breaking news
Economy
-
2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు: రాష్ట్రపతి ఆమోదం
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు ఈ నెల 12న ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.ఈ కొత్త ఆదాయపన్ను చట్టం, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఆదాయపన్ను చట్టం, 1961 స్థానంలో కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. పాత చట్టంతో పోల్చితే కొత్త చట్టం సరళతరంగా, పారదర్శకంగా ఉంటుందని ఆదాయపన్ను శాఖ ‘ఎక్స్’ ప్లాట్ఫామ్పై ప్రకటించింది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.The Income-tax Act, 2025 has received the Hon’ble President’s assent on 21st Aug 2025.A landmark reform replacing the 1961 Act, it ushers in a simpler, transparent & compliance-friendly direct tax regime.Access the official document here: https://t.co/wOPk1PFQbP pic.twitter.com/Xw84hzpPb3— Income Tax India (@IncomeTaxIndia) August 22, 2025 -
ఇథనాల్ కలిపిన పెట్రోలుపై సుప్రీంకోర్టులో పిల్!
ఇరవై శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అమ్మకాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇథనాల్ లేని పెట్రోలును ఎంచుకునే సౌకర్యం వినియోగదారులకు కల్పించాలని కోరుతూ అక్షయ్ మల్హోత్ర అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ సౌకర్యం కల్పించకపోవడం 2019 నాటి వినియోదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని, ప్రజల ప్రాథమిక హక్కులకూ భంగం కలిగించేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇథనాల్ కలిపిన పెట్రోలును విక్రయించాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివరకూ పెట్రోలులో కలిపే ఇథనాల్ మోతాదు పది శాతం మాత్రమే ఉండగా.. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి దీన్ని ఇరవై శాతానికి పెంచారు. అయితే చౌక ఇథనాల్ను కలుపుతున్నా అంతమేరకు పెట్రోలు ధరలు తగ్గకపోవడంపై, ఈ-20 పెట్రోలు కారణంగా తమ వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మైలేజీ తగ్గుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఏప్రిల్ కంటే ముందు తయారైన వాహనాలు, కాలుష్య నివారణ మార్గదర్శకాలు బీఎస్-6లు రెండింటికీ ఈ ఈ-20 పెట్రోలు అనుకూలంగా లేదన్నది ఆరోపణ. ఈ-20 ఇథనాల్ ఇంజిన్ భాగాలను దెబ్బతీస్తుందని, సామర్థ్యాన్ని తగ్గించడమే కాకుండా తుప్పు పట్టేందుకు అవకాశాలు ఎక్కువ చేస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు బీమా కంపెనీలు ససేమిరా అంటూండటం గమనార్హం.వినియోగదారుల అవగాహనపెట్రోల్ కంటే తక్కువ ధరకు ఇథనాల్ లభిస్తోందని కానీ ప్రభుత్వం మాత్రం అందుకు తగ్గట్టుగా పెట్రోలు ధరలు తగ్గించలేదని పిటిషనర్ ఆరోపించారు. పెట్రోలు బంకుల్లో లభిస్తున్నది ఇథనాల్ కలిపినదా? కాదా? అన్నది కూడా స్పష్టంగా తెలియడం లేదని తగిన లేబలింగ్, ప్రకటనలు లేకపోవడం వల్ల వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని తన పిటిషన్లో పేర్కొన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇథనాల్ లేని పెట్రోలును కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చిందీ పిటిషన్. ఇథనాల్ లేదా ఇతర పదార్థాలను కలిపి అందిస్తూంటే ఆ విషయాలను స్పష్టం చేస్తున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో అన్ని పెట్రోల్ స్టేషన్లలో ఇథనాల్ లేని పెట్రోల్ను కూడా అందుబాటులో ఉంచాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతోపాటే మిశ్రమం ఎంత? ఏ ఏ పదార్థాలను కలిపింది కూడా పెట్రోలు బంకుల్లో స్పష్టంగా ప్రకటించాలని... ఆయా వాహనాలు మిశ్రమ ఇంధనానికి అనువైనవా? కావా? అన్న సమాచారాన్ని వినియోగదారులకు అందించాలని సూచించింది. ఈ-20 పెట్రోలు వాడకం ప్రభావం వాహనాలపై ఎలా ఉంటుందన్న విషయాన్ని దేశవ్యాప్తంగా అధ్యయనం చేయాలని అభ్యర్థించింది.ఇదీ చదవండి: పాలసీ ఏజెంట్లు చెప్పని విషయాలు -
ద్రవ్యోల్బణాన్నే టార్గెట్ చేయాలా?
ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలా లేక వృద్ధికి ఊతమిచ్చేలా ఏవైనా కొత్త ప్రమాణాలను పరిశీలించాలా అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఒక చర్చాపత్రాన్ని రూపొందించింది. ఇందులో నాలుగు ప్రశ్నలు పొందుపర్చింది.ఇదీ చదవండి: ఏఐలో ఆధిపత్యం కోసం ఎగబడుతున్నారు!ఆహార, రిటైల్ ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్న పరిస్థితుల్లో మానిటరీ పాలసీకి రిటైల్ ద్రవ్యోల్బణాన్నే పరిగణనలోకి తీసుకోవాలా? 4 శాతం ద్రవ్యోల్బణం టార్గెట్ వేగంగా ఎదుగుతున్న భారత్లాంటి దేశంలో స్థిరత్వం, వృద్ధికి మధ్య సమతౌల్యత సాధించేందుకు 4 శాతం ద్రవ్యోల్బణం టార్గెట్ సరైనదేనా? ద్రవ్యోల్బణ శ్రేణిని సవరించాలా? ద్రవ్యోల్బణ లక్ష్య స్థాయిని తొలగించి, కేవలం శ్రేణిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలా? అనే ప్రశ్నలు వీటిలో ఉన్నాయి. వీటిపై సెప్టెంబర్ 18లోగా ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. -
అంతర్జాతీయ స్థాయికి భారత ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రతిపాదిత జీఎస్టీ శ్లాబుల హేతుబద్దీకరణతో భారత ఆతిథ్య రంగం అంతర్జాతీయంగా పోటీపడే సామర్థ్యాలను సంతరించుకుంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 5 శాతం పన్ను రేటును ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టూరిజం సేవలకు ప్రభుత్వం కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. పన్నుల భారాన్ని తగ్గించేందుకు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలను తీసుకురానున్నట్టు స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రకటనను హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఏఐ) స్వాగతించింది. అంతర్జాతీయంగా పర్యాటకులకు చిరునామాగా భారత్ మారేందుకు జీఎస్టీలో సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇతర దేశాలతో పోల్చితే భారత ఆతిథ్య పరిశ్రమ ఆకర్షణీయంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు, 2047 నాటికి ఏటా 10 కోట్ల మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించాలన్న లక్ష్య సాధనకు ఉపకరిస్తుందని పేర్కొంది. భారత్లో టారిఫ్లు (పన్ను రేట్లు) అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలన్న అభిప్రాయాన్ని హెచ్ఏఐ ప్రెసిడెంట్ కేబీ కచ్రు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా టాప్–5 పర్యాటక గమ్యస్థానాల్లో భారత్ను కూడా చేర్చాలంటే దేశ పోటీతత్వాన్ని పెంచాల్సి ఉందన్నారు. హోటళ్లపై 18 శాతం కారణంగా జీఎస్టీతో గదుల రేట్లు అధికంగా ఉంటున్నాయని.. దీంతో అంతర్జాతీయంగా పోటీపడలేని పరిస్థితి ఉన్నట్టు వివరించారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.. ‘‘ప్రస్తుతం హోటళ్లలో రూ.7,500 వరకు గదుల అద్దెపై 12 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఇది 6–7 ఏళ్ల క్రితం నిర్ణయించిన రేటు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పరిమితిని రూ.15,000కు పెంచాలి. ఇలా చేయడం వల్ల పర్యాటకులకు గదుల ధరలు అందుబాటులోకి వస్తాయి. మొత్తం మీద పరిశ్రమ పోటీతత్వం పెరుగుతుంది’’అని హెచ్ఏఐ సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక సేవలపై ఏక రూప 5 శాతం పన్ను రేటును, ఐటీసీ సదుపాయంతో అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కోరినట్టు పేర్కొంది. ఇలా చేస్తే నిబంధనల అమలు భారం తగ్గుతుందని, వ్యాపార నిర్వహణ మరింత సులభతరం అవుతుందని, మరిన్ని పెట్టుబడులు వచ్చి ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. -
భారత ఉత్పత్తులకు స్వాగతం.. ఆందోళన అనవసరం
అమెరికా టారిఫ్ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఉత్పత్తులను యూఎస్ దిగుమతి చేసుకోకపోతే రష్యా అండగా ఉంటుందని ఇండియాలోని రష్యా రాయబార కార్యాలయానికి చెందిన చార్గే డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ తెలిపారు. భారత వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే, రష్యా భారత దిగుమతులను సాధ్యమైనంత వరకు స్వాగతిస్తుందని, దాని గురించి ఆందోళన చెందకండంటూ భరోసానిచ్చారు. భౌగోళిక రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విస్తరణకు ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు.రష్యాతో భారత ఎగుమతులు, దిగుమతుల్లో వ్యాత్యాసం ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమతుల్యత 59 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రష్యా మరిన్ని భారతీయ వస్తువులను దిగుమతి చేసుకోవాలనే సంకేతాలను హైలైట్ చేస్తుంది. బాబుష్కిన్ చేసిన ప్రకటన ప్రత్యామ్నాయ మార్కెట్లను కోరుకునే భారతీయ ఎగుమతిదారులకు కలిసొచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు.పెరుగుతున్న వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలుభారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాస్కో పర్యటన సానుకూలంగా సాగిందని, ఆచరణాత్మక సహకారానికి భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ) కీలక వేదికగా పనిచేస్తుందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో జరిగే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఇరుదేశాల నేతలు ఢిల్లీలో సమావేశమవుతారని సమాచారం. అధికారికంగా తేదీని ధ్రువీకరించనప్పటికీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం గురించి ఊహాగానాలు పెరుగుతున్నాయి.చమురు సరఫరాకు అంతరాయం లేదుభారత్తో చమురు వాణిజ్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆంక్షల ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా ముడి చమురు ఎగుమతులను కొనసాగిస్తుందని బాబుష్కిన్ పునరుద్ఘాటించారు. భారత్ రష్యా చమురుకు అతిపెద్ద వినియోగదారని, రష్యా అతిపెద్ద చమురు ఉత్పత్తిదారని చెప్పారు. ఏకపక్ష చర్యలు సరఫరా గొలుసులకు విఘాతం కలిగిస్తాయని, ప్రపంచ మార్కెట్లను అస్థిరపరుస్తాయన్నారు.ఆంక్షలు ఉన్నప్పటికీ..రష్యాపై పాశ్చాత్య దేశాలు ఏళ్ల తరబడి ఆంక్షలు విధించినప్పటికీ భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యం విపరీతంగా పెరిగిందని బాబుష్కిన్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇరు దేశాల వాణిజ్యం ఏడు రెట్లు అయిందన్నారు. పరస్పర చర్చల ద్వారా వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన అన్నారు. భారత్-రష్యా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచంలోనే టాప్ 10 చమురు కంపెనీలు -
కొత్త బిల్లుతో ఏటా రూ.20 వేల కోట్లు నష్టం.. అయినా తప్పట్లేదు!
ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ను నిషేధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నిన్నటి పార్లమెంట్ సెషన్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభలో ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు-2025ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఈ రంగంపై ఆధారపడిన వారిలో సామూహిక నిరుద్యోగం పెరుగుతుందనే భయాలు నెలకొన్నాయి. వీటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ డిజిటల్, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమింగ్లో పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు ఉద్భవిస్తాయని పేర్కొంది.ఈ మేరకు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో పెరుగుతున్న నిరుద్యోగ ఆందోళనల మధ్య ఈ హామీ వచ్చింది. ఈ-స్పోర్ట్స్, ఆన్లైన్ సోషల్ గేమ్స్ వంటి ద్రవ్యేతర విభాగాల్లో అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే మనీ గేమింగ్ను పూర్తిగా నిషేధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. ప్రస్తుతం 45 కోట్ల మంది భారతీయులు ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్లో నిమగ్నమయ్యారని, మొత్తంగా ఏటా రూ.20,000 కోట్ల వరకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి. ఇది గణనీయమైన ఆదాయాన్ని త్యాగం చేయడమే అయినా వినియోగదారుల సంక్షేమం, ఆర్థిక రక్షణే ఈ నిషేధానికి కారణమని అధికారులు చెబుతున్నారు.మనీ గేమ్స్ ఆడే వారు బాధితులే తప్పా నేరస్థులు కాదని, ఈ గేమ్స్ ప్రకటనదారులు, సర్వీస్ ప్రొవైడర్లు, ఫైనాన్షియల్ ఎనేబుల్స్పై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘గేమ్ మేకర్లు, సాఫ్ట్వేర్ డెవలపర్లు కేవలం మనీ గేమ్స్పైనే పని చేయరు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఇతర ఈ-స్పోర్ట్స్, సోషల్ గేమ్స్పై కూడా పనిచేస్తున్నారు. ఈ విభాగాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చాం’ అని ఆయన చెప్పారు.ఏమిటీ బిల్లు? అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్(సట్టా, పోకర్, రమ్మీ, కార్డ్ గేమ్స్)తోపాటు ఆన్లైన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్, ఆన్లైన్ లాటరీలను నిషేధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. డబ్బులు పెట్టి ఆన్లైన్లో ఆడే క్రీడలపై నిషేధం అమలవుతుంది. ఆన్లైన్ గేమ్లకు ప్రచారం చేసినవారు కూడా నేరస్తులే. ఇలాంటి గేమ్ల్లో ఒకరి నుంచి మరొకరికి ఆన్లైన్లో నగదు బదిలీలకు వీలు కల్పించిన బ్యాంక్లు లేదా ఆర్థిక సంస్థలను సైతం శిక్షిస్తారు. ఆన్లైన్ గేమ్ను ఏ రూపంలో నిర్వహించినా, ప్రోత్సహించినా, ప్రచారం చేసినా నేరమే. అంటే కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా చేసినా నేరంగా పరిగణిస్తారు. సోషల్ మీడియా లేదా పత్రికలు లేదా టీవీల్లో ప్రచారం చేసినా శిక్ష తప్పదు.నైపుణ్యం లేదా అదృష్టం(చాయిప్)పై ఆధారపడిన ఏ గేమ్ అయినా నిషిద్ధమే. మన దేశంలోనే కాకుండా.. దేశ సరిహద్దుల్లో లేదా విదేశీ గడ్డపై నుంచి గేమ్లను నిర్వహించినా దోషులే అవుతారు. ఈ బిల్లు ప్రకారం.. ఆన్లైన్ గేమ్ల్లో పాల్గొన్నవారిని దోషులుగా కాకుండా బాధితులుగానే పరిగణిస్తారు. డబ్బుతో సంబంధం లేదని ఈ–స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్కు కొన్ని నియంత్రణలను బిల్లు సూచిస్తోంది. సమాజంలో అశాంతి తలెత్తకుండా చూడాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని బిల్లులో పొందుపర్చారు. డిజిటల్ టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడుకొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఇదీ చదవండి: రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరండబ్బు ప్రమేయం లేని ఈ–స్పోర్ట్స్ చట్టబద్ధమే అవుతాయి. ఇందుకోసం కేంద్ర క్రీడల శాఖ కొన్ని మార్గదర్శకాలు, ప్రమాణాలు రూపొందించాలని బిల్లులో సూచించారు. విద్యా, సాంస్కృతిక విలువలను పెంపొందించడానికి, నైపుణ్యాభివృద్ధికి, సమాజంలో ప్రజల మధ్య అనుసంధానానికి ఆన్లైన్ సోషల్ గేమ్స్ను ప్రోత్సహించవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోవాలి. ఈ–స్పోర్ట్స్కు సంబంధించి శిక్షణ, పరిశోధనలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మానసికోల్లాసం, నైపుణ్యాభివృద్ధి కోసం సోషల్, ఎడ్యుకేషన్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఆన్లైన్ గేమ్లను వర్గీకరించడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి రూ.50 కోట్లతో జాతీయ స్థాయిలో గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు. దీనికి ప్రతిఏటా రూ.20 కోట్లు కేటాయిస్తారు. ఎలాంటి గేమ్ అనేది ఈ అథారిటీ నిర్ణయిస్తుంది. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుంది. -
రష్యాతో వాణిజ్యం.. తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం
ముడిచమురు దిగుమతుల కారణంగా రష్యాతో వాణిజ్య అసమతుల్యత పెరుగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. వాణిజ్యం, ఆర్థికం, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై భారత్-రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ (ఐఆర్ఐజీసీ-టీఈసీ)లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఆర్థిక పరిస్థితులను తక్షణమే పునసమీక్షించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గత నాలుగేళ్లలో వస్తువులపరంగా ద్వైపాక్షిక వాణిజ్యం ఐదు రెట్లు పెరిగిందన్నారు. 2021లో 13 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 నాటికి 68 బిలియన్ డాలర్లకు పెరిగిందని చెప్పారు. ఏదేమైనా, ఈ వృద్ధి గణనీయమైన వాణిజ్య అసమతుల్యతతో పాటు 6.6 బిలియన్ డాలర్ల నుంచి 58.9 బిలియన్ డాలర్లకు చేరిందని, ఇది తొమ్మిది రెట్లు పెరిగిందని, దీన్ని అత్యవసరంగా పునసమీక్షించాలని కోరారు.ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంభారత్-రష్యాల మధ్య ప్రత్యేకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ వాణిజ్య అంతరాన్ని పరిష్కరించడమే కాకుండా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు జైశంకర్ రోడ్ మ్యాప్ను రూపొందించారు. టారిఫ్, నాన్ టారిఫ్ అడ్డంకులను తొలగించడం, నిరంతర లాజిస్టిక్స్ అడ్డంకులను పరిష్కరించడం, అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (ఐఎన్ఎస్టీసీ), ఉత్తర సముద్ర మార్గం, చెన్నై-వ్లాదివోస్తోక్ సముద్ర కారిడార్ వంటి వ్యూహాత్మక వాణిజ్య మార్గాల ద్వారా కనెక్టివిటీని పెంచడం వంటి కీలక ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.చెల్లింపు యంత్రాంగాలను క్రమబద్ధీకరించాలని, భారత్-యురేషియన్ ఎకనమిక్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ)పై చర్చలను వేగవంతం చేయాలని జైశంకర్ సూచించారు. ఆయన ప్రస్తుత పర్యటనలో ఈ ఎఫ్టీఏకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడం గమనార్హం. ఈ ప్రయత్నాలు అసమతుల్య వాణిజ్యాన్ని పెంచడానికి సహాయపడటమే కాకుండా 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల సవరించిన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని సాధించడానికి చేరువ చేస్తుందని నమ్ముతున్నారు.రష్యా కంపెనీలకు ‘మేక్ ఇన్ ఇండియా’ మార్గాలుశరవేగంగా మారుతున్న భారత ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని జైశంకర్ రష్యన్ పరిశ్రమలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో పాటు పట్టణీకరణ, భారతీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త వాణిజ్య మార్గాలను తెరతీయాలని చెప్పారు. రష్యన్ కంపెనీలు అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్ను సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి -
ఫండ్స్ విదేశీ ఆస్తుల్లో క్షీణత
మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని విదేశీ పెట్టుబడుల (విదేశీ స్టాక్స్, ఇతర సెక్యూరిటీల్లో) విలువ గత ఆర్థిక సంవత్సంలో 5.6 శాతం తగ్గి 8.3 బిలియన్ డాలర్లుగా (రూ.72,210 కోట్లు సుమారు) ఉన్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. 2024 మార్చి నాటికి మ్యూచువల్ ఫండ్స్ విదేశీ నిర్వహణ ఆస్తుల విలువ 8.81 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం చివరికి ఫండ్స్ నిర్వహణలోని యూఎస్ ఈక్విటీల విలువ 3.9 శాతం తగ్గి రూ.44,500 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ వార్షిక సర్వే నివేదిక తెలిపింది.ఐర్లాండ్, తైవాన్లోని పెట్టుబడుల విలువ సైతం ఇదే మాదిరి తగ్గింది. భారత మ్యూచువల్ ఫండ్స్ సంస్థల విదేశీ పెట్టుబడుల్లో 95 శాతం యూఎస్, లగ్జెంబర్గ్, ఐర్లాండ్లోనే ఉన్నట్టు ఆర్బీఐ డేటా తెలియజేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన వాణిజ్య విధానాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు నెలకొనడం తెలిసిందే. ఇక గత ఆర్థిక సంవత్సరంలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాల్లోని పెట్టుబడులు 25 శాతం పెరిగి రూ.29.45 లక్షల కోట్లుగా ఉన్నట్టు చెబుతూ.. స్థానిక మార్కెట్పై ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగినట్టు వివరించింది.ఇదీ చదవండి: పీఎస్యూ బ్యాంక్ చీఫ్లతో ఆర్థిక శాఖ సమావేశంగత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ విదేశీ చెల్లింపుల బాధ్యతలు 20 శాతం పెరిగి 30.5 బిలియన్ డాలర్లకు చేరాయని.. ప్రవాస భారతీయుల పెట్టుబడులు పెరగడం వల్లేనని వివరించింది. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో యూఏఈలోని ఎన్ఆర్ఐల పెట్టుబడులు రూ.52,549 కోట్లకు చేరాయి. ఫండ్స్ ఆస్తుల్లో యూఏఈ, యూఎస్ఏ, యూకే, సింగపూర్ ఎన్ఆర్ఐల వాటా అధికంగా ఉంది. -
పీఎస్యూ బ్యాంక్ చీఫ్లతో ఆర్థిక శాఖ సమావేశం
ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్లతో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం.నాగరాజు అధ్యక్షతన ఆర్థిక శాఖ మూడు గంటలపాటు సమావేశం నిర్వహించింది. తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై సమీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఉత్పాదక రంగాలకు రుణాల విడుదలను పెంచవలసిందిగా బ్యాంకుల ఎండీలు, సీఈవోలను నాగరాజు కోరినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలిబ్యాంకింగ్ పీఎస్యూ దిగ్గజం స్టేట్బ్యాంక్సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో రూ. 44,218 కోట్ల నికర లాభం ఆర్జించాయి. వార్షికంగా ఇది 11 శాతం వృద్ధికాగా.. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 39,974 కోట్ల లాభం ఆర్జించాయి. ఈ ఏడాది క్యూ1లో ప్రభుత్వ బ్యాంకులు ఆర్జించిన రూ. 44,218 కోట్ల లాభాల్లో కేవలం ఎస్బీఐ 43 శాతం వాటా ఆక్రమించడం విశేషం! -
జీఎస్టీ తగ్గింపుతో వినియోగం జోరు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండే పన్ను శ్లాబులతో కూడిన ప్రతిపాదిత సంస్కరణలతో ఆదాయ నష్టం ఏర్పడినప్పటికీ.. అంతిమంగా వినియోగానికి, జీడీపీకి ఊతమిస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది. జీఎస్టీ 5, 12, 18, 28 శాతం శ్లాబులు ఉండగా.. 5, 18 శాతంతోపాటు లగ్జరీ, సిన్ (పొగాకు తదితర) గూడ్స్పై 40 శాతం పన్నును కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. దీనిపై మంత్రుల బృందం అధ్యయనం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. రేట్ల తగ్గింపు ఫలితంగా ఆదాయం రూ.85,000 కోట్లు తగ్గుతుందని, అదే సమయంలో వినియోగం రూ.1.98 లక్షల కోట్లు పెరుగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది.జీడీపీ కూడా 0.6 శాతం పెరుగుతుందని నివేదిక పేర్కొంది. జీఎస్టీ ఆరంభంలో సగటు రేటు 14.4 శాతంగా ఉంటే, 2019 సెప్టెంబర్ నాటికి 11.6 శాతానికి తగ్గిందని.. అది ఇప్పుడు 9.5 శాతానికి దిగిరావచ్చని తెలిపింది. వినియోగం పెరుగుతుండడం ద్రవ్యోల్బణాన్ని ఎగిసేలా చేయదని వివరించింది. నిత్యావసరాలైన ఆహారం, వస్త్రాలపై 12 శాతం రేటు కాస్తా 5 శాతానికి దిగొస్తుందని.. ఈ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం 10–15 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని తెలిపింది. సేవలకు సంబంధించి ద్రవ్యోల్బణం 5–10 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అంచనా కట్టింది. దీంతో మొత్తం మీద రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) 0.20–0.25 శాతం తగ్గుతుందని తెలిపింది. ఇదీ చదవండి: ఆన్లైన్ గేమింగ్ బిల్లుపై కేంద్ర హోం మంత్రికి లేఖజీడీపీ 1.6 శాతం పెరగొచ్చు..బడ్జెట్లో కల్పించిన ఆదాయపన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని చూస్తే మొత్తం మీద వినియోగం 5.31 లక్షల కోట్లు పెరుగుతుందని.. దీని ఫలితంగా జీడీపీ వృద్ధి 1.6 శాతం అధికమవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. -
మొబైళ్లను 5% జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలి
మొబైల్ ఫోన్లు, పరికరాలను, నిత్యావసర ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన 5 శాతం జీఎస్టీ శ్లాబ్లో చేర్చాలని కేంద్రానికి ఇండియా సెల్యూలార్ అండ్ ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న 18 శాతం జీఎస్టీ తిరోగమన విధానమని పేర్కొంది. నాలుగు శ్లాబులుగా ఉన్న జీఎస్టీ రేట్లను రెండింటికి తగ్గించేలా కేంద్రం ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో ఐసీఈఏ విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.ప్రస్తుతం మొబైల్ ఫోన్లనేవి విలాస వస్తువులుగా గాకుండా విద్య, వైద్యం, ఆర్థిక సమ్మిళితత్వం, గవర్నెన్స్కి సంబంధించి అత్యవసర డిజిటల్ మౌలిక సదుపాయాలకు కీలకంగా మారాయని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ వ్యవస్థను 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా మొబైల్స్ను అయిదు శాతం జీఎస్టీలో చేర్చాలని కోరారు. జీఎస్టీ ప్రవేశపెట్టడానికి ముందు చాలా రాష్ట్రాలు మొబైల్ ఫోన్లను నిత్యావసర ఉత్పత్తులుగా గుర్తించి, వాటిపై 5 శాతం వ్యాట్ (విలువ ఆధారిత పన్ను) మాత్రమే విధించాయని మహీంద్రూ చెప్పారు.ఇదీ చదవండి: అల్ట్రాటెక్ 200 ఎంటీపీఏ సామర్థ్యంఅయితే, జీఎస్టీని ప్రవేశపెట్టాక ముందు 12 శాతం శ్లాబ్లో ఉంచి ఆ తర్వాత 2020లో 18 శాతానికి మార్చారని మహీంద్రూ గుర్తు చేశారు. దీనితో అందుబాటు ధరల్లో మొబైల్స్ లభ్యతపైనా, అమ్మకాల పరిమాణంపైనా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పారు. మొబైల్స్ వార్షిక వినియోగం 30 కోట్ల యూనిట్ల నుంచి 22 కోట్లకు తగ్గిపోయిందని వివరించారు. కాబట్టి వీటిని అయిదు శాతం శ్లాబ్లోకి చేర్చడాన్ని మినహాయింపుగా భావించరాదని, కరెక్షన్గా పరిగణించాలని మహీంద్రూ చెప్పారు. 2015 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రూ. 18,900 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 5.45 లక్షల కోట్లకు చేరింది. -
భారత్పై టారిఫ్ల ప్రభావం అంతంతే!
యూఎస్ టారిఫ్లతో భారత కార్పొరేట్ కంపెనీలకు ప్రత్యక్ష సంబంధం తక్కువేనని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. కాకపోతే ప్రస్తుతం మినహాయింపు పరిధిలో ఉన్న ఫార్మాస్యూటికల్స్, తదితర రంగాలపై భవిష్యత్తులో ఆ వెసులుబాటు తొలగిస్తే ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. భారత ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్లను ప్రస్తుతం యూఎస్ అమలు చేస్తోంది. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం టారిఫ్లు అమల్లోకి రానున్నాయి.ఫార్మా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు మాత్రం వీటి నుంచి మినహాయింపులు ఉన్నాయి. 50 శాతంతో ఆసియాలో భారత్పైనే అధిక టారిఫ్లు అమలు కానున్నట్టు ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రిస్క్లు తగ్గుతాయని పేర్కొంది. రష్యా చమురును భారత ఆయిల్ కంపెనీలు 30–40 శాతం తక్కువ రేటుకు దిగుమతి చేసుకుంటుండడం వాటి లాభాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు వివరించింది. భారత ఐటీ కంపెనీలపై టారిఫ్ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం తక్కువేనని తేల్చింది. అలాగే, దేశీ మార్కెట్పై ప్రధానంగా ఆధారపడే ఆయిల్, గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజినీరింగ్, నిర్మాణ రంగం, టెలికం, యుటిలిటీలపై ప్రభావం ఉండదని తెలిపింది. అమెరికా అధిక టారిఫ్లు అలాగే కొనసాగితే భారత వృద్ధి రేటు 2025–26లో 6.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది. దీర్ఘకాలిక వృద్ధిని టారిఫ్లు అడ్డుకోవుభారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలపై యూఎస్ టారిఫ్లు ప్రభావం చూపించకపోవచ్చని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ మరోసారి పునరుద్ఘాటించింది. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. భారత రేటింగ్ను సైతం బీబీబీ మైనస్ నుంచి బీబీబీ స్టెబుల్కు అప్గ్రేడ్ కూడా చేసింది. ‘రానున్న కాలంలో వృద్ది అవకాశాలు బలోపేతం అవుతాయి. వృద్ధి సగటు 6.8 శాతానికి చేరుతుంది. మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెరిగితే, దీర్ఘకాలిక వృద్ది అవకాశాలకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. దీంతో భారత్ దీర్ఘకాలిక వృద్ధి మరింత బలపడుతుంది’ అని ఎస్అండ్పీ తన తాజా నివేదికలో వివరించింది.స్వీయ వినియోగం సానుకూల అంశంభారత్ ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు చూపిస్తున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటని పేర్కొంది. గత 3–4 ఏళ్లలో ప్రాంతీయంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ మెరుగైన వృద్ధిని నమోదు చేసినట్టు గుర్తు చేసింది. భారత వృద్ధిలో 85 శాతం దేశీయ అంశాలపైనే ఆధారపడి ఉంటుందని, ఎగుమతుల రూపంలో సమకూరేది 15 శాతమేనని తెలిపింది. స్వీయ వినియోగంపై అధికంగా ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ కావడం సానుకూల అంశంగా పేర్కొంది. స్వల్పకాలంలో వ్యాపార విశ్వాసంపై ప్రభావం పడినప్పటికీ సానుకూల వృద్ది పథం, సానుకూల వ్యాపార వాతావరణం అన్నవి.. మధ్య కాలం, దీర్ఘకాలంలో వృద్ధిని నిర్ణయిస్తాయని అభిప్రాయపడింది. ‘భారత జీడీపీలో అమెరికా ఎగుమతుల పాత్ర ఒక శాతమే. టారిఫ్లు అధికంగా విధించినప్పటికీ దీర్ఘకాలంలో వృద్ధి అవకాశాలను ప్రభావితం చేస్తాయని అనుకోవడం లేదు’అని వివరించింది.ఇదీ చదవండి: ‘నా భార్య నన్ను పిచ్చోడిలా చూసింది’ -
పత్తి దిగుమతులపై సుంకాల ఊరట
న్యూఢిల్లీ: దేశీయంగా టెక్స్టైల్స్ పరిశ్రమకు కీలక వనరైన ముడి పత్తి దిగుమతులకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు సుంకాల నుంచి మినహాయింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనిపై 11 శాతం సుంకాలతో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు కూడా వర్తిస్తోంది. ఆర్థిక శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఈ మినహాయింపు ఆగస్టు 19 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.దీనితో భారత్కి పత్తిని ఎగుమతి చేసే రెండో అతిపెద్ద సరఫరాదారైన అమెరికాకు ప్రయోజనం చేకూరనుంది. ధరలను స్థిరీకరించడానికి, ముడి సరుకు లభ్యతను మెరుగుపర్చడానికి సుంకాల మినహాయింపు ఉపయోగపడుతుందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. దేశీయంగా పత్తి ధరలు తగ్గిపోయి, రైతులపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో మినహాయింపులను ప్రభుత్వం 40 రోజులకే పరిమితం చేసినట్లు చెప్పారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 579.2 మిలియన్ డాలర్లుగా ఉన్న పత్తి దిగుమతులు 2025 ఆర్థిక సంవత్సరంలో 107 శాతం ఎగిసి 1.20 బిలియన్ డాలర్లకు చేరాయి. -
యూపీఐ వినియోగంలో టాప్లో ఉన్న రాష్ట్రం ఇదే..
యూపీఐ వినియోగంలో దేశంలోనే మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉందని ఎస్బీఐ ఎకనామిక్ రిసెర్చ్ డిపార్ట్మెంట్(ఈఆర్డీ) తెలిపింది. కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. అయితే కొన్ని టీపీఏపీల(థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్) మధ్య లావాదేవీలు అధికంగా జరుగుతుండడంతో దేశంలో ఫిన్టెక్ ఆవిష్కరణలు దెబ్బతింటున్నట్లు హెచ్చరించింది.ఎస్బీఐ ఈఆర్డీ తొలిసారిగా ప్రచురించిన యూపీఐ లావాదేవీలపై రాష్ట్రాల వారీగా డేటాను ప్రస్తావిస్తూ, జులైలోనే 9.8 శాతం వాల్యూమ్(యూపీఐల సంఖ్య) వాటాతో మహారాష్ట్ర స్థిరంగా ముందంజలో ఉందని తెలిపింది. కర్ణాటక (5.5 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (4.1 శాతం), తమిళనాడు (4 శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఈఆర్డీలో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. జులై నెలలోనే డిజిటల్ చెల్లింపుల్లో(విలువ) మహారాష్ట్ర 9.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక (5.8 శాతం), యూపీ (5.3 శాతం), తెలంగాణ (5.1 శాతం), తమిళనాడు (4.7 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.ఇదీ చదవండి: ఉద్యోగులకు ఆదివారాలు పని.. వివరణ ఇచ్చిన ఎల్ అండ్ టీ ఛైర్మన్విలువ, వాల్యూమ్ పరంగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2025లోనే సగటు రోజువారీ విలువ జనవరిలో రూ.75,743 కోట్ల నుంచి జులైలో రూ.80,919 కోట్లకు, ఆగస్టులో రూ.90,446 కోట్లకు (ఇప్పటివరకు) పెరిగింది. -
ట్రాక్టర్లు, బస్సుల ధరలు తగ్గింపు?
