breaking news
Economy
-
గ్రామీణ క్రెడిట్ స్కోర్తో అప్పు!?
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా సమగ్ర ఆర్థిక వృద్ధిని సాధించవచ్చని ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావిస్తున్నాయి. ఈ క్రమంలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలు (సీఐసీ) ప్రతిపాదించిన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’(GCS)లో నాన్-క్రెడిట్ డేటాను చేర్చాలనే ఆలోచన కీలకంగా మారనుంది.బడ్జెట్ ప్రతిపాదనలు2025-26 కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేకమైన ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్(GCS)’ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీన్ని అనుసరించి సిబిల్, ఈక్విఫాక్స్, ఎక్స్పీరియన్ వంటి ప్రముఖ సీఐసీలు తమ సొంత గ్రామీణ క్రెడిట్ స్కోర్లను రూపొందించడం ప్రారంభించాయి. ప్రస్తుతం ఈ స్కోర్లు కేవలం గతంలో తీసుకున్న అప్పుల చెల్లింపులు, క్రెడిట్ మిక్స్, వినియోగం వంటి సంప్రదాయ పారామీటర్ల ఆధారంగానే లెక్కించబడుతున్నాయి.నాన్ క్రెడిట్ డేటా ఆవశ్యకతగ్రామీణ ప్రాంతాల్లోని మెజారిటీ ప్రజలు ‘థిన్ ఫైల్’ కేటగిరీ కిందకు వస్తారు. అంటే వీరికి గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న చరిత్ర (Credit History) చాలా తక్కువగా ఉంటుంది లేదా అసలు ఉండదు. కేవలం రుణ చరిత్రపైనే ఆధారపడితే, వీరికి బ్యాంకులు అప్పు ఇవ్వడానికి వెనుకాడతాయి. ఈ అడ్డంకిని అధిగమించడానికి సీఐసీలు ఆర్బీఐ, ప్రభుత్వాన్ని నాన్ క్రెడిట్ డేటా వినియోగానికి అనుమతించాలని కోరుతున్నాయి. ఇందులో ప్రధానంగా..విద్యుత్తు బిల్లుల చెల్లింపులునీటి పన్ను, గ్యాస్ సిలిండర్ చెల్లింపులుల్యాండ్లైన్, మొబైల్ బిల్లులు వంటి యుటిలిటీ చెల్లింపులను పరిగణనలోకి తీసుకుంటారు.ప్రయోజనాలుయుటిలిటీ బిల్లుల చెల్లింపు రికార్డులను క్రెడిట్ స్కోర్లో చేర్చడం వల్ల చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. ఒక వ్యక్తి క్రమం తప్పకుండా విద్యుత్ లేదా మొబైల్ బిల్లులు చెల్లిస్తున్నారంటే, అతనికి ఆర్థిక క్రమశిక్షణ ఉందని అర్థం. ఇది రుణగ్రహీత ‘క్రెడిట్వర్తినెస్’ను అంచనా వేయడానికి సహాయపడుతుంది. గతంలో బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న వారికి కూడా క్రెడిట్ స్కోర్ లభించడం వల్ల వారు సులభంగా రుణాలు పొందవచ్చు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణగ్రహీతల ప్రవర్తనను లోతుగా విశ్లేషించడం ద్వారా మొండి బకాయిల ముప్పును తగ్గించుకోవచ్చు.చట్టపరమైన, సాంకేతిక సవాళ్లుప్రస్తుతం సీఐసీలు 2005 క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ (CICRA) పరిధిలో పనిచేస్తున్నాయి. ప్రస్తుత నియమాల ప్రకారం, కేవలం ఆర్థిక లావాదేవీల డేటాను మాత్రమే సేకరించే వీలుంది. నాన్ క్రెడిట్ డేటాను వాడాలంటే ఈ చట్టపరమైన నిబంధనల్లో మార్పులు లేదా ప్రత్యేక అనుమతులు అవసరం. అందుకే సీఐసీలు తమ అభ్యర్థనలో సీఐసీఆర్ఏ చట్టపరిధిని గౌరవిస్తూనే, కాలానుగుణంగా మార్పులు చేయాలని కోరుతున్నాయి.గ్రామీణ భారతం డిజిటల్ చెల్లింపుల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో యుటిలిటీ బిల్లుల వంటి డేటాను క్రెడిట్ స్కోరింగ్లో చేర్చడం అనేది ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది. ఇది కేవలం బ్యాంకులకే కాకుండా చిరు వ్యాపారులు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు సరసమైన వడ్డీకి రుణాలు అందేలా చేస్తుంది. ఆర్బీఐ, ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకుంటే అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది.ఇదీ చదవండి: క్విక్ కామర్స్.. గిగ్ వర్కర్ల సమస్యలివే.. -
2026లో బ్యాంక్ హాలిడేస్: ఫుల్ లిస్ట్
ఇంకొన్ని రోజుల్లో 2025 ముగుస్తుంది. ఇప్పటికే పండుగలు, ఇతర పర్వ దినాలకు సంబంధించిన సెలవులను సంబంధిత శాఖలు వెల్లడించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం వచ్చే ఏడాది (2026) సుమారు 21 రోజులు సెలవులు ఉన్నట్లు తెలుస్తోంది.➤మకర సంక్రాంతి (జనవరి 15)➤రిపబ్లిక్ డే (జనవరి 26)➤హోలీ (మార్చి 3)➤ఉగాది (మార్చి 19)➤రంజాన్ (మార్చి 21)➤శ్రీరామ నవమి (మార్చి 27)➤అకౌంట్స్ క్లోజింగ్ డే (ఏప్రిల్ 1)➤గుడ్ఫ్రైడే (ఏప్రిల్ 3)➤అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14)➤మే డే (మే 1)➤బక్రీద్ (మే 27)➤మొహర్రం (జూన్ 26)➤స్వాతంత్య్ర దినోత్సవం (ఆగస్టు 15)➤మిలాద్ ఉన్-నబీ (ఆగస్టు 26)➤శ్రీకృష్ణ జన్మాష్టమి (సెప్టెంబర్ 4)➤వినాయక చవితి (సెప్టెంబర్ 14)➤గాంధీ జయంతి (అక్టోబర్ 2)➤విజయ దశమి (అక్టోబర్ 20)➤దీపావళి (నవంబర్ 8)➤గురునానక్ జయంతి (నవంబర్ 24)➤క్రిస్మస్ (డిసెంబర్ 25)బ్యాంక్ హాలిడేస్ అనేవి రాష్ట్రాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అయితే.. బ్యాంకుల ఫిజికల్ బ్రాంచీలు మూసివేసినప్పటికీ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ యాప్స్, ఏటీఎం విత్డ్రా వంటి ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. వినియోగదారులు చెల్లింపులు చేయడం, బ్యాలెన్స్ చెకింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.ఇదీ చదవండి: ఆరు నెలల్లో డబుల్.. భారీగా పెరుగుతున్న రేటు! -
భారత్-కెనడా మధ్య చిగురిస్తున్న వాణిజ్య బంధం
భారత్-కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న దౌత్యపరమైన స్తబ్ధత వీడనుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగవ్వనున్నాయి. ఈ దేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్-CEPA) పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా చర్చలు ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.కీలక పర్యటనలు - సన్నాహక చర్చలుకేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరిలో కెనడాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా చర్చలకు పచ్చజెండా ఊపనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనధికారికంగా సన్నాహక చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే కెనడా కూడా పరస్పర రాయితీలతో కూడిన ఒక బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని రంగం సిద్ధం చేస్తోంది.మార్క్ కార్నీ రాకతో మారిన సమీకరణాలు2023 సెప్టెంబర్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం విషయంలో జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే, 2025 మార్చిలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఇటీవల జోహన్నెస్బర్గ్లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన భేటీ ఈ ఒప్పందానికి పునాది వేసింది.50 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంఅమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై (భారతీయ వస్తువులపై 50% వరకు) భారీ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో భారత్-కెనడా ఒప్పందం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కెనడా ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ 13, 2025 నుంచి జనవరి 27, 2026 వరకు ఈ ఒప్పందంపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది.రాజకీయ ఉద్రిక్తతలను పక్కన పెట్టి ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా భారత్, కెనడాలు ముందుకు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో పీయూష్ గోయల్ పర్యటనతో ఈ ఒప్పందం పట్టాలెక్కితే అది రెండు దేశాల వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాల్లోని ఎగుమతిదారులకు ఊరటనిస్తుంది.ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం -
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్గా స్క్రీనింగ్కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్డెస్క్ -
ఉద్యోగం మానేసినా.. పీఎఫ్ డబ్బుకు వడ్డీ వస్తుందా?
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ వస్తుంది. జాబ్ మానేసిన తరువాత ఆగిపోతుంది. అయితే ఉద్యోగం మానేశాక కూడా వడ్డీ వస్తుందా?, వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.ఒక ఉద్యోగి తాను చేస్తున్న ఉద్యోగం ఆపేశాక కూడా పీఎఫ్ బ్యాలెన్స్కు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)కు లింక్ చేసిన తరువాత, మీరు ఉద్యోగం మారినా.. మానేసినా వడ్డీ ఆగిపోదు. సుమారు 58 ఏళ్లు వచ్చే వరకు లేదా మీకై మీరు విత్డ్రా చేసుకునే వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలలు పూర్తయ్యాక, పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే అర్హత పొందుతారు. కేవైసీ (ఆధార్, పాన్, బ్యాంక్) వివరాలు లింక్ అయి ఉంటే.. వడ్డీ క్రెడిట్ / విత్డ్రా సులభంగా జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రభుత్వం EPF వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ధారించింది. -
పదేళ్లలో భారీగా పుంజుకున్న ఆవిష్కరణల సూచీ
గడిచిన దశాబ్ద కాలంలో భారతదేశం ప్రపంచ ఆవిష్కరణల సూచీ (Global Innovation Index)లో ఎంతో ప్రగతి సాధించింది. 2015లో 81వ స్థానంలో ఉన్న భారత్ 2024 నాటికి 39వ స్థానానికి చేరుకోవడం హర్షణీయం. ఇది దేశంలో మారుతున్న ఆర్థిక, సాంకేతిక ముఖచిత్రానికి నిదర్శనం. డబ్ల్యూఐపీవో (WIPO) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారత్ తన స్థానాన్ని స్థిరంగా మెరుగుపరుచుకుంటూ ఆవిష్కరణల కేంద్రంగా అవతరిస్తోంది.గత పదేళ్లలో భారత్ సాధించిన ర్యాంకులు దేశంలో వచ్చిన గుణాత్మక మార్పులను సూచిస్తున్నాయి.సంవత్సరంజీఐఐ ర్యాంక్201476201581202048202439 ఈ వృద్ధికి ప్రధాన కారణాలుబలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. 2014లో కేవలం కొన్ని వందల స్టార్టప్లు ఉండగా, నేడు ఆ సంఖ్య 1.40 లక్షలు దాటింది. 110కి పైగా యూనికార్న్ కంపెనీలు దేశంలో ఆవిష్కరణల జోరును పెంచాయి.ప్రభుత్వ విధానాలు, డిజిటల్ విప్లవం.. యూపీఐ వంటి డిజిటల్ పేమెంట్ వ్యవస్థలు ప్రపంచ దేశాలను సైతం ఆకర్షించాయి. ఇది ఆర్థిక లావాదేవీలనే కాక, కొత్త రకమైన ఫిన్టెక్ ఆవిష్కరణలకు దారితీసింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా ‘అటల్ టింకరింగ్ ల్యాబ్స్’ కీలక పాత్ర పోషిస్తున్నాయి.పరిశోధన, అభివృద్ధిపై దృష్టి.. ప్రభుత్వం ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’(ANRF) వంటి సంస్థల ద్వారా పరిశోధనలకు భారీ నిధులను కేటాయిస్తోంది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానాల్లో ఒకటిగా ఉండటం గమనార్హం.మేధో సంపత్తి హక్కుల బలోపేతం.. పేటెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సరళతరం చేయడం వల్ల భారత్ నుంచి స్వదేశీ పేటెంట్ల నమోదు పెరిగింది. 2015తో పోలిస్తే ప్రస్తుతం పేటెంట్ల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది.భారత్ అందిపుచ్చుకున్న అవకాశాలుఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) సేవల ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs) పరంగా ప్రపంచ దిగ్గజ సంస్థలు తమ పరిశోధనా కేంద్రాలను భారత్లో ఏర్పాటు చేయడం ద్వారా మన దేశం గ్లోబల్ టెక్ హబ్గా మారింది.స్పేస్ టెక్నాలజీ, ఫార్మా రంగాల్లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఫలితాలను సాధించడంలో భారత్ తనదైన ముద్ర వేసింది.భారత్ 39వ స్థానానికి చేరుకున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను మరింత పెంచాల్సి ఉంది. విద్యావ్యవస్థ, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచితే భారత్ టాప్-25 దేశాల జాబితాలోకి చేరడం ఏమాత్రం కష్టం కాదు.ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం -
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా ఒక కిలో బియ్యం సేకరించి, దాన్ని భద్రపరిచి, రవాణా చేసి లబ్ధిదారుడికి చేరవేసేసరికి దాదాపు రూ.40 వరకు ఖర్చు చేస్తోంది. అంటే, మనం ‘ఉచితం’ అని పిలుచుకుంటున్న ఈ బియ్యం వెనుక సామాన్యుడు పన్ను రూపంలో చెల్లించిన భారీ మూల్యం ఉంది. దురదృష్టవశాత్తు 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే రవాణా, నిల్వ లోపాల వల్ల సుమారు 53,000 టన్నుల ఆహార ధాన్యాలు వృథా అయ్యాయి. ఒకవైపు ఆకలి కేకలు, మరోవైపు గోడౌన్లలో కుళ్లిపోతున్న ధాన్యాలు వెరసి ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పడం లేదు.ఈ భారీ నష్టాన్ని, లీకేజీలను అరికట్టడానికి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ‘నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT)’ పరిష్కారంగా తోస్తుంది. ప్రభుత్వం భరిస్తున్న ఈ రూ.40 ఖర్చును నేరుగా పేదల ఖాతాల్లో వేస్తే వారు మార్కెట్లో తమకు నచ్చిన నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందనే వాదనలున్నాయి. భారతదేశపు అతిపెద్ద ఆహార భద్రతా పథకంలో రావాల్సిన విప్లవాత్మక మార్పులపై విశ్లేషణ.ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా పేరుగాంచిన భారత ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ప్రస్తుతం 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా బియ్యం, గోధుమలను అందిస్తోంది. అయితే, పేదల ఆకలి తీరుస్తున్న ఈ పథకం వెనుక ప్రభుత్వం భరిస్తున్న ఆర్థిక భారం, వ్యవస్థలోని లోపాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.ఒక కిలో ధాన్యం ధర ఎంత?సాధారణ పౌరులకు రేషన్ దుకాణాల్లో బియ్యం, గోధుమలు ఉచితంగా లభిస్తున్నప్పటికీ, ప్రభుత్వంపై పడుతున్న వ్యయం సామాన్యమైనది కాదు. ధాన్యాల సేకరణ, నిల్వ, రవాణా, వడ్డీ ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే కిలో ధాన్యం రేషన్ షాపుకు చేరడానికి ప్రభుత్వానికి రూ.28 నుంచి రూ.40 వరకు ఖర్చవుతోంది.2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్సీఐ వ్యయంబియ్యం (కిలోకు): రూ.39.75గోధుమలు (కిలోకు): రూ.27.74మొత్తం ఆహార సబ్సిడీ బిల్లు: రూ.2.05 లక్షల కోట్లువ్యవస్థలోని లోపాలు.. వేల కోట్ల నష్టంప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నా ఆ ఫలాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందడం లేదనే అభిప్రాయాలున్నాయి. గణాంకాల ప్రకారం, సబ్సిడీ ధాన్యాల్లో సుమారు 28 శాతం లక్షిత గృహాలకు చేరడం లేదు. అంటే దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యం పక్కదారి పడుతోంది లేదా వృథా అవుతోంది. దీనివల్ల ఏటా ప్రభుత్వానికి రూ.69,108 కోట్ల నష్టం వాటిల్లుతోంది. రవాణా, నిల్వ సమయంలో జరుగుతున్న నష్టం కూడా ఆందోళనకరంగా ఉంది. 2025 ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలోనే ఎఫ్సీఐ రవాణాలో 40,000 టన్నులు, నిల్వలో 13,000 టన్నుల ధాన్యాన్ని కోల్పోయింది.నగదు బదిలీ(DBT) పరిష్కారమేనా?ఈ లాజిస్టిక్స్ చైన్లోని లోపాలను సరిదిద్దడానికి నగదు బదిలీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ DBT) ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ధాన్యం పంపిణీకి చేసే ఖర్చును నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధిత బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల..సప్లై చైన్ లీకేజీలను అరికట్టవచ్చు.లబ్ధిదారులు తమకు నచ్చిన నాణ్యమైన ఆహారాన్ని స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయవచ్చు.కర్ణాటకలోని ‘అన్న భాగ్య’ నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధిదారులు మెరుగైన ఆహారాన్ని కొనుగోలు చేయడమే కాకుండా, కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యారు.ముందున్న మార్గంపీడీఎస్ వ్యవస్థను నేరుగా నగదు బదిలీకి మార్చడం ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. దీనికోసం ప్రభుత్వం కొన్ని వ్యూహాలను అనుసరించాలి.లబ్ధిదారులే స్వచ్ఛందంగా నగదు లేదా ధాన్యం ఎంచుకునేలా 12-18 నెలల సమయం ఇవ్వాలి.ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నగదు బదిలీ మొత్తాన్ని సవరించాలి.మౌలిక సదుపాయాలు లేని చోట్ల నగదుకు బదులు ఆహార కూపన్లను వినియోగించవచ్చు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే పెట్టి పుట్టాల్సిందే! -
రూ.10 నోట్లకు గుడ్బై..!
సామాన్య ప్రజల దైనందిక అవసరాలలో చిల్లర నోట్లకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అలాగే విద్యార్థుల అవసరాలకు, చిన్న చిన్న ఒప్పందాల లావాదేవీలలో ఉపయోగించే 10 రూపాయల స్టాంప్ పేపర్ల పాత్ర ప్రాధాన్యమైంది. ఉదయం పాల నుంచి మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లలో పది రూపాయల నోట్ల ప్రాధాన్యత మామూలుది కాదు. అయితే కొన్నేళ్లుగా రూ.10 నోట్లు కనుమరుగవుతున్నాయి. నోట్లకు బదులు విడుదల చేసిన రూ.10 నాణేలు చెల్లుబాటు కావని పలు వదంతులు రావడంతో వాటి చెలామణిలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.10 నాణెం తయారీ కంటే 10 నోట్ల ముద్రణ తక్కువ ఖర్చవుతున్నా వాటి జీవిత కాలం తక్కువగా ఉండటంతో నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసినట్లు తెలుస్తోంది. వేయి రూ.10 నోట్లు ముద్రించడానికి ఆర్బీఐకి 966(ప్రతీ నోటుకు 1.01 రూ) రూపాయలు ఖర్చవుతుండగా. 10 నాణెం తయారీకి 5.54 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. నోట్ల ముద్రణ తక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా వాటి జీవితకాలం కూడా తక్కువగానే ఉంటున్నది. 10 రూపాయల నోటు ఏడాదిలోపే శిథిలమవుతుండగా నాణాలు మాత్రం జీవితకాలం పాడవకుండా ఉంటాయి. ఇదే కారణంగా ప్రతి ఏడాది నోట్ల ముద్రణ కంటే నాణాల ముద్రణకే ఆర్బీఐ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మార్కెట్లో 10 నాణాలపై వస్తున్న వదంతులను ఖండిస్తూ ఆర్బీఐ కచ్చితమైన ప్రకటనలు చేసింది. 10 నాణాలను (10 Rupees Coins) ఎవరైనా నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను సామాజిక మాధ్యాల ద్వారా పోస్టర్ల ద్వారా బ్యాంకుల్లో ప్రదర్శించింది. వదంతులకు గురైన పాత రూ.10 నాణాలతో పాటు, గత సంవత్సరం కొత్త రూ.10 నాణాలను ఆర్బీఐ విడుదల చేసింది. రూ.10 నోట్ల కొరత కారణంగా ప్రస్తుతం రూ.10 నాణాల పట్ల మార్కెట్లో తిరస్కరణ ఉండటం లేదని పలువురు అంటున్నారు.రూ.10 స్టాంప్ పేపర్ల కొరతవిద్యార్థుల, సామాన్యుల అవసరాలలో ప్రాధాన్యత కలిగిన రూ.10 స్టాంప్ పేపర్లు కూడా కనుమరుగయ్యాయి. కొద్ది కాలం క్రితం వరకు వాహనాల నెలవారీ కిరాయిలు, ఇళ్లు, దుకాణాల కిరాయినామా లావాదేవీలు, చిన్న చిన్న అఫిడవిట్లు పూర్తిగా రూ.10 స్టాంప్ పేపర్ల పైనే జరిగేవి. విద్యార్థుల స్టైఫండ్ల రెన్యూవల్స్, ఆదాయ, కుల ధృవీకరణాల పత్రాల కోసం ఈ స్టాంప్ పేపర్లనే వాడే వారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు రూ.10 స్టాంప్ పేపర్లపైనే అందజేసేవారు. కొద్ది కాలంగా స్టాంప్ పేపర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.10 స్టాంప్లు లభించకపోవడంతో రూ.20, రూ.50, రూ.100 స్టాంప్ పేపర్లను వాడాల్సి వస్తోంది. సాధారణ అవసరాలకు కూడా ఎక్కువ విలువ గల స్టాంప్ పేపర్లను వాడుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఏడాది క్రితమే రూ.10 స్టాంప్ పేపర్ల ముద్రణ కూడా ఆగిపోయిందని అధికారులు అంటున్నారు.ఫ్రాంకింగ్ మెషిన్ల ద్వారా..స్టాంప్ పేపర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి రిజి్రస్టార్ కార్యాలయాల్లో ఫ్రాంకింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ అధికారులు తెలిపారు. ఈ మెషిన్ల ద్వారా తెల్ల కాగితంపై వినియోగదారులకు ఎంత విలువ స్టాంప్ పేపర్లు (Stam Papers) అవసరమో ఆ విలువను ముద్రించి ఇస్తున్నామని వారు అంటున్నారు. -
చెక్ పవర్ తగ్గిందా?
రెండు దశాబ్దాల క్రితం.. బ్యాంకుకి వెళితే పెద్ద క్యూ లైన్, చేతిలో చెక్కు పుస్తకం, సంతకం వెరిఫికేషన్ కోసం ఎదురుచూపులు. అప్పట్లో ఒకరికి డబ్బు పంపాలంటే చెక్కు రాసి ఇవ్వడమే అత్యంత సురక్షితమైన, ఏకైక మార్గం. ఇరవై ఏళ్ల క్రితం దేశంలోని మొత్తం ఆర్థిక లావాదేవీల విలువలో 98.8 శాతం వాటా చెక్కులదే. కానీ, కాలం మారింది.. టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అదే బ్యాంకు మన అరచేతిలోకి వచ్చేసింది. ఒకప్పుడు సంతకం కోసం నిమిషాలు వేచి చూసిన మనం, ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో పని ముగిస్తున్నాం. ఈ మార్పు వెనుక చాలానే కారణాలున్నాయి.ఆర్థిక లావాదేవీల పరిణామంభారతీయ బ్యాంకింగ్ రంగంలో గత ఇరవై ఏళ్లుగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. జరుగుతున్న మార్పులు విస్మయానికి గురిచేస్తాయి. ఒకప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయాలంటే కేవలం చెక్కులే దిక్కు. కానీ నేడు స్మార్ట్ఫోన్ల ద్వారా ఒక్క క్లిక్తో క్షణాల్లో పని పూర్తవుతోంది. కొన్ని సర్వేల ప్రకారం మొత్తం వార్షిక లావాదేవీల విలువలో చెక్కుల వాటా ఎలా పడిపోయిందో చూద్దాం.సంవత్సరంలావాదేవీల విలువలో చెక్కుల వాటా (%)200598.8%201092.5%201550.7%202015.4%20248.5% 2005లో దాదాపు పూర్తి స్థాయిలో (98.8%) రాజ్యమేలిన చెక్కులు, 2024 నాటికి కేవలం 8.5 శాతానికి పడిపోయాయి. అంటే ప్రజలు, వ్యాపార సంస్థలు పేపర్ ఆధారిత లావాదేవీల కంటే ఎలక్ట్రానిక్ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది.మార్పునకు కారణాలుపెద్ద నోట్ల రద్దు.. 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థకు ఒక టర్నింగ్ పాయింట్. నగదు కొరత ఏర్పడటంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతికారు. ఇది డిజిటల్ వాలెట్లు, కార్డ్ పేమెంట్స్ వాడకాన్ని ఒక్కసారిగా పెంచింది.యూపీఐ విప్లవం.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) చెక్కుల మనుగడను ప్రశ్నార్థకం చేసింది. చెక్కు రాసి బ్యాంకుకు వెళ్లి, అది క్లియర్ అవ్వడానికి రెండు రోజులు వేచి చూసే బదులు సెకన్లలో డబ్బు పంపే సౌలభ్యం యూపీఐ కల్పించింది.డిజిటలైజేషన్, ఇంటర్నెట్ వ్యాప్తి.. చౌకైన డేటా ధరలు, స్మార్ట్ఫోన్ల లభ్యత పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లావాదేవీలు సాధారణమయ్యాయి. నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ వంటి సేవలు చెక్కుల అవసరాన్ని భారీగా తగ్గించాయి.భవిష్యత్తు అంచనాలుభవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు మరింత వినూత్నంగా మారబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన ‘ఈ-రూపాయి’(e-Rupee) రాబోయే రోజుల్లో ఫిజికల్ క్యాష్, చెక్కుల అవసరాన్ని మరింత తగ్గిస్తుంది. భవిష్యత్తులో కేవలం ముఖ గుర్తింపు లేదా వేలిముద్రలతో మరింత సురక్షితమైన లావాదేవీలు జరగనున్నాయి. యూపీఐ సేవలు ఇప్పటికే ఇతర దేశాలకు (సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్ వంటివి) విస్తరిస్తున్నాయి. దీనివల్ల అంతర్జాతీయ లావాదేవీల్లో కూడా చెక్కులు లేదా డ్రాఫ్టుల వాడకం కనుమరుగవుతుంది. ఫిజికల్ బ్యాంక్ బ్రాంచ్లతో పనిలేకుండా ‘నియో బ్యాంక్స్(డిజిటల్ బ్యాంకులు)’ ప్రాధాన్యత పెరగనుంది.ఇదీ చదవండి: పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది! -
పదవి పట్టాభిషేకం కాదు.. ప్రజాసేవకు పునాది!
తెలంగాణ పల్లెల్లో మళ్లీ కొత్త పాలన మొదలైంది. ఊరూరా ఎన్నికల కోలాహలం ముగిసి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు నియామక పత్రాలు అందుకుని గద్దెనెక్కారు. అయితే, కొంతమంది సర్పంచుల్లో ఈ విజయోత్సాహం వెనుక ఒక చేదు నిజం కూడా ఉంది. ఎన్నికల హోరాహోరీలో గెలుపు కోసం చాలా చోట్ల తాయిలాలు, నగదు ప్రవాహం రాజ్యమేలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు కొత్త సర్పంచుల ముందున్న లక్ష్యం ఏమిటి? ఎన్నికల్లో ఖర్చు చేసిన పెట్టుబడిని రాబట్టుకునే మార్గాలను వెతకడమా? లేక పల్లె ప్రగతికి బాటలు వేయడమా? అనే సందిగ్ధం కొద్దిమందిలో నెలకొంది.2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సర్పంచ్కు ఒక సామాన్య ప్రతినిధి హోదా నుంచి గ్రామ పాలకుడి స్థాయి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం అంటే ఆధిపత్యం కాదు.. పారిశుధ్యం, హరితహారం, మౌలిక వసతుల కల్పనలో చూపాల్సిన కార్యదక్షత. ఓటును కొనుక్కున్నామనే భావన పక్కన పెట్టి, గ్రామ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రతి పైసాను అభివృద్ధికి వెచ్చించేలా సర్పంచులు అడుగులు వేయాల్సిన సమయం ఇది. పదవిని ఒక వ్యాపారంగా చూడకుండా, పల్లెను ఒక ఆదర్శంగా మార్చే బాధ్యతగా స్వీకరించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది.తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక వికాసానికి గ్రామాలు పట్టుకొమ్మలు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఒక స్వయం ప్రతిపత్తి గల యూనిట్గా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో సర్పంచ్ కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, గ్రామ సర్వతోముఖాభివృద్ధికి సారథి.పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ విధులుగ్రామసభ నిర్వహణ.. ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభను నిర్వహించి, ప్రజల అవసరాలను గుర్తించడం.పారిశుధ్యం, ఆరోగ్యం.. గ్రామంలో చెత్త సేకరణ (తడి, పొడి చెత్త విభజన), మురుగు కాలువల శుభ్రత, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం సర్పంచ్ ప్రథమ కర్తవ్యం.హరిత హారం.. గ్రామంలో నర్సరీల నిర్వహణ, నాటిన మొక్కల్లో కనీసం 85% బతికించాల్సిన బాధ్యత సర్పంచ్పై ఉంటుంది.ఆర్థిక నిర్వహణ.. పంచాయతీ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయడం, వార్షిక బడ్జెట్ ఆమోదించి, ఆడిటింగ్కు సహకరించడం.మౌలిక సదుపాయాలు.. వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, అంతర్గత రోడ్ల మరమ్మతులు పర్యవేక్షించడం.ఎన్నికల ఖర్చు.. అభివృద్ధి కాంక్షఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి భారీగా ఖర్చు చేశారనే వాదనలు ఉన్న మాట వాస్తవం. అయితే, ‘పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలి’ అనే ధోరణితో సర్పంచులు పనిచేస్తే, అది గ్రామానికి శాపంగా మారుతుంది. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు (కలెక్టర్ ద్వారా తొలగింపు) ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాలి. రాజకీయ అధికారం అనేది కేవలం ఐదేళ్ల అవకాశం. ఈ సమయంలో సంపాదించిన సొమ్ము కంటే గ్రామంలో నిర్మించిన అభివృద్ధి చిహ్నాలు, ప్రజల గుండెల్లో సంపాదించుకున్న గౌరవం శాశ్వతంగా నిలిచిపోతాయి.గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే మార్గాలుకొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడానికి కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. గ్రామ పంచాయతీ సేవలను ఆన్లైన్ చేయడం, ప్రతి పద్దును ప్రజల సమక్షంలో చర్చించి ఖర్చు చేయడం ద్వారా పారదర్శకతను పెంచవచ్చు. గ్రామ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేషించాలి. పన్నుల వసూలులో క్రమశిక్షణ పాటించాలి. అంగన్వాడీలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు అందించాలి. ఏదైనా పని చేసే ముందు ప్రజల సలహాలను తీసుకోవడం వల్ల పనుల్లో నాణ్యత పెరుగుతుంది. జవాబుదారీతనం ఉంటుంది.సర్పంచ్ పదవి అనేది కేవలం హోదా కాదు, అది ఒక గొప్ప సామాజిక బాధ్యత. ఎన్నికల్లోని ఖర్చును ఒక సామాజిక సేవగా భావించి, రాబోయే ఐదేళ్లు గ్రామ పురోభివృద్ధికి అంకితం కావాలి. పచ్చని చెట్లు, శుభ్రమైన వీధులు, విద్యావంతులైన యువత.. ఉన్న గ్రామమే నిజమైన బంగారు తెలంగాణకు పునాది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లాభపడటం కంటే ఒక తరాన్ని బాగు చేసే గ్రామ నాయకుడిగా ఎదగడమే సర్పంచుల అసలు విజయం.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
పన్ను చెల్లింపుదారులను పెంచుకోవాలి
వృద్ధిని మరింత వేగవంతం చేయడానికి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులను మరింత విస్తృతం చేసుకోవడంతోపాటు.. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడంపై 2026–27 బడ్జెట్లో దృష్టి సారించాలని ‘థింక్ చేంజ్ ఫోరమ్’ (టీసీఎఫ్) సూచించింది. పన్నులను సులభతరం చేయడం వల్ల ఆదాయాన్ని పెంచుకోవచ్చని ఇటీవలి జీఎస్టీ 2.0 సంస్కరణలు నిరూపించినట్టు పేర్కొంది.పన్ను వసూళ్లను పెంచుకునేందుకు అధిక పన్ను రేట్లు ఉండాలన్న దీర్ఘకాలిక నమ్మకాన్ని ఇది సవాలు చేసినట్టు తెలిపింది. జీఎస్టీ సంస్కరణల సూత్రాలను ప్రత్యక్ష పన్నులకూ విస్తరించాలని సూచించింది. విధానపరమైన స్పష్టత, నిబంధనల అమలు ఆధారిత వృద్ధి ఉండాలని పేర్కొంది. పరిహార సెస్సు ముగిసిన తర్వాత ఎంఆర్పీ ఆధారిత పన్నుల వ్యవస్థను నిలిపవేయాలని సూచించింది. ఉత్పాదకతను పెంచే పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని, చట్టవిరుద్ధ/దొంగ రవాణాతో కూడిన సమాంతర ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని కోరింది. పన్నుల నిష్పత్తిని పెంచుకోవాలి..జీడీపీలో పన్నుల నిష్పత్తిని పెంచుకునేందుకు పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసుకోవడంపై తక్షణం దృష్టి సారించాలని థింక్ చేంజ్ ఫోరమ్ నివేదిక ప్రధానంగా సూచించింది. 140 కోట్ల జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2.5–3 కోట్లుగానే ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. రేట్లను పెంచడం కాకుండా టెక్నాలజీ సాయంతో పన్ను చెల్లింపుదారులను విస్తృతం చేసుకోవాలని కోరింది. ఇందుకు గాను జీఎస్టీ, ఆదాయపన్ను, అధిక వినియోగ డేటాను అనుసంధానించాలని సూచించింది.గత దశాబ్ద కాలంలో కార్పొరేట్ లాభదాయకత పెరిగినప్పటికీ.. జీడీపీలో పెట్టుబడుల నిష్పత్తి 2011 నాటి గరిష్ట స్థాయికి దిగువనే ఉన్నట్టు తెలిపింది. కంపెనీల లాభాలు ఉత్పాదకతను పెంచే సామర్థ్య విస్తరణకు కాకుండా, ఆర్థిక సాధనాల్లోకి వెళుతున్నట్టు పేర్కొంది. కనుక పన్ను ప్రోత్సాహకాలతోపాటు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ), ఉపాధి కల్పనను ప్రోత్సహించే చర్యలు చేపట్టాలని కోరింది.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
వృద్ధికి మద్దతుగా 2026–27 బడ్జెట్
దేశీయంగా బలంగా ఉన్న డిమాండ్కు ప్రేరణనివ్వడం ద్వారా వచ్చే బడ్జెట్ (2026–27) వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని ఈవై ఎకానమీ వాచ్ తన అంచనా వ్యక్తం చేసింది. వృద్ధికి అనుకూలమైన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానాన్ని సానుకూలంగా పేర్కొంది. ఆదాయపన్ను మినహాయింపులు, జీఎస్టీ సంస్కరణలతో కొంత ఆదాయం కోల్పోవాల్సి వస్తున్నప్పటికీ.. పన్నేతర ఆదాయం కింద బడ్జెట్లో పేర్కొనని అదనపు ఆదాయం, బడ్జెట్లో ప్రకటించిన కొన్ని రకాల వ్యయాలను తగ్గించుకోవడం ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు, మూలధన వ్యయాల లక్ష్యాలను చేరుకోవచ్చని అంచనా వేసింది.ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ఇటీవలే పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం, జాతీయ భద్రతా, ప్రజారోగ్యం సెస్సులను ప్రస్తావించింది. పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మసాలాపై సెస్సును అమలు చేసే రెండు చట్టాలకు పార్లమెంట్ ఇటీవలే ఆమోదించడం తెలిసిందే. ‘‘ఇక ముందూ భారత్ వృద్ధికి మద్దతుగా దేశీ డిమాండ్పైనే ఆధారపడడం కొనసాగొచ్చు. దీనికితోడు ఆర్బీఐ వృద్ధి ఆధారిత విధానంతో 2026–27 బడ్జెట్ వృద్ధికి మద్దతుగా ఉంటుందని అంచనా వేయొచ్చు’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు.అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో వాస్తవ జీడీపీ వృద్ధికి ఎగుమతుల రూపంలో సమకూరేది ప్రతికూలంగా ఉండొచ్చని ఈవై ఎకా నమీ వాచ్ పేర్కొంది. రెండో త్రైమాసికం జీడీపీ వృద్ధి (సెప్టెంబర్ క్వార్టర్)లో ఎగుమతుల వాటా మైనస్ 2.1 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. జూన్ త్రైమాసికంలో ఇది మైనస్ 1.4 శాతంగా ఉందని, అక్క డి నుంచి పెరిగినట్టు తెలిపింది. వాణిజ్య అనిశి్చతులు సమసిపోయే వర కు ఇదే పరిస్థితి కొనసొ గొచ్చని అంచనా వేసింది. భారత్ మధ్య కాలానికి 6.5% వృద్ధిని కొనసాగించొచ్చని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!? -
భాగ్యనగరంలో ఇళ్ల అమ్మకాలు డీలా..!
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 98,019 యూనిట్లకు పరిమితం అవుతాయని రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 2024 చివరి త్రైమాసికంలో విక్రయాలు 1,16,137 యూనిట్లతో పోలి్చతే 16 శాతం తక్కువ అని తెలిపింది. 2021 జూలై–సెపె్టంబర్ త్రైమాసికం తర్వాత ఇంత తక్కువ విక్రయాలు మళ్లీ ఇదేనని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న విక్రయ గణాంకాల ఆధారంగా డిసెంబర్ త్రైమాసికంపై తన అంచనాలతో ఒక నివేదికను విడుదల చేసింది. నవీ ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ మినహా మిగిలిన ఏడు నగరాల్లో అమ్మకాలు తగ్గినట్టు తెలిపింది. ఆయా నగరాల్లోని ప్రధాన నివాస ప్రాంతాలకు సంబంధించిన డేటా ఆధారంగా ప్రాప్ ఈక్విటీ ఈ అంచనాలు రూపొందించింది. ‘‘సంప్రదాయంగా అక్టోబర్–డిసెంబర్లో అమ్మకాలు బలంగా ఉంటుంటాయి. పండుగల సీజన్లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు కనిపిస్తుంటాయి. ఇటీవలి అమ్మకాల క్షీణత అన్నది మార్కెట్లో ప్రీమియమైజేషన్ను సూచిస్తోంది. దీంతో అమ్మకాలు తగ్గినప్పటికీ విలువలో వృద్ధి కనిపిస్తోంది’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు. నగరాల వారీ అంచనాలు.. → హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి 11,323 యూనిట్లుగా ఉండొచ్చు. → చెన్నైలోనూ 3 శాతం తక్కువగా 4,542 యూనిట్లకు విక్రయాలు పరిమితం కావొచ్చు. → బెంగళూరులో అమ్మకాలు 15,603 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఒక శాతం తక్కువ. → కోల్కతాలో 11 శాతం తక్కువగా 3,995 యూనిట్లుగా ఉంటాయి. → పుణెలో అమ్మకాలు ఏకంగా 31 శాతం తగ్గి 15,788 యూనిట్లకు పరిమితం అవుతాయి. → థానేలో అమ్మకాలు 26 శాతం తగ్గి 16,987 యూనిట్లుగా ఉంటాయి. → ముంబై మార్కెట్లోనూ 25 శాతం తక్కువగా 9,135 యూనిట్లకు విక్రయాలు పరిమితం అవుతాయి. → నవీ ముంబైలో మాత్రం 13 శాతం అధికంగా 8,434 యూనిట్లు అమ్ముడుపోవచ్చు. → ఢిల్లీ ఎన్సీఆర్ మార్కెట్లోనూ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 12,212 యూనిట్లుగా ఉంటాయి. → ఇక ఈ నగరాల్లో కొత్త ఇళ్ల యూనిట్ల సరఫరా సైతం 10 శాతం తగ్గి 88,427 యూనిట్లుగా ఉంటాయన్నది ప్రాప్ ఈక్విటీ అంచనా. -
సెజ్ ఔషధాలకు ట్యాక్స్ రిలీఫ్
న్యూఢిల్లీ: దేశీయంగా కీలక ఔషధాల లభ్యత పెరిగేలా, ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్) తయారు చేసి, దేశీయంగా విక్రయించే ఔషధాలపై కస్టమ్స్ సుంకాలను ఎత్తివేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెజ్లలో తయారై, దేశీయ మార్కెట్లో అమ్మే ఔషధాలపై 10 శాతం సుంకాలు వర్తిస్తున్నాయి. ఒకవేళ తాజా ప్రతిపాదన ఆచరణ రూపం దాలిస్తే సదరు సుంకాల ప్రస్తావన లేకుండా పలు టీకాలు, కీలక ఔషధాలను దేశీయంగా తక్కువ ధరకే విక్రయించేందుకు వీలవుతుంది. అయితే, ఏకమొత్తంగా అన్ని ఔషధాలకు కాకుండా కొన్ని ఉత్పత్తులకు మాత్రమే మినహాయింపులను వర్తింప చేయొచ్చని భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనను చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా ఎంపిక చేసిన కొన్ని టీకాలు, కొన్ని కీలకమైన ఔషధాలు, ప్రభుత్వం నిర్ణయించే ఉత్పత్తులకు మినహాయింపునివ్వొచ్చని పేర్కొన్నాయి. వైద్య పరికరాలకు కూడా.. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థని కూడా ప్రోత్సహించే దిశగా కొన్ని మెడికల్ డివైజ్ల తయారీ సంస్థలు, బయోటెక్ సంస్థలకు కూడా ఇదే తరహాలో సుంకాల నుంచి మినహాయింపులనిచ్చే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిగుమతులపై ఆధారపడాల్సి వస్తున్న ఉత్పత్తులను, దేశీయంగా తయారు చేసేందుకు పెట్టుబడులు పెట్టేలా కంపెనీలను ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మన ఫార్మా రంగం గణనీయంగా ఎదుగుతోందని, పలు రాష్ట్రాలు ఫార్మా సెజ్లను ఏర్పాటు చేస్తున్నాయని వివరించాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రతిపాదనలు తోడ్పడగలవని వివరించాయి. అక్టోబర్ 1 నుంచి బ్రాండెడ్, పేటెంటెడ్ ఔషధాల దిగుమతులపై అమెరికా 100 శాతం సుంకాలను ప్రకటించడంతో దేశీయంగా ఔషధాలను విక్రయించుకునేందుకు సుంకాల నుంచి మినహాయింపునివ్వాలంటూ సెజ్ యూనిట్లు కోరుతుండటంతో ప్రభుత్వ తాజా యోచన ప్రాధాన్యం సంతరించుకుంది. సెజ్ల నుంచి ఎగుమతవుతున్న ఉత్పత్తుల్లో హైపర్టెన్షన్, మధుమేహం, కార్డియోవాసు్కలర్ వ్యాధుల్లాంటి వాటి చికిత్స కోసం ఉపయోగించే ట్యాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్టబుల్ ఔషధాలు ఉంటున్నాయి. వీటికి దేశీ మార్కెట్లో కూడా గణనీయంగా డిమాండ్ ఉంటోంది. ప్రస్తుతం దేశీ ఫార్మా మార్కెట్ 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు అంచనా. భారత్కి అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాల విభాగంలో 20 శాతం వాటా, టీకాల సరఫరాలో 60 శాతం వాటా ఉంది. -
రోజుకు 10 గంటల పనికి ప్రభుత్వం ఆమోదం
హరియాణా రాష్ట్రంలో పని గంటలు, వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ‘హరియాణా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సవరణ) బిల్లు, 2025’కు ఆమోదం లభించింది. 1958 నాటి పాత చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ద్వారా రోజువారీ పని గంటలను పెంచడంతో పాటు పలు సంస్కరణలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.బిల్లులోని ముఖ్యాంశాలుప్రస్తుతమున్న 9 గంటల పని పరిమితిని 10 గంటలకు పెంచారు. ఇందులో విశ్రాంతి సమయం కూడా కలిసి ఉంటుంది. అయితే వారానికి గరిష్టంగా 48 గంటల పని నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.త్రైమాసికానికి ఓవర్ టైమ్ పరిమితిని 50 గంటల నుంచి ఏకంగా 156 గంటలకు పెంచారు. వ్యాపార గరిష్ట డిమాండ్ సమయాల్లో సంస్థలకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.విరామం లేకుండా చేసే నిరంతర పని సమయాన్ని 5 గంటల నుంచి 6 గంటలకు పెంచారు.20 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న చిన్న సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వ్యాపార సమాచారాన్ని అందిస్తే సరిపోతుంది.వ్యాపార సౌలభ్యమా? బానిసత్వమా?ఈ బిల్లుపై సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర చర్చ జరిగింది. కార్మిక మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ.. ‘చిన్న సంస్థలపై భారాన్ని తగ్గించడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే 10 గంటల పని విధానం ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత సుర్జేవాలా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రోజుకు 10 గంటలు, దానికి తోడు 2 గంటల ఓవర్ టైమ్ కలిపితే ఒక కార్మికుడు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఇది ఆధునిక బానిసత్వం కిందకు వస్తుంది. ఇలా అయితే ఒక కార్మికుడు తన కుటుంబంతో గడిపే సమయం ఎక్కడ ఉంటుంది?’ అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: మీ స్మార్ట్వాచ్.. బీమా ప్రీమియం డిసైడ్ చేస్తుందా? -
‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..
ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించేలా సౌదీ అరేబియాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. వివిధ దేశాల్లోని పర్యాటకులను అలరించే ‘యూనివర్సల్ స్టూడియోస్’ థీమ్ పార్క్ ఇప్పుడు సౌదీలో ఏర్పాటు కానుంది. రియాద్ సమీపంలోని ఖిద్దియా ఈ ప్రాజెక్టుకు వేదిక కానుంది.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికల ప్రకారం, యూనివర్సల్ స్టూడియోస్ మాతృ సంస్థ కామ్ కాస్ట్ (Comcast) ప్రతినిధులు ఈ థీమ్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి సౌదీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. కామ్ కాస్ట్ సీఈఓ బ్రియాన్ రాబర్ట్స్ ఇటీవల స్వయంగా ఖిద్దియా సైట్ను సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలో ఉందని, నిర్మాణానికి సంబంధించి తుది అనుమతులు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.334 చదరపు కిలోమీటర్లుఈ థీమ్ పార్క్ ఏర్పాటు కానున్న ఖిద్దియా ప్రాజెక్ట్ విస్తీర్ణం 334 చదరపు కిలోమీటర్లుగా ఉందని అంచనా. ఇది ఫ్లోరిడాలోని ప్రఖ్యాత డిస్నీ వరల్డ్ కంటే రెండున్నర రెట్లు పెద్దది కావడం గమనార్హం. ఏటా 4.8 కోట్ల మంది సందర్శకులను ఆకర్షించడం దీని లక్ష్యం. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే సౌదీ జీడీపీకి సుమారు 4.5 బిలియన్ల డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.పర్యాటక రంగంలో దూసుకుపోతున్న సౌదీసౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కేవలం చమురుపైనే ఆధారపడకుండా వైవిధ్యీకరించాలని చూస్తోంది. గతేడాది 10 కోట్ల మందికిపైగా సందర్శకులు సౌదీని సందర్శించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 6.09 కోట్ల మంది పర్యాటకులు రావడం గమనార్హం. 2030 నాటికి ఏడాదికి 15 కోట్ల మంది పర్యాటకులను రప్పించాలని సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (PIF) లక్ష్యంగా పెట్టుకుంది.ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే! -
రూపాయికి ఆర్బీఐ రక్షణ కవచం
భారత రూపాయి విలువ గత కొన్ని నెలలుగా ఒత్తిడికి లోనవుతోంది. అందుకు అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. వంటివి చాలా కారణాలున్నాయి. ఈ క్రమంలో రూపాయి మరింత నేలచూపులు చూడకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చురుకైన చర్యలు చేపట్టింది.ప్రస్తుతం (డిసెంబర్ 2025 నాటికి) భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయిలకు చేరుకుంది. ఇటీవలి కాలంలో రూపాయి విలువ రూ.91 మార్కును తాకి స్వల్పంగా పుంజుకుంది. ఈ తీవ్ర ఒడిదుడుకులను అరికట్టడానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఉపయోగించి మార్కెట్లో డాలర్లను విక్రయిస్తోంది.ఆర్బీఐ జోక్యంతాజా అధికారిక సమాచారం ప్రకారం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ భారీ స్థాయిలో డాలర్లను విక్రయించింది. అక్టోబర్ నెలలో నికరంగా 11.9 బిలియన్ డాలర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించింది. రూపాయి విలువ రూ.89 మార్కును దాటకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టింది. కానీ అంతర్జాతీయ పరిస్థితులు దృష్ట్యా రూపాయి విలువ రూ.91కు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ వరకు ఆర్బీఐ దాదాపు 34.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.91 లక్షల కోట్లు) విలువైన డాలర్లను అమ్మి రూపాయి పతనాన్ని అడ్డుకుంది. డిసెంబర్ 12, 2025 నాటికి భారత విదేశీ మారక నిల్వలు 688.95 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2024లో ఉన్న 704 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ ఇవి దేశానికి పటిష్టమైన రక్షణను కల్పిస్తున్నాయి.రూపాయి బలహీనపడటానికి కారణాలుట్రంప్ ప్రభుత్వ సుంకాల పెంపు భారత ఎగుమతులపై ప్రభావం చూపడం రూపాయి బలహీనతకు ఒక కారణం.ఈ ఏడాది విదేశీ మదుపరులు భారత మార్కెట్ల నుంచి సుమారు 17 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం రూపాయిపై ఒత్తిడి పెంచింది.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల వల్ల మన దేశం ఎక్కువ డాలర్లను చెల్లించాల్సి రావడం రూపాయి విలువను తగ్గిస్తోంది.ఆర్బీఐ చర్యల పర్యావసానాలురూపాయి ఒక్కసారిగా పడిపోతే దిగుమతి చేసుకునే వస్తువుల (పెట్రోల్, ఎలక్ట్రానిక్స్) ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగే అవకశం ఉంది. ఆర్బీఐ జోక్యం వల్ల ఈ ధరలు అదుపులో ఉంటాయి. రూపాయి విలువ మరీ అస్థిరంగా ఉంటే విదేశీ పెట్టుబడిదారులు ఆందోళన చెందే ప్రమాదం ఉంటుంది. ఆర్బీఐ నియంత్రణ వారిలో నమ్మకాన్ని పెంచుతుంది.ప్రతికూలతలుడాలర్లను విక్రయించడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు క్రమంగా తగ్గుతాయి. ఇది భవిష్యత్తులో వచ్చే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవడంలో ఆటంకం కావచ్చు. ఆర్బీఐ డాలర్లను అమ్మడం వల్ల మార్కెట్లో నగదు లభ్యత తగ్గుతుంది. దీన్ని సర్దుబాటు చేసేందుకు ఆర్బీఐ ఇటీవల రూ.2.90 లక్షల కోట్ల లిక్విడిటీ లభ్యత చర్యలను ప్రకటించింది.భారత రూపాయి ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, ఆర్బీఐ తన వద్ద ఉన్న అపారమైన విదేశీ మారక నిల్వలతో రక్షణ గోడలా నిలుస్తోంది. కేవలం రూపాయి విలువను పెంచడం కంటే, మార్కెట్లో తీవ్రమైన అస్థిరత లేకుండా చూడటమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యమని గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఇటీవల పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు కుదిరితే రూపాయి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: 2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే.. -
జీడీపీ డేటా కొత్త సిరీస్: కేంద్రం ప్రకటన
మార్చిన బేస్ ఇయర్తో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) డేటా సిరీస్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ వెల్లడించింది. అలాగే పారిశ్రామికోత్పత్తి కొత్త సిరీస్ను మే నెల నుంచి ప్రకటించనున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.దీని ప్రకారం 2024 బేస్ ఇయర్గా (100కు సమానం) రిటైల్ ద్రవ్యోల్బణం కొత్త సిరీస్ 2026 ఫిబ్రవరి 12న విడుదల అవుతుంది. అలాగే, 2022–23 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్గా నేషనల్ అకౌంట్స్ డేటాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న, ఐఐపీ డేటా మే 28న విడుదల చేస్తారు. -
విలువ తగ్గినా మంచికే!
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ తగ్గడం అనేది సాధారణంగా ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. అయితే, ఆర్థిక కోణంలో విశ్లేషిస్తే దీనివల్ల భారత ప్రభుత్వానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు కొన్ని కీలకమైన సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. అదెలాగంటారా? ముఖ్యంగా ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, దేశీయ తయారీ రంగంపై దీని ప్రభావం సానుకూలంగా ఉంటుంది. ఎలాగో చూద్దాం.ఎగుమతులకు లభించే ప్రోత్సాహంరూపాయి విలువ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తువుల ధరలు తగ్గుతాయి. అంటే విదేశీ కొనుగోలుదారులకు మన ఉత్పత్తులు తక్కువ ధరకే లభిస్తాయి. చైనా వంటి దేశాలతో పోటీ పడేటప్పుడు తక్కువ ధర కలిగిన భారతీయ వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది. విదేశీ కరెన్సీలో (డాలర్లలో) వచ్చే ఆదాయాన్ని రూపాయల్లోకి మార్చినప్పుడు ఎగుమతిదారులకు మునుపటి కంటే ఎక్కువ మొత్తం అందుతుంది. ఇది ఐటీ, ఫార్మా, వస్త్ర పరిశ్రమలకు ఎంతో మేలు చేస్తుంది.ప్రవాస భారతీయుల నుంచి రెమిటెన్స్లుప్రపంచంలోనే అత్యధికంగా విదేశాల నుంచి నిధులను పొందే దేశం భారత్. రూపాయి విలువ పడిపోవడం ప్రవాస భారతీయులకు (ఎన్ఆర్ఐ) ఒక వరం లాంటిది. వారు ఇండియాకు పంపే ప్రతి డాలర్కు ఇప్పుడు ఎక్కువ రూపాయలు వస్తాయి. దీనివల్ల వారి కుటుంబాల వినియోగ సామర్థ్యం పెరగడమే కాకుండా దేశంలోకి విదేశీ కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలను బలోపేతం చేస్తుంది.‘మేక్ ఇన్ ఇండియా’కు ఊతందిగుమతులు ఖరీదైనవిగా మారడం వల్ల దేశీయంగా వస్తువులను తయారు చేసే కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. విదేశీ వస్తువుల ధరలు పెరగడం వల్ల ప్రజలు స్వదేశీ వస్తువుల వైపు మొగ్గు చూపుతారు. ఇది దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. విదేశీ కంపెనీలు భారత్లో కార్యాలయాలను లేదా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడం మునుపటి కంటే చౌకగా మారుతుంది. దీనివల్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (FDI) పెరిగే అవకాశం ఉంది.పర్యాటక రంగం అభివృద్ధివిదేశీ పర్యాటకులు భారత్లో పర్యటించేందుకు మరింత తక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. డాలర్ విలువ పెరగడం వల్ల విదేశీయులు తక్కువ ఖర్చుతోనే భారతదేశంలో ఎక్కువ రోజులు గడపవచ్చు. ఇది హోటళ్లు, రవాణా, స్థానిక వ్యాపారాలకు ఆదాయాన్ని పెంచుతుంది.ప్రభుత్వానికి ఆదాయందేశంలో దిగుమతి చేసుకునే వస్తువుల విలువ రూపాయల్లో పెరగడం వల్ల వాటిపై విధించే కస్టమ్స్ డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది. ఎగుమతుల ద్వారా లాభపడే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రభుత్వానికి అధిక డివిడెండ్లు అందే అవకాశం ఉంది.రూపాయి విలువ తగ్గడం వల్ల ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ వంటి దిగుమతుల భారం పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ సరైన విధానాలతో ఎగుమతులను, దేశీయ ఉత్పత్తిని పెంచుకుంటే భారత్ దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవచ్చు. ప్రభుత్వం ఎగుమతి ఆధారిత వృద్ధిపై దృష్టి పెట్టినప్పుడు బలహీనమైన రూపాయి ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్లా పనిచేస్తుంది.ఇదీ చదవండి: జనరేటివ్ ఏఐ కంటే స్పష్టమైన ఫలితాలిచ్చే దిశగా.. -
చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!
ప్రపంచవ్యాప్తంగా భారత్తోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగులు పనిచేసే చేసే పని గంటలకు, అందుకు వారికి లభించే వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయులు వారానికి ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ వారి సంపాదన మాత్రం ఆయా దేశాల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉంటోంది. 2024-25 నాటి గణంకాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) నివేదికల ఆధారంగా వివిధ దేశాల పనిగంటలు, వేతనాల విశ్లేషణ కింద చూద్దాం.వివిధ దేశాల పనిగంటలు.. వేతనాల పరిశీలనదేశంసగటు వారపు పనిగంటలుసగటు నెలవారీ వేతనంగంటకు ఆదాయంఅమెరికా34 - 36 గంటలురూ.5,60,000రూ.4,100జర్మనీ34 - 35 గంటలురూ.4,50,000రూ.3,100జపాన్38 - 40 గంటలురూ.3,10,000రూ.1,900చైనా46 - 48 గంటలురూ.1,40,000రూ.750భారతదేశం46 - 48 గంటలురూ.32,000రూ.170 గమనిక: ఈ వేతనాలు ఆయా దేశాల కరెన్సీ విలువను ప్రస్తుత మారకపు రేటు ప్రకారం రూపాయిల్లోకి మార్చగా వచ్చిన సగటు విలువలు. రూపాయి విలువను అనుసరించి వీటిలో మార్పులుంటాయని గమనించాలి.అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితిఅమెరికా, జర్మనీ దేశాల్లో వారానికి కేవలం 35 గంటల లోపు పనిచేస్తూనే భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వర్క్, హై-టెక్నాలజీ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత లభిస్తుంది.ఒకప్పుడు అధిక పనిగంటలకు పేరుగాంచిన జపాన్, ప్రస్తుతం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వైపు మొగ్గు చూపుతోంది. 40 గంటల పని పరిమితిని కచ్చితంగా అమలు చేస్తోంది.చైనాలో కూడా పనిగంటలు భారత్తో సమానంగా ఉన్నప్పటికీ అక్కడి ఉత్పాదకత, తయారీ రంగం బలంగా ఉండటం వల్ల వేతనాలు భారత్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.భారత్లో ఎందుకీ పరిస్థితి?భారతదేశంలో కార్మికులు లేదా ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్నా తక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 90% పైగా శ్రామిక శక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. ఇక్కడ కచ్చితమైన వేతన చట్టాలు లేదా పనిగంటల నియంత్రణ తక్కువగా ఉంటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక గంటలో తయారయ్యే వస్తువు/సర్వీసు విలువ, భారత్లో తయారయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధునాతన సాంకేతికత, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం.శ్రమ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులను నియమించుకోగలుగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల బేరమాడే శక్తి ఉద్యోగులకు తక్కువగా ఉంటోంది.భారత్లో జీవన వ్యయం (Rent, Food, Medical) అమెరికా, జర్మనీలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి రూపాయి విలువ పరంగా తక్కువగా కనిపించినా స్థానిక అవసరాలకు అది సరిపోతుందని కంపెనీల వాదన. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది భారీ వ్యత్యాసంగానే కనిపిస్తుంది.భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ సామాన్య ఉద్యోగికి దక్కే ఫలితం ఇంకా ఆశాజనకంగా లేదు. పనిగంటలను తగ్గించి, వేతనాలను పెంచాలంటే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆటోమేషన్, సంఘటిత రంగం విస్తరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ఇదీ చదవండి: పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్! -
పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుంటే నో పెట్రోల్!
