breaking news
Economy
-
'నేను చెప్పినట్లు చేయండి.. లేకుంటే': ట్రంప్ పోస్ట్ వైరల్
డొనాల్ట్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా.. నాటో దేశాలు రష్యా చమురు కొనుగోలును ఆపివేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రష్యా నుంచి పెట్రోలియం కొనుగోలు చేసినందుకు చైనాపై 50-100 శాతం సుంకాలు విధిస్తామని పేర్కొన్నారు.అన్ని నాటో దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపివేసినప్పుడు.. నేను రష్యాపై ప్రధాన ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నాను. నాటో సభ్యులు రష్యా చమురు కొనుగోలు చేయడం షాకింగ్గా ఉంది. యుద్ధంలో గెలవడానికి వారి నిబద్ధత 100% కంటే చాలా తక్కువగా ఉందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో వెల్లడించారు.రష్యా ఇంధనాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశం చైనా, తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. నాటో సభ్యదేశమైన టర్కీ మూడవ స్థానంలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే 32 దేశాల కూటమిలో హంగరీ, స్లోవేకియా కూడా ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.రష్యా చమురుపై నాటో నిషేధం, చైనాపై సుంకాలు ఇవన్నీ కూడా యుద్ధాన్ని ముగించడంలో గొప్ప సహాయకారిగా ఉంటాయి. చైనాకు రష్యాపై బలమైన నియంత్రణ, పట్టు ఉన్నాయి. తానూ విధిస్తున్న సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధం జరగడానికి కారణం అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అని అన్నారు.ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరికజో బైడెన్ అధ్యక్షుదిగా ఉన్న సమయంలో.. నేను అధ్యక్షుడినై ఉండి ఉంటే, ఈ యుద్ధమే ప్రారంభమయ్యేది కాదు. ఇది బైడెన్, జెలెన్స్కీల యుద్ధం అని ట్రంప్ అన్నారు. నేను చెప్పినట్లుగా చేస్తే.. యుద్ధం త్వరగా ముగుస్తుంది, ఎన్నో ప్రాణాలు నిలబడతాయి. లేకపోతే.. మీరు నా సమయాన్ని, దేశ సమయాన్ని, శక్తిని, డబ్బును వృధా చేస్తున్నవారు అవుతారని ఆయన స్పష్టం చేశారు. -
స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో నమోదైన ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి నుంచి ఆగస్ట్ నెలలో కాస్తంత ఎగిసింది. జూలైలో 1.61% కాగా, ఆగస్ట్లో 2.07 శాతానికి చేరింది. కూరగాయలు, మాంసం, చేప లు, గుడ్లు, నూనెలు, ఫ్యాట్స్ ధరలు పెరగడం ఇందుకు దారితీసినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ/రిటైల్ ద్రవ్యోల్బణం) తొమ్మిది నెలల పాటు వరుస క్షీణతకు ఆగస్ట్లో బ్రేక్ పడినట్టయింది. 2024 ఆగస్ట్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా ఉంది. → ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 0.69 శాతంగా నమోదైంది. జూలైలో ఇది మైనస్ 1.76%గా ఉంది. → కూరగాయల ధరలు 15.92% పడిపోయాయి. → గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం జూలైలో 1.18 శాతంగా ఉంటే, ఆగస్ట్లో 1.69 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో 2.1 శాతం నుంచి 2.47 శాతానికి చేరింది. రానున్న నెలల్లో గమనించాలి.. ఆహారం, పానీయాల విభాగాల్లోని ధరల పెరుగుదల వల్లే సీక్వెన్షియల్గా (నెలవారీగా) రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్ట్లో పెరగడానికి కారణమని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి సానుకూల ధోరణులు కనిపిస్తున్నప్పటికీ.. ఆగస్ట్ చివరి నుంచి సెపె్టంబర్ ఆరంభం వరకు అధిక వర్షాలు, వరదలు ఖరీఫ్ దిగుబడులపై ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. అంతిమంగా దిగుబడి, ధరల తీరును గమనించాల్సి ఉందన్నారు. -
ట్రేడ్ వార్తో భారత్కు సవాళ్లు: మారిషస్ ప్రధాని
ప్రతీకార సుంకాలు, వాణిజ్య వివాదాలతో భారత్కు భారీ సవాళ్లు ఎదురవుతున్నట్లు మారిషస్ ప్రధాని నవీన్చంద్ర రామ్గులామ్ పేర్కొన్నారు. రక్షణాత్మక విధానాలు పెరిగిపోవడం, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య ఉధృతమవుతున్న ఆందోళనలు, వాతావరణ సంబంధ విఘాతాలు పలురకాల రిస్కులకు తెరతీస్తున్నట్లు తెలియజేశారు.విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర పారిశ్రామిక సమాఖ్యలతో కలసి ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన మారిషన్ ఇండియా వ్యాపార సదస్సు(బిజినెస్ కాంక్లేవ్)లో నవీన్చంద్ర ప్రసంగించారు. సామాజిక, ఆర్థికాభివృద్ధిలో దీర్ఘకాలంగా మారిషస్కు భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.అన్ని సమయాలలోనూ మారిషస్కు మద్దతివ్వడంలో ధృడంగా నిలుస్తున్నట్లు ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, విధానాలు అస్థిరంగా, అంచనాలకు అందని విధంగా మారినట్లు వ్యాఖ్యానించారు. సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, అదుపుతప్పుతున్న రవాణా వ్యయాలు, వాతావరణ సంబంధ విఘాతాలు విభిన్న రిస్కులకు దారి చూపుతున్నట్లు వివరించారు. -
ఊబకాయం.. ఆర్థిక భారం!
భారత్లో ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకోసం చేసే ఆర్థిక ఖర్చులు అధికమవుతున్నట్లు యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 తెలిపింది. ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశంలో పెరుగుతున్న ఊబకాయం సంక్షోభాన్ని హైలైట్ చేసిన సంగతి తెలిసింది. ఈ సందర్భంగా వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలను కోరారు. శరీరంలో పెరుగుతున్న కొవ్వులపై ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. దాన్ని తగ్గించుకునేందుకు నెలవారీ ఖర్చులను కూడా ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు.యునిసెఫ్ చైల్డ్ న్యూట్రిషన్ గ్లోబల్ రిపోర్ట్ 2025 ప్రకారం.. పాఠశాలకు వెళ్లే, కౌమారదశలోని పిల్లల్లో ఊబకాయం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తక్కువ బరువు సమస్యను భారత్ క్రమంగా అధిగమిస్తున్నప్పటికీ, ఊబకాయం సమస్యగా పరణిమిస్తుంది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ అంచనా ప్రకారం.. 2019లో ఊబకాయం సంబంధిత ఖర్చులు దాదాపు 29 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది భారతదేశ జీడీపీలో 1 శాతం. ఒబెసిటీ సమస్యకు అత్యవసర చర్యలు తీసుకోకపోతే 2060 నాటికి ఈ సంఖ్య 839 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇది జీడీపీలో 2.5 శాతంగా ఉండనుంది.నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) డేటా ప్రకారం అధిక బరువు, ఊబకాయం ఉన్న ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2005-06లో ఎన్ఎఫ్హెచ్ఎస్ 3 నుంచి 2019-21లో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 మధ్య వీరి సంఖ్య 127 శాతం పెరిగింది. కౌమారదశలో ఉన్న బాలికలు, బాలురు వరుసగా 125 శాతం, 288 శాతం అధికమయ్యారు.లఖ్నవూ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్న మనోజ్ కుమార్ అగర్వాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నడక, శారీరక వ్యాయామం లేకపోవడం ఊబకాయం పెరగడానికి కారణాలుగా పేర్కొన్నారు. ‘ఆరోగ్యకరమైన జీవనశైలి, యోగా మొదలైన వాటిని అవలంబించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు’ అని అన్నారు.ఊబకాయం పెరుగుదలకు కారణాలు.. -
భారత్ వరికి ఎంఎస్పీ పెంచితే డబ్ల్యూటీఓలో ప్రశ్నలు!
దేశీయంలో వరి పంటలో స్వావలంబన సాధించేందుకు, ఇథనాల్ ఉత్పత్తికి, రైతులకు ఆర్థిక భరోసాకు, కొన్ని దేశాలకు బియ్యం ఎగుమతులు పెంచేందుకు భారత్ తీసుకున్న నిర్ణయానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశంలో వరి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) పెంపు నిర్ణయానికి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీఓ)లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈమేరకు భారత నిర్ణయాన్ని అమెరికా, పరాగ్వే సంయుక్తంగా డబ్ల్యూటీఓలో వ్యతిరేకిస్తున్నాయి. ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించిన ‘బాలీ ఒప్పందాల’ను(డబ్ల్యూటీఓ ఆహార సబ్సిడీ పరిమితులు) భారత్ భేఖాతరు చేస్తుందని వాదించాయి.ఎంఎస్పీ పెంపు విధానం భారత్ దేశీయ ఆహార పంపిణీ వ్యవస్థలో భాగం అయినప్పటికీ ఎగుమతులు, ఆహారేతర ప్రయోజనాల కోసం నిల్వలు పెంచుతోందని యూఎస్, పరాగ్వే అభిప్రాయపడుతున్నాయి. భారత్ ఎంఎస్పీ పెంచడం, భారీగా నిల్వలు ఉండడం, ఎగుమతులు సాగించడం వంటి విధానాలు ప్రపంచ బియ్యం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నట్లు చెప్పాయి. పాకిస్థాన్ను ఉదాహరిస్తూ.. అక్కడి బాస్మతియేతర బియ్యం ధరలు దాదాపు రాత్రికి రాత్రే మెట్రిక్ టన్నుకు సుమారు 200 డాలర్లు పడిపోయాయని గుర్తు చేశాయి.అయితే భారత్ వాదనలు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దేశం తన వంతుగా చిన్న, సన్నకారు రైతులకు మద్దతు ఇవ్వడానికి, పేదలకు ఆహారం అందించడానికి, కొన్ని దేశాలకు ఆహార భద్రతను నిర్ధారించేందుకు ఈ మార్పులు చేసినట్లు చెప్పింది. భారతదేశం బియ్యంపై ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. 2025 నాటికి రికార్డు స్థాయిలో 22.5 మిలియన్ టన్నులకు పెరుగుతాయని భావిస్తున్నారు. అయితే డబ్ల్యూటీఓ నిబంధనలకు లోబడే నిర్ణయాలున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. ఎఫ్సీఐ గోదాముల్లోని బియ్యాన్ని ఎగుమతులకు ఉపయోగించడం లేదన్నారు. అందుకు బదులుగా ఏటా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న స్టాక్నే నిల్వ ఉంచకుండా నేరుగా ఎగుమతి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై సెప్టెంబర్ 25-26 తేదీల్లో జరిగే సమీక్షా సమావేశంలో చర్చ జరగనుంది.ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి -
రుణాలపై మారటోరియం ఇవ్వండి
ఎగుమతిదారులు టారిఫ్లు, ద్రవ్యోల్బణం, డిమాండ్ అనిశ్చితిలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్థికంగా వెసులుబాటు లభించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్కి ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో విజ్ఞప్తి చేసింది. రుణాలకు సంబంధించి అసలు, వడ్డీపై ఒక ఏడాది పాటు వన్–టైమ్ మారటోరియం(రుణాలు చెల్లించేందుకు గడువు పొడిగింపు) ప్రకటించాలని కోరింది. అలాగే ప్రాధాన్యతా రంగం కింద వర్గీకరించినప్పటికీ ఎగుమతి సంస్థలకు తగు స్థాయిలో ప్రయోజనం లభించడం లేదని పేర్కొంది.ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన 40 శాతం రుణాలకు సంబంధించి ఎగుమతిదార్ల వాటా 2–2.5 శాతంగా ఉండేలా ఆదేశించాలని ప్రతిపాదించింది. గురువారం ఆర్బీఐతో సమావేశమైన సందర్భంగా ఎఫ్ఐఈవో ఈ మేరకు విజ్ఞప్తులు చేసింది. బ్యాంకులు సరళతరమైన విధంగా రుణాలు అందించాలని, పరిస్థితిని బట్టి పునర్వ్యవస్థీకరించాలని, అంతర్జాతీయంగా లావాదేవీల నిర్వహణ విషయంలో ఎగుమతిదార్లకు మద్దతుగా నిలవాలని కోరింది. అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల కారణంగా కొనుగోళ్లు, ఉత్పత్తి, ఎగుమతి షెడ్యూల్స్లో జాప్యం జరుగుతోందని పేర్కొంది. కాబట్టి, ఎగుమతి చేయడానికి ముందు ఇచ్చే స్వల్పకాలిక రుణాల కాలవ్యవధిని పెంచితే ఎగుమతిదార్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎఫ్ఐఈవో తెలిపింది.తమ పరిధిలో లేని జాప్యాల వల్ల ఆర్థికంగా దెబ్బ తినకుండా నిర్వహణ మూలధనాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకునేందుకు, నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు, కాంట్రాక్టు నిబంధనలను పాటించేందుకు వీలవుతుందని వివరించింది. ఇలాంటి ఊరటనిచ్చే చర్యలతో ఎగుమతిదార్లు, మార్కెట్లలో నెలకొన్న కొత్త పరిస్థితులకు అనుగుణంగా తమ కార్యకలాపాలను, వ్యూహాలను మార్చుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఇచ్చిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) తరహా పథకాన్నిమళ్లీ ప్రవేశపెట్టాలని ఎఫ్ఐఈవో విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు ప్రస్తుతం ఇలాంటివి చాలా అవసరమని వివరించింది.ఇదీ చదవండి: భారత్–అమెరికా చర్చల్లో పురోగతి -
భారత్–అమెరికా చర్చల్లో పురోగతి
ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై భారత్–అమెరికా మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో ముందుకు సాగుతున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రకటించారు. చర్చల్లో పురోగతి పట్ల రెండు దేశాలు సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) చర్చలను 2025 నవంబర్ నాటికి ముగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ దేశ వాణిజ్య మంత్రులకు సూచించినట్టు తెలిపారు. వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికాతో భారత్ చురుగ్గా చర్చలు నిర్వహిస్తున్నట్టు మంత్రి గోయల్ బుధవారం సైతం ప్రకటించడం గమనార్హం.రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు విజయవంతంగా పూర్తయ్యేందుకు ఎలాంటి అడ్డంకుల్లేవని, తన మంచి స్నేహితుడైన ప్రధాని నరేంద్ర మోదీతో రానున్న వారాల్లో మాట్లాడేందుకు వేచి చూస్తున్నానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనతో.. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం సాకారమవుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ సైతం వెంటనే సానుకూలంగా స్పందించారు.అమెరికా, భారత్ సహజ భాగస్వాములంటూ.. వీలైనంత ముందుగా వాణిజ్య చర్చలను ముగించేందుకు రెండు దేశాలు చురుగ్గా పనిచేస్తున్నాయంటూ ప్రధాని మోదీ ఎక్స్ ప్లాట్ఫామ్పై చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. వాస్తవానికి భారత్–అమెరికా మధ్య పలు విడతల చర్చలు జరిగినప్పటికీ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదరకపోవడం తెలిసిందే.ఇదీ చదవండి: నోకియా హ్యాండ్సెట్ల తయారీదారు కొత్త ఫోన్ -
22 వరకూ ఆగుదాం!
నగర వాసులకు బొనాంజా అందనుంది. దసరా, దీపావళి పండగ ఆనందాలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) సవరణతో రెట్టింపు కానుంది. ఇటీవల కేంద్రం సవరించిన జీఎస్టీ శ్లాబులు ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. గతంతో పోలిస్తే ఆటో మొబైల్స్, ఎల్రక్టానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు సుమారు 10 శాతం మేర తగ్గనున్నాయి. దీంతో వాహనాలు, టీవీలు, కార్లు, సెల్ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ నెల 22 వరకూ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. మరోవైపు ఈ– కామర్స్ సంస్థలు కూడా ఈ నెల 22 తర్వాతే ఆఫర్లను అందించేందుకూ సిద్ధమవుతున్నాయి. దీంతో ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. 18 నుంచి 5 శాతానికి..గతంలో జీఎస్టీలో ఐదు శ్లాబులు ఉండగా.. తాజాగా కేంద్రం వీటిని రెండింటికి కుదించింది. విలాసవంతమైన వస్తువులపై ప్రత్యేకంగా 10 శాతం జీఎస్టీ శ్లాబును విధించింది. ప్రస్తుతం అనేక ఉత్పత్తులపై జీఎస్టీ 28 శాతం వరకు ఉన్నాయి. 22వ తేదీ నుంచి ఈ స్లాబ్ 18 శాతానికి తగ్గనుంది. కొన్ని ఉత్పత్తులపై 18 శాతం నుంచి 5 శాతానికి కూడా తగ్గే అవకాశముంది. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల వంటి ఎల్రక్టానిక్ వస్తువులతో పాటు కార్లు, బైక్ వంటి ఆటోమొబైల్స్ ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు నిత్యావసర సరుకులపై కూడా కేంద్రం జీఎస్టీని తగ్గించింది. జీఎస్టీ శ్లాబుల్లో మార్పులతో ఒకవైపు కొన్ని కంపెనీలు రేట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తరుణంలో వినియోగదారులు మాత్రం రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. చాలామంది షోరూమ్లకు వెళ్లి వస్తువులను చూస్తున్నారు. వాటి ఫీచర్లను పరిశీలిస్తున్నారు. కానీ కొనుగోలును మాత్రం ఈ నెల 22 తర్వాతే చేద్దామనే అభిప్రాయానికి వస్తున్నారని మార్కెట్ పరిశీలకులు అంటున్నారు. కొన్ని బ్రాండ్లు తాత్కాలికంగా ఆఫర్లు ప్రకటించినా అవి కస్టమర్లను ఆకట్టుకోలేకపోతున్నాయి. తగ్గనున్న వాహనాల ధరలు..సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్గా భావిస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఆటో మొబైల్స్పై 28 శాతంగా జీఎస్టీ ఉండగా.. కొత్త జీఎస్టీ శ్లాబ్లో ఇది 18 శాతానికి తగ్గింది. ఏకంగా 10 శాతం మేర జీఎస్టీ తగ్గుతుంది. దీంతో మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు, బైక్పై రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య తగ్గింపు ఉండనుంది. దీంతో వాహన కొనుగోలుదారులు కొనుగోళ్లను మరో రెండు వారాల పాటు వాయిదా వేసుకుంటున్నారు. వాహన షోరూమ్లో గిరాకీ తగ్గడంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు షోరూమ్ నిర్వాహకులు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ముందస్తుగా బుకింగ్ చేసుకుని 22వ తేదీ తర్వాతే డెలివరీ చేసుకోవచ్చని భావిస్తున్నారు.ఏసీ, వాషింగ్ మెషీన్, టీవీలు సైతం.. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఏసీలు, వాషింగ్ మిషన్లు, డిష్వాషర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై కూడా కేంద్రం జీఎస్టీ శ్లాబ్ను తగ్గించింది. ఇప్పటివరకు వీటిపై 28 శాతం పన్ను విధించగా, ఇప్పుడవి 18 శాతం జీఎస్టీ శ్లాబ్లోకి వెళ్లాయి. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా భారీగానే తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. టీవీలపై రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేల నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల వాయిదాకే జనం మొగ్గు చూపుతున్నారు.ఈ– కామర్స్ ఆఫర్లూ అప్పుడే..ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ–కామర్స్ కొనుగోలుదారులు సైతం ఈ నెల 22 డెడ్లైన్ విధానానికే జై కొడుతుండటంతో.. కొన్ని సంస్థలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లను సైతం నిలిపివేశాయి. దీంతో సాధారణంగా డైలీ, వీక్లీ ఆఫర్ల పేరుతో ఆన్లైన్ కస్టమర్లను ఆకర్షించే ఈ–కామర్స్ సంస్థలు.. తమ మెగా ఆఫర్లను ఈ నెల 22 తర్వాతే ప్రకటించాలని వ్యూహరచన చేస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపు తర్వాత ‘బిగ్ బిలియన్ డేస్’, ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ వంటి పేర్లతో భారీ సేల్ నిర్వహించడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.ఇదీ చదవండి: ప్రపంచ కుబేరుడిగా లారీ ఎలిసన్ -
అమెరికా టారిఫ్ల ప్రభావం ఇదిగో ఇంతే..
అమెరికా టారిఫ్ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావం 0.2–0.3 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. అయితే జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీ డిమాండ్ను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమెరికాకు చేసిన ఎగుమతుల్లో సగం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే నమోదైనట్టు గుర్తు చేశారు.సుంకాలు స్వల్పకాలమే గానీ, దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చన్నారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అప్పుడు ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయంటూ.. పెట్టుబడులు, మూలధన వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్పై దీని తాలూకూ అనిశ్చితి ఉంటుందని చెప్పారు.అయితే, జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీయంగా బలమైన వినియోగ సృష్టి ద్వారా టారిఫ్ల తాలూకూ ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలను అధిగమించేందుకు సాయపడతాయన్నారు. కనుక మొత్తం మీద జీడీపీపై పడే ప్రభావం 0.3 శాతం మించి ఉండదన్నారు. 2025–26 సంవత్సరానికి 6.3–6.8% మధ్య జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చన్న తమ అంచనాలను గుర్తు చేశారు.సాగులో సంస్కరణలు.. వ్యవసాయ రంగం జీడీపీకి మరో 0.5–0.70 శాతం వరకు తోడ్పాటునివ్వగలదని నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకు గాను రైతులు వారు కోరుకున్న చోట విక్రయించే హక్కు అవసరమన్నారు. ప్రకృతి విపత్తులపై సాగు దిగుబడులు ఆధారపడి ఉన్నందున వారికి బీమా రూపంలోనూ దన్నుగా నిలవాలన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానాన్ని భర్తీ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.అటువంటి చర్యలో భారత్ పాలుపంచుకోదని ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు. డాలర్కు మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదంటూ.. ఇందుకు చాలా కాలం పట్టొచ్చన్నారు. గతేడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యానికి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు, ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం. -
భారత వృద్ధి అంచనాలు అప్!
ఫిచ్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ వృద్ధి అంచనాలను పెంచింది. జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందుతుందన్న గత అంచనాను 6.9 శాతం చేసింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి బలమైన పనితీరు నమోదు కావడం, దేశీ వినియోగ ఆధారిత డిమాండ్ పుంజుకోవడాన్ని అంచనాలు పెంచేందుకు కారణాలుగా పేర్కొంది. అమెరికా టారిఫ్లతో భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు లోగడ పలు అంతర్జాతీయ ఏజెన్సీలు ప్రకటించగా.. అంచనాలను పెంచిన తొలి సంస్థ ఫిచ్ కావడం గమనార్హం.మార్చి, జూన్ త్రైమాసికాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగాన్ని పుంజుకున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తన తాజా నివేదికలో పేర్కొంది. జీడీపీ జనవరి–మార్చి త్రైమాసికంలో 7.4 శాతం వృద్ధి చెందగా, జూన్ త్రైమాసికంలో 7.8 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. వాస్తవానికి జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6.7 శాతంగా ఉంటుందని ఫిచ్ ఈ ఏడాది ఏప్రిల్లో తన అంచనాలను ప్రకటించగా, దీనికి మించి బలమైన వృద్ధి రేటు నమోదైంది. దీనికి తోడు జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మంచి వృద్ధిని నమోదు చేస్తుందంటూ తాజా అంచనాలను ఫిచ్ విడుదల చేసింది.వినియోగమే బలమైన చోదకం.. ‘‘అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు ఇటీవలి నెలల్లో పెరిగాయి. భారత ఉత్పత్తులపై అమెరికా 25 శాతం అదనపు టారిఫ్లు విధించగా, ఇవి ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో అమెరికాలో భారత ఉత్పత్తులపై టారిఫ్లు 50 శాతానికి పెరిగాయి. చర్చల ద్వారా టారిఫ్ రేట్లు అంతిమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నాం. వాణిజ్య సంబంధాల విషయంలో నెలకొన్న అనిశ్చితి వ్యాపార వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. పెట్టుబడులపై దీని ప్రభావం పడుతుంది. జీఎస్టీలో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ వినియోగం బలంగా పెరుగుతుంది’’అని ఫిచ్ రేటింగ్స్ వెల్లడించింది. వృద్ధికి దేశీ వినియోగం కీలక చోదకంగా పనిచేస్తుందని తెలిపింది. సానుకూల ఆర్థిక పరిస్థితులు పెట్టుబడులను ఇతోధికం చేస్తాయని అంచనా వేసింది. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల్లో వృద్ధి కొంత నిదానిస్తుందని ఫిచ్ అభిప్రాయపడింది. 2026–27లో 6.3 శాతం.. 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.3 శాతానికి, తదుపరి ఆర్థిక సంవత్సరంలో (2027–28)లో 6.2 శాతానికి పరిమితం అవుతుందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. సగటు కంటే అధిక వర్షపాతం, అధిక నిల్వలతో ఆహార ధరలు తక్కువ స్థాయిలోనే కొనసాగుతాయని తెలిపింది. దీంతో ద్రవ్యోల్బణం 2025 చివర్లోనే 3.2 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2026 చివరికి 4.1 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. ఆర్బీఐ ఈ ఏడాది చివరికి పావు శాతం రేటు తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.ఇదీ చదవండి: రొయ్యల ఎగుమతులకు టారిఫ్ ఎఫెక్ట్.. -
రొయ్యల ఎగుమతులకు టారిఫ్ ఎఫెక్ట్..
రొయ్యల ఎగుమతిదార్లపై అమెరికా టారిఫ్ల ప్రభావం భారీగానే ఉండనుంది. దీని వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) పరిశ్రమ ఆదాయం 12 శాతం క్షీణించే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ఒక నివేదికలో తెలిపింది. భారత ఫ్రోజెన్ రొయ్యలకు అమెరికా కీలక మార్కెట్గా ఉంటోంది. ఎగుమతుల పరిమాణంలో 41 శాతం, విలువపరంగా 48 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. 50 శాతం ప్రతీకార సుంకాల (అదనంగా యాంటీ–డంపింగ్ డ్యూటీ మొదలైనవి కూడా కలిపితే 58 శాతం) వల్ల వాణిజ్యం గణనీయంగా దెబ్బతింటుందని నివేదిక పేర్కొంది. దీనితో ఈక్వెడార్, వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలతో భారత్ పోటీపడలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఫలితంగా ఎగుమతుల పరిమాణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది.ప్రధాన రొయ్యల కంపెనీల ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ ప్రకారం 2025–26లో ఆదాయాలు 12 శాతం మేర, మార్జిన్లు సుమారు 150 బేసిస్ పాయింట్ల (దాదాపు ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉందని ఇండ్–రా తెలిపింది. నిర్వహణ మూలధనంపరంగా కూడా కొంత ఒత్తిడి నెలకొనవచ్చని వివరించింది. అధిక టారిఫ్లను అమెరికా కొనసాగిస్తే మధ్యకాలికంగా రొయ్యల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం తప్పదని పేర్కొంది. ఎగుమతుల పరిమాణం, మార్జిన్లపై ఒత్తిళ్ల వల్ల ఆర్థికంగా అంత పటిష్టంగా లేని మధ్య స్థాయి సంస్థల రుణపరపతి దెబ్బతినే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఇతర దేశాల వైపు చూపు ..భారతీయ రొయ్యల ప్రాసెసింగ్ సంస్థలు దేశీ మార్కెట్తో పాటు అమెరికాయేతర మార్కెట్లలోకి (చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్, బ్రిటన్) కూడా మరింతగా విస్తరించే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు ఇండ్–రా అసోసియేట్ డైరెక్టర్ ఆదర్శ్ గుత్తా తెలిపారు. అయితే, ఈ ప్రాంతాల్లో అంతగా అధిక ధర లభించదని, పైగా పరిమిత స్థాయిలోనే ఎగుమతి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. వ్యూహాత్మక డైవర్సిఫికేషన్, ఉత్పత్తులకు మరింత విలువను జోడించడంపై పెట్టుబడులు పెట్టడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడంలాంటివి పోటీతత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని నిలబెట్టుకునేందుకు కీలకంగా ఉంటాయని ఆదర్శ్ చెప్పారు.ఇదీ చదవండి: లంచం కేసు సెటిల్మెంట్ చేసుకున్న సంస్థ -
ప్రభుత్వ సెక్యూరిటీల వేలం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా రూ.14,900 కోట్లు సమీకరించింది. వివిధ విడతలతో కూడిన ఈ వేలంలో ఆరు రాష్ట్రాలు తమ ఆర్థిక అవసరాల కోసం గణనీయమైన నిధులను సమకూర్చుకున్నాయి. ఆర్బీఐ అధికారిక ప్రకటన ప్రకారం.. వివిధ మెచ్యూరిటీల ద్వారా మొత్తం రూ.15,300 కోట్లు ఆఫర్ చేసింది. కానీ చివరకు రూ.14,900 కోట్లు అందించింది. ఆర్బీఐ రుణాలు ఇచ్చిన ఆరు రాష్ట్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఈ సెక్యూరిటీల వేలంలో బిహార్ అతిపెద్ద రుణగ్రహీతగా ఉంది. మూడు వేర్వేరు విడతల ద్వారా రూ.6,000 కోట్లు సేకరించింది. 5, 9 మరియు 11 సంవత్సరాల కాలపరిమితితో సెక్యూరిటీల ద్వారా రాష్ట్రం రూ.2,000 కోట్ల చొప్పున నిధులు సమీకరించింది. గోవా.. 11 సంవత్సరాల సెక్యూరిటీ ద్వారా 7.48% ఈల్డ్తో రూ.100 కోట్ల రూపాయలను సేకరించింది.హరియాణా రూ.1,500 కోట్లు, జమ్మూ కశ్మీర్ 7.51% ఈల్డ్ అందించే 20 సంవత్సరాల బాండ్తో రూ.300 కోట్లు సమీకరించింది. మధ్యప్రదేశ్ మూడు వేర్వేరు విడతల ద్వారా రూ. 4,000 కోట్లు సేకరించింది. మహారాష్ట్ర మూడు మెచ్యూరిటీలలో రూ.3,000 కోట్లు అప్పుగా తీసుకుంది.ఇదీ చదవండి: భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన -
పాత స్టాక్పై ఎంఆర్పీ మార్చవచ్చు: కేంద్రం
వస్తు సేవల పన్ను శ్లాబులను ఇటీవల సవరించిన ప్రభుత్వం వినియోగ వస్తువుల కంపెనీలకు కార్యాచరణ అడ్డంకులను తగ్గించే లక్ష్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వస్తువుల తయారీదారులు, ప్యాకర్లు, దిగుమతిదారులకు కొత్త జీఎస్టీ రేట్లను ప్రతిబింబించేలా అమ్ముడుపోని ప్రీ-ప్యాకేజ్డ్ స్టాక్పై గరిష్ట రిటైల్ ధర (MRP)ను సవరించడానికి అనుమతించింది. దీని అమలు డిసెంబర్ 31, 2025లోపు పూర్తికావాలని చెప్పింది. కొత్తగా తయారయ్యే స్టాక్కు మారిన రేట్లను అప్డేట్ చేస్తారని గమనించాలి.కేబినెట్ కార్యదర్శి టి.వి.సోమనాథన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ప్రకారం మార్పులను అమలు చేయడంలో పరిశ్రమ వర్గాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈమేరకు వెసులుబాటు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది వృధాను నివారించడానికి, సప్లై చెయిన్ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటానికి ఆచరణాత్మక విధానమని చెప్పింది.నోటిఫికేషన్లోని నిబంధనలుకంపెనీలు జీఎస్టీ సవరణ తేదీకి ముందు తయారు చేసిన అమ్ముడుపోని స్టాక్పై ఉన్న ఎంఆర్పీని సవరించవచ్చు.శ్లాబుల వారీగా వస్తువుల రేట్లు పెరిగినా, తగ్గినా సవరించేలా రెండింటినీ లెక్కించవచ్చు.అప్డేట్ అయిన ధరలను స్టిక్కర్లు, స్టాంపింగ్ లేదా ఆన్లైన్ ప్రింటింగ్ ఉపయోగించి వినియోగదారులకు తెలియజేయవచ్చు.ఒరిజినల్ ఎంఆర్పీ స్పష్టంగా కనిపించాలి.కంపెనీలు సవరించిన ఎంఆర్పీల గురించి వినియోగదారులు, డీలర్లు, పంపిణీదారులకు ప్రకటనలు, పబ్లిక్ నోటీసుల ద్వారా తెలియజేయాలి.ఇప్పటికే ఉన్న ప్యాకేజింగ్, ర్యాపర్లను డిసెంబర్ 31 వరకు లేదా స్టాక్స్ అయిపోయే వరకు ఉపయోగించవచ్చు.ఇదీ చదవండి: నెలకు రూ.18 వేలు జీతం.. ప్రపంచంలోనే రిచ్.. -
అమెరికా టూరిజం.. ఫాల్ ఫాల్ ఫాల్
ప్రపంచ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. యునైటెడ్ స్టేట్స్ ఊహించని తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చేవారి సంఖ్య 8.2 శాతం తగ్గింది. ఫలితంగా పర్యటక ఆదాయం గణనీయంగా తగ్గింది. టూరిస్ట్లు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, చౌకైన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. అమెరికాకు పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణాలను పరిశీలిస్తే..వీసా ఆలస్యం, పెరిగిన ఖర్చులు, రాజకీయ ప్రభావం, భద్రతకు సంబంధించిన ఆందోళనలు ప్రధానంగా పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.యూఎస్కు వెళ్లే జర్మన్ల సంఖ్య 12 శాతం తగ్గింది. వీరంతా పోర్చుగల్, కెనడా, వియత్నాం దేశాలను సందర్శిస్తున్నారు. జపనీస్ సందర్శకుల సంఖ్య.. కోవిడ్ మహమ్మారి సమయం నుంచే 35 శాతం తగ్గిపోయింది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వీరందరూ.. దక్షిణ కొరియా, థాయిలాండ్, ఆస్ట్రేలియాలను సందర్శిస్తున్నారు. అంతే కాకుండా అమెరికాకు వెళ్లే కెనడా పర్యాటకుల సంఖ్య 20.2 శాతం పడిపోయింది.వీసా ఆలస్యం కారణంగా.. బ్రెజిల్ ప్రజలు అమెరికాకు ప్రత్యామ్నాయం వెతుక్కుని, యూరప్, సౌత్ అమెరికా దేశాలకు వెళ్తున్నారు. ఈ దేశీయులు అమెరికా వీసా కోసం 300 రోజులు నిరీక్షించాల్సి ఉంది. ఇది బ్రెజిలియన్ ప్రయాణికులను వేరే మార్గం వెతుక్కునేలా చేసింది.ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను విధించడమే కాకుండా, వీసా ఆంక్షలను కూడా మరింత కఠినం చేశారు. ఇప్పుడు వీసా కోసం భారతీయులు ఏకంగా 400 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రూపాయి కూడా బలహీనపడటం.. అమెరికాలో ఖర్చులు పెరగడం వల్ల, ఇండియన్స్.. ఆగ్నేయాసియా, యూరప్ దేశాలను ఎంచుకుంటున్నారు.ఇదీ చదవండి: అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త ఒప్పందంపర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. అమెరికాలోని ప్రధాన నగరాలు ఇబ్బంది పడుతున్నాయి. పర్యాటకుల సంఖ్య 17 శాతం తగ్గడంతో న్యూయార్క్ నగరం 4 బిలియన్ డాలర్ల నష్టం చొసింది. శాన్ ఫ్రాన్సిస్కో & లాస్ ఏంజిల్స్ కూడా ఇలాంటి నష్టాలనే చవిచూస్తున్నాయి. వీసా విధానాలు సడలించకపోతే.. పర్యాటక రంగంలో అమెరికా కోలుకోవడానికి మరో రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
భారత్ ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదు: పీయూష్ గోయల్
జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు తప్పకుండా అందించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. దీనివల్ల దేశీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. '‘జీఎస్టీ రేట్ల తగ్గింపుతోపాటు, పన్నుల నిర్మాణాన్ని సులభతరం చేయడం వల్ల దేశీ డిమాండ్కు ఊతం లభిస్తుంది. చిన్న, పెద్ద స్థాయి కంపెనీలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఉపాధికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆదాయాలు పెరుగుతాయి. ఇది అధిక వ్యయాలకు దారితీస్తుంది'' అని మంత్రి వివరించారు. మౌలిక వసతుల కల్పనకుతోడు, బలమైన వినియోగ డిమాండ్ కలిగిన భారత్ ఎదుగుదలను ఏ శక్తి అడ్డుకోలేదని.. ఈఈపీసీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్లో నిరుద్యోగ రేటు ఇలా..4 లక్షల ట్రిలియన్ డాలర్ల భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే 2–2.5 ఏళ్లలో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుందన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో దేశీ డిమాండ్కు ప్రధాని ఊతమిచ్చినట్టు చెప్పారు. సంక్షోభం నుంచి బలపడే శక్తి భారత్కు ఉందంటూ, దేశీ ఉత్పత్తులపై వ్యాపారాలు దృష్టి సారించాలని కోరారు. ఇది దేశ వృద్ధికి సాయపడుతుందని, దేశ ఆర్థిక భద్రతను బలోపేతం చేస్తుందన్నారు. -
భారత్లో నిరుద్యోగ రేటు ఇలా..
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకారం జీ20 కూటమి దేశాల్లో చూస్తే.. భారత్లోనే నిరుద్యోగ రేటు అత్యంత కనిష్టంగా 2 శాతం స్థాయిలో ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి 'మన్సుఖ్ మాండవీయ' తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అనుగుణంగా వివిధ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలాంటి స్కీములు కూడా ఇందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ ద్వారా యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చేందుకు క్లాసిఫైడ్స్ ఆన్లైన్ సైట్ ‘క్వికర్’, డిజిటల్ మెంటార్షిప్ ప్లాట్ఫాం’ మెంటార్ టుగెదర్’తో కార్మిక శాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఉద్యోగార్థులకు తగిన ఉద్యోగావకాశాలు దక్కేందుకు ఈ భాగస్వామ్యాలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'ఈ రంగాలు లేకుంటే అమెరికాలో ఉద్యోగాలు సున్నా'మెంటార్ టుగెదర్ భాగస్వామ్యంతో తొలి ఏడాదిలో 2 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె తెలిపారు. మరోవైపు క్వికర్ జాబ్స్ని ఎన్సీఎస్కి అనుసంధానించడం వల్ల పోర్టల్కి ప్రతి రోజూ 1,200 జాబ్ లిస్టింగ్లు జతవుతాయని పేర్కొన్నారు. ఎన్సీఎస్ ప్లాట్ఫాంలో 52 లక్షల పైగా సంస్థలు, 5.79 కోట్ల ఉద్యోగార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం పోర్టల్లో 44 లక్షల పైచిలుకు వేకెన్సీలు అందుబాటులో ఉన్నాయి.Opportunities. Guidance. Growth.Today, @NCSIndia signed MoUs with @mentortogether and Quikr to enhance job access and career guidance for our Yuva Shakti. Through this, Mentor Together will offer expert mentorship and career guidance, while Quikr will bring 1,200+ daily job… pic.twitter.com/nFwWNSZcF2— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 8, 2025 -
పాత స్టాక్ పైనా డిస్కౌంట్!
న్యూఢిల్లీ: తగ్గిన ధరలపై ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి కొంత సమయం పట్టేట్టు ఉంది. వచ్చే నెల ఆరంభం లేదా మధ్య నాటికి ఈ ఉత్పత్తులు మార్కెట్కు చేరుకుంటాయని గోద్రేజ్ కన్జ్యూమర్ సహా పలు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. కానీ, ఇప్పటికే కంపెనీలు, డీలర్లు, రిటైల్ స్టోర్లలో పెద్ద ఎత్తున ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయి. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. పాత స్టాక్ను ఎలా విక్రయించాలా? అన్న ఆలోచనలో పడ్డాయి. పాత ఎంఆర్పీ (గరిష్ట చిల్లర విక్రయ ధర)పై తగ్గింపు రేట్లతో ఈ నెల 22 తర్వాత కూడా వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందన్న ఆశతో ఉన్నాయి. పాత స్టాక్ ఖాళీ అయి, కొత్త స్టాక్ మార్కెట్లోకి వచ్చే వరకు కొన్ని అవాంతరాలు ఎదుర్కోక తప్పేట్టు లేదని భావిస్తున్నాయి. ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది ప్రతి సంస్థ ఆలోచిస్తోందని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతున్నట్టు చెప్పారు. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఎంఆర్పీలను మార్చడం దిశగా పనిచేస్తున్నట్టు తెలిపారు. దీన్ని ఎదుర్కోవడంపై ఒక ప్రణాళికతో ముందుకు వస్తామని ప్రకటించారు. జీఎస్టీలో 12, 28 శాతం రేట్లను ఎత్తివేసి, ఇందులోని వస్తువులను 5, 18% శ్లాబుల్లోకి మార్చడం తెలిసిందే. ఈ రేట్లు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. స్వల్పకాలంలో ఇబ్బందులు తప్పవు.. అధిక టారిఫ్ల్లోని ఉత్పత్తులను 5 శాతం కిందకు తీసుకురాడం వల్ల స్వల్పకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని గోద్రేజ్ కన్జ్యూమర్ ఎండీ, సీఈవో సు«దీర్ సీతాపతి చెప్పారు. డీలర్లు, కంపెనీల వద్ద అధిక ఎంఆర్పీలతో ఉత్పత్తుల నిల్వలు ఉన్నట్టు చెప్పారు. కనుక కొత్త ఎంఆర్పీలతో కూడిన ఉత్పత్తులు వినియోగదారులను చేరుకోవడానికి కొంత సమయం పడుతుందన్నారు. పాత స్టాక్పై తగ్గింపు ఇస్తే అది నేరుగా వినియోగదారులకు బదిలీ అవుతుందన్న గ్యారంటీ లేదన్నారు. స్పష్టత కోసం చూస్తున్నాం.. కొత్త జీఎస్టీ రేట్ల అమలు మార్గదర్శకాల కోసం పరిశ్రమ వేచి చూస్తున్నట్టు పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా తెలిపారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వాన్ని సంప్రదించామని, వెంటనే కొత్త రేట్లకు మారిపోవాలా లేక కొత సమయం ఇస్తారా? అన్నది తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటికే పాత ధరలతో ఉన్న నిల్వల విషయంలో ఒక్కో కంపెనీ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులతో పోల్చినప్పుడు ఆహారోత్పత్తుల మన్నిక (షెల్ప్ లైఫ్/నిల్వ కాలం) తక్కువగా ఉంటుందన్నారు. ఏం చేయాలన్నది అంతా ప్రభుత్వ మార్గదర్శకాలపైనే ఆధారపడి ఉంటుందంటూ, ఇవి త్వరలో వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. ముందే తగ్గిస్తాం..తమ స్టోర్లలో ఉన్న ఉత్పత్తుల ధరల లేబుళ్లను మార్చబోమని, దీనికి బదులు తుది బిల్లు మొత్తంపై తగ్గింపు ఇస్తామని వీ–మార్ట్ రిటైల్ చైర్మన్, ఎండీ లలిత్ అగర్వాల్ ప్రకటించారు. ప్రభుత్వం జీఎస్టీలో కల్పించిన ఉపశమనం మేర బిల్లులో తగ్గింపు ఉంటుందన్నారు. కంపెనీ స్టోర్లలో కస్టమర్లకు తెలిసేలా బోర్డులు పెట్టినట్టు చెప్పారు. ఏసీలు, ఇతర కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలోని బ్లూస్టార్ సైతం సెపె్టంబర్ 22 తర్వాత కస్టమర్లకు తగ్గింపులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. -
వినియోగం వృద్ధితో అధిక ఆదాయం
న్యూఢిల్లీ: జీఎస్టీ ఇటీవలి సంస్కరణలతో వినియోగం పుంజుకుని, మెరుగైన ఆదాయానికి బాటలు వేస్తుందన్న ఆశాభావాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు. తద్వారా జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణతో ఏర్పడే రూ.48,000 ఆదాయ లోటు భర్తీ అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. జీడీపీ వృద్ధికి బలాన్నిస్తుందన్నారు. మొదటి త్రైమాసికంలో (జూన్ క్వార్టర్) బలమైన వృద్ధి రేటు నమోదు కావడం, చరిత్రాత్మక జీఎస్టీ సంస్కరణలతో.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 6.3–6.8 శాతం అంచనాలను అధిగమిస్తామని ప్రకటించారు.జీఎస్టీలో 12%, 28% జీఎస్టీ శ్లాబులను ఎత్తివేస్తూ.. అందులోని మెజారిటీ ఉత్పత్తులను 5, 18 శాతం శ్లాబుల్లోకి మార్చుతూ గత వారం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించడం తెలిసిందే. దీన్ని ప్రజా సంస్కరణగా మంత్రి సీతారామన్ అభివరి్ణంచారు. దీనివల్ల ప్రతి కుటుంబానికీ ప్రయోజనం దక్కుతుందన్నారు. రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ కావడాన్ని తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే కార్ల తయారీదారులు, బీమా కంపెనీలు, పాదరక్షల వంటి కొన్ని పరిశ్రమలు రేట్ల తగ్గింపును ప్రకటించడాన్ని గుర్తు చేశారు. ‘రూపాయి’ని గమనిస్తున్నాం.. కరెన్సీ మారకం విలువలను ప్రభుత్వం గమనిస్తున్నట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. ‘డాలర్తో రూపాయి ఎక్కువ విలువను కోల్పోయింది. ఇతర కరెన్సీలతో కాదు’ అని స్పష్టం చేశారు. భారత్పై అమెరికా పెద్ద మొత్తంలో టారిఫ్లు విధించడం, భారత క్యాపిటల్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలతో డాలర్తో రూపాయి విలువ 88.38 కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే. ప్రధాని చొరవ.. ఆర్థిక మంత్రి కసరత్తు ‘ఒక్కసారి జీఎస్టీ సంగతి చూడండి’ ప్రధాని మోదీ చేసిన సూచన ఆధారంగానే ఈ భారీ కసరత్తుకు పూనుకున్నట్టు మంత్రి సీతారామన్ స్వయంగా వెల్లడించారు. ‘‘గత జీఎస్టీ కౌన్సిల్ భేటీకి ముందు (2024 డిసెంబర్లో) ప్రధాని నాకు కాల్ చేశారు. ‘ఒకసారి జీఎస్టీ విధానంపై దృష్టి పెట్టండి. రేట్ల పరంగా ఎందుకంత అయోమయం? వ్యాపారాలకు సులభతరంగా మార్చండి’ అని చెప్పారు. ఆ తర్వాత బడ్జెట్(2025–26)లో ఆదాయపన్ను ఉపశమన చర్యలపై చర్చల సమయంలోనూ.. ‘జీఎస్టీపై మీరు పనిచేస్తున్నారు కదా?’ అంటూ ప్రధాని మళ్లీ గుర్తు చేశారు. జీఎస్ టీ అమల్లోకి వచ్చి ఎనిమిదేళ్లు ముగిసిన నేపథ్యంలో సమగ్ర సమీక్ష అవసరమని భావించాం. వ్యా పారులు, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమల కోణం నుంచి చూశాం’’ అని మంత్రి సీతారామన్ చెప్పారు. -
సముద్ర మార్గంలో కార్గో తగ్గలేదు..