జీఎస్టీ శ్లాబులను క్రమబద్ధీకరించాలని యోచిస్తున్నట్లు కేంద్రం ఇటీవల తెలిపిన నేపథ్యంలో ప్రధాన వాహనాలపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రధానంగా బస్సులపై పన్నును 28% నుంచి 18%కి, ట్రాక్టర్లపై పన్నును 12% నుంచి 5%కు తగ్గించే ప్రతిపాదనలున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రజారవాణాను మెరుగుపరచడం, వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో ఈ కేటగిరీల్లో అమ్మకాలను పెంచేందుకు ఈమేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.వ్యవసాయ యాంత్రీకరణకు ఊతంవ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి, రైతులపై వ్యయ భారాన్ని తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రాక్టర్లు, వాటి విడిభాగాలపై పన్నును తగ్గించడం వల్ల మూలధనం, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయంటున్నారు. దీనివల్ల వ్యవసాయ సామర్థ్యం పెరుగుతుందని, గ్రామీణ ఆదాయాలు అధికమవుతాయని భావిస్తున్నారు. ఇదిలాఉండగా, కంపెనీలు తయారు చేసే యంత్రాలపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునే అర్హతను కొనసాగించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఇన్పుట్ ట్యాక్స్లు ఎక్కువగా ఉన్నందున మరిన్ని రిఫండ్లు ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఎస్కార్ట్స్ కుబోటా డైరెక్టర్, సీఎఫ్వో భరత్ మదన్ తెలిపారు. ఇన్పుట్ ఖర్చులు ప్రస్తుతం 14-15 శాతంగా ఉన్నాయని, 12 శాతం అవుట్పుట్ ట్యాక్స్ ఉందని పేర్కొన్నారు.ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్(టీఎంఏ) డేటా ప్రకారం, ట్రాక్టర్ అమ్మకాలు ఇప్పటికే పెరుగుతున్నాయి. దేశీయంగా 2025 జనవరి-జులై కాలంలో 14% పెరిగాయి. ఇది 5,50,948 యూనిట్లుగా ఉంది. గతేడాది 4,84,024 యూనిట్ల నుంచి పెరిగింది.బస్ సెగ్మెంట్లో ఇలా..ప్రస్తుతం 28% జీఎస్టీని ఎదుర్కొంటున్న బస్సులు, వాటి విడిభాగాలపై కూడా ఉపశమనం కల్పించవచ్చు. దీన్ని 18 శాతానికి చేర్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిపాదిత 10 పాయింట్ల తగ్గింపు ఈ విభాగంలో బలమైన వృద్ధిని నమోదు చేస్తుందంటున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బస్సులకు ఇటీవలి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎంతో కలిసొస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి ఈ సెగ్మెంట్లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ జీఎస్టీ తగ్గింపు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని అశోక్ లేలాండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ధీరజ్ హిందుజా తెలిపారు. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం, మీడియం, హెవీ బస్ సేల్స్ 2025 ఆర్థిక సంవత్సరంలో 23% పెరిగి 66,328 యూనిట్లకు చేరుకున్నాయి. లైట్ ప్యాసింజర్ క్యారియర్లు కూడా 6% పెరిగి 54,807 యూనిట్లకు చేరుకున్నాయి.ఇదీ చదవండి: నిలిపేసిన పాలసీల పునరుద్ధరణ -
స్టార్టప్లకు పన్ను లబ్ధి
న్యూఢిల్లీ: స్టార్టప్లకు పన్ను సంబంధ లబ్దిని పెంచడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ) మార్గదర్శకాలను మరింత సరళీకరించడం, పొరుగు దేశాల నుంచి పెట్టుబడులను ప్రోత్సహించడం తదితర అంశాలతో వాణిజ్యం, పరిశ్రమల శాఖ 100 రోజుల సంస్కరణల అజెండాకు తెరతీయనుంది. అంతేకాకుండా లెదర్, ఫుట్వేర్ పరిశ్రమకు మద్దతుగా కొన్ని పర్యావరణ నిబంధనలను సులభతరం చేయడం, ఈకామర్స్ కేంద్రాల ద్వారా ఎగుమతుల పెంపునకు నిబంధనలను సరళీకరించడం, వివిధ రంగాలకు అవసరమయ్యే ల్యాబ్ టెస్టింగ్, సర్టిఫికేషన్లను ఏకీకృతం చేయడం సైతం సంస్కరణలలో భాగంకానున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తదుపరి 100 రోజుల ట్రాన్స్ఫార్మేషన్ అజెండాలో భాగంగా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు వేగవంత చర్యలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రతిపాదనలు దేశ ఎగుమతులతోపాటు.. ఎఫ్డీఐలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. కాగా. 2025–26 ఏప్రిల్– జూలైలో ఎగుమతులు 3.07 శాతం పుంజుకుని 149.2 బిలియన్ డాలర్లను తాకగా.. దిగుమతులు మరింత అధికంగా 5.4 శాతం పెరిగి 244 బిలియన్ డాలర్లను దాటాయి. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల్లో వాణిజ్య లోటు 94.81 బిలియన్ డాలర్లకు చేరింది. గతేడాది(2024–25) ఎఫ్డీఐలు 13 శాతం ఎగసి 50 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
యూపీఐ సబ్సిడీ కేటాయింపులు పెంచే అవకాశం
ముంబై: యూపీఐ, రూపే కార్డ్ లావాదేవీల ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకి మద్దతునిచ్చేందుకు ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో కేటాయించిన రూ. 437 కోట్ల వార్షిక సబ్సిడీ మొత్తాన్ని మరింతగా పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి చెందిన ఎకానమిస్టులు ఒక నివేదికలో పేర్కొన్నారు. గణాంకాల ప్రకారం ఈ వ్యవస్థ నిర్వహణ కోసం పరిశ్రమవర్గాలు రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు భారాన్ని మోస్తున్నాయని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,000 కోట్లుగా ఉన్న సబ్సిడీ మొత్తాన్ని ఈ బడ్జెట్లో భారీగా కోత పెట్టడంతో కొన్ని యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధించేందుకు అనుమతించాలంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయని నివేదిక తెలిపింది. దీని ప్రకారం వ్యాపారులకు వ్యక్తులు చేసే చెల్లింపులపై 0.30 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేటును (ఎండీఆర్) వసూలు చేసుకునేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అనుమతిస్తోంది. అయితే, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించే ఉద్దేశంతో 2020 నుంచి రూపే డెబిట్ కార్డు, భీమ్–యూపీఐ ద్వారా చెల్లింపులపై చార్జీలను తొలగించింది. మరోవైపు, చిన్న వర్తకులకు యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఉండదు. పైగా రూ. 2,000 వరకు లావాదేవీ మొత్తాలపై 0.15 శాతం వరకు ప్రోత్సాహకాన్ని కూడా పొందవచ్చు. ఈ ప్రోత్సాహకాన్ని వ్యాపారి బ్యాంకునకు ప్రభుత్వం చెల్లిస్తుంది. దాన్ని కస్టమర్ బ్యాంకుతో పాటు మిగతా వర్గాలన్నీ కలిసి పంచుకుంటాయి. ప్రస్తుతం యూపీఐ లావాదేవీల్లో అమెరికన్ సంస్థలకు చెందిన ఫోన్పే, గూగుల్పే ఆధిపత్యం నెలకొనడమనేది దేశీ ఫిన్టెక్ సంస్థలను తొక్కేసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. -
మేకిన్ ఇండియాపై జాగ్రత్త
న్యూఢిల్లీ: ‘మేకిన్ ఇండియా’ నినాదమనేది ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్’ (భారత్కి కావల్సినవన్నీ ఇక్కడే తయారు చేసుకోవడం)గా మారకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు చెప్పారు. దీనివల్ల చైనాకు వెళ్లే పెట్టుబడులను మనవైపు ఆకర్షించే అవకాశం కోల్పోతామని, ఉత్పాదకతపైనా తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మేకిన్ ఇండియా విజయవంతం కావడమనేది, రక్షణాత్మక ధోరణి కన్నా ఎంత మెరుగ్గా పోటీపడగలమనే దానిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. మిగతావారితో పని లేకుండా విడిగా ఉండిపోవడం కాకుండా స్వేచ్ఛా విధానాలను అమలు చేయడం ద్వారానే సుస్థిర అభివృద్ధి సాధ్యమని దువ్వూరి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పునరుద్ఘాటించినట్లుగా ఆత్మనిర్భర భారత్ నినాద లక్ష్యం రక్షణ, ఇంధనంలాంటి సున్నిత రంగాల్లో వ్యూహాత్మకంగా స్వయం సమృద్ధి సాధించడమే కావాలే తప్ప దాన్ని ప్రతి ఒక్క దానికి అన్వయించుకోకూడదని తెలిపారు. భారత్కి మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచానికి కూడా అవసరమైన వాటిని ఉత్పత్తి చేసే ఎగుమతుల ఆధారిత తయారీ హబ్గా దేశాన్ని తీర్చిదిద్దడమే మేకిన్ ఇండియా ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ‘‘అయితే, 50 శాతం టారిఫ్ల వల్ల కీలకమైన అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి, ఈ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. డైవర్సిఫికేషన్ వ్యూహంలో భాగంగా చైనాకి ప్రత్యామ్నాయంగా భారత్ వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు, ఇప్పుడు ఆసియాలోనే అత్యధిక టారిఫ్లు ఎదుర్కొంటున్న మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి సందేహిస్తారు’’ అని దువ్వూరి తెలిపారు. ‘‘ఆసియాలో బంగ్లాదేశ్, వియత్నాం, ఇండొనేíÙయా కన్నా భారత్పై అత్యధిక టారిఫ్లు వర్తిస్తుండటమనేది ఆందోళనకర అంశం. కీలక తరుణంలో చైనా ప్లస్ వన్గా ఎదగాలన్న ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి దీని వల్ల విఘాతం కలుగుతుంది’’ అని చెప్పారు. అమెరికాకు సగం ఎగుమతులపై టారిఫ్ల ప్రభావం .. మన ఎగుమతుల్లో దాదాపు 20 శాతం వాటా ఉండే అమెరికా మార్కెట్లో 50 శాతం టారిఫ్లు విధిస్తే, కనీసం సగం ఎగుమతులపై ప్రభావం పడుతుందని దువ్వూరి తెలిపారు. ముఖ్యంగా టెక్స్టైల్స్, రత్నాభరణాలు, లెదర్లాంటి కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రంగాలపై ప్రభావం ఉంటుందని చెప్పారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్కు టారిఫ్ల నుంచి మినహాయింపు ఉండటం శాశ్వతమేమీ కాదని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు కొనసాగుతున్న సమీక్షల వల్ల భవిష్యత్తులో వాటిని కూడా టారిఫ్ల పరిధిలోకి చేర్చే అవకాశం ఉందన్నారు.500 బిలియన్ డాలర్ల వాణిజ్యం డౌటే.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలన్న భారత్–అమెరికా లక్ష్యం సాకారం కావడం మిథ్యేనని స్పష్టంగా తెలుస్తోందని దువ్వూరి చెప్పారు. మన ఎగుమతుల మీద పడే ప్రభావాలపై లెక్కలు వేసుకోవడానికి ముందు, అమెరికా మార్కెట్ కోల్పోవడం వల్ల వచ్చే నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రపంచ దేశాలను చైనా తమ ఉత్పత్తులతో ముంచెత్తే ముప్పు గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, దేశీయంగా డెయిరీ, వ్యవసాయం అనేవి రాజకీయంగా చాలా సున్నితమైన రంగాలని, కోట్ల కొద్దీ ప్రజలకు జీవనోపాధి కలి్పంచడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా ముడిపడి ఉన్నవని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా దిగుమతులకు గంపగుత్తగా అనుమతించడం వాంఛనీయమూ, లాభదాయకమూ కూడా కాదని సుబ్బారావు చెప్పారు. అయితే, కొన్ని విషయాల్లో కాస్త పట్టు విడుపులతో వ్యవహరిస్తే చర్చల్లో ప్రతిష్టంభన తొలగేందుకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. -
జీఎస్టీ మంత్రుల బృందం భేటీ రేపే
న్యూఢిల్లీ: జీఎస్టీలో శ్లాబుల తగ్గింపుపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన బృందం 20న చర్చించనుంది. ఈ బృందంలో భాగం కాకపోయినప్పటికీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఈ సమావేశానికి హాజరు కానుండడం గమనార్హం. 5 శాతం, 18 శాతం శ్లాబులతో కూడిన కొత్త నమూనాను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే మంత్రుల బృందం ముందుంచింది. పొగాకు తదితర కొన్నింటిపై 40 శాతం పన్ను ప్రతిపాదించింది. దీనిపై ఢిల్లీలో ఈ నెల 20, 21 తేదీల్లో జీఎస్టీ మంత్రుల బృందం (జీవోఎం) చర్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘‘జీవోఎంలో కేంద్రం భాగం కానప్పటికీ.. ఆర్థిక మంత్రి పాల్గొనడం, ప్రసంగించడం అన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన, ఉద్దేశ్యాలను మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది’’అని ఆ వర్గాలు వెల్లడించాయి. విహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆరుగురు సభ్యుల జీవోఎంకు కనీ్వనర్గా వ్యవహరిస్తున్నారు.కొత్త రేట్లను దిపావళికి ముందే అమల్లోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశంగా ఉంది. జీఎస్టీ రేట్లలో మార్పుతో ఆదాయం తగ్గుతుందన్న ఆందోళనలను కేంద్రం తొలగించే ప్రయత్నం చేసింది. ఆదాయంలో రాష్ట్రాలతో పాటు కేంద్రానికి సమాన వాటా ఉంటుందన్న విషయాన్ని అధికార వర్గాలు గుర్తు చేశాయి. కొత్త ప్రతిపాదనలతో నిరీ్ణత కాలంలో వినియోగం పెరిగి, అధిక ఆదాయానికి దారితీస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇక ప్రతిపాదిత రెండంచెల పన్ను శ్లాబులతో కూడిన కొత్త జీఎస్టీ విధానంలో మెజారిటీ ఆదాయం 18 శాతం నుంచే ఉంటుందని తెలిపాయి. ప్రస్తుతం బంగారంపై 3శాతం, ఇతర వస్తు సేవలపై 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. ఆహార వస్తువులు కొన్నింటిని పన్ను నుంచి మినహాయించగా, కొన్ని 5 శాతం రేటు పరిధిలో ఉన్నాయి. లగ్జరీ, సిన్ గూడ్స్ (హానికారక)పై 40 శాతం రేటు అమలవుతోంది. -
ఇక ఏసీలు, టీవీలు చౌక!
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్నులో శ్లాబుల తగ్గింపుతో ఏసీలు, టీవీల ధరలు చెప్పుకోతగ్గ స్థాయిలో దిగిరానున్నాయి. ముఖ్యంగా ఎయిర్ కండీషనర్లపై (ఏసీలు) 28 శాతంగా ఉన్న జీఎస్టీ 18 శాతానికి తగ్గనుంది. దీంతో మోడల్ను బట్టి ఒక్కో ఏసీ యూనిట్ ధర రూ.1,500–2,500 మేర చౌకగా మారనుంది. 32 అంగుళాలకు మించిన టీవీలపైనా జీఎస్టీ 28% నుంచి 18 శాతానికి తగ్గనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. దీనికితోడు బడ్జెట్లో పెద్ద మొత్తంలో ఆదాయపన్ను మినహాయింపులు కలి్పంచడం, ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ఏసీల కొనుగోళ్లను పెంచుతాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. పెద్ద ముందడుగు రూమ్ ఏసీల కొనుగోళ్లు నిలిచిపోయినందున జీఎస్టీలో ప్రతిపాదిత సంస్కరణలను వేగంగా అమల్లోకి తీసుకురావాలని బ్లూస్టార్ ఎండీ బి. త్యాగరాజన్ కోరారు. ‘‘ఆగస్ట్ నెలలో రూమ్ ఏసీలను ఎవరూ కొనరు. సెపె్టంబర్ లేదా అక్టోబర్ 1 వరకు వేచి చూడొచ్చు. ఈ కాలంలో డీలర్లే కాదు, కస్టమర్లు కూడా కొనుగోళ్లు చేయరు’’అంటూ అన్సీజన్ను ఆయన గుర్తు చేశారు. 10 శాతం వరకు ఏసీల ధరలు తగ్గొచ్చొని చెప్పారు. ఇంధన ఆదా చేసే ఏసీలపై తక్కువ జీఎస్టీని అంచనా వేస్తున్నామని.. ఇతర ఏసీల ధరలు 18% రేటు పరిధిలో ఉండొచ్చని ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ అభిప్రాయపడ్డారు. 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా కానీ ఉత్పత్తుల ధరలు 6–7 శాతం మేర (రూ.1,500–2,500) దిగిరావొచ్చని చెప్పారు. ప్రతిపాదిత జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగాన్ని పెంచుతుందని గోద్రేజ్ అప్లయెన్సెస్ సైతం అంచనా వేసింది.‘‘దేశంలో ఏసీల వినియోగం ఇప్పటికీ 9–10 శాతంగానే ఉంది. జీఎస్టీ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే మరింత మంది ప్రజలకు ఏసీల ధరలు అందుబాటులోకి వస్తాయి. దీంతో చాలా మంది భారతీయుల జీవన నాణ్యత మెరుగుపడుతుంది’’అని గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ అప్లయెన్సెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ప్రస్తుతం రూమ్ ఏసీలపై 28% జీఎస్టీ అమల్లో ఉండగా, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపై 18 శాతం రేటు అమలు అవుతున్నట్టు తెలిపారు. ఏసీ, టీవీలకు అనుకూలం.. థామ్సన్, బ్లోపంక్త్ తదితర బ్రాండ్లపై టీవీలను తయారు చేసి విక్రయించే సూపర్ ప్లా్రస్టానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా సైతం ప్రభుత్వ చర్యతో పండుగల సీజన్లో వినియోగం పెరుగుతుంని అంచనా వేశారు. ఏసీ, స్మార్ట్ టీవీలు (32 అంగుళాల పైన) 28% జీఎస్టీ పరిధిలో ఉన్నాయంటూ.. రేట్లను తగ్గిస్తే అమ్మకాలు పెరుగుతాయని తెలిపారు. తాము 20% వృద్ధిని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఇక 32 అంగుళాల టీవీలను 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. ఈ సెగ్మెంట్లో 38 శాతం అసంఘటిత రంగం నుంచే వస్తున్నట్టు చెప్పారు. వేసవిలో ముందస్తు వర్షాలతో ఈ ఏడాది ఏసీ అమ్మకాలు తగ్గాయి.గొప్ప సంస్కరణ జీఎస్టీ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న చర్య ఎంతో ముఖ్యమైన సంస్కరణ. దీని ద్వారా ప్రభుత్వం అద్భుతమైన పని చేస్తోంది. ఎందుకంటే ఇది ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఆటో పరిశ్రమపై పడే ప్రభావంపై వ్యాఖ్యానించేందుకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకునే వరకు వేచి చూడడం మంచిది.– ఆర్సీ భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ -
PMJDY: నిరుపయోగంగా 13 కోట్ల బ్యాంక్ అకౌంట్స్!
దేశంలో మొత్తం 56.04 కోట్ల ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలలో 23 శాతం అకౌంట్స్ నిరుపయోగంగా ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి 'పంకజ్ చౌదరి' వెల్లడించారు. 2025 జూలై 31 చివరి నాటికి 56.03 కోట్ల PMJDY ఖాతాలలో 13.04 కోట్లు నిరుపయోగంగా ఉన్నయని లోక్సభలో స్పష్టం చేశారు.ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2.75 కోట్ల జన్ ధన్ ఖాతాలు పనిచేయడం లేదని.. ఆ తరువాత జాబితాలో బీహార్ (1.39 కోట్ల ఖాతాలు), మధ్యప్రదేశ్ (1.07 కోట్ల ఖాతాలు) ఉన్నాయని పంకజ్ చౌదరి పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరి 18 నాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. ఒక పొదుపు ఖాతాలో రెండు సంవత్సరాలకు పైగా లావాదేవీలు జరగకపోతే దానిని పనిచేయని ఖాతాగా పరిగణించాలి.బ్యాంకులలో లావాదేవీలు జరగని లేదా ఇనాక్టివ్ ఖాతాల గురించి ఖాతాదారులకు లేఖలు లేదా ఈమెయిల్స్ ద్వారా తెలియజేయనున్నట్లు పంకజ్ చౌదరి చెప్పారు. మొత్తం మీద ఈ ఖాతాలను మళ్ళీ యాక్టివ్ ఖాతాలుగా మార్చి.. ప్రజలు ఉపయోగించేలా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY)ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. కానీ పదేళ్ల కిందట కనీసం ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా లేని ఇల్లు చాలానే ఉండేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని నరేంద్ర మోదీ.. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పేరుతో ఓ పథకం లాంచ్ చేశారు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?ఈ ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు కేవలం డబ్బు పొదుపు చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందటానికి ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఇది జీరో అకౌంట్. ఈ ఖాతా ద్వారా సులభంగా లోన్స్ పొందవచ్చు. అయితే చాలామంది ఈ ఖాతాల ద్వారా లావాదేవీలను జరపకపోవడంతో.. అకౌంట్స్ నిరుపయోగంగా మారాయి. వీటిని రీకేవైసీ ద్వారా మళ్ళీ యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంది. -
బ్యాంకింగ్ వ్యవస్థపై ఫిర్యాదుల గుదిబండ
భారత బ్యాంకింగ్ రంగం అధిక మొత్తంలో ఖాతాదారుల ఫిర్యాదులతో సతమతమవుతోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టెయినబిలిటీ రిపోర్ట్స్ (బీఆర్ఎస్ఆర్) ప్రకారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో అత్యధికంగా ఖాతాదారుల ఫిర్యాదులున్నాయి. ప్రైవేట్ రంగ సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్ ముందుస్థానంలో ఉంది. సర్వీస్ డెలివరీ, డిజిటల్ ఇంటర్ఫేస్లను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ‘ఇతర’ కేటగిరీల కింద సమస్యలు పెరిగాయి. ఇందులో సైబర్ సెక్యూరిటీ, అత్యవసర సర్వీసులు అందించడంలో ఆలస్యం జరగడం వంటివి ఉన్నాయి.టాప్లో ఎస్బీఐ2025 బీఆర్ఎస్ఆర్ ప్రకారం ఎస్బీఐ అనధికారిక ఎలక్ట్రానిక్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి 6.87 లక్షలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. అదనంగా రుణ మంజూరుతో సహా అత్యవసర సేవలను ఆలస్యంగా అందించినందుకు 12,502 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సంఖ్య 2024 ఆర్థిక సంవత్సరం కంటే 7,223 పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 24.02 లక్షల ఫిర్యాదులతో పోలిస్తే ఎస్బీఐ ‘ఇతర’ కేటగిరీ కింద 21.50 లక్షల ఫిర్యాదులను నివేదించింది. ఈ కేటగిరీలో సైబర్ సెక్యూరిటీ, సర్వీస్ ఆలస్యం.. వంటివాటి పరిధిలోకి రాని ఇతర ఫిర్యాదులు ఉంటాయి. అయితే, పారదర్శకత, ప్రతిస్పందనను మెరుగుపరచడానికి ఉద్దేశించిన బహుళ ఫిర్యాదుల పరిష్కార మార్గాలను బ్యాంక్ హైలైట్ చేసింది.పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 2024 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 11.30 లక్షల ఫిర్యాదు సంఖ్య 2025 ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగి 11.39 లక్షలకు చేరింది.బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)కి 5.34 లక్షల ఫిర్యాదులు రాగా, వీటిలో ఎక్కువ భాగం ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ సేవలు, ఏటీఎం/డెబిట్ కార్డు సంబంధిత సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.ప్రైవేట్ బ్యాంకులు ఇలా..ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంక్లో 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఫిర్యాదులు నమోదయ్యాయి. నిత్యావసర సేవల్లో జాప్యానికి సంబంధించి 4.97 లక్షల ఫిర్యాదులు రాగా, మార్చి నెలాఖరు నాటికి 8,782 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయి. ‘ఇతర’ కేటగిరీ కింద 76,111 ఫిర్యాదులు రాగా, ప్రకటనలకు సంబంధించి 12,744, వాణిజ్య పద్ధతులకు సంబంధించి 4,438 ఫిర్యాదులు వచ్చాయి.ఐసీఐసీఐ బ్యాంక్లో సర్వీసుల ఆలస్యం ఫిర్యాదులు గణనీయంగా పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 5.34 లక్షల ఫిర్యాదులను నివేదించింది. 2025 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 45,151 కేసులు పరిష్కారం కోసం పెండింగ్లో ఉన్నాయి.హెచ్డీఎప్సీ బ్యాంక్లో ‘ఇతర’ కేటగిరీ కింద 4.42 లక్షల ఫిర్యాదులు అందాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 4.70 లక్షల నుంచి ఇది తగ్గింది. 16,133 ఫిర్యాదులు ఇప్పటికీ పరిష్కరించలేదు.ఇదీ చదవండి: స్పెషాలిటీ స్టీల్ తయారీకి ప్రోత్సాహకాలు?ప్రధాన రుణదాతల్లో కస్టమర్ ఫిర్యాదులు స్థిరంగా పెరుగుతున్నాయి. డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలను స్వీకరించడం, సర్వీస్ డెలివరీ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల్లో అంతరాలను ఇది సూచిస్తుంది. బ్యాంకులు వాటి సర్వీసులు, సామర్థ్యాలను విస్తరించినప్పటికీ, అపరిష్కృత సమస్యలు, ముఖ్యంగా అత్యవసర సేవలను పరిష్కరించాల్సిన కార్యాచరణను హైలైట్ చేస్తుంది. -
స్పెషాలిటీ స్టీల్ తయారీకి ప్రోత్సాహకాలు?
భారత ప్రభుత్వం స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తి తయారీ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఈ విభాగంలో ఉత్పాదకత పెంచేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని పునరుద్ధరించేందుకు సన్నద్ధమవుతోంది. నిబంధనలను సడలించడం, పరిశ్రమ భాగస్వామ్యాన్ని ఆకర్షించడం లక్ష్యంగా ఈమేరకు చర్యలు చేపడుతోంది.పీఎల్ఐ 1.2 లేదా పీఎల్ఐ 2.0గా పిలువబడే రాబోయే పథకంలో గణనీయమైన సడలింపులు ఉండనున్నాయి. వీటిలో పనితీరు, మెట్రిక్స్ కోసం బేస్ ఇయర్ను 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరానికి మార్చాలని చూస్తున్నారు. ఉక్కు ఉత్పత్తిదారులకు మూలధన పెట్టుబడుల నిబంధనలను సడలించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం సంబంధిత మంత్రిత్వశాఖదేనని గుర్తించాలి. బ్రౌన్ ఫీల్డ్ సామర్థ్య విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, కనీసం 25 అదనపు హైఎండ్, స్పెషాలిటీ స్టీల్ ఉత్పాదకతను పెంచేందుకు పీఎల్ఐ కవరేజీని విస్తరించాలని భావిస్తున్నట్లు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు.ప్రస్తుత ఫ్రేమ్వర్క్లో కొంచెం కఠిన నిబంధనలు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరించడంతో పరిశ్రమ వాటాదారుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాటిని సవరించనున్నట్లు మంత్రి చెప్పారు. పీఎల్ఐ పథకాన్ని మరిన్ని ఎంఎస్ఎంఈ సంస్థలకు చేరువ చేయాలని, ఈ విభాగంలో స్వావలంబన సాధించడానికి అన్ని పరిశ్రమ సూచనలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పీఎల్ఐ 1.0, పీఎల్ఐ 1.1 కలిపి రూ.44,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అయితే, కొన్ని అర్హత నిబంధనలను సడలించడం ద్వారా మరిన్ని సంస్థలను ఈ పరిశ్రమలోకి తీసుకురావడానికి, మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది.ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్ దండగా?పీఎల్ఐ 1.2లో రాబోయే కీలక మార్పులు(అంచనా)స్టీల్కు సంబంధించి బ్రౌన్ ఫీల్డ్ సామర్థ్య విస్తరణను సులభతరం చేయనున్నారు. తప్పనిసరి గ్రీన్ ఫీల్డ్ సామర్థ్య జోడింపు సడలించే అవకాశం ఉంది.ఇంతకు ముందు ప్రోత్సాహక అర్హతతో ముడిపడి ఉన్న వార్షిక ఇంక్రిమెంటల్ ఉత్పత్తి లక్ష్యాలు ఇకపై తప్పనిసరి కాకపోవచ్చు.అంతర్జాతీయ, దేశీయ ఉక్కు మార్కెట్ల ఒడిదుడుకులను అంగీకరిస్తూ, ఎంఓయూ లక్ష్యాల కంటే ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ కంపెనీలు ప్రోత్సాహకాలు పొందడానికి అనుమతించవచ్చు. -
పక్కదారి పడుతున్న ‘పన్ను రహిత దిగుమతి’
న్యూఢిల్లీ: ఎగుమతిదారులకు తయారీ వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో తీసుకొచ్చిన డ్యూటీ ఫ్రీ ఇంపోర్ట్ ఆథరైజేషన్ (డీఎఫ్ఐఏ) పథకం (పన్ను రహిత దిగుమతి ధ్రువీకరణ పథకం) దుర్వినియోగం అవుతున్నట్టు ప్రైవేటు పరిశోధన సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వెలుగులోకి తెచి్చంది. దోపిడీకి ఇది లైసెన్స్గా మారినట్టు ఆరోపించింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని దీనికి చెక్ పెట్టాలని సూచించింది. లేదంటే ఎగుమతుల ప్రోత్సాహక విధానంపై ఉన్న నమ్మ కం పోతుందని, నిజాయితీ పరులైన ఎగుమతిదారులు వ్యాపారానికి దూ రం కావాల్సి వస్తుందని ఆందోళ న వ్యక్తం చేసింది. గత ఐదేళ్లలో కంపెనీలకు ఈ పథకం కింద జారీ చేసిన లైసెన్స్లపై ఫోరెన్సిక్ ఆడిట్ అవసరమని పేర్కొంది. సుంకాల్లేని మోసపూరిత దిగుమతులతో లబ్ధి పొందిన కంపెనీల నుంచి వసూళ్లు చేయాలని సూచించింది. డీఎఫ్ఐఏ కింద గత ఐదేళ్లలో దిగుమతి అయిన వాటిని పరిశీలించి, ఆశించిన ప్రయోజనాలకు విరుద్ధమైనవి ఏవైనా ఉంటే వాటిని పథకం నుంచి మినహాయించాలని జీటీఆర్ఐ కోరింది. ఈ పథకం దుర్వినియోగంపై వచి్చన ఫిర్యాదులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ గ్రేడ్ (డీజీఎఫ్టీ) దర్యాప్తు చేస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ స్పష్టత ఇచ్చింది. దుర్వినియోగం ఇలా.. ‘‘వాస్తవానికి డీఎఫ్ఐఏ అన్నది ఎగుమతిదారులకు తయారీ వ్యయాలను తగ్గించేందుకు ఉద్దేశించినది. కానీ, దోపిడీకి లైసెన్స్గా మారింది. అధిక విలువైన వేప్రొటీన్, కుంకుమపువ్వు, వాల్నట్, లిథియం అయాన్ బ్యాటరీలను సున్నా కస్టమ్స్ డ్యూటీపై ట్రేడర్లు దిగుమతి చేసుకుంటున్నారు. వీటిని బిస్కెట్లు, పచ్చళ్లు, ట్రాక్టర్లకు ముడి సరుకులుగా చూపిస్తున్నారు. వాస్తవానికి వాటిని ఎందుకూ వినియోగించడంలేదు’’అని జీటీఆర్ఐ వివరించింది. -
క్రేజీ క్యాష్.. పెరుగుతున్న చలామణీ నగదు
రిజర్వు బ్యాంకు లెక్కల ప్రకారం... 5 ఏళ్ల కిందటితో పోలిస్తే ప్రస్తుతం నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది. 2020–21లో 2.08 లక్షల నకిలీ నోట్లను గుర్తిస్తే... 2024–25లో వాటి సంఖ్య 2.17 లక్షలకు పెరిగింది. ముఖ్యంగా రూ.500 (ఎమ్జీ కొత్త సిరీస్) అప్పట్లో 39 వేలకుపైగా ఉంటే... 5 ఏళ్ల తరవాత 1.17 లక్షలకు పైగా పెరగడం గమనార్హం.మరోపక్క డిజిటల్ లావాదేవీలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నా... దేశంలో చలామణీలో ఉన్న నగదు ఏటా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2024లో ఇది దాదాపు రెండు రెట్లు పెరగడం విశేషం. 2018లో రూ.18.29 లక్షల కోట్లు చలామణీలో ఉండగా, 2024 నాటికి ఇది రూ.35.11 లక్షల కోట్లకు చేరింది2018 నాటికి భారతదేశంలో చలామణీలో ఉన్న నగదు మొత్తం రూ.18.29 లక్షల కోట్లుగా నమోదైంది. ఆ తర్వాతి సంవత్సరాల్లో ఇది స్థిరంగా పెరుగుతూ వచ్చింది. 2019లో రూ.21.36 లక్షల కోట్లకు, 2020లో రూ.24.47 లక్షల కోట్లకు చేరింది. 2021 నాటికి ఈ మొత్తం రూ.28.53 లక్షల కోట్లకు పెరిగింది. 2022లో ఇది రూ.31.33 లక్షల కోట్లకు, 2023లో రూ.33.78 లక్షల కోట్లకు పెరిగింది. చివరకు 2024 నాటికి చలామణీలో ఉన్న నగదు రూ.35.11 లక్షల కోట్లకు చేరింది. అంటే 2018తో పోలిస్తే 2024లో దాదాపు రెట్టింపు వృద్ధి నమోదైంది. -
‘అమెరికా’ బాయ్కాట్ ప్రచారం
ఎగుమతిదారులను కలవరపెట్టి, న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలను దెబ్బతీస్తూ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం సుంకం విధించిన తర్వాత, దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది. అది అమెరికన్ ఉత్పత్తులను వదిలివేయాలంటూ డిమాండ్ చేసే దాకా వెళ్లింది. మెక్డొనాల్డ్స్ కోకా–కోలా అమెజాన్, ఆపిల్.. ఇలా అమెరికాకు చెందిన బహుళజాతి సంస్థలు భారతదేశంలో బహిష్కరణ డిమాండ్స్ ఎదుర్కుంటున్నాయి.మన భారతం.. మహా మార్కెట్..ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, సంపన్న వినియోగదారుల పెరుగుతున్న స్థావరంగా కూడా మారుతోంది. దీన్ని లక్ష్యంగా చేసుకుని వేగంగా విస్తరించిన అమెరికన్ బ్రాండ్లకు మన దేశం కీలకమైన మార్కెట్గా అవతరించింది. భారతీయ సంపన్నులు, అధికాదాయ వర్గాలు జీవితంలో ఉన్నతికి చిహ్నాలుగా భావిస్తూ అమెరికన్ అంతర్జాతీయ లేబుల్స్ పట్ల ఆకర్షితులయ్యారు. ఉదాహరణకు, భారతదేశం మెటా, వాట్సాప్కు వినియోగదారుల పరంగా అతిపెద్ద మార్కెట్ అలాగే ఏ ఇతర బ్రాండ్ కంటే డొమినోస్వే దేశంలో ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయి. పెప్సి కోకా–కోలా వంటి పానీయాలు మన సాఫ్ట్ డ్రింక్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఇక కొత్త ఆపిల్ స్టోర్ తెరిచినప్పుడు లేదా స్టార్బక్స్ కేఫ్ లో డిస్కౌంట్లను ఇచ్చినప్పుడు మన వాళ్లంతా పొలోమంటూ క్యూలో నిలబడడం కనిపిస్తుందిపోటీ ఇస్తున్నాం.. విస్తరించలేకున్నాం...నిజం చెప్పాలంటే, భారతీయ రిటైల్ కంపెనీలు స్టార్బక్స్ వంటి విదేశీ బ్రాండ్లకు దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తున్నాయి, కానీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం ఒక సవాలుగా ఉంది. అయితే, భారతీయ ఐటి సేవల సంస్థలు మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరపడ్డాయి, టిసిఎస్ , ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లకు సాఫ్ట్వేర్ పరిష్కారాలను అందిస్తున్నాయి. తరచు మన ప్రధాని స్వావలంబన కోసం పిలుపునిస్తూనే ఉన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ టెక్నాలజీ కంపెనీలు ప్రపంచానికి ఉత్పత్తులను తయారు చేస్తాయి, కానీ ‘ఇప్పుడు మనం భారతదేశ అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అన్నారు.నిరసనల వెల్లువ..అమ్మకాలు దెబ్బతింటున్నాయనే తక్షణ సూచనలు లేనప్పటికీ, అమెరికా పన్నులపై ప్రతీకారం తీర్చుకోవాలంటూ పెరుగుతున్న డిమాండ్స్కు స్వదేశీ సంస్థల గొంతులు కూడా జత కలుస్తున్నాయి. వావ్ స్కిన్ సైన్స్ సహ వ్యవస్థాపకుడు మనీష్ చౌదరి లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసిన తన వీడియో సందేశంలో ఈ విషయంపై స్పందించారు. ‘మేడ్ ఇన్ ఇండియా‘ని ‘గ్లోబల్ అబ్సెషన్‘గా మార్చడానికి వీలుగా మన రైతులకు, స్టార్టప్లకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా ఆహార, సౌందర్య ఉత్పత్తుల విజయాల నుంచి మనం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ‘మనం వేల మైళ్ల దూరంలో నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం క్యూ కడుతున్నాం. తమ స్వదేశంలో నిలదొక్కుకోవాలని ఓ వైపు మన తయారీదారులు పోరాడుతుంటే, మరోవైపు మనవి కాని బ్రాండ్లపై మనం గర్వంగా ఖర్చు చేస్తున్నాం‘ అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘చైనా మాదిరిగానే భారతదేశానికి కూడా స్వదేశంలో వృద్ధి చెందిన ఎక్స్(గతంలో ట్విట్టర్)/ గూగుల్/ యూట్యూబ్/ వాట్సాప్/ ఎఫ్బీ ఉండాలి’ అని కారు డ్రైవర్ను కాల్ సర్వీస్ ద్వారా సరఫరా చేసే భారతదేశ సంస్థ ‘డ్రైవ్యూ’ సీఈఓ రహ్మ్ శాస్త్రి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.భారతీయ జనతా పార్టీకి అనుసంధానంగా పనిచేసే స్వదేశీ జాగరణ్ మంచ్ గ్రూప్ భారతదేశం అంతటా బహిరంగ ర్యాలీలు నిర్వహించి, అమెరికన్ బ్రాండ్లను బహిష్కరించాలని ప్రజలను కోరుతోంది. ‘ప్రజలు ఇప్పుడు భారతీయ ఉత్పత్తుల వైపు చూస్తున్నారు. అయితే ఇది విజయవంతం కావడానికి మరి కొంత సమయం పడుతుంది‘ అని గ్రూప్ సహ–కన్వీనర్ అశ్వని మహాజన్ అంటున్నారు. ‘ఇది జాతీయవాదం, దేశభక్తికి పిలుపు‘ అని అన్నారాయన. విదేశీ ఉత్పత్తుల స్థానంలో వాటి కంటే మంచివి, ప్రజలు ఎంచుకోగల భారతీయ బ్రాండ్ల స్నానపు సబ్బులు, టూత్పేస్ట్ శీతల పానీయాల జాబితాను ఈ సంస్థ సోషల్ మీడియాలో, షేర్ చేస్తోంది. జాబితా చేశారు. అలాగే ‘విదేశీ ఆహార సంస్థలను బహిష్కరించండి‘ అంటూ మెక్డొనాల్డ్స్ అనేక ఇతర రెస్టారెంట్ బ్రాండ్ల లోగోలతో ప్రచారం చేస్తున్నారు.ఇదీ చదవండి: కబ్జాసురుల పాపం పండేలా..కొన్ని చిట్కాలుఓ వైపు అమెరికా వ్యతిరేక నిరసనలు ఊపందుకుంటున్నా అమెరికన్ కంపెనీ టెస్లా భారతదేశంలో తన రెండవ షోరూమ్ను న్యూఢిల్లీలో ప్రారంభించింది, ఈ ప్రారంభోత్సవానికి భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు అమెరికా రాయబార కార్యాలయ అధికారులు హాజరయ్యారు- సత్య బాబు -
ఇక జీఎస్టీలో రెండే శ్లాబులు!