పర్యావరణ పరిరక్షణ, పెరుగుతున్న వాహన కాలుష్య నివారణే లక్ష్యంగా ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో చెల్లుబాటు అయ్యే ‘పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్’(పీయూసీ) లేని ఏ వాహనానికీ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయించకూడదని రాష్ట్ర రవాణా యంత్రాంగం (ఎస్టీఏ) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.చమురు సంస్థలకు కీలక ఆదేశాలుఈ నిబంధనను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రిలయన్స్, షెల్ వంటి ప్రైవేట్ చమురు సంస్థలకు కూడా రవాణా శాఖ లేఖలు రాసింది. ప్రతి ఫ్యుయల్ స్టేషన్ వద్ద వాహనదారుడి పీయూసీ సర్టిఫికేట్ను సిబ్బంది భౌతికంగా లేదా డిజిటల్ రూపంలో తనిఖీ చేసిన తర్వాతే ఇంధనం పోయాల్సి ఉంటుంది.అవగాహన కార్యక్రమాలుఈ కొత్త నిబంధనపై వాహనదారులకు, పెట్రోల్ బంక్ సిబ్బందికి తగినంత అవగాహన కల్పించాలని చమురు సంస్థలను కోరింది. ఒకవేళ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఇంధనం సరఫరా చేస్తే సంబంధిత డీలర్లపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఎస్టీఏ హెచ్చరించింది.చట్టపరమైన నిబంధనలు ఇవే..మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2), సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989లోని రూల్ 115 ప్రకారం.. ప్రతి వాహనం నిర్దేశిత ఉద్గార ప్రమాణాలకు లోబడి ఉండాలి. పీయూసీ లేకుండా వాహనం నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోందని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఢిల్లీ బాటలోనే ఒడిశాదేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరడంతో అక్కడ ఇప్పటికే ‘నో పీయూసీ - నో ఫ్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ-4) అమల్లో ఉంది. అదే బాటలో ఒడిశా ప్రభుత్వం కూడా ముందుస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా -
పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్పై నిఘా
కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను ఆధునీకరించే క్రమంలో చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఆదాయపు పన్ను బిల్లు, 2025 ద్వారా ప్రతిపాదించిన మార్పుల ప్రకారం.. ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖకు పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా, ఈమెయిల్స్, ఇతర డిజిటల్ ఖాతాలను యాక్సెస్ చేసే అధికారం లభించనుంది. పన్ను ఎగవేతను అరికట్టడానికి, ఆర్థిక పారదర్శకతను పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ విస్తరణప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్థిక లావాదేవీలు కేవలం బ్యాంకు ఖాతాలకు మాత్రమే పరిమితం కాకుండా, వివిధ ఆన్లైన్ వేదికల ద్వారా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ‘వర్చువల్ డిజిటల్ స్పేస్’ అనే నిర్వచనాన్ని విస్తరించింది. దీని పరిధిలోకి..సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు (Facebook, Instagram, X మొదలైనవి)వ్యక్తిగత కమ్యూనికేషన్.. ఈమెయిల్ రికార్డులు.ఆన్లైన్ ఖాతాలు.. క్లౌడ్ స్టోరేజ్, ట్రేడింగ్ ఖాతాలు, ఇన్వెస్ట్మెంట్ పోర్టల్స్ వస్తాయి.పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన ఆదాయానికి, వారి వాస్తవ జీవనశైలికి మధ్య ఉన్న వ్యత్యాసాలను గుర్తించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మార్పులు ఇంకా ప్రతిపాదన దశలోనే ఉన్నాయని గమనించాలి. కొందరు పన్ను చెల్లింపుదారులు తక్కువ ఆదాయాన్ని చూపిస్తూ విదేశీ పర్యటనలు చేయడం లేదా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి ప్రతిపాదిత మార్పుల ద్వారా నిఘా పరిధిలోకి వస్తాయి.ఈ డిజిటల్ పర్యవేక్షణ ద్వారా పన్ను చెల్లింపుదారులలో బాధ్యత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో భారీ డేటాను విశ్లేషించి పన్ను ఎగవేతను ముందస్తుగానే గుర్తించే అవకాశం ఉంటుంది.గోప్యతా ఆందోళనలు.. చట్టపరమైన సవాళ్లుఈ సంస్కరణ అమలుపై న్యాయ నిపుణులు, పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా గోప్యత ప్రాథమిక హక్కు అనే అంశంపై చర్చ జరుగుతోంది. కోర్టు అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం అధికారులకు ఇవ్వడం దుర్వినియోగానికి దారితీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. క్లౌడ్ స్టోరేజ్ నుంచి వ్యక్తిగత సందేశాల వరకు యాక్సెస్ ఉండటం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: ఫాక్స్కాన్ ప్లాంట్లో 30,000 మంది నియామకం -
చలి చంపుతున్నా వ్యాపారం భళా
భారతదేశంలో చలికాలం కేవలం వాతావరణ మార్పులకే పరిమితం కాకుండా దేశ రిటైల్, ఉత్పాదక రంగాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగే ఈ సీజన్ సుమారు 13.5 బిలియన్ డాలర్ల(సుమారు 1.1 లక్షల కోట్లు) విలువైన వింటర్ వేర్ మార్కెట్తో పాటు పలు కీలక రంగాలకు లాభాల పంట పండిస్తోంది. ఈ కాలంలో వినియోగదారుల అవసరాలు మారిపోవడం వల్ల అనేక రకాల వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.చలికాలంలో వృద్ధి చెందే ప్రధాన వ్యాపారాలుభారతదేశంలో వింటర్ వేర్ మార్కెట్ విలువ 2025 నాటికి సుమారు 13.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్వెటర్లు, జాకెట్లు, థర్మల్ వేర్, శాలువాలు, గ్లౌవ్స్, మఫ్లర్లకు ఈ కాలంలో చాలా డిమాండ్ ఉంటుంది. లుధియానా, తిరుపూర్ వంటి ప్రాంతాల నుంచి హోల్సేల్గా కొనుగోలు చేసి రిటైల్ షాపులు లేదా రోడ్డు పక్కన తాత్కాలిక స్టాళ్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు.ఆహార, పానీయాల రంగంచల్లని వాతావరణంలో ప్రజలు వెచ్చని, పోషక విలువలున్న ఆహారాన్ని కోరుకుంటారు. టీ, కాఫీ ముఖ్యంగా సూప్ విక్రయాల విభాగంలో ఈ సమయంలో డిమాండ్ పెరుగుతోంది. రోగనిరోధక శక్తిని పెంచే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూల అమ్మకాలు పెరుగుతాయి.గృహోపకరణాలుఉష్ణోగ్రతలు తగ్గడంతో గృహ వినియోగ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. నీటిని వేడి చేసే గీజర్లు, గదిని వెచ్చగా ఉంచే రూమ్ హీటర్ల అమ్మకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జోరుగా సాగుతాయి.చలికాలపు వ్యాపారాలు దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయి. పండుగలు (సంక్రాంతి, క్రిస్మస్), వివాహాల సీజన్ కూడా ఈ కాలంలోనే రావడంతో రిటైల్ రంగం భారీ ఆదాయాన్ని గడిస్తుంది. మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. వింటర్ వేర్ మార్కెట్ ఏటా 6.10% వృద్ధి రేటుతో పెరుగుతోంది.తాత్కాలిక విక్రయదారులు, ఉన్ని దుస్తుల తయారీదారులు, పర్యాటక రంగంలో గైడ్లకు ఈ మూడు-నాలుగు నెలలు ఉపాధి లభిస్తుంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు కురిసే ప్రాంతాలతో పాటు ఆహ్లాదకరంగా ఉండే రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. దీనివల్ల హోటల్, రవాణా రంగాలు లాభపడతాయి. అయితే, ఈ వ్యాపారాలు కేవలం కొన్ని నెలలకే పరిమితం కావడం వల్ల మిగిలిపోయిన సరుకు (Inventory) వ్యాపారులకు భారంగా మారుతుంది. దీన్ని అధిగమించడానికి సీజన్ ముగింపులో భారీ డిస్కౌంట్లు ఇస్తుంటారు.ఇదీ చదవండి: దీర్ఘకాల సంపద రహస్యం ఏమిటంటే.. -
క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం అనేది సామాన్యుడికి ఎప్పుడూ ఒక మిస్టరీగానే ఉంటుంది. ప్రస్తుత (2025) అధికారిక గణాంకాలు, గత దశాబ్ద కాలపు విశ్లేషణను పరిశీలిస్తే దీని వెనుక ఉన్న ఆర్థిక, రాజకీయ కారణాలు స్పష్టమవుతాయి.ప్రస్తుతం (డిసెంబర్ 2025 నాటికి) అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర సుమారు 60 - 70 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. అయినప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.103-రూ.110 మధ్య, డీజిల్ రూ.90 నుంచి రూ.98 మధ్య ఉంది.ధరలు తగ్గకపోవడానికి కారణాలుమన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు 50% నుంచి 55% వరకు పన్నులే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ను విధిస్తున్నాయి. చమురు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదా ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి పన్నులను పెంచుతోంది తప్ప, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం లేదు.రూపాయి విలువ పతనంపదేళ్ల కిందట డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సుమారు రూ.45-50 ఉంటే ప్రస్తుతం అది రూ.90కి చేరుకుంది. ముడి చమురును డాలర్లలోనే కొనుగోలు కాబట్టి, అంతర్జాతీయంగా ధరలు తగ్గినా బలహీనపడిన రూపాయి వల్ల మనం చెల్లించే మొత్తం తగ్గడం లేదు.చమురు కంపెనీల నష్టాల భర్తీగతంలో చమురు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (IOCL, BPCL, HPCL) ప్రజలపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచుతాయి. అప్పుడు వాటికి కలిగిన నష్టాలను ఇలాంటి సమయాల్లో అంటే క్రూడ్ ధరలు తగ్గిన సమయంలో లాభాల రూపంలో భర్తీ చేసుకుంటున్నాయి.సెస్, సర్ఛార్జ్కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీలో అధిక భాగం సెస్ రూపంలో ఉంటోంది. దీని వల్ల వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది కేంద్ర ఖజానాకు అదనపు ఆదాయంగా మారుతోంది.10-15 ఏళ్ల కిందటి ధరలతో పోలికసుమారు 2010-2014 మధ్య కాలంలో ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, అప్పటి రిటైల్ ధరలు ఇప్పటికంటే తక్కువగా ఉండేవి. 2010లో పెట్రోల్ ధరలను, 2014లో డీజిల్ ధరలను ప్రభుత్వం నియంత్రించింది (Deregulation). అంతకుముందు ప్రభుత్వం రిఫైనరీ కంపెనీలకు భారీగా సబ్సిడీలు ఇచ్చేది. అందుకే అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఎక్కువగా ఉన్నా దేశీయంగా ధరలు తక్కువగా ఉండేవి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన (రోడ్లు, హైవేలు) కోసం అవసరమైన నిధులను చమురుపై పన్నుల ద్వారా సేకరించడం ప్రారంభించింది.అంశం2011-2012 (సుమారు)2024-2025 (ప్రస్తుతం)ముడి చమురు ధర (బ్యారెల్)డాలర్లు 105 - 115డాలర్లు 65 - 75డాలర్తో రూపాయి విలువరూ.45 - రూ.50రూ.88 - రూ.89పెట్రోల్ ధర (లీటర్)రూ.63 - రూ.68రూ.103 - రూ.107డీజిల్ ధర (లీటర్)రూ.40 - రూ.45రూ.89 - రూ.94కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ (పెట్రోల్)సుమారు రూ.9.48సుమారు రూ.19 - రూ.21 క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా సామాన్యుడికి ఉపశమనం లభించకపోవడానికి ప్రధాన అడ్డంకి ప్రభుత్వాల పన్ను విధానం, రూపాయి బలహీనపడటం. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ (GST) పరిధిలోకి తీసుకువస్తే ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, ఆదాయాన్ని కోల్పోవడానికి ఇటు కేంద్రం, అటు రాష్ట్రాలు సిద్ధంగా లేకపోవడమే ప్రస్తుత పరిస్థితికి మూలకారణం.ఇదీ చదవండి: పొగమంచు గుప్పిట్లో విమానయానం -
డబ్ల్యూటీఓలో భారత్పై చైనా ఫిర్యాదు
అంతర్జాతీయ వాణిజ్య వేదికపై భారత్, చైనాల మధ్య విభేదాలు మరోసారి ముదిరాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఉత్పత్తులు, సోలార్ రంగంలో భారత్ అందిస్తున్న సబ్సిడీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది భారత్కు వ్యతిరేకంగా చైనా డబ్ల్యూటీఓను ఆశ్రయించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.చైనా ప్రధాన ఆరోపణలుబీజింగ్లోని వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, భారత్ అనుసరిస్తున్న విధానాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆరోపించింది. భారత ప్రభుత్వ చర్యలు నేషనల్ ట్రీట్మెంట్ సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇది డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం నిషేధించిన దిగుమతి ప్రత్యామ్నాయ రాయితీలను అనుసరిస్తుందని పేర్కొంది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీలు ఇస్తూ చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తోందని తెలిపింది. తద్వారా భారతీయ కంపెనీలకు అన్యాయమైన పోటీ ప్రయోజనం కలుగుతోందని వాదించింది. డబ్ల్యూటీఓ కట్టుబాట్లను గౌరవించి ఈ రాయితీలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదా సర్దుబాటు చేయాలని చైనా భారత్ను కోరింది.భారత్ వాదనచైనా ఫిర్యాదుపై భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ పరిణామాలపై అవగాహన ఉన్న ఉన్నతాధికార వర్గాల సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ వాణిజ్యంలో దేశాలు పరస్పరం సబ్సిడీలు, సుంకాలను ప్రశ్నించుకోవడం సాధారణమేనని అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, స్వయం సమృద్ధి సాధించడానికి కొన్ని రంగాలు, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధనం (సోలార్), ఐటీ హార్డ్వేర్ రంగాలకు ప్రోత్సాహకాలు అవసరమని భారత్ చెబుతోంది. భారత్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్-పీఎల్ఐ) తయారీ రంగాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అవి నిబంధనలకు లోబడే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.వరుస ఫిర్యాదులతో పెరుగుతున్న ఉత్కంఠగత అక్టోబర్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), బ్యాటరీ రంగాల్లో భారత్ ఇస్తున్న సబ్సిడీలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది. గ్రీన్ ఎనర్జీ, హైటెక్ తయారీ రంగాల్లో ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగానే చైనా ఈ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం, రెండు దేశాలు సంప్రదింపుల ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ చర్చలు విఫలమైతే డబ్ల్యూటీఓ వివాద పరిష్కార కమిటీ ఈ అంశంపై విచారణ జరుపుతుంది.ఇదీ చదవండి: ‘ఫ్లెక్స్’ క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు.. ప్రత్యేకతలివే.. -
చిన్న సంస్థలకు ఏఐ దన్ను
కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్ఎంఈ) గణనీయంగా ప్రయోజనం పొందేందుకు ఆస్కారం ఉంది. దీనితో వాటికి 500 బిలియన్ డాలర్లకు పైగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీఎక్స్), భారతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్లో 6.4 కోట్ల ఎంఎస్ఎంఈల ముంగిట అపార అవకాశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.నివేదికలో మరిన్ని అంశాలు..కృత్రిమ మేథ వినియోగానికి సంబంధించి టాప్ దేశాల జాబితాలో భారత్ కూడా ఉంటున్నప్పటికీ, గ్లోబల్ ఏఐ పేటెంట్లలో వాటా మాత్రం 1 శాతం కన్నా తక్కువే ఉంటోంది. ఈ నేపథ్యంలో చిన్న సవాళ్ల పరిష్కారం కోసం ఏఐ ఆధారిత వ్యాపారాలను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ప్రాంతీయ వ్యవస్థలవ్యాప్తంగా ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ ఉత్పాదకతపరమైన ప్రయోజనాలు పొందడం, నాణ్యమైన ఉద్యోగాలు కల్పించడంతో పాటు దీర్ఘకాలికంగా సామాజిక–ఆర్థిక పటిష్టతను సాధించవచ్చు. ఏఐపై ఆసక్తి, పెట్టుబడులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. దాదాపు 44 శాతం ఎగ్జిక్యూటివ్లు ఇప్పటికీ తమ టెక్నాలజీ బడ్జెట్లో ఏఐకి కేటాయిస్తున్నది 10% లోపే ఉంటోంది.ప్రధానంగా ఏఐ ఆధారిత వ్యాపారాలను నిర్మించడం, మరిన్ని ఆవిష్కరణలు చేయడం, వాటిని అందరికీ అందుబాటులోకి తేవడంలాంటి చర్యలతో కృత్రిమ మేథ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవచ్చు.2026లో నిర్వహణ విధానాల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిర్దిష్ట విధుల నిర్వహణకు, ముందుగా ఏఐని వినియోగించుకోవడం పెరుగుతుంది.ఇదీ చదవండి: రూ.312 కోట్ల వేతన బకాయిలు విడుదల చేసిన ఈడీ -
కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ
ఒకవైపు ఆకాశాన్ని తాకే ఆడంబరపు అద్దాల భవనాలు.. మరోవైపు ఆ భవనాల నీడలోనే మగ్గిపోతున్న రేకుల షెడ్లు. ఒకరికి వేల కోట్ల సంపద ఎలా ఖర్చు చేయాలో తెలియని సందిగ్ధం.. మరొకరికి పూట గడవడానికి కావాల్సిన సరుకులు లేక విచారం. అంకెల్లో చూస్తే అభివృద్ధిలో ప్రపంచంలోనే దేశం పరుగులు పెడుతోంది కానీ, ఆ పరుగులో సామాన్యుడు మాత్రం వెనకబడిపోతున్నాడు. వరల్డ్ ఇనీక్వాలిటీ రిపోర్ట్ బయటపెట్టిన తాజా వాస్తవాలు భారత్లో పెరుగుతున్న ఈ అగాధాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇదే ఆర్థిక అసమానతలు కొనసాగితే సామాజిక అశాంతి పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత ఆర్థిక వ్యవస్థ ఒక భారీ వృక్షంలా ఎదుగుతోంది. కానీ దాని ఫలాలు మాత్రం కొద్దిమందికే అందుతున్నాయి. దేశంలోని 1 శాతం మంది చేతుల్లోనే 40 శాతం సంపద పోగుపడటం అనేది కేవలం ఆర్థిక లెక్క మాత్రమే కాదు, అది కోట్ల మంది భారతీయుల నిస్సహాయతకు సాక్ష్యం. అభివృద్ధి అంటే కేవలం జీడీపీ పెరగడమేనా? లేక ఆ పెరిగిన సంపద పేదవాడి ఆకలిని తీర్చడమా? ఈ తరుణంలో పెరుగుతున్న అసమానతలపై విశ్లేషణ చూద్దాం.భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. జీడీపీ పరంగా మనం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. అయితే, ఈ గణాంకాల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం.. పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాలు స్తంభించిపోవడం ఆందోళన కలిగిస్తోంది.గణాంకాలు ఏం చెబుతున్నాయి?వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థలో అంతరాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని కేవలం 1 శాతం అత్యంత ధనవంతుల వద్దే 40 శాతం జాతీయ సంపద ఉంది. సంపదపరంగా టాప్లో ఉన్న 10 శాతం మంది జాతీయ ఆదాయంలో 58 శాతాన్ని పొందుతుండగా, దిగువన ఉన్న 50 శాతం మందికి కేవలం 15 శాతం ఆదాయం మాత్రమే దక్కుతోంది. ప్రస్తుత ఆదాయ అసమానతలు బ్రిటిష్ పాలన కాలం నాటి కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.ఆర్థిక అసమానతల వల్ల తలెత్తే పరిణామాలుఆదాయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నప్పుడు సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఇది నేరాలు పెరగడానికి, వర్గ పోరాటాలకు, పౌర అశాంతికి దారితీస్తుంది. మెజారిటీ ప్రజల వద్ద ఆదాయం లేకపోతే వారు నాణ్యమైన విద్య, వైద్యానికి దూరమవుతారు. ఇది దేశ భవిష్యత్తు శ్రామిక శక్తి నాణ్యతను తగ్గిస్తుంది. ఆర్థిక వ్యవస్థ నడవాలంటే సామాన్యుల దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి. కేవలం కొద్దిమంది ధనవంతుల ఖర్చుతో దేశ ఆర్థిక చక్రం పూర్తిస్థాయిలో తిరగలేదు. పేదరికం వల్ల మార్కెట్లో వస్తువులకు డిమాండ్ తగ్గి, ఉత్పత్తి రంగం దెబ్బతింటుంది. సంపద కేంద్రీకరణ వల్ల రాజకీయ అధికారం కూడా కొద్దిమంది ధనవంతుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇది సామాన్యుల గొంతుకను నొక్కివేస్తుంది.నియంత్రించేందుకు మార్గాలుఅత్యంత ధనవంతులపై సంపద పన్ను(Wealth Tax) లేదా వారసత్వ పన్ను (Inheritance Tax) వంటివి విధించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమ పథకాలకు మళ్లించాలి.ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలను బలోపేతం చేయడం వల్ల పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుంది. ఇది వారిని పేదరికం నుంచి బయటపడేలా చేస్తుంది.కేవలం కార్పొరేట్ కంపెనీలకే కాకుండా భారీగా ఉపాధి కల్పించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలి.అసంఘటిత రంగంలోని కార్మికులకు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాలు అందేలా కఠినమైన చట్టాలు అమలు చేయాలి.ఇప్పటికీ దేశంలో సగం జనాభా ఆధారపడుతున్న వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ద్వారా గ్రామీణ ఆదాయాలను పెంచవచ్చు.చివరగా..ఆర్థిక వృద్ధి అనేది కేవలం అంకెల్లో కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా ఫలాలను అందించినప్పుడే అది సమ్మిళిత వృద్ధి సాధ్యం అవుతుంది. భారతదేశం వికసిత్ భారత్గా మారాలంటే సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద సమంగా పంపిణీ అయ్యేలా చూడటం అత్యవసరం. లేనిపక్షంలో ఈ ఆర్థిక అసమానతలు దేశ సుస్థిరతకు ముప్పుగా మారతాయని గమనించాలి.ఇదీ చదవండి: ఏఐ నియంత్రణపై భారత్ అడుగులు ఎటువైపు? -
నిధుల నిర్వహణలో పారదర్శకత
కేంద్ర ప్రభుత్వం ద్రవ్య నిర్వహణలో పారదర్శకతకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, అమలు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనితో రుణభారం గణనీయంగా తగ్గిందని ఆమె తెలిపారు. రాష్ట్రాలు కూడా రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఇదే తరహా విధానాన్ని పాటించాలని సూచించారు. తద్వారా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న లక్ష్య సాకారంలో తమ వంతు పాత్ర పోషించాలని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.‘ద్రవ్య నిర్వహణ తీరుతెన్నులు అందరికీ ప్రస్ఫుటంగా తెలిసేలా, అత్యుత్తమ జవాబుదారీతనపు ప్రమాణాలను పాటించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తయారీలో పారదర్శకతకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలను విధించుకుంది. ఫలితంగా కోవిడ్ అనంతరం 60 శాతానికి పైగా ఎగిసిన రుణ, జీడీపీ నిష్పత్తిని తగ్గించగలిగింది. ఇప్పుడిది మరింతగా తగ్గుతోంది’ అని ఆమె తెలిపారు.కోవిడ్ అనంతరం రుణ,జీడీపీ నిష్పత్తి 61.4 శాతానికి ఎగిసింది. అయితే, ప్రభుత్వ విధానాలతో 2023–24 నాటికి 57.1 శాతానికి దిగి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 56.1 శాతానికి తగ్గొచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రుణభారాన్ని తగ్గించుకునే దిశగా ద్రవ్య నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు మంత్రి సూచించారు.ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు! -
రూపాయి నిదానంగా కోలుకుంటుంది
ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో (2025–26) జీడీపీ 7.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. ‘బలమైన స్థూల, ఆర్థిక పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ 2026–27లోకి అడుగుపెడుతోంది. వెలుపలి అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2026–27లోనూ రికార్డు స్థాయిలో 7 శాతం వృద్ధిని సాధించొచ్చు’ అని కేర్ఎడ్జ్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా పేర్కొన్నారు.ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉండడం, వడ్డీ రేట్లు దిగిరావడం, పన్నుల భారం తగ్గడం వృద్ధికి మద్దతునిస్తాయన్నారు. యూఎస్–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే వృద్ధికి అది మరింత ప్రేరణనిస్తుందన్నారు. డాలర్తో రూపాయి విలువ 91 స్థాయికి పడిపోగా.. 2026–27 నాటికి 89–90 స్థాయికి పుంజుకుంటుందని కేర్ ఎడ్జ్ అంచనా వేసింది. మూలధన నిధుల వ్యయ చక్రం కోలుకుంటుందన్న దానికి ఆరంభ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ.. క్యాపిటల్ గూడ్స్ కంపెనీల బలమైన ఆర్డర్లను నిదర్శనాలుగా పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) బలంగా ఉండడాన్ని ప్రస్తావించింది. కొత్త కార్మిక చట్టం దేశ, విదేశీ ఇన్వెస్టర్లకు మరింత నమ్మకాన్నిస్తుందని అభిప్రాయపడింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వృద్ధి రేటు బలంగా నమోదైనప్పటికీ, ద్వితీయ ఆరు నెలల్లో 7 శాతానికి పరిమితం కావొచ్చని.. పూర్తి ఆర్థిక సంతవ్సరానికి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అమెరికా టారిఫ్లు భారత రత్నాభరణాలు, టెక్స్టైల్స్ ఎగుమతులపై ప్రభావం చూపించాయని.. అదే సమయంలో హాంగ్కాంగ్, యూఏఈకి వీటి ఎగుమతులు పెరిగినట్టు తెలిపింది. ఎగుమతుల్లో మారిన ఈ వైవిధ్యాన్ని ఇక ముందు ఎలా ఉంటుందో పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు జీడీపీలో ఒక శాతానికి పరిమితం అవుతుందని, ద్రవ్యలోటును 2026– 27లో 4.4 శాతానికి, తదుపరి ఆర్థిక సంత్సరంలో మరో 0.2% తక్కువకు ప్రభు త్వం కట్టడి చేస్తుందని అంచనా వేసింది. భారత్ వృద్ధి 7 శాతం: గీతా గోపీనాథ్భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ మాజీ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అభిపఆరయపడ్డారు. ఐఎంఎఫ్ అంచనా 6.6 శాతం అన్నది భారత జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) వివరాలు వెల్లడికి ముందు వేసిన అంచనాగా పేర్కొన్నారు. భారత్ వచ్చే 20 ఏళ్ల పాటు 8 శాతం వృద్ధిని కొనసాగిస్తే, వికసిత్ భారత్ లక్ష్యాన్ని 2047 కంటే ముందే సాధించొచ్చన్నారు. ఇందుకు వీలుగా సంస్కరణలను నిలకడగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. అమెరికా–భారత్ వాణిజ్య సంక్షోభానికి ముందు అంచనా వేసిన దానికంటే మెరుగ్గానే భారత్ పనితీరు చూపిస్తున్నట్టు పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్లో చాట్జీపీటీ, పర్ప్లెక్సిటీ జోరు -
ఐడీఆర్బీటీలో ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గురువారం ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడీఆర్బీటీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాంక్డాట్ఇన్ డొమైన్కి బ్యాంకుల మై గ్రేషన్, బ్యాంకింగ్కి పొంచి ఉన్న రిస్కులను గుర్తించేందుకు ఉద్దేశించిన సచేత్ ప్లాట్ఫాంలో ఏఐ వినియోగం తదితర అంశాల గురించి ఐడీఆర్బీటీ అధికారులు ఆయనకు వివరించారు. బ్యాంకింగ్ రంగం కోసం ఐటీ మౌలిక సదుపాయాలను రూపొందించడంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తుండటాన్ని మల్హోత్రా ప్రశంసించారు. టెక్నాలజీ, బ్యాంకింగ్కి అనుగుణంగా పరిశ్రమ అవసరాలకు తగ్గ సొల్యూషన్స్ని రూపొందించడంపై దృష్టి పెట్టాల న్నారు. డిజిటల్ బ్యాంకింగ్పై ప్రజల్లో నమ్మకం కలిగించేలా వ్యూహాన్ని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. -
ఆర్బీఐ జోక్యంతో కోలుకున్న రూపాయి!
న్యూఢిల్లీ: డాలర్తో రూపాయి కాస్త బలపడింది. ఫారెక్స్ మార్కెట్లో గురువారం డాలర్తో 12 పైసలు పుంజుకుని 90.26కు కోలుకుంది. ఆర్బీఐ జోక్యంతో కుదుటపడింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర దిగిరావడమూ కలిసొచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో 90.35 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 34 పైసలు పుంజుకుని 90.04 వరకు కోలుకుంది. చివరికి 12 పైసల లాభానికి పరిమితమైంది. రూపాయిపై ఆందోళన లేదు రూపాయి గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ తెలిపారు. చైనా, జపాన్ సైతం అధిక వృద్ధి దశలో కరెన్సీ బలహీనతను ఎదుర్కొన్నట్టు చెప్పారు. రూపాయి బలహీనతను, ఆర్థిక ఆందోళనతో ముడిపెట్టరాదన్నారు. 1990ల నుంచీ రూపాయి తన వాస్తవ విలువకు అనుగుణంగా చలించేందుకే అనుమతించినట్టు.. అధిక ఆటుపోట్లను తగ్గించే క్రమంలోనే ఆర్బీఐ జోక్యం చేసుకుంటుందని చెప్పారు. -
మురిపిస్తున్న ముగింపు!
డిసెంబర్ చివరి వారం వచ్చిందంటే చాలు.. ప్రపంచమంతా కొత్త ఉత్సాహం నిండుకుంటుంది. క్యాలెండర్ మారుతున్న వేళ, పాత జ్ఞాపకాలకు వీడ్కోలు చెబుతూ కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఈ సమయం కేవలం వేడుకలకే పరిమితం కాదు; ఇది ఒక భారీ ఆర్థిక చక్రానికి ఎనర్జీగా ఉంటుంది. నగరాల్లోని పబ్ కల్చర్ నుంచి గ్రామాల్లోని సెలబ్రేషన్స్ వరకు.. ఇయర్ ఎండింగ్ అనేది కోట్లాది రూపాయల వాణిజ్యానికి వేదికగా మారుతోంది.డిసెంబర్ 31 రాత్రి.. గడియారం ముల్లు 12 గంటలు దాటకముందే దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థల గల్లా పెట్టెలు నిండిపోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారత్లో పండుగ సీజన్, ఇయర్ ఎండింగ్ ఖర్చులు సుమారు 32% పెరిగాయని మార్కెట్ విశ్లేషణలు చెబుతున్నాయి. విశేషమేమిటంటే కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈవెంట్ కల్చర్ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు, పల్లెటూళ్లకు కూడా పాకింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. డిసెంబర్ ముగింపు అంటే ఒక వేడుక కాదు, అదొక భారీ వాణిజ్య జాతర!నగరాల్లో ఈవెంట్లు - కార్పొరేట్ వాణిజ్యంనగరాల్లో ఇయర్ ఎండింగ్ అంటేనే విలాసవంతమైన పార్టీలు, మ్యూజిక్ కాన్సర్ట్లు, స్టే-కేషన్లు(స్టేయింగ్+వెకేషన్స్ Staycations). ఇక్కడ వాణిజ్యం ప్రధానంగా వివిధ రంగాల్లో కేంద్రీకృతమై ఉంటుంది.హోటళ్లు, పబ్లు, రిసార్ట్లు ఒక నెల ముందే బుకింగ్లు ప్రారంభిస్తాయి. ఒక్కో ఎంట్రీ టికెట్ ధర సుమారు రూ.2,000 నుంచి రూ.20,000 అంత కంటే ఎక్కువే పలుకుతుంది. డీజేలు, డ్యాన్సర్లు, లైటింగ్ డెకరేటర్లకు ఈ సమయంలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నగరవాసులు ఇయర్ ఎండింగ్ కోసం గోవా, పాండిచ్చేరి, కేరళ.. వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం వల్ల ట్రావెల్ ఏజెన్సీలు, విమానయాన సంస్థలు లాభాలను ఆర్జిస్తాయి. బట్టలు, గాడ్జెట్లు, కానుకల అమ్మకాలు పెరగనున్నాయి. ఇయర్ ఎండింగ్ సేల్ పేరుతో షాపింగ్ మాల్స్ ఇచ్చే ఆఫర్లు మధ్యతరగతి వినియోగదారులను ఆకర్షిస్తాయి.ఇదీ చదవండి: పార్లమెంట్లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం! -
పార్లమెంట్లో ‘శాంతి’ బిల్లుకు ఆమోదం!
భారత ఇంధన రంగంలో చారిత్రాత్మక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘సస్టైనబుల్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ (SHANTI) బిల్లును పార్లమెంట్లో ఆమోదించింది. దశాబ్దాలుగా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉన్న అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.అడ్డంకుల తొలగింపుసైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టం పాత కాలపు అణు ఇంధన చట్టం (1962), సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ చట్టం (2010)ను రద్దు చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితమైన అణు విద్యుత్ ఉత్పత్తి, దాని అనుబంధ కార్యకలాపాలు ఇకపై ప్రైవేట్ సంస్థలకు కూడా అందుబాటులోకి రానున్నాయి. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడం, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.నిరసన సెగమరోవైపు, ఈ బిల్లుపై కార్మిక సంఘాలు, ఇంజినీర్ల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రైవేటీకరణ వల్ల అణు భద్రత, జవాబుదారీతనం ప్రశ్నార్థకంగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (AIPEF) ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (SKM) సమన్వయంతో డిసెంబర్ 23న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.అభ్యంతరం ఎందుకంటే..రియాక్టర్ సరఫరాదారులను (Supplier Liability) సైతం రద్దు చేయాలని బిల్లులో ప్రతిపాదించడం వివాదాస్పదమైంది. పరికరాల లోపాల వల్ల ప్రమాదం జరిగితే తయారీదారులను కాపాడి ఆ భారాన్ని ప్రభుత్వం, ప్రజలపై వేసేలా ఈ నిబంధన ఉందని ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే విమర్శించారు.ప్రధాన డిమాండ్లుప్రభుత్వం వెంటనే ‘శాంతి’ బిల్లును ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ముందుకు వెళ్లాలనుకుంటే కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నారు.సప్లయర్ లయబిలిటీ నిబంధనలను పునరుద్ధరించాలి.స్వతంత్ర అణు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి.పర్యావరణ, కార్మిక రక్షణలను పటిష్టం చేయాలి.విదేశీ భాగస్వామ్యంపై పార్లమెంటరీ పర్యవేక్షణ ఉండాలి.భారతదేశం తన ఇంధన లక్ష్యాలను చేరుకోవడానికి ఈ చట్టం ఎంతో అవసరమని ప్రభుత్వం భావిస్తుండగా.. క్షేత్రస్థాయిలో ఉన్న కార్మికులు, నిపుణులు మాత్రం తగిన చర్చ లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ 23న జరగబోయే నిరసనలు ప్రభుత్వంపై ఎంతవరకు ఒత్తిడి తెస్తాయో వేచి చూడాలి.ఇదీ చదవండి: టోకనైజేషన్ బిల్లు కోసం పార్లమెంట్లో డిమాండ్ -
టోకనైజేషన్ బిల్లు కోసం పార్లమెంట్లో డిమాండ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంట్లో టోకనైజేషన్ బిల్లు గురించి చేసిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యులకు కూడా భారీ పెట్టుబడుల ఫలాలను అందించేలా ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అసలు టోకనైజేషన్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.టోకనైజేషన్ అంటే ఏమిటి?సాధారణ భాషలో చెప్పాలంటే.. ఒక భారీ ఆస్తిని (ఉదాహరణకు ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్) చిన్న చిన్న డిజిటల్ భాగాలుగా విభజించడాన్నే టోకనైజేషన్ అంటారు. ఈ ఒక్కో భాగాన్ని టోకెన్ అని పిలుస్తారు.ఉదాహరణకు ఒక హైవే ప్రాజెక్ట్ విలువ వందల కోట్లు అనుకుందాం. అందులో సామాన్యులు పెట్టుబడి పెట్టలేరు. కానీ, దాన్ని కోటి టోకెన్లుగా విభజిస్తే.. ఒక్కో టోకెన్ ధర కేవలం వంద రూపాయల్లోనే ఉండవచ్చు. ఇలా సామాన్యులు సైతం ఆ ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చు.ఈ బిల్లును ఎందుకు ప్రతిపాదించారు?ప్రస్తుతం రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కేవలం బిలియనీర్లు లేదా పెద్ద సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి. మధ్యతరగతి ప్రజలు కేవలం బ్యాంక్ ఎఫ్డీలు లేదా మ్యూచువల్ ఫండ్స్కే పరిమితం అవుతున్నారు. ఈ బిల్లు వస్తే సామాన్యులు కూడా భారీ ఆస్తుల్లో వాటాలను కొనుగోలు చేసి అధిక లాభాలను పొందవచ్చని ఎంపీ చెప్పారు.విదేశీ మూలధనంసింగపూర్, యూఏఈ, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి చట్టాలు ఉన్నాయి. భారత్లో కూడా స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు భారత్కు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.మధ్యతరగతికి మేలుమధ్యతరగతి ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కేవలం తక్కువ వడ్డీ వచ్చే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుతున్నారు. టోకనైజేషన్ ద్వారా వారికి రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో చిన్న మొత్తాలతోనే పెట్టుబడి పెట్టే అవకాశం దక్కుతుంది.ప్రయోజనాలుసాధారణంగా ఒక ఇల్లు లేదా భూమి అమ్మాలంటే చాలా సమయం పడుతుంది. కానీ డిజిటల్ టోకెన్లను షేర్ మార్కెట్ తరహాలోనే సులభంగా, త్వరగా విక్రయించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రిజిస్ట్రేషన్ గొడవలు లేకుండా నేరుగా బ్లాక్చెయిన్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రతి లావాదేవీ పక్కాగా రికార్డ్ అవుతుంది. మోసాలకు తావుండదు. ఒకేసారి లక్షల రూపాయలు పెట్టక్కర్లేదు. కేవలం రూ.500 లేదా రూ.1000తో కూడా ఆస్తిలో భాగస్వామ్యం పొందవచ్చు. లాభాలను పంచుకోవచ్చు.ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే. ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ముసాయిదాను విడుదల చేయలేదు. అయితే ఇప్పటికే భారత రిజర్వ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసం ‘కార్డ్ టోకనైజేషన్’ విధానాన్ని అమలు చేస్తోంది. దానికంటే విస్తృతమైన అసెట్ టోకనైజేషన్(ఆస్తుల టోకనైజేషన్) కోసం ప్రత్యేక చట్టం కావాలని ఎంపీ కోరుతున్నారు.ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు -
మరింతగా పడిపోతున్న రూపాయి?? కారణాలు తెలిస్తే షాక్..!
భారత రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే రోజురోజుకూ తగ్గిపోతోంది. మరోవైపు జీడీపీపరంగా భారత్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఐదో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. మరి జీడీపీలో పురోగతి సాధిస్తున్నా రూపాయి పతనం ఎందుకు.. భారత అంతర్జాతీయ విధానంలో ఉన్న లోపాలేంటి.. విద్యాపరంగా పరిమితులేంటి.. తదితర అంశాలను వివరంగా విశ్లేషించారు ఫారిన్ ట్రేడ్ నిపుణులు, హైదరాబాద్కు చెందిన డా.మురళీదర్శన్. సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.అంతర్జాతీయ సంబంధాలు, విదేశాంగ విధానంఅంతర్జాతీయ సంబంధాలు, దౌత్యం చాలా విస్తృతమైన అంశం. ప్రతి దేశం మనతో స్నేహంగా ఉంటుందని ఆశించకూడదు. అధిక టారిఫ్లు భారత ఎగుమతులను బలహీనపరుస్తున్నాయి. అనేక విదేశీ కంపెనీలు భారత్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. దీని వల్ల రూపాయి విలువ పడిపోవడం, ఎగుమతులు తగ్గడం జరుగుతోంది.రూపాయి విలువ.. జీడీపీజీడీపీకి (స్థూల దేశీయోత్పత్తి) రూపాయి విలువకు ప్రత్యక్ష సంబంధం లేదు. జీడీపీ అనేది దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల విలువ. ఎగుమతులు, దిగుమతుల వ్యత్యాసం, విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు వంటివి రూపాయి విలువ ప్రభావితమయ్యే కీలక అంశాలు. దిగుమతులపై ఎక్కువ ఆధారపడితే రూపాయి బలహీనమవుతుంది.ఎగుమతుల లోపాలుభారత ఎగుమతులు ప్రధానంగా సాఫ్ట్వేర్, ఔషధ రంగంపై ఆధారపడి ఉన్నాయి. కొన్ని దేశాలపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి కొత్త మార్కెట్లకు విస్తరించాలి. ప్రతి దేశానికి అనుగుణంగా ఎగుమతి విధానాలు మార్చుకోవాలి.పరిమిత విద్యా వ్యవస్థభారతదేశంలో నాణ్యమైన పరిశోధనా సంస్థలు చాలా పరిమితంగా ఉన్నాయి. దీంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు తిరిగి రావడం లేదు. దీనివల్ల దేశానికి మేథో నష్టం జరుగుతోంది. ఒకప్పుడు నలంద, తక్షశిల వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మనవే. ఇప్పుడు మళ్లీ అలాంటి విద్యా ప్రమాణాలు తీసుకురావాలి.పాలనలో మేధావుల పాత్రరాజకీయాల్లో, విధాన నిర్ణయాల్లో నిపుణుల అవసరం ఉంది. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే ఏకాధిపత్యం రాజ్యమేలుతుంది. ప్రస్తుతం 2% మంది వద్ద 98% సంపద ఉంది. సహజ వనరులను ప్రజల సంక్షేమానికి వినియోగించాలి.ఉపాధి అవకాశాలు, సహజ వనరులుభారతదేశానికి విశాలమైన తీరప్రాంతం ఉంది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం తీరాలు ఉన్నాయి. నౌకల మరమ్మత్తులు, నిర్వహణ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించవచ్చు. ఉపగ్రహ మ్యాపింగ్ సేవలను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయవచ్చు.విలువ జోడింపు అవసరంఏ ఉత్పత్తికైనా విలువ జోడింపు అవసరం. ఉదాహరణకు టమాటాలు పండించే రైతులు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతుంటారు. వారు వాటిని సాస్ లేదా కేచప్లుగా మార్చి ఎగుమతి చేస్తే మంచి లాభం వస్తుంది. అలాగే కాఫీ, రఫ్ డైమండ్స్ కూడా. ఉత్పత్తికి విలువ జోడిస్తే ఉపాధి లభిస్తుంది. విదేశీ మారకం ద్రవ్యం పెరుగుతుంది.స్టార్టప్స్, పరిశోధనపరిశోధనా సంస్థలు పరిశ్రమలకు సహకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ వినియోగించాలి. విదేశీ టెక్నాలజీని దేశీయ అవసరాలకు అనుసంధానం చేయాలి. స్టార్టప్స్కు సరైన విధాన మద్దతు ప్రభుత్వాల నుంచి అందించాల్సిన అవసరం ఉంది.యువతకు సందేశంఅంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కోర్సులు ఎంచుకోండి. విద్య, పరిశోధన, వ్యాపారంపై దృష్టి పెట్టండి. మంచి నాయకులను ఎన్నుకోండి. యువత శక్తితో వ్యవస్థను మార్చవచ్చు. దేశ అభివృద్ధికి మీ జ్ఞానాన్ని వినియోగించండి. భారతదేశానికి గొప్ప చరిత్ర ఉంది. అపారమైన మానవ వనరులు ఉన్నాయి. కావాల్సిందల్లా దూరదృష్టి ఉన్న నాయకత్వం, నాణ్యమైన విద్య, కొత్త మార్కెట్లు, విలువ జోడింపు, సమాన అభివృద్ధి.డా.మురళీదర్శన్ మనోగతం మరింత వివరంగా చూడండి.. ఈ కింది వీడియోలో.. -
ఆయుధాలుగా మారుతున్న వాణిజ్య సుంకాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వాణిజ్యం టారిఫ్లు, ఇత ర రూపాల్లో ఆయుధాలు గా మారుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్ కేవలం టారిఫ్లను ఎలా ఎదుర్కోవాలన్న దానికే పరిమితం కాకుండా, ఈ విషయమై జాగ్రత్తగా సంప్రదింపులు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం మనకు అనుకూలమని ఒక జాతీయ దినపత్రిక నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ‘‘స్వీయ ప్రయోజనాల ధోరణితో ఉందంటూ భారత్కు పాఠాలు బోధించొచ్చు. సుంకాల రాజుగా అభివరి్ణ ంచొచ్చు. కానీ, టారిఫ్ ఆయుధంగా మారిపోయింది. వీటిని ఆయుధాలుగా మార్చు కోకూడదన్నది భారత్ ఉద్దేశం. పోటీ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఉత్పత్తులు వరుస∙కట్టినప్పుడే దేశీ పరిశ్రమను కాపాడుకునేందుకు భారత్ రక్షణాత్మక చర్యలను అనుసరిస్తుంది’’అని మంత్రి స్పష్టం చేశారు. -
ఖర్చులు కట్...లాభాలకు బూస్ట్
ముంబై: మార్కెట్లో పెట్టుబడులపై వ్యయాల భారం తగ్గి, లాభాలు పెరిగేలా ఇన్వెస్టర్లకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పలు సంస్కరణలకు తెరతీసింది. బోర్డు సమావేశంలో నిబంధనల్లో పారదర్శకతను పెంచేందుకు వ్యయ నిష్పత్తి ఫ్రేమ్వర్క్, బ్రోకరేజీ చార్జీల పరిమితుల్లో మార్పులతో పాటు అనేక చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం వ్యయ నిష్పత్తి పరిమితుల నుంచి ఎస్టీటీ, జీఎస్టీ, సీటీటీ, స్టాంప్ డ్యూటీలాంటి లెవీలను తొలగించినట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఇకపై వ్యయ నిష్పత్తి పరిమితులను బేస్ ఎక్స్పెన్స్ రేషియోగా పరిగణిస్తారని పేర్కొన్నారు. వివిధ స్కీములపై అదనంగా 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వ్యయాలను విధించేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకి ఇస్తున్న వెసులుబాటును తొలగించారు. 2018లో ప్రవేశపెట్టిన 0.05 శాతం ఎగ్జిట్ లోడ్ నిబంధనను సెబీ తొలగించింది. 1963లో ప్రారంభమైన మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ప్రస్తుతం రూ. 80 లక్షల కోట్ల పైగా ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మరిన్ని నిర్ణయాలు... → బ్రోకరేజీ చార్జీలు క్యాష్ మార్కెట్ లావాదేవీలపై 12 బీపీఎస్ నుంచి 6 బీపీఎస్కి, డెరివేటివ్ లావాదేవీలపై 5 బీపీఎస్ నుంచి 2 బీపీఎస్కి తగ్గింపు. → స్కీము పనితీరు ఆధారంగా వ్యయ నిష్పత్తి అమలు. ఏఎంసీలు దీన్ని స్వచ్ఛందంగా అమలు చేయొచ్చు. → ట్రస్టీలు సమావేశం కావాల్సిన ఫ్రీక్వెన్సీ తగ్గింపు. స్కీముల్లో మార్పులను తెలియజేసేలా పత్రికా ప్రకటనలు ఇవ్వాలన్న నిబంధన తొలగింపు. ప్రకటనల స్థానంలో ఆన్లైన్లో వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. → రియల్ ఎస్టే ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్ఫ్రా డెట్ ఫండ్ స్కీముల్లో పునరావృతమయ్యే చాప్టర్ల తొలగింపు. దీనితో నిబంధనల పరిమాణం 162 పేజీల నుంచి 88 పేజీలకు తగ్గింది. పదాల సంఖ్య కూడా 67,000 నుంచి 54 శాతం తగ్గి 31,000 పదాలకు పరిమితమవుతుంది. → డెట్ మార్కెట్పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంపొందించే దిశగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, రిటైల్ ఇన్వెస్టర్స్లాంటి వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు డెట్ ఇష్యూయర్లను అనుమతించే ప్రతిపాదనకు ఆమోదముద్ర. → రిటైల్ ఇన్వెస్టర్ల సౌలభ్యం కోసం కంపెనీలు.. డీఆర్హెచ్ పీ దశలో కీలక వివరాలతో కూడుకున్న సంక్షిప్త ప్రాస్పెక్టస్ను కూడా అందుబాటులో ఉంచాలి. → ఇతరత్రా ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల పరిధిలోని ఆర్థిక సాధనాలకు కూడా రేటింగ్స్ సేవలను అందించేందుకు వెసులుబాటు కలి్పంచేలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నిబంధనల్లో మార్పులు. → సెబీ (స్టాక్ బ్రోకర్స్) రెగ్యులేషన్స్ 1992 స్థానంలో కొత్తగా సెబీ (స్టాక్ బ్రోకర్స్) రెగ్యులేషన్స్ 2025 (ఎస్బీ రెగ్యులేషన్స్) అమల్లోకి వస్తుంది. కొత్త ఫ్రేమ్వర్క్లో పదకొండు చాప్టర్లు ఉంటాయి. పాతబడిన కొన్ని షెడ్యూల్స్ను, పనరావృతమయ్యే నిబంధనలను సెబీ తొలగించింది. కొన్నింటిని సమగ్రపర్చింది. మరింత స్పష్టతను ఇచ్చే విధంగా క్లియరింగ్ మెంబర్, ప్రొప్రైటరీ ట్రేడింగ్ మెంబర్లాంటి కీలక నిర్వచనాలను సవరించింది. సులభతరంగా అర్థం చేసుకునేలా నిబంధనలకు సంబంధించిన పేజీల సంఖ్యను 59 నుంచి 29కి, పదాల సంఖ్యను 18,846 నుంచి 9,073కి తగ్గించినట్లు సెబీ తెలిపింది. -
భారీగా జీతాల పెంపు ఈ రంగాల్లోనే..
భారతీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జీతాల పెరుగుదల నిలకడగా కొనసాగుతోంది. కనీసం వచ్చే ఏడాదైనా వేతనాల పెంపు ఆశించినమేర ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ నిర్వహించిన ‘టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ ప్రకారం, 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలు సగటున 9 శాతం వేతన పెంపును అమలు చేసే అవకాశం ఉంది. దాదాపు 1,500 కంటే ఎక్కువ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.రంగాల వారీగా అంచనాలుఈ పెంపులో కొన్ని రంగాలు ఇతర విభాగాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల(జీసీసీ)లో పని చేసే ఉద్యోగులకు సుమారు 9 శాతం మేర పెంపు ఉంటుందని అంచనా.ఈ సందర్భంగా మెర్సర్ ఇండియా రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ మాలతి కేఎస్ మాట్లాడుతూ..‘భారతదేశంలో మెరిట్ ఆధారిత వేతన పెంపు స్థిరంగా ఉండటం అనేది ఆర్థిక వాతావరణం పట్ల సంస్థల నమ్మకాన్ని సూచిస్తుంది. వ్యయ నియంత్రణ పాటిస్తూనే అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు.ఇన్సెంటివ్లపై ఫోకస్ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కంపెనీలు తమ రివార్డ్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. కేవలం వార్షిక పెంపుపైనే కాకుండా స్వల్పకాలిక ప్రోత్సాహకాలపై కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుతూనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులను నిలుపుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.నియామకాల్లో తగ్గుదల..వేతనాల పెంపు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొత్త నియామకాల విషయంలో కంపెనీలు కొంత అప్రమత్తత పాటిస్తున్నాయి. 2024లో 43 శాతంగా ఉన్న నియామక విస్తరణ ప్రణాళికలు 2026 నాటికి 32 శాతానికి తగ్గే అవకాశం ఉంది. సుమారు 31 శాతం కంపెనీలు నియామకాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఏడాదిలో అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలను వదిలి వెళ్లే రేటు) గణనీయంగా తగ్గింది. 2023లో 13.1 శాతంగా ఉన్న అట్రిషన్ 2025 మొదటి అర్ధభాగం నాటికి 6.4 శాతానికి పడిపోయింది.ఇదీ చదవండి: సామాన్యుడికి ఆర్బీఐ ఈ ఏడాది గిఫ్ట్! -
సామాన్యుడికి ఆర్బీఐ ఈ ఏడాది గిఫ్ట్!
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొన్నేళ్లుగా వడ్డీ రేట్ల భారంతో సతమతమవుతున్న మధ్యతరగతి వర్గాలకు 2025 సంవత్సరంలో ఊరటకల్పించింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్బీఐ తన మానిటరీ పాలసీలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటివరకు ఆర్బీఐ ఏకంగా 125 బేసిస్ పాయింట్ల (1.25%) మేర రెపోరేటును తగ్గించింది.ఫిబ్రవరిలో 6.5%కి చేరిన రేటు వరుస కోతలతో ఇప్పుడు 5.25 శాతం వద్ద స్థిరపడింది. దీనివల్ల హోమ్ లోన్, కార్ లోన్ తీసుకున్న వారి నెలవారీ ఈఎంఐలు గణనీయంగా తగ్గాయి. కొత్తగా అప్పులు తీసుకునే వారికి కూడా ఇది శుభవార్తే. 2025-26 నాటికి 7.3% జీడీపీ వృద్ధిని సాధించడమే లక్ష్యంగా గవర్నర్ సంజయ్ మల్హోత్రా బృందం ఈమేరకు పనిచేస్తోంది.మానిటరీ పాలసీ సమావేశంరెపోరేటులో మార్పు(బేసిస్ పాయింట్లు)ప్రస్తుత రెపోరేటుఫిబ్రవరి 2025256.25%ఏప్రిల్ 2025256.00%జూన్ 2025505.50%డిసెంబర్ 2025255.25% ఆర్బీఐ దీర్ఘకాలిక లక్ష్యాలుఆర్బీఐ కేవలం వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2025 అక్టోబర్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి పడిపోయింది.ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని 2% వద్ద స్థిరీకరించాలని భావిస్తోంది. తక్కువ ధరల వల్ల సామాన్యుడి వస్తు కొనుగోలు శక్తి పెరుగుతుంది.దేశీయ డిమాండ్ను పెంచడం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 7.3%కి పెంచింది. వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ రంగాలు పుంజుకుంటాయని అంచనా.బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను పెంచడానికి ఆర్బీఐ దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్ల కొనుగోలును ప్రకటించింది.సవాళ్లు - వ్యూహాత్మక నిర్ణయాలుఅమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 90 మార్కును తాకినప్పటికీ ఆర్బీఐ రేట్ల తగ్గింపునకే మొగ్గు చూపింది. బలమైన విదేశీ మారక నిల్వలు ఉండటంతో రూపాయి పతనంపై ఆందోళన చెందకుండా దేశీయ వృద్ధికి ప్రాధాన్యత ఇచ్చింది.అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాల వల్ల భారత ఎగుమతులపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ అది భారత ఆర్థిక వ్యవస్థపై స్వల్పంగానే ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. దీన్ని ఎదుర్కోవడానికి దేశీయంగా ఉత్పాదకతను పెంచేందుకు వడ్డీ రేట్లను తగ్గించారు.తక్కువ వడ్డీ రేట్లు, స్థిరమైన ద్రవ్యోల్బణం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఇది భారతదేశాన్ని ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా అడుగులు వేయిస్తోంది.ఇదీ చదవండి: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం.. -
భారత్-అమెరికా ట్రేడ్ డీల్ జాప్యం..
ఒకటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. మరొకటి వేగంగా దూసుకుపోతున్న ఆర్థిక శక్తి. వ్యూహాత్మకంగా చూస్తే ఇద్దరిదీ విడదీయరాని బంధం. కానీ, వ్యాపారం విషయానికి వస్తే మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రపంచమంతా ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ చర్చలు కొలిక్కి వచ్చే సమయానికి ఏదో ఒక అడ్డంకి పలకరిస్తూనే ఉంది.అమెరికా విధిస్తున్న కఠినమైన టారిఫ్ రూల్స్ ఒకవైపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని వాషింగ్టన్ జీర్ణించుకోలేకపోవడం మరోవైపు.. ఈ రెండింటి మధ్య ట్రేడ్ డీల్ దోబూచులాడుతోంది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఉన్న పేచీ ఎక్కడ? అగ్రరాజ్యం ఆంక్షల నడుమ భారత్ తన ప్రయోజనాలను ఎలా కాపాడుకుంటోంది? ఈ ప్రతిష్టంభనకు గల కారణాలపై ప్రత్యేక విశ్లేషణ..టారిఫ్ యుద్ధం.. అమెరికా అభ్యంతరంభారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు కలిగిన మార్కెట్లలో ఒకటి అని అమెరికా వాదిస్తుంది. ముఖ్యంగా హార్లే డేవిడ్సన్ వంటి బైకులు, ఐటీ, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న పన్నులను తగ్గించాలని కోరుతోంది.భారత్ వాదనభారత్ తన దేశీయ పరిశ్రమలను (Make in India) కాపాడుకోవడానికి ఈ పన్నులు అవసరమని చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో భారత్ను ‘టారిఫ్ కింగ్’ అని పిలవడం, ప్రస్తుతం మళ్లీ అధికారం చేపట్టాక అదే ధోరణి కొనసాగుతోంది.రష్యా నుంచి చమురు కొనుగోళ్లుఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి. అయితే భారత్ తన ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి రాయితీపై చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఇది అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులకు నచ్చలేదు. రష్యాకు ఆర్థికంగా మద్దతు ఇస్తున్నారని అమెరికా భావిస్తుండగా భారత్ తన స్ట్రాటజిక్ అటానమీ(వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి) వైఖరిని స్పష్టం చేసింది. ఈ భౌగోళిక రాజకీయ భేదాభిప్రాయాలు వాణిజ్య చర్చలపై ప్రభావం చూపుతున్నాయి.జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (GSP) హోదాగతంలో అమెరికా భారత్కు జీఎస్పీ హోదా ఇచ్చేది. దీని ద్వారా కొన్ని భారతీయ ఉత్పత్తులు సుంకం లేకుండానే అమెరికాలోకి ప్రవేశించేవి. ట్రంప్ మొదటి హయాంలో ఈ హోదాను రద్దు చేశారు. దీన్ని పునరుద్ధరించాలని భారత్ పట్టుబడుతుండగా, అమెరికా మాత్రం భారత మార్కెట్లలో తమ డెయిరీ, మెడికల్ డివైజ్లకు(Stents etc..) మరింత వెసులుబాటు ఇస్తేనే ఆలోచిస్తామని అంటోంది.డేటా గోప్యత, ఈ-కామర్స్ విధానాలుఅమెరికన్ దిగ్గజాలైన అమెజాన్, వాల్మార్ట్ (ఫ్లిప్కార్ట్), గూగుల్ వంటి కంపెనీలు భారత మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. భారత్ తీసుకొస్తున్న డేటా లోకలైజేషన్(భారతీయ వినియోగదారుల సమాచారం ఇక్కడే ఉండాలి), ఈ-కామర్స్ నిబంధనలు అమెరికాకు ఇబ్బందికరంగా మారాయి. తమ కంపెనీలకు భారత్ ‘లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్’(పోటీలో ఉన్న అందరికీ సమాన అవకాశాలు కల్పించడం) కల్పించడం లేదని అమెరికా వాణిజ్య శాఖ తరచుగా ఆరోపిస్తోంది.ఫార్మా రంగంలో..అమెరికన్ ఫార్మా కంపెనీలు తమ మందుల పేటెంట్ హక్కుల విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. తక్కువ ధరకే జనరిక్ మందులను ఉత్పత్తి చేసే భారత విధానం తమ లాభాలను దెబ్బతీస్తోందని వారి వాదన.డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారత్తో ట్రేడ్ డీల్ను వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, ట్రంప్ శైలిని పరిశీలిస్తే దీని వెనుక ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.ప్రతికార సుంకాలుభారత్ అమెరికా వస్తువులపై ఎంత పన్ను విధిస్తుందో, అమెరికా కూడా భారత వస్తువులపై అంతే పన్ను విధించాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. దాంతో 2025 ఆగస్టులో భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై ట్రంప్ ప్రభుత్వం 25% రెసిప్రోకల్ సుంకాన్ని విధించింది. భారత్ తన వైపు నుంచి పన్నులు తగ్గించే వరకు ఈ డీల్పై సంతకం చేయకూడదనేది ఆయన ఉద్దేశం.క్రూడాయిల్.. ఎస్-400 పేచీఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ రష్యా నుంచి ముడి చమురు, రక్షణ పరికరాలను (S-400 వంటివి) కొనుగోలు చేయడం ట్రంప్నకు నచ్చడంలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు భారత్పై అదనంగా మరో 25% పెనాల్టీ సుంకాన్ని విధించారు. అంటే ప్రస్తుతం కొన్ని భారతీయ ఉత్పత్తులపై మొత్తం 50% సుంకం అమలవుతోంది. భారత్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకునేలా ఒత్తిడి తేవడానికి ఈ డీల్ను ఒక ఆయుధంగా వాడుతున్నారు.అమెరికా రైతుల ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ పనిచేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఆయన కోరుతున్నారు. ఇటీవల భారతీయ బియ్యం ఎగుమతులపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తూ అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. భారత రైతుల ప్రయోజనాల దృష్ట్యా మన ప్రభుత్వం దీనికి సుముఖంగా లేదు. దీంతో చర్చలు నిలిచిపోయాయి.వ్యక్తిగత ప్రతిష్ఠ, మధ్యవర్తిత్వంకొన్ని విశ్లేషణల ప్రకారం (ఉదాహరణకు: జెఫరీస్ గ్రూప్ నివేదిక), భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో తాను మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. కానీ భారత్ దాన్ని సున్నితంగా తిరస్కరించడం ఆయనకు నచ్చలేదని, ఆ అసహనం కూడా వాణిజ్య చర్చల జాప్యానికి ఒక కారణమని భావిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులకు (MAGA - Make America Great Again) తాను ఇతర దేశాలతో వాణిజ్యం పరంగా ఒక కఠినమైన బేరసారాలాడే వ్యక్తి(Tough Negotiator) అని నిరూపించుకోవాలి. భారత్తో అరకొర ఒప్పందం చేసుకుంటే అది తన రాజకీయ ఇమేజ్కు దెబ్బని ఆయన భావిస్తున్నారు. భారత్ నుంచి భారీగా రాయితీలు పొందితేనే అది తనకు రాజకీయంగా విజయం అని ఆయన నమ్ముతున్నారు.ప్రస్తుత పరిస్థితిఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు పూర్తిగా ఆగిపోలేదు. ఇటీవల కూడా అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం భారత్లో పర్యటించింది. అమెరికా పట్టుబడుతున్న మొక్కజొన్న (Corn), సోయా వంటి ఉత్పత్తులను భారత్లోకి అనుమతించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇరు దేశాలు ఈ విషయంలో ఒక అంగీకారానికి వస్తే 2026 ప్రారంభంలో ఈ సుంకాలు తగ్గే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే.. -
పాత రూ.500, రూ.1000 నోట్లు ఉంటే నేరమా.. జరిమానా ఎంత?