ట్యుటికోరిన్: భారతీయ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్ల ప్రభావాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ.. సముద్ర మార్గంలో సరుకు రవాణా తగ్గలేదని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. భారతీయ మారిటైమ్ రంగం అసాధారణ స్థాయిలో పురోగమిస్తోందని పేర్కొన్నారు.తమిళనాడులో వీవోసీ పోర్టులో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభంతో పాటు ఇతరత్రా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఆగస్టు 27 నుంచి భారత ఎగుమతులపై సుంకాలను అమెరికా 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఎగుమతులపై ప్రభావం పడుతుందనే ఆందోళనల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఏప్రిల్–జూలై మధ్యకాలంలో అమెరికాకు భారత ఎగుమతులు 22 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 12 శాతం పెరిగి 17.41 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ వ్యవధిలో భారత్కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. -
వినియోగానికి జీఎస్టీ సంస్కరణల దన్ను
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) సంస్కరణలతో వినియోగానికి మరింత ఊతం లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. విస్తృత స్థాయిలో వివిధ ఉత్పత్తుల రేట్లను క్రమబద్ధీకరించడం వల్ల ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. మొత్తం మీద ప్రజలకు గణనీయంగా మేలు చేకూర్చే కీలక సంస్కరణగా జీఎస్టీ సవరణలను ఆమె ఓ ఇంటర్వ్యూలో అభివరి్ణంచారు. ధరల తగ్గుదల ప్రయోజనాలు ప్రజలకు బదిలీ అయ్యేలా తానే వ్యక్తిగతంగా పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. పరిశ్రమ ఇప్పటికే రేట్ల తగ్గింపు విషయంలో సానుకూలంగా స్పందించిందన్నారు. పలు కార్ల సంస్థలు మొదలుకుని ప్రభుత్వ రంగ బీమా సంస్థలు, పాదరక్షలు, దుస్తుల బ్రాండ్లు గణనీయంగా ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయని వివరించారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి వచ్చే నాటికి మిగతావి కూడా రేట్లను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘మొత్తం 140 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే సంస్కరణ ఇది. అత్యంత పేదలకు కూడా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది‘ అని నిర్మలా సీతారామన్ చెప్పారు. గతంలో నాలుగు శ్లాబులుగా (5%, 12%, 18%, 28%) ఉన్న జీఎస్టీ రేట్లను రెండు శ్లాబులుగా (5%, 18%) మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవి సెపె్టంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనితో సబ్బుల నుంచి కార్లు, షాంపూలు, ట్రాక్టర్లు, ఏసీల వరకు 400 పైగా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్ను ఉండదు. విలాస వస్తువులతో పాటు కొన్ని ఉత్పత్తులకు 40 శాతం శ్లాబ్ ఉంటుంది. సామాన్యులపై ఫోకస్ .. ఒక దేశం, ఒకే పన్ను నినాదంతో 2017లో జీఎస్టీ ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా చేపట్టిన సవరణలు, అతి పెద్ద సంస్కరణలని నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రధానంగా సామాన్య ప్రజానీకం ప్రయోజనాలపై దృష్టి పెడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. రోజువారీ ఉపయోగించే ఉత్పత్తులపై ప్రతి పన్నును లోతుగా సమీక్షించామని, చాలా మటుకు ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని మంత్రి వివరించారు. బడ్జెట్లో ఆదాయ పన్ను మినహాయింపులపరంగా ఇచి్చన వెసులుబాటుతో ప్రజల చేతిలో మరింత డబ్బు మిగలనుండగా, తాజా జీఎస్టీ సంస్కరణల వల్ల ఉత్పత్తుల ధరలు తగ్గి వినియోగానికి ఊతం లభిస్తుందన్నారు. దీనితో కుటుంబాల నెలవారీ రేషన్, మెడికల్ బిల్లులు మొదలైన వాటి భారం తగ్గుతుందని చెప్పారు. జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాలను పర్యవేక్షించేందుకు పరిశ్రమ వర్గాలతో ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతోందని, దీనిపై సానుకూలత వ్యక్తమవుతోందని సీతారామన్ చెప్పారు. వ్యాపారాల నిర్వహణ సులభతరం.. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థల కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేసేందుకు కూడా జీఎస్టీ సంస్కరణలు తోడ్పడతాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. నిబంధనల భారం సడలింపు, వేగవంతమైన రిఫండ్లు, సులభతరంగా రిజిస్ట్రేషన్ మొదలైన అంశాలన్నీ సంస్కరణల ప్యాకేజీలో భాగమేనని చెప్పారు. కొత్త విధానంలో 90 శాతం వరకు రిఫండ్లు నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రాసెస్ అవుతాయని, కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు రోజుల్లోనే పూర్తవుతుందని చెప్పారు. ఒకే తరహా ఉత్పత్తులను ఒకే శ్లాబ్ తేవడం వల్ల ఉత్పత్తుల వర్గీకరణపై నెలకొన్న గందరగోళం కూడా తొలగిపోతుందని మంత్రి చెప్పారు.రాష్ట్రాలకు ధన్యవాదాలు.. జీఎస్టీ సంస్కరణలకు మద్దతునిచ్చిందుకు గాను రాష్ట్రాలకు సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపాదిత సవరణలు సామాన్యుడికి ప్రయోజనం చేకూర్చేవేనని అంతిమంగా రాష్ట్రాలు అభిప్రాయపడినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను లేఖలు రాసినట్లు చెప్పారు. రాష్ట్రాలు ఎల్లప్పుడూ రేట్ల కోతకు సుముఖంగానే ఉంటాయని, కానీ దానివల్ల రాబడికి కోత పడటంపైనే వాటికి ఆందోళన ఉంటుందని మంత్రి వివరించారు. ‘అయితే, దీని వల్ల రాష్ట్రాలపైనే కాకుండా కేంద్రంపైనా ప్రభావం ఉంటుందని వారికి చెప్పాను. కాకపోతే రేట్లు తగ్గి, ప్రజలు మరింతగా కొనుగోళ్లు చేయడం వల్ల, ఆదాయ లోటు భర్తీ అవుతుందని వివరించాను. ఆ విధంగా ఏకాభిప్రాయం సాధించడం వీలైంది‘ అని ఆమె వివరించారు. జీఎస్టీ మండలిలో రాష్ట్రాలు నిర్మాణాత్మకంగా పాలుపంచుకున్నాయని మంత్రి కితాబిచ్చారు. పన్ను సంస్కరణల విషయంలో నిబద్ధతతో వ్యవహరించాయని పేర్కొన్నారు. -
ఈయూకు పెరిగిన భారత డీజిల్ ఎగుమతులు
భారత్ నుంచి యురోపియన్ యూనియన్(ఈయూ)కు చేసే చమురు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన ఆగస్టు నెలలో 137 శాతం డీజిల్ ఎగుమతులు పుంజుకున్నాయి. ఇవి రోజుకు సుమారు 2,42,000 బ్యారెల్స్(బీపీడీ)కు చేరుకున్నాయి. 2026 జనవరిలో రష్యన్ క్రూడాయిల్ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తులపై ఈయూ నిషేధం విధించడమే ఇలా దేశీయ డీజిల్ ఎగుమతులు పుంజుకోవడానికి కారణమని తెలుస్తుంది.రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురుతో శుద్ధి చేసిన ఉత్పత్తులపై ఈయూ ఆంక్షలు విధించింది. ఇవి వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. దానికి ముందే యురోపియన్ కొనుగోలుదారులు ఇంధన సరఫరాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. అందులో భాగంగా ఇండియా వంటి దేశాల్లో రిఫైనరీ కంపెనీలతో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను సరఫరా చేయాలనేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. దాంతో ఇండియాలో ఈయూకు చేసే డీజిల్ ఎగుమతులు పెరిగాయి.భారత కంపెనీలకు ప్లస్రష్యా ఎగుమతులపై ఈయూ, జీ7 దేశాలు ధరల పరిమితి, ముడిచమురు ఆంక్షలు విధించాయి. దాంతో భారతీయ రిఫైనరీలు డిస్కౌంట్ ధరలకు రష్యా ముడి చమురును దిగుమతి చేసుకొని, శుద్ధి చేయడం, చట్టబద్ధంగా డీజిల్, జెట్ ఇంధనాన్ని యూరప్కు తరలించడం పెరిగింది. భారతీయ రిఫైనరీలు ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ, ఎంఆర్పీఎల్ ఈ ఎగుమతులను పెంచడానికి డిస్కౌంట్ క్రూడ్ను భారీగా దిగుమతి చేసుకుంటున్నాయి. 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో ఈయూకు ఇంధన ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58% పెరిగాయి.రష్యా చమురుపై ఆంక్షలు ఎందుకు?రష్యన్ క్రూడ్ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తుల తయారీపై ఈయూ ఆంక్షలు విధించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆదాయాన్ని తగ్గించేందుకు జీ7 దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఆంక్షలు 2026 జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. రవాణా, వ్యవసాయం, పరిశ్రమలకు డీజిల్ కీలకం. డీజిల్, డీజిల్ గ్రేడ్ క్రూడాయిల్ సరఫరాలో రష్యా అగ్రస్థానంలో ఉంది.ఇదీ చదవండి: మన గోప్యత బజారుపాలు! -
యాంఫి కొత్త చైర్మన్గా సందీప్ సిక్కా
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నూతన చైర్మన్గా నిప్పన్ ఇండియా లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ (ఏఎంసీ) సీఈవో అయిన సందీప్ సిక్కా ఎంపికయ్యారు. వైస్ చైర్మన్గా బంధన్ ఏఎంసీ సీఈవో విశాల్ కపూర్ ఎన్నికైనట్టు యాంఫి ప్రకటించింది. యాంఫి 30 వార్షిక సమావేశంలో వీరిని ఎన్నుకోగా, వెంటనే బాధ్యతలు చేపటినట్టు తెలిపింది. సందీప్ సిక్కా యాంఫి చైర్మన్ బాధ్యతలు చేపట్టడం ఇంది రెండోసారి. 2013 నుంచి 2015 మధ్య కాలంలోనూ రెండేళ్ల పాటు ఆయన సేవలు అందించారు. దేశ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.75 లక్షల కోట్లకు దాటిపోవడం తెలిసిందే. ఈ తరుణంలో ఎన్నికైన నూతన నాయకత్వం.. పరిశ్రమను మరింత వృద్ధి దశలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. దేశంలోని మరిన్ని ప్రాంతాలకు మ్యూచువల్ ఫండ్స్ను విస్తరించడానికి ప్రాధాన్యం ఇస్తానని సందీప్ సిక్కా తెలిపారు. మరింత పారదర్శకత ద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసం పొందుతామని.. సెబీ, విధాన నిర్ణేతలతో మరింత సమన్వయం చేసుకుని అందరికీ ఆర్థిక సేవల చేరువకు కృషి చేస్తామని చెప్పారు. -
సిమెంట్పై జీఎస్టీ కోత.. మౌలిక రంగానికి బూస్ట్!
న్యూఢిల్లీ: సిమెంట్పై జీఎస్టీ రేటు తగ్గింపు మౌలిక రంగ ప్రాజెక్టులపై వ్యయ భారాన్ని తగ్గించనుంది. దీనివల్ల నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని నిర్మాణ రంగ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. మౌలిక రంగ ప్రాజెక్టుల నిర్మాణంలో సిమెంట్ కీలక ముడిపదార్థం అన్న విషయం విదితమే. ప్రస్తుతం సిమెంట్పై 28% జీఎస్టీ అమల్లో ఉండగా, దీన్ని 18 శాతానికి తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ నెల 22 నుంచి అమల్లోకి రానుండడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంతో పరిశ్రమలో ఉత్సాహం నెలకొంది. తమ నగదు ప్రవాహాలు మెరుగుపడతాయని ఇన్ఫ్రా కంపెనీలు పేర్కొన్నాయి.ఆర్థిక వృద్ధికి ప్రేరణ...‘‘నిర్మాణంలోకి వినియోగించే కీలక ముడిపదార్థం అయిన సిమెంట్పై జీఎస్టీని తగ్గించాలన్నది చరిత్రాత్మక నిర్ణయం. రేట్ల క్రమబద్దీకరణ మౌలిక వసతుల అభివృద్ధికి, ఆర్థిక వృద్ధికి ప్రేరణనిస్తుంది’’అని పటేల్ ఇంజనీరింగ్ ఎండీ కవితా శివకుమార్ తెలిపారు. కీలక ముడిపదార్థంపై పన్ను తగ్గించడం రహదారుల రంగానికి ఊతం లభిస్తుందని ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ పేర్కొంది. నిర్మాణ వ్యయాలను తగ్గిస్తుందని, తద్వారా నగదు ప్రవాహాలు పెరుగుతాయని, డెవలపర్ల ఆరి్థక పరిస్థితి బలోపేతం అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సకాలంలో ప్రాజెక్టుల నిర్మాణం కేఈసీ ఇంటర్నేషనల్ ఎండీ విమల్ కేజ్రీవాల్ సైతం ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. సిమెంట్పై జీఎస్టీ తగ్గింపుతో మూలధన నిధుల పరమైన వెసులుబాటు లభిస్తుందని (తక్కువ కేటాయింపులు), నగదు ప్రవాహాలు మెరుగుపడతాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం సకాలంలో పూర్తి అవుతాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక శ్రద్ధకు తోడు రేట్ల తగ్గింపుతో ప్రైవేటు మూలధన వ్యయాలకు ప్రేరణ లభిస్తుందని, ఈ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం సాధ్యపడుతుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం జాప్యంలో నిధుల పరమైన అవసరాలు కూడా ఒక కారణంగా ఉంటుండడం గమనార్హం. నిర్మాణంలోకి వినియోగించే కీలక ముడి పదార్థాలపై జీఎస్టీ తగ్గించం వల్ల తయారీ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని, దీంతో ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంటుందని యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ (ఏసీఈ) ఈడీ సోరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం పరికరాలపై పన్ను రేటును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని చరిత్రాత్మక నిర్ణయంగా అభివరి్ణంచారు. దీనివల్ల రైతులకు, ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ‘‘ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో 40–45 శాతం సిమెంట్ స్టీల్ కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. జీఎస్టీ రేటు మార్పుతో పన్ను భారం 10 శాతం మేర తగ్గుతుంది. దీంతో ప్రాజెక్టుల నిర్మాణం లాభదాయకంగా మారుతుంది. నిర్మాణం వేగవంతం అవుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యానికి ఊతం లభిస్తుంది’’ అని రోడిక్ డిజిటల్ అండ్ అడ్వైజరీ ఎండీ నాగేంద్ర నాథ్ సిన్హా పేర్కొన్నారు. -
జీఎస్టీ తగ్గింపు.. తేడా వస్తే వారే బాధ్యులు: ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు సాధారణ ప్రజలకు చేరాలని, సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పన్ను విధానం అమలు తీరును కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.జీఎస్టీ పునర్వ్యవస్థీకరణ కింద ప్రజలకు హామీ ఇచ్చిన ఉపశమనం వారికి దక్కకపోతే తయారీదారులు, పరిశ్రమ భాగస్వాములు, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రయోజనాలను సామాన్యులకు అందించకపోతే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.కొత్త జీఎస్టీ రేట్ల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా పర్యవేక్షించడానికి తయారీదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ ప్రయోజనాలు ఏ రాష్ట్రంలోనైనా ప్రజలకు అందకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రిని ప్రశ్నిస్తామని చెప్పారు.ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబుల జీఎస్టీ నిర్మాణాన్ని మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం రెండే శ్లాబులతో సరళీకృత జీఎస్టీ విధానాన్ని ఈనెలల 22 నుంచి అమలు చేస్తోంది. కొన్ని రకాల వస్తువులపై జీఎస్టీని 5 శాతానికి, మరికొన్ని వస్తువులపై పన్నును 18 శాతానికి పరిమితం చేసి సామాన్యులకు ప్రభుత్వం ఉపశమనం కల్పిస్తోంది. కొన్ని హానికరమైన, లగ్జరీ ఉత్పత్తులపై మాత్రం ప్రత్యేకంగా 40 శాతం జీఎస్టీని అమలు చేయనుంది. -
‘చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి’
రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ నేతలను కోరారు. రష్యాతో ఇంధన వాణిజ్యాన్ని కొనసాగించడం ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి నిధులు సమకూరుస్తోందని వాదించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యమిచ్చిన పారిస్ సదస్సు అనంతరం ఉక్రెయిన్కు మద్దతిస్తున్న మిత్రదేశాల కూటమి ‘కొలిషన్ ఆఫ్ ది విల్లింగ్’తో వీడియో కాల్ సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.భారత్పై సుంకాలు, యూరప్పై ఒత్తిడిట్రంప్ ప్రభుత్వం ఇటీవల భారత ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో సుంకాల భారం 50%కు రెట్టింపు అయింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈమేరకు సుంకాలు విధించినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో యూరప్ కూడా భారీగానే రష్యా చమురు దిగుమతి చేసుకుంటుందని ట్రంప్ అన్నారు. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఆ దేశపు చమురు కొంటూ యూరోపియన్ దేశాలు నిధులు సమకూరుస్తున్నాయన్నారు.యూరప్ తీరుపై అసహనంయూరప్ ఓ వైపు యుద్ధం ఆపాలంటూ, మరో వైపు చమురు కొనుగోళ్ల రూపంలో రష్యాకు నిధులు సమకూర్చడం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గత ఏడాది కాలంలో ఇంధన అమ్మకాల ద్వారా ఈయూ 1.1 బిలియన్ యూరోలను రష్యాకు ముట్టజెప్పిందని అంతర్గత డేటాను ట్రంప్ ఉదహరించారు. అయితే కొన్ని ఈయూ దేశాలు 2022లో రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను, 2023 నాటికి శుద్ధి చేసిన ఇంధనాన్ని నిలిపివేయగా హంగేరి, స్లొవేకియా పరిమిత దిగుమతులను కొనసాగిస్తున్నాయి.ఇదీ చదవండి: వైట్హౌజ్లో టెక్ సీఈఓలకు ట్రంప్ విందు -
శాశ్వత నివాసం కోసం ఆకర్షణీయ మార్గం
యూరప్లో నివసించాలని చూస్తున్నవారికి ఐర్లాండ్ కొత్త ఆఫర్ను ప్రకటించింది. యురోపియన్ యూనియన్యేతర జాతీయులు ఐర్లాండ్లో దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకునేందుకు ఆకర్షణీయమైన మార్గాన్ని అందిస్తుంది. దీనికోసం దరఖాస్తు చేసేకునేందుకు భారతీయులు సైతం అర్హులని చెప్పింది. ఈ అవకాశం కోసం దరఖాస్తు రుసుము కేవలం 500 యూరోలు (సుమారు రూ.52,000) అని వెల్లడించింది.ఐర్లాండ్లో శాశ్వత నివాసంఐర్లాండ్ శాశ్వత రెసిడెన్సీని అధికారికంగా లాంగ్-టర్మ్ రెసిడెన్సీ అని పిలుస్తారు. ఇది నాన్ ఈయూ/ ఈఈఏ(ఈయూతోపాటు ఐస్ల్యాండ్, లీచెన్స్టీన్, నార్వే) పౌరులు దేశంలో నివసించేందుకు అనుమతించే విధానం. ఇది దేశ పౌరసత్వం కానప్పటికీ, అనుమతులు అవసరం లేకుండా పనిచేసే హక్కు, ప్రజా సేవలకు అవకాశం వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఐర్లాండ్లో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాసం తర్వాత నిబంధనల ప్రకారం ఈ హోదా ఇస్తారు.ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?(భారతీయులు కూడా అర్హులు)ఐర్లాండ్లో చట్టబద్ధంగా ఐదేళ్లు నివసించి, అక్కడ పనిచేసిన ఈయూ/ఈఈఏయేతన జాతీయులు ఈ కింది షరతులకు అనుగుణంగా స్థిర నివాసానికి దరఖాస్తు చేసుకోవచ్చు.ఐర్లాండ్ లో ఐదు సంవత్సరాలు (60 నెలలు) నిరంతర చట్టపరమైన నివాసం ఉండాలి.క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ లేదా జనరల్ ఎంప్లాయిమెంట్ పర్మిట్ వంటి చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ ఉండాలి.దరఖాస్తు సమయంలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారని ధ్రువీకరించుకోవాలి.క్లీన్ క్రిమినల్ రికార్డ్ ఉండాలి.ఆర్థిక స్వాతంత్ర్యం- ప్రజాధనంపై ఆధారపడకుండా మిమ్మల్ని మీరు పోషించుకునే సామర్థ్యం ఉండాలి.ఐరిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పూర్తిగా పాటించాలి.పర్మినెంట్ రెసిడెన్సీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్తో ఐదు సంవత్సరాల చట్టపరమైన నివాస అవసరాలను తెలియజేసేలా డాక్యుమెంటేషన్ తయారు చేయాలి.రెసిడెన్సీ కోసం ఆ దేశ నిబంధనల ప్రకారం ఫారం 8ను పూర్తి చేయాలి.పాస్పోర్ట్, ఐరిష్ రెసిడెన్స్ పర్మిట్ (ఐఆర్పీ) వివరాలు వెల్లడించాలి.గత ఉపాధి అనుమతులు, పని చరిత్రను నివేదించాలి.నిరంతర నివాసం కోసం రుజువులు చూపాలి.అప్లికేషన్ను ఇమ్మిగ్రేషన్ సర్వీస్ డెలివరీ (ఐఎస్డీ)కి సబ్మిట్ చేయాలి.అప్రూవల్ నోటీస్ అందుకున్న 28 రోజుల్లోగా 500 యూరోలు (సుమారు రూ.52,000) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.ప్రాసెసింగ్ కోసం 6 నుంచి 8 నెలలు పట్టవచ్చు.ఆమోదం పొందితే ఐర్లాండ్లో దీర్ఘకాలిక నివాసాన్ని ధ్రువీకరించే స్టాంప్ 4 వీసాను అందుకుంటారు.ఇదీ చదవండి: మొదటిసారి అప్పు చేస్తున్నారా? -
పెట్రోల్లో రసం కలుపుతున్నారు!
ఇంధన భద్రతను పెంపొందించడానికి, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇథనాల్ ఉత్పత్తిపై అన్ని ఆంక్షలను భారత ప్రభుత్వం ఎత్తివేసింది. ఇది 2025-26 ఏడాదికిగాను 20% ఇథనాల్, 80% పెట్రోల్ కలయిక అయిన ఈ20 ఇంధన పరివర్తనను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. భారతదేశం ‘ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ (ఇబీపీ) 2.0’లో భాగంగా ప్రకటించిన ఈ విధానం ద్వారా 2025 నాటికి పెట్రోల్లో 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవాలనే కేంద్రం యోచిస్తోంది. ఈ క్రమంలో సాధారణంగా చాలా మందికి ఉన్న ప్రశ్నలపై నిపుణుల సాయంతో సమాధానాలను కింద తెలియజేశాం.ఈ20 ఫ్యుయల్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యం?ఈ20 ఫ్యుయల్ అనేది 20% ఇథనాల్ కలిగిన మిశ్రమ ఇంధనం. మొక్కల నుంచి ఉత్పన్నమైన ఆల్కహాల్ను పెట్రోల్తో కలుపుతారు. ఈ ఇథనాల్ ప్రధానంగా చెరకు రసం, మొలాసిస్ నుంచి ఉత్పత్తి చేస్తారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇవ్వడమే కాకుండా కర్బన ఉద్గారాలను తగ్గించే జీవ-ఆధారిత ప్రత్యామ్నాయంగా మారుతుంది.దిగుమతి చేసుకునే చమురుపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి, ఇంధన భద్రతను పెంచడానికి, స్వచ్ఛమైన ఇంధన ఎంపికలను ప్రోత్సహించడానికి ఈ20 ఒక వ్యూహాత్మక అడుగు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.ప్రయోజనాలుతక్కువ ఉద్గారాలు: ఈ20 ఇంధనం స్వచ్ఛమైన పెట్రోల్ కంటే శుభ్రంగా మండుతుంది. ఇది గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించడానికి తోడ్పడుతుంది. మెరుగైన పట్టణ గాలి నాణ్యతకు దోహదం చేస్తుంది.ఇంధన భద్రత: ఇథనాల్ మిశ్రమం భారతదేశం ముడి చమురు దిగుమతులను తగ్గిస్తుంది.వ్యవసాయానికి మద్దతు: చెరకుకు స్థిరమైన డిమాండ్ మార్గాన్ని అందిస్తుంది. రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు సహాయపడుతుంది.సవాళ్లుతక్కువ ఎనర్జీ కంటెంట్: పెట్రోల్ కంటే ఇథనాల్ లీటర్కు తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఇది వాహనాల్లో మైలేజ్ తగ్గడానికి దారితీస్తుంది.కంపాటబిలిటీ సమస్యలు: అన్ని వాహనాల్లో, ముఖ్యంగా 2023కి ముందు తయారైన వాటిలో ఈ20 ఇంధనం వాడకానికి అవసరమైన మెకానిజం లేదు. ప్రస్తుత పరిణామాల వల్ల ఈ20 ఇంధనాన్ని పాత వాహనాల్లో వాడితే త్వరగా పాడవుతాయనే వాదనలున్నాయి.వాహనాలకు ఈ20 సురక్షితమేనా?ఇప్పటికే కొనుగోలు చేసిన వాహనాలు ఈ20 కంపాటబుల్ అయితే పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి. అయితే పాత వాహనాలకు ఈ20 తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని కొందరు చెబుతున్నారు.తుప్పు ప్రమాదాలు: ఇథనాల్ తేమను గ్రహిస్తుంది. ఇది ఇంధన ట్యాంకులు, ఇంజెక్టర్లు, ఎగ్జాస్ట్ వ్యవస్థల్లో తుప్పుకు దారితీస్తుంది.రబ్బరు, ప్లాస్టిక్ క్షీణత: ఇథనాల్ గ్యాస్కెట్లు, గొట్టాలు, దానిని తట్టుకునేలా రూపొందించబడని సీళ్లను నాశనం చేస్తుంది.పనితీరు సమస్యలు: పైకారణాల వల్ల ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ దెబ్బతిని మైలేజ్పై ప్రభావం ఏర్పడవచ్చనే వాదనలున్నాయి.ఈ20 మైలేజీని ప్రభావితం చేస్తుందా?కొన్ని సందర్భాల్లో ఇది మైలేజీపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అది వాహనం ఈ20 కంపాటబుల్పై ఆధారపడి ఉంటుంది. ఈ10 వాహనాల్లో ఈ20 ఇంధనం వాడితే 1–2% మైలేజ్ తగ్గవచ్చని చెబుతున్నారు. నాన్ క్యాలిబ్రేటెడ్ వాహనాలు 3–6% మైలేజ్ నష్టపోయే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే దీన్ని విభిన్న వాదనలున్నాయి.దేశంలో తగినంత ఇథనాల్ ఉత్పత్తి అవుతుందా?2025-26 సంవత్సరానికి చెరకు ఆధారిత ఇథనాల్పై ఉత్పత్తి పరిమితులను తొలగించారు. ఈ ఏడాది రుతుపవనాల అనుకూల పరిస్థితులు, ఆంక్షలను ఎత్తివేయడంతో చక్కెర మిల్లులు, డిస్టిలరీలు స్వేచ్ఛగా ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఈ విధాన మార్పు ఇథనాల్ లభ్యతను గణనీయంగా పెంచుతుంది. 2025 నాటికి భారతదేశంలో 20% మిశ్రమ ఇథనాల్ ఇంధనాన్ని వాడాలని, సమీప భవిష్యత్తులో దీన్ని 30%కు పెంచాలని యోచిస్తున్నారు.ఇదీ చదవండి: బీమా అందరికీ చేరువ -
ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలి..
జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని పరిశ్రమ తప్పకుండా వినియోగదారులకు అందించాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. స్వాతంత్య్రం తర్వాత చేపట్టిన అతిపెద్ద, విప్లవాత్మక సంస్కరణగా దీన్ని అభివరి్ణస్తూ, ప్రధాని మోదీకి ఈ ఘనతను ఆపాదించారు. అన్ని రంగాల్లోనూ డిమాండ్కు ఊతమిస్తుందన్నారు. భారత్లో తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలని పరిశ్రమను కోరారు. ఫార్మా, హెల్త్కేర్కు సంబంధించి 11 అంతర్జాతీయ ప్రదర్శన (ఇండియా మెడ్టెక్ ఎక్స్పో 2025, ఐఫెక్స్ 2025)ను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. జీఎస్టీలో తీసుకొచి్చన సంస్కరణలు రైతుల నుంచి ఎంఎస్ఎంఈల వరకు.. ఫార్మా రంగంతోపాటు మరెన్నో రంగాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు సహకరిస్తుందన్నారు. వచ్చే రెండేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందంటూ.. 4 ట్రిలియన్ డాలర్ల పరిమాణం నుంచి 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి బలపడుతుందని చెప్పారు.పెట్టుబడులు, ఉపాధి కల్పనకు ఊతం.. ‘జీఎస్టీ తగ్గింపు మొత్తాన్ని వినియోగదారులకు బదలాయించినప్పుడే పరిశ్రమకు పూర్తిస్థాయిలో ప్రయోజనం దక్కుతుంది. రేట్లు తగ్గడం సహజంగానే వినియోగాన్ని పెంచుతుంది. డిమాండ్కు ఊతంతో పెద్ద ఎత్తున పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు, వృద్ధికి దారితీస్తుంది’ అని మంత్రి చెప్పారు.సాఫీగా మారేలా చూస్తాం: సీబీఐసీ చైర్మన్ జీఎస్టీలో ప్రతిపాదిత కొత్త శ్లాబులకు సాఫీగా మారేందుకు వీలుగా, సెపె్టంబర్ 22 నాటికి టెక్నాలజీని సిద్ధం చేస్తామని పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. రిటర్నుల దాఖలుకు వీలుగా సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ విషయమై పరిశ్రమతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. -
రికార్డు కనిష్టాల్లో కరెన్సీ..
రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయులకు తగ్గిపోతుండటం ఎగుమతులకు ప్రయోజనకరమే అయినప్పటికీ పరిశ్రమ వర్గాల్లో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దీనివల్ల విదేశీ మార్కెట్లలో మరింత మెరుగ్గా పోటీపడటానికి అవకాశం ఉన్నా.. ముడివస్తువుల రేట్లు పెరిగిపోవడం వల్ల ప్రయోజనాలు అంతంతమాత్రంగానే ఉంటాయని దిగుమతి ఆధారిత పరిశ్రమలు చెబుతున్నాయి. రత్నాభరణాలు, పెట్రోలియం, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలు వీటిలో ఉన్నాయి.రూపాయి బలహీనపడటం వల్ల మన ఉత్పత్తులను చౌకగా ఎగుమతులు చేస్తూ విదేశీ మార్కెట్లలో విస్తరించేందుకు వీలవుతుంది. కానీ, అదే సమయంలో దిగుమతుల వ్యయాలూ పెరిగిపోతాయి. దీనితో నిర్దిష్ట ముడివస్తువుల కోసం దిగుమతులపై ఆధారపడిన ఎగుమతిదార్లకు మార్జిన్లు తగ్గిపోయి, పెద్దగా ప్రయోజనం ఉండదని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఎగుమతిదార్ల అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎగుమతిదార్లకు మద్దతుగా నిలుస్తాం..అమెరికా టారిఫ్ల భారం వల్ల ప్రతికూల ప్రభావాలు పడకుండా ఎగుమతిదారులకు కావాల్సిన మద్దతునిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎగుమతిదార్లు ఉత్పత్తి నాణ్యత పెంచుకోవాలని, అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలని, సరఫరా వ్యవస్థల్లో మార్పులు..చేర్పులు చేసుకోవాలని, ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: లక్షలాది కుటుంబాలకు తీపికబురు.. కిరాణా బిల్లులు తగ్గింపు -
కొత్త జీఎస్టీతో పాప్కార్న్ వివాదానికి ఫుల్స్టాప్
కొత్త జీఎస్టీ రేట్లతో ఎప్పటి నుంచో ఉన్న పాప్కార్న్ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. సాల్టెడ్ పాప్ కార్న్, కారామెల్ పాప్ కార్న్పై పన్ను విధించడానికి సంబంధించిన వివాదానికి జీఎస్టీ కౌన్సిల్ ఎట్టకేలకు ముగింపు పలికింది.జీఎస్టీ 2.0 కింద, ఉప్పు, మసాలాలు కలిపిన పాప్కార్న్పై 5% జీఎస్టీ వర్తిస్తుంది. అది విడిగా విక్రయించినా లేదా ప్రీప్యాక్ చేసి లేబుల్ చేసినా సరే ఒకే రకమైన పన్ను విధిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీఎస్టీ రేట్లతో కూడిన వస్తువుల జాబితా ప్రకారం.. కారామెల్ పాప్కార్న్ నాన్ ఎషన్షియల్ కేటగిరిలోని చక్కెర మిఠాయి వస్తువుల పరిధిలోకి వస్తుంది కాబట్టి 18% పన్ను వర్తిస్తుంది.గతంలో, సాల్టెడ్ పాప్కార్న్ను వదులుగా అమ్మితే 5%, బ్రాండెడ్ ప్యాకేజింగ్లో అమ్మితే 12% పన్ను విధించేవారు. అదే కారామెల్ పాప్కార్న్ ప్యాకేజింగ్తో సంబంధం లేకుండా 18% జీఎస్టీ విధించేవారు.చాన్నాళ్ల వివాదందేశంలో జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు, ప్రాసెస్ చేసిన ఆహార వస్తువుగా పాప్కార్న్పై దాన్ని ఏ రూపంలో అమ్ముతారు అనేదాన్ని బట్టీ వేర్వేరు పన్ను స్లాబ్ల కింద జీఎస్టీ విధిస్తూ వచ్చారు. బ్రాండెడ్, ప్యాక్ చేసిన పాప్ కార్న్పై 12% జీఎస్టీ విధించగా, విడిగా విక్రయించే పాప్ కార్న్ను మాత్రం పూర్తిగా మినహాయించారు.ఆ ద్వంద్వ నిర్మాణం చిన్న విక్రేతలకు, మల్టీప్లెక్స్లకు గందరగోళంగా ఉండేది. 2018లో, అధిక ధరలకు పాప్కార్న్ను విక్రయించిన మల్టీప్లెక్స్లు, సినిమా హాళ్లలో విక్రయించే చిరుతిండిని ప్యాక్ చేసిన వస్తువుగా (12% జీఎస్టీ) కాకుండా రెస్టారెంట్ సేవగా (5% జీఎస్టీ) పరిగణించాలని వాదించాయి. ఆ తర్వాత, జీఎస్టీ కౌన్సిల్ పాప్కార్న్ను స్నాక్స్గా నిర్వచించింది. సినిమా లేదా రెస్టారెంట్ తరహా కౌంటర్లో విక్రయించే పాప్కార్న్కు 5%, బ్రాండెడ్ పాప్కార్న్పై 12% పన్ను వర్తిస్తుందని తేల్చింది.తర్వాత ఈ వర్గీకరణపైనా కోర్టులలో సవాళ్లు దాఖలయ్యాయి. 2022లో, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాప్కార్న్ "తాజాగా తయారు చేసేదని", ఎఫ్ఎంసీజీతో పోల్చదగినది కాదని పేర్కొంటూ, ఏకరీతి పన్ను కోసం లాబీయింగ్ చేసింది. 2023లో జీఎస్టీ కౌన్సిల్ మొదటిసారిగా హేతుబద్ధీకరణపై చర్చను ప్రారంభించినప్పుడు "పాప్కార్న్పై జీఎస్టీ" వివాదం మరోసారి బయటకువచ్చింది. 2024లో మల్టీప్లెక్స్లో స్నాక్స్ భారీ ధరకు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలతో సినిమా పాప్కార్న్ విలాసవంతమైన ఆహారమా లేదా ప్రాథమిక చిరుతిండా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇదీ చదవండి: బిగ్ దివాలీ గిఫ్ట్.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట -
లక్షలాది కుటుంబాలకు తీపికబురు.. కిరాణా బిల్లులు తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 3న ఆమోదించిన జీఎస్టీ శ్లాబుల క్రమబద్ధీకరణ వల్ల భారతీయ కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఆమోదించిన నిర్ణయాల వల్ల మెజారిటీ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంతో లక్షలాది కుటుంబాలకు నెలవారీ కిరాణా, ఆహార బిల్లులు తగ్గుతాయని భావిస్తున్నారు. కొత్తగా ఆమోదించిన శ్లాబుల ప్రకారం ఏయే వస్తువులపై జీఎస్టీ ఎలా మారుతుందో కింద చూద్దాం.సరుకులుపాత జీఎస్టీ శ్లాబుకొత్త జీఎస్టీ శ్లాబుఅల్ట్రా హై టెంపరేచర్ మిల్క్5%Nilప్యాకేజ్డ్ పనీర్5%Nilపిజ్జా బ్రెడ్5%Nilరోటీ/చపాతీ5%Nilపరాఠా/పరోటా18%Nilవెన్న, నెయ్యి, పాల ఉత్పత్తులు12%5%జున్ను12%5%ఘనీకృత పాలు12%5%డ్రై ఫ్రూట్స్, నట్స్12%5%బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు18%5%చాక్లెట్, కోక్వ్ ఉత్పత్తులు18%5%కార్న్ ఫ్లేక్స్18%5%జెమ్స్, సాస్, ఊరగాయలు12-18%5%సూప్ ఉత్పత్తులు18%5%ఐస్ క్రీం18%5% ఇదీ చదవండి: అమెజాన్ ప్రైమ్ ఇన్విటేషన్ ప్రోగ్రామ్ నిలిపివేత -
సేవల్లో వృద్ధి శరవేగం
న్యూఢిల్లీ: సేవల రంగం బలమైన వృద్ధితో దూసుకుపోతోంది. 15 ఏళ్ల గరిష్ట స్థాయిలో ఆగస్ట్ నెలకు హెచ్ఎస్బీసీ ఇండియా సేవల రంగ పీఎంఐ 62.9గా నమోదైంది. జూలైలో ఇది 60.5గా ఉంది. 2010 తర్వాత సేవల రంగం పనితీరు ఒక నెలలో ఈ స్థాయిలో వృద్ధిని సాధించడం ఇదే ప్రథమం. కొత్త ఆర్డర్లు గణనీయంగా పెరగడం, డిమాండ్ పరిస్థితులు చెప్పుకోతగ్గ మేర మెరుగవడం బలమైన పనితీరుకు సాయపడినట్టు హెచ్ఎస్బీసీ సర్వే తెలిపింది. 2014 సెప్టెంబర్ నుంచి చూస్తే అంతర్జాతీయ అమ్మకాలు మూడో అత్యధిక గరిష్ట స్థాయికి చేరినట్టు పేర్కొంది. ఆసియా, యూరప్, మధ్యప్రాచ్యం, యూఎస్ క్లయింట్ల నుంచి డిమాండ్ భారీగా ఉన్నట్టు తెలిపింది. దీంతో భారత కంపెనీలు అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు దారితీసినట్టు పేర్కొంది. సిబ్బంది పెరుగుదలతో కంపెనీలు మరిన్ని ఆర్డర్లను సొంతం చేసుకోగలవని తెలిపింది. మానవ వనరులపై అధిక వ్యయాలు, బలమైన డిమాండ్ పరిస్థితుల నేపథ్యంలో ఆగస్ట్లో సేవల ధరలు గణనీయంగా పెరిగినట్టు హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ పేర్కొన్నారు. ఇక ఆగస్ట్ నెలలో తయారీ, సేవల రంగ పనితీరును సూచించే హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ సైతం 17 ఏళ్ల గరిష్ట స్థాయిలో 63.2గా నమోదైంది. 400 సేవల రంగ కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ‘హెచ్ఎస్బీసీ ఇండియా సరీ్వసెస్ పీఎంఐ’ని ఎస్అండ్పీ గ్లోబల్ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. -
7రోజుల్లో 7,000 జంప్
న్యూఢిల్లీ: పుత్తడి నాన్స్టాప్గా పరుగులు తీస్తోంది. గడిచిన ఏడు రోజుల్లో 10 గ్రాములకు దేశీయంగా రూ.7,000 లాభపడింది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత బంగారం మరో రూ.1,000 పెరిగి రూ.1,07,070 వద్ద ముగిసింది. పసిడికి దేశీయంగా ఇది నూతన జీవిత కాల గరిష్ట స్థాయి. ఈ నెల 25న పసిడి ధర రూ.1,00,170 వద్ద ఉండడం గమనార్హం. ఇక 99.5 శాతం స్వచ్ఛత బంగారం సైతం 10 గ్రాములకు రూ.1,000 పెరిగి రూ.1,06,200 స్థాయిని తాకింది. మరోవైపు వెండి ధర పెద్దగా మార్పు లేకుండా రూ.1,26,100 స్థాయిలో ట్రేడయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి 21 డాలర్లకు పైనే పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి అయిన 3,618.50 డాలర్లకు చేరుకుంది. ‘‘యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండడం, అమెరికా ఆర్థిక వ్యవస్థపై నెలకొన్న ఆందోళనలు బంగారం ధరల ర్యాలీకి మద్దతునిచ్చాయి. ఈ వారం చివర్లో ఓపెక్ ప్లస్ కూటమి సమావేశం జరగనుంది. ఇటీవలి ఉక్రెయిన్ దాడితో రష్యా ఆయిల్ ప్రాసెసింగ్ సామర్థ్యం 17 శాతం ప్రభావితం కావడంతో సరఫరా పరమైన ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ఇటీవలి కనిష్టాల నుంచి చమురు ధరలు సైతం పుంజుకున్నాయి’’అని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో చింతన్ మెహతా వివరించారు. ఫెడ్ రేటు కోతల అంచనాలకు తోడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానాలు పసిడి ధరలను నడిపిస్తున్నట్టు వెంచురా కమోడిటీ హెడ్ ఎన్ఎస్ రామస్వామి సైతం అభిప్రాయపడ్డారు. -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ: ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పండగ బొనాంజా ప్రకటించింది. జీఎస్టీ రేట్లు తగ్గింపునకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 12, 28 శాతం శ్లాబులు రద్దు చేయాలని నిర్ణయించింది. 5, 18 శ్లాబులను మాత్రమే కేంద్రం కొనసాగించనుంది. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబులు అమలు కానున్నాయి. లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను విధించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ రద్దు చేసింది.సామాన్యులపై ఆర్థిక భారం పడకుండా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇకపై రెండు శ్లాబులు మాత్రమే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్పై 12 శాతం జీఎస్టీ తొలగించగా.. సిమెంట్పై టాక్స్ 28 నుంచి 18 శాతానికి కుదించాం. క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగించినట్లు నిర్మల పేర్కొన్నారు.సామాన్యులు వాడే వస్తువులపై జీఎస్టీ తగ్గించామని, రైతులు, సామాన్యులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. వ్యవసాయ, వైద్య రంగాలకు ఊరట కలిగించే నిర్ణయాలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.‘‘ఈజ్ ఆఫ్ లివింగ్ కోసమే న్యూ జనరేషన్ రిఫార్మ్స్. ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలకు పిలుపునిచ్చారు. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకొని సంస్కరణలు తెచ్చాం. కొత్త సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్ ఉపయోగించే వస్తువులన్నీ ఐదు శాతం పన్ను పరిధిలోకి తెచ్చాం. పాలు, రోటి, బ్రెడ్పై ఎలాంటి పన్ను లేదు. ఏసీ, టీవీ, డిష్ వాషర్లు, చిన్నకారులపై పన్నును 28 నుంచి 18 శాతానికి తగ్గించాం’’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.👉అన్నీ టీవీలపై 18 శాతం జీఎస్టీ👉వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింపు👉చాలా ఎరువులపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గింపు👉చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5 శాతం జీఎస్టీ👉33 ఔషధాలపై జీఎస్టీ 12 నుంచి సున్నాకి తగ్గింపు👉350 సీసీ కంటే తక్కువ వాహనాలపై 18 శాతం జీఎస్టీ👉350 సీసీ దాటిన వాహనాలపై 40 శాతం పన్ను👉కార్పొనేటెడ్ కూల్డ్రింక్స్, జ్యూస్లపై 40 శాతం జీఎస్టీ👉పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ -
తగ్గిస్తే మంచిది.. కనీసం 175 వస్తువులపై జీఎస్టీ తగ్గింపు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ 56వ సమావేశం ప్రారంభమైంది. జీఎస్టీ శ్లాబులో భారీ మార్పులు, సరళీకరణ చర్యలు, సంస్కరణలపై ఈ రెండు రోజుల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఏ వస్తువు చౌక అవుతుంది.. ఏది మరింత ప్రియం అవుంతుందన్నది ఈ రెండు రోజుల సమావేశంలో తేలుతుంది.మధ్యతరగతి మేలు కోసం..హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, సుమారు 175 వస్తువులపై జీఎస్టీని కనీసం 10 శాతం తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే మరికొన్ని సవరణల కోసం సామాన్యులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతమున్న 5%, 12%, 18%, 28% నాలుగు శ్లాబుల నుంచి కేవలం రెండు శ్లాబులను మాత్రమే ప్రతిపాదించారు. నిత్యావసర వస్తువులకు 5 శాతం, అత్యవసరం కాని వస్తువులకు 18 శాతం. వీటితో పాటు పొగాకు వంటి హానికర వస్తువులు, రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన కార్లపై అదనంగా 40 శాతం శ్లాబ్ ను ప్రతిపాదించే అవకాశం ఉంది.12 శాతం కేటగిరీలోని వెన్న, పండ్ల రసాలు, డ్రై ఫ్రూట్స్ వంటి 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి రానున్నాయి. వీటితో పాటు నెయ్యి, తాగునీరు (20 లీటర్లు), నామ్కీన్, కొన్ని బూట్లు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలపై పన్ను 12 శాతం నుంచి 5 శాతం పన్ను శ్లాబుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఉపయోగించే పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులు, హెయిర్ పిన్స్ వంటి వస్తువులను కూడా 5 శాతం శ్లాబ్ పరిధిలోకి తీసుకురావచ్చు.జీఎస్టీ తగ్గించే అవకాశం ఉన్న వస్తువుల జాబితా ఇలా..వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు: టూత్స్ట్, షాంపూ, సబ్బు, టాల్కమ్ పౌడర్పాల ఉత్పత్తులు: వెన్న, జున్ను, మజ్జిగ, పనీర్ మొదలైనవి.రెడీ టు ఈట్ ఫుడ్స్: జామ్ లు, ఊరగాయలు, స్నాక్స్, చట్నీలు మొదలైనవి.కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్: ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు.ప్రైవేటు వాహనాలు: చిన్న కార్లు, హైబ్రిడ్ కార్లు, మోటార్ సైకిళ్లు, స్కూటర్లు.చాలా వరకు ఆహార, వస్త్ర ఉత్పత్తులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. జీవిత, ఆరోగ్య బీమాపై సున్నా శాతం జీఎస్టీ ప్రతిపాదించారు. కొన్ని కేటగిరీలకు చెందిన టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని, వీటిపై ప్రస్తుతమున్న 28 శాతం నుంచి 18 శాతం పన్ను విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండగా, ఇప్పుడు వాటిపై వేర్వేరు రేట్లను వర్తింపజేయవచ్చు. ఎంట్రీ లెవల్ కార్లపై 18 శాతం పన్ను వర్తిస్తుంది. ఎస్ యూవీలు, లగ్జరీ కార్లపై 40 శాతం పన్ను వర్తిస్తుంది. -
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
పన్నుల హేతుబద్ధీకరణ ప్రధాన అంశంగా 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే న్యూదిల్లీలోని తమిళనాడు భవన్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ శ్లాబులకు క్రమబద్ధీకరించి మొత్తంగా 5, 18, 40 శాతంగా ఉంచాలనే ప్రతిపాదనలున్నాయి. అయితే ఒకవేళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఈ విధానం అమల్లోకి వస్తే కింది విభాగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం(శాతం) కొత్త ప్రతిపాదన(శాతం)టెక్స్టైల్స్125ఫుట్వేర్125ట్రాక్టర్లు125ఎయిర్ కండిషనర్లు2818టీవీలు2818సిమెంటు2818పొగాకు ఉత్పత్తులు2840ఎనర్జీ డ్రింక్స్28401500 సీసీ లగ్జరీకార్లు2840హై ఎండ్ మోటార్ సైకిళ్లు2840పాన్ మసాలా2840కొన్ని రకాల బ్రేవరేజస్2840ఇదీ చదవండి: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదనకు ఎస్బీఐ కౌంటర్ -
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదనకు ఎస్బీఐ కౌంటర్
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్ధీకరణపై సెప్టెంబర్ 3, 4వ తేదీల్లో జరుగుతున్న కౌన్సిల్ సమావేశాల నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు లేవనెత్తిన ఆందోళనలకు ఎస్బీఐ తాజా పరిశోధన నివేదిక కౌంటర్గా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ముందు మంగళవారం విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, పన్నుల పంపిణీ ద్వారా మొత్తం రాష్ట్రాల ఆదాయం రూ.14 లక్షల కోట్లు దాటుతుందని ఎస్బీఐ అంచనా వేసింది.ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్, 16వ ఆర్థిక సంఘం సభ్యురాలు సౌమ్య కాంతి ఘోష్ నేతృత్వంలోని బృందం ఈ రీసెర్చ్ పేపర్లను విడుదల చేశారు. కొత్త పన్నుల క్రమబద్ధీకరణ వల్ల స్టేట్ జీఎస్టీ (ఎస్జీఎస్టీ) వసూళ్లలో రూ.10 లక్షల కోట్లు, పన్ను వికేంద్రీకరణ ద్వారా అదనంగా రూ.4.1 లక్షల కోట్లు వస్తాయని అంచనా వేశారు. జీఎస్టీ శ్లాబుల హేతుబద్ధీకరణ తర్వాత కూడా 2026 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాలు పన్నుల పరంగా నికర లాభాలు ఆర్జిస్తున్నాయని నివేదిక తెలిపింది. తక్కువ జీఎస్టీ రేట్ల ఫలితంగా వినియోగం పెరిగి అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పింది.ప్రతిపక్ష రాష్ట్రాల ఆందోళనగతవారం కర్ణాటక, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, పంజాబ్ సహా ఎనిమిది ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు జీఎస్టీ వల్ల ఆదాయ నష్టాలను హైలైట్ చేస్తూ ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాయి. జీఎస్టీ రేట్ల కోత, పరిహార సెస్ రద్దు కారణంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయంపై ప్రభుత్వం స్పష్టత కొరవడినట్లు కేంద్రానికి సమర్పించిన ఉమ్మడి వినతిపత్రంలో పేర్కొన్నారు. వివిధ ఆర్థిక పరిశోధనా సంస్థలు అందించే అంచనాల ప్రకారం.. ఏడాదికి రూ.85,000 కోట్ల నుంచి రూ.2 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అందులో చెప్పారు. అయితే ఎస్బీఐ నివేదిక అందుకు భిన్నమైన స్వరాన్ని వినిపించింది. అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం జీఎస్టీ ఆదాయం అదనంగా రూ.4.14 లక్షల కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది.ఇదీ చదవండి: ఏఐతో ఉద్యోగాలు పోతాయా? -
అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. అలాగే చైనాతో కూడా సంబంధాలు తిరిగి సాధారణ స్థాయి దిశగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. సరిహద్దు సమస్యలు పరిష్కారమయ్యే కొద్దీ, సహజంగానే ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని పరిశ్రమల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూఏఈ, మారిషస్, బ్రిటన్, ఈఎఫ్టీఏతో (యూరప్లోని నాలుగు దేశాల కూటమి) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి చెప్పారు. భారత్ మా వెంటే...: బెసెంట్అగ్రరాజ్యం మన ఎగుమతులపై భారీగా సుంకాలు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా–భారత్ల మధ్య మార్చి నుంచి ఇప్పటివరకు అయిదు విడతలు చర్చలు జరిగాయి. ఆరో విడత సంప్రదింపుల కోసం ఆగస్టు 25న అమెరికా బృందం భారత్ రావాల్సి ఉన్నప్పటికీ, ఆగస్టు 27 నుంచి సుంకాలను 50 శాతానికి పెంచేయడంతో, ఆ పర్యటన రద్దైంది. తదుపరి విడత చర్చలకు ఇంకా తేదీలు ఖరారు కాలేదు. మరోవైపు, ఏది ఏమైనప్పటికీ భారత్ తమ వెంటే ఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ధీమా వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పాటించే విలువలు రష్యా కన్నా అమెరికా, చైనాకి చాలా దగ్గరగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గొప్ప దేశాలైన భారత్, అమెరికా ఈ వివాదాన్ని (సుంకాలు) పరిష్కరించుకుంటాయని బెసెంట్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: టాటా క్యాపిటల్ రోడ్షోలు షురూ -
అక్టోబర్ 9 నుంచి బడ్జెట్ కసరత్తు ప్రారంభం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ 2026–27 బడ్జెట్ రూపకల్పన కసరత్తును అక్టోబర్ 9 నుంచి ప్రారంభించనుంది. ఒకవైపు అమెరికా 50 శాతం టారిఫ్ రేటును అమలు చేస్తుండడం, అంతర్జాతీయ వాణిజ్య ధోరణుల్లో మార్పుల నేపథ్యంలో తీసుకురానున్న ఈ బడ్జెట్లో కేంద్రం ఏవైనా కీలక సంస్కరణలను ప్రతిపాదిస్తుందేమో చూడాల్సి ఉంది. ముఖ్యంగా దేశీ డిమాండ్కు మరింత ఊతమివ్వడం, ఉపాధి కల్పనను విస్తృతం చేయడం ద్వారా జీడీపీ వృద్ధి రేటును 8 శాతానికి పెంచాల్సిన ఆవశ్యకత కేంద్రం ముందుంది.ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శి అధ్యక్షతన బడ్జెట్ ముందస్తు సమావేశాలు అక్టోబర్ 9 నుంచి మొదలవుతాయంటూ ఆర్థిక వ్యవహారాల శాఖ బడ్జెట్ సర్క్యులర్లో పేర్కొంది. సమావేశాలు ముగిసిన అనంతరం 2026–27 బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ ఖరారు చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను 2026 ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. -
జీఎస్టీ కీలక భేటీ నేటి నుంచి
న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ రెండు రోజుల సమావేశం బుధవారం ప్రారంభం కానుంది. జీఎస్టీలో ఇప్పుడున్న 5, 12, 18 28 శాతం శ్లాబుల స్థానంలో 5, 18 శాతం శ్లాబులను కొనసాగించి, మిగిలిన వాటిని ఎత్తేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. 12, 28 శాతం శ్లాబుల్లో ఉన్న వాటిని 5, 18 శాతం శ్లాబుల్లోకి సర్దుబాటు చేయనున్నారు. సిగరెట్, గుట్కాలు, విలాసవంతమైన కొన్ని వస్తువులపై మాత్రం 40 శాతం ప్రత్యేక పన్ను రేటును అమలు చేయాలన్నది ప్రతిపాదన. దీనికి జీఎస్టీ మంత్రుల బృందం ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేయగా.. జీఎస్టీ మండలి దీనిపై నిర్ణయం తీసుకోనుంది.3, 4వ తేదీల్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహన (ఈవీలు) కొనుగోలును ప్రోత్సహించేందుకు వీలుగా వాటిని 5 శాతం రేటు పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్లాబుల తగ్గింపుతో చాలా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. దీన్ని విపక్ష పాలిత రాష్ట్రాలు ఆహ్వానిస్తూనే.. ఆదాయ నష్టం ఏర్పడితే కేంద్రం భర్తీ చేయాలని కోరుతుండడం గమనార్హం. 2017 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచి్చంది. అప్పట్లో జీఎస్టీలోకి మారడం కారణంగా రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు వీలుగా కాంపెన్సేషన్ సెస్సు (1–290 శాతం మధ్య)ను విలాసవంత, హానికారక వస్తువులపై అమలు చేస్తున్నారు. దీని గడువు 2026 మార్చితో ముగిసిపోనుంది. ఆ తర్వాత కొనసాగించకూడదన్నది కేంద్రం ఉద్దేశమని తెలుస్తోంది.ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహంఎలక్ట్రిక్ వాహనాలపై (రూ.10 లక్షల వరకు) 18 శాతం జీఎస్టీకి మంత్రుల బృందం సానుకూలంగా ఉంది. కానీ, మరింత మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు వీలుగా 5 శాతం రేటుకు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నెయ్యి, నట్స్, తాగు నీరు (20 లీటర్ల క్యాన్లు), నమ్కీన్, కొన్ని రకాల పాదరక్షలు, దుస్తులు, మందులు, వైద్య పరికరాలను 12 శాతం నుంచి 5 శాతం రేటు కిందకు మార్చే అవకాశం ఉంది. పెన్సిళ్లు, సైకిళ్లు, గొడుగులను సైతం తక్కువ రేటు శ్లాబులోకి తీసుకురానున్నారు. కొన్ని రకాల టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, కొన్ని రకాల వాహనాలను 28% నుంచి 18% రేటులోకి తీసు కురానున్నట్టు తెలుస్తోంది. -
27,000 ఈఎస్ఐసీ వివాదాలకు పరిష్కారం?