న్యూఢిల్లీ: సామాన్యులకు వస్తు సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు వీలుగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో రెండు రేట్ల విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. స్టాండర్డ్ (ప్రామాణిక), మెరిట్ (యోగ్యత) కింద వీటిని వర్గీకరిస్తూ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్కు నివేదించింది. వీటిపై అధ్యయనం అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ముందు ప్యానెల్ తన సిఫారసులు ఉంచనుంది. దాదాపు అన్ని రకాల వస్తు, సేవలు రెండు రేట్ల పరిధిలోనే ఉంటాయి. విలాస, హాని కారక వస్తువులపై మాత్రం 40% ప్రత్యేక రేటు అమలు కానుంది. దీంతో నిత్యావసరాలు, వాహనాలు సహా ఎన్నో రకాల వస్తు, సేవల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొత్త విధానాన్ని అమలు చేయాలన్న సంకల్పాన్ని ఆర్థిక శాఖ వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జీఎస్టీ చట్టాన్ని సంస్కరించనున్నట్టు ప్రకటించారు. పన్నుల భారం గణనీయంగా తగ్గుతుందంటూ, దీన్ని దీపావళి కానుకగా అభివర్ణించారు. రోజువారీ వినియోగ వస్తువుల రేట్లు చౌకగా మారనున్నట్టు చెప్పారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రధాని ప్రసంగం తర్వాత ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. జీఎస్టీలోనే ఎన్నో పన్నులు.. ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో 5, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. కొన్నింటిని జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయించగా, విలాస వస్తువులు, సిగరెట్లు వంటి హానికారక (సిన్గూడ్స్) వస్తువులపై 28 శాతం రేటుకు అదనంగా కాంపెన్సేషన్ సెస్ (రాష్ట్రాల కోసం ఉద్దేశించిన పరిహార పన్ను) అమలవుతోంది. 5% పన్ను పరిధిలో 21 శాతం వస్తువులు ఉన్నాయి. 12% పన్ను రేటు కింద 19 శాతం.. 18% పన్ను పరిధిలో 44% వస్తు సేవలు ఉన్నాయి. 12% శ్లాబును ఎత్తివేసి ఇందులో ఉన్న వస్తు, సేవలను 5, 18 శాతం రేట్ల పరిధిలోకి మార్చొచ్చని తెలుస్తోంది. 12 శాతం రేటు పరిధిలోని 99 శాతం వస్తువులు 5 శాతం పరిధిలోకి వెళ్లనున్నట్టు.. 28 శాతం పరిధిలోని 90 శాతం వస్తు సేవలు 18 శాతం రేటు పరిధిలోకి వెళ్లనున్నట్టు సమాచారం. పొగాకు ఉత్పత్తులు, ఆన్లైన్ గేమింగ్ తదితర కొన్ని 40 శాతం పన్ను పరిధిలో ఉంటాయి. ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్స్టైల్స్, ఫెర్టిలైజర్స్, పునరుత్పాదక ఇంధనాలు, హస్తకళలు, వ్యవసాయం, ఆరోగ్యం, బీమా తదితర రంగాలకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా బంగారంపై 3 శాతం ప్రత్యేక రేటు అమలవుతోంది. దీన్ని అలాగే కొనసాగిస్తారా? లేక 5 శాతం రేటు పరిధిలోకి తెస్తారా? అన్న దానిపై ఇప్పటికి స్పష్టత లేదు. రేట్ల తగ్గింపు కారణంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గినట్టయితే దీన్ని ఎలా భర్తీ చేస్తారో చూడాలి. అలాగే, విలాసవంత, హానికారక వస్తువులపై 28 శాతం పన్నుకు అదనంగా అమలు చేస్తున్న కాంపెన్సేషన్ సెస్సు గడువు 2026 మార్చి 31తో ముగియనుంది. ఈ రూపంలో వచ్చే ఆదాయం ఆ తర్వాత తగ్గనుంది. అయితే, దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే, రేట్ల తగ్గింపుతో వినియోగం పెరిగి, అదనపు ఆదాయం సమకూరుతుందన్నది ఆర్థిక శాఖ అంచనా. 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచి్చన జీఎస్టీ విధానంలో తొలిసారి పెద్ద ఎత్తున మార్పు చోటుచేసుకోనుంది. జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని, దీన్ని సరైన సమయంలో సరైన చర్యగా ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్లో కీలక భేటీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలోనే సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే జీవిత, ఆరోగ్య బీమాలపై పన్ను తగ్గింపు సహా జీఎస్టీలో రేట్ల క్రమబదీ్ధకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పన్నుల తగ్గింపు వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని అంచనా వేస్తోంది. గుర్తింపు పరమైన వివాదాలను తొలగిస్తుందని, కొన్ని రంగాలకు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను సరిచేస్తుందని.. రేట్ల పరమైన స్థిరత్వం ఏర్పడి వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందని భావిస్తోంది. రాష్ట్రాల విస్తృత ఏకాభిప్రాయంతో తదుపరి తరం సంస్కరణలను అమలు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ‘‘జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి భేటీలో మంత్రుల బృందం సిఫారసులపై చర్చిస్తుంది. సాధ్యమైనంత త్వరగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. దీంతో ఆశించిన ప్రయోజనాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సాకారమవుతాయి’’అని పేర్కొంది. -
జీఎస్టీ స్లాబ్ల తగ్గింపునకు కేంద్రం అడుగులు!
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించే పనిని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు ప్రధాన స్లాబ్లను కుదించి రెండు ప్రధాన స్లాబ్లుగా మారుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం, స్లాబ్లను రద్దు చేసి 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచినట్లు సమాచారం.నూతన ప్రతిపాదనల ప్రకారం.. 28 శాతం స్లాబ్ పరిధిలోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి, అలాగే 12 శాతం స్లాబ్ పరిధిలోని 99 శాతం వస్తువులను 5 శాతం కిందికి తీసుకురానున్నారు. ప్రస్తుతం 12 శాతం స్లాబ్లో ఉన్న టూత్పేస్ట్, మొబైల్ ఫోన్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బట్టలు, బూట్లు వంటి మధ్యస్థాయి వినియోగ వస్తువులను 5 శాతం స్లాబ్లోకి మార్చే యోచన ఉంది. ఇదే సమయంలో, 28 శాతం స్లాబ్లో ఉన్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని సేవలను 18 శాతం స్లాబ్లోకి తరలించనున్నారు.ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా రెండు స్లాబ్లే కొనసాగనున్నప్పటికీ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్ను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ స్లాబ్లో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి కేవలం 5–7 వస్తువులే ఉండే అవకాశం ఉంది.ఈ మార్పుల వల్ల నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలపై నెలవారీ ఖర్చుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం అంచనా ప్రకారం, ఈ స్లాబ్ మార్పుల వల్ల రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం జరగవచ్చని భావిస్తున్నప్పటికీ, వినియోగం పెరిగి, పన్ను ఆదాయం తిరిగి స్థిరపడే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి లేవు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జీఎస్టీ మార్పులను "డబుల్ దీపావళి గిఫ్ట్"గా ప్రజలకు ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకరించడం ద్వారా ప్రజలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. -
వేగంగా వాణిజ్య ఒప్పందాలు
అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఎగుమతులను ఇతోధికం చేసుకునే దిశగా కేంద్ర సర్కారు చర్యలపై దృష్టి సారించింది. వాణిజ్య ఒప్పందాలపై చర్చలను వేగవంతం చేయడంతోపాటు, వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం ద్వారా ఎగుమతులు పెంచుకోవాలని భావిస్తోంది. ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంతోపాటు, ఎగుమతులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం, ఎగుమతులను పలు దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవడం, దిగుమతుల్లోనూ వైవిధ్యంపై వాణిజ్య శాఖ దృష్టి సారించినట్టు ఆ శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు.సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందానికి అమోదాన్ని వేగవంతం చేయాలని యూకేని కోరినట్టు చెప్పారు. ఈ ఏడాది జూలై 24న దీనిపై రెండు దేశాలు సంతకాలు చేయడం గమనార్హం. ఐరోపా సమాఖ్య (ఈయూ)తోనూ చర్చలను వేగవంతం చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది చివరికి ముగింపునకు రావొచ్చన్నారు. ఒమన్తో సంప్రదింపులు ముగిశాయని, రెండు దేశాలకు అనుకూలమైన తేదీన ఒప్పందంపై సంతకాలు జరగనున్నట్టు చెప్పారు. ఇక న్యూజిలాండ్, పెరూ, చిలీతోనూ చర్చలు పురోగతితో సాగుతున్నట్టు పేర్కొన్నారు. ఇదీ చదవండి: రక్షణ రంగంలో స్టార్టప్లతో స్వావలంబన10 దేశాల ఆసియా కూటమితోనూ సమీక్షపై సంప్రదింపులు చేస్తున్నట్టు భత్వాల్ తెలిపారు. ప్రధానంగా 50 దేశాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహానికి పలు పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, వాటిని మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. దిగుమతులకు కొన్ని దేశాలపైనే ఎక్కువగా ఆధారపకుండా వైవిధ్యం చేసుకోవాల్సి ఉందన్నారు. -
రష్యా చమురు కొనుగోళ్లు ఆపలేదు
అమెరికా టారిఫ్ల బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికనే ఐవోసీలాంటి రిఫైనింగ్ సంస్థలు కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో కొనుగోళ్లను తగ్గించాలని గానీ లేదా మరింతగా పెంచాలని గానీ తమకు ఎలాంటి సూచనలు రాలేదని సాహ్ని చెప్పారు.రష్యా చమురుపై ఎలాంటి ఆంక్షలు లేవని, వాటికి విరుద్ధమైనవేమీ భారత్ చేయలేదని పేర్కొన్నారు. 2022 ఫిబ్రవరికి ముందు భారత చమురు దిగుమతుల్లో 1 శాతం కన్నా తక్కువగా రష్యా వాటా ఉండేది. కానీ ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ ఇంధనంపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత నుంచి ఇది 30 శాతానికి పెరిగింది. ఇదీ చదవండి: రూపాయి 79 ఏళ్ల ప్రస్థానంఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఐవోసీ రిఫైనరీలు ప్రాసెస్ చేసిన క్రూడాయిల్లో 22–23 శాతం వాటా రష్యా దిగుమతులది ఉంటోంది. అటు బీపీసీఎల్ క్రూడాయిల్ రిఫైనింగ్లో 34 శాతంగా నమోదైంది. మరోవైపు రష్యా చమురుపై డిస్కౌంట్లు, బ్యారెల్పై 1.5 డాలర్లకు తగ్గడంతో గత నెల దిగుమతులు కొంత తగ్గినట్లు బీపీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) వెత్సా రామకృష్ణ గుప్తా తెలిపారు. -
రూపాయి 79 ఏళ్ల ప్రస్థానం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి రేపటితో 79 ఏళ్లు పూర్తవుతాయి. బ్రిటిష్ రాచరిక పాలన అంతమైన 1947 సమయంలో ఇండియన్ రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే రూ.3.30గా ఉండేది. క్రమంగా అది మారుతూ ప్రస్తుతం రూ.87.65కు చేరింది. ఇలా డాలర్ పెరిగి రూపాయి విలువ తగ్గేందుకు చాలా కారణాలున్నాయి. స్వాతంత్ర్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు డాలర్-రూపాయి పరిణామం ఎలా ఉందనే వివరాలు తెలుసుకుందాం.రూపాయి విలువను ప్రభావితం చేసే కొన్ని అంశాలు..వాణిజ్యం: భారత్ విదేశాల నుంచి చేసుకునే దిగుమతులు, ఇతర ప్రాంతాలకు చేసే ఎగుమతుల సమతుల్యత వల్ల రూపాయి ప్రభావం చెందుతుంది. ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తే రూపాయి విలువ పడిపోతుంది. విదేశీ కరెన్సీలకు డిమాండ్ పెరుగుతుంది.ద్రవ్యోల్బణం: దేశంలోని అధిక ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల కొనుగోలుకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువ తగ్గిపోతుంది.వడ్డీ రేట్లు: అధిక వడ్డీ రేట్లు విదేశీ మూలధనాన్ని ఆకర్షిస్తాయి. రూపాయి విలువను పెంచుతాయి.విదేశీ మారక నిల్వలు: భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిల్వలు, ఈక్విటీ మార్కెట్లోకి వచ్చే ఫారెన్ కరెన్సీ వల్ల రూపాయి స్థిరంగా ఉంటుంది. విదేశీ కరెన్సీ రాకపెరిగితే రూపాయి విలువ పెరుగుతుంది.రాజకీయ, ఆర్థిక పరిస్థితులు: ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందాలంటే రాజకీయ అనిశ్చితులు ఉండకూడదు. స్పష్టమైన రాజకీయ నాయకత్వ పరిస్థితులు లేకపోయినా రూపాయి పతనమయ్యే అవకాశం ఉంటుంది.చమురు ధరలు: భారత్ గణనీయంగా చమురును దిగుమతి చేసుకుంటోంది. అందుకోసం డాలర్లు చెల్లించాల్సిందే. భారత్ వద్ద ఉన్న ఫారెన్స్ కరెన్సీ రిజర్వులు అందులో ఉపయోగపడుతాయి. అయితే చమురు ధరలు పెరగితే చెల్లింపులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దాంతో డాలర్ విలువ పెరిగి రూపాయి విలువ తగ్గుతుంది.కొన్ని నివేదికల ప్రకారం.. 1947లో అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి ఎక్సేంజ్ రేట్ రూ.3.30గా ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ విలువ క్రమంగా పడిపోయింది. 1947 నుంచి 2025 వరకు ఇండియన్ రూపాయి పరిణామక్రమం కింది విధంగా ఉంది. -
ఎస్బీఐ ‘ఐఎంపీఎస్’ చార్జీలు
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ (ఇమీడియెట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీలను సవరిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఆన్లైన్లో ఐఎంపీఎస్ ద్వారా నిర్వహించే నగదు బదిలీ రూ.25,000 దాటితే రూ.2 నుంచి రూ.10 వరకు చార్జీ, దీనిపై జీఎస్టీ అమలవుతుంది. రూ.25,000కు పైన రూ.లక్షలోపు లావాదేవీపై రూ.2, రూ.1–2 లక్షల లావాదేవీపై రూ.6, రూ.2–5 లక్షల లావాదేవీలపై రూ.10 చొప్పున చార్జీతో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఎస్బీఐ తెలిపింది.. బ్యాంక్ శాఖల ద్వారా నిర్వహించే ఐఎంపీఎస్ లావాదేవీలపై ఇక ముందూ ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొంది. వేతన ఖాతాదారులు సైతం ఎలాంటి చార్జీల్లేకుండా ఐఎంపీఎస్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కరెంట్ ఖాతా (గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోడియం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి)లకూ ఈ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. -
మైనస్లోనే టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల కనిష్ట స్థాయికి దిగొచి్చంది. జూలైలో మైనస్ 0.58 శాతంగా (ప్రతి ద్రవ్యోల్బణం) నమోదైంది. జూన్లోనూ ఇది మైనస్ 0.13 శాతంగా ఉంది. గతేడాది జూలైలో 2.10 శాతంగా ఉండడం గమనార్హం. ఆహార వస్తువులు, మినరల్ ఆయిల్, ముడి చమురు, సహజ వాయువు, బేసిక్ మెటల్స్ ధరలు తగ్గడం వల్ల జూలై నెలకు టోకు ద్రవ్యోల్బణం ప్రతికూలంగా నమోదైనట్టు పరిశ్రమల శాఖ పేర్కొంది. → ఆహార వస్తు విభాగంలో టోకు ద్రవ్యోల్బణం మైనస్ 6.29%గా నమోదైంది. జూన్లో మైనస్ 3.75%గా ఉంది. ముఖ్యంగా ఈ విభాగంలో కూరగాయల ధరలు గణనీయంగా తగ్గడంతో ద్రవ్యోల్బణం మైనస్ 28.96 శాతంగా నమోదైంది.→ ఇంధనం, విద్యుత్ విభాగంలో మైనస్ 2.43 శాతంగా ఉంది. → తయారీ వస్తు విభాగంలో ద్రవ్యోల్బణం 2.05 శాతానికి పెరిగింది. జూన్లో ఇది 1.97%. ఆగస్ట్లో మళ్లీ ప్లస్లోకి.. ‘‘ఆహార విభాగం కారణంగానే జూలైలో టోకు ద్రవ్యోల్బణం మైనస్లో కొనసాగింది. కూరగాయలు, పప్పులు, గుడ్లు, మాంసం, చేపల ధరలు ఎక్కువగా తగ్గాయి. వినియోగ ధరల (రిటైల్) ద్రవ్యోల్బణం లాగే టోకు ద్రవ్యోల్బణం సైతం జూలైలో కనిష్టానికి చేరింది. ఆగస్ట్ నుంచి తిరిగి ప్లస్లోకి చేరుకుంటుంది’’ అని ఇక్రా సీనియర్ ఆర్థికవేత్త రాహుల్ అగర్వాల్ తెలిపారు. -
భారత్కు రేటింగ్ బూస్ట్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు, ద్రవ్యలోటు కట్టడి విషయంలో ప్రభుత్వ క్రమశిక్షణను ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ గుర్తించింది. ద్రవ్యోల్బణ నియంత్రణ అనుకూల పరపతి విధానాలనూ పరిగణనలోకి తీసుకుంటూ.. భారత సార్వబౌమ రేటింగ్ను బీబీబీ మైనస్ నుంచి ‘బీబీబీ’ స్టేబుల్ అవుట్లుక్ (స్థిరమైన దృక్పథం)కు అప్గ్రేడ్ చేస్తున్నట్టు ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థను నిర్జీవమైనదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించిన కొన్ని రొజులకే.. ఎస్అండ్పీ తన చర్యతో అసలు నిజమేంటో నిరూపించింది. 18 ఏళ్ల విరామం తర్వాత భారత రేటింగ్ను ఎస్అండ్పీ అప్గ్రేడ్ చేయడం గమనార్హం. 2007 జనవరిలో భారత సావరీన్ రేటింగ్ను బీబీబీ మైనస్ (అతి తక్కువ పెట్టుబడుల గ్రేడ్)కు తగ్గిస్తూ ఎస్అండ్పీ నిర్ణయం ప్రకటించింది. ఆ తర్వాత రేటింగ్ సవరణ మళ్లీ ఇదే. గతేడాది మే నెలలో భారత క్రెడిట్ రేటింగ్ అవుట్లుక్ను స్థిరత్వం నుంచి సానుకూలానికి మారుస్తూ.. వచ్చే 24 నెలల్లో రేటింగ్ అప్గ్రేడ్ ఉండొచ్చంటూ సంకేతం పంపింది. దీర్ఘకాల అన్సాలిసైటెడ్ (స్వచ్ఛంద) సావరీన్ క్రెడిట్ రేటింగ్స్ను బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి.. స్వల్పకాల రేటింగ్స్ను ఏ–3 నుంచి ఏ–2కు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అప్గ్రేడ్ చేసింది. దీనివల్ల భారత కంపెనీలు మరింత తక్కువ రేట్లపై అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నిధులు సమీకరించే వెసులుబాటు లభిస్తుంది. బీబీబీ అన్నది ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్. తన రుణాలను సౌకర్యవంతంగానే చెల్లించగలదని ఇది సూచిస్తుంది. ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు ‘‘ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరు చూపుతున్న దేశాల్లో భారత్ ఇక ముందూ తప్పకుండా ఉంటుంది. ప్రభుత్వ వ్యయాల తీరు గత ఐదారేళ్ల కాలంలో మెరుగుపడింది. అమెరికా టారిఫ్ల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం ఎదుర్కోతగినదే. 50% టారిఫ్ల విధింపు వృద్ధిని ఏమంత కిందకు తోసేయదు. వాణిజ్య ఎగుమతులపై భారత్ తక్కువగా ఆధారపడి ఉన్నది. 60% ఆర్థిక వృద్ధి దేశీ వినియోగం రూపంలోనే ఉంటోంది’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. ఆర్థిక వృద్ధి సరైన దిశలోనే ఉన్నందున ద్రవ్య స్థిరీకరణకు మరింత నిర్దిష్టమైన మార్గాన్ని రూపొందించుకోవాలని సూచించింది.ఇక ముందూ ఇదే ఒరవడి..: ఆర్థిక శాఖ ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ చురుగ్గా, చైతన్యంగా, బలంగా ఉందని రేటింగ్ అప్గ్రేడ్ రుజువు చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఒకవైపు మౌలిక వసతుల కల్పన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, మరోవైపు ద్రవ్య స్థిరీకరణకు భారత్ ప్రాధాన్యం ఇచి్చందని, దీని ఫలితమే రేటింగ్ అప్గ్రేడ్ అంటూ ఎక్స్ ప్లాట్ఫామ్పై పేర్కొంది. చురుకైన ఈ వృద్ధిని భారత్ ఇక ముందూ కొనసాగిస్తూ, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు వీలుగా అవసరమైన సంస్కరణలు చేపడుతుందని తెలిపింది. -
జులైలో ఎగుమతులు జూమ్
న్యూఢిల్లీ: ఎగుమతులు రెండు వరుస నెలల క్షీణత తర్వాత జూలైలో పుంజుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 7.29% వృద్ధితో 37.24 బిలియన్ డాలర్ల విలువైన (రూ.3.24 లక్షల కోట్లు) ఎగుమతులు నమోదయ్యాయి. దిగుమతులు సైతం 8.6% పెరిగి 64.59 బిలియన్ డాలర్ల (రూ.5.62 లక్షల కోట్లు)కు చేరాయి. దీంతో వాణిజ్య లోటు ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి చేరి, 27.35 బిలియన్ డాలర్లుగా (రూ.2.38 లక్షల కోట్లు) నమోదైంది. గతేడాది నవంబర్ (31.77 బిలియన్ డాలర్లు) తర్వాత ఇదే గరిష్ట వాణిజ్య లోటు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లో ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3% పెరిగి 149.2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే కాలంలో దిగుమతులు 5%కి పైగా పెరిగి 244 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వాణిజ్య లోటు 4 నెలల్లో 94.81 బిలి యన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత వస్తు, సేవల ఎగుమతులు మంచి పనితీరు చూపిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ పేర్కొన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఎగుమతులే ఎక్కువ వృద్ధిని సాధించినట్టు చెప్పారు. ఇంజనీరింగ్, ఎల్రక్టానిక్స్, రత్నాభరణాలు, ఫార్మా, కెమికల్స్ ఎగుమతుల్లో బలమైన పనితీరు చూపాయి. -
భారత్-సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
న్యూఢిల్లీలో తాజాగా జరిగిన మూడో భారత్-సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ (ఐఎస్ఎంఆర్) సమావేశం విజయవంతంగా ముగిసింది. అధిక ప్రభావం ఉన్న రంగాల్లో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్-సింగపూర్ పనిచేస్తున్నట్లు ఇరుదేశాల ప్రతినిధులు తెలిపారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సెప్టెంబర్లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ సమావేశం కీలకంగా మారింది.ఈ ఉన్నత స్థాయి మంత్రుల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఆరు అంశాలపై చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.డిజిటలైజేషన్స్కిల్ డెవలప్మెంట్సుస్థిరతహెల్త్ కేర్ & మెడిసిన్అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్కనెక్టివిటీసెమీకండక్టర్స్ అండ్ గ్రీన్ ఎనర్జీభారత్ సెమీకండక్టర్ల తయారీ ఆశయాలకు సింగపూర్ మద్దతు ప్రకటించింది. అదనంగా ఇరుపక్షాలు గ్రీన్ హైడ్రోజన్ సహకారాన్ని అన్వేషిస్తున్నట్లు చెప్పాయి. రాబోయే రోజుల్లో ఒడిశా హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారుతుందని తెలిపాయి.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుభారత్లో ఐదు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు సింగపూర్ సహకరిస్తుందని తెలిపింది. ఒడిశాలోని ఒక కేంద్రంలో ఏటా 3,000 మంది యువ భారతీయులకు మెకట్రానిక్స్, హెచ్వీఏసీ వ్యవస్థల్లో శిక్షణ ఇవ్వనున్నారు.డేటా, ఫైనాన్షియల్ కోఆపరేషన్రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య సీమాంతర డేటా ట్రాన్స్మిషన్ను క్రమబద్ధీకరించడానికి, క్యాపిటల్ మార్కెట్ ఏకీకరణను బలోపేతం చేయడానికి అవసరమైన ఫ్రేమ్వర్క్లను చర్చించారు.సింగపూర్ నుంచి భారత్ దిగుమతులు: 21.3 బిలియన్ డాలర్లుసింగపూర్కు భారత ఎగుమతులు: 13 బిలియన్ డాలర్లువిదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎప్డీఐ): భారత్కు సింగపూర్ నుంచే అధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరుతున్నాయి. ఇది మొత్తం ఎఫ్డీఐ రాకలో 24% దోహదం చేస్తుంది. గత 25 సంవత్సరాలలో 174.8 బిలియన్ డాలర్లు సమకూరాయి.ఇదీ చదవండి: అనుమతిస్తే పునప్రారంభానికి సిద్ధం -
యూపీఐలోని ఫీచర్ నిలిపివేత?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సంబంధిత మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పుల్ ట్రాన్సాక్షన్స్ అని పిలువబడే పర్సన్-టు-పర్సన్ (పీ 2 పీ) డిజిటల్ చెల్లింపులను నిలిపివేయాలని చూస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈ విషయం తెలిసిన వారిని ఉటంకిస్తూ కొన్ని సంస్థలు వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎన్పీసీఐ ఇప్పటికే బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలకు తెలియజేసినట్లు అందులో తెలిపాయి. యూపీఐ యాక్టివిటీలో పీ2పీ పుల్ ట్రాన్సాక్షన్స్ కేవలం 3% మాత్రమే ఉన్నాయని, తద్వారా ఎన్పీసీఐ ఈ ఫీచర్ను ఉపసంహరించుకోవడం సులభమవుతుందని పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి.యూపీఐ పుల్ ట్రాన్సాక్షన్ ఫీచర్ అంటే ఏమిటి?యూపీఐ పుల్ లావాదేవీని కలెక్ట్ రిక్వెస్ట్ అని కూడా పిలుస్తారు. ఏదైనా షాపుకు వెళ్లి సాధారణంగా క్యూఆర్ స్కాన్ చేసి మనీ పంపాలనుకునేవారు ఎంత మొత్తం చెల్లించాలో ఎంటర్ చేసి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకు భిన్నంగా కొన్ని సందర్భాల్లో డబ్బు తీసుకునేవారే ఎంత కావాలో ఓటీపీ, బార్కోడ్, మెసేజ్ లింక్ రూపంలో రెక్వెస్ట్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేసి డబ్బు పంపాలనుకునేవారు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే వెంటనే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు గ్రహీతలు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించలేక ఎదుటివారు డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. పైగా యూపీఐ మొత్తం లావాదేవీల్లో ఇది 3 శాతం మాత్రమే. ఎన్పీసీఐ దీని నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?ఇదిలాఉండగా, ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
టారిఫ్లు ఆర్నెల్లు మించి ఉండవు..
ముంబై: అమెరికా టారిఫ్లకు సంబంధించి సవాళ్లు వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో సమసిపోతాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. దేశం దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రైవేటు రంగం మరింత ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 2023–24లో జీడీపీ వృద్ధి 9.2 శాతం నుంచి 2024–25లో 6.5 శాతానికి తగ్గిపోవడానికి కఠిన రుణ పరిస్థితులు, లిక్విడిటీ అంశాలను కారణాలుగా పేర్కొన్నారు. సరైన వ్యవసాయ విధానాలను అమలు చేస్తే నిజమైన జీడీపీ వృద్ధికి 25 శాతం అదనపు తోడ్పాటునిస్తాయన్నారు. రత్నాభరణాలు, రొయ్యలు, టెక్స్టైల్స్ రంగాలపై అమెరికా టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ, వీటిని ఎదుర్కోవడం కష్టమన్నారు. ప్రభావిత రంగాలతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయంటూ, కొంత ఓపిక పట్టాలని కోరారు. అమెరికా వాణిజ్య బృందం ఈ నెల చివర్లో భారత్కు చర్చలకు రానున్న నేపథ్యంలో.. అలాస్కాలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగే సమావేశం ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. టారిఫ్ సంబంధిత అంశాలపై దృష్టి పెడుతూ.. అదే సమయంలో ముఖ్యమైన సవాళ్లను విస్మరించరాదన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా పడే ప్రభావం, కీలక ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడడం వంటి సవాళ్లను ప్రస్తావించారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో, ప్రైవేటు రంగం సైతం దీర్ఘకాల దృష్టితోనే ఆలోచించాలని సూచించారు. విధానపరమైన మద్దతు పరిశోధనల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తమ వంతు పెట్టుబడులు పెంచాల్సిన బాధ్యత ప్రైవేటు రంగంపై ఉన్నట్టు సీఈఏ అనంత నాగేశ్వరన్ చెప్పారు. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దేశీయంగా వినియోగం బలంగా ఉన్నట్టు చెప్పారు. చైనాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ.. దిగుమతులను మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించాలని కోరారు. -
ఇక చకచకా చెక్కుల క్లియరెన్స్
ముంబై: చెక్కులను వేగంగా క్లియర్ (చెల్లింపులు) చేసే దిశగా ఆర్బీఐ అక్టోబర్ 4 నుంచి కొత్త యంత్రాంగాన్ని అమల్లోకి తీసుకురానుంది. బ్యాంక్లో చెక్కు సమర్పించిన గంటల్లోనే అది నగదుగా మారిపోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద రెండు పనిదినాల వరకు సమయం తీసుకుంటోంది. కొత్త విధానంలో చెక్కులను స్కాన్ చేసి వాటిని వెంటనే క్లియరింగ్ హౌస్కు బ్యాంక్లు పంపాల్సి ఉంటుంది. దీంతో క్లియరింగ్ సైకిల్ టీప్లస్1 (సమర్పించిన తర్వాతి రోజు) నుంచి కొన్ని గంటలకు తగ్గిపోనుంది.సీటీఎస్లో బ్యాచ్ ప్రాసెసింగ్ నుంచి కంటిన్యూయెస్ క్లియరింగ్ విత్ ‘ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్’కు బ్యాంక్లు మారిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంక్లకు ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. ‘‘సీటీఎస్ నుంచి కంటిన్యూయెస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆన్ రియలైజేషన్కు రెండు దశల్లో మారిపోవాలని నిర్ణయించడమైంది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండో దశ 2026 జనవరి 3 నుంచి అమల్లోకి వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకటే సెషన్ (చెక్కుల సమర్పణ) ఉంటుంది’ అని ఆర్బీఐ పేర్కొంది. -
టారిఫ్లు భారత్ వృద్ధిని ఆపలేవు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు భారత వృద్ధిని అడ్డుకోలేవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత్ ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని గుర్తు చేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అంచనా సానుకూలంగానే కొనసాగుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ యీఫార్న్ ఫువా స్పష్టం చేశారు. భారత సార్వభౌమ రేటింగ్ను బీబీబీ మైనస్ నుంచి సానుకూలానికి అప్గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్అండ్పీ గతేడాది మేలో ప్రకటించడం తెలిసిందే. బలమైన వృద్ధి అవకాశాలను ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్అండ్పీ అంచనాగా ఉంది. భారత్పై ఈ నెల 6 నుంచి 25 శాతం టారిఫ్లను యూఎస్ అమలు చేస్తుండడం, ఆగస్ట్ 27 నుంచి మరో 25 శాతం మేర టారిఫ్లు అమలు కానున్న నేపథ్యంలో ఎస్అండ్పీ గ్లోబల్ తన విశ్లేషణను వెల్లడించింది. టారిఫ్ల విధింపు భారత సానుకూల ఔట్లుక్ను తగ్గించొచ్చా? అన్న సందేహంపై యీఫార్న్ స్పందించారు. అమెరికాతో వాణిజ్యం భారత జీడీపీలో 2 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులకు టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్నట్టు చెప్పారు. దీర్ఘకాలంలో అధిక టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై ఏమంత ప్రభావం చూపించబోవంటూ.. సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడులపైనా ప్రభావం ఉండదు.. అమెరికా టారిఫ్లు భారత్లో పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయా? అన్న ప్రశ్నకు ఈఫార్న్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లలో చైనా ప్లస్ వన్ విధానం ఫలితమిచ్చినట్టు చెప్పారు. భారత్లో వ్యాపారాన్ని ప్రారంభించిన కంపెనీలు దేశీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకునే ఆ పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్కు వచ్చే చాలా వరకు పెట్టుబడులు యూఎస్కు ఎగుమతుల కోసం ఉద్దేశించినవి కావు. దేశీయంగా భారీ డిమాండ్ ఉండడమే కారణం. మధ్యతరగతి వర్గం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ఎగుమతులు చేయాలనుకునే వాటికి యూఎస్ మార్కెట్ ప్రధానంగా ఉండకపోవచ్చు’’ అని ఈఫార్న్ వివరించారు. 2021–25 మధ్య భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమానార్హం. దేశ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకే వెళ్లాయి. భారత్ దిగుమతుల్లో అమెరికా వాటా 6.22 శాతంగా ఉంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా భారత్ 35.32 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది. -
ట్రంప్.. సంప్రదింపులా? అధికార ప్రయోగమా?