నవంబర్ 2016లో మన దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఆ సమయంలో వీటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదా.. మార్చుకోవడానికి సమయం ఇచ్చారు. ఆ తరువాత వీటి వాడకం పూర్తిగా నిషేధించారు. అయినప్పటికీ.. ఇప్పటికి కూడా కొంతమంది దగ్గర ఈ నోట్లు ఉన్నట్లు అప్పుడప్పుడు సంబంధిత అధికారులు గుర్తిస్తూ ఉంటారు.పాత రూ. 500, రూ. 1000 నోట్లు ఉపయోగించడం నేరమా?, ఒక వ్యక్తి దగ్గర ఎన్ని నోట్లు ఉండొచ్చు?, చట్టం ఏం చెబుతోంది? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.చట్టం ఏం చెబుతోందంటే?స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం 2017 ప్రకారం.. రద్దు అయిన రూ. 500, రూ. 1000 నోట్లు తక్కువ సంఖ్యలో ఉండటం నేరమేమీ కాదు. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడే నేరమవుతుంది. ఒక వ్యక్తి దగ్గర 10 నోట్ల వరకు ఉండవచ్చు. దీనివల్ల ఎలాంటి సమస్య రాదు.10 కంటే ఎక్కువ రూ. 500 లేదా రూ. 1000 నోట్లు ఉంటే.. మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే అభిరుచి కలిగిన నాణేలను సేకరించేవారు గరిష్టంగా 25 నోట్ల వరకు ఉంచుకోవచ్చు. అయితే వీటిని ఆర్ధిక లావాదేవీల కోసం ఎట్టిపరిస్థితుల్లో ఉపయోగించుకోకూడదు.ఐదు రెట్లు జరిమానా!ఒక వ్యక్తి పరిమితి కంటే ఎక్కువ సంఖ్యలో రద్దు చేసిన నోట్లను కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే.. కనీసం రూ. 10వేలు జరిమానా లేదా ఆ వ్యక్తి దగ్గర ఉన్న నోట్ల విలువకు ఐదు రేట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీదగ్గర రూ. 20వేలు విలువైన రద్దు చేసిన నోట్లు ఉన్నాయనుకుంటే.. రూ. లక్ష (ఐదు రెట్లు) జరిగిమానా చెల్లించాలన్నమాట. అయితే జైలు శిక్ష ఉండదు.రద్దు చేసిన నోట్లను ఎక్కువగా ఉంచుకున్నప్పటికీ.. దానిని ఆర్ధిక నేరంగా పరిగణించరు. అయితే జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రద్దు చేసిన నోట్లు చట్టబద్దమైనవి కాదు. కాబట్టి వీటిని ఎక్కడా ఉపయోగించలేరు. ఉపయోగించకూడదు కూడా.ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం.. -
ఐదో స్థానానికి ఎగబాకిన భారత్.. ఎవరి ఆదాయాలు ఎలా?
భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం అందరికీ గర్వకారణం. కేవలం 15 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలోని తొమ్మిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. సేవల రంగంలో గణనీయమైన వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం పెరగడం, జీఎస్టీ, డిజిటలైజేషన్, ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం.. వంటి కీలకమైన సంస్కరణలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. దాంతోపాటు బలమైన స్థూల ఆర్థిక స్థిరత్వం, అధిక మూలధన వ్యయం ఇందుకు ఎంతో తోడ్పడ్డాయి. అయితే భారత్ దశాబ్ద కాలంలో ఏమేరకు వృద్ధి చెందిందో అదే రీతిలో ప్రజల ఆదాయాలు పెరిగాయా అంటే లేదనే చెప్పాలి. ఏయే విభాగాల్లో పెట్టుబడి పెట్టినవారి ఆదాయాలు ఎంతమేరకు వృద్ధి చెందాయో కింద చూద్దాం.ఉద్యోగాలు పెరిగినా..భారతదేశ వృద్ధి పథంలో భాగంగా ఉద్యోగ కల్పన దశాబ్ద కాలంలో మెరుగ్గానే ఉంది. గడిచిన పదేళ్లలో దాదాపు 17 కోట్ల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. 2004-2014 కాలంతో పోలిస్తే ఉద్యోగ కల్పనలో తయారీ రంగం వాటా మెరుగుపడగా సర్వీసులు, నిర్మాణ రంగాల్లో అధిక కొలువులొచ్చాయి. అయినప్పటికీ జీవన నాణ్యత సంక్లిష్టంగా ఉంది. వైట్-కాలర్ ఉద్యోగాల్లో(ఫ్రొఫెషనల్ ఉద్యోగాలు) వేతన పెరుగుదల జీడీపీ విస్తరణ కంటే తక్కువగా ఉంది. కొత్తగా ఉద్యోగ మార్కెట్లో ప్రవేశించిన వారిలో ఎక్కువ భాగం అనధికారిక లేదా గిగ్ (Gig) వర్క్లో చేరుతున్నారు. భారతదేశం ఏటా వృద్ధి నమోదు చేస్తున్నట్లుగా ఉద్యోగులు వేతనాలు, వారి ఆదాయాలు వృద్ధి చెందడం లేదు.పెట్టుబడిదారులకు లాభాలుభారతదేశ వృద్ధి దశలో ఇటీవలి కాలంలో ఈక్విటీ ఇన్వెస్టర్లు లబ్ధిదారులుగా ఉన్నారు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ఇన్వెస్టర్ల పొదుపును అమాంతం పెంచేశాయి. సెప్టెంబర్ 2025 నాటికి వివిధ ఈక్విటీల్లో సిప్ల కింద ఉన్న ఆస్తులు సుమారు రూ.15.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి. 10 కోట్లకు పైగా సిప్ ఖాతాల ద్వారా ప్రస్తుతం నెలకు సుమారు రూ.20,000 కోట్లకు పైగా నిధులను ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లిస్తున్నారు.గత ఐదేళ్లలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సుమారు 170-200 శాతం రాబడిని అందించాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు 300-380 శాతం వరకు పెరిగాయి. 2010 ప్రారంభంలో సిప్లను ప్రారంభించిన పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోలు రెట్టింపు అయ్యాయి. ఇది ఆర్థికంగా చాలా కుటుంబాలకు సాధికారత కల్పించింది.రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లునగరాల్లోని చాలా మంది పొదుపుదారులకు స్టాక్ మార్కెట్లోని రాబడులు తమ జీతం పెరుగుదలను అధిగమించాయి. ప్రధానంగా ఎస్ఐపీ ద్వారా సృష్టించిన సంపద వార్షిక వేతన పెంపు కంటే ఎక్కువగా ఉంది. దీనికి విరుద్ధంగా సాంప్రదాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టినవారికి ఎక్కువగా రాబడులు లేవు. పెద్దగా ఆదరణలేని ప్రదేశాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి వాటిలో ఆశించిన రాబడి రాలేదు. ఆహారం, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి నిత్యావసరాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది.మీరు నిజంగా ధనవంతులా?భారతదేశం ఆర్థికంగా వేగంగా దూసుకుపోతోంది. అధిక జీడీపీ ర్యాంక్, మెరుగైన మూలధన మార్కెట్లు, బలమైన డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలు దీనికి నిదర్శనం. అయితే, ‘మీరు ధనవంతులా?’ అనే ప్రశ్నకు సమాధానం అసమానంగా ఉంటుంది. స్థిరమైన సిప్ పెట్టుబడిదారులు, ఐటీ, ఫైనాన్స్, న్యూఏజ్(కొత్తగా, వేగంగా విస్తరిస్తున్న రంగాలు) సర్వీసులు వంటి అధిక వృద్ధి రంగాల్లో నిపుణుల నికర విలువలో అభివృద్ధి కనిపిస్తోంది. అయితే స్థిరమైన వేతనం లేనివారు, ఈక్విటీలో పెట్టుబడులు లేని సాధారణ జీతం పొందే సిబ్బంది ఈ సంపద సృష్టి నుంచి దూరంగా ఉన్నారు.భారతదేశం ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక దేశాల్లో ఐదో స్థానానికి ఎగబాకడం సంతోషకరమైన అంశమే. అయితే ఇందులో అందరికీ భాగస్వామ్యం ఉండాలి. దేశ వృద్ధికి అనుగుణంగా అన్ని రంగాల్లోని ప్రజల ఆదాయాలు వృద్ధి చెందాల్సి ఉంటుంది. ఈ ప్రయోజనాలు అందరికీ అందేలా ప్రభుత్వం, వ్యవస్థలు చర్యలు తీసుకోవాలి. ఈక్విటీ మార్కెట్ విజయాన్ని ‘ఇండియా గ్రోత్ స్టోరీ’గా మార్చాలంటే, వేతన వృద్ధి, ఉద్యోగ నాణ్యతను మెరుగుపరచడం తదుపరి ఆర్థిక సంస్కరణల ప్రధాన లక్ష్యం కావాలి.ఇదీ చదవండి: ఉద్యోగం చేస్తూ కోటీశ్వరులు కావాలంటే.. -
ఎగుమతుల జోరు
న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నవంబర్లో బలమైన పనితీరు చూపించింది. అమెరికా టారిఫ్ల నడుమ సానుకూల వృద్ధి నమోదైంది. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం నవంబర్లో 38.13 బిలియన్ డాలర్ల విలువైన వస్తు ఎగుమతులు జరిగాయి. ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, కెమికల్స్, రత్నాభరణాలు వృద్ధికి తోడ్పడ్డాయి. దిగుమతులు 1.88 శాతం తగ్గి 62.66 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రధానంగా బంగారం, ముడిచమురు దిగుమతులు గణనీయంగా తగ్గాయి. దీంతో వాణిజ్య లోటు 24.53 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. అక్టోబర్ నెలకు వాణిజ్య లోటు 41.68 బిలియన్ డాలర్లతో పోల్చి చూసినా నవంబర్లో గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎగుమతులు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.62 శాతం పెరిగి 292.07 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం ఇదే కాలంలో 5.59 శాతం అధికమై 515.21 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 223.14 బిలియన్ డాలర్లుగా ఉంది. → నవంబర్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 11.65 శాతం పెరిగి 3.93 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → టీ, కాఫీ, ఐరన్ ఓర్, జీడిపప్పు, డెయిరీ, హస్తకళాకృతులు, సముద్ర ఉత్పత్తులు, తోలు ఉత్పత్తుల ఎగుమతులు సైతం సానుకూలంగా నమోదయ్యాయి. → బియ్యం, నూనె గింజలు, కార్పెట్, ప్లాస్టిక్స్ ఎగుమతులు క్షీణించాయి. → సేవల ఎగుమతులు నవంబర్లో 35.86 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2024 నవంబర్లో వీటి ఎగుమతులు 32.11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు సేవల ఎగుమతులు 270 బిలియన్ డాలర్లకు పెరిగాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 248.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎగుమతులకు ప్రోత్సాహకం.. రూ. 25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్కు సంబంధించి సవివర మార్గదర్శకాలను ఖరారు చేస్తున్నట్టు వాణిజ్య శాఖ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ తెలిపారు. కొన్నింటిని ఈ వారంలోనే అమల్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు. అమెరికా 50 శాతం టారిఫ్ల కారణంగా ఏర్పడిన ప్రభావం నుంచి ఎగుమతిదారులకు కొంత మేరకు ఉపశమనం లభిస్తుందన్నారు. అమెరికా టారిఫ్లు విధించినప్పటికీ.. 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు భారత ఎగుమతులకు యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్నట్టు ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్’ (ఎఫ్ఐఈవో) ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ తెలిపారు.యూఎస్కు 22 శాతం అధికంనవంబర్లో అమెరికాకు ఎగుమతులు బలపడ్డాయి. వరుసగా రెండు నెలల పాటు (సెప్టెంబర్, అక్టోబర్) క్షీణత తర్వాత.. నవంబర్లో 22.61 శాతం మేర అధికంగా 6.98 బిలియన్ డాలర్ల ఎగుమతులు యూస్ మార్కెట్కు వెళ్లాయి. భారత్పై 50 శాతం టారిఫ్లను ఆగస్ట్ నుంచి యూఎస్ అమలు చేస్తుండడం తెలిసిందే. అమెరికా నుంచి నవంబర్లో భారత్కు దిగుమతులు 38 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు అమెరికాకు ఎగుమతులు 11.38 శాతం పెరిగి 59 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 13.49 శాతం పెరిగి 35.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
పవర్ఫుల్ ఆదా... సెకండ్ హ్యాండ్ ఈవీకి ఓకే!
ఐదేళ్ల కిందట దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు పెద్దగా లేనేలేవు. మొత్తం వాహనాల్లో ఎలక్ట్రిక్ వాటా నిండా ఒక శాతం కూడా లేదు. మరి ఇప్పుడో..? దాదాపుగా మూడున్నర శాతానికి చేరుకుంది. ఇదేమీ మామూలు పెరుగుదల కాదు. మరెలా సాధ్యమైంది? ఎలాగంటే అప్పట్లో ఛార్జింగ్ సదుపాయాలు తక్కువ. ధరలు ఎక్కువ. పైపెచ్చు మోడళ్లూ తక్కువే. దాంతో కొనేవారు వెనకడుగు వేసేవారు. ఇపుడు ఛార్జింగ్ సదుపాయాలు పెరిగాయి. ప్రతి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లలోనూ వస్తున్నాయి. దాదాపు అన్ని కంపెనీలూ ఈ రంగంలోకి వచ్చి రకరకాల మోడళ్లు తెస్తున్నాయి. వీటికి తోడు ధరలూ తగ్గాయి. అందుకే ఇపుడు జనం ఆలోచనలు మారుతున్నాయి. సరే! ఇదంతా ఒకెత్తయితే... ఆర్థికంగా మనకు ఏదైతే లాభం? ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం వెతుకుతూనే ఉన్నారు. వారికోసమే ఈ కథనం...పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల ధరలు కొంచెం ఎక్కువ. కానీ నిర్వహణ వ్యయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎలక్ట్రిక్ కారు నిర్వహణ వ్యయమే తక్కువ. మరి మొత్తంగా చూసినపుడు ఏది బెటర్? ఇలా చూసినపుడు స్మార్ట్గా సేవ్ చేసుకోవటానికి సెకండ్ హ్యాండ్ (ప్రీఓన్డ్/ అప్పటికే మరొకరు వినియోగించిన) ఎలక్ట్రిక్ కారు కొనటం మంచిదంటున్నారు నిపుణులు. కొత్త పెట్రోల్ కారు కొనే బదులు ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కారును ఇంటికి తెచ్చుకోవటమనేది స్మార్ట్ మార్గమని సలహా ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ కారే చౌక.. అదెలా?కొత్త వాటి ధరలు అధికంగా ఉంటుండడంతో.. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ తదితర పట్టణాల్లో ప్రీ ఓన్డ్ ఎలక్ట్రిక్ కార్లకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. ఇందులో ఉన్న ఆదా సూత్రం చాలా మందికి నచ్చుతోంది. ఎందుకంటే పెట్రోల్ కార్లతో పోల్చినపుడు ఎలక్ట్రిక్ కార్ల విలువ వేగంగా తగ్గిపోతోంది. 2020లో రూ.12 లక్షలు పలికిన ఈవీ ధర.. ఇప్పుడు రూ.5.5 నుంచి 6.5 లక్షలకే దొరుకుతోంది. అందుబాటు ధరలకే.. ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఎప్పటికప్పుడు మారిపోతోంది. కొత్త కొత్త ఫీచర్లు తరచూ యాడ్ అవుతూనే ఉన్నాయి. పైపెచ్చు కంపెనీలు అత్యాధునిక సదుపాయాలతో మోడళ్లను అప్గ్రేడ్ చేస్తున్నాయి. దీంతో అప్గ్రేడెడ్ వెర్షన్ను కొనుక్కోవటానికి సంపన్నులు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా 3– 4 ఏళ్లు తిరక్కుండానే తమ పాత వాహనాన్ని సెకండ్ హ్యాండ్ మార్కెట్లో విక్రయానికి పెడుతున్నారు. ఈ ధోరణే ఇప్పుడు మధ్య తరగతి వాసులకు కలిసి వస్తోంది. సెకండ్ హ్యాండ్లో పెట్రోలు కారు కొని అధిక నిర్వహణ వ్యయాన్ని భరించే బదులు... తక్కువ ధరకే ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొని తక్కువ నిర్వహణ వ్యయంతో ముందుకెళుతున్నారు. నిర్వహణ వ్యయం కలిసొచ్చేదిలా... → పెట్రోలు కారు లీటర్కు 15 కిలోమీటర్లు మైలేజీ ఇస్తోందనుకుందాం. దాన్లో నెలకు 1,000 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపుగా రూ.6,500 నుంచి రూ.7000 ఖర్చవుతుంది. → నెలకు ఇంతే దూరం కోసం ఎలక్ట్రిక్ కారులో గనక తిరిగితే.. ఒక కిలోమీటర్కు రూ.1.5 చొప్పున ఎలక్ట్రిక్ చార్జింగ్ కోసం రూ.1,500–2,000 వెచి్చస్తే సరిపోతుంది. → ఈ ఉదాహరణలో ఎలక్ట్రిక్ కారును వినియోగించడం వల్ల నెలవారీ రూ.5,000 వరకు ఆదా అవుతుంది. → ఎలక్ట్రిక్ కారులో ఇంజన్ ఆయిల్ మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. క్లచ్/గేర్ బాక్స్లు ఉండవు. కనుక ఎలక్ట్రిక్ కారుకు సర్వీసింగ్ కోసం ఏడాదిలో రూ.2,000–5,000 సరిపోతుంది. → పెట్రోల్ కారులో ఇంజన్ ఆయిల్, సర్వీసింగ్ కోసం ఏటా రూ.12,000 వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ‘బ్యాటరీ’పై ఆందోళన ఎందుకు? ఎలక్ట్రిక్ కారుకు బ్యాటరీయే హృదయం. కొంత కాలానికి బ్యాటరీ పనితీరు పడిపోతుందని, అగ్ని ప్రమాదాల రిస్క్ ఉంటుందని కొందరు భయపడుతుంటారు. కానీ, ఇపుడు కంపెనీలు ఏమాత్రం రాజీ పడకుండా మెరుగైన టెక్నాలజీతో మంచి బ్యాటరీలు తెస్తున్నాయి. పైపెచ్చు కార్ల కంపెనీలు బ్యాటరీలపై ఎనిమిదేళ్ల వారంటీని లేదంటే 1,60,000 కిలోమీటర్ల వినియోగానికి వారంటీని ఆఫర్ చేస్తున్నాయి. పైగా నాలుగేళ్ల వినియోగం తర్వాత ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పనితీరు అందరూ అనుకునేట్టు 40–50 శాతం పడిపోవడం అన్నది నిజం కాదు. 8–12 శాతమే తగ్గుతున్నట్టు యూజర్ డేటా ఆధారంగా తెలుస్తోంది.దీన్నిబట్టి చూసినపుడు మూడేళ్లు వాడిన కారును కొనుక్కున్నా మరో మూడు నాలుగేళ్లు అదే బ్యాటరీని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఒకవేళ బ్యాటరీ మార్చాల్సి వస్తే.. అది కారును బట్టి రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఉంటోంది. ఐదేళ్లలో మిగిలేది బ్యాటరీకి పెట్టొచ్చు... ప్రీఓన్డ్ ఈవీ వర్సెస్ పెట్రోల్ కారు → నెలవారీ వినియోగం 1,000 కిలోమీటర్లు → పెట్రోల్ కారుకు నెలకు ఇంధనం కోసం రూ.7,000 చొప్పున ఐదేళ్లలో రూ.4.2 లక్షలు అవుతుంది. → అదే ఎలక్ట్రిక్ కారుకు నెలకు రూ.2,000 చొప్పున రూ.లక్ష చాలు. → పెట్రోల్ కారుకు ఏటా రూ.12వేల చొప్పున ఐదేళ్లలో రూ.60వేలు మెయింటెనెన్స్ అవుతుంది. → ఎలక్ట్రిక్ కారుకు రూ.2–5 వేల చొప్పున రూ.10–25వేలు సరిపోతుంది. → ఈ రకంగా చూస్తే ఎలక్ట్రిక్ కారుపై ఐదేళ్లలో రూ.3 – 4 లక్షలు మిగులుతుంది. → బ్యాటరీ రీప్లేస్ చేయాల్సిన సమయం వచ్చేసరికి బ్యాటరీ ఖర్చు కన్నా మనకు మిగిలేదే ఎక్కువనేది నిపుణుల మాట. ఎవరికి ఏది అనుకూలం? ప్రీఓన్డ్ ఈవీ: → పట్టణాల్లో రోజువారీ కార్యాలయానికి వెళ్లి వచ్చేందుకు అయితే ఈవీ అనుకూలం. → ఒక రోజులో 80 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారు దీనికి మొగ్గు చూపొచ్చు. నెలలో కనీసం 700 కిలోమీటర్లు, అంతకుమించి ప్రయాణించే వారికే ఈవీ లాభసాటి. → రూ.5– 8 లక్షలే పెట్టుబడి పెట్టగలిగే వారు, ఇంట్లో చార్జింగ్ వసతులు కలిగిన వారు ఇటు వైపు మొగ్గు చూపించొచ్చు. పెట్రోల్ కారు: → హైవేలపై ఎక్కువగా ప్రయాణించే వారు లేదా గ్రామీణ/మారుమూల ప్రాంతాలకు ప్రయాణాలు ఎక్కువగా పెట్టుకునే వారికి ఎలక్ట్రిక్ కారు కంటే పెట్రోల్ కారు అనుకూలం. ఎలక్ట్రిక్ కారుకు ఒకసారి చార్జింగ్ చేశాక... మైలేజ్ పరంగా పరిమితులను దృష్టిలో పెట్టుకోవాలి. → ఇంట్లో చార్జింగ్ సదుపాయం లేని వారికి సైతం పెట్రోల్ కారుతోనే సౌలభ్యమని చెప్పాలి. → నెలలో 500 కిలోమీటర్లకు మించి ప్రయాణం చేయని వారికి పెట్రోల్పై, కారు నిర్వహణపై పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఏర్పడదు. వినియోగం తక్కువే కనుక ఏటా విలువ గణనీయంగా తగ్గిపోయే ఎలక్ట్రిక్ కారు కంటే పెట్రోల్ కారే వీరికి అనుకూలం. -
ఆటుపోట్లున్నా ముందుకే..!
గత వారం తొలుత అంచనాలకు విరుద్ధంగా దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో కొంత కోలుకున్నాయి. వెరసి ఈ వారం సైతం మార్కెట్లు ఆటుపోట్ల మధ్య ముందుకుసాగే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. బుల్లిష్ ట్రెండ్ కొనసాగవచ్చని భావిస్తున్నారు. మరోపక్క దేశ, విదేశీ ఆర్థిక గణాంకాలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు చెబుతున్నారు. వివరాలు చూద్దాం.. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ ఇండెక్స్(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(సోమవారం) విడుదలకానున్నాయి. అక్టోబర్(2025)లో ప్రతిద్రవ్యోల్బణం(మైనస్ 1.21 శాతం) నమోదుకాగా.. నవంబర్ నెలకు సైతం ధరల క్షీణత కనిపించనున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. దీంతో అక్టోబర్తో పోలిస్తే గత నెలలో కాస్తమెరుగ్గా మైనస్ 0.5 నుంచి –0.6 శాతంస్థాయిలో గణాంకాలు వెలువడవచ్చని చెబుతున్నారు. ఈ బాటలో నవంబర్ నెలకు వాణిజ్య సంబంధ గణాంకాలు విడుదలకానున్నట్లు తెలియజేశారు. ప్రధానంగా పసిడి ధరలు భారీగా పెరగడంతో అక్టోబర్లో వాణిజ్య లోటు(ఎగుమతి, దిగుమతుల మధ్య అంతరం) రికార్డ్ గరిష్టం 41.68 బిలియన్ డాలర్లను తాకింది. నవంబర్లోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అక్టోబర్లో దిగుమతుల బిల్లు 76 బిలియన్ డాలర్లను దాటగా.. ఎగుమతులు 34.38 బిలియన్ డాలర్లు మాత్రమే. కరెన్సీ మారకంపై కన్ను గత వారం డాలరుతో మారకంలో రూపాయి ఇంట్రాడేలో చరిత్రాత్మక కనిష్టం 90.56కు పడిపోయింది. ఆరు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 98.4కు బలహీనపడగా.. 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ తొలుత నీరసించినప్పటికీ 4.18 శాతానికి కోలుకున్నాయి. ఫెడ్, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతలు కరెన్సీ, బాండ్లపై ప్రభావం చూపుతున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. కాగా.. యూఎస్ విధించిన అదనపు టారిఫ్లకుతోడు మెక్సికో సైతం భారత్ దిగుమతులపై సుంకాలను పెంచడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అయితే ఇటీవల యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్తో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు, మెక్సికో వాణిజ్య అధికారులతో భారత అధికారుల భేటీ టారిఫ్ల సమస్యలకు చెక్ పెట్టే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ గణాంకాలు యూఎస్, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. గత నెలకు యూఎస్ వినియోగ ధరలు, రిటైల్ అమ్మకాలు, వ్యవసాయేతర ఉపాధి గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. వెరసి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్గత పటిష్టత, ద్రవ్యోల్బణ ఔట్లుక్ తదితర అంశాలు ఫెడ్ మానిటరీ పాలసీపై ప్రభావం చూపనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. ఈ బాటలో విడుదలకానున్న జపనీస్ ద్రవ్యోల్బణం, వాణిజ్య గణాంకాలు బ్యాంక్ ఆఫ్ జపాన్ పరపతి సమీక్షను ప్రభావితం చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వారం సైతం మార్కెట్లలో హెచ్చుతగ్గులకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. చిన్న షేర్లు భళా అంచనాలకు అనుగుణంగా గడిచిన వారం యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటులో 0.25 శాతం కోత పెట్టడంతో చివర్లో మార్కెట్లు రికవరీ అయ్యాయి. వెరసి ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,000 పాయింట్లకు ఎగువన, బీఎస్ఈ సెన్సెక్స్ 85,200స్థాయికి పైన నిలిచాయి. డాలరుతో మారకంలో రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి చేరడం, యూఎస్కు తోడు కొత్తగా దేశీ ఎగుమతులపై మెక్సికో సుంకాల పెంపు ప్రకటించడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో గత వారం నికరంగా సెన్సెక్స్ 445 పాయింట్లు(0.51 శాతం) క్షీణించి 85,268 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 140 పాయింట్ల(0.53 శాతం) వెనకడుగుతో 26,047 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ 0.65 శాతం చొప్పున పుంజుకోవడం గమనార్హం! సాంకేతికంగా ముందుకే.. చార్టుల ప్రకారం గత వారం అంచనాలకు భిన్నంగా దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. అయితే రెండో సపోర్ట్ స్థాయిల వద్ద నుంచి కోలుకున్నాయి. వెరసి సాంకేతికంగా కీలకమైన 85,000 పాయింట్లు(సెన్సెక్స్), 26,000 పాయింట్ల(నిఫ్టీ) కీలకస్థాయిలకు ఎగువన ముగిశాయి. ఈ వారం సైతం ఆటుపోట్ల మధ్య బలపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. → నిఫ్టీకి తొలుత 26,000 పాయింట్లు సపోర్ట్గా నిలవవచ్చు. తదుపరి 25,800 వద్ద తిరిగి మద్దతు లభించే వీలుంది. 26,000 పాయింట్ల స్థాయికి ఎగువన నిలదొక్కుకుంటే 26,350 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఆపై సమీప భవిష్యత్లో 26,900–27,000 వరకూ పుంజుకునే చాన్స్లున్నాయ్. → సెన్సెక్స్ జోరందుకుంటే తొలుత 85,700–85,800 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడి కనిపించవచ్చు. ఈ స్థాయిలను అధిగమిస్తే 88,000–88,500 వరకూ బలపడే వీలున్నట్లు అంచనా. ఒకవేళ అమ్మకాలతో బలహీనపడితే 85,000 నుంచి 84,000 పాయింట్లవరకూ క్షీణించవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కో–లివింగ్.. ఇన్వెస్ట్మెంటే!
ఒకప్పుడు సింగిల్గా అద్దెకుండే వారికి సింగిల్ రూమ్లు దొరికేవి. కానీ ఇప్పుడు ఆ జమానా పోయింది. అయితే సింగిల్ బెడ్రూమ్ తీసుకోవాలి. ఇపుడు అవీ దొరకటం లేదు. ఇక డబుల్ లేదా ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లు తీసుకుంటే అద్దెలు తడిసి మోపెడవుతాయి. హైదరాబాద్ వంటి నగరాల్లోనైతే కో–లివింగ్ లేదా షేర్డ్ రెంటల్ ఇళ్లు బాగా దొరుకుతాయి. అంటే ఒక ట్రిపుల్ బెడ్రూమ్ను మూడు బెడ్రూమ్లుగా విభజించి... కిచెన్, హాల్ వంటివి కామన్గా వినియోగించుకోవటమన్న మాట. ఆ సింగిల్ బెడ్రూమ్లో ఒక్కరే గానీ, ఇద్దరు గానీ ఉండొచ్చు. దాన్ని బట్టే అద్దె ఉంటుంది. అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన కో–లివింగ్ రెంటల్ హౌసింగ్ విధానం ఇపుడు ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్తో పాటు విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఈ సంస్కృతి ఇపుడిపుడే ప్రాచుర్యం అందుకుంటోంది. అటు ప్రొఫెషనల్స్తో పాటు ఇటు పెట్టుబడులపై అధిక రాబడులనిచ్చే కొత్త మార్గాలను అన్వేíÙస్తున్న ఇన్వెస్టర్లకు కూడా ఇది మంచి అవకాశమేనని చెప్పాలి. నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీ, ఎడ్యుకేషన్ హబ్లుగా ఎదుగుతున్నాయి. దీనితో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్, విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనే, తక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో–లివింగ్ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్ బెడ్రూమ్ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగా, సరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై–ఫై, క్లీనింగ్, కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్ జెడ్ వీటివైపు మొగ్గు చూపుతోంది. నిర్వహణ బాదరబందీ లేకుండా... ఇలాంటి ప్రాపర్టీలను కో–లివింగ్ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానులకు నిర్వహణ బాధ్యతలను గానీ, కిరాయిదార్లతో డీల్ చేయటం వంటి బాధ్యతలు గానీ లేకుండా వాటన్నిటినీ తామే చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు చాలా వస్తున్నాయి. నెస్ట్ అవే, స్టాంజా లివింగ్, కోలివ్, యువర్స్పేస్ లాంటి కంపెనీలు రకరకాల విధానాల్లో నిర్వహణ సేవలను అందిస్తున్నాయి. కిరాయిదారుకు అద్దెకివ్వడం నుంచి గదుల మెయింటెనెన్స్, ఫరి్నíÙంగ్, అద్దెల వసూళ్లు మొదలైన పనులన్నీ ఓనర్ల ప్రమేయం లేకుండా అవే చూసుకుంటాయి. ఫలితంగా నిర్వహణ బాదరబందీ లేకుండా యజమానులకు స్థిరంగా నెలకి ఇంత చొప్పున అద్దె లభిస్తుంది. సాధారణ ఫ్లాటు కాస్త అధిక రాబడి అందించే సాధనంగా మారుతుంది. లాభసాటి ఇన్వెస్ట్మెంట్ కూడా... ఓనరు ఏమాత్రం కలుగజేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ వసతి సదుపాయాలను మేనేజ్ చేసే సంస్థలిపుడు చాలా వస్తున్నాయి. వాటి కారణంగా ఇలాంటి ప్రాపర్టీలు ఆదాయ వనరులుగా మారుతున్నాయి. ఉదాహరణకు వైజాగ్లో సాధారణ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు రూ.18,000 ఉందనుకుంటే, ఆ ఇంటినే కో–లివింగ్ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 24,000– రూ. 30,000 వరకు వస్తోంది. అంటే దాదాపు 35–40 శాతం మేర అధికంగా రాబడి వచి్చనట్లే. సంప్రదాయ రెంటల్ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో–లివింగ్ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్, టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. అంటే బ్యాంకు వడ్డీతో సమానంగా వస్తున్నట్లే. పైపెచ్చు దీర్ఘకాలంలో విలువ పెరగటం లాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులకు ఉండే పెరుగుదల ప్రయోజనాలు ఎలాగూ ఉంటాయి. ఖాళీగా ఉండేది తక్కువే.. సాధారణంగా విద్యార్థులు, జూనియర్ ఐటీ ఉద్యోగులు కొంత సమయం పాటు వచ్చి వెళ్లిపోతుంటారు. ఫలితంగా కో–లివింగ్ ప్రాపరీ్టలకు డిమాండ్ స్థిరంగా ఉంటోంది. వైజాగ్లోని మధురవాడ, విజయవాడలోని బెంజ్ సర్కిల్లాంటి ప్రాంతాల్లో ఏడాది పొడవునా 90– 95 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటున్నట్లు కన్సలి్టంగ్ సంస్థల చెబుతున్నాయి.రిస్క్ లు తెలుసుకోవాలి.. షరా మామూలుగా ఏ పెట్టుబడి సాధనంలోనైనా ఎంతో కొంత రిస్క్ లు ఉంటాయి. కో–లివింగ్లోనూ అలాంటివి కొన్ని ఉంటాయి. కిరాయిదారులు తరచుగా మారుతుండటం వల్ల ప్రాపర్టీ పాతబడిపోతుంటుంది. నిర్వహణ వ్యయాలు పెరుగుతుంటాయి. వివాదాలు తలెత్తవచ్చు. ప్రమాదాలు, డ్యామేజ్లకు ఆస్కారం ఉండటం వల్ల ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీని కూడా తీసుకోవాల్సి రావచ్చు. ఇవి కాకుండా జోనింగ్ పరిమితుల్లాంటి రెగ్యులేటరీ నిబంధనల అవరోధాలు, పరస్పరం సంబంధంలేని కిరాయిదార్లు, స్వల్పకాలిక రెంటల్ నిబంధనలపరంగా ఏవైనా వివాదాలు తలెత్తడంలాంటి సమస్యలు రావచ్చు. అయితే, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిస్క్ లతో పోలిస్తే ప్రయోజనాలే ఎక్కువన్నది నిపుణుల మాట. -
రూపాయి నేలచూపులు.. ప్రభుత్వానికి సవాల్!
భారత రూపాయి విలువ అమెరికన్ డాలర్తో పోలిస్తే చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోవడం దేశీయ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న తాజా పరిణామం. ఇటీవల రూపాయి మారకం విలువ తొలిసారిగా డాలర్తో పోలిస్తే రూ.90.4 వద్ద ఆల్-టైమ్ కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్ బలం తగ్గుతున్నప్పటికీ రూపాయి పతనం కొనసాగడం అనేక అంతర్జాతీయ, దేశీయ సంక్లిష్టతలను సూచిస్తోంది. ఈ పతనం దేశంలో ద్రవ్యోల్బణం పెంచే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.రూపాయి పతనానికి కారణాలుభారత రూపాయి విలువ ఈ విధంగా జీవనకాల కనిష్టానికి చేరడానికి ప్రపంచవ్యాప్త ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక అనిశ్చితులు, దేశీయ పరిణామాలు సంయుక్తంగా కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గతంలో పెంచింది. దీని కారణంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో పెట్టుబడి పెట్టిన విదేశీ పెట్టుబడిదారులు (ఎఫ్పీఐ) తమ నిధులను వెనక్కి తీసుకొని అధిక రాబడి కోసం డాలర్ ముడిపడిన ఆస్తుల్లోకి మళ్లించారు. దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయిపై ఒత్తిడి పెరిగింది.ఉక్రెయిన్-రష్యా యుద్ధం, మిడిల్ ఈస్ట్ దేశాల ఉద్రిక్తతలు వంటి భౌగోళిక అనిశ్చితులు అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే అమెరికన్ డాలర్కు ప్రాధాన్యత ఇవ్వడం రూపాయి బలహీనతకు దారితీసింది.దేశీయ, వాణిజ్య పరిణామాలుభారతదేశం దిగుమతి చేసుకునే విలువ, ఎగుమతి చేసే విలువ కంటే ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ముడి చమురు, బొగ్గు, ఎలక్ట్రానిక్స్, బంగారం వంటి వాటి దిగుమతులు అధికంగా ఉండటంతో వాటిని కొనుగోలు చేయడానికి భారీ మొత్తంలో డాలర్లు అవసరం. దీనివల్ల డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గింది.ముడి చమురు ధరల పెరుగుదలభారతదేశ అవసరాల్లో దాదాపు 85% వరకు చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఇది రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది.విదేశీ పెట్టుబడుల ఉపసంహరణవిదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి భారీ మొత్తంలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం (సుమారు 17 బిలియన్ డాలర్లకు పైగా) రూపాయి పతనానికి ప్రధాన కారణమైంది. దాంతోపాటు అమెరికా విధించిన పరస్పర సుంకాలు, వాణిజ్య ఒప్పందంపై జాప్యం కూడా రూపాయి విలువపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.సవాళ్ల పరిష్కారం ఇలా..ఈ సంక్లిష్టమైన సవాళ్లను అధిగమించడానికి, రూపాయి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం, ఆర్బీఐ, ఇతర అధికార యంత్రాంగాలు పటిష్టమైన దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకోవాలి.ఆర్బీఐ తరఫున తీసుకోవాల్సిన చర్యలురూపాయి విలువ పతనాన్ని నిలువరించడానికి ఆర్బీఐ తన వద్ద ఉన్న విదేశీ మారక నిల్వల నుంచి మార్కెట్లోకి డాలర్లను విక్రయించడం ద్వారా రూపాయికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. (ఆర్బీఐ ఇప్పటికే లండన్, సింగపూర్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో జోక్యం చేసుకుంది) ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి ఆకర్షించడానికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచేందుకు (రెపో రేటు) నిర్ణయం తీసుకోవచ్చు. ఇది పెట్టుబడులకు ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఎన్నారైలు విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకులు) డిపాజిట్లను పెంచేందుకు వారికి ప్రత్యేక ఆకర్షణలు, మినహాయింపులు ప్రకటించడం ద్వారా దేశంలోకి డాలర్ల ప్రవాహాన్ని పెంచవచ్చు.అధికార యంత్రాంగం..ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకాలు, రాయితీలు ప్రకటించవచ్చు. స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేందుకు అవసరమైన మౌలిక వసతులు, లాజిస్టిక్స్ మెరుగుపరచాలి. ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాలి. అలాగే బంగారం దిగుమతిపై సుంకాలను పెంచడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా దిగుమతులపై ఖర్చును తగ్గించవచ్చు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను మరింత సులభతరం చేయాలి. పారిశ్రామిక విధానాలు, పన్నుల విధానంలో స్థిరత్వం, స్పష్టత ఉండేలా చూడాలి. అంతర్జాతీయ వాణిజ్యాన్ని అమెరికన్ డాలర్కు బదులుగా రూపాయిలో నిర్వహించేందుకు ఇతర దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను వేగవంతం చేయాలి. ఇది డాలర్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.ఇదీ చదవండి: పడిలేచిన కెరటంలా నిఫ్టీ సూచీ -
భారత్పై మెక్సికో సుంకాల పెంపు.. ఏయే రంగాలపై ప్రభావం అంటే..
అమెరికా బాటలోనే మెక్సికో కూడా భారత్, చైనా సహా ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై భారీగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది భారత ఎగుమతిదారులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారతీయ ఆటోమొబైల్స్, వాటి విడిభాగాల తయారీదారులు, ఎంఎస్ఎంఈ రంగాలపై దీని ప్రభావం పడనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.మెక్సికో సుంకాల పెంపుఇటీవల మెక్సికన్ సెనేట్ వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న సుంకాల పెంపును ఆమోదించింది. వాణిజ్య ఒప్పందాలు లేని దేశాల నుంచి వచ్చే వస్తువులపై ఈ కొత్త విధానం అమలవుతుందని చెప్పింది. ఈ పెంపులో ఆటోమొబైల్స్ దిగుమతి సుంకం కీలకంగా మారింది. కొత్త నిర్ణయాల్లో భాగంగా ఇది 20 శాతం నుంచి ఏకంగా 50 శాతానికి పెరుగుతుంది. భారతీయ కార్ల తయారీదారులు, ఆటో విడిభాగాల సరఫరాదారులకు మెక్సికో ప్రధాన వైవిధ్య మార్కెట్ల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు 50% సుంకం కారణంగా వారి ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగి, మెక్సికన్ మార్కెట్లో పోటీ పడే సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు(అంచనా)అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్, చైనా వంటి దేశాలు తమ వస్తువులను నేరుగా అమెరికాకు ఎగుమతి చేయకుండా మెక్సికో ద్వారా మళ్లించి ఆ తర్వాత అమెరికాకు పంపే అవకాశం ఉంది. ఈ వస్తు మళ్లింపును నిరోధించే లక్ష్యంతో మెక్సికో సుంకాలు పెంచింది.యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (USMCA)ను సమీక్షించబోతున్న నేపథ్యంలో మెక్సికో తన వాణిజ్య విధానాన్ని అమెరికా వైఖరికి దగ్గరగా ఉండేలా చూసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.మెక్సికోకు భారత్ ఎగుమతులు.. ఏ రంగాలు ప్రభావితం?భారతదేశం నుంచి మెక్సికోకు ఎగుమతయ్యే ప్రధాన అంశాలలో ఆటోమొబైల్స్ ఒకటి. ద్విచక్ర వాహనాలు, చిన్న కార్లు, ట్రక్కులు, ఇంజిన్ విడిభాగాలు, టైర్లు వంటి ఆటో విడిభాగాల ఎగుమతులు ప్రభావితం కానున్నాయి.కొన్ని రకాల రసాయనాలు, ఔషధ తయారీలో వాడే ముడి పదార్థాలు.రంగులు, రంగుల పదార్థాలు (Dyes and Pigments), ఇతర ఆర్గానిక్ రసాయనాలు.రెడీమేడ్ దుస్తులు, ఇతర వస్త్ర ఉత్పత్తులు.పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు.భారత్కు మెక్సికో దిగుమతులు ఇలా..మెక్సికో నుంచి భారత్ దిగుమతి చేసుకునే వాటిలో చమురు అత్యంత కీలకం. చమురు ధరల్లో పెరుగుదల లేదా లభ్యతలో హెచ్చుతగ్గులు భారతీయ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా రవాణా, తయారీ రంగాలపై నేరుగా ప్రభావం చూపుతాయి.యంత్రాలు, విడిభాగాలుతయారీ, ఇంజినీరింగ్ రంగానికి సంబంధించిన భారీ పారిశ్రామిక యంత్రాలు, టర్బైన్లు, పంపింగ్ పరికరాలు వంటి వాటిని భారత్ మెక్సికో నుంచి దిగుమతి చేసుకుంటుంది.బంగారం, వెండివిలువైన లోహాల రంగంలో భారత్ బంగారం, వెండి లోహాలను (కొన్ని సందర్భాలలో) దిగుమతి చేసుకుంటుంది. భారతదేశంలో బంగారం వినియోగం అత్యధికంగా ఉంటుంది.ఖనిజాలుమైనింగ్ రంగంలో కొన్ని రకాల లోహ ఖనిజాలు, ముడి పదార్థాలను భారత్ దిగుమతి చేసుకుంటుంది.మెక్సికో సుంకాల పెంపు ప్రభావం భారత ఎగుమతులపై తీవ్రంగా ఉన్నప్పటికీ భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు వంటి కీలకమైన వస్తువులపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన సరఫరాలో కూడా అనిశ్చితి ఏర్పడవచ్చు.ఇప్పుడు ఏం చేయాలంటే..సుంకాల నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఎగుమతిదారులు లాటిన్ అమెరికాలోని ఇతర దేశాలు, ఆఫ్రికా, ఆగ్నేయాసియాలోని ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి సారించాల్సి ఉంది.లాటిన్ అమెరికన్ ఆర్థిక వ్యవస్థలతో ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాల (ప్రైమరీ ట్రేడ్ అగ్రిమెంట్) కోసం చర్చలను వేగవంతం చేయాలి. ఇది సుంకాల భారం లేకుండా మార్కెట్ అవకాశాన్ని సులభతరం చేస్తుంది.దేశీయంగా తయారీ రంగాన్ని ఆధునీకరించి పోటీతత్వాన్ని పెంచాలి.ఇదీ చదవండి: భారత్లో పెరుగుతున్న ‘ఘోస్ట్ మాల్స్’ -
ఎగుమతులకు మెక్సికో టారిఫ్ల దెబ్బ
న్యూఢిల్లీ: దేశీ ఎగుమతులపై మెక్సికో ప్రకటించిన టారిఫ్ల పెంపు ప్రధానంగా ఆటో, ఆటో విడిభాగాలు, మెటల్, ఎల్రక్టానిక్స్, కెమికల్స్ రంగాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. దక్షిణ అమెరికా దేశమైన మెక్సికో తాజాగా భారత్ దిగుమతులపై సుంకాల పెంపును చేపట్టింది. ఇవి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మెక్సికోతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం పరిధిలోలేని దేశాలపై 5 నుంచి 50 శాతంవరకూ దిగుమతి సుంకాలు వర్తించనున్నాయి. భారత్సహా చైనా, దక్షిణ కొరియా, థాయ్లాండ్, ఇండోనేసియా దేశాలలోని వివిధ రంగాలు, పరిశ్రమలపై ఈ టారిఫ్లు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది(2024–25) మెక్సికోకు 5.75 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను భారత్ చేపట్టింది. అయితే తాజా టారిఫ్ల పెంపు కారణంగా మెక్సికోకు ఎగుమతులు వ్యయభరితమయ్యే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గతేడాది ప్రయాణికుల వాహన ఎగుమతులు 938.35 మిలియన్ డాలర్లుకాగా.. 20 శాతం నుంచి 35 శాతం మధ్య టారిఫ్ పెంపు వర్తించనున్నట్లు గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనేíÙయేటివ్(జీటీఆర్ఐ) తెలియజేసింది. దీంతో ధరల పోటీతత్వం నీరసించవచ్చని అభిప్రాయపడింది. ఆటో విడిభాగాలపై ఇది మరింత అధికంగా కనిపించనున్నట్లు పేర్కొంది. ఆటో విడిభాగాల ఎగుమతులు 507.26 మిలియన్ డాలర్లుకాగా.. 10–15% సుంకాలు 35 శాతానికి పెరగనున్నట్లు జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలియజేశారు. ఇదేవిధంగా 390.25 మిలియన్ డాలర్ల విలువైన మోటార్సైకిళ్ల ఎగుమతులు సైతం సవాళ్లను ఎదుర్కోనున్నట్లు తెలియజేశారు. వీటిపై సుంకాలు 20% నుంచి 35 శాతానికి పెరగనున్నట్లు వెల్లడించారు. ఆటో విడిభాగాలపై ఎఫెక్ట్ దేశీ ఆటో విడిభాగాల పరిశ్రమపై తాజాగా మెక్సికో చేపట్టిన దిగుమతి సుంకాల పెంపు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పరిశ్రమల సమాఖ్య ఏసీఎంఏ పేర్కొంది. భారత్ నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో 37 కోట్ల డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను మెక్సికోకు ఎగుమతి చేసింది. సుంకాలు భారత్ ఎగుమతులపై 35–50% స్థాయిలో పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొ న్నాయి. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక చర్చలు వృద్ధిలో ఉన్న ఆటోమోటివ్ వాణిజ్యానికి నిలకడను తీసుకురాగలదని విశ్వసిస్తున్నట్లు దేశీ ఆటోమోటివ్ విడిభాగ తయారీదారుల అసోసియేషన్(ఏసీఎంఏ) డైరెక్టర్ జనరల్ విన్నీ మెహతా చెప్పారు. -
నైట్క్లబ్లు.. ఆర్థిక చిక్కులు.. నిర్వహణ సవాళ్లు
గోవా నైట్క్లబ్లో ఇటీవల జరిగిన ఫైర్ యాక్సిడెంట్తో నైట్లైఫ్ ఇండస్ట్రీ నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, దాని ఆర్థిక వ్యవస్థలోని అంశాలు చర్చకు వస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే లైట్లు, డీజే సంగీతం ఉండే నైట్క్లబ్ల్లో కోట్లాది రూపాయల బిజినెస్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. భారతదేశంలో కూడా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, గోవా వంటి నగరాలు ఈ రాత్రిపూట వినోద రంగంలో ఏటా సుమారు 10% వృద్ధిని నమోదు చేస్తున్నాయి.నైట్క్లబ్ వ్యాపార నమూనానైట్క్లబ్లు ప్రధానంగా అధిక మార్జిన్ కలిగిన ఉత్పత్తులు, సర్వీసులను విక్రయించడం ద్వారా లాభాలను ఆర్జిస్తాయి. నైట్క్లబ్ ఆదాయంలో అత్యంత కీలకమైన భాగం ఆల్కహాల్, ఇతర పానీయాల విక్రయం. పానీయాలపై లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. వీఐపీ టేబుల్స్ లేదా ప్రత్యేక విభాగాల్లో ‘బాటిల్ సర్వీస్’ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఇందులో కస్టమర్లు అధిక ధరలకు ఖరీదైన మద్యం బాటిళ్లను కొనుగోలు చేస్తారు. దీనికి ప్రత్యేక సర్వీస్ అందిస్తుండడంతో నైట్క్లబ్లు ఆదాయం సంపాదిస్తాయి.ప్రవేశ రుసుము, కవర్ ఛార్జీలువారాంతాల్లో లేదా ప్రత్యేక ఈవెంట్ల సమయంలో కస్టమర్ల సంఖ్యను నియంత్రించడానికి, ఆదాయాన్ని పెంచడానికి ప్రవేశ రుసుము లేదా కవర్ ఛార్జ్ (దీనిలో కొంత మొత్తం పానీయాలకు లెక్కిస్తారు) వసూలు చేస్తారు.ప్రత్యేక ఈవెంట్లు, స్పాన్సర్షిప్లుప్రముఖ జాతీయ/ అంతర్జాతీయ డీజేలు, కళాకారులతో ఈవెంట్లను నిర్వహించడం ద్వారా టికెట్ ధరలను పెంచుతుంటారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు.కార్పొరేట్ ఈవెంట్లుప్రైవేట్ పార్టీలు, కార్పొరేట్ ఫంక్షన్లు, ప్రొడక్ట్ లాంచ్ల కోసం క్లబ్ను అద్దెకు ఇస్తుంటారు.బ్రాండ్ స్పాన్సర్షిప్లుమద్యం, సాఫ్ట్డ్రింక్స్ లేదా ఇతర లైఫ్స్టైల్ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది.నిర్వహణ, సవాళ్లునైట్క్లబ్ను విజయవంతంగా నడపడం కేవలం సంగీతం, డ్రింక్స్కు సంబంధించినది మాత్రమే కాదు. ఇది సంక్లిష్టమైన నిర్వహణ సవాళ్లతో కూడుకుంది. మద్యం లైసెన్స్, అగ్నిమాపక భద్రతా ధ్రువీకరణ, మ్యూజిక్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ వంటి అనేక రకాల అనుమతులను పొందాలి. వాటిని ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకోవాలి. గోవాలో జరిగిన సంఘటన వంటి వాటి నేపథ్యంలో నైట్క్లబ్ల భద్రతా ప్రమాణాల అమలుపై ప్రభుత్వాల నుంచి పర్యవేక్షణ, నియంత్రణ మరింత కఠినతరం కావాల్సి ఉంది.భద్రతా వాతావరణంనాణ్యమైన ధ్వని, లైటింగ్ సిస్టమ్, విభిన్న వాతావరణం (Ambiance), ప్రముఖ డీజేల ఎంపిక క్లబ్ పేరును, ప్రజాదరణను పెంచుతాయి. తాగుబోతుల నియంత్రణ, గొడవలు, ముఖ్యంగా మహిళా కస్టమర్ల భద్రత కోసం బలమైన భద్రతా సిబ్బంది అవసరం.ఖర్చుల నిర్వహణక్లబ్ల ఏర్పాటు కోసం స్థలం అద్దె, విద్యుత్, నీరు, బీమా వంటి స్థిర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. క్లబ్లో స్టాక్ను నిర్వహించడం, దుర్వినియోగాన్ని అరికట్టడం, పానీయాల నాణ్యతను కాపాడటం లాభాలకు కీలకం. డీజేలు, బార్ అటెండర్లు, వెయిటర్లు, భద్రతా సిబ్బందికి అయ్యే వేతనాలుంటాయి.భద్రతా ప్రమాణాల ఉల్లంఘనల పర్యవసానంక్లబ్ల్లో కిటికీలు లేని చీకటి ప్రదేశాలు, ఇరుకైన మెట్లు, మూసివేసిన ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం లేదా ఉన్నా పని చేయకపోవడం వంటివి ప్రమాద తీవ్రతను పెంచుతాయి. భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన క్లబ్ యజమానులు, నిర్వాహకులు భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు, క్రిమినల్ కేసులను ఎదుర్కోవలసి వస్తుంది. భద్రతా వైఫల్యాలు క్లబ్ బ్రాండ్కు, నైట్లైఫ్ పరిశ్రమ ప్రతిష్టకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.ఇప్పుడేం చేయాలంటే..భారతదేశంలో నైట్క్లబ్ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం. అయితే, ఇది నిలకడగా, సురక్షితంగా మనుగడ సాగించాలంటే కేవలం లాభాలపైనే కాకుండా.. భద్రతా ప్రమాణాలపై, చట్టపరమైన నిబంధనల అమలుపై నిర్వాహకులు, ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలి. గోవా సంఘటన లాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే వ్యాపార లాభాలతో పాటు కస్టమర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం తక్షణ అవసరం.ఇదీ చదవండి: ఇంకా సమసిపోని ఇండిగో సంక్షోభం -
5 కంపెనీలు లిస్టింగ్కు రెడీ
ఈ కేలండర్ ఏడాది(2025) సరికొత్త రికార్డు నెలకొల్పే బాటలో ప్రైమరీ మార్కెట్లు పలు లిస్టింగ్లతో కదం తొక్కుతున్నాయి. ఇప్పటికే సెంచరీ మార్క్కు చేరువైన ఐపీవోలు రూ. 1.6 లక్షల కోట్లకుపైగా సమీకరించాయి. ఈ బాటలో తాజాగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరో 5 కంపెనీలకు గ్రీన్సిగ్నల్ ఇచి్చంది. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు తాజాగా సెబీ నుంచి 5 కంపెనీలకు అనుమతి లభించింది. జాబితాలో లీప్ ఇండియా, ఎల్డొరాడో అగ్రిటెక్, మోల్బియో డయాగ్నోస్టిక్స్, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్, ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్(ఇండియా) చేరాయి. నిధుల సమీకరణకు వీలుగా ఈ కంపెనీలన్నీ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. అయితే మరోపక్క ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ, స్కై అల్లాయ్స్ అండ్ పవర్ వెనకడుగు వేశాయి. ఈ నెల మొదట్లో సెబీ నుంచి ఐపీవో పత్రాలను వాపస్ తీసుకున్నాయి. వీటిలో ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ తాత్కాలికంగానే ప్రాస్పెక్టస్ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రీఐపీవో రౌండ్లో భాగంగా కంపెనీ ఇటీవల రూ. 5,000 కోట్లు సమకూర్చుకున్న నేపథ్యంలో ఫైనాన్షియల్స్పై సవరించిన ముసాయిదా పత్రాలను తిరిగి దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రూ. 2,400 కోట్లపై కన్ను పబ్లిక్ ఇష్యూలో భాగంగా సప్లైచైన్ అసెట్ పూలింగ్ కంపెనీ లీప్ ఇండియా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 2,000 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. దీంతో లిస్టింగ్ ద్వారా రూ. 2,400 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 300 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. రూ. 1,000 కోట్లకు రెడీ శ్రీకార్ సీడ్స్ బ్రాండ్ కంపెనీ ఎల్డొరాడో అగ్రిటెక్ ఐపీవోలో భాగంగా రూ. 340 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 660 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. విత్తనాలుసహా.. సస్యరక్షణ సొల్యూషన్స్ సమకూర్చే తెలంగాణ కంపెనీ ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 245 కోట్లు రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. పీఈ సంస్థల వాటాలు పీఈ సంస్థలు టెమాసెక్, మోతీలాల్ ఓస్వాల్కు పెట్టుబడులున్న మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఐపీవోలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 1.25 కోట్ల షేర్లను కంపెనీ ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 99 కోట్లు కొత్త ఆర్అండ్డీ యూనిట్(ఎక్సలెన్స్ సెంటర్, ఆఫీస్ స్పేస్) ఏర్పాటుకు వెచి్చంచనుంది. కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటు కేటరింగ్, ఫుడ్ రిటైల్ చైన్ కంపెనీ ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్(ఇండియా) ఐపీవోలో భాగంగా రూ. 160 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.19 కోట్ల షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను కొత్త కేంద్రీకృత కిచెన్ల ఏర్పాటుతోపాటు, మెటీరియల్ అనుబంధ సంస్థ ఫుడ్లింక్ గ్లోబల్ రెస్టారెంట్స్ అండ్ కేటరింగ్ సర్వీసెస్ కొత్తగా నెలకొల్పనున్న క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్లకు వినియోగించనుంది. ఇండియా బిస్ట్రో, ఆర్ట్ ఆఫ్ దమ్, చైనా బిస్ట్రో తదితర బ్రాండ్లతో 30 క్యాజువల్ రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లను నిర్వహిస్తోంది. తాజా ఈక్విటీ, ఓఎఫ్ఎస్ ఐపీవోలో భాగంగా వేస్ట్వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్లు అందించే టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ 95.05 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 23.76 లక్షల షేర్లను కంపెనీ ప్రమోటర్ సంస్థ కార్తికేయ కన్స్ట్రక్షన్స్ ఆఫర్ చేయనుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 138 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. రెండు కంపెనీల దరఖాస్తు జాబితాలో స్టీమ్హౌస్ ఇండియా సిటియస్ ట్రాన్స్నెట్ ఇన్వెస్ట్ ట్రస్ట్ రవాణా సంబంధ మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు చేపట్టే సిటియస్ ట్రాన్స్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇన్విట్) పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుమతించమంటూ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా యూనిట్ల జారీ ద్వారా రూ. 1,340 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 1,235 కోట్లు ఎస్ఆర్పీఎల్లో సెక్యూరిటీల కొనుగోలు, టీఈఎల్, జేఎస్ఈఎల్, ధోలా, డిబంగ్ తదితర ఎస్పీవీ ప్రాజెక్టులలో పెట్టుబడులు చేపట్టనుంది. మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. దాదాపు 3,407 కిలోమీటర్ల పోర్ట్ఫోలియో(ఆస్తులు)ను కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,987 కోట్ల ఆదాయం, రూ. 418 కోట్ల నికర నష్టం ప్రకటించింది. రూ. 425 కోట్లకు సై ఇండ్రస్టియల్ స్టీమ్, గ్యాస్ సరఫరా చేసే స్టీమ్హౌస్ ఇండియా ఐపీవోకు వీలుగా సెబీకి అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను జత చేసింది. జూలైలో గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడంతో తాజాగా పత్రాలు దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 345 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ ఆఫర్ చేయనున్నారు. తద్వారా 425 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, అంకలేశ్వర్, పనోలీ యూనిట్ల విస్తరణకు, దహేజ్లో కొత్త స్టీమ్ జనరేషన్ యూనిట్ ఏర్పాటుకు వినియోగించనుంది. 2024–25లో రూ. 395 కోట్ల ఆదాయం, రూ. 31 కోట్ల నికర లాభం ఆర్జించింది. -
అమెరికా టారిఫ్స్: చరిత్ర సృష్టించిన చైనా..!