నిర్మాణాత్మక సమస్యల వల్ల పెండింగ్లో ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)-యాజమాన్యాల కేసుల పరిష్కారానికి మోక్షం లభించనుంది. చట్టపరమైన అవాంతరాలను తగ్గించడానికి, పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు, యాజమాన్యాలతో ఉన్న వివాదాలను తొలగించుకునేందుకు ఈఎస్ఐసీ ‘ఆమ్నెస్టీ స్కీమ్ 2025’ను ఆమోదించింది. ఇది 15 సంవత్సరాలకు పైగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సుమారు 27,000 చట్టపరమైన కేసుల పరిష్కారానికి దారితీస్తుందని నమ్ముతున్నారు.కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఇటీవల సిమ్లాలో జరిగిన 196వ ఈఎస్ఐ కార్పొరేషన్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఆమ్నెస్టీ పథకంఆమ్నెస్టీ పథకం అక్టోబర్ 1, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు అమలులో ఉంటుంది. ఈఎస్ఐసీతో ముడిపడి ఉన్న వివాదాలను కోర్టు వెలుపల పరిష్కరించడానికి నిర్మాణాత్మక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో జ్యుడీషియరీ జోక్యం తగ్గుతుంది. పరిపాలనా మార్గాల ద్వారా వివాదాలను వేగంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం.పెండింగ్లో ఇన్ని కేసులు ఎందుకు?మార్చి 31, 2025 నాటికి యజమానులు, ఈఎస్ఐసీకి సంబంధించిన సుమారు 27,000 చట్టపరమైన కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కోత్కతాలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఈఎస్ఐసీ చేసిన బీమా విరాళాల తాత్కాలిక మదింపులకు సంబంధించినవే అధికంగా ఉన్నాయి. యజమానులు ఈ మదింపులను వ్యతిరేకించిన సందర్భాల్లో ఇన్సూరెన్స్ కోర్టులను ఆశ్రయించారు. దాంతో చట్టపరమైన సవాళ్ల వల్ల చాలాకాలంపాటు పెండింగ్లో ఉంటున్నాయి.ఆమ్నెస్టీ పథకంలోని కీలక నిబంధనలుయజమానులు తాత్కాలిక మదింపులపై అదనపు ఛార్జీలు లేకుండా వాస్తవ విరాళాలు, వాటిపై వర్తించే వడ్డీని మాత్రమే చెల్లించడం ద్వారా వివాదాలను పరిష్కరించవచ్చు.ఇప్పటికే బకాయిలు చెల్లించినట్లయితే యజమానులు వివాదాస్పద నష్టపరిహారం లేదా పెనాల్టీలో కేవలం 10% చెల్లించడం ద్వారా కోర్టు కేసులను ఉపసంహరించుకోవచ్చు.రికార్డులను సమర్పించకపోవడం లేదా ఆలస్యంగా చెల్లింపులు చేసినందుకు ఈఎస్ఐసీ దాఖలు చేసిన చట్టపరమైన కేసులు కూడా కోర్టు ఆమోదానికి లోబడి ఉపసంహరించుకోవచ్చు.క్రిమినల్ కేసులుఈఎస్ఐసీ తుది నిర్ణయం తర్వాత యజమానులు కోర్టులను ఆశ్రయించిన కేసుల్లో ఉపశమనం లభించదు.27,000 కేసుల్లో కొన్ని ఈఎస్ఐ చట్టంలోని సెక్షన్ 85 కింద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఉన్నాయి. ఇందులో కంట్రిబ్యూషన్లు చెల్లించడంలో వైఫల్యం, తప్పుడు రిటర్నులు సమర్పించడం వంటి కేసులున్నాయి.ఈ నేరాలు జైలు శిక్ష /జరిమానాలకు దారితీయవచ్చు. ప్రస్తుత చట్రంలో క్షమాభిక్షకు కూడా అర్హులు కాకపోవచ్చు.ఇదీ చదవండి: ఒకే కంపెనీలో 25 ఏళ్లు అనుభవం.. తీరా చూస్తే.. -
కరెంట్ ఖాతా లోటు 0.2 శాతమే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (2025–26 ఏప్రిల్–జూన్) కరెంటు ఖాతా లోటు (క్యాడ్)జీడీపీలో 0.2 శాతంగా (2.4 బిలియన్ డాలర్లు) ఉన్నట్టు ఆర్బీఐ విడుదల చేసిన డేటా తెలియజేస్తోంది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం చివరికి క్యాడ్ జీడీపీలో 0.9 శాతం (8.6 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే చాలా తక్కువకే పరిమితమైంది. సేవల ఎగుమతులు ఇందుకు దోహదం చేసినట్టు డేటా స్పష్టం చేస్తోంది.ఇక ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో కరెంట్ ఖాతా 13.5 బిలియన్ డాలర్ల మిగులు (జీడీపీలో 1.3 శాతం)తో ఉండడం గమనార్హం. విదేశాలకు చేసే ఎగుమతుల రూపంలో వచ్చే ఆదాయం, దిగుమతులకు చేసే చెల్లింపులు, ఆదాయ స్వీకరణలు ఇవన్నీ కరెంట్ ఖాతా కిందకు వస్తాయి. వస్తు వాణిజ్యానికి సంబంధించి లోటు జూన్ త్రైమాసికంలో 68.5 బిలియన్ డాలర్లుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 63.8 శాతమే. సేవల రూపంలో నికరంగా 47.9 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 39.7 బిలియన్ డాలర్లుగా ఉంది. వ్యక్తిగత నగదు బదిలీ స్వీకరణలు (విదేశాల్లో స్థిరపడిన వారు మాతృదేశానికి పంపించే) 33.2 బిలియన్ డాలర్లుగా జూన్ త్రైమాసికంలో నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 28.6 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనించొచ్చు.ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే.. -
దేశీ వినియోగమే జీడీపీకి బూస్ట్
దేశీ డిమాండ్ పుంజుకోవడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకునేలా చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నామినల్ జీడీపీ మాత్రం జూన్ క్వార్టర్లో 8.8 శాతానికి తగ్గిందని, క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది 10.8 శాతంగా ఉన్నట్టు క్రిసిల్ ఆర్థికవేత్తల బృందం పేర్కొంది.‘దేశీ ప్రైవేటు వినియోగం బలపడింది. ఇది తయారీ, సేవల రంగానికి ఊతమిచ్చింది. మొదటి త్రైమాసికంలో ప్రభుత్వం మూలధన వ్యయాలను పెద్ద మొత్తంలో పెంచిది. ఇది సైతం ప్రభుత్వ వినియోగ వ్యయాన్ని పెంచింది’ అని క్రిసిల్ ఆర్థిక బృందం తెలిపింది. స్థూల విలువ జోడింపు (జీవీఏ) క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఉన్న 6.8 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. గ్రామీణ డిమాండ్ ప్రైవేటు వినియోగం పెరిగేందుకు దోహదం చేసి ఉండొచ్చని అభిప్రాయపడింది. సవాళ్లలోనూ పటిష్ట పనితీరు..అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు నెలకొన్న తరుణంలో భారత జీడీపీ రికార్డు స్థాయిలో 7.8 శాతంగా నమోదు కావడం ప్రశంసనీయమని ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి పేర్కొన్నారు. గత ఐదు త్రైమాసికాల్లోనే ఇది గరిష్ట రేటు అని గుర్తు చేశారు. వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కావడంతో అన్ని రంగాల్లో అవకాశాల విస్తరణకు మద్దతునిస్తున్నట్టు చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబడులతో తన నిర్వహణలోని అన్ని వ్యాపారాల విస్తరణకు, విలువ జోడింపునకు ఐటీసీ కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.ఇదీ చదవండి: మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే.. -
తయారీ రంగం భళా
తయారీ రంగం ఆగస్ట్లో అదరగొట్టింది. ఈ రంగంలో పనితీరును ప్రతిఫలించే హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 59.3కు చేరుకుంది. జూలైలో ఇది 59.1గా ఉంది. పదిహేడున్నరేళ్ల కాలంలోనే అత్యంత వేగవంతమైన విస్తరణను చూపించినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా తెలిపింది. 50 పాయింట్లకు పైన విస్తరణగా, అంతకు దిగువన నమోదైతే కుచించినట్టు పరిగణిస్తుంటారు.‘భారత తయారీ రంగ పీఎంఐ ఆగస్ట్లో మరో కొత్త రికార్డును తాకింది. తయారీ శర వేగంగా విస్తరించడం ఫలితమే ఇది. భారత వస్తువులపై అమెరికా 50 శాతం టారిఫ్లు విధించడం కొత్త ఎగుమతి ఆర్డర్లు కొంత తగ్గేందుకు దారితీసి ఉండొచ్చు. టారిఫ్ల అనిశ్చితుల మధ్య అమెరికా కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లకు దూరంగా ఉన్నారు’ అని హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థిక వేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. కొత్త ఆర్డర్ల రాక ఐదు నెలల కనిష్ట స్థాయిలో ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. కాకపోతే జూలై ఆర్డర్ల స్థాయిలోనే ఉన్నట్టు పేర్కొంది.ఇదీ చదవండి: వాహన విక్రయాలకు జీఎస్టీ 2.0 బ్రేకులు -
రూ.6 వేల కోట్ల ‘పెద్ద’ నోట్లు ఇంకా చలామణీలో..
ముంబై: రిజర్వ్ బ్యాంక్ రూ. 2,000 నోట్లను ఉపసంహరించి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ రూ. 5,956 కోట్ల విలువ చేసే నోట్లు చలామణీలో ఉన్నాయి. ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. 2023 మే 19న ఈ పెద్ద నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ రోజున మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2025 ఆగస్టు 31 నాటికి ఇది రూ. 5,956 కోట్లకు తగ్గినట్లు ఆర్బీఐ తెలిపింది. 98.33 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్లు పేర్కొంది. రూ. 2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించినప్పటికీ, వాటిని రద్దు చేయలేదు కాబట్టి చలామణీలో ఉన్నవి చెల్లుబాటు అవుతాయి. ఈ నోట్లను బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చు. తమ ఖాతాల్లో జమ చేసుకునేందుకు ఇండియా పోస్ట్ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లోని ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. -
కొంచెం ఆగి చూద్దాం!
న్యూఢిల్లీ: కీలకమైన పండుగల సమయంలో వినియోగదారులు (ఆన్లైన్ షాపర్లు) ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ గూడ్స్ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) క్రమబద్దీకరణతో రేట్లు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కారణం. అయితే ఈ పరిస్థితి తాత్కాలికమేనని, ఒక్కసారి పన్ను రేట్లపై స్పష్టత వస్తే కొనుగోళ్లు తిరిగి ఊపందుకుంటాయన్నది నిపుణుల అంచనా. కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్టీలో శ్లాబుల తగ్గింపును వేగంగా అమల్లోకి తీసుకురావాలనుకుంటోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 3, 4 తేదీల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుంది. ప్రస్తుతం వివిధ రకాల వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం జీఎస్టీ రేట్లు అమల్లో ఉండడం తెలిసిందే. 12, 28 శాతం శ్లాబులను ఎత్తివేయాలన్నది ప్రతిపాదన. అప్పుడు అధిక శాతం వస్తు సేవలు 5 లేదా 18 శాతం రేట్ల పరిధిలోకి వస్తాయి. వాషింగ్ మెషిన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తదితర ఎన్నో ఉత్పత్తులపై పన్ను భారం తగ్గనుంది. ఈ–కామర్స్పై కనిపిస్తున్న మార్పు.. ఈ–కామర్స్ ప్లాట్ఫామ్లపై వినియోగదారుల కొనుగోళ్ల పరంగా స్పష్టమైన మార్పు కనిపిస్తున్నట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ నవీన్ మల్పానీ తెలిపారు. ముఖ్యంగా అధిక విలువ కలిగిన ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విషయంలో ఈ ధోరణి నెలకొన్నట్టు చెప్పారు. ‘‘జీఎస్టీ రేట్లపై స్పష్టత ఆలస్యమయితే అప్పుడు ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు తదితర విభాగాలపై 25–30 శాతం మేర ప్రభావం పడొచ్చు. కొత్త శ్లాబులు అమల్లోకి వస్తే రేట్లు తగ్గుతాయన్న అంచనాలు ప్రస్తుత వేచి చూసే ధోరణికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు రూ.1.2 లక్షల ఖరీదైన స్మార్ట్ఫోన్ ధర జీఎస్టీలో సంస్కరణల అనంతరం 10 శాతం మేర తగ్గనుంది. ఈ అంచనాలు కొనుగోళ్ల నిర్ణయాలను వాయిదా వేసుకునేందుకు దారితీస్తున్నాయి’’అని మల్పానీ వివరించారు. అమ్మకాలు వేగంగా పెరుగుతాయ్.. ‘‘రిటైలర్ల వద్ద ఉత్పత్తుల నిల్వలు అధికంగానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల విభాగంలో కొనుగోళ్లు వాయిదా పడుతున్నాయి. పండుగల సీజన్ చివర్లో (అక్టోబర్) పెరిగే డిమాండ్కు అనుగుణంగా సన్నద్ధం అయ్యేందుకు ఈ–కామర్స్ సంస్థలు బ్రాండ్లతో సంప్రదింపులు చేస్తున్నాయి. జీఎస్టీలో పన్ను రేట్ల సవరణ ధరల వ్యూహాల్లోనూ మార్పులకు దారితీయనుంది. మొత్తం మీద సమీప కాలంలో కనిపించే ప్రభావం తాత్కాలికమే. కొత్త పన్నులపై ఒక్కసారి స్పష్టత వస్తే అమ్మకాలు వేగంగా పుంజుకుంటాయి’’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ శుభమ్ నింకార్ తెలిపారు. ఈ–కామర్స్ సంస్థలకు పండుగల సీజన్ ఎంతో కీలకం. వార్షిక అమ్మకాల్లో పావు శాతం ఈ సమయంలోనే నమోదవుతుంటాయి.పండుగ షాపింగ్ ప్రత్యేకం..పండుగల సమయంలో కొనుగోళ్లు కేవలం సంస్కృతిలో భాగమే కాకుండా, భావోద్వేగపరమైనవి అని షిప్రాకెట్ ఎండీ, సీఈవో సాహిల్ గోయల్ పేర్కొన్నారు. ‘‘కొత్త గృహోపకరణం అయినా, గ్యాడ్జెట్ అయినా లేక గృహ నవీకరణ అయినా పండుగల సమయంలో కొనుగోలు చేసేందుకు కుటుంబాలు ప్రణాళికలతో ఉంటాయి. ఈ అంతర్గత డిమాండ్ కచ్చితంగా కొనసాగుతుంది. జీఎస్టీ క్రమబదీ్ధకరణ అన్నది కొనుగోళ్ల దిశగా వినియోగదారులకు మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. రేట్ల సవరణతో ధరలు అందుబాటులోకి వస్తాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుంది’’అని వివరించారు. జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ అన్నది నిర్మాణాత్మక సంస్కరణ అని, వినియోగానికి బలమైన ఊతం ఇస్తుందని ఫ్లిప్కార్ట్ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ సైతం అభిప్రాయపడ్డారు. జీఎస్టీలో మార్పులు అమల్లోకి వచ్చినట్టయితే పండుగల సీజన్లో ఈ–కామర్స్ అమ్మకాలు మొత్తం మీద 15–20 శాతం పెరగొచ్చని (గతేడాదితో పోల్చితే) మల్పానీ అంచనా వేశారు. -
జీఎస్టీ లెక్కలు వచ్చేశాయి.. గత నెల ఎంత వసూలైందంటే..
గడిచిన నెలలో జీఎస్టీ వసూళ్ల లెక్కలు వెల్లడయ్యాయి. ఆగస్టులో వస్తు, సేవల పన్ను (GST) రూపంలో రూ.1.86 లక్షల కోట్లు వసూలయ్యాయని, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 6.5 శాతం అధికమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. గత నెలలో భారత స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2025 ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రూ.2.37 లక్షల కోట్లకు పెరిగాయి.ఆగస్టులో స్థూల దేశీయ ఆదాయం 9.6 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను 1.2 శాతం తగ్గి రూ.49,354 కోట్లకు పరిమితమైంది. జీఎస్టీ రీఫండ్స్ ఏడాది ప్రాతిపదికన 20 శాతం తగ్గి రూ.19,359 కోట్లకు పరిమితమయ్యాయి.2025 ఆగస్టులో నికర జీఎస్టీ ఆదాయం రూ .1.67 లక్షల కోట్లుగా ఉంది. ఇది సంవత్సరానికి 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. రేట్ల హేతుబద్ధీకరణ, పన్ను శ్లాబుల సంఖ్య తగ్గింపుపై చర్చించే కేంద్రం, రాష్ట్రాలతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి రెండు రోజుల ముందు ఈ డేటాను విడుదల చేశారు.జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలను దీపావళి నాటికి ఆవిష్కరిస్తామని, ఇది సామాన్యులకు 'గణనీయమైన' పన్ను ఉపశమనం కలిగిస్తుందని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుస్తుందని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సెప్టెంబర్ 3 నుంచి 4 వరకు జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు 5, 18 శాతం రెండు శ్లాబుల పన్నుపై చర్చించనున్నారు. -
భారత్ మూడంచెల ప్లాన్..
భారతీయ ఎగుమతులపై సుంకాలను 50 శాతానికి పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయానికి వ్యూహాత్మక ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. టారిఫ్ల వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక ఉపశమనం కోసం దేశ ఎగుమతి ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి మూడంచెల కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తున్నందుకు భారత్పై అమెరికా తీసుకున్న ఈ టారిఫ్ చర్య 60 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, లెదర్, రసాయనాలు వంటి కార్మిక ఆధారిత రంగాలపై ప్రభావం చూపుతుంది. వీటిలో చాలా వరకు ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్) పరిధిలోకి రానివే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.స్వల్పకాలిక చర్యలు..చాలా సంస్థలకు వడ్డీ రాయితీ పథకాలు అందించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు పూచీకత్తు లేని రుణాలను సులభతరం చేయాలని యోచిస్తోంది. సెజ్ యూనిట్ల ఆర్డర్ వాల్యూమ్లను నిర్వహించడానికి, ఉద్యోగాలను రక్షించడంలో సహాయపడటానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. బ్రాండింగ్, ప్యాకేజింగ్, వేర్హౌజింగ్, లాజిస్టిక్స్పై పట్టుసాధించేందుకు సాయం అందించాలని చూస్తోంది. టెక్స్టైల్స్, హస్తకళల్లో చిన్న ఎగుమతిదారులకు లిక్విడిటీ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా ఉంది. ఈ సమస్య పరిష్కరించేందుకు స్వల్పకాలిక చర్యలు కీలకం కానున్నాయని అధికారులు చెబుతున్నారు.మీడియం స్ట్రాటజీరాబోయే 12-24 నెలల్లో అమెరికాకు చేసే ఎగుమతులను వైవిధ్య పరచాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను పొందేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. యూకే, యూఏఈ, ఆస్ట్రేలియా వంటి దేశాలతో ఇప్పటికే చర్చలు వేగవంతం చేసింది. ఎగుమతి వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పన్ను రిఫండ్లను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించేలా చర్యలు తీసుకుంటోంది. యూరప్, ఆఫ్రికా వంటి కొత్త భాగస్వామ్యాలను ఏర్పరుచుకోవడానికి ట్రేడ్ ఫెయిర్లను ఏర్పాటు చేస్తుంది.దీర్ఘకాలిక దృష్టిఈ సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎగుమతి ప్రోత్సాహక మిషన్ను ప్రారంభించింది. దేశీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్లను వైవిధ్య పరిచేందుకు చర్యలు తీసుకుంటుంది. సరళీకృత లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్, జీఎస్టీ రిఫండ్ విధానాలతో డిజిటల్ వాణిజ్యంలో ఎంఎస్ఎంఈలకు మరింత అవకాశాన్ని కల్పించాలని చూస్తుంది. భారతీయ ఎగుమతులకు గ్లోబల్ బ్రాండ్ విశ్వసనీయతను పెంచడానికి స్కిల్లింగ్, ఆర్ అండ్ డీ, క్వాలిటీ సర్టిఫికేషన్లో పెట్టుబడులు పెంచాలని చూస్తుంది.ఇదీ చదవండి: రూ.50 లక్షలు ఆదాయం ఉన్నా స్కూల్ ఫీజు భారం! -
ఐటీ ఫైలింగ్కి ఉపక్రమించండి... మహాశయా..!
గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2023–24 గానూ సుమారు 9 కోట్ల రిటర్నులు చేసినట్లు ఒక లెక్క ఉంది. ఇక 2024–25కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 25.8.2025 నాటికి 3,67,94,801 రిటర్నులు పడ్డాయి. అంటే ఫైల్ చేసినట్లు. ఇందులో 3.54 కోట్ల మంది సక్రమంగా వెరిఫై చేశారు. గొప్ప విషయం ఏమిటంటే 2.29 కోట్ల మంది రిటర్నులు ప్రాసెస్ అయ్యాయి. అంటే అస్సెస్మెంట్ అయినట్లే. 13 లక్షల మంది వెరిఫై చేయలేదట.మీరు ఒకసారి చెక్ చేసుకొండి. వెరిఫై చేసుకోపోతే వెంటనే వెరిఫై చేయండి. వైరిఫై జరిగితే కానీ అసెస్మెంట్ మొదలుపెట్టరు. గతవారం అయితే రిటర్నులు వేసిన కొంతమంది అసెస్మెంట్ పూర్తి చేసి రీఫండ్ మొత్తాన్ని వారి వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం జరిగింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ వారి కృషి, కష్టాన్ని, సామర్థ్యాన్ని మెచ్చుకోవాలి. శెహభాష్... టాక్స్ అడిట్ అవసరం లేని వారికి జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు గడువు తేది ముందుగానే పొడిగించారు. గతంలో పొడిగింపుల పర్వం లేదా వాయిదాల పద్ధతి ఉండేది. దానిని పక్కన పెట్టి గత 2 ఏళ్లుగా ఎటువంటి పొడిగింపు చేయకుండా నిలకడగా ఉన్నారు. కానీ ఏడాది ఆరంభంలో ఈసారి పెద్ద పొడిగింపు చేశారు. ఇప్పుడు అన్లైన్లో పనులు చకచకా జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేవు. ఫాస్ట్గా, మృదువు గా బండి నడుస్తోంది. ఈ కాలమ్ చదివే సమయానికి ఫైలర్ల సంఖ్య 4 కోట్లు దాటిందన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకో 5 కోట్లకు పైచిలుకు రిటర్నులు వేయాలి. మీరు వేసిన 4 కోట్ల మందిలో ఉన్నారా..? వేయాల్సిన 5 కోట్ల మందిలో ఉన్నారా..?వెంటనే ఏం చేయాలంటే... పాన్ కార్డుని తీయండిఆధార్తో పాన్ అనుసంధానం చేసుకోండి. మీకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో ఆరా తీయండి. చాలా మందికి ఒక అకౌంటు లేదా రెండు అకౌంట్లు గుర్తుంటాయి. నిత్యం వాడే అకౌంట్లు గుర్తుంటాయి. ఎన్ని ఉన్నాయో మరిచిపోతుంటాము. ఎవరో తెలిసిన వ్యక్తి లోన్ ఇప్పిస్తాడు. అప్పుడు బ్యాంకులో అకౌంటు ఓపెన్ చేస్తాము. లోన్ క్లియర్ అయ్యాక ఈ సంగతి మరిచిపోతాము. ఉద్యోగాల బదిలీ వలన, ఇంటికి దగ్గరగా ఉందనో.. దగ్గర బంధువు ఉన్నాడని తెరిచిన అకౌంటు... ఇలా ఒక జాబితా చేసుకొండి. అన్నీ బ్యాంకు అకౌంటు వివరాలు సేకరించండి. వాటిలో వ్యవహారాలకు వివరాలు రాసుకొండి. ఇన్నీ ఉన్నా ఏదో ఒకదాన్ని మాత్రమే రిఫండ్ కోసం ఎంచుకోండి. అలా ఎంచుకోకపోతే రీఫండ్ రానే రాదు. వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు... వాటి విషయంలో అశ్రద్ధ వహిస్తాము. గుర్తు తెచ్చుకోండి. పుట్టింటి నుంచి వచ్చిన డబ్బును అదే ఊరిలో ఫిక్స్డ్ వేసి మరిచిపోయే నారీమణులు ఎందరో.... అన్ని వివరాలు సేకరించండి.మీరు ఉద్యోగస్తులు అయితే ఫారమ్ 16 అడగండి. అందులో అన్నీ వివరాలు చెక్ చేసుకొండి. ప్రతి నెలా తయారయ్యే శాలరీ స్లిప్ను జాగ్రతగా ఉంచండి. ఫారమ్ 16 ఎ లో కరెక్ట్ చేసి భద్రపరచండి.డివిడెండ్ల మీద ఆదాయం బ్రోకర్ని అడిగి తెలుసుకొండి. స్టేట్మెంట్ తీసుకొండి. మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు అమ్మకాలు స్టేట్మెంట్ తీసుకొండి. పూర్తి స్టేట్మెంట్ అడగండిఅద్దె మీద ఆదాయం ఆదాయం ఉంటే ఇంటి అడ్రెస్సు, కిరాయిదారు పాన్/ఆధార్ తీసుకొండి. ప్రాపర్టీ టాక్సు రశీదులు తీసుకోండి. విదేశాల్లో ఉండే కుటుంబ సభ్యుల నుంచి వచ్చే మొత్తం వివరాలు తెలుసుకోండిఅలాగే విదేశీ ఆస్తుల మీద ఆదాయం కూడా పాత పద్ధతిలో డిడక్షన్లకు అయితే అన్ని కాగితాలు, వివరాలు కావాలి. అద్దె రశీదులు... విరాళాల వివరాలు ఉండాలి. కరెక్ట్ ఫారాన్ని సెలెక్ట్ చేసుకోండి. డిపార్ట్మెంట్ వారి ఉపకరణాలు ఉపయోగపడుతాయి. ఇప్పుడు ఫైలింగ్కు ఉపక్రమించండి. ఆల్ ద బెస్ట్..... -
తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. ఏ ప్రాంతంలో ఎంతంటే..
దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించాయి. కొత్త ధరలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలకు ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచే ఈ ధరలు అమల్లోకి వస్తాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు.19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రాంతాల వారీగా కింది విధంగా ఉన్నాయి.ఢిల్లీ: రూ.1,580కోల్కతా: రూ.1,683ముంబై: రూ.1,531చెన్నై: రూ.1,737.52025 ఏప్రిల్-జులై మధ్య 19 కిలోల ఎల్పీజీ ధరలు ఢిల్లీలో రూ.138, కోల్కతాలో రూ.144, ముంబైలో రూ.139, చెన్నైలో రూ.141.5 తగ్గాయి. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర ఏప్రిల్ 8, 2025న రూ.50 పెరిగినప్పటి నుంచి మార్పు చేయలేదు. ప్రస్తుత ధరలు ఢిల్లీలో రూ.853, కోల్కతాలో రూ.879, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50గా ఉంది.ఇదీ చదవండి: మరో బీమా సంస్థ సూపర్ టాపప్ ప్లాన్.. తీసుకోవచ్చా? -
ప్రతీ లావాదేవీపై ‘ఐ’టీ!
మల్టీ నేషనల్ బ్యాంక్ ఉద్యోగి ఒకరు తన ఆదాయపన్ను రిటర్నుల్లో వడ్డీ ఆదాయం కింద రూ.25,000 వచ్చినట్టు చూపించాడు. దీంతో ఆదాయపన్ను శాఖ మదింపు అధికారి (అసెసింగ్ ఆఫీసర్)కి సందేహం వచ్చి సంబంధిత ఐటీఆర్ను పరిశీలన కోసం తీసుకున్నారు. పన్ను చెల్లింపుదారు బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా, మరింత విలువైన సమాచారం లభించింది. దీంతో పెనాల్టీ విధించి, చెల్లించాలంటూ నోటీసు జారీ చేశారు. ఒక వ్యాపారి స్థలం విక్రయించగా లాభం వచ్చింది. ఐటీఆర్లో వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచాడు. ఎస్ఎఫ్టీ ద్వారా వచ్చిన సమాచారానికి, వ్యాపారి ఐటీఆర్లో వివరాలకు మధ్య తేడా ఉందని అసెసింగ్ ఆఫీసర్ గుర్తించారు. ఐటీఆర్ మదింపు అనంతరం, స్థలం విక్రయంపై మూలధన లాభాల పన్నుతోపాటు, పెనాల్టీ చెల్లించాలంటూ ఆదేశించారు. అంతేకాదు ఆదాయపన్ను చట్టం కింద చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడమే కాదు.. చట్టంలోని నిబంధనలను అనుసరించి అన్ని ఆర్థిక వివరాలనూ వెల్లడించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. చెప్పకపోతే పన్ను అధికారులకు తెలియదులే! అన్న నిర్లక్ష్యం పనికిరాదు. అన్ని ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల సమాచారం ఐటీ శాఖ గుప్పిట్లో ఉంటుంది. ఖరీదైన కొనుగోళ్లు, క్రెడిట్ కార్డు రుణాలు, ప్రాపర్టీ లావాదేవీలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడుల సమాచారం ఆదాయపన్ను శాఖకు చేరుతుంది. ఏ చిన్న అంతరం ఉన్నా ఏఐ సాయంతో పన్ను అధికారులు సులభంగా గుర్తిస్తున్నారు. కనుక పన్ను చెల్లించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడం కష్టమే..! అన్ని బ్యాంక్లు, ఆర్థిక సంస్థలు, తపాలా శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తదితర రిపోర్టింగ్ ఎంటీటీలు (ఆర్ఈలు) ఆదాయపన్ను శాఖ వద్ద ‘స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్’ను (ఎస్ఎఫ్టీ) ఏటా దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రతీ పాన్పై చేసిన నిర్దేశిత ఆర్థిక లావాదేవీల వివరాలను ఎస్ఎఫ్టీలో వెల్లడించాలి. పన్ను ఎగవేతలను నివారించేందుకు ఆదాయపన్ను శాఖ ఎస్ఎఫ్టీలను పరిశీలిస్తుంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలేనంటూ సెక్షన్ 87ఏ కింద రిబేటును వినియోగించుకుని ఎలాంటి పన్ను లేకుండా రిటర్నులు దాఖలు చేశాడని అనుకుందాం. కానీ, అదే వ్యక్తి రూ.5 లక్షలు విలువ చేసే బంగారం కొనుగోలు చేసి ఉంటే ఆదాయపన్ను శాఖ వద్దనున్న రికార్డులు ఆ విషయాన్ని లేవనెత్తుతాయి. దాంతో వారి ఐటీఆర్లు స్క్రూటినీ (పరిశీలన)కి వెళతాయి. తనకు ఆదాయం రూ.6 లక్షలుగానే చూపించొచ్చు. తీరా చూస్తే బ్యాంక్ నుంచి ఉపసంహరణలు లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తి జీవన అవసరాలకు కావాల్సిన సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటివన్నీ ఆదాయపన్ను శాఖ అధికారులు సులభంగా పసిగట్టగలరు. కనుక ఎస్ఎఫ్టీ గురించి, ఏఐఎస్ గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. ప్రతి సమాచారం రికార్డు అవుతుంది.. స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ (ఎస్ఎఫ్టీ) ద్వారా బ్యాంక్లు, మ్యూచువల్ ఫండ్స్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తదితర సంస్థలు అందించే సమాచారం.. పాన్ నంబర్ వారీగా వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో నమోదవుతుంది. అన్ని ముఖ్య ఆర్థిక లావాదేవీల వివరాలు ప్రతీ పన్ను చెల్లింపుదారుడి ఏఐఎస్లో ఆటోమేటిక్గా రికార్డు అవుతాయని సింఘానియా అండ్ కో పార్ట్నర్ రికిత నయ్యర్ వెల్లడించారు. కనుక ఏఐఎస్ను ఒక్కసారి పరిశీలించుకున్న తర్వాత ఐటీఆర్ దాఖలు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల కచ్చితమైన సమాచారంతో ఐటీఆర్ నమోదు చేయడం సాధ్యపడుతుందని, తద్వారా ఐటీఆర్ వేగంగా ప్రాసెస్ అవుతుందని చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024–25) పన్ను రిటర్నుల సమర్పణకు పొడిగించిన గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగియనుంది.ఐటీఆర్లో వెల్లడించకపోతే ఏమవుతుంది? ‘‘పన్ను చెల్లింపుదారు ఆదాయపన్ను రిటర్నుల్లో (ఐటీఆర్) కీలక లావాదేవీల సమాచారాన్ని వెల్లడించనప్పుడు లేదా ఎస్ఎఫ్టీ, ఏఐఎస్లోని సమాచారంతో, ఐటీఆర్లోని వివరాలు సరిపోలనప్పుడు తదుపరి పలు పరిణామాలకు దారితీయవచ్చు’’ అని సంజోలి మహేశ్వరి తెలిపారు. నోటీసులు: ఏఐఎస్లో నమోదైన అధిక విలువ కలిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివరణ కోరుతూ ఆదాయపన్ను శాఖ నోటీసు జారీ చేస్తుంది. ఐటీఆర్లో వెల్లడించిన లావాదేవీలు సరిగ్గానే ఉన్నాయా? అంటూ ధ్రువీకరించాలని కోరుతుంది. పూర్తి వివరాలు వెల్లడించకపోవడం లేదంటే పాక్షిక వివరాలతో సరిపెట్టినట్టయితే సవరించిన ఐటీఆర్లు దాఖలు చేయాలని కోరుతుంది. పరిశీలన: ఐటీఆర్లో వెల్లడించిన ఆదాయానికి, ఎస్ఎఫ్టీలో లావాదేవీల సమాచారానికి మధ్య పొంతన లేనప్పుడు లేదా అసలు ఐటీఆర్ దాఖలు చేయనప్పుడు లేదంటే నోటీసుకు స్పందించనప్పుడు లేదా నోటీసుకు సరైన సమాధానం ఇవ్వనప్పుడు సంబంధిత పన్ను చెల్లింపుదారుడి ఐటీఆర్ను పూర్తి స్థాయి పరిశీలనను అసెసింగ్ ఆఫీసర్ చేపడతారు. నోటీసు జారీ చేసి సరైన సమాచారంతో రిటర్నులు దాఖలు చేయాలని పన్ను అధికారి కోరొచ్చు. పెనాల్టిలు: నిబంధనల ప్రకారం ఐటీఆర్లు దాఖలు చేయకపోవడం లేదా పన్ను చెల్లించనట్టయితే.. జరిమానాతో సహా చెల్లించాలని ఆదేశాలు జారీ చేస్తారు. ఈ పెనాల్టీ అసలు పన్నుకు 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉంటుంది. అంతేకాదు చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తిస్తే జరిమానాకు అదనంగా జైలు శిక్ష కూడా పడుతుందని మహేశ్వరి తెలిపారు. ఎగవేసిన మొత్తం రూ.25 లక్షలకు పైన ఉంటే 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని.. తప్పుడు వివరాలతో లేదా వివరాలను రహస్యంగా ఉంచి వెల్లడించని సందర్భాల్లో 3 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించొచ్చని చెప్పారు. అయితే, నోటీసులకు సకాలంలో స్పందించి, వాస్తవ సమాచారంతో ఐటీఆర్లు దాఖలు చేసి, పన్ను చెల్లించడం ద్వారా ఈ ఇబ్బందులను అధిగమించొచ్చు. ఎస్ఎఫ్టీల్లోకి చేరే లావాదేవీలు.. → ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించిన విలువపై బ్యాంక్ డ్రాఫ్ట్లు/ పే ఆర్డర్లు / బ్యాంకర్ చెక్కులకు నగదు చెల్లింపులు. → బ్యాంక్లు, కోపరేటివ్ బ్యాంకుల నుంచి ప్రీ–పెయిడ్ ఇన్స్ట్రుమెంట్లను రూ.10 లక్షలు అంతకుమించి నగదు చెల్లించి కొనుగోలు చేయడం. → ఒక వ్యక్తి కరెంట్ ఖాతాలో నగదు జమలు రూ.50 లక్షలు అంతకుమించి చేసినప్పుడు. → ఒక వ్యక్తి కరెంట్ ఖాతా నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలు, అంతకుమించి నగదు ఉపసంహరణలు. → కరెంట్, టైమ్ డిపాజిట్ కాకుండా ఇతర బ్యాంక్ ఖాతాల్లో ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి నగదు జమ చేయడం. → వస్తువు లేదా సేవా విక్రయంపై ఒక వ్యక్తి రూ.2 లక్షలకు మించి నగదు చెల్లించడం. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 44ఏఈబీ కిందకు ట్యాక్స్ ఆడిట్ అవసరమైన వారికే ఈ నిబంధన → ఒకటి లేదా ఒకటికి మించిన క్రెడిట్ కార్డులకు ఒక ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపులు రూ.లక్ష అంతకుమించి ఉంటే → ఒకటి లేదా అంతకు మించిన క్రెడిట్ కార్డులకు డిజిటల్ చెల్లింపుల మొత్తం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు, అంతకు మించితే. → ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించిన మొత్తంతో టైమ్ డిపాజిట్ (రెన్యువల్ కాకుండా) చేయడం. → బాండ్లు లేదా డిబెంచర్లపై మొత్తం మీద (ఒకటికి మించిన లావాదేవీలు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి ఇన్వెస్ట్ చేయడం. → షేర్ల కొనుగోలు విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు (ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం), అంతకుమించినప్పుడు ఎస్ఎఫ్టీ ద్వారా బ్రోకర్లు ఐటీ శాఖకు ఫైల్ చేయాల్సిందే. → షేర్ల బైబ్యాక్లో పాల్గొని విక్రయించిన మొత్తం రూ.10 లక్షలు అంతకుమించిన సందర్భాల్లో. → మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్లపై పెట్టుబడి రూ.10 లక్షలు అంంతకుమించిన సందర్భాల్లో. → స్థిరాస్తి కొనుగోలు లేదా విక్రయం విలువ (రిజిస్ట్రేషన్ వ్యాల్యూ/ప్రభుత్వ మార్కెట్ విలువ లేదా రికార్డు అయిన అసలు కొనుగోలు/విక్రయం విలువ) రూ.30 లక్షలు అంతకుమించిన సందర్భాల్లో రిజిస్టార్ లేదా సబ్ రిజి్రస్టార్ నివేదించాల్సి ఉంటుంది. → ఫారీన్ కరెన్సీ కోసం రూ.10 లక్షలు అంతకుమించిన చెల్లింపులు చేసినప్పుడు. → క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా ట్రావెలర్స్ చెక్కు లేదా డ్రాఫ్ట్ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు అంతకుమించి ఖర్చు చేసిన సందర్భాల్లో సమాచారం ఎస్ఎఫ్టీ రూపంలో ఐటీ శాఖకు వెళుతుంది. రిజిస్ట్రార్ అండ్ షేర్ ట్రాన్స్ఫర్ ఏజెంట్, రిజి్రస్టార్ కార్యాలయాలు తదితర) ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాతి మే 31లోపు ఎస్ఎఫ్టీలను నమోదు చేయాల్సింఇక్కడ చెప్పిన పరిమితులన్నీ ఒక ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి అమలవుతాయి. రిపోర్టింగ్ ఎంటీటీలు (బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలు లేదా మ్యూచువల్ ఫండ్స్దే.– సంజోలి మహేశ్వరి , నాంజియా అండ్ కో ఎల్ఎల్పీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) వేతనాలు, వడ్డీ ఆదాయం, డివిడెండ్లు, ఇల్లు/ప్లాంట్లు/మెíÙనరీలపై అద్దె ఆదాయం తదితర లావాదేవీల వివరాలతోపాటు.. టీడీఎస్, టీసీఎస్, జీఎస్టీ ఇతర పన్ను సంబంధిత వివరాలు, రెమిటెన్స్లు (విదేశీ చెల్లింపులు/స్వీకరణలు), షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్లలో పెట్టుబడులు/ఉపసంహరణలు, ఆఫ్ మార్కెట్ కొనుగోళ్లు/విక్రయాలు, ప్రాపర్టీల క్రయ/విక్రయాలు ఇలా సమగ్ర సమాచార నివేదికగా ఏఐఎస్ ఉంటుంది. అంతేకాదు బంగారం, కార్లు తదితర అధిక విలువ కొనుగోళ్లు, కమీషన్ల ఆదాయం, విదేశీ పర్యటనలపై అధిక వ్యయాలు, జీవిత బీమా పాలసీల నుంచి అందుకున్న మొత్తం, లాటరీ/బెట్టింగ్ల్లో గెలుచుకుంటే, ఆయా వివరాలు కూడా ఇందులోకి చేరతాయి. దీన్ని రిటర్నుల దాఖలుకు ముందు ఒకసారి పరిశీలించుకుని, అందులోని వివరాలు/లావాదేవీలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిపై తమ అభిప్రాయాలను ఆదాయపన్ను శాఖకు నివేదించొచ్చు. ఉదాహరణకు ఏదైనా పెట్టుబడి విషయంలో అసలు కంటే అధిక మొత్తం ఉన్నట్టు గుర్తించినట్టయితే ఇదే విషయాన్ని ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లొచ్చు. దాంతో అది సవరణకు గురవుతుంది. పన్ను చెల్లింపుదారుడికి సంబంధించి సమగ్రమైన ఆర్థిక సమాచార నివేదిక ఇది. పూర్తిగా పరిశీలించుకుని, నిబంధనల ప్రకారం ఆ వివరాలను ఐటీఆర్లో స్వచ్ఛందంగా వెల్లడించే దిశగా పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడమే దీని ఉద్దేశం. ఫారమ్ 26ఏఎస్ ఫారమ్ 26ఏఎస్ అన్నది పన్ను చెల్లింపుదారుడి ఆదాయంపై మినహాయించిన టీడీఎస్, వ్యయాలపై వసూలు చేసిన టీసీఎస్, ప్రాపర్టీ క్రయ/విక్రయాల వివరాలతో ఉంటుంది. ఏఐఎస్, ఫారమ్ 26ఏఎస్ను ఆదాయపన్ను ఈ–ఫైలింగ్ పోర్టల్ నుంచి పొందొచ్చు. -
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కొత్తగా వేస్తున్నారా?..
మీరు వేతన జీవి అయినా, ఫ్రీలాన్సర్ లేదా ఇప్పుడే జాబ్ మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ, మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడం సంక్లిష్టంగా అనిపించవచ్చు. అందుకే ఆదాయపు పన్ను శాఖ తరచుగా ఐటీ రిటర్నులను సౌకర్యవంతంగా, వేగంగా దాఖలు చేయడానికి చిట్కాలు, పద్ధతులను తెలియజేస్తుంటుంది.ఐటీఆర్ దాఖలు చేయడానికి ముందు, పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో నమోదు చేసుకోవడం చాలా అవసరం. ఫైలింగ్ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడానికి, ఐటీఆర్ పోర్టల్లో ఎలా నమోదు చేసుకోవాలన్నదానిపై ఆదాయపు పన్ను శాఖ వివరణాత్మక గైడ్ను షేర్ చేసింది. ఈ-పోర్టల్లో నమోదు చేసుకోవడానికి దశలవారీ గైడ్ను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.ఐటీఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండిలా..స్టెప్ 1: ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ - www.incometax.gov.in కు వెళ్లండి. హోమ్ పేజీ ఎగువ కుడి వైపు మూలలో ఉన్న 'రిజిస్టర్' బటన్ పై క్లిక్ చేయండి.స్టెప్ 2: యూజర్ టైప్ ట్యాబ్ లో 'ట్యాక్స్ పేయర్' ఎంచుకొని 'కంటిన్యూ' క్లిక్ చేయాలి.స్టెప్ 3: 'పాన్' ఆప్షన్లో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి 'వెలిడేట్' క్లిక్ చేయాలి. మీరు ఆధార్తో పాన్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.స్టెప్ 4: పాన్ వివరాలను ఇచ్చిన తర్వాత, మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డును ఎంటర్ చేసి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.స్టెప్ 5: పూర్తి పేరు, పుట్టిన తేదీ, జెండర్, నివాస స్థితితో సహా ప్రాథమిక సమాచారాన్ని అందించండి. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత 'కంటిన్యూ' ఎంచుకోండి.స్టెప్ 6: చెల్లుబాటులో ఉన్న కాంటాక్ట్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీ, పూర్తి నివాస చిరునామా వంటి కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.స్టెప్ 7: మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడీపై రెండు వేర్వేరు ఆరు అంకెల ఓటీపీలను మీరు అందుకుంటారు. తర్వాత మీ కాంటాక్ట్ వివరాలను ధృవీకరించి సంబంధిత ఫీల్డ్ ల్లో ఓటీపీలను నమోదు చేయండి. ఒకవేళ మీకు ఓటీపీలు రాకపోతే 'రీసెండ్ ఓటీపీ'పై క్లిక్ చేయండిస్టెప్ 8: ఇప్పటివరకు అందించిన సమాచారం అంతటిని సమీక్షించుకుని అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే 'కన్ఫర్మ్' మీద క్లిక్ చేయండి.స్టెప్ 9: బలమైన పాస్వర్డ్ను క్రియేట్ చేసుకుని మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ను ధృవీకరించండి. తరువాత, ధృవీకరించడానికి అదే పాస్వర్డ్ను మళ్లీ నమోదు చేయండి. చివరగా, వ్యక్తిగతీకరించిన లాగిన్ సందేశాన్ని సెట్ చేయండి. మీరు ఫిషింగ్ వెబ్సైట్లో లేరని, అధికారిక ఐటీ వెబ్సైట్లో ఉన్నారని నిర్ధారించడానికి ఈ దశ సహాయపడుతుంది.పాస్ వర్డ్ పాలసీ: కనీసం 8 క్యారెక్టర్లు, గరిష్టంగా 14 క్యారెక్టర్లు ఉండాలి. ఇందులో అప్పర్ కేస్, లోయర్ కేస్ అక్షరాలు రెండూ ఉండాలి. ఒక సంఖ్య, ఒక ప్రత్యేక అక్షరాన్ని కలిగి ఉండాలి (ఉదా. @#$%).స్టెప్ 10: రిజిస్టర్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ ఈ-ఫైలింగ్ అకౌంట్ క్రియేట్ అయ్యి లాగిన్ పేజీకి వెళ్తారు.New to the Income Tax Portal?Registering on the Income Tax Portal is easy! Here’s a quick step-by-step guide to help you register with ease.Become a partner in nation's progress by registering now. Visit - https://t.co/uv6KQUbXGv@nsitharamanoffc @officeofPCM @FinMinIndia… pic.twitter.com/ThzoVrS1g6— Income Tax India (@IncomeTaxIndia) August 28, 2025 -
ఎగుమతులకు ప్రత్యేక వ్యూహాల బూస్ట్..