భారత్, బ్రెజిల్ దేశాలపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు ఆచరణ సాధ్యం కాదని, రాజకీయంగా ప్రమాదకరమని ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అమెరికా వాణిజ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బ్రెజిల్ ఫైనాన్షియల్ పబ్లికేషన్ వాలర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు. యూఎస్ అనుసరిస్తున్న ఈ చర్య దీర్ఘకాలిక దౌత్య, ఆర్థిక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు.అమెరికా వ్యతిరేకిగా ముద్రరష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తున్నందుకు శిక్షగా పేర్కొంటూ ట్రంప్ ఇటీవల భారీ సుంకాలను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్పై ట్రంప్ ‘అమెరికా వ్యతిరేకి’గా ముద్ర వేసి ఇలాంటి సుంకాలు విధించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్, ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పని చేస్తున్న రఘురామ్ రాజన్ ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.యూఎస్కు భారత్ భయపడితే..‘తలకు తుపాకీ గురిపెట్టి వాణిజ్య సంప్రదింపులు జరపడం కష్టం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇవి వాణిజ్య సంప్రదింపులు కావు. అధికార ప్రయోగం. ఇండియా ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు కోరుకుంది. అందుకు భిన్నంగా అకస్మాత్తుగా దాడి చేయడం సరికాదు. రష్యా నుంచి భారత్ చేసే చమురు కొనుగోళ్లపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇలా సుంకాలతో బయపెట్టాలనుకోవడం తగదు. ఈ తీరు రాజకీయ ప్రతిఘటనను సృష్టిస్తుంది. రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్ నిర్ణయం తీసుకుంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్లు అవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో చెడు సంకేతాలకు దారితీస్తుంది’ అన్నారు.ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!యూఎస్కు కూడా నష్టమే..‘అమెరికా అనుసరిస్తున్న దూకుడు సుంకాల వల్ల ఆర్థిక పతనం ఏకపక్షంగా ఉండదు. అమెరికాకు 80 బిలియన్ డాలర్ల వరకు భారత ఎగుమతులు లాభసాటిగా ఉండవు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యాపిల్ వంటి సంస్థల ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 50 శాతం సుంకాలు భరించడం భారత్కు మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని భావిస్తున్న అమెరికాకు కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ప్రజలు చాలా కాలం గుర్తుంచుకుంటారు. యూఎస్ నేడు ఒక దేశంపై, రేపు మరో దేశంపై 50 శాతం సుంకాలు విధిస్తూపోతే అనిశ్చితి వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలుగుతుంది’ అని రాజన్ హెచ్చరించారు. -
రూ.5.82 లక్షల కోట్ల రుణాల మాఫీ
ప్రభుత్వరంగ బ్యాంక్లు (పీఎస్బీలు) గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.5.82 లక్షల కోట్ల మొండి రుణాలను (వసూలు కాని/ఎన్పీఏలు) మాఫీ (రద్దు) చేశాయి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్వయంగా రాజ్యసభకు ఈ విషయాన్ని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.91,260 కోట్లను మాఫీ చేసినట్టు చెప్పారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2023–24) రూ.1.15 లక్షల కోట్లుగా ఉన్నట్టు తెలిపారు.అత్యధికంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.1.33 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయి. 2021–22లో రూ.1.16 లక్షల కోట్లు, 2022–23లో రూ.1.27 లక్షల కోట్ల చొప్పున మాఫీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. ఇలా మాఫీ చేసిన మొత్తం నుంచి గత ఐదు సంవత్సరాల్లో వసూలైన మొత్తం రూ.1.65 లక్షల కోట్లుగా ఉంది. అంటే మొత్తం మాఫీ రుణాల్లో వసూలైంది 28 శాతమే. ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎన్పీఏలకు బ్యాంక్లు ప్రొవిజన్లు చేయాల్సి ఉంటుంది. ఇలా నూరు శాతం కేటాయింపుల తర్వాత నిబంధనల కింద పుస్తకాల్లో మాఫీ చేసినట్టు చూపిస్తాయి. అయినా, వాటి వసూలుకు బ్యాంకులు చర్యలు చేపడుతూనే ఉంటాయి. మాఫీ చేసినప్పటికీ రుణ గ్రహీతలపై చెల్లింపుల బాధ్యత ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. -
స్వల్పంగా తగ్గిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
ప్రత్యక్ష పన్నుల రూపంలో ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (ఏప్రిల్1 నుంచి ఆగస్ట్ 11 వరకు) రూ.6.64 లక్షల కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.6.91 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 3.95 శాతం మేర తగ్గినట్లు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి విడుదల చేసిన గణాంకాలతో స్పష్టమవుతోంది. రిఫండ్లు పెరగడం ఇందుకు కారణం. వ్యక్తులు, కంపెనీలు, వ్యాపార సంస్థలు చెల్లించే పన్నులు ప్రత్యక్ష పన్నుల కిందకు వస్తాయి.ఇదీ చదవండి: సమగ్ర భూ సంస్కరణలు చేపట్టాల్సిందే..కార్పొరేట్ సంస్థల నుంచి నికర పన్నుల ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగి రూ.2.29 లక్షల కోట్లుగా నమోదైంది. వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, సంస్థల నుంచి వచ్చిన ఆదాయం 7 శాతానికి పైగా పెరిగి రూ.4.12 లక్షల కోట్లుగా ఉంది. రూ.22,362 కోట్లు సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్టీటీ) రూపంలో వసూలైంది. ఇదే కాలంలో రిఫండ్లు 10 శాతం పెరిగి రూ.1.35 లక్షల కోట్లకు చేరాయి. రిఫండ్లకు ముందు స్థూల పన్ను వసూళ్లు రూ.7.99 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
మరింత దిగొచ్చిన ధరలు
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహారోత్పత్తులు, ధాన్యాల ధరలు మరింత కిందకు దిగొచ్చాయి. ఫలితంగా జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయి అయిన 1.55 శాతానికి పడిపోయింది. 2017 జూన్ నెలలో నమోదైన 1.46 శాతం తర్వాత ఇదే అత్యంత కనిష్ట రిటైల్ ద్రవ్యోల్బణం. ఈ ఏడాది జూన్ నెలలో ద్రవ్యోల్బణం 2.1 శాతంతో పోల్చి చూసినా 0.55 శాతం తక్కువగా నమోదైంది.2024 జూన్ నెలలో ఇది 3.6%గా ఉంది. ఈ వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగిపోయిన తరుణంలో రిటైల్, ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం అన్నది వినియోగదారులతో పాటు విధాన నిర్ణేతలకూ ఉపశనమం కలిగిస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ⇒ ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం (కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్/సీఎఫ్పీఐ) మైనస్ 1.76 శాతానికి క్షీణించింది. జూన్లో ఇది మైనస్ 1.01గా ఉంది. 2019 జనవరి తర్వాత ఆహార విభాగంలో అతి తక్కువ ద్రవ్యోల్బణం ఇది. వరి, గోధుమ, చక్కెర, పప్పులు, ధాన్యాలు, కూరగాయలు, గుడ్లు తదితర ఉత్పత్తులు ఈ విభాగం కిందకు వస్తాయి. ⇒ గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలకు 1.18 శాతంగా నమోదైంది. జూన్లో ఇది 1.72 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంత ఆహార ద్రవ్యోల్బణం మైనస్ 1.74 శాతానికి పతనమైంది. ⇒ పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.05 శాతానికి తగ్గింది. -
కొత్త ఆదాయపన్ను బిల్లులోని ముఖ్యాంశాలు
అరవై ఏళ్ల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న భారత నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025లో ప్రధాన మార్పులు కింది విధంగా ఉన్నాయి.కొత్త పన్ను బిల్లులోని కీలక సంస్కరణలుఅద్దె ఆదాయం నుంచి మున్సిపల్ పన్నులను మినహాయించిన తర్వాత ప్రామాణిక మినహాయింపు(స్టాండర్డ్ డిడక్షన్) వర్తిస్తుంది.స్వీయ-ఆక్రమిత ఆస్తులకు మాత్రమే కాకుండా, ఖాళీ చేసిన ఆస్తులపై వడ్డీ తగ్గించేలా నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, భూస్వాములకు ప్రయోజనం చేకూరనుంది.కార్పొరేట్, బిజినెస్ ప్రొవిజన్స్కొత్త పన్ను విధానం కింద కార్పొరేషన్లు ఇప్పుడు సెక్షన్ 80ఎం కింద మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. డివిడెండ్ ఆదాయంలో పన్ను తగ్గించుకోవచ్చు.కంపెనీలకు కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) వర్తిస్తుంది.మినహాయింపులను క్లెయిమ్ చేసే నాన్-కార్పొరేట్ సంస్థలకు ఆల్టర్నేటివ్ మినిమమ్ ట్యాక్స్ (ఏఎంటీ) వర్తిస్తుంది.అధిక సంపాదన కలిగిన వారు(రూ.50 కోట్లు+ రశీదులు) నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల ఆడిట్ మార్గాలు మెరుగుపడతాయి. లెక్కల్లోకి రాని ఆదాయాన్ని అరికట్టవచ్చు.ధార్మిక ప్రయోజనాల కోసం ఉపయోగించే మూలధన లాభాలను ఇకపై ‘ఆదాయ అనువర్తనం(అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్)’గా పరిగణిస్తారు. ఇది నిధుల కేటాయింపులో సౌలభ్యాన్ని పెంచుతుంది. ట్రస్టులు ఇకపై కూడబెట్టిన ఆదాయంలో 15% నిర్దిష్ట పద్ధతుల్లో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది మరింత అనుకూలమైన ఆర్థిక ప్రణాళికకు ఉపయోగపడుతుంది.స్నేహపూర్వక చర్యలునిర్దిష్ట పరిస్థితుల్లో ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసేవారు కూడా ఇప్పుడు రిఫండ్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆలస్యానికి తగిన రుజువులు జతచేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు పన్ను అధికారులకు నిబంధనలు అతిక్రమించిన వారిపై విధించిన జరిమానాలను మాఫీ చేసే విచక్షణ ఉంటుంది. ఇది పన్ను చెల్లింపుదారుల హక్కులకు అనుగుణంగా ఉంటుంది. అయితే అందుకు తగిన కారణాలను సమర్పించాలి.ఇదీ చదవండి: దిగొస్తున్న కనకం ధరలు!పన్నులు మారుతాయా?కొత్త ఆదాయపన్ను బిల్లు 2025 అమల్లోకి రానున్న నేపథ్యంలో చాలామంది తాము ఏమేరకు పన్ను చెల్లించాలనేదానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం గతంలో చెప్పినదాని ప్రకారమే పన్ను శ్లాబులు ఉంటాయి. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. కేంద్రం గతంలో ప్రవేశపెట్టిన కొత్త శ్లాబుల ప్రకారం.. రూ.12,00,000 ఆదాయం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. -
టార్గెట్ 50
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను గణనీయంగా పెంచేయడంతో ప్రత్యామ్నాయాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకునే వ్యూహరచనకు తెరతీసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా తదితర ప్రాంతంలో 50 దేశాలకు ఎగుమతులను ఇతోధికం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత మొత్తం ఎగుమతుల్లో 90 శాతం ఈ 50 దేశాలకే వెళుతుండడం గమనార్హం. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు, ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా లోతైన విశ్లేషణ కొనసాగుతోందని చెప్పాయి. వాణిజ్య శాఖ ఇప్పటికే 20 దేశాలపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇప్పుడు మరో 30 దేశాలు ఈ జాబితాలోకి వచ్చి చేరినట్టు పేర్కొన్నాయి. కొత్త మార్కెట్లను అన్వేషించండి.. అధిక యూఎస్ టారిఫ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని.. రొయ్యలు, ఇతర చేపల ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు కేంద్రం సూచించింది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, యూకే, రష్యా, ఆ్రస్టేలియా, పశి్చమాసియా, దక్షిణాసియా తదితర ఎన్నో ప్రాంతాలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. ఇతర దేశాలను ఎగుమతులను పెంచుకునే ముందు విలువను పెంచుకోవడం, ప్యాకేజింగ్పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు ఫిషరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 55 శాతం ఎగుమతులపై ప్రభావం అమెరికాకు ఎగుమతి చేస్తున్న మొత్తం వస్తు ఎగుమతుల్లో 55 శాతం మేర 25 శాతం ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైతులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాల పరిరక్షణకు, ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉత్పత్తుల వైవిధ్యం, డిమాండ్, నాణ్యత, కాంట్రాక్టు ఒప్పందాలు భారత ఎగుమతులపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. -
మతపరమైన సంస్థలకు పన్ను మినహాయింపులు
న్యూఢిల్లీ: అన్ని మతపరమైన, స్వచ్ఛంద సేవా సంస్థలకు వచ్చే అజ్ఞాత విరాళాలపై టీడీఎస్ క్లెయిమ్, పన్ను మినహాయింపులకు ప్రస్తుత చట్టంలో మాదిరే ఆదాయపన్ను కొత్త బిల్లు (2.0)లోనూ అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకొచి్చన కొత్త బిల్లులో దీన్ని తొలగించడం గమనార్హం. అన్ని రిజిస్టర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థలు అందుకునే అజ్ఞాత విరాళాలపై 30 శాతం స్థిర పన్నును ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, సెలక్ట్ కమిటీ చేసిన సూచనల మేరకు నూతన బిల్లులో మినహాయింపులకు తిరిగి చోటు కల్పించింది. క్లాజు 187 కింద ‘ప్రొఫెషన్’ పదాన్ని చేర్చారు. ఒక ఏడాదిలో చెల్లింపుల స్వీకరణలు రూ.50 కోట్లకు మించితే నిపుణులు సైతం ఎల్రక్టానిక్ చెల్లింపుల నమూనాలను కలిగి ఉండాలని ఇది నిర్దేశిస్తోంది. నష్టాలను సర్దుబాటు చేసుకోవడం, క్యారీ ఫార్వార్డ్ చేసుకోవడానికి సంబంధించిన నిబంధనలను మరింత మెరుగుపరిచారు. టీడీఎస్ కరెక్షన్ స్టేట్మెంట్ (సవరణ నివేదికలు)లకు సంబంధించి దాఖలు గడువును ఆరేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించారు. నూతన ఆదాయపన్ను బిల్లు (2.0)గా చెబుతున్న తాజా బిల్లులో సెలక్ట్ కమిటీ సిఫారసులు అన్నింటికీ దాదాపుగా చోటు కల్పించడం గమనార్హం. తొలుత ఈ కొత్త బిల్లును ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టగా, సెలక్ట్ కమిటీకి సిఫారసు చేశారు. సెలక్ట్ కమిటీ తన నివేదికను జూలై 21న పార్లమెంట్కు సమరి్పంచింది. సోమవారం దీన్ని లోక్సభ ఆమోదించింది. -
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం: అమల్లోకి ఎప్పుడంటే?
ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ.. కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025కు తాజాగా ఆమోదం లభించింది. బైజయంత్ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సుల ఆధారంగా ఇందులో మార్పులు చేశారు.సుమారు నాలుగు నెలల పాటు తీవ్రంగా సమీక్షించిన తర్వాత, కమిటీ 285 కంటే ఎక్కువ సిఫార్సులతో 4,500 పేజీలకు పైగా నివేదికను రూపొందించింది. ఈ సూచనల ఉద్దేశ్యం చట్టం భాషను సరళీకృతం చేయడం, నిబంధనలలో స్పష్టత తీసుకురావడం & పన్ను చెల్లింపుదారులకు సమ్మతిని సులభతరం చేయడం. ఇప్పుడు ప్రభుత్వం ఈ మార్పులను కలుపుకొని కొత్త ముసాయిదాను సమర్పించింది.ప్రస్తుతమున్న 1961 చట్టాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు, రాష్ట్రపతి ఆమోదం కోరే ముందు రాజ్యసభకు వెళుతుంది. ఒకసారి అమలులోకి వచ్చిన తర్వాత, కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది.పాత vs కొత్త బిల్లు మధ్య తేడాలుపాత ఆదాయపు పన్ను చట్టం, 1961.. దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే అందులోని భాష, నిర్మాణం వంటివన్నీ సామాన్యులకు కొంత గందరగోళంగా ఉన్నాయి. దీనిని పూర్తిగా మార్చాలనే ఉద్దేశ్యంతో కొత్త బిల్లును తీసుకువచ్చారు.ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.ఇకపై మునుపటి సంవత్సరం & అసెస్మెంట్ సంవత్సరం వంటి పదాలకు బదులు "పన్ను సంవత్సరం" అనే పదం వాడుకలోకి వస్తుంది.2025 కొత్త పన్ను బిల్లులో ఇంతకు ముందు ఉన్న శ్లాబులు, రేట్లు అలాగే ఉంటాయి. ఐటీఆర్ ఫైలింగ్ గడువు తేదీలు, ఆదాయపన్ను శ్లాబులలో కూడా ఎలాంటి మార్పు లేదు.కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.ఇదీ చదవండి: ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్ -
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు: స్పందించిన ఆర్బీఐ గవర్నర్
సేవింగ్స్ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50వేలు ఉండాలని, ఐసీఐసీఐ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. బ్యాంకుల మినిమమ్ బ్యాలెన్స్ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ 'సంజయ్ మల్హోత్రా' (Sanjay Malhotra) స్పందించారు.ఒక ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాలనేది పూర్తిగా ఆ బ్యాంకుల పరిధిలోకే వస్తుంది. కొన్ని బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ను రూ. 50వేలు, మరికొన్ని రూ. 10వేలు, ఇంకొన్ని రూ. 2వేలుగా నిర్ణయించుకున్నాయి. కొన్ని బ్యాంకులైతే మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో ఎలాంటి నియమాలను సూచించదు. ఇదంతా సదరు బ్యాంక్ తీసుకునే నిర్ణయమే అని, ఈ అంశం ఆర్బీఐ పరిధిలోకి రాదని సంజయ్ మల్హోత్రా గుజరాత్లో జరిగిన ఆర్థిక చేరిక సమావేశంలో స్పష్టం చేశారు.ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్మెట్రో, పట్టణ శాఖలలోని వినియోగదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 50,000 ఉండేలా చూడాలి.సెమీ అర్బన్ ప్రాంతాలలో వినియోగదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 25,000 ఉండేలా చూడాలిగ్రామీణ ఖాతాదారులు తమ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ రూ. 10,000 ఉంచాలి.ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయని పక్షంలో.. మినిమమ్ బ్యాలెన్సుకు ఎంత తక్కువ డబ్బు ఖాతాలో ఉంటే.. దానిపై 6 శాతం లేదా రూ. 500 ఏది తక్కువైతే ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. అయితే ఇది ఖాతాదారులపై ప్రభావం చూపిస్తుందని, ఇదే పద్దతిని ఇతర బ్యాంకులు కూడా అనుసరిస్తే పరిస్థితి ఏంటని.. పలువురు విమర్శిస్తున్నారు.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే? -
పెట్రోల్ పంపుల ఏర్పాటు మరింత సులువు?
ఇంధన భద్రతను బలోపేతం చేయడానికి, దేశ క్లీన్ ఎనర్జీ పరివర్తనను ముందుకు తీసుకెళ్లడానికి విధానపరమైన చర్యల్లో మార్పులు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా పెట్రోల్ పంపుల ఏర్పాటుకు లైసెన్సింగ్ నిబంధనలను సులభతరం చేయడానికి సిద్ధమవుతోంది. ఇంధన రిటైల్ మార్కెట్ను వైవిధ్యపరచడానికి, పోటీని పెంపొందించడానికి, ప్రత్యామ్నాయ ఇంధనాలు, ఎలక్ట్రిక్ మొబిలిటీ మౌలిక సదుపాయాలను వేగవంతం చేయడానికి విస్తృత వ్యూహంలో భాగంగా ఈమేరకు చర్యలు తీసుకుంటోంది.నిబంధనలు సమీక్ష2019లో ప్రవేశపెట్టిన ఇంధన రిటైల్ ఆథరైజేషన్ నిబంధనలను పునసమీక్షించడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ సుఖ్మల్ జైన్ నేతృత్వంలో నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. అభివృద్ధి చెందుతున్న ఇంధన ప్రాధాన్యతలను ప్రతిబింబించే సవరణలను సూచించేలా కమిటీ ప్రస్తుత రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను సమీక్షిస్తోంది. పారదర్శకత, సమగ్రతను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియ కోసం ప్రజల అభిప్రాయాలకు కూడా కోరుతోంది. ఆగస్టు 6న జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం 14 రోజుల్లోగా వాటాదారులు, పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపింది.2019లో సంస్కరణలు ఇలా..ఇంధన రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలను చివరిసారిగా 2019లో ప్రభుత్వం సవరించింది. ఇది ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనుకూలంగా ఉన్న కొన్ని ఆంక్షల్లో మార్పులు చేసింది. సవరించిన ఫ్రేమ్వర్క్ ప్రకారం చమురుయేతర సంస్థలు, గ్లోబల్ ఎనర్జీ సంస్థలు దేశీయ ఇంధన రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి అనుమతించింది.2019 నిబంధనల్లోని ముఖ్యాంశాలురిటైల్ లైసెన్స్ కోసం కంపెనీలు రూ.250 కోట్ల నికర విలువ కలిగి ఉండాలి. రిటైల్ + బల్క్ మార్కెటింగ్ కోసం రూ.500 కోట్లు నికర విలువ కలిగి ఉండాలి. ప్రత్యామ్నాయ ఇంధన మార్కెట్ కోసం సీఎన్జీ, ఎల్ఎన్జీ, జీవ ఇంధనాలు(బయో ఫ్యూయెల్స్) లేదా ఈవీ ఛార్జింగ్కు అవసరమైన మౌలిక సదుపాయాలు 3 సంవత్సరాలలోపు ఏర్పాటు చేయాలి. కొత్త కంపెనీలు దేశంలో కనీసం 100 రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయాలి. అందులో గ్రామీణ ప్రాంతాలకు కనీసం 5% కేటాయించాలి.2019లో మార్పులు చేయకముందు రిటైల్ లైసెన్స్ కోసం అర్హత సాధించడానికి కంపెనీలు అప్స్ట్రీమ్ ఆయిల్ లేదా గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనీసం రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉండేది. ఇది కొత్త కంపెనీలకు సవాలుగా మారింది. దాంతో ఈ విభాగంలో మార్కెటింగ్ కోసం ఎక్కువ కంపెనీలు ముందుకు రాలేకపోయాయి. ఫలితంగా 2019లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. తాజాగా వాటిలో కూడా కొన్ని మార్పులు చేయాలని కమిటీ ఏర్పాటు చేశారు.కొత్త సంస్కరణలు ఎందుకంటే..వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థకు, జనాభాకు వీలుగా దేశవ్యాప్తంగా 97,000కు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్కు ఇది ఉదాహరణ. దేశీయ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, ఇంధన రిటైలర్ల సంఖ్యను పెంచుతూ వారి సర్వీసులను వైవిధ్యపరచాల్సి ఉంది. అందుకు అడ్డంకులను తగ్గించడానికి, సరఫరా గొలుసులను పెంచడానికి కొన్ని మార్పులు అవసరమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.భారతదేశం దీర్ఘకాలిక డీకార్బనైజేషన్ లక్ష్యాలకు అనుగుణంగా కొత్త సమీక్షలో మార్పులు చేయనున్నారు. ఇంధన రిటైల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం ద్వారా, ముఖ్యంగా సీఎన్జీ, ఎల్ఎన్జీ, జీవ ఇంధనాలు, ఈవీ ఛార్జింగ్ కోసం క్టీన్ ఎనర్జీ పరివర్తనను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.కొత్త నిబంధనలు విస్తృత శ్రేణి దేశీయ, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తాయని భావిస్తున్నారు. పెరిగిన పోటీ సేవల నాణ్యతను మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. ఈ విధానాలు ఇంధన ధరలను తగ్గిస్తాయని, స్థిరమైన ఇంధన ప్రత్యామ్నాయాల్లో పెట్టుబడులను వేగవంతం చేస్తాయని అంచనా వేస్తున్నారు.నెక్ట్స్ ఏంటి?సంప్రదింపుల వ్యవధి ముగిసిన తర్వాత నిపుణుల కమిటీ ఫీడ్ బ్యాక్ను తయారు చేసి మంత్రిత్వ శాఖకు సిఫార్సులను సమర్పిస్తుంది. దీనిపై సదరు శాఖ తుది నిర్ణయం తీసుకుని సవరించిన మార్గదర్శకాలను విడుదల చేస్తుంది.ఇదీ చదవండి: సీఈఓ కనుసన్నల్లోనే వేతన పెంపు -
ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..
కోర్టు సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే '1929 నాటి మహా మాంద్యం' వస్తుందని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం హెచ్చరించారు. ఇంతకీ ఈ మహా మాంద్యం ఏమిటి?, దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనే.. విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.1929 నాటి మహా మాంద్యం1929 నాటి మహా మాంద్యం.. 20వ శతాబ్దంలోని అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంగా చరిత్రలో నిలిచింది. ఇది 1929లో ప్రారంభమై సుమారు 1939 వరకు ప్రభావం చూపింది. ఈ మాంద్యం మొదట అమెరికాలో 1929 అక్టోబర్ 24 నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపింది.1929 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలుస్టాక్ మార్కెట్ పతనంస్టాక్ ధరలు పెరుగుతుండటం, వాటిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ప్రజలు స్టాక్లను కొనుగోలు చేశారు. చాలామంది అప్పు తెచ్చుకున్న డబ్బుతో కూడా స్టాక్ కొనేశారు. ఇలా పెద్దఎత్తున స్టాక్లు అమ్ముడవడం వల్ల మార్కెట్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది.బ్యాంకులు మూతపడటంప్రజలు తమ డబ్బును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది బ్యాంకులు మూతపడటానికి కారణమైంది. వేలాది బ్యాంకులు క్లోజ్ అవ్వడంతో.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ప్రభుత్వ జోక్యం కూడా తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడటం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమైంది.అధిక ఉత్పత్తి, తక్కువ డిమాండ్రైతులు మార్కెట్ అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేశారు. పారిశ్రామిక రంగం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకుండా పోయింది. ఇది ధరలు తగ్గడానికి మాత్రమే కాకుండా.. అప్పులు పెరగడానికి కూడా కారణమైంది. ఇది ఆర్ధిక వ్యవస్థను మరింత దిగజారేలా చేసింది.ప్రపంచ వాణిజ్య పతనంస్మూట్ హాలీ టారిఫ్ చట్టం (1930) వల్ల అమెరికా దిగుమతులపై అధిక పన్నులు విధించడం జరిగింది. ఇది ఇతర దేశాల నుంచి ప్రతీకార సుంకాలను సైతం పెంచింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం క్షిణించింది. ప్రపంచ మాంద్యం తీవ్రతరం అయింది.ప్రజలపై ప్రభావం1929 నాటి మహా మాంద్యం కారణంగా అమెరికాలో నిరుద్యోగం రేటు 25% దాటింది. లక్షలాది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఇళ్లను కూడా వదిలి బయటకు వలసలు వెళ్లి, నిరాశ్రయులయ్యారు. -
టారిఫ్ అంటే ఏమిటి?: దేశ ఆర్ధిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా..
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' భారతదేశంపైన 50 శాతం సుంకాలను ప్రకటించారు. ఇది భారత ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ సుంకం (టారిఫ్) అంటే ఏమిటి?, అది దేశ ఆర్ధిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందో.. ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.సుంకం అంటే?సుంకం అంటే పన్ను. దీన్ని ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై విధిస్తుంది. దీనివల్ల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇతర దేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలు చౌకగా కాకుండా ఉండటానికి.. ఆ దేశ ప్రభుత్వం ఈ సుంకాలను విధిస్తుంది.దేశ ఆర్ధిక వ్యవస్థపై సుంకాల ప్రభావం..ట్రంప్ భారతదేశంపై విధించిన 50 శాతం సుంకాల వల్ల.. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్త్రాలు, ఇనుము, ఉక్కు, ఫార్మా, బంగారం మొదలైన వాటి ధరలు పెరుగుతాయి. వీటి ధరలు పెరిగితే అక్కడ డిమాండ్ తగ్గుతుంది. ఇది ఇండియన్ కంపెనీలపై ప్రభావం చూపుతుంది. క్రమంగా ఎగుమతులు తగ్గుతాయి. తద్వారా విదేశీ మారకద్రవ్యం కూడా తగ్గుతుంది. ఇది దేశ ఆర్ధిక వ్యవస్థ మీద కొంతవరకు ప్రభావాన్ని చూపుతుంది.సుంకాలు విధించడం వల్ల ప్రయోజనాలుసుంకాలు విధించడం వల్ల దేశీయ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. విదేశీ వస్తువుల ధరలు అధికంగా కావడంతో ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల మీదనే మొగ్గు చూపుతారు. ఇది దేశీయ పరిశ్రమలను బలపరుస్తుంది, కర్మాగారాల సంఖ్య కూడా పెంచుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.ఇదీ చదవండి: మేడ్ ఇన్ ఇండియా రాఖీలదే హవా.. ఏకంగా రూ.17000 కోట్ల బిజినెస్సుంకాల వల్ల ప్రతికూల ప్రభావంఒక దేశం ఇతర దేశాలపై భారీ సుంకాలను విధిస్తే.. ఆ దేశం కూడా అదే స్థాయిలో సుంకాలను విధిస్తుంది. తద్వారా ఆ దేశం వస్తువుల ధరలు కూడా ఇతర దేశాల్లో పెరుగుతాయి. ఇది వాణిజ్య యుద్దానికి దారితీసే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా భారతదేశంలో 50 శాతం సుంకాలను ప్రకటించింది. ఇండియా కూడా అమెరికాకు ధీటుగా సుంకాలను పెంచే అవకాశం ఉంది. -
జీడీపీపై టారిఫ్ ఎఫెక్ట్!!
న్యూఢిల్లీ: అమెరికా ఆగస్టు 27 నుంచి 50 శాతం టారిఫ్లను అమలు చేస్తే భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి)పై ప్రభావం పడనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 బేసిస్ పాయింట్లు నెమ్మదించి 6 శాతానికి పరిమితం కావొచ్చని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే, దేశీయంగా డిమాండ్ మెరుగ్గా ఉండటం, సరీ్వసుల రంగం పటిష్టంగా ఉండటం వంటి అంశాలు భారత్పై ఒత్తిడిని తగ్గిస్తాయని పేర్కొంది. భారీ అమెరికా టారిఫ్లపై భారత్ స్పందించే తీరే అంతిమంగా వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని వివరించింది. ‘భారత్ ఎగుమతులకు అమెరికా అతి పెద్ద గమ్యస్థానంగా ఉంటోంది. అలాంటప్పుడు అమెరికా 50 శాతం టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తున్నా, రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని కొనసాగిస్తే 2025–26లో భారత జీడీపీ వృద్ధి రేటు ముందుగా అంచనా వేసిన 6.3 శాతంతో పోలిస్తే 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) మేర నెమ్మదించవచ్చు‘ అని మూడీస్ పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్పై అమెరికా టారిఫ్లను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు పెంచుకునే లక్ష్యంతో ఇరు దేశాలు మార్చి నుంచి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. ఆసియా–పసిఫిక్ దేశాలతో పోటీ.. అమెరికా విధానాల్లో మార్పుల వల్ల సరఫరా సిస్టంలు పునర్వ్యవస్థీకరణకు లోనవుతున్న నేపథ్యంలో వాణిజ్యం, పెట్టుబడుల్లో మరింత వాటా కోసం ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని పలు దేశాలు పోటీపడుతున్నాయని తెలిపింది.2025 తర్వాత మిగతా ఆసియా–పసిఫిక్ దేశాలతో పోలిస్తే టారిఫ్ల అంతరాలు భారీగా పెరిగిపోవడం వల్ల తయారీ రంగ హబ్గా ఎదగాలన్న భారత ఆకాంక్షలకు గండి పడొచ్చని మూడీస్ పేర్కొంది. అంతేగాకుండా ఇటీవలి కాలంలో పెట్టుబడుల రూపంలో ఒనగూరిన కొన్ని ప్రయోజనాలు కూడా వెనక్కి తరలిపోవచ్చని తెలిపింది. అయితే, అంతర్జాతీయ ఒడుదుడుకులను ఎదుర్కొనడానికి భారత్ వద్ద ప్రస్తుతం తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయని వివరించింది. -
రైతుల ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరించాలని.. అంతర్జాతీయ కంపెనీలు అనుసరించే దోపిడీ విధానాల నుంచి భారత రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఎస్బీఐ అధ్యయన నివేదిక సూచించింది. అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు నిర్వహిస్తుండడం తెలిసిందే. ఈ నెలలో తదుపరి చర్చల కోసం అమెరికా బృందం భారత్ను సందర్శించాల్సి ఉంది. ‘‘బలమైన బహుళజాతి సంస్థలు భారత మార్కెట్లో సదుపాయాలు, వ్యవసాయ విలువ ఆధారిత ఉత్పత్తుల కల్పన, రైతుల సంక్షేమం, వారి శ్రేయస్సు దిశగా పెద్దగా పెట్టుబడులు పెట్టుకుండానే ఇక్కడి మార్కెట్ అవకాశాలను కొల్లగడతాయి. కనుక వీటి బారి నుంచి రైతుల ప్రయోజనాలను తప్పకుండా కాపాడాలి’’అని ఈ నివేదిక సూచించింది.ఒత్తిడి పెంచుతున్న ట్రంప్...బహుళజాతి సాగు సంస్థలు బడా మార్కెట్లలో అవకాశాల కోసం ఎదురు చూస్తుండడాన్ని ప్రస్తావించింది. మొక్కజొన్న, సోయాబీన్, యాపిల్స్, బాదం, ఇథనాల్పై టారిఫ్లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తుండడం గమనార్హం. వీటితోపాటు అమెరికా పాడి ఉత్పత్తులకు అవకాశాలు కలి్పంచాలంటూ డిమాండ్ చేస్తోంది. మన రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్న ఆందోళనతో కేంద్ర సర్కారు అమెరికా డిమాండ్లను అంగీకరించడం లేదు. దీంతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడింది. రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారుల ప్రయోజనాల విషయంలో భారత్ ఎప్పటికీ రాజీపడబోదని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం తేల్చి చెప్పారు. భారత ఉత్పత్తులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రోజే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ద్వారా యూఎస్కు స్పష్టమైన సంకేతం పంపారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను తగ్గించుకునే దిశగా భారత్పై ఒత్తిడి పెంచేందుకు టారిఫ్లను అమెరికా అధ్యక్షుడు పెంచేయడం గమనార్హం. ఇంధన బిల్లు పెరగొచ్చు.. ఒకవేళ అమెరికా ఒత్తిళ్ల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి భారత్ నిలిపివేసినట్టయితే చమురు దిగుమతుల బిల్లు 9 బిలియన్ డాలర్లు మేర పెరుగుతుందని.. 2026–27లోనూ 11.7 బిలియన్ డాలర్లు అధికం కావొచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.‘‘ అంతర్జాతీయ చమురు సరఫరాలో రష్యా 10 శాతం వాటా కలిగి ఉంది. అన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తే, అదే సమయంలో మిగిలిన దేశాలు ఉత్పత్తిని పెంచకపోతే చమురు ధరలు 10 శాతం పెరిగే అవకాశం ఉంది’’అని ఈ నివేదిక పేర్కొంది. -
ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును వెనక్కితీసుకున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను వెనక్కి తీసుకుంది. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం 1961లో మార్పులు చేస్తూ ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్రం ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ నూతన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు 2025ను తాజాగా ఉపసంహరించుకుంది.బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ చేసిన అనేక సిఫార్సులను చేర్చి నూతన ఆదాయపు పన్ను బిల్లు సరికొత్త వెర్షన్ ఆగస్టు 11న అంటే సోమవారం తిరిగి పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. బిల్లులో కొత్త మార్పులు చేస్తన్న క్రమంలో బహుళ వెర్షన్ల గందరగోళాన్ని నివారించడానికి అన్ని మార్పులతో స్పష్టమైన, నవీకరించిన ఆదాయపు పన్ను బిల్లును ఆగస్టు 11న సభ పరిశీలన కోసం ప్రవేశపెట్టనున్నారు.ఆదాయపు పన్ను బిల్లు 2025 మార్పులుగత ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు- 2025 అరవై సంవత్సరాల నాటి భారతదేశ ప్రత్యక్ష పన్ను చట్టంలో పలు కీలక మార్పులు తీసుకొస్తోంది. 298-సెక్షన్ ఆదాయపు పన్ను చట్టం 1961 స్థానంలో ప్రస్తుత శాసనం కంటే 50 శాతం తక్కువ సరళమైన భాషలో రాసిన ఆధునిక, పన్ను చెల్లింపుదారులకు స్నేహపూర్వక చట్టాన్ని తీసుకురావడం ఆదాయపు పన్ను బిల్లు- 2025 ముఖ్యమైన లక్ష్యం. -
భారత్కు ఎంత బాధైనా అది ఏడాదే?