అమెరికా టారిఫ్లు చైనా వాణిజ్య జైత్రయాత్రకు బ్రేకులు వేయలేకపోయాయి. ప్రపంచ దేశాలతో వాణిజ్యం ఎలా చేయాలో తనను చూసి నేర్చుకోండన్నట్టుగా.. డ్రాగన్ వాణిజ్య మిగులును అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.90 లక్షల కోట్లు) వాణిజ్య మిగులును సాధించిన తొలి దేశంగా చైనా చరిత్రను సృష్టించింది.ఈ ఏడాది చైనా 3.6 ట్రిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయగా, ఇదే సమయంలో 2.6 ట్రిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. 2010లో ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్య మిగులు 0.18 ట్రిలియన్ డాలర్లుగానే ఉంది. 2015 నాటికి 0.59 ట్రిలియన్ డాలర్లు, 2025 నాటికి 1.08 ట్రిలియన్ డాలర్లకు పెంచుకోవడం ద్వారా తయారీలో సూపర్ పవర్గా కొనసాగుతోంది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టగానే చైనాపై టారిఫ్లు బాదేయడం తెలిసిందే. ఈ టారిఫ్ల కారణంగా అమెరికాకు చైనా వస్తు ఎగుమతులు నవంబర్లో 29 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో నెల చైనా నుంచి యూఎస్కు ఎగుమతులు క్షీణతను చూశాయి. అమెరికా బెదిరింపులకు డ్రాగన్ ఏమాత్రం బెదరలేదు. సరికదా తన వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులు పెంచుకోవడం ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. -
బలహీనమైన యూరప్ అమెరికాకు అనవసరం
అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గాన్ అండ్ చేజ్ సీఈఓ జామీ డిమోన్ ఇటీవల రీగన్ నేషనల్ డిఫెన్స్ ఫోరమ్లో కీలక వ్యాఖ్యలు చేశారు. యూరప్ అధికార యంత్రాంగం, ఆర్థిక విచ్ఛిన్నం అమెరికా భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించారు. డిమోన్ ఈ సందర్భంగా యూరప్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను హైలైట్ చేశారు.‘యూరప్లో సమస్య ఉంది. వారు వ్యాపారాన్ని, పెట్టుబడులను, ఆవిష్కరణలను బయటకు పంపిస్తున్నారు. యూరోపియన్ యూనియన్లో కీలక అంశాలపై ఏకాభిప్రాయానికి రావడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఇది ఆ ప్రాంతం స్థిరత్వానికి ప్రమాదం. యూరప్ బలహీనపడటం అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. యూరప్ విచ్ఛిన్నమైతే ‘అమెరికా ఫస్ట్’ ఇకపై సాధ్యం కాదు. బలహీనమైన యూరప్ అమెరికాకు అవసరం లేదు’ అని నొక్కి చెప్పారు.జేపీ మోర్గాన్ భారీ పెట్టుబడిఈ హెచ్చరికల నేపథ్యంలో జేపీ మోర్గాన్ సంస్థ అమెరికా ఆర్థిక స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికను ఇటీవల ప్రకటించింది. ఇది గత ప్రణాళిక కంటే 500 బిలియన్ డాలర్లు ఎక్కువ కావడం గమనార్హం. ఈ పెట్టుబడులు ప్రధానంగా కొన్ని కీలక రంగాలపై దృష్టి పెట్టేందుకు తోడ్పడుతాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: ఇండిగో సంక్షోభం.. పూర్తిస్థాయిలో కార్యకలాపాలు పునరుద్ధరణ -
విస్తరణపై ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారంపై ఏది?
మీరు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నారా? క్రెడిట్ కార్డుపై బిల్లింగ్ వివాదంతో సతమతమవుతున్నారా? కార్డు రివార్డ్ పాయింట్లలో సమస్యలున్నాయా? బ్యాంకు ద్వారా ఏ కారణం లేకుండా డబ్బులు కట్ అయ్యాయా?.. ఇలాంటి సమస్యలు మీకు ఒక్కరికే కాదు.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఏకంగా అంతకుముందు ఏడాది కంటే 13.55% పెరిగి 13.34 లక్షలకు చేరాయి. రుణాలు, క్రెడిట్ కార్డుల సర్వీసుల్లో లోపాల కారణంగా వినియోగదారులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన ‘రిజర్వ్ బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ ఓంబుడ్స్మన్ స్కీమ్ (ఆర్బీ-ఐఓఎస్) 2024-25 వార్షిక నివేదిక’ స్పష్టం చేసింది.ఈ ఫిర్యాదుల పెరుగుదల ట్రెండ్లో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులపై ఫిర్యాదులు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మించి 37.53%కి చేరాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులు రిటైల్ లెండింగ్లో దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో కస్టమర్ సర్వీస్ నాణ్యతలో లోపాలు ఎక్కువగా ఉన్నాయనేందుకు ఇదే నిదర్శనం.సెక్టార్ వారీగా ఫిర్యాదులు ఇలా..బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన మొత్తం 2,96,321 ఫిర్యాదుల్లో ప్రైవేట్ బ్యాంకుల వాటా పెరిగింది.సెక్టార్ఫిర్యాదుల సంఖ్యశాతం (%)గతేడాది ఇలా (%)మార్పుప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు1,11,19937.5334.39+10% పెరుగుదలపబ్లిక్ సెక్టార్ బ్యాంకులు1,03,11734.8038.32-8.45% తగ్గుదల అంతకుముందు ఆర్థిక సంవత్సరం 38.32% వాటాతో పబ్లిక్ బ్యాంకులు ముందుండగా, ఇప్పుడు 37.53% వాటాతో ప్రైవేట్ బ్యాంకులు వాటిని అధిగమించాయి. పబ్లిక్ బ్యాంకులు తమ అంతర్గత ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలను మెరుగుపరుచుకోవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.కస్టమర్ల ప్రధాన సమస్యలుకస్టమర్ల నుంచి వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో దాదాపు సగం (46%) కేవలం రుణాలు, క్రెడిట్ కార్డులు కేటగిరీలకే పరిమితమయ్యాయి. లోన్లు, అడ్వాన్స్లు విభాగంలో 29.25% వాటాలో 86,670 ఫిర్యాదులు అందాయి. వడ్డీ రేట్లలో మార్పులు, రుణాల మంజూరులో ఆలస్యాలు, రుణ చెల్లింపుల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు ఇందులో ఉన్నాయి.క్రెడిట్ కార్డులు17.15% వాటాతో (50,811 ఫిర్యాదులు) రెండో స్థానంలో ఉంది. ఈ కేటగిరీలో ఏకంగా 20.04% పెరుగుదల నమోదైంది. బిల్లింగ్ తప్పులు, అనధికార లావాదేవీలు, రివార్డ్ పాయింట్ల మోసాలు వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ముఖ్యంగా, క్రెడిట్ కార్డు ఫిర్యాదుల్లో ప్రైవేట్ బ్యాంకుల వాటా (32,696) అత్యధికంగా ఉంది.డిజిటల్ బ్యాంకింగ్మొబైల్/ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఫిర్యాదులు అంతకుముందుతో పోలిస్తే 12.74% తగ్గడం స్వాగతించదగిన పరిణామం. డిజిటల్ సెక్యూరిటీ మెరుగుపడటం, కస్టమర్లకు అవగాహన పెరగడం దీనికి దోహదపడింది.సమస్యలకు కారణాలు ఇవేనా..ప్రైవేట్ బ్యాంకులు తమ మార్కెట్ షేర్ను, డిజిటల్ ఉత్పత్తుల విస్తరణను పెంచుతున్న వేగంతో పోలిస్తే కస్టమర్ సపోర్ట్, ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యతను పెంచడం లేదనేది మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు వంటివి కూడా కొన్ని ఫిర్యాదులకు కారణమని తెలుస్తోంది. మరోవైపు, మొత్తం ఫిర్యాదుల్లో 87% వ్యక్తిగత కస్టమర్ల నుంచి వచ్చాయి. ఇది బ్యాంకింగ్ నియమాలు, కస్టమర్ హక్కులపై ప్రజల్లో అవగాహన పెరగడాన్ని సూచిస్తోంది.ఎలా పరిష్కరించుకోవాలంటే..బ్యాంకింగ్ సర్వీసుల్లో లోపాలు ఎదురైతే కస్టమర్ల కోసం ఆర్బీఐ-ఐఓఎస్ 2021 సులభమైన, ఉచిత పరిష్కార మార్గాన్ని అందిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే ముందుగా మీరు సంబంధిత బ్యాంకు బ్రాంచ్ లేదా కస్టమర్ కేర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. బ్యాంకు 30 రోజుల్లోగా స్పందించాలి.బ్యాంకు స్పందించకపోయినా లేదా వారిచ్చిన పరిష్కారంతో మీరు సంతృప్తి చెందకపోయినా cms.rbi.org.in పోర్టల్ ద్వారా ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.మీ ఫిర్యాదు ‘మెయింటైనబుల్’(ఆర్బీఐ-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే, పరిశీలనకు అర్హత ఉన్న, పరిష్కరించదగిన ఫిర్యాదులు) అయితే అది 24 ఆర్బీఐ అంబుడ్స్మన్ కార్యాలయాల్లో ఒకదానికి బదిలీ అవుతుంది. అంబుడ్స్మన్ 30 రోజుల్లో మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది.అంబుడ్స్మన్ నిర్ణయంతో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.బ్యాంకింగ్ రంగం డిజిటల్ యుగంలో వేగంగా ముందుకు వెళ్తున్నప్పటికీ సర్వీసుల నాణ్యతను మెరుగుపరచడం, కీలక విభాగాల్లో కస్టమర్ల సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం. ప్రైవేట్ బ్యాంకులు తమ కస్టమర్ సపోర్ట్ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, పబ్లిక్ బ్యాంకులు డిజిటలైజేషన్లో మరింత వేగవంతం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: పనివేళల తర్వాత నో కాల్స్.. నో ఈమెయిల్స్ -
రూ.6.15 లక్షల కోట్ల రుణాల మాఫీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్బీలు) గడిచిన ఐదున్నరేళ్ల కాలంలో రూ.6.15 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయి. ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీనిపై లోక్సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘ఆర్బీఐ డేటా ప్రకారం.. గత ఐదు ఆర్థిక సంవత్సరాలతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెపె్టంబర్ 30 వరకు ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.6,15,647 కోట్ల మేర రుణాలను మాఫీ చేశాయి’’అని వెల్లడించారు. వసూలు కాని మొండి రుణాలను (ఎన్పీఏలు) బ్యాంక్లు నిబంధనల మేరకు మాఫీ చేస్తాయని వివరించారు. అయినప్పటికీ అలా మాఫీ చేసిన రుణాల వసూలుకు అవి చర్యలు కొనసాగిస్తాయని చెప్పారు. ఆదాయపన్ను చట్టం, 2025 కింద కొత్త పన్ను రిటర్నుల పత్రాలను (ఐటీఆర్) 2027–28 ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే నోటిఫై చేయనున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా లోక్సభకు వెల్లడించారు. -
మీరూ కావచ్చు... మిస్టర్ బాండ్!
రెండ్రోజుల కిందటే ఆర్బీఆఐ రెపోరేటు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే... వడ్డీ రేట్లు తగ్గుతాయన్న మాట. వాస్తవంగా చూస్తే అటు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీరేటూ తగ్గాలి.. ఇటు మన డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటూ తగ్గుతుంది. కాకపోతే మన బ్యాంకులకు వాటి వ్యాపారమే తొలి ప్రాధాన్యం. కాబట్టి రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కాస్త లేటుగా స్పందిస్తాయి. కానీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వెంటనే తగ్గించేస్తాయి. పాపం... డిపాజిట్లు చేసుకుని, వాటిపై వడ్డీతో బండి లాగించేవారికి ఇది ఇబ్బందికరమే. మరి డిపాజిట్లపై వడ్డీ తగ్గుతూ పోతున్న ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేంటి? చాలామంది స్టాక్ మార్కెట్లవైపు చూస్తారు. మార్కెట్లలో డబ్బులు సంపాదించాలంటే వాటి గురించి బాగా తెలిసి ఉండాలి. అందుకే మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తారు. అవి కొంతవరకూ బెటరే అయినా... వీటిలో ఎక్కడా రాబడులపై గ్యారంటీ ఉండదు. మరి ఎలా? ఇదిగో... ఇలాంటి వారి కోసమే కార్పొరేట్ బాండ్లున్నాయి. అవేంటో చూద్దాం...కంపెనీలు నేరుగా ప్రజల నుంచి డబ్బులు సమీకరించడానికి బాండ్లు (రుణపత్రాలు) జారీ చేస్తుంటాయి. వాటికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. పైపెచ్చు వార్షికంగా చెల్లించేలా స్థిరమైన వడ్డీ రేటుంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై దాదాపు 7 శాతమే వడ్డీ వస్తున్న తరుణంలో బాండ్లపై మాత్రం 8 నుంచి 12% వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. దీనికి గ్యారంటీ కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరాలకు అనుగుణంగా..కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసమో, వర్కింగ్ క్యాపిటల్ కోసమో లేదా అధిక వడ్డీపై తీసుకున్న రుణాలను తీర్చేసేందుకో నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లను కార్పొరేట్ బాండ్లుగా పిలుస్తారు. అంటే ఈ బాండును కొనుక్కున్న వాళ్లు, సదరు కంపెనీకి నిర్దిష్ట కాల వ్యవధికి అప్పు ఇచి్చనట్లు లెక్క. దీనికోసం ఆ కంపెనీ మధ్య మధ్యలో (అంటే నెల, మూడు నెలలు, వార్షికంగా..) వడ్డీ చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తీరాక అసలును చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేటును బాండ్ల పరిభాషలో కూపన్ రేటుగా వ్యవహరిస్తారు. కూపన్ కాకుండా సాధారణ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండు విలువ కూడా పెరగవచ్చు. ఆ విధంగా వడ్డీతో పాటు, పెట్టిన పెట్టుబడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బాండ్ ఫండ్స్.. ప్రతి బాండును క్షుణ్నంగా అధ్యయనం చేసి, సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం కష్టతరంగా అనిపించే వారి కోసం బాండ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల్లో కనీసం 80 శాతం మొత్తాన్ని అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ఉండి, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిప్పన్ ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కార్పొరేట్ బాండ్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కార్పొరేట్ బాండ్ ఫండ్, కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్, యాక్సిస్ కార్పొరేట్ బాండ్ ఫండ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇవి వార్షికంగా సగటున ఏడు శాతానికి పైగా రాబడులు అందించాయి. ఇవి 2–5 ఏళ్ల కాలవ్యవధికి అనువుగా ఉంటాయి. ఇదీ.. బాండ్ పరిభాష.. కూపన్ రేటు: కంపెనీ చెల్లించే వడ్డీ ఈల్డ్: ధరల్లో మార్పుల వల్ల చేతికి అందే మొత్తం రాబడి క్రెడిట్ రేటింగ్: తిరిగి చెల్లించడంలో కంపెనీకి ఉండే సామర్థ్యం మెచ్యూరిటీ: అసలును తిరిగి చెల్లించే సమయం లిక్విడిటీ: బాండ్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించే వీలు కొన్ని రిస్క్ లుంటాయి .. అధిక రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లే ఈ బాండ్లలో రిస్క్ లు కూడా ఉంటాయి. సాధారణంగా బ్యాంకుల్లో రూ.5 లక్షలలోపు చేసే డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుంచి బీమా రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ బాండ్లకు అలాంటిదేమీ ఉండదు. వాటి ధరలు కూడా వడ్డీ రేట్లను బట్టి ప్రభావితమవుతూ ఉంటాయి. పైపెచ్చు ఆ కంపెనీ తాలూకు క్రెడిట్ రేటింగ్ను బట్టి కూడా మారుతుంటాయి. ఇష్యూ చేసే కంపెనీ క్రెడిట్ రేటింగ్, వడ్డీ రేట్లను బట్టి మారిపోతుంటాయి. ఎక్కడ కొనొచ్చు.. జిరోధా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, ఏంజెల్ వన్, అప్స్టాక్స్ ెలాంటి బ్రోకరేజ్ ప్లాట్ఫాంలతో పాటు ఇండియా బాండ్స్, బాండ్ బజార్, గ్రిప్ ఇన్వెస్ట్లాంటి సెబీ రిజిస్టర్డ్ ప్లాట్ఫాంల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు.. తమకు కావాల్సిన కార్పొరేట్ బాండ్లను ఎంచుకుని, కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు, అమ్మకం లావాదేవీలను బట్టి స్వల్ప చార్జీలు ఉంటాయి. ప్లాట్ఫాంను బట్టి కనీస పెట్టుబడి రూ. 1,000 నుంచి ఉంటోంది. కొనుక్కున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో డీమ్యాట్ ఖాతాలోకి బాండ్లు క్రెడిట్ అవుతాయి. ఎంచుకోవడం ఇలా.. తీసుకున్న మొత్తాన్ని ఆ కంపెనీ తిరిగి సక్రమంగా చెల్లించగలదా లేదా అనేది ఇన్వెస్టర్లు తెలుసుకునేందుకు వీలుగా ఇక్రా, క్రిసిల్, కేర్ లాంటి రేటింగ్ ఏజెన్సీలు .. ఏ ప్లస్, ఏఏ, ట్రిపుల్ ఎ, బి ప్లస్ అంటూ బాండ్లకు రకరకాల రేటింగ్ ఇస్తాయి. దీన్ని బట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా ట్రిపుల్ ఏ నుంచి ట్రిపుల్ బి మైనస్ వరకు రేటింగ్ ఉన్న వాటిని అత్యంత సురక్షితమైనవిగా, డబుల్ బీ ప్లస్ నుంచి బీ మైనస్ వరకు రేటింగ్ను ఒక మోస్తరు రిస్కు ఉన్నవాటిగా పరిగణిస్తారు. షేర్ల మాదిరిగానే ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో ఇవి ట్రేడవుతూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని విక్రయించుకోవచ్చు, కొనవచ్చు కూడా.ఎవరికి అనువైనవంటే.. → మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా అంటే ఏడాది నుంచి సుమారు పదేళ్ల వ్యవధికి గాను స్థిరంగా ఆదాయాన్ని అందించే సాధనాల కోసం చూస్తుంటే → బ్యాంక్ డిపాజిట్లకే పరిమితం కాకుండా ఇతరత్రా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులను డైవర్సిఫై చేయదల్చుకుంటే → ఎఫ్డీలకు మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నా... రిటైర్మెంట్ తరువాత స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని కావాలనుకుంటున్నా → పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకుంటున్న తల్లిదండ్రులు... పెద్దగా రిస్క్ లను ఇష్టపడకుండా ఎఫ్డీలు కాకుండా ఇతర సాధనాలను చూస్తున్నవారికిరేటింగ్ బట్టి రాబడి.. AAA: తక్కువ రిస్కు : 7–8 శాతం AA: మధ్య స్థాయి రిస్కు : 8–9.5 శాతం A: అధిక రిస్కు : 10–12 శాతం -
ట్యాక్స్ అయిపోయింది.. ఇక భారీ మార్పులు వీటిలోనే..
భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాటిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఇప్పటివరకు ఆదాయ పన్ను రేట్లు, వస్తు..సేవల పన్నుల (జీఎస్టీ) క్రమబద్ధీకరణ తదితర సంస్కరణలను అమలు చేసినట్లు ఆమె వివరించారు. ఇక కస్టమ్స్ డ్యూటీ రేట్లను క్రమబదీ్ధకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్లో దీనిపై ప్రకటనలు ఉండొచ్చని ఆమె వివరించారు. గత రెండేళ్లుగా కస్టమ్స్ సుంకాన్ని తాము గణనీయంగా తగ్గించామని తెలిపారు.అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పోటీతత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్ విధానాల్లో ఆధునీకరణ అత్యవసరమైందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని మంత్రి సూచించారు. సరుకుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడం, పేపర్లెస్ విధానాలను మరింత విస్తరించడం, రిస్క్ మేనేజ్మెంట్ను మెరుగుపరిచే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతులు, దిగుమతుల సంబంధిత ఖర్చులు తగ్గి దేశీయ పరిశ్రమలకు మరింత అవకాశాలు కలుగుతాయని తెలిపారు.అదేవిధంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశ ర్యాంకును మెరుగుపరిచేందుకు కస్టమ్స్ విభాగం కీలకంగా మారబోతోందని ఆమె అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పారదర్శకమైన, అంచనాలు స్పష్టంగా ఉండే కస్టమ్స్ విధానాలు ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపార వర్గాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనలోకి తీసుకుని రాబోయే బడ్జెట్లో వాటికి అనుగుణంగా విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ఆమె వెల్లడించారు. -
దేశంలో ధరలు తగ్గుతాయ్..!
సాక్షి, హైదరాబాద్: దేశంలో నిత్యావసరాలు, ఇతర వస్తువులు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయట. ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులు, గృహోపకరణాలు, సేవల రంగాల్లో ధరలు గణనీయంగా తగ్గుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెపుతోంది. గత అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (కన్సూ్యమర్ ప్రైస్ ఇండెక్స్–సీపీఐ) కనిష్టంగా 0.25 శాతానికి పడిపోవడమే అందుకు ప్రధాన కారణం. ఆహార ధరల్లో భారీ తగ్గుదల, జీఎస్టీ రేట్లలో కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణలు, ద్రవ్య విధానంలో ఆర్బీఐ తీసుకున్న చర్యలు మొదలైనవి ద్రవ్యోల్బణాన్ని తగ్గించాయి. రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన ‘హౌస్హోల్డ్ ఇన్ఫ్లుయేషన్ ఎక్స్పెక్టేషన్స్ సర్వే’ కూడా ఇదే విషయాన్ని చెపుతోంది. నవంబర్ 1–10 వరకు 19 నగరాల్లో 6,061 కుటుంబాలపై చేసిన ఈ సర్వేలో భవిష్యత్తులో వినియోగదారులపై ధరల ఒత్తిడి మరింత తగ్గుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత ద్రవ్యోల్బణంపై కుటుంబాల మధ్యస్థ అంచనా సెప్టెంబర్తో పోలిస్తే 80 బేసిస్ పాయింట్లు తగ్గి 6.6 శాతానికి చేరింది. రాబోయే మూడు నెలలలో ధరలు పెరుగుతాయన్న భావన 7.6 శాతానికి, ఒక సంవత్సర అంచనా 8 శాతానికి పడిపోయింది. సర్వే సందర్భంగా భిన్న వయసు్కలు, వివిధ ఆదాయ స్థాయి, వృత్తులకు సంబంధించిన వర్గాల్లో కూడా ధరలపై ఒత్తిడి తగ్గిన భావన స్పష్టంగా కనిపించిందని ఆర్బీఐ పేర్కొంది. ధరల పట్ల ఎక్కువ సున్నితంగా స్పందించే గృహిణులు, పింఛనుదారుల్లోనూ ఇదే ధోరణి కనిపించడం విశేషం. ఇది వినియోగదారుల విశ్వాసం పెరుగుతున్న సంకేతంగా ఆర్బీఐ పేర్కొంది. ఆహార ధరలే సీపీఐ తగ్గుదలకి కారణం అక్టోబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం సుమారు –5% వరకు పడిపోవడం సీపీఐ తగ్గుదలకి ప్రధాన కారకంగా నిలిచింది. కూరగాయలు, ఉల్లిపాయలు, పప్పులు, ధాన్యాలు, నిత్యావసర పదార్థాల ధరలు మార్కెట్లో గణనీయంగా తగ్గాయి. సరఫరా మెరుగుదల, రవాణా ఖర్చుల తగ్గుదల, వరుసగా మంచి పంటలు రావడం వంటి అంశాలు ఈ తగ్గుదలకి దోహదపడ్డాయి. అలాగే సెపె్టంబర్ చివరి వారం నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ రేట్ల సవరణలు వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనాన్ని అందించాయి. ప్యాకేజ్డ్ ఫుడ్స్, దినసరి వినియోగ వస్తువులు, గృహోపకరణాలపై పన్ను రేట్లు తగ్గించడంతో మార్కెట్లో ధరలు తగ్గాయి. జీఎస్టీ స్లాబ్ సులభతరం చేయడం వల్ల వ్యాపారులపై ఉండే పన్ను భారం తక్కువై, దాని ప్రభావం రిటైల్ ధరలపై పడింది.ఆర్బీఐ–ఎంపీసీ చర్యలతో వృద్ధికి ఊపిరిద్రవ్యోల్బణం కనిష్టానికి తగ్గడంతో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఇటీవల రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకువచి్చంది. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకి నిధులు పొందగలుగుతాయి. ఫలితంగా, గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యాపార రుణాలు కూడా తక్కువ వడ్డీకి లభించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వడ్డీ రేట్ల స్థాయిలు తగ్గడం ఆర్థిక వృద్ధికి అవసరమైన వినియోగ వ్యయాలను పెంచుతుందని ఆర్బీఐ అభిప్రాయపడుతోంది. 2 శాతం నుంచి 3 శాతం మధ్యలో ద్రవ్యోల్బణం ఉండడం, 8 శాతం వృద్ధి సాధ్యమవుతుండటం భారత ఆర్థిక వ్యవస్థకు అరుదైన బంగారు దశగా చెపుతోంది. కనిష్ట ద్రవ్యోల్బణం మరిన్ని విధాన సడలింపులకు వీలు కల్పిస్తుందని పేర్కొంది.పట్టణ, గ్రామీణ వినియోగదారుల్లో ఆశావాదం .. ఆర్బీఐ నిర్వహించిన ‘కన్సూ్యమర్ కాని్ఫడెన్స్ సర్వే’ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ‘ప్రస్తుత పరిస్థితి సూచీ’ కూడా 96.9 నుంచి 98.4కి మెరుగుపడినట్లు ఆర్బీఐ తెలిపింది. భవిష్యత్తులో ధరలు పెద్దగా పెరగవని భావించే కుటుంబాల సంఖ్య పెరగడంతో ‘ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్’ కూడా స్వల్పంగా పైకి రాగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ భవిష్యత్తుపై వినియోగదారుల నమ్మకం పెరిగిందని తెలిపింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో తగ్గడం, జీఎస్టీ ప్రభావం, సరఫరా పరిస్థితుల మెరుగుదల, ఆర్బీఐ విధానాలు... ఇలా అన్నీ కలిసి రాబోయే నెలల్లో ధరలు మరింత తగ్గుతాయన్న సంకేతాలనిస్తున్నాయి. దేశంలోని సగటు కుటుంబాలు కూడా ఇదే అంచనాతో ముందుకు సాగుతున్నట్లు ఆర్బీఐ చెపుతోంది. ఆహార వస్తువుల సరఫరా స్థిరంగా కొనసాగితే, నిత్యావసరాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. -
‘రూపాయి’ని అలా చూడొద్దు: నిర్మలా సీతారామన్
కొనసాగుతున్న రూపాయి పతనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు స్పందన వచ్చింది. యూఎస్ డాలర్తో రూపాయి మారక విలువ కొన్ని రోజులుగా రికార్డ్ కనిష్టాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇటీవల ఆల్ టైమ్ కనిష్ట స్థాయి రూ .90.43కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రూపాయి ఇటీవలి కదలికలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ మొదటి స్పందనను అందించారు.హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో మాట్లాడుతూ.. రూపాయి విలువలో భారీ జోక్యం చేసుకోకుండా మార్కెట్ శక్తులకు వదిలివేయాలన్నారు. మారకం రేట్లు "చాలా సున్నితమైనవి" అన్నారు. కరెన్సీ కదలికలను అతిగా రాజకీయం చేయడం లేదా అతిగా నిర్వహించడం గురించి ఆమె హెచ్చరించారు. అవి ప్రపంచ ఒత్తిళ్లకు త్వరగా స్పందిస్తాయని పేర్కొన్నారు.ఆర్థిక ప్రాథమికాంశాలు ముఖ్యంనేటి రూపాయి స్థాయిలను గత పరిస్థితులతో పోల్చకుండా 2026 ఆర్థిక సంవత్సరంలో 7% లేదా అంతకంటే ఎక్కువ అంచనా వేసిన భారతదేశ ప్రస్తుత వృద్ధి పథంపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్ పరిశీలకులను కోరారు.పూర్తిగా ప్రతికూలం కాదురూపాయి బలహీనమైనప్పుడల్లా పూర్తిగా ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. రూపాయి విలువ క్షీణించినప్పుడు ఎగుమతిదారులు తరచుగా ప్రయోజనం పొందుతారని, ఎందుకంటే ఇది భారతీయ వస్తువులను విదేశాలలో మరింత పోటీగా మారుస్తుందని ఆమె పేర్కొన్నారు. -
ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్
అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్ బ్యాంక్ తాజాగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను తగ్గించింది. ఆరు నెలల తదుపరి పావు శాతం కోత పెట్టడంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. యూఎస్ టారిఫ్ల సవాళ్ల నేపథ్యంలో ఎకానమీకి జోష్నిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీసింది. వివరాలు చూద్దాం..ముంబై: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా మొగ్గు చూపింది. ఫలితంగా రెపో రేటులో 0.25 శాతం కోత పడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో తాజాగా 5.25 శాతానికి క్షీణించింది. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత దిగివచ్చేందుకు దారి ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల కొద్ది నెలలుగా యూఎస్ వాణిజ్య టారిఫ్లతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నునిస్తూ బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం ఎంపీసీ వెసులుబాటు కల్పించింది. తాజా పరపతి సమీక్షలో తటస్థ విధానాలు అవలంబించడం ద్వారా భవిష్యత్లోనూ రేట్ల కోతకు వీలున్నట్లు సంకేతాలిచి్చంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్బీఐ నాలుగుసార్లు కోత విధించడం ద్వారా రెపో రేటును 5.25 శాతానికి చేర్చింది. అంటే 2025 ఫిబ్రవరి నుంచి 1.25 శాతంమేర దిగివచి్చంది. ప్రభుత్వ ప్రోత్సాహానికితోడుగా.. ఇప్పటికే యూఎస్ టారిఫ్లతో దేశీ ఎగుమతులు నీరసించగా.. వాణిజ్య లోటు పెరిగింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లకు చెక్ పెట్టే బాటలో మరింత లిక్విడిటీ ద్వారా రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్బీఐ సంకల్పించింది. తద్వారా సమర్థవంత ఆర్థిక పురోగతికి అండగా నిలిచే నిర్ణయాలను ప్రకటించింది. ఇప్పటికే మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్టీ రేట్లలో సంస్కరణలు, కారి్మక చట్టాలు, ఫైనాన్షియల్ రంగ నిబంధనల సరళీకరణ ద్వారా జీడీపీకి జోష్నిచ్చే చర్యలను చేపట్టింది. వెరసి ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆర్బీఐ నిర్ణయాలు జత కలవనున్నాయి. రూ. లక్ష కోట్లు ఇలా ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తాజా పాలసీలో పేర్కొంది. రెండు దశలలో అంటే ఈ నెల 11న రూ. 50,000 కోట్లు, 18న మరో రూ. 50,000 కోట్లు విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దన్నుగా ఈ నెల 16కల్లా 5 బిలియన్ డాలర్ల విలువైన మూడేళ్ల డాలర్–రూపీ కొనుగోళ్లు–అమ్మకాల స్వాప్ను చేపట్టనుంది. సీజనల్గా బ్యాంకింగ్ వ్యవస్థ ఎదుర్కొంటున్న లిక్విడటీ సమస్యలకు ఈ చర్యలు పరిష్కారం చూపనున్నట్లు ఆర్బీఐ తెలియజేసింది. రూపాయిపై కల్పించుకోం..ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కదలికలపై ఎలాంటి ధరల శ్రేణినీ లక్ష్యంగా పెట్టబోమని మల్హోత్రా తెలియజేశారు. దేశీ కరెన్సీ దిద్దుబాటును అడ్డుకోబోమని స్పష్టం చేశారు. రూపాయికి సరైనస్థాయిని మార్కెట్టే నిర్ణయిస్తుందని తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి 90కు పతనమైన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.బ్యాలన్స్చేస్తూ ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. మరోపక్క అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం భారీగా క్షీణిస్తోంది. దీంతో లక్ష్యానికంటే దిగువకు ధరలు జారుతున్నాయి. వెరసి వృద్ధి– ధరల సమతౌల్యానికి చర్యలు తీసుకుంటున్నాం. వృద్ధి పరిస్థితులను కొనసాగించేందుకు వీలుగా పాలసీ నిర్ణ యాలతో మద్దతిస్తున్నాం. బయటినుంచి సవాళ్లు ఎదు రవుతున్న నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తావించదగ్గస్థాయిలో నిలకడను చూపుతూ వృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. ధరలు వెనకడుగు వేయడంతో వృద్ధికి వీలైన చర్యలు తీసుకునేందుకు వీలు చిక్కుతోంది. – సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్ఈఎంఐలు తగ్గనున్నాయ్ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్బీఐ నాలుగుసార్లు కీలక వడ్డీ రేటును తగ్గించింది. దీంతో రెపో రేటు 1.25 శాతంమేర దిగివచి్చంది. ఇప్పటికే 1 శాతంవరకూ రెపో తగ్గడంతో ప్రధానంగా గృహ రుణ వినియోగదారులకు భారీగా కలసిరానుంది. ప్రామాణిక రుణ వడ్డీ రేటు(ఈబీఎల్ఆర్) ఆధారిత గృహ రుణాలపై ఈఎంఐ మొత్తం తగ్గనుంది. ఇప్పటికే గృహ రుణ రేట్లు సుమారుగా 9 శాతం నుంచి 7.5 శాతంవరకూ దిగివచ్చాయి. ఇదేస్థాయిలో రేట్లు కొనసాగితే ఉదాహరణకు రూ. 50 లక్షల రుణంపై రూ. 9 లక్షలవరకూ ఆదాకానున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేశాయి. 20 ఏళ్లకాలానికి 8.5 శాతం వడ్డీ రేటులో రూ. 50 లక్షల గృహ రుణం తీసుకుంటే నెలకు రూ. 43,400 చొప్పున ఈఎంఐ చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే తాజా తగ్గింపు పూర్తిగా వర్తిస్తే అంటే 7.25 శాతానికి రుణ రేటులో కోతపడితే ఈఎంఐ చెల్లింపులో దాదాపు మరో రూ. 4,000 తగ్గే వీలుంది. ఇలాకాకుండా రూ. 43,400 చొప్పున చెల్లింపులు కొనసాగిస్తే.. 3 ఏళ్లకుపైగా వాయిదాల మొత్తం తగ్గవచ్చని అభిప్రాయపడ్డాయి.కార్పొరేట్లు సైతం ఖుషీరెపో రేటు దిగిరావడంతో వ్యక్తిగత రుణాలతోపాటు.. కార్పొరేట్ రంగానికీ లబ్ధి చేకూరనుంది. ఆర్బీఐ నుంచి తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు రెపో. వెరసి రెపో తగ్గడంతో బ్యాంకులు ఆమేర తమ కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపును బదిలీ చేయవలసి ఉంటుంది. ఇది ఎంసీఎల్ఆర్, బేస్ రేటు తదితరాల ఆధారంగా తీసుకునే వ్యక్తిగత, వాహన, గృహ, బిజినెస్ రుణాలన్నిటికీ వర్తించనుంది. వెరసి రుణాలు మరింత చౌకకానున్నాయి. ఇది రుణాలకు డిమాండ్ను పెంచడంతో వినియోగం ఊపందుకునే వీలుంది. ఇది ఇండ్రస్టియల్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ రంగాల అమ్మకాలలో వృద్ధికి దారి చూపుతుందని, ఫలితంగా ఉపాధి కల్పన సైతం మెరుగుపడే వీలున్నదని ఆర్థికవేత్తలు వివరించారు. ఆటో రంగ జోరు వడ్డీ రేటు కోత ఇటీవల ఆటో రంగ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది. జీఎస్టీ సంస్కరణలతో వడ్డీ రేట్ల తగ్గింపు జత కలవడం ఇందుకు తోడ్పాటునిస్తుంది. అందుబాటులో రుణాలతో వినియోగం బలపడుతుంది. – శైలేష్ చంద్ర, ఆటో పరిశ్రమల అసోసియేషన్(సియామ్) ప్రెసిడెంట్ కొత్తవాళ్లకు పుష్ గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు మరింతమంది ప్రజలు సొంత ఇళ్లవైపు ఆలోచించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. ఇంతవరకూ నిర్ణయం తీసుకోని వ్యక్తులు, కుటుంబాలు గృహ కొనుగోలుకి ముందడుగు వేసే వీలుంది. – రియల్టీ రంగ సమాఖ్యలు క్రెడాయ్, ఎన్ఏఆర్ఈడీసీవో(నరెడ్కో)లక్ష్యాలివీ ఈ ఏడాదికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఆర్బీఐ తాజాగా 2.6% నుంచి 2 శాతానికి కుదించింది. మరోపక్క జీడీపీ వృద్ధిపై గత అంచనా 6.8 శాతాన్ని 7.3 శాతానికి మెరుగుపరచింది. అరుదుగా ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 2.2 శాతానికి పరిమితంకావడం.. దేశ జీడీపీ 8 శాతం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ఇలా అరుదుగా జరుగుతుందని తెలియజేశారు. -
ఇదో అవకాశంగా చూడాలి.. ఆర్బీఐ గవర్నర్
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావాన్ని చూపడంలేదని, దీన్ని ఎగుమతి రంగం ఒక అవకాశంగా మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల అనంతరం విలేకరులతో మాట్లాడిన మల్హోత్రా, భారతదేశం ప్రధానంగా దేశీయ డిమాండ్పై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కాబట్టి యూఎస్ సుంకాల ప్రభావం గణనీయంగా ఉండదని స్పష్టం చేశారు. అయినప్పటికీ, లేబర్ ఇంటెన్సివ్ రంగాలపై ప్రభావం కనిపిస్తున్నట్లు ఆయన అంగీకరించారు.సుంకాల పెరుగుదల, ఎగుమతుల తగ్గుదలఆగస్టు 1 నుంచి అమెరికా 25 శాతం సుంకాలు విధించగా, ఆగస్టు 27 నుంచి రష్యా నుంచి ఇంధన దిగుమతుల కారణంగా అదనంగా 25 శాతం సుంకాలు అమలు చేసింది. ఏప్రిల్ 2న ప్రారంభమైన 10 శాతం సుంకాలు ఆగస్టు చివరి నాటికి 50 శాతానికి చేరాయి. ఈ పరిణామాల వల్ల భారత్ తన అతిపెద్ద విదేశీ మార్కెట్ అయిన అమెరికాకు చేసే ఎగుమతులు గణనీయంగా తగ్గాయి.గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) నివేదిక ప్రకారం, మే నుంచి అక్టోబర్ 2025 వరకు భారత ఎగుమతులు 28.5 శాతం తగ్గి, 8.83 బిలియన్ డాలర్ల నుంచి 6.31 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ సుంకాల వల్ల రత్నాలు, ఆభరణాలు, టెక్స్టైల్స్, గార్మెంట్స్, కెమికల్స్, సీఫుడ్ వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలు 31.2 శాతం తగ్గుదలను నమోదు చేశాయి. జీటీఆర్ఐ ప్రకారం, స్మార్ట్ఫోన్ ఎగుమతులు 36 శాతం, కెమికల్స్ 38 శాతం తగ్గాయి.ఆర్బీఐ వృద్ధి అంచనా పెంపుఎంపీసీ సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి తీసుకొచ్చింది. మల్హోత్రా జీడీపీ వృద్ధి అంచనాను 7.3 శాతానికి పెంచారు. ఇన్ఫ్లేషన్ 2 శాతానికి పడిపోయినప్పటికీ ఎగుమతుల తగ్గుదల రెండో అర్ధ సంవత్సరంలో వృద్ధిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఎగుమతి సంఘాలు, జీటీఆర్ఐ వంటి సంస్థలు ప్రభుత్వాన్ని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ను త్వరగా అమలు చేయాలని సూచించాయి. అమెరికాతో చర్చలు వేగవంతం చేయాలని కోరుతున్నాయి.ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి.. -
ఆర్బీఐ వడ్డీ రేటు పావు శాతం కోత
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీలక నిర్ణయాలను శుక్రవారం ప్రకటించింది. కీలకమైన రెపో రేటును పావు శాతం తగ్గించింది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేశారు. విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే కీలక వడ్డీ రేటును తగ్గంచింది. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 5.5 శాతం నుంచి 5.25 శాతానికి దిగివచ్చింది.రెపో రేటు కోత నిర్ణయాన్ని పాలసీ కమిటీలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం మూడు రోజుల సమీక్ష ముగిసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈ రోజు ఆర్బీఐ గరవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.లిక్విడిటీని పెంచడానికి రూ .1 లక్ష కోట్ల ఓఎంఓ, 3 సంవత్సరాల డాలర్-రూపాయి కొనుగోలు-అమ్మకం మార్పిడిని ప్రకటించారు. బ్యాంకింగ్ వ్యవస్థకు తగినంత మన్నికైన లిక్విడిటీని అందించడానికి సెంట్రల్ బ్యాంక్ కట్టుబడి ఉంది' అని ఆర్బీఐ గరవర్నర్ తెలిపారు. భారతదేశ విదేశీ మారక నిల్వలు 686 బిలియన్ డాలర్ల వద్ద ఆరోగ్యకరంగానే ఉన్నాయని వివరించారు.ద్రవ్యోల్బణం అక్టోబర్లో అత్యంత కనిష్ట స్థాయి 0.3 శాతానికి దిగిరావడం రెపో రేటు తగ్గింపునకు వీలు కల్పిస్తుందని కొందరు ఆర్థికవేత్తలు భావించారు. అదే సమయంలో జీడీపీ వృద్ధి క్యూ2లో 8.2 శాతానికి బలపడడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్న కారణంగా రూపాయి బక్కచిక్కుతున్న వేళ.. యథాథత స్థితిని కొనసాగించొచ్చన్నది మరికొందరు విశ్లేషించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్బీఐ రెపో రేటును ఒక శాతం తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే.రెపో రేటు తగ్గింపుపై నిపుణుల స్పందనడిపాజిటర్లలో ఆందోళనస్థిర-ఆదాయ సాధనాలపై రాబడి తగ్గే అవకాశం ఉండడంతో 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు డిపాజిటర్లలో ఆందోళన కలిగించవచ్చు. ఈ నిర్ణయం రాబోయే నెలల్లో బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గించడానికి ప్రేరేపిస్తుంది. ఏదేమైనా, ఈ వాతావరణం సంపన్న పెట్టుబడిదారులను రియల్ ఎస్టేట్-ఫోకస్డ్ కేటగిరీ 2 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (AIF) ల వంటి అధిక-దిగుబడినిచ్చే మార్గాల వైపు నెట్టివేస్తుంది.- అంకుర్ జలాన్, గోల్డెన్ గ్రోత్ ఫండ్ సీఈఓరియల్ ఎస్టేట్కు ఊపురేట్ల తగ్గింపు కొనసాగుతున్న రియల్ ఎస్టేట్ పెరుగుదలకు బలమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రుణ ఖర్చుల తగ్గింపు గృహ రుణాలను మరింత అందుబాటుగా మారుస్తుంది. కొత్తవారితోపాటు ఇప్పటికే ఉన్న రుణగ్రహీతలకు ఈఎంఐలు తగ్గుతాయి. డెవలపర్లు, మెరుగైన లిక్విడిటీ, వేగవంతమైన ప్రాజెక్ట్ అమలు, అధిక-డిమాండ్ మార్కెట్లలో కొత్త లాంచింగ్ల నుండి ప్రయోజనం పొందుతారు.- లలిత్ పరిహార్, ఐజీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గృహ కొనుగోలుదారులకు మేలుఇప్పటికే హౌసింగ్ మార్కెట్ మందగమనంలో ఉన్న నేపథ్యంలో రెపో రేటు తగ్గింపు సరిగ్గా బదిలీ అయితే పెరుగుతున్న ఆస్తి ధరల ప్రభావాన్ని ఎదుర్కోవడంలో గృహ కొనుగోలుదారులకు సహాయపడుతుంది. మరింత మంది గృహ కొనుగోళ్లకు ముందుకు రావడానికి ప్రోత్సహిస్తుంది. డెవలపర్లు కూడా తక్కువ రుణ భారం నుండి ప్రయోజనం పొందుతారు. ఇది ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది.- విజయ్ హర్ష్ ఝా, వీఎస్ రియల్టర్స్ ఫౌండర్ & సీఈఓస్వాగతించదగినదిఆర్బీఐ నిరంతర రేట్ల తగ్గింపు స్వాగతించదగినది. తక్కువ గృహ రుణ రేట్లు, పెరుగుతున్న ధరల నుండి కొనుగోలుదారులకు చాలా అవసరమైన ఉపశమనాన్ని అందిస్తాయి. డెవలపర్లు కూడా ఈ అభివృద్ధి చెందుతున్న డిమాండ్ ల్యాండ్ స్కేప్ కు ప్రయోజనం పొందుతారు.- సమీర్ జసుజా, ఫౌండర్ & సీఈఓ, ప్రాప్ఈక్విటీ -
రష్యాకి మరిన్ని ఎగుమతులపై దృష్టి
వాణిజ్య లోటును భర్తీ చేసుకునే దిశగా రష్యాకు ఎగుమతులను మరింతగా పెంచుకోవడానికి ఆస్కారం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. వినియోగ వస్తువులు, ఆహారోత్పత్తులు, వాహనాలు, ట్రాక్టర్లు, భారీ వాణిజ్య వాహనాలు, స్మార్ట్ఫోన్స్ లాంటి ఎల్రక్టానిక్స్ మొదలైన విభాగాల్లో అవకాశాలు ఉన్నాయని ఇరు దేశాల వ్యాపార వర్గాలతో భేటీలో ఆయన పేర్కొన్నారు.ద్వైపాక్షిక వాణిజ్యం 70 బిలియన్ డాలర్లకు చేరుకుందని మంత్రి తెలిపారు. అమెరికా భారీ టారిఫ్లను భారత్, పాశ్చాత్య దేశాల ఆంక్షలను రష్యా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమీప భవిష్యత్తులో వాణిజ్య అసమానతలను తొలగించుకునే దిశగా కలిసి పని చేయాల్సి ఉందని పేర్కొన్నారు.2024–25లో రష్యాకు భారత్ ఎగుమతులు 4.96 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 63.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2023–24లో 56.89 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్య లోటు 59 బిలియన్ డాలర్లకు చేరింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్దేశించుకున్నాయి. భారత పర్యటనకి వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బృంద సభ్యుడు, ప్రెసిడెన్షియల్ ఆఫీస్ డిప్యుటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మ్యాక్సిమ్ ఒరెష్కిన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారత్ నుంచి ఫార్మా, వ్యవసాయం, టెలికం పరికరాల్లాంటి ఆరు విభాగాల్లో ఎగుమతులు పెరిగేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు సున్నితంగా మారిన తరుణంలో భారత్లో పుతిన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
భారత వృద్ధి 7.4 %
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచాలను పెంచుతున్నట్టు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ ప్రకటించింది. 2025–26లో 6.9 శాతం వృద్ధి నమోదుకావొచ్చన్న గత అంచనాను 7.4 శాతానికి పెంచింది. ఈ ఏడాది ప్రైవేటు వినియోగం వృద్ధికి ప్రధాన చోదకంగా ఉన్నట్టు వివరించింది. దీనికి తోడు ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణలతో సెంటిమెంట్ మెరుగుపడినట్టు తెలిపింది. ద్రవ్యోల్బణం గణనీయంగా దిగిరావడంతో ఆర్బీఐ డిసెంబర్ సమీక్షలో మరో పావు శాతం రెపో రేటును తగ్గించి, 5.25 శాతం చేయొచ్చని అంచనా వేసింది. 2025లో 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) తగ్గింపునకు ఇది అదనమని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో (క్యూ1) 7.8 శాతం, సెప్టెంబర్ త్రైమాసికంలో (క్యూ2) 8.2 శాతం చొప్పున జీడీపీ వృద్ధి నమోదు కావడంతో ఫిచ్ రేటింగ్స్ తన అంచనాలను సవరించినట్టయింది. కాకపోతే ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి రేటు కొంత నిదానించొచ్చని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) భారత్ జీడీపీ వృద్ధి 6.4 శాతానికి తగ్గుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఆర్థిక పరిస్థితులు సరళంగా మారితే వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవచ్చని పేర్కొంది. అక్టోబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 0.3 శాతానికి తగ్గడం తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ కింద 375 ఉత్పత్తులపై రేట్లు తగ్గడం ఇందుకు అనుకూలించింది. -
నేడే ఆర్బీఐ ఎంపీసీ నిర్ణయాలు
ముంబై: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తన కీలక నిర్ణయాలను శుక్రవారం ప్రకటించనుంది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొందరు విశ్లేషకులు యథాతథ స్థితినే కొనసాగించొచ్చని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం అక్టోబర్లో అత్యంత కనిష్ట స్థాయి 0.3 శాతానికి దిగిరావడం రెపో రేటు తగ్గింపునకు వీలు కల్పిస్తుందని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అదే సమయంలో జీడీపీ వృద్ధి క్యూ2లో 8.2 శాతానికి బలపడడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళుతున్న కారణంగా రూపాయి బక్కచిక్కుతున్న వేళ.. యథాథత స్థితిని కొనసాగించొచ్చన్నది కొందరి విశ్లేషణగా ఉంది. ఈ అంచనాల నడుమ ఆర్బీఐ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్బీఐ రెపో రేటును ఒక శాతం తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే. సీఆర్ఆర్ను సైతం ఒక శాతం తగ్గించడంతో 3 శాతానికి దిగొచ్చింది. -
రిటైల్ ఇన్వెస్టర్లు స్మార్ట్గురూ!
ఈ కేలండర్ ఏడాది(2025) మార్చి మొదలు రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపట్ల కొంతమేర విముఖతను ప్రదర్శిస్తున్నారు. దీంతో అప్పుడప్పుడూ కొనుగోళ్లకు కట్టుబడినప్పటికీ అడపాదడపా విక్రయాలకే అధిక ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇదే బాటలో గత రెండు నెలల్లో మరింత అధికంగా పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ద్వారా స్మార్ట్గా వ్యవహరిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. కొద్ది నెలలుగా ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ కదులుతున్నాయి. ఇటీవలే ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 86,100 పాయింట్లు, ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 26,300ను అధిగమించాయి. ఈ బాటలో గత రెండు నెలల్లోనూ హెచ్చుతగ్గుల మధ్య లాభాలు ఆర్జించాయి. అక్టోబర్లో ఇండెక్సులు 4.5 శాతం పుంజుకోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్(100) 5.8 శాతం, స్మాల్ క్యాప్(100) 4.7 శాతం చొప్పున ఎగశాయి. ఈ ప్రభావంతో నవంబర్లోనూ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ మరింత బలపడినప్పటికీ స్మాల్ క్యాప్ 3 శాతం క్షీణించింది. సరిగ్గా ఇదే సమయంలో అంటే గత రెండు నెలల్లో రిటైల్ ఇన్వెస్టర్లు ఉమ్మడిగా రూ. 23,405 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఈ ట్రెండ్ ఇప్పటివరకూ 2025 పొడవునా కనిపించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. అప్రమత్తతతో.. నిజానికి మార్కెట్లు బలపడుతున్నప్పుడు విక్రయాలకు ప్రాధాన్యమిస్తూ వచి్చన రిటైలర్లు దిద్దుబాటుకు లోనైనప్పుడు కొనుగోళ్లు చేపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా దేశీ స్టాక్స్పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అయితే మరోపక్క ఇదే సమయంలో దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్) పెట్టుబడులను కొనసాగించడం ప్రస్తావించదగ్గ అంశం! వివిధ పథకాలలో కొంతమంది రిటైలర్లు సిప్ల ద్వారా పెట్టుబడులు కొనసాగించడం మ్యూచువల్ ఫండ్లకు దన్నుగా నిలుస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రధానంగా స్వల్పకాలిక పెట్టుబడుల విషయంలో రిటైలర్లు అప్రమత్తతతో వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు. అధిక విలువల్లో కొనుగోలు చేసిన షేర్ల విషయంలోనూ మార్కెట్ల తీరు ఆధారంగా కొద్దిపాటి నష్టాలకు లేదా లాభాలకు అమ్మకాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మరోపక్క అంతగా లాభాలకు ఆస్కారం లేదనిపించిన దీర్ఘకాలిక పెట్టుబడులపైనా ఇదే ధోరణి అనుసరిస్తున్నట్లు వివరించారు. ఐపీవోలలోనూ 2025లో ప్రైమరీ మార్కెట్లు సరికొత్త రికార్డులు సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 96 ఇష్యూలు రూ. 1.6 లక్షల కోట్లు సమీకరించాయి. అయితే రిటైలర్లు ఐపీవోలో లిస్టింగ్ లాభాలకోసమే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో లిస్టింగ్ రోజునే అత్యధిక శాతం ఇన్వెస్టర్లు హోల్డింగ్స్ విక్రయించడం ద్వారా పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేశారు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
7 ట్రిలియన్ డాలర్లకు గ్రీన్ ఎకానమీ
అంతర్జాతీయ గ్రీన్ ఎకానమీ (పర్యావరణ అనుకూల రంగాలు) విలువ 2030 నాటికి వార్షికంగా 7 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) అంచనా వేసింది. ఇప్పటికే ఇది 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించినట్టు తెలిపింది. భారత్ పునరుత్పాదక విద్యుత్ పరంగా అధిక వృద్ధిని నమోదు చేస్తుందని పేర్కొంది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్తో కలసి రూపొందించిన నివేదికను విడుదల చేసింది.పర్యావరణ అనుకూల ఆర్థిక వ్యవస్థతో ఎన్నో రంగాల్లోని వ్యాపారాలు ప్రయోజనం పొందుతున్నట్టు తెలిపింది. పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరిస్తున్న కంపెనీలు లబ్ది పొందుతున్నట్టు వివరించింది. ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ, వైవిధ్యమైన పర్యావరణ పరిస్థితుల్లోనూ గ్రీన్ టెక్నాలజీలపై పెట్టుబడులు గరిష్ట స్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. సంప్రదాయ వ్యాపార మార్గాల కంటే పర్యావరణ అనుకూల వ్యాపార ఆదాయాలు కలిగిన కంపెనీలు మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక వివరించింది.సంప్రదాయ కంపెనీల కంటే పర్యావరణ అనుకూల వ్యాపారాల ఆదాయాలు రెండు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నాయని, అలాగే నిధుల వ్యయాలు కూడా పర్యావరణ అనుకూల వ్యాపార కంపెనీలకు తక్కువగా ఉంటున్నట్టు పేర్కొంది. దీంతో ఈ కంపెనీలు 12–15 శాతం అధిక ప్రీమియాన్ని క్యాపిటల్ మార్కెట్లలో పొందుతున్నట్టు తెలిపింది. దీర్ఘకాలంలో ఈ కంపెనీల లాభాలు బలంగా కొనసాగుతాయన్న నమ్మకం ఇన్వెస్టర్లలో ఉండడమే దీనికి కారణమని వివరించింది.పునరుత్పాదక విద్యుత్లో భారత్ టాప్ పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుదుత్పత్తి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 9 శాతం పెరుగుతుంటే, 13 శాతం వృద్ధితో భారత్ అగ్రస్థానంలో ఉన్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక వెల్లడించింది. చైనాలో వృద్ధి 12 శాతంగా ఉన్నట్టు తెలిపింది. చాలా ప్రాంతాల్లో ఏటా 10 శాతం వృద్ధి నమోదవుతుందంటూ.. 16 శాతం వృద్ధితో భారత్ ముందుంటుందని అంచనా వేసింది. 15 శాతం వృద్ధితో చైనా తర్వాతి స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. 2019 నుంచి 2024 వరకు భారత్, చైనాలో పర్యావరణ అనుకూల ఇంధనాలపై ఏటా 12 శాతం చొ3ప్పున పెట్టుబడులు పెరిగినట్టు వెల్లడించింది. భారత్లో పునరుత్పాదక విద్యుదుత్పత్తి విభాగంలో ‘రెన్యూ’ కంపెనీని ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా 28 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని ఈ సంస్థ కలిగి ఉన్నట్టు తెలిపింది. -
మళ్లీ పడిపోయిన రూపాయి
భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో భారత రూపాయి మారక విలువ మళ్లీ పడిపోయింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం చుట్టూ ఉన్న నిరంతర ఈక్విటీ అవుట్ ఫ్లోలు, అనిశ్చితి కారణంగా డిసెంబర్ 4న రూపాయి 22 పైసలు పడిపోయింది.కీలకమైన రూ.90 మార్కును అధిగమించి మునుపటి సెషన్ ను ముగించిన తర్వాత డాలర్తో రూపాయి విలువ గురువారం రూ.90.41 వద్ద ప్రారంభమైంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిమిత జోక్యం కూడా కరెన్సీని ఒత్తిడిలో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూపాయి తగ్గితే ఏమౌతుంది? -
ఆర్బీఐ వడ్డీ రేటును తగ్గిస్తుందా?
ఆర్బీఐ ఎంపీసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని రేటింగ్ సంస్థ కేర్ఎడ్జ్ అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గడంతోపాటు, జీడీపీ వృద్ధి బలంగా కొనసాగుతుండడం రేట్ల కోతకు అనుకూలించొచ్చని పేర్కొంది. ఈ నెల 5న ఆర్బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను ప్రకటించనుండడం తెలిసిందే. ద్రవ్యోల్బణం దశా బ్ద కనిష్ట స్థాయి అయిన 0.3 శాతానికి అక్టోబర్లో తగ్గినట్టు కేర్ ఎడ్జ్ గుర్తు చేసింది.ఆర్బీఐ లక్ష్యం అయిన 4 శాతానికి ఇది ఎంతో దిగువన ఉందని, దీంతో పాలసీ రేట్ల తగ్గింపునకు వెసులుబాటు ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతంగా ఉంది. ‘‘బ్రెంట్ ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలు ఉండడం రబీ సాగుకు అనుకూలం. చైనాలో తయా రీ అధికంగా ఉండడంతో ధరలు పెరిగే ఒత్తిళ్లు లేవు. ద్రవ్యోల్బణం ఇక్కడి నుంచి గణనీయంగా పెరగకుండా ఇవి సాయపడతాయి’’అని తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ద్వితీయార్ధంలో వృద్ధి నెమ్మదించొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 8.2 శాతానికి విస్తరించగా.. ద్వితీయ ఆరు నెలల్లో (క్యూ3, క్యూ4) వృద్ధి రేటు 7 శాతానికి నెమ్మదించొచ్చని కేర్ ఎడ్జ్ అంచనా వేసింది. అమెరికా టారిఫ్లు అమల్లోకి రావడానికి ముందుగా చేసిన అధిక ఎగుమతులు, పండుగల అనంతరం వినియోగం తగ్గడం వంటివి వృద్ధి రేటును నెమ్మదింపజేస్తాయని పేర్కొంది.కాకపోతే పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే 12 నెలల్లో 3.7 శాతంలోపు ఉండొచ్చని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య చర్చలు దీర్ఘకాలం పాటు కొనసాగుతుండడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. విదేశీ మారకం నిల్వలు బలంగానే కొనసాగుతున్నట్టు, నవంబర్ మధ్య నాటికి 27 బిలియన్ డాలర్లు పెరిగి 693 బిలియన్ డాలర్లకు చేరినట్టు తెలిపింది. -
రూపాయి.. 90కి జారిపోయి..