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఎగుమతిదార్లకు తోడ్పాటు అందించడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం బహుళ వ్యూహాలపై వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. అలాగే ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్) సంబంధించిన పలు నిబంధనలను కూడా సరళతరం చేయడాన్ని కూడా పరిశీలిస్తోందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. సరళతరమైన రిటర్నుల నిబంధనలతో ఈ–కామర్స్ ఎగుమతి హబ్లను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తోందని వివరించారు. ఎగుమతిదార్లకు ద్రవ్యలభ్యతపరంగా తక్షణం ఊరట కల్పించడం, బలహీనంగా ఉన్న రంగాల్లో ఆర్డర్లు .. ఉద్యోగాలు తగ్గిపోకుండా చూడటం, సంస్కరణలతో సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, కొత్త మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, ప్రస్తుత వాణిజ్య ఒప్పందాల నుంచి గరిష్టంగా ప్రయోజనాలను రాబట్టేందుకు ప్రయతి్నంచడంలాంటి విషయాలపై కార్యాచరణ ప్రణాళికలో ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు అధికారి చెప్పారు. ఇందుకోసం వాణిజ్య శాఖ మరో ద్విముఖ వ్యూహం కూడా రూపొందించింది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్లాంటి ప్రస్తుత మార్కెట్లకు ఎగుమతులను పెంచడంతో పాటు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, తూర్పు ఆసియా, తూర్పు యూరప్లోని కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం ఇందులో ఉన్నాయి. పరిశీలనలో ఉన్న మరిన్ని ప్రతిపాదనలు.. → బ్రాండింగ్పరంగా తోడ్పాటు అందించడం. నిబంధనలు, లాజిస్టిక్స్ వ్యయాల భారాన్ని తగ్గించడం. ఎగుమతులతో పాటు దేశీయంగా వినియోగానికి కూడా ఊతమివ్వడం. → స్వల్పకాలిక ప్రణాళికల్లో భాగంగా .. లిక్విడిటీ సమస్యలను తగ్గించడానికి, దివాలా పరిస్థితులను నివారించడానికి, సెజ్లలో యూనిట్లకు నిబంధనలను మరింత సరళతరం చేయడానికి, నిర్దిష్ట దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకోవడం. → మధ్యకాలికంగా పరిశీలిస్తున్న అంశాల్లో వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో (ఎఫ్టీఏ) గరిష్టంగా ప్రయోజనాలను రాబట్టడం, దేశ–విదేశాల్లో కొనుగోలుదారులు–విక్రేతలను మరింతగా అనుసంధానించేందుకు ఎగ్జిబిషన్లలాంటివి నిర్వహించడం, పోటీతత్వాన్ని పెంచేలా జీఎస్టీ సంస్కరణలను పటిష్టం చేయడం ఉన్నాయి. చాలా మటుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) నిర్దిష్ట దేశాలతో టారిఫ్లపరమైన ప్రయోజనాల గురించి అంతగా తెలియకపోవడంతో ఎఫ్టీఏలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనేది మరో ప్రతిపాదన. ఇటీవలి కాలంలో ఆ్రస్టేలియా, యూఏఈ, జపాన్, కొరియాతో పాటు డజను పైగా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పొందడంపై వాటి ప్రయోజనాలను పొందడంపై భారత్ దృష్టి పెట్టనుంది. కొనుగోలుదారులను నేరుగా కలిసేందుకు దుస్తుల రంగానికి సంబంధించి ఆ్రస్టేలియాకు, రత్నాల విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, తోలు ఉత్పత్తుల అంశంపై బ్రిటన్కు ఎగుమతిదార్ల ప్రతినిధి బృందాలను పంపించే అవకాశాలు పరిశీలించనుంది. → ఇక దీర్ఘకాలికంగా చూస్తే.. మన ఎగుమతులకు ఆటంకాలు ఉండని మార్కెట్లపై దృష్టి పెట్టడం, తదనుగుణంగా ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ను (ఈపీఎం) బలపేతం చేసుకోవడం, సెజ్ ని బంధనలను సంస్కరించడం, సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలాంటి అంశాలు ఉన్నాయి. → టారిఫ్ల వల్ల పలు ఎగుమతిదార్లకు రావాల్సిన బాకీలు ఆలస్యం కావడం, ఆర్డర్లు రద్దు కావడంలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని వల్ల ఎగుమతిదార్లకు నిర్వహణ మూలధనం కొరతలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు, ఉద్యోగాలను కాపాడేందుకు పలు చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ప్రతిపాదిత జీఎస్టీ క్రమబద్దీకరణతో దేశీయంగా వినియోగానికి ఊతం లభిస్తుందని, డిమాండ్కి తగ్గట్లుగా ఇక్కడి మార్కెట్లో మరింతగా విక్రయించుకోవడానికి ఎగుమతిదార్లకు అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఓవర్టైమ్ పనిచేస్తోంది: సీఈఏ ఎగుమతి రంగాలను టారిఫ్ల ప్రభావాల నుంచి కాపాడేందుకు తగిన వ్యూహాలను రూపొందించడానికి ఆర్థిక శాఖ, ఇతరత్రా శాఖలు మరింతగా పని చేస్తున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ తెలిపారు. టారిఫ్లు అమల్లోకి వచ్చాక గత మూడు, నాలుగు రోజుల నుంచి పరిశ్రమ ప్రతినిధులతో సమాలోచనలు జరుగుతున్నాయని పరిశ్రమల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. సంక్షోభాలు చిన్నవైనా, పెద్దవైనా, సాధారణంగా వాయిదా వేసుకునే ప్రణాళికలను సత్వరం అమలు చేసేలా దృష్టి పెట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాలను (ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, కుటుంబాలు) ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. ప్రభావిత ఎగుమతి రంగాలు, యూనిట్లకు ఆర్థికంగా, సమయంపరంగా కాస్త వెసులుబాటు లభించేలా చూడాలనేది తక్షణ లక్ష్యంగా ఉందని నాగేశ్వరన్ చెప్పారు.గ్లోబల్ ఎగ్జిబిషన్లకు నిధులు కేటాయించాలి: జీటీఆర్ఐ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలకు నిధులు తగ్గిపోవడంపై మేధావుల సంఘం గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) కింద గ్లోబల్ ఎగ్జిబిషన్లలో ఎగుమతిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా రూ. 2,500 కోట్లు కేటాయించడాన్ని పరిశీలించాలని సూచించింది. ఎంఏఐకి ఈసారి అస్సలు నిధులే విడుదల చేయకపోవడంతో, సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ఏప్రిల్, ఆగస్టుల్లో విదేశీ ఎగ్జిబిషన్లలో ఎగుమతిదార్లు పాల్గొనలేకపోయారని పేర్కొంది. ‘440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే ఎకానమీ గత అనేక సంవత్సరాలుగా రూ. 250 కోట్ల స్కీముతో నెట్టుకొస్తోంది. దీన్ని ఏటా రూ. 2,500 కోట్లకు పెంచాలి. కనీసం ఏడాది ముందుగా ఆ నిధులను విడుదల చేస్తే, అత్యంత ప్రయోజనకరంగా ఉండే గ్లోబల్ ఎగ్జిబిషన్లలో మన సంస్థలు పాల్గొనేందుకు వీలవుతుంది‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. వడ్డీ రాయితీ పథకాన్ని (ఐఈఎస్) పునరుద్ధరించాలని, ఈ–కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్లను తక్షణం పూర్తిస్థాయిలో విస్తరించాలని సూచించారు. 2025 ఏప్రిల్లో ఐఈఎస్ను నిలిపివేయడం వల్ల అధిక వడ్డీల భారంతో ఎంఎస్ఎంఈలు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల కారి్మక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్టైల్స్, తోలు, హస్తకళలు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల్లాంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని శ్రీవాస్తవ చెప్పారు. -
ఆర్బీఐ కఠిన నిర్ణయం: రెండు బ్యాంకులకు జరిమానా
నియమాలను పాటించడంలో విఫలమైన బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (RBI) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకులకు భారీ జరిమానాలు విధించిన ఆర్బీఐ.. తాజాగా బంధన్ బ్యాంక్, నాందేడ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు జరిమానా విధించింది.ఆదేశాలను పాటించలేకపోవడం వల్ల బంధన్ బ్యాంక్కు రూ. 44.7 లక్షల జరిమానా విధించడం జరిగిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ముఖ్యంగా కొంత మంది ఉద్యోగుల వేతనాలను కమిషన్ రూపంలో చెల్లించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. అంతే కాకుండా.. బ్యాంక్ కొన్ని ఖాతాల డేటాకు సంబంధించి బ్యాక్ ఎండ్ ద్వారా మాన్యువల్ జోక్యాన్ని నిర్వహించిందని.. సిస్టమ్లోని నిర్దిష్ట వినియోగదారు వివరాలతో యాక్సెస్ ఆడిట్ ట్రయల్స్/లాగ్లను సంగ్రహించలేదని తెలిపింది.మహారాష్ట్ర కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న 'నాందేడ్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్'కు ఆర్బీఐ రూ. 45వేలు జరిమానా విధించింది. కేవైసీ నిబంధనలను పాటించకపోవడం, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించేటువంటి సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయకపోవడం వంటి కారణాల వల్ల ఈ ఫైన్ విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.ఇదీ చదవండి: ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి సమాధానం!..అంచనాలు మించిన భారత్ జీడీపీరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. బ్యాంకులపై జరిమానాలు విధించినప్పటికీ, ఈ ప్రభావం కస్టమర్ల మీద ఉండదు. అయితే బ్యాంకు కార్యకలాపాలపై ఆంక్షలు విధించినప్పుడు లేదా లైసెన్స్ రద్దు చేసినప్పుడు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కస్టమర్లు.. నిలక్ష్యంగా వ్యవహరించే బ్యాంకులకు కొంత దూరంగా ఉండాలి. -
ద్రవ్యలోటు రూ.4.68 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు (ఆదాయం–వ్యయాల మధ్య అంతరం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై చివరికి (నాలుగు నెలల్లో) రూ.4,68,416 కోట్లకు చేరింది. 2025–26 సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం (రూ.15.69 లక్షల కోట్లు)గా ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. మొదటి నాలుగు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో 29.9 శాతానికి చేరింది. ఈ వివరాలను కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసింది.గత ఆర్థిక సంవత్సరంలో మొదటి నాలుగు నెలల్లో ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో 17.2 శాతంగానే ఉండడం గమనించొచ్చు. జూలై చివరికి ప్రభుత్వానికి రూ.10.95 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో రూ.6.61 లక్షల కోట్లు పన్నుల రూపంలో రాగా, రూ.4.03 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం, రూ.29,789 కోట్లు నాన్ డెట్ రూపంలో (రుణేతర మార్గాలు) వచి్చంది. మొత్తం వ్యయాలు రూ.15.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.12.16 లక్షల కోట్లు రెవెన్యూ వ్యయం కాగా, రూ.3.46 కోట్లు మూలధన రూపంలో ఖర్చయింది. -
జీడీపీ జిగేల్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ పనితీరు అంచనాలను మించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికం (క్యూ1)లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.8 శాతం వృద్ధి సాధించింది. ఇది 5 త్రైమాసికాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం. 2024 జనవరి–మార్చి క్వార్టర్లో వృద్ధి రేటు 8.4 శాతం తర్వాత మళ్లీ గరిష్ట స్థాయి ఇదే. ఆర్బీఐ అంచనా అయిన 6.5 శాతం మించి వృద్ధి నమోదైంది. వ్యవసాయం, తయారీ రంగాలు బలంగా రాణించడం ఇందుకు దోహదం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024–25) క్యూ1లో జీడీపీ 6.5% వృద్ధి చెందగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 7.4% వృద్ధి నమోదైంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ఈ వివరాలను విడుదల చేసింది. ‘2025–26 క్యూ1లో స్థిరమైన ధరల ఆధారంగా అసలైన జీడీపీ (జీవీఏ) రూ.47.89 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. 2024–25 క్యూ1లో ఇది రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది. అంటే 7.8% వృద్ధికి సమానం’ అని ఎన్ఎస్వో తెలిపింది.ఆదుకున్న సాగు, సేవలు.. → ముఖ్యంగా వ్యవసాయ రంగం రాణించింది. 3.7 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ రంగంలో వృద్ధి 1.5 శాతమే. → తయారీ, నిర్మాణ రంగంలో వృద్ధి 7.7%కి పెరిగింది. గత క్యూ1లో ఇది 7.6%. → సేవల రంగం 9.3 శాతం వృద్ధి చెందింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది 6.8 శాతంగా ఉంది. సేవల విభాగంలో వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్, ప్రసార సేవలకు సంబంధించి వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 5.4 శాతం నుంచి 8.6 శాతానికి పెరిగింది. ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, వృత్తి సేవలకు సంబంధించి వృద్ధి రేటు 6.6% నుంచి 9.5 శాతానికి పెరిగింది.→ ముఖ్యంగా మైనింగ్ రంగంలో పనితీరు బలహీనపడింది. ఈ రంగంలో వృద్ధి మైనస్ 3.1%గా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంలో మైనింగ్ రంగం 6.6 శాతం వృద్ధి చెందింది. → ఎగుమతుల వృద్ధి సైతం 6.3 శాతానికి పరిమితమైంది. గతేడాది ఇదే క్వార్టర్లో 8.3 శాతం పెరగడం గమనార్హం.→ జూన్ త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి 5.2 శాతంగా ఉంది. దీంతో ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని భారత్ నిలబెట్టుకుంది.2025–26 జీడీపీ అంచనాల్లో మార్పు లేదు.. అమెరికా ప్రతీకార, పెనాల్టీ సుంకాలు విధించినప్పటికీ, క్యూ1లో బలమైన పనితీరు నమోదైన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 6.3–6.8 శాతం మధ్య ఉంటుందన్న మా అంచనాలను యథావిధిగా కొనసాగిస్తున్నాం. – వి.అనంత నాగేశ్వరన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు -
ట్రంప్ వ్యాఖ్యలకు గట్టి సమాధానం!..అంచనాలు మించిన భారత్ జీడీపీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద ప్రతీకార సుంకాలను విధించడం మాత్రమే కాకుండా.. 'ఇండియా డెడ్ ఎకానమీ' అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి భారత్ గట్టి సమాధానం చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో జీడీపీ అంచనాలను అధిగమించి 7.8% వృద్ధిని నమోదు చేసింది. దీనిని నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ (NSO) శుక్రవారం విడుదల చేసిన డేటా స్పష్టం చేసింది.కేంద్ర గణాంకాల విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత ఆర్ధిక వ్యవస్థ 7.8 శాతంగా నమోదైంది. గత ఐదు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.2026 మొదటి త్రైమాసికంలో వ్యవసాయ రంగం బాగా అభివృద్ధి చెందింది. ఇది జీడీపీ వృద్ధికి దోహదపడింది. అంతే కాకుండా.. మైనింగ్ రంగం, తయారీ, విద్యుత్ రంగాల వృద్ధి కూడా దేశ ఆర్ధిక వ్యవస్థకు బాగా దోహదపడ్డాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో.. భారత్ ముందు వరుసలో ఉంది అనడానికి.. తాజాగా విడుదలైన గణాంకాలే నిదర్శనం. దీన్నిబట్టి చూస్తే భారత్ మరింత వేగంగా వృద్ధి చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.Real #GDP has witnessed 7.8% growth rate in Q1 of FY 2025-26 over the growth rate of 6.5% during Q1 of FY 2024-25.@PMOIndia @Rao_InderjitS @PIB_India @_saurabhgarg@mygovindia @NITIAayog @PibMospi pic.twitter.com/nQw8Iwo9sG— Ministry of Statistics & Programme Implementation (@GoIStats) August 29, 2025 -
రూపాయిని గట్టి దెబ్బ కొట్టిన టారిఫ్లు.. ఆల్టైమ్ పతనం
భారత కరెన్సీ రూపాయి విలువపై అమెరికా టారిఫ్ల దెబ్బ గట్టిగా తగిలింది. భారత వస్తువులపై అమెరికా సుంకాల పెంపుపై ఇన్వెస్టర్ల ఆందోళనలతో శుక్రవారం డాలర్ తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో 87.9650కు పడిపోయింది. భారత్ నుంచి వచ్చే వస్తువులపై ఇటీవల 25% సుంకాన్ని విధించిన అమెరికా ప్రభుత్వం ఆ మొత్తాన్ని 50% కు రెట్టింపు చేసింది. ఇది మార్కెట్ ప్రతిస్పందనను తీవ్రంగా ప్రేరేపించింది.టారిఫ్ల పెంపు ప్రభావం డాలర్- రూపాయి మారక విలువ క్షీణత వరకు ఆగిపోలేదు. ఇతర దేశాల కరెన్సీతో ఇండియన్ రూపాయి మారక విలువ పడిపోయింది. ఆఫ్షోర్ చైనీస్ యువాన్తో పోలిస్తే, రూపాయి విలువ మరింత క్షీణించి, 12.3307 ను తాకింది. ఇది వారంలోనే 1.2%, నెలలో 1.6% క్షీణతను సూచిస్తుంది. గత నాలుగు నెలలుగా రూపాయి మారకం విలువ యువాన్ తో పోలిస్తే దాదాపు 6 శాతం క్షీణించింది.డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 87.9650కి పడిపోవడం అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. డాలతో రూపాయి మారక విలువ ఏడాది కాలంలో 4.24% పడిపోయింది. అమెరికా విధించిన భారీ టారిఫ్ల వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. -
త్వరలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. ఎప్పుడంటే..
జీఎస్టీ శ్లాబ్లను సరళీకరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఈమేరకు వివరాలు వెల్లడించారు. కేంద్రం 5, 18 శాతం జీఎస్టీ శ్లాబ్లను మాత్రమే ఉంచాలని యోచిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో 56వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది. ఇందులో దీనిపై చర్చించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పలు వస్తువులు, సేవల రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.కేంద్రం ప్రతిపాదించిన ఐదు శాతం పన్ను పరిధిలోకి హోటల్ గదుల అద్దెలు, 100 రూపాయల సినిమా టికెట్లు, బ్యూటీ సర్వీసెస్ ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. గ్యాంబ్లింగ్, క్యాసినో, బెట్టింగ్, ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు, రేస్ క్లబ్లపై 40 శాతం పన్ను విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 30 క్యాన్సర్ చికిత్సలో వాడే మందులు, అరుదైన వ్యాధుల ఔషధాలు పూర్తిగా టాక్స్ ఫ్రీ శ్లాబ్లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. మెడికల్ ఆక్సిజన్, అయోడిన్, పొటాషియం ఐయోడేట్ 12% నుంచి 5%కి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రీమియం ఎయిర్ టికెట్లు 18% శ్లాబ్లో, వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు, మైక్రోన్యూట్రియెంట్స్, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లపై 5% జీఎస్టీ, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్స్, సింథటిక్ యార్న్, కార్పెట్స్, టెర్రకోటా వస్తువులు, కొన్ని రకాల ఫుట్వేర్ను 5% జీఎస్టీ శ్లాబ్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. విద్యకు ఉపయోగపడే మ్యాప్స్, అట్లాసులు, షార్పెనర్లు, పెన్సిల్స్, క్రేయాన్స్, ఎక్సర్సైజ్ బుక్స్పై 5% జీఎస్టీ విధిస్తారని అంచనాలున్నాయి. రేట్ల తగ్గింపుపై విపక్ష పాలిత రాష్ట్రాల నాయకులు ఇటీవల డిల్లీలోని కర్ణాటక భవన్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.ఇదీ చదవండి: వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ -
టారిఫ్లతో ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు
భారత ఎగుమతులపై అమెరికా టారిఫ్ల కారణంగా తక్షణం పడే ప్రభావం పరిమితంగానే ఉన్నప్పటికీ.. వీటి తాలూకూ ప్రభావాలు భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వీటిని తప్పకుండా పరిష్కరించాల్సి ఉందని పేర్కొంది. ఈ సమస్యల పరిష్కారానికి భారత్–యూఎస్ మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కీలకమని తన నెలవారీ ఆర్థిక సమీక్షా నివేదికలో పేర్కొంది. అమెరికా 50 శాతం టారిఫ్లు 48 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం చూపించనున్నట్టు అంచనా. అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా ఎగుమతుల్లో వైవిధ్యంపై దృష్టి సారించినట్టు ఆర్థిక శాఖ తెలిపింది.ఇటీవలే యూకే, ఈఎఫ్టీతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్ఏటీ)పై చర్చలను ముగించినట్టు, యూఎస్, ఈయూ, న్యూజిలాండ్, చిలీ, పెరూతో చర్చలు కొనసాగుతున్నట్టు పేర్కొంది. ‘ఈ చర్యల ఫలితాలు కనిపించేందుకు కొంత సమయం పడుతుంది. అధిక టారిఫ్ల కారణంగా అమెరికాకు తగ్గే ఎగుమతులను ఇవి పూర్తి స్థాయిలో భర్తీ చేయకపోవచ్చు’ అని ఆర్థిక శాఖ నివేదిక వివరించింది. బలమైన ఆర్థిక పనితీరు, విధానపరమైన స్థిరత్వం, మౌలిక సదుపాయాలపై అధిక పెట్టుబడులు, భారత సావరీన్ రేటింగ్ను బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి ఎస్అండ్పీ అప్గ్రేడ్ చేయడాన్ని సానుకూలంగా పేర్కొంది. దీనివల్ల రుణ వ్యయాలు తగ్గుతాయని, విదేశీ పెట్టుబడులు మరిన్ని ఆకర్షించొచ్చని అభిప్రాయపడింది. దేశీయంగా సాధారణం కంటే అధిక వర్షపాతం, ఖరీఫ్ సాగు మెరుగ్గా ఉండడం రిటైల్ ద్రవ్యోల్బణాన్ని సమీప కాలంలో నియంత్రణలోనే ఉంచుతాయని అంచనా వేసింది. జీఎస్టీ సంస్కరణలు, పన్నుల తగ్గింపు వంటివి వినియోగాన్ని పెంచుతాయని, వ్యాపార నిర్వహణ సులభతరం అవుతుందని పేర్కొంది.జీడీపీపై అర శాతం ప్రభావంఅమెరికా టారిఫ్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం స్వల్పమేనని వాణిజ్య శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను గుర్తించలేకపోతే అప్పుడు జీడీపీ వృద్ధి రేటుపై 0.50 శాతం మేర ప్రభావం ఉంటుందన్నారు. ఫలితంగా టెక్స్టైల్స్, రత్నాభరణాలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, కెమికల్స్ రంగాలకు ఇబ్బందులు ఎదురుకావొచ్చన్నారు. రష్యా చమురును యూరప్ దేశాలు, చైనా దిగుమతి చేసుకుంటున్నప్పటికీ భారత్పైనే అధిక టారిఫ్లు విధించడం వివక్ష చూపించడమేనన్నారు. ప్రభుత్వం ఈ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమస్యలను గట్టెక్కి, కొత్త మార్కెట్లలో అవకాశాలను సొంతం చేసుకునే దిశగా దేశీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలన్నారు.ఇదీ చదవండి: వైద్య రంగంలో కృత్రిమ మేధ విస్తరణ -
అంతర్జాతీయ ద్రవ్య నిధికి ఆర్బీఐ మాజీ గవర్నర్
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఈ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి కె.సుబ్రమణియన్ స్థానంలో నియమితులైన ఆయన భారత్తోపాటు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు ప్రాతినిధ్యం వహిస్తారు.ఈ కొత్త పాత్ర ద్వారా మూడు దశాబ్దాల క్రితం తన కెరీర్ ప్రారంభించిన ఐఎంఎఫ్కే ఉర్జిత్ పటేల్ తిరిగివచ్చినట్లయింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్ లో డిగ్రీ, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్, యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో పీహెచ్ డీ చేసిన పటేల్ 1990వ దశకం ప్రారంభంలో ఐఎంఎఫ్ లో భారత డెస్క్ పై పనిచేశారు.కొన్నేళ్లుగా పటేల్ పబ్లిక్ పాలసీ, ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్స్, అకడమిక్ విభాగాల్లో విస్తృతమైన పోర్ట్ ఫోలియోను నిర్మించారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)లో ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెండ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్సీ)లో సీనియర్ బాధ్యతలు నిర్వర్తించారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి అధ్యక్షత వహించి బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్ లో సీనియర్ ఫెలోగా పనిచేశారు.2016 సెప్టెంబర్ లో రఘురామ్ రాజన్ స్థానంలో ఉర్జిత్ పటేల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 24వ గవర్నర్ గా నియమితులయ్యారు. 2016 నవంబరులో పెద్దనోట్ల రద్దు తర్వాత ద్రవ్యోల్బణాన్ని లక్ష్యంగా చేసుకుని ఆర్థిక అస్థిరతను నిర్వహించడం సహా పలు గణనీయమైన విధానపరమైన చర్యలు ఆయన తన పదవీకాలంలో చేపట్టారు. సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తి, మిగులు నిల్వలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో బహిరంగ వివాదం తలెత్తడంతో వ్యక్తిగత కారణాలను చూపుతూ 2018 డిసెంబరులో రాజీనామా చేశారు. -
రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!
కొనుగోలు శక్తి రీత్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించే వీలున్నట్లు ఈవై నివేదిక అంచనా వేసింది. వెరసి 2038కల్లా దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 34.2 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నట్లు ఎకానమీ వాచ్ పేరుతో ఆగస్టు నెలకు విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది. ఈ బాటలో 2030కల్లా దేశ జీడీపీ 20.7 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు పేర్కొంది. తగిన చర్యలు చేపట్టడం ద్వారా ఎంపిక చేసిన దిగుమతులపై యూఎస్ విధించిన అధిక టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించుకోగలదని తెలియజేసింది.ఇదీ చదవండి: నెట్వర్క్ విస్తరణలో అమెజాన్వాస్తవిక జీడీపీ వృద్ధిపై 0.1 శాతానికి పరిమితం చేసుకోగలదని వివరించింది. ప్రపంచంలోని 5 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్ అత్యంత శక్తివంతంగా మారుతున్నట్లు పేర్కొంది. పటిష్ట ఆర్థిక మూలాలు, గరిష్ట పొదుపు, పెట్టుబడుల రేటు, సానుకూల జనాభా, ద్రవ్య పరిస్థితుల్లో నిలకడ వంటి అంశాలు ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు వివరించింది. టారిఫ్ ఒత్తిళ్లు, వాణిజ్య మందగమనం వంటి అంతర్జాతీయ అనిశ్చితులున్నప్పటికీ దేశీ డిమాండ్, ఆధునిక టెక్నాలజీలలో సామర్థ్యాల పెంపు తదితరాలు మద్దతివ్వనున్నట్లు తెలియజేసింది. -
అమెరికా టారిఫ్ బెదిరింపులకు లొంగకూడదు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల బెదిరింపులకు భారత్ తలొగ్గరాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. ఇలాంటి వాటికి ప్రజలంతా ఐక్యంగా ఎదురు నిలవాలని, దేశ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీ 44వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భార్గవ ఈ విషయాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన అంశాల్లో తొలిసారిగా టారిఫ్లను ప్రయోగించడం ద్వారా సంప్రదాయ విధానాలు, సంబంధాల విషయంలో దేశాలను పునరాలోచనలో పడేశారన్నారు.ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి మద్దతుగా నిల్చి, దేశ పరువు ప్రతిష్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులపై ఉందని భార్గవ తెలిపారు. అమెరికా మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయేలా, ట్రంప్ సర్కారు భారత ఎగుమతులపై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, దేశీయంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో సంస్కరణలు వేగవంతమైన వృద్ధికి, ఉద్యోగాల కల్పనకి దోహదపడుతుందని భార్గవ తెలిపారు. సంస్కరణలతో చిన్న కార్లపై జీఎస్టీ 18%కి తగ్గుతుందని ఆశిస్తున్నామని, అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే చిన్న కార్ల మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని భార్గవ చెప్పారు. స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా చిన్న కార్లు.. దేశ జనాభాలో సింహభాగం ప్రజలు వ్యక్తిగత అవసరాల కోసం అత్యంత రిసు్కలతో కూడుకున్న ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడుతుంటారని భార్గవ చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఉండే చిన్న కార్లను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. 1950లలో ’కీయి’ కార్లను ప్రవేశపెట్టడం ద్వారా జపాన్ ఇలాంటి సమస్యను పరిష్కరించిందని తెలిపారు. -
టెక్స్టైల్స్కు కష్టకాలం..!
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల కారణంగా అధిక ప్రభావం పడే టెక్స్టైల్స్, వజ్రాల పాలిషింగ్, టైర్ల పరిశ్రమలు ప్రభుత్వం నుంచి విధానపరమైన సాయం కోరుతున్నాయి. ముఖ్యంగా అమెరికా 50 శాతం టారిఫ్లు దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమపై అధిక ప్రభావం చూపించనుంది. మొత్తం టెక్స్టైల్స్ ఎగుమతుల్లో పావు శాతంపై వచ్చే ఆరు నెలల పాటు టారిఫ్ల ప్రభావం ఉంటుందని పరిశ్రమ పేర్కొంది. దేశ వస్త్ర ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. టారిఫ్ల కారణంగా ఆర్డర్లు రద్దు అవుతున్నట్టు తెలిపింది.వచ్చే డిసెంబర్ 31 వరకు సుంకాల్లేకుండా కాటన్ దిగుమతులకు ప్రభుత్వం అనుమతించడం, దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమకు ఉపశమనం ఇవ్వనున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ (సీఐటీఐ) సెక్రటరీ జనరల్ చంద్రిమా ఛటర్జీ చెప్పారు. దీనివల్ల వ్యయాలు తగ్గి కొంత పోటీతత్వం లభిస్తుందన్నారు. ‘వచ్చే 6 నెలలు 20–25% టెక్స్టైల్స్ ఎగుమతులపై ప్రభావం పడొచ్చు’ అని చెప్పారు. 50% టారిఫ్లు టెక్స్టైల్స్, వస్త్ర పరిశ్రమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) చైర్మన్ సుదీర్ శక్రి తెలిపారు. 2024–25లో టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమ ఆదా యం 179 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో ఎగుమతులు 37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 30 శాతం వ్యాపారంపై ప్రభావం: అమెరికా టారిఫ్ల కారణంగా సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ 28–30% మేర (12.5 బిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. 2024–25లో దేశ సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం 16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. అమెరికా, చైనాలో డిమాండ్ బలహీనపడడం, ల్యాబ్లో తయారైన కృత్రిమ వజ్రాల నుంచి పోటీతో గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి దేశీ సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం 40% మేర తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. పాలిపౌడ వజ్రాల పరిశ్రమకు 80 శాతం ఆదాయం ఎగుమతుల నుంచే వస్తోందని.. భారత ఎగుమతుల్లో 35 శాతం వాటాతో అమెరికా కీలక మార్కెట్గా ఉన్నట్టు గుర్తు చేసింది.టైరు... బేజారు!భారత టైర్ల పరిశ్రమకు అమెరికా భారీ టారిఫ్లు పెద్ద ప్రతికూలమని ఆటోమొబైల్ టైర్ల తయారీదారుల సంఘం (ఏటీఎంఏ) పేర్కొంది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు కోసం డిమాండ్ చేసింది. అధిక శాతం టైర్ల ఎగుమతులపై 50 శాతం టరిఫ్లు అమలు కానుండగా, కొన్నింటికి 25 శాతం టారిఫ్ వర్తించనుంది. భారత టైర్ల ఎగుమతుల్లో ఒక్క అమెరికా వాటాయే 17% ఉండడం గమనార్హం. 2024–25లో మొత్తం టైర్ల ఎగుమతుల విలువ రూ.25,000 కోట్లుగా ఉంది. -
ఎగుమతిదారులకు అండ!
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు విధించడంతో దేశీ ఎగుమతిదారులకు మద్దతుగా నిలించేందుకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రుణాలపై మారటోరియం (చెల్లింపులపై తాత్కాలిక విరామం), ఎగుమతి ప్రోత్సాహకాలను అందించడంపై దృష్టి సారించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. తమకు తక్కువ రేట్లపై రుణసాయం అందించాలని ఎగుమతిదారులు ఎప్పటి నుంచో కోరుతుండగా, వారి డిమాండ్లను పరిశీలిస్తున్నట్టు చెప్పా రు.ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందంటూ.. ఈ దిశగా సానుకూల నిర్ణయాలు వెలువడనున్నట్టు ఆ అధికారి చెప్పారు. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, మరిన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక పరమైన మద్దతు చర్యలకుతోడు దేశీ మార్కెట్ విస్తరణ ద్వారా యూఎస్ టారిఫ్ల ప్రభావం అధిగమించేలా చూడనున్నట్టు వివరించారు. ముఖ్యంగా అమెరికా టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ల ఉద్యోగులకు ప్రత్యక్ష నగదు సాయాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘ప్రోత్సాహకాలను ఎలా అందించాలన్నది పరిశీలించాల్సి ఉంది. ఇందుకు ఎంత మొత్తం కేటాయించాలి. రుణ హామీ, తనఖా లేని రుణ పరిమితి పెంపును తొలుత ప్రకటించొచ్చు’ అని ఆ అధికారి తెలిపారు. 2025–26 బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లను ఎగుమతి ప్రోత్సాహకాల కింద ప్రకటించింది.రాయితీ రుణాలు..రుణాలపై వడ్డీ రాయితీని తిరిగి ఐదేళ్ల కాలానికి తీసుకురావాలని ఎగుమతిదారులు కోరుతుండడం గమనార్హం. మూలధన అవసరాలకు వీలుగా రుణాల లభ్యతను పెంచడం, ఏడాది పాటు రుణాల అసలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం తదితర సాయాన్ని అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, టారిఫ్ల కారణంగా ఏర్పడే నష్టం తాత్కాలికమేనని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.ముఖ్యంగా అమెరికా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడిన రొయ్యలు, టెక్స్టైల్స్, తోలు, రత్నాభరణాల పరిశ్రమల నుంచి ఎక్కువ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు 21 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.2024–25లో ఎగుమతులు 86.5 బిలిన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లలో 20% అమెరికాకే వెళ్లాయి. మరోవైపు సవాళ్లతో కూడిన ఈ తరుణంలో ఎగుమతిదారుల ఆందోళనలను పరిష్కరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ హామీ ఇచి్చనట్టు భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రకటించింది. -
కొనసాగిన టారిఫ్ టెన్షన్
ముంబై: అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి రావడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ దాదాపు ఒకశాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 24,501 వద్ద ముగిశాయి. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. బలహీనంగా మొదలైన సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. వినిమయ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.ఒక దశలో సెన్సెక్స్ 774 పాయింట్లు క్షీణించి 80,013 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 24,482 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలహీనపడి 87.58 వద్ద స్థిరపడింది. టారిఫ్ సంబంధిత అనిశ్చితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.⇒ సూచీల పతనంతో రెండు రోజుల్లో రూ.9.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.445.17 లక్షల కోట్లకు దిగివచి్చంది. గురువారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. ⇒ ట్రాన్స్ఫార్మర్ ఉపకరణాల తయారీ సంస్థ మంగళ్ ఎల్రక్టానిక్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.561)తో పోలిస్తే బీఎస్ఈలో అరశాతం డిస్కౌంట్ రూ.558 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 6% క్షీణించింది, చివరికి 4.50% నష్టంతో రూ. 534 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,475.31 కోట్లుగా నమోదైంది. -
ఈపీఎఫ్ఓ 3.0 కీలక ఫీచర్లు.. 8 కోట్ల మందికి ప్రయోజనం
భారతదేశ సామాజిక భద్రతా ఫ్రేమ్వర్క్ను ఆధునీకరించే దిశగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా 8 కోట్లకు పైగా ప్రావిడెంట్ ఫండ్ సభ్యులకు వేగవంతమైన, మరింత పారదర్శక సేవలను అందించడానికి రూపొందించిన డిజిటల్ ప్లాట్ఫామ్ ఈపీఎఫ్ఓ 3.0ను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. వాస్తవానికి ఇది జూన్ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక, ఇతర కారణాలతో ఆలస్యమైంది. అయితే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల సహకారంతో అభివృద్ధి చేసిన ఈ అప్గ్రేడెడ్ సిస్టమ్ అమలు తుది దశలో ఉందని కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు.ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను యాక్సెస్ చేసే విధానం, తమ ఖాతాలను నిర్వహించే పద్ధతుల్లో మార్పులుంటాయని ఆయన చెప్పారు. దీని ద్వారా ఖాతాదారులకు మరింత వేగవంతమైన సదుపాయం కలగబోతుందని పేర్కొన్నారు.ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా రాబోయే మార్పులు..ఏటీఎంల్లో నేరుగా పీఎఫ్ విత్డ్రాతొలిసారిగా ఈపీఎఫ్ సభ్యులు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ను లింక్ చేసి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్ )ను యాక్టివేట్ చేసుకుంటే నేరుగా ఏటీఎంల నుంచి డబ్బులు విత్డా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా నగదు ఉపసంహరణకు జాప్యాన్ని తొలగించడం, వినియోగదారుల డబ్బుకు రియల్ టైమ్ యాక్సెస్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.యూపీఐ ద్వారా తక్షణ ఉపసంహరణఈపీఎఫ్ఓ 3.0 యూపీఐ ప్లాట్ఫామ్లతో అనుసంధానమై, అత్యవసర సమయాల్లో తక్షణ ఉపసంహరణలను అనుమతిస్తుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ వైద్య లేదా ఆర్థిక సంక్షోభాల సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది.ఆన్లైన్ క్లెయిమ్సభ్యులు ఇకపై ప్రాథమిక సేవల కోసం పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే క్లెయిమ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓటీపీ ఆధారిత ఆథెంటికేషన్ ఉపయోగించి వినియోగదారులు చాలా సర్వీసులు పొందవచ్చు.డెత్ క్లెయిమ్ల పరిష్కారంమానవతా దృక్పథంతో ఈపీఎఫ్ఓ డెత్ క్లెయిమ్ల్లో గార్డియన్షిప్ సర్టిఫికెట్ల అవసరాన్ని తొలగించింది. మైనర్ పిల్లల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నిధులు జమ చేస్తే గార్డియన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ప్రతి మైనర్ పిల్లవాడి పేరుతో ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరవాలి. పీఎఫ్, పెన్షన్, ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు ఇది వర్తిస్తుంది. కోర్టు ప్రక్రియలు లేకుండా బాధిత కుటుంబాలకు వేగంగా ఆర్థిక సహాయం అందించడమే దీని లక్ష్యం.డిజిటల్ డ్యాష్బోర్డులుయూజర్ ఇంటర్ఫేస్ ద్వారా నెలవారీ కంట్రిబ్యూషన్ను ట్రాక్ చేయవచ్చు. క్లెయిమ్ స్టేటస్ను మానిటర్ చేయవచ్చు. బ్యాలెన్స్, వడ్డీ అప్డేట్లను రియల్ టైమ్లో తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖ -
అమెరికా సుంకాలు భారత్కు మేల్కొలుపు
భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలు బాధాకరమని, ఏ ఒక్క వాణిజ్య భాగస్వామిపైనా ఎక్కువగా ఆధారపడకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. భారత్కు ఇదో స్పష్టమైన మేల్కొలుపు అని హెచ్చరించారు. భారత వస్తువులపై యూఎస్ 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు.వాణిజ్య సంబంధాలకు ఎదురుదెబ్బ‘ప్రతీకార సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలను దెబ్బతీసింది. భారతదేశం కఠినమైన ఆర్థిక శిక్షలను ఎదుర్కొన్నప్పటికీ చైనా, యూరప్ వంటి రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై యూఎస్ ఇలాంటి విధానాన్ని అనుసరించలేదు. ఇది యూఎస్ విదేశీ వాణిజ్య విధానంలో ద్వంద్వ ప్రమాణాల ఆరోపణలను రేకెత్తిస్తోంది. అమెరికా భౌగోళిక రాజకీయం, వాణిజ్యం, పెట్టుబడులు, ఫైనాన్స్ అన్నీ ఆయుధంగా మలుచుకుంటోంది’ అన్నారు.రష్యా చమురు విధానం‘భారత్ తన రష్యా ముడిచమురు దిగుమతులను కొనసాగించాలి. వాస్తవంగా ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరుగుతుందో స్పష్టంగా తెలియజేయాలి. రిఫైనరీలు అధిక లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ ఎగుమతిదారులు పెరిగిన టారిఫ్ ధరలు చెల్లించాల్సిందే. అందులో ప్రయోజనం పెద్దగా లేకపోతే ఈ కొనుగోళ్లను కొనసాగించాలా వద్దా అనేది ఆలోచించాలి’ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ రష్యా చమురు నుంచి భారత్ లాభపడుతోందని యూఎస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో సహా అమెరికా అధికారులు ఆరోపించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రత్యామ్నాయాలు అవసరం..‘అమెరికా, చైనా సహా ఏదైనా ఒక దేశంపై భారత్ అతిగా ఆధారపడకూడదు. చైనా, జపాన్, అమెరికా లేదా ఎవరితోనైనా కలిసి పనిచేయాలి కానీ, వాటిపై పూర్తిగా ఆధారపడకూడదు. ప్రత్యామ్నాయాలు ఉండేలా చూసుకోవాలి. సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి నిర్మాణాత్మక సంస్కరణలను వేగవంతం చేయాలి. ప్రపంచ సరఫరా గొలుసులకు అనుగుణంగా దేశీయ పోటీతత్వాన్ని పెంచాలి. ఆచరణాత్మకంగా ఉన్న విభాగాల్లో స్వావలంబన సాధించాలి’ అని రాజన్ అన్నారు.ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖ -
భారత్లో యూఎస్ టార్గెట్ అదే..
పెరుగుతున్న ప్రపంచ ఇంధన అనిశ్చితి, మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్దేశానికి అతిపెద్ద ముడి చమురు, సహజ వాయువు సరఫరాదారుగా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు యునైటెడ్ స్టేట్స్ తెలిపింది. భారత్ రష్యా ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) ఇంధన సదస్సులో భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రిన్సిపల్ కమర్షియల్ ఆఫీసర్ జియాబింగ్ ఫెంగ్ ఈమేరకు వివరాలు వెల్లడించారు.ప్రధాన సరఫరాదారుగా మారేందుకు..ఈ సదస్సులో ఫెంగ్ మాట్లాడుతూ..‘ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధి లక్ష్యాలకు మద్దతుగా భారత్తో కలిసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉంది. నాణ్యమైన ప్రపంచ స్థాయి ఉత్పత్తులు, సేవల ఎగుమతి ద్వారా మద్దతు ఇచ్చేందుకు అమెరికా కట్టుబడి ఉంది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారు అయిన భారతదేశానికి ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) ప్రధాన సరఫరాదారుగా మారడానికి యూఎస్ ఎంతో ఆసక్తి చూపుతోంది’ అన్నారు.దౌత్యపరమైన ఒత్తిడిప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రష్యా చమురు దిగుమతులను తగ్గించాలని భారతదేశాన్ని కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఇటీవల దౌత్యపరమైన ఒత్తిళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సదస్సులోని ప్రకటన మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. చమురు, గ్యాస్, అణుశక్తిపై సహకారంతో బలమైన ద్వైపాక్షిక ఇంధన భద్రతా భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి కలిసి రావాలని ఫెంగ్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ గతంలో అమెరికా పర్యటనను హైలైట్ చేశారు. శిలాజ ఇంధనాలతో పాటు గ్రిడ్ ఆధునీకరణ, అణు ఇంధనం, అభివృద్ధి చెందుతున్న క్లీన్ టెక్నాలజీ రంగాల్లో కూడా భారత్తో భాగస్వామ్యం కావడానికి అమెరికా ఆసక్తిగా ఉంది. వీటిలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు (ఎస్ఎంఆర్లు), అధునాతన సహజ వాయువు మౌలిక సదుపాయాలు ఉన్నాయి.ఇంధన భాగస్వామ్యాలు..కీలకమైన ఖనిజాలను ఇరు దేశాలు సంయుక్తంగా భద్రపరచాలని, సోలార్ మాడ్యూల్ ఉత్పత్తిని పెంచాలని, అణువిద్యుత్, స్మార్ట్ గ్రిడ్లపై భారీగా పెట్టుబడులు పెట్టాలని ఐఏసీసీ రీజినల్ ప్రెసిడెంట్ అతుల్ చౌహాన్ సూచించారు. ఐఏసీసీలో క్లైమేట్ ఛేంజ్ అండ్ ఈఎస్జీ ఛైర్మన్ సునీల్ జైన్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య సమీకృత ఎనర్జీ భాగస్వామ్యాలు అవసరమని అన్నారు. భవిష్యత్తులో భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాలకు అణు, ఎస్ఎంఆర్లతో సహా కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో సంప్రదాయ వనరులు కీలకంగా మారుతాయన్నారు.ఇదీ చదవండి: పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖఅమెరికా భారత్పై విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. టారిఫ్లకు భయపడి భారత్ డిమాండ్లకు ఒప్పుకుంటుందని భావించిన ట్రంప్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. భారత్ చౌకగా దిగుమతి చేసుకుంటున్న రష్యా చమురు స్థానంలో యూఎస్ క్రూడ్ దిగుమతులు పెంచాలని ఇటీవల ఒత్తిడి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
పిల్లల ఆధార్ అప్డేట్.. యూఐడీఏఐ లేఖ
పిల్లల ఆధార్ అప్డేట్కు సంబంధించి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటన విడుదల చేసింది. 5-15 సంవత్సరాల వయసు గల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ దేశవ్యాప్తంగా పాఠశాలలకు పిలుపునిచ్చింది. పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం ద్వారా పెండింగ్లో ఉన్న బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేయాలని కోరుతూ యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఎస్ఈ+) అప్లికేషన్లో పాఠశాల పిల్లల ఆధార్కు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్(ఎంబీయూ) స్టేటస్ను అందించడానికి పాఠశాల విద్య విభాగంతో యూఐడీఏఐ చేతులు కలిపింది. ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్లను సకాలంలో పూర్తి చేయడం ఐదేళ్ల వయసు వారికి, 15 ఏళ్ల వయసులో పిల్లలకు అవసరమని యూఐడీఏఐ నొక్కి చెప్పింది.దాదాపు 17 కోట్ల ఆధార్ నంబర్ల విషయంలో తప్పనిసరి బయోమెట్రిక్స్ అప్డేట్ పెండింగ్లో ఉంది. పిల్లల బయోమెట్రిక్స్ను అప్డేట్ చేయకపోవడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రయోజనాలు పొందడానికి, నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ, విశ్వవిద్యాలయ పరీక్షల్లో నమోదు చేసుకోవడానికి అథెంటికేషన్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. యూఐడీఏఐ సీఈఓ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కూడా ఈ పరిస్థితి గురించి తన లేఖలో వివరించారు. ఎంబీయూ శిబిరాలను నిర్వహించడానికి ఆయా ప్రాంతాల మద్దతు కోరారు. ఈ శిబిరాలు పెండింగ్లో ఉన్న ఎంబీయూలను పూర్తి చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు కుమార్ పేర్కొన్నారు. అయితే ఈ శిబిరాలను పాఠశాలలు ఎప్పటిలోపు ఏర్పాటు చేయాలనే దానిపై సమాచారం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: పసిడి ప్రియుల నడ్డి విరిగినట్టే! పెరిగిన తులం ధర -
ఆర్బీఐ బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ
బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఖాతాదారులకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొదుపు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు బ్యాంకింగ్ పద్ధతులకు పారదర్శకతను నిర్ధారించి, దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఖాతాదారులను నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.నిబంధనల్లోని ముఖ్యాంశాలువినియోగదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని సులభతరం చేయడం, బ్యాంకులను మరింత జవాబుదారీగా నిలిపేందుకు ఈ నిబంధనలు తోడ్పడుతాయని ఆర్బీఐ పేర్కొంది.రోజువారీ వడ్డీ లెక్కింపుపొదుపు డిపాజిట్లపై వడ్డీని నెలవారీ లేదా త్రైమాసికంగా కాకుండా ప్రతిరోజూ లెక్కించాలని ఆర్బీఐ తెలిపింది. ఇది తక్కువ డిపాజిట్లపై కస్టమర్లకు స్థిరంగా వడ్డీని సంపాదించేలా చేస్తుంది. ఇది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలపై స్పష్టతమినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే విధించే జరిమానాలను బ్యాంకులు స్పష్టంగా పేర్కొనాలి. ఇది హిడెన్ ఛార్జీలపై అనుమానాలను తొలగిస్తుంది. వినియోగదారులు వారి ఖాతాలకు సంబంధించి సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇస్తుంది.ప్రామాణిక ఉచిత ఏటీఎం లావాదేవీలుఖాతాదారులు అన్ని బ్యాంకుల్లో ఒకే నిర్దిష్ట ఉచిత ఏటీఎం లావాదేవీలకు అర్హులవుతారు. ఉచిత పరిమితి ముగిసిన తర్వాత లావాదేవీలు చేయాలంటే ప్రామాణిక రుసుము వర్తిస్తుంది. ప్రత్యేకించి వివిధ బ్యాంకుల్లో బహుళ ఖాతాలు కలిగి ఉన్నవారికి ఇది స్పష్టతనిస్తుంది.అకౌంట్ పోర్టబిలిటీని సరళీకృతంఆర్బీఐ సేవింగ్స్ ఖాతా పోర్టబిలిటీని అమలు చేయాలని చెప్పింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ మాదిరిగానే వినియోగదారులు తమ బ్యాంకు లేదా శాఖను ఇబ్బంది లేకుండా మార్చడానికి అనుమతిస్తుంది. ఇది ఖాతాదారుల సౌకర్యాన్ని పెంచుతుంది. మెరుగైన సేవలను అందించడానికి బ్యాంకుల మధ్య పోటీని పెంచుతుంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.కొత్త రూల్స్ ఎందుకు?కొంతకాలంగా దేశంలో పొదుపు ఖాతాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాన మంత్రి జన్ధన్ యోజన వంటి ప్రభుత్వ చొరవలతో ఖాతాల సంఖ్య అధికమైంది. అయితే వడ్డీ లెక్కింపు, మినిమమ్ బ్యాలెన్స్ అవసరాలు, ఏటీఎం వినియోగ పరిమితులు, అకౌంట్ ఛార్జీలు వంటి అంశాలను వివిధ బ్యాంకులు నిర్వహించే విధానంలోని అసమానతలున్నాయి. వీటిలో ఏకరూపకత తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిచింది. ఈ అసమానతలను పరిష్కరించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిని అన్ని బ్యాంకులు పాటించాలి.ఇదీ చదవండి: మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా? -
భారత్పై టారిఫ్ల ఎఫెక్ట్: కంపెనీల దివాళా, లక్షల ఉద్యోగాలు ఉష్కాకి!!