భారత దిగుమతులపై అమెరికా 50 శాతానికి సుంకాలు పెంచడం ఇండియాపై మధ్య, దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. భారత్ ఇప్పటికీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కాబట్టి, ఏడాదిపాటు వృద్ధిలో 50 బేసిస్ పాయింట్లు కోల్పోయే పరిస్థితులున్నాయని అభిప్రాయపడ్డారు. సుంకాలు అమలైతే జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 6.1 శాతానికి లేదా 6 శాతానికి పడిపోతుందని అంచనా వేశారు. ప్రస్తుతం భారత జీడీపీలో ఎగుమతుల వాటా 22 శాతం కాగా, వాటిలో అమెరికా వాటా 17 శాతంగా ఉంది.ట్రంప్ సుంకాలతో ఏడాది పాటు జీడీపీ వృద్ధి గణాంకాలపై ప్రభావం పడినా, దీర్ఘకాలంలో అంటే ఏడాదికి మించి దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని సుబ్బారావు చెప్పారు. 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా సంపన్న దేశాల సరసన నిలవాలనే ఆకాంక్షలు ఉన్న ఆర్థిక వ్యవస్థగా భారత్కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దాన్ని చేరుకోవాలంటే తొలినాళ్లలో వృద్ధి ఎక్కువగా ఉండాలన్నారు. ఎందుకంటే తర్వాతి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వృద్ధి సాధించడం కష్టమవుతుందని చెప్పారు. ఏటా 50 బేసిస్ పాయింట్ల నష్టపోతే 2047 నాటికి వికసిత్ భారత్గా ఎదగాలనే దేశం లక్ష్యం నీరుగారుతుందన్నారు.శ్రమ ఆధారిత రంగాలపై ప్రభావం‘అమెరికా ప్రకటించిన లెవీలు ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై ప్రభావం చూపడమే కాకుండా, అల్ప ఆదాయ వర్గాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఎందుకంటే అమెరికాకు ఎగుమతుల్లో ప్రధాన విభాగాలైన యంత్రాలు, రత్నాలు, ఆభరణాలు వంటి శ్రమ ఆధారిత రంగాలపై ప్రభావం పడనుంది. దీనికితోడు, భారతదేశం తన పెట్రోలియం అవసరాల కోసం రష్యాను కాదని పూర్తిగా సౌదీ అరేబియాపై ఆధారపడితే మొత్తం చమురు ఖర్చు పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణ రేటును, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది’ అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడం వల్ల డిమాండ్ తగ్గుతుందని, తద్వారా ప్రపంచ వృద్ధి రేటు కుంటుపడుతుందన్నారు. ఇది భారత్పై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అంచనా వేశారు.ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా యూపీఐ సర్వీస్ డౌన్!దృష్టి సారించాల్సినవి..‘మన ఎగుమతులను ఇతర భౌగోళిక ప్రాంతాలకు విస్తరించడం, కొత్త ఎగుమతుల కోసం అన్వేషించడం, ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి దేశంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి అంశాలపై భారత్ మరింత దృష్టి సారించాలి. అమెరికాతో వాణిజ్యపరంగా ఏం జరిగినా వీటన్నిటినీ మనం అమలు చేయాలి’ అని సుబ్బారావు చెప్పారు. -
దేశవ్యాప్తంగా యూపీఐ సర్వీస్ డౌన్!
భారతదేశం అంతటా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలకు గురువారం సాయంత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇది లావాదేవీల సమయంలో వినియోగదారులకు అసౌకర్యాన్ని కలిగించింది. 62 శాతం మంది వినియోగదారులు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. 29 శాతం మంది డబ్బు బదిలీ చేసేటప్పుడు ఇబ్బందులకు గురయ్యామని, 8 శాతం మంది యాప్ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నట్లు డౌన్ డిటెక్టర్ డేటా తెలిపింది.ఈ అంతరాయం కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకు వినియోగదారులపై ప్రభావం పడింది. డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రం సజావుగానే పని చేశాయి. యూపీఐ సేవలు అందుబాటులో లేనప్పుడు కస్టమర్లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డును బ్యాకప్గా వెంటే ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్లో సంక్షోభంఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా యూపీఐ వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. గతంలో ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
ఏయూ స్మాల్ ఫైనాన్స్కు ‘బ్యాంకింగ్’ లైసెన్స్
యూనివర్సల్ బ్యాంకు (పూర్తి స్థాయి బ్యాంకు)గా కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఆర్బీఐ మార్గ దర్శకాలకు అనుగుణంగా 2024 సెపె్టంబర్ 3న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. అర్హత ప్రమాణాలు పరిశీలించిన ఆర్బీఐ తాజాగా దీన్ని మంజూరు చేసింది. దీంతో ఆర్బీఐ నుంచి పూర్తి స్థాయి బ్యాంకింగ్ లైసెన్స్ పొందిన తొలి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుగా అవతరించింది.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే!బ్యాంకు ఎండీ సీఈవో సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘యూనివర్సల్ బ్యాంక్గా కార్యకపాలు నిర్వహించుకునేందుకు ఆర్బీఐ నుంచి సూత్రప్రాయంగా ఆమోదం పొందడం ద్వారా చరిత్ర సృష్టించాం. వ్యాపార విస్తరణ సామర్థ్యాన్ని పెంచుకోవడమే కాకుండా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం’ అన్నారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత మళ్లీ ఆర్బీఐ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వడం ఇదే తొలిసారి. అంతక్రితం 2014 ఏప్రిల్లో బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్ (ప్రస్తుతం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్)లకు ఆర్బీఐ బ్యాంకింగ్ లైసెన్స్ మంజూరు చేసింది. -
ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 47% అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 12.4 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో నమోదైన 8.43 బిలియన్ డాలర్లతో పోలిస్తే 47 శాతం పెరిగాయి. ఇండియా సెల్యులార్, ఎల్రక్టానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మొబైల్ ఫోన్స్ ఎగుమతులు 55 శాతం పెరిగి 4.9 బిలియన్ డాలర్ల నుంచి 55 శాతం వృద్ధితో 7.6 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. మొబైల్యేతర ఎల్రక్టానిక్స్ సెగ్మెంట్ 3.53 బిలియన్ డాలర్ల నుంచి 37 శాతం పెరిగి 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ విభాగంలో సోలార్ మాడ్యూల్స్, స్విచి్చంగ్.. రూటింగ్ పరికరాలు, చార్జర్ అడాప్టర్లు, ఇతర విడిభాగాలు మొదలైనవి ఉన్నాయి. వీటితో పాటు ఐటీ హార్డ్వేర్, వేరబుల్స్, హియరబుల్స్, కన్జూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఈఏ చైర్మన్ పంకజ్ మహీంద్రూ చెప్పారు. విడిభాగాలు, సబ్–అసెంబ్లీస్ నుంచి తుది ఉత్పత్తుల వరకు వేల్యూ చెయిన్వ్యాప్తంగా అంతర్జాతీయంగా పోటీపడగలిగేలా భారతీయ బ్రాండ్లు మరింతగా ఎదగాల్సి ఉంటుందని మహీంద్రూ చెప్పారు. దశాబ్దకాలంలో దేశీయంగా మొత్తం ఎల్రక్టానిక్స్ ఉత్పత్తి 31 బిలియన్ డాలర్ల నుంచి 133 బిలియన్ డాలర్లకు ఎగిసింది. 50 బిలియన్ డాలర్ల అంచనాలు.. క్యూ1 తరహాలోనే జోరు కొనసాగితే 2026 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు 46–50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండొచ్చని ఐసీఈఏ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇవి 29.1 బిలియన్ డాలర్ల నుంచి 38.6 బిలియన్ డాలర్లకు పెరిగాయి. -
‘టారిఫ్’ రంగాలకు చేయూత!
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల ప్రభావం తీవ్రంగా ఉండే పరిశ్రమలకు ఊరటనివ్వడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద రసాయనాలు, టెక్స్టైల్స్లాంటి రంగాలకు చేయూతనిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ రెండు రంగాల ఎగుమతిదార్లతో భేటీ అయిన సందర్భంగా టారిఫ్ల ప్రభావాలు, సహాయక చర్యలకు అవకాశాలు తదితర అంశాల గురించి వాణిజ్య శాఖ చర్చించినట్లు వివరించాయి.కేంద్ర బడ్జెట్లో రూ. 2,250 కోట్లతో ప్రతిపాదించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కింద టారిఫ్ ప్రభావిత రంగాలకు తోడ్పాటు అందించే విషయాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ మిషన్ కింద చిన్న–మధ్య తరహా సంస్థలు, ఈ–కామర్స్ ఎగుమతిదార్లకు సులభ రుణ పథకాలు, విదేశాల్లో వేర్హౌసింగ్ సదుపాయాల కల్పన, ఎగుమతి అవకాశాలను దక్కించుకునేందుకు గ్లోబల్ బ్రాండింగ్కి సహాయం అందించడం మొదలైనవి ఉంటాయని అంచనా. అమెరికాకు టెక్స్టైల్స్ ఎగుమతులు 11 బిలియన్ డాలర్లుగా, రసాయనాల ఎగుమతులు సుమారు 6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వస్త్రాలు, రత్నాభరణాలు, రొయ్యలు, లెదర్.. ఫుట్వేర్, రసాయనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, మె కానికల్ పరికరాలు మొదలైన రంగాలపై 50% టారిఫ్ల ప్రభావం గణనీయంగా ఉండనుంది. సంస్కరణలకు జీజేఈపీసీ విజ్ఞప్తి.. సుంకాల భారం తగ్గేలా తక్షణం పాలసీపరమైన సంస్కరణలు చేపట్టాలని కేంద్రాన్ని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి జీజేఈపీసీ కోరింది. డ్యూటీ డ్రాబ్యాక్ స్కీము, మార్కెట్ డైవర్సిఫికేషన్ కోసం ఆర్థిక సహాయం అందించడంలాంటి చర్యలు పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. కట్, పాలిష్డ్ డైమండ్లలో సగం ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయని, భారీ టారిఫ్ల వల్ల మొత్తం పరిశ్రమ స్తంభించిపోయే ముప్పు ఏర్పడిందని జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బతింటాయని వివరించారు. తక్కువ టారిఫ్లు ఉండే టర్కీ, వియత్నాలాంటి దేశాలతో అమెరికా మార్కెట్లో భారత్ పోటీపడటం కష్టతరమవుతుందని భన్సాలీ చెప్పారు. దీన్ని పరిష్కరించకపోతే, అమెరికాకు కీలక సరఫరాదారుగా భారత్కి ఉన్న హోదా పోతుందని వివరించారు. అయితే, టారిఫ్ల ఎఫెక్ట్ను పక్కన పెడితే దేశీయంగా ప్రస్తుతం 85 బిలియన్ డాలర్లుగా ఉన్న మార్కెట్, వచ్చే రెండేళ్లలో 130 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందనే అంచనాలు పరిశ్రమకు కాస్త ఊరటనిచ్చే విషయమని భన్సాలీ చెప్పారు. అమెరికాకు భారత్ నుంచి రత్నాభరణాల ఎగుమతులు దాదాపు 10 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. -
భారత్పై ట్రంప్ టారిఫ్స్: ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' విధించిన సుంకాలు.. దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనిపై స్పందిస్తూ.. దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) కీలక సూచనలు చేశారు.రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న కారణంగా.. భారతీయ వస్తువులపై అదనంగా 25 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు. దీంతో అమెరికా మనదేశం మీద విధించిన సుంకం మొత్తం 50 శాతానికి చేరింది. టారిఫ్ల గురించి ఆందోళన చెందకుండా.. దీన్ని ఒక అవకాశంగా మల్చుకోవడం ఎలా అనే అంశంపై దృష్టి సారించే ప్రయత్నాలు చేయాలని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.1991 నాటి ఫారెక్స్ సంక్షోభం ఎలాగైతే ఆర్థిక సరళీకరణకు దారి తీసిందో.. అదే విధంగా ఈ టారిఫ్ల మథనంలో మనకు తప్పకుండా అమృతం దక్కుతుందని ఆనంద్ మహీంద్రా అన్నారు. దీనికోసం రెండు బలమైన అడుగులు వేయాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు.వ్యాపారాలను మెరుగుపరచాలిభారతదేశంలో పెరుగుతున్న సంస్కరణలకు మించి అన్ని పెట్టుబడి ప్రతిపాదనలకు సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను సృష్టించాలి. ప్రపంచ పెట్టుబడులకు మన దేశాన్ని వేదికగా మార్చాలి. అప్పుడే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితుంది.సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెట్టుబడులను వేగవంతం చేయాలి. వీటికి కావలసిన ప్రోత్సాహకాలను అందించాలి. దిగుమతి సుంకాలను క్రమబద్దీకరించాలి. పోటీతత్వాన్ని మెరుగు పరచాలని, మన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవడానికి కృషి చేయాలి.పర్యాటక రంగాన్ని మెరుగుపరచాలిపర్యాటకం అనేది విదేశీ మారకం. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం వీసా ప్రాసెసింగ్ను వేగవంతం చేయాలి. పర్యాటక సౌకర్యాలను మెరుగుపరచాలి. ఇప్పటికే ఉన్న హాట్స్పాట్ల కారిడార్లను నిర్మించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం చేయాలి. అంతే కాకుండా.. ఇతర ప్రాంతాలు జాతీయ ప్రమాణాలను అనుకరించడానికి మరియు పెంచడానికి ప్రోత్సహిస్తాయి.The ‘law of unintended consequences’ seems to be operating stealthily in the prevailing tariff war unleashed by the U.S.Two examples:The EU may appear to have accepted the evolving global tariff regime, responding with its own strategic adjustments. Yet the friction has… pic.twitter.com/D5lRe5OWUa— anand mahindra (@anandmahindra) August 6, 2025 -
భారత్ ఆర్థిక వృద్ధి బలంగా ఉంది.. కానీ..: ట్రంప్ సుంకాలపై ఆర్బీఐ చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాపై మరోసారి 25 శాతం సుంకాలను ప్రకటించారు. త్వరలోనే కొత్త టారిఫ్ అమల్లోకి రానుంది. ఈ తరుణంలో.. ఈసారి కూడా రెపో రేటును యథాతథంగా 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ 'సంజయ్ మల్హోత్రా' చెప్పారు.అమెరికా సుంకాల ప్రభావం మన దేశం ఆర్ధిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపుతాయని చాలామంది భావిస్తున్నారు. అయితే భారత్ వృద్ధిపై వాటి ప్రభావాన్ని అంచనా వేయండం కొంత కష్టమని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. ఎందుకంటే దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. సుంకాల ప్రభావం వాణిజ్య సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.భారతదేశ ఆర్ధిక వ్యవస్థ బలంగా ఉన్నప్పటియికీ.. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితులు వంటివన్నీ దేశాభివృద్ధికి కొంత ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో.. భారత ఆర్థిక వ్యవస్థ తన సముచిత స్థానాన్ని సాధించడానికి ప్రయత్నిస్తోంది. దీనికి దేశంలోని అన్ని రంగాలు కీలకని ఆయన అన్నారు.ఇదీ చదవండి: భారత ఆర్థిక మూలాలు పటిష్టం: డెలాయిట్ ఇండియాడెడ్ ఎకానమీ కాదు..భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తగిన బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తోంది. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతంగా ఉంటే, భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావించారు. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో అమెరికా వాటా 11 శాతంగా ఉంటే, భారత్ 18 శాతం సమకూరుస్తోంది. ఇదే పనితీరును ఇక ముందూ కొనసాగిస్తామని సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. -
రేట్ల కోతకు బ్రేక్!
ముంబై: వరుసగా మూడు సమీక్షల్లో కీలక రేట్లను తగ్గిస్తూ వచ్చిన ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఈ సారి ఆచితూచి వ్యవహరించింది. కీలకమైన రెపో రేటును (ఆర్బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే నిధులపై వసూలు చేసే రేటు) 5.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన గల ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. రివర్స్ రెపో రేటును (బ్యాంకుల నుంచి ఆర్బీఐ తీసుకునే నిధులపై రేటు) సైతం 3.35 శాతం వద్దే కొనసాగించింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న అస్పష్ట వాణిజ్య విధానాలకు తోడు టారిఫ్ల పట్ల అనిశ్చితులు కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటికే పలు విడతలుగా రేట్లను తగ్గించగా ఇది పూర్తి స్థాయిలో బదిలీ కావాల్సి ఉండడం, ద్రవ్యోల్బణం రిస్క్ను దృష్టిలో పెట్టుకుని రేట్ల పరంగా యథాతథ స్థితిని కొనసాగించడమే ఉత్తమమని భావించింది. ద్రవ్య పరపతి విధానం పరంగా తటస్థ వైఖరినే (న్యూట్రల్) కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) ద్రవ్యోల్బణం మొత్తం మీద 3.7 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను 3.1 శాతానికి తగ్గించింది. అలాగే, జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం అంచనాలో ఎలాంటి మార్పు చేయలేదు. ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాం.. రుతుపవన ఆధారిత వర్షాలు అనుకున్న విధంగా కొనసాగుతుండడం, పండుగల సీజన్ సమీపిస్తుండడం ఆర్థిక వ్యవస్థకు జోష్నిస్తాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచ క్రమంలో బలమైన మూలాలు, సౌకర్యవంతమైన ఫారెక్స్ మిగులు నిల్వలు కలిగి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థకు మధ్యకాలానికి ఉజ్వల అవకాశాలున్నట్టు చెప్పారు. అన్ని రకాల డేటాను గమనిస్తూ అవసరమైతే రేట్లపై తగిన నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ‘‘అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లతో కూడిన వాతావరణంలో భారత ఆర్థిక వ్యవస్థ ధరల స్థిరత్వంతో, నిలకడైన వృద్ధి పథాన్ని కొనసాగించింది. ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావడంతో వృద్ధికి మద్దతుగా పరపతి విధానాన్ని చక్కగా వినియోగించుకున్నాం. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య నాలుగు నెలల్లోనే రెపో రేటును ఒక శాతం తగ్గించాం. వ్యవస్థలో రేట్ల బదలాయింపు ఇంకా కొనసాగుతోంది’’అని చెప్పారు. రేట్ల తగ్గింపు పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే అప్పుడు రుణ వితరణ పుంజుకోవచ్చన్నారు. గృహ రుణ విభాగం 14 శాతం వృద్ధితో మెరుగైన పనితీరు చూపిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతమున్న తీవ్ర అనిశ్చితుల్లో రూపాయి ఆల్టైమ్ కనిష్టానికి పడిపోవడం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఏడాది చివర్లో ద్రవ్యోల్బణం పైపైకి.. ఏడాది చివర్లో ద్రవ్యోల్బణం కొంత పెరిగే అవకాశాలున్నట్టు మల్హోత్రా చెప్పారు. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం క్యూ4లో (2026 జనవరి–మార్చి) 4 శాతం పైకి చేరుకోవచ్చు. విధానపరమైన చర్యల మద్దతుతో (రేట్ల కోత) డిమాండ్ పెరగడం ఇందుకు దారితీయొచ్చు’’అని అభిప్రాయపడ్డారు.అకౌంట్, లాకర్ క్లెయిమ్ సులభతరం బ్యాంక్ ఖాతాలు, లాకర్ల క్లెయిమ్ ప్రక్రియను ప్రామాణీకరించనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు. మరణించిన కస్టమర్ల తరఫున నామినీ సులభంగా క్లెయిమ్ చేసుకోవడం దీని లక్ష్యమని చెప్పారు. ట్రెజరీ బిల్లుల్లో రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా పెట్టుబడులు పెట్టుకునేందుకు వీలుగా ఆర్బీఐ రిటైల్–డైరెక్ట్ ప్లాట్ఫామ్ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు.పాలసీ ముఖ్యాంశాలు.. → యథాతథ స్థితికి అనుకూలంగా ఎంపీసీలోని ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. → రెపో రేటును ఐదేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు ( పావుశాతం) తగ్గించి 6.25 శాతం చేయగా, ఏప్రిల్లో మరో పావు శాతం కోతతో 6 శాతానికి దిగొచ్చింది. జూన్లో అర శాతం కోతతో 5.5 శాతానికి పరిమితమైంది. → రివర్స్ రెపో రేటు 3.35 శాతంలోనూ ఎలాంటి మార్పులేదు. → తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష సెప్టెంబర్ 29– అక్టోబర్ 1 మధ్య నిర్వహించనున్నారు. డెడ్ ఎకానమీ కాదు.. సంజీవని భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీ (నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థ) అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తగిన బదులిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు చూపిస్తోందంటూ.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అమెరికా కంటే భారతే దన్నుగా నిలుస్తున్నట్టు చెప్పారు. 2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3 శాతంగా ఉంటే, భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతంగా ఉంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలను ప్రస్తావించారు. ‘‘అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిలో అమెరికా వాటా 11 శాతంగా ఉంటే, భారత్ 18 శాతం సమకూరుస్తోంది. ఇదే పనితీరును ఇక ముందూ కొనసాగిస్తాం’’అని చెప్పారు. భారత వృద్ధి ఆకాంక్షలు 6.5 శాతం కంటే అధికంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. గతంలో ఏటా సగటున 7.8 శాతం వృద్ధిని నమోదు చేయడాన్ని గుర్తు చేశారు. -
త్వరలో యూఎస్ కొత్త వీసా బాండ్ పైలట్ ప్రోగ్రామ్
యునైటెడ్ స్టేట్స్ నిర్దిష్ట దేశాల నుంచి కొంతమంది వీసా దరఖాస్తుదారులకు 12 నెలల వీసా బాండ్ పైలట్ కార్యక్రమాన్ని అమలు చేయాలని చూస్తుంది. వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని నిబంధనలు ఉపయోగించుకుంటూ, ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని కట్టడి చేసేందుకు ఆగస్టు 20, 2025న ఈ ప్రోగ్రామ్ను అమల్లోకి తేనున్నారు. దీని ప్రకారం..నిర్దిష్ట దేశాలకు చెందిన బీ-1 (వ్యాపారం), బీ-2 (పర్యాటక) వీసా దరఖాస్తుదారులు రిఫండబుల్ బాండ్ సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు పుట్టిన దేశాన్ని బట్టి ఈ బాండ్ కోసం 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాలి. పెరుగుతున్న వలసలు, జాతీయ భద్రతపై ప్రమాదాన్ని గుర్తించి వీసా నిబంధనల్లో ఈ మేరకు మార్పులు చేశారు.ఈ నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే దేశాలుఈ 12-నెలల వీసా బాండ్ పరిధిలోకి వచ్చే దేశాల వివరాలను ప్రాథమికంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.1. మలావి: ఈ దేశంలోని వారు బీ-1, బీ-2 కింద యూఎస్ వెళ్లాలంటే 15,000 డాలర్ల వరకు బాండ్ తీసుకోవాలి.2. జాంబియా: 15,000 డాలర్ల వరకు బాండ్ అవసరం.అమెరికా కొత్త వీసా ప్రోగ్రామ్ పరిధిలో ప్రస్తుతానికి భారత్ ఈ జాబితాలో లేదు. ఏదేమైనా ఈ పైలట్ ప్రోగ్రామ్లోని అంశాలను పరిగణించి క్రమంగా ఈ విధానాన్ని ఇతర దేశాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు యూఎస్ అధికారులు సూచించారు.ఈ బాండ్ ఎలా పని చేస్తుంది?వీసా ఓవర్ స్టే(అధిక కాలంపాటు యూఎస్లో నివసించడం)ను నిరోధించడానికి, ప్రయాణీకులు వారి వీసా నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు ఈ బాండ్ వ్యవస్థను రూపొందించారు. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కింద తెలుసుకుందాం.వీసా అప్రూవల్ తర్వాతే బాండ్ అవసరం అవుతుంది. దరఖాస్తుదారులు యూఎస్ ట్రెజరీ Pay.gov ప్లాట్పామ్ ద్వారా బాండ్ చెల్లింపులు చేయాలి.దరఖాస్తుదారులు తమ పుట్టిన దేశాన్ని బట్టి 5,000 డాలర్ల నుంచి 15,000 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.వీసా నిబంధనలు పాటిస్తూ, వీసా గడువు ముగియకముందే అమెరికాను వీడే ప్రయాణికులకు బాండ్ పూర్తి రీఫండ్ లభిస్తుంది.వీసా హోల్డర్ తమ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే (అనధికార ఉద్యోగం లేదా వారి వీసా పరిధినిదాటి కార్యకలాపాలు సాగిస్తే) బాండ్ జప్తు చేసుకుంటారు.ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయాణికులు నిర్దేశిత విమానాశ్రయాల ద్వారానే యూఎస్లోకి ప్రయాణం సాగించాలి.బోస్టన్ లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయం (బీఓఎస్)న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయం (జేఎఫ్కే)వాషింగ్టన్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐఏడీ)భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..ఓవర్ స్టే పరిమితంగానే..ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులు పరిమితంగానే ‘ఓవర్ స్టే రేట్లు’ కలిగి ఉన్నారని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) గుర్తించింది. బాండ్ అవసరాలకు సంబంధించి భవిష్యత్తు నిర్ణయాలను ఈ డేటా ప్రభావితం చేస్తుంది.భవిష్యత్తు విస్తరణఈ కార్యక్రమం పైలట్ పీరియడ్లో భారతదేశాన్ని చేర్చలేదు. అయితే ఇది శాశ్వతం మాత్రం కాదు. భారతీయ బీ -1 / బీ -2 దరఖాస్తుదారులు త్వరలో బాండ్ చెల్లించాలని కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆర్బీఐ బ్రేక్అసలు యూఎస్ సమస్య ఏంటి?వీసాపై యూఎస్ వచ్చి వ్యవస్థలోని ఏదో కారణాలతో అక్కడే తిష్టవేస్తున్న వారి సంఖ్య(ఓవర్ స్టే) పెరుగుతోంది. ఇది అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. 2023లో యూఎస్లోకి వచ్చి అక్కడే నిలిచిపోతున్న వారి సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. చాలా ఓవర్ స్టేలు హానికరం కానప్పటికీ, కొన్ని భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తాయి. వాటిని ట్రాక్ చేయడం కష్టం. సందర్శకులు, ఇతరులు సకాలంలో దేశం వదిలి వెళ్లేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ బాండ్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు. బాండ్ రీఫండబుల్.. సందర్శకులకు వీసా నిబంధనలను పాటించేలా చేస్తుంది. -
కీలక వడ్డీ రేట్లు యథాతథం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఈసారి రెపో రేటును మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఇప్పటికే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్లో జరిగిన మానిటరీ పాలసీ సమావేశంలో కీలక వడ్డీరేట్లను 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆగస్టు 4న ప్రారంభమైన ఎంపీసీ 6న ముగిసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అందులోని అంశాలను పేర్కొన్నారు. రెపో రేటును 5.5 శాతం వద్దే స్థిరంగా ఉంచుతున్నట్లు చెప్పారు.స్థిరమైన రేట్లకు కారణాలు..రిటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 2.1 శాతానికి చేరింది. భారతీయ ఎగుమతులపై అమెరికా సుంకాలు సహా మునుపటి కోతలు, ప్రపంచ అనిశ్చితుల ప్రభావాన్ని అంచనా వేయాలని ఆర్బీఐ భావిస్తుంది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో లోన్ ఈఎంఐలు ప్రస్తుతానికి నిలకడగా ఉండే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ వృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.ఆర్బీఐ పూర్వ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలం ముగిసిన అనంతరం, సంజయ్ మల్హోత్రా గత డిసెంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తనకు నాలుగో ద్రవ్య విధాన కమిటీ సమావేశం. తాను పదవి చేపట్టిన తర్వాత ముందుగా ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో రెపో రేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్లోనూ మరోసారి అందరూ అంచనా వేసినట్లుగానే ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. జూన్లోనూ మరో 50 బేసిస్ పాయింట్లు కోత విధించింది. దీంతో బెంచ్మార్క్ రుణ రేటు 5.5 శాతానికి చేరింది.ఇదీ చదవండి: ఆస్తిలో అంబానీనే మించిన 20 ఏళ్ల యువకుడురెపో రేటు అంటే..రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. రెపో రేటు పూర్తి రూపం రీపర్చేజ్ అగ్రిమెంట్ లేదా రీపర్చేజింగ్ ఆప్షన్. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యోల్బణం మార్కెట్పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపో రేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తాయి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు నెలవారీ వాయిదాల (ఈఎంఐ) భారం తగ్గుతుంది. ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ముఖ్యాంశాలు..సీపీఐ ద్రవ్యోల్బణం 2026 ఆర్థిక సంవత్సరంలో 3.1 శాతంగా అంచనా.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా అంచనా.గ్రామీణ వినియోగం నిలకడగా ఉంది.ప్రధాన ద్రవ్యోల్బణం 4 శాతం మార్కును తాకింది.జాగ్రత్తతో కూడిన విధానంపాలసీ రెపో రేటును 5.50 శాతంగా కొనసాగించాలని ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం కొనసాగుతున్న ప్రపంచ అనిశ్చిత వాతావరణాన్ని ఎదుర్కోవడంలో విశ్వాసపూరితమైన, జాగ్రత్తతో కూడిన విధానాన్ని సూచిస్తోంది. ధరల ఒత్తిళ్ల నేపథ్యంలో సీపీఐ ద్రవ్యోల్బణం 3.1 శాతానికి తగ్గడం స్వాగతించదగిన అంశం. ఇది దీర్ఘకాలిక మూలధన ప్రణాళికకు తోడ్పడుతుంది. బయటి నుంచి వాణిజ్య చర్చలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ స్థిరమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ నేతృత్వంలోని మూలధన వ్యయాలు గణనీయమైన పెట్టుబడి అవకాశాలను ప్రేరేపిస్తున్నాయి.- శ్రీనివాసన్ వైద్యనాథన్, ఆపరేటింగ్ పార్టనర్, ఎస్సార్ క్యాపిటల్వ్యూహాత్మక విరామంఆర్బీఐ నిర్ణయాన్ని పూర్వపు వడ్డీ రేట్ల తగ్గింపుల ప్రభావం జనానికి చేరేలా చేయడం కోసం తీసుకున్న వ్యూహాత్మక విరామంగా చూడవచ్చు. 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి ప్రకటించిన 4.9 శాతం సీపీఐ అంచనా ద్రవ్యోల్బణ అంచనాలను నిలకడగా ఉంచాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. పెరిగిన వాస్తవ ధరలు, స్థిరమైన "తక్కువ రేట్లు ఎక్కువ కాలం" విధానం రానున్న కాలంలో మెరుగైన పనితీరును సమర్థిస్తుంది.- అనురాగ్ మిట్టల్, యూటీఐ ఏంఎంసీ ఫిక్స్డ్ ఇన్కం హెడ్ -
భారత ఆర్థిక మూలాలు పటిష్టం: డెలాయిట్ ఇండియా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, అంతర్జాతీయంగానూ అవకాశాలు విస్తరిస్తున్నాయని చెబుతూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025-26) జీడీపీ వృద్ధి 6.4 - 6.7 శాతం వరకు నమోదు కావొచ్చని తెలిపింది.దేశీ డిమాండ్ బలంగా కొనసాగుతుండడం, ద్రవ్యోల్బణం దిగిరావడాన్ని సానుకూలతలుగా పేర్కొంది. అంతర్జాతీయంగా వాణిజ్య అవకాశాలను పర్యవేక్షిస్తూ.. భౌగోళికపరమైన అనిశ్చితులకు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. యూకేతో వాణిజ్య ఒప్పందానికి తోడు అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతుండడం, ఐరోపా సమాఖ్యతో వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది చివరికి సాకారమయ్యే అవకాశాలు.. ఇవన్నీ భారత వాణిజ్య అవకాశాలను విస్తృతం చేస్తాయని, అధిక ఆదాయం, ఉద్యోగాలు, మార్కెట్ అవకాశాలను, దేశీ డిమాండ్ను పెంచుతాయని వివరించింది.గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉండడం గమనార్హం. అంతర్జాతీయంగా ఆర్థిక కల్లోలిత వాతావరణంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉండడాన్ని ప్రత్యేకమైనదిగా ప్రస్తావించింది. పెద్ద సంఖ్యలో వినియోగదారులు, చౌక మానవ వనరులు ఉండడాన్ని సానుకూలతలుగా డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వాణిజ్య అవకాశాలను పెంచుకునేందుకు భారత్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు డెలాయిట్ ఇండియా తెలిపింది.ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి పాన్ 2.0: పాత కార్డులు రద్దవుతాయా?ఇటీవలి వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకమైనవిగా అభివర్ణించింది. ఏఐ, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణల ఆధారిత స్టార్టప్ విభాగాల్లో సహకారాన్ని ఈ ఒప్పందాలు మరింత బలోపేతం చేస్తాయని విశ్లేషించింది. కాకపోతే ఇటీవలి చోటు చేసుకున్న ప్రాంతీయ భౌగోళిక ఉద్రిక్తతలు, కీలక ఖనిజాలు, ఫర్టిలైజర్స్పై ఆంక్షలు వంటివి వృద్ధి అవకాలను ప్రభావితం చేస్తాయని తెలిపింది. -
సేవల రంగం పనితీరు పటిష్టం
న్యూఢిల్లీ: సేవల రంగంలో కార్యకలాపాలు బలంగా కొనసాగుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ జూలైలో 60.5 పాయింట్లకు చేరింది. ఇది 11 నెలల గరిష్ట స్థాయి. మొత్తం మీద విక్రయాలు పెరగడం, కొత్త ఎగుమతి ఆర్డర్లు రావడం బలమైన పనితీరుకు సాయపడ్డాయి. సేవల రంగం పీఎంఐ జూన్ నెలలో 60.4గా ఉండడం గమనార్హం. 50 పాయింట్లకు పైన నమోదైతే విస్తరణగా, అంతకంటే దిగువన ఉంటే బలహీనపడినట్టుగా భావిస్తారు. సేవల రంగం బలమైన వృద్ధిని నమోదు చేసినట్టు హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు. కొత్త ఆర్డర్లు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్టు చెప్పారు. సేవలకు అంతర్జాతీయంగా బలమైన డిమాండ్ ఉన్నట్టు సర్వీస్ ప్రొవైడర్లు హెచ్ఎస్బీసీ నిర్వహించిన నెలవారీ సర్వేలో చెప్పడం గమనార్హం. ఆసియా, కెనడా, యూరప్, యూఏఈ, యూఎస్ ప్రాంతాల నుంచి కొత్త ఆర్డర్లు వచ్చిన్టటు వెల్లడించారు. ఈ ఏడాదికి మిగిలి ఉన్న కాలంలోనూ మెరుగైన పనితీరు నమోదు చేసే విషయమై సర్వీస్ ప్రొవైడర్లు ఆశావహంగా ఉన్నారు.సామర్థ్యాల పెంపు, మార్కెటింగ్, టెక్నాలజీ ఆవిష్కరణలు, ఆన్లైన్లో సేవల విస్తరణ బలమైన కార్యకలాపాలకు మద్దతుగా నిలుస్తున్నట్టు హెచ్ఎస్బీసీ సర్వే పేర్కొంది. జూన్తో పోల్చి చూస్తే జూలైలో సర్విస్ ప్రొవైడర్లకు వ్యయాలు పెరిగినట్టు తెలిపింది. ‘‘ఉపాధి కల్పన పరిమితంగానే ఉంది. కాకపోతే దీర్ఘకాల సగటుకు అనుగుణంగానే ఉంది. రెండు శాతం కంటే కొంచెం ఎక్కువ కంపెనీలు అదనపు సిబ్బందిని తీసుకున్నాయి. మిగిలిన కంపెనీల్లో జూన్ నుంచి ఎలాంటి మార్పు లేదు’’అని సర్వే వివరించింది. ఇక హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ సూచీ (తయారీ, సేవలతో కూడిన) జూన్లో 61గా ఉంటే జూలైలో 61.1కి చేరింది. -
ఆల్టైమ్ రికార్డ్: ఒక్క రోజులో 70 కోట్లు..
డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చిన తరువాత చిన్న బట్టీ కొట్టు దగ్గర నుంచి, పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ వరకు.. దాదాపు అన్నీ ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ జరిగిపోతున్నాయి. ఇటీవలే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది.గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
మొండి బాకీలు గొడ్డలిపెట్టు
భారత ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)లు అభివృద్ధి చెందాలంటే, స్థూల నిరర్థక ఆస్తులను (జీఎన్ పీఏ)లను తగ్గించాలి. ఆ దిశలో కొంత కృషి జరిగిన మాట నిజమే కానీ మరింత పకడ్బందీగా వ్యవహరించవలసి ఉంది. 2018 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా జీఎన్ పీఏ నిష్పత్తి 11.2 శాతానికి చేరింది. క్రమంగా తగ్గుతూ 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.58 శాతానికి వచ్చింది. బ్యాంకులు అనుసరిస్తున్న మెరుగైన రుణ మదింపు, కఠిన మైన నియంత్రణ పర్యవేక్షణతోటు దేశవ్యాప్తంగా తయారీ, సేవల రంగాల్లో వృద్ధి నమో దవుతుండటంతో ఈ పురోగతి సాధ్యమైంది. ప్రతిసారీ బ్యాలెన్స్ షీట్లను క్లియర్ చేయ డానికి రుణాల రైట్–ఆఫ్ బ్యాంకులకు ఒక సాధనమైంది. అయితే అధిక మొత్తంలో రుణ మాఫీలు సరికాదు. ఇవి జీఎన్ పీఏ గణాంకాలను తగ్గించి, మూలధన వినియోగాన్ని నియంత్రించేలా చేస్తాయి. కస్టమర్లు తీసుకున్న రుణాల్లో బలమైన రికవరీ (వసూలు) లేక పోతే బ్యాంకులు శాశ్వత నష్టాల్లో కూరుకుపో తాయి. దేశంలో నిరర్థక ఆస్తుల రికవరీ ఏటా 10 నుంచి 15% వరకు ఉంటోంది. దానికి తోడు ఏటా కొత్తగా ఎన్ పీఏలు చేరుతున్నాయి. ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు గొడ్డలిపెట్టు.ఆర్బీఐ డేటా ప్రకారం, రూ.1 లక్ష అంత కంటే ఎక్కువ పరిమాణంలోని ఆర్థిక మోసాల విలువ 2025 ఆర్థిక సంవత్సరంలో 36,013 కోట్లకు చేరింది. ఈ పెరుగుదల క్రెడిట్ అండర్ రైటింగ్ (అప్పు ఇచ్చే ముందు బ్యాంకులు పరి గణించే పరామితులు)లో లోపాలను ప్రతిబింబిస్తోంది. గతంలో కంటే మోసాల సంఖ్య తగ్గినా సగటు మోసం చేసే మొత్తం నగదు విలువ అధికంగా ఉంటోంది. ఇది వ్యవస్థాగత బలహీనతను సూచిస్తోంది. దీనికితోడు ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్ఫుల్ డిఫాల్టర్లు) పెరుగుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి భారతీయ బ్యాంకులు 1,629 ఉద్దేశపూర్వక ఎగవేతదారులను నివేదించాయి. వీరి మొత్తం రుణం రూ. 1.62 లక్షల కోట్లుగా తెలిపాయి. వీరిపై అనేక సంద ర్భాల్లో చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నా రికవరీ మందకొడిగా ఉంది. ఈ దీర్ఘకాలిక సమస్యను తగ్గించడానికి కఠిన చర్యలు అవసరం. రియల్ టైమ్ అనలిటిక్స్, ఏఐ ఆధారిత నిఘా, ఆడిట్ ఇంటిగ్రేషన్ ద్వారా పెద్దమొత్తంలో మోసాలను తగ్గించవచ్చు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును రికవరీ చేయడా నికి, భవిష్యత్తులో ఎగవేతలను నిరోధించడా నికి కఠిన చట్టాలు అవసరం. బ్యాంకుల కార్పొరేట్, ఎస్ఎంఈ విభాగాల్లో రుణాలు మంజూరు చేసేటపుడు మరింత పకడ్బందీ విధానాలు పాటించాలి.– అల్లపురపు పవన్ కుమార్ -
బక్కచిక్కుతోన్న రూపాయి
రూపాయి మళ్లీ బక్కచిక్కుతోంది. డాలర్ మారకంలో దేశీ కరెన్సీ విలువ సోమవారం 48 పైసలు బలహీనపడి 87.66 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 55 పైసలు క్షీణించి 87.73 వద్ద కనిష్టాన్ని తాకింది. వాణిజ్య సుంకాల అనిశి్చతులు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు దేశీ కరెన్సీ కోతకు కారణమయ్యాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడమూ ఒత్తిడిని పెంచిందని నిపుణులు తెలిపారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి 10న రూపాయి 87.95 వద్ద జీవితకాల కనిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: ‘ఏదో అలా బ్రతికేస్తున్నాం.. అంతే..’రూపాయి పతనానికి కారణాలు..1. ఇండియన్ రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర పెరుగుతోంది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గిస్తున్నాయి. జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
అందరికీ ఆర్థిక సేవలకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందరికీ అందించేందుకు, అధికారిక ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేసేందుకు కృషి చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు లిఖిత పూర్వకంగా తెలియజేశారు. 2014లో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) పథకాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పథకం కింద ఎలాంటి బ్యాలన్స్ అవసరం లేని బేసిక్ సేవింగ్స్ ఖాతాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం తెలిసిందే. ఇప్పటికి 55.90 కోట్ల జన్ధన్ యోజన ఖాతాలు ప్రారంభమైనట్టు చెప్పారు. ఆర్థిక సేవల విస్తృతిపై అవగాహన కల్పించేందుకు, బ్యాంక్ ఖాతాల పునర్ కేవైసీ సేవల కోసం బ్యాంక్లు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయని.. జూలై 1న ఇది మొదలు కాగా, సెపె్టంబర్ 30తో ముగుస్తుందన్నారు. -
అమెరికాకు ఎగుమతుల్లో30 శాతం కోత!
న్యూఢిల్లీ: భారత్పై 25 శాతం టారిఫ్లు విధించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) అమెరికాకు ఎగుమతులు 30 శాతం తగ్గి 60.6 బిలియన్ డాలర్లుగా (రూ.5.27 లక్షల కోట్లు) ఉండొచ్చని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అంచనా వేసింది. 2024–25లో అమెరికాకు ఎగుమతులు 86.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ (తక్కువ వడ్డీపై రుణ సాయం)ను పునరుద్దరించాలని ప్రభుత్వానికి సూచించింది. అలాగే, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి, వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడం, కొత్త ఎగుమతిదారులను నమోదు చేయించాలని పేర్కొంది. ఆసియాలో పోటీ ఎగుమతిదేశాలైన వియత్నాంపై 20%, బంగ్లాదేశ్పై 18%, ఇండోనేíÙయా, మలేషియా, ఫిలిప్పీన్స్పై 19%, దక్షిణ కొరియాపై 15% చొప్పున అమెరికా సుంకాలు విధించడం గమనార్హం. కనుక ఈ దేశాలతో పోటీపడడం భారత ఎగుమతిదారులకు కష్టమవుతుందని జీటీఆర్ఐ తెలిపింది. అమెరికా టారిఫ్ల నుంచి ఫార్మాస్యూటికల్స్, ఇంధన ఉత్పత్తులు, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లకు మినహాయింపు ఉంది. కనుక ఇతర ఎగుమతులకు ఒత్తిళ్లు ఎదురవుతాయని పేర్కొంది. గార్మెంట్స్, రత్నాభరణాల పరిశ్రమలకు ఇబ్బందులు గార్మెంట్స్ (వ్రస్తాలు) తయారీదారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అల్లిన, నేత వస్త్రాలపై వరుసగా 38.9%, 35.3% చొప్పున టారిఫ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని.. దీంతో వీటికి సంబంధించి 2.7 బిలియన్ డాలర్ల ఎగుమతులకు ఆటంకాలు ఎదురవుతాయన్నారు. టవల్స్, బెడ్ïÙట్లు వంటి 3 బిలియన్ డాలర్ల టెక్స్టైల్స్ ఎగుమతులు 34% టారిఫ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పాకిస్తాన్, వియత్నాం కంపెనీలకు ఈ విభాగంలో ప్రయోజనం లభిస్తుందన్నారు. అమెరికాకు ఎగుమతి అయ్యే 2 బిలియన్ డాలర్ల రొయ్యల ఎగుమతులపైనా ప్రభావం పడుతుందని చెప్పారు. 10 బిలియన్ డాలర్ల రత్నాభరణాలు 27% టారిఫ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ‘ఇంటరెస్ట్ ఈక్వలైజేషన్ స్కీమ్ను గతేడాది నిలిపివేశారు. రూ.15,000 కోట్ల వార్షిక బడ్జెట్తో దీన్ని తిరిగి ప్రారంభించాలని జీటీఆర్ఐ సూచించింది. ఐదేళ్ల పాటు సబ్సిడీపై రుణాన్ని ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు అందించాలి. దీనివల్ల రుణ వ్యయాలు తగ్గి ఎగుమతిదారుల పోటీతత్వం పెరుగుతుంది’అని శ్రీవాస్తవ వివరించారు. రంగంలోకి దిగిన ప్రభుత్వం అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొనే టెక్స్టైల్స్, కెమికల్స్ తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఓ అధికారి తెలిపారు. స్టీల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, మెరైన్, వ్యవసాయం తదితర రంగాలకు చెందిన ఎగుమతిదారులతో వాణిజ్య శాఖ సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఆర్థిక సాయంతోపాటు చౌక రేట్లపై రుణ సాయాన్ని సమకూర్చాలని ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరారు. -
ఇంత జీఎస్టీ ఎగ్గొట్టారా?
గడిచిన ఐదేళ్లలో (2024-25 ఆర్థిక సంవత్సరం వరకు) సుమారు రూ.7.08 లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం కూడా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పార్లమెంటుకు తెలిపింది.లోక్సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షల కోట్లకు పైగా జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. గత ఐదేళ్లలో గుర్తించిన మొత్తం 91,370 కేసుల్లో జీఎస్టీ ఎగవేత సుమారు రూ.7.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో స్వచ్ఛంద డిపాజిట్ ద్వారా వసూలు చేసిన పన్నులు రూ.1.29 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య 44,938 కేసుల్లో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఐటీసీ మోసం జరిగింది. 2022, 2021 ఆర్థిక సంవత్సరాల్లో జీఎస్టీ ఎగవేతలు వరుసగా రూ.73,238 కోట్లు, రూ.49,384 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఐటీసీ మోసాలు వరుసగా రూ.28,022 కోట్లు, రూ.31,233 కోట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు.2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.32 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించామని, ఇందులో రూ.24,140 కోట్ల నకిలీ ఐటీసీ క్లెయిమ్లు ఉన్నాయని తెలిపారు. 2025 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన 30,056 జీఎస్టీ ఎగవేత కేసులలో సగానికి పైగా లేదా 15,283 కేసులు ఐటీసీ మోసానికి సంబంధించినవి. వీటి ద్వారా రూ .58,772 కోట్ల ఎగవేత జరిగింది. -
ట్రంప్ టారిఫ్ ఆందోళనలు.. త్వరలో మంత్రి భేటీ
భారత టెక్స్టైల్, అప్పారెల్ ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వచ్చే వారం పరిశ్రమ ప్రముఖులతో సమావేశం కానున్నారు. ట్రంప్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశం కీలకంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతదేశపు టెక్స్టైల్ ఎగుమతి మార్కెట్లో భవిష్యత్తులో రాబోయే మార్పులు, వాటిని ఎలా సమర్థంగా నిర్వహించాలో ఈమేరకు చర్చించనున్నారు.అమెరికా టారిఫ్ ముప్పుభారతదేశం మొత్తం వస్త్ర, దుస్తుల ఎగుమతుల్లో యునైటెడ్ స్టేట్స్ సుమారు 25% వాటాను కలిగి ఉంది. యూఎస్ ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్గా నిలుస్తోంది. అమెరికాకు భారత్ చేసే ఎగుమతులపై 25 శాతం సుంకం ప్రకటించడం దేశీయ టెక్స్ టైల్ పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తుంది. ఇది ధరల పోటీతత్వాన్ని, డిమాండ్ను తీవ్రంగా దెబ్బతీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో పరిశ్రమకు నిర్దిష్ట ప్రభుత్వ మద్దతు ఉండాలని కొన్ని కంపెనీల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడానికి, పరిశ్రమ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరించడానికి పరిశ్రమ నాయకులతో జరిగే చర్చలు కొంత ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.యూకే-ఇండియా ఎఫ్టీఏ ఎఫెక్ట్ఇటీవల యూకే-ఇండియా ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్టీఏ) కుదుర్చుకున్న నేపథ్యంలో రాబోయే సమావేశం ఎజెండా టారిఫ్ ఆందోళనలకే పరిమితం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్టీఏ ద్వారా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై కూడా చర్చలు జరగనున్నాయి. తగ్గిన సుంకాలు, సరళీకృత వాణిజ్య విధానాల ద్వారా భారతీయ వస్త్రాలకు యూకే మార్కెట్ను మరింత పెంచాలని భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఆస్తిపాస్తులు గోప్యంగా ఉంచితే అంతే..100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యంప్రభుత్వ మద్దతు, వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందాలతో భారతీయ వస్త్ర, దుస్తుల పరిశ్రమ 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ మైలురాయిని చేరుకోవడానికి కీలక మార్కెట్ల నుంచి అనుకూలమైన విధానాలు అవసరం. అభివృద్ధి చెందుతున్న సరఫరా గొలుసు ధోరణులతో సహా మారుతున్న ప్రపంచ వాణిజ్య డైనమిక్స్ను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. -
ఆర్బీఐ ఎంపీసీ దారెటు..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తదుపరి సమావేశం ఆగస్టు 4-6 మధ్య జరుగుతున్నందున ఈసారి రెపో రేటుపై నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆర్థిక వర్గాల్లో చర్చ సాగుతోంది. గతంలోలాగే రెపో రేటును మరింత తగ్గిస్తారా? లేదా వరుస దూకుడు రేట్లలో కాస్తా విరామం తీసుకుంటారా? అనే సందిగ్ధం నెలకొంది. ఇటీవల జరిగిన సమీక్షల్లో ఇప్పటికే రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించారు.ఈసారి కొంతమంది ఆర్థికవేత్తలు రెపో రేటు తగ్గింపు విషయంలో ఎంపీసీ విరామం తీసుకుంటుందని యోచిస్తున్నారు. గతంలో ఇచ్చిన వెసులుబాటు రేట్ల కోత ఫలితాలు ఆర్థిక వ్యవస్థలో ప్రతిబింబించేందుకు కాసింత సమయం అవసరమని వాదిస్తున్నారు. మరికొందరు అంతర్జాతీయ, దేశీయ అనిశ్చితుల నేపథ్యంలో ఆర్బీఐ ముందుచూపుగా మరోసారి సడలింపు నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.ఆర్థిక అనిశ్చితులు..జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉంది. ఇది ఎంపీసీ లక్ష్యంగా ఉన్న 4% కంటే వరుసగా ఐదో నెలలోనూ తక్కువగానే నమోదైంది. ఇది సెంట్రల్ బ్యాంకుకు కాస్త ఊరటనిచ్చే అంశం. అయితే భారత దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎగుమతి పోటీతత్వం, రూపాయి స్థిరత్వంపై అనిశ్చితిని సృష్టించింది. భవిష్యత్తులో సుంకాలను తగ్గించే చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. విధాన నిర్ణేతలు ఈ పరిణామాలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు: హింటన్ హెచ్చరికఈసారి తీపికబురు ఉండదా?తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చేసిన వ్యాఖ్యలతో రెపో రేటు తగ్గింపులో కాస్త విరామం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మల్హోత్రా మాట్లాడుతూ.. జూన్లో ఎంపీసీ రెపో రేటు విధానంలో పాజిటివ్ నుంచి స్టేబుల్ వైఖరి ఉన్నట్లు తెలిపారు. కేర్ రేటింగ్స్కు చెందిన ఆర్థికవేత్తలు రజనీ సిన్హా, సర్బర్తో ముఖర్జీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ద్రవ్యోల్బణం తగ్గుతుందని ముందే ఊహించి ఆర్బీఐ ఇప్పటికే చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. వృద్ధి ఆందోళనలు తీవ్రమైతే తప్పా మరిన్ని కోతలు విధించే అవకాశం లేదని తెలిపారు. -
ఐటీ బిల్లులో 5 మార్పులు
కేంద్ర ప్రభుత్వం పన్ను వ్యవస్థను సరళంగా.. పారదర్శకంగా మార్చే దిశగా ఒక పెద్ద అడుగు వేసింది. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961 స్థానంలో ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వం 'ఆదాయపు పన్ను బిల్లు - 2025'ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును లోక్సభ సెలెక్ట్ కమిటీకి పంపారు. ఈ బిల్లుపై పరిశీలనలు.. సూచనలతో కూడిన 4,500 పేజీల నివేదికను ప్యానెల్ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించింది.ఇప్పుడు, ఆగస్టు 11న జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే దశాబ్దాల తర్వాత భారతదేశ పన్ను వ్యవస్థలో అతిపెద్ద మార్పు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఆదాయపు పన్ను బిల్లులో 5 ప్రధాన మార్పులుఅధ్యాయాల సంఖ్య: ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం, 1961లో మొత్తం 47 అధ్యాయాలు ఉన్నాయి, ఇవి బహుళ సవరణల కారణంగా చాలా క్లిష్టంగా మారాయి. కొత్త బిల్లులో.. అధ్యాయాల సంఖ్యను కేవలం 23కి తగ్గించారు. దీనివల్ల చదవడం, అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. ఈ మార్పు ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, నిపుణులకు ఉపశమనం కలిగిస్తుంది.పదాల సంఖ్య: పాత చట్టంలో 4.1 లక్షల పదాలు ఉండగా, కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025లో 2.6 లక్షల పదాలు మాత్రమే ఉన్నాయి. ఈ చట్టాన్ని పన్ను సలహాదారులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణంగానే పదాల సంఖ్యను చాలా తగ్గించడం జరిగింది.ఇదీ చదవండి: ‘ఇండియా డెడ్ ఎకానమీ’.. ఏఐ దిమ్మతిరిగే సమాధానంసూత్రాలు & పట్టికలు: కొత్త బిల్లులో, సంక్లిష్టమైన చట్టపరమైన భాషకు బదులుగా, పన్నును సులభంగా లెక్కించగల సూత్రాలు, పట్టికలను ఇవ్వడం జరిగింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు ఎంత పన్ను చెల్లించాలో.. ఎలా చెల్లించాలో అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.వివరణ మరింత సులభం: స్థిరత్వాన్ని కొనసాగించడానికి, పన్ను విధించదగిన ఆదాయం, పన్ను స్లాబ్లు, రాయితీలు వంటి పాత పన్ను సూత్రాలను బిల్లులో అలాగే ఉంచారు. అయితే, వాటి ప్రదర్శన, వివరణ మునుపటి కంటే స్పష్టంగా.. సులభంగా చేసారు.అవసరమైన నిబంధనలు: 1961 చట్టంలో ఇప్పుడు వర్తించని అనేక నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక, పన్ను నిర్మాణం పరంగా అవసరమైనవి మాత్రమే చట్టంలో మిగిలి ఉండేలా కొత్త బిల్లులో అలాంటి నిబంధనలను తొలగించారు. -
ఆర్బీఐ కొత్త ప్రతిపాదన
బ్యాంకులు తమ డిజిటల్ ఛానళ్లపై థర్డ్ పార్టీ (ఇతర సంస్థలకు చెందిన) ఉత్పత్తులను ప్రదర్శించరాదంటూ ఆర్బీఐ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, బ్యాంక్ గ్రూపు సబ్సిడరీలు/జేవీలు/అసోసియేట్లకు సైతం ఇది వర్తించనుంది.రిస్క్ ఆధారిత లావాదేవీల పర్యవేక్షణ, నిఘా యంత్రాంగాన్ని బ్యాంక్లు అమల్లోకి తీసుకురావాలని ముసాయిదా నిబంధనల్లో ఆర్బీఐ పేర్కొంది. కస్టమర్ల లావాదేవీల తీరును అధ్యయనం చేయడం, అసాధారణ లావాదేవీలను పర్యవేక్షించడం లేదా లావాదేవీలకు సంబంధించి కస్టమర్ల ఆమోదాన్ని ముందస్తుగా పొందడం వంటివి కొత్త రిస్క్ నిర్వహణ విధానం కింద ఆర్బీఐ ప్రతిపాదించింది. ఆగస్ట్ 11 వరకు వీటిపై భాగస్వాముల నుంచి సలహా, సూచనలను ఆహ్వానించింది. -
పూర్తిగా వెనక్కి రాని రూ.2,000 నోట్లు
మార్కెట్ నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించి రెండేళ్లు దాటినా.. ఇప్పటికీ రూ.6,017 కోట్ల విలువ చేసేవి వెనక్కి తిరిగి రాలేదు. 2023 మే 19న రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. చట్టపరంగా చెల్లుబాటును రద్దు చేయలేదు. 2023 మే 19 నాటికి వ్యవస్థలో రూ.3.56 లక్షల కోట్ల వలువ చేసే పెద్ద నోట్లు చలామణిలో ఉన్నాయి. 2025 జూలై 31 నాటికి రూ.6,017 కోట్లకు తగ్గిపోయినట్టు ఆర్బీఐ డేటా వెల్లడించింది.ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల పీక నొక్కిన యూఏఐనాడు చలామణిలో ఉన్న మొత్తం రూ.2,000 నోట్లలో 98.31 శాతం వెనక్కి వచ్చినట్లు తెలిపింది. తొలుత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించడం తెలిసే ఉంటుంది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ఇష్యూ ఆఫీసుల వద్ద వీటిని మార్చుకునే అవకాశం ఇప్పటికీ ఉంది. తమ వద్దనున్న 2,000 నోట్లను బ్యాంక్ ఖాతా వివరాలతోపాటు ఆర్బీఐ ఇష్యూ ఆఫీస్కు పోస్ట్ ద్వారా పంపొచ్చు. -
భారత వృద్ధి అంచనాలకు ఫిచ్ కోత
న్యూఢిల్లీ: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 6.4% వృద్ధి నమోదవుతుందన్న గత అంచనాలను సవరిస్తూ.. 6.3 శాతానికి పరిమితం అవు తుందని తాజాగా వెల్లడించింది. అమెరికా టారిఫ్ల ప్రభావం భారత కంపెనీలపై చూపించే ప్రత్య క్ష ప్రభావం తక్కువేనని అభిప్రాయపడింది. ‘‘మౌలిక సదుపాయాల కల్పనపై పెద్ద ఎత్తు్తన ఖర్చు చేస్తుండడం సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ (తయారీలో వినియోగించేవి), విద్యుత్, పెట్రో లి యం ఉత్పత్తులు, స్టీల్, ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలకు సానుకూలిస్తుంది’’అంటూ ‘ఇండియా కార్పొరేట్స్ క్రెడిట్ ట్రెండ్స్’ నివేదికలో ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తాను రేటింగ్ ఇచ్చే భా రత కంపెనీల రుణ కొలమానాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగుపడతాయని, బలమైన ఎ బిటా మార్జిన్లు, అధిక మూలధన వ్యయాలను అధి గమించేందుకు అనుకూలిస్తాయని వివరించింది. టారిఫ్ల ప్రభావం అధిగమించొచ్చు.. భారత కంపెనీలపై అమెరికా టారిఫ్ల కారణంగా పడే ప్రభావం తక్కువేనన్నది ఫిచ్ రేటింగ్ విశ్లేషణగా ఉంది. అమెరికా మార్కెట్లో వీటి ఎక్స్పోజర్ (వ్యాపారం) తక్కువగా ఉండడాన్ని గుర్తు చేసింది. కాకపోతే అధిక సరఫరా పరమైన రిస్క్లు ఎదురుకావొచ్చని పేర్కొంది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై తుది ఫలితం ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది. భారత కంపెనీలు తమ ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం ద్వారా (ఇతర మార్కెట్లకు పెంచుకోవడం) టారిఫ్ల ప్రభావాన్ని అధిగమించగలవని అంచనా వేసింది. భారత్పై 25 శాతం టారిఫ్లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య విస్తృత స్థాయి చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఏకాభిప్రాయ సాధనకు సమయం తీసుకుంటోండడం గమనార్హం. దేశీ మార్కెట్పైనే ప్రధానంగా ఆధారపడే ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, టెలికం, యుటిలిటీలపై టారిఫ్ల కారణంగా ప్రత్యక్ష ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది. టారిఫ్ల అనిశ్చితులు కారణంగా యూఎస్, యూరప్కు ఐటీ, ఆటో ఎగుమతులు 2025–26లో పరిమితంగా ఉండొచ్చంటూ.. అమెరికా విధానంలో మార్పు చోటుచేసుకుంటే ఫార్మా కంపెనీలపైనా ప్రభావం పడొచ్చని అంచనా వేసింది. స్టీల్, కెమికల్స్ అధిక సరఫరాలు భారత మార్కెట్ను ముంచెత్తితే ఆయా రంగాల్లోని కంపెనీలు ధరలపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని, మెటల్స్, మైనింగ్ రంగాల్లో ధరల పరంగా అధిక అస్థిరతలు ఉండొచ్చని తెలిపింది. -
టారిఫ్ల భారం.. సగమే!
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 25 శాతం టారిఫ్లు విధించాలన్న అమెరికా నిర్ణయం వల్ల దాదాపు సగం ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమెరికాకు 86 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు ఉండగా, అందులో 48 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎక్స్పోర్ట్స్పై సుంకాల ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొన్నాయి. టెక్స్టైల్స్/క్లోతింగ్ (10.3 బిలియన్ డాలర్లు), రత్నాభరణాలు (12 బి.డా.), రొయ్యలు (2.24 బి.డా.), లెదర్.. ఫుట్వేర్ (1.18 బి.డా.), రసాయనాలు (2.3 బి.డా.), ఎలక్ట్రికల్.. మెకానికల్ మెషినరీ (9 బిలియన్ డాలర్లు) రంగాలపై ఎక్కువగా ప్రభావం పడుతుందని వివరించాయి. అమెరికాకు 5.33 బిలియన్ డాలర్ల విలువైన అపారెల్ ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఒక ఎగుమతిదారు తెలిపారు. ఫార్మా, ఎల్రక్టానిక్స్ గూడ్స్లాంటి సుమారు సగం పైగా పరిశ్రమలు మినహాయింపు కేటగిరీలో ఉన్నందున మిగతా సగం కేటగిరీలపై ఎఫెక్ట్ పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2024–25లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లుగా (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు) నమోదైంది. ఏపీఐలు, సర్క్యూట్లకు మినహాయింపులు.. ఫినిష్డ్ ఫార్మా ఉత్పత్తులు, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐలు), అలాగే ముడిచమురు, నేచురల్ గ్యాస్, రిఫైన్డ్ ఇంధనాలు, బొగ్గు, విద్యుత్లాంటి ఎనర్జీ ఉత్పత్తులు, కీలకమైన లోహాలు, ఎల్రక్టానిక్స్.. సెమీకండక్టర్లు మొదలైన వాటికి 25 శాతం టారిఫ్ల నుంచి మినహాయింపు ఉంటుందని జీటీఆర్ఐ తెలిపింది. కంప్యూటర్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లాంటివి కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే రవాణాలో ఉన్నవి, ఆగస్టు 7 నాటికల్లా అమెరికాకు చేరేలా ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఉత్పత్తులకు మినహాయింపు ఉంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి.. టారిఫ్ల వల్ల ఫ్యాక్టరీలు మూతబడకుండా నడిపించడానికి, ఉద్యోగులను తీసివేయకుండా ఉండటానికి ఎగుమతిదారులు.. ఉత్పత్తి వ్యయానికన్నా తక్కువకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఏఈపీసీ చైర్మన్ సు«దీర్ సెఖ్రీ తెలిపారు. ఈ నేపథ్యంలో సుంకాలపరమైన ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగుమతిదారులు కూడా ఇతరత్రా మరిన్ని మార్కెట్లకు విస్తరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
యూపీఐ సరికొత్త రికార్డ్
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జూలైలో సరికొత్త రికార్డులకు చేరాయి. 19.47 బిలియన్ లావాదేవీలు (1947 కోట్లు) నమోదైనట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకటించింది. వీటి విలువ రూ.25.08 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది జూలైలో యూపీఐ లావాదేవీల విలువ రూ.20.64 కోట్లతో పోల్చిచే 20 శాతానికి పైగా పెరిగింది. ఈ ఏడాది మే నెలలో నమోదైన 18.67 బిలియన్ లావాదేవీలు (విలువ రూ.25.14 లక్షల కోట్లు) ఇంతకుముందు వరకు గరిష్ట రికార్డుగా ఉంది. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీలు 85 శాతంగా ఉన్నాయి. యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ దేశాల్లోనూ యూపీఐ అందుబాటులోకి రావడం గమనార్హం. యూపీఐపై కొత్త పరిమితులు యూపీఐ నెట్వర్క్పై రద్దీని తగ్గించేందుకు వీలుగా ఎన్పీసీఐ కొన్ని పరిమితులను తీసుకొచ్చింది. బ్యాంక్ ఖాతాలోఎంత బ్యాలన్స్ ఉందన్నది రోజులో 50 సార్ల వరకే పరిశీలించుకోగలరు. ఇంతకుముందు ఈ విషయంలో ఎలాంటి పరిమితి లేదు. యూపీఐ లింక్డ్ అకౌంట్లను సైతం 25 సార్లే చూసుకోగలరు. ఒక మొబైల్ నంబర్కు లింక్ అయి, 12 నెలలకు పైగా ఇనాక్టివ్గా ఉన్న (కార్యకలాపాలు లేని) యూపీఐ ఐడీలు ఇక పనిచేయవు. -
జులైలో జీఎస్టీ వసూళ్లు ఎంతంటే?
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జీఎస్టీ (GST) వసూళ్లు జూలై 2025లో రూ. 1,95,735 కోట్లు. ఇది జూలై 2024తో (రూ.1,82,075 కోట్లు) పోలిస్తే 7.5% పెరుగుదలను సూచిస్తుంది. వరుసగా ఏడవ నెల రూ.1.8 లక్షల కోట్లకు పైన జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.ఏప్రిల్లో స్థూల జీఎస్టీ వసూళ్లు ఆల్టైమ్ గరిష్ఠ స్థాయి రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయి, కానీ మే నెలలో రూ.2.01 లక్షల కోట్లకు తగ్గాయి. జూలైలో నికర దేశీయ ఆదాయం 0.2 శాతం తగ్గింది, నికర మొత్తం వసూళ్లు కేవలం 1.7 శాతం పెరిగి రూ.1.69 లక్షల కోట్లకు చేరుకున్నాయి.ట్రంప్ భారతదేశంపై విధించిన అధిక సుంకాలు.. వృద్ధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ సుంకాల కారణంగా వృద్ధి 0.3 శాతం పాయింట్ల తగ్గుదలను కలిగి ఉంటుందని ఆగస్టు 1న ఆర్థికవేత్తలు గుర్తించారు. భారతదేశానికి కేటాయించిన 25 శాతం సుంకాలు చాలా ఆసియా ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా ఉన్నాయి. -
సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఆర్థిక సంక్షోభం గురించి, బంగారం & వెండి కొనుగోలు గురించి, బిట్కాయిన్లో పెట్టుబడుల గురించి పలుమార్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ ముఖ్యమైన ప్రశ్న అంటూ.. ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్ అవుతోంది.మనం నియంత్రించే రెండు అత్యంత విలువైన ఆస్తులు.. మన సమయం, డబ్బు. వేలాది మంది ప్రజలు సమయాన్ని, డబ్బును తమ బాడీ, మైండ్, స్పిరిట్ కోసం కేటాయిస్తున్నారు. ఇది గొప్ప విషయమే. అయితే 'మీరు మీ సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?' అని తన ఎక్స్ వేదికగా ప్రశ్నింస్తూ.. జాగ్రత్తగా ఉండు అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి ప్రశ్నకు నెటిజన్లు కూడా తమదైన రీతిలో సమాధానాలు ఇస్తున్నారు.At at Ken McElroy’s LIMITLESS Event in Dallas. Thousands of people..great speakers. Priceless. I have leaned a lot….not all of it pleasant. Two most valuable assets we control….our time and our money.Grateful that thousands of people give both their time and their…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 1, 2025 -
పరిశ్రమలకు తగ్గిన బ్యాంకుల రుణ సాయం
ముంబై: పరిశ్రమలకు బ్యాంకుల రుణ సాయంలో వృద్ధి జూన్ 26తో ముగిసిన పక్షం రోజుల్లో 5.5 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 7.7 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆహారేతర పరిశ్రమలకు రుణ సాయం 10.2 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 13.8 శాతం వృద్ధి చెందింది. 41 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డేటా ఆధారంగా ఈ వివరాలను ఆర్బీఐ విడుదల చేసింది.‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) రుణ వితరణ స్థిరంగా పెరుగుతోంది. ప్రధాన రంగాల్లో ఇంజనీరింగ్, నిర్మాణం, టెక్స్టైల్స్కు రుణ వితరణ మెరుగైంది’’అని ఆర్బీఐ తెలిపింది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు సైతం రుణ సాయం నిదానించింది. 6.8 శాతం వృద్ధికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే పక్షం రోజుల్లో ఈ రంగాలకు రుణ వితరణ 17.4 శాతం పెరిగినట్టు ఆర్బీఐ డేటా స్పష్టం చేసింది. సేవల రంగానికి రుణ వితరణ 9.6 శాతం పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 15.1 శాతం వృద్ధితో పోల్చి చూస్తే తగ్గుముఖం పట్టింది. -
17.9 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్తో ముగిసిన తొలి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు రూ.2,80,732 కోట్లుగా నమోదైంది. తొలి త్రైమాసికం చివరికి ద్రవ్యలోటు పూర్తి ఆర్థిక సంవత్సరం అంచనాల్లో 17.8 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీలో 4.4 శాతం మేర ద్రవ్యలోటు (రూ.15.69 లక్షల కోట్లు) ఉంటుందన్నది కేంద్రం అంచనా. ప్రభుత్వ వ్యయాలు–ఆదాయాల మధ్య అంతరమే ద్రవ్యలోటు. జూన్ త్రైమాసికంలో ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం రూ.9.41 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో రూ.5.4 లక్షల కోట్లు పన్నుల రూపంలో, రూ.3.73 లక్షల కోట్లు పన్నేతర మార్గంలో వచ్చింది. రుణేతర పత్రాల రూపంలో రూ.28,018 కోట్లు సమకూరింది. పన్నుల వాటా రూపంలో రాష్ట్రాలకు రూ.3,26,941 కోట్లను కేంద్రం బదిలీ చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే రూ.47,439 కోట్లు పెరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వ వ్యయం జూన్ క్వార్టర్లో రూ.12.22 లక్ష కోట్లుగా నమోదైంది. 2025–26 బడ్జెట్ అంచనాల్లో 24.1 శాతానికి సమానం. వ్యయాల్లో రూ.3.86 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకే వెళ్లింది. సబ్సిడీలపై రూ.83,554 కోట్లు ఖర్చు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూస్తే మూలధన వ్యయాలు 52 శాతం పెరిగాయి. -
ట్రంప్ ‘డెడ్ ఎకానమీ’ వ్యాఖ్యలు తప్పుగా దొర్లినవే...
