద్ధి 4.5%తో పోల్చితే చెప్పుకోతగ్గ స్థాయిలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. రిఫైనరీ ఉత్పత్తుల తయారీ 0.1%, స్టీల్ ఉత్పత్తి 2.2%, సిమెంట్ ఉత్పత్తి 4% చొప్పున మార్చి నెలలో తగ్గాయి. సహజ వాయువు ఉత్పత్తి మాత్రం పెరిగింది. 4 రంగాల ఉత్పత్తి క్షీణించడంతో, ఐదు నెలల్లో తొలిసారి కీలక మౌలిక రంగాల పనితీరు తగ్గినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో యుద్ధంతో ముడి సరుకుల సరఫరా తగ్గడం ఎరువుల ఉత్పత్తిని ప్రభావితం చేసినట్టు చెప్పారు. దీంతో మార్చి నెలలో పారిశ్రామిక రంగం (ఐఐపీ) వృద్ధి 1–2%కి తగ్గిపోవచ్చని నాయర్ అంచనా వేశారు. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి 5.2%గా ఉంది. -
ఎన్బీఎఫ్సీ శాఖల విస్తరణపై ఆర్బీఐ కొత్త రూల్స్
దేశంలోని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) కార్యకలాపాలను మరింత పారదర్శకంగా, పటిష్టంగా మార్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక అడుగు వేసింది. ఎన్బీఎఫ్సీల శాఖల ప్రారంభం, విస్తరణ, మూసివేతపై సవరించిన సరికొత్త నిబంధనలను ఇటీవల జారీ చేసింది. ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు - బ్రాంచ్ ఆథరైజేషన్) ఆదేశాలు, 2025’ పేరుతో వెలువడిన ఈ మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.డిపాజిట్లు స్వీకరించే ఎన్బీఎఫ్సీలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఇన్వెస్ట్మెంట్ అండ్ క్రెడిట్ కంపెనీలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్బీఐ చట్టం-1934, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ చట్టం-1987 లోని అధికారాలను ఉపయోగించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది.శాఖల విస్తరణకు షరతులు ఇవే..కొత్త నిబంధనల ప్రకారం, ఎన్బీఎఫ్సీల ఆర్థిక స్తోమతను బట్టి వాటి విస్తరణ పరిధిని ఆర్బీఐ నిర్ణయించింది.రూ.50 కోట్ల వరకు నికర యాజమాన్య నిధులు (ఎన్ఓఎఫ్) కలిగి ఉండి, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న డిపాజిట్ తీసుకునే ఎన్బీఎఫ్సీలు తమ రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్న రాష్ట్రంలో మాత్రమే శాఖలను తెరవాలి.రూ.50 కోట్లకు పైగా నికర నిధులు ఉండి ‘AA’ లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న సంస్థలు దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించుకోవడానికి అనుమతి ఉంటుంది.‘ప్రవాహ్’ పోర్టల్ ద్వారా దరఖాస్తుశాఖల విస్తరణ కోసం ఎన్బీఎఫ్సీలు ఆర్బీఐకి ముందస్తు సమాచారం అందించాలి. ఇందుకోసం ప్రవాహ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసిన 30 రోజులలోపు ఆర్బీఐ నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోతే, ఆయా సంస్థలు తమ విస్తరణ ప్రణాళికలతో ముందుకు వెళ్లవచ్చు. అయితే, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు దేశంలో శాఖలు తెరిచే ముందు నేషనల్ హౌసింగ్ బ్యాంక్కు సమాచారం ఇవ్వాలని, విదేశాల్లో శాఖలు తెరవడానికి వీలు లేదని ఆర్బీఐ పేర్కొంది.గోల్డ్ లోన్ సంస్థలపై ప్రత్యేక నిఘాబంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలు ఇచ్చే ఎన్బీఎఫ్సీ-ఐసీసీలపై ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది.1,000 కంటే ఎక్కువ శాఖలను తెరవాలనుకునే గోల్డ్ లోన్ కంపెనీలు తప్పనిసరిగా ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి.తాకట్టు పెట్టిన బంగారం భద్రత కోసం తగినంత నిల్వ సామర్థ్యం(స్ట్రాంగ్ రూమ్స్), పటిష్టమైన భద్రతా సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి.శాఖల మూసివేతకు మూడు నెలల నోటీసుఏదైనా కారణంతో శాఖలను మూసివేయాలనుకుంటే వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కనీసం మూడు నెలల ముందుగా స్థానిక వార్తాపత్రికలలో పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. ఈ సమాచారాన్ని ఆర్బీఐ లేదా ఎన్హెచ్బీకి తెలియజేయడం తప్పనిసరి. అలాగే, విదేశాల్లో రిప్రెజెంటేటివ్ కార్యాలయాలను తెరవడానికి ఆర్బీఐ అనుమతి అవసరం. ఇవి కేవలం పరిశోధన, సమన్వయ కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కావాలని, ఎటువంటి నిధుల లావాదేవీలు జరపకూడదని నిబంధనల్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
చైనాలో రివర్స్ మైగ్రేషన్..
దశాబ్దాలుగా చైనా ఆర్థిక శక్తిగా ఎదగడంలో కీలకంగా నిలిచిన వలస కార్మిక వ్యవస్థ ఇప్పుడు అనూహ్య మలుపు తిరుగుతోంది. నగరాల్లోని ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగాల్లో పనిచేస్తూ దేశ వృద్ధిని పరుగులు పెట్టించిన కోట్లాది మంది కార్మికులు ఇప్పుడు తిరుగుముఖం పడుతున్నారు. ఇది కేవలం ఒక సామాజిక మార్పు మాత్రమే కాదు, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో వస్తున్న భారీ నిర్మాణాత్మక సంక్షోభానికి సంకేతమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఎందుకు ఈ తిరుగు ప్రయాణం?చైనాలో సుమారు 300 మిలియన్ల (30 కోట్లు) వలస కార్మికులు ఉన్నారు. గతంలో గ్రామాల నుంచి నగరాలకు వెళ్లడం, ఎక్కువ సంపాదించి ఇంటికి డబ్బు పంపడం ఒక నిరంతర ప్రక్రియగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమూనా బీటలు వారుతోంది. దీనికి ప్రధాన కారణాలు..చైనా జీడీపీలో దాదాపు 25-30% వాటా కలిగిన స్థిరాస్తి రంగం కుప్పకూలడం నిర్మాణ కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది. పెద్ద ప్రాజెక్టులు నిలిచిపోవడంతో వేలాది మందికి పనుల్లేకుండా పోయాయి.అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, అమెరికా వంటి దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతల వల్ల చైనా ఫ్యాక్టరీలలో నియామకాలు భారీగా తగ్గాయి.నగరాల్లో జీవన వ్యయం పెరగడం, దానికి తగ్గట్టుగా వేతనాలు పెరగకపోవడంతో వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.నైపుణ్యం లేని వారికి ముప్పుచైనా ఇప్పుడు తన ఆర్థిక వ్యవస్థలో సాంకేతికతను అమలు చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, హై-టెక్ మాన్యుఫ్యాక్చరింగ్పై ప్రభుత్వం దృష్టి సారించింది. ‘పాత పద్ధతుల్లో పనిచేసే కార్మికులకు కొత్త టెక్నాలజీ రంగంలో అవకాశాలు దొరకడం లేదు. ముఖ్యంగా వృద్ధ కార్మికులు ఈ మార్పునకు తట్టుకోలేక తిరిగి వ్యవసాయం వైపు లేదా అసంఘటిత రంగాల వైపు మొగ్గు చూపుతున్నారు’ అని నిపుణులు చెబుతున్నారు.సవాళ్లు.. ఆందోళనచైనా ప్రభుత్వం గతంలో రవాణా రాయితీలు, నగరాల్లో నివాస అనుమతులు సడలించడం వంటి చర్యలు చేపట్టింది. కానీ, సమస్య ఇప్పుడు రవాణా కాదు, ఉద్యోగాల కల్పన. పరిశ్రమల్లో నిత్యం మార్పులొస్తున్నాయి. కానీ శ్రామిక శక్తి పాత నైపుణ్యాలతోనే ఉంది. ఈ స్కిల్ గ్యాప్ (నైపుణ్యాల అంతరం)ను పూరించడం ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఒకవేళ ఈ మిలియన్ల కొద్దీ ప్రజలకు సరైన ఉపాధి లభించకపోతే అది కేవలం ఆర్థిక మందగమనానికే కాదు, రాజకీయ అస్థిరతకు కూడా దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: డిమాండ్ భళా.. నిర్మాణాలు డీలా! -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభం రూ. 20,351 కోట్లు
ముంబై: దేశీ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 20,351 కోట్ల నికర లాభం ప్రకటించింది. అంతక్రితం క్యూ4లో నమోదైన రూ. 18,835 కోట్లతో పోలిస్తే ఇది 8 శాతం అధికం. సమీక్షాకాలంలో మొత్తం ఆదాయం రూ. 1,16,920 కోట్లుగా నిల్చింది. క్రితం క్యూ4లో ఇది రూ. 1,20,269 కోట్లు. వడ్డీ ఆదాయం రూ. 86,779 కోట్ల నుంచి రూ. 87,182.50 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుపై రూ. 13 చొప్పున తుది డివిడెండును కంపెనీ ప్రకటించింది. గతేడాది ఆగస్టు 11న ప్రకటించిన రూ. 2.50 మధ్యంతర డివిడెండుతో కలిపి మొత్తం రూ. 15.5 మేర డివిడెండు ఇచ్చినట్లవుతుందని సంస్థ తెలిపింది. క్యూ1లో చిన్న రుణగ్రహీతలపై పశ్చిమాసియా ప్రభావం.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల చిన్న, మధ్య తరహా రుణగ్రహీతలపై ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభావం పడొచ్చని బ్యాంక్ సీఈవో, ఎండీ శశి జగదీశన్ తెలిపారు. యుద్ధం ముగిశాక పరిస్థితి చక్కబడటానికి రెండు నెలలు పట్టొచ్చని వివరించారు. అయితే, అసెట్ క్వాలిటీపరంగా ప్రతికూల పరిస్థితులేమీ లేవని చెప్పారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ శాఖ బాండ్ల మిస్–సెల్లింగ్ వ్యవహారం నేపథ్యంలో నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి అకస్మాత్తుగా రాజీనామాపై వ్యాఖ్యానించేందుకు జగదీశన్ నిరాకరించారు. మిస్–సెల్లింగ్ వ్యవహారంపై విచారణ జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే, విచారణ నివేదిక ఎప్పట్లోగా రావొచ్చనేది కూడా చెప్పడానికి నిరాకరించారు. దర్యాప్తులో భాగంగా భారీ స్థాయిలో డేటాను పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చక్రవర్తి రాజీనామా అనంతరం బ్యాంకు పట్ల సానుకూలంగా వ్యవహరించడంపై ప్రభుత్వం, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాత్కాలికంగా చైర్పర్సన్గా ఉన్న కేకి మిస్త్రీ పూర్తి కాలం కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు కోరుకుంటున్నామని, అయితే నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ (ఎన్ఆర్సీ) ముందు ఈ ప్రతిపాదన ఉంచడానికి ముందుగా నిర్దిష్ట ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని వివరించారు. జగదీశన్ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనున్న నేపథ్యంలో ఆయన పునర్నియామకం విషయాన్ని ఎన్ఆర్సీ పరిశీలిస్తుందని, ఇందుకు నిర్దిష్ట కాలవ్యవధిని చెప్పలేమని డిప్యుటీ ఎండీ కైజాద్ భరూచా తెలిపారు. ఇతర విశేషాలు.. → పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) రూ. 4,95,463 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 4,70,916 కోట్లు. → స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4లో నికర లాభం రూ. 19,221 కోట్లకు చేరింది. క్రితం క్యూ4లో ఇది రూ. 17,616 కోట్లు. మొత్తం ఆదాయం రూ. 89,488 కోట్ల నుంచి రూ. 89,809 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు రూ. 62,951 కోట్ల నుంచి రూ. 62,006 కోట్లకు తగ్గాయి. → వడ్డీ ఆదాయం రూ. 77,460 కోట్ల నుంచి రూ. 76,610 కోట్లకు నెమ్మదించింది. → స్థూల మొండిబాకీల నిష్పత్తి 2025 మార్చి క్వార్టర్లో 1.33 శాతంగా, డిసెంబర్ క్వార్టర్లో 1.24 శాతంగా ఉండగా ప్రస్తుతం 1.15 శాతానికి తగ్గింది. నికర మొండిబాకీల నిష్పత్తి 0.38 శాతంగా ఉంది. క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి 19.7 శాతంగా ఉంది. → 2026 మార్చి 31 నాటికి 9,689 శాఖలు, 21,172 ఏటీఎంలు ఉన్నాయి. 2025 మార్చి 31న 9,455 శాఖలు, 21,139 ఏటీఎంలు ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య 2,14,521 నుంచి 2,11,178కి తగ్గింది. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
సాక్షి, ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డియర్ అలవెన్స్ను 2 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో DA పెంపు ఉద్యోగులకు తక్షణ ఉపశమనంగా చెప్పొచ్చు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది. ఒకవైపు ఉద్యోగ సంఘాలు 8వ వేతన కమిషన్ కింద వేతన నిర్మాణంలో పెద్ద మార్పులు కోరుతూ.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83గా పెంచాలని, కనీస బేసిక్ పే రూ.18,000 నుంచి రూ.69,000కి పెంచాలని ప్రతిపాదించాయి. అలాగే, వేతన లెక్కల్లో ఆధారపడిన తల్లిదండ్రులను కూడా ‘కుటుంబం’ నిర్వచనంలో చేర్చాలని.. వేతన వ్యత్యాసానికి పరిమితి పెట్టాలని, ద్రవ్యోల్బణానికి అనుసంధానంగా అలవెన్సులు ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు, కేంద్రం సముద్ర రవాణా రంగానికి కూడా పెద్ద ఊరట ఇచ్చింది. సావరిన్ మారిటైం ఫండ్ పేరుతో రూ.13,000 కోట్ల నిధిని కేబినెట్ మీటింగ్లో ఆమోదించింది. దీని ద్వారా భారత్ నుంచి బయలుదేరే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇన్సూరెన్స్ అందించనుంది. ఇది సముద్ర రవాణా రంగానికి భద్రతా పరంగా కీలకంగా మారనుంది.గ్రామీణ రహదారి అభివృద్ధి కోసం కూడా కేంద్ర మంత్రి మండలి మరో నిర్ణయం తీసుకుంది. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY)ను 2028 వరకు పొడిగించింది. అదనంగా రూ.3,000 కోట్ల కేటాయింపును ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుపడటానికి ఇది తోడ్పడనుంది. -
ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి ఇదేనా?
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హార్మూజ్ జలసంధి పునరుద్ధరణ, ఇరాన్ అణు నిల్వలపై చైనా వైఖరి కీలకంగా మారనుంది.హార్మూజ్ జలసంధి పునరుద్ధరణప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సంతోషంగా ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ‘హార్మూజ్ జలసంధి తెరిచినందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఎంతో సానుకూలంగా ఉన్నారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గడం వల్ల ప్రపంచ వాణిజ్యానికి, ముఖ్యంగా చైనా ఇంధన అవసరాలకు భారీ ఊరట లభించనుంది. బీజింగ్ నుంచి వస్తున్న ఈ సానుకూల సంకేతాలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఆశాభావాన్ని నింపుతున్నాయి.ఇరాన్ అణు నిల్వలు - చైనా వ్యూహాత్మక పాత్రఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ యురేనియం. తాజా దౌత్య చర్చల ప్రకారం.. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించడంలో లేదా వాటిని తన ఆధీనంలోకి తీసుకోవడంలో చైనా మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే అటు వాషింగ్టన్, ఇటు టెహ్రాన్ మధ్య నేరుగా ఘర్షణ పడకుండా సమస్యను పరిష్కరించే మార్గం సుగమం అవుతుంది. దీనివల్ల గ్లోబల్ పాలిటిక్స్లో చైనా ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ చైనా పర్యటనత్వరలోనే తాను చైనాలో పర్యటించనున్నట్లు వెల్లడించిన ట్రంప్, ఈ పర్యటన ప్రత్యేకమైనదని, చారిత్రాత్మకమైనదన్నారు. ‘షీ జిన్పింగ్తో భేటీ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సమావేశం ద్వారా ఎన్నో అద్భుతాలు సాధించబోతున్నాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇరాన్ అణు ఒప్పందంపై ప్రతిష్టంభనను తొలగించడానికి చైనాను ఒక బఫర్గా వాడుకోవాలని అమెరికా భావిస్తోంది. ఒకవేళ ఇరాన్ తన యురేనియం నిల్వలను చైనాకు తరలించడానికి అంగీకరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: గోల్డ్ ధర.. గుండె దడ! -
అణు కార్యక్రమాన్ని నిలిపేసేందుకు ఇరాన్ అంగీకారం
ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిరవధికంగా నిలిపివేయడానికి అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అయితే, దీనికి ప్రతిఫలంగా అమెరికాలో స్తంభింపజేసిన ఇరాన్ నిధులను మాత్రం విడుదల చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ వారాంతంలో జరగనున్న శాంతి చర్చల అనంతరం తుది ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.డబ్బు లేదు.. కేవలం శాంతి మాత్రమేట్రంప్ తన విలక్షణ శైలిలో ఈ ఒప్పందంపై స్పందిస్తూ, టెహ్రాన్తో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ప్రకటించారు. ఈ ఒప్పందంలోని ప్రధాన ముఖ్యాంశాలు ఇవే..యురేనియంతో అణు కార్యక్రమాన్ని ఇరాన్ పూర్తిగా నిలిపివేయనుంది. ఇది కేవలం 10 లేదా 20 ఏళ్ల కాలపరిమితితో కూడుకున్నది కాదని, అపరిమిత కాలం పాటు అమల్లో ఉంటుందని ట్రంప్ నొక్కి చెప్పారు.ఇరాన్కు చెందిన సుమారు 20 బిలియన్ డాలర్ల స్తంభింపజేసిన ఆస్తులను అమెరికా విడుదల చేస్తుందన్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు.చర్చలు తుది దశకు చేరినప్పటికీ ఇరాన్పై అమెరికా విధించిన నావికాదళ దిగ్బంధనం కొనసాగుతుందని, ఒప్పందం ఖరారైన తర్వాతే దీనిపై నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.కీలక పాత్రలో ఈజిప్ట్, టర్కీగత కొన్ని వారాలుగా తెర వెనుక జరిగిన దౌత్య ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో ఈజిప్ట్, టర్కీ దేశాల మద్దతుతో జరిగిన పరోక్ష చర్చలు ఈ సానుకూల ఫలితానికి దారితీశాయి. ఒప్పందం ఖరారైతే శాంతి చర్చల ముగింపు కోసం తాను స్వయంగా పాకిస్థాన్ సందర్శించే అవకాశం ఉందని కూడా ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ‘చాలా ప్రధాన అంశాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరగాలి. ఇరాన్ తన అణు నిల్వలను అప్పగించడానికి సిద్ధంగా ఉంది’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.ఇరాన్ స్పందనఅమెరికా అధ్యక్షుడి ప్రకటనలపై ఇరాన్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం హార్మూజ్ జలసంధి ప్రస్తుతం తెరిచే ఉంటుందని టెహ్రాన్ ధ్రువీకరించింది. ఇది ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడానికి ఒక సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! -
దేశంలో తొలిసారి ఇంటింటి ఆదాయ సర్వే..
దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జాతీయ గృహ ఆదాయ సర్వే (NHIS) నిర్వహించనున్నట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) ప్రకటించింది. 2026 ఏప్రిల్ నుంచి 2027 మార్చి వరకు ఏడాది పాటు ఈ భారీ సర్వే ప్రక్రియ కొనసాగనుంది.రుజువు-ఆధారిత విధాన రూపకల్పనే లక్ష్యంగణాంక విశ్లేషణలో ఇప్పటివరకు ఉన్న లోటుపాట్లను భర్తీ చేస్తూ, వాస్తవిక డేటా ఆధారంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ‘రుజువు-ఆధారిత విధాన రూపకల్పనను బలోపేతం చేసేందుకు, ప్రజల వాస్తవ ఆదాయాలను లెక్కించేందుకు ఈ సర్వే చేపడుతున్నాం’ అని మంత్రిత్వ శాఖ తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.సర్వే ఎలా చేస్తారంటే.. నమూనా సేకరణ శాస్త్రీయ పద్ధతిలో చేస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 4.5 లక్షల కుటుంబాలను ఎంపిక చేసి సమాచారాన్ని సేకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలు, ఆదాయ వనరులు, ఖర్చు చేసే విధానాలపై ఈ సర్వే ద్వారా సమగ్ర విశ్లేషణ చేస్తారు. వినియోగదారుల ధరల సూచిక (CPI) సవరణకు, జాతీయ ఖాతాల తయారీకి, పేదరిక నిర్మూలన విశ్లేషణకు ఈ డేటా వెన్నెముకగా నిలుస్తుంది. ‘గృహ ఆదాయాలను నేరుగా సర్వే చేయడం ద్వారా ఆదాయ అసమానతలు, ఉత్పత్తి వనరుల మధ్య ఉన్న వ్యత్యాసాలను లోతుగా విశ్లేషించే అవకాశం కలుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.ప్రపంచ దేశాల సరసన భారత్ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మన పొరుగు దేశాలైన చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా గృహ ఆదాయ డేటాను సేకరిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఈ విభాగంలో చేరడం ద్వారా ఆర్థిక గణాంకాలలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోనుంది.ఇప్పటికే ముగిసిన 'ప్రీ-టెస్టింగ్'ఈ ప్రతిష్టాత్మక సర్వే కోసం ఐఎంఎఫ్ (IMF) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుర్జిత్ భల్లా నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు, సర్వే ప్రశ్నావళి సామర్థ్యాన్ని పరీక్షించడానికి 2025 ఆగస్టు 4 నుండి 8 వరకు ముందస్తు పరీక్షలు (Pre-testing) నిర్వహించారు.హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు సహా 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఈ ట్రయల్స్ జరిగాయి. ధనిక, పేద వర్గాలను కవర్ చేసేలా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ క్షేత్రస్థాయి కసరత్తులు పూర్తి చేశారు. ప్రభుత్వం చేపట్టబోయే ఈ సరికొత్త సర్వే ద్వారా సామాజిక-ఆర్థిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: పండుగ పసిడి.. తిరుగులేని రాబడి!NSO, MoSPI is undertaking India’s first National Household Income Survey (NHIS) from April 2026 to March 2027, capturing income to strengthen evidence-based policy formulation.Visit MoSPI’s official website for related updates and official information: https://t.co/V2xm331pY2… pic.twitter.com/1mmaukq88v— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) April 17, 2026 -
దేశంలో నిలిచిన బంగారం, వెండి దిగుమతులు!
దేశీయ బులియన్ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారిక అనుమతుల్లో జాప్యం కారణంగా భారతీయ బ్యాంకులు విదేశీ సరఫరాదారుల నుంచి బంగారం, వెండి దిగుమతి ఆర్డర్లను నిలిపివేశాయి. ఇప్పటికే దిగుమతి అయిన టన్నుల కొద్దీ విలువైన లోహాలు కస్టమ్స్ క్లియరెన్స్ లేక విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయాయి. ఈ పరిణామం అటు ఆభరణాల రంగాన్ని, ఇటు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.అసలేం జరిగింది?ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. బంగారం, వెండి దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఉన్న బ్యాంకుల జాబితాను ఇందులో పేర్కొంటుంది. గత ఏప్రిల్ 2025లో జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ ప్రారంభంలోనే కొత్త ఉత్తర్వులు వస్తాయని బ్యాంకులు ఆశించినప్పటికీ ఇప్పటివరకు డీజీఎఫ్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ప్రస్తుతం సుమారు 5 టన్నుల బంగారం, 8 టన్నుల వెండి కస్టమ్స్ వద్ద క్లియరెన్స్ కోసం ఉంది.‘మునుపటి సరుకులే క్లియర్ కానప్పుడు కొత్త ఆర్డర్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే బ్యాంకులు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి’ అని ముంబైకి చెందిన ఒక బులియన్ డీలర్ వ్యాఖ్యానించారు.సరఫరా కొరత - అక్షయ తృతీయపై ప్రభావం?ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా, అతిపెద్ద వెండి కొనుగోలుదారుగా ఉన్న భారత్.. తన అవసరాల కోసం పూర్తిగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతుంది. ప్రస్తుత దిగుమతుల నిలిపివేత వల్ల మార్కెట్లో భారీ సరఫరా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ కార్యదర్శి సురేంద్ర మెహతా స్పందిస్తూ, ‘త్వరలోనే అక్షయ తృతీయ రాబోతోంది. ఈ సమయంలో దిగుమతులు పునప్రారంభం కాకపోతే మార్కెట్లో ప్రీమియంలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి’ అని కోరారు.వాణిజ్య లోటును తగ్గించే వ్యూహమా?మరోవైపు, ఈ జాప్యం వెనుక ప్రభుత్వం ఆర్థిక వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆసియా కరెన్సీల్లో ఈ ఏడాది రూపాయి బలహీనంగా ఉంది. బంగారం దిగుమతులు తగ్గితే డాలర్లకు డిమాండ్ తగ్గి, రూపాయి విలువ స్థిరపడే అవకాశం ఉంది. ఇరాన్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. దీనివల్ల దేశ వాణిజ్య లోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ లోటును సమతుల్యం చేయడానికి విలాస వస్తువులైన బంగారం, వెండి దిగుమతులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నియంత్రిస్తుండవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి! -
భారీగా వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతులు మార్చిలో భారీగా పెరిగాయి. 11,73,168 టన్నులుగా ఉన్నట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) తెలిపింది. గతేడాది మార్చి నెలలో దిగుమతులు 10,45,281 టన్నులతో పోల్చితే 12 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనెల ధరలు (ఎడిబుల్ ఆయిల్) పెరగడం, రవాణా చార్జీలు కూడా అధికమైనందున, రానున్న నెలల్లో దిగుమతులు తగ్గొచ్చని ఎస్ఈఏ పేర్కొంది. అంతర్జాతీయంగా నూనెల ధరలు తగ్గుముఖం పట్టడం లేదంటే రూపాయి విలువ బలోపేతం అయ్యే వరకు దిగుమతులు పెరగకపోవచ్చని ఎస్ఈఏ అంచనా. దేశీయంగా నూనె గింజల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా దిగుమతులను తటస్థం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించొచ్చని పేర్కొంది. → అత్యధికంగా ముడి పామాయిల్ (శుద్ధి చేయని) దిగుమతులు దాదాపు రెట్టింపు స్థాయిలో 6,73,965 టన్నులుగా ఉన్నాయి. 2025 మార్చిలో పామాయిల్ దిగుమతులు 3,43,949 టన్నులుగా ఉండడం గమనార్హం. → నాన్ ఎడిబుల్ నూనెల దిగుమతులు మాత్రం క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 27,742 టన్నుల నుంచి 13,401 టన్నులకు తగ్గాయి. నాన్ ఎడిబుల్ అంటే ఆహార వినియోగానికి పనికిరానివి. వీటిల్లో మలినాలు, హానికారకాలు ఎక్కువగా ఉంటుంటాయి. సబ్బుల్లో, లూబ్రికెంట్లలో, ఫార్మాస్యూటికల్స్ తయారీలో వీటిని వినియోగిస్తుంటారు. → వెజిటబుల్ నూనెల దిగుమతులు 11 శాతం పెరిగి 11,86,569 టన్నులుగా ఉన్నాయి. సోయా, సన్ఫ్లవర్, పీనట్, కార్న్, కనోలా ఇవన్నీ వెజిటుబల్ ఆయిల్స్ కిందకు వస్తాయి. వీటితో సహా వంటకు వినియోగించే అన్ని రకాల నూనెలను ఎడిబుల్ ఆయిల్స్గా పేర్కొంటారు. → 2025–26 మార్కెటింగ్ సంవత్సరంలో మొత్తం వెజిటబుల్ ఆయిల్ దిగుమతులు 8 శాతం పెరిగి 65,72,131 టన్నులకు చేరాయి. ఏటా నవంబర్తో మొదలై మరుసటి సంవత్సరం అక్టోబర్తో ఇది ముగుస్తుంటుంది. నెలవారీగా తగ్గుముఖం.. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే మార్చిలో వంట నూనెల దిగుమతులు పెరిగినప్పటికీ.. అంతక్రితం నెలతో (ఈ ఏడాది ఫిబ్రవరి) పోల్చి చూస్తే మాత్రం దిగుమతులు 10 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో దిగుమతులు 12.92 లక్షల టన్నులుగా ఉన్నాయి. పామాయిల్ను ఇండోనేషియా, మలేషియా నుంచి.. సోయాబీన్ ఆయిల్ను అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. మొత్తం అవసరాల్లో సగానికి పైనే దిగుమతుల ద్వారా భర్తీ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
పెరిగిన నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు మార్చి నెలలో స్వల్పంగా పెరిగి 5.1 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఇది 4.9 శాతంగా ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం ఎక్కువగా పెరిగింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 15 ఏళ్లు నిండిన పట్టణ జనాభాలో నిరుద్యోగం ఫిబ్రవరిలో ఉన్న 6.6 శాతం నుంచి మార్చిలో 6.8 శాతానికి చేరింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగగా, గ్రామీణ పురుషుల్లో స్వల్పంగా పెరిగింది. కార్మికుల భాగస్వామ్య రేటు మార్చి నెలకు 55.4 శాతంగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 55.9 శాతంగా ఉండడం గమనార్హం. జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి మార్చిలో 52.6 శాతం వద్ద స్థిరంగా కొనసాగింది. గ్రామీణ ప్రాంతాల్లో 55.5 శాతం, పట్టణాల్లో 46.8 శాతంగా ఉండడం గమనార్హం. -
రష్యన్ ఆయిల్.. రయ్ రయ్..
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల క్రూడ్ రేట్లు పెరగకుండా రష్యన్ ఆయిల్పై ఆంక్షలను అమెరికా నెలరోజుల పాటు సడలించడంతో, ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చిలో భారత్ కొనుగోళ్లు మూడు రెట్లు పెరిగి 5.3 బిలియన్ డాలర్లకు చేరాయి.యూరప్కి చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ, క్లీన్ ఎయిర్ (క్రియా) నివేదిక ప్రకారం ఫిబ్రవరిలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకున్న భారత్, ఆ తర్వాతి నెలలో మళ్లీ గణనీయంగా కొనుగోళ్లు చేసింది. మొత్తం 5.8 బిలియన్ యూరోల విలువ చేసే రష్యన్ హైడ్రోకార్బన్స్ని దిగుమతి చేసుకోగా ఇందులో క్రూడాయిల్ వాటా 91 శాతం (సుమారు 5.3 బిలయన్ యూరోలు)గా నమోదైంది.ఇది 2025 మార్చిలో నమోదైన దానితో పోలిస్తే 72 శాతం అధికం. ఇక రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మిగతా వాటిలో బొగ్గు (337 మిలియన్ యూరోలు), ఇతరత్రా ఆయిల్ ఉత్పత్తులు (178.5 మిలియన్ యూరోలు) ఉన్నాయి. మార్చిలో భారత్ క్రూడాయిల్ దిగుమతులు మొత్తం మీద 4 శాతం తగ్గినప్పటికీ రష్యా నుంచి కొనుగోళ్లు మాత్రం రెట్టింపయ్యాయి.ఫిబ్రవరిలో 1.4 బిలియన్ డాలర్ల మేర ముడిచమురు దిగుమతి అయింది. ఆంక్షల కారణంగా 2025 నవంబర్లో రష్యన్ దిగుమతులు నిలిపివేసిన ప్రభుత్వ రంగ మంగళూరు, వైజాగ్ రిఫైనరీలు 2026 మార్చి నుంచి తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టాయి. -
భారత్ వృద్ధి వేగవంతం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ, 2027లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయనుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2026లో 6.5 శాతం వృద్ధి అంచనాతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని పేర్కొంది. భారత వస్తువులపై అమెరికా అదనపు టారిఫ్లను 50 శాతం నుంచి10 శాతానికి తగ్గించడం వంటి సానుకూల అంశాలు వృద్ధికి దోహదం చేస్తాయని ఐఎంఎఫ్ పేర్కొంది. మధ్యప్రాచ్యంలో ఘర్షణల కారణంగా ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, ఈ సానుకూలతల అండతో 2026లో వృద్ధి రేటు 0.3 శాతం మెరుగుపడి 6.5 శాతానికి చేరుతుందని, 2027లో కూడా ఇదే వృద్ధి కొనసాగుతుందని అంచనా వేసింది. ప్రపంచ వృద్ధి రేటు తగ్గొచ్చు.. ఇరాన్ యుద్ధంతో ప్రంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిందంటూ, దీని ఫలితంగా 2025లో వృద్ది రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2026లో వృద్ధి అంచనాను 3.3 శాతం నుంచి 3.1 శాతానికి తగ్గించింది. 2025లో నమోదైన 3.4 శాతం వృద్ధితో పోలిస్తే తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. 2027లోనూ 3.2 శాతానికి వృద్ధి రేటు తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు ఈ ఏడాదికి ద్రవ్యోల్బణం అంచనాలను లోగడ ప్రకటించిన (జనవరిలో) అంచనా 3.8 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. యుద్ధానికి ముందు వరకు అమెరికా టారిఫ్లను ఎదుర్కొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలంగానే నిలబడిందని.. డేటా సెంటర్లు, ఏఐపై భారీ పెట్టుబడులు, ఉత్పాదక పెరగడం ఆర్థికంగా అనుకూలించినట్టు విశ్లేషించింది. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం ఈ వేగానికి అడ్డుపడిందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త పీర్నే ఒలీవర్ పేర్కొన్నారు. -
ఏప్రిల్ 20 నుంచి యూఎస్ టారిఫ్ రీఫండ్లు!
అమెరికా దిగుమతిదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో అక్రమంగా వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించేందుకు ఏప్రిల్ 20 (వచ్చే సోమవారం) నుంచి సరికొత్త వ్యవస్థను ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సుమారు 166 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని దిగుమతిదారులకు వాపసు ఇచ్చే ప్రక్రియ వేగవంతం కానుంది.‘కేప్’ వ్యవస్థతో వేగంగా చెల్లింపులుయూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఈ రీఫండ్ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ‘కేప్’ అనే ఎలక్ట్రానిక్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన కోర్టు ఫైలింగ్లో ఏజెన్సీ అధికారి బ్రాండన్ లార్డ్ వివరాలను వెల్లడించారు. గతంలోలాగే ప్రతి ఎంట్రీకి విడివిడిగా కాకుండా, దిగుమతిదారులందరికీ వర్తించే వడ్డీతో కలిపి ఒకేసారి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిధులు జమ చేస్తారు. ఈ వ్యవస్థను తొలుత దిగుమతి చేసుకున్న వస్తువులు, ఎటువంటి సాంకేతిక చిక్కులు లేని ఎంట్రీల కోసం వినియోగిస్తారు. సుమారు 2.9 బిలియన్ డాలర్ల విలువైన కొన్ని క్లిష్టమైన ఎంట్రీలకు మాన్యువల్ ప్రాసెసింగ్ అవసరమని, దీనివల్ల సిబ్బందిపై పనిభారం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం1977 నాటి ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ను అడ్డుపెట్టుకుని ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జాతీయ అత్యవసర పరిస్థితుల పేరుతో అధ్యక్షుడు తన పరిధిని మించి వ్యవహరించారని కోర్టు తప్పుబట్టింది. చట్టబద్ధమైన పరిధిని దాటి విధించిన సుంకాలను తక్షణమే తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.కోర్టు పత్రాల ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం దిగుమతిదారులు 3.30 లక్షల మందికి పైగా ఉన్నారు. 53 మిలియన్ల దిగుమతి షిప్మెంట్లపై సుంకాలు వసూలు చేశారు. ఏప్రిల్ 9 నాటికి సుమారు 56,497 మంది దిగుమతిదారులు ఎలక్ట్రానిక్ వాపసు ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. వీరి వాటా విలువ దాదాపు 127 బిలియన్ డాలర్లు.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల! -
ఆటో, టాక్సీ డ్రైవర్లకు అలర్ట్!
మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజా రవాణా వ్యవస్థలో కీలక మార్పులు చేపట్టింది. మే 1వ తేదీన ‘మహారాష్ట్ర దినోత్సవం’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాషను తప్పనిసరి చేస్తూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో పర్మిట్ పొందాలన్నా లేదా డ్రైవర్గా కొనసాగాలన్నా మరాఠీ భాషలో ప్రాథమిక అవగాహన ఉండటం నిబంధనగా మారింది.మెరుగైన సేవలురాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ ఈ నూతన విధానాన్ని వెల్లడించారు. ప్రయాణికులు, డ్రైవర్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ను తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్ల వల్ల భాషా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ‘మరాఠీ మన రాష్ట్ర అధికారిక భాష. ప్రజా సేవల్లో దాని వాడకాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత. డ్రైవర్లకు మరాఠీ చదవడం, రాయడం, మాట్లాడటం వస్తేనే ప్రయాణికులకు మెరుగైన భద్రత, సేవలు అందుతాయి’ అన్నారు.అమలు తీరు.. తనిఖీలుఈ నిబంధనను కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. మే 1 నుంచి రవాణా శాఖకు చెందిన 59 ప్రాంతీయ (ఆర్టీఓ), ఉప ప్రాంతీయ కార్యాలయాల ద్వారా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీల సమయంలో డ్రైవర్లు మరాఠీలో తమ ప్రాథమిక నైపుణ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. వారికి మరాఠీ చదవడం, రాయడం వస్తుందా లేదా అని అధికారులు ధ్రువీకరిస్తారు. కేవలం డ్రైవర్లే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు జారీ చేసే అధికారులపై కూడా నిఘా పెంచనున్నారు. అర్హత లేని వారికి లైసెన్సులు ఇస్తే సదరు అధికారులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.ఇదీ చదవండి: బంగారం ధరలు సలసల! -
భారత్ వృద్ధికి... క్రూడ్ కోత!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరింత పెరిగి బ్యారెల్కు 130 డాలర్లకు చేరితే భారత్ ఆర్థిక వృద్ధి రేటుపై 80 బేసిస్ పాయింట్ల (0.8 శాతం) మేర ప్రభావం పడొచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, పటిష్టమైన ఆర్థిక రంగంతో చమురు ధరల పెరుగుదలను భారత్ తట్టుకోగలదని పేర్కొంది. ‘‘చమురు ధరలు పెరిగితే ప్రభుత్వ ద్రవ్య లోటు లక్ష్యాలకు కొంత ఆటంకం కలగొచ్చు. కానీ భారత్ ‘సావరిన్ రేటింగ్’ పై తక్షణమే ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు’’అని ఎస్అండ్పీ స్పష్టం చేసింది. ఒకవేళ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గి, చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తే.. భారత్ తిరిగి పుంజుకుంటుందని నివేదిక పేర్కొంది. నివేదికలోని ఇతర అంశాలు.. ⇒ చమురు ధరల పెరుగుదల వల్ల గృహ వినియోగం, కార్పొరేట్ లాభాలు, బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల జీడీపీ వృద్ధి రేటు మందగించే అవకాశం ఉంది. ⇒ కంపెనీల ఎబిట్డా 2027 ఆర్థిక సంవత్సరంలో 15–25 శాతం తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా కెమికల్స్, రిఫైనింగ్ మరియు విమానయాన రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ⇒ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (ఎన్పీఏలు) 3.5 శాతానికి పెరగొచ్చు. అయినప్పటికీ, భారతీయ బ్యాంకుల వద్ద తగినంత మూలధనం ఉండటం ఊరటనిచ్చే అంశం. ⇒ చమురు ధర ప్రతి 10 డాలర్ల పెరుగుదలతో దేశ కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.4% పెరగవచ్చు. దీనివల్ల రూపాయి విలువపైనా ఒత్తిడి పడుతుంది. ⇒ భారతీయ కంపెనీలు గత కొన్నేళ్లుగా అప్పులను తగ్గించుకుంటూ రావడంతో వాటి బ్యాలెన్స్ షీట్లు బలంగా ఉన్నాయి. బ్యాంకుల వద్ద మెరుగైన మూలధనంతోపాటు తక్కువ స్థాయిలో ఎన్పీఏలు సానుకూలాంశాలు. -
సామాన్యుడిపై ధరల భారం తప్పదా?
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా వ్యవస్థలో తలెత్తిన ఆటంకాలు ముడి చమురు ధరలను ఆకాశానికి చేర్చుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర ఇటీవలే 110 డాలర్ల మార్కును తాకడం భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తుంటే రాష్ట్ర ఎన్నికల అనంతరం సామాన్యుడిపై ఇంధన ధరల భారం పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.కంపెనీల నెత్తిన నష్టాల భారంఅంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) సంస్థలు ఏప్రిల్ 2022 నుంచి రిటైల్ ధరలను సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్పుట్ ఖర్చులు పెరగడం, విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. పెట్రోల్పై నష్టం లీటరుకు సుమారు రూ.18, డీజిల్పై నష్టం లీటరుకు సుమారు రూ.35గా ఉందని అంచనా. ఓఎంసీలకు ఒక దశలో రోజుకు రూ.2,400 కోట్లుగా ఉన్న ఈ నష్టం ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత ప్రస్తుతం రూ.1,600 కోట్లకు చేరింది.మాక్వారీ నివేదిక విశ్లేషణప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ (Macquarie) తాజా నివేదిక ప్రకారం, చమురు కంపెనీల ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వచ్చిన స్వల్ప లాభాలను మార్చి నెల నష్టాలు తుడిచిపెట్టేశాయి. ‘అంతర్జాతీయంగా స్పాట్ ధరలు బ్యారెల్కు 135 - 165 డాలర్ల మధ్య ఉన్న తరుణంలో భారత్లో విక్రయ ధరలు పెంచకపోవడం వల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీలు భారీ నష్టాలను ప్రకటించే అవకాశం ఉంది’ అని తెలిపింది. అంతేకాకుండా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ నెలాఖరులోగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.దిగుమతులపై ఆధారపడటం ఒక సవాల్భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 88% దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది (2025 గణాంకాల ప్రకారం). మధ్యప్రాచ్యం, రష్యా, అమెరికాల నుంచి మనం చమురును సేకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే, దేశీయంగా లీటరుపై రూ.6 నష్టం అదనంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాగించాలంటే బ్యారెల్ ధర 80-85 డాలర్ల మధ్య ఉండాలి, కానీ ఇప్పుడు అది 120 డాలర్ల వద్ద ఉండటం ఆందోళనకరం.అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గని పక్షంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత చమురు ధరల పెంపు అనేది అనివార్యంగా కనిపిస్తోంది. ఇది రవాణా రంగంపై ప్రభావం చూపి, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేసే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా? -
డ్రాగన్కు యుద్ధం దెబ్బ!
ప్రపంచ ఆర్థిక గమనానికి దిక్సూచిగా భావించే చైనా వాణిజ్య రంగం ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను చవిచూస్తోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ డిమాండ్పై ప్రతికూల ప్రభావం చూపడంతో మార్చి నెలలో చైనా ఎగుమతుల వృద్ధి ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే, దీనికి విరుద్ధంగా దిగుమతులు మాత్రం గత నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా గరిష్ట వృద్ధిని నమోదు చేయడం విశేషం. చైనా కస్టమ్స్ విభాగం విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాలను వెల్లడించాయి.ఎగుమతుల్లో బ్రేక్.. దిగుమతుల్లో జోరురాయిటర్స్ విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ చైనా ఎగుమతులు మార్చిలో కేవలం 2.5% మాత్రమే వృద్ధి చెందాయి. ఏడాది మొదటి రెండు నెలల్లో నమోదైన 21.8% వృద్ధితో పోలిస్తే ఇది భారీ పతనం. విశ్లేషకులు కనీసం 8.6% వృద్ధిని ఆశించినప్పటికీ, అంతర్జాతీయంగా తగ్గిన డిమాండ్ డ్రాగన్ ఆశలపై నీళ్లు చల్లింది. మరోవైపు, దిగుమతుల రంగం అనూహ్యంగా పుంజుకుంది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి దిగుమతులు 27.8% పెరిగాయి. నవంబర్ 2021 తర్వాత ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. 11.2% పెరుగుదల ఉంటుందన్న అంచనాలను మించి ఈ వృద్ధి నమోదు కావడం గమనార్హం.ఇంధన షాక్ను తట్టుకునే వ్యూహంమధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తీవ్రంగా ఊగిసలాడుతున్నాయి. హార్మూజ్ జలసంధి వంటి కీలక రవాణా మార్గాల్లో ఆటంకాలు ఎదురైతే ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. అయితే, ఈ ముప్పును ఎదుర్కోవడానికి బీజింగ్ పటిష్టమైన బఫర్ను సిద్ధం చేసుకుంది. చైనా వద్ద ప్రస్తుతం 120 రోజులకు పైగా సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి. కేవలం చమురుపైనే ఆధారపడకుండా బొగ్గు, ఇతర ప్రత్యామ్నాయ ఇంధన వనరులను చైనా వేగంగా అభివృద్ధి చేస్తోంది. పెరిగిన ఇంధన ధరల భారాన్ని వినియోగదారులపై వేయకుండా ప్రభుత్వం నియంత్రిస్తోంది.అమెరికాతో తగ్గిన వాణిజ్యం..అమెరికాతో పెరుగుతున్న సుంకాల యుద్ధం, ఉద్రిక్తతల ప్రభావం గణాంకాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మార్చిలో అమెరికాకు చైనా ఎగుమతులు ఏకంగా 26.5% పడిపోయాయి. ప్రపంచ సరఫరా గొలుసులో ఇబ్బందులు, ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా చైనా మొత్తం వాణిజ్య మిగులు 264.3 బిలియన్ డాలర్లకు (3% తగ్గుదల) పరిమితమైంది.ముందున్న సవాలుచైనా తన మొదటి త్రైమాసిక జీడీపీ గణాంకాలను గురువారం విడుదల చేయనుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఇది 4.8% గా ఉండొచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడింట ఒక వంతు వాటా కలిగిన చైనా ఎగుమతులు మందగించడం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలను ఎలా మారుస్తుందో వేచి చూడాలి.ఇదీ చదవండి: నోటీసు లేకుండానే 300 మంది తొలగింపు! -
‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?
భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి మధ్యతరగతి ప్రజలే కీలకం. దేశంలో తయారయ్యే సగటు వస్తువులను అధికంగా కొనేది వీరే. ప్రభుత్వానికి సింహభాగం పన్నులు కట్టేదీ వీరే. కానీ, ప్రస్తుతం వారు ఆర్థికంగా, సామాజికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేదల కోసం పథకాలు ఇస్తోంది. ధనికుల కోసం ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ, ఈ రెండింటి మధ్య ఉన్న మధ్యతరగతి ప్రజల కష్టాలను మాత్రం విస్మరిస్తోంది.వచ్చే జీతం చాలడం లేదుమునుపటితో పోలిస్తే ఇప్పుడు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ సామాన్యుడి జీతం మాత్రం పెరగడం లేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్కో లేదా ఆఫీస్ ఉద్యోగికో వచ్చే ప్రారంభ జీతం ఎంత ఉందో, నేటికీ దాదాపు అంతే ఉంది. కానీ, అప్పటితో పోలిస్తే ఇళ్ల అద్దెలు, పెట్రోల్, కూరగాయల ధరలు రెట్టింపు అయ్యాయి. మన దేశంలో 70 శాతం మంది సంపాదన దేశ సగటు ఆదాయం కంటే తక్కువగానే ఉంది. అంటే, కొద్దిమంది ధనికులు రోజురోజుకు మరింత ధనవంతులు అవుతుంటే మెజారిటీ ప్రజలు మాత్రం బతుకు బండి అంతంతమాత్రంగానే నెట్టుకొస్తున్నారు.చదువు, వైద్యం, ఇల్లుమధ్యతరగతి బడ్జెట్ను ఈ మూడు అంశాలు పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేక, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు భరించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ఏటా ప్రైవేట్ రంగంలో ఫీజులు 10-20% పెరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు కోసం సొంత అవసరాలను త్యాగం చేసి మరీ ఫీజులు కడుతున్నారు. మరోవైపు పెరిగిన వైద్య ఖర్చుల దృష్ట్యా ఒక్కసారి ఆసుపత్రిలో చేరితే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇన్సూరెన్స్ ఉన్నా అది అన్నింటికీ సరిపోవడం లేదు. వైద్యం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. నగరాల్లో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. సొంత ఇల్లు కొందామంటే బ్యాంక్ వడ్డీలు భయం పుట్టిస్తున్నాయి. దీంతో సంపాదనలో సగం అద్దెకో లేదా ఈఎంఐకో సరిపోతోంది.‘ప్రభుత్వం లెక్కించే ధరల పెరుగుదల పాత పద్ధతిలో ఉంది. అది పప్పులు, ఉప్పుల ధరల మీద దృష్టి పెడుతుంది కానీ, మనం ఎక్కువగా ఖర్చు చేసే స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఖర్చులను సరిగ్గా లెక్కలోకి తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. అందుకే ప్రభుత్వ లెక్కల్లో ధరలు తక్కువగా ఉన్నా సామాన్యుడికి మాత్రం ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి’పొదుపు మాయం.. అప్పులే శరణ్యంఒకప్పుడు మధ్యతరగతి వారు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకునేవారు. కానీ ఇప్పుడు నెలవారీ జీతం క్షణాల్లో అయిపోతోంది. దాచుకోవడానికి రూపాయి మిగలడం లేదు. అవసరాల కోసం అప్పులు చేయడం, క్రెడిట్ కార్డులు వాడటం పెరిగిపోయింది. దేశవ్యాప్తంగా ప్రజల పొదుపు తగ్గిపోయి, అప్పులు పెరగడం ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరం.ఆశలు నీరుగారుతున్నాయిమధ్యతరగతి వారు కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల్లో ప్రమోషన్లు లేవు. కొత్త ఉద్యోగం చూద్దామంటే రిస్క్ ఎక్కువగా ఉంది. కొత్త టెక్నాలజీలు సంప్రదాయ కొలువులకు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. కొంతమంది సంపన్నులకే మంచి చదువు దొరుకుతుండటంతో పేద/దిగువ మధ్యతరగతి వారు పైకి రావడం ఒక యుద్ధంలా మారింది.‘మధ్యతరగతి వారు కేవలం పన్నులు కట్టే యంత్రాలు కాదు. దేశం ఆర్థికంగా బలంగా ఉండాలంటే ఈ వర్గం కూడా బలంగా ఉండాలి. పెరిగిన పన్నుల భారం తగ్గించి విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి. లేకపోతే దేశ ప్రగతి ప్రమాదపు అంచులకు చేరుతుంది’ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. ఆదుకునే కవచమా? చక్రవ్యూహమా? -
రెమిటెన్సులకు యుద్ధం సెగ
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో భారత్కు వచ్చే రెమిటెన్స్ ప్రవాహం తగ్గే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ప్రవాస భారతీయుల నుంచి వచ్చే మొత్తం రెమిటెన్స్ల్లో సుమారు మూడో వంతు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల నుంచే వస్తుందని పేర్కొంది. అక్కడి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే ఈ ప్రవాహం మందగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రవాస భారతీయుల ఆదాయాలు తగ్గితే కరెంట్ ఖాతా లోటు (సీఏడీ)పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే వాణిజ్య లోటు ఒత్తిడిలో ఉన్న సమయంలో రెమిటెన్స్ తగ్గుదల ఆర్థిక సమతౌల్యంపై మరింత ప్రభావం చూపవచ్చని పేర్కొంది. ప్రవాసుల నుంచి రెమిటెన్స్లు అత్యధికంగా పొందుతున్న దేశంగా భారత్ ప్రపంచంలో ముందంజలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఈ రూపంలో 135 బిలియన్ డాలర్లకు పైగా వచ్చాయి. ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడిపశ్చిమాసియా ఘర్షణల కారణంగా గ్లోబల్ వాణిజ్య ప్రవాహాల్లో అంతరాయం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల భారత ఎగుమతుల వృద్ధిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. అయితే అమెరికా సుంకాలు తగ్గడం కొంతమేర మద్దతు ఇస్తుందని పేర్కొంది. మరోవైపు ముడి చమురు ధరలు సంవత్సరానికి 8–9% పెరగడం వల్ల దిగుమతి బిల్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. లాజిస్టిక్ సమస్యలు, సరఫరా గొలుసు పునర్వ్యవస్థీకరణ కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఎగుమతులు ఇలాజీసీసీ దేశాలకు భారత్ 57 బిలియన్ డాలర్లు (మొత్తం ఎగుమతుల్లో 13%), ఇతర పశ్చిమ ఆసియా దేశాలకు 9 బిలియన్ డాలర్లు (2%) ఎగుమతులు చేసింది. బాస్మతి బియ్యం (70% పైగా), బోవైన్ మీట్ (30%), సిరామిక్ ఉత్పత్తులు (25%), పెట్రోలియం ఉత్పత్తులు (15%), రత్నాలు – ఆభరణాలు (20%) వంటి ఉత్పత్తుల్లో ఆ ప్రాంతానికి అధిక ప్రాధాన్యం ఉందని నివేదిక వెల్లడించింది. రవాణా సమస్యలు, సరఫరా విధానాల్లో మార్పుల కారణంగా పశ్చిమాసియాకు ఎగుమతులు తగ్గడం లేదా ఆలస్యం కావచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
కార్మికుల వేతనాలు పెంపు
ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక రంగంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న అశాంతికి తెరదించుతూ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఈ కొత్త వేతన రేట్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి ఇస్తాయని తెలిపింది. నోయిడాలో వేలాది మంది ఫ్యాక్టరీ కార్మికులు వేతనాలు పెంచాలని, పని పరిస్థితులు మెరుగుపరచాలని సోమవారం చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.సవరించిన వేతనాల వివరాలుగౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపమ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడిస్తూ, ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సుల మేరకు ముఖ్యమంత్రి ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.గౌతమ్ బుద్ధ నగర్, ఘజియాబాద్ఈ కీలక పారిశ్రామిక ప్రాంతాల్లో వేతనాలు అత్యధికంగా ఉన్నాయి. నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.13,690 (గతంలో రూ.11,313), సెమీ స్కిల్డ్ వర్కర్లకు రూ.15,059, నైపుణ్యం కలిగిన కార్మికులకు రూ.16,868 వేతనం నిర్ణయించారు.ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో..నైపుణ్యం లేని వారు: రూ. 13,006సెమీ స్కిల్డ్: రూ. 14,306నైపుణ్యం కలిగిన వారు: రూ.16,025మిగిలిన జిల్లాల్లో..నైపుణ్యం లేని వారు: రూ.12,356సెమీ స్కిల్డ్: రూ.13,591నైపుణ్యం కలిగిన వారు: రూ.15,224సమతుల్య విధానం - ప్రభుత్వ వివరణయజమానుల సంఘాలు, కార్మిక సంస్థలతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాతే ఈ సమతుల్య, ఆచరణాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవైపు కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే అయినప్పటికీ, మరోవైపు పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రపంచ ఆర్థిక సవాళ్లు, పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు, పడిపోతున్న ఎగుమతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.తప్పుడు ప్రచారాలను నమ్మొద్దుసోషల్ మీడియాలో కార్మికులకు నెలకు రూ.20,000 ఏకరీతి కనీస వేతనం నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. జాతీయ స్థాయిలో ‘ఫ్లోర్ వేజ్’ నిర్ణయించే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని, ఇప్పటి వరకు అటువంటి నోటిఫికేషన్ ఏదీ జారీ చేయలేదని స్పష్టం చేసింది.యాజమాన్యాలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తిముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరిశ్రమల యజమానులకు పలు సూచనలు చేశారు. వాటి ప్రకారం.. సకాలంలో వేతనాలు చెల్లించాలి. అదనపు పని గంటలకు(ఓటీ) సరైన పరిహారం ఇవ్వాలి. బోనస్, వారపు సెలవులు, సామాజిక భద్రతా ప్రయోజనాలను అమలు చేయాలి. ముఖ్యంగా మహిళా కార్మికులకు అత్యంత సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలి. త్వరలోనే పూర్తిస్థాయి వేతన బోర్డును ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల మేరకు తుది వేతన నిర్ణయ ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇండెక్సేషన్ ఆధారంగా మధ్యంతర పెంపును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
ధరలు.. ఇంకాస్త పైకి
న్యూఢిల్లీ: మార్చిలో నిత్యావసరాల ధరలు మరింత పెరిగాయి. రిటైల్ ధరల ఆధారిత సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణాన్ని సూచించే ) 3.4 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో ఇది 3.21 శాతంగా ఉంది. ముఖ్యంగా మార్చి నెలలో బంగారం, వెండి ఆభరణాలు, కొబ్బరి, టమాటా, క్యాలిఫ్లవర్ ధరలు పెరిగాయి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, వెల్లుల్లి, కందిపప్పు, శనగపప్పు ధరలు తగ్గినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన డేటా ఆధారంగా తెలుస్తోంది. అయినప్పటికీ మార్చి నెల ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యమైన 4 శాతానికి దిగువనే ఉండడం గమనార్హం. ఈ గణాంకాలు 2024 బేస్ ఇయర్ ఆధారంగా రూపొందించినవి. విద్యుత్, గ్యాస్, ఇతర ఇంధన విభాగంలో ద్రవ్యోల్బణం 1.65 శాతం నమోదైంది. ఫిబ్రవరిలో ఇదే విభాగం ద్రవ్యోల్బణం 1.52 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 3.63 శాతం, పట్టణ ప్రాంతాల్లో 3.11 శాతం చొప్పున మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే అత్యధిక ద్రవ్యోల్బణం తెలంగాణలో 5.83 శాతంగా ఉంది. అత్యల్పంగా మిజోరాంలో 0.66 శాతం నెలకొంది. పశ్చిమాసియా ప్రభావం.. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం కొంత మేర ద్రవ్యోల్బణంలో కనిపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ప్రధానంగా ఆహారం, విద్యుత్, గ్యాస్ ధరల పెరుగుదలతో నెలవారీగా ద్రవ్యోల్బణం ఎగసినట్టు చెప్పారు. -
ఇరాన్ సమీపంలో అమెరికా నౌకా దళాలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ప్రకటించిన ‘నౌకా దళ దిగ్బంధనం’ (నేవల్ బ్లాకేడ్) ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై రష్యా తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో పాటు శాంతి స్థాపన కోసం ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను తమ అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించింది.యురేనియం తరలింపునకు ప్రతిపాదనప్రపంచంలోనే అతిపెద్ద అణ్వాయుధ నిల్వలు కలిగిన రష్యా, ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడానికి కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న యురేనియంను రష్యాకు తరలించడం ద్వారా అగ్రరాజ్యంతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చని క్రెమ్లిన్ సూచించింది. ‘ఈ ప్రతిపాదనను అధ్యక్షుడు పుతిన్ గతంలోనే అమెరికా ముందు ఉంచారు’ అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు.అంతేకాకుండా, ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి రష్యా మధ్యవర్తిగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.హార్మూజ్ జలసంధి.. ట్రంప్ కఠిన నిర్ణయంపాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి బృందం మధ్య జరిగిన చర్చలు విఫలమవ్వడంతో అమెరికా తన తదుపరి వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను దిగ్బంధిస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సోమవారం నుంచి ఇది ప్రారంభమవుతుందన్నారు. ఇరాన్ ఓడరేవులకు వచ్చే లేదా అక్కడి నుంచి వెళ్లే అన్ని రకాల నౌకలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మూతపడటం అంతర్జాతీయ మార్కెట్ను అతలాకుతలం చేసే అవకాశం ఉంది.అయితే, ఈ దిగ్బంధనాన్ని అమెరికా సైన్యం క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు, ఇరాన్ సైన్యం ఈ చర్యను పైరసీగా అభివర్ణించింది.యుద్ధం ముగిసేది ఎప్పుడు?ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు చర్చలు విఫలమవ్వడంతో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశలు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఇరాన్ తన స్నేహపూర్వక దేశాలైన చైనా వంటి ప్రాంతాలకు మాత్రమే చమురు నౌకలను అనుమతిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రష్యా ముందుకొస్తున్నా అమెరికా తన మొండివైఖరిని వీడకపోతే ప్రపంచం భారీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: దేశ రాజధాని సమీపంలో కార్మికుల నిరసన.. -
చైనా ‘ఇంధన దిగ్బంధనం’పై తైవాన్ కసరత్తులు
ఇంధన సరఫరానే లక్ష్యంగా చైనా విధించగల సంభావ్య నౌకాదళ దిగ్బంధనాన్ని (నావెల్ బ్లాకేడ్) ఎదుర్కోవడానికి తైవాన్ ప్రభుత్వం భారీ యుద్ధ విన్యాసాలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్న తరుణంలో తైవాన్ తన సొంత ఎనర్జీ సెక్యూరిటీపై ప్రత్యేక దృష్టి సారించింది. చైనా ఒకవేళ తైవాన్ చుట్టూ ఇంధన దిగ్బంధనం విధిస్తే దానికి ధీటుగా సహజ వాయువు (ఎల్ఎన్జీ), చమురు నౌకలను సురక్షితంగా తీరానికి చేర్చేలా ఈ కసరత్తులు ఉండనున్నాయి.ఎస్కార్ట్ మిషన్లుఈ ప్రత్యేక రక్షణ విన్యాసాల్లో తైవాన్ నావికాదళం కీలక పాత్ర పోషించనుంది. సముద్ర మార్గంలో చైనా నౌకలు అడ్డుకోకుండా ఇంధనంతో వచ్చే భారీ నౌకలకు తైవాన్ యుద్ధనౌకలు రక్షణ కవచంలా (ఎస్కార్ట్) నిలుస్తాయి. శత్రువుల దిగ్బంధనాన్ని ఎలా ఛేదించాలో ఈ డ్రిల్స్లో భాగంగా సైన్యం అనుకరిస్తుంది. ప్రధాన ఓడరేవులపై చైనా పట్టు సాధిస్తే ఇతర చిన్న రేవుల ద్వారా సరఫరాను ఎలా కొనసాగించాలనేది కూడా ఈ ప్రణాళికలో భాగం.ప్రాంతీయ ముప్పుగా 'బ్లాకేడ్'తైవాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఈ కసరత్తులపై స్పందిస్తూ చైనా చర్యలు కేవలం తైవాన్కు మాత్రమే పరిమితం కావని హెచ్చరించారు. ‘చైనా విధించే ఇంధన దిగ్బంధనం తైవాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాకుండా మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతం ఇంధన సరఫరా గొలుసును ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇది ప్రపంచ ఇంధన భద్రతకే సవాలు’ అని ఆయన పేర్కొన్నారు.ఇంధన సంక్షోభం వైపు తైవాన్?ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు తైవాన్కు కీలకంగా మారాయి. తైవాన్ తన విద్యుత్ అవసరాల కోసం 50% పైగా ఎల్ఎన్జీ పైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం తైవాన్ వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం వస్తే ఈ నిల్వలు త్వరగా నిండుకునే ప్రమాదం ఉంది. దిగ్బంధనం సమయంలో గ్యాస్ కొరతను అధిగమించడానికి తైవాన్ తన బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలను సిద్ధం చేస్తోంది.తైవాన్ సమీపంలో చైనా తన సైనిక కదలికలను పెంచుతున్న నేపథ్యంలో తైపీ ప్రభుత్వం చేపడుతున్న ఈ ఎనర్జీ డ్రిల్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయుధాలే కాదు, ఇంధన లభ్యత కూడా కీలకమని తైవాన్ గుర్తించింది.ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ! -
8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల సంపద ఢమాల్
స్టాక్ మార్కెట్లపై హర్ముజ్ సంక్షోభం ఎఫెక్ట్ పడింది. చర్చలు విఫలమై చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లకుపైగా.. నిష్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో కేవలం 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయ్యింది.హర్ముజ్ జలసంధి సంక్షోభం ప్రభావంతో ఇవాళ్టి ట్రేడింగ్ సెషన్లో భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కుదేలయ్యాయి. చర్చలు విఫలమవడంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 8 శాతం పెరగడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామం వెంటనే మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.సెన్సెక్స్ 73,000 స్థాయికి చేరగా, నిఫ్టీ 23,600 కంటే దిగువకు పడిపోయింది. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ పతనంతో మార్కెట్లో భయాందోళనలు పెరిగి, చిన్న పెట్టుబడిదారులు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెరుగుదలతో ఎయిర్లైన్స్, పెయింట్స్, ఫర్టిలైజర్స్ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండిగో, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు, ఎనర్జీ-అప్స్ట్రీమ్ రంగం, డిఫెన్స్ సంబంధిత షేర్లు మాత్రం కొంత స్థిరంగా నిలిచాయి. నిపుణుల అంచనా ప్రకారం.. హర్ముజ్ సంక్షోభం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దిగుమతి ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం అధికమవడం, వృద్ధి మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు తాత్కాలికంగా రిస్క్ ఉన్న రంగాల నుండి దూరంగా ఉండి, స్థిరమైన రంగాల వైపు దృష్టి మళ్లించాలని సూచిస్తున్నారు. -
డీజిల్, ఏటీఎఫ్పై విండ్ఫాల్ ట్యాక్స్ పెంపు
న్యూఢిల్లీ: డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై ఆయిల్ కంపెనీలకు వచ్చే అసాధారణ లాభాల మీద పన్నులను (విండ్ఫాల్ ట్యాక్స్) కేంద్రం పెంచింది. దీనితో ఇది డీజిల్పై లీటరుకు రూ. 21.50 నుంచి రూ. 55.5కి, విమాన ఇంధనం ఏటీఎఫ్పై లీటరుకు రూ. 29.5 నుంచి రూ. 42కి పెరిగింది. ప్రస్తుతం పెట్రోల్ ఎగుమతులపై ఎలాంటి సుంకాలు లేవు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ విండ్ఫాల్ పన్నులను క్రమపద్ధతిలో సవరిస్తూ వస్తోంది. దేశీయ చమురు ఉత్పత్తిదారులు అంతర్జాతీయ ధరల పెరుగుదల వల్ల పొందే అదనపు ప్రయోజనాలను నియంత్రించడమే ఈ పన్ను ప్రధాన ఉద్దేశం. ఈ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు అదనపు ఆదాయం సమకూరడమే కాకుండా, దేశీయ రిఫైనరీలు తమ ఉత్పత్తులను విదేశాలకు తరలించకుండా స్థానిక మార్కెట్ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేలా చేస్తుంది. -
పసిడి, ఫారెక్స్ నిల్వలు పెరిగాయ్..
న్యూఢిల్లీ: ఇటీవల తగ్గముఖం పట్టిన భారత విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో 9.063 బిలియన్ డాలర్లు పెరిగి 697.121 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు (మార్చి 27) వారంలో ఇవి 10.288 బిలియన్ డాలర్లు క్షీణించి 688.058 బిలియన్ డాలర్లుగా నమోదైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 27తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు చరిత్రాత్మక గరిష్టం 728.494 డాలర్లుగా నమోదయ్యాయి. పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత కొన్ని వారాలు పాటు తగ్గుతూ వచ్చాయి. రూపాయి మారకపు విలువపై తీవ్ర ఒత్తిడి ఏర్పడటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని డాలర్లు విక్రయించడమే కాక.. కొన్ని విధానపరమైన జాగ్రత్తలనూ తీసుకుంటోంది.ఏప్రిల్ 3తో ముగిసిన వారంలో విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 1.784 బిలియన్ డాలర్లు పెరిగి, 552.856 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ 7.221 బిలియన్ డాలర్లు పెరిగి 120.742 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
‘ఆమె’ తీసుకున్న లోన్లు రూ.76 లక్షల కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళా శక్తి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు చిన్నపాటి అవసరాల కోసం రుణాలు తీసుకోవడానికే పరిమితమైన వనితలు .. ఇప్పుడు వ్యాపార విస్తరణకు భారీ స్థాయిలో రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మహిళల రుణ పోర్ట్ఫోలియో అక్షరాలా రూ.76 లక్షల కోట్లకు చేరిందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో మహిళల వాటా ఏకంగా 26 శాతానికి ఎగబాకింది.నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ న్యూఢిల్లీలో విడుదల చేసిన ‘ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్: ఉమెన్ అండ్ ఇండియాస్ ఎవాల్వింగ్ క్రెడిట్ మార్కెట్‘ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్లాట్ఫామ్ (డబ్ల్యూఈపీ), ట్రాన్స్యూనియన్ సిబిల్, మైక్రోసేవ్ కన్సల్టింగ్ (ఎంఎస్సీ) సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 2017 నుంచి చూస్తే మహిళలకు ఇచి్చన రుణాల పరిమాణం 4.8 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం రుణాలు పొందడం మాత్రమే కాకుండా, అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గుణాత్మకంగా మారుతోందని వెల్లడించింది.పరుగులు పెడుతున్న వృద్ధి .. 2017 డిసెంబర్ నుంచి 2025 డిసెంబర్ మధ్య కాలంలో క్రియాశీలక మహిళా రుణగ్రహీతల సంఖ్య 9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేసింది. మహిళల్లో రుణ విస్తృతి 19 శాతం నుంచి 36 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం రుణ మార్కెట్లో 16 కోట్ల మంది యాక్టివ్ మహిళా రుణగ్రహీతలు ఉన్నారు. 2017లో రూ.16 లక్షల కోట్లుగా ఉన్న వీరి బకాయిలు, 2025 నాటికి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. దేశంలో రుణ అర్హత కలిగిన 45 కోట్ల మంది మహిళలు ఉండగా, భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింతగా విస్తరించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.మైక్రోఫైనాన్స్ నుంచి అప్గ్రేడ్ .. చిన్నపాటి మైక్రోఫైనాన్స్ రుణాలతో మొదలుపెట్టిన మహిళలు ఆ తర్వాత మంచి క్రెడిట్ హిస్టరీ సాధించి క్రమంగా రిటైల్, కమర్షియల్ రుణాల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న మైక్రోఫైనాన్స్ రుణగ్రహీతల్లో 19 శాతం మంది రిటైల్ లేదా కమర్షియల్ లోన్స్ కలిగి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ ’కస్టమర్ గ్రాడ్యుయేషన్’లోనూ దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధికంగా తమిళనాడులో 27 శాతం మంది మహిళలు పెద్ద రుణాల వైపు అప్గ్రేడ్ అవ్వగా, కర్ణాటకలో ఈ రేటు 20 శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న బలమైన క్రెడిట్ వ్యవస్థకు ఇది నిదర్శనమని నివేదిక స్పష్టం చేసింది.డిజిటల్ అండతో సత్వర రుణాలు: కేరళ కేస్ స్టడీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ), అధికారిక రుణ వ్యవస్థల కలయికతో ఆర్థిక భాగస్వామ్యం సులభతరమైందని నీతి ఆయోగ్ సీఈఓ నిధి చిబ్బర్ పేర్కొన్నారు. గుర్తింపు, చెల్లింపులు, అండర్రైటింగ్, లోన్ సరీ్వసింగ్ వంటి అంశాల్లో డిజిటలైజేషన్ పెరగడం వల్ల మహిళలకు రుణాలు త్వరగా మంజూరవుతున్నాయి. ప్రధాన వినియోగ విభాగాల్లో అదే రోజు రుణం మంజూరు (సేమ్–డే అప్రూవల్స్) ఏకంగా 45 శాతానికి చేరింది. గ్రామీణ మహిళా వ్యాపారుల డిజిటల్ ప్రయాణంపై అధ్యయనం చేసిన బృందం.. కేరళలో పలు ఆసక్తికర విషయాలు గుర్తించింది.కేరళలోని గ్రామీణ మహిళా వ్యాపారుల్లో 38 శాతం మంది మహిళలు.. ’సమయాభావం’ తమ వ్యాపార వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని వెల్లడించారు. ఇంటి బాధ్యతలు, వ్యాపారం రెండింటినీ చూసుకోవాల్సి రావడం వల్ల డిజిటల్ టూల్స్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని వారు తెలిపారు. అయినా సరే కొందరు గ్రామీణ వ్యాపారులు వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, పింటెరెస్ట్ వంటి డిజిటల్ టూల్స్ ఉపయోగించి మార్కెటింగ్ చేసుకుంటున్న తీరును నివేదిక కేస్ స్టడీలుగా ప్రచురించింది. భవిష్యత్తులో ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.మహిళలు అధికారిక ఫైనాన్షియల్ సిస్టమ్స్ వైపు మళ్లడం, వివిధ రుణ విభాగాల్లో చురుకుగా పాల్గొనడం భారత్ ఆర్థిక ముఖచిత్రంలో ఒక అర్థవంతమైన మార్పని డబ్ల్యూఈపీ మిషన్ డైరెక్టర్ అన్నా రాయ్ తెలిపారు. దాదాపు 16 కోట్ల మంది యాక్టివ్ మహిళా రుణగ్రహీతల డేటాతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 161 మంది మహిళా నానో–ఎంటర్ప్రెన్యూర్ల ప్రైమరీ రీసెర్చ్ ఆధారంగా ఈ నివేదికను సమగ్రంగా రూపొందించారు. వ్యాపార రుణాల్లో దక్షిణాది హవా .. వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2022–2025 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్ క్రెడిట్ వృద్ధి రేటు 17 శాతంగా ఉండగా, మహిళా వ్యాపారుల రుణాల వృద్ధి రేటు ఏకంగా 31 శాతంగా నమోదైంది. 2017 నుంచి చూస్తే వ్యాపార రుణాల బకాయిల పరిమాణం 7.5 రెట్లు పెరిగింది. ఈ విభాగంలో దక్షిణాది రాష్ట్రాలు బలమైన ముద్ర వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్ రుణాలు తీసుకున్న మహిళల్లో ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే 15 శాతం మంది ఉండగా, కర్ణాటక వాటా 9 శాతంగా ఉంది. అయితే వృద్ధి రేటు పరంగా చూస్తే ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్ (59%), ఉత్తరప్రదేశ్ (42%) వేగంగా దూసుకెళ్తున్నాయని నివేదిక తెలిపింది. -
పశ్చిమాసియా సంక్షోభానికి మోక్షం లభించేనా?