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధింపులపై ప్రముఖ భారత మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్లతో సంస్థలు దివాళా తీయడం, వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయేందుకు దారితీయనుందని అన్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా 50శాతం విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలపై మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా స్పందించారు.అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారత్ 50శాతం టారిఫ్ చెల్లిస్తోంది. వీటివల్ల భారత్పై కొంతకాలం ప్రతికూల ప్రభావం పడుంది. పలు సంస్థలు దివాళా తీయోచ్చు. షార్ట్ టర్మ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అంచనా వేశారు.అదనపు టారిఫ్ కారణంగా భారత్ ఉత్పత్తి రంగంపై 30 నుంచి 40 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అజయ్ బగ్గా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా సమీప భవిష్యత్తులో భారతదేశ జీడీపీ 0.5 శాతం నుంచి 1శాతం వరకు తగ్గుతుంది. రూ.5.25 లక్షల కోట్లు నష్టం వాటిల్లనుంది. అలా అని పరిస్థితులు ఇలాగే స్థిరంగా ఉంటాయా? అని ప్రశ్నిస్తే.. లేదనే సమాధానం చెబుతున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఆగస్టు 7న నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించింది. నేటి నుంచి మరో 25శాతం అదనపు సుంకాలు.. మొత్తంగా 50శాతం అదనపు సుంకాలు చెల్లిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న దేశాల జాబితాలో చేరినట్లైంది.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కొనసాగేందుకు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లను ఆపకపోతే భారత్ ఎగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికల్ని భారత్ భేఖాతరు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ చెల్లించాలని ప్రకటించారు. దీంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది. -
ఏపీవైలో 50 లక్షల మంది స్వనిధి లబ్ధిదారులు
అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకం కిందకు 50 లక్షల మంది ప్రధాన మంత్రి స్వనిధి పథకం లబ్ధిదారులను చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ఛైర్మన్ ఎస్ రామన్ ప్రకటించారు. వీధి వర్తకుల కోసం ఉద్దేశించిన పీఎం స్వనిధి పథకం 2020 జూన్ 1న ప్రారంభమైంది. దీని కింద ఒక్కో లబ్ధిదారుడికి తనఖా అవసరం లేకుండా రూ.50వేల రుణ సాయం అందించనున్నారు.ఈ పథకం విజయవంతమైందంటూ.. స్వనిధి పథకం 82 శాతం మంది ఇప్పటికే మొదటి విడత రుణాన్ని పొందడమే కాకుండా, తిరిగి చెల్లించినట్టు రామన్ చెప్పారు. గత మూడేళ్లలో అటల్ పెన్షన్ యోజన పథకం కింద కోటి మంది కొత్త సభ్యులు చేరినట్టు తెలిపారు. ఇందులో 2024–25లోనే 1.17 కోట్ల మంది సభ్యులైనట్టు వెల్లడించారు. ఇందులో 55% మంది మహిళలు ఉన్నట్టు తెలిపారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నాటికి ఏపీవై కింద 50 లక్షల మంది కొత్త సభ్యులు చేరినట్టు ప్రకటించారు.పీఎం స్వనిధిగృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 జూన్ 1న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. పూచీకత్తు లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలను అందించడం దీని లక్ష్యం. దీని ద్వారా పట్టణ వీధి వ్యాపారులకు సాయం చేయాలని భావిస్తున్నారు.రుణ బదిలీలు ఇలా..రూ.10,000 (మొదటి విడత)రూ.20,000 (రెండో విడత, మొదటి విడత తిరిగి చెల్లించిన తర్వాత)రూ.50,000 (మూడో విడత, రెండో విడత చెల్లింపు తర్వాత)వడ్డీ రాయితీ ఉంటుంది.డిజిటల్ ప్రోత్సాహకాలు: యూపీఐ, డిజిటల్ లావాదేవీలకు రివార్డులు ఇస్తారు.లోన్ ప్రాసెసింగ్ ఫీజు లేదు.ఇదీ చదవండి: మార్వాడీలు వ్యాపారంలో ఎందుకు విజయం సాధిస్తారు? -
సినిమా టికెట్లపై 5% జీఎస్టీ!
న్యూఢిల్లీ: సినిమా టికెట్ల ధర రూ.300లోపు వాటిని 5 శాతం జీఎస్టీ కిందకు తీసుకురావాలని సినిమా, మల్టిప్లెక్స్ ఆపరేటర్లు కేంద్రాన్ని కోరారు. దీనివల్ల సినిమా ప్రదర్శనలు సామాన్యులకు అందుబాటులో ఉండడమే కాకుండా.. కరోనా తర్వాత నుంచి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న, సినిమా ప్రదర్శకులకు సాయంగా నిలుస్తుందని మల్టిప్లెక్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఏఐ) పేర్కొంది. ‘‘ప్రస్తుత జీఎస్టీ చట్టంలో రూ.100కు మించిన సినిమా టికెట్లను 18 శాతం శ్లాబు పరిధిలో ఉంచగా, రూ.100లోపు టికెట్లపై 12 శాతం జీఎస్టీ అమలవుతోంది. రూ.100 పరిమితిని రూ.300కు పెంచాలని కోరుతున్నాం. దీంతో రూ.300 వరకూ ఉన్న టికెట్లపై 5 శాతం జీఎస్టీ, అంతకుమించిన ధరలపై 18 శాతం జీఎస్టీ అమలు చేయాలి’’అని ఎంఏఐ ప్రెసిడెంట్ కమల్ జ్ఞన్చందాని పేర్కొన్నారు. రూ.100 పరిమితి ఏడేళ్లుగా అమల్లో ఉందంటూ.. దీన్ని రూ.300కు పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ, ఐఅండ్బీ శాఖను కోరినట్టు చెప్పారు. పరిశ్రమ మనుగడకు, వృద్ధికి మద్దతుగా రూ.300 వరకు ధరలున్న మూవీ టికెట్లపై తక్కువ రేటు విధించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. తమ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించినట్టయితే అప్పుడు రూ.300 వరకు టికెట్లపై రూ.20–25 వరకు ధర తగ్గుతుందన్నారు. సినిమా థియేటర్లలో విక్రయించే ఆహారం, పానీయాలను రెస్టారెంట్ సేవలుగా పరిగణిస్తూ.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయం కల్పించడం లేదన్నారు. దీంతో ఈ సేవలకు గాను తాము చేసిన కొనుగోళ్లపై చెల్లించిన పన్నును సర్దుబాటు చేసుకునే అవకాశం ఉండడం లేదన్నారు. కనుక ఐటీసీ ప్రయోజనం కల్పించాలని కోరారు. 9,000 స్క్రీన్లకు ఎంఏఐ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
పవన విద్యుత్కు మహర్దశ
న్యూఢిల్లీ: భారత్లో పవన విద్యుదుత్పత్తి సామర్థ్యాలు వచ్చే ఐదేళ్లలో రెట్టింపు కానున్నాయి. ప్రస్తుతం 51 గిగావాట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం ఉండగా.. 2030 నాటికి 107 గిగావాట్లకు చేరుకుంటుందని అంతర్జాతీయ పవన విద్యుత్ మండలి (జీడబ్ల్యూఈసీ) తెలిపింది. 2030 నాటికి 100 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. భారత పర్యావరణ అనుకూల ఇంధన ఆకాంక్షలకు పవన విద్యుత్ కీలకంగా ఉండడమే కాకుండా, అంతర్జాతీయంగానూ ప్రభావం చూపిస్తున్నట్టు నివేదికలో పేర్కొంది. కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సెక్రటరీ సంతోష్ కుమార్ సారంగి సమక్షంలో ఈ నివేదికను జీడబ్ల్యూఈసీ విడుదల చేసింది. భారత్ ఇంధన పరివర్తనను తక్కువ ఖర్చుతో విజయవంతంగా సాధించేందుకు పవన విద్యుత్ సాయంగా నిలుస్తుందని తెలిపింది. పవన విద్యుత్ టర్బయిన్ల ఉత్పత్తి పరంగా భారత్ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ప్రపంచ అవసరాల్లో 10 శాతాన్ని భారత్ పరిశ్రమ తీర్చనుందని, 1,54,000 మందికి ఉపాధి కల్పించనుందని వెల్లడించింది. పరిశ్రమ గణాంకాల ప్రకారం గతేడాది భారత్ 3 గిగావాట్ల పవన విద్యుత్ ఎక్విప్మెంట్ను ఎగుమతి చేయగా, అంతర్జాతీయంగా ఎగుమతి మార్కెట్ పరిమాణం 117 గిగావాట్లుగా ఉంది. ఈ ఏడాది 135 గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచ ఎగుమతుల్లో 60 శాతం చైనా సమకూరుస్తోంది. 500 గిగావాట్ల సామర్థ్యం సాధిస్తాం.. 2030 నాటికి శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధిస్తామని కేంద్ర నూతన, పనరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందులో 100 గిగావాట్లు పవన విద్యుత్ రూపంలో ఉంటుందన్నారు. భారత్ కేవలం శుద్ధ ఇంధన సదుపాయాలనే సమకూర్చుకోవడం లేదంటూ భవిష్యత్ను నిర్మిస్తున్నట్టు చెప్పారు. 30 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ప్రాజెక్టుల అమలు వివిధ దశల్లో ఉన్నట్టు సంతోష్ కుమార్ సారంగి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. వచ్చే కొన్నేళ్లలో ఇవి కార్యకలాపాలు మొదలు పెడతాయని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది ఆరు నుంచి ఏడు గిగావాట్ల సామర్థ్యం అదనంగా కార్యకలాపాల్లోకి వస్తుందన్నారు. అమెరికా టారిఫ్లు పునరుత్పాదక ఇంధన ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలపై పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చంటూ, భారత్ నుంచి అమెరికాకు సోలార్, విండ్ ఎగుమతులు పెద్దగా లేవన్నట్టు చెప్పారు. 2030 నాటికి ప్రపంచ విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సగం ఉంటుందని, ఇందులో పవన విద్యుత్ వాటా 20–25 శాతం మేర ఉంటుందని ప్రపంచ పవన విద్యుత్ మండలి ఇండియా చైర్మన్ గిరీష్ తంతి తెలిపారు. -
అదనపు సుంకాల మోత షురూ!
రష్యా నుంచి చమురు కొంటున్నామన్న సాకుతో భారత ఎగుమతులపై అమెరికా ప్రకటించిన 25 శాతం అదనపు సుంకాలు నేటి నుంచే (ఆగస్టు 27) అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 25 శాతానికి ఇవి అదనం కావడంతో టారిఫ్ల భారం 50 శాతానికి పెరిగినట్లవుతుంది. ఫలితంగా ఎగుమతుల్లో ఏకంగా 66 శాతం వాటాతో, కార్మిక శక్తి అత్యధికంగా ఉండే రొయ్యలు, దుస్తులు, తోలు, రత్నాభరణాల్లాంటి ఎక్స్పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది.‘అమెరికాలో వినియోగానికి భారత్ నుంచి వచి్చన ఉత్పత్తులపై అదనపు సుంకాలు ఆగస్టు 27 ఈస్టర్న్ డేలైట్ సమయం 12:01 గం.ల నుంచి (భారతీయ కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 9.31 గం.లు) వర్తిస్తాయి‘ అని అమెరికా ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దీని వల్ల అమెరికా మార్కెట్లో చాలా మటుకు భారతీయ ఉత్పత్తులకు చోటు లేకుండా పోతుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మనకన్నా తక్కువ సుంకాలు వర్తించే బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, కాంబోడియా, ఇండొనేషియా లాంటి దేశాలతో పోటీ పడే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తుల్లాంటి 30 శాతం ఎగుమతులకు మాత్రమే ప్రస్తుతం మినహాయింపు ఉంటుంది. అమెరికా వాణిజ్య గణాంకాల ప్రకారం గతేడాది భారత్ నుంచి ఎగుమతులు 91.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, జీఎస్టీ రేట్ల సవరణతో దేశీయంగా వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అమెరికా సుంకాల భారం పడినప్పటికీ భారత్ వృద్ధిపై పెద్దగా ప్రభావం ఉండదని ఆర్థికవేత్తలు తెలిపారు. ఈసారి 49 బిలియన్ డాలర్లకు డౌన్.. టారిఫ్ల భారం వల్ల అమెరికాకు 66 శాతం ఎగుమతులపై (దాదాపు 60.2 బిలియన్ డాలర్ల విలువ) ప్రభావం పడుతుందని మేధావుల సంఘం జీటీఆర్ఐ తెలిపింది. ‘ఇటీవలి కాలంలో భారత్కి తగిలిన అత్యంత తీవ్రమైన వాణిజ్య షాక్లలో ఇదొకటి. 86.5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతుల్లో మూడింట రెండొంతుల వాటిపై భారీ స్థాయిలో 50 శాతం టారిఫ్లు విధించడం వల్ల టెక్స్టైల్స్, రత్నాభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్ మొదలైన కార్మిక శక్తి ఎక్కువగా ఉండే రంగాలు పోటీని దీటుగా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడి ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ రంగాల నుంచి ఎగుమతులు 70 శాతం పడిపోయి 18.6 బిలియన్ డాలర్లకు క్షీణించవచ్చు. వేల కొద్దీ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది’ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఎగుమతులు గణనీయంగా 49.6 బిలియన్ డాలర్లకు పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఒకవేళ తర్వాతెప్పుడో టారిఫ్లను సవరించినా.. అప్పటికే ఆలస్యమవుతుందని, చైనా, వియత్నాం, మెక్సికోతో పాటు ఆఖరికి పాకిస్తాన్, నేపాల్లాంటి దేశాలు కూడా మన స్థానాన్ని ఆక్రమించేసే అవకాశం ఉందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. తిరుపూర్, సూరత్లో నిల్చిపోయిన ఉత్పత్తి.. సుంకాల పెంపు కారణంగా తిరుపూర్, నోయిడా, సూరత్లోని దుస్తుల తయారీ సంస్థలు ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ఆదాయ వృద్ధి సగానికి పడిపోయి 3–5 శాతం స్థాయికి పరిమితం కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. దీంతో కంపెనీలు యూరోపియన్ యూనియన్, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లాంటి ఇతరత్రా మార్కెట్ల వైపు చూడాల్సి ఉంటుందని వివరించింది. సిబ్బంది.. ఉత్పత్తి కోత .. అదనపు టారిఫ్ల మోత మొదలవుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) స్పష్టత వచ్చే వరకు ఉత్పత్తిని నిలిపివేసి, సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తోలు, పాదరక్షల పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మనకు అమెరికానే అతి పెద్ద మార్కెట్ కాబట్టి ఆభరణాలు, వజ్రాల రంగంలో ఉద్యోగాల కోత తప్పదు’ అని రత్నాభరణాల ఎగుమతిదారు ఒకరు తెలిపారు. ఇలాంటి భారీ టారిఫ్లను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ఎగుమతి వ్యూహం అవసరమని పేర్కొన్నారు. వడ్డీ సబ్సిడీ, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, సకాలంలో జీఎస్టీ బకాయిలను రిఫండ్ చేయడం, ప్రత్యేక ఆర్థిక మండలి చట్టాన్ని సంస్కరించడం తదితర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 10.3 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే టెక్స్టైల్స్ పరిశ్రమ, టారిఫ్ల మోత వల్ల అత్యధికంగా నష్టపోనుందని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ తెలిపారు. అనిశ్చితి.. సవాళ్లుకొన్ని ఉత్పత్తుల విషయంలో సగానికి పైగా ఎగుమతులకు అమెరికా గమ్యస్థానంగా ఉంటోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవడం సవాలుగా మారనుంది. ప్రధానంగా సోలార్ మాడ్యూల్స్ ఎక్స్పోర్ట్స్లో 98% అమెరికా వాటా ఏకంగా 98%గా (1.6 బిలియన్ డాలర్లు) ఉంది. బ్రిటన్, యూఏఈ, ఆ్రస్టేలియా లాంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) కుదుర్చుకున్నప్పటికీ ఆ మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తులను తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల పెద్దగా ఊరట ఉండకపోవచ్చు. అమెరికాపై అత్యధికంగా ఆధారపడే 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండే ఉన్ని కార్పెట్లు, బెడ్ లినెన్ ఎగుమతులకూ రిసు్కలు నెలకొన్నాయి. సిమెంటు, ఆరి్టఫిషియల్ స్టోన్స్ 88 శాతం ఎగుమతులకు అమెరికానే గమ్యస్థానంగా ఉంటోంది. రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం (సుమారు 420 మిలియన్ డాలర్లు) అగ్రరాజ్యానికే వెళ్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లపై ఫోకస్.. ఎగుమతుల కోసం అమెరికాపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేని ఉత్పత్తులు కూడా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో వీటి విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉంటోంది. ఇంద్రనీలం, కెంపులు, న్యూమాటిక్ టైర్లలాంటివి వీటిలో ఉన్నాయి. వీటిని వేరే మార్కెట్ల వైపు మళ్లించే అవకాశం ఉంటుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
మార్కెట్ విస్తరణకు ఈక్వెడార్తో దోస్తి?
అమెరికా ఇటీవల భారత్పై విధించిన సుంకాల నేపథ్యంలో దేశీయ రొయ్యల ఎగుమతిదారులు ఆందోళన చెందకూడదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. భారత రొయ్యలకు అమెరికా మార్కెట్కు కీలకమే అయినా అందుకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్కెట్లను అన్వేషించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈక్వెడార్ను పరిశీలించవచ్చని సూచిస్తున్నారు.అమెరికా ప్రభుత్వం సీఫుడ్తో సహా వివిధ రకాల భారతీయ దిగుమతులపై 25% సుంకాన్ని అదనంగా విధించింది. దాంతో ఇది 50 శాతానికి చేరింది. భారతదేశ సీఫుడ్ ఎగుమతిదారులకు, ముఖ్యంగా రొయ్యల రంగంలోని వారికి ఈ నిర్ణయం తీవ్ర ఆందోళనకు దారితీసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికాకు చేసిన సుమారు 2.5 బిలియన్ డాలర్ల విలువైన సీఫుడ్ ఎగమతుల్లో రొయ్యలు సుమారు 92% వాటాను కలిగి ఉన్నాయి.అమెరికాకు ప్రత్యామ్నాయ మార్కెట్2030 నాటికి సీఫుడ్ ఎగుమతుల్లో 18 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఎంపీఈడీఏ)కు యూఎస్ టారిఫ్లు సవాలుగా మారాయి. అమెరికా కొన్నేళ్ల నుంచి భారతదేశ సీఫుడ్ కొనుగోలుదారుగా ఉంది. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా తయారయ్యాయి. దేశంలో ఉత్పత్తవుతున్న రొయ్యలకు అమెరికాకు ప్రత్యామ్నాయంగా ఇతర మార్కెట్లను అన్వేషించాలని నిపుణులు చెబుతున్నారు.మెరుగైన భాగస్వామిగా ఈక్వెడార్?భారత్తో వాణిజ్య-స్నేహపూర్వక దేశాల్లో రొయ్యల మార్కెట్ను విస్తరించాలని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఈక్వెడార్ భారత రొయ్యల మార్కెట్కు మెరుగైన భాగస్వామిగా నిలుస్తుందంటున్నారు. ఈక్వెడార్ ఇప్పటికే రొయ్యల ఉత్పత్తిలో గ్లోబల్ పవర్హౌజ్గా ఉంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసులు, బలమైన ఎగుమతి నెట్వర్క్ ఉంది. ఫీడ్ మిల్లులు, హేచరీలు, అధునాతన ప్రాసెసింగ్ యూనిట్లు, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఈక్వెడార్లో మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు.భాగస్వామ్యం-వ్యూహాత్మకంభారత్, ఈక్వెడార్ రెండూ ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ ధర రొయ్యల ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. మెరుగైన నిర్వహణ సామర్థ్యం, తక్కువ ఖర్చుతో కూడిన వ్యవసాయ పద్ధతులకు ప్రసిద్ధి చెందిన భారతీయ కంపెనీలు ఈక్వెడార్ ప్రస్తుత పద్ధతులతో బాగా సమన్వయం చేయగలవని నిపుణులు నమ్ముతున్నారు. భారతదేశం ప్రధానంగా మెరుగైన విస్తృత వ్యవస్థలను ఉపయోగిస్తుండగా, ఈక్వెడార్ సెమీ ఇంటెన్సివ్ నమూనాలపై ఆధారపడుతుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు అవకాశం లభిస్తుంది. ఈక్వెడార్లో రొయ్యల పెంపకంలో ఉత్పాదకత, సుస్థిరతను పెంచడానికి భారతీయ సంస్థలు ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులను అందించగలవని మార్కెట్ నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి: రెండు నెలలుగా పాకిస్థాన్కు ఫార్మా ఎగుమతులు బంద్ -
రెండు నెలలుగా పాకిస్థాన్కు ఎగుమతులు బంద్
భారత్ నుంచి పాకిస్థాన్కు చేసే ఫార్మా ఎగుమతులు రెండు నెలలుగా కస్టమ్స్ వద్ద నిలిచిపోవడంతో భారత ఔషధ ఎగుమతిదారులు అనిశ్చితితో సతమతమవుతున్నారు. ఫార్ములేషన్లు, వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ)తో సహా పాకిస్థాన్కు ఏటా 200 మిలియన్ డాలర్లకు పైగా విలువైన ఫార్మా ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది. పాకిస్థాన్తో భారతదేశం 2025 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో 18% వృద్ధిని నమోదు చేసింది. అయితే 2025 మే తర్వాత కస్టమ్స్ అనుమతులు నిలిపివేయడంతో దేశీయ ఎగుమతిదారులు ఆందోళన చెబుతున్నారు.కశ్మీర్లో పర్యాటకులపై దాయాది దేశం ఉగ్రదాడి, ఆ తర్వాత సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రతిస్పందనగా భారత్ అధికారికంగా పాకిస్థాన్తో అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. సస్పెన్షన్ తర్వాత కూడా ఫార్మా ఎగుమతులు కొంతకాలం కొనసాగినప్పటికీ, అధికారిక వివరణ లేకుండా ఫార్మా ఎగుమతులు కొద్దికాలంలోనే నిలిచిపోయాయి. పాకిస్థాన్తో ట్రేడ్ సస్పెన్షన్ తర్వాత కొన్ని వారాల పాటు ఎగుమతులను కొనసాగించామని, సాధారణంగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని భావిస్తున్నట్లు హైదరాబాద్కు చెందిన ఫార్మా కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కానీ కస్టమ్స్ క్లియరెన్స్ అకస్మాత్తుగా ఆగిపోయిందని, ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రాలేదని చెప్పారు.‘ఔషధ ఎగుమతులపై నిషేధాన్ని సాధారణంగా మానవతా ప్రాతిపదికన ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక ఆంక్షల నుంచి మినహాయిస్తారు. అయితే ఇప్పటివరకు బహిరంగంగా ఎటువంటి అధికారిక నిషేధం లేదా నోటిఫికేషన్ జారీ చేయలేదు. దాంతో ఎగుమతుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ సహా కీలక ఫార్మా హబ్ల్లో ఎగుమతిదారులు ఆర్థిక, కాంట్రాక్టు చిక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’ అని సీనియర్ అధికారి చెప్పారు.ఈ సమస్యకు పరిష్కారంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఫార్మెక్సిల్) గత నెలలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్(డీజీఎఫ్టీ)కి అధికారిక వినతిపత్రాన్ని సమర్పించింది. పాకిస్థాన్కు ఔషధ ఎగుమతులను నిషేధించడం లేదా పరిమితం చేయడంపై ఏదైనా అధికారిక నోటిఫికేషన్ ఉందా?.. ఉంటే కంపెనీలకు స్పష్టమైన కటాఫ్ తేదీ వివరాలు ఏవైనా ఉన్నాయా అని వివరణ కోరింది. దీనిపై డీజీఎప్టీ నుంచి స్పష్టత రావాల్సి ఉందని ఫార్మెక్సిల్ ప్రతినిధి తెలిపారు. ఇదీ చదవండి: బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు -
బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం సంస్థలకు ఆర్బీఐ ఆదేశాలు
బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపర్టర్లు నిర్వహిస్తున్న ఏటీఎంల్లో తప్పకుండా రూ.100, రూ.200 నోట్లు ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్ల డినామినేషన్కు సంబంధించి ఇప్పటికే చాలా ఏటీఎంల్లో ప్రత్యేక సదుపాయాలు, సామర్థ్యం ఉన్నందున ఇతర మార్పులు అవసరం లేదని చెప్పింది.ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్లు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. వినియోగదారులు, చిరు వ్యాపారాలను ప్రభావితం చేసే ఈ డినామినేషన్ నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇకపై ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్లు విరివిగా అందుబాటులోకి రానున్నాయి. అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు ఈ డినామినేషన్లను కనీసం ఒక క్యాసెట్ ద్వారా పంపిణీ చేయాలని ఆర్బీఐ ఆదేశాల్లో తెలిపింది.ఇదీ చదవండి: రైల్వే ట్రాక్పై సోలార్ ఎనర్జీ తయారీ!2025 సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఏటీఎంలు, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలు ఈ నోట్లను పంపిణీ చేయాలి. ఈ నోట్ల డినామినేషన్ల కోసం బ్యాంకులు కొత్తగా యంత్రాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ఏటీఎంలకు సర్దుబాట్లు చేస్తే సరిపోతుందని చెప్పింది. -
సులభతర జీఎస్టీ నిర్మాణం: కేంద్రానికి సీఐఐ సూచనలు
దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు వీలుగా కీలక సంస్కరణల అజెండాను భారతీయ పరిశ్రమల సమాఖ్య కేంద్ర ప్రభుత్వం ముందుంచింది. సులభతర జీఎస్టీ నిర్మాణం ఉండాలంటూ అందులోకి పెట్రోలియం, రియల్ ఎస్టేట్ను కూడా చేర్చాలని సూచించింది. జాతీయ స్థాయిలో ఉపాధి, తాత్కాలిక కార్మికుల పని విధానాలను తీసుకురావాలని కోరింది. ‘పోటీతత్వంతో కూడిన భారత్ కోసం విధానాలు’ పేరుతో తన నివేదికలో 250కు పైగా సిఫారసలు చేసింది. ఇందులో 14 కీలక సంస్కరణల విభాగాలనూ ప్రస్తావించింది.2047 నాటికి వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్య సాధనకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై పరిశ్రమల నేతలు, ఆర్థికవేత్తలు, విధానపరమైన నిపుణులతో సంప్రదింపుల అనంతరం సీఐఐ ఈ నివేదికను రూపొందించింది. ద్రవ్య క్రమశిక్షణ, ద్రవ్యోల్బణం నియంత్రణ, అధునాత గణాంకాల విధానాలు, వ్యూహాత్మకం కాని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం, సావరీన్ వెల్త్ ఫండ్ ఏర్పాటు, స్వల్ప ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించకపోవడం, సకాలంలో అనుమతులు, సింగిల్ విండో అనుమతులు, రెండో తరం దివాలా అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) సంస్కరణలు, క్రమబద్ధీకరణతో కూడిన కార్మిక చట్టాలు, కనీస వేతన కార్యాచరణ, వివాదాలను వేగంగా పరిష్కరించడం వంటి సూచనలు ఈ నివేదికలో ఉన్నాయి.ఇక ఇంధన రంగానికి సంబంధించి.. పోటీతో కూడిన టారిఫ్లు, క్రాస్ సబ్సిడీని తొలగించడం, బలమైన ట్రాన్స్మిషన్ నెట్వర్క్లు, న్యూక్లియర్ విద్యుత్లో ప్రైవేటు రంగానికి చోటు కల్పించడం, గ్రీన్ హైడ్రోజన్ వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలను సూచించింది. ఈ కామర్స్ ఎగుమతులకు సంబంధించి ప్రత్యేక విధానం, మూలధన మద్దతుతో తయారీకి ఊతం, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు, రవాణా అనుసంధానత తదితర చర్యలను తన నివేదికలో ప్రస్తావించింది. ప్రభుత్వ సంస్కరణలకు అనుగుణంగానే..ఈ నివేదికపై సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ మాట్లాడుతూ.. ‘‘ఈ సిఫారసులు ప్రభుత్వ సంస్కరణల పథానికి అనుగుణంగా ఉన్నాయి. అంతేకాదు సాహసోపేత, పరివర్తనాత్మక మార్పు కోసం ప్రధాని ఇచ్చిన పిలుపునకు మద్దతుగా ఉన్నాయి. భారత పోటీతత్వం కోసం తీసుకోవాల్సిన చర్యలు, విధాన నిర్ణేతలకు తాజా ఐడియాలు ఇందులో ఉన్నాయి’’అని పేర్కొన్నారు. ఈ చర్యలు వృద్ధిని వేగవంతం చేస్తాయని, ఉపాధి కల్పనను విస్తృతం చేస్తాయని, వికసిత్ భారత్ దిశగా చేరువ చేస్తాయని సీఐఐ అభిప్రాయపడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి భారత్ చేరువ అవుతున్నందున.. అంతర్జాతీయంగా మరింత పోటీ పడేందుకు వీలుగా ఈ సంస్కరణలు అవసరమని సీఐఐ మాజీ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ సైతం అభిప్రాయపడ్డారు. -
జీఎస్టీ తగ్గాకే కొందాంలే..!
సాక్షి, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత సీజన్లో ఆఫర్లు బాగున్నాయని గోపాల్ కొత్తగా మారుతీ బలెనో కొనుక్కుందామని బుక్ చేశారు. అడ్వాన్స్ పేమెంట్ కూడా చేశారు. కానీ, అకస్మాత్తుగా కొనుక్కోవడాన్ని వాయిదా వేసుకున్నారు. అటు డీలరు రోజూ ఇంకాస్త కట్టేసి కారును తీసుకెళ్లండంటూ వెంటబడుతున్నప్పటికీ రేపు, మాపు అంటూ సాగదీస్తున్నారే తప్ప డీల్ పూర్తి చేయడం లేదు. గోపాలే కాదు వాహనాల కొనుగోలు నిర్ణయాలను చాలా మంది ఇలాగే వాయిదా వేసుకుంటున్నారు. కొత్తగా ప్రతిపాదించిన జీఎస్టీ విధానంలో కార్లపై పన్నులు తగ్గి, మరింత ప్రయోజనం లభించనుండటమే ఇందుకు కారణం. ఇది కొనుగోలుదారులపరంగా చూస్తే బాగానే ఉన్నప్పటికీ వాహనాల డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనివల్ల పండుగ సీజన్ అంతా తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన చెందుతున్నారు. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండింటికి తగ్గించేట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. దీపావళి కానుకగా దీన్ని అమల్లోకి తేవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే, దీన్ని ఆ తర్వాతెప్పుడో అమలు చేస్తామంటూ, పండుగ సీజన్లో ముందుగా ప్రకటించడమే ప్రస్తుతం తంటా తెచి్చపెట్టింది. ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం 5, 12, 18, 28గా ఉన్న శ్లాబుల స్థానంలో ఇకపై 5, 18 శ్లాబులు మాత్రమే ఉంటాయి. నిర్దిష్ట ఉత్పత్తులకు మాత్రం 40% ఉంటుంది. వాహనాల విషయం తీసుకుంటే.. ప్రస్తుతం వాటిపై జీఎస్టీ 28 శాతంగా ఉండగా, రకాన్ని బట్టి 1 నుంచి 22 శాతం వరకు కాంపన్సేషన్ సెస్సు కూడా ఉంటోంది. ఫలితంగా చిన్న పెట్రోల్ కార్లపై 29 శాతం నుంచి మొదలుకుని ఎస్యూవీలకు 50 శాతం వరకు జీఎస్టీ వర్తిస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చే జీఎస్టీ విధానంతో వాహనాలపై జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 3–4న సమావేశం కానుంది. ఎకాయెకిన 10% మేర పన్ను భారం తగ్గితే గణనీయంగా మిగులుతుంది కాబట్టి వాహన కొనుగోలుదారులు.. కొత్త జీఎస్టీ వచ్చాకే కొనుక్కుందాములే అని వాయిదా వేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు డీలర్లకు సంకటంగా మారింది. సరిగ్గా పండుగ సీజన్లో ఇలా చేయడం వల్ల అమ్మకాలు తగ్గిపోతాయని భయపడుతున్నారు. పండుగ సీజన్పై ఆశలు పెట్టుకుని ఉత్పత్తిని భారీగా పెంచుకోగా, అమ్మకాలు నెమ్మదిస్తే, నిల్వలు పేరుకుపోతాయని కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి.కొత్త రేట్లను వెంటనే అమలు చేయాలి: ఎఫ్ఏడీఏకొత్త జీఎస్టీ రేట్లను సత్వరం అమల్లోకి తేవాలంటూ కేంద్రానికి ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ విజ్ఞప్తి చేసింది. జీఎస్టీపై ప్రకటన వల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కి ఎఫ్ఏఐడీఏ లేఖ రాసింది. దీని ప్రకారం ఓనం (ఆగస్టు 26), వినాయక చవితి (ఆగస్టు 27), అక్టోబర్లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా డీలర్లు గణనీయంగా వాహనాల నిల్వలను పెంచుకున్నారు. అయితే, జీఎస్టీ క్రమబదీ్ధకరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేస్తుండటంతో పాటు, కొత్త రేట్ల వివరాల గురించి డీలర్లను అడుగుతున్నారు. దీంతో పండుగ అమ్మకాలు మొత్తం తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కొత్త రేట్లను ప్రకటించిన తర్వాత దీపావళి సందర్భంలో మాత్రమే అమ్మకాలు పుంజుకునే అవకాశం నెలకొంది. ‘కాబట్టి జీఎస్టీ మండలి ప్రధాన పండుగల కన్నా కాస్త ముందుగానే సమావేశమై, కొత్త రేట్లను ప్రకటించాలని అభ్యర్థిస్తున్నాం. దీనివల్ల దీపావళికే పరిమితం కాకుండా సీజన్ ఆసాంతం డిమాండ్ ఏర్పడుతుంది. ఇటు పరిశ్రమకు అటు కొనుగోలుదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది‘ అని లేఖలో ఎఫ్ఏడీఏ తెలిపింది. ఫైనాన్సింగ్ వ్యవధిని పెంచాలి.. మరోవైపు, నిల్వలను సమకూర్చుకునేందుకు తీసుకున్న స్వల్పకాలిక ఫైనాన్సింగ్ తిరిగి చెల్లింపు వ్యవధిని అదనంగా 30–45 రోజుల వరకు పొడిగించేలా బ్యాంకులు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలను (ఎన్బీఎఫ్సీ) ఆదేశించాలని ఎఫ్ఏడీఏ కోరింది. సాధారణంగా 45–60 రోజుల వరకు ఈ వ్యవధి ఉంటుంది. కానీ కొత్త జీఎస్టీ రేట్ల కోసం ఎదురుచూపులతో అమ్మకాలు మందగిస్తే, డీలర్లకు ఆర్థికంగా పెనుభారం పడుతుంది కాబట్టి ఈ మేరకు వెసులుబాటు కల్పించాలని ఎఫ్ఏడీఏ వివరించింది. ఎఫ్ఏడీఏలో దేశవ్యాప్తంగా దాదాపు 15,000 డీలర్ ప్రిన్సిపల్స్, సుమారు 30,000 డీలర్లకు సభ్యత్వం ఉంది. -
ట్యాక్స్ లేదన్నారు.. 8 లక్షలకే పన్ను కట్టమంటున్నారే..
‘‘పన్నెండు లక్షలు దాటకపోతే ట్యాక్స్ లేదన్నారు. రూ. 8 లక్షల ఆదాయానికే పన్ను కట్టమంటున్నారు’’ అని విసుక్కున్నాడు వీరభద్రం తన కన్సల్టెంటు మీద. ‘‘మనం కడుతున్నది 2025 మార్చి 31 నాటికి సంబంధించినది సార్’’ అని కన్సల్టెంట్ చెప్పారు. ‘‘అంటే?’’ .. ఎదురు ప్రశ్న వేశాడు వీరభద్రం.పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రసంగం, బిల్లు పాస్ అయిన వైనం 2026 మార్చి 31తో పూర్తయ్యే సంవత్సరానికి వర్తిస్తుందని ఎన్నో ఉదాహరణలతో చూపించిన తర్వాత, అశక్తుడై, ప్రతిఘటనతోనే ఒప్పుకున్నాడు వీరభద్రం.నికర ఆదాయంలో నుంచి బేసిక్ లిమిట్ తీసివేసి, మిగతా మొత్తంలో నుంచి మొదటి రూ. 3 లక్షలకు నిల్ అని లెక్క కట్టారు గోవిందరావుగారు. నా చేత ఎక్కువ పన్ను కట్టిస్తున్నారని వాపోయారు. ఎన్నో ఉదాహరణలను చూసిన తర్వాత కూడా ‘‘ఇదంతా మాకు ఏం అర్థం అవుతుంది లెండి. మీరెంత అంటే అంతే’’ అని మర్యాదగా వత్తాసు పలికారు.‘‘లాస్ట్ ఇయర్ ఇంత పన్ను కట్టలేదు. ఈసారి ఎక్కువ కడుతున్నాం’’ అని హెచ్చరిక చేశాడు హరనాధం. ఆయన ఇచ్చిన ఫీజు రూ. 2,000కు మరో రెండు గంటలు వెచ్చించక తప్పదని నిర్ణయించుకున్నాడు కన్సల్టెంటు కామేశం గారు.గత ఆర్థిక సంవత్సరం, అంతక్రితం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీతం, ఇంటద్దె, ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ, సేవింగ్స్ అకౌంట్పై వడ్డీ, మ్యుచువల్ ఫండ్ వ్యవహారాలు, 80సీ సేవింగ్స్, 80డీ మెడిక్లెయిం, 80జీ డొనేషన్లు.. అన్నీ చెక్ చేసి, నికర ఆదాయం, పన్ను శ్లాబులు, పన్ను రేట్లు, పన్ను భారం, సెస్సు, సర్చార్జీ.. ఏదీ వదిలిపెట్టకుండా వివరించారు. చివరికి కన్విన్స్ అయ్యాడు హరనాధం.‘‘నాకు నమ్మకం ఉంది. మీరెందుకు తప్పు చేస్తారు’’ అని ఓ కితాబిచ్చి కదిలాడు. వెళ్తూ.. వెళ్తూ.. ‘‘మా బావమరిదికి నాకు ఆదాయం ఇంచు మించు సమానమే. వాడేమీ కట్టలేదన్నాడు. అందుకనే అడిగాను’’ అంటూ సాగదీశాడు. ‘‘కొత్త పద్ధతో, పాత పద్ధతో.. ఏది తక్కువైతే అది తగలెట్టండి’’ అని వ్యంగ్యంగా అన్నాడు వామనరావు. ‘‘అయ్యా ఏది తక్కువైతే అదే కట్టించండి’’ అని వేడుకున్నాడు వెంకటేశం.‘‘పాఠక మహాశయులైన మిమ్మల్ని మేము వేడుకుంటున్నాం. కంపేర్ చేసి, కన్విన్స్ కండి’’.. ఇది మా విన్నపం. నిజమే మాస్టారు!! మీరు నైబర్తో, ఓనర్తో, మీ ఇంట్లో అద్దెకున్న వారితో, అన్నతో, తమ్ముడితో, వియ్యంకుడితో, మార్నింగ్ వాక్ ఫ్రెండుతో, యోగా కొలీగ్తో, మీ డాక్టర్గారి దగ్గరకొచ్చే పేషంటు ఫ్రెండుతో కంపేర్ చేసుకోవద్దండి. అందరి లెక్కలు ఒకలాగా ఉండవు. తేడాలుంటాయి. కాబట్టి, ఎంచక్కా మీరు మీ ఇన్కంతో మాత్రమే కంపేర్ చేసుకోండి.2024 మార్చి 31కి సంబంధించిన ఆదాయం, అలాగే 2025 మార్చి 31కి వచ్చిన ఆదాయండిడక్షన్లు.. అంశాలవారీగా టీడీఎస్ వివరాలు టీసీఎస్ వివరాలు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు 2024 మార్చి 31కి ఏ పద్ధతిలో చెల్లించారు 2025 మార్చి 31కి ఏది ఫాలో అవుతున్నారు 2025 మార్చి 31 నాటికి రెండు పద్ధతుల్లోనూ పన్ను భారం లెక్కించి, కంపేర్ చేయండి. ఏ ఆదాయాన్నైనా మర్చిపోయారా గత సంవత్సరం వచ్చిన ఆదాయం ఏదైనా ఈ సంవత్సరంలో రాలేదా అలాగే డిడక్షన్లలో తేడాలు ఈ లెక్కలు కంపేర్ చేసి అప్పుడు కన్విన్స్ అవ్వండి.ఇలా కంపేర్ చేయడానికి మీరు ఎవర్ని అడగనక్కర్లేదు. ఆధారపడక్కర్లేదు. మీరే చేసుకోవచ్చు. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీరే కన్విన్స్ అవుతారు. ఇంతలో పరుగెత్తుకుంటూ వచ్చాడు హరనాధం గారి బామ్మర్ది పరంధామయ్య, ‘‘మా బావగారు నన్ను దెప్పి పొడుస్తున్నారు. మనం తప్పు చేశామా అని’’ అంటూ. అప్పుడు కన్సల్టెంటు కామేశం తన వృత్తి రహస్యాలను చెప్పాడు. ‘‘ఏమీ తప్పు చేయలేదండి. ఒక విషయం చెబుతా. ఇవన్నీ ప్రీఫిక్సిడ్ రిటర్నులు. మేము 26ఏఎస్ మొదలైన సమాచారాన్ని కరెక్టుగా ఎంటర్ చేస్తాం. ఆటోమేటిక్గా పోర్టల్ సమాచారాన్ని తీసుకుంటుంది. కొత్త పద్ధతా, పాత పద్ధతా అనేది చెబుతాం. పన్ను భారం లెక్కించబడుతుంది. ఎటువంటి తప్పులు జరగవు. ఆదాయం ఎంట్రీ, డిడక్షన్లు ఎంట్రీ, తప్పుగా రాస్తే తప్ప. లెక్కింపులో ఏ పొరపాటు జరగదు. చాలా కరెక్టుగా సాఫ్ట్వేర్ ఉంటుంది. అందుకుని తప్పులు జరగవు. అయితే, మీలాంటివాళ్లు ఎక్సెల్ షీటులో మాన్యువల్గా చేసి, కంపేర్ చేసి, కన్విన్స్ అవ్వొచ్చు’’ అని వివరించాడు. ఇది విని చిద్విలాసంగా బైల్దేరాడు పరంధామయ్య. -
నవరాత్రులకు ముందే జీఎస్టీ కొత్త రేట్లు!
జీఎస్టీ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీఎస్టీలోని అత్యధిక పన్ను శ్లాబుల తొలగింపునకు ప్రతిపాదించింది. జీఎస్టీ శ్లాబుల సవరణ.. కొత్త పన్ను రేట్లు నవరాత్రి పర్వదినానికి ముందే అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్ 22 నాటికి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులను అమలు చేస్తుందని ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ ప్రాఫిట్ పేర్కొంది.కేంద్రం ప్రతిపాదించిన 5 శాతం, 18 శాతం సరళీకృత రెండు వ్యవస్థల జీఎస్టీ పన్ను శ్లాబులపై చర్చించేందుకు సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కానుంది. రేట్ల హేతుబద్ధీకరణ, పరిహార సెస్, ఆరోగ్య, జీవిత బీమాపై మంత్రుల బృందం చేసిన సిఫార్సులపై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ చర్చించనుంది. రాష్ట్ర మంత్రులతో కూడిన మంత్రుల బృందం (జివోఎం) ఇదివరకే సమావేశమై, రెండు శ్లాబుల జీఎస్టీపై కేంద్రం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత దాదాపు ఐదారు రోజుల తర్వాత జీఎస్టీ కొత్త రేట్ల అమలుపై నోటిఫికేషన్లు వెలువడుతాయని తెలుస్తోంది.రెండే శ్లాబులు.. తక్కువ పన్నులుకేంద్రం 5% (మెరిట్ వస్తువులకు), 18% (స్టాండర్డ్ వస్తువులకు) అనే రెండు శ్లాబుల జీఎస్టీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. అదనంగా కొన్ని వస్తువులపై ప్రత్యేక రేట్లు అమలవుతాయి. అల్ట్రా లగ్జరీ కార్లు, సిన్ గూడ్స్పై 40 శాతం, కార్మికాధారిత రంగాలపై 0.1%, 0.3%, 0.5% రాయితీ రేట్లు కొనసాగుతాయి.ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ నిర్మాణంలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబులు ఉన్నాయి. త్వరలో అమల్లోకి వచ్చే కొత్త జీఎస్టీ నిర్మాణంలో 12%, 28% శ్లాబులను తొలగించనున్నారు. 5%, 18% శ్లాబుటు మాత్రమే కొనసాగుతాయి. తద్వారా అనేక వస్తువులపై పన్నులు తగ్గి వాటి ధరలు దిగిరానున్నాయి. అయితే రానున్నది పండుగ సీజన్ కాబట్టి ఎక్కువ కొనుగోళ్లకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో పండగ సీజన్కు ముందే కొత్త రేట్లు అమల్లోకి వస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. -
మొబైల్ ఫోన్లపై జీఎస్టీ 5 శాతానికి తగ్గించాలి
హైదరాబాద్: అందరికీ నిత్యావసరంగా మారిన మొబైల్ ఫోన్లను 5 శాతం జీఎస్టీ శ్లాబు కిందకు తీసుకురావాలని ఇండియా సెల్యులర్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) డిమాండ్ చేసింది. మొబైల్ ఫోన్ విడిభాగాలకూ 5 శాతం జీఎస్టీని వర్తింపజేయాలని కోరింది. ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీ రేటును తిరోగమన చర్యగా పేర్కొంది. 90 కోట్ల మంది డిజిటల్ సేవలను పొందేందుకు వీలు కలి్పస్తున్న మొబైల్ ఫోన్లను నిత్యావసరాలుగా పరిగణించాలని కోరింది. జీఎస్టీ శ్లాబులను రెండింటికి తగ్గిస్తూ, కీలక సంస్కరణలను జీఎస్టీ కౌన్సిల్కు కేంద్రం నివేదించిన నేపథ్యంలో ఐసీఈఏ ఈ విధంగా కోరడం గమనార్హం. ‘‘మొబైల్ ఫోన్ ఇకపై ఆకాంక్ష ఎంత మాత్రం కాదు. విద్య, ఆరోగ్యం, ఆర్థిక సేవల చేరువ, పరిపాలనకు అవసరమైన తప్పనిసరి డిజిటల్ సాధనం. కనుక ప్రధాని జీఎస్టీ సంస్కరణల అజెండా, 500 బిలియన్ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని 5 శాతం జీఎస్టీ కిందకు మార్చాలి’’అని ఐసీఈఏ చైర్మన్ పకంజ్ మొహింద్రూ కోరారు. 2014–15 నాటికి దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ విలువ రూ.18,900 కోట్లుగా ఉంటే, 2024–25 నాటికి రూ.5,45,000 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇందులో ఎగుమతులు రూ.2,00,000 కోట్లుగా ఉన్నాయి. 2020లో మొబైల్ ఫోన్లపై జీఎస్టీని 18 శాతానికి పెంచిన తర్వాత దేశీ వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్ల యూనిట్లకు తగ్గినట్టు ఐసీఈఏ తెలిపింది. -
2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు: రాష్ట్రపతి ఆమోదం
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు ఈ నెల 12న ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.ఈ కొత్త ఆదాయపన్ను చట్టం, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పాత చట్టంతో పోల్చితే కొత్త చట్టం సరళతరంగా, పారదర్శకంగా ఉంటుందని ఆదాయపన్ను శాఖ ‘ఎక్స్’ ప్లాట్ఫామ్పై ప్రకటించింది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.The Income-tax Act, 2025 has received the Hon’ble President’s assent on 21st Aug 2025.A landmark reform replacing the 1961 Act, it ushers in a simpler, transparent & compliance-friendly direct tax regime.Access the official document here: https://t.co/wOPk1PFQbP pic.twitter.com/Xw84hzpPb3— Income Tax India (@IncomeTaxIndia) August 22, 2025 -
ఇథనాల్ కలిపిన పెట్రోలుపై సుప్రీంకోర్టులో పిల్!
ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇథనాల్ లేని పెట్రోలును ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్ర అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ సౌకర్యం కల్పించకపోవడం 2019 నాటి వినియోదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజల ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోలును విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివరకూ పెట్రోలులో కలిపే ఇథనాల్ మోతాదు పది శాతం మాత్రమే ఉండగా.. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి దీన్ని ఇరవై శాతానికి పెంచారు. అయితే చౌక ఇథనాల్ను కలుపుతున్నా అంతమేరకు పెట్రోలు ధరలు తగ్గకపోవడంపై, ఈ-20 పెట్రోలు కారణంగా తమ వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మైలేజీ తగ్గుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఏప్రిల్ కంటే ముందు తయారైన వాహనాలు, కాలుష్య నివారణ మార్గదర్శకాలు బీఎస్-6లు రెండింటికీ ఈ ఈ-20 పెట్రోలు అనుకూలంగా లేదన్నది ఆరోపణ. ఈ-20 ఇథనాల్ ఇంజిన్ భాగాలను దెబ్బతీస్తుందని, సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా తుప్పు పట్టేందుకు అవకాశాలు ఎక్కువ చేస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు బీమా కంపెనీలు ససేమిరా అంటూండటం గమనార్హం.వినియోగదారుల అవగాహనపెట్రోల్ కంటే తక్కువ ధరకు ఇథనాల్ లభిస్తోందని కానీ ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గట్టుగా పెట్రోలు ధరలు తగ్గించలేదని పిటిషనర్ ఆరోపించారు. పెట్రోలు బంకుల్లో లభిస్తున్నది ఇథనాల్ కలిపినదా? కాదా? అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదని తగిన లేబలింగ్, ప్రకటనలు లేకపోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇథనాల్ లేని పెట్రోలును కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిందీ పిటిషన్. ఇథనాల్ లేదా ఇతర పదార్థాలను కలిపి అందిస్తూంటే ఆ విషయాలను స్పష్టం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని పెట్రోల్ స్టేషన్లలో ఇథనాల్ లేని పెట్రోల్ను కూడా అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతోపాటే మిశ్రమం ఎంత? ఏ ఏ పదార్థాలను కలిపింది కూడా పెట్రోలు బంకుల్లో స్పష్టంగా ప్రకటించాలని... ఆయా వాహనాలు మిశ్రమ ఇంధనానికి అనువైనవా? కావా? అన్న సమాచారాన్ని వినియోగదారులకు అందించాలని సూచించింది. ఈ-20 పెట్రోలు వాడకం ప్రభావం వాహనాలపై ఎలా ఉంటుందన్న విషయాన్ని దేశవ్యాప్తంగా అధ్యయనం చేయాలని అభ్యర్థించింది.ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు -
ద్రవ్యోల్బణాన్నే టార్గెట్ చేయాలా?
ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలా లేక వృద్ధికి ఊతమిచ్చేలా ఏవైనా కొత్త ప్రమాణాలను పరిశీలించాలా అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఒక చర్చాపత్రాన్ని రూపొందించింది. ఇందులో నాలుగు ప్రశ్నలు పొందుపర్చింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!ఆహార, రిటైల్ ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితుల్లో మానిటరీ పాలసీకి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలా? 4 శాతం ద్రవ్యోల్బణం టార్గెట్ వేగంగా ఎదుగుతున్న భారత్లాంటి దేశంలో స్థిరత్వం, వృద్ధికి మధ్య సమతౌల్యత సాధించేందుకు 4 శాతం ద్రవ్యోల్బణం టార్గెట్ సరైనదేనా? ద్రవ్యోల్బణ శ్రేణిని సవరించాలా? ద్రవ్యోల్బణ లక్ష్య స్థాయిని తొలగించి, కేవలం శ్రేణిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలా? అనే ప్రశ్నలు వీటిలో ఉన్నాయి. వీటిపై సెప్టెంబర్ 18లోగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. -
అంతర్జాతీయ స్థాయికి భారత ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జీఎస్టీ శ్లాబుల హేతుబద్దీకరణతో భారత ఆతిథ్య రంగం అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాలను సంతరించుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 5 శాతం పన్ను రేటును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం సేవలకు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. పన్నుల భారాన్ని తగ్గించేందుకు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను తీసుకురానున్నట్టు స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనను హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) స్వాగతించింది. అంతర్జాతీయంగా పర్యాటకులకు చిరునామాగా భారత్ మారేందుకు జీఎస్టీలో సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇతర దేశాలతో పోల్చితే భారత ఆతిథ్య పరిశ్రమ ఆకర్షణీయంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, 2047 నాటికి ఏటా 10 కోట్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలన్న లక్ష్య సాధనకు ఉపకరిస్తుందని పేర్కొంది. భారత్లో టారిఫ్లు (పన్ను రేట్లు) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్న అభిప్రాయాన్ని హెచ్ఏఐ ప్రెసిడెంట్ కేబీ కచ్రు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా టాప్–5 పర్యాటక గమ్యస్థానాల్లో భారత్ను కూడా చేర్చాలంటే దేశ పోటీతత్వాన్ని పెంచాల్సి ఉందన్నారు. హోటళ్లపై 18 శాతం కారణంగా జీఎస్టీతో గదుల రేట్లు అధికంగా ఉంటున్నాయని.. దీంతో అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి ఉన్నట్టు వివరించారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.. ‘‘ప్రస్తుతం హోటళ్లలో రూ.7,500 వరకు గదుల అద్దెపై 12 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఇది 6–7 ఏళ్ల క్రితం నిర్ణయించిన రేటు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని రూ.15,000కు పెంచాలి. ఇలా చేయడం వల్ల పర్యాటకులకు గదుల ధరలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద పరిశ్రమ పోటీతత్వం పెరుగుతుంది’’అని హెచ్ఏఐ సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక సేవలపై ఏక రూప 5 శాతం పన్ను రేటును, ఐటీసీ సదుపాయంతో అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్టు పేర్కొంది. ఇలా చేస్తే నిబంధనల అమలు భారం తగ్గుతుందని, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. -
భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరం
అమెరికా టారిఫ్ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉత్పత్తులను యూఎస్ దిగుమతి చేసుకోకపోతే రష్యా అండగా ఉంటుందని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయానికి చెందిన చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, రష్యా భారత దిగుమతులను సాధ్యమైనంత వరకు స్వాగతిస్తుందని, దాని గురించి ఆందోళన చెందకండంటూ భరోసానిచ్చారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణకు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.రష్యాతో భారత ఎగుమతులు, దిగుమతుల్లో వ్యాత్యాసం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత 59 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రష్యా మరిన్ని భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవాలనే సంకేతాలను హైలైట్ చేస్తుంది. బాబుష్కిన్ చేసిన ప్రకటన ప్రత్యామ్నాయ మార్కెట్లను కోరుకునే భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.పెరుగుతున్న వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలుభారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన సానుకూలంగా సాగిందని, ఆచరణాత్మక సహకారానికి భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ) కీలక వేదికగా పనిచేస్తుందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఇరుదేశాల నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. అధికారికంగా తేదీని ధ్రువీకరించనప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం గురించి ఊహాగానాలు పెరుగుతున్నాయి.చమురు సరఫరాకు అంతరాయం లేదుభారత్తో చమురు వాణిజ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా ముడి చమురు ఎగుమతులను కొనసాగిస్తుందని బాబుష్కిన్ పునరుద్ఘాటించారు. భారత్ రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారని, రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారని చెప్పారు. ఏకపక్ష చర్యలు సరఫరా గొలుసులకు విఘాతం కలిగిస్తాయని, ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తాయన్నారు.ఆంక్షలు ఉన్నప్పటికీ..రష్యాపై పాశ్చాత్య దేశాలు ఏళ్ల తరబడి ఆంక్షలు విధించినప్పటికీ భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగిందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల వాణిజ్యం ఏడు రెట్లు అయిందన్నారు. పరస్పర చర్చల ద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్-రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు -
కొత్త బిల్లుతో ఏటా రూ.20 వేల కోట్లు నష్టం.. అయినా తప్పట్లేదు!
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ను నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిన్నటి పార్లమెంట్ సెషన్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.ఈ మేరకు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో పెరుగుతున్న నిరుద్యోగ ఆందోళనల మధ్య ఈ హామీ వచ్చింది. ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ వంటి ద్రవ్యేతర విభాగాల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మనీ గేమింగ్ను పూర్తిగా నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం 45 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్లో నిమగ్నమయ్యారని, మొత్తంగా ఏటా రూ.20,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి. ఇది గణనీయమైన ఆదాయాన్ని త్యాగం చేయడమే అయినా వినియోగదారుల సంక్షేమం, ఆర్థిక రక్షణే ఈ నిషేధానికి కారణమని అధికారులు చెబుతున్నారు.మనీ గేమ్స్ ఆడే వారు బాధితులే తప్పా నేరస్థులు కాదని, ఈ గేమ్స్ ప్రకటనదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఫైనాన్షియల్ ఎనేబుల్స్పై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘గేమ్ మేకర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు కేవలం మనీ గేమ్స్పైనే పని చేయరు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఇతర ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమ్స్పై కూడా పనిచేస్తున్నారు. ఈ విభాగాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చాం’ అని ఆయన చెప్పారు.ఏమిటీ బిల్లు? అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. ఆన్లైన్ గేమ్లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు. ఆన్లైన్ గేమ్ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు.నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్)పై ఆధారపడిన ఏ గేమ్ అయినా నిషిద్ధమే. మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్లను నిర్వహించినా దోషులే అవుతారు. ఈ బిల్లు ప్రకారం.. ఆన్లైన్ గేమ్ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు. డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది. సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరండబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ–స్పోర్ట్స్కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఆన్లైన్ గేమ్లను వర్గీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. -
రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం
ముడిచమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య అసమతుల్యత పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. వాణిజ్యం, ఆర్థికం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ-టీఈసీ)లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆర్థిక పరిస్థితులను తక్షణమే పునసమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గత నాలుగేళ్లలో వస్తువులపరంగా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందన్నారు. 2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి 68 బిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. ఏదేమైనా, ఈ వృద్ధి గణనీయమైన వాణిజ్య అసమతుల్యతతో పాటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి 58.9 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది తొమ్మిది రెట్లు పెరిగిందని, దీన్ని అత్యవసరంగా పునసమీక్షించాలని కోరారు.ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంభారత్-రష్యాల మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ వాణిజ్య అంతరాన్ని పరిష్కరించడమే కాకుండా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు జైశంకర్ రోడ్ మ్యాప్ను రూపొందించారు. టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించడం, నిరంతర లాజిస్టిక్స్ అడ్డంకులను పరిష్కరించడం, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్ఎస్టీసీ), ఉత్తర సముద్ర మార్గం, చెన్నై-వ్లాదివోస్తోక్ సముద్ర కారిడార్ వంటి వ్యూహాత్మక వాణిజ్య మార్గాల ద్వారా కనెక్టివిటీని పెంచడం వంటి కీలక ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.చెల్లింపు యంత్రాంగాలను క్రమబద్ధీకరించాలని, భారత్-యురేషియన్ ఎకనమిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ)పై చర్చలను వేగవంతం చేయాలని జైశంకర్ సూచించారు. ఆయన ప్రస్తుత పర్యటనలో ఈ ఎఫ్టీఏకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం గమనార్హం. ఈ ప్రయత్నాలు అసమతుల్య వాణిజ్యాన్ని పెంచడానికి సహాయపడటమే కాకుండా 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల సవరించిన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించడానికి చేరువ చేస్తుందని నమ్ముతున్నారు.రష్యా కంపెనీలకు ‘మేక్ ఇన్ ఇండియా’ మార్గాలుశరవేగంగా మారుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని జైశంకర్ రష్యన్ పరిశ్రమలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో పాటు పట్టణీకరణ, భారతీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త వాణిజ్య మార్గాలను తెరతీయాలని చెప్పారు. రష్యన్ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి -
ఫండ్స్ విదేశీ ఆస్తుల్లో క్షీణత
మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని విదేశీ పెట్టుబడుల (విదేశీ స్టాక్స్, ఇతర సెక్యూరిటీల్లో) విలువ గత ఆర్థిక సంవత్సంలో 5.6 శాతం తగ్గి 8.3 బిలియన్ డాలర్లుగా (రూ.72,210 కోట్లు సుమారు) ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2024 మార్చి నాటికి మ్యూచువల్ ఫండ్స్ విదేశీ నిర్వహణ ఆస్తుల విలువ 8.81 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం చివరికి ఫండ్స్ నిర్వహణలోని యూఎస్ ఈక్విటీల విలువ 3.9 శాతం తగ్గి రూ.44,500 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వార్షిక సర్వే నివేదిక తెలిపింది.ఐర్లాండ్, తైవాన్లోని పెట్టుబడుల విలువ సైతం ఇదే మాదిరి తగ్గింది. భారత మ్యూచువల్ ఫండ్స్ సంస్థల విదేశీ పెట్టుబడుల్లో 95 శాతం యూఎస్, లగ్జెంబర్గ్, ఐర్లాండ్లోనే ఉన్నట్టు ఆర్బీఐ డేటా తెలియజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన వాణిజ్య విధానాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు నెలకొనడం తెలిసిందే. ఇక గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాల్లోని పెట్టుబడులు 25 శాతం పెరిగి రూ.29.45 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెబుతూ.. స్థానిక మార్కెట్పై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగినట్టు వివరించింది.ఇదీ చదవండి: పీఎస్యూ బ్యాంక్ చీఫ్లతో ఆర్థిక శాఖ సమావేశంగత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ విదేశీ చెల్లింపుల బాధ్యతలు 20 శాతం పెరిగి 30.5 బిలియన్ డాలర్లకు చేరాయని.. ప్రవాస భారతీయుల పెట్టుబడులు పెరగడం వల్లేనని వివరించింది. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యూఏఈలోని ఎన్ఆర్ఐల పెట్టుబడులు రూ.52,549 కోట్లకు చేరాయి. ఫండ్స్ ఆస్తుల్లో యూఏఈ, యూఎస్ఏ, యూకే, సింగపూర్ ఎన్ఆర్ఐల వాటా అధికంగా ఉంది. -
పీఎస్యూ బ్యాంక్ చీఫ్లతో ఆర్థిక శాఖ సమావేశం
ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు అధ్యక్షతన ఆర్థిక శాఖ మూడు గంటలపాటు సమావేశం నిర్వహించింది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై సమీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఉత్పాదక రంగాలకు రుణాల విడుదలను పెంచవలసిందిగా బ్యాంకుల ఎండీలు, సీఈవోలను నాగరాజు కోరినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలిబ్యాంకింగ్ పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ. 44,218 కోట్ల నికర లాభం ఆర్జించాయి. వార్షికంగా ఇది 11 శాతం వృద్ధికాగా.. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 39,974 కోట్ల లాభం ఆర్జించాయి. ఈ ఏడాది క్యూ1లో ప్రభుత్వ బ్యాంకులు ఆర్జించిన రూ. 44,218 కోట్ల లాభాల్లో కేవలం ఎస్బీఐ 43 శాతం వాటా ఆక్రమించడం విశేషం! -
జీఎస్టీ తగ్గింపుతో వినియోగం జోరు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండే పన్ను శ్లాబులతో కూడిన ప్రతిపాదిత సంస్కరణలతో ఆదాయ నష్టం ఏర్పడినప్పటికీ.. అంతిమంగా వినియోగానికి, జీడీపీకి ఊతమిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జీఎస్టీ 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉండగా.. 5, 18 శాతంతోపాటు లగ్జరీ, సిన్ (పొగాకు తదితర) గూడ్స్పై 40 శాతం పన్నును కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిపై మంత్రుల బృందం అధ్యయనం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేట్ల తగ్గింపు ఫలితంగా ఆదాయం రూ.85,000 కోట్లు తగ్గుతుందని, అదే సమయంలో వినియోగం రూ.1.98 లక్షల కోట్లు పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.జీడీపీ కూడా 0.6 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. జీఎస్టీ ఆరంభంలో సగటు రేటు 14.4 శాతంగా ఉంటే, 2019 సెప్టెంబర్ నాటికి 11.6 శాతానికి తగ్గిందని.. అది ఇప్పుడు 9.5 శాతానికి దిగిరావచ్చని తెలిపింది. వినియోగం పెరుగుతుండడం ద్రవ్యోల్బణాన్ని ఎగిసేలా చేయదని వివరించింది. నిత్యావసరాలైన ఆహారం, వస్త్రాలపై 12 శాతం రేటు కాస్తా 5 శాతానికి దిగొస్తుందని.. ఈ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం 10–15 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని తెలిపింది. సేవలకు సంబంధించి ద్రవ్యోల్బణం 5–10 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా కట్టింది. దీంతో మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 0.20–0.25 శాతం తగ్గుతుందని తెలిపింది. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖజీడీపీ 1.6 శాతం పెరగొచ్చు..బడ్జెట్లో కల్పించిన ఆదాయపన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే మొత్తం మీద వినియోగం 5.31 లక్షల కోట్లు పెరుగుతుందని.. దీని ఫలితంగా జీడీపీ వృద్ధి 1.6 శాతం అధికమవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. -
మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి
మొబైల్ ఫోన్లు, పరికరాలను, నిత్యావసర ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన 5 శాతం జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలని కేంద్రానికి ఇండియా సెల్యూలార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న 18 శాతం జీఎస్టీ తిరోగమన విధానమని పేర్కొంది. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండింటికి తగ్గించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఐసీఈఏ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.ప్రస్తుతం మొబైల్ ఫోన్లనేవి విలాస వస్తువులుగా గాకుండా విద్య, వైద్యం, ఆర్థిక సమ్మిళితత్వం, గవర్నెన్స్కి సంబంధించి అత్యవసర డిజిటల్ మౌలిక సదుపాయాలకు కీలకంగా మారాయని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొబైల్స్ను అయిదు శాతం జీఎస్టీలో చేర్చాలని కోరారు. జీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందు చాలా రాష్ట్రాలు మొబైల్ ఫోన్లను నిత్యావసర ఉత్పత్తులుగా గుర్తించి, వాటిపై 5 శాతం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) మాత్రమే విధించాయని మహీంద్రూ చెప్పారు.ఇదీ చదవండి: అల్ట్రాటెక్ 200 ఎంటీపీఏ సామర్థ్యంఅయితే, జీఎస్టీని ప్రవేశపెట్టాక ముందు 12 శాతం శ్లాబ్లో ఉంచి ఆ తర్వాత 2020లో 18 శాతానికి మార్చారని మహీంద్రూ గుర్తు చేశారు. దీనితో అందుబాటు ధరల్లో మొబైల్స్ లభ్యతపైనా, అమ్మకాల పరిమాణంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. మొబైల్స్ వార్షిక వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్లకు తగ్గిపోయిందని వివరించారు. కాబట్టి వీటిని అయిదు శాతం శ్లాబ్లోకి చేర్చడాన్ని మినహాయింపుగా భావించరాదని, కరెక్షన్గా పరిగణించాలని మహీంద్రూ చెప్పారు. 2015 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ. 18,900 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.45 లక్షల కోట్లకు చేరింది. -
భారత్పై టారిఫ్ల ప్రభావం అంతంతే!
యూఎస్ టారిఫ్లతో భారత కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యక్ష సంబంధం తక్కువేనని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కాకపోతే ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న ఫార్మాస్యూటికల్స్, తదితర రంగాలపై భవిష్యత్తులో ఆ వెసులుబాటు తొలగిస్తే ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. భారత ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్లను ప్రస్తుతం యూఎస్ అమలు చేస్తోంది. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్లు అమల్లోకి రానున్నాయి.ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మాత్రం వీటి నుంచి మినహాయింపులు ఉన్నాయి. 50 శాతంతో ఆసియాలో భారత్పైనే అధిక టారిఫ్లు అమలు కానున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రిస్క్లు తగ్గుతాయని పేర్కొంది. రష్యా చమురును భారత ఆయిల్ కంపెనీలు 30–40 శాతం తక్కువ రేటుకు దిగుమతి చేసుకుంటుండడం వాటి లాభాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. భారత ఐటీ కంపెనీలపై టారిఫ్ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం తక్కువేనని తేల్చింది. అలాగే, దేశీ మార్కెట్పై ప్రధానంగా ఆధారపడే ఆయిల్, గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, టెలికం, యుటిలిటీలపై ప్రభావం ఉండదని తెలిపింది. అమెరికా అధిక టారిఫ్లు అలాగే కొనసాగితే భారత వృద్ధి రేటు 2025–26లో 6.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. దీర్ఘకాలిక వృద్ధిని టారిఫ్లు అడ్డుకోవుభారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై యూఎస్ టారిఫ్లు ప్రభావం చూపించకపోవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మరోసారి పునరుద్ఘాటించింది. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత రేటింగ్ను సైతం బీబీబీ మైనస్ నుంచి బీబీబీ స్టెబుల్కు అప్గ్రేడ్ కూడా చేసింది. ‘రానున్న కాలంలో వృద్ది అవకాశాలు బలోపేతం అవుతాయి. వృద్ధి సగటు 6.8 శాతానికి చేరుతుంది. మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెరిగితే, దీర్ఘకాలిక వృద్ది అవకాశాలకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. దీంతో భారత్ దీర్ఘకాలిక వృద్ధి మరింత బలపడుతుంది’ అని ఎస్అండ్పీ తన తాజా నివేదికలో వివరించింది.స్వీయ వినియోగం సానుకూల అంశంభారత్ ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటని పేర్కొంది. గత 3–4 ఏళ్లలో ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. భారత వృద్ధిలో 85 శాతం దేశీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని, ఎగుమతుల రూపంలో సమకూరేది 15 శాతమేనని తెలిపింది. స్వీయ వినియోగంపై అధికంగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడం సానుకూల అంశంగా పేర్కొంది. స్వల్పకాలంలో వ్యాపార విశ్వాసంపై ప్రభావం పడినప్పటికీ సానుకూల వృద్ది పథం, సానుకూల వ్యాపార వాతావరణం అన్నవి.. మధ్య కాలం, దీర్ఘకాలంలో వృద్ధిని నిర్ణయిస్తాయని అభిప్రాయపడింది. ‘భారత జీడీపీలో అమెరికా ఎగుమతుల పాత్ర ఒక శాతమే. టారిఫ్లు అధికంగా విధించినప్పటికీ దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తాయని అనుకోవడం లేదు’అని వివరించింది.ఇదీ చదవండి: ‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’ -
పత్తి దిగుమతులపై సుంకాల ఊరట
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్స్టైల్స్ పరిశ్రమకు కీలక వనరైన ముడి పత్తి దిగుమతులకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు సుంకాల నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనిపై 11 శాతం సుంకాలతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు కూడా వర్తిస్తోంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ మినహాయింపు ఆగస్టు 19 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.దీనితో భారత్కి పత్తిని ఎగుమతి చేసే రెండో అతిపెద్ద సరఫరాదారైన అమెరికాకు ప్రయోజనం చేకూరనుంది. ధరలను స్థిరీకరించడానికి, ముడి సరుకు లభ్యతను మెరుగుపర్చడానికి సుంకాల మినహాయింపు ఉపయోగపడుతుందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. దేశీయంగా పత్తి ధరలు తగ్గిపోయి, రైతులపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో మినహాయింపులను ప్రభుత్వం 40 రోజులకే పరిమితం చేసినట్లు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 579.2 మిలియన్ డాలర్లుగా ఉన్న పత్తి దిగుమతులు 2025 ఆర్థిక సంవత్సరంలో 107 శాతం ఎగిసి 1.20 బిలియన్ డాలర్లకు చేరాయి. -
యూపీఐ వినియోగంలో టాప్లో ఉన్న రాష్ట్రం ఇదే..
యూపీఐ వినియోగంలో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని ఎస్బీఐ ఎకనామిక్ రిసెర్చ్ డిపార్ట్మెంట్(ఈఆర్డీ) తెలిపింది. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అయితే కొన్ని టీపీఏపీల(థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) మధ్య లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో దేశంలో ఫిన్టెక్ ఆవిష్కరణలు దెబ్బతింటున్నట్లు హెచ్చరించింది.ఎస్బీఐ ఈఆర్డీ తొలిసారిగా ప్రచురించిన యూపీఐ లావాదేవీలపై రాష్ట్రాల వారీగా డేటాను ప్రస్తావిస్తూ, జులైలోనే 9.8 శాతం వాల్యూమ్(యూపీఐల సంఖ్య) వాటాతో మహారాష్ట్ర స్థిరంగా ముందంజలో ఉందని తెలిపింది. కర్ణాటక (5.5 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (4.1 శాతం), తమిళనాడు (4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈఆర్డీలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జులై నెలలోనే డిజిటల్ చెల్లింపుల్లో(విలువ) మహారాష్ట్ర 9.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (5.8 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (5.1 శాతం), తమిళనాడు (4.7 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్విలువ, వాల్యూమ్ పరంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2025లోనే సగటు రోజువారీ విలువ జనవరిలో రూ.75,743 కోట్ల నుంచి జులైలో రూ.80,919 కోట్లకు, ఆగస్టులో రూ.90,446 కోట్లకు (ఇప్పటివరకు) పెరిగింది. -
ట్రాక్టర్లు, బస్సుల ధరలు తగ్గింపు?
జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించాలని యోచిస్తున్నట్లు కేంద్రం ఇటీవల తెలిపిన నేపథ్యంలో ప్రధాన వాహనాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా బస్సులపై పన్నును 28% నుంచి 18%కి, ట్రాక్టర్లపై పన్నును 12% నుంచి 5%కు తగ్గించే ప్రతిపాదనలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రజారవాణాను మెరుగుపరచడం, వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో ఈ కేటగిరీల్లో అమ్మకాలను పెంచేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.వ్యవసాయ యాంత్రీకరణకు ఊతంవ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి, రైతులపై వ్యయ భారాన్ని తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రాక్టర్లు, వాటి విడిభాగాలపై పన్నును తగ్గించడం వల్ల మూలధనం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయంటున్నారు. దీనివల్ల వ్యవసాయ సామర్థ్యం పెరుగుతుందని, గ్రామీణ ఆదాయాలు అధికమవుతాయని భావిస్తున్నారు. ఇదిలాఉండగా, కంపెనీలు తయారు చేసే యంత్రాలపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే అర్హతను కొనసాగించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇన్పుట్ ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నందున మరిన్ని రిఫండ్లు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్కార్ట్స్ కుబోటా డైరెక్టర్, సీఎఫ్వో భరత్ మదన్ తెలిపారు. ఇన్పుట్ ఖర్చులు ప్రస్తుతం 14-15 శాతంగా ఉన్నాయని, 12 శాతం అవుట్పుట్ ట్యాక్స్ ఉందని పేర్కొన్నారు.ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్(టీఎంఏ) డేటా ప్రకారం, ట్రాక్టర్ అమ్మకాలు ఇప్పటికే పెరుగుతున్నాయి. దేశీయంగా 2025 జనవరి-జులై కాలంలో 14% పెరిగాయి. ఇది 5,50,948 యూనిట్లుగా ఉంది. గతేడాది 4,84,024 యూనిట్ల నుంచి పెరిగింది.బస్ సెగ్మెంట్లో ఇలా..ప్రస్తుతం 28% జీఎస్టీని ఎదుర్కొంటున్న బస్సులు, వాటి విడిభాగాలపై కూడా ఉపశమనం కల్పించవచ్చు. దీన్ని 18 శాతానికి చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపాదిత 10 పాయింట్ల తగ్గింపు ఈ విభాగంలో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులకు ఇటీవలి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంతో కలిసొస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ సెగ్మెంట్లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ జీఎస్టీ తగ్గింపు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, మీడియం, హెవీ బస్ సేల్స్ 2025 ఆర్థిక సంవత్సరంలో 23% పెరిగి 66,328 యూనిట్లకు చేరుకున్నాయి. లైట్ ప్యాసింజర్ క్యారియర్లు కూడా 6% పెరిగి 54,807 యూనిట్లకు చేరుకున్నాయి.ఇదీ చదవండి: నిలిపేసిన పాలసీల పునరుద్ధరణ -
స్టార్టప్లకు పన్ను లబ్ధి
న్యూఢిల్లీ: స్టార్టప్లకు పన్ను సంబంధ లబ్దిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) మార్గదర్శకాలను మరింత సరళీకరించడం, పొరుగు దేశాల నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలతో వాణిజ్యం, పరిశ్రమల శాఖ 100 రోజుల సంస్కరణల అజెండాకు తెరతీయనుంది. అంతేకాకుండా లెదర్, ఫుట్వేర్ పరిశ్రమకు మద్దతుగా కొన్ని పర్యావరణ నిబంధనలను సులభతరం చేయడం, ఈకామర్స్ కేంద్రాల ద్వారా ఎగుమతుల పెంపునకు నిబంధనలను సరళీకరించడం, వివిధ రంగాలకు అవసరమయ్యే ల్యాబ్ టెస్టింగ్, సర్టిఫికేషన్లను ఏకీకృతం చేయడం సైతం సంస్కరణలలో భాగంకానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తదుపరి 100 రోజుల ట్రాన్స్ఫార్మేషన్ అజెండాలో భాగంగా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు వేగవంత చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రతిపాదనలు దేశ ఎగుమతులతోపాటు.. ఎఫ్డీఐలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. కాగా. 2025–26 ఏప్రిల్– జూలైలో ఎగుమతులు 3.07 శాతం పుంజుకుని 149.2 బిలియన్ డాలర్లను తాకగా.. దిగుమతులు మరింత అధికంగా 5.4 శాతం పెరిగి 244 బిలియన్ డాలర్లను దాటాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో వాణిజ్య లోటు 94.81 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది(2024–25) ఎఫ్డీఐలు 13 శాతం ఎగసి 50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
యూపీఐ సబ్సిడీ కేటాయింపులు పెంచే అవకాశం
ముంబై: యూపీఐ, రూపే కార్డ్ లావాదేవీల ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకి మద్దతునిచ్చేందుకు ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేటాయించిన రూ. 437 కోట్ల వార్షిక సబ్సిడీ మొత్తాన్ని మరింతగా పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి చెందిన ఎకానమిస్టులు ఒక నివేదికలో పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం ఈ వ్యవస్థ నిర్వహణ కోసం పరిశ్రమవర్గాలు రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు భారాన్ని మోస్తున్నాయని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,000 కోట్లుగా ఉన్న సబ్సిడీ మొత్తాన్ని ఈ బడ్జెట్లో భారీగా కోత పెట్టడంతో కొన్ని యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయని నివేదిక తెలిపింది. దీని ప్రకారం వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.30 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేటును (ఎండీఆర్) వసూలు చేసుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతిస్తోంది. అయితే, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో 2020 నుంచి రూపే డెబిట్ కార్డు, భీమ్–యూపీఐ ద్వారా చెల్లింపులపై చార్జీలను తొలగించింది. మరోవైపు, చిన్న వర్తకులకు యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఉండదు. పైగా రూ. 2,000 వరకు లావాదేవీ మొత్తాలపై 0.15 శాతం వరకు ప్రోత్సాహకాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్రోత్సాహకాన్ని వ్యాపారి బ్యాంకునకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దాన్ని కస్టమర్ బ్యాంకుతో పాటు మిగతా వర్గాలన్నీ కలిసి పంచుకుంటాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో అమెరికన్ సంస్థలకు చెందిన ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యం నెలకొనడమనేది దేశీ ఫిన్టెక్ సంస్థలను తొక్కేసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. -
మేకిన్ ఇండియాపై జాగ్రత్త
న్యూఢిల్లీ: ‘మేకిన్ ఇండియా’ నినాదమనేది ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్’ (భారత్కి కావల్సినవన్నీ ఇక్కడే తయారు చేసుకోవడం)గా మారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దీనివల్ల చైనాకు వెళ్లే పెట్టుబడులను మనవైపు ఆకర్షించే అవకాశం కోల్పోతామని, ఉత్పాదకతపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతం కావడమనేది, రక్షణాత్మక ధోరణి కన్నా ఎంత మెరుగ్గా పోటీపడగలమనే దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మిగతావారితో పని లేకుండా విడిగా ఉండిపోవడం కాకుండా స్వేచ్ఛా విధానాలను అమలు చేయడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని దువ్వూరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించినట్లుగా ఆత్మనిర్భర భారత్ నినాద లక్ష్యం రక్షణ, ఇంధనంలాంటి సున్నిత రంగాల్లో వ్యూహాత్మకంగా స్వయం సమృద్ధి సాధించడమే కావాలే తప్ప దాన్ని ప్రతి ఒక్క దానికి అన్వయించుకోకూడదని తెలిపారు. భారత్కి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికి కూడా అవసరమైన వాటిని ఉత్పత్తి చేసే ఎగుమతుల ఆధారిత తయారీ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దడమే మేకిన్ ఇండియా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ‘‘అయితే, 50 శాతం టారిఫ్ల వల్ల కీలకమైన అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఆసియాలోనే అత్యధిక టారిఫ్లు ఎదుర్కొంటున్న మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి సందేహిస్తారు’’ అని దువ్వూరి తెలిపారు. ‘‘ఆసియాలో బంగ్లాదేశ్, వియత్నాం, ఇండొనేíÙయా కన్నా భారత్పై అత్యధిక టారిఫ్లు వర్తిస్తుండటమనేది ఆందోళనకర అంశం. కీలక తరుణంలో చైనా ప్లస్ వన్గా ఎదగాలన్న ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి దీని వల్ల విఘాతం కలుగుతుంది’’ అని చెప్పారు. అమెరికాకు సగం ఎగుమతులపై టారిఫ్ల ప్రభావం .. మన ఎగుమతుల్లో దాదాపు 20 శాతం వాటా ఉండే అమెరికా మార్కెట్లో 50 శాతం టారిఫ్లు విధిస్తే, కనీసం సగం ఎగుమతులపై ప్రభావం పడుతుందని దువ్వూరి తెలిపారు. ముఖ్యంగా టెక్స్టైల్స్, రత్నాభరణాలు, లెదర్లాంటి కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్కు టారిఫ్ల నుంచి మినహాయింపు ఉండటం శాశ్వతమేమీ కాదని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు కొనసాగుతున్న సమీక్షల వల్ల భవిష్యత్తులో వాటిని కూడా టారిఫ్ల పరిధిలోకి చేర్చే అవకాశం ఉందన్నారు.500 బిలియన్ డాలర్ల వాణిజ్యం డౌటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న భారత్–అమెరికా లక్ష్యం సాకారం కావడం మిథ్యేనని స్పష్టంగా తెలుస్తోందని దువ్వూరి చెప్పారు. మన ఎగుమతుల మీద పడే ప్రభావాలపై లెక్కలు వేసుకోవడానికి ముందు, అమెరికా మార్కెట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రపంచ దేశాలను చైనా తమ ఉత్పత్తులతో ముంచెత్తే ముప్పు గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, దేశీయంగా డెయిరీ, వ్యవసాయం అనేవి రాజకీయంగా చాలా సున్నితమైన రంగాలని, కోట్ల కొద్దీ ప్రజలకు జీవనోపాధి కలి్పంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా ముడిపడి ఉన్నవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు గంపగుత్తగా అనుమతించడం వాంఛనీయమూ, లాభదాయకమూ కూడా కాదని సుబ్బారావు చెప్పారు. అయితే, కొన్ని విషయాల్లో కాస్త పట్టు విడుపులతో వ్యవహరిస్తే చర్చల్లో ప్రతిష్టంభన తొలగేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
జీఎస్టీ మంత్రుల బృందం భేటీ రేపే
న్యూఢిల్లీ: జీఎస్టీలో శ్లాబుల తగ్గింపుపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం 20న చర్చించనుంది. ఈ బృందంలో భాగం కాకపోయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ సమావేశానికి హాజరు కానుండడం గమనార్హం. 5 శాతం, 18 శాతం శ్లాబులతో కూడిన కొత్త నమూనాను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే మంత్రుల బృందం ముందుంచింది. పొగాకు తదితర కొన్నింటిపై 40 శాతం పన్ను ప్రతిపాదించింది. దీనిపై ఢిల్లీలో ఈ నెల 20, 21 తేదీల్లో జీఎస్టీ మంత్రుల బృందం (జీవోఎం) చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘జీవోఎంలో కేంద్రం భాగం కానప్పటికీ.. ఆర్థిక మంత్రి పాల్గొనడం, ప్రసంగించడం అన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన, ఉద్దేశ్యాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది’’అని ఆ వర్గాలు వెల్లడించాయి. విహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆరుగురు సభ్యుల జీవోఎంకు కనీ్వనర్గా వ్యవహరిస్తున్నారు.కొత్త రేట్లను దిపావళికి ముందే అమల్లోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పుతో ఆదాయం తగ్గుతుందన్న ఆందోళనలను కేంద్రం తొలగించే ప్రయత్నం చేసింది. ఆదాయంలో రాష్ట్రాలతో పాటు కేంద్రానికి సమాన వాటా ఉంటుందన్న విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేశాయి. కొత్త ప్రతిపాదనలతో నిరీ్ణత కాలంలో వినియోగం పెరిగి, అధిక ఆదాయానికి దారితీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇక ప్రతిపాదిత రెండంచెల పన్ను శ్లాబులతో కూడిన కొత్త జీఎస్టీ విధానంలో మెజారిటీ ఆదాయం 18 శాతం నుంచే ఉంటుందని తెలిపాయి. ప్రస్తుతం బంగారంపై 3శాతం, ఇతర వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. ఆహార వస్తువులు కొన్నింటిని పన్ను నుంచి మినహాయించగా, కొన్ని 5 శాతం రేటు పరిధిలో ఉన్నాయి. లగ్జరీ, సిన్ గూడ్స్ (హానికారక)పై 40 శాతం రేటు అమలవుతోంది. -
ఇక ఏసీలు, టీవీలు చౌక!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో శ్లాబుల తగ్గింపుతో ఏసీలు, టీవీల ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరానున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లపై (ఏసీలు) 28 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గనుంది. దీంతో మోడల్ను బట్టి ఒక్కో ఏసీ యూనిట్ ధర రూ.1,500–2,500 మేర చౌకగా మారనుంది. 32 అంగుళాలకు మించిన టీవీలపైనా జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికితోడు బడ్జెట్లో పెద్ద మొత్తంలో ఆదాయపన్ను మినహాయింపులు కలి్పంచడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఏసీల కొనుగోళ్లను పెంచుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద ముందడుగు రూమ్ ఏసీల కొనుగోళ్లు నిలిచిపోయినందున జీఎస్టీలో ప్రతిపాదిత సంస్కరణలను వేగంగా అమల్లోకి తీసుకురావాలని బ్లూస్టార్ ఎండీ బి. త్యాగరాజన్ కోరారు. ‘‘ఆగస్ట్ నెలలో రూమ్ ఏసీలను ఎవరూ కొనరు. సెపె్టంబర్ లేదా అక్టోబర్ 1 వరకు వేచి చూడొచ్చు. ఈ కాలంలో డీలర్లే కాదు, కస్టమర్లు కూడా కొనుగోళ్లు చేయరు’’అంటూ అన్సీజన్ను ఆయన గుర్తు చేశారు. 10 శాతం వరకు ఏసీల ధరలు తగ్గొచ్చొని చెప్పారు. ఇంధన ఆదా చేసే ఏసీలపై తక్కువ జీఎస్టీని అంచనా వేస్తున్నామని.. ఇతర ఏసీల ధరలు 18% రేటు పరిధిలో ఉండొచ్చని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ అభిప్రాయపడ్డారు. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా కానీ ఉత్పత్తుల ధరలు 6–7 శాతం మేర (రూ.1,500–2,500) దిగిరావొచ్చని చెప్పారు. ప్రతిపాదిత జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగాన్ని పెంచుతుందని గోద్రేజ్ అప్లయెన్సెస్ సైతం అంచనా వేసింది.‘‘దేశంలో ఏసీల వినియోగం ఇప్పటికీ 9–10 శాతంగానే ఉంది. జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే మరింత మంది ప్రజలకు ఏసీల ధరలు అందుబాటులోకి వస్తాయి. దీంతో చాలా మంది భారతీయుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది’’అని గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ అప్లయెన్సెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ప్రస్తుతం రూమ్ ఏసీలపై 28% జీఎస్టీ అమల్లో ఉండగా, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై 18 శాతం రేటు అమలు అవుతున్నట్టు తెలిపారు. ఏసీ, టీవీలకు అనుకూలం.. థామ్సన్, బ్లోపంక్త్ తదితర బ్రాండ్లపై టీవీలను తయారు చేసి విక్రయించే సూపర్ ప్లా్రస్టానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా సైతం ప్రభుత్వ చర్యతో పండుగల సీజన్లో వినియోగం పెరుగుతుంని అంచనా వేశారు. ఏసీ, స్మార్ట్ టీవీలు (32 అంగుళాల పైన) 28% జీఎస్టీ పరిధిలో ఉన్నాయంటూ.. రేట్లను తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు. తాము 20% వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇక 32 అంగుళాల టీవీలను 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ సెగ్మెంట్లో 38 శాతం అసంఘటిత రంగం నుంచే వస్తున్నట్టు చెప్పారు. వేసవిలో ముందస్తు వర్షాలతో ఈ ఏడాది ఏసీ అమ్మకాలు తగ్గాయి.గొప్ప సంస్కరణ జీఎస్టీ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఎంతో ముఖ్యమైన సంస్కరణ. దీని ద్వారా ప్రభుత్వం అద్భుతమైన పని చేస్తోంది. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆటో పరిశ్రమపై పడే ప్రభావంపై వ్యాఖ్యానించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకునే వరకు వేచి చూడడం మంచిది.– ఆర్సీ భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ -
PMJDY: నిరుపయోగంగా 13 కోట్ల బ్యాంక్ అకౌంట్స్!
దేశంలో మొత్తం 56.04 కోట్ల ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలలో 23 శాతం అకౌంట్స్ నిరుపయోగంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి 'పంకజ్ చౌదరి' వెల్లడించారు. 2025 జూలై 31 చివరి నాటికి 56.03 కోట్ల PMJDY ఖాతాలలో 13.04 కోట్లు నిరుపయోగంగా ఉన్నయని లోక్సభలో స్పష్టం చేశారు.ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2.75 కోట్ల జన్ ధన్ ఖాతాలు పనిచేయడం లేదని.. ఆ తరువాత జాబితాలో బీహార్ (1.39 కోట్ల ఖాతాలు), మధ్యప్రదేశ్ (1.07 కోట్ల ఖాతాలు) ఉన్నాయని పంకజ్ చౌదరి పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 18 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. ఒక పొదుపు ఖాతాలో రెండు సంవత్సరాలకు పైగా లావాదేవీలు జరగకపోతే దానిని పనిచేయని ఖాతాగా పరిగణించాలి.బ్యాంకులలో లావాదేవీలు జరగని లేదా ఇనాక్టివ్ ఖాతాల గురించి ఖాతాదారులకు లేఖలు లేదా ఈమెయిల్స్ ద్వారా తెలియజేయనున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. మొత్తం మీద ఈ ఖాతాలను మళ్ళీ యాక్టివ్ ఖాతాలుగా మార్చి.. ప్రజలు ఉపయోగించేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ పదేళ్ల కిందట కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేని ఇల్లు చాలానే ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేరుతో ఓ పథకం లాంచ్ చేశారు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?ఈ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు కేవలం డబ్బు పొదుపు చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందటానికి ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇది జీరో అకౌంట్. ఈ ఖాతా ద్వారా సులభంగా లోన్స్ పొందవచ్చు. అయితే చాలామంది ఈ ఖాతాల ద్వారా లావాదేవీలను జరపకపోవడంతో.. అకౌంట్స్ నిరుపయోగంగా మారాయి. వీటిని రీకేవైసీ ద్వారా మళ్ళీ యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. -
బ్యాంకింగ్ వ్యవస్థపై ఫిర్యాదుల గుదిబండ
భారత బ్యాంకింగ్ రంగం అధిక మొత్తంలో ఖాతాదారుల ఫిర్యాదులతో సతమతమవుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టెయినబిలిటీ రిపోర్ట్స్ (బీఆర్ఎస్ఆర్) ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అత్యధికంగా ఖాతాదారుల ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్ ముందుస్థానంలో ఉంది. సర్వీస్ డెలివరీ, డిజిటల్ ఇంటర్ఫేస్లను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ‘ఇతర’ కేటగిరీల కింద సమస్యలు పెరిగాయి. ఇందులో సైబర్ సెక్యూరిటీ, అత్యవసర సర్వీసులు అందించడంలో ఆలస్యం జరగడం వంటివి ఉన్నాయి.టాప్లో ఎస్బీఐ2025 బీఆర్ఎస్ఆర్ ప్రకారం ఎస్బీఐ అనధికారిక ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి 6.87 లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. అదనంగా రుణ మంజూరుతో సహా అత్యవసర సేవలను ఆలస్యంగా అందించినందుకు 12,502 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరం కంటే 7,223 పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 24.02 లక్షల ఫిర్యాదులతో పోలిస్తే ఎస్బీఐ ‘ఇతర’ కేటగిరీ కింద 21.50 లక్షల ఫిర్యాదులను నివేదించింది. ఈ కేటగిరీలో సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ ఆలస్యం.. వంటివాటి పరిధిలోకి రాని ఇతర ఫిర్యాదులు ఉంటాయి. అయితే, పారదర్శకత, ప్రతిస్పందనను మెరుగుపరచడానికి ఉద్దేశించిన బహుళ ఫిర్యాదుల పరిష్కార మార్గాలను బ్యాంక్ హైలైట్ చేసింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 2024 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 11.30 లక్షల ఫిర్యాదు సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగి 11.39 లక్షలకు చేరింది.బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)కి 5.34 లక్షల ఫిర్యాదులు రాగా, వీటిలో ఎక్కువ భాగం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ సేవలు, ఏటీఎం/డెబిట్ కార్డు సంబంధిత సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.ప్రైవేట్ బ్యాంకులు ఇలా..ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఫిర్యాదులు నమోదయ్యాయి. నిత్యావసర సేవల్లో జాప్యానికి సంబంధించి 4.97 లక్షల ఫిర్యాదులు రాగా, మార్చి నెలాఖరు నాటికి 8,782 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ‘ఇతర’ కేటగిరీ కింద 76,111 ఫిర్యాదులు రాగా, ప్రకటనలకు సంబంధించి 12,744, వాణిజ్య పద్ధతులకు సంబంధించి 4,438 ఫిర్యాదులు వచ్చాయి.ఐసీఐసీఐ బ్యాంక్లో సర్వీసుల ఆలస్యం ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 5.34 లక్షల ఫిర్యాదులను నివేదించింది. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 45,151 కేసులు పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్నాయి.హెచ్డీఎప్సీ బ్యాంక్లో ‘ఇతర’ కేటగిరీ కింద 4.42 లక్షల ఫిర్యాదులు అందాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల నుంచి ఇది తగ్గింది. 16,133 ఫిర్యాదులు ఇప్పటికీ పరిష్కరించలేదు.ఇదీ చదవండి: స్పెషాలిటీ స్టీల్ తయారీకి ప్రోత్సాహకాలు?ప్రధాన రుణదాతల్లో కస్టమర్ ఫిర్యాదులు స్థిరంగా పెరుగుతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలను స్వీకరించడం, సర్వీస్ డెలివరీ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల్లో అంతరాలను ఇది సూచిస్తుంది. బ్యాంకులు వాటి సర్వీసులు, సామర్థ్యాలను విస్తరించినప్పటికీ, అపరిష్కృత సమస్యలు, ముఖ్యంగా అత్యవసర సేవలను పరిష్కరించాల్సిన కార్యాచరణను హైలైట్ చేస్తుంది. -
స్పెషాలిటీ స్టీల్ తయారీకి ప్రోత్సాహకాలు?