న్యూఢిల్లీ: భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ తదితర పేరున్న సంస్థలు కీర్తిస్తుంటే.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ (నిర్వీర్యమైనది)గా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. కాకపోతే ఈ వ్యాఖ్యలు తప్పుగా ఉచ్చరించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉండడమే కాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీలు) ఏర్పాటుకు క్యూ కడుతుండడాన్ని గుర్తు చేశారు. భారత్ ఉత్పత్తులపై ఆగస్ట్ 1 నుంచి 25 శాతం టారిఫ్లకు అదనంగా పెనాల్టిలను విధిస్తామంటూ ప్రకటించిన మర్నాడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ‘‘రష్యాతో భారత్ ఏం చేసినా నాకు అవసరం లేదు. నిర్వీర్యమైన తమ ఆర్థిక వ్యవస్థలను (డెడ్ ఎకానమీస్) అవి పరస్పరం మరింత దిగజార్చుకుంటుండడంపైనే నా దృష్టి అంతా’’అని పోస్ట్లో పేర్కొన్నారు. దీనిపై కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా స్పందిస్తూ.. భారత్పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తప్పుగా దొర్లినట్టుగా పేర్కొంది.ఇండియానే ఆధారం.. ‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గ్లోబల్ సౌత్ ప్రధానంగా మారుతోంది. ఇందులో భారత్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. మరోవైపు అభివృద్ధి చెందిన ఒకప్పటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. భారత సంతతి వారి కృషి మూలంగానే ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత సానుకూల వృద్ధిని చూపించగలుగుతున్నాయి’’అని ఈవై ఇండియా ముఖ్య విధాన సలహాదారుడు డీకే శ్రీవాస్తవ తెలిపారు. అధిక యువ జనాభా కలిగిన భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో చురుకైన, చైతన్యవంతమైనదిగా పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 2024 గణాంకాల ప్రకారం భారత్లో సగటు వయసు 28.8 సంవత్సరాలు కాగా, అమెరికాలో ఇది 38.5, యూరప్లో 42.8 సంవత్సరాలుగా ఉంది. సగటు వయసు, వృద్ధి అవకాశాల పరంగా అభివృద్ది చెందిన దేశాలు మరింత వృద్ధాప్యంలోకి చేరుతున్నట్టు శ్రీవాస్తవ అన్నారు. ఐఎంఎఫ్ ఒక రోజు ముందే భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచుతూ ప్రకటించడం గమనార్హం. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాదికి గాను భారత్ 6.3 శాతం వృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంక్ ప్రకటించగా, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) 6.5 శాతంగా అంచనా వేసింది. పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సమాఖ్య (ఓఈసీడీ) సైతం భారత్కు సంబంధించి మెరుగైన అంచనాలను ప్రకటించడం తెలిసిందే. -
ఎగుమతులకు టారిఫ్ల సెగ
భారత ఎగుమతులపై అమెరికా ఎకాయెకిన 25 శాతం టారిఫ్లు ప్రకటించడం దేశీ పరిశ్రమలకు శరాఘాతంగా తగిలింది. దీనితో అమెరికన్ మార్కెట్పైనే ఎక్కువగా ఆధారపడుతున్న రత్నాభరణాలు, టెక్స్టైల్స్, ఫార్మా తదితర పలు పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలు నెలకొన్నాయి. అలాగే పలు రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలకు కూడా కోత పడొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికాకు కనీసం 25 శాతం ఎగుమతులు తగ్గినా, వాణిజ్య ఆదాయాలపరంగా ఏటా 21.75 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు తగ్గడం వల్ల మన రూపాయి మారకం విలువ కూడా క్షీణించే అవకాశం ఉంది. అటు స్టాక్ మార్కెట్లపరంగా చూస్తే ఎగుమతుల ఆధారిత రంగాలకు చెందిన (టెక్స్టైల్స్, జ్యుయలరీ మొదలైనవి) సంస్థల షేర్లు తగ్గొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో మన వాణిజ్యం, టారిఫ్లపై వివిధ రంగాలపై పడే ప్రభావాలపై ఈ ప్రత్యేక కథనం. – బిజినెస్ డెస్క్రత్నాభరణాలు: రత్నాభరణాల పరిశ్రమ మొత్తం ఎగుమతుల్లో 30 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. అగ్రరాజ్యానికి ఎగుమతులు సుమారు 10 బిలియన్ డాలర్లుగా ఉంటున్నాయని రత్నాభరణాల ఎగుమతుల మండలి జీజేఈపీసీ చైర్మన్ కిరీట్ భన్సాలీ తెలిపారు. భారీ స్థాయిలో టారిఫ్లు విధించడం వల్ల వ్యయా పెరిగిపోవడానికి, ఎగుమతుల్లో జాప్యానికి దారి తీస్తుందని, చిన్న స్థాయి వ్యాపారుల నుంచి భారీ తయారీ సంస్థల వరకు అందరిపైనా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఎగుమతులు పడిపోవడం, ఆర్డర్లు రద్దు కావడం, ఎగుమతిదారుల మార్జిన్లు తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని రిద్ధిసిద్ధి బులియన్స్ (ఆర్ఎస్బీఎల్) ఎండీ పృథ్వీ రాజ్ కొఠారీ చెప్పారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 2.3 బిలియన్ డాలర్ల విలువ చేసే రొయ్యలను అమెరికా మార్కెట్కు ఎగుమతి చేసింది. అమెరికాకు మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో ఇది 90 శాతం కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎగుమతులు ఉంటుండటంతో తెలుగువారిపైనా ఈ ప్రభావం పడొచ్చని అంచనా. ఈ విభాగంలో మనతో పోలిస్తే టారిఫ్లు తక్కువగా ఉన్న ఈక్విడార్తో పోటీ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అయితే, బ్రిట న్తో ఇటీవలే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో అమెరికా టారిఫ్ల ప్రభావం కాస్త తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఫార్మా.. మెడికల్ డివైజ్లు.. చౌక జనరిక్స్ ఔష ధాలకు సంబంధించి అమెరికా అవసరాల్లో దాదాపు 47 శాతాన్ని భారత్ తీరుస్తోంది. టారిఫ్లతో ఎగుమతులపై ప్రభావం పడితే భారత ఫార్మా సంస్థల లాభాలు తగ్గుతాయి. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు నెమ్మదిస్తాయని, కొత్త ఔషధాలకు అనుమతులు నిలిచిపోతాయని, అలాగే కొత్త ఆవిష్కరణలపై ఎఫెక్ట్ పడుతుందని భారతీయ మెడికల్ డివైజ్ల పరిశ్రమ సమాఖ్య ఏఐఎంఈడీ ఫోరం కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు. అయితే, టారిఫ్లపరంగా చైనా, భారత్ మధ్య 15–20 శాతం మేర వ్యత్యాసం కొనసాగినంత కాలం మెడికల్ డివైజ్ల పరిశ్రమకు కాస్త సానుకూలంగానే ఉంటుందని పేర్కొన్నారు.ఇంజినీరింగ్ ఉత్పత్తులు.. » గణాంకాల ప్రకారం అమెరికాకు ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు 18.3 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. మన ఉత్పత్తులు ఖరీదుగా మారితే అమెరికన్లు మెక్సికోలాంటి దేశాలవైపు మళ్లొచ్చు. దీనితో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మేకిన్ ఇండియా కార్యక్రమానికి విఘాతం కలగవచ్చు.వ్యవసాయ ఉత్పత్తులు.. » అమెరికాకు మన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు 5.6 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నాయి. సుంకాలతో భారత్ నుంచి ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయి, అమెరికన్లు దిగుమతులను తగ్గించుకోవచ్చు. ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మళ్లొచ్చు. దీనితో రైతులు, ఎగుమతిదార్లపై ప్రభావం పడొచ్చు. ఉక్కు, రసాయనాలు, పెట్రోలియం ఉత్పత్తులు.. అమెరికాకు ఈ ఉత్పత్తుల ఎగుమతులు 8 బిలియన్ డాలర్ల పైగా ఉన్నాయి. టారిఫ్లతో వల్ల వియత్నాం, బ్రెజిల్లాంటి దేశాలు పోటీకి రావడం వల్ల మన దగ్గర ఈ రంగంలోని బడా కంపెనీలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలపైనా ప్రభావం పడుతుంది. మొత్తం ఎగుమతుల్లో అయిదో వంతు వాటాతో భారత్కు అమెరికా కీలకంగా ఉంటోంది. » భారీగా ఉపాధి కల్పించే టెక్స్టైల్స్, వ్యవసాయం, లెదర్, రత్నాభరణాల్లాంటి పరిశ్రమల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో అమెరికా వాటా ఏకంగా 35 శాతంగా నమోదైంది. టారిఫ్లతో ఈ పరిశ్రమలు దెబ్బతింటే, ఉపాధి అవకాశాలపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. రత్నాభరణాల పరిశ్రమలో 1 లక్ష పైగా ఉద్యోగాలపై ప్రభావం పడొచ్చని అంచనా. » గత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ 87 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయగా, 46 బిలియన్ డాలర్ల మేర దిగుమతులు చేసుకుంది. అమెరికాతో వాణిజ్యంలో భారత్కు సుమారు 41 బిలియన్ డాలర్ల మేర మిగులు ఉంది. అటు సర్వీసులపరంగా చూసినా అమెరికాకు 2023లో 36.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయగా, 34 బిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంది. భారత్ పక్షాన సుమారు 2.4 బిలియన్ డాలర్ల మిగులు నమోదైంది. అమెరికన్లకూ ’చేదు’ మాత్రే .. అమెరికా టారిఫ్లు భారత్కి కొంత సమస్యాత్మకమే అయినప్పటికీ, దీర్ఘకాలంలో వాటి ప్రభావం అమెరికన్లపైనే ఎక్కువగా ఉంటుందని నిపుణులు, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలు విధించడం వల్ల, అక్కడ వాటి ధరలు పెరిగిపోయి స్థానికులు మరింతగా వెచ్చించాల్సి వస్తుందని ఫార్మా ఎగుమతి సంస్థల సమాఖ్య ఫార్మెక్సిల్ చైర్మన్ నమిత్ జోషి తెలిపారు. భారీ ఎత్తున, నాణ్యమైన ఔషధాలను చౌకగా అందించే ప్రత్యామ్నాయాలను ఇప్పటికిప్పుడు దొరకపుచ్చుకోవడం పెద్ద సవాలుగానే ఉంటుందని చెప్పారు.ఏయే పరిశ్రమలకు ప్రతికూలం.. టెక్స్టైల్స్/దుస్తులు రత్నాభరణాలు ఫార్మా వాహనాలు, ఆటో విడిభాగాలు ఎల్రక్టానిక్స్/మొబైల్ డివైజ్లు ఇంజనీరింగ్ ఉత్పత్తులు/మెటల్స్ సీఫుడ్/అగ్రి ఎగుమతులుటెక్స్టైల్స్..టారిఫ్ల వల్ల భారతీయ టెక్స్టైల్స్ ఎగుమతిదారులపై గణనీయంగానే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు తెలిపారు. మనతో పోలి స్తే వియత్నాం, ఇండొనేషియాలాంటి దేశాలపై తక్కువ సుంకాలు ఉండటం వల్ల వాటి నుంచి మరింత పోటీని ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొన్నా రు. ఆర్డర్లు రద్దు కావడం, ధర లు తగ్గించాలంటూ ఒత్తిడి పెరగడంలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని ట్రేడ్ ఇంటెలిజెన్స్ సంస్థ సైబెక్స్ ఎగ్జిమ్ సొల్యూషన్స్ తెలిపింది. బంగ్లాదేశ్, వియత్నాంలాంటి దేశా ల నుంచి పోటీ పెరిగి, చిన్న తయారీ సంస్థలపై ఒత్తిడి పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్, జపాన్లాంటి ఇతర మార్కెట్లపై కూడా మరింతగా దృష్టి పెట్టాలని భారతీయ టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య (సీఐటీఐ) సెక్రటరీ జనరల్ చంద్రిమా చటర్జీ చెప్పారు. భారత టెక్స్టైల్స్, దుస్తులకు అమెరికా అతి పెద్ద మార్కెట్గా ఉంటోంది. 17 బిలియన్ డాలర్ల రెడీమేడ్ దుస్తుల ఎగుమతుల్లో 5.6 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు అమెరికాకే ఎగుమతవుతున్నాయి. టెక్స్టైల్స్, అపారెల్ పరిశ్రమ ద్వారా దాదాపు 4.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమ దెబ్బతింటే వీరి ఉపాధిపైనా ప్రభావం పడుతుంది.ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరికరాలు.. టెలికం పరికరాలు, మొబైల్ ఫోన్స్, సర్క్యూట్ బోర్డుల్లాంటి ఉత్పత్తుల ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటున్నాయి. టారిఫ్ల వల్ల చౌకగా లభించే ఎలక్ట్రానిక్స్ విషయంలో మిగతా దేశాలతో భారత్ పోటీ పడే సామర్థ్యం తగ్గుతుంది. దీనితో ఎల్రక్టానిక్స్ ఎగుమతులు నెమ్మదించవచ్చు. -
టారిఫ్లతో జీడీపీపై ఎఫెక్ట్
న్యూఢిల్లీ: ఊహించిన దానికన్నా అధిక స్థాయిలో టారిఫ్లు విధించడంతో పాటు పెనాల్టిలు కూడా వేయాలన్న అమెరికా నిర్ణయంతో భారత స్థూల దేశీయోత్పత్తిపై (జీడీపీ) ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు తెలిపారు. పరస్పరం ప్రయోజనకరంగా ఉండే డీల్ను కుదుర్చుకోవడం ద్వారా భారత్ దీన్ని అధిగమించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ టారిఫ్ల వల్ల ఇరు దేశాల మధ్య అత్యధిక వాణిజ్యం జరిగే ఫార్మా, టెక్స్టైల్స్, లెదర్, ఆటోమొబైల్స్, మెరైన్ ఉత్పత్తుల్లాంటి కీలక రంగాలపై నేరుగా ప్రభావం పడుతుందని ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ప్రాథమికంగా టారిఫ్లను ప్రకటించినప్పుడే 2025–26 జీడీపీ వృద్ధి అంచనాలను 6.2 శాతానికి కుదించగా, తాజాగా పెనాల్టిల పరిమాణాన్ని బట్టి మరింతగా తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, 25% టారిఫ్ల విధింపు దురదృష్టకరమని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానించాయి. దీని వల్ల ఎగుమతులపై ప్రభావం పడుతుందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్ తెలిపారు. టెక్స్టైల్స్ రంగానికి టారిఫ్లు పెను సవాలుగా మారతాయని టెక్స్టైల్ పరిశ్రమ సమాఖ్య సీఐటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. -
రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనం
ముంబై: భారత్పై ఆగస్టు 1 నుంచి జరిమానాతో సహా 25% సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో దేశీయ కరెన్సీ రూపాయి మూడేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. డాలర్ మారకంలో ఏకంగా 89 పైసలు బలహీనపడి 87.80 వద్ద ముగిసింది.2022, డిసెంబర్ 24 (99 పైసలు క్షీణత) తర్వాత రూపాయి ఒకే రోజు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. నెలాఖరున దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సైతం దేశీయ కరెన్సీ కోతకు కారణమయ్యాయి. -
రెండేళ్లపాటు 6.4 శాతం వృద్ధి
న్యూయార్క్: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారత ఆర్థిక వ్యవస్థ పట్ల ఆశావహ అంచనాలను ప్రకటించింది. 2025, 2026 సంవత్సరాల్లో జీడీపీ 6.4 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించిన అంచనాలను ఐఎంఎఫ్ స్వల్పంగా పెంచడం గమనార్హం. ఈ ఏడాదికి సంబంధించి 0.2 శాతం, వచ్చే ఏడాదికి 0.1 శాతం మేర తాజా అంచనాల్లో ఎగువకు సవరించింది. ఈ మేరకు తన తాజా నివేదికను విడుదల చేసింది. బలమైన వినియోగానికి.. ప్రభుత్వ పెట్టుబడులకు చురుకైన సంస్కరణలు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. రానున్న కాలంలో ఈ సానుకూల వృద్ధిని కొనసాగించడం భారత్కు ఎంతో కీలకమని ఐఎంఎఫ్ పరిశోధన విభాగం చీఫ్ డెనిజ్ ఇగాన్ పేర్కొన్నారు. వేగంగా ఉపాధి సృష్టి, నైపుణ్యాల కల్పన ద్వారా వ్యవసాయ రంగంలో అధికంగా ఉన్న కారి్మకులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడంతోపాటు.. మౌలిక వసతులు, వాణిజ్య అడ్డంకులను తొలగించడం భారత్ ముందున్న ప్రాధాన్యతలుగా తెలిపారు. మధ్య కాలానికి భారత్ విద్యపై పెట్టుబడులు పెంచడం, భూ సంస్కరణలు చేపట్టడం, సామాజిక భద్రత కల్పించడం, నిబంధనలు, పాలనా యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించడం కూడా కీలకమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ వృద్ధి అంచనాలూ పెంపు వర్ధమాన దేశాల్లో ఆర్థిక వృద్ధి 2025లో 4.1 శాతం, 2026లో 4 శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇక చైనా ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సైతం 2025 సంవత్సరానికి 0.8 శాతం పెంచి 4.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బలమైన పనితీరుకు తోడు, అమెరికాతో టారిఫ్లు గణనీయ స్థాయి నుంచి తగ్గడాన్ని సానుకూలంగా ప్రస్తావించింది. 2026లో 4.2 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను సైతం స్వల్పంగా పెంచి 2025లో 3 శాతంగా, 2026లో 3.1 శాతంగా ఉంటుందని పేర్కొంది. -
విద్యుత్కు డిమాండ్ అంతంతే..!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో వేసవి ఉష్ణోగ్రతలు మరీ తీవ్రంగా లేకపోవడంతో విద్యుత్కి డిమాండ్ అంతగా ఉండకపోవచ్చని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనా వేస్తోంది. 2025లో విద్యుత్ వినియోగం 4 శాతం స్థాయిలో పెరగవచ్చని ఒక నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే 2025–26 వ్యవధిలో, దశాబ్దకాలంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్కి డిమాండ్ పెరగనున్నప్పటికీ భారత్, చైనాలో మాత్రం ఇది ఓ మోస్తరు స్థాయికి పరిమితం కావచ్చని వివరించింది. ఐఈఏ ప్రకారం భారత్లో గతేడాది విద్యుత్ వినియోగం 6 శాతం పెరగ్గా ఈసారి 4 శాతం స్థాయిలో ఉండనుంది. అలాగే చైనాలో 2024లో వినియోగం 7 శాతం పెరగ్గా ఈ ఏడాది 5 శాతానికి పరిమితం కానుంది. డిమాండ్ నెమ్మదించినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎలక్ట్రిసిటీ వినియోగ వృద్ధిలో ఈ రెండు దేశాల వాటా, గతేడాది తరహాలోనే, 50 శాతానికి పైగా ఉంటుందని ఐఈఏ తెలిపింది. ‘అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల వల్ల భారత్లో పారిశ్రామిక కార్యకలాపాలపై ప్రభావం పడింది. అలాగే వేసవి తీవ్రత కూడా పెద్దగా లేకపోవడం వల్ల 2024తో పోలిస్తే 2025 ప్రథమార్ధంలో విద్యుత్ వినియోగం 1.4 శాతమే పెరిగింది. వేసవి ముగిసిపోయినందున, ఇక సెప్టెంబర్లో డిమాండ్ మెరుగుపడితే, వార్షికంగా సుమారు 4 శాతం మేర వృద్ధి నమోదు కావచ్చు‘ అని ఐఈఏ తెలిపింది. పరిశ్రమలు, సేవల కార్యకలాపాలు పుంజుకుని, ఏసీల అమ్మకాలు కూడా పెరగడం వల్ల 2026లో ఎలక్ట్రిసిటీ డిమాండ్ 6.6 శాతం పెరగవచ్చని పేర్కొంది. -
రేర్ ఎర్త్ ప్రాసెసింగ్లో రాష్ట్రాలూ పాలుపంచుకోవాలి
న్యూఢిల్లీ: రేర్ ఎర్త్ మూలకాలు సహా కీలక ఖనిజాల వెలికితీత, ప్రాసిసెంగ్లో రాష్ట్రాల ప్రభుత్వాలు చురుగ్గా పాలుపంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఒక అధ్యయన నివేదికలో తెలిపింది. ఇది క్రిటికల్ ఖనిజాలకు అదనపు విలువను జోడించే వ్యవస్థపరంగా భారత్ స్వయం సమృద్ధిని సాధించేందుకు, ప్రాంతీయంగా ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని పేర్కొంది. విద్యుత్ వినియోగాన్ని, డివైజ్ల పరిమాణాన్ని తగ్గించగలిగే భౌతిక, రసాయనిక స్వభావాలున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అనేవి నేడు నిర్మాణ, ఎల్రక్టానిక్స్, ఆటోమోటివ్ తదితర రంగాల్లో కీలకంగా మారినట్లు నివేదిక వివరించింది. గత నాలుగేళ్లుగా భారత్ ఏటా సగటున 3.3 కోట్ల డాలర్ల విలువ చేసే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సంబంధిత ఖనిజాలను దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ దిగుమతులు 3.19 కోట్ల డాలర్లకు చేరగా, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ దిగుమతులు మరింత అధికంగా 24.9 మిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. లాంథనం, ల్యూటీషియంలాంటివి రేర్ (అరుదైన) ఎర్త్ మూలకాల కోవకు చెందుతాయి. వాస్తవానికి ఇవి పుష్కలంగా ఉన్నప్పటికీ, వెలికితీత ప్రక్రియ చాలా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో రేర్ ఎర్త్ మూలకాలుగా పరిగణిస్తారు. -
నాలుగు నెలల కనిష్టానికి రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ 21 పైసలు క్షీణించి 4 నెలల కనిష్ట స్థాయి 86.91 వద్ద స్థిరపడింది. డాలర్ బలపడటం, క్రూడ్ ధరల అనూహ్య పెరుగుదల, నెలాఖరున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, దిగుమతిదార్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ‘అమెరికా–భారత్ల మధ్య ఆగస్టు 1న వాణిజ్య ఒప్పంద చర్చలు విఫలమైనా, చర్చలు వాయిదా పడినా దేశీయ కరెన్సీపై అదనపు ఒత్తిడి పడుతుంది. ట్రేడ్ డీల్ కుదిరితే రూపాయి బలపడే వీలుంది. అప్పటిదాకా ఫారెక్స్ ట్రేడర్లు వేచిచూసే ధోరణి ప్రదర్శించవచ్చు’ అని మీరే అసెట్ షేర్ఖాన్ రీసెర్చ్ విశ్లేషకుడు అనుజ్ చౌదరీ తెలిపారు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’రూపాయి పతనానికి కారణాలు..1. ఇండియన్ రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర పెరుగుతోంది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గిస్తున్నాయి. జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. -
ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉంది
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ పనితీరు స్థిరంగానే కొనసాగుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జూన్ త్రైమాసికంలో దేశీ సరఫరా, డిమాండ్ బలంగా ఉన్నట్టు కార్యకలాపాలను పరిశీలిస్తే తెలుస్తున్నట్టు తన నెలవారీ సమీక్షలో పేర్కొంది. ద్రవ్యోల్బణం నియంత్రిత లక్ష్యం పరిధిలోనే ఉండడం, రుతుపవనాల పురోగతి మెరుగ్గా ఉండడంతో దేశీ ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలోకి (జూలై–సెప్టెంబర్) బలంగా అడుగుపెట్టినట్టు తెలిపింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరగకపోయినా.. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూఎస్లో మందగమనం భారత ఎగుమతులపై ప్రభావం చూపించొచ్చని ఆర్థిక శాఖ తన నివేదికలో అంచనా వేసింది. అమెరికా టారిఫ్ల పరంగా అనిశ్చితి అదే పనిగా కొనసాగుతుండడం రానున్న త్రైమాసికాల్లో భారత వాణిజ్య పనితీరును ప్రభావితం చేయొచ్చని తెలిపింది. ప్రైవేటు పెట్టుబడులు, రుణాల్లో వృద్ధి నిదానించడం ఆర్థిక పనితీరు మరింత వేగం పుంజుకోకుండా నియంత్రించొచ్చని అభిప్రాయపడింది. స్థిరమైన ధరల వద్ద ఆర్థిక పనితీరును గమనించినట్టయితే మరింత పటిష్టంగా కనిపిస్తున్నట్టు పేర్కొంది. మొత్తం మీద చూస్తే ఆర్థిక వ్యవస్థ అనుకున్నట్టు సజావుగానే సాగుతోందని అభివరి్ణంచింది. దేశ స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. నిదానించిన రుణ వితరణ ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు పటిష్టంగానే ఉన్నప్పటికీ రుణ వృద్ధి నిదానించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. రుణ గ్రహీతలు ఆచితూచి వ్యవహరించడం లేదంటే రుణ దాతలు రిస్్కకు సిద్ధపడకపోవడం కారణమై ఉండొచ్చని పేర్కొంది. తక్కువ వ్యయాల కారణంగా కార్పొరేట్లు బాండ్ల మార్కెట్లో నిధులు సమీకరణకు మొగ్గు చూపిస్తుండడం కూడా రుణ వృద్ధి నిదానించడానికి ఒక కారణమై ఉండొచ్చని తెలిపింది. ఉపాధి అనుసంధానిత ప్రోత్సాహక పథకం మద్దతుతో కొర్పొరేట్ సంస్థలు పెట్టుబడులతో ముందుకు రావాల్సి ఉందని సూచించింది. -
బ్యాంక్లు.. అడ్డదారులు!
ముంబై: కొన్ని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు తీవ్రమైన పోటీ ఒత్తిళ్ల మధ్య తాత్కాలిక విజయాల కోసం అనైతిక విధానాలను అనుసరిస్తున్నాయంటూ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే ఆరోపించారు. తమిళనాడులోని కరూర్లో ప్రైవేటు బ్యాంక్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లక్ష్యం మంచిదైనప్పుడు దాన్ని సాధించడానికి ఏ పద్ధతి అనుసరించినా మంచిదే’అన్నట్టు సంబంధిత రుణ దాతల యాజమాన్యాలు భావిస్తున్నాయంటూ.. ఆ తరహా విధానాలు బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేస్తాయని హెచ్చరించారు. క్రియేటివ్ అకౌంటింగ్ (నిబంధనల్లో లోపాలను ఆసరాగా చేసుకుని గణాంకాలను సానుకూలంగా పేర్కొంటూ తప్పుదోవ పట్టించడం), నిబంధనలకు కచి్చతంగా కట్టబడకుండా స్వేచ్ఛగా వ్యవహరించడం, అంతర్గతంగా సరైన నియంత్రణలు లేకపోవడం వంటివి కొన్ని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల్లో సాధారణంగా మారిపోయినట్టు చెప్పారు. దీంతో ఆర్బీఐ జోక్యం చేసుకోవాల్సి వస్తోందని స్వామినాథన్ వివరించారు. నైతిక మార్గంలోనే వృద్ధి ప్రక్రియలను అనుసరించడం అవసరమన్నారు. నమ్మకమైన వ్యవస్థలు, బాధ్యతాయుతమైన నాయకత్వం, స్పందించే సేవలతో విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత బ్యాంక్ బోర్డులు, యాజమాన్యాలపై ఉన్నట్టు గుర్తు చేశారు. ఒక బ్యాంక్కు గుర్తింపే పెద్ద ఆస్తి అవుతుందన్నారు. పోటీ పెరిగిపోయి, కస్టమర్ల అంచనాలు విస్తృతమవుతున్న నేపథ్యంలో కస్టమర్ ప్రాధాన్యంగా సేవలు అందించడం ద్వారానే నమ్మకం, విశ్వసనీయతకు తోడు, దీర్ఘకాలంలో విలువ సమకూర్చుకోవడం సాధ్యపడుతుందన్నారు. నియంత్రణపరమైన అవసరాల కోసమని నంబర్లను పెంచి చూపించడం కాకుండా.. ఆర్థిక వనరులను ఏ విధంగా వినియోగిస్తున్నారన్నది ముఖ్యమని సూచించారు. జవాబుదారీగా నడుచుకోవాలి.. కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ, కొత్త ప్రాంతాల్లోకి సేవల విస్తరణ పరంగా సరైన స్పష్టత, సమన్వయం, జవాబుదారీతనం అవసరమని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. డిజిటల్ టెక్నాలజీలను వేగంగా అందిపుచ్చుకుంటున్నట్టే, సైబర్ భద్రత, డేటా నిర్వహణపైనా బలమైన పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని సూచించారు. టెక్నాలజీ అంతరాలను వేగంగా పరిష్కరించకుంటే వ్యవస్థాగత బలహీనతకు దారితీస్తుందని హెచ్చరించారు. -
ఇండియాలో డిజిటల్ చెల్లింపులు జోరు
ముంబై: ఇండియాలో డిజిటల్ చెల్లింపులు ఎప్పటికప్పుడు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆర్బీఐ – డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ (ఆర్బీఐ–డీపీఐ) ఈ ఏడాది మార్చి నెలకు 493.22గా నమోదైంది. దీనికి ఆరు నెలల ముందు.. 2024 సెప్టెంబర్లో ఈ సూచీ 455.5గా ఉండడం గమనార్హం. అంటే డిజిటల్ చెల్లింపుల్లో 10.7% మేర వృద్ధి నమోదైంది. చెల్లింపుల సదుపాయాలు, సరఫరా వైపు అంశాలు ఆర్బీఐ–డీపీఐ సూచీ బలపడేందుకు దారితీసినట్టు ఆర్బీఐ తెలిపంది.ఐదు అంశాల ఆధారంగా చెల్లింపుల తీరును ఆర్బీఐ మదింపు వేస్తుంటుంది. ఇందులో చెల్లింపులు చేసే వారు (25% వెయిటేజీ), చెల్లింపులు సదుపాయాలు – డిమాండ్ వైపు అంశాలు (10%) పేమెంట్ (Payment) సదుపాయాలు – సరఫరా వైపు అంశాలు (15%), చెల్లింపుల పనితీరు (45%), వినియోగదారుల కేంద్రీకరణ 5% చొప్పున వెయిటేజీ కలిగి ఉన్నాయి.విప్రో ఇన్ఫ్రా నుంచి కొత్త బిజినెస్ న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, తయారీ సొల్యూషన్లు అందించే విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీరింగ్ (విన్) తాజాగా కొత్త బిజినెస్ విభాగానికి తెరతీసింది. విప్రో ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ పేరుతో ఏర్పాటు చేసిన విభాగంపై రూ. 500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల(పీసీబీలు) తయారీలో ఉపయోగించే బేస్ మెటీరియల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం కర్ణాటకలో కాపర్ క్లాడ్ లామినేట్(సీసీఎల్) తయారీ యూనిట్ను నెలకొల్పుతున్నట్లు వివరించింది. దీంతో సుమారు 350 మందికి ఉపాధి లభించనుంది.చదవండి: టీసీఎస్ లేఆఫ్స్తో ఆర్థిక ప్రకంపనలుపెగాసిస్టమ్స్ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తమ డెవలపర్ల కోసం ఎక్స్పర్ట్ సర్కిల్స్ సెషన్లను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తమ డెవలపర్లలో 50 శాతం మంది భారత్లో ఉన్నారని, వారు తమ నైపుణ్యాలను మరింతగా పెంచుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని పెగాఇన్నోవేట్ 2025 కార్యక్రమం సందర్భంగా కంపెనీ ఎండీ దీపక్ విశ్వేశ్వరయ్య తెలిపారు. పెగా ప్రధాన టెక్నాలజీలైన బ్లూప్రింట్, యాప్ డిజైన్లాంటి టెక్నాలజీలు తదితర అంశాల గురించి ఈ సెషన్స్లో చర్చిస్తారు. ఒక్కో సెషన్లో 50 మంది వరకు పాల్గొనవచ్చని దీపక్ చెప్పారు. -
క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.67వేల కోట్లు
బ్యాంక్ల్లో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు (కాల వ్యవధి ముగిసిపోయినప్పటికీ వెనక్కి తీసుకోనివి) జూన్ చివరికి రూ.67,003 కోట్లకు చేరాయి. ఇందులో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రూ.58,330 కోట్లు ఉంటే, రూ.8,673.72 కోట్లు ప్రైవేటు బ్యాంకుల పరిధిలోనివి. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు.ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒక్క ఎస్బీఐలోనే అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు రూ.19,330 కోట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీలో రూ.6,910 కోట్లు, కెనరా బ్యాంక్లో రూ.6,278 కోట్లు చొప్పున ఉన్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంకుల్లో రూ.2,063 కోట్లు క్లెయిమ్ లేకుండా పడి ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో రూ.1,609 కోట్లు, యాక్సిస్ బ్యాంకులో రూ.1,360 కోట్ల చొప్పున అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ద్వారా క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని దాదాపు 30 ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఇందులో పొందుపరిచారు.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ సర్వీసుల నిలిపివేతఅన్క్లెయిమ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు ముందుగా..ఉద్గమ్ పోర్టల్(https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login)ను సందర్శించాలి.రిజిస్టర్ బటన్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.ఓటీపీ ద్వారా వెరిఫై చేయాలి.రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి.తర్వాత పేజీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకులను ఎంచుకోవాలి.ధ్రువీకరణ కోసం పుట్టిన తేదీ, ఓటరు ఐడీ, పాస్ పోర్ట్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు వంటి వివరాలు ఇవ్వాలి.ఒకవేళ అన్క్లెయిమ్ డిపాజిట్లు ఉంటే అన్క్లెయిమ్ డిపాజిట్ రిఫరెన్స్ నంబర్ (యూడీఆర్ఎన్) వస్తుంది.ఈ పోర్టల్ ద్వారా ప్రతి బ్యాంకుకు క్లెయిమ్ సూచనలు వెళుతాయి.యూడీఆర్ఎన్ ద్వారా బ్యాంకును సంప్రదించాల్సి ఉంటుంది. -
స్పీడ్ తగ్గిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగం వృద్ధి జూన్లోనూ నిదానించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 4.9 శాతంగా నమోదైంది. వృద్ధి 1.5 శాతానికి పరిమితమైంది. ఇది పది నెలల (2024 ఆగస్ట్ తర్వాత) కనిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ రంగాల్లో పనితీరు ఢీలాపడింది. జూన్ చివర్లో వర్షాలు ఈ రంగాల పనితీరును ప్రభావితం చేశాయి. ఈ మేరకు జూన్ నెలకు సంబంధించి ఐఐపీ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసింది. మే నెలకు సంబంధించిన ఐఐపీ రేటును 1.2 శాతం నుంచి 1.9 శాతానికి సవరించినట్టు ఎన్ఎస్వో ప్రకటించింది. → తయారీ రంగంలో ఉత్పత్తి జూన్లో 3.9 శాతం పెరిగింది. 2024 జూన్లో ఈ రంగంలో ఉత్పత్తి 3.5 శాతం వృద్ధి చెందడం గమనార్హం. → మైనింగ్లో ఉత్పత్తి మైనస్ 8.7 శాతానికి పడిపోయింది. క్రితం ఏడాది ఇదే నెలలో 10.3 శాతం వృద్ధి నమోదైంది. → విద్యుదుత్పత్తి సైతం మైనస్ 2.6 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 8.6 శాతం వృద్ధి నమోదైంది. → క్యాపిటల్ గూడ్స్ విభాగంలోనూ వృద్ధి 3.5 శాతానికి పరిమితమైంది. → కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో వృద్ధి 2.9 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 8.8 శాతంగా ఉంది. → కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్ ఉత్పత్తి మైనస్ 0.4 శాతంగా నమోదైంది. క్రితం ఏడాది జూన్లోనూ మైనస్ ఒక శాతంగా ఉండడం గమనార్హం. → ఇన్ఫ్రా/నిర్మాణ రంగంలో 7.2 శాతం వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఇది 8.2 శాతం వృద్ధిని చూసింది. → ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్)నూ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2 శాతానికి తగ్గింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 5.4 శాతంగా ఉంది.వర్షాల ప్రభావం.. జూన్ రెండో భాగంలో అధిక వర్షాలు మైనింగ్ ఉత్పత్తి, విద్యుత్ రంగాలపై ప్రభావం చూపించినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ తెలిపారు. త్రైమాసికం వారీగా చూస్తే వృద్ధి 11 నెలల కనిష్ట స్థాయికి చేరినట్టు పేర్కొన్నారు. -
అధిక వృద్ధి రేటు సాధ్యమే.. ఎలాంటి సవాళ్లు లేవు
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా వృద్ధి చెందుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) 6.5 శాతానికి పైన వృద్ధిని సాధించే విషయంలో ఎలాంటి సవాళ్లు లేవని ఆర్బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని ఆర్థిక వ్యవస్థల్లోకి భారత్ ఆశాకిరణంలా కొనసాగుతోందన్నారు. ‘‘నిజానికి మూడింట ఒకవంతుకు పైగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థలు ఒత్తిళ్లను, అధిక ధరలు, ఆర్థిక మందగమనంతో సతమతం అవుతున్నాయి. కానీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా దేశీ వినియోగం, దేశీ పెట్టుబడుల ఆధారితంగా నడుస్తోంది. ఎగుమతులపై ఆధారపడడం తక్కువ. కనుక 6.5 శాతం కంటే అధిక వృద్ధి సాధించే విషయంలో నాకు ఎలాంటి సవాళ్లు కనిపించడం లేదు’’అని కుమార్ వివరించారు. ఇదే వేగం కొనసాగుతుందంటూ రానున్న సంవత్సరాల్లో 7–7.5 శాతం వృద్ధి రేటును చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని రేట్ల కోతకు అవకాశం ఉంటుందా? అన్న ప్రశ్నకు.. కేవలం ద్రవ్యోల్బణం నియంత్రణ కాకుండా ఇతర స్థూల ఆర్థిక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని నగేష్ కుమార్ బదులిచ్చారు. యూఎస్తో ఒప్పందం ప్రయోజనకరమే అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం సాకారమైతే కారి్మక ఆధారిత విస్తృతమైన అమెరికా మార్కెట్లో భారత్కు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని నగేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. మనదగ్గర పెద్ద ఎత్తున కారి్మక వనరులు ఉన్నందున భారత్ పోటీతత్వం పెరుగుతుందన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ విషయంలో అమెరికాకు అవకాశాలు కలి్పంచడం పట్ల భారత్కు కొన్ని ఆందోళనలు ఉన్నట్టు ప్రస్తావించారు. -
‘దేశానికి రక్షణ కల్పించండి.. మీ సమస్యలతో మేం పోరాడుతాం’
భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సైనికుల కుటుంబాలకు న్యాయసహాయం అందించనున్నారు. ‘నల్సా వీర్ పరివార్ సహాయతా యోజన 2025’ పేరుతో ఈ కొత్త కార్యక్రమం ద్వారా భారతీయ సైనికులకు సాయం చేయనున్నారు. సొంత ఊళ్లకు దూరంగా దేశం కోసం సేవలందిస్తున్న సైనికులు, తమ కుటుంబ సభ్యులు కొన్నిసార్లు స్థానికంగా న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో దేశం కోసం సుదూర ప్రాంతాల్లో పోరాడుతున్న సైనికులు స్వగ్రామాలకు రావడం కష్టంగా మారుతుంది. అలాంటివారికి, తమ కుటుంబ సభ్యులకు న్యాయసేవ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ సూర్యకాంత్ శ్రీనగర్లో జరిగిన కార్గిల్ విజయ్ దివాస్ సదస్సులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈమేరకు నిర్ణయం తీసుకోవడం సైనికులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుందని నమ్ముతున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో సాయుధ దళాలు చేసిన త్యాగాలను చూసి తీవ్రంగా చలించిపోయానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. న్యాయవ్యవస్థ వారి శ్రేయస్సుకు మరింత ప్రత్యక్షంగా దోహదపడే మార్గాలను అన్వేషిస్తుందన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఈ కార్యక్రమం ఉద్దేశం..సైనికులు విధుల్లో ఉన్నప్పుడు అపరిష్కృత ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాలు, భూ సమస్యలు, ఇతర చట్టపరమైన విషయాల నుంచి ఉపశమనం కలిగించేలా న్యాయసేవ అందిస్తారు.సైనికులు వృత్తిపరమైన కారణాలతో కోర్టుకు హాజరు కాలేకపోయినా, కోర్టులో కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించడానికి నల్సా రంగంలోకి దిగుతుంది.ఇండియన్ ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఇతర పారామిలటరీ బలగాలు దీని పరిధిలోకి వస్తారు.ప్యానెల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లకు సులభంగా అందుబాటులో ఉండేలా రాష్ట్రాల్లోని సైనిక్ వెల్ఫేర్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.కేసు పురోగతిని పర్యవేక్షించడానికి, సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడానికి వీరు తోడ్పాటు అందిస్తారు. -
యూకే కార్బన్ ట్యాక్స్ విధిస్తే ఎలా?