వేలాది మంది ప్రాణాలను బలిగొని ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తూ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపుకు చేరుకుంది. నెలల తరబడి సాగుతున్న రక్తపాతానికి ముగింపు పలికే దిశగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య నేడు (ఏప్రిల్ 11, 2026) పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. యుద్ధ మేఘాల మధ్య ఆశా కిరణంలా కనిపిస్తున్న ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.శాంతి మంతనాలు - పట్టువిడుపులుమధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు ఇస్లామాబాద్లో ముఖాముఖి భేటీ అవుతున్నారు. అయితే, చర్చల ప్రారంభానికి ముందే ఇరు దేశాలు తమ పంతాలను నెగ్గించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్లో కాల్పుల విరమణ, ఆర్థిక ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలపై ఇరుపక్షాల మధ్య తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అడ్డంకిగా మారిన హెజ్బుల్లా అంశంమార్చి నెలలో ప్రారంభమైన పోరాటంలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్లో దాదాపు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా లక్ష్యంగా సాగుతున్న ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అయితే, లెబనాన్ అంశాన్ని ఈ ద్వైపాక్షిక చర్చలతో ముడిపెట్టడానికి అమెరికా, ఇజ్రాయెల్ ససేమిరా అంటున్నాయి.ఆర్థిక ఆంక్షలు.. అణు కార్యక్రమంసంవత్సరాలుగా తమ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆంక్షలను అమెరికా వెంటనే ఎత్తివేయాలని ఇరాన్ పట్టుబడుతోంది. దీనికి ప్రతిగా ఇరాన్ తన అణు, క్షిపణి తయారీ కార్యక్రమాలు నిలిపేస్తేనే ఆంక్షల ఉపశమనం ఉంటుందని వాషింగ్టన్ సంకేతాలిచ్చింది. ముఖ్యంగా యురేనియం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిపై పట్టుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిపై తన సార్వభౌమత్వాన్ని గుర్తించాలని, అక్కడ రవాణా రుసుములు వసూలు చేసే అధికారం తమకు ఉండాలని ఇరాన్ కోరుతోంది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా, ఎటువంటి పరిమితులు లేకుండా అంతర్జాతీయ చమురు ట్యాంకర్ల రాకపోకలు సాగాలని డిమాండ్ చేస్తోంది.సైనిక ఉపసంహరణ - పరిహారంగత ఆరు వారాలుగా జరిగిన యుద్ధ నష్టానికి భారీ పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేయనుండగా, అమెరికా దీనిపై మౌనం వహిస్తోంది. అలాగే, మధ్యప్రాచ్యం నుంచి అమెరికా తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా, శాంతి ఒప్పందం కుదిరే వరకు సైన్యం కదిలేది లేదని, ఒకవేళ ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధం తీవ్రతరం అవుతుందని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
21 నెలల కనిష్ఠానికి ఎల్పీజీ వినియోగం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తున్న వేళ, భారత ఇంధన రంగంలో విరుద్ధమైన ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు యుద్ధ భయాలతో రవాణా ఇంధనాలైన పెట్రోల్, డీజిల్కు విపరీతమైన గిరాకీ పెరగ్గా, మరోవైపు వంట గ్యాస్ వినియోగం గత 21 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) విడుదల చేసిన తాత్కాలిక గణాంకాలు ఈ ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.ఎల్పీజీ వినియోగంలో భారీ క్షీణతమార్చి 2026లో దేశీయ ఎల్పీజీ వినియోగం గణనీయంగా తగ్గింది. గత నెలతో పోలిస్తే 16 శాతం, గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 13 శాతం క్షీణత నమోదైంది. మార్చిలో మొత్తం వినియోగం 2.38 మిలియన్ టన్నుల వద్ద నిలిచింది. జూన్ 2024 తర్వాత ఎల్పీజీ వినియోగంలో ఇంతటి భారీ పతనం నమోదు కావడం ఇదే తొలిసారి.దిగుమతులపై హార్మూజ్ ప్రభావంభారతదేశం తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సుమారు 90 శాతం దిగుమతులు వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధి గుండానే సాగుతుంటాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంక్షోభం ఈ జలసంధి ద్వారా రవాణాను ప్రభావితం చేయడంతో ఫిబ్రవరిలో 2 మిలియన్ టన్నులుగా ఉన్న దిగుమతులు మార్చి నాటికి 1.1 మిలియన్ టన్నులకు పడిపోయాయి.పెట్రోల్, డీజిల్కు డిమాండ్సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో వినియోగదారులు ముందు జాగ్రత్తగా ఇంధన కేంద్రాలకు క్యూ కట్టడం వల్ల రవాణా ఇంధనాల వినియోగం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.ఇంధనంమర్చి నెల వినియోగంవృద్ధి (నెలవారీ)వృద్ధి (వార్షిక)డీజిల్8.73 MT (రికార్డు)14%8%పెట్రోల్3.78 MT (రికార్డు)12%8% వార్షిక ధోరణి ఆశాజనకంమార్చి నెలలో ఎల్పీజీ వినియోగంలో క్షీణత కనిపించినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం వినియోగం మాత్రం ఆశాజనకంగానే ఉంది. గతేడాది కంటే 6 శాతం వృద్ధి చెంది 33.21 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇది 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత నమోదైన అత్యధిక వార్షిక వృద్ధి కావడం విశేషం.ప్రభుత్వ భరోసా - ప్రత్యామ్నాయ మార్గాలుప్రస్తుత అస్థిరతపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ దేశంలో ఇంధన నిల్వలు తగినంతగా ఉన్నాయని, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని తెలిపింది. దేశీయ ఎల్పీజీ వినియోగంలో 90 శాతంపైగా ఉన్న గృహ అవసరాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎల్పీజీపై భారాన్ని తగ్గించేందుకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. మార్చిలోనే 3 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వగా ఏప్రిల్ చివరి నాటికి మరో 6 నుంచి 7 లక్షల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: గ్రాట్యుటీ.. రిటైర్మెంట్ గిఫ్ట్! -
భారత్ వృద్ధి అంచనాలు అప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థికంగా, భౌగోళిక–రాజకీయాంశాలపరంగా పరిస్థితులు దిగజారుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27) భారత్ వృద్ధి రేటు పటిష్టంగా 6.9 శాతం స్థాయిలో ఉంటుందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. డిసెంబర్లో వెలువరించిన 6.5 శాతం స్థాయి కన్నా అధికంగా ఉంటుందని పేర్కొంది. దేశీయంగా డిమాండ్ పటిష్టంగా ఉండటం, సులభతరంగా రుణాల లభ్యత, భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్ల తగ్గుదలలాంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని ఒక నివేదికలో పేర్కొంది. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరల పెరుగుదల, వాణిజ్య నిర్వహణకు ఆటంకాలు, రెమిటెన్సులు తగ్గుదల తదితర అంశాలు వృద్ధిపై ప్రభావం చూపవచ్చని ఏడీబీ తెలిపింది. ఇక సానుకూల పాలసీలు, అంతర్జాతీయంగా పరిస్థితులు మెరుగుపడటం వల్ల దేశీయంగా వినియోగం, పెట్టుబడులకు ప్రయోజనం చేకూరుతుందని, ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2026–27 అంచనాలను ఏడీబీ సవరించినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరపు 7.6 శాతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 6.9 శాతానికి తగ్గనుండటం గమనార్హం. -
ఈక్విటీ ఫండ్స్.. తగ్గేదేలే!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో ఆటుపోట్లు నెలకొన్న తరుణంలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడుల పట్ల తమ విశ్వాసాన్ని చాటారు. మార్చి నెలలో ఈక్విటీ ఫండ్స్లోకి రికార్డు స్థాయిలో రూ.40,456 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో వచ్చిన రూ.25,978 కోట్లతో పోల్చి చూస్తే 56 శాతం పెరిగాయి. 2025 జూలై (రూ.42,702 కోట్లు) తర్వాత ఒక నెలలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవి. ముఖ్యంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్కు అత్యధిక ఆదరణ లభించింది. మరోవైపు డెట్ ఫండ్స్ నుంచి భారీ స్థాయిలో రూ.2.95 లక్షల కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో ఇదే విభాగం రూ.42,106 కోట్లను ఆకర్షించడం గమనార్హం. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ మార్చిలో రూ.2.4 లక్షల కోట్ల పెట్టుబడులను నికరంగా కోల్పోయింది. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఆస్తుల (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.82.03 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.73.73 లక్షల కోట్లకు తగ్గింది. ఇందులో ఈక్విటీ ఫండ్స్ రూ.31,97,698 కోట్లుగా ఉంది. స్టాక్స్ విలువలు తగ్గడం ఏయూఎంపై ప్రభావం చూపించింది. విభాగాల వారీగా.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ రూ.10,054 కోట్ల పెట్టుబడులను మార్చి నెలలో ఆకర్షించాయి. → స్మాల్క్యాప్ ఫండ్స్లోకి రూ.6,263 కోట్లు, మిడ్క్యాప్ లోకి రూ.6,063 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → లార్జ్ అండ్ మిడ్క్యాప్ ఫండ్స్ రూ.5,307 కోట్లు, లార్జ్క్యాప్ ఫండ్స్ రూ.2,997 కోట్ల చొప్పున రాబట్టాయి. → మల్టీక్యాప్ ఫండ్స్లోకి రూ.2,981 కోట్లు రాగా, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.437 కోట్లను కోల్పోయాయి. → గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి పెట్టుబడులు భారీగా తగ్గి రూ.2,266 కోట్లకు పరిమితమయ్యాయి. ఫిబ్రవరిలో ఇదే విభాగంలోకి రూ.5,255 కోట్లు, జనవరిలో రూ.24,040 కోట్లు చొప్పున రావడం గమనార్హం. → హైబ్రిడ్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.16,500 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ నుంచి రూ.21,000 కోట్లు బయటకు వెళితే, మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్స్లోకి రూ.5,000 కోట్లు వచ్చాయి. ఇన్వెస్టర్ల నమ్మకం.. ‘మ్యూచువల్ ఫండ్స్ ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టిపై ఇన్వెస్టర్లలో స్థిరమైన విశ్వాసం కొనసాగుతోందని మార్చి నెల పెట్టుబడులు తెలియజేస్తున్నాయి. భారత్ నిర్మాణాత్మక వృద్ధి బలంగా ఉండడంతో, ఇన్వెస్టర్లు తమ దీర్ఘకాల లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను సర్దుబాటు చేసుకుంటున్నారు’ అని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. సిప్ సరికొత్త రికార్డు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీల్లోకి నెలవారీ వచ్చే పెట్టుబడులు మార్చిలో ఆల్టైమ్ గరిష్ట రికార్డును నమోదు చేశాయి. రూ.32,087 కోట్ల పెట్టుబడులు సిప్ రూపంలో వచ్చాయి. ఫిబ్రవరిలో సిప్ పెట్టుబడులు రూ.29,845 కోట్లుగా ఉన్నాయి. దీర్ఘకాలం కోసం సిప్ రూపంలో వివిధ పథకాల్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టే సంస్కృతి ఇటీవలి కాలంలో విస్తరిస్తున్నట్టు ఈ గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. -
బంగారం అమ్మేసుకుంటున్న దేశాలు..
ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ మేఘాలు దేశాల పసిడి నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఒకప్పుడు సురక్షితమైన పెట్టుబడిగా భావించిన బంగారాన్ని ఇప్పుడు కొన్ని దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం, ముఖ్యంగా యుద్ధ వ్యయాల కోసం విక్రయిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో వివిధ దేశాల పసిడి నిల్వల తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం..యుద్ధం తెచ్చిన మార్పులేంటి?ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సాధారణంగా తమ విదేశీ మారక ద్రవ్య నిల్వలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. అయితే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలు పసిడి నిల్వలను పెంచుకుంటుంటే, యుద్ధంలో చిక్కుకున్న కొన్ని దేశాలు మాత్రం నిల్వలను అమ్ముకుంటున్నాయి.బంగారం అమ్ముతున్న దేశాలు ఇవే..ఇటీవలి నివేదికల ప్రకారం.. మూడు ప్రధాన దేశాలు తమ పసిడి నిల్వలను విక్రయించడం లేదా తగ్గించుకోవడం చేస్తున్నాయి.రష్యా: ఉక్రెయిన్తో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా రష్యా తన పసిడి నిల్వలను విక్రయించక తప్పడం లేదు. యుద్ధ వ్యయాలను భరించడానికి, పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి బయటపడటానికి రష్యా 2025 నుండి నిరంతరంగా బంగారాన్ని విక్రయిస్తోంది. ఫిబ్రవరి 2026 నాటికి రష్యా పసిడి నిల్వలు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి (సుమారు 2,327 టన్నులకు) పడిపోయినట్లు తెలుస్తోంది.టర్కీ: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో తన కరెన్సీ 'లిరా' విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి టర్కీ సుమారు 60 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లు సమాచారం. దీని విలువ దాదాపు 8 బిలియన్ డాలర్లు.పోలాండ్: గతంలో పసిడి కొనుగోళ్లలో అగ్రస్థానంలో ఉన్న పోలాండ్, ఇప్పుడు తన రక్షణ బడ్జెట్ కోసం నిల్వలను వినియోగించుకోవాలని యోచిస్తోంది.భారత్ పరిస్థితి ఇలా..ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) మాత్రం పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ప్రస్తుతం 880.18 టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. దీని విలువ ఫిబ్రవరి 2026 నాటికి రికార్డు స్థాయిలో 131.63 బిలియన్ డాలర్లకు చేరింది.ర్యాంకుదేశంనిల్వలు (టన్నుల్లో)నిల్వల విలువ (బిలియన్ డాలర్లలో)1అమెరికా81331,250+2జర్మనీ33505623ఇటలీ24524204ఫ్రాన్స్24374085రష్యా23273806చైనా23073877స్విట్జర్లాండ్10401758జపాన్8461429భారత్88013110నెదర్లాండ్స్612102 -
వజ్రాల మెరుపు వెనుక అసలు కథ
వజ్రాల వ్యాపారులు, వినియోగదారులు నిన్న(ఏప్రిల్ 8, 2026) తొలి ‘ప్రపంచ వజ్రాల దినోత్సవం’ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నేచురల్ డైమండ్ కౌన్సిల్ (ఎన్డీసీ) పిలుపు మేరకు జరిగిన ఈ వేడుకల్లో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్లో సహజ వజ్రాలకు ధీటుగా ‘ల్యాబ్గ్రోన్ డైమండ్లు’ విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? వీటి భవిష్యత్తు వినియోగం ఎలా ఉండబోతోంది? అనే అంశాలను విశ్లేషిద్దాం.సహజ వజ్రం.. ల్యాబ్గ్రోన్ డైమండ్ మధ్య తేడా..చాలామంది ల్యాబ్గ్రోన్ డైమండ్లను నకిలీ వజ్రాలు అనుకుంటారు, కానీ అది తప్పు. ఇవి భౌతికంగా, రసాయనికంగా, ఆప్టికల్గా దాదాపు సహజ వజ్రాల మన్నికనే పోలి ఉంటాయి. సహజ వజ్రాలు భూమి అంతర్భాగంలో అధిక ఉష్ణోగ్రత, పీడనం వల్ల ఏర్పడతాయి. ల్యాబ్గ్రోన్ డైమండ్లు ప్రయోగశాలల్లో కేవలం కొన్ని వారాల్లోనే తయారవుతాయి. సహజ వజ్రాలతో పోలిస్తే ల్యాబ్గ్రోన్ వజ్రాలు 60% నుంచి 80% వరకు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని భూమిని తవ్వి ప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం లేనందున ‘ఎకో-ఫ్రెండ్లీ’ డైమండ్లుగా పిలుస్తారు.కృత్రిమంగా ఎలా తయారు చేస్తారు?ల్యాబ్లో వజ్రాలను సృష్టించడానికి ప్రధానంగా రెండు పద్ధతులు ఉన్నాయి.హెచ్పీహెచ్టీ(హై ప్రెషర్ హై టెంపరేచర్): భూమి పొరల్లో ఉండే సహజ వాతావరణాన్ని (అధిక పీడనం, ఉష్ణోగ్రత) యంత్రాల ద్వారా సృష్టించి కార్బనైజేషన్ ద్వారా వజ్రాన్ని అభివృద్ధి చేస్తారు.సీవీడీ (కెమికల్ వేపర్ డెపొజిషన్): ఒక ఛాంబర్లో కార్బన్ వాయువులను నింపి ప్లాస్మా సాంకేతికతతో కార్బన్ పరమాణువులను పొరలు పొరలుగా పేరుకుపోయేలా చేస్తారు. ప్రస్తుతం అత్యుత్తమ నాణ్యత గల వజ్రాల కోసం భారత్లో ఈ పద్ధతినే ఎక్కువగా వాడుతున్నారు.వినియోగదారులు తేడాను ఎలా గుర్తించాలి?సాధారణంగా సహజ వజ్రానికి, ల్యాబ్గ్రోన్ వజ్రానికి మధ్య తేడాను కనిపెట్టడం అసాధ్యం. అనుభవజ్ఞులైన వ్యాపారులు కూడా వీటిని కొన్నిసార్లు గుర్తుపట్టలేరు. కాబట్టి వినియోగదారులు వజ్రాలు కొనేముందు కొన్ని అంశాలు గమనించాలి. వజ్రాభరణాలు కొనేటప్పుడు జీఐఏ(జెమొలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా) లేదా ఐజీఐ వంటి సంస్థల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా అడగాలి. అందులో అది ‘నేచురల్’ లేదా ‘లేబొరేటరీ గ్రోన్’ అని స్పష్టంగా ఉంటుంది. ల్యాబ్ వజ్రాల గర్డిల్ (అంచు)పై మైక్రోస్కోపిక్ లేజర్ మార్కింగ్ ఉంటుంది.ఈ విభాగంలో ఉపాధి అవకాశాలువజ్రాల తయారీ రంగంలో భారత్లోని సూరత్ గ్లోబల్ హబ్గా మారింది. దాంతో స్థానికంగా సీవీడీ మిషన్ల నిర్వహణకు ఇంజినీర్లు, ల్యాబ్ టెక్నీషియన్ల అవసరం పెరుగుతోంది. వజ్రాలను సానబెట్టే (పాలిషింగ్) నైపుణ్యం ఉన్నవారికి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. తక్కువ ధర వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా వజ్రాల వైపు మొగ్గు చూపుతుండటంతో సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో వేలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి.భవిష్యత్తు ఎటువైపు?సహజ వజ్రాలు పెట్టుబడిగా, వారసత్వ సంపదగా వాటి విలువను కాపాడుకుంటున్నాయి. కొన్ని పెళ్లిళ్లు, భావోద్వేగ సందర్భాల కోసం వీటిని వాడుతున్నారు. ల్యాబ్గ్రోన్ డైమండ్లు ఫ్యాషన్ జ్యువెలరీ, రోజువారీ వాడకానికి ఇవి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. వీటి పర్యావరణ హితం, తక్కువ ధర కారణంగా యువత, జెన్జీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: 40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ? -
40 శాతం రాయితీపై రష్యా ఎల్ఎన్జీ?
ప్రపంచ ఇంధన మార్కెట్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఒకవైపు పశ్చిమ దేశాల ఆంక్షలు, మరోవైపు హార్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి మధ్య దక్షిణాసియా దేశాలను ఆకర్షించేందుకు రష్యా భారీ డిస్కౌంట్లను ఎరగా వేస్తోంది. ముఖ్యంగా అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న తన ఎల్ఎన్జీ ప్రాజెక్టుల నుంచి గ్యాస్ను విక్రయించేందుకు రష్యా ఏకంగా 40 శాతం రాయితీని ప్రకటిస్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, రష్యా కొన్ని మధ్యవర్తిత్వ సంస్థల ద్వారా ఈ రాయితీని ఆఫర్ చేస్తోంది. గ్యాస్ కొనుగోలు చేసే దేశాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ఈ సరుకు ఒమన్ లేదా నైజీరియా వంటి రష్యాయేతర దేశాల నుంచి వస్తున్నట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలను కూడా సృష్టించడానికి అక్కడి ప్రైవేట్ విక్రేతలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.ముఖ్యంగా ఆర్కిటిక్ ఎల్ఎన్జీ 2 వంటి బ్లాక్లిస్ట్ చేసిన ప్లాంట్ల నుంచి ఎగుమతులను పెంచుకోవడమే రష్యా ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్లు కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ గ్యాస్ను షాడో ఫ్లీట్ (గుర్తింపు లేని నౌకలు) ద్వారా దిగుమతి చేసుకుంటున్న ఏకైక దేశం చైనా మాత్రమే. అయితే, తన కస్టమర్ బేస్ను విస్తరించుకోవడానికి రష్యా ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలను సంప్రదిస్తుంది.ఖతార్ ఎగుమతుల నిలిపివేతప్రస్తుతం ఆసియాలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటానికి ప్రధాన కారణం హార్మూజ్ జలసంధిలో తలెత్తిన ఉద్రిక్తతలు. ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన ఖతార్ నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలు స్పాట్ మార్కెట్లో రెట్టింపు ధర చెల్లించి గ్యాస్ కొనాల్సి వస్తోంది. గ్యాస్ కొరత కారణంగా ఎరువుల రంగానికి సరఫరాను నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. గత ఏడాది తన అవసరాల్లో 60 శాతం గ్యాస్ను ఖతార్ నుంచి పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తోంది. ఇదే అదనుగా రష్యా తన రాయితీ ఆఫర్ను ముందుకు తెచ్చింది.ఆచితూచి అడుగులురష్యా ఆఫర్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం ఆంక్షల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బ్లాక్లిస్ట్ చేసిన రష్యా ప్రాజెక్టుల నుంచి గ్యాస్ తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అయితే, ఇటీవల అమెరికా ట్రెజరీ జనరల్ లైసెన్స్ ద్వారా కొన్ని ఆంక్షలను సడలించిన తర్వాత 2019 నుంచి మొదటిసారిగా భారత్ ఇరాన్ నుంచి చమురు రవాణాను కొనుగోలు చేసింది. అమెరికా నుంచి ఎటువంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయంతో భారతీయ కంపెనీలు రష్యా ఎల్ఎన్జీ పట్ల ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.రష్యా ఆఫర్ చేస్తున్న 40 శాతం డిస్కౌంట్ ఆర్థికంగా భారత్, బంగ్లాదేశ్లకు ఊరటనిచ్చే విషయమే. అయినప్పటికీ, దీని వెనుక ఉన్న దౌత్యపరమైన రిస్క్ తక్కువేమీ కాదు. ఒకవేళ ఈ ఒప్పందాలు జరిగితే అది అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీస్తుంది. ప్రస్తుతానికి బ్లూమ్బెర్గ్ వంటి సంస్థలు ఈ కొనుగోళ్లు జరిగాయో లేదో ధ్రువీకరించలేదు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
యుద్ధ విరమణతో భారత్కు దక్కేదేమిటి?
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. గత నెల రోజులుగా సాగుతున్న యుద్ధ వాతావరణాన్ని చల్లారుస్తూ అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. మంగళవారం అర్థరాత్రి దాటాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో వెలువడిన ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. ఈ నిర్ణయం ప్రస్తుత పరిస్థితుల్లో భారత్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.ఏమిటీ ఒప్పందం? ప్రధానాంశాలు ఇవే..అమెరికా, ఇరాన్లు రెండు వారాలపాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదు. క్షిపణి ప్రయోగాలు, ప్రతీకార దాడులు తక్షణమే నిలిపివేయాలి. యుద్ధం కారణంగా నిలిచిపోయిన రవాణా నౌకలను హార్మూజ్ జలసంధి గుండా అనుమతించేందుకు ఇరాన్ తాత్కాలికంగా అంగీకరించింది. అయితే, ఇరాన్ సైనిక పర్యవేక్షణలోనే ఈ నౌకలు ప్రయాణించాలి. తదుపరి దౌత్యపరమైన చర్చల కోసం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు దేశాల ప్రతినిధులను ఏప్రిల్ 10న ఇస్లామాబాద్కు ఆహ్వానించారు.ఎవరి వాదన వారిదే!ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు తమ విజయంగానే అభివర్ణించుకుంటున్నాయి. ‘మా సైనిక లక్ష్యాలు నెరవేరాయి. ఇది పూర్తి విజయం. ఇరాన్ తన అణు కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాల్సిందే. భూగర్భంలో ఉన్న అణు వ్యర్థాలను తొలగించేందుకు ఇరాన్తో కలిసి పని చేస్తాం’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ తన 10 పాయింట్ల శాంతి ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇందులో ఇరాన్పై ఆంక్షల తొలగింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, పశ్చిమాసియా నుంచి అమెరికా సైన్యం ఉపసంహరణ వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఇవి నెరవేరితేనే శాంతి సుస్థిరమవుతుందని ఇరాన్ అంటోంది.భారత్పై ప్రభావం ఎలా ఉంటుంది?పశ్చిమాసియాలోని ఈ పరిణామం భారత్కు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. మన దేశ ఇంధన భద్రత హార్మూజ్ జలసంధిపైనే ఆధారపడి ఉంది. భారత్ దిగుమతి చేసుకునే వంటగ్యాస్లో 90% ఈ జలసంధి గుండానే వస్తుంది. గత నెల రోజులుగా సరఫరా ఆగిపోవడంతో దేశీయంగా ధరలు పెరగడమే కాకుండా కొరత ఏర్పడింది. మన దేశ ముడి చమురు అవసరాల్లో 30%, సహజ వాయువులో 47% ఈ మార్గం ద్వారానే వస్తాయి. యుద్ధం విరమణ ప్రకటన రాగానే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 15% పడిపోయి 90 డాలర్ల స్థాయికి చేరింది. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది.ఇజ్రాయెల్ - లెబనాన్ పరిస్థితి ఏమిటి?ఈ కాల్పుల విరమణ ఇరాన్తో యుద్ధానికి మాత్రమే వర్తిస్తుందని, లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లపై తమ పోరాటం కొనసాగుతుందని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇది చర్చల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన 16 భారతీయ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
సహజ వాయువు కోటా 95 శాతానికి పెంపు
దేశీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచే ఎరువుల పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతను సమీక్షించిన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఎరువుల తయారీ యూనిట్లకు సరఫరా చేసే సహజ వాయువు కోటాను 95 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన కేటాయింపులు గురువారం (ఏప్రిల్ 9, 2026) నుంచి అమలులోకి రానున్నాయి. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ ఇటీవల జరిగిన ఇతర మంత్రిత్వ శాఖల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. గడిచిన ఆరు నెలల సగటు వినియోగం ఆధారంగా ఈ కేటాయింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.పెరిగిన కేటాయింపులుగత వారం (ఏప్రిల్ 6) ఎరువుల రంగానికి గ్యాస్ సరఫరాను 90 శాతానికి పెంచిన ప్రభుత్వం, తాజాగా అందుబాటులో ఉన్న నిల్వలు, షెడ్యూల్ ప్రకారం వస్తున్న ఎల్ఎన్జీ కార్గోలను దృష్టిలో ఉంచుకుని మరో 5 శాతం పెంచి మొత్తం కోటాను 95 శాతానికి చేర్చింది. దేశ సగటు గ్యాస్ వినియోగం రోజుకు సుమారు 196 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు(ఎంఎస్సీఎం). ఎరువుల రంగ అవసరం రోజుకు సుమారు 52 ఎంఎస్సీఎండీగా ఉంది. ఒక ఎంఎస్సీఎం గ్యాస్తో సుమారు 1,600 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయవచ్చు. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎరువుల రంగం 9,753 ఎంఎస్సీఎంల గ్యాస్ను వినియోగించింది. ఇది దేశ మొత్తం వినియోగంలో 28 శాతానికి సమానం.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
ఎంట్రప్రెన్యూర్లకు ముద్రా రుణాల దన్ను
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ముద్రా రుణాలు ఆర్థికంగా సాధికారత కల్పిస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వికసిత భారత్ 2047 లక్ష్యంలో వారు కూడా భాగమయ్యేలా తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ప్రారంభించి 11 ఏళ్లయిన సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. ఈ స్కీము దన్నుతో గత దశాబ్దకాలంలో కోట్లాది సామాన్య ప్రజలు సరికొత్త ఆత్మవిశ్వాసంతో ఎంట్రప్రెన్యూర్షిప్ చేపట్టినట్లు మంత్రి వివరించారు.‘రుణాలను మరింతగా అందుబాటులోకి తేవడం ద్వారా కోట్లాది మంది ప్రజలు గొప్ప కలలు కనేందుకు, వాటిని సాకారం చేసుకునేందుకు పీఎం ముద్రా యోజన సాధికారత కల్పించింది’ అని ప్రధాని నరేంద్ర మోదీ .. ఎక్స్లో పోస్ట్ చేశారు. 2015 ఏప్రిల్ 8న ప్రారంభమైన పీఎంఎంవై కింద ఇప్పటివరకు రూ. 40.07 లక్షల కోట్ల విలువ చేసే 57.79 కోట్ల రుణాలు మంజూరైనట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడింట రెండొంతుల లోన్స్ మహిళా ఎంట్రప్రెన్యూర్లకు, అయిదింట ఒక వంతు రుణాలు ఫస్ట్ టైమ్ ఎంట్రప్రెన్యూర్లకు మంజూరైనట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పథకం అమల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర భాగస్వాములు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
ధరల భయం.. రేట్లు యథాతథం!
ముంబై: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఆర్థిక, వాణిజ్య అనిశ్చితులు.. రూపాయి అస్థిరతలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తరుణంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను 6.9 శాతానికి తగ్గించింది. ప్రస్తుతానికి పరిస్థితులను సునిశితంగా గమనిస్తూ, స్పష్టత వచ్చే వరకు వేచి చూడడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. దీంతో రెపో రేటు 5.25 శాతం, రివర్స్ రెపో రేటు 3.35 శాతం, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) రేటు 5 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఇక వడ్డీ రేట్లకు సంబంధించి తన విధానాన్ని తటస్థంగానే ఆర్బీఐ కొనసాగించింది. ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా యుద్ధంతో ముడి చమురు ధరలు గరిష్టాలకు పెరిగిపోవడం, రూపాయి బలహీనపడడం, ఎగుమతులు/దిగుమతులకు ఏర్పడిన అవరోధాలను ఆర్బీఐ ఎంపీసీ ప్రస్తావించింది. ఇరాన్–అమెరికా కాల్పుల విరమణనను సమీక్షలో పరిగణనలోకి తీసుకున్నా మని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా చెప్పారు. పాలసీ ముఖ్యాంశాలు.. → గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.6 శాతం కాగా, ప్రస్తుత 2026–27లో 6.9 శాతానికి పరిమితం కావొచ్చు. → పశ్చిమాసియా యుద్ధం ఎంత కాలం పాటు కొనసాగుతుంది? నష్టం ఏ మేరకు అన్నది ద్రవ్యోల్బణం, వృద్ధి రిస్్కలను నిర్ణయిస్తుంది. → ద్రవ్యోల్బణం 2026–27లో 4.6 శాతంగా ఉండొచ్చు. క్యూ1లో 4 శాతం, క్యూ2లో 4.4 శాతం, క్యూ3లో 5.2 శాతం, క్యూ4లో 4.7 శాతంగా అంచనా. ఆర్బీఐ లక్ష్యం 4 శాతం కాగా, అసాధారణ పరిస్థితుల్లో గరిష్టంగా 6 శాతం మించకుండా చూడాలన్న విధానాన్ని అనుసరిస్తోంది.→ 2026–27లో రూపాయి డాలర్తో 94 వద్ద, ముడి చమురు బ్యారెల్కు 85 డాలర్ల వద్ద (సగటున) స్థిరపడొచ్చు. → 2025 ఫిబ్రవరి వరకు ఆర్బీఐ మొత్తం మీద 1.25% మేర రెపో రేటును తగ్గించడం గమనార్హం. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష జూన్ 3 నుంచి 5 వరకు ఉంటుంది.దీర్ఘకాలం పాటు తక్కువ రేట్లే...పశ్చిమాసియా ఘర్షణలు ఎగుమతులు, వృద్ధిని అడ్డుకోవచ్చు. ఇంధన ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో విఘాతాలు కీలక ముడి సరుకుల లభ్యతను అడ్డుకుంటుంది. ఇది వ్యవసాయం, అనుబంధ రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించొచ్చు. వృద్ధిని నిదానింపజేయొచ్చు. అయినప్పటికీ దేశ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. తటస్థ విధానాన్నే కొనసాగిస్తున్నాం. మధ్యకాలం నుంచి దీర్ఘకాలం పాటు కనిష్ట వడ్డీ రేట్లే కొనసాగుతాయి. – ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా -
దేశాలకు టారిఫ్ల షాక్.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్ల షాక్ ఇచ్చారు. ఇరాన్ కు ఆయుధాలను విక్రయించే దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆయా దేశాల నుంచి అమెరికాకు దిగుమయ్యే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే సుంకాలు అమలు తెస్తున్నట్లు బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు."ఇరాన్ కు సైనిక ఆయుధాలను సరఫరా చేసే దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు విక్రయించే అన్ని రకాల వస్తువులపైనా తక్షణమే 50 శాతం సుంకం విధిస్తున్నాం. ఇది తక్షణమే అమలులోకి వస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులులు ఉండవు" అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక పోస్ట్లో రాసుకొచ్చారు. -
టెక్స్టైల్స్ పీఎల్ఐ పరిధిలోకి మరిన్ని విభాగాలు
టెక్స్టైల్స్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.10,683 కోట్లతో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత పథకం (పీఎల్ఐ) పరిధిలోకి మ్యాన్ మేడ్ వ్రస్తాలు (ఎంఎంఎఫ్), ఫ్యాబ్రిక్స్, టెక్నికల్ టెక్స్టైల్స్నూ చేర్చనున్నట్టు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. దీనివల్ల పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుందని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందన్నారు. అలాగే తాజా పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని, టెక్స్టైల్స్రంగంలో వృద్ధి వేగం అందుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.ఉపాధి అవకాశాలను విస్తృతం చేయడం, అంతర్జాతీయ టెక్స్టైల్ మార్కెట్లో భారత్ స్థానాన్ని బలోపేతం చేయడం నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొన్నారు. ఫుట్వేర్ పరిశ్రమల ప్రతినిధులు తనను కలసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముడి సరకుల లభ్యత, నాణ్యత సమస్యలను పాదరక్షల పరిశ్రమల ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గత 12 ఏళ్లలో దేశంలో కొనుగోలు శక్తికి అనుగుణంగా పాదరక్షల వినియోగం పెరుగుతూ వస్తున్నట్టు చెప్పారు. యూఎస్లో ఒక్కో వ్యక్తి 7 జతల పాదరక్షలు వినియోగిస్తుంటే, చైనాలో 3.3 జతలుగా ఉందని.. భారత్లోనూ 3 జతలకు చేరినట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పసిడి ధరల మంట! తులం ఎంతంటే.. -
యథాతథంగా కీలక వడ్డీరేట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లపై తన విధాన నిర్ణయాన్ని ప్రకటించింది. గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇది మొదటి విధాన సమీక్ష. ఈ సమీక్ష సమావేశంలో కీలక రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది.2025-26 ఏడాది ప్రారంభం నుంచి వరుసగా రేట్లు తగ్గించిన ఆర్బీఐ.. గడిచిన సమావేశంతోపాటు ఈసారీ రేట్ల తగ్గింపుపై తటస్థ వైఖరి తీసుకుంది. గతేడాది ఫిబ్రవరి నుంచి ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ వరుసగా మూడుసార్లు రేట్లలో కోత విధించింది. దాంతో మొత్తంగా 100 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించింది. గత ఫిబ్రవరిలో 6.5 శాతంగా ఉన్న పాలసీ రేటు ప్రస్తుతం 5.25గా ఉంది.ఇదీ చదవండి: అమెరికా ఇన్ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా? -
అమెరికా ఇన్ఫ్రాపై ఇరాన్ హ్యాకర్ల పంజా?
అగ్రరాజ్యం అమెరికాలోని కీలక మౌలిక సదుపాయాల నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ అనుబంధ హ్యాకింగ్ గ్రూపులు భారీ సైబర్ దాడులకు తెగబడుతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సరఫరా అయ్యే నీరు, ఇంధన వ్యవస్థలను నియంత్రించే సాఫ్ట్వేర్లలోని లొసుగులను వాడుకుని ఈ కీలక వ్యవస్థలను స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అగ్రరాజ్య నిఘా వర్గాలు హెచ్చరించాయి.సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) నేతృత్వంలో ఎఫ్బీఐ (ఎఫ్బీఐ), నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) సహా పలు ఫెడరల్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ మేరకు ఇటీవల ఒక అత్యవసర భద్రతా సలహా (అడ్వైజరీ) జారీ చేశాయి.రంగంలోకి 'అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్'ఈ దాడుల వెనుక ఇరాన్ ప్రభుత్వంతో సంబంధం ఉన్న అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్ (ఏపీటీ) సభ్యులు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ హ్యాకర్లు ప్రధానంగా పారిశ్రామిక కంప్యూటర్లైన ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్లను (పీఎల్సీ) లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇవి నీటి శుద్ధి ప్లాంట్లు, విద్యుత్ గ్రిడ్లు, ఇంధన సరఫరా కేంద్రాల్లో యంత్రాలను నియంత్రించడానికి వాడే అత్యంత కీలకమైన పరికరాలు. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ రాక్వెల్ ఆటోమేషన్ అభివృద్ధి చేసిన పీఎల్సీలను ఈ హ్యాకర్లు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇతర కంపెనీల పరికరాలపై కూడా దాడులు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీలు హెచ్చరించాయి.దాడుల వెనుక భౌగోళిక రాజకీయ కారణాలు?గతంలో 2023లో పెన్సిల్వేనియాలోని నీటి శుద్ధి కేంద్రాలపై ఇరాన్ అనుబంధ ‘సైబర్ ఏవీ3ఎన్గర్స్’ గ్రూప్ జరిపిన దాడుల తరహాలోనే ప్రస్తుత దాడులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)తో ఈ హ్యాకర్లకు సంబంధాలు ఉన్నాయి. అక్టోబర్ 7న ఇజ్రాయెల్-హమాస్ మధ్య ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ తయారు చేసిన పరికరాలను వాడుతున్న అమెరికా సంస్థలను ఇరాన్ హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. అమెరికా-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాల పట్ల ఇరాన్ ఈ సైబర్ యుద్ధం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఈ వార్తలు వెలుగులోకి వచ్చాక ఈరోజు ఉదయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో చేస్తున్న యుద్ధాన్ని రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. ఇరువర్గాల మధ్య చర్చలు సఫలం అయితే ఇకపై యుద్ధం ఉండబోదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: వీడిన యుద్ధ మేఘాలు.. మార్కెట్లలో జోష్! -
ఈ–కామర్స్ @ 250 బిలియన్ డాలర్లు!