దిగుమతులు, విదేశీ చదువులు, పర్యటనల భారాన్ని పెంచేస్తూ అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకీ కిందికి జారిపోతోంది. బుధవారం తొలిసారి ఏకంగా 90 స్థాయిని దాటేసి సెంచరీ దిశగా పతన పరుగును మరింత వేగం చేసింది. డాలరుతో రూపాయి విలువ ఈ ఏడాది అయిదు శాతం పడిపోయింది. 2030 నాటికి రూపాయి సెంచరీ కొట్టేసే అవకాశం ఉందంటూ కేంబ్రిడ్జ్ కరెన్సీస్లాంటి ఆర్థిక సేవల సంస్థలు అంచనా వేస్తున్నాయి. రేపటి (శుక్రవారం) వెలువడే సమీక్షలో కీలక పాలసీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గిస్తే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మరింత వెల్లువెత్తి రూపాయి పాతాళానికి పడిపోయే అవకాశం ఉందని పరిశీలకులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న రూపాయి కారణంగా ఆర్బీఐ పని కష్టతరంగా మారిందని నిపుణులు అంటున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం రూపాయి పతనాన్ని తేలికగా తీసిపారేస్తున్నారు, దీని గురించి పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదని అంటున్నారు. రూపాయి పతనం ఎగుమతిదారులకు ప్రయోజనమే అయినప్పటికీ దిగుమతిదారులకు మాత్రం భారంగా మారుతోంది.ముంబై: అమెరికా డాలర్లకు దిగుమతిదార్ల నుంచి డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజీలో రూపాయి మారకం విలువ బుధవారం ఒక దశలో ఆల్టైమ్ కనిష్ట స్థాయి 90.30ని తాకింది. చివరికి క్రితం ముగింపుతో పోలిస్తే 19 పైసలు క్షీణించి 90.15 వద్ద క్లోజయ్యింది. మంగళవారం సైతం 43 పైసలు పతనమై 89.96 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు ఎడతెగకుండా విక్రయిస్తుండటం, బలహీన ఈక్విటీ మార్కెట్లు, క్రూడాయిల్ రేట్లు పెరగడం వంటి అంశాలు దీనికి కారణం. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొనడం కూడా ఒత్తిడి పెంచింది. అయితే, డాలర్ ఇండెక్స్ కూడా బలహీనంగా ఉండటం వల్ల మరింత భారీగా పతనం కాకుండా కాస్త అడ్డుకట్ట పడింది. రాబోయే రోజుల్లో కూడా రూపాయి కొంత బలహీనంగానే ట్రేడ్ కావచ్చు. అయితే, డాలరు బలహీనపడి, డిసెంబర్లో ఫెడ్ రేట్ల కోత అవకాశాలు పెరిగితే రూపాయి కాస్త నిలదొక్కుకోవచ్చు’’ అని మిరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనుజ్ చౌదరి తెలిపారు. విదేశీ ఇన్వెస్టర్లు రిస్కుల జోలికి వెళ్లకుండా, క్రూడాయిల్ రేట్లు అధిక స్థాయిలోనే తిరుగాడుతూ ఉంటే సమీప భవిష్యత్తులో రూపాయిపై ఒత్తిడి కొనసాగవచ్చని, 89.50–91.20 శ్రేణిలో తిరుగాడవచ్చని ఆషికా గ్రూప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాహుల్ గుప్తా తెలిపారు. సాధారణమే.. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి పతనం సాధారణ విషయంగా మారిపోయిందని కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ నీలేష్ షా చెప్పారు. ‘‘మన వాణిజ్య భాగస్వాములతో పోలిస్తే ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉంది. ఉత్పాదకత తక్కువగా ఉంది. ఈ అసమానతల కారణంగా 2–3 శాతం క్షీణించడం సహజమే’’ అని పేర్కొన్నారు. స్వల్పకాలికంగా పెట్టుబడుల ప్రవాహంలో హెచ్చుతగ్గులనేవి కరెన్సీ స్థాయిని ప్రభావితం చేసినప్పటికీ, శాశ్వత ప్రాతిపదికన రూపాయి పెరగడానికి అవకాశాలు లేవన్నారు. ఒకవేళ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరినా ఇదే స్థాయిలో కొనసాగవచ్చని చెప్పారు. రూపాయి మారకాన్ని మార్కెట్ శక్తులకు విడిచిపెట్టి, తీవ్ర ఒడిదుడుకులను కట్టడి చేసేందుకు మాత్రమే ఆర్బీఐ జోక్యం చేసుకోవడం సరైన విధానమేనని పేర్కొన్నారు.పతనానికి మరిన్ని కారణాలు.. → ముడి చమురు ధరలు అధిక స్థాయిలో తిరుగాడుతుండటం → ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం → కరెన్సీ క్షీణతను అడ్డుకునేందుకు ఆర్బీఐ ప్రయత్నాలేమీ చేయకపోవడంఆందోళన అక్కర్లేదు: సీఈఏ రూపాయి క్షీణత విషయంలో ప్రభుత్వమేమీ ఆందోళన చెందడం లేదని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ చెప్పారు. దీనివల్ల ద్రవ్యోల్బణం, ఎగుమతులపై తీవ్ర ప్రతికూల ప్రభావమేమీ లేదన్నారు. వచ్చే ఏడాది రూపాయి కాస్త మెరుగుపడొచ్చని సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ ఏడాది 100 బిలియన్ డాలర్లకు చేరొచ్చని నాగేశ్వరన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇది 81.04 బిలియన్ డాలర్లుగా ఉంది.ప్రతికూలం విదేశీ చదువులు విదేశీ టూర్లు , దిగుమతులు (రత్నాభరణాలు, ఎల్రక్టానిక్స్, ముడిచమురు, ఫార్మా రంగానికి కావల్సిన ముడిపదార్థాలు మొదలైనవి) విదేశీ లగ్జరీ కార్లు సానుకూలం ఎగుమతి ఆధారిత రంగాలు (ఐటీ పరిశ్రమ, ఆటో ఎగుమతులు, ఫార్మా, టెక్స్టైల్స్) రెమిటెన్సులు -
రూపాయి తగ్గితే ఏమౌతుంది?
భారత కరెన్సీ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే చరిత్రలో ఎప్పుడూ లేనంతగా పడిపోయి రూ.90 మార్క్ను దాటి 90.02 వద్ద ముగిసింది. బ్యాంకులు అధిక స్థాయిలో యూఎస్ డాలర్లను కొనుగోలు చేయడం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల అవుట్ ఫ్లోలు కొనసాగుతుండటం వంటివి రూపాయి పతనానికి కారణాలుగా నిలుస్తున్నప్పటికీ రూపాయి విలువ తగ్గడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది ఈ కథనంలో చూద్దాం..దిగుమతులు ఖరీదవుతాయి క్రూడ్ ఆయిల్, బంగారం, ఎలక్ట్రానిక్స్, మెడికల్ పరికరాలు వంటి దిగుమతి వస్తువుల ధరలు పెరుగుతాయి. దీని ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరుగుతాయి. ఇతర ఉత్పత్తుల రవాణా ఖర్చులు కూడా పెరుగుతాయి.ద్రవ్యోల్బణం పెరిగే అవకాశందిగుమతులు ఖరీదవడం వల్ల, ఆ ఖర్చులు వినియోగదారులపై పడతాయి. దీని కారణంగా సాధారణ ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలు పెరుగుతాయి.ప్రయాణ ఖర్చులు పెరుగుతాయివిదేశాలకు వెళ్ళేవారికి ఖర్చులు అధికమవుతాయి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు, జీవన వ్యయం ఇంకా ఖరీదవుతుంది.ఇంధనం ధరలు పెరిగి, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిభారత్ మొత్తం క్రూడ్ ఆయిల్లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది. ఆయిల్ ధర పెరగడంతో రవాణా, తయారీ, వ్యవసాయ ఖర్చులు కూడా పెరుగుతాయి.విదేశీ రుణాల వ్యయం పెరుగుతుందిసంస్థలు లేదా ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న రుణాలు రూపాయి బలహీనత వల్ల ఖరీదవుతాయి. వడ్డీ చెల్లింపులు పెరిగి, ఆర్థిక భారంగా మారుతాయి.విదేశీ పెట్టుబడులపై ప్రభావంరూపాయి పడిపోతే కొందరు విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఒడిదుడుకులకు గురవుతాయి.పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రభావంఒక దేశ కరెన్సీ చాలా బలహీనపడితే, గ్లోబల్ మార్కెట్లలో దేశ ఆర్థిక స్థిరత్వంపై సందేహాలు వచ్చి పెట్టుబడులు తగ్గవచ్చు.ఎగుమతిదారులకు కొంత లాభంరూపాయి బలహీనపడితే, భారతదేశం నుండి వస్తువులు కొనుగోలు చేసే విదేశీ క్లయింట్లకు అవి తక్కువ ఖర్చుతో అందుతాయి.టెక్స్టైల్, ఐటీ సేవలు, ఔషధాలు వంటి రంగాలకు కొంత ప్రయోజనం. -
క్రిప్టో తరహా ఆర్థిక ఉత్పత్తులతో సవాళ్లు
ఆర్థిక వ్యవస్థలు డిజటల్గా మారుతుండడం, క్రిప్టో, స్టెబుల్ కాయిన్లు తరహా కొత్త ఆర్థిక ఉత్పత్తులు పుట్టుకొస్తుండడంతో.. వీటి కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.లబ్ధిదారుల వివరాలు, పన్నుల సమాచారాన్ని సకాలంలో పంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ఇందుకోసం కృత్రిమ మేథ (ఏఐ) వంటి సాధనాలను వినియోగించుకోవాలని, దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. ఇందుకు వీలుగా అంతర్జాతీయ ఫోరమ్ కోసం మంత్రి సీతారామన్ పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రమాణాలను మరింత బలోపేతం చేయడంతోపాటు పంచుకున్న సమాచారం ఆధారంగా ఫలితాలు సాధించేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు.ఢిల్లీలో మంగళవారం 18వ గ్లోబల్ ఫోరమ్ ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి సీతారామన్ మాట్లాడారు. ఏ ఒక్క దేశం తనంతట తాను ఈ సవాళ్లను పరిష్కరించలేదన్నారు. సహకారం, విశ్వాసం, సకాలంలో సరైన సమాచారం పంచుకోవడం అవసమరన్నారు. స్పష్టమైన నిబంధనల మేరకు నడుచుకుంటే పన్నుల్లో పారదర్శకత, కచ్చితత్వం ఉంటుందన్నారు.గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో స్వచ్చంద నిబంధనల అమలు మెరుగుపడినట్టు మంత్రి చెప్పారు. సకాలంలో సమాచారాన్ని గుర్తించేందుకు ఏఐ తరహా టెక్నాలజీలు అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. ఆవిష్కరణలు అన్నవి జవాబుదారీగా ఉండాలంటూ.. ఇవి వ్యవస్థలకు బలాన్ని, విశ్వసనీయతను తెచ్చిపెట్టే విధంగా ఉండాలన్నారు. రహస్య సమాచారం.. డేటా గోప్యతకు సంబంధించి బలమైన వ్యవస్థల దిశగా దేశాలు కలసి పనిచేయాలని ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ పిలుపునిచ్చాన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంచుకునే సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించు కోవాలన్నారు. -
అయ్యో... రూ‘పాయే’
న్యూఢిల్లీ: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. స్పెక్యులేటర్ల నుంచి భారీగా షార్ట్ కవరింగ్, దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ కొనసాగడం దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. ఫలితంగా డాలర్ మారకంలో రూపాయి విలువ 43 పైసలు బలహీనపడి జీవితకాల కనిష్టం 89.96 వద్ద స్థిరపడింది. ఎఫ్ఐఐలు వరుస విక్రయాలు, అమెరికా–భారత్ల వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం తదితర అంశాలు సెంటిమెంట్ను దెబ్బతీశాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 89.70 వద్ద మొదలైంది. ఒక దశలో 47 పైసలు కుప్పకూలి 90.00 స్థాయి వద్ద ఇంట్రాడే రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. ‘‘సాంకేతికంగా రూపాయి 90 స్థాయిపై ముగిసినట్లయితే.., ఆ పైన స్థాయిల్లో బై–స్టాప్ ఆర్డర్లు మరిన్ని ఉండొచ్చు. కావున 90కి దిగువునే ఆర్బీఐ జోక్యం చేసుకోవాలి.లేకపోతే 91 స్థాయిని ఛేదించేందుకు మరెంతో సమయం పట్టదు. అంతంకంతా పెరుగుతున్న వాణిజ్య లోటు రూపాయిపై మరింత భారాన్ని పెంచుతోంది. అయితే డిసెంబర్లో వడ్డీరేట్ల తగ్గింపు, ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చనే ఆశావహ అంచనాలతో రానున్న రోజుల్లో రూపాయి 89.60 – 90.20 శ్రేణిలో ట్రేడవ్వచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ, కరెన్సీ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. -
భారత వృద్ధి రేటు అంచనాలు పెంపు.. ఎంతంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో భారత వృద్ధి రేటు అంచనాను ఏడు శాతానికి పెంచుతున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. అంతకుముందు 6.5% వృద్ధిని అంచనా వేసింది. 2025–26 ప్రథమార్ధంలో దేశీయ వృద్ధి రేటు అంచనాలకు మించి 8% వృద్ధి సాధించిన నేపథ్యంలో వృద్ధి అవుట్లుక్ను అప్గ్రేడ్ చేసింది. భారత వాస్తవ జీడీపీ వృద్ధి రెండో త్రైమాసికంలో 8.2 శాతంగా నమోదై, అంచనాలను మించిందని క్రిసిల్ ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు.ద్రవ్యోల్బణం దిగిరావడంతో నామినల్ జీడీపీ లేదా ప్రస్తుత ధరల వద్ద జీడీపీ వృద్ధి మోస్తారు స్థాయిలో 8.7%గా నమోదైంది. అమెరికా సుంకాల విధింపు ప్రభావంతో 2025–26 ద్వితీయార్ధంలో వృద్ధి 6.1 శాతానికి పరిమితం కావొచ్చని జోషి అంచనా వేశారు. ‘‘ప్రైవేటు వినియోగం వాస్తవ జీడీపీ వృద్ధికి ప్రధాన ఇంధనంగా నిలిచింది. సప్లై దృష్టి కోణంలో తయారీ, సేవల రంగాల్లో వృద్ధి గణనీయంగా పెరిగింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గడంతో స్వచ్ఛంద వినియోగ వ్యయం ఊపందుకుంది. మూడో క్వార్టర్లో ఈ అనుకూల పరిస్థితులు కలిసొస్తాయి. ప్రభుత్వ పెట్టుబడుల్లో స్థిరత్వం కొనసాగే వీలుంది. ప్రైవేటు పెట్టుబడులు ఆలస్యమైనప్పట్టకీ.., క్రమంగా పెరగొచ్చు’’ అని జోషి అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: తయారీపై ‘టారిఫ్ల’ ప్రభావం -
ఆరు నెలల గరిష్టానికి డీజిల్ విక్రయాలు
పండుగ సీజన్, జీఎస్టీ రేట్ల తగ్గింపు దన్నుతో ఎకానమీ పరుగులు తీసిన నేపథ్యంలో దేశీయంగా నవంబర్లో డీజిల్ అమ్మకాలు ఆరు నెలల గరిష్టానికి ఎగిశాయి. పెట్రోలియం ప్లానింగ్, అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా ప్రకారం వార్షిక ప్రాతిపదికన 4.7 శాతం పెరిగి 8.55 మిలియన్ టన్నులుగా నమోదైంది. మే నెల తర్వాత ఇది అత్యధిక స్థాయి. జూన్లో వర్షాకాలం మొదలైనప్పటి నుంచి సెపె్టంబర్ వరకు తగ్గుముఖం పట్టిన అమ్మకాలు అక్టోబర్లో తిరిగి కొంత పుంజుకుని 6.79 మిలియన్ టన్నులకు చేరుకోగా, నవంబర్లోనూ అదే ధోరణి కొనసాగింది.2023 నవంబర్ నాటి 7.52 మిలియన్ టన్నులతో పోలిస్తే తాజాగా 13.61 శాతం, కోవిడ్ పూర్వం 2019తో పోలిస్తే వార్షికంగా 2 శాతం మేర డీజిల్ వినియోగం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో డీజిల్ అమ్మకాలు వార్షికంగా 2.76 శాతం పెరిగి 61.85 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. మరోవైపు, నవంబర్లో పెట్రోల్ వినియోగం 2.19 శాతం పెరిగి 3.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. విమాన ఇంధనం వినియోగం 4.7 శాతం పెరిగి 7,83,000 టన్నులకు, ఎల్పీజీ విక్రయాలు 7.62 శాతం వృద్ధితో 3 మిలియన్ టన్నులకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఎనిమిది నెలల్లో పెట్రోల్ డిమాండ్ 6.25 శాతం పెరిగి 28.35 మిలియన్ టన్నులకు చేరింది.ఇదీ చదవండి: తయారీపై ‘టారిఫ్ల’ ప్రభావం -
తయారీపై ‘టారిఫ్ల’ ప్రభావం
తయారీ రంగం పనితీరు నవంబర్లో కొంత బలహీనపడింది. తొమ్మిది నెలల కనిష్ట స్థాయికి చేరింది. తయారీ రంగం పనితీరును సూచించే హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 56.6 పాయింట్లకు పరిమితమైంది. అక్టోబర్లో ఇది 59.2 పాయింట్లుగా ఉండడం గమనార్హం. సాధారణంగా 50కు పైన నమోదైతే, విస్తరణగానే పరిగణిస్తుంటారు.అమెరికా టారిఫ్లు తయారీ కార్యకలాపాల విస్తరణను నిదానించేలా చేసినట్టు నవంబర్ నెల పీఎంఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోందని హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. అంతర్జాతీయంగా విక్రయాలు సానుకూలంగా ఉన్నట్టు కంపెనీలు చెబుతున్నప్పటికీ.. ఆఫ్రికా, ఆసియా, యూరప్, మధ్య ప్రాచ్యంలోని క్లయింట్లకు అమ్మకాల్లో వృద్ధి కొంత నిదానించినట్టు చెప్పారు. కొత్త ఎగుమతి ఆర్డర్లు రాక 13 నెలల కనిష్టానికి చేరినట్టు ప్రంజుల్ భండారీ తెలిపారు. వ్యాపార విశ్వాసం సైతం నవంబర్లో పడిపోయినట్టు చెప్పారు. టారిఫ్ల ప్రభావంపై పెరిగిన ఆందోళనలను తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు.జీఎస్టీ కోత ఒక్కటీ చాలదు..‘జీఎస్టీ రేట్ల కోత ప్రభావం క్రమంగా ఆవిరవుతోంది. డిమాండ్పై టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇది చాలకపోవచ్చు’ అని భండారీ అభిప్రాయపడ్డారు. నవంబర్లో తయారీ వ్యయాలు, విక్రయ ధరలు ఎనిమిది నెలల కనిష్ట స్థాయిలో పెరిగాయి. తగ్గిన ఆర్డర్లకు అనుగుణంగా నియామకాలు, కొనుగోళ్ల ప్రణాళికలను సంస్థలు సవరించుకుంటున్నట్టు హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ రంగ పీఎంఐ సర్వేలో తెలిసింది. నియామకాలు 21 నెలల కనిష్ట స్థాయిలో పెరిగాయి. వచ్చే 12 నెలల కాలానికి తయారీ ఉత్పత్తిని పెంచుకుంటామన్న విశ్వాసం కంపెనీల్లో కనపించడగా, సానుకూల సెంటిమెంట్ మాత్రం మూడున్నరేళ్ల కనిష్టానికి పడిపోయింది. 400 తయారీ సంస్థలకు సంబంధించి పర్చేంజింగ్ మేనేజర్ల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను హెచ్ఎస్బీసీ ఇండియా విడుదల చేస్తుంటుంది.ఇదీ చదవండి: 13 నెలల కనిష్టానికి పారిశ్రామిక వృద్ధి -
13 నెలల కనిష్టానికి పారిశ్రామిక వృద్ధి
దేశ పారిశ్రామిక రంగం పనితీరు జోరు అక్టోబర్లో నిదానించింది. 13 నెలల కనిష్ట స్థాయిలో 0.4 శాతంగా నమోదైంది. విద్యుత్, మైనింగ్, తయారీ రంగాల్లో పనితీరు మందగించింది.పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 2024 అక్టోబర్లో 3.7 శాతం వృద్ధిని చూడడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటును గతంలో ప్రకటించిన 4 శాతం నుంచి 4.6శాతానికి సవరిస్తున్నట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. పారిశ్రామికోత్పత్తిలో భాగమైన తయారీరంగం అక్టోబర్లో 1.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 అక్టోబర్లో వృద్ధి 4.4 శాతం కంటే తక్కువ. మైనింగ్ రంగంలో ఉత్పత్తి 1.8 శాతం తగ్గింది. క్రితం ఏడాది అక్టోబర్లో 0.9 శాతం వృద్ధి చెందింది.విద్యుదుత్పత్తి సైతం 6.9% తగ్గింది. క్రితం ఏడా ది ఇదే నెలలో 2% వృద్ధిని చూడడం గమనార్హం. క్యాపిటల్ గూడ్స్లో ఉత్పత్తి 2.4 శాతం పెరిగింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో ఉత్పత్తి 0.5 శాతం తగ్గింది. క్రితం ఏడాది ఇదే నెలలో 5.5 శాతం వృద్ధి చెందడం గమనించొచ్చు. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లో ఉత్పత్తి 4.4 శాతం తగ్గింది. ఇన్ఫ్రా/కన్స్ట్రక్షన్ గూడ్స్లో 7.1 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు దేశ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2.7 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 4 శాతంగా ఉంది. -
జీఎస్టీ వసూళ్లు డీలా
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఆదాయం ఏడాది కనిష్టానికి పడిపోయింది. నవంబర్లో రూ.1,70,276 కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైంది. 2024 నవంబర్లో ఆదాయం రూ.1.69 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 0.7 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్లో మాత్రం స్థూల జీఎస్టీ వసూళ్లు అంతక్రితం ఏడాది ఇదే నెలతో (రూ.1.87 లక్షల కోట్లు) పోల్చి చూస్తే 4.6 శాతం అధికంగా రూ.1.95 లక్షల కోట్ల స్థాయిలో ఉండడం తెలిసిందే. జీఎస్టీలో శ్లాబులను కుదించడంతోపాటు, 375 వరకు ఉత్పత్తులను తక్కువ పన్ను శ్లాబులోకి మార్చడం తెలిసిందే. కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అక్టోబర్లో మెరుగైన ఆదాయానికి పండుగల సమయంలో కొనుగోళ్లు దోహదపడినట్టు, నవంబర్ నెల గణాంకాల్లో రేట్ల సవరణ ప్రభావం కనిపించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు జీఎస్టీ వసూళ్లు క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే 8.9 శాతం పెరిగి రూ.14,75,488 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లు 4 శాతం తగ్గి రూ.18,196 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లను మినహాయించి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం రూ.1.52 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. -
రక్షణ, ఆరోగ్య రంగాల్లో నిధులకు కేంద్రం ప్రయత్నం
జాతీయ భద్రత, ప్రజారోగ్య రంగాల కోసం అదనపు నిధులను సమీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ‘ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్ బిల్లు-2025’ను ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కీలక బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది.ఈ ప్రతిపాదిత సెస్ అనేది నిర్దిష్ట వస్తువుల ఉత్పత్తి, తయారీ యంత్రాలకు వర్తిస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. త్వరలో ముగియనున్న పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ను ఈ కొత్త సెస్ భర్తీ చేయనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా పొగాకు ఉత్పత్తులపై ఉన్నత స్థాయి జీఎస్టీ రేటును కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని సమాచారం.ఈ సెస్ను అమల్లోకి తీసుకువచ్చేందుకు జాతీయ భద్రత, ప్రజారోగ్యం అనే రెండు ప్రధాన అంశాలు కారణంగా ఉన్నాయి. ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటరీ స్థాయి ప్యానెల్ ‘ఫ్యూచర్ వార్ఫేర్ ఫండ్’ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. ఈ నిధిని సాయుధ దళాల్లో భవిష్యత్ యుద్ధ సాంకేతికతల అధ్యయనం కోసం ఉపయోగించాలని సూచించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రక్షణ కేటాయింపులు ఇప్పటికే రూ.6.18 లక్షల కోట్లు దాటాయి. ఈ సెస్ అమల్లోకి వస్తే మరింత నిధులు చేరే అవకాశం ఉంటుంది.ప్రజారోగ్యం, పథకాల విస్తరణఆయుష్మాన్ భారత్ వంటి కీలక ఆరోగ్య పథకాల విస్తరణకు అదనపు వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం దేశ జనాభాలోని 40 శాతం ప్రజలకు చెందిన సుమారు 55 కోట్ల మంది లబ్ధిదారులకు అంటే దాదాపు 12.37 కోట్ల కుటుంబాలకు ఏటా రూ.5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తోందని ప్రభుత్వ చెబుతుంది. 2025-26లో ఆరోగ్య రంగానికి సుమారు రూ.1 లక్ష కోట్ల వ్యయం అంచనా వేయగా, జాతీయ ఆరోగ్య విధానం ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని సిఫారసు చేస్తోంది. దాంతో ఈ సెస్ ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.సెంట్రల్ ఎక్సైజ్ చట్టం సవరణఈ కొత్త సెస్ బిల్లుతో పాటు, 1944కి చెందిన వలస పాలన కాలం సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ను కూడా ప్రభుత్వం సవరించనుంది. సవరణ అనంతరం ఎక్సైజ్ సుంకం కేవలం ముడి పెట్రోలియం, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్, సహజ వాయువు, పొగాకు ఉత్పత్తులకు మాత్రమే వర్తిస్తుందనే అంచనాలున్నాయి. దీనికి సంబంధించి ఇంకా సమగ్ర వివరాలు తెలియాల్సి ఉంది. పన్ను పరిధిని విస్తరించే ఉద్దేశం లేకపోయినా సమకాలీన ఆర్థిక అవసరాలకు అనుగుణంగా పాత చట్టాన్ని ఆధునీకరించడమే ఈ సవరణ లక్ష్యం అని ప్రభుత్వం పేర్కొంది.ఇప్పటికే అమలవుతున్న సెస్లుఆదాయపు పన్నుపై 4% హెల్త్, ఎడ్యుకేషన్ సెస్.పెట్రోల్, డీజిల్పై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్, రోడ్లు, మౌలిక సదుపాయాల సెస్.పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్.సాధారణంగా ఈ సెస్ల నుంచి వచ్చే ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తరచూ విమర్శలు వస్తున్నాయి.సరిహద్దు ఉద్రిక్తతలు, పెరుగుతున్న ఆరోగ్య డిమాండ్ల నేపథ్యంలో కేంద్రం ఈ రెండు కీలక రంగాలను సమానంగా బలోపేతం చేయాలని చూస్తోంది. అయితే సెస్లపై అధికంగా ఆధారపడటం వల్ల కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంబంధాలు, వినియోగదారులపై అదనపు భారం వంటి అంశాలపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రధాన చర్చాంశంగా మారనున్నాయి.ఇదీ చదవండి: ఉద్యోగాలు మట్టి కొట్టుకుపోతాయి!.. మస్క్ ఇంటర్వ్యూ -
వృద్ధి గుడ్.. మరి వడ్డీ రేట్లో?
మార్కెట్లు ఆల్టైమ్ రికార్డులకు అత్యంత చేరువలో ఉన్నాయి. గతంలో రెండుసార్లు మార్కెట్ ఈ స్థాయిలకు వచ్చి... అక్కడి నుంచి ముందుకు వెళ్లలేక కొంత కరెక్షన్కు గురయ్యింది. ఈ సారి మాత్రం మార్కెట్లు ముందుకెళ్ళి, కొత్త ఆల్టైమ్ గరిష్ఠ స్థాయిలను నమోదు చేసే అవకాశం ఉందనేది నిపుణుల మాట. గత వారం చివర్లో... అది కూడా మార్కెట్లు ముగిశాక విడుదలైన క్యూ2 జీడీపీ వృద్ధి గణాంకాలు మార్కెట్ను ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తాయన్నది వారి అభిప్రాయం. ఎందుకంటే వృద్ధి రేటు అంచనాలను మించింది. తయారీ, సర్వీసు రంగాలు 9 శాతం వృద్ధిని దాటి పరుగు తీయడంతో ఆరి్థక వ్యవస్థ 8.2 శాతం ఎగసింది. ఇది ఆరు త్రైమాసికాలలోనే అత్యధికం. కాబట్టి ఈ ప్రభావం సోమవారం మార్కెట్లలో ప్రతిఫలించనునున్న విశ్లేషకులు చెబుతున్నారు. యూఎస్ టారిఫ్ల నేపథ్యంలో జీఎస్టీ రేట్లను సవరించటమనేది దేశ ఆరి్థక వ్యవస్థ బలపడటానికి ఉపకరించినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. దేశీ కీలకాంశాలివే... → ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయబోయే దేశీయ అంశాల్లో ప్రధానమైనది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధానంపై జరిపే సమీక్షా సమావేశం. ఈ నెల 5న (వారాంతాన) ఈ సమావేశం ముగుస్తుంది. మరింతగా రేట్లను తగ్గించటమా... లేదా యథాతథ పరిస్థితిని కొనసాగించటమా అన్నది మార్కెట్లను ప్రభావితం చేయనుంది. వృద్ధి రేటు పెరిగింది కనక రేట్ల కోత ఉండొచ్చన్నదే ఎక్కువ మంది అభిప్రాయంగా కనిపిస్తోంది. → డిసెంబరు 1న (సోమవారం) అక్టోబర్ నెలకు సంబంధించిన దేశ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలవుతాయి. సెపె్టంబర్లో ఐఐపీ 4 శాతం వద్ద నిలకడగా నమోదైంది. తయారీ రంగం 4.8 శాతం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. → నవంబర్ నెలకు ఆటో రంగ విక్రయ గణాంకాలు సైతం 1న వెలువడనున్నాయి. దీంతో పాటు హెచ్ఎస్బీసీ తయారీ, సర్వీసులు, కాంపోజిట్ పీఎంఐ గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. సాంకేతికంగా స్పీడ్.. → గత వారం మొదట్లో దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనపడినప్పటికీ చివర్లో బౌన్స్ బ్యాక్ అయ్యాయి. దీంతో సరికొత్త గరిష్టాలను తాకాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 85707 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 26,203 పాయింట్ల వద్ద ముగిశాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం సైతం మార్కెట్లు మరింత పుంజుకునే వీలుంది. నిఫ్టీ 26,300 పాయింట్లను దాటితే.. 26,800– 26,850 వరకూ బలపడవచ్చు. ఇలాకాకుండా ఈ స్థాయిలో బలహీనపడితే.. తొలుత 26,000 పాయింట్లకు నీరసించవచ్చు. తదుపరి 25,850–25,800 పాయింట్ల స్థాయిలో సపోర్ట్ లభించే వీలుంది. గమనించాల్సిన ప్రధాన షేర్లు... అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారత్ ఎల్రక్టానిక్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లిమిటెడ్, గెయిల్ ఇండియా కంపెనీల షేర్లను గతవారం పలు బ్రోకరేజీ సంస్థలు రికమెండ్ చేశాయి. వీటి టార్గెట్ ధరను అప్గ్రేడ్ చేశాయి కూడా. దీంతో ఈ వారం ఇన్వెస్టర్లు ఈ షేర్లలో కదలికలను గమనించవచ్చు. -
భారత్ జీడీపీ వృద్ధి 6.6 శాతం
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్ జీడీపీ 2025–26లో 6.6 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. జీఎస్టీ సంస్కరణలతో అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ల ప్రభావాన్ని భారత్ అధిగమిస్తుందని తెలిపింది. ‘‘భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కొనసాగిస్తోంది. 2024–25లో 6.5 శాతం వృద్ధి అనంతరం, 2025–26 క్యూ1లో వాస్తవ జీడీపీ 7.8 శాతానికి విస్తరించింది’’అని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్య సాధనకు వీలుగా నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని సూచించింది. అంతర్జాతీయంగా సమస్యలు నెలకొన్నప్పటికీ దేశీయంగా సానుకూల పరిస్థితులతో వృద్ధి బలంగా ఉంటుందని అంచనా వేసింది. అమెరికా 50 శాతం టారిఫ్లు మరింత కాలం పాటు కొనసాగుతుతాయని అనుకుంటే అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 2025–26లో 6.6 శాతం, తర్వాతి ఆర్థిక సంవత్సరంలో (2026–27) 6.3 శాతానికి తగ్గుతుంది’’అని ఐఎంఎఫ్ పేర్కొంది. సమీప కాలంలో రిస్క్ లు ఆర్థిక వృద్ధికి సంబంధించి సమీప కాలంలో రిస్్కలు ఉన్నట్టు ఐఎంఎఫ్ తెలిపింది. కొత్త వాణిజ్య ఒప్పందాలను త్వరగా ముగించడం, దేశీయంగా నిర్మాణాత్మక సంస్కరణలను వేగంగా అమలు చేయడం, ప్రైవేటు పెట్టబుడులు, ఉపాధి అవకాశాలపై వృద్ధి వేగం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. భౌగోళికంగా సమస్యలు మరింత పెరిగితే కఠినతర ఆర్థిక పరిస్థితులకు దారితీయొచ్చని, అధిక ముడి సరుకుల ధరలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఎగుమతులు తగ్గడం వంటివి వృద్ధిని కిందకు తీసుకెళ్లే రిస్క్ లుగా ప్రస్తావించింది. ద్రవ్యోల్బణం చక్కని నియంత్రణలో ఉండడాన్ని గుర్తు చేసింది. ఆర్థిక, కార్పొరేట్ రంగాలు బలంగా ఉండడం, తగినంత నగదు నిల్వలు, వసూలు కాని మొండి రుణాలు కనిష్ట స్తాయికి చేరడాన్ని సానుకూలతలుగా పేర్కొంది. -
సెమీకండక్టర్ ల్యాబ్ కోసం రూ.4,500 కోట్లు
దేశంలోని ప్రభుత్వ రంగ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ అయిన సెమీకండక్టర్ ల్యాబొరేటరీ (ఎస్సీఎల్)ను వచ్చే మూడేళ్లలో పూర్తిగా ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.4,500 కోట్లు వెచ్చించనుంది. ఈమేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు.ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన ఎస్సీఎల్ ప్రస్తుతం అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు (ASICs), ఆప్టో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఎంఈఎంఎస్ పరికరాలకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈ సదుపాయం దేశంలోని ఏకైక ఇంటిగ్రేటెడ్ డివైస్ తయారీ యూనిట్గా గుర్తింపు పొందింది.‘రూ.76,000 కోట్ల ఇండియా సెమీకండక్టర్ మిషన్లో భాగంగా ఈ రూ.4,500 కోట్ల పెట్టుబడి తోడ్పడుతుంది. ఎస్సీఎల్ ఉత్పత్తిని మూడేళ్లలో 100 రెట్లు పెంచాలి’ అని మంత్రి అన్నారు. ప్లాంట్ విస్తరణ కోసం 25 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్రం పంజాబ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ‘పంజాబ్ ప్రభుత్వం ఎంత త్వరగా భూమి కేటాయిస్తే అంత త్వరగా ఎస్సీఎల్ విస్తరణ పూర్తవుతుంది. ఆధునీకరణ పనుల కోసం ఇప్పటికే టెండర్లు జారీ చేశాం’ అని మంత్రి అన్నారు. ప్రస్తుతం 180 నానోమీటర్ నోడ్లో చిప్లు తయారు చేస్తున్న ఎస్సీఎల్ను స్టార్టప్లకు ‘టేప్ అవుట్ ఫెసిలిటీ’గా మార్చనున్నారు. -
భారత్-రష్యా ఒప్పందాలపై అంచనాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారతదేశంలో పర్యటించనుండడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాలపై చర్చ జరుగుతోంది. సంప్రదాయంగా బలమైన మిత్ర దేశాలైన భారత్, రష్యాల మధ్య ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు.తగ్గిన చమురు కొనుగోళ్లు..రష్యా-ఉక్రెయిన్ వివాదం తరువాత అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా భారత్కు చౌకగా ముడి చమురును అందించింది. దీంతో భారత్ చమురు దిగుమతుల్లో రష్యా ప్రధాన సరఫరాదారుగా అవతరించింది. అయితే, ఇటీవల కాలంలో ధర పరిమితుల సమస్యలు, చెల్లింపుల విధానాల్లోని క్లిష్టత, దేశీయ అవసరాల సర్దుబాటు కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొంతమేరకు తగ్గించుకుంది. దాంతోపాటు భారత్పై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు కొనుగోళ్లు తగ్గాయి.భారత్-రష్యా స్నేహానికి ఆర్థిక మూలస్తంభంగా ఉన్న ఈ కొనుగోళ్ల తగ్గింపు రష్యాకు కొంత ఆర్థిక ఒత్తిడిని పెంచుతోంది. ఈ సమయంలో పుతిన్ పర్యటన జరగడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ పర్యటన కేవలం రక్షణ లేదా ఎనర్జీ రంగాలకే పరిమితం కాకుండా రష్యాకు వివిధ మార్గాల్లో చేదోడుగా నిలిచే కొత్త ఆర్థిక, వ్యూహాత్మక ఒప్పందాలను అన్వేషించేందుకు ఉపయోగపడనుంది.కీలక ఒప్పందాలపై అంచనా..భారత్కు రష్యా అతిపెద్ద రక్షణ భాగస్వామి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఒప్పందాలు ఈ రంగంలోనే కుదిరే అవకాశం ఉంది. S-400 ట్రయంఫ్ క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీలు, దాని భవిష్యత్తు నిర్వహణపై డీల్స్ కుదిరే అవకాశం ఉంది. AK-203 అసాల్ట్ రైఫిల్స్ తయారీకి సంబంధించిన వెంచర్లపై ఒప్పందం. అత్యాధునిక రక్షణ సాంకేతికత అభివృద్ధిలో సంయుక్త పరిశోధన, అభివృద్ధి డీల్స్ జరిగే అవకాశం ఉంది.చమురు, రక్షణ పరికరాల కొనుగోళ్ల విషయంలో డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడం ఇరు దేశాల లక్ష్యం. దీని కోసం దేశీయ కరెన్సీలైన రూపాయి, రూబుల్ ద్వారా చెల్లింపులు జరిపే సుస్థిర యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడంపై కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది రష్యాపై ఉన్న అంతర్జాతీయ చెల్లింపుల ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.అంతరిక్ష, అణు శక్తి సహకారంభారతదేశంలో రష్యన్ సాంకేతికతతో నిర్మిస్తున్న కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్ తదుపరి యూనిట్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు ఒప్పందాలు. గగన్యాన్ వంటి భారత అంతరిక్ష కార్యక్రమాలకు రష్యా సహకారం, సంయుక్త ఉపగ్రహ నిర్మాణ ప్రాజెక్టులపై చర్చలు జరిగే అవకాశం ఉంది.కొత్త డీల్స్చమురు కొనుగోళ్లు తగ్గిన నేపథ్యంలో రష్యా భారత్ నుంచి ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ప్రయోజనం పొందేందుకు కొన్ని కొత్త రకాల డీల్స్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆంక్షల ప్రభావం తక్కువగా ఉన్న రంగాలపై దృష్టి సారిస్తూ భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్ (ముఖ్యంగా జెనరిక్ మందులు), ఐటీ సేవలను పెద్ద ఎత్తున ఎగుమతి చేసుకునేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. రష్యా ఈ రంగాల్లో భారత్ను సుస్థిర సరఫరాదారుగా గుర్తించడానికి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.రవాణా కారిడార్లుఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్ఫోర్ట్ కారిడార్ కార్యకలాపాలను వేగవంతం చేయడంపై ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. ముంబైని రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్తో కలుపుతూ ఇరాన్ మీదుగా సాగే ఈ కారిడార్ పశ్చిమ దేశాల ద్వారా కాకుండా, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాన్ని అందిస్తుంది. ఇది రష్యా తన వస్తువులను ఇతర దేశాలకు తరలించడానికి కీలక వ్యూహాత్మక ప్రత్యామ్నాయం అవుతుంది.సహజ వాయువుచమురు కొనుగోళ్లు తగ్గినప్పటికీ రష్యా తన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) అమ్మకాలను భారత్లో పెంచేందుకు ప్రయత్నించవచ్చు. ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలోని ఇంధన ప్రాజెక్టుల్లో భారత పెట్టుబడులు పెంచేందుకు ఒప్పందాలు కుదరవచ్చు. ఈ డీల్స్ దీర్ఘకాలికంగా భారత్కు ఎనర్జీ సెక్యూరిటీను, రష్యాకు స్థిరమైన నిధులను అందిస్తాయి.ఇదీ చదవండి: వెండికి హాల్మార్కింగ్.. వజ్రాభరణాలపై ఫ్రేమ్వర్క్ -
అంచనాల్లో 52 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరికి రూ.8,25,144 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతం (15.69 లక్షల కోట్లు)గా ఉండొచ్చన్నది కేంద్రం అంచనా. ఇందులో మొదటి ఏడు నెలల కాలంలో 52.6 శాతానికి ద్రవ్యలోటు చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ద్రవ్యలోటు అంచనాల్లో 46.5 శాతంగా ఉండడం గమనార్హం. ప్రబుత్వ వ్యయాలు–ఆదాయం మధ్య అంతరమే ద్రవ్యలోటు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన డేటా ప్రకారం.. అక్టోబర్ చివరికి ప్రభుత్వానికి రూ.18 లక్షల కోట్ల ఆదాయం వచి్చంది. ఇందులో రూ.12.74 లక్షల కోట్లు పన్ను రూపంలో రాగా, రూ.4.89 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం. రుణేతర నిధుల వసూళ్లు రూ.37,095 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రాష్ట్రాలకు రూ.8,34,957 కోట్లను కేంద్రం బదిలీ చేసింది. వ్యయాలు రూ.26.25 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.20 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయాలు కాగా, రూ.6.17 లక్షల కోట్లు మూలధన వ్యయాలకు సంబంధించి ఉన్నాయి. -
జీడీపీ... జైత్రయాత్ర
న్యూఢిల్లీ: అంచనాలను మించి, విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తూ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలోనూ (క్యూ2) బలమైన పనితీరు చూపించింది. ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయిలో 8.2 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8 శాతం కంటే మరింత బలపడింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గనుండడంతో డిమాండ్ పుంజుకుంటుందన్న అంచనాల మేరకు పరిశ్రమలు ఉత్పత్తిని పెంచడం, పండుగల సీజన్లో పెరిగిన వినియోగ వ్యయాలు వృద్ధికి అండగా నిలిచాయి. క్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ2లో జీడీపీ వృద్ధి 5.6 శాతంగా ఉండడం గమనార్హం. 2023–24 జనవరి–మార్చి క్వార్టర్లో నమోదైన 8.4 శాతం పూర్వపు గరిష్ట వృద్ధిగా ఉంది. మరోసారి భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ కాలంలో 4.8% వృద్ధితో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఎన్ఎస్వో సెప్టెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలంలో జీడీపీ వృద్ధి 8 శాతంగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 6.1% కంటే ఎంతో మెరుగుపడింది. ముఖ్యాంశాలు.. → జీడీపీలో 57 శాతం వాటా కలిగిన ప్రైవేటు తుది వినియోగం 7.9 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 6.4 శాతంగా ఉంది. జూన్ త్రైమాసికంలో 7 శాతం వృద్ధి చెందడం గమనార్హం. → తయారీ రంగంలో 9.1% స్థాయిలో బలమైన వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే త్రైమా సికంలో ఈ రంగంలో వృద్ధి 2.2 శాతమే. ఆగస్ట్ 15న స్వాతంత్య్రదినం సందర్భంగా ప్రధాని జీఎస్టీ సంస్కరణలను ప్రకటించడంతో.. పెరిగే డిమాండ్కు అనుగుణంగా పరిశ్రమలు ఉత్పత్తిని పెంచడం ఇందుకు దారితీసింది. → సేవల రంగం లోనూ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నిపుణుల సేవలు సహా) 10.2 శాతానికి వృద్ధి బలపడింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసింకలో వృద్ధి 7.2 శాతంగా ఉంది. → దేశంలో ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న వ్యవసాయ రంగంలో మాత్రం వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సాగు రంగం 4.1 శాతం వృద్ధిని చూపించడం గమనార్హం. → ప్రభుత్వ వ్యయాలు క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2తో పోలి్చతే 2.7 శాతం తగ్గాయి. జూన్ త్రైమాసికంలో 7.4 శాతం పెరగడం గమనించొచ్చు. ప్రభుత్వ మూలధన వ్యయాలు క్యూ2లో 31 శాతం పెరిగాయి. జూన్ క్వార్టర్లో 52 శాతం పెరుగుదల కంటే తక్కువే. → రియల్ జీడీపీ (స్థిర ధరల వద్ద/ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసిన) సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.48.63 లక్షల కోట్లుగా ఉంది. 2024–25 క్యూ2లో రూ.44.94 లక్షల కోట్లతో పోలి్చతే 8.2 శాతం పెరిగింది. → నామినల్ జీడీపీ సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.85.25 లక్షల కోట్లుగా ఉంది. 2024–25లో రూ.78.40 లక్షల కోట్ల కంటే 8.7 శాతం వృద్ధి చెందింది. → వ్యత్యాసాలు ఏకంగా రూ.1.62 లక్షల కోట్లకు పెరిగాయి. వివిధ నమూనాల ఆధారంగా జీడీపీ గణనలో వచి్చన వ్యత్యాసాలు ఇవి. ఎంతో ప్రోత్సాహకరం 2025–26 క్యూ2లో 8.2 శాతం వృద్ధి రేటు అన్నది చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మేము చేపట్టిన సంస్కరణలు, వృద్ధి అనుకూల విధానాల ఫలితాన్ని సూచిస్తోంది. అంతేకాదు మన దేశ వ్యాపార సంస్థలు, ప్రజల కృషిని తెలియజేస్తోంది. మా ప్రభుత్వం సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ప్రతి పౌరుడి జీవనాన్ని మరింత సులభతరం చేస్తుంది – ప్రధాని నరేంద్ర మోదీదేశ ఆర్థిక శక్తికి నిదర్శనం జీడీపీ అంచనాలు బలమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక కార్యకలాపాల వేగాన్ని సూచిస్తున్నాయి. 2025–26 క్యూ2లో 8.2 శాతం రియల్ జీడీపీ వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. నిలకడైన ద్రవ్య స్థిరీకరణ, లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ పెట్టుబడులు ఉత్పాదకతను బలోపేతం చేశాయి. వ్యాపార సులభతర నిర్వహణను మెరుగుపరిచాయి. ప్రధాని ఆధ్వర్యంలో ఈ వృద్ధి జోరును కొనసాగించేందుకు, దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి అనుకూలించే సంస్కరణలను చేపట్టేందుకు కట్టుబడి ఉంది. – ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ -
ఊహించిన దాని కంటే మెరుగైన వృద్ధి
భారత ఆర్థిక వ్యవస్థ 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్) అనూహ్యంగా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 8.2 శాతానికి పెరిగింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 5.6% వృద్ధి కంటే గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఇది కొన్ని సర్వేలు అంచనా వేసిన 7.3 శాతం వృద్ధి రేటును మించిపోయింది.ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్ధీకరణ వస్తువుల వినియోగాన్ని పెంచుతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. కేర్ ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలు భారీగా వృద్ధి నమోదు చేశాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక సగటున 4.1% పెరిగింది (గత సంవత్సరం 2.7%), తయారీ ఉత్పత్తి 4.9% పెరిగింది (గత సంవత్సరం 3.3%) అన్నారు.మెరుగైన వ్యవసాయ ఉత్పత్తి కారణంగా గ్రామీణ వ్యయం పెరగడంతో ఆర్థిక వ్యవస్థలో సుమారు 60% వాటాను కలిగి ఉన్న గృహ వినియోగం బలపడింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ మూలధన వ్యయం 31% పెరిగింది. ఇది మునుపటి త్రైమాసికంలో 52% పెరుగుదల కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ, సంవత్సరం క్రితం నమోదైన 10% వృద్ధి కంటే మెరుగ్గా ఉంది.సరుకుల ఎగుమతులు 8.8% పెరిగాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 7% తగ్గుదలను ఈ గణాంకాలు తిప్పికొట్టాయి. యూఎస్ సుంకాల అమలు కంటే ముందు ఫ్రంట్ లోడెడ్ షిప్మెంట్ల ద్వారా ఈ పెరుగుదల నమోదైంది.జీఎస్టీ కోతలతో పెరిగిన డిమాండ్భారతదేశం సెప్టెంబర్ 22 నుంచి చాలా వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్లో ఇది వినియోగాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ జీఎస్టీ తగ్గింపులు అమల్లోకి రాకముందే గృహోపకరణాలు, కిరాణా సామాగ్రికి డిమాండ్ పెరిగినట్లు కొన్ని సంస్థలు నివేదికలు రూపొందించాయి. జీఎస్టీ పునర్వ్యవస్థీకరణ వల్ల సామాన్య ప్రజలకు రూ.2 లక్షల కోట్లు మిగులనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ అదనపు డబ్బు భవిష్యత్తులో వినియోగాన్ని మరింతగా పెంచడానికి దోహదపడుతుంది.ఆందోళన కలిగించే అంశాలుఅద్భుతమైన జీడీపీ వృద్ధి సాధించినప్పటికీ కొన్ని ఆందోళన కలిగించే అంశాలు కూడా ఉన్నాయని రాయిటర్స్ నివేదించింది. ముఖ్యంగా పట్టణ డిమాండ్, ప్రైవేట్ పెట్టుబడులు వెనుకబడుతున్నట్లు పేర్కొంది. గ్రామీణ డిమాండ్ పుంజుకున్నప్పటికీ స్థిరమైన, సమగ్రమైన వృద్ధికి పట్టణ డిమాండ్, ప్రైవేట్ రంగ పెట్టుబడుల పునరుద్ధరణ కూడా కీలకం.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి? -
ఆర్బీఐ కీలక వడ్డీ రేటు తగ్గింపు?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 5న జరగబోయే మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25 శాతానికి చేర్చే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఆహార ధరల పతనం, ఇటీవల వినియోగ వస్తువులపై ప్రకటించిన పన్ను తగ్గింపుల కారణంగా ద్రవ్యోల్బణం రికార్డు కనిష్ట స్థాయికి చేరుకుంది. దాంతో వినియోగానికి మద్దతు ఇవ్వడానికి ఆర్బీఐ రేటు తగ్గిస్తుందని భావిస్తున్నారు.రికార్డు కనిష్టానికి ద్రవ్యోల్బణంఅక్టోబర్లో భారతదేశ వినియోగదారుల ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 0.25%కి చేరుకుంది. ఇది సెంట్రల్ బ్యాంక్కు రేట్ల తగ్గింపునకు అవకాశం ఇస్తుంది. డాలర్తో పోలిస్తే రూపాయి 89.49 వద్ద కొత్త కనిష్టాన్ని తాకినప్పటికీ, దేశీయంగా బలహీనపడుతున్న డిమాండ్ను పెంచేందుకు ఆర్బీఐ మొగ్గు చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల విడుదలైన ఆర్థిక గణాంకాలు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఇంకా ఉందని సూచించాయని పేర్కొన్నారు. ఏడాది మొదటి అర్ధభాగంలో 100 బేసిస్ పాయింట్ల కోత తర్వాత ఆర్బీఐ ఆగస్టు నుంచి రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది.ఆర్థికవేత్తల అంచనాలునవంబర్ 18-26 మధ్య నిర్వహించిన రాయిటర్స్ పోల్లో 18 మంది ఆర్థికవేత్తలు ఆర్బీఐ తన డిసెంబర్ 3-5 పాలసీ సమావేశం ముగిసే సమయానికి రెపో రేటును 5.25 శాతానికి తగ్గిస్తుందని అంచనా వేశారు. మరో 18 మంది మాత్రం ఎలాంటి మార్పు ఉండదని భావించారు. డ్యూయిష్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ మాట్లాడుతూ ‘2025-2026 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాను మరింత సవరించే అవకాశం ఉన్నందున 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపు ఉంటుందనే అంచనాలున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి? -
జనన ధ్రువీకరణకు ఆధార్ చెల్లదు
ఆధార్ కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా లేదా పుట్టిన తేదీ రుజువుగా పరిగణించబోమని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. నకిలీ ధ్రువపత్రాల వినియోగాన్ని అరికట్టేందుకు, జనన, మరణాల నమోదు చట్టం (సవరణ) 2023కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.ఉత్తరప్రదేశ్లో..ఉత్తరప్రదేశ్లో ఆధార్ కార్డును పుట్టిన తేదీకి ఏకైక రుజువుగా అంగీకరించబోమని ప్రణాళిక శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘ఆధార్ కార్డుకు జనన ధ్రువీకరణ పత్రం జతఅవ్వదు. అందువల్ల దీన్ని బర్త్ సర్టిఫికేట్గా పరిగణించలేం’ అని ఆ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ అన్ని ప్రభుత్వ శాఖలకు ఈ ఉత్తర్వులను జారీ చేశారు.మహారాష్ట్రలో..మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహా ఉత్తర్వులు జారీ చేసింది. జనన ధ్రువీకరణ పత్రాల జారీలో ఆధార్ కార్డును కీలకంగా పరిగణించబోమని, జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం కేవలం ఆధార్ కార్డు ద్వారా జారీ చేసిన అన్ని జనన ధ్రువీకరణ పత్రాలను రద్దు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నకిలీ పత్రాలను చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా నిలిపివేయడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ఆధార్ కార్డులను ఉపయోగించి జారీ చేసిన అన్ని అనుమానాస్పద సర్టిఫికెట్లను రద్దు చేయాలని ఆదేశించారు. అంతేకాక, ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు.అక్రమ వలసదారులపై కఠిన వైఖరిమరోవైపు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా మేజిస్ట్రేట్లను ఆదేశించారు. శాంతిభద్రతలు, జాతీయ భద్రత తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలు అని, ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను సహించబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతి జిల్లా యంత్రాంగం తమ ప్రాంతంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేలా చూడాలని, నిబంధనల ప్రకారం చర్యలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే, చొరబాటుదారులకు ఆశ్రయం కల్పించేందుకు ప్రతి జిల్లాలో తాత్కాలిక నిర్బంధ కేంద్రాలను (డిటెన్షన్ సెంటర్లు) ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. అవసరమైన ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు విదేశీ పౌరసత్వం కలిగి ఉన్న అక్రమ వలసదారులను ఈ కేంద్రాల్లో ఉంచి తదుపరి వారి స్వస్థలాలకు పంపాలని తెలిపారు.ఇదీ చదవండి: ఐటీఆర్ ఫైలింగ్లో తప్పులు.. నోటీసులు వస్తే ఏం చేయాలి? -
త్వరలో 25 వేల మందికి ఐటీ మెసేజ్లు
న్యూఢిల్లీ: 2025–26 అసెస్మెంట్ ఇయర్కి (ఏవై) గాను దాఖలు చేసిన ఆదాయ పన్ను రిటర్నుల్లో విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించని వారికి ఆదాయ పన్ను శాఖ త్వరలో ఎస్ఎంఎస్లు/ఈ–మెయిల్స్ పంపించనుంది. చట్టపరమైన చర్యలను నివారించేందుకు 2025 డిసెంబర్ 31లోగా సవరించిన ఐటీఆర్ను దాఖలు చేయాలంటూ తొలి దశలో 25,000 ‘హై–రిస్్క’ కేసులుగా పరిగణిస్తున్న వారికి వీటిని పంపించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండో దశలో డిసెంబర్ మధ్య నుంచి మిగతా కేసులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వివరించాయి. ఆటోమేటిక్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (ఏఈఓఐ) కింద విదేశీ జ్యూరిస్డిక్షన్ల నుంచి వచి్చన సమాచారాన్ని బట్టి, విదేశాల్లో ఆస్తులున్నప్పటికీ ఆ వివరాలను వెల్లడించని నిర్దిష్ట ట్యాక్స్పేయర్లకు డిపార్ట్మెంట్ గతేడాది కూడా ఇలాగే ఎస్ఎంఎస్లు, ఈమెయిళ్లు పంపించింది. దీంతో నోటీసులు వచ్చిన వారు, రాని వారు మొత్తం మీద 24,678 మంది రూ. 29,208 కోట్ల విలువ చేసే విదేశీ అసెట్స్ వివరాలను పొందుపరుస్తూ సవరించిన ఐటీఆర్లను దాఖలు చేశారు. ఈ ఏడాది జూన్ వరకు ఆదాయ పన్ను శాఖ 1,080 కేసులను మదింపు చేసి, రూ. 40,000 కోట్లకు సంబంధించి డిమాండ్ నోటీసులు పంపింది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే తదితర నగరాల్లో పలు సోదాలు నిర్వహించింది. -
‘కేంద్రం లేబర్ కోడ్స్ మాకొద్దు’.. అందులో ఏముంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్స్ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని కేరళ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2020 నుంచి పెండింగ్లో ఉన్న మొత్తం నాలుగు లేబర్ కోడ్స్ను ఇటీవల నోటిఫై చేసింది. దశాబ్దాలుగా ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో ఈ కొత్త ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చారు.లేబర్ కోడ్స్లో చేసిన ముఖ్యమైన మార్పులుతొలిసారిగా గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం.దేశవ్యాప్తంగా కార్మికులందరికీ చట్టబద్ధమైన కనీస వేతనాలు అమలు.ఉద్యోగులందరికీ తప్పనిసరి నియామక పత్రాలు.అన్ని రంగాల్లో ఏకరీతి వేతన చెల్లింపు నియమాలు తీసుకురావడం.కేరళ వైఖరికేరళ కార్మిక శాఖ మంత్రి వి.శివన్ కుట్టి కేంద్ర కార్మిక కోడ్స్ను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. కేరళ ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న సీపీఐ(ఎం) ఈ కోడ్స్ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కోడ్స్ కార్మికుల దీర్ఘకాలిక హక్కులు, రక్షణలను పలుచన చేసేలా ఉన్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఈ కోడ్స్ కంపెనీల యజమానులకు అనుకూలంగా ఉండేలా రూపొందించినట్లు చెబుతోంది.ఈ కోడ్లు ఉపాధిని పెంచుతాయనే కేంద్ర ప్రభుత్వ వాదనను కేరళ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ కోడ్స్ లక్ష్యం కార్మిక హక్కులను రద్దు చేయడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం అని పేర్కొంది.ఈ కోడ్స్ కార్మికులు సమ్మె చేసే హక్కును హరించడానికి ప్రయత్నిస్తున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా మంత్రి శివన్ కుట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక వైఖరిని తీసుకోదని తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం జరుపుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ మూడో వారంలో తిరువనంతపురంలో కార్మిక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.లేబర్ కోడ్స్పై నిపుణులు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్మిక సంఘాలు, కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.తొలగింపు నియమాలు సడలింపు300 మంది వరకు కార్మికులు ఉన్న సంస్థలకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండానే లే-ఆఫ్లు లేదా తొలగింపు చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుంది. గతంలో ఈ పరిమితి 100 మంది కార్మికులుగా ఉండేది. దీనివల్ల సంస్థలు ఇష్టానుసారం ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.సమ్మె హక్కుపై పరిమితులుసమ్మెకు వెళ్లే ముందు 14 రోజుల నోటీసు తప్పనిసరి. ఈ నియమాలు సమ్మె హక్కును పరిమితం చేస్తాయని కార్మిక సంఘాల సామూహిక బేరసారాల శక్తిని బలహీనపరుస్తాయని ఆందోళన వ్యక్తం అవుతోంది.సామాజిక భద్రతపై అస్పష్టతగిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తున్నప్పటికీ ఈ నిధుల్లో కంపెనీల విరాళం చాలా తక్కువ (ఆదాయంలో 1-2%) ఉంది. ఇది వారి అవసరాలకు సరిపోదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.పని గంటలుఈ కోడ్ పని గంటలను రోజుకు 8 నుంచి 12 గంటలకు పెంచడానికి అనుమతిస్తుంది (వారానికి మొత్తం పని గంటల్లో మార్పు లేకపోయినా). ఇది కార్మికుల ఆరోగ్యం, శ్రేయస్సుకు హానికరం.స్థిర కాల ఉపాధిఉద్యోగులను ఏ రకమైన పనికైనా నిర్దిష్ట కాలానికి నియమించడానికి ఈ కోడ్లు అనుమతిస్తాయి. దీనివల్ల సంస్థలు రెగ్యులర్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు (గ్రాట్యుటీ, పెన్షన్ వంటివి) ఎగవేసి, ఎక్కువ మంది కార్మికులను తాత్కాలికంగా నియమించుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: రిచ్గా కనిపిస్తున్నారా? రిచ్గా మారుతున్నారా? -
రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకున్నాయి.గణనీయ పెరుగుదలనవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్నెఫ్ట్(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.తగ్గుముఖం పట్టే అవకాశంనవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం.. -
3 శాతం ‘నిమ్’ సాధిస్తాం
న్యూఢిల్లీ: ఆర్బీఐ ఎంపీసీ డిసెంబర్ సమీక్షలో రెపో రేటును పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తాము పెట్టుకున్న 3 శాతం నికర వడ్డీ మార్జిన్ (నిమ్) లక్ష్యాన్ని సాధిస్తామని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్లో రేటు కోత ఉంటే, అది పావు శాతం మించకపోవచ్చన్నది తమ అంచనా అని చెప్పారు. దీనివల్ల తమ మార్జిన్లపై పెద్ద ప్రభావం ఉండదన్నారు. రేటు తగ్గింపునకు అవకాశం ఉందని, ఈ విషయాన్ని గత సమీక్ష సందర్భంగానే పేర్కొన్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ వారం మొదట్లో ప్రకటించడం గమనార్హం. దినికితోడు స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా ఉండడంతో వచ్చే ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో రేట్ల కోత ఉంటుందన్న అంచనాలు పెరిగిపోయాయి. సెపె్టంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.5 శాతంగా, పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2025–26) 7 శాతంగా ఉండొచ్చని శెట్టి అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధి రేటు, సానుకూల ద్రవ్యోల్బణం పరిస్థితులతో రేట్ల కోతకు అవకాశాలున్నట్టు చెప్పారు. పలు మార్గాలున్నాయ్.. ఆర్బీఐ ఈ ఏడాది ఒక శాతం వరకు రేట్లు తగ్గించడంతో మార్జిన్లను కాపాడుకోవడం బ్యాంకులకు సవాలుగా మారిన తరుణంలో.. తన మార్జిన్లను కాపాడుకునేందుకు ఎస్బీఐకి పలు చోదకాలున్నట్టు శెట్టి పేర్కొన్నారు. ‘‘సీఆర్ఆర్ ఒక శాతం కోత పూర్తిగా అమల్లోకి రావడంతో దీనివల్ల వడ్డీ ఆదాయం మెరుగవుతుంది. రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. గడువు ముగిసే ఫిక్స్డ్ డిపాజిట్లకు కొత్త వడ్డీ రేట్లు అమలు చేయడంతోపాటు, సేవింగ్స్ డిపాజిట్లపై 0.2 శాతం వడ్డీ రేటు తగ్గించడం వల్ల మార్జిన్ల పరంగా ప్రయోజనం కలుగుతుంది’’అని శెట్టి వివరించారు. ఎస్బీఐ ఆస్తుల్లో కేవలం 30 శాతమే ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆఫ్ రెపో రేటుతో అనుసంధామైనవిగా చెప్పారు. దీనివల్ల ఆర్బీఐ రేట్ల కోత చేపట్టినప్పుడు మూడింట ఒక వంతు రుణాల రేట్లను మార్చాల్సి వస్తుందని, దీంతో మార్జిన్లపై ఒత్తిడి పరిమితంగానే ఉంటుందని వివరించారు. సెపె్టంబర్ త్రైమాసికంలో ఎస్బీఐ నిమ్ 2.93 శాతంగా ఉండడం గమనార్హం. -
భారత్లో రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు
భారతదేశంలో అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర కేబినెట్ బుధవారం రూ.7,280 కోట్ల భారీ పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ‘సింటెర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించే పథకం’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ పథకం ద్వారా దేశీయంగా అరుదైన లోహ అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా 6,000 ఎంటీపీఏ (సంవత్సరానికి మెట్రిక్ టన్) సామర్థ్యంతో అరుదైన లోహ అయస్కాంతాలను తయారు చేయాలని నిర్ణయించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.కీలక రంగాల్లో వీటి ఉపయోగంఈ అరుదైన లోహ అయస్కాంతాలు అనేక కీలక, అత్యాధునిక పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. వీటిలో కింది విభాగాలున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీలు)ఏరోస్పేస్ఎలక్ట్రానిక్స్వైద్య పరికరాలురక్షణ రంగంలబ్ధిదారులకు కేటాయింపు, ప్రోత్సాహకాలు.దేశీయంగా ఈ విభాగంలో తయారీని వేగవంతం చేసేందుకు ఈ పథకం ప్రపంచ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మొత్తం సామర్థ్యాన్ని ఐదుగురు లబ్ధిదారులకు కేటాయించాలని భావిస్తోంది. ప్రతి లబ్ధిదారునికి 1,200 ఎంటీపీఏ సామర్థ్యం వరకు కేటాయించనున్నారు.పథకం కాలపరిమితిఈ ఇంటిగ్రేటెడ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (ఆర్ఈపీఎం) తయారీ సదుపాయాన్ని ప్రోత్సహించే పథకం వ్యవధి 7 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి 2 సంవత్సరాలు ఉంటాయి. ఆర్ఈపీఎం అమ్మకంపై ప్రోత్సాహకాన్ని పంపిణీ చేయడానికి 5 సంవత్సరాలు గడువు నిర్ణయించారు.ఇదీ చదవండి: ఎన్వీడియాకు గూగుల్ గట్టి దెబ్బ -
ట్యాక్స్ రీఫండ్.. ఆలస్యానికి కారణం ఇదే..