భారత ప్రభుత్వం స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తి తయారీ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ విభాగంలో ఉత్పాదకత పెంచేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని పునరుద్ధరించేందుకు సన్నద్ధమవుతోంది. నిబంధనలను సడలించడం, పరిశ్రమ భాగస్వామ్యాన్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈమేరకు చర్యలు చేపడుతోంది.పీఎల్ఐ 1.2 లేదా పీఎల్ఐ 2.0గా పిలువబడే రాబోయే పథకంలో గణనీయమైన సడలింపులు ఉండనున్నాయి. వీటిలో పనితీరు, మెట్రిక్స్ కోసం బేస్ ఇయర్ను 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి మార్చాలని చూస్తున్నారు. ఉక్కు ఉత్పత్తిదారులకు మూలధన పెట్టుబడుల నిబంధనలను సడలించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం సంబంధిత మంత్రిత్వశాఖదేనని గుర్తించాలి. బ్రౌన్ ఫీల్డ్ సామర్థ్య విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, కనీసం 25 అదనపు హైఎండ్, స్పెషాలిటీ స్టీల్ ఉత్పాదకతను పెంచేందుకు పీఎల్ఐ కవరేజీని విస్తరించాలని భావిస్తున్నట్లు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు.ప్రస్తుత ఫ్రేమ్వర్క్లో కొంచెం కఠిన నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించడంతో పరిశ్రమ వాటాదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాటిని సవరించనున్నట్లు మంత్రి చెప్పారు. పీఎల్ఐ పథకాన్ని మరిన్ని ఎంఎస్ఎంఈ సంస్థలకు చేరువ చేయాలని, ఈ విభాగంలో స్వావలంబన సాధించడానికి అన్ని పరిశ్రమ సూచనలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పీఎల్ఐ 1.0, పీఎల్ఐ 1.1 కలిపి రూ.44,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అయితే, కొన్ని అర్హత నిబంధనలను సడలించడం ద్వారా మరిన్ని సంస్థలను ఈ పరిశ్రమలోకి తీసుకురావడానికి, మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్ దండగా?పీఎల్ఐ 1.2లో రాబోయే కీలక మార్పులు(అంచనా)స్టీల్కు సంబంధించి బ్రౌన్ ఫీల్డ్ సామర్థ్య విస్తరణను సులభతరం చేయనున్నారు. తప్పనిసరి గ్రీన్ ఫీల్డ్ సామర్థ్య జోడింపు సడలించే అవకాశం ఉంది.ఇంతకు ముందు ప్రోత్సాహక అర్హతతో ముడిపడి ఉన్న వార్షిక ఇంక్రిమెంటల్ ఉత్పత్తి లక్ష్యాలు ఇకపై తప్పనిసరి కాకపోవచ్చు.అంతర్జాతీయ, దేశీయ ఉక్కు మార్కెట్ల ఒడిదుడుకులను అంగీకరిస్తూ, ఎంఓయూ లక్ష్యాల కంటే ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ కంపెనీలు ప్రోత్సాహకాలు పొందడానికి అనుమతించవచ్చు. -
పక్కదారి పడుతున్న ‘పన్ను రహిత దిగుమతి’
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు తయారీ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో తీసుకొచ్చిన డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ (డీఎఫ్ఐఏ) పథకం (పన్ను రహిత దిగుమతి ధ్రువీకరణ పథకం) దుర్వినియోగం అవుతున్నట్టు ప్రైవేటు పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వెలుగులోకి తెచి్చంది. దోపిడీకి ఇది లైసెన్స్గా మారినట్టు ఆరోపించింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దీనికి చెక్ పెట్టాలని సూచించింది. లేదంటే ఎగుమతుల ప్రోత్సాహక విధానంపై ఉన్న నమ్మ కం పోతుందని, నిజాయితీ పరులైన ఎగుమతిదారులు వ్యాపారానికి దూ రం కావాల్సి వస్తుందని ఆందోళ న వ్యక్తం చేసింది. గత ఐదేళ్లలో కంపెనీలకు ఈ పథకం కింద జారీ చేసిన లైసెన్స్లపై ఫోరెన్సిక్ ఆడిట్ అవసరమని పేర్కొంది. సుంకాల్లేని మోసపూరిత దిగుమతులతో లబ్ధి పొందిన కంపెనీల నుంచి వసూళ్లు చేయాలని సూచించింది. డీఎఫ్ఐఏ కింద గత ఐదేళ్లలో దిగుమతి అయిన వాటిని పరిశీలించి, ఆశించిన ప్రయోజనాలకు విరుద్ధమైనవి ఏవైనా ఉంటే వాటిని పథకం నుంచి మినహాయించాలని జీటీఆర్ఐ కోరింది. ఈ పథకం దుర్వినియోగంపై వచి్చన ఫిర్యాదులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ గ్రేడ్ (డీజీఎఫ్టీ) దర్యాప్తు చేస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ స్పష్టత ఇచ్చింది. దుర్వినియోగం ఇలా.. ‘‘వాస్తవానికి డీఎఫ్ఐఏ అన్నది ఎగుమతిదారులకు తయారీ వ్యయాలను తగ్గించేందుకు ఉద్దేశించినది. కానీ, దోపిడీకి లైసెన్స్గా మారింది. అధిక విలువైన వేప్రొటీన్, కుంకుమపువ్వు, వాల్నట్, లిథియం అయాన్ బ్యాటరీలను సున్నా కస్టమ్స్ డ్యూటీపై ట్రేడర్లు దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని బిస్కెట్లు, పచ్చళ్లు, ట్రాక్టర్లకు ముడి సరుకులుగా చూపిస్తున్నారు. వాస్తవానికి వాటిని ఎందుకూ వినియోగించడంలేదు’’అని జీటీఆర్ఐ వివరించింది. -
క్రేజీ క్యాష్.. పెరుగుతున్న చలామణీ నగదు
రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం... 5 ఏళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది. 2020–21లో 2.08 లక్షల నకిలీ నోట్లను గుర్తిస్తే... 2024–25లో వాటి సంఖ్య 2.17 లక్షలకు పెరిగింది. ముఖ్యంగా రూ.500 (ఎమ్జీ కొత్త సిరీస్) అప్పట్లో 39 వేలకుపైగా ఉంటే... 5 ఏళ్ల తరవాత 1.17 లక్షలకు పైగా పెరగడం గమనార్హం.మరోపక్క డిజిటల్ లావాదేవీలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నా... దేశంలో చలామణీలో ఉన్న నగదు ఏటా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2024లో ఇది దాదాపు రెండు రెట్లు పెరగడం విశేషం. 2018లో రూ.18.29 లక్షల కోట్లు చలామణీలో ఉండగా, 2024 నాటికి ఇది రూ.35.11 లక్షల కోట్లకు చేరింది2018 నాటికి భారతదేశంలో చలామణీలో ఉన్న నగదు మొత్తం రూ.18.29 లక్షల కోట్లుగా నమోదైంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇది స్థిరంగా పెరుగుతూ వచ్చింది. 2019లో రూ.21.36 లక్షల కోట్లకు, 2020లో రూ.24.47 లక్షల కోట్లకు చేరింది. 2021 నాటికి ఈ మొత్తం రూ.28.53 లక్షల కోట్లకు పెరిగింది. 2022లో ఇది రూ.31.33 లక్షల కోట్లకు, 2023లో రూ.33.78 లక్షల కోట్లకు పెరిగింది. చివరకు 2024 నాటికి చలామణీలో ఉన్న నగదు రూ.35.11 లక్షల కోట్లకు చేరింది. అంటే 2018తో పోలిస్తే 2024లో దాదాపు రెట్టింపు వృద్ధి నమోదైంది. -
‘అమెరికా’ బాయ్కాట్ ప్రచారం
ఎగుమతిదారులను కలవరపెట్టి, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తూ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత, దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. అది అమెరికన్ ఉత్పత్తులను వదిలివేయాలంటూ డిమాండ్ చేసే దాకా వెళ్లింది. మెక్డొనాల్డ్స్ కోకా–కోలా అమెజాన్, ఆపిల్.. ఇలా అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు భారతదేశంలో బహిష్కరణ డిమాండ్స్ ఎదుర్కుంటున్నాయి.మన భారతం.. మహా మార్కెట్..ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, సంపన్న వినియోగదారుల పెరుగుతున్న స్థావరంగా కూడా మారుతోంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని వేగంగా విస్తరించిన అమెరికన్ బ్రాండ్లకు మన దేశం కీలకమైన మార్కెట్గా అవతరించింది. భారతీయ సంపన్నులు, అధికాదాయ వర్గాలు జీవితంలో ఉన్నతికి చిహ్నాలుగా భావిస్తూ అమెరికన్ అంతర్జాతీయ లేబుల్స్ పట్ల ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, భారతదేశం మెటా, వాట్సాప్కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్ అలాగే ఏ ఇతర బ్రాండ్ కంటే డొమినోస్వే దేశంలో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. పెప్సి కోకా–కోలా వంటి పానీయాలు మన సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఇక కొత్త ఆపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్బక్స్ కేఫ్ లో డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు మన వాళ్లంతా పొలోమంటూ క్యూలో నిలబడడం కనిపిస్తుందిపోటీ ఇస్తున్నాం.. విస్తరించలేకున్నాం...నిజం చెప్పాలంటే, భారతీయ రిటైల్ కంపెనీలు స్టార్బక్స్ వంటి విదేశీ బ్రాండ్లకు దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఒక సవాలుగా ఉంది. అయితే, భారతీయ ఐటి సేవల సంస్థలు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరపడ్డాయి, టిసిఎస్ , ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందిస్తున్నాయి. తరచు మన ప్రధాని స్వావలంబన కోసం పిలుపునిస్తూనే ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేస్తాయి, కానీ ‘ఇప్పుడు మనం భారతదేశ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.నిరసనల వెల్లువ..అమ్మకాలు దెబ్బతింటున్నాయనే తక్షణ సూచనలు లేనప్పటికీ, అమెరికా పన్నులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ పెరుగుతున్న డిమాండ్స్కు స్వదేశీ సంస్థల గొంతులు కూడా జత కలుస్తున్నాయి. వావ్ స్కిన్ సైన్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ చౌదరి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసిన తన వీడియో సందేశంలో ఈ విషయంపై స్పందించారు. ‘మేడ్ ఇన్ ఇండియా‘ని ‘గ్లోబల్ అబ్సెషన్‘గా మార్చడానికి వీలుగా మన రైతులకు, స్టార్టప్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా ఆహార, సౌందర్య ఉత్పత్తుల విజయాల నుంచి మనం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ‘మనం వేల మైళ్ల దూరంలో నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నాం. తమ స్వదేశంలో నిలదొక్కుకోవాలని ఓ వైపు మన తయారీదారులు పోరాడుతుంటే, మరోవైపు మనవి కాని బ్రాండ్లపై మనం గర్వంగా ఖర్చు చేస్తున్నాం‘ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చైనా మాదిరిగానే భారతదేశానికి కూడా స్వదేశంలో వృద్ధి చెందిన ఎక్స్(గతంలో ట్విట్టర్)/ గూగుల్/ యూట్యూబ్/ వాట్సాప్/ ఎఫ్బీ ఉండాలి’ అని కారు డ్రైవర్ను కాల్ సర్వీస్ ద్వారా సరఫరా చేసే భారతదేశ సంస్థ ‘డ్రైవ్యూ’ సీఈఓ రహ్మ్ శాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా పనిచేసే స్వదేశీ జాగరణ్ మంచ్ గ్రూప్ భారతదేశం అంతటా బహిరంగ ర్యాలీలు నిర్వహించి, అమెరికన్ బ్రాండ్లను బహిష్కరించాలని ప్రజలను కోరుతోంది. ‘ప్రజలు ఇప్పుడు భారతీయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారు. అయితే ఇది విజయవంతం కావడానికి మరి కొంత సమయం పడుతుంది‘ అని గ్రూప్ సహ–కన్వీనర్ అశ్వని మహాజన్ అంటున్నారు. ‘ఇది జాతీయవాదం, దేశభక్తికి పిలుపు‘ అని అన్నారాయన. విదేశీ ఉత్పత్తుల స్థానంలో వాటి కంటే మంచివి, ప్రజలు ఎంచుకోగల భారతీయ బ్రాండ్ల స్నానపు సబ్బులు, టూత్పేస్ట్ శీతల పానీయాల జాబితాను ఈ సంస్థ సోషల్ మీడియాలో, షేర్ చేస్తోంది. జాబితా చేశారు. అలాగే ‘విదేశీ ఆహార సంస్థలను బహిష్కరించండి‘ అంటూ మెక్డొనాల్డ్స్ అనేక ఇతర రెస్టారెంట్ బ్రాండ్ల లోగోలతో ప్రచారం చేస్తున్నారు.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఓ వైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఊపందుకుంటున్నా అమెరికన్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన రెండవ షోరూమ్ను న్యూఢిల్లీలో ప్రారంభించింది, ఈ ప్రారంభోత్సవానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు- సత్య బాబు -
ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు!
న్యూఢిల్లీ: సామాన్యులకు వస్తు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు వీలుగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండు రేట్ల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి. విలాస, హాని కారక వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు అమలు కానుంది. దీంతో నిత్యావసరాలు, వాహనాలు సహా ఎన్నో రకాల వస్తు, సేవల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త విధానాన్ని అమలు చేయాలన్న సంకల్పాన్ని ఆర్థిక శాఖ వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జీఎస్టీ చట్టాన్ని సంస్కరించనున్నట్టు ప్రకటించారు. పన్నుల భారం గణనీయంగా తగ్గుతుందంటూ, దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించారు. రోజువారీ వినియోగ వస్తువుల రేట్లు చౌకగా మారనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీలోనే ఎన్నో పన్నులు.. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. కొన్నింటిని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించగా, విలాస వస్తువులు, సిగరెట్లు వంటి హానికారక (సిన్గూడ్స్) వస్తువులపై 28 శాతం రేటుకు అదనంగా కాంపెన్సేషన్ సెస్ (రాష్ట్రాల కోసం ఉద్దేశించిన పరిహార పన్ను) అమలవుతోంది. 5% పన్ను పరిధిలో 21 శాతం వస్తువులు ఉన్నాయి. 12% పన్ను రేటు కింద 19 శాతం.. 18% పన్ను పరిధిలో 44% వస్తు సేవలు ఉన్నాయి. 12% శ్లాబును ఎత్తివేసి ఇందులో ఉన్న వస్తు, సేవలను 5, 18 శాతం రేట్ల పరిధిలోకి మార్చొచ్చని తెలుస్తోంది. 12 శాతం రేటు పరిధిలోని 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి వెళ్లనున్నట్టు.. 28 శాతం పరిధిలోని 90 శాతం వస్తు సేవలు 18 శాతం రేటు పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు, ఆన్లైన్ గేమింగ్ తదితర కొన్ని 40 శాతం పన్ను పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక ఇంధనాలు, హస్తకళలు, వ్యవసాయం, ఆరోగ్యం, బీమా తదితర రంగాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బంగారంపై 3 శాతం ప్రత్యేక రేటు అమలవుతోంది. దీన్ని అలాగే కొనసాగిస్తారా? లేక 5 శాతం రేటు పరిధిలోకి తెస్తారా? అన్న దానిపై ఇప్పటికి స్పష్టత లేదు. రేట్ల తగ్గింపు కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దీన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. అలాగే, విలాసవంత, హానికారక వస్తువులపై 28 శాతం పన్నుకు అదనంగా అమలు చేస్తున్న కాంపెన్సేషన్ సెస్సు గడువు 2026 మార్చి 31తో ముగియనుంది. ఈ రూపంలో వచ్చే ఆదాయం ఆ తర్వాత తగ్గనుంది. అయితే, దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే, రేట్ల తగ్గింపుతో వినియోగం పెరిగి, అదనపు ఆదాయం సమకూరుతుందన్నది ఆర్థిక శాఖ అంచనా. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చన జీఎస్టీ విధానంలో తొలిసారి పెద్ద ఎత్తున మార్పు చోటుచేసుకోనుంది. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, దీన్ని సరైన సమయంలో సరైన చర్యగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్లో కీలక భేటీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలోనే సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను తగ్గింపు సహా జీఎస్టీలో రేట్ల క్రమబదీ్ధకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పన్నుల తగ్గింపు వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది. గుర్తింపు పరమైన వివాదాలను తొలగిస్తుందని, కొన్ని రంగాలకు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను సరిచేస్తుందని.. రేట్ల పరమైన స్థిరత్వం ఏర్పడి వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని భావిస్తోంది. రాష్ట్రాల విస్తృత ఏకాభిప్రాయంతో తదుపరి తరం సంస్కరణలను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి భేటీలో మంత్రుల బృందం సిఫారసులపై చర్చిస్తుంది. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీంతో ఆశించిన ప్రయోజనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సాకారమవుతాయి’’అని పేర్కొంది. -
జీఎస్టీ స్లాబ్ల తగ్గింపునకు కేంద్రం అడుగులు!
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించే పనిని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు ప్రధాన స్లాబ్లను కుదించి రెండు ప్రధాన స్లాబ్లుగా మారుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం, స్లాబ్లను రద్దు చేసి 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచినట్లు సమాచారం.నూతన ప్రతిపాదనల ప్రకారం.. 28 శాతం స్లాబ్ పరిధిలోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి, అలాగే 12 శాతం స్లాబ్ పరిధిలోని 99 శాతం వస్తువులను 5 శాతం కిందికి తీసుకురానున్నారు. ప్రస్తుతం 12 శాతం స్లాబ్లో ఉన్న టూత్పేస్ట్, మొబైల్ ఫోన్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బట్టలు, బూట్లు వంటి మధ్యస్థాయి వినియోగ వస్తువులను 5 శాతం స్లాబ్లోకి మార్చే యోచన ఉంది. ఇదే సమయంలో, 28 శాతం స్లాబ్లో ఉన్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని సేవలను 18 శాతం స్లాబ్లోకి తరలించనున్నారు.ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా రెండు స్లాబ్లే కొనసాగనున్నప్పటికీ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ స్లాబ్లో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి కేవలం 5–7 వస్తువులే ఉండే అవకాశం ఉంది.ఈ మార్పుల వల్ల నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలపై నెలవారీ ఖర్చుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం అంచనా ప్రకారం, ఈ స్లాబ్ మార్పుల వల్ల రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం జరగవచ్చని భావిస్తున్నప్పటికీ, వినియోగం పెరిగి, పన్ను ఆదాయం తిరిగి స్థిరపడే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి లేవు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జీఎస్టీ మార్పులను "డబుల్ దీపావళి గిఫ్ట్"గా ప్రజలకు ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకరించడం ద్వారా ప్రజలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. -
వేగంగా వాణిజ్య ఒప్పందాలు
అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఎగుమతులను ఇతోధికం చేసుకునే దిశగా కేంద్ర సర్కారు చర్యలపై దృష్టి సారించింది. వాణిజ్య ఒప్పందాలపై చర్చలను వేగవంతం చేయడంతోపాటు, వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం ద్వారా ఎగుమతులు పెంచుకోవాలని భావిస్తోంది. ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంతోపాటు, ఎగుమతులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం, ఎగుమతులను పలు దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవడం, దిగుమతుల్లోనూ వైవిధ్యంపై వాణిజ్య శాఖ దృష్టి సారించినట్టు ఆ శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు.సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందానికి అమోదాన్ని వేగవంతం చేయాలని యూకేని కోరినట్టు చెప్పారు. ఈ ఏడాది జూలై 24న దీనిపై రెండు దేశాలు సంతకాలు చేయడం గమనార్హం. ఐరోపా సమాఖ్య (ఈయూ)తోనూ చర్చలను వేగవంతం చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది చివరికి ముగింపునకు రావొచ్చన్నారు. ఒమన్తో సంప్రదింపులు ముగిశాయని, రెండు దేశాలకు అనుకూలమైన తేదీన ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్టు చెప్పారు. ఇక న్యూజిలాండ్, పెరూ, చిలీతోనూ చర్చలు పురోగతితో సాగుతున్నట్టు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబన10 దేశాల ఆసియా కూటమితోనూ సమీక్షపై సంప్రదింపులు చేస్తున్నట్టు భత్వాల్ తెలిపారు. ప్రధానంగా 50 దేశాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహానికి పలు పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, వాటిని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దిగుమతులకు కొన్ని దేశాలపైనే ఎక్కువగా ఆధారపకుండా వైవిధ్యం చేసుకోవాల్సి ఉందన్నారు. -
రష్యా చమురు కొనుగోళ్లు ఆపలేదు
అమెరికా టారిఫ్ల బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికనే ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థలు కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో కొనుగోళ్లను తగ్గించాలని గానీ లేదా మరింతగా పెంచాలని గానీ తమకు ఎలాంటి సూచనలు రాలేదని సాహ్ని చెప్పారు.రష్యా చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవని, వాటికి విరుద్ధమైనవేమీ భారత్ చేయలేదని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరికి ముందు భారత చమురు దిగుమతుల్లో 1 శాతం కన్నా తక్కువగా రష్యా వాటా ఉండేది. కానీ ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఇంధనంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత నుంచి ఇది 30 శాతానికి పెరిగింది. ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానంఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఐవోసీ రిఫైనరీలు ప్రాసెస్ చేసిన క్రూడాయిల్లో 22–23 శాతం వాటా రష్యా దిగుమతులది ఉంటోంది. అటు బీపీసీఎల్ క్రూడాయిల్ రిఫైనింగ్లో 34 శాతంగా నమోదైంది. మరోవైపు రష్యా చమురుపై డిస్కౌంట్లు, బ్యారెల్పై 1.5 డాలర్లకు తగ్గడంతో గత నెల దిగుమతులు కొంత తగ్గినట్లు బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వెత్సా రామకృష్ణ గుప్తా తెలిపారు. -
రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపటితో 79 ఏళ్లు పూర్తవుతాయి. బ్రిటిష్ రాచరిక పాలన అంతమైన 1947 సమయంలో ఇండియన్ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. క్రమంగా అది మారుతూ ప్రస్తుతం రూ.87.65కు చేరింది. ఇలా డాలర్ పెరిగి రూపాయి విలువ తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. స్వాతంత్ర్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్-రూపాయి పరిణామం ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.రూపాయి విలువను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..వాణిజ్యం: భారత్ విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు, ఇతర ప్రాంతాలకు చేసే ఎగుమతుల సమతుల్యత వల్ల రూపాయి ప్రభావం చెందుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తే రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ కరెన్సీలకు డిమాండ్ పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: దేశంలోని అధిక ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది.వడ్డీ రేట్లు: అధిక వడ్డీ రేట్లు విదేశీ మూలధనాన్ని ఆకర్షిస్తాయి. రూపాయి విలువను పెంచుతాయి.విదేశీ మారక నిల్వలు: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే ఫారెన్ కరెన్సీ వల్ల రూపాయి స్థిరంగా ఉంటుంది. విదేశీ కరెన్సీ రాకపెరిగితే రూపాయి విలువ పెరుగుతుంది.రాజకీయ, ఆర్థిక పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందాలంటే రాజకీయ అనిశ్చితులు ఉండకూడదు. స్పష్టమైన రాజకీయ నాయకత్వ పరిస్థితులు లేకపోయినా రూపాయి పతనమయ్యే అవకాశం ఉంటుంది.చమురు ధరలు: భారత్ గణనీయంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకోసం డాలర్లు చెల్లించాల్సిందే. భారత్ వద్ద ఉన్న ఫారెన్స్ కరెన్సీ రిజర్వులు అందులో ఉపయోగపడుతాయి. అయితే చమురు ధరలు పెరగితే చెల్లింపులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దాంతో డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది.కొన్ని నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ.3.30గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విలువ క్రమంగా పడిపోయింది. 1947 నుంచి 2025 వరకు ఇండియన్ రూపాయి పరిణామక్రమం కింది విధంగా ఉంది. -
ఎస్బీఐ ‘ఐఎంపీఎస్’ చార్జీలు
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ (ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీలను సవరిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఆన్లైన్లో ఐఎంపీఎస్ ద్వారా నిర్వహించే నగదు బదిలీ రూ.25,000 దాటితే రూ.2 నుంచి రూ.10 వరకు చార్జీ, దీనిపై జీఎస్టీ అమలవుతుంది. రూ.25,000కు పైన రూ.లక్షలోపు లావాదేవీపై రూ.2, రూ.1–2 లక్షల లావాదేవీపై రూ.6, రూ.2–5 లక్షల లావాదేవీలపై రూ.10 చొప్పున చార్జీతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.. బ్యాంక్ శాఖల ద్వారా నిర్వహించే ఐఎంపీఎస్ లావాదేవీలపై ఇక ముందూ ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొంది. వేతన ఖాతాదారులు సైతం ఎలాంటి చార్జీల్లేకుండా ఐఎంపీఎస్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కరెంట్ ఖాతా (గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడియం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి)లకూ ఈ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. -
మైనస్లోనే టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయికి దిగొచి్చంది. జూలైలో మైనస్ 0.58 శాతంగా (ప్రతి ద్రవ్యోల్బణం) నమోదైంది. జూన్లోనూ ఇది మైనస్ 0.13 శాతంగా ఉంది. గతేడాది జూలైలో 2.10 శాతంగా ఉండడం గమనార్హం. ఆహార వస్తువులు, మినరల్ ఆయిల్, ముడి చమురు, సహజ వాయువు, బేసిక్ మెటల్స్ ధరలు తగ్గడం వల్ల జూలై నెలకు టోకు ద్రవ్యోల్బణం ప్రతికూలంగా నమోదైనట్టు పరిశ్రమల శాఖ పేర్కొంది. → ఆహార వస్తు విభాగంలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 6.29%గా నమోదైంది. జూన్లో మైనస్ 3.75%గా ఉంది. ముఖ్యంగా ఈ విభాగంలో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గడంతో ద్రవ్యోల్బణం మైనస్ 28.96 శాతంగా నమోదైంది.→ ఇంధనం, విద్యుత్ విభాగంలో మైనస్ 2.43 శాతంగా ఉంది. → తయారీ వస్తు విభాగంలో ద్రవ్యోల్బణం 2.05 శాతానికి పెరిగింది. జూన్లో ఇది 1.97%. ఆగస్ట్లో మళ్లీ ప్లస్లోకి.. ‘‘ఆహార విభాగం కారణంగానే జూలైలో టోకు ద్రవ్యోల్బణం మైనస్లో కొనసాగింది. కూరగాయలు, పప్పులు, గుడ్లు, మాంసం, చేపల ధరలు ఎక్కువగా తగ్గాయి. వినియోగ ధరల (రిటైల్) ద్రవ్యోల్బణం లాగే టోకు ద్రవ్యోల్బణం సైతం జూలైలో కనిష్టానికి చేరింది. ఆగస్ట్ నుంచి తిరిగి ప్లస్లోకి చేరుకుంటుంది’’ అని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు. -
భారత్కు రేటింగ్ బూస్ట్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యలోటు కట్టడి విషయంలో ప్రభుత్వ క్రమశిక్షణను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ గుర్తించింది. ద్రవ్యోల్బణ నియంత్రణ అనుకూల పరపతి విధానాలనూ పరిగణనలోకి తీసుకుంటూ.. భారత సార్వబౌమ రేటింగ్ను బీబీబీ మైనస్ నుంచి ‘బీబీబీ’ స్టేబుల్ అవుట్లుక్ (స్థిరమైన దృక్పథం)కు అప్గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థను నిర్జీవమైనదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన కొన్ని రొజులకే.. ఎస్అండ్పీ తన చర్యతో అసలు నిజమేంటో నిరూపించింది. 18 ఏళ్ల విరామం తర్వాత భారత రేటింగ్ను ఎస్అండ్పీ అప్గ్రేడ్ చేయడం గమనార్హం. 2007 జనవరిలో భారత సావరీన్ రేటింగ్ను బీబీబీ మైనస్ (అతి తక్కువ పెట్టుబడుల గ్రేడ్)కు తగ్గిస్తూ ఎస్అండ్పీ నిర్ణయం ప్రకటించింది. ఆ తర్వాత రేటింగ్ సవరణ మళ్లీ ఇదే. గతేడాది మే నెలలో భారత క్రెడిట్ రేటింగ్ అవుట్లుక్ను స్థిరత్వం నుంచి సానుకూలానికి మారుస్తూ.. వచ్చే 24 నెలల్లో రేటింగ్ అప్గ్రేడ్ ఉండొచ్చంటూ సంకేతం పంపింది. దీర్ఘకాల అన్సాలిసైటెడ్ (స్వచ్ఛంద) సావరీన్ క్రెడిట్ రేటింగ్స్ను బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి.. స్వల్పకాల రేటింగ్స్ను ఏ–3 నుంచి ఏ–2కు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అప్గ్రేడ్ చేసింది. దీనివల్ల భారత కంపెనీలు మరింత తక్కువ రేట్లపై అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే వెసులుబాటు లభిస్తుంది. బీబీబీ అన్నది ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్. తన రుణాలను సౌకర్యవంతంగానే చెల్లించగలదని ఇది సూచిస్తుంది. ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు ‘‘ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరు చూపుతున్న దేశాల్లో భారత్ ఇక ముందూ తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వ వ్యయాల తీరు గత ఐదారేళ్ల కాలంలో మెరుగుపడింది. అమెరికా టారిఫ్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎదుర్కోతగినదే. 50% టారిఫ్ల విధింపు వృద్ధిని ఏమంత కిందకు తోసేయదు. వాణిజ్య ఎగుమతులపై భారత్ తక్కువగా ఆధారపడి ఉన్నది. 60% ఆర్థిక వృద్ధి దేశీ వినియోగం రూపంలోనే ఉంటోంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ఆర్థిక వృద్ధి సరైన దిశలోనే ఉన్నందున ద్రవ్య స్థిరీకరణకు మరింత నిర్దిష్టమైన మార్గాన్ని రూపొందించుకోవాలని సూచించింది.ఇక ముందూ ఇదే ఒరవడి..: ఆర్థిక శాఖ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ చురుగ్గా, చైతన్యంగా, బలంగా ఉందని రేటింగ్ అప్గ్రేడ్ రుజువు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఒకవైపు మౌలిక వసతుల కల్పన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, మరోవైపు ద్రవ్య స్థిరీకరణకు భారత్ ప్రాధాన్యం ఇచి్చందని, దీని ఫలితమే రేటింగ్ అప్గ్రేడ్ అంటూ ఎక్స్ ప్లాట్ఫామ్పై పేర్కొంది. చురుకైన ఈ వృద్ధిని భారత్ ఇక ముందూ కొనసాగిస్తూ, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు వీలుగా అవసరమైన సంస్కరణలు చేపడుతుందని తెలిపింది. -
జులైలో ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: ఎగుమతులు రెండు వరుస నెలల క్షీణత తర్వాత జూలైలో పుంజుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 7.29% వృద్ధితో 37.24 బిలియన్ డాలర్ల విలువైన (రూ.3.24 లక్షల కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. దిగుమతులు సైతం 8.6% పెరిగి 64.59 బిలియన్ డాలర్ల (రూ.5.62 లక్షల కోట్లు)కు చేరాయి. దీంతో వాణిజ్య లోటు ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరి, 27.35 బిలియన్ డాలర్లుగా (రూ.2.38 లక్షల కోట్లు) నమోదైంది. గతేడాది నవంబర్ (31.77 బిలియన్ డాలర్లు) తర్వాత ఇదే గరిష్ట వాణిజ్య లోటు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3% పెరిగి 149.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో దిగుమతులు 5%కి పైగా పెరిగి 244 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్య లోటు 4 నెలల్లో 94.81 బిలి యన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత వస్తు, సేవల ఎగుమతులు మంచి పనితీరు చూపిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఎగుమతులే ఎక్కువ వృద్ధిని సాధించినట్టు చెప్పారు. ఇంజనీరింగ్, ఎల్రక్టానిక్స్, రత్నాభరణాలు, ఫార్మా, కెమికల్స్ ఎగుమతుల్లో బలమైన పనితీరు చూపాయి. -
భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
న్యూఢిల్లీలో తాజాగా జరిగిన మూడో భారత్-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ (ఐఎస్ఎంఆర్) సమావేశం విజయవంతంగా ముగిసింది. అధిక ప్రభావం ఉన్న రంగాల్లో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్-సింగపూర్ పనిచేస్తున్నట్లు ఇరుదేశాల ప్రతినిధులు తెలిపారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సెప్టెంబర్లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.ఈ ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఆరు అంశాలపై చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.డిజిటలైజేషన్స్కిల్ డెవలప్మెంట్సుస్థిరతహెల్త్ కేర్ & మెడిసిన్అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కనెక్టివిటీసెమీకండక్టర్స్ అండ్ గ్రీన్ ఎనర్జీభారత్ సెమీకండక్టర్ల తయారీ ఆశయాలకు సింగపూర్ మద్దతు ప్రకటించింది. అదనంగా ఇరుపక్షాలు గ్రీన్ హైడ్రోజన్ సహకారాన్ని అన్వేషిస్తున్నట్లు చెప్పాయి. రాబోయే రోజుల్లో ఒడిశా హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారుతుందని తెలిపాయి.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుభారత్లో ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్ సహకరిస్తుందని తెలిపింది. ఒడిశాలోని ఒక కేంద్రంలో ఏటా 3,000 మంది యువ భారతీయులకు మెకట్రానిక్స్, హెచ్వీఏసీ వ్యవస్థల్లో శిక్షణ ఇవ్వనున్నారు.డేటా, ఫైనాన్షియల్ కోఆపరేషన్రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సీమాంతర డేటా ట్రాన్స్మిషన్ను క్రమబద్ధీకరించడానికి, క్యాపిటల్ మార్కెట్ ఏకీకరణను బలోపేతం చేయడానికి అవసరమైన ఫ్రేమ్వర్క్లను చర్చించారు.సింగపూర్ నుంచి భారత్ దిగుమతులు: 21.3 బిలియన్ డాలర్లుసింగపూర్కు భారత ఎగుమతులు: 13 బిలియన్ డాలర్లువిదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎప్డీఐ): భారత్కు సింగపూర్ నుంచే అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరుతున్నాయి. ఇది మొత్తం ఎఫ్డీఐ రాకలో 24% దోహదం చేస్తుంది. గత 25 సంవత్సరాలలో 174.8 బిలియన్ డాలర్లు సమకూరాయి.ఇదీ చదవండి: అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం -
యూపీఐలోని ఫీచర్ నిలిపివేత?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సంబంధిత మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పుల్ ట్రాన్సాక్షన్స్ అని పిలువబడే పర్సన్-టు-పర్సన్ (పీ 2 పీ) డిజిటల్ చెల్లింపులను నిలిపివేయాలని చూస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈ విషయం తెలిసిన వారిని ఉటంకిస్తూ కొన్ని సంస్థలు వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎన్పీసీఐ ఇప్పటికే బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలకు తెలియజేసినట్లు అందులో తెలిపాయి. యూపీఐ యాక్టివిటీలో పీ2పీ పుల్ ట్రాన్సాక్షన్స్ కేవలం 3% మాత్రమే ఉన్నాయని, తద్వారా ఎన్పీసీఐ ఈ ఫీచర్ను ఉపసంహరించుకోవడం సులభమవుతుందని పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి.యూపీఐ పుల్ ట్రాన్సాక్షన్ ఫీచర్ అంటే ఏమిటి?యూపీఐ పుల్ లావాదేవీని కలెక్ట్ రిక్వెస్ట్ అని కూడా పిలుస్తారు. ఏదైనా షాపుకు వెళ్లి సాధారణంగా క్యూఆర్ స్కాన్ చేసి మనీ పంపాలనుకునేవారు ఎంత మొత్తం చెల్లించాలో ఎంటర్ చేసి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకు భిన్నంగా కొన్ని సందర్భాల్లో డబ్బు తీసుకునేవారే ఎంత కావాలో ఓటీపీ, బార్కోడ్, మెసేజ్ లింక్ రూపంలో రెక్వెస్ట్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేసి డబ్బు పంపాలనుకునేవారు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే వెంటనే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు గ్రహీతలు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించలేక ఎదుటివారు డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. పైగా యూపీఐ మొత్తం లావాదేవీల్లో ఇది 3 శాతం మాత్రమే. ఎన్పీసీఐ దీని నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?ఇదిలాఉండగా, ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
టారిఫ్లు ఆర్నెల్లు మించి ఉండవు..
ముంబై: అమెరికా టారిఫ్లకు సంబంధించి సవాళ్లు వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో సమసిపోతాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. దేశం దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రైవేటు రంగం మరింత ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 2023–24లో జీడీపీ వృద్ధి 9.2 శాతం నుంచి 2024–25లో 6.5 శాతానికి తగ్గిపోవడానికి కఠిన రుణ పరిస్థితులు, లిక్విడిటీ అంశాలను కారణాలుగా పేర్కొన్నారు. సరైన వ్యవసాయ విధానాలను అమలు చేస్తే నిజమైన జీడీపీ వృద్ధికి 25 శాతం అదనపు తోడ్పాటునిస్తాయన్నారు. రత్నాభరణాలు, రొయ్యలు, టెక్స్టైల్స్ రంగాలపై అమెరికా టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ, వీటిని ఎదుర్కోవడం కష్టమన్నారు. ప్రభావిత రంగాలతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయంటూ, కొంత ఓపిక పట్టాలని కోరారు. అమెరికా వాణిజ్య బృందం ఈ నెల చివర్లో భారత్కు చర్చలకు రానున్న నేపథ్యంలో.. అలాస్కాలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగే సమావేశం ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. టారిఫ్ సంబంధిత అంశాలపై దృష్టి పెడుతూ.. అదే సమయంలో ముఖ్యమైన సవాళ్లను విస్మరించరాదన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా పడే ప్రభావం, కీలక ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడడం వంటి సవాళ్లను ప్రస్తావించారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో, ప్రైవేటు రంగం సైతం దీర్ఘకాల దృష్టితోనే ఆలోచించాలని సూచించారు. విధానపరమైన మద్దతు పరిశోధనల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తమ వంతు పెట్టుబడులు పెంచాల్సిన బాధ్యత ప్రైవేటు రంగంపై ఉన్నట్టు సీఈఏ అనంత నాగేశ్వరన్ చెప్పారు. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దేశీయంగా వినియోగం బలంగా ఉన్నట్టు చెప్పారు. చైనాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ.. దిగుమతులను మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించాలని కోరారు. -
ఇక చకచకా చెక్కుల క్లియరెన్స్
ముంబై: చెక్కులను వేగంగా క్లియర్ (చెల్లింపులు) చేసే దిశగా ఆర్బీఐ అక్టోబర్ 4 నుంచి కొత్త యంత్రాంగాన్ని అమల్లోకి తీసుకురానుంది. బ్యాంక్లో చెక్కు సమర్పించిన గంటల్లోనే అది నగదుగా మారిపోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద రెండు పనిదినాల వరకు సమయం తీసుకుంటోంది. కొత్త విధానంలో చెక్కులను స్కాన్ చేసి వాటిని వెంటనే క్లియరింగ్ హౌస్కు బ్యాంక్లు పంపాల్సి ఉంటుంది. దీంతో క్లియరింగ్ సైకిల్ టీప్లస్1 (సమర్పించిన తర్వాతి రోజు) నుంచి కొన్ని గంటలకు తగ్గిపోనుంది.సీటీఎస్లో బ్యాచ్ ప్రాసెసింగ్ నుంచి కంటిన్యూయెస్ క్లియరింగ్ విత్ ‘ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్’కు బ్యాంక్లు మారిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంక్లకు ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. ‘‘సీటీఎస్ నుంచి కంటిన్యూయెస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆన్ రియలైజేషన్కు రెండు దశల్లో మారిపోవాలని నిర్ణయించడమైంది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండో దశ 2026 జనవరి 3 నుంచి అమల్లోకి వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకటే సెషన్ (చెక్కుల సమర్పణ) ఉంటుంది’ అని ఆర్బీఐ పేర్కొంది. -
టారిఫ్లు భారత్ వృద్ధిని ఆపలేవు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు భారత వృద్ధిని అడ్డుకోలేవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత్ ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని గుర్తు చేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అంచనా సానుకూలంగానే కొనసాగుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ యీఫార్న్ ఫువా స్పష్టం చేశారు. భారత సార్వభౌమ రేటింగ్ను బీబీబీ మైనస్ నుంచి సానుకూలానికి అప్గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్అండ్పీ గతేడాది మేలో ప్రకటించడం తెలిసిందే. బలమైన వృద్ధి అవకాశాలను ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్అండ్పీ అంచనాగా ఉంది. భారత్పై ఈ నెల 6 నుంచి 25 శాతం టారిఫ్లను యూఎస్ అమలు చేస్తుండడం, ఆగస్ట్ 27 నుంచి మరో 25 శాతం మేర టారిఫ్లు అమలు కానున్న నేపథ్యంలో ఎస్అండ్పీ గ్లోబల్ తన విశ్లేషణను వెల్లడించింది. టారిఫ్ల విధింపు భారత సానుకూల ఔట్లుక్ను తగ్గించొచ్చా? అన్న సందేహంపై యీఫార్న్ స్పందించారు. అమెరికాతో వాణిజ్యం భారత జీడీపీలో 2 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులకు టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్నట్టు చెప్పారు. దీర్ఘకాలంలో అధిక టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై ఏమంత ప్రభావం చూపించబోవంటూ.. సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడులపైనా ప్రభావం ఉండదు.. అమెరికా టారిఫ్లు భారత్లో పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయా? అన్న ప్రశ్నకు ఈఫార్న్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లలో చైనా ప్లస్ వన్ విధానం ఫలితమిచ్చినట్టు చెప్పారు. భారత్లో వ్యాపారాన్ని ప్రారంభించిన కంపెనీలు దేశీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకునే ఆ పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్కు వచ్చే చాలా వరకు పెట్టుబడులు యూఎస్కు ఎగుమతుల కోసం ఉద్దేశించినవి కావు. దేశీయంగా భారీ డిమాండ్ ఉండడమే కారణం. మధ్యతరగతి వర్గం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ఎగుమతులు చేయాలనుకునే వాటికి యూఎస్ మార్కెట్ ప్రధానంగా ఉండకపోవచ్చు’’ అని ఈఫార్న్ వివరించారు. 2021–25 మధ్య భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమానార్హం. దేశ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకే వెళ్లాయి. భారత్ దిగుమతుల్లో అమెరికా వాటా 6.22 శాతంగా ఉంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా భారత్ 35.32 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది. -
ట్రంప్.. సంప్రదింపులా? అధికార ప్రయోగమా?
భారత్, బ్రెజిల్ దేశాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు ఆచరణ సాధ్యం కాదని, రాజకీయంగా ప్రమాదకరమని ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అమెరికా వాణిజ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బ్రెజిల్ ఫైనాన్షియల్ పబ్లికేషన్ వాలర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు. యూఎస్ అనుసరిస్తున్న ఈ చర్య దీర్ఘకాలిక దౌత్య, ఆర్థిక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు.అమెరికా వ్యతిరేకిగా ముద్రరష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తున్నందుకు శిక్షగా పేర్కొంటూ ట్రంప్ ఇటీవల భారీ సుంకాలను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్పై ట్రంప్ ‘అమెరికా వ్యతిరేకి’గా ముద్ర వేసి ఇలాంటి సుంకాలు విధించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న రఘురామ్ రాజన్ ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.యూఎస్కు భారత్ భయపడితే..‘తలకు తుపాకీ గురిపెట్టి వాణిజ్య సంప్రదింపులు జరపడం కష్టం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇవి వాణిజ్య సంప్రదింపులు కావు. అధికార ప్రయోగం. ఇండియా ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు కోరుకుంది. అందుకు భిన్నంగా అకస్మాత్తుగా దాడి చేయడం సరికాదు. రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇలా సుంకాలతో బయపెట్టాలనుకోవడం తగదు. ఈ తీరు రాజకీయ ప్రతిఘటనను సృష్టిస్తుంది. రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్లు అవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో చెడు సంకేతాలకు దారితీస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!యూఎస్కు కూడా నష్టమే..‘అమెరికా అనుసరిస్తున్న దూకుడు సుంకాల వల్ల ఆర్థిక పతనం ఏకపక్షంగా ఉండదు. అమెరికాకు 80 బిలియన్ డాలర్ల వరకు భారత ఎగుమతులు లాభసాటిగా ఉండవు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యాపిల్ వంటి సంస్థల ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 50 శాతం సుంకాలు భరించడం భారత్కు మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని భావిస్తున్న అమెరికాకు కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ప్రజలు చాలా కాలం గుర్తుంచుకుంటారు. యూఎస్ నేడు ఒక దేశంపై, రేపు మరో దేశంపై 50 శాతం సుంకాలు విధిస్తూపోతే అనిశ్చితి వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలుగుతుంది’ అని రాజన్ హెచ్చరించారు. -
రూ.5.82 లక్షల కోట్ల రుణాల మాఫీ
ప్రభుత్వరంగ బ్యాంక్లు (పీఎస్బీలు) గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.82 లక్షల కోట్ల మొండి రుణాలను (వసూలు కాని/ఎన్పీఏలు) మాఫీ (రద్దు) చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్వయంగా రాజ్యసభకు ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.91,260 కోట్లను మాఫీ చేసినట్టు చెప్పారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు.అత్యధికంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.33 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. 2021–22లో రూ.1.16 లక్షల కోట్లు, 2022–23లో రూ.1.27 లక్షల కోట్ల చొప్పున మాఫీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇలా మాఫీ చేసిన మొత్తం నుంచి గత ఐదు సంవత్సరాల్లో వసూలైన మొత్తం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం మాఫీ రుణాల్లో వసూలైంది 28 శాతమే. ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎన్పీఏలకు బ్యాంక్లు ప్రొవిజన్లు చేయాల్సి ఉంటుంది. ఇలా నూరు శాతం కేటాయింపుల తర్వాత నిబంధనల కింద పుస్తకాల్లో మాఫీ చేసినట్టు చూపిస్తాయి. అయినా, వాటి వసూలుకు బ్యాంకులు చర్యలు చేపడుతూనే ఉంటాయి. మాఫీ చేసినప్పటికీ రుణ గ్రహీతలపై చెల్లింపుల బాధ్యత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. -
స్వల్పంగా తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
ప్రత్యక్ష పన్నుల రూపంలో ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్1 నుంచి ఆగస్ట్ 11 వరకు) రూ.6.64 లక్షల కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.6.91 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 3.95 శాతం మేర తగ్గినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి విడుదల చేసిన గణాంకాలతో స్పష్టమవుతోంది. రిఫండ్లు పెరగడం ఇందుకు కారణం. వ్యక్తులు, కంపెనీలు, వ్యాపార సంస్థలు చెల్లించే పన్నులు ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి.ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..కార్పొరేట్ సంస్థల నుంచి నికర పన్నుల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, సంస్థల నుంచి వచ్చిన ఆదాయం 7 శాతానికి పైగా పెరిగి రూ.4.12 లక్షల కోట్లుగా ఉంది. రూ.22,362 కోట్లు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో వసూలైంది. ఇదే కాలంలో రిఫండ్లు 10 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్లకు ముందు స్థూల పన్ను వసూళ్లు రూ.7.99 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
మరింత దిగొచ్చిన ధరలు
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహారోత్పత్తులు, ధాన్యాల ధరలు మరింత కిందకు దిగొచ్చాయి. ఫలితంగా జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 1.55 శాతానికి పడిపోయింది. 2017 జూన్ నెలలో నమోదైన 1.46 శాతం తర్వాత ఇదే అత్యంత కనిష్ట రిటైల్ ద్రవ్యోల్బణం. ఈ ఏడాది జూన్ నెలలో ద్రవ్యోల్బణం 2.1 శాతంతో పోల్చి చూసినా 0.55 శాతం తక్కువగా నమోదైంది.2024 జూన్ నెలలో ఇది 3.6%గా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్నది వినియోగదారులతో పాటు విధాన నిర్ణేతలకూ ఉపశనమం కలిగిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ⇒ ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం (కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్/సీఎఫ్పీఐ) మైనస్ 1.76 శాతానికి క్షీణించింది. జూన్లో ఇది మైనస్ 1.01గా ఉంది. 2019 జనవరి తర్వాత ఆహార విభాగంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం ఇది. వరి, గోధుమ, చక్కెర, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు ఈ విభాగం కిందకు వస్తాయి. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలకు 1.18 శాతంగా నమోదైంది. జూన్లో ఇది 1.72 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 1.74 శాతానికి పతనమైంది. ⇒ పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.05 శాతానికి తగ్గింది. -
కొత్త ఆదాయపన్ను బిల్లులోని ముఖ్యాంశాలు
అరవై ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న భారత నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025లో ప్రధాన మార్పులు కింది విధంగా ఉన్నాయి.కొత్త పన్ను బిల్లులోని కీలక సంస్కరణలుఅద్దె ఆదాయం నుంచి మున్సిపల్ పన్నులను మినహాయించిన తర్వాత ప్రామాణిక మినహాయింపు(స్టాండర్డ్ డిడక్షన్) వర్తిస్తుంది.స్వీయ-ఆక్రమిత ఆస్తులకు మాత్రమే కాకుండా, ఖాళీ చేసిన ఆస్తులపై వడ్డీ తగ్గించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, భూస్వాములకు ప్రయోజనం చేకూరనుంది.కార్పొరేట్, బిజినెస్ ప్రొవిజన్స్కొత్త పన్ను విధానం కింద కార్పొరేషన్లు ఇప్పుడు సెక్షన్ 80ఎం కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. డివిడెండ్ ఆదాయంలో పన్ను తగ్గించుకోవచ్చు.కంపెనీలకు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) వర్తిస్తుంది.మినహాయింపులను క్లెయిమ్ చేసే నాన్-కార్పొరేట్ సంస్థలకు ఆల్టర్నేటివ్ మినిమమ్ ట్యాక్స్ (ఏఎంటీ) వర్తిస్తుంది.అధిక సంపాదన కలిగిన వారు(రూ.50 కోట్లు+ రశీదులు) నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల ఆడిట్ మార్గాలు మెరుగుపడతాయి. లెక్కల్లోకి రాని ఆదాయాన్ని అరికట్టవచ్చు.ధార్మిక ప్రయోజనాల కోసం ఉపయోగించే మూలధన లాభాలను ఇకపై ‘ఆదాయ అనువర్తనం(అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్)’గా పరిగణిస్తారు. ఇది నిధుల కేటాయింపులో సౌలభ్యాన్ని పెంచుతుంది. ట్రస్టులు ఇకపై కూడబెట్టిన ఆదాయంలో 15% నిర్దిష్ట పద్ధతుల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మరింత అనుకూలమైన ఆర్థిక ప్రణాళికకు ఉపయోగపడుతుంది.స్నేహపూర్వక చర్యలునిర్దిష్ట పరిస్థితుల్లో ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసేవారు కూడా ఇప్పుడు రిఫండ్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆలస్యానికి తగిన రుజువులు జతచేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పన్ను అధికారులకు నిబంధనలు అతిక్రమించిన వారిపై విధించిన జరిమానాలను మాఫీ చేసే విచక్షణ ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారుల హక్కులకు అనుగుణంగా ఉంటుంది. అయితే అందుకు తగిన కారణాలను సమర్పించాలి.ఇదీ చదవండి: దిగొస్తున్న కనకం ధరలు!పన్నులు మారుతాయా?కొత్త ఆదాయపన్ను బిల్లు 2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో చాలామంది తాము ఏమేరకు పన్ను చెల్లించాలనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం గతంలో చెప్పినదాని ప్రకారమే పన్ను శ్లాబులు ఉంటాయి. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. కేంద్రం గతంలో ప్రవేశపెట్టిన కొత్త శ్లాబుల ప్రకారం.. రూ.12,00,000 ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. -
టార్గెట్ 50
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను గణనీయంగా పెంచేయడంతో ప్రత్యామ్నాయాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకునే వ్యూహరచనకు తెరతీసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా తదితర ప్రాంతంలో 50 దేశాలకు ఎగుమతులను ఇతోధికం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత మొత్తం ఎగుమతుల్లో 90 శాతం ఈ 50 దేశాలకే వెళుతుండడం గమనార్హం. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు, ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా లోతైన విశ్లేషణ కొనసాగుతోందని చెప్పాయి. వాణిజ్య శాఖ ఇప్పటికే 20 దేశాలపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇప్పుడు మరో 30 దేశాలు ఈ జాబితాలోకి వచ్చి చేరినట్టు పేర్కొన్నాయి. కొత్త మార్కెట్లను అన్వేషించండి.. అధిక యూఎస్ టారిఫ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని.. రొయ్యలు, ఇతర చేపల ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు కేంద్రం సూచించింది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, యూకే, రష్యా, ఆ్రస్టేలియా, పశి్చమాసియా, దక్షిణాసియా తదితర ఎన్నో ప్రాంతాలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. ఇతర దేశాలను ఎగుమతులను పెంచుకునే ముందు విలువను పెంచుకోవడం, ప్యాకేజింగ్పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు ఫిషరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 55 శాతం ఎగుమతులపై ప్రభావం అమెరికాకు ఎగుమతి చేస్తున్న మొత్తం వస్తు ఎగుమతుల్లో 55 శాతం మేర 25 శాతం ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైతులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాల పరిరక్షణకు, ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉత్పత్తుల వైవిధ్యం, డిమాండ్, నాణ్యత, కాంట్రాక్టు ఒప్పందాలు భారత ఎగుమతులపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. -
మతపరమైన సంస్థలకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అన్ని మతపరమైన, స్వచ్ఛంద సేవా సంస్థలకు వచ్చే అజ్ఞాత విరాళాలపై టీడీఎస్ క్లెయిమ్, పన్ను మినహాయింపులకు ప్రస్తుత చట్టంలో మాదిరే ఆదాయపన్ను కొత్త బిల్లు (2.0)లోనూ అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచి్చన కొత్త బిల్లులో దీన్ని తొలగించడం గమనార్హం. అన్ని రిజిస్టర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థలు అందుకునే అజ్ఞాత విరాళాలపై 30 శాతం స్థిర పన్నును ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, సెలక్ట్ కమిటీ చేసిన సూచనల మేరకు నూతన బిల్లులో మినహాయింపులకు తిరిగి చోటు కల్పించింది. క్లాజు 187 కింద ‘ప్రొఫెషన్’ పదాన్ని చేర్చారు. ఒక ఏడాదిలో చెల్లింపుల స్వీకరణలు రూ.50 కోట్లకు మించితే నిపుణులు సైతం ఎల్రక్టానిక్ చెల్లింపుల నమూనాలను కలిగి ఉండాలని ఇది నిర్దేశిస్తోంది. నష్టాలను సర్దుబాటు చేసుకోవడం, క్యారీ ఫార్వార్డ్ చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలను మరింత మెరుగుపరిచారు. టీడీఎస్ కరెక్షన్ స్టేట్మెంట్ (సవరణ నివేదికలు)లకు సంబంధించి దాఖలు గడువును ఆరేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. నూతన ఆదాయపన్ను బిల్లు (2.0)గా చెబుతున్న తాజా బిల్లులో సెలక్ట్ కమిటీ సిఫారసులు అన్నింటికీ దాదాపుగా చోటు కల్పించడం గమనార్హం. తొలుత ఈ కొత్త బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టగా, సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారు. సెలక్ట్ కమిటీ తన నివేదికను జూలై 21న పార్లమెంట్కు సమరి్పంచింది. సోమవారం దీన్ని లోక్సభ ఆమోదించింది. -
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే?