న్యూఢిల్లీ: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2030 నాటికి దాదాపు మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుత 90 బిలియన్ డాలర్ల స్థాయి నుంచి 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. జెన్ జెడ్ షాపర్స్, క్విక్ కామర్స్ వేగంగా విస్తరిస్తుండటంలాంటి అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. గూగుల్, డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం దశాబ్దం ఆఖరు నాటికి భారత డిజిటల్ ఎకానమీలోకి 15 కోట్ల మంది కొత్త షాపర్స్ ప్రవేశించనున్నారు. మొత్తం ఆన్లైన్ వ్యయాల్లో 22 కోట్ల పైగా ఉన్న జెన్ జెడ్ వినియోగదారుల వాటా 45%కి చేరనుంది.దేశీయంగా ప్రజల షాపింగ్ చేసే తీరుతెన్నులు మారుతున్న నేపథ్యంలో ఈ–కామర్స్ కీలక దశలో ఉందని గూగుల్ ఇండియా ఎండీ (కనెక్టెడ్ కన్జూమర్ కామర్స్) రోమా దత్త చౌబే తెలిపారు. ఏఐ, ఇతరత్రా సాంకేతికతలతో వినియోగదారులు కొత్త కొనుగోలు ధోరణులను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆల్గోరిథమ్ శకం వైపు మార్కెట్ మళ్లుతోందని డెలాయిట్ దక్షిణాసియా పార్ట్నర్ ఆనంద్ రామనాథన్ పేర్కొన్నారు. డిజిటల్ జనులైన జెన్ జెడ్ వినియోగదారులు ఈ మార్పులకు కారణమవుతున్నారని వివరించారు. వినియోగదారులు తమ అవసరాన్ని వివరిస్తే, ఏఐ దాన్ని విశ్లేషించుకుని, సత్వరమే సొల్యూషన్స్ కూడా అందించే జనరేటివ్ కామర్స్ వేగవంతంగా అమల్లోకి వచ్చేందుకు ఇది దోహదపడుతోందన్నారు. మరిన్ని కీలకాంశాలు.. ⇒ ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో విస్తృతంగా ఉంటున్న క్విక్ కామర్స్ మార్కెట్ రాబోయే రోజుల్లో 50 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ఈ విభాగంలో కొనుగోలుదారుల సంఖ్య రెట్టింపై 7 కోట్లకు చేరనుంది. ఈ మార్కెట్లో ద్వితీయ శ్రేణి నగరాలు, అంతకన్నా చిన్న పట్టణాల వినియోగదారుల వాటా 30 శాతం స్థాయిలో ఉండనుంది. ⇒ 2030 నాటికి మొత్తం క్విక్ కామర్స్ వ్యయాల్లో సౌందర్య సాధనాలు, ఫ్యాషన్, ఎల్రక్టానిక్స్లాంటి ఆహారయేతర కేటగిరీల వాటా 45 శాతానికి చేరుతుంది. తద్వారా ఆయా విభాగాల్లో స్పెషలిస్టులకు 10 బిలియన్ డాలర్ల వ్యాపారావకాశాలు లభిస్తాయి. ⇒ క్రియేటర్ ఎకానమీ కూడా కీలకంగా మారనుంది. కంటెంట్ క్రియేటర్లు 2030 నాటికి మొత్తం రిటైల్ వ్యయాల్లో 30 శాతం భాగాన్ని ప్రభావితం చేస్తారు. ప్రతి 10 ఆన్లైన్ కొనుగోళ్లలో ఒకటి నేరుగా క్రియేటర్ స్టోర్ఫ్రంట్ ద్వారా జరుగుతుంది. లైవ్ కామర్స్ 8 బిలియన్ డాలర్ల స్థాయికి పెరుగుతుంది. ⇒ పరిశ్రమ వృద్ధిలో కృత్రిమ మేధ ముఖ్య పాత్ర పోషించనుంది. హైపర్ పర్సనలైజేషన్, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం ద్వారా రిటైల్ లాభదాయకత 30–35% మేర పెరిగేందుకు దోహదపడనుంది. -
యుద్ధం ఎఫెక్ట్.. దెబ్బతిన్న రంగాలకు కేంద్రం దన్ను!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో దేశీయంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవనుంది. రూ.2.5 లక్షల కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (రుణ హామీ పథకం)ను తీసుకొచ్చే యోచనతో ఉంది. ఈ పథకం కింద రుణాలు తీసుకున్న సంస్థలు ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా యుద్ధ ప్రభావం కారణంగా చెల్లింపుల్లో విఫలమైతే 90 శాతం మేర (రూ.100 కోట్ల వరకు) ప్రభుత్వం రుణదాతలకు (బ్యాంక్లు) చెల్లిస్తుంది.ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్సీజీటీసీ) ఈ మేరకు హామీని బ్యాంక్లకు ఇవ్వనుంది. కరోనా సమయంలోనూ ప్రభుత్వం ఇదే తరహా పథకాన్ని (అత్యవసర రుణ హామీ పథకం/ఈసీఎల్జీఎస్) ప్రకటించడం తెలిసిందే. నాడు ఈ పథకం ఎంతో విజయవంతమైందని, ఎన్నో సంస్థలు నిలదొక్కుకుని, తర్వాత చెల్లింపులు చేసేందుకు వీలు ఏర్పడినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈసీఎల్జీఎస్ను నాడు అన్ని రంగాలకు అమలు చేశారు. నూరు శాతం హామీని ఈ పథకం కింద ప్రభుత్వం అందించింది. దీనికింద అప్పటికే రుణాలు తీసుకున్న సంస్థలకు, అదనపు రుణ సదుపాయాలను బ్యాంక్లు ఆఫర్ చేశాయి.రుణ రేట్లపై పరిమితులతోపాటు ముందస్తు చెల్లింపుల చార్జీలు, ప్రాసెసింగ్ చార్జీల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక పశ్చిమాసియా యుద్ధం మొదలైన తర్వాత క్రూడ్ ధరలు భగ్గుమనడం తెలిసిందే. ఈ ప్రభావం వినియోగదారులపై పడకుండా ఉండేందుకు పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడం తెలిసిందే. ఫార్మా, టెక్స్టైల్స్ తదితర రంగాల్లో వినియోగించే కీలక ముడిపదార్థాలైన పెట్రోకెమికల్స్పైనా దిగుమతి సుంకాలను మినహాయించడం గమనార్హం. -
రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ పథకం సిద్ధం!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతరాయాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ సంక్షోభం వల్ల దెబ్బతిన్న వివిధ రంగాలను ఆదుకునేందుకు సుమారు రూ.2.5 లక్షల కోట్ల భారీ క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొవిడ్ సమయంలో ఎంఎస్ఎంఈలను ఆదుకున్న ‘ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్’ (ఈసీఎల్జీఎస్) తరహాలోనే ఈ నూతన ప్యాకేజీ ఉండబోతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు.వ్యాపారాలకు రక్షణ కవచంప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్యలను ఎదుర్కొంటున్న పరిశ్రమలకు ఈ పథకం ఊపిరి పోయనుంది. ఇందులోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.ఈ పథకం కింద వ్యాపారాలు పొందే రుణాలకు నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ (ఎన్సీజీటీసీ) ద్వారా 90 శాతం క్రెడిట్ గ్యారెంటీ లభిస్తుంది. ఒకవేళ రుణగ్రహీత డిఫాల్ట్ అయితే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.ఈ పథకం సుమారు నాలుగేళ్ల పాటు అమలులో ఉండే అవకాశం ఉంది.వివిధ రంగాలు, ఉప-రంగాలకు సుమారు రూ.100 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.గత అనుభవాల దృష్ట్యా రుణాలను చౌకగా అందించేందుకు బ్యాంకుల వడ్డీ రేటును 9.25 శాతం, ఎన్బీఎఫ్సీల వడ్డీ రేటును 14 శాతానికి పరిమితం చేసే అవకాశం ఉంది.అసలు మొత్తం తిరిగి చెల్లింపుపై ఏడాది పాటు మారటోరియం లభిస్తుంది. అయితే, ఈ కాలంలో వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.విమానయాన, ఎంఎస్ఎంఈ రంగాలపై ప్రత్యేక దృష్టిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా విమాన మార్గాల మళ్లింపు, ఇంధన ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చులు పెరగడంతో విమానయాన రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ రంగానికి తక్షణ మద్దతు అవసరమని అధికారులు గుర్తించారు. ‘ప్రస్తుతం లిక్విడిటీ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న విమానయానం, ఎంఎస్ఎంఈలు, ఇతర కీలక వ్యాపారాలకు అండగా నిలవడమే మా ప్రాధాన్యత. ఇరాన్ సంక్షోభం వల్ల విమానయాన కార్యకలాపాల్లో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మద్దతు అవసరం’ అని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.ఇదీ చదవండి: చల్లారిన పసిడి వేడి! తులం ఎంతంటే.. -
రెస్క్యూ మిషన్ వివరాలు లీక్ చేస్తే అంతే..
ఇరాన్లో చిక్కుకున్న ఇద్దరు అమెరికన్ వైమానిక దళ పైలట్లను రక్షించేందుకు చేపట్టిన అత్యంత సాహసోపేతమైన సైనిక చర్యకు సంబంధించిన రహస్యాలను బహిర్గతం చేసిన జర్నలిస్టులపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే విధంగా సమాచారాన్ని లీక్ చేసిన వారిని కనుగొని, వారికి సహకరించిన జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ రెస్క్యూ మిషన్కు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఆపరేషన్ను అమెరికా సైనిక చరిత్రలోనే ఒక చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు. అయితే, ఇదే సమయంలో మీడియా తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.జర్నలిస్టులకు జైలు శిక్ష!నిర్దిష్ట మీడియా సంస్థల పేర్లను ప్రస్తావించనప్పటికీ ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలోనే వివరాలను ప్రచురించిన పత్రికలపై ట్రంప్ మండిపడ్డారు. ‘మొదటి పైలట్ను మాత్రమే రక్షించారనే సమాచారాన్ని ముందే బయటపెట్టడం ద్వారా ఇరానియన్లకు మనం క్లూ ఇచ్చినట్లయింది. ఇది రెండో పైలట్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది’ అని ఆయన పేర్కొన్నారు. ‘మేము ఆ సమాచారాన్ని లీక్ చేసిన వాళ్లని పట్టుకుంటాం. అదొక వికృత మనస్తత్వం. సదరు వార్తను ప్రచురించిన జర్నలిస్టు తన సోర్స్ వెల్లడించకపోతే వారు కూడా జైలుకు వెళ్లాల్సిందే. ఈ మిషన్ను వారు ఎంతటి ప్రమాదంలోకి నెట్టారో ప్రపంచం అర్థం చేసుకోవాలి’ అని ట్రంప్ స్పష్టం చేశారు.176 యుద్ధ విమానాలువారాంతంలో జరిగిన ఈ దాడి వివరాలను ట్రంప్ వివరించారు. ఈ రెస్క్యూ మిషన్ ఎంత భారీ స్థాయిలో జరిగిందో ఆయన వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. మొదటి పైలట్ రక్షణకు 21 యుద్ధ విమానాలు, రెండో పైలట్ రక్షణకు 155 యుద్ధ విమానాలు ఉపయోగించినట్లు చెప్పారు. ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించేందుకు డెకాయ్(మోసపూరిత) ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా విమానాలు ఏడు వేర్వేరు ప్రాంతాలపై చక్కర్లు కొట్టాయి. ఈ ఆపరేషన్లో ఎంతమంది సైనికులు పాల్గొన్నారని జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ డాన్ కెయిన్ను ట్రంప్ ప్రశ్నించగా భద్రతా కారణాల దృష్ట్యా ఆయన మౌనం వహించారు. అయితే ట్రంప్ స్పందిస్తూ ఆ సంఖ్య వందల్లో ఉంటుందని చెప్పారు.ఇరాన్ ప్రయోగించిన ‘హ్యాండ్-హెల్డ్ షోల్డర్ క్షిపణి’ ద్వారా అమెరికాకు చెందిన ‘ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్’ కూలిపోయింది. ఆ విమానంలోని వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ ఇరాన్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 48 గంటల పాటు శత్రువుల కంట పడకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. శత్రు దళాలు గంటగంటకూ అతనికి దగ్గరవుతున్న తరుణంలో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ హెలికాప్టర్ ద్వారా అతడిని సురక్షితంగా కాపాడినట్లు ట్రంప్ చెప్పారు.విమానాల పేల్చివేతరెస్క్యూ సమయంలో ఇసుకలో చిక్కుకుపోయిన అమెరికా సైనిక విమానాలను శత్రువుల చేతికి చిక్కకుండా ఉండేందుకు సైన్యం వాటిని పేల్చివేసింది. ‘మా దగ్గర ఉన్న అత్యుత్తమ సాంకేతికతను ఇరానియన్లు కాపీ కొట్టే అవకాశం ఇవ్వదలచుకోలేదు. అందుకే వాటిని ముక్కలుగా పేల్చేశాం’ అని ట్రంప్ వివరించారు.ఇదీ చదవండి: ఇరాన్తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు -
పెట్టుబడులకు బూస్ట్.. వడ్డీరేట్ల కట్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులు నెలకొన్నప్పటికీ అటు పెట్టుబడులకు ఊతమిస్తూనే ఇటు పశ్చిమాసియా సంక్షోభంతో దెబ్బతిన్న రంగాలను ఆదుకునేలా వడ్డీ రేట్లను కూడా తగ్గించగలిగే సామర్థ్యాలు భారత్కి ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దశాబ్దకాలంగా పాటిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ ప్రతిఫలం ఇదని ఆమె పేర్కొన్నారు. కఠినతరమైన పరిస్థితులను అధిగమించాలంటే మేలైన ఆర్థిక విధానాలు పాటించడం అవసరమని ఆమె పేర్కొన్నారు. భారీ రుణ భారాలు, ద్రవ్య లోటుతో సతమతమవుతున్న కొన్ని దేశాల్లో భారత్లో ఉన్నటువంటి వెసులుబాటు లేదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్పీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ముందుంది గడ్డుకాలం... పశ్చిమాసియాలో ఉద్రిక్తతలనేవి ప్రాంతీయ భద్రతా సవాళ్ల స్థాయి నుంచి వ్యవస్థాగతంగా ప్రకంపనలు సృష్టించే స్థాయికి విస్తరించాయని, అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు కీలకమైన మార్గాలకు పెను ముప్పుగా మారాయని మంత్రి చెప్పారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత కఠినతరంగా ఉండబోతోందని తెలిపారు. గతేడాది వాణిజ్యపరమైన ఉద్రిక్తతలతో గ్లోబల్ సరఫరా వ్యవస్థల్లో అనిశ్చితి నెలకొని, గ్లోబల్ వృద్ధి అంచనాలను దిగువముఖంగా తిరగరాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అయినప్పటికీ భారత్ పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. జీడీపీలో ప్రభుత్వ రుణభారం సుమారు 81 శాతమేనని, జర్మనీ మినహాఅతి పెద్ద ఎకానమీల్లో ఇదే తక్కువ స్థాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. -
ఇరాన్తో భారత్ సహా పలు దేశాల ఒప్పందాలు
పశ్చిమాసియాలో యుద్ధ భయాల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత మొదటిసారిగా ఈ జలసంధి గుండా నౌకల రాకపోకలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారత్ వంటి ఇంధన అవసరాలు అధికంగా ఉన్న దేశాలు ఇరాన్తో జరిపిన చర్చలు సఫలం కావడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.రెండు రోజుల్లో 21 నౌకల ప్రయాణంగత వారాంతంలో ఈ జలమార్గం గుండా ఏకంగా 21 నౌకలు ప్రయాణించాయి. మార్చి మొదటి వారంలో ట్రాఫిక్ నిలిచిపోయిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో నౌకలు ప్రయాణించడం ఇదే తొలిసారి. ఈ 21 నౌకలలో 13 నౌకలు ఇప్పటికే అరేబియా సముద్రంలోకి చేరుకున్నాయి. ఇరాన్ నౌకల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ మిత్రదేశం అనే కారణంతో ఇరాక్ ముడి చమురు ట్యాంకర్లకు టెహ్రాన్ ప్రత్యేక మినహాయింపునిచ్చింది. భారతదేశం ఇరాన్తో జరిపిన దౌత్యపరమైన చర్చల ఫలితంగా ఎనిమిది ఎల్పీజీ ట్యాంకర్లు ఈ మార్గం ద్వారా సురక్షితంగా బయటపడ్డాయి.అగ్రరాజ్యం హెచ్చరికలుయుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని, ఆ దేశానికి నరకం చూపిస్తామని హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ తన పట్టును మరింత బిగించింది. నౌకల ప్రయాణంపై టోల్ వసూలు చేసే ప్రక్రియను చట్టబద్ధం చేస్తూ కొత్త నిబంధనలను తీసుకువస్తామని చెప్పింది. యుద్ధం వల్ల కలిగే నష్టాలను ఈ రుసుములతోనే భర్తీ చేస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది. ప్రస్తుతానికి భారత్, చైనా, గ్రీస్, టర్కీ, థాయ్లాండ్ దేశాలకు చెందిన నౌకలు ఇరాన్ సూచించిన తీర ప్రాంత మార్గాల గుండా ప్రయాణిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నాయి. అయినప్పటికీ, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య రంగాన్ని కలవరపెడుతూనే ఉన్నాయి.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు! -
యుద్ధం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు!
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ప్రమాదం ఉందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్మన్ తుహిన్ కాంత పాండే హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలు చమురు, గ్యాస్ సరఫరాలపై తీవ్ర ఆంక్షలకు దారితీసి అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదలకు కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.సోమవారం ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ’ (సీఐఐ) నిర్వహించిన కార్పొరేట్ గవర్నెన్స్ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, కార్పొరేట్ రంగం ఎదుర్కోవాల్సిన సవాళ్లపై వ్యాఖ్యలు చేశారు.సంక్షోభంలో ప్రపంచంగత కొన్నేళ్లుగా వ్యాపార సంస్థలు, నియంత్రణ సంస్థలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని పాండే గుర్తుచేశారు. ‘కొవిడ్ సృష్టించిన అస్థిరత నుంచి కోలుకోకముందే కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతిక మార్పులు వ్యవస్థలను పరీక్షించాయి. ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరోసారి ప్రమాదంలోకి నెట్టేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సంస్థాగత అంశాలు, బలమైన పాలనా పద్ధతులు అత్యంత అవసరమన్నారు.కార్పొరేట్ గవర్నెన్స్లో మార్పుకంపెనీల బోర్డులు కేవలం నామమాత్రంగా ఉండకూడదని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో నాణ్యత పెరగాలని సెబీ ఛైర్మన్ స్పష్టం చేశారు. ‘బోర్డు సభ్యులుగా ఎవరున్నారన్న దానికంటే వారు సంస్థ పర్యవేక్షణలో ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారనేది ముఖ్యం. పటిష్టమైన పాలనా ప్రమాణాల అమలులో స్వతంత్ర డైరెక్టర్లే కీలకం. వారి పనితీరును మెరుగుపరిచేందుకు సెబీ త్వరలో ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. పెరుగుతున్న సంక్లిష్ట వ్యాపార వాతావరణంలో స్వతంత్ర డైరెక్టర్లకు శిక్షణ, అవగాహన కల్పించడానికి ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని సెబీ యోచిస్తోంది’ అన్నారు.నిరంతర పర్యవేక్షణే మార్గంపాలనా పరమైన సంస్కరణల్లో భాగంగా కాలానుగుణ సమీక్షల స్థానంలో నిరంతర పర్యవేక్షణ పద్ధతిని తీసుకురావాలని పాండే సూచించారు. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయన్నారు. సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడమే తదుపరి దశ పాలనా సంస్కరణల ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి దృష్ట్యా భారతీయ కంపెనీలు తమ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ను మరింత పటిష్టం చేసుకోవాలని ఈ సదస్సు వేదికగా సెబీ ఛైర్మన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు! -
భారత్ వృద్ధికి ‘రిస్క్’.. అంచనాలకు మూడీస్ కోత
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో భారత్ వృద్ధి అంచనాలకు మూడీస్ కోత విధించింది. గతంలో 6.8 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందన్న అంచనాలను 6 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. పశ్చిమాసియా యద్ధ సంక్షోభంతోపాటు.. ఇప్పటి వరకు నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణం పెరిగిపోయే రిస్క్తో వృద్ధి మోస్తరు స్థాయికి పరిమితం అవుతుందని పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్పీజీ రవాణాకు ఆటంకాలు మరింత కాలం పాటు గృహాలకు సరఫరా కొరతకు దారితీస్తుందని.. అధిక ఇంధన రవాణా ఖర్చులు ఆహార ద్రవ్యోల్బణానికి కారణమవుతాయని హెచ్చరించింది. భారత్ చమురు, గ్యాస్ సరఫరాకు హర్మూజ్ జలసంధి కీలకంగా ఉండడం తెలిసిందే. 2026–27లో ద్రవ్యోల్బణం 4.8 శాతం స్థాయిలో ఉండొచ్చని, 2025–26లో ఉన్న సగటు 2.4 శాతంతో పోల్చితే రెట్టింపు అవుతుందని మూడిస్ పేర్కొంది.వృద్ధికి అవరోధాలు, ద్రవ్యోల్బణం రిస్క్ల నేపథ్యంలో పాలసీ రేట్లు స్థిరంగా లేదంటే క్రమంగా పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఎంత కాలం పాటు పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతుంది? ఇంధనం, ఆహారంపై దాని ప్రభావంపైనే ఇది ఆధారపడి ఉంటుందని తెలిపింది. పెరిగిపోయిన చమురు, ఎరువుల ధరలు లకి‡్ష్యత సబ్సిడీలు మరింత పెరిగేలా చేస్తాయని.. దీంతోపాటు ఆదాయం కూడా తగ్గిపోతుందని పేర్కొంది. వినియోగదారులపై ప్రభావం పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం తెలిసిందే. స్థిరంగానే ఎగుమతులువస్తు, సేవల ఎగుమతులు స్థిరంగానే ఉంటాయని మూడిస్ అంచనా వేసింది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురు, ఎరువుల సరఫరాకు మార్గాలు గుర్తిస్తున్నందున దిగుమతుల వ్యయాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆర్థిక సహకార, అభివృద్ది సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్ జీడీపీ 2026–27లో 6.1 శాతానికి పరిమితం అవుతుందని అంచనా వేయగా, ఈవై ఒక శాతం వరకు వృద్ధి రేటు తగ్గే అవకాశం ఉందని పేర్కొనడం గమనార్హం. దేశీ రేటింగ్ సంస్థ ఇక్రా 2026–27లో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. -
ఎక్కడి రేట్లు అక్కడే! ఆర్బీఐ పాలసీ మీట్ నేటి నుంచే..
ముంబై: ఆర్బీఐ ఎంపీసీ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా, యథాతథంగా కొనసాగించొచ్చని విశ్లేషకులు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బీఐ ఎంపీసీ మూడు రోజుల సమీక్ష 6న ప్రారంభం కానుంది. 8వ తేదీన (బుధవారం) కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ కుమార్ మల్హోత్రా మీడియాకు వెల్లడించనున్నారు.గత సమీక్షలో రెపో రేటు 5.25 శాతంలో ఎలాంటి మార్పు చేయని విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, కమోడిటీల ధరలు గరిష్టాల్లో ట్రేడ్ అవుతుండడం, రూపాయి మారకం విలువలో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో ఆర్బీఐ రేట్ల సవరణకు మొగ్గు చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.‘‘చమురు ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల అనిశ్చితుల నేపథ్యంలో ఆర్బీఐ ఏప్రిల్ పాలసీ సమీక్షలో రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా దాటవేయొచ్చు. ద్రవ్యోల్బణం డేటాను లోతుగా పరిశీలించిన తర్వాతే రేట్లపై తదుపరి నిర్ణయానికి రావొచ్చు’’అని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చని ఎస్బీఐ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ సైతం అంచనా వేశారు.చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల పైకి చేరడం, రూపాయి డాలర్తో 93కు పడిపోవడం, సూపర్ ఎల్నినో అంచనాలు ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లను పెంచొచ్చన్నారు. స్వల్పకాల పరిణామాల ఆధారంగా రేట్లపై ఆర్బీఐ నిర్ణయానికి రాలేదని.. ద్రవ్యోల్బణం తీరుపై స్పష్టత వచ్చాకే రేట్లపై నిర్ణయం తీసుకోవచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త శక్తి గుప్తా అభిప్రాయపడ్డారు. -
ప్రమోటర్ల దారెటు..?
కొన్నాళ్లుగా అమెరికా సుంకాలు... ఇపుడేమో ఇరాన్ యుద్ధం. మార్కెట్లు విపరీతమైన ఊగిసలాటకు గురవుతున్నాయి. గడిచిన ఆరునెలల రికార్డు చూస్తే 90 శాతానికి పైగా స్టాక్స్ నష్టాల్లోనే ఉన్నాయి. కొన్ని స్టాక్స్ 50 శాతానికి పైగా నష్టపోయాయంటే అతిశయోక్తి కాదు. కొందరేమో ఇపుడు కొంత సొమ్ము ఇన్వెస్ట్ చేయొచ్చని చెబుతున్నారు. మరికొందరేమో ఇంకొన్నాళ్లు ఆగాలని చెబుతున్నారు. ఒకరకంగా ఇది గందరగోళ పరిస్థితే. ఇప్పటికే బాగా నష్టపోయిన వారి పరిస్థితయితే మరీ దారుణం. మరేం చెయ్యాలి? ఈ ప్రశ్నకు జవాబు వెదికే ముందు మరో సంగతి చూద్దాం.. అది.. ప్రమోటర్లు ఏం చేస్తున్నారనేది. ఎందుకంటే ప్రమోటర్లు కూడా పరిస్థితులకు తగ్గట్టుగా వారి కంపెనీలో వారికున్న షేర్లనూ విక్రయిస్తుంటారు. కొన్నిసార్లు కొంటుంటారు. షేరు ధర పడిపోతే వారి కంపెనీ విలువతో పాటు వారి షేర్ల విలువా తగ్గిపోయినట్టే. తాజా పతనంలో వారూ నష్టపోయినట్లే. అయితే సొంత కంపెనీ షేర్లను కొంటున్నా, అమ్ముతున్నా అది మిగిలిన ఇన్వెస్టర్లకు వారిస్తున్న సంకేతంగానే భావించాలి. ఎందుకంటే మిగతా వారందరి కన్నా ఫౌండర్స్, మేనేజ్మెంటుకే కంపెనీ వాస్తవ స్థితిగతులు ఎక్కువగా తెలుస్తాయి. వారు స్పెక్యులేషన్ బట్టి కాకుండా క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టే ప్రమోటర్లు తమ షేరును కొనడాన్ని మార్కెట్ కొంత సానుకూల విషయంగా పరిగణిస్తుంది. వారు సొంత డబ్బును మరింతగా ఇన్వెస్ట్ చేయడాన్ని కంపెనీ వ్యాపారంపై వారికి గల ధీమాగా భావిస్తుంది. ప్రమోటర్లు ఇలా కొనుగోళ్లు, అమ్మకాలు జరపడమనేది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? సాధారణ ఇన్వెస్టర్లు వాటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? సదరు స్టాక్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు? ఇందులో పొంచి ఉన్న రిస్కులు ఏమిటి? ఇవన్నీ ఈ వెల్త్ స్టోరీలో చూద్దాం... కొనుగోళ్లకు ఎందుకంత ప్రాముఖ్యత.. ప్రమోటర్లు షేర్లను కొనుక్కోవడమనేది ఒకోసారి స్టాక్ విలువ ఉండాల్సిన స్థాయి కంటే తక్కువే ఉందని (అండర్వేల్యుయేషన్) భావించడానికి సంకేతంగా చూడొచ్చు. అలాగే, దీర్ఘకాలికంగా వ్యాపారంపై వారికున్న నమ్మకాన్ని ప్రతిబింబించవచ్చు. సాధారణంగా ఆదాయాలు మెరుగుపడటానికి, స్టాక్ రీ–రేటింగ్కి ముందు ఇలాంటివి కనిపిస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే.. స్టాక్ తగ్గిందంటే దానిపై మార్కెట్లో నిరాశపూరిత ధోరణికి సిగ్నల్గా, ప్రమోటర్లు కొంటున్నారంటే.. కాని్ఫడెన్సుకి సంకేతంగా పరిగణిస్తుంటారు.ఈ డేటాను ఎలా ఉపయోగించుకోవాలంటే.. ప్రమోటర్లు కొన్ని త్రైమాసికాలుగా స్థిరంగా కొనుక్కుంటూ ఉండవచ్చు. మార్కెట్లు కరెక్షన్కి లోనైనప్పుడు కొనుక్కుంటూ ఉండొచ్చు. ఇలాంటి వాటిని ట్రాక్ చేయాలి. ప్రమోటర్లు అదనంగా కొంటున్నారేమో చూడాలి. షేర్హోల్డింగ్ ప్యాటర్న్ను ప్రమోటర్ సైకాలజీగా చూడాలి. ఎలా ట్రాక్ చేయొచ్చు..ప్రమోటర్ల యాక్టివిటీని దేశీయంగా ట్రాక్ చేసేందుకు కొన్ని సాధనాలున్నాయి. రియల్ టైమ్ డిస్క్లోజర్స్కి సంబంధించి సెబీ పీఐటీ (ఇన్సైడర్ ట్రేడింగ్) ఫైలింగ్స్లో చాలా తరచుగా, దాదాపు రియల్ టైమ్లో వివరాలు అందుబాటులో ఉంటాయి. అదే వాటాల్లో మార్పులేవైనా చోటు చేసుకుంటే సెబీ ఎస్ఏఎస్టీ ఫైలింగ్స్లో తెలుస్తుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు ఇన్సైడర్ ట్రేడింగ్ డిస్క్లోజర్లు, రెగ్యులేషన్ 10(5) .. 10 (6), ఎస్ఏఎస్టీ థ్రెషోల్డ్ ఫైలింగ్స్ రూపంలో ఉంటాయి.ప్రమోటరు అమ్మడం పూర్తి నెగటివ్ కాదు.. ప్రమోటర్లు అమ్ముతున్నారంటే తప్పకుండా దుర్వార్త ఏదో ఉండే ఉంటుందనే అభిప్రాయం అపోహ మాత్రమే. వివిధ కారణాలరీత్యా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయిస్తుండవచ్చు. వెల్త్ డైవర్సిఫికేషన్, కొత్త వెంచర్లకు నిధులను సమకూర్చుకోవడం, ఫ్యామిలీ లేదా ఎస్టేట్ ప్లానింగ్ కూడా కారణం కావచ్చు. ఇలాంటివేవీ కాకపోయి ఉంటే ప్రమోటర్ల విక్రయాలు కొన్ని సార్లు నిర్దిష్ట సంకేతాలు ఇస్తాయి. ర్యాలీ తర్వాత వేల్యుయేషన్ భారీ స్థాయికి చేరిపోయి ఉండొచ్చు. ఎరి్నంగ్స్, ఫండమెంటల్స్తో సంబంధం లేకుండా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ట్రేడవుతూ ఉండొచ్చు. లేదా వ్యూహాత్మకంగా లాభాల స్వీకరణ కోసం కూడా ప్రమోటర్లు కొంత వాటాలు అమ్ముకోవచ్చు. గుర్తుంచుకోవాల్సినది.. ప్రమోటర్లు కొనడమనేది కంపెనీ సామర్థ్యాలకు సంబంధించి శక్తివంతమైన సంకేతమే. కానీ దీని వెనుక ఉద్దేశాలను బట్టి రిస్కులు ఉండొచ్చు. కొనుక్కోవడమనేది స్టాక్ పతనాన్ని అడ్డుకునేందుకు కావొచ్చు, వేల్యూ ట్రాప్ చేసేందుకు కావొచ్చు, ధీమా ముసుగు వేసి బలహీన ఫండమెంటల్స్ని అధిగమించేందుకు కావచ్చు. ఇలా ఏదైనా కారణం కావచ్చు. కాబట్టి ప్రమోటర్లు కొనుగోళ్ల వ్యవహారాన్ని ఆర్థిక అంశాల విశ్లేషణ, క్యాష్ ఫ్లో, కార్పొరేట్ గవర్నెన్స్, తీసుకున్న రుణాలు.. తనఖా స్థాయులతో కలిపి అధ్యయనం చేస్తే అసలు విషయంపై మరికాస్త మెరుగైన అవగాహన ఏర్పడవచ్చు. ప్రమోటర్లు చాలా స్మార్ట్ ఇన్సైడర్స్. వారు తీసుకునే చర్యలనేవి నమ్మకాన్ని, వ్యూహాన్ని ప్రతిబింబిస్తాయి. వేల్యుయేషన్ని సూచిస్తాయి. అయితే, ఇన్సైడర్ సంకేతాలతో పాటు ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నప్పుడే ప్రయోజనం చేకూరుతుంది. ఇలాంటి సందర్భాల్లో గందరగోళానికి లోను కాకుండా దీర్ఘకాలిక దృష్టి కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది. ప్రమోటర్ సిగ్నల్ అనేది దిక్సూచి మాత్రమే తప్ప మ్యాప్ కాదు.– సాక్షి వెల్త్ -
తగ్గిన సిబిల్ స్కోర్.. సుప్రీంకోర్టుకు వెళ్లిన వ్యక్తి
లోన్ తీసుకుని చెల్లించకపోవడం, క్రెడిట్ కార్డు బిల్స్ సరైన సమయంలో క్లియర్ చేసుకోక పోవడం వంటివి జరిగితే సిబిల్ స్కోర్ / క్రెడిట్ స్కోర్ తగ్గిపోవడం లేదా నెగటివ్లోకి వెళ్లడం జరిగే అవకాశం ఉంది. అయితే ఒక వ్యక్తి ఎలాంటి లోన్ తీసుకోకపోయినా.. తన సిబిల్ స్కోర్ నెగటివ్గా చూపిస్తోందని కోర్టు మెట్లెక్కాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఉత్తరాఖండ్కు చెందిన రాజేంద్ర సింగ్ పన్వార్ అనే వ్యక్తి.. తాను 2020 నుంచి ఎలాంటి లోన్స్ తీసుకోకపోయినా సిబిల్ స్కోర్ నెగటివ్గా చూపిస్తోందని, దీనివల్ల లోన్స్, క్రెడిట్ కార్డులు తీసుకోలేక పోతున్నాననే కారణంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం.. సంబంధిత బ్యాంకుల నుంచి వివరాలు కోరింది.కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత బ్యాంకులు రాజేంద్ర సింగ్ పన్వార్ లావాదేవీలు పరిశీలించి, తాను ఎలాంటి లోన్స్ తీసుకోలేదని నిర్దారించాయి. అయితే అతని సిబిల్ స్కోర్ నెగటివ్లోకి వెళ్లడానికి కారణం.. ఒకే పేరుతో ఉన్న ఇతర వ్యక్తులకు అదే పాన్ నంబర్ జారీ కావడం అని తెలిసింది. దీనివల్లనే స్కోర్ నెగటివ్గా చూపించిందని వివరణలో తెలుసుకున్నారు. బ్యాంకుల వివరణల తరువాత పన్వార్ సిబిల్ జారీచేసినట్లు సంబంధిత సంస్థలు స్పష్టం చేశాయి.సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్నే సిబిల్ స్కోర్ అంటారు.సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి మార్గాలు➤ క్రెడిట్ కార్డు బిల్స్, ఈఎంఐ వంటివి సకాలంలో చెల్లించాలి. ఇది మీ సిబిల్ స్కోరును పెంచడంలో సహాయపడుతుంది. బిల్స్, ఈఎంఐ చెల్లింపులు ఆలస్యమైతే సిబిల్ స్కోర్ మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. దీంతో స్కోర్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ.. గడువుకు ముందే చెల్లింపులు పూర్తి చేయాలి.➤ లోన్ కోసం మళ్ళీ మళ్ళీ వెంట వెంటనే అప్లై చేయడం మానుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం ఆర్థిక ఒత్తిడిని సూచిస్తుంది. ఇది మీ సిబిల్ స్కోర్ను తగ్గిస్తుంది.➤ మీ పేరుతో లేదా మీ డాక్యుమెంట్స్ ఉపయోగించి ఎవరికైనా లోన్ తీసి ఇవ్వడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే లోన్ తీసుకున్న వ్యక్తి సకాలంలో ఈఎంఐ చెల్లించకపోతే.. ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోర్ మీద చూపిస్తుంది. రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మీరు విశ్వసిస్తే మాత్రమే.. హామీదారుగా ఉండటానికి అంగీకరించండి.➤ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకున్నప్పటికీ.. ఖర్చులను కొంత ఆచితూచి చేయాల్సి. ఖర్చులు పెరిగితే.. మీ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది.➤ సిబిల్ స్కోరును పెంచుకోవడానికి సరైన మార్గం.. క్రెడిట్ కార్డును ఉపయోగించడం మాత్రమే కాదు. సకాలంలో తిరిగి చెల్లించడం. ఇవన్నీ సరిగ్గా పాటిస్తే మీరు ఉత్తమ సిబిల్ స్కోర్ తప్పకుండా పొందుతారు.ఇదీ చదవండి: డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా? -
రూపాయి రక్షణలో.. మరింత తగ్గిన ఫారెక్స్, బంగారం నిల్వలు
ముంబై: అధిక చమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, రూపాయి విలువ కాపాడే చర్యలు విదేశీ మారకం నిల్వలపై ప్రభావం చూపిస్తున్నాయి. మార్చి 27తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు (ఫారెక్స్) అంతకుముందు వారంతో పోల్చితే 10.29 బిలియన్ డాలర్లు తగ్గి 688.06 బిలయన్ డాలర్లకు పరిమితమయ్యాయి.గత వారంలోనూ ఫారెక్స్ నిల్వలు 11.41 బిలియన్ డాలర్లు తగ్గడం గమనార్హం. ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా యుద్ధానికి ముందు ఫిబ్రవరి 27న దేశ ఫారెక్స్ నిల్వలు ఆల్టైమ్ గరిష్టం 728.49 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. మార్చి 27తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వల్లో.. కరెన్సీ అసెట్స్ 6.62 బిలియన్ డాలర్లు తగ్గి 551.07 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.బంగారం నిల్వల విలువ 3.66 బిలియన్ డాలర్లు తగ్గి 113.52 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐఎంఎఫ్ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 17 మిలియన్ డాలర్లు పెరిగి 18.64 బిలియన్ డాలర్లకు చేరింది. -
దారి మళ్లిన ఇరాన్ చమురు నౌక..
ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన ముడి చమురు నౌక తన దారి మార్చుకుంది. గుజరాత్లోని వాడినార్ పోర్టుకు రావాల్సిన ‘పింగ్ షున్’ అనే నౌక గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు ప్రయాణిస్తోంది. చెల్లింపు నిబంధనల విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.ఏమిటీ వివాదం?ఇరాన్లోని ఖర్గ్ ఐలాండ్ నుంచి సుమారు 6,00,000 బ్యారెళ్ల ముడి చమురుతో బయలుదేరిన ఈ నౌక భారత్కు చేరుకోవాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో అమ్మకందారులు క్రెడిట్ నిబంధనలను కఠినతరం చేయడంతో చిక్కుముడి పడింది. సాధారణంగా ఇరాన్ చమురు వ్యాపారంలో 30 నుంచి 60 రోజుల క్రెడిట్ గడువు ఉంటుంది. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విక్రేతలు తక్షణమే లేదా స్వల్పకాలిక వ్యవధిలోనే నగదు చెల్లించాలని పట్టుబడుతున్నారు. భారత్ ఈ కఠిన నిబంధనలకు అంగీకరించకపోవడంతో సదరు నౌక తన దిశను మార్చుకుని చైనా వైపు మళ్లిందని అంతర్జాతీయ డేటా విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ వెల్లడించింది.అమెరికా ఊరట నిచ్చినా తప్పని తిప్పలుపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా మార్చి 20 లోపు లోడ్ అయిన ఇరాన్ నౌకలపై అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షలను సడలించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుని తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవాలని భారత్ భావించింది. కానీ, వాణిజ్య పరమైన చెల్లింపుల సమస్యలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. ‘చెల్లింపు సమస్యలు పరిష్కారమైతే ఈ కార్గో తిరిగి భారత రిఫైనరీలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం లాజిస్టిక్స్ కంటే వాణిజ్య నిబంధనలే ఇరాన్ చమురు సరఫరాను శాసిస్తున్నాయి’ అని కెప్లర్ లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రితోలియా తెలిపారు.తగ్గుతున్న రాయితీలుమరోవైపు, రష్యా, ఇరాన్ చమురుపై ఇన్నాళ్లూ లభించిన భారీ డిస్కౌంట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, కొనుగోలుదారులు ఎక్కువ కావడంతో ఈ నౌకలపై డిస్కౌంట్లు తగ్గి కొన్ని సందర్భాల్లో ప్రీమియం ధరలు కూడా వసూలు చేస్తున్నట్లు ‘వొర్టెక్సా’ నివేదిక పేర్కొంది. రష్యా చమురుపై ఆంక్షల సడలింపు తర్వాత భారత దిగుమతులు పుంజుకున్నప్పటికీ, ఇరాన్ విషయంలో మాత్రం చెల్లింపుల చిక్కులు వీడటం లేదు. చైనా వంటి దేశాలు భారీగా దిగుమతులు చేసుకుంటున్న తరుణంలో భారత్ తన ఇంధన భద్రత కోసం ఇరాన్తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
ట్రంప్ పాచిక పారేనా?
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నుంచి సులభంగా నిష్క్రమించగలరా? అనే ప్రశ్న వస్తోంది. ఈ అనిశ్చితుల నేపథ్యంలో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లు విలువ పరంగా ఇటీవల కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భౌగోళిక రాజకీయ పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి.వ్యూహాత్మక ఆధిపత్యం: ఇరాన్ ఎందుకు కీలకం?గత కొంతకాలంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమి గాజా, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో తమ వ్యతిరేక శక్తులను క్రమపద్ధతిలో బలహీనపరుస్తూ వస్తున్నాయి. గల్ఫ్ దేశాలు పాలస్తీనాకు సానుభూతి తెలుపుతున్నట్లు కనిపిస్తున్నా లోలోపల అమెరికా రక్షణ గొడుగు కిందకే చేరుతున్నాయి. గల్ఫ్ దేశాల సంపద అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడిగా మారుతూ యూఎస్ ఆర్థిక ఆధిపత్యాన్ని బలపరుస్తోంది.అయితే, ఈ పూర్తిస్థాయి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది ఇరాన్, దాని ప్రాక్సీలు (హిజ్బుల్లా, హౌతీలు). హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం ద్వారా చైనా వంటి ఆసియా దేశాల ఇంధన సరఫరాను నియంత్రించే ‘ట్రంప్ కార్డ్’ అమెరికాకు ఇక్కడే దొరుకుతుంది. అందుకే ఈ దశలో యుద్ధం నుంచి వైదొలగడం అంటే ఇరాన్ సామీప్య శక్తులకు తలవంచడమే అవుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అమెరికా చర్యలను ఇరాన్ ప్రతిఘటిస్తుండడం అగ్రరాజ్యానికి మింగుడుపడడం లేదు. దాంతో యూఎస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఇరాన్లోని మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. అందుకు తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పింది.ఆర్థిక సంక్షోభంఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బదీస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థికవేత్త కెన్నెత్ రోగోఫ్ హెచ్చరించినట్లుగా, ఐదు దశాబ్దాల్లో ప్రపంచం చూడని అతిపెద్ద స్టాగ్ఫ్లేషనరీ ముప్పు (ఆర్థిక మందగమనం + అధిక ద్రవ్యోల్బణం) దిశగా ఈ యుద్ధం దారితీస్తోంది. మార్చి నెల జేపీ మోర్గాన్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ప్రకారం, ఇన్పుట్ ధరల ద్రవ్యోల్బణం 44 నెలల గరిష్టానికి చేరింది. ఇది వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లింది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, చమురు, ఎరువుల సరఫరాలో అంతరాయం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్స్లు తగ్గడం వంటి అంశాలు రూపాయి విలువను మరింత పాతాళానికి నెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రతిచర్యగా ఆర్బీఐ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది.భారత మార్కెట్లు - రంగాల వారీ విశ్లేషణవిమానయానం, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలు పెరిగిన ఇంధన, ముడిసరుకు ధరల వల్ల ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. యుద్ధతంత్రంలో మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే భారతీయ రక్షణ కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.రసాయన, సిరామిక్ రంగాల్లో కొన్ని బలహీనమైన సంస్థలు నిష్క్రమించి, పటిష్టమైన కంపెనీలకు మార్కెట్ వాటా పెరిగే అవకాశం ఉంది.ట్రంప్ ఏం చేయబోతున్నారు?ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎంత దారుణంగా నిర్వహించినా చివరకు తనే గెలిచినట్లు ప్రకటించుకుని వైదొలిగే అవకాశం ఉంది. ఆయనకు ఓటమిని అంగీకరించే అలవాటు లేదు. యుద్ధం ముగిసినా దాని వల్ల కలిగే ఆర్థిక పర్యవసానాలు మాత్రం దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వేచి చూసే ధోరణి ఉత్తమం.ఇదీ చదవండి: వైద్యరంగానికి ‘సహకారి’ కరవు -
ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.కొత్త పని గంటలుపెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.విద్యా రంగంలో మార్పులుపాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు -
వంతెనలు.. అభివృద్ధికి వారధులు
పశ్చిమాసియాలో భీకరపోరు కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ను, పశ్చిమ నగరమైన కరాజ్తో అనుసంధానిస్తూ సుమారు 136 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై అమెరికా తాజాగా జరిపిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగానే కాకుండా ఒక దేశ ఆర్థిక వెన్నెముకపై దెబ్బకొట్టే వ్యూహంగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.ఆర్థికాభివృద్ధికి వంతెనలే ప్రాణాధారంఏ దేశానికైనా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. వంతెనలు ఇరు ప్రాంతాలను కలపడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటి వల్ల..ప్రయాణ దూరాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.పారిశ్రామిక హబ్లను నౌకాశ్రయాలతో లేదా మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి.భారీ వంతెనల నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలను, సామగ్రిని వేగంగా తరలించడానికి వంతెనలు కీలకం.దేశ ప్రగతికి నిదర్శనాలుభారతదేశం కూడా గత దశాబ్ద కాలంలో అద్భుతమైన వంతెనలను నిర్మించి తన ఆర్థిక శక్తిని చాటుకుంది.అటల్ సేతు: ముంబై - నవీ ముంబైలను కలిపే ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ఇది పారిశ్రామిక కారిడార్లకు ఊపిరిపోస్తోంది.చీనాబ్ వంతెన: జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఇది వ్యూహాత్మకంగా, పర్యాటక పరంగా భారత్కు ఎంతో కీలకం.ధోలా-సాదియా వంతెన: అసోం, అరుణాచల్ ప్రదేశ్లను అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనే మార్చివేసింది.నెక్ట్స్ ‘కింగ్ ఫహాద్ కాజ్వే’?ఇరాన్ వంతెనపై దాడి నేపథ్యంలో కింగ్ ఫహాద్ కాజ్వే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్తో కలిపే ఈ 25 కిలోమీటర్ల భారీ వంతెన మిడిల్ఈస్ట్లో అత్యంత కీలకమైన రవాణా మార్గం. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళన నెలకొంది. ఒకవేళ కింగ్ ఫహాద్ కాజ్వే వంటి వంతెనలు దెబ్బతింటే గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు! -
అసంఘటిత రంగంలో ఉపాధి మెరుగు
అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు 2025లో 6.18 శాతం పెరిగి 12,80,51,800కు చేరాయి. గతేడాది 74.52 లక్షల కొత్త అవకాశాలు వచ్చాయి. ఇందులో 35 లక్షల ఉపాధి అవకాశాలు ఇతర సేవల విభాగంలో ఏర్పడ్డాయి. ఈ వివరాలను అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (ఆసుసే) నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఈ వార్షిక సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 2023 అక్టోబర్ చివరికి ఈ రంగలో ఉపాధి అవకాశాలు 12,05,99,800గానే ఉన్నాయి.అసంఘటిత రంగంలో సంస్థల సంఖ్య 7.34 కోట్ల నుంచి 7.92 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఇతర సేవల విభాగంలో సంస్థల సంఖ్య 10.29 శాతం పెరిగింది. ఆ తర్వాత తయారీ రంగంలో 6.48 శాతం, వాణిజ్య విభాగంలో 6.18 శాతం చొప్పున కొత్త సంస్థలు అవతరించాయి. ఆర్థిక పనితీరును సూచించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) 10.87 శాతం ఎగిసింది. ట్రేడ్ విభాగంలో 16.77 శాతం, తయారీలో 8.52 శాతం, సేవల విభాగంలో 7.36 శాతం మేర జీవీఏ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. ఇతర సేవల విభాగం వాటా జీవీఏలో 42 శాతంగా ఉంటే, ట్రేడ్ విభాగం 37 శాతం, తయారీ 21 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఒక్కో కారి్మకుడి జీవీఏ (కార్మికుల ఉత్పాదకత) 2023–24లో ఉన్న రూ.1,49,742 నుంచి రూ.1,56,539కు చేరింది. అన్ఇన్కార్పొరేటెడ్ అంటే వ్యవసాయేతర రంగాల్లోని ప్రైవేటు సంస్థలతో కూడినది కావడం గమనార్హం. మహిళా సంస్థల్లో వృద్ధి..మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు 2023–24లో 26.2 శాతంగా ఉంటే, 2025లో 27 శాతానికి పెరిగాయి. ఒక్కో ఉద్యోగికి చెల్లించే వేతనం గతేడాది 3.88 శాతం పెరిగింది. ముఖ్యంగా ట్రేడ్ విభాగంలో కారి్మకుల వేతనం అత్యధికంగా 8.5 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ను వినియోగించే సంస్థల సంఖ్య సైతం 26.7 శాతం నుంచి 39.4 శాతానికి పెరిగాయి. వ్యాపార నిర్వహణలో టెక్నాలజీ స్వీకరణను ఇది తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 6,70,289 సంస్థల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
పుష్కరకాలం తర్వాత రూపాయి భారీ ర్యాలీ
బ్యాంకుల డాలర్–రూపాయి ఫార్వర్డ్ ట్రేడింగ్ను నియంత్రించేందుకు ఆర్బీఐ పలు చర్యలు తీసుకోవడంతో డాలర్ మారకంలో రూపాయి విలువ 152 పైసలు బలపడి 93.18 వద్ద ముగిసింది. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 94.62 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 188 పైసలు బలపడి 92.82 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. గడిచిన 12 ఏళ్లల్లో ఒకరోజులో ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి.‘ఫారెక్స్ మార్కెట్లో మార్పులను సమీక్షించిన తర్వాత ఆర్బీఐ కొన్ని నియంత్రణ చర్యలు ప్రకటించింది. రూపాయికి సంబంధించిన నాన్–డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను రెసిడెంట్, నాన్–రెసిడెంట్ వినియోగదారులకు అందించకుండా బ్యాంకులను ఆర్బీఐ ఆంక్షలు విధించింది. అలాగే, ఈ ఆదేశాల తర్వాత రద్దు చేసిన ఎలాంటి ఫారెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టులను అయినా మళ్లీ బుక్ చేసుకోవడాన్ని కూడా పరిమితం చేసింది. దీనివల్ల డాలర్లకున్న కృత్రిమ డిమాండ్ తగ్గడంతో రూపాయికి బలం చేకూరింది’ అని మీరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ నిపుణుడు అనుజ్ చౌదరీ తెలిపారు.ఇదీ చదవండి: ఆంత్రోపిక్ సోర్స్ కోడ్ లీక్! -
క్రాష్ టు బౌన్స్బ్యాక్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి అనూహ్యంగా కోలుకొని స్వల్ప లాభంతో ముగిసింది. ఐటీ, బ్యాంకుల షేర్లలో బలమైన కొనుగోళ్లు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గణనీయమైన రికవరీ అంశాలు కలిసొచ్చాయి. ఇంట్రాడేలో 1,588 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ చివరికి 185 పాయింట్ల లాభంతో 73,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం నుంచి 530 పాయింట్లు కోలుకుంది. ఆఖరికి 34 పాయింట్లు పెరిగి 22,713 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా 4.67%, జపాన్ 2.43%, ఇండోనేసియా 2.24%, తైవాన్ 1.85% క్షీణించాయి. చైనా, హాంగ్కాంగ్ 1%, సింగపూర్ అరశాతం నష్టపోయాయి. యూరప్లో ఫ్రాన్స్, జర్మనీ ఇండెక్సులు అరశాతం పతనమయ్యాయి. బ్రిటన్ సూచీ 1% పెరిగింది. అమెరికా స్టాక్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆరంభంలో భారీ క్రాష్: రానున్న 2–3 వారాల్లో ఇరాన్పై భీకర దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ హెచ్చరికలు, క్రూడాయిల్ ధరలు ఎగసిపడటం, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 1,588 పాయింట్లు కుప్పకూలి 71,546 వద్ద, నిఫ్టీ 497 పాయింట్లు క్షీణించి 22,183 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. రికవరీ కారణాలు ఇవే: ఆర్బీఐ నియంత్రణ చర్యలతో డాలర్ మారకంలో రూపాయి విలువ గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 152 పైసలు బలపడింది. మిడ్ సెషన్ నుంచి ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన లార్జ్క్యాప్ షేర్లలో వాల్యూ బయింగ్ కొనుగోళ్లు చోటుచేసుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ ఇంట్రాడే కనిష్టం (71,546) నుంచి 2023 పాయింట్లు ఎగసి 73,569 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం ఇంట్రాడే కనిష్టం (22,183) నుంచి 600 పాయింట్లు ర్యాలీ చేసి 22783 వద్ద గరిష్టాన్ని అందుకుంది.సాయి పేరెంటరల్స్ లిస్టింగ్ సక్సెస్ఫార్మాస్యూటికల్ కంపెనీ సాయి పేరెంటరల్స్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర (రూ.392)తో పోలిస్తే బీఎస్ఈలో 3% ప్రీమియంతో రూ.405 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 6.17% పెరిగి రూ.416 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 3.67% లాభంతో రూ.406 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,795.44 కోట్లుగా నమోదైంది.→ పవర్ సొల్యూషన్స్ ప్రొవైడర్ పవరికా లిస్టింగ్లో నిరాశపరిచింది. ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర (రూ.395)తో పోలిస్తే 7.34% డిస్కౌంటుతో రూ.366 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 365 – 397 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 2.53% నష్టంతో రూ.385 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,872 కోట్లుగా నమోదైంది.→ బాస్మతి బియ్యం ఎగుమతి సంస్థ అమీర్ చంద్ జగదీష్ కుమార్(ఎక్స్పోర్ట్స్) పేలవంగా లిస్టయింది. బీఎస్లో ఇష్యూ ధర (రూ.212)తో పోలిస్తే 8% డిస్కౌంటుతో రూ.195 వద్ద లిస్టయ్యింది. రోజంతా నష్టాల్లో ట్రేడవుతూ చివరికి 11% పతనంతో రూ.189 వద్ద ముగిసింది. -
ఇంకా పూర్తిగా వెనక్కిరాని పెద్ద నోట్లు!
చలామణీలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో దాదాపు 98.45 శాతం వెనక్కి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించింది. 2023 మే 19న ప్రకటించిన ఈ నోట్ల ఉపసంహరణను ప్రకటించినప్పుడు రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు చలామణీలో ఉండగా 2026 మార్చి 31 నాటికి ఇది రూ. 5,501 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ ఆఫీసుల్లో పెద్ద నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు ఉంది. అలాగే తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ఇండియా పోస్ట్ ద్వారా కూడా ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు పంపించవచ్చు. -
పాకిస్థాన్కు వీసా నిలిపివేసిన ఖతార్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితులు వివిధ దేశాల్లోని దౌత్య, రవాణా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు, దానికి అమెరికా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో నెలకొన్న అస్థిరతను దృష్టిలో ఉంచుకుని ఖతార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు ఇప్పటివరకు కల్పిస్తున్న ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.రాయబార కార్యాలయం ప్రకటనవీసా ఆన్ అరైవల్ అంటే ఒక దేశానికి వెళ్లాలనుకునే ప్రయాణికులు తమ స్వదేశంలోనే ముందస్తుగా వీసా కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. నేరుగా ఆ దేశానికి చేరుకున్న తర్వాత అక్కడి విమానాశ్రయంలోనో లేదా సరిహద్దు చెక్-పోస్ట్ వద్దనో వీసా పొందవచ్చు. ఈ తాజా పరిణామంపై దోహాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల దృష్ట్యా ఖతార్ ఈ నిర్ణయం తీసుకుందని, పాక్ పౌరులు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా పాకిస్థాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం అందుబాటులో లేదు. ప్రయాణికులు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే ముందస్తుగానే వీసాలు పొందాలి’ అని పాక్ ఎంబసీ స్పష్టం చేసింది.ఎవరిపై ప్రభావం?ఖతార్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల తక్షణం పనుల నిమిత్తం వెళ్లే వ్యాపారులకు ఇది సమస్యగా మారుతంది. స్వల్పకాలిక ప్రాజెక్టుల కోసం వెళ్లే నిపుణులు, వీసా నిబంధనల సరళీకరణతో ఖతార్ వెళ్లాలనుకున్న సందర్శకులకు ఇది అవాంతరంగా మారుతుంది. కేవలం పాకిస్థానే కాకుండా లెబనాన్ పౌరులపై కూడా ఖతార్ ఇవే ఆంక్షలు విధించింది. లెబనాన్ నుంచి వచ్చే వారు ఇప్పుడు అధికారిక ‘Hayya.qa’ ప్లాట్ఫారమ్ ద్వారా ముందుగా వీసా పొంది దాని ప్రింటెడ్ కాపీని వెంట ఉంచుకోవడం తప్పనిసరి.ఎందుకీ నిర్ణయంఖతార్ ప్రభుత్వం పాకిస్థాన్, లెబనాన్ పౌరులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని నిలిపివేయడం వెనుక ప్రధానంగా భద్రతా, దౌత్యపరమైన కారణాలు ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఖతార్ భౌగోళికంగా ఈ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉంది. దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అనే అంశంపై పూర్తి నియంత్రణ సాధించాలని ఖతార్ భావిస్తోంది. వీసా ఆన్ అరైవల్ ఇస్తే ప్రయాణికుల పూర్తి నేపథ్యాన్ని వారు దేశానికి రాకముందే పరిశీలించడం కష్టం. అదే ముందస్తు వీసా అయితే, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.దౌత్యపరమైన వ్యూహాలు - పాక్ ప్రతిపాదనమరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. యుద్ధం ఆరో వారంలోకి ప్రవేశించిన నేపథ్యంలో పాకిస్థాన్ కొన్ని ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇరాన్ హార్మూజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని పునరుద్ధరించాలని, తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని పాక్ కోరుతోంది. ఈజిప్ట్ విదేశాంగ మంత్రి బదర్ అబ్దెలాటీ బుధవారం టర్కీ, పాకిస్థాన్, ఖతార్, బహ్రెయిన్ విదేశాంగ మంత్రులతో ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: ఆకాశం ఎందుకో ఎరుపెక్కింది! -
స్పెక్యులేటర్లపై ఆర్బీఐ ఉక్కుపాదం
విదేశీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కఠిన చర్యలు తీసుకుంటోంది. కరెన్సీ మార్కెట్లో కృత్రిమంగా ఒత్తిడి పెంచుతున్న స్పెక్యులేటర్ల ఆట కట్టించేలా తాజాగా ఆంక్షలు జారీ చేసింది. ఇది డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో రికవరీకి బాటలు వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఆఫ్-షోర్ స్పెక్యులేషన్లకు బ్రేక్తాజా మార్గదర్శకాల ప్రకారం, భారత్లో నివసించే వారు లేదా ప్రవాస భారతీయులు ఎవరూ రూపాయికి సంబంధించిన నాన్-డెలివరబుల్ డెరివేటివ్ కాంట్రాక్టులను (ఎన్డీఎఫ్) ఆఫర్ చేయకుండా అధీకృత డీలర్లపై (బ్యాంకులపై) ఆర్బీఐ నిషేధం విధించింది. ముఖ్యంగా ఆన్-షోర్ (భారత మార్కెట్), ఆఫ్-షోర్ (విదేశీ మార్కెట్) ధరల మధ్య ఉన్న తేడాను సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు చేసే ఆర్బిట్రేజ్ ట్రేడ్లను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం ఉంది. ఇకపై క్లయింట్లు ఫారెన్ ఎక్స్చేంజ్ డెరివేటివ్ కాంట్రాక్టులను ఒకసారి రద్దు చేసిన తర్వాత వాటిని తిరిగి బుక్ చేసుకోవడానికి అనుమతించవద్దని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.రూపాయిపై ప్రభావంసెంట్రల్ బ్యాంక్ నిర్ణయం వెలువడిన వెంటనే మార్కెట్ వర్గాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. డాలర్-రూపాయి ఫార్వర్డ్స్ ఈ వారం ఇప్పటివరకు 1.4% పడిపోయాయి. ఇది రూపాయి బలపడుతుందనే అంచనాలకు బలం చేకూరుస్తోంది. గత దశాబ్ద కాలంలో లేనంత సాహసోపేతమైన చర్యగా బ్యాంకుల రోజువారీ ఆన్-షోర్ కరెన్సీ పొజిషన్లను 100 మిలియన్ డాలర్లకు ఆర్బీఐ పరిమితం చేసింది.‘రూపాయికి వ్యతిరేకంగా విదేశీ మార్కెట్లలో జరుగుతున్న స్పెక్యులేషన్లను అరికట్టడానికి ఇది అత్యంత కఠినమైన చర్య. గురువారం మార్కెట్లు తెరుచుకోగానే రూపాయి విలువ పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కరెన్సీ ఎక్స్పర్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.బీఐఎస్ నివేదికల ప్రకారం సింగపూర్, లండన్, హాంకాంగ్ వంటి ప్రాంతాల్లో రూపాయి సగటు రోజువారీ ఆఫ్-షోర్ ట్రేడింగ్ 149 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ భారీ మార్కెట్ భారత దేశీయ మార్కెట్ ధరలను ప్రభావితం చేస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ అభిప్రాయం ప్రకారం ‘మారకపు రేటు నిర్ణయాధికారాన్ని ఆన్-షోర్ మార్కెట్ పరిధిలోకి తీసుకురావాలని ఆర్బీఐ గట్టిగా ప్రయత్నిస్తోంది’ అన్నారు.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
అమల్లోకి కొత్త ఐటీ చట్టం
ఆదాయపన్ను చట్టం, 2025 బుధవారం నుంచి అమల్లోకి వచి్చంది. దేశ పన్ను చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయంగా నిలిచిపోతుందని.. వికసిత్ భారత్ దిశగా కీలక అడుగు అవుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) పేర్కొంది. ఆరు దశాబ్దాల కాలం నాటి ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో మరింత సరళతర చట్టంగా కేంద్రం దీన్ని రూపొందించడం తెలిసిందే. మరింత స్పష్టత, నిబంధనల అమలు సులభతరం, సరళమైన భాష, చదివే వారు అర్థం చేసుకునేందుకు అనుకూలత ఇందులోని ప్రత్యేకతలుగా సీబీడీటీ పేర్కొంది.కొత్త చట్టానికి మారే క్రమంలో పాత, కొత్త పన్ను చట్టాల పరిధిలో నిబంధనల అమలుకు ఇ–ఫైలింగ్ పోర్టల్ వీలు కలి్పంచనుందని సీబీడీటీ తెలిపింది. ముందటి సంవత్సరాలకు సంబంధించి అన్ని మదింపులు, అప్పీళ్లు పాత పన్ను చట్టం కిందే కొనసాగుతాయని, అసెస్మెంట్ సంవత్సరం 2026–27 (2025–26 ఆర్థిక సంవత్సరం) రిటర్నులను పాత పన్ను చట్టం కింద దాఖలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు -
సెజ్ యూనిట్లకు సుంకాల్లో రాయితీలు
ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్)ని యూనిట్లకు ఏడాది కాలం పాటు సుంకాల్లో రాయితీలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా యూనిట్లు తమ ఉత్పత్తులను దేశీ మార్కెట్లో విక్రయించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాప్తంగా ఈ చర్యలు అమల్లో ఉంటాయని తెలిపింది.ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సెజ్ యూనిట్లలో తయారైన వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తగ్గనుంది. కొన్ని కేసుల్లో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) కూడా వర్తించదు. రసాయనాలు, ఎరువులు, టెక్స్టైల్స్, ఫుట్వేర్, మెషినరీ ఇలా దాదాపు అన్ని రకాల ఉత్పత్తులకు ఈ ప్రయోజనాలు అమలు కానున్నాయి. 2025 మార్చి 31కి ముందు సెజ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన యూనిట్లకే ఈ మినహాయింపు వర్తిస్తాయని నోటిఫికేషన్ పేర్కొంది. దీంతో తాము పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేకుండా ఉన్నామని, వస్తువులను దేశీ మార్కెట్లో రాయితీ రేట్లపై విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాలని ఎగుమతి యూనిట్లు డిమాండ్ చేయడం గమనార్హం.తక్కువ రేట్లుసెజ్ యూనిట్లలో తయారైన వస్తువులకు ప్రస్తుతం అమలవుతున్న 7.5 శాతం స్థానంలో 6 శాతం, 10 శాతం బదులు 9 శాతం, 12.5 శాతం, 15 శాతం బదులు 10 శాతం రేట్లు వర్తిస్తాయి. అలాగే, 20 శాతం అమలయ్యే చోట 12.5 శాతం, 20–30 శాతం బ్రాకెట్లోని వాటికి 15 శాతం, 30–40 శాతం సుంకాల పరిధిలోని వాటికి 20 శాతమే ఇకపై అమలు కానున్నాయి.ఇదీ చదవండి: ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా.. -
రూ.2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ వసూళ్లు మార్చిలో మరింత బలపడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 9% పెరిగి రూ.2,00,064 కోట్లకు చేరింది. ఇందులో దిగుమతులపై జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం 17.8% పెరిగి రూ.53,861 కోట్లుగా ఉంది. 2025–26లో నెలవారీ మూడో అత్యధిక వసూళ్లు ఇవి. 2025 ఏప్రిల్లో అత్యధికంగా రూ.2.36 లక్షల కోట్లు వసూలు కాగా, మేలో రూ.2.01 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. 2025 మార్చి నెలలో జీఎస్టీ ఆదాయం రూ.1.83 లక్షల కోట్లుగా ఉంది. మార్చి నెలలో రిఫండ్లు 13.8% పెరిగి రూ.22,074 కోట్లకు చేరాయి. రిఫండ్లు మినహాయించి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం 8% వృద్ధితో రూ.1.78 లక్షల కోట్లకు చేరింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2025–26) మొత్తం జీఎస్టీ వసూళ్లు అంతక్రితం ఏడాదితో పోల్చి చూస్తే 8.3 శాతం పెరిగి రూ.22.27 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీ శ్లాబులను కుదించడం ఫలితంగా 375 ఉత్పత్తులపై పన్ను రేటు దిగిరావడం తెలిసిందే. అయినప్పటికీ జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతూ వస్తోంది. -
నయారా బాటలో షెల్ ఇండియా!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇటీవల పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన నయారా ఎనర్జీ బాటలోనే తాజాగా ‘షెల్ ఇండియా’ సైతం ఏప్రిల్ 1 నుంచి ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాల నేపథ్యంలో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటడంతో నష్టాలను తగ్గించుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.బెంగళూరులో ధరల మోతతాజా పెంపుతో కర్ణాటక రాజధాని బెంగళూరులో షెల్ కంపెనీ అవుట్లెట్లలో ఇంధన ధరలు కింది విధంగా ఉన్నాయి. స్థానిక పన్నుల వ్యత్యాసం కారణంగా ఇతర నగరాల్లో ఈ ధరలు స్వల్పంగా అటు ఇటుగా ఉండవచ్చు.ఇంధనం రకంపెంపు (లీటరుకు)తాజా ధర (సాధారణ)ప్రీమియం వేరియంట్ ధరపెట్రోల్రూ. 7.41రూ. 119.85రూ. 129.85డీజిల్రూ. 25.01రూ. 123.52రూ. 133.52అంతర్జాతీయ సంక్షోభంఫిబ్రవరి 28 నుంచి ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 60 శాతం మేర పెరిగింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా సరఫరాకు అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు ధరలను మరింత పెంచుతున్నాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో ఈ సరఫరా గొలుసులో తలెత్తే స్వల్ప మార్పులైనా దేశీయ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ప్రైవేట్ వర్సెస్ ప్రభుత్వ రంగ సంస్థలుముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరలను దాదాపు స్థిరంగా ఉంచడం గమనార్హం. అయితే ప్రైవేట్ రిటైలర్లు అయిన షెల్, నయారా వంటి సంస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు లభించే సబ్సిడీలు లేదా నష్టపరిహారాలు ప్రైవేట్ సంస్థలకు అందవు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా తమ మనుగడ సాగించాలంటే పెరిగిన భారాన్ని కస్టమర్లపై వేయడం తప్ప మరో మార్గం లేదని ప్రైవేట్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్! -
ప్రీమియం పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారతీయ ఇంధన మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రీమియం ఇంధనాలతో పాటు వాణిజ్య ఎల్పీజీ, విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను భారీగా పెంచుతూ సామాన్యుడి నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరికీ షాక్ ఇచ్చింది.ప్రీమియం ఇంధనాలకు ధరల సెగలగ్జరీ కార్లు, సూపర్ బైక్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎక్స్పీ100 (100-ఆక్టేన్ పెట్రోల్) ధర ఢిల్లీలో లీటరుకు ఏకంగా రూ.11 పెరిగింది. దాంతో రూ.149 నుంచి రూ.160 కు చేరింది. ఎక్స్ట్రా గ్రీన్ (ప్రీమియం డీజిల్) రూ.91.49 నుంచి రూ.92.99 కు పెంచింది. రెండు వారాల క్రితమే హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్పీసీఎల్) తన ప్రీమియం పెట్రోల్ ధరను రూ.101.89 కు సవరించగా ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కూడా అదే బాటలో పయనించింది.రూ.2,000 దాటిన వాణిజ్య సిలిండర్ ధరవ్యాపారస్తులు, హోటళ్లు, క్యాటరింగ్ రంగంపై కమర్షియల్ ఎల్పీజీ భారం పడింది. జనవరి 1, 2026 నుంచి ఇది ఇటీవలి పెంపుతో ఐదోసార్లు ధరలు పెంచినట్లయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ప్రస్తుత ధర (ఏప్రిల్ 1) రూ.2,078.50 (19 కిలోల సిలిండర్)గా ఉంది. మార్చి 1 నాటి ధర రూ.1,768.50. గత నెల రోజుల్లోనే రూ.310 మేర భారం పడింది.ఏటీఎఫ్ రూ.2 లక్షలువిమానయాన రంగం మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటరుకు రూ.2 లక్షల మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ధర రూ.2,07,341.22 (కిలోలీటరుకు). గతంలో 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో గరిష్టంగా రూ.1.1 లక్షలు ఉన్న ధర, ఇప్పుడు ఇరాన్ యుద్ధం కారణంగా అన్ని రికార్డులను తుడిచివేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో విమాన ప్రయాణ భారాలు భారీగా పెరిగే అవకాశం ఉంది.ప్రభుత్వ ఊరటప్రీమియం ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ సాధారణ వాహనదారులపై భారం పడకుండా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. సాధారణ పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు ధరల సెగ తగలకుండా చూసేందుకు మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల చమురు కంపెనీలకు కలిగే భారీ నష్టాలను భర్తీ చేయడంతో పాటు రిటైల్ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉండేలా ప్రభుత్వం చొరవ తీసుకుంది.ఇదీ చదవండి: చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ల వంతు! -
80.4 శాతానికి ద్రవ్యలోటు
కేంద్ర ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి చివరికి రూ.12.52 లక్షల కోట్లకు చేరింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ద్రవ్యలోటు లక్ష్యంలో 80.4 శాతానికి సమానం. కానీ, అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో 85.8 శాతంగా ఉండడం గమనించవచ్చు.2025–26 జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (రూ.15.58 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం.. కేంద్రానికి రూ.27.91 లక్షల కోట్ల ఆదాయం ఫిబ్రవరి చివరికి నాటికి వచ్చింది. పూర్తి ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో ఫిబ్రవరి నాటికి 82 శాతం సమకూరింది. రూ.21.45 లక్షల కోట్లు పన్నుల రూపంలో, రూ.5.8 లక్షల కోట్లు పన్నేతర రూపంలో వచ్చింది. -
ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి బెటర్!
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ ఇటీవల రూ.95 మార్కును తాకిన నేపథ్యంలో దేశీయ కరెన్సీ స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి స్థిరంగా, పటిష్టంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఇటీవల లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రూపాయి పతనంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక మూలాధారాలు పటిష్టంగా ఉన్నాయని ఆమె తెలిపారు.రూపాయి భేష్రూపాయి విలువ తగ్గుదలపై స్పందిస్తూ, ‘మిగిలిన వర్ధమాన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలతో పోలిస్తే మన రూపాయి పరిస్థితి బాగుంది. ఇది మెరుగైన స్థితిలోనే ఉంది’ అని మంత్రి తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు ఇస్తున్నాయని, ముఖ్యంగా మన ద్రవ్యలోటు నిర్వహణ, భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు రూపాయికి రక్షణ కవచంలా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.గణాంకాలు ఇలా..మంత్రి సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాచారం ప్రకారం, మార్చి 27 నాటికి విలువ డాలర్తో పోలిస్తే రూపాయి రూ.94.82 వద్ద ముగిసింది. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 27, 2026 మధ్య కాలంలో రూపాయి విలువ 9.9 శాతం మేర తగ్గింది. ఫిబ్రవరి 28న మిడిల్ఈస్ట్ దేశాల్లో మొదలైన ఉద్రిక్తతల కారణంగా రూపాయి 4.1 శాతం మేర క్షీణించింది.ఆర్బీఐ పర్యవేక్షణరూపాయి విలువ అనేది మార్కెట్ బాహ్య పరిస్థితుల ఆధారంగా నిర్ణయించబడుతుందని, దీనికి ప్రభుత్వం ఎటువంటి నిర్దిష్ట లక్ష్యాన్ని లేదా పరిమితిని విధించలేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అయితే, ఎఫ్డీఐ మార్కెట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరంతరం పర్యవేక్షిస్తోందని, విపరీతమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు జోక్యం చేసుకుంటుందని తెలిపారు. విదేశీ మారకద్రవ్యం రాకను పెంచడానికి, ఇతర దేశాల్లో రూపాయి ఆమోదాన్ని పెంచడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు రూపాయిపై ఒత్తిడిని తగ్గిస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు -
ఎరువుల ముందస్తు కొనుగోళ్లపై అప్రమత్తత
రాష్ట్రంలోని సాగు భూముల్లో దుక్కులు దున్నకముందే ఎరువుల విక్రయశాలల వద్ద రైతుల సందడి పెరిగింది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే డిమాండ్ ఈసారి మార్చిలోనే రికార్డు స్థాయికి చేరింది. భవిష్యత్తులో ఎరువుల కొరత ఏర్పడవచ్చనే ఆందోళనతో అన్నదాతలు భారీగా నిల్వలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ గణంకాల ప్రకారం.. మార్చి 23 నాటికే దేశవ్యాప్తంగా ఎరువుల విక్రయాలు అంచనాలను మించిపోవడం గమనార్హం.గణాంకాలు ఏం చెబుతున్నాయి?ఎరువుమార్చి అంచనా డిమాండ్ (లక్షల టన్నుల్లో)మార్చి 23 నాటికే జరిగిన విక్రయాలుయూరియా14.9620.21డీఏపీ2.434.78కాంప్లెక్స్ ఎరువులు7.057.22ఎంఓపీ1.801.58 గత ఏడాది (2025) మార్చి నెల మొత్తం మీద జరిగిన యూరియా విక్రయాలు 16.2 లక్షల టన్నులు కాగా, ఈ ఏడాది మార్చి 23 నాటికే అది 20 లక్షల టన్నులు దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం మార్చి 14 నుంచి 23 మధ్య పది రోజుల్లోనే సుమారు 13 లక్షల టన్నుల యూరియా అమ్ముడైంది.తెలుగు రాష్ట్రాల్లో నిల్వ ధోరణితెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ అసాధారణ డిమాండ్ కనిపిస్తోంది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే వరి సాగు కోసం రైతులు ముందస్తుగానే ఎరువులను నిల్వ చేసుకుంటున్నారు. ఏటా సీజన్ సమయంలో ఎదురవుతున్న కొరతను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే కొనుగోలు చేస్తున్నట్లు వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘ముఖ్యంగా తక్కువ ధర ఉండే ఎరువులు, గతంలో కొరత ఏర్పడిన వాటిపై రైతులు మక్కువ చూపుతున్నారు. జూన్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయంతోనే ఈ ముందస్తు నిల్వలు జరుగుతున్నాయి’ అని వ్యవసాయ శాస్త్రవేత్త ఏ.కె.సింగ్ అన్నారు.ప్రభుత్వ చర్యలు - క్షేత్రస్థాయి పరిశీలనఈ ఆకస్మిక విక్రయాల పెరుగుదలపై ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని భరోసా ఇస్తోంది. అయితే, పెరిగిన విక్రయాల వెనుక ఉన్న అసలు కారణాలను తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది.స్టాక్ వెరిఫికేషన్క్షేత్రస్థాయిలో ఎరువుల నిల్వలపై భౌతిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిజంగా రైతులే కొంటున్నారా? లేక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడానికి రికార్డుల్లో విక్రయాలు చూపి నిల్వ చేస్తున్నారా? అనే కోణంలో విచారణ జరపాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో కొంతమేరకు మొక్కజొన్న, చెరకు పంటల కోసం విక్రయాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు.ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు -
రేపటి నుంచి కొత్త లేబర్ కోడ్లు అమలు?