ఆదాయపు పన్ను (ఐటీ) రీఫండ్ల జారీలో జరుగుతున్న జాప్యంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ కీలక అప్డేట్ ఇచ్చారు. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులు (Incorrect Deductions) లేదా అధిక విలువ గల క్లెయిమ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నందున రీఫండ్ల ఆలస్యం జరుగుతోందని స్పష్టం చేశారు.ఈ ఏడాది ఐటీఆర్ (ITR) దాఖలు గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. దేశవ్యాప్తంగా పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సీబీడీటీ ఛైర్మన్ చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (ఐఐటీఎఫ్)లో పన్ను చెల్లింపుదారుల లాంజ్ను ప్రారంభించిన అనంతరం అగర్వాల్ విలేకరులతో మాట్లాడారు.‘తక్కువ విలువ కలిగిన రీఫండ్లను ఇప్పటికే విడుదల చేస్తున్నాం. మిగిలిన రీఫండ్లను ఈ నెలలో లేదా డిసెంబర్ నాటికి విడుదల చేస్తాం. పన్ను శాఖ కొన్ని తప్పుడు తగ్గింపులు, అధిక విలువ గల రీఫండ్ క్లెయిమ్లను గుర్తించింది. వాటిని ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్లెయిమ్లను సిస్టమ్ ద్వారా రెడ్-ఫ్లాగ్ చేశాం. పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన తప్పుడు తగ్గింపులపై విశ్లేషణ నిర్వహిస్తున్నాం. ఇది రీఫండ్ల జారీలో జాప్యానికి కారణం అవుతుంది’ అని అగర్వాల్ పేర్కొన్నారు.మరోవైపు, ఏదైనా తగ్గింపులను మర్చిపోయిన పన్ను చెల్లింపుదారులు సవరించిన రిటర్న్ (Revised Return) దాఖలు చేయాలని కోరుతూ వారికి లేఖలు రాసినట్లు కూడా ఆయన వెల్లడించారు. టీడీఎస్ (మూలం వద్ద పన్ను తగ్గింపు) రేట్లు హేతుబద్ధీకరించబడటం వల్ల రీఫండ్ క్లెయిమ్ల్లో కూడా తేడాలుంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 మధ్య రీఫండ్లు రూ.2.42 లక్షల కోట్లకు చేరుకున్నాయి.వ్యాజ్యాల తగ్గింపుపై దృష్టిప్రత్యక్ష పన్ను కేసులకు సంబంధించిన వ్యాజ్యాలను తగ్గించడానికి డిపార్ట్మెంట్, బోర్డు తీవ్రంగా కృషి చేస్తున్నాయని అగర్వాల్ తెలిపారు. అప్పీలేట్ అధికారులు ఓవర్ టైమ్ పని చేస్తున్నారని చెప్పారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 40 శాతానికి పైగా అప్పీళ్లు పరిష్కరించినట్లు తెలిపారు.ఇదీ చదవండి: అమెరికాపై తగ్గని మోజు! -
అమెరికాపై తగ్గని మోజు!
అమెరికాలో ఏటా రికార్డు స్థాయిలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుదలకు ప్రధానంగా భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులు అధికమవుతుండడం కారణంగా నిలిచింది. తాజాగా ఓపెన్ డోర్స్ 2025 నివేదికలోని వివరాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూఎస్లో దాదాపు ముగ్గురు అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒకరు భారతీయులే ఉండడం గమనార్హం. 2024-25 విద్యా సంవత్సరంలో భారతీయ విద్యార్థుల నమోదు 3,63,019కు చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 9.5 శాతం పెరుగుదలను సూచిస్తుంది.యూఎస్ వెళ్లే భారతీయ విద్యార్థులు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితం కావడం లేదు. ప్రాడిజీ ఫైనాన్స్ డేటా ప్రకారం ఇండోర్, భువనేశ్వర్, పంజాబ్, సూరత్, కోయంబత్తూర్, మైసూరు, నాగ్పుర్.. వంటి టైర్ 2, టైర్ 3 నగరాల నుంచి యూఎస్ వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.ఈ విద్యార్థులు తరచుగా ఉపాధ్యాయులు, చిన్న వ్యాపార యజమానులు, మిడ్ కెరియర్ నిపుణుల కుటుంబాల నుంచి ఎక్కువగా ఉన్నారు.STEM కోర్సులు2024-25లో యూఎస్ మొత్తంగా 11,77,766 అంతర్జాతీయ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చింది. ఇది అంతకుముందు ఏడాది కంటే 4.5 శాతం ఎక్కువ. యూఎస్లోని ప్రతి 10 మంది భారతీయ విద్యార్థుల్లో దాదాపు 7 మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సుల్లో చేరుతున్నారు.43.4% మంది భారతీయ విద్యార్థులు గణితం, కంప్యూటర్ సైన్స్ లో చేరారు.22.8% మంది ఇంజినీరింగ్ కోర్సులను ఎంచుకున్నారు.ఓపీటీ..అమెరికా అందిస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT)కు ఆదరణ పెరుగుతోంది. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అంతర్జాతీయ గ్రాడ్యుయేట్లు దేశీయ శ్రామిక శక్తిలోకి ప్రవేశించడానికి ఓపీటీ ఎంతో తోడ్పడుతుంది. భారతీయ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ముఖ్యంగా STEMలో H-1B వీసాలు లేదా ఇతర వర్గాలకు మారడానికి ముందు వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి ఓపీటీని ఉపయోగించుకుంటున్నారు.ఇదీ చదవండి: బంగారు నగలపై ఓవర్డ్రాఫ్ట్.. వివరాలివే.. -
పన్ను కోతలతో ఆదాయ వృద్ధి కష్టమే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సర్కారు తీసుకున్న పన్ను తగ్గింపు నిర్ణయాలు ఆదాయ వృద్ధిని అడ్డుకుంటాయని.. దీంతో ద్రవ్యపరమైన మద్దతుకు పెద్ద అవకాశాల్లేవని మూడిస్ రేటింగ్స్ అభిప్రాయం వ్యక్తం చేసింది.‘‘ఆదాయ వృద్ధిలో బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్య స్థిరీకరణ పరంగా అవరోధాలు ఎదుర్కోవచ్చు. కొన్ని పన్ను తగ్గింపులను కూడా చూశాం. ఇది ఆదాయ వృద్ధికి మరింత అడ్డుగా మారొచ్చు. కనుక ద్రవ్యపరమైన మద్దతుకు అవకాశాలు తక్కువగానే ఉన్నాయి’’అని మూడిస్ రేటింగ్స్ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ పెట్చ్ పేర్కొన్నారు.సెప్టెంబర్ చివరికి నికర పన్ను వసూళ్లు 12.29 లక్షల కోట్లుగా ఉన్నట్టు ప్రభుత్వ డేటా ఆధారంగా తెలుస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.12.65 లక్షల కోట్ల కంటే స్వల్పంగా తగ్గడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ప్రభుత్వం వేసుకున్న పన్ను వసూళ్ల అంచనాల్లో 43.3 శాతమే సెప్టెంబర్ చివరికి (ఆరు నెలల్లో) సమకూరింది.క్రితం ఆర్థిక సంవత్సరం ఆదాయం అంచనాల్లో 49 శాతం మేర తొలి ఆరు నెలల్లో రావడం ఉంది. ఆదాయపన్ను మినహాయింపును కొత్త విధానంలో రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ కేంద్రం ప్రకటించడం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ శ్లాబుల్లో తీసుకొచి్చన మార్పులతో 375 ఉత్పత్తులపై పన్ను తగ్గింది. వాస్తవానికి ఈ రేటు తగ్గింపుతో వినియోగం పెరుగుతుందన్నది కేంద్రం అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటు 4.4 శాతానికి పరిమితం చేయాలన్నది కేంద్రం లక్ష్యం.వినియోగం, వ్యయాలే అండ..ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగిరావడం, వడ్డీ రేట్ల తగ్గింపుతో గృహాల కొనుగోలు శక్తి పెరుగుతుందని, ఇది వినియోగానికి మద్దతునిస్తుందని మార్టిన్ పెట్చ్ అన్నారు. దేశీ వినియోగానికి తోడు మౌలిక వసతుల అభివృద్ధికి చేసే వ్యయాలు భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని.. అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని సర్దుబాటు చేస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ టారిఫ్లు ఇక ముందూ గరిష్ట స్థాయిలోనే కొనసాగితే, అది ఇకపై పెట్టుబడులను ప్రతికూలంగా మారొచ్చన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 7 శాతం, 2026లో 6.5 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని గత వారం మూడిస్ అంచనాలు వ్యక్తం చేయడం తెలిసిందే. -
భారత వృద్ధి అంచనాలకు బూస్ట్
న్యూఢిల్లీ: భారత జీడీపీ వృద్ధి అంచాలను ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఎగువకు సవరించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.3 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వ్యక్తీకరించగా, తాజాగా దీన్ని 7 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటు (7.8 శాతం) నమోదు కావడం, ప్రపంచ వృద్ధి, వాణిజ్యంపై అమెరికా టారిఫ్ల పెంపు ప్రభావం అనుకున్నంత లేకపోవడం 2025–26 వృద్ధి అంచాలను పెంచడానికి కారణాలుగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉండొచ్చన్నది ఆర్బీఐ అంచనా.ఇంతకంటే మెరుగ్గా ఇండ్–రా అంచనాలుండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంది. తాము జూలైలో ప్రకటించిన అంచనాల అనంతరం దేశీయంగా, అంతర్జాతీయంగా పరిణామాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నట్టు ఇండ్–రా తెలిపింది. ద్రవ్యోల్బణం చాలా వేగంగా తగ్గుముఖం పట్టడం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు పెరగడం, జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ అంశాలను ఇండ్–రా ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ ప్రస్తావించారు. ముఖ్యంగా జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాలకంటే ఎంతో అధికంగా నమోదు కావడం, అమెరికా టారిఫ్ల ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై ఏమంత లేకపోవడం వృద్ధి అంచనాల పెంపులో ప్రధానపాత్ర పోషించినట్టు ఇండ్–రా తెలిపింది. సానుకూల పరిస్థితులు.. ‘‘భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం వేగంగా పట్టాలెక్కడం, శీతాకాలంలో సానుకూల వాతావరణ పరిస్థితులు జీడీపీ వృద్ధి రేటును 7 శాతానికి తీసుకెళతాయి. ఒకవేళ డిమాండ్ కోలుకోవడం (వినియోగం; పెట్టుబడులు) అన్నది అంచనాలకంటే తక్కువగా ఉంటే కనుక అది జీడీపీ వృద్ధి అంచనాలను కిందకు తీసుకెళ్లొచ్చు’’అని ఇండ్–రా తెలిపింది. జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ, తక్కువ ద్రవ్యోల్బణంతో తుది ప్రైవేటు వినియోగం 2025–26లో 7.4 శాతం పెరగొచ్చని పేర్కొంది. ‘‘అమెరికాకు ఎగుమతులు సెపె్టంబర్లో 11.9 శాతం (గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు), అక్టోబర్లో 8.9 శాతం చొప్పున తగ్గాయి.ఎగుమతులు 2024–25లో సగటున నెలవారీ 7.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూస్తే నెలవారీ సగటు 7.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కానీ సెప్టెంబర్–అక్టోబర్ కాలాన్నే పరిశీలించి చూస్తే నెలవారీ ఎగుమతులు 5.9 బిలియన్ డాలర్లకు (టారిఫ్ల కారణంగా) తగ్గాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాకారం కావడం లేదంటే భారత ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించడం అన్నది ఎగుమతులు పుంజుకోవడానికి కీలకం’’అని ఇండ్–రా తన నివేదికలో పేర్కొంది. -
టారిఫ్ల ప్రభావం ఉన్నప్పటికీ.. భారత్ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2026–27) వృద్ధి రేటు 6.7 శాతం పుంజుకుంటుందని తెలిపింది. ఆదాయపన్ను తగ్గింపులు, వడ్డీ రేట్ల తగ్గింపుతో వినియోగానికి ఊతమిస్తుందని, దీంతో వృద్ధి రేటు బలపడుతుందని వివరించింది.అమెరికా టారిఫ్ల ప్రభావం నెలకొన్నప్పటికీ.. బలమైన వినియోగంతో దేశీ వృద్ధి పటిష్టంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6.8 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. సెపె్టంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి.అమెరికాతో ఒప్పందంఅమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం చేసుకుంటే అది అనిశ్చితులు తగ్గేందుకు, విశ్వాసం పెరుగుదలకు దారితీస్తుందని ఎస్అండ్పీ తెలిపింది. ఇది కార్మికుల ఆధారిత రంగాలకు ప్రయోజనం కలిగిస్తుందని తెలిపింది. ‘‘జీఎస్టీ రేట్లు తగ్గించడం మధ్య తరగతి వినియోగానికి మద్దతునిస్తుంది. దీనికి ఆదాయపన్ను తగ్గింపు, వడ్డీ రేట్ల తగ్గింపు కూడా తోడవుతుంది. ఈ మార్పులతో పెట్టుబడుల కంటే వినియోగం వృద్ధిని బలంగా నడిపిస్తుంది’’అని పేర్కొంది.గత బడ్జెట్లో రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపు (కొత్త పన్ను విధానం కింద) కలి్పంచడం తెలిసిందే. ఇక ఆర్బీఐ వరుస వడ్డీ రేట్ల తగ్గింపుతో రెపో రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.5 శాతానికి దిగిరావడం గమనార్హం. అలాగే, సెప్టెంబర్ 22 నుంచి 375 వస్తువులపై జీఎస్టీ తగ్గడం తెలిసిందే. భారత ఎగుమతుల విస్తరణపై అమెరికా టారిఫ్ల ప్రభావం ఉందంటూ.. అంతిమంగా భారత ఉత్పత్తులపై టారిఫ్లను అమెరికా తగ్గించే అవకాశాలున్నట్టు అభిప్రాయపడింది. -
త్వరలో రూ.5000 నోట్లు!.. స్పందించిన కేంద్రం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ.5000 నోట్లను విడుదల చేయనున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.సోషల్ మీడియాలో రూ.5000 నోట్లకు సంబంధించి, వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఐదు వేలరూపాయల నోట్ల విషయంలో ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని.. పీఐబీ ఫ్యాక్ట్చెక్ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఆర్ధిక అంశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచించింది. సామజిక మాధ్యమాల్లో వస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దు స్పష్టం చేసింది.ప్రస్తుతం భారతదేశంలో రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500 నోట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రెండువేల రూపాయల నోట్లను ఆర్బీఐ ఉపసంహరిస్తున్నట్లు 2023 మే 19న ప్రకటించింది. అప్పట్లో రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 బ్యాంక్ నోట్లు ఉండగా.. 2025 అక్టోబర్ 31 నాటికి రూ. 5,817 కోట్లకు తగ్గినట్లు ఆర్బీఐ వెల్లడించింది.⚠️ सतर्क रहें ⚠️सोशल मीडिया पर दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक द्वारा ₹5000 के नए नोट जारी किए जाएंगे#PIBFactCheck✅ यह दावा #फर्जी है✅@RBI द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है✅ आधिकारिक वित्तीय जानकारी हेतु वेबसाइट https://t.co/e6gEcOvLu3 पर विजिट करें pic.twitter.com/EF82vaxMvE— PIB Fact Check (@PIBFactCheck) November 24, 2025 -
రుణాలను చౌకగా అందిస్తే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందా?: అదెలా..
సరసమైన రుణాల లభ్యత దేశీయ మార్కెట్లను పెంచుతుంది. అంతేకాదు బ్యాంకింగ్ వ్యవస్థను మరింత స్థిరంగా చేస్తుంది. ఈఎంఐలను తగ్గించడం వల్ల వినియోగదారుల పునర్వినియోగపరచలేని ఆదాయం పెరుగుతుంది, గృహాలు, వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. చాలా కాలంగా నెమ్మదిగా అమ్మకాలతో సతమతమవుతున్న రియల్ ఎస్టేట్ రంగం వడ్డీ రేటు తగ్గింపు నుంచి ఉపశమనం పొందుతుంది.ద్రవ్యోల్బణం తగ్గడం చౌక రుణాలకు కొత్త అవకాశాలను తెరిచింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఇచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం, అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం పదేళ్ల కనిష్ట స్థాయి 0.25 శాతానికి పడిపోయింది. అయితే టోకు ద్రవ్యోల్బణం కూడా 27 నెలల కనిష్ట స్థాయి మైనస్ 1.21 శాతానికి చేరుకుంది. ఈ తగ్గుదల ప్రధానంగా కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాదరక్షలు, ధాన్యాలు ,వాటి ఉత్పత్తుల ధరలు తగ్గడం, అలాగే విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ సేవల కారణంగా ఉంది. సెప్టెంబర్లో అమలు చేసిన జీ ఎస్టీ రేట్ల తగ్గింపు కూడా గణనీయమైన పాత్ర పోషించింది, ఇది ఆహార పదార్థాల ధరలు తగ్గడానికి దారితీసింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2.5 శాతం వద్ద స్థిరంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు, ఇది గత సంవత్సరం 4.6 శాతం రేటు కంటే తక్కువ. ఇది వృద్ధిని పెంచడానికి డిసెంబర్ నెలలో జరిగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో విధాన వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాన్ని పెంచింది. తక్కువ పన్నులు, ద్రవ్యోల్బణం కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వేగవంతం అవుతోందని, దేశం క్రెడిట్ రేటింగ్ మెరుగుపడుతోందని జాతీయ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు హైలైట్ చేస్తున్నాయి. అయినప్పటికీ, వేగవంతమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి రుణాలను చౌకగా చేయవలసిన అవసరం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధిక దిగుమతి సుంకాలను విధించినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధి రేటుతో, తక్కువ ద్రవ్యోల్బణం, బలమైన ఆర్థిక ఫండమెంటల్స్ కారణంగా భారతదేశం G-20 దేశాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉంటుందని మూడీస్ గ్లోబల్ మాక్రో అవుట్లుక్ నివేదిక పేర్కొంది.వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతుల్యతను కొనసాగించిన ఆర్బీఐ జాగ్రత్తగా ద్రవ్య విధానాన్ని మూడీస్ కూడా ప్రశంసించింది. గత నెలలో రెపో రేటును స్థిరంగా ఉంచడం ద్వారా, తక్కువ ద్రవ్యోల్బణం, బలమైన వృద్ధి వాతావరణంలో ఆర్బీఐ జాగ్రత్తగా ముందుకు సాగుతోందని నివేదిక పేర్కొంది. అయితే, ప్రైవేట్ రంగం ఇప్పటికీ పెద్ద ఎత్తున పెట్టుబడుల గురించి అనిశ్చితంగా కనిపిస్తోంది. ఈ సమయంలో, ప్రపంచ వృద్ధి మందగమనం, అమెరికా సుంకాల పెంపు మధ్య పరిశ్రమ, వ్యాపారానికి సరళీకృత ఫైనాన్సింగ్ అవసరం మరింత ఒత్తిడికి గురైంది.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ మధ్య-సంవత్సర సమీక్ష నివేదిక GST రేటు తగ్గింపులు, తగ్గిన ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థకు స్పష్టంగా ప్రయోజనం చేకూర్చినప్పటికీ, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల దృష్ట్యా పరిశ్రమ, వ్యాపారానికి ఆర్థిక సహాయం అవసరమని పేర్కొంది. 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలనే ఆశయానికి ఆర్థిక రంగ సంస్కరణలు, సులభంగా రుణం పొందడం చాలా అవసరమని ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది.ఈ సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లలో ఆర్బీ ఐ ఇప్పటికే రెపో రేటును మొత్తం ఒక శాతం తగ్గించింది, దీని వల్ల అది 5.5 శాతానికి చేరుకుంది. నగదు నిల్వ నిష్పత్తి కూడా మూడు శాతానికి తగ్గింది. అయితే, ప్రస్తుత ప్రపంచ సవాళ్లు, భారత పరిశ్రమ, వాణిజ్య అవసరాల దృష్ట్యా, మరింత వడ్డీ రేటు తగ్గింపులు ఈ సమయంలో అవసరం. ఆర్థిక సూచికలు నిరంతరం మెరుగుపడుతున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మరోసారి భారత మార్కెట్లలో తమ పెట్టుబడులను పెంచుతున్నారు.ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో చౌక రుణాలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తాయి. ట్రంప్ సుంకాలు, ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల మధ్య భారతదేశం వ్యూహాత్మక సంసిద్ధతను దృష్టిలో ఉంచుకుని, సులభంగా క్రెడిట్ పరిశ్రమ, వాణిజ్యం, సేవల రంగాలలోకి కొత్త శక్తిని చొప్పించగలదు. తగ్గిన వడ్డీ రేట్లు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఆవిష్కరణ, ఉత్పత్తి, మార్కెట్ విస్తరణకు కొత్త పునాదిని కూడా సృష్టిస్తాయి. ఇది విదేశీ పెట్టుబడులను కూడా పెంచుతుంది. గ్రామీణ, పట్టణ డిమాండ్ కూడా పెరుగుతుంది, తయారీ, సేవా రంగాలను బలోపేతం చేస్తుంది.రుణాల లభ్యత దేశీయ మార్కెట్లను పెంచుతుంది. అంతేకాదు దీనివల్ల బ్యాంకింగ్ వ్యవస్థ మరింత స్థిరంగా మారుతుంది. ఈఎంఐలను తగ్గించడం వల్ల వినియోగదారుల పునర్వినియోగపరచలేని ఆదాయం పెరుగుతుంది, గృహాలు, వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. చాలా కాలంగా సరైన అమ్మకాలు లేక ఇబ్బంది పడుతున్న రియల్ ఎస్టేట్ రంగం వడ్డీ రేటు తగ్గింపు నుంచి ఉపశమనం పొందుతుంది.రిటైల్, టోకు ద్రవ్యోల్బణంలో పదునైన తగ్గుదల జీఎస్టీ తగ్గింపు, సానుకూల ప్రభావం దృష్ట్యా, ఆర్బీఐ తన రాబోయే ద్రవ్య విధాన సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించడానికి గణనీయమైన నిర్ణయం తీసుకుంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇది వ్యాపార అభివృద్ధిని పెంచుతుంది, వినియోగదారులకు ఉపశమనం కూడా కలిగిస్తుంది, అంతేకాదు మార్కెట్ డిమాండ్ను బలోపేతం చేస్తుంది. కొత్త పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్య అనిశ్చితి, ట్రంప్ సుంకాల సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుంది. -
విదేశీ పెట్టుబడులకు పుష్
న్యూఢిల్లీ: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్డీఐ)లు, విదేశీ సంస్థాగత పెట్టుబడు(ఎఫ్ఐఐ)లను ఆకట్టుకునేందుకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంబంధిత వర్గాలతో సమావేశమయ్యారు. సమావేశంలో ఇందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సరళతర, సమర్థవంత వేగంతోకూడిన విధానాలకు తెరతీయనున్నారు. ఈ బాటలో ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ విధానాలను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్చలు కొనసాగించనుంది. తద్వారా దేశంలోకి మరింత వేగంగా పటిష్టస్థాయిలో పెట్టుబడులు ప్రవహించేలా గోయల్ చర్యలు చేపట్టనున్నారు. సమావేశానికిముందు పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 98వ వార్షిక సాధారణ సమావేశంలో సభ్యులనుద్ధేశించి గోయల్ ప్రసంగించారు. దేశంలోకి మరింత వేగంగా విదేశీ పెట్టుబడులు ప్రవహించేందుకు ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై సమావేశాలు నిర్వహించనున్నట్లు గోయల్ తెలియజేశారు. ఉద్యోగ కల్పన, కొత్త టెక్నాలజీలు, పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలకు విదేశీ పెట్టుబడులు దారి చూపుతాయని ఈ సందర్భంగా గోయల్ పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ రంగ పరికరాల తయారీని ప్రోత్సహించడం ద్వారా దేశీ కరెన్సీకి స్థిరత్వాన్ని కలి్పంచవచ్చని తెలియజేశారు. దీంతో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. క్యూ1లో 15 శాతం అప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో దేశంలోకి 15 శాతం అధికంగా ఎఫ్డీఐలు ప్రవహించాయి. ఏప్రిల్–జూన్(క్యూ1)లో 18.62 బిలియన్ డాలర్లను తాకాయి. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో ఎఫ్డీఐ ఈక్విటీ పెట్టుబడులు 50 బిలియన్ డాలర్లను అధిగమించగా.. ఎఫ్డీఐలు 80.6 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! పారిశ్రామికంగా సరఫరా వ్యవస్థలు డైవర్సిఫైకావలసి ఉన్నట్లు గోయల్ ప్రస్తావించారు. దీంతో ఒకే ప్రాంతంపై ఆధారపడటం తగ్గుతుందని తెలియజేశారు. -
‘ఆహార వృధా అంత ఎక్కువేం లేదు’
ప్రజల్లో అనుకుంటున్నట్టు మన దేశంలో ఆహార వృధా అంత ఎక్కువేం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ వ్యాఖ్యానించారు. పాలకు సంబంధించి వృధా కేవలం 0.5 శాతమే ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ఆహార వృధాలోనూ చాలా వరకు అరికట్టొచ్చని చెబుతూ.. ఇలా చేస్తే అది గోదాముల్లో పెట్టుబడులకు సైతం ప్రోత్సాహకరంగా మారుతుందన్నారు. దేశ వ్యవసాయ రంగం వచ్చే పదేళ్ల పాటు 4 శాతం వృద్ధి రేటును సులభంగానే సాధిస్తుందని రమేష్ చంద్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదాముల వసతులను పెంచుకోవాల్సి ఉందన్నారు. పీహెచ్డీ సీసీఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఏటా 2.5 శాతం చొప్పున పెరుగుతున్నట్టు చెప్పారు. కనుక 4 శాతం వృద్ధి సాధ్యమేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో (క్యూ1) వ్యవసాయ రంగంలో వృద్ధి 3.7 శాతంగా ఉండడం గమనార్హం.‘‘కానీ, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఈ స్థాయిలో పెరగడం లేదు. కనుక ఈ ఉత్పత్తులను పరిశ్రమలు వినియోగించాలి. లేదంటే ఎగుమతి చేయాలి. ఎగుమతి మార్కెట్ను గుర్తించడం మెరుగైన ఆప్షన్ అవుతుంది’’అని రమేష్ చంద్ పేర్కొన్నారు.బియ్యం, గోధుమలకు కావాల్సిన నిల్వ వసతుల్లో (గోదాములు) ఎలాంటి వ్యత్యాసం లేదంటూ.. అదే మొక్కజొన్న విషయంలో మాత్రం భిన్నంగా ఉంటుందన్నారు. నిర్ణీత పరిమాణానికి మించి నిల్వ చేయకూడదన్న చట్టం ఉంటే.. అలాంటి నియంత్రణలు గోదాముల నిర్మాణంపై పెట్టుబడులను ప్రభావితం చేస్తాయన్నారు. -
ఇన్ఫ్రా, ఇంధన రంగ నిపుణులతో ఆర్థిక మంత్రి భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీలో మౌలిక రంగం, ఇంధన రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్కాన్స్ ఎండీ ఎస్.పరమశివన్, షాపూర్జీ పల్లోంజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ డైరెక్టర్ మనీష్ త్రిపాఠి, జీఎంఆర్ గ్రూప్ డిప్యూటీ ఎండీ కె.నారాయణరావు, జేఎం బక్సి గ్రూప్ డైరెక్టర్ సందీప్ వాద్వా, ఇన్ఫ్రా విజన్ ఫౌండేషన్ సీఈవో జగదన్షా తదితర కంపెనీల సారథులు ఇందులో పాల్గొన్నారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్ఫామ్పై ఒక పోస్ట్ పెట్టింది. ‘‘ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సీతారామన్ రానున్న 2026–27 కేంద్ర బడ్జెట్కు సంబంధించి 11వ ముందస్తు సమావేశాన్ని ఇన్ఫ్రా, ఇంధన రంగాల నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్ శాఖ, షిప్పింగ్ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు హాజరయ్యారు’’అని ఆర్థిక శాఖ తన పోస్ట్లో వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ 2026–27 బడ్జెట్ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు ప్రాధాన్యం నెలకొంది. డిమాండ్, ఉపాధి కల్పనను పెంచడం, దేశ జీడీపీని 8 శాతం వృద్ధి రేటుకు చేర్చడం వంటి ప్రధాన సవాళ్లు ఆర్థిక మంత్రి ముందున్నాయి. వ్యవసాయం, ఎంఎస్ంఎఈలు, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్ మార్కెట్ రంగాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇప్పటి వరకు బడ్జెట్ ముందస్తు సమావేశాలు నిర్వహించడం గమనార్హం. -
రూపాయి భారీ క్రాష్..!
ముంబై: చరిత్రలో అత్యంత కనిష్టానికి రూపాయి విలువ పడిపోయింది. జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కె ట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ ఒక్కరోజులో అత్యధికంగా 98 పైసలు కుప్పకూలి చరిత్రాత్మక కనిష్టం 89.66 స్థాయి వద్ద ముగిసింది. అంతకుముందు అక్టోబర్ 14న 88.91 జీవితకాల కనిష్టంగా ఉంది. అంతర్జాతీయ టెక్నాలజీ షేర్లలో అనూహ్య అమ్మకాలు, అమెరికా–భారత్ల వాణిజ్య డీల్పై స్పష్టత లేమి కూడా రూపాయి కోతకు కారణమయ్యాయి. ఇంట్రాడేలో 97 పైసలు క్షీణించి 89.65 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 88.85 వద్ద ఇంట్రాడేలో రికార్డు కనిష్టాన్ని తాకిన సంగతి తెలిసిందే. అలాగే జూలై 30న ఒక్కరోజులో 89 పైసల పతన రికార్డునూ చెరిపివేసింది. ‘క్రిప్టో భారీ పతనం, ఏఐõÙర్లలో వెల్లువెత్తిన విక్రయాలతో అంతర్జాతీయంగా కరెన్సీ మార్కెట్లలో రిస్క్ సామర్థ్యం ఒక్కసారిగా తగ్గింది. ఈ పరిమాణం భారత్ వంటి వర్ధమాన దేశాల కరెన్సీలపై తీవ్ర ఒత్తిడి పెంచింది’ అని ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ అండ్ కమోడిటీ, కరెన్సీ హెడ్ అనింద్య బెనర్జీ తెలిపారు. -
ఆరోగ్య బీమా పరిశ్రమ నష్టం
న్యూఢిల్లీ: క్లెయిమ్లలో మోసాలు, దుర్వీనియోగం (ఎఫ్డబ్ల్యూఏ) తదితర కారణాలతో బీమా పరిశ్రమ ఏటా రూ. 10,000 కోట్ల నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. దీని వల్ల వ్యవస్థపై నమ్మకం సడలుతోంది. మోసపూరిత ధోరణులు, ప్రక్రియల్లో సమర్ధత లోపించడం, నిబంధనల ఉల్లంఘనలు మొదలైనవి వ్యవస్థవ్యాప్తంగా వేళ్లూనుకుపోయి, మరింతగా పెరుగుతున్నాయని ఆరోగ్య బీమాపై బీసీజీ, మెడి అసిస్ట్ రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది. ముందస్తుగా నివారించడం, మోసాలను గుర్తించడం, మోసాలకు పాల్పడకుండా కఠినచర్యలు తీసుకోవడంలాంటి మూడంచెల వ్యూహాన్ని పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించేందుకు, సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. క్లెయిమ్స్ ప్రాసెసింగ్లో మోసాలను రియల్ టైమ్లో నిరోధించేందుకు కృత్రిమ మేధ, జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) ఉపయోగపడగలవని నివేదిక తెలిపింది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. → ఆరోగ్య బీమా పరిశ్రమ గత అయిదేళ్లుగా ఏటా 17 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోంది. 2025లో రూ. 1.27 లక్షల కోట్లకు చేరింది. → రాబోయే అయిదేళ్ల వ్యవధి చాలా ఆశావహంగా ఉండనుంది. పరిశ్రమ సగటున 16–18 శాతం మేర వృద్ధి చెందుతూ, 2030 నాటికి రూ. 2.6 – రూ. 3 లక్షల కోట్లకు చేరనుంది. కాంపోజిట్ లైసెన్సులు, వ్యాల్యూ యాడెడ్ సరీ్వసులు మొదలైనవి మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చివేయనున్నాయి. → ఎలాంటి రిసు్కలు లేని క్లెయిమ్లు 90 శాతం ఉంటున్నాయి. అయితే, రెండు శాతం మాత్రం పూర్తి మోసపూరితమైనవిగా ఉంటున్నాయి. ఇక మరో 8 శాతం క్లెయిమ్లు కాస్త అటూ ఇటుగా ఉంటున్నాయి. నిఖార్సయిన పాలసీదారులకు అసౌకర్యం కలిగించకుండా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ తరహా క్లెయిమ్లలో కొంత అవకాశం ఉంటుంది. → ప్రతి సంవత్సరం మోసపూరిత క్లెయిమ్లకు సంబంధించి ఎఫ్డబ్ల్యూఏ రూపంలో రూ. 8,000–10,000 కోట్ల చెల్లింపులు ఉంటున్నాయని అంచనా. దీని వల్ల బీమా సంస్థల మార్జిన్లు తగ్గుతున్నాయి. కస్టమర్లకు ప్రీమియం భారం పెరుగుతోంది. → డిజిటల్ ఇంటెలిజెన్స్, కొత్త తరం టెక్నాలజీని వాడి ఈ సెగ్మెంట్లో మోసాలను అరికట్టవచ్చు. విశ్వసనీయతను పెంపొందించుకోవచ్చు. ఇలాంటి చర్యలతో, అందరికీ బీమా రక్షణ కలి్పంచాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అయిదేళ్లు ముందుగానే సాధించడానికి వీలవుతుంది. అలాగే ఆరోగ్య బీమా వ్యవస్థను పారదర్శకమైనదిగా, టెక్నాలజీ ఆధారితమైనదిగా తీర్చిదిద్దేందుకు సాధ్యపడుతుంది. -
డిజిటల్ గోల్డ్ను నియంత్రించం
న్యూఢిల్లీ: డిజిటల్ బంగారం లేదా ఈ–బంగారం వంటి ఉత్పత్తులను నియంత్రించాలనుకోవడం లేదని సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే స్పష్టం చేశారు. ఇవి తమ పరిధిలోకి రావన్నారు. రీట్, ఇని్వట్–2025 జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వచి్చన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మ్యూచువల్ ఫండ్స్ అందించే గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్లు) లేదా ట్రేడింగ్కు వీలయ్యే ఇతర బంగారం సెక్యూరిటీలనే సెబీ నియంత్రిస్తున్నట్టు చెప్పారు. నియంత్రణల పరిధిలో లేని డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్లో లావాదేవీలతో రిస్క్ ఉందంటూ.. వీటికి దూరంగా ఉండాలంటూ ఇటీవలే సెబీ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. ‘‘ఆ తరహా డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు సెబీ నియంత్రించే బంగారం ఉత్పత్తులకు భిన్నమైనవి. వాటిని సెక్యూరిటీలుగా లేదా కమోడిటీ డెరివేటివ్లుగా నోటిఫై చేయలేదు. అవి పూర్తిగా సెబీ నియంత్రణల వెలుపల పనిచేస్తున్నాయి. అటువంటి డిజిటల్ బంగారం సాధనాలతో ఇన్వెస్టర్లు గణనీయమైన రిస్్కను ఎదుర్కోవాల్సి రావచ్చు’’అని సెబీ తన ప్రకటనలో పేర్కొంది. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయమంటూ కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లు డిజిటల్ గోల్డ్పై ప్రచారం చేస్తున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ హెచ్చరిక జారీ చేసింది. దీంతో డిజిటల్ గోల్డ్ను ఆఫర్ చేసే ప్లాట్ఫామ్లు తమను సైతం సెబీ నియంత్రణల పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశాయి. -
కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు: తక్షణమే అమల్లోకి
భారతదేశంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు.. తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ అధికారికంగా పేర్కొన్నారు.కొత్త చట్టాలువేతనాల కోడ్ (2019)పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020)సామాజిక భద్రత కోడ్ (2020)వృత్తి భద్రత, ఆరోగ్యం & పని పరిస్థితుల కోడ్ (OSHWC) (2020)కనీస వేతనానికి గ్యారెంటీ, గ్రాట్యూటీ, సామాజిక భద్రతకు పెద్దపీట వేయడంలో భాగంగానే ఈ కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అమల్లోకి వచ్చిన కొత్త చట్టాలు ఇప్పటికే ఉన్న 29 కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో ఉంటాయి.వేతనాల కోడ్ (2019): కనీస వేతనాలను నోటిఫైడ్ 'షెడ్యూల్డ్ ఉద్యోగాల'కు అనుసంధానించే మునుపటి వ్యవస్థను భర్తీ చేస్తూ, అన్ని రంగాలలో కనీస వేతనాలు & సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును ఈ కోడ్ వివరిస్తుంది.పారిశ్రామిక సంబంధాల కోడ్ (2020): ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు/మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం ఈ కోడ్ లక్ష్యం.సామాజిక భద్రత కోడ్ (2020): సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐసీ, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని విస్తరిస్తుంది. అంతే కాకుండా మొదటిసారిగా గిగ్ & ప్లాట్ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్వర్క్ను సృష్టిస్తుంది.OSHWC కోడ్ (2020): ఈ కోడ్ కార్యాలయ భద్రత & పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో విలీనం చేస్తుంది.ప్రయోజనాలుకొత్త కార్మిక కోడ్ల ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీలు, కార్మికులందరికీ కనీస వేతనం గ్యారెంటీ, అపాయింట్మెంటు లెటర్ గ్యారెంటీ, సమాన పనికి సమాన వేతనం, మహిళల ఆమోదం, భద్రత చర్యలకు లోబడి రాత్రి వేళలో స్త్రీలు పని చేయడానికి అనుమతి, 40 కోట్ల మంది కార్మికులకు సోషల్ సెక్యూరిటీ, ఏడాది తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిస్కు గ్రాట్యూటీ, ఓవర్ టైంకు రెట్టింపు వేతనం, ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య రక్షణ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం వంటివి ఉన్నాయి.నరేంద్ర మోదీ ట్వీట్''శ్రమేవ్ జయతే! నేడు, మన ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను అమలులోకి తెచ్చింది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అత్యంత సమగ్రమైన, ప్రగతిశీల కార్మిక ఆధారిత సంస్కరణలలో ఒకటి'' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ .. తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.Shramev Jayate!Today, our Government has given effect to the Four Labour Codes. It is one of the most comprehensive and progressive labour-oriented reforms since Independence. It greatly empowers our workers. It also significantly simplifies compliance and promotes ‘Ease of…— Narendra Modi (@narendramodi) November 21, 2025 -
దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకోవాలి
న్యూఢిల్లీ: కీలకమైన ముడి వస్తువుల తయారీలో స్వయం సమృద్ధి సాధించాలని దేశీ ఫార్మా పరిశ్రమకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. వచ్చే దశాబ్దకాలంలో కీలకమైన ఏపీఐల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఫార్మా తయారీ సంస్థల సమాఖ్య ఓపీపీఐ 60వ వార్షిక సదస్సుకు ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని పంపించారు. బయోసిమిలర్లు, వినూత్న మాలిక్యూల్స్, జీన్..సెల్ థెరపీల్లో కొత్త ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయాలని పరిశ్రమ దిగ్గజాలను ఆయన కోరారు. అదే సమయంలో ఆరోగ్య సంరక్షణ సేవలు అందరికీ సమానంగా, అందుబాటు ధరల్లో లభ్యమయ్యే లా చూడటంపైనా దృష్టి పెట్టాలని సూచించారు. భారత ఫార్మా గత దశాబ్దకాలంలో గణనీయంగా పురోగమించిందని, 200 పైచిలుకు దేశాలకు ఔషధాలను సరఫరా చేస్తోందని, అమెరికా..బ్రిటన్లో జనరిక్ ఔషధాల మార్కెట్లో భారీ వాటాను దక్కించుకోవడంతో పాటు అంతర్జాతీయంగా 60 శాతం పైగా టీకాలను సరఫరా అందిస్తోందని మంత్రి చెప్పారు. అంతర్జాతీయంగా పరిశోధనలు, డిజిటల్ ఆవిష్కరణలకు హబ్గా ఎదుగుతోందని, ఫార్మా..లైఫ్సైన్సెస్ తదితర రంగాలకు చెందిన 1,600 పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. ఓపీపీఐతో కలిసి ఈవై పార్థినాన్ ఈ సందర్భంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం నవకల్పనలపై ప్రధానంగా దృష్టి పెడుతూ ఫార్మా పరిశ్రమ 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరనుంది. ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లుగా ఉన్న కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్మెంట్, తయారీ (సీఆర్డీఎంవో) రంగం 2028 నాటికి రెట్టింపై 14 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
నాస్కామ్ యూకే ఫోరమ్ షురూ
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమల అసోసియేషన్ నాస్కామ్ యూకే ఫోరమ్ను ఆవిష్కరించింది. తద్వారా రెండు యునైటెడ్ కింగ్డమ్(యూకే), భారత్ మధ్య ద్వైపాక్షిక టెక్నాలజీ, వాణిజ్య భాగస్వామ్యాలు మరింత విస్తరించనున్నట్లు పేర్కొంది. దేశీ టెక్నాలజీ పరిశ్రమకు యూకే రెండో పెద్ద మార్కెట్కాగా.. వార్షిక ఆదాయం 90 బిలియన్ డాలర్లను మించుతోంది. ఈ నేపథ్యంలో నాస్కామ్ యూకే ఫోరమ్కు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 56 బిలియన్ డాలర్లుకాగా.. సరీ్వసుల వాణిజ్యం 33 బిలియన్ డాలర్లుగా అంచనా. 2030కల్లా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపునకు పెంచుకోవాలనేది స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఏ) లక్ష్యంకాగా.. డిజిటల్, టెక్నాలజీ ఆధారిత వృద్ధి కీలకంగా నిలవనుంది. సాంకేతిక భద్రతా కార్యాచరణ(టీఎస్ఐ)లో భాగంగా రెండు దేశాల మధ్య ఏఐ సాంకేతిక సహకారం మరింత ముందుకు సాగడంలో నాస్కామ్ యూకే ఫోరమ్ ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఏఐ వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూకే సిటిజన్ సరీ్వసులను పెంచుకోవడంలో ఉపయోగపడనున్నట్లు నాస్కామ్ పేర్కొంది. ఏఐకు సిద్ధపడటం, మానవవనరుల నైపుణ్య పెంపు, డిజిటల్వైపు ఎస్ఎంఈల ప్రయాణం(ట్రాన్స్ఫార్మేషన్)సహా బాధ్యతాయుత ఏఐ వినియోగం, ఇన్నోవేషన్ విధానాలను పంచుకోవడం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందనున్నట్లు అభిప్రాయపడింది. -
అల్యూమినియం చౌక దిగుమతులను కట్టడి చేయాలి
చౌక అల్యూమినియం దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమను కాపాడాలంటూ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మినరల్ ఇండస్ట్రీస్ (ఫిమి) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. ప్రాథమిక అల్యూమినియంతోపాటు అల్యూమియం డౌన్స్ట్రీమ్ ఉత్పత్తుల (షీట్లు, ఫాయిల్స్, రాడ్లు తదితర) దిగుమతులపై 15 కస్టమ్స్ సుంకం విధించాలని డిమాండ్ చేసింది. అల్యూమినియం ఉత్పత్తి మిగులు ఉన్న చైనా, రష్యా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతులు పెరిగిపోతుండడంతో దేశీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఇతర దేశాలు టారిఫ్లు విధించడంతో ఇవి తమ మిగులు ఉత్పత్తులను భారత్కు మళ్లిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీనివల్ల దేశీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేమని, అది పెట్టబడులకు విఘాతం కలిగిస్తుందని పేర్కొంది. దిగుమతులతో దేశీ సంస్థలు పోటీ పడేందుకు వీలుగా కస్టమ్స్ సుంకం విధించాలని కోరింది. 2025–26లో అల్యూమినియం డిమాండ్లో 55 శాతం దిగుమతులతోనే భర్తీ అయ్యే పరిస్థితి ఉన్నట్టు వివరించింది. కనుక చౌక దిగుమతుల కట్టడికి ప్రమాణాలను పెంచాలని కోరింది. తయారీలోకి వినియోగించే కీలక ముడిపదార్థాల దిగుమతులపై మాత్రం సుంకాలు తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని పేర్కొంది. -
పర్యాటక రంగానికి జాతీయ బోర్డు ఉండాలి
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగం దీర్ఘకాల అభివృద్ధి కోసం నేషనల్ టూరిజం బోర్డ్ను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖను పరిశ్రమల ప్రతినిధులు కోరారు. అలాగే, మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు నిధుల మద్దతు అవసరమని స్పష్టం చేశారు. బడ్జెట్కు ముందు పర్యాటకం, ఆతిథ్య రంగాల ప్రతినిధులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పర్యాటకం–ఆతిథ్యానికి అన్ని రాష్ట్రాలూ పరిశ్రమ హోదా కలి్పంచేందుకు సహకరించాలని.. దీనివల్ల అందుబాటు ధరలపై రుణాలను పొందడం సాధ్యపడుతుందని ఈ రంగాల ప్రతినిధులు కోరారు. కొన్ని రాష్ట్రాలు పరిశ్రమ హోదా ఇవ్వగా, మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉండంతో పరిశ్రమ ప్రతినిధులు కేంద్రం సహకారాన్ని ఆశించారు. పరిశ్రమ హోదా లేకపోవడం, సమన్వయం లేని నియంత్రణలు వృద్ధికి అడ్డు పడుతున్నట్టు చెప్పారు. లైసెన్స్ల మంజూరు, హోటళ్లకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) దాఖలుకు వీలుగా సింగిల్ విండో అనుమతుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్, ఇండియా ఫుడ్ టూరిజం ఆర్గనైజేషన్, టూరిస్ట్ గైడ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అడ్వెంచర్ టూర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తదితర సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
కీలక రంగాల్లో వృద్ధి ఫ్లాట్
న్యూఢిల్లీ: మౌలిక రంగం పనితీరు అక్టోబర్లో ఫ్లాట్గా (ఎలాంటి వృద్ధిలేని) నమోదైంది. ఎనిమిది కీలక రంగాలకు గాను పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్లో ఉత్పత్తి విస్తరించగా, బొగ్గు, విద్యుదుత్పత్తి తగ్గడంతో మొత్తం మీద పనితీరు ఫ్లాట్గా ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్లో ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 3.3 శాతం పెరగ్గా, 2024 అక్టోబర్లోనూ 3.8 శాతం వృద్ధి కనిపించింది. కేంద్ర వాణిజ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. → అక్టోబర్లో బొగ్గు ఉత్పత్తి 8.5 శాతం తగ్గింది. → విద్యుదుత్పత్తి సైతం 7.6%, సహజ వాయువు ఉత్పత్తి 5 శాతం మేర తక్కువ నమోదైంది. → ముడి చమురు ఉత్పత్తి 1.2 శాతం తగ్గింది. → పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు 4.6 శాతం వృద్ధిని నమోదు చేశాయి. → ఎరువుల ఉత్పత్తి 7.4%, స్టీల్ ఉత్పత్తి 6.7%, సిమెంట్ ఉత్పత్తి 5.3 శాతం చొప్పున పెరిగింది. → ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 8 కీలక మౌలిక రంగాల్లో వృద్ధి 2.5%కి పరిమితమైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 4.3%గా ఉండడం గమనార్హం. వర్షాల వల్లే..: అధిక వర్షాలతో మైనింగ్ కార్యకలాపాలపై, విద్యుత్ డిమాండ్పై అక్టోబర్లో ప్రభావం పడినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. మౌలిక రంగంలో ఫ్లాట్ పనితీరు నేపథ్యంలో అక్టోబర్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2.5–3.5% మధ్య పరిమితం కావొచ్చన్నారు. -
పన్ను మినహాయింపులు ఇవ్వాలి
రానున్న బడ్జెట్లో సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను(ఎస్టీటీ) తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు క్యాపిటల్ మార్కెట్ సంస్థల ప్రతినిధులు విన్నవించారు. ఆర్థిక మంత్రితో ప్రీబడ్జెట్ సమావేశం సందర్భంగా క్యాపిటల్ మార్కెట్ల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిలో చోటు కల్పించడం తదితర అంశాలను సూచించారు. ఫైనాన్షియల్ రంగం మరింత లోతుగా విస్తరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. డెరివేటివ్స్తో పోలిస్తే నగదు విభాగంలో ఎస్టీటీని కుదించాలని విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనకు తెరతీసిన నేపథ్యంలో క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులు నాలుగోసారి ఆర్థిక మంత్రిని కలవడం గమనార్హం! స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈసహా ఎంసీఎక్స్, మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ), పెట్టుబడుల రిజిస్టర్డ్ సలహాదారులు, కమోడిటీ పార్టిసిపెంట్ల అసోసియేషన్ తదితర సంస్థల ప్రతినిధులు ఆర్థిక మంత్రితో సమావేశానికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న 2026–27 బడ్జెట్ను సీతారామన్ లోక్సభలోప్రవేశపెట్టే అవకాశముంది. తద్వారా వరుసగా 9వసారి బడ్జెట్ను ప్రకటించనున్నారు. 33 శాతం అప్ గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్లు 33 శాతం అధికంగా రూ. 14.6 లక్షల కోట్ల పెట్టుబడుల మొబిలైజేషన్కు వీలు కల్పించాయి. ఈక్విటీ, డెట్, రియల్టీ ట్రస్ట్(రీట్)లు, ఇన్ఫ్రా ట్రస్ట్(ఇన్విట్)లు తదితర ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా నిధుల మొబిలైజేషన్ జరిగింది. కార్పొరేట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు విభిన్న ఫైనాన్సింగ్ వ్యూహాలను అందిపుచ్చుకోవడాన్ని ఇది ప్రతిఫలిస్తోంది. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ, డెట్ విభాగాలే రూ. 14.2 లక్షల కోట్లను ఆక్రమించడం విశేషం! వెరసి ఆర్థిక వృద్ధికి అనువైన పెట్టుబడులను సమకూర్చడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కాగా.. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అనురాధా ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్తోపాటు ఆర్థిక శాఖకు చెందిన ఇతర అధికారులు హాజరయ్యారు. వార్షిక బడ్జెట్ తుది రూపకల్పనకు ముందు ఆర్థిక శాఖ వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించే విషయం విదితమే. ఈ బాటలో గత వారం సైతం ఆర్థికవేత్తలు, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగ అత్యున్నత ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించింది. డిమాండును పెంచడం, ఉద్యోగ కల్పన, 8 శాతం ఆర్థిక వృద్ధి తదితర లక్ష్యాలతో బడ్జెట్ రూపొందనున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. -
ట్రేడ్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ప్రారంభం
ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడంలో వాటాదారులకు సహాయపడటానికి ట్రేడ్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ (TIA) పోర్టల్ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. చిరు వ్యాపారులకు అందుబాటులో ఉండే వాణిజ్య డేటాతో వ్యాపారం మరింత పారదర్శకంగా ఉండాలని చెప్పారు. దిగుమతిదారులు, ఎగుమతిదారులు, స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) కోసం ఈ పోర్టల్ సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు.చిన్న వ్యాపారాలకు అవకాశంపెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉన్న డేటాను చిన్న వ్యాపారాలకు, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని వారికి యాక్సెస్ కల్పించడమే టీఐఏ పోర్టల్ ముఖ్య లక్ష్యం అన్నారు. భారత్ ఇతర దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను (FTA) మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఎగుమతిదారులకు ఈ వేదిక సహాయపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచ సుంకాల పరిస్థితిని వేకప్కాల్గా అభివర్ణించిన గోయల్ ప్రభుత్వం, ప్రైవేట్ రంగం వనరులను సమీకరించాలని పిలుపునిచ్చారు.వాటాదారుల డిమాండ్లకు హామీఈ సందర్భంగా వాటాదారులు తమ డిమాండ్లను తెలియజేయాలని తెలిపారు. వాటిని పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని హామీ ఇచ్చారు. వాటాదారులు తీసుకొచ్చిన సమస్యలు వాణిజ్య విభాగానికి సంబంధించినవి అయితే త్వరగా పరిష్కరించబడుతాయన్నారు. ఇతర విభాగాలకు సంబంధించినవి అయితే వాణిజ్య శాఖ చురుకుగా సమన్వయం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ ఫ్రేమ్వర్క్ అవసరాన్ని గుర్తించిన వాణిజ్య శాఖ మార్చి 2024లో TIA పోర్టల్ అభివృద్ధిని ప్రారంభించింది. ఈ పోర్టల్ 28 డ్యాష్బోర్డ్ల్లో 270 కంటే ఎక్కువ ఇంటరాక్టివ్ విజువలైజేషన్లను అందిస్తుంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మానిటరింగ్ డ్యాష్బోర్డ్, నిర్యాత్ పోర్టల్, ట్రేడ్స్టాట్ పోర్టల్ వంటి పాత వాణిజ్య సమాచార పోర్టల్ల స్థానంలో దశలవారీగా అప్డేట్ అవుతుంది.ఇదీ చదవండి: డేటా సెంటర్ల ఏర్పాటులో సవాళ్లు.. భారత్ ఏం చేయాలంటే.. -
పెరిగిన మిడిల్ఈస్ట్ చమురు దిగుమతులు
రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షలు అమలులోకి రానుండటంతో భారతదేశం చమురు దిగుమతులను పెంచుకోవడానికి మిడిల్ఈస్ట్ దేశాలపై మొగ్గు చూపుతోంది. దాంతో మధ్యప్రాచ్యం(మిడిల్ఈస్ట్) నుంచి భారత్కు సరుకులు తీసుకురావడానికి చమురు ట్యాంకర్ల(క్రూడాయిల్ సరఫరా చేసే షిప్లు) బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి.పెరిగిన డిమాండ్షిప్ బ్రోకర్ నివేదికల ప్రకారం ఈ వారం ఇప్పటివరకు సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుంచి ముడి చమురును రవాణా చేయడానికి సుమారు డజను ట్యాంకర్లను అద్దెకు తీసుకున్నారు. ఈ ట్యాంకర్లు అరేబియా సముద్రం మీదుగా రవాణా కానున్నాయి. ఇది గత నెలలో ఇదే నమోదైన కేవలం నాలుగు బుకింగ్లతో పోలిస్తే పెరిగింది.ఈ బుకింగ్ల్లో వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్సీసీ) అని పిలువబడే సూపర్ ట్యాంకర్లతో పాటు చిన్న సూయజ్మ్యాక్స్ నౌకలు కూడా ఉన్నాయి. భారతీయ దిగుమతిదారులు ఇంకా అదే మార్గాల్లో మరిన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని చూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.నవంబర్ 21 నుంచి ఆంక్షలునవంబర్ 21న రోస్నెఫ్ట్ పీజేఎస్సీ(Rosneft PJSC), లుకోయిల్ పీజేఎస్సీ(Lukoil PJSC)పై ఆంక్షలు అమలులోకి రానున్న నేపథ్యంలో భారత చమురు వ్యాపారులు రష్యాయేతర ముడి చమురు కొనుగోళ్లవైపు మళ్లుతున్నారు. భారతదేశంలోని రిఫైనరీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో సహా ఐదు ప్రధాన రిఫైనరీలు ఈ వారం తర్వాత రష్యన్ ముడి చమురు డెలివరీ చేసుకోబోమని ఇప్పటికే ప్రకటించాయి. మిగిలిన కంపెనీలు మాత్రం ఆంక్షలు లేని రష్యా చమురు విక్రేతల నుంచి కొనుగోళ్లు కొనసాగించవచ్చని భావిస్తున్నారు.ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష! -
జీడీపీ వృద్ధి 7.5 శాతాన్ని మించొచ్చు..