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.సుమారు నాలుగు నెలల పాటు తీవ్రంగా సమీక్షించిన తర్వాత, కమిటీ 285 కంటే ఎక్కువ సిఫార్సులతో 4,500 పేజీలకు పైగా నివేదికను రూపొందించింది. ఈ సూచనల ఉద్దేశ్యం చట్టం భాషను సరళీకృతం చేయడం, నిబంధనలలో స్పష్టత తీసుకురావడం & పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మార్పులను కలుపుకొని కొత్త ముసాయిదాను సమర్పించింది.ప్రస్తుతమున్న 1961 చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు, రాష్ట్రపతి ఆమోదం కోరే ముందు రాజ్యసభకు వెళుతుంది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.ఇదీ చదవండి: ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్ -
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్
సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు ఉండాలని, ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 'సంజయ్ మల్హోత్రా' (Sanjay Malhotra) స్పందించారు.ఒక ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలనేది పూర్తిగా ఆ బ్యాంకుల పరిధిలోకే వస్తుంది. కొన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ను రూ. 50వేలు, మరికొన్ని రూ. 10వేలు, ఇంకొన్ని రూ. 2వేలుగా నిర్ణయించుకున్నాయి. కొన్ని బ్యాంకులైతే మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఎలాంటి నియమాలను సూచించదు. ఇదంతా సదరు బ్యాంక్ తీసుకునే నిర్ణయమే అని, ఈ అంశం ఆర్బీఐ పరిధిలోకి రాదని సంజయ్ మల్హోత్రా గుజరాత్లో జరిగిన ఆర్థిక చేరిక సమావేశంలో స్పష్టం చేశారు.ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్మెట్రో, పట్టణ శాఖలలోని వినియోగదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50,000 ఉండేలా చూడాలి.సెమీ అర్బన్ ప్రాంతాలలో వినియోగదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 25,000 ఉండేలా చూడాలిగ్రామీణ ఖాతాదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 10,000 ఉంచాలి.ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయని పక్షంలో.. మినిమమ్ బ్యాలెన్సుకు ఎంత తక్కువ డబ్బు ఖాతాలో ఉంటే.. దానిపై 6 శాతం లేదా రూ. 500 ఏది తక్కువైతే ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇది ఖాతాదారులపై ప్రభావం చూపిస్తుందని, ఇదే పద్దతిని ఇతర బ్యాంకులు కూడా అనుసరిస్తే పరిస్థితి ఏంటని.. పలువురు విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే? -
పెట్రోల్ పంపుల ఏర్పాటు మరింత సులువు?
ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, దేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడానికి విధానపరమైన చర్యల్లో మార్పులు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా పెట్రోల్ పంపుల ఏర్పాటుకు లైసెన్సింగ్ నిబంధనలను సులభతరం చేయడానికి సిద్ధమవుతోంది. ఇంధన రిటైల్ మార్కెట్ను వైవిధ్యపరచడానికి, పోటీని పెంపొందించడానికి, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి విస్తృత వ్యూహంలో భాగంగా ఈమేరకు చర్యలు తీసుకుంటోంది.నిబంధనలు సమీక్ష2019లో ప్రవేశపెట్టిన ఇంధన రిటైల్ ఆథరైజేషన్ నిబంధనలను పునసమీక్షించడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ సుఖ్మల్ జైన్ నేతృత్వంలో నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందుతున్న ఇంధన ప్రాధాన్యతలను ప్రతిబింబించే సవరణలను సూచించేలా కమిటీ ప్రస్తుత రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను సమీక్షిస్తోంది. పారదర్శకత, సమగ్రతను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియ కోసం ప్రజల అభిప్రాయాలకు కూడా కోరుతోంది. ఆగస్టు 6న జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం 14 రోజుల్లోగా వాటాదారులు, పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపింది.2019లో సంస్కరణలు ఇలా..ఇంధన రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలను చివరిసారిగా 2019లో ప్రభుత్వం సవరించింది. ఇది ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనుకూలంగా ఉన్న కొన్ని ఆంక్షల్లో మార్పులు చేసింది. సవరించిన ఫ్రేమ్వర్క్ ప్రకారం చమురుయేతర సంస్థలు, గ్లోబల్ ఎనర్జీ సంస్థలు దేశీయ ఇంధన రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి అనుమతించింది.2019 నిబంధనల్లోని ముఖ్యాంశాలురిటైల్ లైసెన్స్ కోసం కంపెనీలు రూ.250 కోట్ల నికర విలువ కలిగి ఉండాలి. రిటైల్ + బల్క్ మార్కెటింగ్ కోసం రూ.500 కోట్లు నికర విలువ కలిగి ఉండాలి. ప్రత్యామ్నాయ ఇంధన మార్కెట్ కోసం సీఎన్జీ, ఎల్ఎన్జీ, జీవ ఇంధనాలు(బయో ఫ్యూయెల్స్) లేదా ఈవీ ఛార్జింగ్కు అవసరమైన మౌలిక సదుపాయాలు 3 సంవత్సరాలలోపు ఏర్పాటు చేయాలి. కొత్త కంపెనీలు దేశంలో కనీసం 100 రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయాలి. అందులో గ్రామీణ ప్రాంతాలకు కనీసం 5% కేటాయించాలి.2019లో మార్పులు చేయకముందు రిటైల్ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి కంపెనీలు అప్స్ట్రీమ్ ఆయిల్ లేదా గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనీసం రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. ఇది కొత్త కంపెనీలకు సవాలుగా మారింది. దాంతో ఈ విభాగంలో మార్కెటింగ్ కోసం ఎక్కువ కంపెనీలు ముందుకు రాలేకపోయాయి. ఫలితంగా 2019లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. తాజాగా వాటిలో కూడా కొన్ని మార్పులు చేయాలని కమిటీ ఏర్పాటు చేశారు.కొత్త సంస్కరణలు ఎందుకంటే..వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థకు, జనాభాకు వీలుగా దేశవ్యాప్తంగా 97,000కు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్కు ఇది ఉదాహరణ. దేశీయ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, ఇంధన రిటైలర్ల సంఖ్యను పెంచుతూ వారి సర్వీసులను వైవిధ్యపరచాల్సి ఉంది. అందుకు అడ్డంకులను తగ్గించడానికి, సరఫరా గొలుసులను పెంచడానికి కొన్ని మార్పులు అవసరమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.భారతదేశం దీర్ఘకాలిక డీకార్బనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా కొత్త సమీక్షలో మార్పులు చేయనున్నారు. ఇంధన రిటైల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా, ముఖ్యంగా సీఎన్జీ, ఎల్ఎన్జీ, జీవ ఇంధనాలు, ఈవీ ఛార్జింగ్ కోసం క్టీన్ ఎనర్జీ పరివర్తనను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.కొత్త నిబంధనలు విస్తృత శ్రేణి దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. పెరిగిన పోటీ సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ విధానాలు ఇంధన ధరలను తగ్గిస్తాయని, స్థిరమైన ఇంధన ప్రత్యామ్నాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేస్తాయని అంచనా వేస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?సంప్రదింపుల వ్యవధి ముగిసిన తర్వాత నిపుణుల కమిటీ ఫీడ్ బ్యాక్ను తయారు చేసి మంత్రిత్వ శాఖకు సిఫార్సులను సమర్పిస్తుంది. దీనిపై సదరు శాఖ తుది నిర్ణయం తీసుకుని సవరించిన మార్గదర్శకాలను విడుదల చేస్తుంది.ఇదీ చదవండి: సీఈఓ కనుసన్నల్లోనే వేతన పెంపు -
ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..
కోర్టు సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే '1929 నాటి మహా మాంద్యం' వస్తుందని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం హెచ్చరించారు. ఇంతకీ ఈ మహా మాంద్యం ఏమిటి?, దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనే.. విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.1929 నాటి మహా మాంద్యం1929 నాటి మహా మాంద్యం.. 20వ శతాబ్దంలోని అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంగా చరిత్రలో నిలిచింది. ఇది 1929లో ప్రారంభమై సుమారు 1939 వరకు ప్రభావం చూపింది. ఈ మాంద్యం మొదట అమెరికాలో 1929 అక్టోబర్ 24 నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపింది.1929 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలుస్టాక్ మార్కెట్ పతనంస్టాక్ ధరలు పెరుగుతుండటం, వాటిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ప్రజలు స్టాక్లను కొనుగోలు చేశారు. చాలామంది అప్పు తెచ్చుకున్న డబ్బుతో కూడా స్టాక్ కొనేశారు. ఇలా పెద్దఎత్తున స్టాక్లు అమ్ముడవడం వల్ల మార్కెట్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది.బ్యాంకులు మూతపడటంప్రజలు తమ డబ్బును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది బ్యాంకులు మూతపడటానికి కారణమైంది. వేలాది బ్యాంకులు క్లోజ్ అవ్వడంతో.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ప్రభుత్వ జోక్యం కూడా తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడటం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమైంది.అధిక ఉత్పత్తి, తక్కువ డిమాండ్రైతులు మార్కెట్ అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేశారు. పారిశ్రామిక రంగం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకుండా పోయింది. ఇది ధరలు తగ్గడానికి మాత్రమే కాకుండా.. అప్పులు పెరగడానికి కూడా కారణమైంది. ఇది ఆర్ధిక వ్యవస్థను మరింత దిగజారేలా చేసింది.ప్రపంచ వాణిజ్య పతనంస్మూట్ హాలీ టారిఫ్ చట్టం (1930) వల్ల అమెరికా దిగుమతులపై అధిక పన్నులు విధించడం జరిగింది. ఇది ఇతర దేశాల నుంచి ప్రతీకార సుంకాలను సైతం పెంచింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం క్షిణించింది. ప్రపంచ మాంద్యం తీవ్రతరం అయింది.ప్రజలపై ప్రభావం1929 నాటి మహా మాంద్యం కారణంగా అమెరికాలో నిరుద్యోగం రేటు 25% దాటింది. లక్షలాది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఇళ్లను కూడా వదిలి బయటకు వలసలు వెళ్లి, నిరాశ్రయులయ్యారు. -
టారిఫ్ అంటే ఏమిటి?: దేశ ఆర్ధిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా..
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' భారతదేశంపైన 50 శాతం సుంకాలను ప్రకటించారు. ఇది భారత ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ సుంకం (టారిఫ్) అంటే ఏమిటి?, అది దేశ ఆర్ధిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సుంకం అంటే?సుంకం అంటే పన్ను. దీన్ని ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధిస్తుంది. దీనివల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలు చౌకగా కాకుండా ఉండటానికి.. ఆ దేశ ప్రభుత్వం ఈ సుంకాలను విధిస్తుంది.దేశ ఆర్ధిక వ్యవస్థపై సుంకాల ప్రభావం..ట్రంప్ భారతదేశంపై విధించిన 50 శాతం సుంకాల వల్ల.. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్త్రాలు, ఇనుము, ఉక్కు, ఫార్మా, బంగారం మొదలైన వాటి ధరలు పెరుగుతాయి. వీటి ధరలు పెరిగితే అక్కడ డిమాండ్ తగ్గుతుంది. ఇది ఇండియన్ కంపెనీలపై ప్రభావం చూపుతుంది. క్రమంగా ఎగుమతులు తగ్గుతాయి. తద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా తగ్గుతుంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద కొంతవరకు ప్రభావాన్ని చూపుతుంది.సుంకాలు విధించడం వల్ల ప్రయోజనాలుసుంకాలు విధించడం వల్ల దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. విదేశీ వస్తువుల ధరలు అధికంగా కావడంతో ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల మీదనే మొగ్గు చూపుతారు. ఇది దేశీయ పరిశ్రమలను బలపరుస్తుంది, కర్మాగారాల సంఖ్య కూడా పెంచుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ఇదీ చదవండి: మేడ్ ఇన్ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్సుంకాల వల్ల ప్రతికూల ప్రభావంఒక దేశం ఇతర దేశాలపై భారీ సుంకాలను విధిస్తే.. ఆ దేశం కూడా అదే స్థాయిలో సుంకాలను విధిస్తుంది. తద్వారా ఆ దేశం వస్తువుల ధరలు కూడా ఇతర దేశాల్లో పెరుగుతాయి. ఇది వాణిజ్య యుద్దానికి దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా భారతదేశంలో 50 శాతం సుంకాలను ప్రకటించింది. ఇండియా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచే అవకాశం ఉంది. -
జీడీపీపై టారిఫ్ ఎఫెక్ట్!!
న్యూఢిల్లీ: అమెరికా ఆగస్టు 27 నుంచి 50 శాతం టారిఫ్లను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)పై ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 బేసిస్ పాయింట్లు నెమ్మదించి 6 శాతానికి పరిమితం కావొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే, దేశీయంగా డిమాండ్ మెరుగ్గా ఉండటం, సరీ్వసుల రంగం పటిష్టంగా ఉండటం వంటి అంశాలు భారత్పై ఒత్తిడిని తగ్గిస్తాయని పేర్కొంది. భారీ అమెరికా టారిఫ్లపై భారత్ స్పందించే తీరే అంతిమంగా వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని వివరించింది. ‘భారత్ ఎగుమతులకు అమెరికా అతి పెద్ద గమ్యస్థానంగా ఉంటోంది. అలాంటప్పుడు అమెరికా 50 శాతం టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తున్నా, రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని కొనసాగిస్తే 2025–26లో భారత జీడీపీ వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.3 శాతంతో పోలిస్తే 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) మేర నెమ్మదించవచ్చు‘ అని మూడీస్ పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్పై అమెరికా టారిఫ్లను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంతో ఇరు దేశాలు మార్చి నుంచి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఆసియా–పసిఫిక్ దేశాలతో పోటీ.. అమెరికా విధానాల్లో మార్పుల వల్ల సరఫరా సిస్టంలు పునర్వ్యవస్థీకరణకు లోనవుతున్న నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత వాటా కోసం ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని పలు దేశాలు పోటీపడుతున్నాయని తెలిపింది.2025 తర్వాత మిగతా ఆసియా–పసిఫిక్ దేశాలతో పోలిస్తే టారిఫ్ల అంతరాలు భారీగా పెరిగిపోవడం వల్ల తయారీ రంగ హబ్గా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు గండి పడొచ్చని మూడీస్ పేర్కొంది. అంతేగాకుండా ఇటీవలి కాలంలో పెట్టుబడుల రూపంలో ఒనగూరిన కొన్ని ప్రయోజనాలు కూడా వెనక్కి తరలిపోవచ్చని తెలిపింది. అయితే, అంతర్జాతీయ ఒడుదుడుకులను ఎదుర్కొనడానికి భారత్ వద్ద ప్రస్తుతం తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించింది. -
రైతుల ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలని.. అంతర్జాతీయ కంపెనీలు అనుసరించే దోపిడీ విధానాల నుంచి భారత రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఎస్బీఐ అధ్యయన నివేదిక సూచించింది. అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ నెలలో తదుపరి చర్చల కోసం అమెరికా బృందం భారత్ను సందర్శించాల్సి ఉంది. ‘‘బలమైన బహుళజాతి సంస్థలు భారత మార్కెట్లో సదుపాయాలు, వ్యవసాయ విలువ ఆధారిత ఉత్పత్తుల కల్పన, రైతుల సంక్షేమం, వారి శ్రేయస్సు దిశగా పెద్దగా పెట్టుబడులు పెట్టుకుండానే ఇక్కడి మార్కెట్ అవకాశాలను కొల్లగడతాయి. కనుక వీటి బారి నుంచి రైతుల ప్రయోజనాలను తప్పకుండా కాపాడాలి’’అని ఈ నివేదిక సూచించింది.ఒత్తిడి పెంచుతున్న ట్రంప్...బహుళజాతి సాగు సంస్థలు బడా మార్కెట్లలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండడాన్ని ప్రస్తావించింది. మొక్కజొన్న, సోయాబీన్, యాపిల్స్, బాదం, ఇథనాల్పై టారిఫ్లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వీటితోపాటు అమెరికా పాడి ఉత్పత్తులకు అవకాశాలు కలి్పంచాలంటూ డిమాండ్ చేస్తోంది. మన రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో కేంద్ర సర్కారు అమెరికా డిమాండ్లను అంగీకరించడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడింది. రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడబోదని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం తేల్చి చెప్పారు. భారత ఉత్పత్తులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రోజే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ద్వారా యూఎస్కు స్పష్టమైన సంకేతం పంపారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే దిశగా భారత్పై ఒత్తిడి పెంచేందుకు టారిఫ్లను అమెరికా అధ్యక్షుడు పెంచేయడం గమనార్హం. ఇంధన బిల్లు పెరగొచ్చు.. ఒకవేళ అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి భారత్ నిలిపివేసినట్టయితే చమురు దిగుమతుల బిల్లు 9 బిలియన్ డాలర్లు మేర పెరుగుతుందని.. 2026–27లోనూ 11.7 బిలియన్ డాలర్లు అధికం కావొచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.‘‘ అంతర్జాతీయ చమురు సరఫరాలో రష్యా 10 శాతం వాటా కలిగి ఉంది. అన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తే, అదే సమయంలో మిగిలిన దేశాలు ఉత్పత్తిని పెంచకపోతే చమురు ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది’’అని ఈ నివేదిక పేర్కొంది. -
ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వెనక్కితీసుకున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను వెనక్కి తీసుకుంది. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ నూతన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను తాజాగా ఉపసంహరించుకుంది.బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సులను చేర్చి నూతన ఆదాయపు పన్ను బిల్లు సరికొత్త వెర్షన్ ఆగస్టు 11న అంటే సోమవారం తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులో కొత్త మార్పులు చేస్తన్న క్రమంలో బహుళ వెర్షన్ల గందరగోళాన్ని నివారించడానికి అన్ని మార్పులతో స్పష్టమైన, నవీకరించిన ఆదాయపు పన్ను బిల్లును ఆగస్టు 11న సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టనున్నారు.ఆదాయపు పన్ను బిల్లు 2025 మార్పులుగత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు- 2025 అరవై సంవత్సరాల నాటి భారతదేశ ప్రత్యక్ష పన్ను చట్టంలో పలు కీలక మార్పులు తీసుకొస్తోంది. 298-సెక్షన్ ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ప్రస్తుత శాసనం కంటే 50 శాతం తక్కువ సరళమైన భాషలో రాసిన ఆధునిక, పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వక చట్టాన్ని తీసుకురావడం ఆదాయపు పన్ను బిల్లు- 2025 ముఖ్యమైన లక్ష్యం. -
భారత్కు ఎంత బాధైనా అది ఏడాదే?
భారత దిగుమతులపై అమెరికా 50 శాతానికి సుంకాలు పెంచడం ఇండియాపై మధ్య, దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. భారత్ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి, ఏడాదిపాటు వృద్ధిలో 50 బేసిస్ పాయింట్లు కోల్పోయే పరిస్థితులున్నాయని అభిప్రాయపడ్డారు. సుంకాలు అమలైతే జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 6.1 శాతానికి లేదా 6 శాతానికి పడిపోతుందని అంచనా వేశారు. ప్రస్తుతం భారత జీడీపీలో ఎగుమతుల వాటా 22 శాతం కాగా, వాటిలో అమెరికా వాటా 17 శాతంగా ఉంది.ట్రంప్ సుంకాలతో ఏడాది పాటు జీడీపీ వృద్ధి గణాంకాలపై ప్రభావం పడినా, దీర్ఘకాలంలో అంటే ఏడాదికి మించి దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని సుబ్బారావు చెప్పారు. 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా సంపన్న దేశాల సరసన నిలవాలనే ఆకాంక్షలు ఉన్న ఆర్థిక వ్యవస్థగా భారత్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దాన్ని చేరుకోవాలంటే తొలినాళ్లలో వృద్ధి ఎక్కువగా ఉండాలన్నారు. ఎందుకంటే తర్వాతి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వృద్ధి సాధించడం కష్టమవుతుందని చెప్పారు. ఏటా 50 బేసిస్ పాయింట్ల నష్టపోతే 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదగాలనే దేశం లక్ష్యం నీరుగారుతుందన్నారు.శ్రమ ఆధారిత రంగాలపై ప్రభావం‘అమెరికా ప్రకటించిన లెవీలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై ప్రభావం చూపడమే కాకుండా, అల్ప ఆదాయ వర్గాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే అమెరికాకు ఎగుమతుల్లో ప్రధాన విభాగాలైన యంత్రాలు, రత్నాలు, ఆభరణాలు వంటి శ్రమ ఆధారిత రంగాలపై ప్రభావం పడనుంది. దీనికితోడు, భారతదేశం తన పెట్రోలియం అవసరాల కోసం రష్యాను కాదని పూర్తిగా సౌదీ అరేబియాపై ఆధారపడితే మొత్తం చమురు ఖర్చు పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణ రేటును, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం వల్ల డిమాండ్ తగ్గుతుందని, తద్వారా ప్రపంచ వృద్ధి రేటు కుంటుపడుతుందన్నారు. ఇది భారత్పై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అంచనా వేశారు.ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా యూపీఐ సర్వీస్ డౌన్!దృష్టి సారించాల్సినవి..‘మన ఎగుమతులను ఇతర భౌగోళిక ప్రాంతాలకు విస్తరించడం, కొత్త ఎగుమతుల కోసం అన్వేషించడం, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అంశాలపై భారత్ మరింత దృష్టి సారించాలి. అమెరికాతో వాణిజ్యపరంగా ఏం జరిగినా వీటన్నిటినీ మనం అమలు చేయాలి’ అని సుబ్బారావు చెప్పారు. -
దేశవ్యాప్తంగా యూపీఐ సర్వీస్ డౌన్!
భారతదేశం అంతటా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలకు గురువారం సాయంత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది లావాదేవీల సమయంలో వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగించింది. 62 శాతం మంది వినియోగదారులు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. 29 శాతం మంది డబ్బు బదిలీ చేసేటప్పుడు ఇబ్బందులకు గురయ్యామని, 8 శాతం మంది యాప్ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్ డేటా తెలిపింది.ఈ అంతరాయం కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకు వినియోగదారులపై ప్రభావం పడింది. డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రం సజావుగానే పని చేశాయి. యూపీఐ సేవలు అందుబాటులో లేనప్పుడు కస్టమర్లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డును బ్యాకప్గా వెంటే ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్లో సంక్షోభంఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా యూపీఐ వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. గతంలో ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏయూ స్మాల్ ఫైనాన్స్కు ‘బ్యాంకింగ్’ లైసెన్స్
యూనివర్సల్ బ్యాంకు (పూర్తి స్థాయి బ్యాంకు)గా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆర్బీఐ మార్గ దర్శకాలకు అనుగుణంగా 2024 సెపె్టంబర్ 3న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అర్హత ప్రమాణాలు పరిశీలించిన ఆర్బీఐ తాజాగా దీన్ని మంజూరు చేసింది. దీంతో ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా అవతరించింది.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!బ్యాంకు ఎండీ సీఈవో సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘యూనివర్సల్ బ్యాంక్గా కార్యకపాలు నిర్వహించుకునేందుకు ఆర్బీఐ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొందడం ద్వారా చరిత్ర సృష్టించాం. వ్యాపార విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం’ అన్నారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ ఆర్బీఐ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. అంతక్రితం 2014 ఏప్రిల్లో బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్ (ప్రస్తుతం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్)లకు ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. -
ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 47% అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 12.4 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 8.43 బిలియన్ డాలర్లతో పోలిస్తే 47 శాతం పెరిగాయి. ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొబైల్ ఫోన్స్ ఎగుమతులు 55 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 55 శాతం వృద్ధితో 7.6 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మొబైల్యేతర ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్ 3.53 బిలియన్ డాలర్ల నుంచి 37 శాతం పెరిగి 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ విభాగంలో సోలార్ మాడ్యూల్స్, స్విచి్చంగ్.. రూటింగ్ పరికరాలు, చార్జర్ అడాప్టర్లు, ఇతర విడిభాగాలు మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు ఐటీ హార్డ్వేర్, వేరబుల్స్, హియరబుల్స్, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ చెప్పారు. విడిభాగాలు, సబ్–అసెంబ్లీస్ నుంచి తుది ఉత్పత్తుల వరకు వేల్యూ చెయిన్వ్యాప్తంగా అంతర్జాతీయంగా పోటీపడగలిగేలా భారతీయ బ్రాండ్లు మరింతగా ఎదగాల్సి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. దశాబ్దకాలంలో దేశీయంగా మొత్తం ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి 31 బిలియన్ డాలర్ల నుంచి 133 బిలియన్ డాలర్లకు ఎగిసింది. 50 బిలియన్ డాలర్ల అంచనాలు.. క్యూ1 తరహాలోనే జోరు కొనసాగితే 2026 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 46–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇవి 29.1 బిలియన్ డాలర్ల నుంచి 38.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
‘టారిఫ్’ రంగాలకు చేయూత!
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల ప్రభావం తీవ్రంగా ఉండే పరిశ్రమలకు ఊరటనివ్వడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద రసాయనాలు, టెక్స్టైల్స్లాంటి రంగాలకు చేయూతనిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రంగాల ఎగుమతిదార్లతో భేటీ అయిన సందర్భంగా టారిఫ్ల ప్రభావాలు, సహాయక చర్యలకు అవకాశాలు తదితర అంశాల గురించి వాణిజ్య శాఖ చర్చించినట్లు వివరించాయి.కేంద్ర బడ్జెట్లో రూ. 2,250 కోట్లతో ప్రతిపాదించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద టారిఫ్ ప్రభావిత రంగాలకు తోడ్పాటు అందించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మిషన్ కింద చిన్న–మధ్య తరహా సంస్థలు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లకు సులభ రుణ పథకాలు, విదేశాల్లో వేర్హౌసింగ్ సదుపాయాల కల్పన, ఎగుమతి అవకాశాలను దక్కించుకునేందుకు గ్లోబల్ బ్రాండింగ్కి సహాయం అందించడం మొదలైనవి ఉంటాయని అంచనా. అమెరికాకు టెక్స్టైల్స్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లుగా, రసాయనాల ఎగుమతులు సుమారు 6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వస్త్రాలు, రత్నాభరణాలు, రొయ్యలు, లెదర్.. ఫుట్వేర్, రసాయనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, మె కానికల్ పరికరాలు మొదలైన రంగాలపై 50% టారిఫ్ల ప్రభావం గణనీయంగా ఉండనుంది. సంస్కరణలకు జీజేఈపీసీ విజ్ఞప్తి.. సుంకాల భారం తగ్గేలా తక్షణం పాలసీపరమైన సంస్కరణలు చేపట్టాలని కేంద్రాన్ని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ కోరింది. డ్యూటీ డ్రాబ్యాక్ స్కీము, మార్కెట్ డైవర్సిఫికేషన్ కోసం ఆర్థిక సహాయం అందించడంలాంటి చర్యలు పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. కట్, పాలిష్డ్ డైమండ్లలో సగం ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయని, భారీ టారిఫ్ల వల్ల మొత్తం పరిశ్రమ స్తంభించిపోయే ముప్పు ఏర్పడిందని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయని వివరించారు. తక్కువ టారిఫ్లు ఉండే టర్కీ, వియత్నాలాంటి దేశాలతో అమెరికా మార్కెట్లో భారత్ పోటీపడటం కష్టతరమవుతుందని భన్సాలీ చెప్పారు. దీన్ని పరిష్కరించకపోతే, అమెరికాకు కీలక సరఫరాదారుగా భారత్కి ఉన్న హోదా పోతుందని వివరించారు. అయితే, టారిఫ్ల ఎఫెక్ట్ను పక్కన పెడితే దేశీయంగా ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్, వచ్చే రెండేళ్లలో 130 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనే అంచనాలు పరిశ్రమకు కాస్త ఊరటనిచ్చే విషయమని భన్సాలీ చెప్పారు. అమెరికాకు భారత్ నుంచి రత్నాభరణాల ఎగుమతులు దాదాపు 10 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
భారత్పై ట్రంప్ టారిఫ్స్: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' విధించిన సుంకాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్పందిస్తూ.. దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) కీలక సూచనలు చేశారు.రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న కారణంగా.. భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. దీంతో అమెరికా మనదేశం మీద విధించిన సుంకం మొత్తం 50 శాతానికి చేరింది. టారిఫ్ల గురించి ఆందోళన చెందకుండా.. దీన్ని ఒక అవకాశంగా మల్చుకోవడం ఎలా అనే అంశంపై దృష్టి సారించే ప్రయత్నాలు చేయాలని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.1991 నాటి ఫారెక్స్ సంక్షోభం ఎలాగైతే ఆర్థిక సరళీకరణకు దారి తీసిందో.. అదే విధంగా ఈ టారిఫ్ల మథనంలో మనకు తప్పకుండా అమృతం దక్కుతుందని ఆనంద్ మహీంద్రా అన్నారు. దీనికోసం రెండు బలమైన అడుగులు వేయాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.వ్యాపారాలను మెరుగుపరచాలిభారతదేశంలో పెరుగుతున్న సంస్కరణలకు మించి అన్ని పెట్టుబడి ప్రతిపాదనలకు సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను సృష్టించాలి. ప్రపంచ పెట్టుబడులకు మన దేశాన్ని వేదికగా మార్చాలి. అప్పుడే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితుంది.సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెట్టుబడులను వేగవంతం చేయాలి. వీటికి కావలసిన ప్రోత్సాహకాలను అందించాలి. దిగుమతి సుంకాలను క్రమబద్దీకరించాలి. పోటీతత్వాన్ని మెరుగు పరచాలని, మన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేయాలి.పర్యాటక రంగాన్ని మెరుగుపరచాలిపర్యాటకం అనేది విదేశీ మారకం. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం వీసా ప్రాసెసింగ్ను వేగవంతం చేయాలి. పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచాలి. ఇప్పటికే ఉన్న హాట్స్పాట్ల కారిడార్లను నిర్మించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చేయాలి. అంతే కాకుండా.. ఇతర ప్రాంతాలు జాతీయ ప్రమాణాలను అనుకరించడానికి మరియు పెంచడానికి ప్రోత్సహిస్తాయి.The ‘law of unintended consequences’ seems to be operating stealthily in the prevailing tariff war unleashed by the U.S.Two examples:The EU may appear to have accepted the evolving global tariff regime, responding with its own strategic adjustments. Yet the friction has… pic.twitter.com/D5lRe5OWUa— anand mahindra (@anandmahindra) August 6, 2025 -
భారత్ ఆర్థిక వృద్ధి బలంగా ఉంది.. కానీ..: ట్రంప్ సుంకాలపై ఆర్బీఐ చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. ఈ తరుణంలో.. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ 'సంజయ్ మల్హోత్రా' చెప్పారు.అమెరికా సుంకాల ప్రభావం మన దేశం ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతాయని చాలామంది భావిస్తున్నారు. అయితే భారత్ వృద్ధిపై వాటి ప్రభావాన్ని అంచనా వేయండం కొంత కష్టమని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఎందుకంటే దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. సుంకాల ప్రభావం వాణిజ్య సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటియికీ.. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితులు వంటివన్నీ దేశాభివృద్ధికి కొంత ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. భారత ఆర్థిక వ్యవస్థ తన సముచిత స్థానాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. దీనికి దేశంలోని అన్ని రంగాలు కీలకని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత ఆర్థిక మూలాలు పటిష్టం: డెలాయిట్ ఇండియాడెడ్ ఎకానమీ కాదు..భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తగిన బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తోంది. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతంగా ఉంటే, భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావించారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో అమెరికా వాటా 11 శాతంగా ఉంటే, భారత్ 18 శాతం సమకూరుస్తోంది. ఇదే పనితీరును ఇక ముందూ కొనసాగిస్తామని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. -
రేట్ల కోతకు బ్రేక్!
ముంబై: వరుసగా మూడు సమీక్షల్లో కీలక రేట్లను తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సారి ఆచితూచి వ్యవహరించింది. కీలకమైన రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రివర్స్ రెపో రేటును (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై రేటు) సైతం 3.35 శాతం వద్దే కొనసాగించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అస్పష్ట వాణిజ్య విధానాలకు తోడు టారిఫ్ల పట్ల అనిశ్చితులు కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే పలు విడతలుగా రేట్లను తగ్గించగా ఇది పూర్తి స్థాయిలో బదిలీ కావాల్సి ఉండడం, ద్రవ్యోల్బణం రిస్క్ను దృష్టిలో పెట్టుకుని రేట్ల పరంగా యథాతథ స్థితిని కొనసాగించడమే ఉత్తమమని భావించింది. ద్రవ్య పరపతి విధానం పరంగా తటస్థ వైఖరినే (న్యూట్రల్) కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) ద్రవ్యోల్బణం మొత్తం మీద 3.7 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 3.1 శాతానికి తగ్గించింది. అలాగే, జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం అంచనాలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాం.. రుతుపవన ఆధారిత వర్షాలు అనుకున్న విధంగా కొనసాగుతుండడం, పండుగల సీజన్ సమీపిస్తుండడం ఆర్థిక వ్యవస్థకు జోష్నిస్తాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ క్రమంలో బలమైన మూలాలు, సౌకర్యవంతమైన ఫారెక్స్ మిగులు నిల్వలు కలిగి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు మధ్యకాలానికి ఉజ్వల అవకాశాలున్నట్టు చెప్పారు. అన్ని రకాల డేటాను గమనిస్తూ అవసరమైతే రేట్లపై తగిన నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లతో కూడిన వాతావరణంలో భారత ఆర్థిక వ్యవస్థ ధరల స్థిరత్వంతో, నిలకడైన వృద్ధి పథాన్ని కొనసాగించింది. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడంతో వృద్ధికి మద్దతుగా పరపతి విధానాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య నాలుగు నెలల్లోనే రెపో రేటును ఒక శాతం తగ్గించాం. వ్యవస్థలో రేట్ల బదలాయింపు ఇంకా కొనసాగుతోంది’’అని చెప్పారు. రేట్ల తగ్గింపు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అప్పుడు రుణ వితరణ పుంజుకోవచ్చన్నారు. గృహ రుణ విభాగం 14 శాతం వృద్ధితో మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న తీవ్ర అనిశ్చితుల్లో రూపాయి ఆల్టైమ్ కనిష్టానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఏడాది చివర్లో ద్రవ్యోల్బణం పైపైకి.. ఏడాది చివర్లో ద్రవ్యోల్బణం కొంత పెరిగే అవకాశాలున్నట్టు మల్హోత్రా చెప్పారు. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం క్యూ4లో (2026 జనవరి–మార్చి) 4 శాతం పైకి చేరుకోవచ్చు. విధానపరమైన చర్యల మద్దతుతో (రేట్ల కోత) డిమాండ్ పెరగడం ఇందుకు దారితీయొచ్చు’’అని అభిప్రాయపడ్డారు.అకౌంట్, లాకర్ క్లెయిమ్ సులభతరం బ్యాంక్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు. మరణించిన కస్టమర్ల తరఫున నామినీ సులభంగా క్లెయిమ్ చేసుకోవడం దీని లక్ష్యమని చెప్పారు. ట్రెజరీ బిల్లుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుగా ఆర్బీఐ రిటైల్–డైరెక్ట్ ప్లాట్ఫామ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు.పాలసీ ముఖ్యాంశాలు.. → యథాతథ స్థితికి అనుకూలంగా ఎంపీసీలోని ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. → రెపో రేటును ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు ( పావుశాతం) తగ్గించి 6.25 శాతం చేయగా, ఏప్రిల్లో మరో పావు శాతం కోతతో 6 శాతానికి దిగొచ్చింది. జూన్లో అర శాతం కోతతో 5.5 శాతానికి పరిమితమైంది. → రివర్స్ రెపో రేటు 3.35 శాతంలోనూ ఎలాంటి మార్పులేదు. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష సెప్టెంబర్ 29– అక్టోబర్ 1 మధ్య నిర్వహించనున్నారు. డెడ్ ఎకానమీ కాదు.. సంజీవని భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థ) అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తగిన బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తోందంటూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా కంటే భారతే దన్నుగా నిలుస్తున్నట్టు చెప్పారు. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతంగా ఉంటే, భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావించారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో అమెరికా వాటా 11 శాతంగా ఉంటే, భారత్ 18 శాతం సమకూరుస్తోంది. ఇదే పనితీరును ఇక ముందూ కొనసాగిస్తాం’’అని చెప్పారు. భారత వృద్ధి ఆకాంక్షలు 6.5 శాతం కంటే అధికంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఏటా సగటున 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడాన్ని గుర్తు చేశారు. -
త్వరలో యూఎస్ కొత్త వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్
యునైటెడ్ స్టేట్స్ నిర్దిష్ట దేశాల నుంచి కొంతమంది వీసా దరఖాస్తుదారులకు 12 నెలల వీసా బాండ్ పైలట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని చూస్తుంది. వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని నిబంధనలు ఉపయోగించుకుంటూ, ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆగస్టు 20, 2025న ఈ ప్రోగ్రామ్ను అమల్లోకి తేనున్నారు. దీని ప్రకారం..నిర్దిష్ట దేశాలకు చెందిన బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటక) వీసా దరఖాస్తుదారులు రిఫండబుల్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు పుట్టిన దేశాన్ని బట్టి ఈ బాండ్ కోసం 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాలి. పెరుగుతున్న వలసలు, జాతీయ భద్రతపై ప్రమాదాన్ని గుర్తించి వీసా నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు.ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే దేశాలుఈ 12-నెలల వీసా బాండ్ పరిధిలోకి వచ్చే దేశాల వివరాలను ప్రాథమికంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.1. మలావి: ఈ దేశంలోని వారు బీ-1, బీ-2 కింద యూఎస్ వెళ్లాలంటే 15,000 డాలర్ల వరకు బాండ్ తీసుకోవాలి.2. జాంబియా: 15,000 డాలర్ల వరకు బాండ్ అవసరం.అమెరికా కొత్త వీసా ప్రోగ్రామ్ పరిధిలో ప్రస్తుతానికి భారత్ ఈ జాబితాలో లేదు. ఏదేమైనా ఈ పైలట్ ప్రోగ్రామ్లోని అంశాలను పరిగణించి క్రమంగా ఈ విధానాన్ని ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యూఎస్ అధికారులు సూచించారు.ఈ బాండ్ ఎలా పని చేస్తుంది?వీసా ఓవర్ స్టే(అధిక కాలంపాటు యూఎస్లో నివసించడం)ను నిరోధించడానికి, ప్రయాణీకులు వారి వీసా నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు ఈ బాండ్ వ్యవస్థను రూపొందించారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కింద తెలుసుకుందాం.వీసా అప్రూవల్ తర్వాతే బాండ్ అవసరం అవుతుంది. దరఖాస్తుదారులు యూఎస్ ట్రెజరీ Pay.gov ప్లాట్పామ్ ద్వారా బాండ్ చెల్లింపులు చేయాలి.దరఖాస్తుదారులు తమ పుట్టిన దేశాన్ని బట్టి 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.వీసా నిబంధనలు పాటిస్తూ, వీసా గడువు ముగియకముందే అమెరికాను వీడే ప్రయాణికులకు బాండ్ పూర్తి రీఫండ్ లభిస్తుంది.వీసా హోల్డర్ తమ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే (అనధికార ఉద్యోగం లేదా వారి వీసా పరిధినిదాటి కార్యకలాపాలు సాగిస్తే) బాండ్ జప్తు చేసుకుంటారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయాణికులు నిర్దేశిత విమానాశ్రయాల ద్వారానే యూఎస్లోకి ప్రయాణం సాగించాలి.బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీఓఎస్)న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం (జేఎఫ్కే)వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐఏడీ)భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..ఓవర్ స్టే పరిమితంగానే..ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పరిమితంగానే ‘ఓవర్ స్టే రేట్లు’ కలిగి ఉన్నారని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) గుర్తించింది. బాండ్ అవసరాలకు సంబంధించి భవిష్యత్తు నిర్ణయాలను ఈ డేటా ప్రభావితం చేస్తుంది.భవిష్యత్తు విస్తరణఈ కార్యక్రమం పైలట్ పీరియడ్లో భారతదేశాన్ని చేర్చలేదు. అయితే ఇది శాశ్వతం మాత్రం కాదు. భారతీయ బీ -1 / బీ -2 దరఖాస్తుదారులు త్వరలో బాండ్ చెల్లించాలని కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ బ్రేక్అసలు యూఎస్ సమస్య ఏంటి?వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. 2023లో యూఎస్లోకి వచ్చి అక్కడే నిలిచిపోతున్న వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చాలా ఓవర్ స్టేలు హానికరం కానప్పటికీ, కొన్ని భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయి. వాటిని ట్రాక్ చేయడం కష్టం. సందర్శకులు, ఇతరులు సకాలంలో దేశం వదిలి వెళ్లేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ బాండ్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు. బాండ్ రీఫండబుల్.. సందర్శకులకు వీసా నిబంధనలను పాటించేలా చేస్తుంది. -
కీలక వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఈసారి రెపో రేటును మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆగస్టు 4న ప్రారంభమైన ఎంపీసీ 6న ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందులోని అంశాలను పేర్కొన్నారు. రెపో రేటును 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు చెప్పారు.స్థిరమైన రేట్లకు కారణాలు..రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 2.1 శాతానికి చేరింది. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాలు సహా మునుపటి కోతలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావాన్ని అంచనా వేయాలని ఆర్బీఐ భావిస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో లోన్ ఈఎంఐలు ప్రస్తుతానికి నిలకడగా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన అనంతరం, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు నాలుగో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రెపో రేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్లోనూ మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్మార్క్ రుణ రేటు 5.5 శాతానికి చేరింది.ఇదీ చదవండి: ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడురెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ముఖ్యాంశాలు..సీపీఐ ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో 3.1 శాతంగా అంచనా.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా అంచనా.గ్రామీణ వినియోగం నిలకడగా ఉంది.ప్రధాన ద్రవ్యోల్బణం 4 శాతం మార్కును తాకింది.జాగ్రత్తతో కూడిన విధానంపాలసీ రెపో రేటును 5.50 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చిత వాతావరణాన్ని ఎదుర్కోవడంలో విశ్వాసపూరితమైన, జాగ్రత్తతో కూడిన విధానాన్ని సూచిస్తోంది. ధరల ఒత్తిళ్ల నేపథ్యంలో సీపీఐ ద్రవ్యోల్బణం 3.1 శాతానికి తగ్గడం స్వాగతించదగిన అంశం. ఇది దీర్ఘకాలిక మూలధన ప్రణాళికకు తోడ్పడుతుంది. బయటి నుంచి వాణిజ్య చర్చలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ నేతృత్వంలోని మూలధన వ్యయాలు గణనీయమైన పెట్టుబడి అవకాశాలను ప్రేరేపిస్తున్నాయి.- శ్రీనివాసన్ వైద్యనాథన్, ఆపరేటింగ్ పార్టనర్, ఎస్సార్ క్యాపిటల్వ్యూహాత్మక విరామంఆర్బీఐ నిర్ణయాన్ని పూర్వపు వడ్డీ రేట్ల తగ్గింపుల ప్రభావం జనానికి చేరేలా చేయడం కోసం తీసుకున్న వ్యూహాత్మక విరామంగా చూడవచ్చు. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ప్రకటించిన 4.9 శాతం సీపీఐ అంచనా ద్రవ్యోల్బణ అంచనాలను నిలకడగా ఉంచాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. పెరిగిన వాస్తవ ధరలు, స్థిరమైన "తక్కువ రేట్లు ఎక్కువ కాలం" విధానం రానున్న కాలంలో మెరుగైన పనితీరును సమర్థిస్తుంది.- అనురాగ్ మిట్టల్, యూటీఐ ఏంఎంసీ ఫిక్స్డ్ ఇన్కం హెడ్ -
భారత ఆర్థిక మూలాలు పటిష్టం: డెలాయిట్ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, అంతర్జాతీయంగానూ అవకాశాలు విస్తరిస్తున్నాయని చెబుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) జీడీపీ వృద్ధి 6.4 - 6.7 శాతం వరకు నమోదు కావొచ్చని తెలిపింది.దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుండడం, ద్రవ్యోల్బణం దిగిరావడాన్ని సానుకూలతలుగా పేర్కొంది. అంతర్జాతీయంగా వాణిజ్య అవకాశాలను పర్యవేక్షిస్తూ.. భౌగోళికపరమైన అనిశ్చితులకు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. యూకేతో వాణిజ్య ఒప్పందానికి తోడు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతుండడం, ఐరోపా సమాఖ్యతో వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివరికి సాకారమయ్యే అవకాశాలు.. ఇవన్నీ భారత వాణిజ్య అవకాశాలను విస్తృతం చేస్తాయని, అధిక ఆదాయం, ఉద్యోగాలు, మార్కెట్ అవకాశాలను, దేశీ డిమాండ్ను పెంచుతాయని వివరించింది.గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఆర్థిక కల్లోలిత వాతావరణంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండడాన్ని ప్రత్యేకమైనదిగా ప్రస్తావించింది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు, చౌక మానవ వనరులు ఉండడాన్ని సానుకూలతలుగా డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వాణిజ్య అవకాశాలను పెంచుకునేందుకు భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు డెలాయిట్ ఇండియా తెలిపింది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పాన్ 2.0: పాత కార్డులు రద్దవుతాయా?ఇటీవలి వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకమైనవిగా అభివర్ణించింది. ఏఐ, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణల ఆధారిత స్టార్టప్ విభాగాల్లో సహకారాన్ని ఈ ఒప్పందాలు మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషించింది. కాకపోతే ఇటీవలి చోటు చేసుకున్న ప్రాంతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, కీలక ఖనిజాలు, ఫర్టిలైజర్స్పై ఆంక్షలు వంటివి వృద్ధి అవకాలను ప్రభావితం చేస్తాయని తెలిపింది.