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కార్మికుల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లు అమలుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న సంక్లిష్టమైన 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో సరళీకరించిన ఈ నూతన కోడ్లను ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు చేయాల్సి ఉంది.స్వాతంత్య్రానికి పూర్వం నాటి పాత చట్టాలకు స్వస్తి పలికి మారుతున్న సాంకేతికత, పని వాతావరణానికి అనుగుణంగా ఈ సంస్కరణలను తీసుకువచ్చారు. గత ఏడాది నవంబర్ 21, 2025న కేంద్రం వీటిని అధికారికంగా ప్రకటించినప్పటికీ రాష్ట్రాల నిబంధనల రూపకల్పన ప్రక్రియలో ఉండటంతో అమలు తేదీపై సందిగ్ధత నెలకొంది. తాజాగా, కార్మిక శాఖ ఈ నిబంధనలను ఖరారు చేసి న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపినట్లు సమాచారం.ఏమిటి ఈ కొత్త కోడ్లు?1. వేతనాల కోడ్, 2019: వేతనాల పంపిణీ, కనీస వేతనాల క్రమబద్ధీకరణ.2. పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020: యాజమాన్యం, కార్మికుల మధ్య సత్సంబంధాలు, వివాదాల పరిష్కారం.3. సామాజిక భద్రత కోడ్, 2020: అసంఘటిత రంగ కార్మికులకు కూడా బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు.4. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్, 2020: పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య ప్రమాణాలు.జీతం లెక్కల్లో మార్పు..కొత్త కోడ్ల ప్రకారం వేతనం నిర్వచనంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఒక ఉద్యోగి పొందే మొత్తం జీతంలో ప్రాథమిక వేతనం (బేసిక్ పే), కరువు భత్యం (డీఏ), రిటైనింగ్ అలవెన్స్ కలిపి కనీసం 50 శాతం ఉండాలి. ఒకవేళ ఇతర అలవెన్సులు 50 శాతం మించితే ఆ అదనపు మొత్తాన్ని కూడా వేతనంగానే పరిగణిస్తారు. బేసిక్ పే పెరగడం వల్ల భవిష్య నిధి (పీఎఫ్), గ్రాట్యుటీ విరాళాలు పెరుగుతాయి. ఇది దీర్ఘకాలంలో కార్మికుడికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. అయితే ప్రతి నెలా చేతికి వచ్చే నికర జీతం స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.కీలక సంస్కరణలు - ముఖ్యాంశాలుఈ నూతన చట్టాలు అమలులోకి వస్తే లింగ భేదం లేకుండా అందరికీ ఒకే రకమైన వేతనం అందుతుంది.సామాజిక భద్రతను నిర్ధారించడానికి ప్రతి కార్మికుడికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం ఇకపై తప్పనిసరి.కాంట్రాక్ట్ లేదా నిర్ణీత కాలానికి పనిచేసే వారికి కూడా శాశ్వత ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు అందుతాయి.ఫిర్యాదుల పరిష్కార కమిటీల్లో మహిళలకు తప్పనిసరిగా చోటు కల్పించాలి.500 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉన్న సంస్థల్లో ప్రత్యేక సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి.పెన్షన్ పథకంలో మార్పులుకేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంటులో తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) 1995 స్థానంలో కొత్త సవరించిన పథకం రానుంది. సామాజిక భద్రత కోడ్ కింద రూపొందించే ఈ కొత్త పెన్షన్ విధానం అమలులోకి వచ్చే వరకు పాత విధానమే కొనసాగుతుంది.కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిబంధనలను ఖరారు చేసింది. ప్రస్తుతం ఇవి న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అయితే కార్మిక అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలోని నిబంధనలను ఖరారు చేసి నోటిఫై చేయాల్సి ఉంటుంది. చాలా రాష్ట్రాలు ఇప్పటికే ముసాయిదా నిబంధనలను సిద్ధం చేశాయి.ఇదీ చదవండి: అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు -
అత్తమామల పోషణ కోడలి బాధ్యత కాదు: హైకోర్టు
భారతీయ కుటుంబ వ్యవస్థలో నైతిక విలువలకు, చట్టబద్ధమైన బాధ్యతలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం, ఒక కోడలు తన అత్తమామలకు భరణం చెల్లించాల్సిన చట్టపరమైన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.కేసు నేపథ్యం ఏమిటి?ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఒక మహిళపై ఆమె అత్తమామలు కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడు మరణించాడని, తాము వృద్ధులమని, నిరక్షరాస్యులమని, ఎటువంటి ఆదాయ వనరులు లేని పేదలమని వారు పేర్కొన్నారు. తమ కోడలు తన భర్తకు రావాల్సిన సర్వీసు ప్రయోజనాలన్నింటినీ పొందిందని, పైగా ఆమెకు స్వతంత్ర ఆదాయం ఉన్నందున తమను పోషించాల్సిన బాధ్యత ఆమెపై ఉందని వారు వాదించారు.గతంలో ఆగ్రాలోని కుటుంబ కోర్టు ఆగస్టు 2025లో వీరి పిటిషన్ను తిరస్కరించింది. తాజాగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 144 కింద తాము భరణం పొందేందుకు అర్హులమని కోరుతూ వృద్ధ దంపతులు వేసిన రీపిటిషన్పై జస్టిస్ మదన్ పాల్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.కోర్టు వ్యాఖ్యలువిచారణ సందర్భంగా జస్టిస్ మదన్ పాల్ సింగ్ చట్టంలోని నిబంధనలను విశ్లేషించారు. ‘భరణం కోరే హక్కు అనేది కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే. సెక్షన్లో స్పష్టంగా పేర్కొన్న వ్యక్తుల వర్గాలకు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) మాత్రమే ఇది పరిమితం. అత్తమామలు ఈ పరిధిలోకి రారు. నైతిక బాధ్యత అనేది ఎంత బలంగా ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ఆదేశం లేని పక్షంలో దానిని చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం’ అని కోర్టు స్పష్టం చేసింది. అత్తమామలను ఈ నిబంధన పరిధిలోకి చేర్చకూడదని శాసనసభ తన విచక్షణతోనే నిర్ణయించిందని, కోడలిపై అత్తమామల పోషణ బాధ్యతను మోపడం చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు.వారసత్వ ఆస్తులపై స్పష్టతపిటిషనర్లు వాదించినట్లుగా.. కోడలు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది. అలాగే, మరణించిన కుమారుడి ఆస్తి వారసత్వానికి సంబంధించిన అంశాలు ఇటువంటి భరణం కేసుల విచారణ పరిధిలోకి రావని హైకోర్టు తేల్చి చెప్పింది.చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారుడిపై లేదా కుమార్తెపై ఉంటుంది తప్ప, కోడలిపై అత్తమామలను పోషించాలనే చట్టపరమైన నిబంధన లేదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇటువంటి అనేక కుటుంబ వివాదాల్లో కీలకంగా నిలవనుంది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
డిజిటల్ చెల్లింపులకు యూపీఐ ఊతం..
దేశీయంగా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ) గణనీయంగా పెరిగిందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గ్రోత్ సోహిని రాజోలా తెలిపారు. యూపీఐ ప్రస్తుతం నెలకు 2,170 కోట్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తోందని, దేశంలో దాదాపు సగం జనాభా అంటే.. 50.4 కోట్ల మంది దీన్ని వినియోగిస్తున్నారని ఆమె వివరించారు.2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్ మాధ్యమంలో జరగగా, విలువపరంగా యూపీఐ వాటా అందులో 84 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు. 2021తో పోలిస్తే ఇది 1.6 రెట్లు అధికమని వివరించారు. ఆర్థిక సమ్మిళితత్వానికి కూడా యూపీఐ ఉపయోగపడుతోందన్నారు. ప్రాథమిక బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉండే ప్రాంతాల్లో కూడా విస్తరించిందని, ప్రస్తుతం 19,000 పైచిలుకు పిన్ కోడ్స్లో అందుబాటులో ఉందని సోహిని వివరించారు. యూపీఐ వినియోగ ధోరణులు కూడా మారుతున్నాయని సోహిని చెప్పారు. చిన్న మొత్తాల్లో చెల్లించేందుకు కొత్త యూజర్లు చేరుతుండటమనేది ఈ విధానం అందరికీ అందుబాటులోకి రావడాన్ని సూచిస్తోందన్నారు. ప్రతి యూజరు చేసే చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయని సోహిని వివరించారు. ఇక వ్యక్తుల కన్నా వ్యాపార వర్గాలకు జరిపే చెల్లింపులు వరుసగా గత మూడేళ్లుగా వేగంగా పెరిగినట్లు ఆమె పేర్కొన్నారు. నిత్యావసరాలు, సూపర్మార్కెట్లు, రెస్టారెంట్లు, సర్వీస్ స్టేషన్లు, మెడికల్ స్టోర్స్ మొదలైన అన్ని చోట్లా యూపీఐ ఆమోదయోగ్యత పెరగడం ఇందుకు దోహదపడుతున్నట్లు సోహిని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
వడ్డీ రూ.50,000 మించితే టీడీఎస్
బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు (టీడీఎస్) నిబంధనలపై ఆదాయపన్ను శాఖ తాజాగా కీలక స్పష్టతనిచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం నిర్ణీత పరిమితిని మించినప్పుడు బ్యాంకులు కచ్చితంగా మూలం వద్దే పన్నును(టీడీఎస్) మినహాయించాలని ఆదేశించింది. ఈ మేరకు ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా ఐటీ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఎవరికి ఎంత పరిమితి?ఆదాయపన్ను నిబంధనల ప్రకారం, డిపాజిట్లపై వచ్చే వడ్డీకి సంబంధించి వేర్వేరు వర్గాలకు వేర్వేరు పరిమితులను నిర్ణయించారు. సాధారణ పౌరులు ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లేదా పోస్టాఫీసు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రూ.50,000 మించితే టీడీఎస్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు నిండిన వారు)కు ఊరటనిస్తూ ఈ పరిమితిని రూ.1,00,000గా నిర్ణయించారు. వడ్డీ ఆదాయం ఈ మొత్తాన్ని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు పన్ను మినహాయింపు ప్రక్రియను చేపడతాయి.సెక్షన్ల విశ్లేషణపన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చే బ్యాంకింగ్ సంస్థల గురించి ఐటీ శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఆదాయపన్ను చట్టం, 2025లోని సెక్షన్ 402 ప్రకారం.. బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్, 1949 పరిధిలో పనిచేసే అన్ని సంస్థలు దీని కిందకు వస్తాయి. ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్ 51 కింద పేర్కొన్న ఆర్థిక సంస్థలు కూడా ఈ టీడీఎస్ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రానట్లయితే టీడీఎస్ మినహాయించకుండా ఉండేందుకు బ్యాంకులకు ఫామ్ 15జీ లేదా 15హెచ్ సమర్పించాల్సి ఉంటుంది. డిపాజిటర్లు తమ వడ్డీ ఆదాయాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని, తద్వారా ఆర్థిక సంవత్సరం చివరలో అనవసర పన్ను భారం పడకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
పశ్చిమాసియా యుద్ధం మరింత కాలం కొనసాగితే?
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ద పరిస్థితులు ఇలాగే కొనసాగితే (ఇరాన్–ఇజ్రాయెల్/అమెరికా), దీని కారణంగా దేశీ పరిశ్రమలపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు, ఉపశమన ప్యాకేజీలను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో, దేశీయంగా వినియోగదారులపై ఈ ప్రభావం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం లీటరు పెట్రోల్పై రూ.3 ఎక్సైజ్ సుంకం తగ్గించగా, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయించింది. అదేవిధంగా దేశీయ సరఫరా పెంచేందుకు డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై మళ్లీ సుంకాలు విధించడం తెలిసిందే. ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు ఫిబ్రవరి 28న ప్రారంభమైన తరువాత, ఇరాన్ ప్రతీకార చర్యలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సుమారు 50 శాతం వరకు పెరిగాయి. ఈ నెల ప్రారంభంలో బ్యారెల్కు 119 డాలర్ల వరకు వెళ్లగా, ప్రస్తుతం 100 డాలర్ల పైనే ట్రేడ్ అవుతున్నాయి. మన దేశ చమురు, గ్యాస్ అవసరాల్లో 88 శాతం దిగుమతి చేసుకుంటుండడం తెలిసిందే. వీటిలో ఎక్కువ భాగం హార్మూజ్ జలసంధి నుంచే వస్తుంటాయి. ఎగుమతిదారులకు అండ.. ఈ సంక్షోభం కారణంగా ఎగుమతిదారులు సరుకుల రవాణాలో ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో.. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎగుమతిదారులకు కొన్ని సడలింపులు ఇచి్చంది. రూ.497 కోట్లతో ‘రిలీఫ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం తెలిసిందే. దీంతో నౌకా రవాణా మార్గం మార్చుకోవడం కారణంగా అధిక సమయం పట్టడం, ట్రాన్స్షిప్మెంట్ హబ్ల వద్ద రద్దీ పెరగడం, బీమా చార్జీలు పెరగడం, అత్యవసర సర్చార్జీలు విధించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనివల్ల రవాణా (లాజిస్టిక్స్) ఖర్చులు పెరిగిపోయాయి. ఇలా పెరిగిన రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలను ఎదుర్కొనేందుకు రిలీఫ్ పథకం సాయం అందించనుంది. అలాగే, రాడ్టెప్ పథకం కింద ఫిబ్రవరి 23 నుంచి మార్చి 31, 2026 వరకు అన్ని అర్హత గల ఉత్పత్తులపై పూర్తి ప్రయోజనాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. గత నెలలో ఈ ప్రయోజనాలను సగానికి తగ్గించడంతో ఎగుమతిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో వాటిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. తక్షణ ఉపశమనం అవసరం.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా ప్రభావితమయ్యే వర్గాలు, వ్యాపారాలకు తక్షణ ఉపశమనం అవసరం. అదే సమయంలో వ్యూహాత్మక, దీర్ఘకాల అవసరాలకు వీలుగా తగినంత ద్రవ్య వెసులుబాటు కూడా అవసరమే. కేవలం ఇంధన అవసరాలే కాకుండా.. పలు కమోడిటీలు, మెటీరియల్స్ పరంగానూ దీర్ఘకాల నిల్వలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది’’అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తాజాగా నెలవారీ ఆర్థిక సమీక్ష వివరాలు విడుదల సందర్భంగా పేర్కొన్నారు. -
రూపీ @ 95
ముంబై: ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలవుతున్న తరుణంలో రూపాయి మారకం విలువ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. సోమవారం డాలరుతో పోలిస్తే ఒక దశలో ఏకంగా 95 మార్కును దాటేసి ఆల్టైమ్ కనిష్ట స్థాయి 95.22ని తాకింది. ఇంట్రాడేలో 165 పైసల శ్రేణిలో తిరుగాడింది. చివరికి 15 పైసల లాభంతో 94.70 వద్ద క్లోజయ్యింది. శుక్రవారం నాడు 89 పైసలు పతనమై 94.85 వద్ద క్లోజయిన రూపాయి, రిజర్వ్ బ్యాంక్ సానుకూల చర్యల దన్నుతో, సోమవారం నాడు ట్రేడింగ్లో కాస్త పుంజుకుని 128 పైసల లాభంతో 93.62 వద్ద ప్రారంభమైంది. కానీ ఆ స్థాయి లాభాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. డాలరు ఇండెక్స్, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో రూపాయిపై ఒత్తిడి ఉంటోందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 92–97 శ్రేణిలో రూపాయి తిరుగాడవచ్చని నిపుణులు పేర్కొన్నారు. ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని, డాలరుతో రూపాయి మారకం విలువ బాగానే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పదా్నలుగేళ్లలో భారీ క్షీణత: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 9.88 శాతం క్షీణించింది. గత 14 ఏళ్లలో ఇంత భారీగా పతనం కావడం ఇదే మొదటిసారి. అప్పట్లో.. 2012 ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 4.2 శాతానికి పెరిగిపోయిన తరుణంలో దేశీ కరెన్సీ 12.4 శాతం పతనమైంది. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండటం, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటం, డాలరు బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో ఒడిదుడుకులు లాంటి అంశాలు ఇప్పటి క్షీణతకు కారణంగా నిలుస్తున్నాయి. ఫిబ్రవరి 28న పశి్చమాసియా ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి చూస్తే రూపాయి విలువ 4.1 శాతం పడిపోయింది. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు దాదాపు 55.073 బిలియన్ డాలర్లను విక్రయించింది. డాలరుతో పోలిస్తే ఇతర ఆసియా కరెన్సీలు కూడా గణనీయంగా క్షీణించాయి. జపాన్ యెన్ 6 శాతం, ఫిలిప్పీన్ పెసో 5.74 శాతం, దక్షిణ కొరియా వాన్ 2.88 శాతం తగ్గాయి. -
రూ.84,582 కోట్ల లిక్విడిటీని విడుదల చేసిన ఆర్బీఐ
దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిటీ) క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం రెండు వేర్వేరు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలాల ద్వారా మొత్తం రూ.84,582 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని వ్యవస్థలోకి ప్రవేశపెట్టింది.వేలం వివరాలు..సోమవారం నిర్వహించిన ఈ వేలాల్లో బ్యాంకుల నుంచి అనూహ్య స్పందన లభించినప్పటికీ రెండో వేలంలో మాత్రం బిడ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి విడతలో మూడు రోజుల వీఆర్ఆర్ వేలంలో ఆర్బీఐ రూ.50,001 కోట్లను విడుదల చేసింది. దీని కోసం రూ.57,287 కోట్ల విలువైన బిడ్లు రాగా ఆర్బీఐ రూ.50,001 కోట్ల బిడ్లను ఆమోదించింది. దీని కట్ఆఫ్ రేటు 5.34 శాతం కాగా, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.44 శాతంగా నమోదైంది.రెండో వేలం ద్వారా ఆర్బీఐ రూ.34,581 కోట్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేర్చింది. దీని కట్ఆఫ్ రేటు 5.26 శాతం, వెయిటెడ్ యావరేజ్ రేటు 5.30 శాతంగా ఉంది. ఈ వేలంలో నోటిఫై చేసిన మొత్తం కంటే తక్కువ బిడ్లు దాఖలయ్యాయి.మిగులు దిశగా నగదు లభ్యతప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత తీరి మిగులు బాట పట్టినట్లు కనిపిస్తోంది. మార్చి 27 నాటికి వ్యవస్థలో సుమారు రూ.1.27 లక్షల కోట్ల మిగులు నగదు ఉంటుందని అంచనా. గత కొన్ని రోజులుగా ఆర్బీఐ వివిధ కాలపరిమితులు గల వీఆర్ఆర్ వేలాల ద్వారా మొత్తం రూ.2,73,530 కోట్ల తాత్కాలిక లిక్విడిటీని చొప్పించడం వల్ల ఇది సాధ్యమైంది. తాత్కాలిక నిధులే కాకుండా జనవరి 2026 నుంచి ఆర్బీఐ బహిరంగ మార్కెట్ కార్యకలాపాల ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేస్తూ రూ.3.50 లక్షల కోట్ల లిక్విడిటీని ఇప్పటికే వ్యవస్థలోకి చేర్చింది.ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో బ్యాంకుల వద్ద నగదు అవసరాలు పెరుగుతాయి. ఈ క్రమంలో వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా నగదును అందుబాటులో ఉంచడానికి ఆర్బీఐ ఈ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓఎమ్ఓ కొనుగోళ్లు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ఇస్తుండగా వీఆర్ఆర్ వేలాలు స్వల్పకాలిక అవసరాలను తీరుస్తున్నాయి.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
శ్రీలంకలో విద్యుత్ షాక్
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకపై మరో భారం పడింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 7.2%, పరిశ్రమలకు 8.7% మేర విద్యుత్ టారిఫ్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.ఐఎంఎఫ్ నిబంధనలే కారణమా?అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పొందిన 2.9 బిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీలో భాగంగా శ్రీలంక కఠిన ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు (సీఈబీ) ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటం, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం కోసం కాస్ట్ రిఫ్లెక్టివ్(ఖర్చుకు అనుగుణంగా ధరలు) విధానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడాదికి పలుమార్లు విద్యుత్ ధరలను సవరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.మరింత పెరిగే అవకాశం ఉందా?‘యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు మరింత పెరిగితే, విద్యుత్ ఛార్జీలను మళ్లీ పెంచాలనే అభ్యర్థనను మేము పరిశీలిస్తాం’ అని శ్రీలంక పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఛైర్మన్ ప్రొఫెసర్ కె.పి.ఎల్. చంద్రలాల్ స్పష్టం చేశారు. వాస్తవానికి సీఈబీ 13.56 పెంపును కోరినప్పటికీ ప్రస్తుతానికి దాన్ని నియంత్రించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.తీవ్ర స్థాయిలో ఇంధన కొరతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడి చమురు, ఫర్నేస్ ఆయిల్ కొరత తీవ్రంగా ఉంది. దీనిపై సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్ జానక రాజకరుణ మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ‘వినియోగాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ఇంధన రేషనింగ్ను ప్రవేశపెట్టారు. విద్యుత్ ఆదా కోసం ప్రతి బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. నిరంతరాయ సరఫరా కోసం రష్యా, భారత్, అమెరికా దేశాలతో చర్చలు జరుపుతున్నారు. ఏప్రిల్లో శుద్ధి చేసిన ఇంధనం కోసం 600 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నారు’ అని చెప్పారు.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
డాలర్ క్రయవిక్రయాలకు ఆర్బీఐ చెక్
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారీగా పతనమవుతున్న భారత రూపాయిని ఆదుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ అత్యవసర జోక్యం వల్ల బ్యాంకులు తమ బిలియన్ల డాలర్ల ఆర్బిట్రేజ్ పొజిషన్లను వదులుకోవాల్సి వస్తోంది. ఈ పరిణామంతో బ్యాంకింగ్ రంగానికి దాదాపు రూ.4,000 కోట్ల మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఆర్బిట్రేజ్ పొజిషన్లు అంటే ఏమిటి?బ్యాంకులు తమ లాభం కోసం చేసే ఒక తెలివైన వ్యాపారమే ఈ ‘ఆర్బిట్రేజ్’. సాధారణంగా డాలర్ ధర ఆన్-షోర్ మార్కెట్ (భారతదేశంలో)లో తక్కువ ప్రీమియం ఉంటుంది. ఆఫ్-షోర్ మార్కెట్ (దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో)లో డాలర్ ధర ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దాంతో భారతదేశంలో తక్కువ ధరకు డాలర్లను కొని, విదేశీ మార్కెట్లలో ఎక్కువ ధరకు అమ్ముతాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం బ్యాంకులకు లాభం. అదే ఆర్బిట్రేజ్. ఇలా బ్యాంకులు ఇటీవల సుమారు 25 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల వరకు పొజిషన్లను నిర్మించుకున్నాయి.100 మిలియన్ డాలర్ల పరిమితిబ్యాంకులు తమ వద్ద భారీగా డాలర్లను నిల్వ ఉంచుకోవడం కూడా రూపాయి విలువ వేగంగా పడిపోవడానికి ఒక కారణంగా ఉంది. దీన్ని అరికట్టడానికి ఆర్బీఐ ‘నెట్ ఓపెన్ పొజిషన్’పై పరిమితి విధించింది. అంటే.. ఏ బ్యాంకైనా సరే బిజినెస్డే చివరలో తన వద్ద ఉన్న డాలర్ల నిల్వ (కొన్నవి - అమ్మినవి) విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతకుముందు బిలియన్ల కొద్దీ డాలర్లను హోల్డ్ చేసిన బ్యాంకులు, ఇప్పుడు ఆ అదనపు డాలర్లను మార్కెట్లో అమ్మేయాల్సి వస్తుంది. మార్కెట్లోకి డాలర్ల సరఫరా పెరగడం వల్ల రూపాయి విలువ పుంజుకోనుంది.రూ.4,000 కోట్ల నష్టంబ్యాంకులు ఈ డాలర్లను లాంగ్టర్మ్ కోసం వ్యూహాత్మకంగా కొన్నాయి. కానీ ఆర్బీఐ ఏప్రిల్ 10 లోపు వాటిని విక్రయించాలని డెడ్లైన్ పెట్టడంతో బ్యాంకులు అమ్మాల్సి వస్తోంది. మార్కెట్ రేటు కంటే తక్కువకు లేదా అననుకూల సమయంలో అమ్మడం వల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లలో నష్టాలు నమోదవుతాయి. నిపుణుల అంచనా ప్రకారం, బ్యాంకులు హోల్డ్ చేసిన ప్రతి డాలర్ మీద రూపాయి కదలిక వల్ల వచ్చే వ్యత్యాసం, మొత్తం బ్యాంకింగ్ రంగానికి కలిపి సుమారు రూ.3,000 కోట్లు నుంచి రూ.4,000 కోట్ల నష్టాన్ని మిగిల్చే అవకాశం ఉంది.బ్యాంకింగ్ రంగంపై ప్రభావంఈ నిర్ణయం వెలువడగానే ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. బ్యాంకుల లాభదాయకత (క్యూ4 ఫలితాలు) దెబ్బతింటుందనే ఆందోళనతో బ్యాంక్ షేర్లు ఈరోజు మార్కెట్లో పడిపోయాయి. ప్రైవేట్ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా.. వంటి బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు చాలా వరకు నష్టపోయాయి. రూపాయి విలువ పడిపోతే దేశంలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరుగుతుంది. ఆ భారీ నష్టాన్ని దేశం భరించడం కంటే బ్యాంకులపై నియంత్రణ విధించి కరెన్సీని కాపాడటమే మేలని ఆర్బీఐ భావించింది. అందుకే బ్యాంకుల లాభాలకు గండి పడినా సరే కఠినమైన నిర్ణయం తీసుకుంది.ఇదీ చదవండి: డాలరు ధాటికి రూపీ విలవిల -
డాలరు ధాటికి రూపీ విలవిల
భారత కరెన్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ భారీ పతనానికి గురైంది. సోమవారం (మార్చి 30, 2026) నాటి ట్రేడింగ్లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 95.45 స్థాయికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ ఈ అసాధారణ పరిణామం భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మంట దీనికి ప్రధాన కారణాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.పతనానికి ప్రధాన కారణాలుఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధం ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడంతో మార్కెట్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది డాలర్కు విపరీతమైన డిమాండ్ను పెంచి, రూపాయిని బలహీనపరిచింది.చమురు ధరలుభారతదేశం తన చమురు అవసరాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర ఇటీవల బ్యారెల్కు 115 డాలర్ల మార్కు వరకు వెళ్లడంతో చమురు దిగుమతి బిల్లు భారీగా పెరిగింది. చమురు కంపెనీలు డాలర్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో రూపాయిపై ఒత్తిడి తీవ్రమైంది.ఎల్పీజీ దిగుమతులుకేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా వంటగ్యాస్(ఎల్పీజీ) దిగుమతులపై కూడా యుద్ధ ప్రభావం పడింది. సరఫరాలో అంతరాయాలు కలగవచ్చనే భయంతో ముందస్తుగా నిల్వలను పెంచుకోవడానికి కంపెనీలు చేస్తున్న కొనుగోళ్లు కరెన్సీ విలువను మరింత తగ్గించాయి.విదేశీ పెట్టుబడుల ఉపసంహరణఒక్క మార్చి నెలలోనే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సుమారు 13.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించి భారత మార్కెట్ల నుంచి నిష్క్రమించారు. 2020 నాటి కోవిడ్ పరిస్థితుల తర్వాత ఈ స్థాయిలో పెట్టుబడులు వెనక్కి వెళ్లడం ఇదే మొదటిసారి.ఆర్థిక వ్యవస్థపై ప్రభావంరూపాయి బలహీనపడటంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు (ఎలక్ట్రానిక్స్, ఎరువులు, వంట నూనెలు) పెరిగి సామాన్యుడిపై భారం పడనుంది.పెరిగిన చమురు బిల్లుల కారణంగా దేశ కరెంట్ ఖాతా లోటు భారీగా విస్తరించే అవకాశం ఉంది.విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, విదేశీ ప్రయాణాలకు వెళ్లే వారికి ఖర్చు భారీగా పెరుగుతుంది.ఆర్బీఐ చర్యలురూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. బ్యాంకుల ఫారెక్స్ పొజిషన్లపై కఠినమైన పరిమితులు విధించడంతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి డాలర్లను విక్రయించడం ద్వారా లిక్విడిటీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తోంది. అయితే, యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే అత్యవసర డిపాజిట్ పథకాలను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయ స్థిరత్వం ఏర్పడే వరకు రూపాయిపై ఈ ఒత్తిడి కొనసాగేలా కనిపిస్తోంది. యుద్ధం చల్లారకపోతే రూపాయి విలువ మరింత క్షీణించే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
వంటగ్యాస్ కొరత.. కేంద్రం కీలక నిర్ణయం..
దేశవ్యాప్తంగా ఎల్పీజీ సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఇరాన్ వివాదం నేపథ్యంలో ముడి చమురు, ఇంధన సరఫరాలు దెబ్బతినడంతో.. సామాన్యులకు ఉపశమనం కలిగించేలా కిరోసిన్ నిబంధనలను సడలిస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గృహ అవసరాలకు, దీపాల కోసం కిరోసిన్ పంపిణీని వేగవంతం చేసేందుకు పెట్రోలియం భద్రత, లైసెన్సింగ్ నిబంధనల్లో కేంద్రం తాత్కాలిక మార్పులు చేసింది.రాష్ట్రాల్లో తాత్కాలిక పునరుద్ధరణగతంలో కిరోసిన్ రహిత రాష్ట్రాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు దాని సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. ఢిల్లీ, హరియాణా, ఉత్తర ప్రదేశ్, గుజరాత్ సహా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా సుపీరియర్ కిరోసిన్ ఆయిల్ (ఎస్కేఓ) అందుబాటులోకి రానుంది.కొత్త నిబంధనల ముఖ్యాంశాలుప్రభుత్వ రంగ చమురు సంస్థలు (ఓఎంసీ) నిర్వహించే ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రభుత్వం గుర్తించిన ప్రతి అవుట్లెట్లో గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్ నిల్వ చేసుకోవచ్చు.ప్రతి జిల్లాకు గరిష్టంగా రెండు సర్వీస్ స్టేషన్లకు మాత్రమే ఈ అనుమతి ఉంటుంది.పెట్రోలియం రూల్స్, 2002 ప్రకారం డీలర్లు, రవాణా వాహనాలకు కొన్ని కఠినమైన లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.ఈ సడలింపులు తక్షణమే అమల్లోకి వస్తాయి. ఇవి 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమల్లో ఉంటాయి.భద్రతలో రాజీ లేదునిబంధనలు సడలించినప్పటికీ భద్రత విషయంలో కేంద్రం కఠినంగా ఉన్నట్లు చెప్పింది. ‘పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్లు యధావిధిగా వర్తిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిన నిర్దేశిత అవుట్లెట్ల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఈ కిరోసిన్ను కేవలం వంట, దీపాల వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి’ అని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.ఇంధన భద్రతే లక్ష్యంప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ సంక్షోభం దృష్ట్యా గృహాలపై వంటగ్యాస్ భారం పడకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పీడీఎస్ కింద కిరోసిన్ సరఫరాను నిలిపివేసిన చోట కూడా ప్రస్తుతం ఉన్న రిటైల్ నెట్వర్క్ను వాడుకుని తక్షణమే సరఫరాను పునరుద్ధరించడం ఈ చర్య వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్! -
ఈ-చెక్స్ వస్తున్నాయ్.. ఆర్బీఐ కీలక ప్రకటన!
చెల్లింపు వ్యవస్థను మరింత కొత్తగా మార్చే ప్రక్రియలో భాగంగా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్తగా ఈ-చెక్స్ (ఎలక్ట్రానిక్ చెక్స్) ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ చర్యకు కారణం భద్రతను పెంచడం.. వ్యాపార, వినియోగదారుల అవసరాలను తీర్చడం.ఆర్బీఐ తన పేమెంట్స్ విజన్ 2028 నివేదికలో.. చెక్స్ డిజైన్, భద్రతా లక్షణాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు తెలిపింది. దీని ద్వారా సౌకర్యం, ఒక్కసారిగా అమలులో ఉండే విధానం, మోసాల నివారణ, కొత్త చెల్లింపు విధానాలతో సర్దుబాటు సాధ్యమవుతుందని వెల్లడించింది.ఈ-చెక్ అంటే?ఈ-చెక్ అనేది కాగితపు చెక్కుకు డిజిటల్ రూపం. అంటే దీనిని కాగితంపై కాకుండా ఆన్లైన్లో పంపుతారు. చెల్లింపుదారుడు వివరాలను నింపి, డిజిటల్ పద్ధతిని ఉపయోగించి సురక్షితంగా సంతకం చేసి, దానిని చెల్లింపు గ్రహీతకు లేదా బ్యాంకుకు పంపుతారు. బ్యాంక్ దీన్ని సాధారణ చెక్లా పరిశీలించి ప్రాసెస్ చేస్తుంది. ఇది వేగంగా, సురక్షితంగా, పేపర్ లెస్గా, ట్రాక్ చేయడానికి సులభంగా ఉంటుంది.ఇదీ చదవండి: భారత్లో దోహా బ్యాంక్ పూర్తిగా క్లోజ్! -
బిగ్ షాక్.. భారత్లో ఆ బ్యాంక్ పూర్తిగా క్లోజ్!
భారతదేశంలో పదేళ్లకు పైగా తన కార్యకలాపాలను సాగించిన దోహా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. కటార్లోని దోహా బ్యాంక్ తన భారత్లోని రెండు శాఖలను మూసివేయాలని నిర్ణయించింది. కాగా ఇకపై కేవలం ఒక ప్రతినిధి కార్యాలయాన్ని మాత్రమే కొనసాగించనుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.దోహా బ్యాంక్ భారతదేశంలో తన కార్యకలాపాలను జూన్ 2014 లో ప్రారంభించింది. మొదటి శాఖ ముంబైలో, తరువాత కొచ్చిలో రెండవ శాఖ ప్రారంభించింది. ఆ తరువాత 2016లో ఈ బ్యాంక్ భారతీయ మార్కెట్లో వృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితులను ఉపయోగించుకుని, గల్ఫ్ దేశం, భారతదేశం మధ్య రిమిటెన్స్ (ప్యారమిటెన్స్) అవకాశాలను లబ్ధిపరచడానికి ఇండియాలో సబ్సిడియరీ స్థాపించేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తుందని వార్తలు వచ్చాయి.ఇప్పుడు దోహా బ్యాంక్ వ్యూహం మార్పుతో.. భారతదేశంలో ప్రత్యక్ష కార్యకలాపాలను తగ్గిస్తూ, ప్రతినిధి కార్యాలయం ద్వారా మాత్రమే తన ఉనికిని కొనసాగించనున్నది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. డబ్బులు జమ చేసుకోవడం విత్డ్రా చేయడం వంటివి ఇకపై ఉండదు. అయితే ఇది ఖతార్లోని ప్రధాన బ్యాంకుకు, భారతీయ కస్టమర్లకు మధ్య ఒక వారధిలా మాత్రమే పనిచేస్తుంది. అంటే వ్యాపార అవకాశాలను వెతకడం, దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడం వంటి పనులకు మాత్రమే ఇది పరిమితమై ఉంటుందన్నమాట.ఇదీ చదవండి: 'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు' -
భారత్ వృద్ధిపై ఓఈసీడీ ఆశావహ అంచనాలు
న్యూఢిల్లీ: భారత్ జీడీపీపై ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) ఆశావహ అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) జీడీపీ 7.6 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.1 శాతానికి పరిమితం అవుతుందని తెలిపింది. ఈ మేరకు మధ్యంతర అంచనాలను వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులతో ఆయా దేశాల్లో ప్రజలు, ఆర్థిక వ్యవస్థలపై ఆర్థిక భారం పడుతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలాన్ని ఇది పరీక్షిస్తుందని పేర్కొంది.హర్మూజ్ జలసంధిని మూసివేయడంతోపాటు, ఇంధన వసతులను దెబ్బతీయడాన్ని ప్రస్తావించింది. ‘‘యూఎస్ టారిఫ్లు తగ్గడం భారత వృద్ధికి అనుకూలిస్తుంది. గ్యాస్ కొరతతో ఉత్పత్తి కార్యకలాపాలకు కొంత మేర విఘాతం కలగొచ్చు. అయితే, ద్రవ్యపరమైన ఉద్దీపనల మద్దతుతో దీన్ని అధిగమించొచ్చు. ఈ పరిణామాల దృష్ట్యా భారత వృద్ధి రేటు 2025–26లో ఉండే 7.6 శాతం నుంచి 2026–27లో 6.1 శాతానికి పరిమితం కావొచ్చు. 2027–28లో 6.4 శాతానికి చేరుకోవచ్చు’’అని ఓఈసీడీ తెలిపింది.ఆహారం, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం 2025–26లో ఉండే 2 శాతం నుంచి 2026–27లో 5.1 శాతం, 2027–28లో 4.1 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. వర్ధమాన దేశాల్లో ఒక్క భారత్లో మాత్రం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను సర్దుబాటు చేసేందుకు సెంట్రల్బ్యాంక్ జూన్ త్రైమాసికంతో తాత్కాలికంగా రేట్లను పెంచొచ్చని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2026లో 2.9 శాతం, 2027లో 3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. -
ఏప్రిల్ 1 నుంచి.. జీతంలో మార్పులు ఉంటాయా?
కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది.. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కూడా అమల్లోకి రానుంది. ఈ తరుణంలో ఉద్యోగులలో జీతభత్యాలు సంబంధించి ఆందోళన, ఆసక్తి పెరిగిపోయింది.2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లో పన్ను నిబంధనలకు సంబంధించిన మార్పులు ఉండదు. అయినప్పటికీ.. జీతం నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీటీసీ యథాతథంగా ఉన్నప్పటికీ.. జీతంలో భాగాల విభజనలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇప్పటి వరకు పన్నురహితంగా లేదా కొంత సడలింపుతో లెక్కించిన అలవెన్సులు, రీయింబర్స్మెంట్లు, ఇతర ప్రయోజనాలు అన్నీ కూడా కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను పరిధిలోకి రానున్నాయి. ఇదే జరిగితే.. ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాల ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు.కార్మిక చట్టాల ప్రకారం.. బేసిక్ జీతం, మొత్తంలో సీటీసీలో 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో.. ఉద్యోగుల చేతికి వచ్చే టేక్-హోమ్ శాలరీ కొంత తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కంపెనీ అందించే వివిధ సౌకర్యాలపై కూడా పన్ను విధింపు కఠినతరం అవుతుంది. కంపెనీ అందించే వసతి, వ్యక్తిగత ఉపయోగానికి ఆఫీస్ వెహికల్, డ్రైవర్, గృహ సేవలు, యుటిలిటీ బిల్లులు, పిల్లల విద్య ఖర్చులు వంటి ప్రయోజనాలు ఇప్పుడు నిర్దిష్ట పరిమితిని మించితే.. పన్ను విధించదగిన ఆదాయంగా పరిగణిస్తారు. ఈ అంశాలకు సంబంధించి విలువ నిర్ణయ విధానాలను కూడా కొత్త నిబంధనలు స్పష్టంగా నిర్వచించాయి.ఏప్రిల్ 1 నుంచి.. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025భారతదేశంలో గత 65 సంవత్సరాలుగా అమల్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, 1961.. త్వరలో (2026 ఏప్రిల్ 1 నుంచి) రద్దు అవుతుంది. దీని స్థానంలో కొత్తగా రూపొందించిన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, 2025 అమల్లోకి వస్తుంది. పాత చట్టం అనేక సవరణలతో చాలా క్లిష్టంగా మారి, 800కి పైగా సెక్షన్లు కలిగి ఉండేది.కొత్త చట్టం ముఖ్య ఉద్దేశ్యం పన్ను విధానాన్ని సులభతరం చేయడం. ఇందులో పన్ను రేట్లు లేదా ఎక్కువగా డిడక్షన్లలో పెద్ద మార్పులు లేవు. అయితే చట్టాన్ని సులభమైన భాషలో రాసి, సెక్షన్ల సంఖ్యను 819 నుంచి 536కి తగ్గించారు. అలాగే చాప్టర్ల సంఖ్యను 47 నుంచి 23కి తగ్గించారు. దీనివల్ల సాధారణ ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకునేలా మారుతుంది.మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2026 మార్చి 31 వరకు సంపాదించిన ఆదాయం పాత చట్టం ప్రకారం పన్ను విధింపు ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 తరువాత వచ్చిన ఆదాయానికి మాత్రమే కొత్త చట్టం వర్తిస్తుంది. పాత చట్టం కింద ఉన్న కేసులు, అప్పీలు మొదలైనవి పూర్తయ్యే వరకు అదే చట్టం ప్రకారం కొనసాగుతాయి.ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక: అదే నిజమైతే.. లక్షలాది మంది పేదలవుతారు! -
సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్ నజర్!
ప్రపంచ దేశాలను మరో భారీ సంక్షోభం ముంచెత్తబోతోందా? పశ్చిమ ఆసియాలో ముదిరిన యుద్ధ భయాలు ఇప్పుడు సముద్ర గర్భంలోని ‘డిజిటల్ కేబుళ్ల’ను తెంచేలా కనిపిస్తున్నాయా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సముద్ర గర్భంలోని డేటా కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.ఏమిటీ వివాదం?ప్రపంచవ్యాప్తంగా జరిగే ఇంటర్నెట్ డేటా రవాణాలో దాదాపు 95% నుంచి 97% వరకు సముద్ర గర్భంలో అమర్చిన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారానే జరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర సముద్రం (రెడ్ సీ), హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను అనుసంధానిస్తున్నాయి. ఇరాన్ తాజా హెచ్చరికలతో ఈ కేబుళ్లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు ఈ హెచ్చరికలు?2026 ఫిబ్రవరి చివర్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు పరాకాష్టకు చేరుకున్నాయి. అమెరికా నేతృత్వంలోని దళాలకు గల్ఫ్ దేశాలు ఆశ్రయం కల్పిస్తే ప్రతిచర్యగా ఈ డిజిటల్ మౌలిక సదుపాయాలను దెబ్బతీస్తామని ఇరాన్ హెచ్చరించినట్లు సమాచారం. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే ‘గ్రే జోన్ వార్ఫేర్’ అని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎవరు ప్రభావితమవుతారు?ఒకవేళ ఇరాన్ అనుకున్న పనిచేస్తే ఈ ముప్పు కేవలం ఒక దేశానికో లేదా ప్రాంతానికో పరిమితం కాదు. భారత్ నుంచి అమెరికా, యూరప్లకు వెళ్లే డేటా ట్రాఫిక్లో దాదాపు మూడో వంతు ఈ మార్గాల ద్వారానే వెళ్తుంది. ఇది ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూఏఈ, సౌదీ అరేబియాలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లు, డేటా సెంటర్లు నేరుగా ప్రభావితమవుతాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు ఇప్పటికే తమ కేబుల్ ప్రాజెక్టుల విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ‘2ఆఫ్రికా పర్ల్స్’ వంటి భారీ ప్రాజెక్టుల పనులు ఇప్పటికే నిలిచిపోయాయి.ఎలాంటి ప్రభావం ఉంటుంది?ఒకవేళ ఈ కేబుళ్లు తెగిపోతే అది కేవలం ఇంటర్నెట్లో అవాంతరం కలగడమే కాకుండా అంతర్జాతీయ బ్యాంకింగ్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్లు స్తంభిస్తాయి. క్లౌడ్ సర్వీసులు, వీడియో కాల్స్, అంతర్జాతీయ సమాచార మార్పిడి నిలిచిపోతుంది. యుద్ధ ప్రాతిపదికన వీటిని బాగు చేయడం చాలా కష్టంతో కూడుకుంది. సముద్ర గర్భంలో వీటిని సరిచేయడానికి ప్రత్యేక నౌకలు కావాలి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఆ నౌకలు అక్కడికి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.భారత ప్రభుత్వం అప్రమత్తంఈ పరిణామాల నేపథ్యంలో భారత టెలికాం శాఖ ఇప్పటికే అలర్ట్ అయింది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ వంటి సంస్థలతో అత్యవసర సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ‘సముద్ర గర్భంలోని ఈ కేబుళ్లు ఆధునిక ప్రపంచానికి ప్రాణధారలు. వీటిపై దాడి జరిగితే అది కేవలం ఒక భౌగోళిక దాడి కాదు, ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై జరిగే అతిపెద్ద దాడి అవుతుంది. దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ ముప్పును నివారించడం ఒక్కటే ప్రస్తుతానికి మార్గం’ అని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బ్యాంకింగ్ వ్యవస్థకు ముప్పుగా అంతర్గత లోపాలు -
సుంకం తగ్గినా తగ్గని ధరలు.. సామాన్యుడికి మొండిచేయి!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల అస్థిరత, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ ఇంధన రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ, సామాన్య వినియోగదారుడికి మాత్రం బంకుల వద్ద ధరల్లో తక్షణ ఉపశమనం లభించలేదనే వాదనలున్నాయి. చమురు విక్రయ సంస్థల (ఓఎంసీ) నష్టాలను పూడ్చేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.సుంకాల కోత.. మారని ధరలు!కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.13 నుంచి రూ.3కి తగ్గించింది. అలాగే, గతంలో లీటరుకు రూ.10గా ఉన్న డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగించింది. అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారుడికి బదిలీ కావడం లేదు. హార్మూజ్ జలసంధి మూసివేత భయాలు, మధ్యప్రాచ్య దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెరిగిన దిగుమతి వ్యయాన్ని తట్టుకోవడానికి, చమురు సంస్థల ఆర్థిక రికవరీకి సహాయపడటానికే ఈ సుంకాల కోత ఉపయోగపడనుంది.నయారా ఎనర్జీ ధరల పెంపుదేశంలో ప్రధాన ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ అయిన నయారా ఎనర్జీ వినియోగదారులపై ధరల భారాన్ని మోపింది. అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరల పెరుగుదల వల్ల ఏర్పడిన సేకరణ ఖర్చులను భర్తీ చేసేందుకు పెట్రోల్ లీటరుకు రూ.5 పెంచింది. డీజిల్ లీటరుకు రూ.3 పెంచింది. రోస్నెఫ్ట్ మద్దతు గల ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న తన 6,967 ఫిల్లింగ్ స్టేషన్లలో ఈ పెంపును అమలు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉండే వ్యాట్ వ్యత్యాసాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.5.30 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉంది.ప్రధాన నగరాల్లో తాజా ధరలు (మార్చి 27)ప్రభుత్వ రంగ సంస్థల (ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) ఇంధన ధరల్లో మార్పులు లేనప్పటికీ నగరాల వారీగా ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.నగరంపెట్రోల్ (లీటరుకు)డీజిల్ (లీటరుకు)ఢిల్లీరూ. 94.72రూ. 87.62ముంబైరూ. 104.21రూ. 92.15బెంగళూరురూ. 102.84రూ. 88.95హైదరాబాద్రూ. 107.41రూ. 95.65చెన్నైరూ. 100.75రూ. 92.34 గమనిక: పైన పేర్కొన్నవి ప్రభుత్వ రంగ సంస్థల ధరలు. ప్రైవేట్ బంకుల్లో (నయారా వంటివి) ఈ ధరలు రూ.3 నుంచి రూ.5 వరకు ఎక్కువగా ఉండవచ్చు.ఎందుకీ అస్థిరత?ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల బ్యారెల్ ముడిచమురు ధర అమాంతం పెరిగింది. ప్రైవేట్ సంస్థలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి ధరలను పెంచగా ప్రభుత్వ సంస్థలు ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నాయి. వెరసి, సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు.ఇదీ చదవండి: విడాకులు ఇస్తే ఉమ్మడి ఆస్తి ఎవరిది? -
60 రోజులకు సరిపడా ముడి చమురు సిద్ధం
దేశంలో ఇంధన సరఫరాపై సాగుతున్న వదంతులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. భారత్లో పెట్రోలియం, ఎల్పీజీ సరఫరా పూర్తిగా సురక్షితంగా, నియంత్రణలో ఉందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దేశవ్యాప్తంగా ఎక్కడా కొరత లేదని భరోసా ఇచ్చింది.వదంతులు నమ్మొద్దు..సోషల్ మీడియాలో ఇంధన కొరతపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇతర దేశాల్లోని క్యూలైన్లు, పాత లాక్డౌన్ దృశ్యాలను వాడుతూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్చరించింది. ఇటువంటి వార్తలను నమ్మి పౌరులు ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని పేర్కొంది.కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 60 రోజులకు సరిపడా ముడి చమురును కంపెనీలు ఇప్పటికే సేకరించాయి. రిటైల్ అవుట్లెట్ల ద్వారా దేశవ్యాప్తంగా 1 లక్షకు పైగా పెట్రోల్ బంకులు నిరంతరాయంగా సేవలు అందిస్తున్నాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా నుంచి 8,00,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ సరుకు సముద్ర మార్గంలో భారత్కు వస్తోంది. భారతీయ రిఫైనరీలు ప్రస్తుతం 100 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్ ఇంధన భద్రతలో పటిష్టంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకప్పుడు కేవలం పశ్చిమాసియాపైనే ఆధారపడిన భారత్, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 41కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల హార్మూజ్ జలసంధి వంటి ప్రాంతాల్లో అంతరాయాలు కలిగినా దేశీయ సరఫరాకు ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేసింది.తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలునిత్యావసర వస్తువుల లభ్యతపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరమని ప్రభుత్వం హెచ్చరించింది. ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేసింది. సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని, డీలర్లకు క్రెడిట్ పరిమితులను కూడా పెంచామని, కావున ప్రజలు సంయమనం పాటించాలని కోరింది.విశాఖ తీరానికి ‘ఎంటీ జంబో’ రాక!రష్యా నుంచి సుమారు 1,36,728 మెట్రిక్ టన్నుల ముడి చమురును మోసుకొస్తూ ‘ఎంటీ జంబో’ నౌక నేడు విశాఖ తీరానికి చేరుకుంది. ఈ భారీ కంటైనర్ రాకతో స్థానిక రిఫైనరీలకు ముడి సరుకు లభ్యత పెరగడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాలో స్థిరత్వం ఏర్పడనుంది. నిన్న బీడబ్ల్యూ బ్రిచ్ నౌక 24,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ (వంట గ్యాస్)తో విశాఖ పోర్టుకు చేరుకుంది. ఎంటీ పెట్రాయిట్ నౌక కూడా భారీ స్థాయిలో ముడి చమురును తీసుకువచ్చింది. అయితే, ఎంటీ జంబో ద్వారా వచ్చిన లక్షన్నర టన్నుల ముడి చమురును పైప్లైన్ల ద్వారా రిఫైనరీలకు తరలించే అన్లోడింగ్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. వంట గ్యాస్ నిల్వలను మరింత పెంచే దిశగా ఈ నెల 30వ తేదీన మరో రెండు ఎల్పీజీ నౌకలు విశాఖ తీరానికి చేరుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం.ఇదీ చదవండి: ఉద్యోగం మారినా.. వయసు పెరిగినా ఇదే దిక్కు! -
ఒక్క యాప్.. 2400 సేవలు: దీని గురించి తెలుసా?
ఉమాంగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. కానీ అందులో ఏకంగా 2400 కంటే ఎక్కువ ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉన్నాయని, అవి చాలా ఉపయోగపడతాయని చాలామందికి తెలియదు. ఈ కథనంలో ఆ వివరాలు తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఉమాంగ్ యాప్ను యూజర్లకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ.. కొత్త సర్వీసులు ప్రవేశపెడుతూనే ఉంది. ఇందులో భాగంగానే 2400 సేవలను అందిస్తోంది. ఇప్పుడు యూజర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. ఉన్నచోటనే తమకు కావలసిన సేవలను పొందవచ్చు.ఉమాంగ్ యాప్ వేలాది కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ సేవలను ఒకే వేదికపైకి చేర్చి, మల్టిపుల్ యాప్లు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది. 2026 నాటికి ఈ యాప్ గూగుల్ ప్లేలో 100 మిలియన్లకు పైగా డౌన్లోడ్లను, లక్షలాది మంది రిజిస్ట్రేషన్ వినియోగదారులను, బిలియన్ల కొద్దీ సంచిత లావాదేవీలను కలిగి ఉంది.UMANG యాప్ ఆండ్రాయిడ్, iOS, వెబ్, SMS, KaiOS ద్వారా ఫీచర్ ఫోన్లలో కూడా అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఇది బహుళ భాషలకు, బయోమెట్రిక్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఇది సురక్షితమైనదిగా గుర్తింపు పొందింది. గ్యాస్ బుకింగ్, ఈపీఎఫ్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నో సేవలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సంయుక్తంగా డిజిటల్ ఇండియా చొరవ కింద 2017లో UMANG యాప్ను (యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్) ప్రారంభించాయి. ఆ తరువాత వన్-స్టాప్ డిజిటల్ ప్లాట్ఫారమ్గా UMANG ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందింది. ఇదీ చదవండి: గరిష్టాల నుంచి డౌన్.. రూ.1.60 లక్షలు తగ్గిన వెండి! -
వచ్చే ఆర్ధిక సంవత్సరానికి భారత్ వృద్ధి ఎంతంటే?
భారత్కు మెరుగైన వృద్ధి అంచనాలను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) 7.1 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. పూర్వపు అంచనా కంటే 0.20 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సైతం గతంలో పేర్కొన్న అంచనాలతో పోల్చితే 0.4 శాతం పెంచి 7.6 శాతం వృద్ధి నమోదవుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది.ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు కీలక చోదకాలుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే మధ్యప్రాచ్యంలో ఘర్షణ వాతావరణం కారణంగా అధిక ఇంధన ధరలు ద్రవ్య పరిస్థితులపై ఒత్తిడి కలిగించొచ్చని అభిప్రాయపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరమైన అనిశ్చితులు కారణంగా ఏర్పడే రిస్కులు భారత్పై ప్రభావం చూపించొచ్చని (కమోడిటీ ధరలు, ఎగుమతులు, పెట్టుబడుల రాకపై) పేర్కొంది.చమురు ధరలు అధిక స్థాయిల్లోనే కొనసాగితే భారత్లో విక్రయ ధరలు సైతం పెరుగుతాయని అంచనా వేసింది. అయితే ధరల పెరుగుదల భారాన్ని పూర్తి స్థాయిలో వినియోగదారులపై మోపే అవకాశం లేదని పేర్కొంది. ద్రవ్యోల్బణం 2026–27లో 4.3 శాతానికి చేరుకోవచ్చని తెలిపింది. అధిక చమురు ధరలు వాణిజ్యలోటు పెరిగేందుకు కారణం కావొచ్చంటూ.. సేవల ఎగుమతుల రూపంలో మిగులు ఈ లోటును పరిమితం చేస్తుందని వివరించింది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ వడ్డీ రేట్లను ఎలాంటి మార్పులు చేయకుండా, స్థిరంగా కొనసాగించొచ్చని అంచనా వేసింది.చమురు ధరల సెగలు.. జూన్ త్రైమాసికంలో బ్రెంట్ బ్యారెల్కు సగటున 92 డాలర్ల స్థాయిలో, 2026లో సగటున 80 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే జూన్ త్రైమాసికంలో బ్రెంట్ చమురు బ్యారెల్కు 185 డాలర్ల స్థాయికి, 2026 వ్యాప్తంగా 130 డాలర్ల స్థాయిలో ఉండే అవకాశం లేకపోలేదని తెలిపింది. -
పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..
అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నిమిషాల్లోనే బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), డీలర్ అసోసియేషన్లు మాత్రం ‘కంగారు వద్దు.. సరిపడా నిల్వలు ఉన్నాయి’ అని భరోసా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం బైకులు, కార్లకే కాకుండా.. అసలు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ఏయే రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారో తెలుసుకుందాం.డీజిల్: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంభారతదేశంలో చమురు వినియోగంలో సింహభాగం డీజిల్దే. ఇది కేవలం లారీలు, బస్సులకే పరిమితం కాదు. దేశీయంగా రవాణా రంగంలో (సుమారు 70 శాతం) దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులను చేరవేసే భారీ ట్రక్కులు, గూడ్స్ వాహనాలు పూర్తిగా డీజిల్పైనే ఆధారపడి ఉన్నాయి. రైల్వే ఇంజిన్లలో కూడా గణనీయమైన భాగం ఇంకా డీజిల్తోనే నడుస్తున్నాయి.వ్యవసాయ రంగం (సుమారు 13%): రైతులకు డీజిలే ఆధారం. పొలం దున్నే ట్రాక్టర్లు, నీటిని తోడే పంపు సెట్లు, హార్వెస్టర్లు (కోత యంత్రాలు) పెట్రోల్ కంటే డీజిల్నే ఎక్కువగా వాడుతాయి. ముఖ్యంగా సాగు సీజన్లో ఈ వినియోగం రెట్టింపు అవుతుంది.పరిశ్రమలు, విద్యుత్ (సుమారు 10%): భారీ ఫ్యాక్టరీల్లోని జనరేటర్లు, విద్యుత్ గ్రిడ్ ఫెయిల్ అయినప్పుడు వాడే బ్యాకప్ పవర్ ప్లాంట్లకు డీజిల్ కీలకం. ఐటీ కంపెనీలు, మల్టీప్లెక్స్లు, ఆసుపత్రుల్లోని పవర్ బ్యాకప్ వ్యవస్థలు దీనిపైనే నడుస్తాయి.పెట్రోల్: వ్యక్తిగత ప్రయాణాలకే పరిమితమా?ద్విచక్ర వాహనాలు (సుమారు 60%): భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో అత్యధిక వాటా టూ-వీలర్లదే. మధ్యతరగతి ప్రజల ప్రధాన రవాణా సాధనం కావడంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ప్రైవేట్ కార్లు (సుమారు 35%): వ్యక్తిగత వినియోగం కోసం వాడే కార్లు పెట్రోల్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నాయి.ఇతర రంగాలు: చిన్నపాటి గార్డెనింగ్ పరికరాలు, కొన్ని రకాల పడవలు (ఫిషింగ్ బోట్లు), కొన్ని జనరేటర్లలో తక్కువ మొత్తంలో పెట్రోల్ వాడుతుంటారు.ప్రజలు ఏం చేయాలి?ప్రస్తుతానికి దేశంలో చమురు నిల్వలు పటిష్టంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తోంది. యుద్ధ భయంతో అవసరం లేకున్నా డబ్బాల్లో, బాటిళ్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంధనం పొదుపు చేయడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే. అనవసర భయాందోళనలకు లోనై బంకుల వద్ద రద్దీ పెంచకుండా సంయమనం పాటించడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరం.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
ఆర్బీఐ పాలసీ మీటింగుల షెడ్యూల్ వచ్చేసింది..
ముంబై: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ షెడ్యూల్ను ఆర్బీఐ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి సమీక్ష ఏప్రిల్ 6–8 తేదీల మధ్య ఉంటుంది. ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ మొత్తం మీద 2026–27లో ఆరుసార్లు సమావేశం కానుంది. ద్వితీయ ద్వైమాసిక సమీక్షా సమావేశం జూన్ 3–5 తేదీల మధ్య ఉంటుంది. ఆ తర్వాత ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్, 2027 ఫిబ్రవరి నెలల్లో తదుపరి ఎంపీసీ భేటీలు ఉంటాయి.ప్రతీ సమీక్ష మూడు రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ మీడియాకు వెల్లడిస్తుంటారు. ఆరుగురు సభ్యుల్లో ఆర్బీఐ గవర్నర్తోపాటు మరో ఇద్దరు ఆర్బీఐ అధికారులు, కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యులు భాగంగా ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరిగా ఫిబ్రవరిలో ఎంపీసీ సమీక్ష ముగియడం తెలిసిందే. ఆ సందర్భంగా కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. -
మూడు నెలల్లో 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు
భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెబ్సైట్పై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ 2025) ఏకంగా 6.1 కోట్లకు పైగా సైబర్ దాడి ప్రయత్నాలు జరిగినట్లు ఆర్బీఐ అధికారికంగా వెల్లడించింది. అయితే, అత్యాధునిక రక్షణ వ్యవస్థల కారణంగా ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, ఎటువంటి డేటా ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసింది.మూడొంతులు పెరిగిన దాడుల తీవ్రతగత ఏడాది కాలంగా ఆర్బీఐ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గణాంకాలను పరిశీలిస్తే సైబర్ ముప్పు ఏ స్థాయిలో పొంచి ఉందో అర్థమవుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - జూన్ మధ్య 1.9 కోట్లు, జులై - సెప్టెంబర్ మధ్య 3.1 కోట్లు, అక్టోబర్ - డిసెంబర్ మధ్య 6.1 కోట్ల సైబర్ దాడి యత్నాలు జరిగాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే దాడుల సంఖ్య రెట్టింపు కావడం గమనార్హం. దేశ కేంద్ర బ్యాంక్ కావడంతో దీని ప్రాముఖ్యత దృష్ట్యా హ్యాకర్లు నిరంతరం సాఫ్ట్వేర్లలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న శక్తివంతమైన ఫైర్వాల్లు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలు ఈ ముప్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.రక్షణ వ్యవస్థలో ఏఐ విప్లవంపెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ తన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లో కృత్రిమ మేధస్సు సాంకేతికతను అనుసంధానించింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.వాసుదేవన్ తెలిపిన వివరాల ప్రకారం.. వెబ్సైట్లోకి వచ్చే ప్రతి విజిటర్ డేటాను ఏఐ విశ్లేషిస్తుంది. సాధారణ వినియోగదారులకు, హ్యాకర్లకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే బ్లాక్ చేస్తుంది. దాడి తీవ్రరూపం దాల్చకముందే దాని మూలాలను గుర్తించి అడ్డుకుంటుంది.భవిష్యత్తు ప్రణాళికలురాబోయే రోజుల్లో వ్యవస్థలో ఏఐ పాత్రను మరింత విస్తృతం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది. కేవలం భద్రతకే పరిమితం కాకుండా.. మోసపూరిత లావాదేవీలను క్షణాల్లో గుర్తించడం. ప్రాంతీయ భాషల్లో వాయిస్ కమాండ్ల ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు కల్పించడం. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఏఐ చాట్బాట్లను మరింత అభివృద్ధి చేయడం వంటి విధానలు తీసుకురానున్నారు.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
ఆర్థిక వ్యవస్థలోకి ‘బంగారం’ తేవాలి
న్యూఢిల్లీ: దేశంలో గృహాలు, ఆలయాల్లో ఉన్న 10 ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌధరి అన్నారు. భౌతిక బంగారాన్ని నిల్వ (స్టోర్) రూపంలో ఉంచడం వల్ల అది ఆర్థిక వృద్ధికి పెద్దగా ఉపయోగపడటం లేదని అభిప్రాయపడ్డారు. పార్లమెంటరీ స్థాయి సంఘం (ఆర్థిక) సభ్యుడైన చౌధరి, బంగారానికి బదులు ఆర్థిక సాధనాల వైపు వినియోగదారులను మళ్లించాలని సూచించారు. దీనివల్ల బంగారం దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని, కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడి దిగొస్తుందని అన్నారు. అసోచామ్ నిర్వహించిన ఒకకార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్.. దేశంలోని గృహాలు, దేవాలయాల వద్ద సుమారు 50,000 టన్నుల బంగారం ఉందని, దీని విలువ 10 ట్రిలియన్ డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ఈ బంగారం అంతా అధికారిక ఆర్థిక వ్యవస్థకు బయటే ఉందని చెప్పారు. ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ (ఈజీఆర్) ద్వారా బంగారాన్ని డీమ్యాట్ చేసి షేర్ల మాదిరి ట్రేడ్ చేయడానికి దేశంలో అవసరమైన సాంకేతికత, వేదికలు ఉన్నాయని కృష్ణన్ తెలిపారు. అయితే, ఈజీఆర్ సమయంలో బంగారం డిపాజిట్పై విధించే 3 శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకిగా ఉన్నట్టు చెప్పారు. దీనిపై తాము పరిష్కారాన్ని సూచించినట్టు తెలిపారు. ఈజీఆర్ అన్నది సెబీ ఆమోదిత పథకం. వినియోగదారులు తమవద్దనున్న భౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో షేర్ల మాదిరి ట్రేడ్ చేసుకోవచ్చు. -
ధర దడ!
ఇళ్లలో వినియోగించే ముఖ్యమైన ఎల్రక్టానిక్ వస్తువుల ధరలు ప్రియంగా మారుతున్నాయి. ఒకవైపు కొత్త ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమల్లోకి రావడం, మరోవైపు ముడిసరుకుల ధరల పెరుగుదలతో కంపెనీలు ఒక విడత రేట్లను పెంచగా.. ఇప్పుడు ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో వ్యయాల భారం పెరిగిపోయిందంటూ మరో విడత రేట్ల పెంపునకు తెరతీరాయి. దీంతో ఏసీలు, టీవీలు తదితర ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. గతేడాది సెపె్టంబర్లో జీఎస్టీలో శ్లాబుల కుదింపు ఫలితంగా వీటి ధరలు దిగిరాగా.. తాజాగా వీటి ధరలు పూర్వపు స్థాయిలను మించుతున్నాయి. మెమొరీ చిప్ల ధరల పెరుగుదలతో ఇప్పటికే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్ల ధరలు ప్రియం కావడం తెలిసిందే. కమోడిటీ ధరల్లో అస్థిరతలు, రూపాయి క్షీణత, అధిక రవాణా, ఇంధన వ్యయాలను రేట్ల సవరణకు కారణాలని పంపిణీదారులు, డీలర్లకు కంపెనీలు తెలియజేస్తున్నాయి. ధరల పెంపు విషయమై తమ వాణిజ్య భాగస్వాములకు ఎల్జీ, శామ్సంగ్, పానాసోనిక్, డైకిన్, లాయిడ్స్ తాజాగా సమాచారమిచ్చాయి. ఏసీల ధరలు 10 శాతం వరకు, ఇతర ఉత్పత్తుల ధరలు 5 శాతం వరకు పెంచుతున్నట్టు ఎల్జీ ప్రకటించింది. ఏసీల ధరలను 8–12 శాతం మధ్య పెంచుతున్నట్టు పానాసోనిక్ తెలిపింది. డైకిన్, బ్లూస్టార్ సైతం 12 శాతం పెంపు దిశగా నిర్ణయాన్ని ప్రకటించింది. లాయిడ్స్ ఇప్పటికే ధరలను పెంచింది. శామ్సంగ్ సైతం ధరలను పెంచనున్నట్టు తెలిపింది. మెమొరీ చిప్లు ధరల పెరుగుదలతో టీవీల విక్రయ ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాస్తవానికి తయారీ వ్యయాల భారం పేరుతో ఏసీలు, టీవీల ధరలను 5–9% మధ్య కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలు జనవరిలో పెంచడం గమనార్హం. ఈ వరుస పెంపులతో డిమాండ్కు విఘాతం కలగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాహన ధరలు సైతం.. తయారీ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ఆటోమొబైల్ సంస్థలు సైతం తమ వాహన విక్రయ ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్ తన ప్యాసింజర్, వాణిజ్య వాహనాల (ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్) ధరలను 0.5–1.5% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి రానుంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సెడెజ్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ సైతం తమ వాహనాల ధరలను వచ్చే నెల నుంచి 2% వరకు పెంచుతున్నట్టు ప్రకటించాయి. హోండా సైతం ఈ దిశగా ఆలోచన చేస్తుండగా, మిగిలిన కంపెనీలూ ఇదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. డిమాండ్పై ప్రభావం.. తాజా ధరల పెంపుతో గతేడాది జీఎస్టీ సవరణల కారణంగా తగ్గిన ధరల ప్రయోజనం పూర్తిగా ఆవిరైపోతోందని, ఇది డిమాండ్ను బలహీనం చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి వరుస ధరల పెంపు దురదృష్టకరమని, వినియోగ సెంటిమెంట్పై ప్రభావం చూపిస్తుందని ప్రముఖ ఎల్రక్టానిక్ రిటైల్ చైన్ ‘గ్రేట్ ఈస్టర్న్ రిటైల్’ డైరెక్టర్ పులకిత్ బైద్ పేర్కొన్నారు. ‘‘జీఎస్టీ తగ్గింపు అనంతరం అధిక ముడి సరుకుల ధరల పేరుతో బ్రాండ్లు రేట్లను పెంచేశాయి. ప్రస్తుత అనిశి్చతుల్లో తరచుగా ధరల పెంపు డిమాండ్పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’అని బైద్ అన్నారు. డిమాండ్ కోలుకోవడం మొదలైందంటూ, అయితే వరుస ధరల పెంపు డిమాండ్ను దెబ్బతీయొచ్చని ప్రముఖ ఎల్రక్టానిక్స్ బ్రాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సైతం అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
దేశాల్లో పెట్రోల్ మంటలు.. దారుణంగా ధరలు!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడే అవకాశం ఉందన్న వార్తలు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలుయుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకానొక దశలో బ్యారెల్ ధర ఏకంగా 119 డాలర్లకు చేరుకోవడంతో, చమురు దిగుమతులపై ఆధారపడే దేశాల ఆర్థిక స్థితిగతులు తలకిందులయ్యాయి. ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి పలు దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరా మార్గాలను వెతుక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నాయి.ధరల పెంపులో ముందంజలో ఉన్న దేశాలుగ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్ డేటా ప్రకారం, మార్చి రెండో వారం నాటికి దాదాపు 85 దేశాలు పెట్రోల్ ధరలను భారీగా పెంచాయి. ఫిబ్రవరి 23 నుంచి నమోదైన గణాంకాల ప్రకారం ఇంధన ధరల పెరుగుదల ఇలా ఉంది..దేశంపెరుగుదల శాతంమయన్మార్55.4%ఫిలిప్పీన్స్54.2%కంబోడియా52.8%లెబనాన్28.6%కెనడా25.0%పాకిస్తాన్24.4%చైనా23.2%జపాన్19.6%పొరుగు దేశాలైన పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 1.15 డాలర్లు, శ్రీలంకలో 1.45 డాలర్లు, ఆఫ్ఘనిస్తాన్లో 0.98 డాలర్లుగా నమోదైంది.ధరలలో ఈ వ్యత్యాసం ఎందుకు?ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు ముడి చమురు దాదాపు ఒకే ధరకు అందుబాటులో ఉన్నప్పటికీ, వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి ధరలు మారడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి..పంపిణీ వ్యయం: చమురును శుద్ధి చేయడం, రవాణా చేయడం, పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చు. ఇది ధరలో చాలా తక్కువ భాగం మాత్రమే.పన్నుల ప్రభావం: ఇంధన ధరలను నిర్ణయించడంలో ఎక్సైజ్ సుంకం (Excise Duty), స్థానిక పన్నులు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో దేశం ఒక్కో రకమైన పన్ను విధానాన్ని అనుసరించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో చమురు ధరల పెరుగుదల సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగేలా చేస్తోంది. -
సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిన్నటి నుంచి వాహనదారులు బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళన, చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను తగ్గించాయన్న వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, ఈ పరిణామాలపై తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టతనిచ్చింది.ఓఎంసీలు - డీలర్లు.. క్రెడిట్ విధానం అంటే ఏమిటి?ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి ప్రధాన కారణం చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ (అప్పు) సౌకర్యంపై జరుగుతున్న చర్చ. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినప్పుడు దానికి సంబంధించిన సొమ్ము చెల్లించడానికి కొంత సమయం (క్రెడిట్ పీరియడ్) ఇస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత వల్ల ఓఎంసీలు తమ రిస్క్ను తగ్గించుకోవడానికి డీలర్ల క్రెడిట్ పరిమితులను తగ్గించడం లేదా ‘క్యాష్ అండ్ క్యారీ’ (నగదు చెల్లించి స్టాక్ తీసుకోవడం) విధానాన్ని అమలు చేస్తున్నాయి. చేతిలో నగదు లభ్యత తక్కువగా ఉన్న చిన్న డీలర్లు క్రెడిట్ దొరకకపోవడంతో స్టాక్ను తక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి తప్ప కంపెనీల వద్ద స్టాక్ లేక కాదని నిపుణులు చెబుతున్నారు.యుద్ధ ప్రభావం ఎంతవరకు?పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. అయితే, భారత ప్రభుత్వం వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు ఉండటం వల్ల తక్షణమే ఇంధన సరఫరా నిలిచిపోయే అవకాశం లేదు. డీలర్లకు, కంపెనీలకు మధ్య ఉన్న అంతర్గత చెల్లింపుల వ్యవహారాలను వాహనదారులు కొరతగా భావించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి సమయాన్ని వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరఫరా సజావుగానే సాగుతోందని అధికారులు నిర్ధారించారు.కొరత లేదు.. ఆందోళన వద్దుతెలంగాణలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్) డిపోల వద్ద రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల సరఫరా ఆగిపోతుందనేది కేవలం ఊహాగానమేనని, ప్రస్తుతానికి దిగుమతులకు ఎలాంటి ఆటంకం లేదని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, ఆందోళనతో కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కంపెనీల స్పందన..వదంతులను నమ్మొద్దు: బీపీసీఎల్భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. భారత్లో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. మా రిఫైనరీలు, సరఫరా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి’ అని సంస్థ పేర్కొంది.చమురు కంపెనీల ఉమ్మడి ప్రకటనబీపీసీఎల్, హెచ్పీసీఎల్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ (ఎల్పీజీ) సరఫరా కూడా సుస్థిరంగా ఉందని వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత డిమాండ్ను తట్టుకోవడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. లాజిస్టిక్స్, రవాణా నెట్వర్క్ ఎక్కడా ఆగకుండా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఇరాన్ నుంచి రిలయన్స్ చమురు కొనుగోలుమరోవైపు, అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్! -
మరో ఐదు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను చట్టం!
దశాబ్దాల కాలం నాటి ‘ఆదాయపు పన్ను చట్టం 1961’ మరికొద్ది రోజుల్లో చరిత్ర పుటల్లోకి వెళ్లనుంది. దీని స్థానంలో ఆధునికమైన, పారదర్శకమైన ‘ఆదాయపు పన్ను చట్టం 2025’, ‘ఆదాయపు పన్ను నియమాలు 2026’ అమలులోకి రానున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ మార్పులు అమలు కానున్న నేపథ్యంలో వేతన జీవులు తమ పన్ను ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.కొత్త చట్టం వస్తోంది కదా అని ప్రస్తుత పన్ను చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పాత, కొత్త చట్టాల మధ్య స్పష్టమైన విభజన రేఖను గీసింది.2025-26 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2026 వరకు మీరు సంపాదించిన ఆదాయంపై పాత చట్టం (1961) ప్రకారమే పన్ను విధిస్తారు. దీనికి సంబంధించిన రిటర్నులను 2026 జూలైలో సమర్పించాల్సి ఉంటుంది.2026-27 ఆర్థిక సంవత్సరం: ఏప్రిల్ 1, 2026 తర్వాత సంపాదించే ఆదాయానికి మాత్రమే కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వర్తిస్తుంది.ఆటోమేటెడ్ రిటర్న్స్: తప్పులకు తావులేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) నోటిఫై చేసిన కొత్త నిబంధనల ప్రకారం, భవిష్యత్తులో పన్ను చెల్లింపు ప్రక్రియ పూర్తిగా డిజిటల్, ఆటోమేటెడ్ కానుంది.ఇకపై మీ జీతం, బ్యాంక్ వడ్డీలు, షేర్ల లావాదేవీల వివరాలను మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. కంపెనీలు, బ్యాంకుల నుంచి డేటా నేరుగా సిస్టమ్లోకి వస్తుంది.సిస్టమ్ ఆటోమేటిక్గా వివరాలను సేకరించినప్పటికీ ఆ సమాచారం సరైనదేనని ధ్రువీకరించే బాధ్యత పన్ను చెల్లింపుదారుడిదే.ప్రస్తుతం వాడుకలో ఉన్న ఫారం-16, ఫారం-26AS స్థానంలో మరింత పారదర్శకమైన కొత్త డాక్యుమెంట్ ఫార్మాట్లు రానున్నాయి.హెచ్ఆర్ఏ, అలవెన్సులపై నిఘాపన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసే విషయంలో కొత్త నిబంధనలు కఠినంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) విషయంలో యజమాని వివరాలు, పాన్ కార్డు, సంబంధిత పత్రాలను సమర్పించడం తప్పనిసరి కానుంది.సీటీసీలో మార్పులుకొత్త చట్టం ప్రకారం, ఉద్యోగి ప్రాథమిక వేతనం(బేసిక్ పే) అతని మొత్తం సీటీసీలో కనీసం 50 శాతం ఉండాలి. దీనివల్ల పీఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఫలితంగా చేతికి వచ్చే జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ దీర్ఘకాలిక పొదుపు, పదవీ విరమణ ప్రయోజనాలు మెరుగుపడతాయి.కొత్త వ్యవస్థ పన్ను ఎగవేతను అరికట్టడమే కాకుండా నిజాయితీగా పన్ను చెల్లించే వారికి ప్రక్రియను సులభతరం చేస్తుంది. అయితే, ఆటోమేటెడ్ ఫ్లాగింగ్ సిస్టమ్ వల్ల చిన్న తప్పు జరిగినా నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, 2026 ఏప్రిల్ నుంచి ప్రతి పైసా ఖర్చుకు, ప్రతి మినహాయింపునకు సరైన రికార్డులు కలిగి ఉండటం ముఖ్యం.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
త్వరలో బీటీ పత్తి విత్తనాల గరిష్ట ధరల ప్రకటన!