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో (జూలై–సెపె్టంబర్ త్రైమాసికం)7.5 శాతం మించి నమోదు కావొచ్చని ఎస్బీఐ పరిశోధన విభాగం అంచనా వేసింది. జీఎస్టీ రేట్ల తగ్గింపునకు తోడు, పండుగల సమయంలో విక్రయాలు బలంగా నమోదు కావడం మెరుగైన వృద్ధికి దారితీయొచ్చని పేర్కొంది. అలాగే, పెట్టుబడులు పుంజుకోవడం, గ్రామీణ వినియోగం కోలుకోవడాన్ని ప్రస్తావించింది.‘‘పండుగల నేపథ్యంలో అమ్మకాలకు సంబంధించి మంచి గణాంకాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలకు సంబంధించి వినియోగం, డిమాండ్ను సూచించే సంకేతాలు క్యూ1లో ఉన్న 70 శాతం నుంచి క్యూ2లో 83 శాతానికి పెరిగాయి. వీటి ఆధారంగా క్యూ2లో వాస్తవ జీడీపీ వృద్ధి 7.5 శాతం లేదా అంతకంటే ఎక్కువే ఉండొచ్చన్న అంచనాకు వచ్చాం’’అని ఎస్బీఐ ఆర్థిక పరిశోధన విభాగం తన నివేదికలో పేర్కొంది.ఈ నెల చివర్లో క్యూ2 జీడీపీ గణాంకాలు విడుదల కానున్నాయి. రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చన్నది ఆర్బీఐ అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో (ఏప్రిల్–జూన్) జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉండడం గమనార్హం. జోరుగా జీఎస్టీ వసూళ్లు.. నవంబర్ నెలకు జీడీపీ వసూళ్లు రూ.1.49 లక్షల కోట్ల స్థాయిలో ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 6.8 శాతం అధికమని ఎస్బీఐ నివేదిక తెలిపింది. దిగుమతులపై ఐజీఎస్టీ, సెస్సు రూపంలో ఆదాయం రూ.51,000 కోట్లుగా ఉంటుందని.. దీంతో నవంబర్ నెలకు మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లను మించొచ్చని పేర్కొంది. జీఎస్టీ రేట్ల తగ్గింపు గత నెలలో పండుగల విక్రయాలను గణనీయంగా పెంచడాన్ని గుర్తు చేసింది.క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు వ్యయాలు సైతం దీన్ని సూచిస్తున్నట్టు పేర్కొంది. యుటిలిటీలు, సేవలపై 38 శాతం, సూపర్ మార్కెట్, గ్రోసరీ కొనుగోళ్లపై 17 శాతం, పర్యటనలపై 9 శాతం ఖర్చు చేసినట్టు తెలిపింది. పట్టణాల వారీగా క్రెడిట్ కార్డు వ్యయాలను పరిశీలించగా, డిమాండ్ అన్ని ప్రాంతాల్లోనూ అధికమైనట్టు పేర్కొంది. అన్ని పట్టణాల్లోనూ ఈ–కామర్స్ విక్రయాలు సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. ఇక్రా అంచనా 7 శాతం సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. సేవలు, వ్యవసాయ రంగంలో రెండో త్రైమాసికంలో కొంత జోరు తగ్గిందంటూ.. తయారీ, నిర్మాణ రంగం, సానుకూల బేస్ మద్దతుతో పారిశ్రామిక పనితీరు బలంగా ఉన్నట్టు తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరం క్యూ2లో జీడీపీ 5.6 శాతంగా ఉండడం గమనార్హం.క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2తో పోల్చి చూసినప్పుడు ప్రభుత్వ వ్యయాలు తక్కువగా ఉండడం జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపించొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. అయినప్పటికీ పండుగల సీజన్లో అమ్మకాలు, జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ కారణంగా పెరిగిన అమ్మకాలు, టారిఫ్లు అమల్లోకి రావడానికి ముందుగా అమెరికాకు అధిక ఎగుమతులు జరగడం వృద్దికి మద్దతునివ్వొచ్చని చెప్పారు. -
‘2047 తెలంగాణ రైజింగ్’ ఉత్సవాల్లో కొత్త పాలసీలు
తెలంగాణ ఆర్థిక ప్రయాణంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 2047 నాటికి ఆధునిక, సమగ్ర, భవిష్యత్తుకు సిద్ధమయ్యే తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ‘2047 తెలంగాణ రైజింగ్’ ఉత్సవాల్లో కీలక పాలసీలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మంగళవారం బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన 47వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ త్రైమాషిక సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేందుకు HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) ద్వారా 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ ప్రాజెక్టును బ్యాంకులు ప్రాధాన్య రంగంగా చూడాలని కోరారు. తెలంగాణను మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంతోపాటు 13% జీడీపీ పెరుగుదలే లక్ష్యంగా 2047 రోడ్మ్యాప్ను విడుదల చేస్తామని తెలిపారు.ఏటా 10% పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యుత్ సరఫరా లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో రాష్ట్రం పట్ల తమ కల ఏంటో, ఆ కలను సాధించేందుకు ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోతున్నామో వివరిస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డును కలుపుతూ ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం, మూసీ నది పునర్జీవనం వంటి అంశాలను ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు వివరిస్తామన్నారు.ఉపాధి, సంపద సృష్టికి మద్దతుడిప్యూటీ సీఎం బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ, మధ్యతరహా, చిన్న పరిశ్రమలకు (MSME) బ్యాంకులు పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ రెండు రంగాలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి లభించడంతోపాటు సంపద సృష్టించబడుతుందన్నారు. తద్వారా జీడీపీ పెరుగుతుందని తెలిపారు.విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిరాష్ట్ర ప్రభుత్వం విద్య, ఆరోగ్యం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించి, డిజిటలైజ్డ్ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతుందని చెప్పారు. బ్యాంకర్లు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను ఈ రంగాల్లో ఖర్చు చేయాలని, చీఫ్ సెక్రెటరీతో సహా ఉన్నతాధికారులను సంప్రదించి ముందుకు సాగాలని సూచించారు.ఇదీ చదవండి: గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్.. -
గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్..
గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (GIFT City) భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(IFSC)గా వృద్ధిని నమోదు చేసింది. 2020 నాటికి 82 కంపెనీలున్న గిఫ్ట్ సిటీలో 2025 నాటికి వీటి సంఖ్య ఏకంగా 409 సంస్థలకు చేరింది. ఇందులో 23 బ్యాంకులు, 177 ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలు, 200కు పైగా ఇతర ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు ఉన్నాయి. ఈ అసాధారణ వృద్ధికి దోహదపడిన ప్రధాన కారణాలు చూద్దాం.అభివృద్ధికి కారణాలుగిఫ్ట్ సిటీ ఇంతలా అభివృద్ధి చెందడానికి ప్రధానంగా రెండు అంశాలు కీలకం. ఒకటి ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు. రెండు.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు. గిఫ్ట్ సిటీలో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన అపారమైన పన్ను మినహాయింపులు కలిసొచ్చిన అంశం. పదేళ్లపాటు ఐఎఫ్ఎస్సీ యూనిట్లకు 100% ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నారు. విదేశీ కరెన్సీ రుణాలపై వడ్డీకి విత్హోల్డింగ్ పన్ను ఉండదు. గిఫ్ట్ సిటీ యూనిట్లకు అందించే లేదా వాటి నుంచి పొందే సేవలకు జీఎస్టీ వర్తించదు.నిర్దిష్ట లావాదేవీలు, మూలధన లాభాల పన్నుపై కూడా రాయితీలు లభిస్తాయి. గుజరాత్ ప్రభుత్వం స్టాంప్ డ్యూటీని కూడా రద్దు చేసింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కారణంగా గిఫ్ట్ సిటీ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలైన సింగపూర్, దుబాయ్ వంటి వాటి కంటే తక్కువ నిర్వహణ వ్యయాన్ని కలిగి ఉంది. దాంతో ఇది అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తోంది.నియంత్రణ సులభతరంఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ (IFSCA) స్థాపనతో బ్యాంకింగ్, బీమా, మూలధన మార్కెట్లు వంటి అన్ని ఆర్థిక సేవల నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చారు. ఇది సింగిల్ విండో క్లియరెన్స్ల ద్వారా వ్యాపారాన్ని స్థాపించడం, నిర్వహించడం సులభతరం చేస్తుంది.ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలువ్యాపార సంస్థలు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించడానికి వీలుగా అత్యాధునిక ఆఫీస్ స్పేస్లు, నివాస గృహాలు ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటి డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(ఒకే చోటు నుంచి అండర్ వాటర్ పైపుల ద్వారా విభిన్న భవనాలకు కూల్ వాటర్ సదుపాయం), భూగర్భ యుటిలిటీ టన్నెల్, ఆటోమేటెడ్ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ వంటి అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు సిద్ధం చేశారు. ఇక్కడ నివాస, వాణిజ్య ప్రాంతాలు దగ్గరగా ఉండటం ఉద్యోగుల జీవన నాణ్యతను పెంచుతుంది.గుజరాత్కు ఉన్న ప్రత్యేక అవకాశాలుసముద్ర తీరం, పోర్ట్ కనెక్టివిటీగుజరాత్ పొడవైన తీర రేఖను కలిగి ఉంది. ఇది సుమారు 1600 కిలోమీటర్లు. ఈ భౌగోళిక ప్రయోజనం కారణంగా గుజరాత్లో దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఓడరేవులు ఉన్నాయి (ముంద్రా, కాండ్లా). ఇది అంతర్జాతీయ వాణిజ్యం, లాజిస్టిక్స్కు గుజరాత్ను కేంద్రంగా నిలుపుతుంది. గిఫ్ట్ సిటీలో స్థాపించబడే అంతర్జాతీయ వాణిజ్య ఫైనాన్స్ సంస్థలకు, మెరైన్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ పోర్ట్ కనెక్టివిటీ ఒక సహజమైన వ్యాపార అవకాశాన్ని అందిస్తుంది.పరిశ్రమలుపెట్రోలియం, పెట్రోకెమికల్ రిఫైనరీలు, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, డైమండ్స్ వంటి విభాగాల్లో గుజరాత్కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ వైవిధ్యభరితమైన పరిశ్రమలు గిఫ్ట్ సిటీలోని ఆర్థిక సంస్థలకు స్థిరమైన వ్యాపార డిమాండ్ను సృష్టిస్తున్నాయి.ఇదీ చదవండి: వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ.. -
5.2% వద్దే నిరుద్యోగం
న్యూఢిల్లీ: నిరుద్యోగ రేటు అక్టోబర్లో 5.2 శాతం వద్దే కొనసాగింది. సెపె్టంబర్లోనూ 5.2 శాతంగా ఉండగా, ఆగస్ట్లో 5.1 శాతం, జూలైలో 5.2 శాతం, మే, జూన్లో 5.6 శాతం, ఏప్రిల్లో 5.1 శాతం వద్ద ఉండడం గమనార్హం. అక్టోబర్ నెలకు సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 15 ఏళ్ల వయసు పైబడిన వారికి సంబంధించిన గణాంకాలు ఇవి. → గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం కాస్తంత తగ్గుముఖం పట్టింది. సెప్టెంబర్లో 4.6 శాతంగా ఉంటే, అక్టోబర్లో 4.4 శాతానికి తగ్గింది. → పట్టణ ప్రాంతాల్లో ఉపాధి పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నాయి. నిరుద్యోగం రేటు సెపె్టంబర్లో ఉన్న 6.8 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది. → మొత్తం మీద 15 ఏళ్లు నిండిన మహిళల్లో నిరుద్యోగం 5.5 శాతం నుంచి 5.4 శాతానికి తగ్గింది. గ్రామీణ మహిళల్లో నిరుద్యోగ రేటు 4.3 శాతం నుంచి 4 శాతానికి పరిమితమైంది. → పురుషులకు సంబంధించి నిరుద్యోగ రేటు అక్టోబర్లో 5.1 శాతం వద్ద స్థిరంగా ఉంది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం 4.7 శాతం నుంచి 4.6 శాతానికి తగ్గింది. అదే పట్టణాల్లో మాత్రం 6 శాతం నుంచి 6.1 శాతానికి పెరిగింది. → వర్కర్–పాపులేషన్ రేషియో (మొత్తం జనాభాలో ఉపాధి పొందుతున్న వారు) 52.5 శాతంగా ఉంది. మహిళల్లో వర్కర్ పాపులేషన్ రేషియో స్థిరంగా పెరుగుతూ వస్తోంది. జూన్లో ఇది 30.2 శాతంగా ఉంటే, అక్టోబర్లో 32.4 శాతానికి మెరుగుపడింది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇది జూన్లో 33.6 శాతంగా ఉంటే, అక్టోబర్ నాటికి 36.9 శాతానికి పెరిగింది. → లేబర్ ఫోర్స్ పారి్టసిపేషన్ రేట్ (ఎల్ఎఫ్పీఆర్) జూన్లో ఉన్న 54.2 శాతం నుంచి అక్టోబర్లో 55.4 శాతానికి మెరుగుపడింది. -
ఆంక్షలతో భారత ఓఎంసీలకు రిస్కేమీ లేదు
న్యూఢిల్లీ: రష్యన్ ఆయిల్ కంపెనీలైన రోజ్నెఫ్ట్, ల్యూక్ ఆయిల్పై అమెరికా ఆంక్షలు విధించడం, రష్యా చమురు ఆధారిత రిఫైనరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య (ఈయూ) నిషేధం విధించడం భారత ప్రభుత్వరంగ చమురు సంస్థల మార్జిన్లు, పరపతి సామర్థ్యాలపై పెద్దగా ప్రభావం ఉండదని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే, ఈ ఆంక్షలు ఎంత కాలం పాటు కొనసాగుతాయి, ఎంత కఠినంగా అవి అమలవుతాయన్న దాని ఆధారంగా తుది ప్రభావం ఆధారపడి ఉంటుందని పేర్కొంది. 2025 జనవరి నుంచి ఆగస్ట్ మధ్య కాలంలో భారత చమురు దిగుమతుల్లో మూడింట ఒక వంతు రష్యా నుంచే ఉండడం గమనార్హం. రష్యా డిస్కౌంట్ రేటుపై చమురును విక్రయించడంతో ప్రభుత్వరంగ చమురు సంస్థల లాభదాయకత గణనీయంగా మెరుగుపడింది. సాధారణంగా మధ్యప్రాచ్య దేశాలపై చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువగా ఆధారపడేది. కానీ, 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన తర్వాత ఈ పరిస్థితుల్లో చాలా మార్పు వచి్చంది. పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో మార్కెట్ ధర కంటే తక్కువకే చమురును రష్యా ఆఫర్ చేయడంతో భారత కంపెనీలు అటువైపు మళ్లాయి. దీంతో భారత చమురు దిగుమతుల్లో అంతకుముందు రష్యా వాటా ఒక శాతంగా ఉంటే, 40 శాతానికి పెరిగింది. చమురు ధరలు తక్కువ స్థాయిలోనే.. ప్రపంచ చమురు ఉత్పత్తి సామర్థ్యం తగినంత ఉండడం ధరలను అదుపులోనే ఉంచుతుందని, బ్రెంట్ బ్యారెల్ ధర 2026లో సగటున 65 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపంది. 2025లో బ్రెంట్ బ్యారెల్ 70 డాలర్లుగా ఉండడాన్ని ప్రస్తావించింది. ఇక రష్యా చమురు ఆధారిత ఉత్పత్తులను ఈయూకి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న భారత్లోని ప్రైవేటు చమురు సంస్థలు రిస్్కను ఎదుర్కోవాల్సి రావొచ్చని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. మూడు ప్రభుత్వరంగ చమురు సంస్థల (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీ) ఇష్యూయర్ డిఫాల్ట్ రేటింగ్లు బలంగా ఉన్నట్టు తెలిపింది. ఎల్పీబీ సబ్సిడీల నష్టాన్ని ప్రభుత్వం ప్రకటించిన రూ.30వేల కోట్ల ప్యాకేజీతో గట్టెక్కొచ్చని పేర్కొంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్ 2025–26లో బ్యారెల్కు 6–7 డాలర్లు, 2026–27లో 6 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని అంచనా వేసింది. -
ఎగుమతులు డీలా
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు మన దేశ ఎగుమతులపై అక్టోబర్లో చెప్పుకోతగ్గ ప్రభావమే చూపించాయి. వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 11.8 శాతం తక్కువగా 34.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు 16.63 శాతం అధికమై 76.06 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 41.68 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లను అమలు చేస్తుండడం తెలిసిందే. సేవల ఎగుమతులు 38.52 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో సేవల ఎగుమతులు 34.41 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. → బంగారం దిగుమతులు 200 శాతం అధికమై 14.72 బిలియన్ డాలర్లకు చేరాయి. 2024 అక్టోబర్లో పసిడి దిగుమతుల విలువ 4.92 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూసినా బంగారం దిగుమతులు 21.44 శాతం పెరిగి 41.23 బివలియన్ డాలర్లకు చేరాయి. → వెండి దిగుమతులు ఏకంగా 529 శాతం పెరిగి 2.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. → చమురు దిగుమతులు మాత్రం 14.8 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2024 అక్టోబర్లో చమురు దిగుమతులు 18.9 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే చమురు దిగుమతుల స్థాయికి బంగారం దిగుమమతులు చేరినట్టు తెలుస్తోంది. → ఇంజనీరింగ్ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాభరణాలు, అపారెల్స్, టెక్స్టైల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ప్లాస్టిక్ గూడ్స్ ఎగుమతులు చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. ఇక చేతి ఉత్పత్తులు, కార్పెట్, లెదర్, ఐరన్ఓర్, టీ, రైస్, పొగాకు, దినుసుల ఎగుమతులు మరింత క్షీణించాయి. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలంలో ఎగుమతులు 254.25 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 0.63 శాతం ఎక్కువ. ఇదే కాలంలో దిగుమతులు 6.37 శాతం పెరిగి 451.08 బిలియన్ డాలర్లకు చేరాయి. తొలి ఆరు నెలల్లో వస్తు వాణిజ్య లోటు 196.82 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం దిగుమతుల్లో 5 శాతం బంగారం దిగుమతుల విలువ మొత్తం ఎగుమతుల్లో 5 శాతంగా ఉండడం గమనార్హం. అయితే, పసిడి దిగుమతులు భారీగా పెరగడానికి పండుగల సమయంలో డిమాండ్ కారణమని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేజ్ అగర్వాల్ పేర్కొన్నారు. బంగారం దిగుమతుల్లో 40 శాతం స్విట్జర్లాండ్ నుంచి రాగా, యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం చొప్పున దిగుమతైంది. -
అమెరికాతో భారత్ ఎల్పీజీ డీల్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు ఏడాదిపాటు యూఎస్ నుంచి వంట గ్యాస్(ఎల్పీజీ) కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్నాయి. డీల్లో భాగంగా 2026వరకూ 2.2 మిలియన్ టన్నుల ఎల్పీజీని దిగుమతి చేసుకోనున్నాయి. దీంతో యూఎస్ నుంచి భారత ప్రభుత్వం ఇంధన కొనుగోళ్లను పెంచుకోనుంది. తద్వారా యూఎస్తో వాణిజ్య మిగులును తగ్గించుకోనుంది. దేశీ వస్తువులపై యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లను విధించిన నేపథ్యంలో తాజా డీల్కు ప్రాధాన్యత ఏర్పడింది. దేశీ పీఎస్యూ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్.. యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచి ఎల్పీజీ దిగుమతికి ఏడాదిపాటు అమల్లో ఉండే కాంట్రాక్టుకు తెరతీసినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. భారత వార్షిక ఎల్పీజీ దిగు మతుల్లో ఇది 10% కాగా, దేశీ మార్కెట్లకు యూఎస్ ఎల్పీజీ సరఫరాపై తొలి కాంట్రాక్టుగా నిలవనుంది. 31 మిలియన్ టన్నులు పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధనం విషయంలో భారత్ స్వయం సమృద్ధిని సాధించినప్పటికీ.. దేశీయంగా వినియోగించే 31 మిలియన్ టన్నుల ఎల్పీజీలో 65 శాతంవరకూ దిగుమతి చేసుకుంటోంది. 2024లో దిగుమతి చేసుకున్న 20.4 మిలియన్ టన్నులలో 90 శాతంవరకూ యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా నుంచి లభించింది. గత రెండు నెలలుగా యూఎస్తో భారత్ నిర్వహిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య చర్చలలో భాగంగా వంట గ్యాస్ దిగుమతులకు తెరతీసింది. మరోపక్క పెట్రోల్, డీజిల్ తదితరాలను ప్రాసెస్ చేసేందుకు వీలయ్యే ముడిచమురులో 8 శాతంవరకూ యూఎస్ నుంచి కొనుగోలు చేస్తోంది. 51 శాతం అధికం ఈ ఏడాది(2025) తొలి అర్ధభాగంలో యూఎస్ నుంచి రోజుకి 2,71,000 బ్యారళ్ల(బీపీడీ) ముడిచమురు ను భారత్ దిగుమతి చేసుకుంది. 2024 తొలి ఆరు నెలల దిగుమతులతో పోలిస్తే ఇవి 51 శాతం అధికం. చారిత్రాత్మకం ప్రపంచంలోనే వేగవంత వృద్ధిలో ఉన్న, భారీ ఎల్పీజీ మార్కెట్ అయిన భారత్ తొలిసారి యూఎస్తో డీల్ కుదుర్చుకున్నట్లు చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది చారిత్రాత్మకంకాగా.. తద్వారా దేశ ప్రజలకు అందుబాటు ధరలో ఎల్పీజీ సరఫరాలకు తెరతీసినట్లు చెప్పారు. -
రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ECMS)’ కింద రూ.7,172 కోట్ల పెట్టుబడితో 17 కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ.65,111 కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతుందని అంచనా. ఈ ఆమోదాలతో ECMS కింద మొత్తం ఆమోదించబడిన ప్రాజెక్టుల సంఖ్య 24కి చేరింది.ఇందులో జబిల్ సర్క్యూట్ ఇండియా, ఏక్యూస్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, యునో మిండా, ఏఎస్యూఎక్స్ సేఫ్టీ కాంపోనెంట్స్ ఇండియా, జెట్ఫాబ్ ఇండియా, టీఈ కనెక్టివిటీ ఇండియా, మీనా ఎలక్ట్రోటెక్..వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ 17 ప్రాజెక్టులు కెమెరా మాడ్యూల్, కనెక్టర్లు, మల్టీ లేయర్ పీసీబీ, ఆసిలేటర్లు.. వంటి ఆరు వేర్వేరు విభాగాల్లో తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి.కొత్త ప్రాజెక్టులను ప్రకటించిన సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..భారతదేశంలోనే డిజైన్ సామర్థ్యాలను పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అన్ని ఉత్పత్తుల్లో అత్యున్నతమైన ‘సిక్స్-సిగ్మా’ నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ఉత్పత్తుల మూల్యాంకన ప్రక్రియలో నాణ్యతా వ్యవస్థలు కీలకంగా ఉంటాయని మంత్రి నొక్కి చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కోసం కొత్త నైపుణ్య ఫ్రేమ్వర్క్ సిద్ధంగా ఉందని తెలిపారు.గత నెలలో మంత్రి వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసీఎంఎస్ కింద ప్రభుత్వం రూ.59,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు అందాయి. ఈ పథకం కింద 91,600 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దరఖాస్తుదారులు దాదాపు 1.41 లక్షల మందికి ఉపాధి కల్పించాలని ప్రతిపాదించారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 8న రూ.22,919 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నోటిఫై చేసింది. అప్లికేషన్ విండో మే 1న ఓపెన్ చేసి సెప్టెంబర్ 30న మూసివేశారు.ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ECMS) అనేది భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ భాగాలు, సబ్-అసెంబ్లీలు, కాపిటల్ గూడ్స్ తయారీని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా బలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే దీని లక్ష్యం. ECMS కింద పెట్టుబడిదారులు, తయారీదారులకు రెండు రకాల ప్రోత్సాహకాలు అందుబాటులో ఉంటాయి. టర్నోవర్-లింక్డ్ ప్రోత్సాహకాలు, కాపెక్స్-లింక్డ్ ప్రోత్సాహకాలు ఉన్నాయి.ఇదీ చదవండి: వీడియో వాంగ్మూలం ఇచ్చేందుకు రెడీ.. -
వాణిజ్య చర్చలపై దృష్టి
దేశీయంగా ఆర్థిక గణాంకాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ గత సమీక్షా సంబంధ వివరాలు(మినిట్స్) ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. వీటికితోడు యూఎస్తో వాణిజ్య టారిఫ్లపై చర్చల పురోగతి సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ఆటుపోట్ల మధ్య మరింత బలపడవచ్చని భావిస్తున్నారు. వివరాలు చూద్దాం..ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను దేశ, విదేశీ గణాంకాలతోపాటు పలు ఇతర అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ప్రధానంగా యూఎస్తో వాణిజ్య టారిఫ్లపై చర్చల పురోగతిపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అత్యధికకాలం కొనసాగిన యూఎస్ ప్రభుత్వ షట్డౌన్కు గత వారాంతాన ముగింపు పలకడం ప్రోత్సాహకర అంశమని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక(జూలై–సెప్టెంబర్) ఫలితాలు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో వ్యవస్థాగత సానుకూలతలు, పటిష్ట ఫండమెంటల్స్ కలిగిన రంగాలవైపు ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. దీంతో ఈ ఏడాది ద్వితీయార్థం(అక్టోబర్ 2025–మార్చి2026)లో అప్గ్రేడ్కు వీలున్న రంగాలవైపు పోర్ట్ఫోలియోల సవరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. క్యాపిటల్ మార్కెట్ సంబంధిత స్టాక్స్ వెలుగులో నిలవనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు. ఇందుకు రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, సిప్ పెట్టుబడులు, ఐపీవోల హవా దోహదపడనున్నట్లు వివరించారు. బీహార్ ఎఫెక్ట్ దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉండటానికితోడు.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ విస్పష్ట మెజారిటీ సాధించడం సానుకూల అంశాలుగా నిపుణులు పేర్కొన్నారు. క్యూ2లో ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్సహా పలు రంగాల దిగ్గజాలు ఆశావహ ఫలితాలు సాధించడం సెంటిమెంటుకు బలాన్నివ్వనున్నట్లు అభిప్రాయపడ్డారు. పండుగులు, పెళ్ళిళ్ల సీజన్ నేపథ్యంలో డిమాండ్కు వీలున్న రంగాలు పెట్టుబడులను ఆకట్టుకోవచ్చని ఖేమ్కా ప్రస్తావించారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో పెట్టుబడులు పుంజుకునే వీలున్నట్లు అంచనా వేశారు. టెక్నాలజీ, మెటల్ రంగాలు పుంజుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వాణిజ్య గణాంకాలు వారాంతాన దేశీయంగా అక్టోబర్ నెల ఎగుమతి, దిగుమతి గణాంకాలు విడుదలకానున్నాయి. 2025 సెప్టెంబర్లో ఎగుమతులకంటే దిగుమతులు పెరగడంతో వాణిజ్య లోటు 32.15 బిలియన్ డాలర్లకు చేరింది. ఇవికాకుండా తయారీ, సర్వీసెస్ తదితర పీఎంఐ ఇండెక్సులు విడుదలకానున్నాయి. ఇప్పటికే రిటైల్ ధరలు, టోకు ధరల ద్రవ్యోల్బణం భారీగా వెనకడుగు వేయడంతో ఆర్బీఐ చేపట్టనున్న డిసెంబర్ పాలసీ సమీక్షపై సానుకూల అంచనాలకు వీలున్నట్లు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల కోతసహా.. ధరలు దిగిరావడం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు.గత వారమిలాపలు ఆటుపోట్ల మధ్య గత వారం(10–14) దేశీ స్టాక్ మార్కెట్లు బలపడ్డాయి. వెరసి రెండు వారాల నష్టాలకు చెక్ పెట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 1,347 పాయింట్లు(1.6 శాతం) పుంజుకుని 84,563 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 418 పాయింట్లు(1.6 శాతం) లాభపడి 25,910 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్క్యాప్ 0.9 శాతం జంప్చేయగా.. స్మాల్క్యాప్ 0.15 శాతమే బలపడింది.విదేశీ అంశాలుగత పాలసీ సమీక్షా వివరాల(మినిట్స్)ను యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ వారం వెల్లడించనుంది. అంతేకాకుండా ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పరపతి విధానాలపై ప్రసంగించనున్నారు. గత నెలలో నిర్వహించిన పరపతి సమావేశంలో ఫెడ్ కమిటీ వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి దిగివచ్చాయి. మరోవైపు చైనా ఎఫ్డీఐలు, వడ్డీ రేట్ల వివరాలు, యూఎస్ తయారీ, హౌసింగ్ తదితర గణాంకాలు సైతం ఈ వారం వెల్లడికానున్నాయి. కాగా.. అక్టోబర్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో పెట్టుబడులు చేపట్టినప్పటికీ తిరిగి ఈ నెలలో అమ్మకాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశాలన్నిటికీ ప్రాధాన్యత ఉన్నట్లు నాయిర్ తెలియజేశారు. ముడిచమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం తదితర అంశాలు సైతం కీలకమేనని విశ్లేషకులు ప్రస్తావించారు.సాంకేతికంగా..గత వారం నికరంగా మార్కెట్లు పుంజుకున్నాయి. ఈ బాటలో మరింత బలపడేందుకు వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఈ అంచనాల ప్రకారం ఎన్ఎస్ఈ నిఫ్టీ బలహీనపడితే తొలుత 25,750 వద్ద, తదుపరి 25,500 వద్ద మద్దతు లభించవచ్చు. ఆపై 26,300–26,800వరకూ పురోగమించే వీలుంది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ తొలుత 84,000 వద్ద, ఆపై 83,600 వద్ద మద్దతు కూడగట్టుకోవచ్చు. తదుపరి బలపడితే 85,500–85,600 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. -
బంగారానికి డబ్బులు కాస్తాయ్!
ధర ఎంతున్నా.. తమ తాహతు మేరకు పసిడి కొనుగోలు అన్నది భారతీయ కుటుంబాల్లో సాధారణంగా కనిపించే ధోరణి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ 2025 అక్టోబర్ నివేదిక ప్రకారం.. భారతీయుల ఇళ్లల్లో 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటి విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.334 లక్షల కోట్లు). దేశ జీడీపీలో 88.8 శాతానికి సమానం. పసిడి ధరలు రికార్డు గరిష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంతటి విలువైన పసిడిని బీరువాల్లోనో.. లేదంటే బ్యాంక్ లాకర్లలో పెట్టే వారి ముందు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాడకంలో లేని పసిడిని ఉత్పాదకతకు వినియోగించుకోవచ్చు. అదనపు రాబడి మార్గాలను ప్రయతి్నంచొచ్చు. బంగారం రుణాలు, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, పసిడి ఆధారిత పెట్టుబడుల పథకాలు ఇలా ఎన్నో సాధనాలున్నాయి. వాటి గురించి తెలియజేసే కథనమే ఇది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కేంద్ర సర్కారు 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్/పసిడి నగదీకరణ పథకం)ను తీసుకొచ్చింది. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని ఉత్పాదకత వైపు తీసుకువచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద వ్యక్తులతోపాటు సంస్థలు భౌతిక బంగారాన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. జమ చేసిన మేర బంగారం విలువపై ఏటా 2.25–2.5 శాతం మేర వడ్డీని పొందొచ్చు. దీనివల్ల సదరు బంగారాన్ని ఎక్కడ భద్రంగా నిల్వ చేసుకోవాలన్న ఆందోళన ఉండదు. బంగారం ఆభరణాలు, కాయిన్లు, కడ్డీలను అధీకృత కేంద్రానికి తరలించి అక్కడ స్వచ్ఛత పరీక్షిస్తారు. ఈ పథకం కింద కనీసం 10 గ్రాముల బంగారం నుంచి ఎంత వరకు అయినా డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. జమ చేసిన మేర బంగారానికి (స్వచ్ఛత అనంతరం) బ్యాంక్లు డిపాజిట్ రసీదును జారీ చేస్తాయి. సదరు బంగారాన్ని కరిగించి వినియోగంలోకి తెచ్చుకుంటాయి. గడువు ముగిసిన తర్వాత జమ చేసినంత బంగారాన్ని తిరిగి పొందొచ్చు. లేదంటే అప్పటి విలువ మేరకు నగదు రూపంలోనూ తీసుకోవచ్చు. 2025 మార్చి నుంచి మధ్య, దీర్ఘకాల గోల్డ్ మానిటైజేషన్ డిపాజిట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడాది, మూడేళ్ల కాలానికే ప్రస్తుతం ఈ పథకం కింద బంగారం డిపాజిట్కు అనుమతి ఉంది. దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు. మంచి విలువైన పథకం అయినప్పటికీ దీనిలో పాల్గొనే వారు చాలా తక్కువగా ఉంటున్నట్టు ఆనంద్రాఠి వెల్త్ మ్యూచువల్ ఫండ్స్ విభాగం హెడ్ స్వేత రజని తెలిపారు. బంగారం ఆభరణాలతో ఉన్న దీర్ఘకాల అనుబంధం, సెంటిమెంట్ను ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు. కనీసం దెబ్బతిన్న ఆభరణాలు, వినియోగించని వాటి విషయంలో అయినా గోల్డ్ మానిటైజేషన్ పథకం ఎంతో అనుకూలం. రిస్క్ లేని రాబడులను అందుకోవచ్చు. ఆభరణాలతో భావోద్వేగమైన బంధం ఉన్న వారికి ఇది అనుకూలం కాదు. ఎందుకంటే మానిటైజేషన్ కింద డిపాజిట్ చేస్తే వాటిని పూర్వపు రూపంలో తిరిగి పొందలేరని రజని తెలిపారు. → ఇది ప్రభుత్వ హామీ కలిగిన పథకం. ఇందులో డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రాబడి 2.25–2.5%. వడ్డీని ఏటా చెల్లిస్తారు. → ఆభరణాలు, కాయిన్లను డిపాజిట్ చేయొచ్చు. గడువు తీరిన తర్వాత తిరిగి బంగారం లేదంటే నగదు రూపంలో తీసుకోవచ్చు. → కేవలం 1–3 ఏళ్ల కాలానికే అందుబాటులో ఉంటుంది. వేగంగా నగదు మార్చుకోవడానికి ఇందులో అవకాశం లేదు. గడువు ముగిసే వరకు ఆగాల్సిందే. → 10 గ్రాముల్లోపు బంగారండిపాజిట్కు అవకాశం లేదు. నగలపై రుణం.. వినియోగించకుండా ఉన్న ఆభరణాలను, వాటితో ఉన్న అనుబంధం దృష్ట్యా గోల్డ్ మానిటైజేషన్కు మనసొప్పని వారు.. వాటిని రుణాల కోసం వినియోగించుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటుపై రుణాన్ని వేగంగా పొందొచ్చు. బంగారం తాకట్టు విలువపై 75 శాతం వరకు రుణం కింద బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఇస్తుంటాయి. రూ.5 లక్షల్లోపు రుణాలకు 85 శాతం విలువ వరకు కూడా (ఎల్టీవీ) ఇస్తాయి. ప్రతి నెలా వడ్డీ చెల్లించి, గడువు ముగిసిన తర్వాత అసలు చెల్లించొచ్చు. కొన్ని బ్యాంకులు గడువు చివర్లో వడ్డీ, అసలు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. కాకపోతే వడ్డీని ప్రతి నెలా చార్జ్ చేస్తుంటాయి. దీంతో ఏ నెలకు ఆ నెల వడ్డీ కట్టకపోతే, దానిపై రెండో నెలలో వడ్డీ భారీగా పెరిగిపోతుంది. రుణాన్ని సమాన నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించే ఆప్షన్ కూడా ఉంటుంది. బంగారం తాకట్టుపై ఓవర్డ్రాఫ్ట్ రుణాన్ని కూడా పొందొచ్చు. అనుమతించిన రుణాన్ని అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. తిరిగి ఎప్పుడైనా చెల్లించొచ్చు. ఎలాంటి ఆదాయపత్రాలు, క్రెడిట్ స్కోర్ ఈ రుణాలకు అవసరం లేదు. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 12–15 శాతం వరకు ఉంటోంది. అదే బంగారంపై రుణాలు 8 శాతం రేటు నుంచి లభిస్తున్నాయి. గోల్డ్ అప్రైజర్, ప్రాసెసింగ్ చార్జీల పేరుతో కొంత చార్జీ భరించాల్సి ఉంటుంది. ముందుగా రుణాన్ని చెల్లించేస్తే ఎలాంటి చార్జీ పడదు. కొన్ని సంస్థలు ముందస్తు చెల్లింపులపై కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. రుణ గడువు ముగిసిన తర్వాత చెల్లింపుల్లో విఫలమైతే 30–60 రోజుల వ్యవధి అనంతరం, బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు వేలం వేస్తుంటాయి. → ఆభరణాల విలువపై 85 శాతం వరకు రుణంగా పొందొచ్చు. → వ్యక్తిగత రుణాలు తీసుకుని అధిక వడ్డీ భారం మోస్తున్న వారు.. తమ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారం ఆభరణాలు, కాయిన్లపై రుణంతో భారాన్ని తగ్గించుకోవచ్చు. → గడువులోపు రుణాన్ని తీర్చివేయడంలో విఫలమైతే బంగారాన్ని వేలం వేస్తారు. → రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు గణనీయంగా పడిపోతే, కొంత మొత్తాన్ని మధ్యంతరంగా చెల్లించాల్సి రావడం ప్రతికూలత.బంగారం లీజుకు.. బంగారాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా కొంత రాబడి పొందొచ్చు. నగల వ్యాపారులకు (జ్యుయెలర్) మూలధన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వారు దుకాణాల్లో ఆభరణాల నిల్వ కోసం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం పడుతుంది. కనుక నగల వ్యాపారులు ఆభరణాలను లీజుకు తీసుకుని ఈ అవసరాలను గట్టెక్కుతుంటారు. దీనిపై కొంత రాబడి చెల్లిస్తుంటారు. దీనివల్ల బంగారాన్ని బీరువా లేదా బ్యాంకు లాకర్లకు పరిమితం కాకుండా, ఆదాయాన్ని తెచ్చిపెట్టే సాధనంగా మార్చుకోవచ్చు. సేఫ్గోల్డ్ అనే ప్లాట్ఫామ్ ఇందుకు వీలు కలి్పస్తోంది. ఈ సంస్థను సంప్రదించినట్టయితే అనుమతి తీసుకుని, లీజుకు ఇచ్చిన బంగారాన్ని కరిగించి అందులోని స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అనంతరం 24 క్యారెట్ బంగారం కిందకు మారుస్తారు. అనంతరం సంబంధిత వ్యక్తి పేరుపై డిజిటల్ గోల్డ్ ఖాతా తెరిచి బంగారం విలువ మేరకు జమ చూపిస్తారు. అనంతరం సేఫ్గోల్డ్ ప్లాట్ఫామ్పై లిస్ట్ అయిన నగల వ్యాపారులకు మీ బంగారాన్ని లీజుకు ఇవ్వొచ్చు. ఏటా 2–5 శాతం మధ్య రాబడి లభిస్తుంది. రాబడిని రూపాయిల్లో కాకుండా తిరిగి బంగారం రూపంలోనే జమ చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో తాము లీజుకు ఇచ్చిన బంగారానికి అదనంగా మరికొంత పసిడిని పోగుచేసుకోవచ్చు. పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా, దీర్ఘకాలంలో అదనపు రాబడిని ఈ మార్గంలో సంపాదించుకోవచ్చు. → ఈ విధానంలో ఆభరణాలు, కాయిన్లను కరిగించి, వాటి విలువపై 2–5 శాతం మధ్య రాబడి చెల్లిస్తారు. → కోరుకున్నప్పుడు తిరిగి పాత ఆభరణాలను పొందడం సాధ్యపడదు. ఒకవేళ భౌతిక బంగారం రూపంలోనే వెనక్కి తీసుకునేట్టు అయితే డెలివరీ చార్జీలు చెల్లించుకోవాలి. ఫండ్స్లోకి మార్చుకోవడం భౌతిక బంగారాన్ని గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లోకి మార్చుకోవడం మరో మార్గం. దీనివల్ల భద్రతపరమైన రిస్క్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా నగదుగా మార్చుకోవచ్చు. ఇందులో లాభ, నష్టాలు రెండూ ఉన్నాయి. నాణ్యత, నిల్వ, భద్రతాపరమైన రిస్్కలను తొలగించుకోవడం సానుకూలతలు. పెద్ద మొత్తంలో బంగారం కలిగిన వారికి, దాన్ని కాపాడుకోవడం, ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం పెద్ద సవాలే. ఇలాంటి వారు మొత్తం కాకపోయినా సగం బంగారాన్ని అయినా డిజిటల్ రూపంలోకి మార్చుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఏడాది నిండిన తర్వాత డిజిటల్ గోల్డ్ను విక్రయించిన సందర్భంలో వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. → భౌతిక బంగారాన్ని విక్రయించి, డిజిటల్గా మారిపోవడం వల్ల పారదర్శకత, భద్రత, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, డిజిటల్ రూపంలో (ఈటీఎఫ్లు) ఉంటే స్వల్ప స్థాయిలో ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. → భౌతిక బంగారాన్ని విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.కొత్త ఆభరణాలకు అప్గ్రేడ్... కొందరు ఇంట్లో వినియోగంలో లేని బంగారాన్ని అలాగే ఉంచేసి, కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. దీనికి బదులు పాత బంగారాన్ని కొత్త ఆభరణాల కిందకు అప్గ్రేడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. కొత్త ఆభరణాల కిందకు మార్చుకోవడం వల్ల నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగంలోకి వస్తుంది. దీంతో కొత్తవాటి కొనుగోలుకు అదనపు పెట్టుబడి అవసరం రాదు. కొత్త డిజైన్లకు, తయారీ కోసం చార్జీల వరకు చెల్లిస్తే చాలు. సున్నా తరుగు లేదా అతి తక్కువ తరుగు చార్జీల ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్రెండ్కు అనుగుణంగా కొత్త ఆభరణాలను ధరించామన్న సంతృప్తి దక్కుతుంది. → గతంలో ఎప్పుడో కొన్న ఆభరణాల్లో స్వచ్ఛత పాళ్లు తక్కువ. ఇప్పుడు వాటిని హాల్మార్క్ ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. → వినియోగంలో లేని ఆభరణాలనే కొత్త ఆభరణాల అప్గ్రేడ్ కోసం పరిశీలించొచ్చు. → బంగారం విలువలో 10–15 శాతం చార్జీలను భరించాల్సి రావచ్చు. జీఎస్టీ కూడా పడుతుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్, జేడీ వాన్స్ పరస్పరం విభిన్న వ్యాఖ్యలు
అమెరికాలో హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ ఇటీవల కాలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విదేశీ కార్మికుల సమస్యపై సాహసోపేతమైన ప్రకటన చేశారు. విదేశీ ఉద్యోగులను చౌక కార్మికులని పేర్కొనడంతో పాటు అమెరికాకు వారి అవసరం లేదని స్పష్టం చేశారు. సీన్ హన్నిటీతో జరిగిన పాడ్కాస్ట్ సంభాషణలో వాన్స్ మాట్లాడుతూ.. డెమొక్రాట్ మోడల్ ప్రకారం.. తక్కువ వేతనాలు తీసుకునే ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులు యూఎస్లో ఉన్నారని చెప్పారు. ఇది దేశంలోని ఉద్యోగాలు, వేతనాల శ్రేయస్సుకు హాని కలిగిస్తుందని పేర్కొన్నారు. అమెరికన్ కార్మికులను శక్తివంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా వారు అధిక వేతనాలు పొందుతారని, దేశం మెరుగుపడుతుందని తెలిపారు.భారతీయ టెక్నాలజీ రంగం, వైద్య రంగం నిపుణులు, వైట్ కాలర్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులుగా ఉన్న హెచ్-1బీ వీసాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సంస్కరణల ప్రక్రియ మొదలైంది. ఇది గ్రీన్ కార్డ్, పౌరసత్వం కోసం భారతీయుల మార్గాలను నేరుగా ప్రభావితం చేయనుంది.వీసా సంస్కరణలుసెప్టెంబర్ 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతమంది నాన్ ఇమ్మిగ్రెంట్ కార్మికుల ప్రవేశంపై పరిమితి విధించాలని భావించారు. దాంతో హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని సంస్కరించడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 21, 2025 తర్వాత దాఖలు చేసిన కొన్ని హెచ్-1బీ పిటిషన్లకు అర్హత షరతుగా అదనంగా రూ.1,00,000 డాలర్లు చెల్లించాలి. ఈ భారీ రుసుము పెంపు వీసా ప్రోగ్రామ్ లక్ష్యాన్ని, లబ్ధిదారులను గణనీయంగా ప్రభావితం చేయనుంది.ట్రంప్ వైఖరి నుంచి వాన్స్ ‘యూటర్న్’వలస ఉద్యోగులకు సంబంధించి వాన్స్ చేసిన వ్యాఖ్యలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వైఖరితో భిన్నంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో నిర్దిష్ట ప్రతిభ ఉన్న కార్మికులు లేరని చెప్పారు. ఆ కొరతను తీర్చడానికి విదేశీ ప్రతిభను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే, వాన్స్ అభిప్రాయం దీనికి భిన్నంగా ఉంది. ఈ చర్చ అమెరికన్ శ్రామిక శక్తికి కీలకం ఉంది. ఒకవైపు తక్కువ వేతనాల కోసం విదేశీ కార్మికులను తీసుకురావడం ద్వారా దేశీయ ఉద్యోగాలు దెబ్బతింటాయని విమర్శకులు భావిస్తున్నారు. మరోవైపు, ట్రంప్ సూచించినట్లుగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాల్లో ఉన్న అంతరాన్ని భర్తీ చేయడానికి, ఆవిష్కరణలను కొనసాగించడానికి, తయారీ రంగంలో శిక్షణ ఇవ్వడానికి హెచ్-1బీ వీసాదారులు అవసరం అని పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు.ఇదీ చదవండి: ఏడు పవర్ఫుల్ ఏఐ టూల్స్.. -
ప్రపంచంలో 10 పవర్ఫుల్ మిలిటరీ దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత శక్తివంతమైన సైనిక దళాల తాజా ర్యాంకింగ్స్ను గ్లోబల్ ఫైర్ పవర్ (Global Fire Power) వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్లో యునైటెడ్ స్టేట్స్ (USA) అగ్రస్థానంలో ఉండగా, భారత్ సైనిక బలం పరంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది.నివేదికల ప్రకారం గ్లోబల్ ఫైర్ పవర్ ఈ సంవత్సరం 145 దేశాల సాయుధ దళాలను వారి వనరులు, యుద్ధ పరికరాల ఆధారంగా అంచనా వేసింది. దళాల బలం, ఆర్థిక స్థితి, వనరులతో సహా 60కి పైగా ప్రమాణాలను లెక్చించి, ఆయా దేశాల మిలిటరీలను పోల్చి ర్యాంకింగ్ను కేటాయించింది. ఈ ర్యాంకింగ్లో దేశాల అణు సామర్థ్యాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.టాప్ 10 అత్యంత శక్తివంతమైన మిలిటరీ దేశాలు1. యునైటెడ్ స్టేట్స్ (USA)-1వ ర్యాంకుపవర్ ఇండెక్స్ స్కోరు: 0.0744ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా ర్యాంక్ పొందింది. 2024 లో 873 బిలియన్ డాలర్లు దాటిన ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ బడ్జెట్ను కలిగి ఉంది.2. రష్యా-2వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.0788విస్తారమైన అణ్వాయుధాలు కలిగి ఉంది. విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకుల పరంగా ఇది రెండో స్థానంలో ఉంది.3. చైనా: 3వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.0788పవర్ ఇండెక్స్లో రష్యాకు సమానంగా ఉంది.4. భారతదేశం: 4వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.1184సైనిక బలం పరంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానంలో ఉంది.5. దక్షిణ కొరియా: 5వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.16566. యునైటెడ్ కింగ్డమ్ (UK): 6వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.17857. ఫ్రాన్స్: 7వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.18788. జపాన్: 8వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.18399. టర్కీ: 9వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.1902ఫ్రిగేట్ నౌకాదళాలు, హెలికాప్టర్లు, నావికాదళ కార్వెట్లు, జలాంతర్గాములు వంటివి అధికంగా ఉన్నాయి.10. ఇటలీ: 10వ స్థానంపవర్ ఇండెక్స్ స్కోరు: 0.2164ఇదీ చదవండి: ఓపెన్ఏఐతో ఫోన్ పే భాగస్వామ్యం -
ఎంఎస్ఎంఈల ప్రగతికి నిబంధనల అడ్డుగోడలు
నిబంధనల అమలుకు అధిక వ్యయం చేయాల్సి రావడం, నియంత్రణలపరమైన జాప్యం, అనుమతులకు సింగిల్ విండో వ్యవస్థ లేకపోవడం దేశ ఎంఎస్ఎంఈలు వాటి పూర్తి సామర్థ్యాలను చేరుకోలేకపోవడానికి అవరోధాలుగా అసోచామ్ నివేదిక పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈలు) వాటి పూర్తి సామర్థ్యం మేర రాణించేందుకు వీలుగా రాష్ట్రాల స్థాయిలో సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సూచించింది.జీఎస్టీ సంబంధిత అవరోధాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్ల్లో జాప్యాలు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో సమస్యలు, లాజిస్టిక్స్ (రవాణా), మౌలిక వసతుల పరమైన అవరోధాలు, ఇ–వే బిల్లుల్లో సమస్యలతోపాటు.. పశ్చిమబెంగాల్, ఒడిశాలో విద్యుత్ సరఫరా పరమైన సమస్యలు ఉత్పత్తి నష్టాలకు కారణమవుతున్నట్టు తెలిపింది. కంపెనీల చట్టం, భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిబంధనలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారాయంటూ.. ప్రక్రియలు ఎంతో సంక్లిష్టంగా ఉండడం, సర్టిఫికేషన్ జారీలో జాప్యం, ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబందనల్లో అస్పష్టతలను సైతం ఎంఎస్ఎంఈలు రాణించడానికి అవరోధాలుగా ప్రస్తావించింది. సింగిల్ విండో వ్యవస్థసకాలంలో అనుమతులు, ప్రక్రియలు పూర్తి చేసే సింగిల్ విండో వ్యవస్థ ఎంఎస్ఎంఈ పరిశ్రమ ముఖచిత్రాన్ని మార్చేస్తుందని, రాష్ట్రాల స్థాయిలో పెట్టుబడుల వాతావరణం మెరుగుపడుతుందని అసోచామ్ నివేదిక సూచించింది. పశ్చిమబెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సింగిల్ విండో వ్యవస్థను వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరింది. జాతీయ స్థాయిలోనూ చిన్న వ్యాపార సంస్థలకు నిబంధనల అమలును సమూలంగా మార్చేయాలని పేర్కొంది. చిన్న సంస్థలకు తప్పనిసరి ఆడిట్ నుంచి మినహాయింపులు కల్పించాలని, గ్రేడ్వారీగా పెనాల్టీ వ్యవస్థ ఉండాలని సూచించింది. అనుమతులను క్రమబద్దీకరించడం, జీఎస్టీ సంస్కరణలు, భూ వినియోగ మార్పిడి అనుమతులను సకాలంలో మంజూరు చేయడం, సౌకర్యవంతమైన కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరింది. అలాగే మౌలిక వసతులను మెరుగుపరచాలని, సులభతర ఇ–వే బిల్లు విధానాన్ని, ప్రత్యేకమైన లాజిస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు -
స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం
వియత్నాం నుంచి వచ్చే చౌక స్టీల్ దిగుమతులను కట్టడి చేసేందుకు కేంద్ర సర్కారు యాంటీ డంపింగ్ డ్యూటీ విధించింది. హాట్ రోల్డ్ స్టీల్ ఉత్పత్తులు టన్నుపై 121.55 డాలర్ల సుంకాన్ని ప్రకటించింది. చౌక ఉత్పత్తుల నుంచి దేశీ తయారీదారులను కాపాడేందుకు ఈ చర్య తీసుకుంది.డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) సిఫారసు మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐదేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. చౌక దిగుమతులపై దర్యాప్తు చేయాలన్న దేశీ పరిశ్రమ చేసిన వినతి మేరకు డీజీటీఆర్ విచారణ చేసి, యాంటీ డంపింగ్ డ్యూటీ విధింపునకు సిఫారసు చేసింది. భారత్–వియత్నాం మధ్య 2023–24లో ద్వైపాక్షిక వాణిజ్య 14.81 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ 5.47 బిలియన్ డాలర్ల విలువ మేర ఎగుమతులు చేసింది.ఇదీ చదవండి: బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు -
బాలల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు
భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ బాలల పట్ల చూపిన అపారమైన ప్రేమ, ఆప్యాయతలను గుర్తుచేసుకుంటూ ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం(Childrens Day) జరుపుకుంటున్నాం. పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఎదిగి దేశానికి ఉత్తమ పౌరులుగా మారడానికి సరైన వాతావరణం కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను, చట్టాలను రూపొందించి అమలు చేస్తోంది. బాలల రక్షణ, విద్య, ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాల వివరాలు చూద్దాం.విద్యా హక్కు చట్టం 20096 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి చిన్నారికి ఉచితంగా, తప్పనిసరిగా నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించాలి.ఏ చిన్నారి నుంచి పాఠశాల ఫీజులు, ఛార్జీలు లేదా ఖర్చుల రూపంలో డబ్బు వసూలు చేయకూడదు.ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లల కోసం తరగతి సీట్లలో 25% రిజర్వేషన్ కల్పించాలి.ఏ విద్యార్థిని కూడా 8వ తరగతి వరకు ఫెయిల్ చేయకూడదు లేదా పాఠశాల నుంచి తొలగించకూడదు (తరువాత కొన్ని రాష్ట్రాలు ఈ నిబంధనను సడలించాయి).పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి వంటి ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.మిషన్ వాత్సల్యభారతదేశంలోని ప్రతి చిన్నారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. ఇది బాలల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఒక సమగ్ర పథకం.సంరక్షణ అవసరమైన పిల్లల కోసం శిశు గృహాలు, ప్రత్యేక దత్తత సంస్థలు, ఓపెన్ షెల్టర్లు మొదలైన వాటిని ఏర్పాటు చేయాలి.బాలల దత్తత, పోషణ సంరక్షణ, స్పాన్సర్షిప్ (ఆర్థిక సహాయం) వంటి కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. ఈ విధానం ద్వారా పిల్లలను సంస్థలకు కాకుండా కుటుంబ వాతావరణంలో పెంచడానికి ప్రాధాన్యత ఇస్తారు.జువైనల్ జస్టిస్ బోర్డులు (JJBs), బాలల సంరక్షణ కమిటీలు (CWCs), బాలల భద్రతా యూనిట్ల ఏర్పాటుకు మద్దతు ఇస్తారు.కష్టాల్లో ఉన్న పిల్లల కోసం 24 గంటలు పనిచేసే చైల్డ్లైన్ (1098) సేవలను బలోపేతం చేయాలి.బేటీ బచావో, బేటీ పడావోబాలికల పట్ల సామాజిక దృక్పథంలో మార్పు తీసుకురావడం, లింగ వివక్షను తొలగించడం, ఆడపిల్లల సంఖ్య తగ్గుదలను నివారించడం, బాలికల విద్యను ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం.బాలికల జనన నిష్పత్తి తగ్గుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి, సమాజంలో బాలికల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి.పాఠశాలల్లో బాలికల నమోదును పెంచడం, వారి డ్రాపౌట్ రేటును తగ్గించడం, ఆరోగ్య సంరక్షణ సేవలు అందేలా చూడాలి.బాల్య వివాహాలు, గర్భంలో లింగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన చట్టాలను కఠినంగా అమలు చేయాలి.ఈ పథకం స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖల సమన్వయంతో పనిచేస్తుంది.ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణం(మధ్యాహ్న భోజన పథకం)ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలి.ఆకలితో పాఠశాల మానేసే సమస్యను తగ్గించి పిల్లలు తరగతి గదిలో చురుగ్గా పాల్గొనేలా చేయాలి.కుల, మత, ఆర్థిక వ్యత్యాసాలు లేకుండా పిల్లలందరూ ఒకే చోట కూర్చుని భోజనం చేయడం ద్వారా సామాజిక సమానత్వాన్ని పెంచాలి.ఈ పథకంలో భాగంగా అదనంగా చిరుధాన్యాలు కూడా సరఫరా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.సుకన్య సమృద్ధి యోజనఆర్థికంగా బాలికలకు భద్రత కల్పించడం, వారి ఉన్నత విద్య, వివాహం వంటి భవిష్యత్తు అవసరాల కోసం తల్లిదండ్రులు/ సంరక్షకులు పొదుపు చేసేలా ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం.10 సంవత్సరాలలోపు వయసు ఉన్న బాలిక పేరు మీద ఈ ఖాతాను తెరవవచ్చు (ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు బాలికలకు).ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు డబ్బు జమ చేయవచ్చు.ఇది భారత ప్రభుత్వ మద్దతు ఉన్న పథకం కాబట్టి సాధారణ పొదుపు పథకాల కంటే అధిక వడ్డీ రేటును అందిస్తుంది (ప్రతి త్రైమాసికంలో ప్రభుత్వం ఈ రేటును సవరిస్తుంది).ఆదాయపు పన్ను చట్టంలోని 80C కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. మెచ్యూరిటీపై వచ్చే మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది.బాలిక 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఉన్నత విద్య కోసం కొంత మొత్తాన్ని లేదా 21 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి కోసం పూర్తి మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.ఇదీ చదవండి: పరుగెడుతున్న కొనుగోళ్లు.. జాగ్రత్త! -
భారత ఉత్పత్తులకు మరింత పోటీతత్వం
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లను బలంగా ఎదుర్కొనేందుకు, ఎగుమతులను పెంచుకునేందుకు కేంద్ర కేబినెట్ రూ.45,000 కోట్ల ప్రోత్సాహకాలతో రెండు పథకాలకు ఆమోదం తెలిపింది. రూ.25,060 కోట్లతో ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ (ఈపీఎం), రూ.20,000 కోట్లతో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (సీజీఎస్ఈ) ఇందులో ఉన్నాయి. ఈపీఎం అన్నది భారత ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచుతుందని, ఎంఎస్ఎంఈలు, మొదటిసారి ఎగుమతిదారులు, కారి్మకులపై ఎక్కువగా ఆధారపడిన రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్పై ప్రకటించారు. ‘‘ప్రపంచ మార్కెట్లో భారత్లో తయారీ మరింత మార్మోగుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ (ఈపీఎం) ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచుతుంది. ఎంఎస్ఎంఈలు, మొదటిసారి ఎగుమతిదారులు, కారి్మక ఆధారిత రంగాలకు ప్రయోజనం లభిస్తుంది’’అని పోస్ట్ చేశారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్తో ఎగుమతిదారులు అంతర్జాతీయంగా మరింత పోటీపడగలరని, వ్యాపార కార్యకలాపాలను సాఫీగా నిర్వహించుకోగలరని అభిప్రాయపడ్డారు. సీజీఎస్ఈ పథకంతో ఎగుమతిదారులకు నగదు లభ్యత పెరుగుతుందని, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేస్తుందని, ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధనను వేగవంతం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా పేర్కొన్నారు. సవాళ్లకు పరిష్కారం.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సమస్యలు.. అందుబాటు ధరలకే రుణాలు, నిబంధనల సంక్లిష్టత, బ్రాండింగ్ అంతరాయాలకు కేంద్రం ప్రకటించిన పథకాలు పరిష్కారం చూపిస్తాయని సీఐఐ ఎగుమతుల కమిటీ చైర్మన్ సంజయ్ బుధియా అభిప్రాయపడ్డారు. ఎంఎస్ఎంఈలకు కొత్త అవకాశాలు కలి్పస్తాయన్నారు. ‘‘రుణ లభ్యతను పెంచుతాయి. మార్కెట్ సన్నద్ధత, దేశ ఎగుమతులు బలపడతాయి. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. దేశ ఎగుమతుల వృద్ధికి తాజా ప్రేరణ లభిస్తుంది’’అని అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) వైస్ చైర్మన్ ఎ.శక్తివేల్ అభిప్రాయపడ్డారు. రుణ సదుపాయం, నిబంధనల అమలులో సమస్యలను ఎదుర్కొనే ఎంఎస్ఎంఈలకు ఈ పథకాలు సాధి కారత కలి్పస్తాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెండ్ ఎస్.సి. రల్హాన్ పేర్కొ న్నారు. ఎగుమతుల రంగంలో 85 శాతం ఎంఎస్ంఎఈలేనని, 2047 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యం సాధ్యపడుతుందని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి పేర్కొంది. స్థిరంగా టెక్స్టైల్స్ ఎగుమతులు 111 దేశాలకు మాత్రం 10 శాతం వృద్ధి న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లతో కూడిన వాతావరణం మధ్య దేశ టెక్స్టైల్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెపె్టంబర్) ఫ్లాట్గా నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో పోల్చి చూస్తే 0.1 శాతమే పెరిగాయి. కానీ, 111 దేశాలకు మాత్రం 10 శాతం అధికంగా 8,489 మిలియన్ డాలర్ల ఎగుమతులు నమోదయ్యాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ దేశాలకు ఎగుమతులు 7,718 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. యూఏఈకి 14.5 శాతం, యూకేకి 1.5 శాతం, జపాన్కు 19 శాతం, జర్మనీకి 2.9 శాతం, స్పెయిన్కు 9 శాతం, ఫ్రాన్స్కు 9.2 శాతం చొప్పున ఎగుమతులు పెరిఆయి. ఈజిప్్టకు 27 శాతం, సౌదీ అరేబియాకి 12.5 శాతం, హాంగ్కాంగ్కు 69 శాతం అధికంగా టెక్స్టైల్ ఎగుమతులు జరిగాయి. రెడీ మేడ్ గార్మెంట్స్ (ఆర్ఎంజీ) ఎగుమతులు 3.4 శాతం పెరగ్గా, జ్యూట్ ఎగుమతులు 5.56% అధికంగా నమోదయ్యాయి. టెక్స్టైల్స్ పరిశ్రమ పోటీతత్వం, మార్పుల స్వీకరణకు ఈ పనితీరు అద్దం పడుతుందని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ పేర్కొంది. -
క్యూ2లో జీడీపీ వృద్ధి 7.2 శాతం
న్యూఢిల్లీ: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలోనూ (జూలై–సెప్టెంబర్) బలమైన పనితీరు చూపిస్తుందని, 7.2 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) అంచనా వేసింది. ప్రైవేటు వినియోగం కీలక చోదకంగా నిలుస్తుందని తెలిపింది.క్రితం ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) జీడీపీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడం తెలిసిందే. క్యూ2 జీడీపీ గణాంకాలు ఈ నెల 28న విడుదల కానున్నాయి. ‘‘ఉన్నత, మధ్యాదాయ వర్గాల వారికి ఆదాయం స్థిరంగా పెరుగుతుండడం ప్రైవేటు వినియోగానికి కీలక చోదకంగా నిలుస్తుంది. సేవల రంగం బలమైన పనితీరు, వస్తు ఎగుమతుల పెరుగుదల జీడీపీ వృద్ధిని మరింత పైకి తీసుకెళుతుంది’’అని ఇండ్–రా ఆర్థికవేత్త పరాస్ జస్రాయ్ పేర్కొన్నారు.దేశీ డిమాండ్ బలంగా ఉండడం, ఆర్బీఐ అంచనాలకంటే వేగంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం వేతన వృద్ధికి, వినియోగానికి మద్దతుగా నిలుస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రైవేటు వినియోగం క్యూ2లో 8 శాతం వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ2లో 6.4 శాతం వృద్ధి నమోదు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 7 శాతం పెరిగినట్టు తెలిపింది. ఆదాయపన్ను తగ్గింపులు సైతం వినియోగానికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. -
ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టే ఎగుమతి ప్రోత్సాహక మిషన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం నుంచి భారతదేశ ఎగుమతి రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.25,060 కోట్ల వ్యయంతో కూడిన ఐదేళ్ల ఎగుమతి ప్రమోషన్ మిషన్ (EPM)కు ఆమోదం తెలిపింది. పెరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల మధ్య భారతీయ ఎగుమతులకు ఊతం ఇచ్చేలా ప్రయత్నిస్తుంది.అదనంగా రూ.20,000 కోట్ల క్రెడిట్ గ్యారెంటీచిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) ఉపశమనం ఇస్తూ ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కింద నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (NCGTC) MSMEలతో కలిసి అర్హత కలిగిన ఎగుమతిదారులకు అదనపు రుణాల రూపంలో బ్యాంకులకు రూ.20,000 కోట్ల వరకు క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని విస్తరించనుంది.టారిఫ్లను ఎదుర్కోవడానికి..ఇటీవల యూఎస్ సుంకాల పెరుగుదల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులతో సహా కీలక రంగాలకు ఎగుమతి ప్రమోషన్ మిషన్ ప్రాధాన్యత ఇస్తుంది. ఎగుమతి ఆర్డర్లను కొనసాగించడానికి, ఉద్యోగాలను రక్షించడానికి కొత్త ప్రాంతాల్లో మార్కెట్ విస్తరణ ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.ఎగుమతి ప్రమోషన్ మిషన్ ద్వారా వడ్డీ రాయితీ, కొలేటరల్ గ్యారెంటీలు, ఈ-కామర్స్ ఎగుమతిదారుల కోసం క్రెడిట్ కార్డులు, మార్కెట్ వైవిధ్యం కోసం క్రెడిట్ మెరుగుదల యంత్రాంగాలను అందిస్తారు. ఇది అంతర్జాతీయ బ్రాండింగ్, ప్యాకేజింగ్, ట్రేడ్ ఫెయిర్లలో పాల్గొనడానికి ఎగుమతిదారులకు మద్దతు ఇస్తుంది.ఇదీ చదవండి: మార్జిన్ ట్రేడింగ్పై పెరుగుతున్న ఆసక్తి -
టెక్నాలజీ అప్గ్రేడ్కు నిధులు
సాంకేతికపరమైన పురోగతికి ప్రత్యేకమైన నిధిని కేటాయించాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎఎంస్ఎంఈ) పరిశ్రమలు కేంద్ర ఆర్థిక శాఖను కోరాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎంఎస్ఎంఈల ప్రతినిధులతో నిర్వహించిన బడ్జెట్ ముందస్తు సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది. రుణాలను సులభంగా పొందేలా చర్యలు తీసుకోవాలని, ఎగుమతి అవకాశాలను సులభతరం చేయాలని ఎంఎస్ఎంఈ ప్రతినిధులు కోరారు.వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం, జీడీపీలో 30 శాతం వాటా కలిగి ఉండడం గమనార్హం. ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్ఎంఈలే నిర్వహిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శులు, ఎంఎస్ఎంఈ శాఖ సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. లఘు ఉద్యోగ్ భారతి, కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్, తిరుపూర్ ఎక్స్పోర్ట్స్ అండ్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యుర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. రానున్న బడ్జెట్కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించిన మూడో సమావేశం ఇది. ఈ వారంలోనే వివిధ ఆర్థిక వేత్తలు, వ్యవసాయ రంగం, పరిశోధన సంస్థల ప్రతినిధులతోనూ ఆర్థిక మంత్రి భేటీ కావడం గమనార్హం.ఇదీ చదవండి: మార్జిన్ ట్రేడింగ్పై పెరుగుతున్న ఆసక్తి -
ధరలు.. కూల్!