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ట విక్రయ ధరను (ఎంఆర్పీ) కేంద్ర వ్యవసాయ శాఖ త్వరలోనే ఖరారు చేయనుంది. 2026-27 సీజన్కు సంబంధించి బోల్గార్డ్-1 (బీజీ-1), బోల్గార్డ్-2 (బీజీ-2) రకాల ధరలపై ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది. అయితే, ప్రభుత్వం పత్తి విత్తనాలపై ప్రకటించేది గరిష్ట ధర మాత్రమే. కంపెనీలు లేదా డీలర్లు అంతకంటే తక్కువ ధరకే విక్రయించవచ్చు కానీ, ఒక్క రూపాయి కూడా ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు.ధరల్లో మార్పు ఉంటుందా?గత కొన్నేళ్ల ధోరణిని పరిశీలిస్తే ఈ ఏడాది విత్తన ధరల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, తుది నిర్ణయం ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సి ఉంది. గత ఏడాది (2025-26) బీజీ-2 450 గ్రాముల ప్యాకెట్ ధరను రూ.900గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందు 2024-25లో ఇది రూ.864గా ఉండేది. 2016లో ధరల నియంత్రణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి బీజీ 1 ధర రూ.635 వద్దే స్థిరంగా కొనసాగుతోంది.2019-20లో కూడా ప్రభుత్వం ధరలను పెంచకుండా యథాతథంగా ఉంచిన దాఖలాలు ఉన్నాయి. గత ఏడాది సుమారు 4 శాతం మేర ధరలు పెరిగినందున ఈసారి పెంచకపోయినా విత్తన పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండదని నిపుణులు భావిస్తున్నారు.ధరల నియంత్రణపై భిన్నాభిప్రాయాలుకాటన్ సీడ్స్ ప్రైస్ ఆర్డర్-2015 ప్రకారం, ధర పెంచినా పెంచకపోయినా ఏటా ప్రభుత్వం ఎంఆర్పీని నోటిఫై చేయడం చట్టపరమైన బాధ్యత. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2016కు ముందు విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా అధిక ధరలకు విత్తనాలను విక్రయించి రైతులను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ప్రభుత్వం గరిష్ట ధరను (క్యాప్) నిర్ణయిస్తోంది. ఇది రైతులకు రక్షణ కవచం లాంటిదని అధికారులు పేర్కొంటున్నారు.బీటీ పత్తి విత్తనాల ధరల నిర్ణయాన్ని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) వ్యతిరేకిస్తోంది. బీటీ విత్తనాలకు ధర నిర్ణయించడం వల్ల నాన్-జీఎం (సాధారణ) పత్తి విత్తనాలు కేవలం రూ.300-400కే లభిస్తున్నాయని, అలాగే గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి బీటీ విత్తనాలకు తగ్గిపోతోందని వారు వాదిస్తున్నారు.సాగులో బీటీ పత్తిదే హవా..కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ గత నెల లోక్సభలో వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశంలోని మొత్తం పత్తి సాగు విస్తీర్ణంలో 95 శాతం బీటీ పత్తిదే. అయితే, బీటీ పత్తిలోని ప్రొటీన్ను తట్టుకునే సామర్థ్యాన్ని గులాబీ రంగు పురుగు పెంచుకోవడం ఇప్పుడు శాస్త్రవేత్తలను, రైతులకు ఆందోళనకు గురిచేస్తోంది. పత్తి పండించే అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ ఈ పురుగు ఉధృతి పెరగడం సాగు ఖర్చును పెంచుతోంది.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
వంటగ్యాస్ కష్టాలకు చెక్.. పెరిగిన ఉత్పత్తి!
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.పెరిగిన స్వదేశీ ఉత్పత్తిఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాకముందు వరకు భారతదేశ అవసరాల్లో స్వదేశీ ఎల్పీజీ ఉత్పత్తి వాటా 40% మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో దీన్ని 50-60%కి పెంచినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.గత కొద్ది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు అవసరం ఉన్నా, లేకపోయినా బుకింగ్స్ చేశారు. అయితే, ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ నిలకడగా ఉందని, ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బుకింగ్స్ కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘మేము నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాం. దేశవ్యాప్తంగా సిలిండర్ల డెలివరీ సాధారణంగానే సాగుతోంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సుజాత శర్మ చెప్పారు.ఇదీ చదవండి: ఢమాల్.. నేలకరిచిన పసిడి ధరలు -
భౌగోళిక రాజకీయ చదరంగంలో అనివార్య శక్తిగా భారత్
సరిగ్గా పాతికేళ్ల క్రితం, అంటే 2000వ సంవత్సరంలో కాందహార్ విమాన హైజాక్ ఉదంతం తర్వాత.. వాషింగ్టన్-న్యూఢిల్లీ-టెల్ అవీవ్ (అమెరికా-భారత్-ఇజ్రాయెల్) మధ్య సెక్యూరిటీ ట్రైయాంగిల్ ఏర్పడాలని అంతర్జాతీయ నిపుణులు సూచించారు. పాకిస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లెబనాన్ మీదుగా గాజా వరకు విస్తరించి ఉన్న ఉగ్రవాద కారిడార్ను అడ్డుకోవడానికి భారత్, ఇజ్రాయెల్ రెండు వైపులా రక్షణ కవచాలుగా నిలుస్తాయన్నది ఆనాటి ఆలోచన. కానీ, 2026 నాటికి అంతర్జాతీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. అప్పటి సెక్యూరిటీ ట్రైయాంగిల్కు సపోర్ట్గా ఉన్న అమెరికా ఇప్పుడు తన పట్టు కోల్పోతుంటే భారత్ అత్యంత కీలకమైన, నిర్ణయాత్మకమైన శక్తిగా ఆవిర్భవించింది.అమెరికా వ్యూహాత్మక వైఫల్యం - ఇరాన్ సంక్షోభంప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ఒక అస్థిరమైన సూపర్ పవర్గా కనిపిస్తోంది. సరైన నిష్క్రమణ వ్యూహం లేకుండా ఇరాన్పై యుద్ధం ప్రకటించడం, ప్రపంచ ఇంధన సరఫరాలో 20% వాటా కలిగిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగలదని అంచనా వేయకపోవడం వాషింగ్టన్ చేసిన అతిపెద్ద పొరపాట్లు. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటిపోయింది. అటు రష్యాపై ఆంక్షల విషయంలోనూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలు ఇప్పుడు మిత్రదేశాలకే మింగుడుపడటం లేదు.భారత్-ఇజ్రాయెల్ బంధంభారత్, ఇజ్రాయెల్ సంబంధాలు నిన్న మొన్నటివి కావు. 1962 చైనా యుద్ధం సమయంలోనే ఇజ్రాయెల్ రహస్యంగా భారత్కు సైనిక సాయం అందించింది. ఇందిరా గాంధీ హయాంలో 1968 నుంచే ‘రా’, ‘మొసాద్’(ఇజ్రాయెల్) మధ్య నిఘా సంబంధాలు ఉన్నాయి. నేడు ఇజ్రాయెల్ సాంకేతికత భారత రక్షణ వ్యవస్థలో అంతర్భాగమైపోయింది. నెతన్యాహు అన్నట్లు ఇది స్వర్గంలో కుదిరిన బంధం అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది.వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిభారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ఇప్పుడు ప్రపంచానికే ఒక పాఠం. ఇరాన్ తన జలాల్లో పాశ్చాత్య దేశాల నౌకలను అడ్డుకుంటున్నా భారత నౌకలకు మాత్రం ‘ప్రివిలేజ్డ్ న్యూట్రల్’(విశిష్ట తటస్థ దేశం) హోదా ఇచ్చి అనుమతిస్తోంది. దీని వెనుక దశాబ్దాల నాటి దౌత్య నీతి ఉంది. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇరాన్లోని చాబహార్ ఓడరేవును కాపాడుకుంటూ వచ్చింది. ముంబై నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వరకు ఇరాన్ మీదుగా సాగే అంతర్జాతీయ రవాణా కారిడార్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.మెరుగైన సంబంధాలుప్రస్తుతం భారత్ నరేంద్ర మోదీ, ఎస్.జైశంకర్ నాయకత్వంలో భారత్ ‘యాక్టివ్ మల్టీ-వెక్టర్ ఎంగేజ్మెంట్’ను అనుసరిస్తోంది. అంటే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్, గల్ఫ్ దేశాలతో ఏకకాలంలో మెరుగైన సంబంధాలను కొనసాగించగల ఏకైక దేశంగా భారత్ నిలిచింది. నేటి భౌగోళిక రాజకీయాల్లో అమెరికా కేవలం పెట్టుబడి, సాంకేతికతకు మాత్రమే పరిమితమవుతోంది. ఇజ్రాయెల్కు లేని ఇరాన్ ఛానల్, రష్యా ఛానల్ భారత్ వద్ద ఉన్నాయి. 50 ఏళ్లుగా నిశ్శబ్దంగా సిద్ధమైన భారత్ ఇప్పుడు ప్రపంచ యుద్ధ మేఘాల మధ్య ఒక శాంతి వారధిగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
ప్రకటనల హోరు.. స్పాన్సర్షిప్ జోరు
భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి దేశీయ క్రీడా ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థ డబ్ల్యూపీపీ మీడియా విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ నివేదిక ప్రకారం, భారత క్రీడా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.18,864 కోట్లకు (2.13 బిలియన్ డాలర్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగేళ్ల కాలంలోనే (2021లో రూ.9,530 కోట్లు) ఈ రంగం రెట్టింపు వృద్ధిని సాధించడం గమనార్హం.నివేదికలోని ముఖ్యాంశాలుక్రీడా రంగం మొత్తం ఆదాయంలో 51 శాతం వాటా ప్రకటనలదే. గత ఏడాదితో పోలిస్తే ఇవి 19.8 శాతం పెరిగి రూ.9,571 కోట్లకు చేరాయి.టీమ్, లీగ్ స్పాన్సర్షిప్ల ద్వారా రూ.7,943 కోట్లు (42% వాటా) సమకూరాయి.క్రీడాకారుల బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాల విలువ 10.3 శాతం పెరిగి రూ.1,350 కోట్లకు చేరింది.‘భారత క్రీడా రంగం సుస్థిరత, విస్తరణ దశకు చేరుకుంది. 2021 నుంచి చూస్తే 19 శాతం చక్రవడ్డీ రేటుతో (సీఏజీఆర్) ఈ వృద్ధి కొనసాగుతోంది’ అని డబ్ల్యూపీపీ మీడియా ఎండీ (కంటెంట్, స్పోర్ట్స్) వినీత్ కర్ణిక్ తెలిపారు.ఎదురులేని రారాజు క్రికెట్భారత మార్కెట్లో క్రికెట్ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం క్రీడా ఆదాయంలో 89 శాతం వాటా (రూ.16,704.2 కోట్లు) ఒక్క క్రికెట్ ద్వారానే లభిస్తోంది. లీనియర్ టీవీ (సాధారణ ఛానెళ్లు) కంటే డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనల వ్యయం వేగంగా పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం స్పాన్సర్షిప్ ఆదాయం మొదటిసారిగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రియల్ మనీ గేమింగ్ యాప్లపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ లోటును సంప్రదాయ బ్రాండ్లు భర్తీ చేశాయని నివేదిక పేర్కొంది.ఇతర క్రీడల పరిస్థితి ఏమిటి?క్రికెట్ దూసుకుపోతున్నా ఇతర క్రీడల ఆదాయం 2025లో 12.2 శాతం క్షీణించి రూ.2,159.9 కోట్లకు పరిమితమైంది. ఇండియన్ సూపర్ లీగ్ వాయిదా పడటం, ఇతర భారీ అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్, మెస్సీ ఇండియా టూర్ వంటి ఈవెంట్లతో పాటు పికిల్ బాల్ వంటి కొత్త క్రీడలకు ఆదరణ పెరుగుతుండటం సానుకూలాంశం.ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే.. -
ఉగ్రదేశంలో ఇంధన సెగ
తీవ్ర ఆర్థిక సంక్షోభం, అడుగంటిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ బ్లెండెడ్ ఫ్యూయల్ (హెచ్ఓబీసీ) ధరను ఏకంగా లీటరుకు రూ.200 పెంచుతూ ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమోద ముద్ర వేశారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఆర్థిక క్రమబద్ధీకరణప్రధాని షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఈ చర్యలు అనివార్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వానికి నెలకు సుమారు 9 బిలియన్ పాకిస్థానీ రూపాయల (పీకేఆర్) ఆదాయం మిగులుతుందని, ఈ మొత్తాన్ని ప్రజలకు ఉపశమనం కలిగించే పథకాలకు మళ్లిస్తామని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.సాధారణ పెట్రోల్తో పోలిస్తే హెచ్ఓబీసీ ఫ్యుయెల్లో ఆక్టేన్ రేటింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణ పెట్రోల్ ఆక్టేన్ సంఖ్య 87 నుంచి 92 మధ్య ఉంటే, హై-ఆక్టేన్ ఇంధనం 95 నుంచి 100 వరకు ఉంటుంది. కేవలం లగ్జరీ కార్లు, ఖరీదైన వాహనాలు వాడే ఉన్నత ఆదాయ వర్గాలపైనే ఈ పెరిగిన ధరల భారం పడుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలు ఉపయోగించే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రస్తుతం అదనపు భారం వేయలేదు. ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ లేదా విమాన ప్రయాణ ఖర్చులపై తక్షణ ప్రభావం ఉండదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.సాధారణ పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పాక్ ప్రభుత్వం ఇప్పటికే మార్చి 6న పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.55 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. మారిన ధరల ప్రకారం..ఇంధనం రకంపాత ధర (లీటరుకు)ప్రస్తుత ధర (లీటరుకు)పెట్రోల్రూ. 266.17రూ. 321.17డీజిల్రూ. 280.86రూ. 335.86 విమాన ప్రయాణికులకు షాక్ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడదని చెబుతున్నప్పటికీ జెట్ ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమానయాన రంగంపై అప్పుడే మొదలైంది. పాకిస్థాన్లోని ఏఆర్వై మీడియా కథనం ప్రకారం, మార్చి 10 నుంచి పాకిస్థాన్ ఎయిర్లైన్స్ ఛార్జీలను భారీగా పెంచాయి. దేశీయ ప్రయాణం(కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ రూట్లు)పై టికెట్ ధరలు రూ.2,800 నుంచి రూ.5,000 వరకు పెరిగాయి. విదేశీ ప్రయాణాలపై రూ.10,000 నుంచి రూ.28,000 వరకు అదనపు భారం పడింది.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
పార్లమెంట్లో నేడు ‘సీఏపీఎఫ్ బిల్లు-2026’
దేశ అంతర్గత భద్రతలో కీలకమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్) నిర్వహణలో కీలక మార్పులు లక్ష్యంగా రూపొందించిన ‘కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సాధారణ పరిపాలన) బిల్లు-2026’ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్, క్యాడర్ సంస్కరణలపై చర్చ జరుగుతున్న తరుణంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది.ఏకీకృత చట్టం.. లక్ష్యం ఇదే!ప్రస్తుతం సీఆర్పీఎప్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ వంటి దళాలు వేర్వేరు చట్టాల ద్వారా నడుస్తున్నాయి. దీనివల్ల నియామకాలు, పదోన్నతులు, సేవా నిబంధనల్లో వ్యత్యాసాలు ఉండి పరిపాలనాపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తొలగించి సుమారు 10 లక్షల మంది సిబ్బంది ఉన్న ఈ దళాలన్నింటికీ ఒకే విధమైన చట్టపరమైన చట్రాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం.బిల్లులోని కీలక అంశాలుఅధికారుల నియామకం, పదోన్నతి, డిప్యుటేషన్లపై నిబంధనలు రూపొందించే పూర్తి అధికారం కేంద్రానికి ఉంటుంది. అవసరమైతే ఇతర చట్టాలను ఇది నియంత్రించవచ్చు.అత్యున్నత స్థాయి పదవుల్లో ఐపీఎస్ అధికారుల ప్రాబల్యాన్ని ఈ బిల్లు చట్టబద్ధం చేస్తోంది.ఐజీ స్థాయిలో.. 50 శాతం పోస్టులు ఐపీఎస్ డిప్యుటేషన్ ద్వారా భర్తీ.ఏడీజీ స్థాయిలో.. కనీసం 67 శాతం పోస్టులు ఐపీఎస్ అధికారులకే.స్పెషల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్ జనరల్ పదవులన్నీ పూర్తిగా డిప్యుటేషన్ ద్వారానే భర్తీ అవుతాయి.కోర్టు తీర్పుకు విరుద్ధమా?మే 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ బిల్లు వివాదాస్పదంగా మారింది. సీఏపీఎఫ్ అధికారులను ‘ఆర్గనైజ్డ్ గ్రూప్-A సర్వీస్’గా గుర్తించిన అత్యున్నత న్యాయస్థానం, ఉన్నత స్థాయిల్లో ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ను క్రమంగా తగ్గించాలని, క్యాడర్ రివ్యూ చేపట్టాలని ఆదేశించింది. అక్టోబర్ 2025లో కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కూడా కోర్టు తిరస్కరించింది. తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు కోర్టు ఆదేశాలను నీరుగార్చేలా ఉందని మాజీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిరసనలుబిల్లులోని నిబంధనలపై మాజీ సీఏపీఎఫ్ అధికారులు తిరుగుబాటు స్వరం వినిపిస్తున్నారు. హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు ఈ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ‘ఐపీఎస్ అధికారుల లేటరల్ ప్రవేశం వల్ల సొంత క్యాడర్ అధికారుల పదోన్నతులు నిలిచిపోతున్నాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పని చేసే జవాన్లకు స్పష్టమైన కెరీర్ వృద్ధి ఉండాలి. నాయకత్వ బాధ్యతల్లో అంతర్గత అధికారులకు ప్రాధాన్యత ఇస్తేనే క్షేత్రస్థాయి నిర్ణయాలు సమర్థవంతంగా ఉంటాయి’ అని హెచ్.ఆర్. సింగ్, ఎస్.కె. సూద్ (రిటైర్డ్ అధికారులు) చెబుతున్నారు.కేంద్రం వాదనరాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే కేంద్ర దళాల స్వభావాన్ని కాపాడాలంటే ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్లు అత్యవసరమని కేంద్రం వాదిస్తోంది. ఈ కొత్త చట్టం వల్ల నిబంధనల్లో స్పష్టత వస్తుందని, అనవసరమైన లిటిగేషన్లు తగ్గి పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. నేడు రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనుంది. కోర్టు తీర్పులను అధిగమిస్తూ కేంద్రం తీసుకువస్తున్న ఈ నిబంధనలపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
యుద్ధ సంక్షోభం.. రంగంలోకి మంత్రుల బృందం..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై, సామాన్యులపై దాని ప్రభావం పడకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సంక్షోభం వల్ల ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడానికి మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారు. ఈ సమావేశానికి హోం, రక్షణ, ఆర్థిక శాఖల మంత్రులతో సహా మొత్తం 13 మంది మంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏకతాటిపై పని చేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారు.ఆహార, ఇంధన భద్రతపై ప్రత్యేక దృష్టిపశ్చిమాసియా పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో సామాన్యుడి అవసరాలకు విఘాతం కలగకుండా కొన్ని అంశాలపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు.ముడి చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడటంపై చర్చించారు. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న బఫర్ స్టాక్ వల్ల ప్రస్తుతానికి ఇబ్బంది లేదని, భవిష్యత్తు అవసరాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.ఆహార భద్రతకు ఎటువంటి ముప్పు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.దిగుమతుల వైవిధ్యం - ఎగుమతుల విస్తరణరసాయనాలు, ఫార్మాసూటికల్స్, పెట్రోకెమికల్స్ వంటి కీలక పారిశ్రామిక రంగాలకు అవసరమైన ముడి పదార్థాల కోసం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడకుండా, దిగుమతి వనరులను వైవిధ్యీకరించాలని సమావేశం నిర్ణయించింది. అలాగే, భారతీయ వస్తువుల కోసం కొత్త ఎగుమతి గమ్యస్థానాలను వేగంగా అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు.రాష్ట్రాలతో సమన్వయం..ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలని మోదీ ఆదేశించారు. ‘నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై, బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మీ డబ్బు మీ కోసం పనిచేస్తుందా? -
2047 నాటికి సంపన్న దేశంగా భారత్: అమెరికన్ మ్యాగజైన్ సంచలన రిపోర్ట్!
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం 2047 నాటికి.. సంపన్న దేశంగా మారుతుందని అమెరికా మ్యాగజైన్ 'వాషింగ్టన్ ఎగ్జామినర్' నివేదించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వాషింగ్టన్ ఎగ్జామినర్ ప్రకారం.. గత రెండు దశాబ్దాలుగా దేశం బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. 2003 నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థ.. సగటు వార్షిక వృద్ధి రేటు 7% కంటే ఎక్కువగా ఉంది. రాబోయే 20 ఏళ్లపాటు ఇదే ఊపు కొనసాగితే తలసరి జీడీపీ 15,000 డాలర్లు దాటేస్తుంది. ఇంతటి స్థిరమైన వృద్ధి సాధించడం వల్ల భారత్.. బ్రెజిల్, దక్షిణాఫ్రికా, తుర్కీయే వంటి ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసిన మధ్య ఆదాయ ట్రాప్ను (మిడిల్ ఇన్కమ్ ట్రాప్) దాటేయగలదు.భారతదేశం అభివృద్ధి చెందడానికి అనుకూలమైన విధానాలు, జనాభా, పెరుగుతున్న టెక్నాలజీ అని వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది. ఇండియాలో 28 సంవత్సరాలు మధ్య వయసున్న వారు.. యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాల కంటే ఎక్కువ. కాబట్టి రానున్న రోజుల్లో మన దేశంలో యువకులు శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ జనాభా ధోరణి బలమైన దేశీయ మార్కెట్కు మద్దతునిస్తుందని, తద్వారా వృద్ధి కోసం ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని వాషింగ్టన్ ఎగ్జామినర్ నివేదించింది.ఈ ప్రయోజనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి.. విధాన రూపకర్తలు ఉత్పాదకతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు. రహదారులు, విమానాశ్రయాలు, ఓడరేవులు, లాజిస్టిక్స్ కారిడార్ల వంటి మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు వేగవంతమవుతున్నాయి. మరింత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ సరఫరా గొలుసులను బలోపేతం చేసి, దేశీయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు తోడ్పడుతుందని భావిస్తున్నట్లు వాషింగ్టన్ ఎగ్జామినర్ స్పష్టం చేసింది.నిరంతర పెట్టుబడులు, కార్మిక శక్తిని విస్తరించడం, సాంకేతికతను స్వీకరించడం ద్వారా దేశాలు అధిక - ఆదాయ హోదాకు మారగలవని చారిత్రక ధోరణులు చూపిస్తున్నాయి. ఈ మూడు లక్షణాలు భారతదేశానికి ఉన్నట్లు కనిపిస్తోందని వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది.వికసిత భారత్ - మోదీ కలభారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల. ఈ లక్ష్యం ద్వారా దేశాన్ని ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో శక్తివంతంగా మార్చడం ప్రధాన ఉద్దేశ్యం.వికసిత భారత్ అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, మంచి విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు అందేలా చేయడం. గ్రామాలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందాలి. డిజిటల్ టెక్నాలజీ వినియోగంతో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం.మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి పథకాల ద్వారా దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడం వంటివి కూడా ఇందులో ప్రధాన లక్ష్యాలు.ఇదీ చదవండి: బంగారం ధర భారీగా తగ్గుతుందా?: నిపుణుల అంచనా.. -
మైక్రోఫైనాన్స్ సంస్థలకు కేంద్రం ఆసరా
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మైక్రోఫైనాన్స్ రంగానికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ’క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ ఫర్ మైక్రోఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్–2.0’ పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎంఎఫ్ఐలకు సుమారు రూ. 20 వేల కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణాల లభ్యత పెరగనుంది. ఫలితంగా అట్టడుగు వర్గాలకు చెందిన సుమారు 36 లక్షల మంది చిన్న తరహా రుణ గ్రహీతలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ ద్వారా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎంఎఫ్ఐలకు ఇచ్చే రుణాలకు కేంద్రం గ్యారెంటీ కలి్పస్తుంది. సంస్థల పరిమాణాన్ని బట్టి (చిన్న, మధ్య, పెద్ద) ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు 70 శాతం నుంచి 80 శాతం వరకు గ్యారెంటీ కవరేజీ లభిస్తుంది. → సామాన్యులకు వడ్డీ భారం తగ్గించేలా కేంద్రం ఇందులో కీలక నిబంధన చేర్చింది. ఎంఎఫ్ఐలు చిన్న తరహా రుణ గ్రహీతలకు ఇచ్చే వడ్డీ రేటును.. గత ఆరు నెలల సగటు వడ్డీ రేటు కంటే కనీసం 1 శాతం తక్కువకు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల పరిధిలోకి వచ్చే చిన్న రుణ గ్రహీతలందరూ దీనికి అర్హులే. మైక్రోఫైనాన్స్ రంగం నిధుల లేమితో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికే ఈ స్కీమ్ను తీసుకొచ్చారు. 2026 జూన్ 30 వరకు లేదా రూ.20 వేల కోట్ల రుణాలకు గ్యారెంటీ పూర్తయ్యే వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్యారంటీ స్కీమును మైక్రోఫైనాన్స్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఎంఎఫ్ఐఎన్ స్వాగతించింది. సవాళ్లెదుర్కొంటున్న తమ రంగానికి తోడ్పాటునిచ్చేలా సకాలంలో తీసుకున్న సరైన చర్యగా అభివరి్ణంచింది. → మరోవైపు, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) ఎగుమతిదారులకు మరింత మద్దతునిచ్చేలా మ్యుచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (ఎంసీజీఎస్–ఎంఎస్ఎంఈ)లో సవరణలు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సరీ్వసుల రంగాన్ని కూడా ఇందులో చేర్చినట్లు పేర్కొంది. -
మొండి బకాయిదారుల తీరుపై ఆగ్రహం
దివాలా, రుణ పరిష్కార చట్టం (ఐబీసీ)లోని లొసుగులను అడ్డు పెట్టుకునే మొండి బకాయిదారుల తీరుపై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టాన్ని రక్షణ కవచంగా వాడుకుంటూ అప్పులు ఎగ్గొట్టే ధోరణి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యాయస్థానం హెచ్చరించింది. జస్టిస్ మనీష్ పితాలే, జస్టిస్ శ్రీరామ్ శిర్సత్లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఏమిటీ ఆందోళనకర ధోరణి?రుణ ఎగవేతదారులు అనుసరిస్తున్న వ్యూహాలను కోర్టు ‘డిస్టర్బింగ్ ట్రెండ్’(ఆందోళనకర ధోరణి)గా అభివర్ణించింది. సాధారణంగా బ్యాంకులు తాకట్టు పెట్టిన ఆస్తులను రికవరీ చేయడానికి ‘సర్ఫేసీ’ (SARFAESI) చట్టం కింద వేలం ప్రక్రియ చేపడతాయి. అయితే, ఈ ప్రక్రియ ముగిసి వేలంలో ఆస్తులు కొనుగోలు చేసిన వారు రంగంలోకి వచ్చే వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉండే డిఫాల్టర్లు చివరి నిమిషంలో ఎన్సీఎల్టీని(వివాద పరిష్కారాల ట్రిబ్యునల్) ఆశ్రయిస్తున్నారు.‘ఐబీసీ కింద తప్పుడు మార్గాల్లో మొరటోరియం(చట్టబద్ధంగా కొంతకాలం పాటు వేలం వాయిదా వేయడం) పొందడం ద్వారా వారు అప్పటివరకు జరిగిన చట్టబద్ధమైన వేలం ప్రక్రియను స్తంభింపజేస్తున్నారు. ఇది కేవలం న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడమే కాకుండా దేశ వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది’ అని బాంబే హైకోర్టు తెలిపింది. ‘కొన్ని సంస్థల తీరువల్ల ఐబీసీ లక్ష్యం దెబ్బతింటోంది. ఐబీసీ అసలు ఉద్దేశం రుణ పరిష్కారం, కానీ ఇక్కడ అది రికవరీని అడ్డుకోవడానికి వాడుతున్నారు. ఇటువంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యాన్ని, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. నిజాయితీ గల రుణదాతల హక్కులను కాపాడటంలో కఠినంగా వ్యవహరించాలి’ అని చెప్పింది.కేసు నేపథ్యం ఇదే..రోజినా ఫిరోజ్ హజియాని, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సంస్థ రూ.6.25 కోట్ల రుణ సౌకర్యాన్ని పొందింది. అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు ముంబైలోని తాకట్టు ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసింది. వేలం ప్రక్రియ పూర్తయి పిటిషనర్లు ఆ ఆస్తిని కొనుగోలు చేసిన తర్వాత.. సదరు రుణగ్రహీతలు ఒక్కసారిగా ఐబీసీని తెరపైకి తెచ్చి ఎన్సీఎల్టీ ద్వారా స్టే పొందారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ) సేల్ రిజిస్ట్రేషన్ను నిలిపివేసింది. దీన్ని సవాలు చేస్తూ కొనుగోలుదారులు హైకోర్టును ఆశ్రయించారు.దేశంలో మొండి బకాయిల వసూలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బలమైన ఆయుధం ఐబీసీ. అయితే, కొందరు విల్ఫుడ్ డిఫాల్టర్లు(ఉద్దేశపూర్వక ఎగవేతదారులు) దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని బ్యాంకుల చేతులు కట్టేస్తున్నారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చట్టంలోని లొసుగులను వాడుకుని కాలయాపన చేసే వారికి గట్టి హెచ్చరిక. ఇది భవిష్యత్తులో వేలం కొనుగోలుదారులకు భరోసానివ్వడమే కాకుండా బ్యాంకింగ్ రంగంలో క్రమశిక్షణను పెంచుతుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
‘జీడి’ రైతుకు కొత్త ఆదాయం
సాధారణంగా జీడి తోటలంటే కేవలం జీడిపిక్కల కోసమేననే భావన రైతుల్లో బలంగా ఉంది. కానీ, ఆ పిక్కకు అనుబంధంగా ఉండే ‘జీడిపండు’ రైతు ఆర్థిక స్థితిగతులను మార్చేయగల అద్భుత శక్తి అని వ్యవసాయ రంగ నిపుణులు నొక్కి చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా లక్షలాది టన్నుల జీడిపండు వృథాగా నేలపాలవుతోందని, దీన్ని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుత్తూరులోని ఐకార్-జీడి పరిశోధన డైరెక్టరేట్ (డీసీఆర్) నిర్వహించిన పరిశ్రమల ముఖాముఖి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది.గణాంకాలు ఇలా..డీసీఆర్ డైరెక్టర్ జె.దినకర అడిగా సమర్పించిన వివరాల ప్రకారం, దేశంలో జీడిపండు వినియోగం అత్యల్పంగా ఉంది. భారతదేశంలో ఏటా సుమారు 60 లక్షల టన్నుల జీడిపండు ఉత్పత్తి అవుతోంది. ఇందులో కేవలం 1 శాతం మాత్రమే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి వాడుతున్నారు. ఒక హెక్టారు జీడి తోటలో సగటున 1 టన్ను జీడిపిక్కలు లభిస్తే ఏకంగా 8 టన్నుల జీడిపండు లభిస్తుంది. అంటే మనం ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న పిక్కల కంటే 8 రెట్లు ఎక్కువగా పండ్లు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన, సాంకేతికత లేక వాటిని వృథా చేస్తున్నాం. జీడిపండు నుంచి రసం తీసిన తర్వాత మిగిలే పిప్పితోనూ ఆదాయం పొందే మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు.కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్సిటీ సహకారంతో జీడిపండు పిప్పి పొడితో చేపల మేతను తయారు చేసే సాంకేతికతను డీసీఆర్ అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే స్వచ్ఛమైన జీడిపండు రసం, పాశ్చరైజ్డ్ జ్యూస్, లిక్విడ్ స్వీటెనర్, జీడిపండు పిప్పి టీ వంటి వినూత్న ఉత్పత్తుల సాంకేతికతను డైరెక్టరేట్ సిద్ధం చేసింది.బ్రెజిల్ ఆదర్శంబ్రెజిల్ వంటి దేశాల్లో జీడిపండును అత్యధికంగా వినియోగించుకుంటున్నారని నిపుణులు పేర్కొన్నారు. భారతదేశంలో చిన్న స్థాయిలోనైనా ఈ ప్రయత్నం మొదలుపెడితే భవిష్యత్తులో ఇది పెద్ద పరిశ్రమగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘ప్రభుత్వ సంస్థలు తాము అభివృద్ధి చేసిన సాంకేతికతను బదిలీ చేసేటప్పుడు వసూలు చేసే రాయల్టీలు స్టార్టప్లను నిరుత్సాహపరిచేలా ఉండకూడదు. నామమాత్రపు ధరలకే సాంకేతికతను అందిస్తే యువత ఈ రంగంలోకి వస్తారు’ అని చెబుతున్నారు.కేవలం జీడిపిక్కల అమ్మకానికే పరిమితం కాకుండా జీడిపండును కూడా ఒక వాణిజ్య పంటగా గుర్తిస్తే రైతులకు ఇది బోనస్ ఆదాయం అవుతుంది. ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందించి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఊపిరి పోయడం ఖాయం.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
సాగుకు ముందస్తు భరోసా
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగింది. రానున్న ఖరీఫ్-2026 సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు దేశీయ ఉత్పత్తిని పెంచడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులను వేగవంతం చేస్తూ బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.యూరియా ఉత్పత్తికి ప్రాధాన్యతదేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు చేసింది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) కొరత కారణంగా పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయలేకపోతున్న ప్లాంట్లకు ఊరటనిస్తూ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.ఎల్పీజీ(వంటగ్యాస్) అవసరాల తర్వాత గ్యాస్ సరఫరాలో ఎరువుల ప్లాంట్లకు రెండో ప్రాధాన్యత కల్పించారు. స్పాట్ మార్కెట్ నుంచి బిడ్డింగ్ ద్వారా అదనంగా 7.31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పర్ డే(ఎంఎంఎస్సీఎండీ) గ్యాస్ను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల ప్లాంట్లకు అందుతున్న గ్యాస్ సరఫరా 32 ఎంఎంఎస్సీఎండీ నుంచి 39.31 ఎంఎంఎస్సీఎండీకి (23 శాతం) పెరుగుతుంది. అమోనియాను విడిగా విక్రయించవద్దని దాన్ని పూర్తిగా యూరియా తయారీకే ఉపయోగించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి.ప్రస్తుతం ప్లాంట్లకు అవసరమైన గ్యాస్లో 62 శాతం మాత్రమే అందుతుండగా కొత్త ఒప్పందంతో అది 76 శాతానికి చేరనుంది. దీనివల్ల దేశీయ యూరియా ఉత్పత్తి రోజుకు 54,500 టన్నుల నుంచి 67,000 టన్నులకు పెరుగుతుందని అంచనా.ఖరీఫ్ 2026.. అందుబాటులో భారీ నిల్వలుజూన్ 1న నైరుతి రుతుపవనాల రాకతో ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ కోసం ఇప్పటికే సరిపడా నిల్వలను సిద్ధం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఎరువుల నిల్వలు మెరుగ్గా ఉన్నాయన్నారు.మార్చి 19 నాటికి ఎరువుల నిల్వల వివరాలు (లక్షల టన్నుల్లో)ఎరువు రకంప్రస్తుత నిల్వలు (2026)గతేడాది నిల్వలు (2025)యూరియా61.1455.22డీఏపీ24.2411.85కాంప్లెక్స్57.2134.44ఎస్ఎస్పీ24.823.15ఎంఓపీ12.6514.13 వ్యూహాత్మక అడుగులుయుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ రష్యా, బెలారస్, మొరాకో, కెనడా వంటి దేశాలు ఎరువుల సరఫరాకు ముందుకొచ్చాయి. అయితే, ప్రభుత్వం ప్రస్తుతం దేశీయంగా యూరియా ఉత్పత్తిపైనే దృష్టి కేంద్రీకరించింది. రాబోయే 1-2 వారాల్లో అంతర్జాతీయ పరిస్థితులు కుదుటపడితే అవసరానికి అనుగుణంగా దిగుమతులపై తుది నిర్ణయం తీసుకోనుంది.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