న్యూఢిల్లీ: నిత్యావసర ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ నెలలో వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) రికార్డు కనిష్ట స్థాయి 0.25 శాతానికి తగ్గుముఖం పట్టింది. కూరగాయలు, పండ్లు, గుడ్ల ధరలు శాంతించడానికి తోడు, జీఎస్టీలో 380 ఉత్పత్తుల రేట్ల తగ్గింపు ఇందుకు అనుకూలించింది. సీపీఐ డేటా 2014 నుంచి సమీకరిస్తుండగా, ఇంత కనిష్ట స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఇదే ప్రథమం. ఈ ఏడాది సెపె్టంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.44 శాతం కాగా, 2024 అక్టోబర్లో 6.21 శాతంగా ఉండడం గమనార్హం. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. మైనస్లో ఆహార ద్రవ్యోల్బణం ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం మైనస్ 5.02గా నమోదైంది. జీఎస్టీ రేట్లు తగ్గడం, సానుకూల బేస్ ప్రభావం, నూనెలు, ఫ్యాట్స్, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాదరక్షలు, తృణ ధాన్యాలు, రవాణా ధరలు తగ్గడం వల్లేనని ఎన్ఎస్వో తెలిపింది. జీఎస్టీ రేట్ల సవరణ సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రావడం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతంగా ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 0.88 శాతంగా ఉంది. కేరళలో అత్యధికంగా 8.56 శాతం, తమిళనాడులో అత్యల్పంగా 1.29 శాతం ద్రవ్యోల్బణం కనిపించింది. అసోం, బిహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, యూపీలో మైనస్గా నమోదైంది. 2025–26 సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.6 శాతంగా ఉండొచ్చన్నది ఆర్బీఐ అంచనా. తాజా గణాంకాల నేపథ్యంలో దీన్ని మరింత దిగువకు సవరించొచ్చని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్ పేర్కొన్నారు. డిసెంబర్ భేటీలో రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చని అంచనా వేశారు. అక్టోబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గడానికి సెప్టెంబర్ చివర్లో అమల్లోకి వచి్చన జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణమని కేర్ఎడ్జ్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త రజని సిన్హా పేర్కొన్నారు. -
పదేళ్లలో ఇండియాలో ఇంధన డిమాండ్ పీక్..
ప్రపంచంలోనే 2035 నాటికి భారతదేశంలో అత్యధికంగా ఇంధన డిమాండ్ నెలకొంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) విడుదల చేసిన ‘వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ 2025’ నివేదిక వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వేగవంతమైన పట్టణీకరణ, మధ్యతరగతి జనాభా పెరుగుదల కారణంగా దేశ ఇంధన డిమాండ్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతుందని నివేదిక పేర్కొంది.చమురు డిమాండ్లో కీలక పాత్రగత దశాబ్ద కాలంలో చమురు డిమాండ్ వృద్ధిలో చైనా 75% వాటాను కలిగి ఉండగా, ఈ పరిస్థితి మారుతోందని ఐఈఏ తెలిపింది. రాబోయే దశాబ్దంలో ప్రపంచ చమురు డిమాండ్ వృద్ధికి భారత్ నాయకత్వం వహిస్తుంది. ఇండియా చమురు వినియోగం 2024లో రోజుకు సగటున 5.5 డాలర్లుగా ఉండేది. 2035 నాటికి ఇది 8 డాలర్లకు పెరుగుతుందని అంచనా. కార్ల కొనుగోలు వేగంగా పెరగడం, ప్లాస్టిక్స్, రసాయనాలు, విమానయానానికి పెరుగుతున్న డిమాండ్ ఇందుకు కారణం.వేగవంతమైన ఆర్థిక, విద్యుత్ వృద్ధి2035 నాటికి భారతదేశంలో జీడీపీ సగటున 6.1% చొప్పున పెరుగుతుంది. ఇది ఇతర ప్రధాన దేశాల కంటే ఎక్కువ. 2035 నాటికి భారతదేశ తలసరి జీడీపీ ప్రస్తుత గణాంకాల కంటే 75% అధికంగా ఉంటుంది. గృహాల్లో ఎయిర్ కండీషనర్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల వాడకం పెరుగుతున్న కారణంగా విద్యుత్ డిమాండ్ 80% అధికమవుతుంది.ఇదీ చదవండి: పేలుడు ఘటనల్లో సత్య శోధన -
రాష్ట్రాలు సకాలంలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వాలు పలు పరిశ్రమలకు హామీ ఇచ్చిన మేరకు ప్రోత్సాహకాలను సకాలంలో మంజూరు చేయాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ కోరారు. కొన్ని రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ప్రకటించి, వాటిని సకాలంలో ఇవ్వకపోవడం పట్ల పలు రంగాల నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు చెప్పారు. కార్మికులు, దుకాణాలు/వాణిజ్య సంస్థలకు సంబంధించిన చట్టాలను సరళతరం చేయాలని కోరారు. తద్వారా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించొచ్చన్నారు. రాష్ట్రాల వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రులను ఉద్దేశించి మంత్రి గోయల్ మాట్లాడారు. నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, సుస్థిర విధానాలను పాటించే దిశగా పరిశ్రమలకు అవగాహన కల్పించాలని సూచించారు. నాణ్యత నియంత్రణ చట్టాలను అనుసరించాల్సిన ప్రాధాన్యతను గుర్తు చేశారు. వైద్య చికిత్సల కోసం వీసా ఆన్ అరైవల్ యూఎస్, యూరప్ దేశాల నుంచి వైద్య చికిత్సల కోసం భారత్కు వచ్చే వారికి వెంటనే వీసా మంజూరు (వీసా ఆన్ అరైవల్)ను పరిశీలిస్తున్నట్టు మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఇదొక మంచి ఆలోచన అని సీఐఐ వార్షిక కార్యక్రమంలో భాగంగా పేర్కొ న్నారు. ఇప్పటికే పలు దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ మంజూరు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచ స్థాయి రేటింగ్ వ్యవస్థ2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో భాగంగా మనకంటూ బలమైన, విశ్వసనీయమైన, ప్రపంచ స్థాయి రేటింగ్ సంస్థ ఉండాలన్నది తమ లక్ష్యమని మంత్రి గోయల్ చెప్పారు. వృద్ధి క్రమంలో రేటింగ్ ఏజెన్సీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు! -
ప్రత్యక్ష పన్ను వసూళ్ల జోరు
ప్రత్యక్ష పన్ను వసూళ్లు బలంగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకు రూ.12.92 లక్షల కోట్ల నికర పన్ను వసూలైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.12.08 లక్షల కోట్లతో పోలిస్తే 7 శాతం పెరిగింది.కార్పొరేట్ పన్ను రూపంలో నికరంగా రూ.5.37 లక్షల కోట్లు వచ్చింది. క్రితం ఆర్థిక సంవత్సరం సరిగ్గా ఇదే కాలంలో వచ్చిన మొత్తం రూ.5.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు వాపసు) 18% తగ్గి రూ.2.42 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2025–26 మొత్తం మీద రూ.25.2 లక్షల కోట్లు ప్రత్యక్ష పన్నుల రూపంలో సమకూరుతుందని కేంద్ర సర్కారు బడ్జెట్లో అంచనా వేసింది.ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు! -
సహకార రుణ రంగాన్ని విస్తరించడమే లక్ష్యం
పట్టణ సహకార రుణ రంగాన్ని విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. దేశ రాజధానిలో జరిగిన ‘అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సెక్టార్, కో-ఆప్ కుంభ్ 2025’ అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోని 2,00,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి పట్టణంలో వచ్చే ఐదేళ్లలో ఒక సహకార బ్యాంకు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.అర్బన్ కో-ఆపరేటివ్ సెక్టార్లో ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు ఇవ్వడాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్షా చెప్పారు. భాగస్వామ్య యాజమాన్య నమూనా ఆధారంగా వ్యాపారాన్ని విస్తరించే లక్ష్యంలో భాగంగా ఈ సదస్సులో రూపొందించిన ‘ఢిల్లీ డిక్లరేషన్ 2025’ రోడ్మ్యాప్గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.ఎన్పీఏల తగ్గింపుగత రెండేళ్లలో పట్టణ సహకార బ్యాంకుల నిరర్థక ఆస్తులు (NPA) గణనీయంగా తగ్గాయని అమిత్షా హైలైట్ చేశారు. గత రెండేళ్లలో ప్రభుత్వం ఎన్పీఏను 2.8 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గించేందుకు ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. సహకార రంగంలోని రుణదాతలు ఆర్థిక డిజిటల్ సాంకేతికతలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘సహకార్ డిజీ-పే’, ‘సహకార్ డిజీ-లోన్’ యాప్లు డిజిటల్ విప్లవంలో సహకార రంగం భాగస్వామ్యానికి గుర్తింపు ఇవ్వనున్నాయని చెప్పారు.యువత, బలహీన వర్గాల సాధికారత కోసం..యువ పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక బృందాలు, సమాజంలోని బలహీన వర్గాల సాధికారత కోసం పట్టణ సహకార బ్యాంకులు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ‘సహకార సంఘాలను బలోపేతం చేయడం, అదే సమయంలో బలహీన వర్గాలకు దన్నుగా నిలవడం మా లక్ష్యం. పట్టణ సహకార బ్యాంకులు తప్ప మరే సంస్థ దీన్ని సాధించలేదు’ అని ఆయన నొక్కి చెప్పారు. ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించడానికి ఈ రంగాన్ని విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయంలో ఉమ్మడి విధానాన్ని రూపొందించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చారు.సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుగ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సహకార రంగాన్ని డిజిటలైజ్ చేయడానికి, ఈ విభాగంలో సేవలు విస్తరించడానికి కేంద్రం అనేక మార్పులను తీసుకువచ్చింది. జులై 2021లో మోదీ ప్రభుత్వం కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో సహకార మంత్రిత్వ శాఖను సృష్టించింది. జాతీయ స్థాయి సహకార సంఘాల పాలనను మెరుగుపరచడానికి గత సంవత్సరం పార్లమెంటు బహుళ-రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) చట్టం, 2022ను కూడా ఆమోదించింది.ఇదీ చదవండి: ఉద్యోగంతో ఊడిగం చేయాల్సిందేనా..! -
విద్య అంటే కేవలం చదువేనా?
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఏటా నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవం(National Education Day)గా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశ భవిష్యత్తుకు బలమైన పునాది వేయడానికి మౌలానా ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా అనేక దార్శనిక నిర్ణయాలు తీసుకున్నారు.దేశంలోని ప్రతి పౌరుడికి విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్య కోసం కృషి చేశారు.దేశంలో పరిశోధనలు, సాంకేతిక విద్యను ప్రోత్సహించడానికి ఆయన అనేక ఉన్నత విద్యా సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర వహించారు.యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs) వంటి సాంకేతిక విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు.విద్య అంటే కేవలం చదువు మాత్రమే కాదనే ఉద్దేశంతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి సాహిత్య అకాడమీ, లలిత కళా అకాడమీ, సంగీత నాటక అకాడమీ వంటి సంస్థలను స్థాపించారు.సెకండరీ విద్యలో మార్పులు తీసుకురావడానికి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ (ముదలియార్ కమిషన్) ఏర్పాటుకు సహకరించారు.అసలు విద్య అంటే..మౌలానా ఆజాద్ ఆశయాలను నెరవేర్చేందుకు శ్రమిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త విద్యా విధానాన్ని అనుసరించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో నేటి భారతీయ విద్యావ్యవస్థలో ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. విద్య అంటే కేవలం పుస్తకాల్లోని చదువు మాత్రమేనా? నిజానికి విద్య అనేది విద్యార్థిని విమర్శనాత్మక ఆలోచనాపరుడిగా, సమస్య పరిష్కరించే వ్యక్తిగా, సృజనాత్మక పౌరుడిగా తీర్చిదిద్దాలి. కానీ ప్రస్తుతం ఉన్న పాఠ్యాంశాల ధోరణి ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమవుతోంది.పాత సిలబస్ - పరిశోధనలకు అవరోధంభారత్లో ఏళ్లుగా వస్తున్న సిలబస్నే ఇప్పటికీ చాలా ప్రభుత్వ విద్యా సంస్థల్లో బోధిస్తున్నారు. సిద్ధాంతాలకే(Theory) ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విద్యార్థులకు పరిశ్రమకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలు లోపిస్తున్నాయి. గుడ్డిగా బట్టీ పట్టే విధానం వల్ల పిల్లల్లో పరిశోధన, ఆవిష్కరణ, కొత్త ఆలోచనలు చేసే సామర్థ్యం దెబ్బతింటోంది.కొన్ని ప్రైవేట్ సంస్థలు ట్రెండ్కు తగ్గట్టుగా మార్పులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థల్లో ఆ మేరకు చర్యలు లేకపోవడంతో మెజారిటీ విద్యార్థులు పాత పద్ధతుల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పరిశోధనలు, ఆవిష్కరణల పరంగా భారత్ భవిష్యత్తులో ప్రపంచ దేశాల కంటే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.భవిష్యత్తు కోసం విద్యా విధానం ఎలా ఉండాలి?భారతదేశం విద్యారంగంలో ప్రపంచంలోనే మెరుగైన స్థాయికి ఎదగాలంటే మన విద్యా విధానాన్ని పూర్తిగా పునర్నిర్మించాలి. జాతీయ విద్యా విధానం (NEP) 2020 లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలి. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా ప్రయోగశాలలు, ప్రాజెక్టులు, ఫీల్డ్ ట్రిప్ల ద్వారా విద్యను బోధించాలి. విభిన్న సబ్జెక్టులను (ఉదా: సైన్స్, ఆర్ట్స్, టెక్నాలజీ) కలిపి బోధించాలి. తద్వారా విద్యార్థికి సమగ్ర దృక్పథం ఏర్పడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్, డేటా సైన్స్, డిజిటల్ అక్షరాస్యత వంటి ఫ్యూచర్ స్కిల్స్ను పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఉపాధ్యాయులకు నిరంతర శిక్షణ, ఆధునిక బోధనా పద్ధతులను నేర్పించాలి. బట్టీ పట్టడాన్ని ప్రోత్సహించే పరీక్షలకు బదులుగా విద్యార్థుల సమస్య పరిష్కార సామర్థ్యాన్ని అంచనా వేసే పద్ధతులు ప్రవేశపెట్టాలి.విద్యా సంస్థల యాజమాన్యాలు చేయాల్సిన తక్షణ చర్యలుచాలా విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఫీజుల వసూళ్లపై (Focus on Fees) అధికంగా దృష్టి సారిస్తున్నాయి. లాభాపేక్ష కంటే విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలి. ప్రతి పైసా విద్యార్థి అభ్యసన వనరుల కోసం ఖర్చు పెట్టాలి. పాతబడిన తరగతి గదులకు బదులుగా డిజిటల్ లైబ్రరీలు, అత్యాధునిక ప్రయోగశాలలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధనా పరికరాలను అందించాలి. అత్యంత ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించుకోవాలి. వారికి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలి. మంచి జీతాలు ఇవ్వడం ద్వారా బోధనను గౌరవప్రదమైన వృత్తిగా మార్చాలి.ఫీజుల విషయంలో పారదర్శకత పాటించాలి. పేద విద్యార్థులకు, ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయాన్ని అందించాలి. విద్యను వ్యాపారంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూడాలి. విద్యార్థులు సైద్ధాంతిక పరిజ్ఞానంతో(Theoritical Knowledge)పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడానికి పరిశ్రమ నిపుణులతో శిక్షణ తరగతులు, ఇంటర్న్షిప్లను తప్పనిసరి చేయాలి.ఇదీ చదవండి: మాజీ ఉద్యోగిపై రూ.2 కోట్లు దావా వేసిన ఇంటెల్ -
వ్యవసాయంలో పరిశోధనలను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో పెరిగిపోతున్న వాతావరణ పరమైన సవాళ్లను అధిగమించేందుకు వీలుగా పరిశోధన, అభివృద్ధికి (ఆర్అండ్డీ) మరిన్ని నిధుల సాయం అందించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు నిపుణులు సూచించారు. ఈ దిశగా విధానపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన బడ్జెట్ ముందస్తు సమావేశంలో వ్యవసాయ రంగం, ఆర్అండ్డీ సంస్థల నుంచి 12 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగం ప్రస్తుత స్థాయి నుంచి మరింత ప్రగతి సాధించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యల గురించి వారు తమ సూచనలు అందించారు. వ్యవసాయరంగ కార్యదర్శి దేవేష్ చౌదరి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ ఎంఎల్ జట్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం సానుకూలంగా జరిగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న కీలక సవాళ్లను నిపుణులు ప్రస్తావించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్య క్రమంలో చర్యలు తీసుకోవాలని కోరినట్టు వెల్లడించాయి. వ్యవసాయంలో ఆర్అండ్డీకి వాస్తవ నిధుల కేటాయింపులు గత రెండు దశాబ్దాల కాలంలో తగ్గినట్టు ఈ సమావేశంలో పాల్గొన్న భారత్ క్రిషక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జఖార్ తెలిపారు. పంటల బీమాను తిరిగి సమీక్షించాలని, చాలా మంది రైతులు దీని విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. వ్యవసాయ ముడి పదార్థాల విక్రయ వివరాలను వర్తకులు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధానం ఉండాలని కోరారు. అలాగే, కనీస మద్దతు ధరలను ప్రకటిస్తున్న పంట ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు విధించాలని అభిప్రాయపడ్డారు.ప్రముఖ ఆర్థికవేత్తలతోనూ భేటీ మరోవైపు ప్రముఖ ఆర్థికవేత్తలైన సాజిద్ చినాయ్, నీల్కాంత్ మిశ్రా, ధర్మకృతి జోషి, రిధమ్ దేశాయ్, సోనల్ వర్మ, ఇందిరా రాజారామన్ తదితరులతోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. 2026–27 బడ్జెట్కు సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇది తొలి సమావేశమని ఆర్థిక శాఖ ఎక్స్ ప్లాట్ఫామ్పై ప్రకటించింది. -
30 ఏళ్ల టోల్ పాలసీలో మార్పులు?
దేశంలోని జాతీయ రహదారులపై వర్తించే టోల్ పాలసీకి ఆధారం అయిన మూడు దశాబ్దాల నాటి సూత్రాలను సవరించడానికి సిద్ధమవుతున్నారు. 1995 నుంచి పెద్దగా మారకుండా ఉన్న టోలింగ్ ఫ్రేమ్వర్క్ను ఆధునిక ట్రాఫిక్ నమూనాలు, ఆపరేటింగ్ ఖర్చులు, మెరుగైన రహదారి నాణ్యతను ప్రతిబింబించేలా సంస్కరించడానికి నీతి ఆయోగ్ (NITI Aayog) నాయకత్వం వహిస్తోంది.రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న టోలింగ్ నిబంధనలను సమీక్షించి గత 30 సంవత్సరాల్లో జరిగిన మార్పులకు అనుగుణంగా మరింత వాస్తవికమైన యూజర్ ఫీజు మోడళ్లను సిఫార్సు చేయాలని నీతి ఆయోగ్ కొన్ని సంస్థలను నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సిఫార్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు.పాతబడిన విధానాలు..ప్రస్తుత టోల్ నిర్మాణం 1995 ఫ్రేమ్వర్క్ ఆధారంగా రూపొందించబడింది. ఇది మూడు ప్రామాణిక కొలమానాలపై ఆధారపడి ఉంది.వెహికల్ ఆపరేటింగ్ ఖర్చు-ఇంధనం, నిర్వహణ ఖర్చుల లెక్క.వెహికల్ డ్యామేజీ ఫ్యాక్టర్ - రహదారిపై వాహనం వల్ల కలిగే అరుగుదలను లెక్కించడం.టోల్ చెల్లించే స్థోమత-ధర, వినియోగదారుల ఆర్థిక పరిస్థితుల అంచనా.అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పాతబడిన ఫార్ములాలు భారతదేశంలోని విస్తరించిన హైవే నెట్వర్క్కు సరిపోవడం లేదు. జాతీయ రహదారుల రుసుము నిబంధనలు 2008 ప్రకారం టోల్ రేట్లను ఏటా సవరించినప్పటికీ (ఏప్రిల్ 1 నుంచి హోల్సేల్ ధరల సూచిక ఆధారంగా) అంతర్లీన ప్రాథమిక రేటు నిర్ణయం పాతదిగానే ఉంది.నీతి ఆయోగ్ ఎజెండానీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర అధ్యయనం కీలక అంశాలపై దృష్టి సారించనుంది. రవాణా ప్రాజెక్ట్ల నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్ ఖర్చులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లెక్కించనున్నారు. రియల్టైమ్ వినియోగం, ట్రాఫిక్ డెన్సిటీ, మౌలిక సదుపాయాల విలువను ప్రతిబింబించే కొత్త ధరల విధానాన్ని సిఫార్సు చేయనున్నారు.పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సులుపార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ (PAC) జాతీయ రహదారులపై శాశ్వత టోలింగ్ పద్ధతిని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పూర్తిగా రికవరీ అయిన తర్వాత టోల్ వసూళ్లను నిలిపివేయాలని లేదా గణనీయంగా తగ్గించాలని కమిటీ సూచించడం గమనార్హం.టోల్ ధరల నిర్ణయం, వసూలు, నియంత్రణలో పారదర్శకతను నిర్ధారించడానికి ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) తరహాలో ఒక ప్రత్యేక టారిఫ్ అథారిటీని ఏర్పాటు చేయాలని PAC ప్రతిపాదించింది.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్ తగ్గుతుందా? -
పర్యాటకులను ఆకర్షించేలా అన్ని చర్యలు
భారతదేశం ఇన్బౌండ్ టూరిజం (దేశంలోకి వచ్చే పర్యాటకులు) సమీప భవిష్యత్తులో బలంగా పుంజుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల విదేశీ పర్యాటకుల రాక కొవిడ్ పూర్వ స్థాయికి చేరుకుంటుండడం మాత్రమే కాకుండా ప్రయాణ అనుభవాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయి. క్రమబద్ధీకరించిన వీసా ప్రక్రియలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంస్కృతిక పరిస్థితులు విదేశీ సందర్శకులను ఆకర్షిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.పెరిగిన పర్యాటకులుభారతదేశం పర్యాటక రంగం 2024లో ఆశించిన వృద్ధిని సాధించింది. పర్యాటక మంత్రిత్వ శాఖ అందించిన గణాంకాల ప్రకారం 2024లో 9.95 మిలియన్ల విదేశీ పర్యాటకులు భారత్ వచ్చారు. ఇది 2023 కంటే 4.5% పెరుగుదలను సూచిస్తుంది. 2019 నాటి కొవిడ్ పూర్వ స్థాయి 10.9 మిలియన్ల మార్కుకు దగ్గరగా ఉంది. 2025లో ఈ మార్కు చేరుకుంటుందని పరిశ్రమ నిపుణులు విశ్వసిస్తున్నారు. చాలా మంది టూర్ ఆపరేటర్లు ప్రస్తుత పీక్ సీజన్లో 10-15% అధిక బుకింగ్లు వస్తున్నట్లు చెబుతున్నారు. విదేశీ పర్యాటకుల రాక కోసం భారత్ ఇటీవల కాలంలో తీసుకున్న చర్యలు కింది విధంగా ఉన్నాయి.ఈ-వీసా (e-Visa) యాక్సెస్, వేగవంతమైన అనుమతులు 160 కంటే ఎక్కువ దేశాల నుంచి పర్యాటకుల ప్రయాణాన్ని సులభతరం చేశాయి.కొత్త అంతర్జాతీయ విమాన మార్గాలను ప్రారంభించింది.పర్యాటక ప్రదేశాలకు రోడ్డు, రైలు, వాయు మార్గాలను అప్గ్రేడ్ చేసింది.హోటల్ ఆక్యుపెన్సీ పెరిగేందుకు చర్యలు తీసుకుంది.పర్యాటకుల డిమాండ్కు అనుగుణంగా టూర్ ఆపరేటర్లు మరింత పర్సనలైజ్ ప్రయాణాలను అందిస్తున్నారు.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్ తగ్గుతుందా? -
భారత వృద్ధికి సీఐఐ ఫండ్ ప్రతిపాదన
భారతదేశ దీర్ఘకాలిక వృద్ధికి ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఇండియా డెవలప్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫండ్ (IDSF)ను స్థాపించాలని ప్రతిపాదించింది. ఇది దేశ వృద్ధిని, ప్రపంచ ఆర్థిక ప్రభావాన్ని లక్ష్యంగా చేసుకుని స్వాతంత్ర్య శతాబ్ది సంవత్సరం (2047) నాటికి 1.3 నుంచి 2.6 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ.108 నుంచి రూ.216 లక్షల కోట్ల కార్పస్ను ఏర్పాటు చేయాలని ఈ ఫండ్ లక్ష్యంగా పెట్టుకుంది.జాతీయ అవసరాలకు అనుగుణంగా IDSFను ఏర్పాటు చేయాలని సీఐఐ భావిస్తోంది. దీనిద్వారా మౌలిక సదుపాయాలు, తయారీ, ఆవిష్కరణలకు మూలధనాన్ని అందించనున్నారు. ఇంధనం, ఖనిజాలు, సాంకేతిక విజ్ఞానం వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ద్వారా విదేశాల్లో భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించనున్నారు. ఇప్పటికే ఉన్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF)ను బేస్గా ఉపయోగించుకుని ప్రతిపాదిత ఐడీఎస్ఎఫ్ను మెరుగైన పాలనకు వెచ్చించనున్నారు.నిధుల సమీకరణ యంత్రాంగాలులక్ష్యాన్ని చేరుకోవడానికి సీఐఐ వినూత్న నిధుల వనరులను ప్రతిపాదించింది.రోడ్లు, ఓడరేవులు, స్పెక్ట్రమ్ వంటి ప్రజా మౌలిక సదుపాయాల ఆస్తుల విక్రయం ద్వారా నిధులను సమీకరించనున్నారు.ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఈక్విటీని ఫండ్కు బదిలీ చేస్తారు.దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ప్రపంచ పెట్టుబడిని ఆకర్షించనున్నారు.ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్ తగ్గుతుందా? -
రూ.9,169 కోట్ల లాండరింగ్ రాకెట్ను గుర్తించిన సీబీడీటీ
దేశంలో వ్యవస్థీకృత పన్ను ఎగవేత నెట్వర్క్పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) సంచలన విషయాలు బయటపెట్టింది. రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు (RUPP), చార్టర్డ్ అకౌంటెంట్లు (CA), మధ్యవర్తుల సహకారంతో రూ.9,169 కోట్ల విలువైన నిధులను లాండరింగ్ చేస్తూ పన్ను ఎగవేత కోసం రాజకీయ విరాళాలుగా మళ్లిస్తున్న ఒక భారీ రాకెట్ను సీబీడీటీ వెలుగులోకి తీసుకొచ్చింది.అదనపు పన్ను మినహాయింపులుసీబీడీటీ చర్యకు సంబంధించి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2022–23, 2023–24 సంవత్సరాల్లో చట్టబద్ధంగా ప్రకటించిన రాజకీయ రసీదులతో పోలిస్తే రూ.9,169 కోట్లు అదనపు పన్ను మినహాయింపులు క్లెయిమ్ అయ్యాయి. అందులో..2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి రూ.6,116 కోట్లు2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి రూ.3,053 కోట్లుభారత ఎన్నికల సంఘం ఇటీవల 800 RUPPలను రద్దు చేసిన తర్వాత రాజకీయ విరాళ చట్టాల్లోని లొసుగులను RUPPలు దుర్వినియోగం చేస్తున్నాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీబీడీటీ దర్యాప్తు చేసినట్లు తెలిసింది.మోసపూరిత పద్ధతులుదర్యాప్తులో భాగంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని సీబీడీటీ బృందాలు 420 బ్యాంక్ స్టేట్మెంట్లు, 200 కేసు ఫైళ్లు, పెద్ద సంఖ్యలో వాట్సాప్ సందేశాలతో సహా కీలకమైన ఆధారాలను పరిశీలించాయి. ఇందులో కొందరు దాతలు మధ్యవర్తులు లేదా చార్టర్డ్ అకౌంటెంట్ల ద్వారా RUPPలకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తాన్ని పన్ను రహిత రాజకీయ విరాళాలుగా క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి బదులుగా ఆయా పార్టీల్లో కీలక వ్యక్తులుగా ఉన్న ఆదే దాతలకు నగదు ట్యాక్స్ లేకుండా వాపసు వెళ్తుంది. ఈ ప్రక్రియలో మధ్యవర్తులు కమీషన్లు పొందుతున్నారు.ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29ఏ కింద నమోదు చేసుకున్న RUPPలు జాతీయ లేదా రాష్ట్ర పార్టీ గుర్తింపు పొందని రాజకీయ సంస్థలు. ఇవే ఈ అక్రమ కార్యకలాపాలకు వేదికగా మారాయి. కేవలం 36 RUPPలు మాత్రమే రూ.5,591 కోట్లను అక్రమంగా మళ్లించినట్లు గుర్తించారు. మొత్తం బోగస్ రాజకీయ నిధులలో 60 శాతం కేవలం 10 పార్టీల్లో కేంద్రీకృతమై ఉండటం గమనార్హం.నకిలీ పత్రాలుసీబీడీటీ నిర్వహించిన సోదాల్లో నకిలీ విరాళాల రసీదులు, నకిలీ దాతల జాబితా, నకిలీ బ్యాంక్ రసీదు పుస్తకాలు వంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆడిట్ ట్రయల్స్ను చెరిపివేయడానికి, పెద్ద ఎత్తున పన్ను మినహాయింపులను గుర్తించకుండా ఉండేందుకు ఈ దస్త్రాలను ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. పన్ను చెల్లింపు విధానాల్లో పారదర్శకతను మెరుగుపరచడానికి, పన్ను ఎగవేతను అరికట్టడానికి RUPPల ఆర్థిక లావాదేవీలపై కఠినమైన నిబంధనలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా? -
రిటర్నులకు ఇంకా చాన్సుంది..!
ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు (ఐటీఆర్) గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. ఏదైనా కారణాలతో గడువు లోపు రిటర్నులు సమర్పించలేకపోతే.. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కొంత పెనాల్టీ చెల్లించడం ద్వారా ఆదాయపన్ను చట్టం నిబంధనల కింద రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఇందుకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంది. ఇక గడువు ముగియడానికి చివరి గడియల్లో హడావుడిగా రిటర్నులు దాఖలు చేసిన వారు సైతం, అందులో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిచేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలన్నది చూద్దాం. – సాక్షి, బిజినెస్ డెస్క్ఈ ఏడాది రిటర్నుల దాఖలుకు ఆదాయపన్ను శాఖ అదనపు సమయం ఇచ్చిది. జూలై 31గా ఉన్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. చివరి రోజుల్లో ఈ–ఫైలింగ్ పోర్టల్పై సాంకేతిక సమస్యలు రావడంతో సెప్టెంబర్ 16 వరకు రిటర్నులు సమర్పించేందుకు అవకాశం ఇచ్చిది. అయినా సరే సకాలంలో రిటర్నులు సమర్పించని వారు ఇప్పుడు బిలేటెడ్ (ఆలస్యంగా) ఐటీఆర్ను సెక్షన్ 139(1) కింద సమర్పించొచ్చు. ఇందుకు డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంటుంది. కాకపోతే పెనాల్టీ కట్టాలి. అంతేకాదు, ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే, వడ్డీతోపాటు కట్టేయాలి.సెక్షన్ 234ఎఫ్ కింద.. ఆదాయం రూ.5 లక్షలకు మించని వారు రూ.1,000 బిలేటెడ్ రిటర్నుల ఫీజు కింద చెల్లించాలి. ఆదాయం రూ.5 లక్షలు మించితే రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు.. సెక్షన్ 234ఏ కింద నికరంగా చెల్లించాల్సిన పన్నుపై, గడువు ముగిసిన నాటి నుంచి నెలవారీ ఒక శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి. అప్పటికే సంబంధిత పన్ను చెల్లింపుదారు పాన్పై నమోదైన టీడీఎస్, ముందస్తు పన్ను చెల్లింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికరంగా చెల్లించాల్సిన మొత్తంపైనే వడ్డీ పడుతుందని బీడీవో ఇండియా ఎల్ఎల్పీ ట్యాక్స్ పార్ట్నర్ ప్రీతి శర్మ తెలిపారు. అసలు చెల్లించాల్సిన తేదీ నుంచి, రిటర్నులు సమర్పించే తేదీ వరకు ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద పన్ను బాధ్యత రూ.10,000కు మించి ఉంటే అందులో 90 శాతాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే చెల్లించాలని (ముందస్తు పన్ను) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రకారం.. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నికర పన్ను మొత్తంలో 90 శాతాన్ని ముందుగా చెల్లించడంలో విఫలమైతే అప్పుడు సెక్షన్ 234బీ కింద నిబంధనలు అమలవుతాయి. వీటి కింద ఆర్థిక సంవత్సరం ముగిసిన మర్నాటి నుంచి (ఏప్రిల్ 1) పన్ను మొత్తంపై వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది. ఇక సెక్షన్ 234సీ కింద సంబంధిత త్రైమాసికం చివరి తేదీ నాటికి ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైనా, లేదా తక్కువ చెల్లించినా.. అప్పుడు క్వార్టర్ వారీ పరిశీలన తర్వాత వడ్డీ రేటు అమలు చేస్తారు. ఒకవేళ త్రైమాసికం వారీ ముందస్తు పన్ను చెల్లింపుల్లో విఫలమై, ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా గడువులోపు రిటర్నులు సమర్పించి, పన్ను బకాయిని వడ్డీ సహా చెల్లించలేకపోతే.. అలాంటి సందర్భాల్లో ఈ మూడు సెక్షన్ల (234ఏ, బీ, సీ) కింద మూడు రెట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ప్రీతి శర్మ వివరించారు. దీంతో చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోతుంది. ఈ భారం వద్దనుకుంటే నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించడమే చక్కని మార్గం. జాప్యం చేస్తే నష్టమే.. గడువులోపు రిటర్నులు దాఖలు చేసినట్టయితే పాత, కొత్త పన్ను విధానాల్లో తమకు అనుకూలమైన దాన్ని (తక్కువ పన్ను భారం పడే) ఎంపిక చేసుకోవచ్చు. కానీ, గడువు దాటితే విధిగా కొత్త పన్ను విధానం కిందే సమర్పించగలరు. అంతేకాదు సెక్షన్ 10ఏ, 10బీ, 80–1ఏ, 80–ఐబీ, 80–ఐసీ, 80–ఐడీ, 80–ఐఈ కింద వ్యాపార, మూలధన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకోవడం కుదరదు. గడువులోపు రిటర్నులు సమర్పించిన వారికే ఈ నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.‘‘గడువు తర్వాత కొత్త పన్ను విధానం కింద రిటర్నులు వేసేట్టు అయితే స్వీయ నివాసానికి సంబంధించి నష్టాలను లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు లేదా తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉండదు. అద్దెకు ఇచ్చిన నివాసం రూపంలో నష్టం ఏర్పడితే, కేవలం క్యారీ ఫార్వార్డ్ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు ) చేసుకునేందుకే అవకాశం ఉంటుంది’’ అని ప్రీతి శర్మ తెలిపారు.అలస్యంగా డిసెంబర్ 31లోపు దాఖలు చేసినప్పటికీ, సాధారణ ఐటీఆర్ మాదిరే మదింపు చేస్తారు. నికరంగా పన్ను చెల్లించాల్సిన వారే రిటర్నులు వేయాలని లేదు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు సైతం బిలేటెడ్ రిటర్నుల పత్రాన్ని సమర్పించడం ద్వారా నిబంధనలను పాటించొచ్చు. దీనివల్ల టీడీఎస్ లేదా టీసీఎస్లు ఉంటే నిబంధనల కింద పెనాల్టీ చెల్లించి, వాటి రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు.ఇలా సమర్పించొచ్చు.. ఈ–ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. ‘ఈ–ఫైల్’ విభాగంలో ‘ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్’ అన్న దగ్గర క్లిక్ చేయాలి. అక్కడ అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంపిక చేసుకుని, ‘రివైజ్డ్ రిటర్న్ అండ్ సెక్షన్ 139(5)’పై క్లిక్ చేయాలి. తొలుత సమర్పించిన ఐటీఆర్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను పేర్కొనడం మర్చిపోవద్దు. ఆఫ్లైన్లో పేపర్ రూపంలో (80 ఏళ్లకు పైబడిన వారు) రిటర్నులు దాఖలు చేసిన వారు ఆన్లైన్లో సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు.తిరిగి భౌతిక రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది. సవరణ రిటర్నులను డిసెంబర్ 31 (2024–25 సంవత్సరానికి సంబంధించి) వరకు ఎన్ని పర్యాయాలు అయినా సమర్పించొచ్చు. ఇందుకు ఎలాంటి పెనాల్టీ చెల్లించక్కర్లేదు. రిఫండ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. సాధారణ రిటర్నుల మాదిరే సవరణ రిటర్నులు వేసిన తర్వాత 30 రోజుల్లోపు ధ్రువీకరించడం తప్పనిసరి. అప్పుడే అది మదింపునకు వెళుతుంది.డిసెంబర్ 31 తర్వాత కూడా.. గడిచిన ఆర్థిక సంవత్సరానికి తర్వాతి ఆర్థిక సంవత్సరం అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. 2024–25కు 2025–26 అసెస్మెంట్ సంవత్సరం అవుతుంది. అసెస్మెంట్ సంవత్సరం డిసెంబర్ 31 వరకు బిలేటెడ్ రిటర్నులు లేదా సవరణ రిటర్నులు సమర్పించుకోవచ్చు. అప్పటికీ అది చేయలేకపోతే, ఆ తర్వాత ఉన్న ఏకైక మార్గం అప్డేటెడ్ రిటర్నులు (ఐటీఆర్–యూ) సమర్పించడం.అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి 48 నెలల వరకు (నాలుగేళ్లు) ఇందుకు అవకాశం ఉంటుంది. అసలు టర్నులు దాఖలు చేయకపోయినా లేక సమర్పించిన రిటర్నుల్లో తప్పులను గుర్తించినా లేదా ఏవైనా ఆదాయ, ఆస్తుల వివరాలు వెల్లడించడం మర్చిపోయినా లేదా సవరణ రిటర్నుల్లోనూ తప్పులను గుర్తించిన సందర్భాల్లో.. ఐటీఆర్–యూ దాఖలు చేసుకోవచ్చు.ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139(8ఏ) ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఆదాయపన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి, రిటర్నులు సమర్పించని వారు లేదా సమర్పించినా సమగ్ర వివరాలు వెల్లడించని వారు తప్పకుండా ఐటీఆర్–యూ దాఖలు చేసి, పెనాల్టీ, వడ్డీ సహా పన్నును చెల్లించడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులను ఎంత ఆలస్యంగా దాఖలు చేశారు, చెల్లించాల్సిన పన్ను ఎంతన్నదాని ఆధారంగా.. అసలుకి 25 శాతం, 50 శాతం, 60 శాతం లేదా 70 శాతం వరకు అదనపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా అంతకాలానికి వడ్డీ, పెనాలీ్టలను కూడా సమర్పించుకోవాలి. రిటర్నుల్లో సవరణలు..ఆదాయపన్ను రిటర్నుల దాఖలు ఇటీవలి కాలంలో కొంత సులభంగా మారినప్పటికీ, ఇంకా కొంత సంక్లిష్టమనే చెప్పుకోవాలి. అన్ని ఆర్థిక లావాదేవీలు, ఆదాయం, పెట్టుబడులు, మూలధన లాభాలు/నష్టాలు, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, విదేశీ పెట్టుబడులు ఇలా ఎన్నో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. టీడీఎస్, టీసీఎస్ ఏవైనా ఉంటే సరిచూసుకోవాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)ను చూసుకున్న తర్వాత అందులో ఏవైనా తప్పులుంటే ఆదాయపన్ను శాఖకు రెక్టిఫికేషన్ (దిద్దుబాటు) అభ్యర్థన నమోదు చేయాలి. ఇంత సుదీర్ఘ ప్రక్రియలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు.లేదా ఫలానా ఆదాయం లేదా ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడించడం మర్చిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. కనుక రిటర్నులు సమర్పించిన అనంతరం ప్రతి ఒక్కరూ ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోవడం మంచిది. ఏవైనా తప్పులుంటే, వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 31లోపు ఈ పనిచేయొచ్చు. ఐటీఆర్ పత్రం సరైనది ఎంపిక చేసుకోకపోవడం, వ్యక్తిగత వివరాల్లో తప్పులు, బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పులు, కొన్ని ఆదాయాలను వెల్లడించకపోవడం, మినహాయింపులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకుండా పన్ను రిటర్నులు వేసి, అధిక పన్ను చెల్లించడం.. విదేశీ పెట్టుబడులు, ఆదాయాలు, ఇ–సాప్లు.. ఎలాంటి ఆధారాల్లేకుండా మినహాయింపులను క్లెయిమ్ చేసుకున్న సందర్భాల్లో సవరణ రిటర్నులు సమర్పించొచ్చు.ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయాలను వెల్లడించకపోతే ‘బ్లాక్మనీ అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ యాక్ట్, 2015’ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అప్పటికే సమర్పించిన రిటర్నులను ఆదాయపన్ను శాఖ మదింపు చేయడం ముగిసిపోతే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. ⇒ సెక్షన్ 143 (1) కింద ఐటీఆర్ ప్రాసెస్ (ఇనీíÙయల్/ప్రాథమిక) అయినప్పుడే సవరణ రిటర్నులను డిసెంబర్ 31లోపు లేదా తుది ప్రాసెసింగ్కు ముందు సమర్పించుకునేందుకు అనుమతి ఉంటుంది. ⇒ ఒకవేళ డిసెంబర్ 31 కంటే ముందుగానే సెక్షన్ 143 (3) కింద ఐటీఆర్ తుది మదింపు ముగిసినట్టయితే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సెక్షన్ 139(8ఏ) కింద ఐటీఆర్–అప్డేటెడ్ సమర్పించుకోవచ్చు.డిసెంబర్ 31నాటికి దాఖలు చేయకపోతే..? డిసెంబర్ 31లోపు ఆలస్యపు రిటర్నులు సమర్పించడంలోనూ విఫలమైతే ఏమవుతుంది? అన్న సందేహం ఏర్పడొచ్చు. అలాంటి కేసుల్లో ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ కావొచ్చు. సకాలంలో రిటర్నులు వేయడం ద్వారానే చట్టపరిధిలో ఎన్నో మినహాయింపులు, ప్రయోజనాలకు అర్హత ఉంటుంది. లేదంటే వీటిని కోల్పోయినట్టే. రుణాలకు, ఆదాయ ధ్రువీకరణకు, వీసా ప్రాసెసింగ్కు ఐటీ రిటర్నులు రుజువుగా పనికొస్తాయన్నది గుర్తు పెట్టుకోవాలి. వివిధ వర్గాల వారికి రిటర్నుల గడువు ⇒ వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్), ఆడిటింగ్ అవసరం లేని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ (ఏవోపీ), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐ) రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. ⇒ ఆడిట్ అవసరమైన వ్యాపార సంస్థలు రిటర్నుల సమర్పణ గడువు అక్టోబర్ 31. ⇒ సవరణ, బిలేటెడ్ రిటర్నుల సమర్పణ గడువు డిసెంబర్ 31. ⇒ 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి అప్డేటెడ్ రిటర్నుల దాఖలు గడువు 2030 మార్చి 31. -
35 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ అమ్మేసిందా?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన పసిడి నిల్వలలో నుంచి 35 టన్నుల బంగారాన్ని అమ్మేసినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కథనాలు విస్తృతంగా వచ్చాయి. ఈ కథనాలను దేశ అత్యున్నత బ్యాంక్ ఖండించింది. ఈ వార్తలపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించిన ప్రభుత్వ వార్తా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అవన్నీ ఫేక్ అని తేలుస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా దాన్ని ఆర్బీఐ రీ ట్వీట్ చేస్తూ సెంట్రల్ బ్యాంక్ అటువంటి అమ్మకం జరగలేదని స్పష్టం చేసింది.ఆర్బీఐకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితమైన వివరాలు, అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచిస్తూ ఆర్బీఐ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.ప్రపంచంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా యూఎస్ డాలర్ నుండి వైవిధ్యపరచడానికి తమ పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. 2022లో రష్యా రిజర్వ్ ఆస్తులను స్తంభింపజేసిన తర్వాత ఈ ధోరణి ఊపందుకుంది.భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద ప్రస్తుతం (2025 సెప్టెంబర్ చివరి నాటికి) 880.8 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటి అంచనా విలువ దాదాపు 9 లక్షల కోట్లకు పైనే. వీటిలో 575.8 టన్నులు భారత్లో ఉండగా 290.3 టన్నులు విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి వాటి వద్ద ఉన్నాయి.Reserve Bank of India, through PIB Fact Check Unit, has debunked claims that 35 tonnes of gold has been sold by RBI from its reserves. https://t.co/8iDYlbO25TRBI cautions against unsubstantiated rumours on social media. For any information pertaining to RBI, please visit the… pic.twitter.com/A91AIm1Vf3— ReserveBankOfIndia (@RBI) November 7, 2025 -
భారత్-యూఎస్ వాణిజ్య చర్చలపై ట్రంప్ ఆశాభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో కొనసాగుతున్న వాణిజ్య చర్చలపై ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చలు బాగానే జరుగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా 2026లో ఇండియా పర్యటన చేయబోతున్నట్లు సంకేతాలు కూడా ఇచ్చారు. అయినప్పటికీ రష్యాతో భారతదేశ ఇంధన సంబంధాలపై ఆయన తన కఠిన వైఖరిని తెలియజేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించాలని చెప్పారు.వాణిజ్య చర్చలువైట్ హౌస్లో జరిగిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీని గొప్ప వ్యక్తి, మంచి స్నేహితుడు అని ప్రశంసించారు. వాణిజ్య ఉద్రిక్తతలను పరిష్కరించడానికి విస్తృత ప్రయత్నం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘మోదీ రష్యా నుంచి చమురు కొనడం చాలా వరకు నిలిపేశారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. తన భారత పర్యటన గురించి అడిగినప్పుడు ‘మేము చర్చిస్తున్నాం. నేను అక్కడికి రావాలని మోదీ కోరుకుంటారు. నేనూ వెళ్తాను. 2026లో వెళ్లే అవకాశం ఉంది’ అని స్పందించారు.భౌగోళిక రాజకీయ సాధనంగా సుంకాలురష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా భారత్ వస్తువులపై 50% సుంకం విధించింది. ఇందులో 25% పరస్పర సుంకం కాగా, రష్యన్ చమురు కొనుగోళ్లకు అదనంగా 25% సుంకం జోడించారు. యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఇటీవల ఈ సుంకాలను సమర్థించారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చే వ్యూహాత్మక చర్యగా ఆ సుంకాలను రూపొందించినట్లు చెప్పారు. ‘రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ సుంకాలను ఉపయోగిస్తున్నారు. దానివల్లే ఇండియా చమురు కొనడం ఆపండంటూ ట్రంప్ చెప్పారు’ అని అన్నారు. అయితే, భారత్ ఈ వాదనలను ఖండించింది. రష్యన్ చమురును కొనుగోలు చేయడం సార్వభౌమ నిర్ణయం అని తెలిపింది. భారత్ ఏ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించదని అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రైలులో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా? -
రిస్క్ నియంత్రణకు కలసి పనిచేయాలి
ముంబై: సంస్థాగత ఆర్థిక, వాతావరణ మార్పుల రిస్క్ ను సకాలంలో గుర్తించి, చర్యలు తీసుకునేందుకు వీలుగా సమగ్రమైన కార్యాచరణను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు సంయుక్తంగా కలసి పనిచేయాలని బీమారంగ నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) చైర్మన్ అజయ్సేత్ అన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ 10వ సదస్సును ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. ఆర్థిక రంగానికి సంబంధించిన సైభర్ భద్రతా రిస్క్ నిర్వహణ విధానం ముసాయిదా 2026 ఆరంభంలో ఐఆర్డీఏఐ ముందుకు వస్తుందని చెప్పారు. వాతావరణ సంబంధిత రిస్క్, అవకాశాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం ద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించాలన్నారు. అదే సమయంలో దేశ అభివృద్ధి ఆకాంక్షలు, ప్రాధాన్యతల విషయంలో రాజీపడరాదన్నారు. ఆర్థిక రంగంలో ఎన్నో విభాగాల మధ్య అంతర్గత అనుసంధానం పెరుగుతోందంటూ.. ఒక విభాగంలో సమస్యలు ఏర్పడితే ఇతర విభాగాల్లోనూ ఆర్థిక ఇబ్బందులు, అస్థిరతలు ఎదురవుతున్నట్టు అజయ్సేత్ చెప్పారు. -
వృద్ధి 6.8 శాతానికి చేరుకోవచ్చు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. జీఎస్టీ రేట్ల కోత, ఆదాయపన్ను మినహాయింపులతో పెరిగే వినియోగం వృద్ధికి ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం 6.8 శాతం వృద్ధి రేటు విషయంలో సౌకర్యంగా ఉన్నాను. వాస్తవానికి 2025–26 సంవత్సరానికి సంబంధించి నా అంచనా 6.3–6.8 శాతం (ఆర్థిక సర్వే ప్రకారం). కనీసం 6–7 శాతం శ్రేణిలో కనిష్ట స్థాయికి వెళతామేమోనన్న ఆందోళన ఆగస్ట్లో వ్యక్తమైంది. ఇప్పుడు ఇది 6.5 శాతం, అంతకుమించి 6.8 శాతానికి కూడా చేరుకోవచ్చని సౌకర్యంగా చెబుతున్నాను. 7 శాతం వృద్ధి రేటు అంచనాలను వ్యక్తీకరించాలంటే, రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు వచ్చే వరకు ఆగాల్సిందే’’అని నాగేశ్వరన్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. 2025–26 జూన్ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం తెలిసిందే. దీనికంటే ముందు 2024 జనవరి–మార్చి త్రైమాసికంలో 8.4 శాతం స్థాయిలో జీడీపీ వృద్ధి నమోదైంది. ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉండగా, 5.2 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. అమెరికాతో ఒప్పందం సానుకూలం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే దేశ వృద్ధి రేటు మరింత వేగాన్ని అందుకుంటుందని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ ఒప్పందం సాకారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం విషయంలో పరిష్కారం పట్ల ఇప్పటికీ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు అమలు చేస్తుండడం తెలిసిందే. నవంబర్ నాటికి తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడం గమనార్హం.