ఇండియా-బ్రిటన్ దేశాల మధ్య దాదాపు 99% వాణిజ్య వస్తువులపై సుంకాలను నియంత్రించేలా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)పై ఇరు దేశాల ప్రతినిధులు అధికారికంగా సంతకాలు చేశారు. అయితే భారత ఎగుమతులపై యూకే ప్రతిపాదిత కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎం) ప్రభావం ఎలా ఉండబోతుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సీబీఏఎం అనేది 2027లో యునైటెడ్ కింగ్డమ్ (యూకే) ప్రవేశపెడుతున్న వాతావరణ సంబంధిత సుంకం. ఇతర దేశాల ఉత్పత్తుల దిగుమతులపై వాటి కర్బన ఉద్గారాల ఆధారంగా పన్ను విధిస్తారు.కార్బన్ పన్నులకు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను ఎఫ్టీఏలో చేర్చలేదు. అయితే భవిష్యత్తులో యూకే కార్బన్ లెవీల ఒప్పందం కింద భారతదేశ వాణిజ్య ప్రయోజనాలపై ప్రభావం చూపితే దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు యూకే నుంచి భారత్ దౌత్య హామీని తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సీబీఏఎంను అమలు చేసేందుకు యూకే ప్రస్తుతం సన్నాహక దశలో ఉంది. ఇది అమల్లోకి వస్తే ప్రధానంగా ప్రభావితం చెందే వస్తువులు కింది విధంగా ఉన్నాయి.అల్యూమినియంసిమెంట్ఎరువులుహైడ్రోజన్స్టీల్ఇదీ చదవండి: హైదరాబాద్లో ప్లాట్ల అమ్మకాలకు అంతా సిద్ధం..ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులు దేశీయ వస్తువుల మాదిరిగానే కార్బన్ నిబంధనలకు లోబడి ఉండేలా చూడటం యూకే లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్టీఏలో సీబీఏఎం సంబంధిత నిబంధనలు చేర్చబడనప్పటికీ భారతదేశ ప్రయోజనాలను పరిరక్షించడానికి ఒక ‘వెర్బల్ నోట్(అధికారిక దౌత్య హామీ)’ని కుదుర్చుకున్నట్లు భారత అధికారులు చెబుతున్నారు. దీనిప్రకారం..‘యూకే సీబీఏఎం భారత ఎగుమతులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తే, ఎఫ్టీఏ కింద మార్కెట్ యాక్సెస్ రాయితీలను హరిస్తే భారత్ తిరిగి సమతుల్యత చర్యలు తీసుకోవచ్చు’ అని సీనియర్ అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘జీఎస్టీ అమల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి’
యూపీఐ లావాదేవీలను మరింత లోతుగా స్క్రూటినీ చేస్తూ, వాటి ఆధారంగా జీఎస్టీని దూకుడుగా అమలు చేస్తే మొదటికే మోసం రావొచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో హెచ్చరించింది. దీనివల్ల చిన్న వ్యాపారులు తిరిగి నగదు లావాదేవీల వైపు వెళ్లిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అలా జరగకుండా జీఎస్టీ అమలు విషయంలో జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.యూపీఐ చెల్లింపుల ఆధారంగా జీఎస్టీ నోటీసులు వస్తుండటంతో, కర్ణాటకలోని చిన్న వ్యాపారులు మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గు చూపుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. పరోక్ష పన్నుల విధానం వల్ల జవాబుదారీతనం, ఆదాయం మరింతగా పెరిగినప్పటికీ, చిన్న ట్రేడర్లపై జరిమానాలు వేయకుండా, వారికి సాధికారత కల్పించినప్పుడే దీర్ఘకాలంలో ఇది విజయవంతం అవుతుందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది.యూపీఐలాంటి డిజిటల్ లావాదేవీల ఆధారంగా బెంగళూరులోని పలువురు చిన్న ట్రేడర్లు, దుకాణదారులకు అసంబద్ధ స్థాయిలో ట్యాక్స్ నోటీసులు రావడాన్ని తన నివేదికలో ప్రస్తావించింది. ఈ అంశంపై కర్ణాటకలోని చిన్న వ్యాపారులు జూలై 23 నుంచి మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను తలపెట్టారు.ఇదీ చదవండి: ప్రతి బీమా సంస్థకు ఒక అంబుడ్స్మన్టాప్ 5 రాష్ట్రాల వాటా 50 శాతం..జీఎస్టీ అమలు, మొత్తం చెల్లింపుదారుల్లో టాప్ 5 రాష్ట్రాల వాటా సుమారు 50 శాతంగా ఉంటోందని నివేదిక పేర్కొంది. చెల్లింపుదారుల్లో మహిళల వాటా (ప్రతి అయిదుగురిలో ఒకరు) పెరుగుతోందని వివరించింది. ప్రస్తుతం 1.52 కోట్ల పైగా గూడ్స్, సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలాంటి రాష్ట్రాలు పెద్దవి, సంపన్నమైనవి అయినప్పటికీ, మొత్తం జీఎస్డీపీలో ఆయా రాష్ట్రాల వాటాతో పోలిస్తే క్రియాశీలక జీఎస్టీ ట్యాక్స్పేయర్ల వాటా తక్కువగానే ఉంటోంది. అదే సమయంలో మొత్తం జీఎస్డీపీలో ఉత్తర్ప్రదేశ్, బీహార్, గుజరాత్ల వాటా తక్కువే అయినప్పటికీ మొత్తం జీఎస్టీ ట్యాక్స్పేయర్లలో ఆయా రాష్ట్రాల వాటా ఎక్కువగా ఉంటోంది. -
ఆగస్టు 1 నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్
ఆగష్టు 1వ తేదీ నుంచి యూపీఐ(Unified Payment Interface) యూజర్లకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో.. పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకునేవారిని చెక్ పెట్టే నిబంధనలు ప్రధానంగా తీసుకొచ్చింది.యూపీఐ పేమెంట్స్ చేసేవారు.. ఇక నుంచి రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్కు NPCI వీలు కల్పించనుంది. అలాగే.. ఫోన్ నెంబర్ లింకైన బ్యాంక్ ఖాతాలను రోజుకు 25సార్లు మాత్రమే చూసేలా నిబంధన తీసుకురానుంది. పదే పదే బ్యాలెన్స్ చెక్తో ఏర్పడే ట్రాఫిక్కు చెక్ పెట్టేందుకే ఈ రూల్స్ తెచ్చినట్లు తెలిపింది.ఇక.. ఆటోపే ట్రాన్జాక్షన్ విషయంలోనూ ఓ చిన్న మార్పు చేసింది. UPI AutoPay లావాదేవీలకు నిర్దిష్ట సమయ పరిమితులు (ఫిక్స్డ్ టైం స్లాట్) ఆప్షన్ తీసుకొచ్చింది. అంటే.. సబ్స్క్రిప్షన్లు, విద్యుత్/నీటి బిల్లులు, ఈఎంఐలాంటి షెడ్యూల్ చేయబడిన చెల్లింపులు ఇకపై ఫలానా రోజులో మొత్తం ఎప్పుడైనా జరగకుండా.. ముందుగా నిర్ణయించిన టైం స్లాట్ ప్రకారం ప్రాసెస్ అవుతాయి.అయితే ట్రాన్జాక్షన్(లావాదేవీల) లిమిట్ విషయంలో యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ఎన్పీసీఐ స్పష్టం చేసింది. -
రేట్ల కోతను నిర్ణయించేది.. ద్రవ్యోల్బణం, వృద్ధి అంచనాలే
ముంబై: ద్రవ్యోల్బణం, వృద్ధిపై అంచనాలే భవిష్యత్తు రేట్ల కోతను నిర్ణయిస్తాయే గానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా కాదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. రుణ వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ రేట్ల కోతను చేపట్టినట్టు చెబుతూ.. ఇది అస్సెట్ బబుల్కు (ఆస్తుల విలువ అతిగా పెరిగేందుకు) దారితీయదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేందుకు రేట్ల కోతకు అదనంగా ఆర్బీఐ చేతిలో అ్రస్తాలున్నట్టు చెప్పారు. ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక శాతం రెపో రేటు కోతను చేపట్టడం తెలిసిందే. పరపతి విధానం అమలు ఆలస్యంగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కనుక ద్రవ్యోల్బణం వంటి కీలక డేటా విషయంలో 12 నెలల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రేట్ల కోతపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది’’అని మల్హోత్రా తెలిపారు. క్యూ4లో ద్రవ్యోల్బణం 4.4 శాతం ఉంటుందన్నది అంచనాలు కాగా, ప్రస్తుత తీరు చూస్తుంటే ఇంకా తగ్గేలా ఉందన్నారు. జూన్ వరకు ఉన్న డేటాను గమనిస్తే బ్యాంకుల రుణ రేట్లు అర శాతం మేర తగ్గాయని.. ఆర్బీఐ నిర్ణయం పూర్తిగా అమలైనట్టు ఇది తెలియజేస్తోందన్నారు. మెరుగైన రుణ వృద్ధి 2024–25లో రుణాల్లో వృద్ధి 12.1 శాతంగా ఉందని సంజయ్ మల్హోత్రా తెలిపారు. దశాబ్దం సగటు 10 శాతం కంటే అధికమన్నారు. 2025–26లో ఇది 9 శాతంగా ఉండొచ్చన్నారు. వృద్ధికి అనుకూలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు ఉండేలా చూస్తామని పరిశ్రమకు హామీ ఇచ్చారు. వృద్ధికి మద్దతుగా భారీ రేట్ల కోత చేపట్టి ఆర్బీఐ తన సాధనాలను పూర్తిగా వినియోగించేసిందా? అన్న ప్రశ్నకు.. రేట్ల కోతకు అదనంగా మరిన్ని అ్రస్తాలు తమ వద్ద ఉన్నట్టు చెప్పారు. సీఆర్ఆర్ను 3 శాతానికి తగ్గించినప్పటికీ, ఎలాంటి అవసరం ఏర్పడినా ఎదుర్కొనేందుకు తగినన్ని నిధులున్నట్టు తెలిపారు. కరోనా సమయంలోనూ ఒక శాతమే వినియోగించినట్టు గుర్తు చేశారు. సీఆర్ఆర్ తగ్గింపు కేవలం లిక్విడిటీని పెంచడమే కాకుండా మధ్యవర్తిత్వ వ్యయాలను తగ్గించడం కోసమన్నారు. ఇది అంతిమంగా రుణ వ్యయాలను కూడా తగ్గిస్తుందన్నారు. ఆర్థిక సేవల విస్తృతికి వీలుగా బ్యాంక్ సిబ్బంది ప్రతి వారం 2.7 లక్షల గ్రామ పంచాయితీలను సందర్శిస్తున్నట్టు చెప్పారు. పారిశ్రామిక గ్రూప్లను బ్యాంకింగ్లోకి అనుమతించే విషయంలో ఆర్బీఐ ఆందోళనలను ప్రస్తావించగా.. ప్రయోజన వైరుధ్యం రిస్క్ ఉంటుందన్నారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి వ్యయాలను ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో రాష్ట్రాలు లేదా వినియోగదారులు చెల్లించాల్సి రావచ్చన్నారు. ఈ వ్యవస్థ సాఫీగా సాగేందుకు ఇది అవసరమని అభిప్రాయపడ్డారు. యూకేతో ఒప్పందం భారత్కు మేలు బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం భారత్కు మేలు చేస్తుందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. తయారీ, సేవల రంగంలో ఎన్నింటికో ప్రయోజనం చేకూరుస్తుందంటూ.. ఇదే తరహా మరిన్ని ఒప్పందాలు అవసరమన్నారు. మరిన్ని దేశాలతో ఒప్పందాలు చర్చల దశలో ఉన్నట్టు గుర్తు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విమర్శిస్తున్నప్పటికీ.. సెంట్రల్ బ్యాంక్ స్వతంత్రను కాపాడుతున్నారంటూ యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ను అభినందించారు. -
ఇండియా-యూకే ట్రేడ్ డీల్ వ్యవసాయానికి జాక్పాట్
భారత వ్యవసాయ రంగానికి ఇండియా-యూకే ఇటీవల సంతకం చేసిన కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (సీఈటీఏ) ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారతీయ వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతుల్లో 95% యూకే మార్కెట్లో సుంకం లేకుండా అనుమతించే వీలుంది. ఇది భారతీయ రైతులు, వ్యవసాయ ఎగుమతిదారులకు మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవల కుదిరిన ఒప్పందం ప్రకారం వ్యవసాయానికి సంబంధించి కొన్ని ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి.జీరో-డ్యూటీ యాక్సెస్బాస్మతి, బాస్మతియేతర బియ్యంపండ్లు మరియు కూరగాయలుమసాలా దినుసులు (పసుపు, మిరియాలు, యాలకులు)ప్రాసెస్ చేసిన ఆహారాలు (ఊరగాయలు, మసాలా మిశ్రమాలు, పండ్ల గుజ్జులు, రెడీ టు ఈట్ భోజనం)సముద్ర ఉత్పత్తులు (రొయ్యలు, ట్యూనా, ఫిష్ మీల్, ఫిష్ ఫీడ్)పాడి, వంట నూనెలు, యాపిల్స్ సుంకం రాయితీ పరిధిలోకి రావు. ఇది కీలకమైన దేశీయ పరిశ్రమలను కాపాడుతుంది.గతంలో 70 శాతం వరకు దిగుమతి సుంకాలను ఎదుర్కొన్న ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇప్పుడు జీరో డ్యూటీ పరిధిలోకి రానున్నాయి.ఇదీ చదవండి: విస్కీ ధరలు తగ్గింపు..?వచ్చే మూడేళ్లలో యూకేకు భారత వ్యవసాయ ఎగుమతుల్లో 20% వృద్ధి నమోదవుతుందని అంచనా. ఇది భారతదేశం తన 100 బిలియన్ డాలర్ల వ్యవసాయ ఎగుమతి లక్ష్యానికి చేరువ కావడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం 2.25 శాతం మాత్రమే ఉన్న బ్రిటన్ 5.4 బిలియన్ డాలర్ల సముద్ర దిగుమతుల్లో భారత్ వాటాను ఈ వాణిజ్య ఒప్పందం పెంచుతుందని భావిస్తున్నారు. -
ప్రమాణాలను పెంచండి, విశ్వాసాన్ని గెలవండి
న్యూఢిల్లీ: విధానాలను సకాలంలో అమలు చేయడం ద్వారా కొత్త ప్రమాణాలను సృష్టించాలని.. పన్ను చెల్లింపుదారుల విశ్వాసాన్ని చూరగొనాలని ఆదాయపన్ను శాఖ అధికారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఆరు నెలల్లోనే కొత్త ఆదాయపన్ను చట్టం ముసాయిదాను రూపొందించడం పట్ల అధికారులను అభినందించారు. ‘‘మంచి విధానాలు ఉండడంతోనే సరిపో దు. సకాలంలో వాటిని అమ లు చేయడమే కీలకం. ఇటీవలి కాలంలో మీరు ఎంతో గొప్ప గా పనిచేశారు. ఈ ప్రమాణాలను మరింత పెంచాల్సిన సమయం వచి్చంది’’అని 166వ ఆదాయపన్ను శాఖ దినోత్సవం సందర్భగా పేర్కొన్నారు. -
వాణిజ్య యుద్ధాలు తాత్కాలికమే!
న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధాలు ఎక్కువ కాలం పాటు కొసాగబోవని డెలాయిట్ దక్షిణాసియా సీఈవో రోమల్ శెట్టి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న అనిశ్చితులు వచ్చే కొన్ని నెలల్లో సమసిపోతాయని అంచనా వేశారు. గతం కంటే ఇప్పుడు భారత్–అమెరికా మరింత సన్నిహితంగా మారినట్టు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వైపాక్షిక బంధం బలపడినట్టు తెలిపారు. దీనికితోడు భౌగోళికంగా వ్యూహాత్మకమైన స్థితిలో ఉండడంతో ఇతర దేశాలకు లేని అనుకూలతలు భారత్కు ఉన్నట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం విషయమై భారత్–అమెరికా మధ్య విస్తృత సంప్రదింపులు నడుస్తున్న తరుణంలో డెలాయిట్ సీఈవో వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. 50–60 శాతం టారిఫ్లు కొనసాగడం అసాధ్యమని, అవి దిగొస్తాయని శెట్టి పేర్కొన్నారు. భారత్–అమెరికా తమ సొంత ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నాయని.. కనుక ఇవి మధ్యేమార్గానికి రావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత్లో కొన్ని అట్టడుగు వర్గాలు, ఇతర విభాగాలున్న నేపథ్యంలో స్వేచ్ఛా వాణిజ్యం కుదుర్చుకోవడం సవాలుగానే అభివర్ణించారు. సంక్లిష్టమైన అంశాల పరిష్కారం అంత సులభం కాదంటూ.. ఎన్నో దశల చర్చల తర్వాతే ఏకాభిప్రాయం సాధ్యపడుతుందన్నారు. అంతిమంగా కుదిరే ఒప్పందం ఇరు దేశాలకూ ప్రయోజనం కలిగిస్తుందని.. రెండు దేశాల మార్కెట్ వాటా పెరుగుతుందన్నారు. జీడీపీ వృద్ధి 6.7 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని రోమల్ శెట్టి అంచనా వేశారు. వచ్చే దశాబ్దంన్నర (15 ఏళ్లు) పాటు ఏటా 7–8 శాతం వృద్ధి రేటు సాధ్యమేనన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో అంతర్జాతీయ సంక్షోభాలను (కరోనా, భౌగోళిక ఉద్రిక్తతలు) విజయవంతంగా అధిగమించడమే కాకుండా బలమైన వృద్ధిని నమోదు చేయడాన్ని గుర్తు చేశారు.ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్.. ఈ ఏడాది జపాన్ను అధిగమించి 4.2 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేయయం ఈ సందర్భంగా గమనార్హం. భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరు వెనుక సేవల రంగం పాత్రను రోమల్శెట్టి ప్రస్తావించారు. భారత ఆర్థిక వ్యవస్థకు సేవలే బలమంటూ.. అంతర్జాతీయ వాణిజ్య సవాళ్ల ప్రభావం ఏమంత ఉండబోదన్నారు.ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయ రంగం పనితీరు మెరుగుపడినట్టు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య పరంగా కొంత ప్రభావం ఉన్నా కానీ, అది తాత్కాలికమేనన్నారు. తలసరి ఆదాయం 2,800 డాలర్ల నుంచి 4,000 డాలర్లకు చేరుకుందంటూ, ఇదే కాలంలో వాస్తవ వినియోగం రెట్టింపైనట్టు చెప్పారు. తయారీ, సెమీకండక్టర్లు క్రమంగా పట్టు సాధిస్తునట్టు తెలిపారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థాయిలోనే ఉండొచ్చన్నారు. 2029–30 నాటికి మంచి స్థితికి చేరుకోవచ్చని అంచనా వేశారు. -
భారత వృద్ధి అంచనాలు కట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్టు ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ), ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) ప్రకటించాయి. ఏడీబీ 0.20 శాతం మేర, ఇండ్–రా 0.30 శాతం చొప్పున కోత పెట్టాయి. భారత జీడీపీ 2025–26లో 6.7 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఏడీబీ లోగడ అంచనా వేయగా.. తాజాగా దీన్ని 6.5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. భారత ఎగుమతులు, పెట్టుబడులపై వాణిజ్య అనిశ్చితులు, అమెరికా టారిఫ్లు ప్రభావం చూపించొచ్చని పేర్కొంది. అయినప్పటికీ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతుందని తెలిపింది. ‘‘అమెరికా కనీస టారిఫ్లు, సంబంధిత విధానపరమైన అనిశ్చితి వల్లే వృద్ధి అంచనాను సవరించాం. దీనికి అదనంగా అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నిదానించడం, భారత ఎగుమతులపై అమెరికా అదనపు టారిఫ్లు, విధానపరమైన అనిశ్చితులు పెట్టుబడులపైనా ప్రభావం చూపిస్తాయి’’అని ఏడీబీ పేర్కొంది. దేశీ ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయంటూ.. గ్రామీణ డిమాండ్ పుంజుకోవడంతో దేశీ వినియోగం బలంగా వృద్ధి చెందనుందని అంచనా వేసింది. భారత వృద్ధిని ప్రధానంగా వ్యవసాయం, సేవల రంగాలు నడిపిస్తాయని తెలిపింది. సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలు వ్యవసాయ రంగం పనితీరుకు మద్దతుగా నిలుస్తాయని వివరించింది. 2025–26 సంవత్సరంలో జీడీపీ 6.3–6.8 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక సర్వే పేర్కొనగా, 6.5 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనాగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024–25) జీడీపీ 6.5 శాతం వృద్ధి చెందడం గమనార్హం. 2026–27లో 6.7 శాతం.. భారత ప్రభుత్వ ద్రవ్య పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని, అంచనాలకు మించి ఆర్బీఐ డివిడెండ్ రావడంతో ద్రవ్యలోటును క్రమంగా తగ్గించుకోవాలన్న లక్ష్యాన్ని చేరుకునే దిశలో ఉన్నట్టు ఏడీబీ తెలిపింది. 2026–27లో భారత జీడీపీ 6.7 శాతం వృద్ధిని చేరుకోవచ్చని అంచనా వేసింది. సానుకూల ఆర్థిక పరిస్థితులు, విధానపరమైన అనిశ్చితి తగ్గుముఖం పట్టడం, పెట్టుబడుల్లో వృద్ధి, ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు అనుకూలించొచ్చని పేర్కొంది. చమురు ధరలు కనిష్ట స్థాయిల్లో ఉండడం కూడా భారత ఆర్థిక వ్యవస్థకు అనుకూలిస్తుందని అభిప్రాయపడింది.6.3 శాతానికి పరిమితం కావొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ది 6.3 శాతానికి పరిమితం కావొచ్చని ఇండ్–రా అంచనా వేసింది. 2024 డిసెంబర్ అంచనాల్లో పేర్కొన్న 6.6%తో పోల్చి చూస్తే 0.30% తగ్గించింది. అమెరికా టారిఫ్ల పరంగా అనిశ్చితులు నెలకొనడంతోపాటు, పెట్టుబడుల వాతావరణం బలహీనంగా ఉండడాన్ని ప్రస్తావించింది. అన్ని దేశాలపై టారిఫ్లను అమెరికా ఏకపక్షంగా పెంచేయడం, పెట్టుబడుల వాతావరణం అంచనాలకు మించి బలహీనంగా ఉండడాన్ని ప్రతికూలతలుగా పేర్కొంది. పరపతి విధానం సరళీకరించడం (రెపో రేట్ల కోత), ద్రవ్యోల్బణం వేగంగా తగ్గుముఖం పట్టడం, సాధారణం కంటే అధిక వర్షపాతం అంచనాలను అనుకూలతలుగా ఇండ్–రా ముఖ్య ఆర్థికవేత్త దేవేంద్ర కుమార్ పంత్ తెలిపారు. సగటున రిటైల్ ద్రవ్యోల్బణం 3% స్థాయిలో, డాలర్తో రూపాయి మారకం 86.9% స్థాయిలో ఉండొచ్చని ఇండ్–రా అంచనా వేసింది. -
‘ఆర్బీఐ రేట్ల కోత మ్యాజిక్ బుల్లెట్ కాదు’
ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు పెట్టుబడులను ఇతోధికం చేసే మ్యాజిక్ బుల్లెట్ కాబోదని మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంతో ఇతర అంశాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రస్తుత తరుణంలో వడ్డీ రేట్లు అధికంగా లేవన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్బీఐ రేట్ల కోత ఫలితమిచ్చేందుకు సమయం పడుతుందన్నారు.ఆర్బీఐ ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక శాతం మేర రెపో రేటును తగ్గించడం తెలిసిందే. ఈ రేట్ల తగ్గింపు అంతిమంగా కంపెనీల పెట్టుబడులు పెరిగేందుకు దారితీస్తుందా? అంటూ ఓ మీడియా సంస్థ ఆయన్ను ప్రశ్నించింది. ‘కేవలం వడ్డీ రేట్లతోనే ఇది సాధ్యపడుతుందని నేను అనుకోవడం లేదు. ఒకటికి మించిన అంశాలు ఇందులో పనిచేస్తాయి. మరిన్ని రంగాల్లో పోటీని పెంచాలి. తమ సానుకూలతలను కాపాడుకునేందుకు వీలుగా పెట్టుబడులపై మరింతగా దృష్టి పెట్టే విధంగా పరిశ్రమలను ప్రోత్సహించాలి. మరిన్ని కార్పొరేట్ పెట్టుబడులు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను’అని రాజన్ పేర్కొన్నారు. ప్రైవేటు పెట్టుబడులు 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్టు కేంద్ర ప్రభుత్వ గణంకాల ఆధారంగా తెలుస్తోంది.ఇదీ చదవండి: చందా కొచ్చర్పై ఆరోపణలు.. నిజం బట్టబయలుప్రతి ద్రవ్యోల్బణంద్రవ్యోల్బణం జూన్ నెలలో 2.1 శాతానికి దిగిరావడంతో ఆర్బీఐ మరిన్ని రేట్లను తగ్గించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు రాజన్ నేరుగా బదులివ్వలేదు. ద్రవ్యోల్బణం పరంగా భారత్ సౌకర్యమైన స్థితిలో ఉన్నట్టు చెప్పారు. పారిశ్రామిక దేశాలపై అమెరికా టారిఫ్ల విధింపు.. అంతిమంగా ఆయా దేశాల్లోకి అమెరికా ఉత్పత్తుల ప్రవేశం ప్రతి ద్రవ్యోల్బణానికి (ధరల పతనానికి) దారితీస్తుందన్నారు. ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకున్న రిటైల్ ద్రవ్యోల్బణం కంటే ప్రధాన ద్రవ్యోల్బణం అధికంగా ఉన్నట్టు గుర్తు చేశారు. -
ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటుకు చర్చలు ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పింఛన్లను సవరించే 8వ వేతన సంఘం (సీపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ముందస్తు చర్చలు ప్రారంభించింది. 2026 జనవరి 1 నుంచి ఈ కమిషన్ అమల్లోకి రానుంది. పీటీఐ నివేదిక ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్రస్థాయిలోని కీలక శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఈమేరకు సంప్రదింపులు మొదలు పెట్టింది. వీటిలో రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది, శిక్షణ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.ఈ సంప్రదింపుల్లో భాగంగా కేంద్రశాఖలతోపాటు రాష్ట్రాలతో సహా ప్రధాన భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ధ్రువీకరించారు. కమిషన్ను అధికారికంగా నోటిఫై చేసిన తర్వాత ఛైర్పర్సన్, సభ్యులను నియమిస్తామని ఆయన పార్లమెంటుకు తెలిపారు.ఎనిమిదో వేతన సంఘం దేశవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా క్లర్కులు, ప్యూన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) వంటి లెవల్ 1 హోదాల్లో ఉన్న వారు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒక వేతన సంఘాన్ని నియమిస్తుంది. ప్రస్తుత 7వ సీపీసీ 31 డిసెంబర్ 2025తో ముగియనుంది. 2024 జనవరిలో 8వ సీపీసీని ప్రకటించినప్పటికీ, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఇంకా నోటిఫై చేయలేదు. అది పూర్తయి సభ్యులను నియమించే వరకు జీతాలు, అలవెన్సులు, పింఛన్లపై అధికారిక సమీక్ష మొదలుకాదని గమనించాలి.ఇదీ చదవండి: ఆర్కామ్, అనిల్ అంబానీపై ‘ఫ్రాడ్’ ముద్రకొత్త కమిషన్ కింద వేతన సవరణలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకమైన అంశంగా మారుతుంది. ఇది 8వ సీపీసీ కింద ప్రస్తుత మూల వేతనాన్ని రెట్టింపు చేస్తుంది. 7వ సీపీసీ 2.57 యూనిఫామ్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్(కొత్త బేసిక్పేలో ఇప్పటివరకు ఉన్న బేసిక్పేను 2.57తో హెచ్చు వేస్తారు)ను అవలంబించింది.గమనిక: 2026 జనవరి నాటికి డీఏ 57 శాతానికి పెరగనుంది. నగర వర్గీకరణ ఆధారంగా హెచ్ఆర్ఏ, టీఏ గణాంకాలు కొద్దిగా మారుతూ ఉంటాయి. -
భారత్లోకి యూఎస్ జన్యుమార్పిడి పంటలు ఎంట్రీ?
భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) చర్చల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయని అంచనా. అందులో డెయిరీ ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పు చెందిన (జీఎం) ఉత్పత్తులపై నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డెయిరీ అనేది లక్షలాది గ్రామీణ కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్న సున్నితమైన పరిశ్రమ. కాబట్టి ఈ డీల్ నుంచి పాడి పరిశ్రమను మినహాయించడానికి యూఎస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జన్యుపరంగా మార్పు చెందిన (జీఎం) వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా సోయాబీన్స్, మొక్కజొన్నకు భారత్లో అధిక మార్కెట్కు అవకాశం ఉన్నందున అమెరికా ఒత్తిడి పెంచాలని చూస్తున్నట్లు సమాచారం.వాణిజ్య ఒప్పందం నుంచి డెయిరీ పరిశ్రమను దూరంగా ఉంచాలన్న భారత్ డిమాండ్పై అమెరికా కొంత సానుకూలంగా స్పందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పరిశ్రమతో ముడిపడి ఉన్న సామాజిక, ఆర్థిక సున్నితత్వాన్ని యూఎస్ అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాయి. పాడి పరిశ్రమ కేవలం వాణిజ్య వ్యవహారం మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు జీవనాడిగా ఉంటోందని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. సబ్సిడీతో విదేశీ పాల ఉత్పత్తులను భారత్లో ప్రవేశపెట్టేందుకు యూస్ ప్రయత్నించింది. దాంతో వ్యతిరేకత నెలకొంది. ఈ డీల్ ముందుకెళితే రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తుంది. దాన్ని నివారించడానికి బీటీఏ నుంచి డెయిరీని మినహాయించడం ఎంతో సహాయపడుతుంది.జన్యుమార్పిడి పంటలుట్రేడ్ డీల్ చర్చల నుంచి డెయిరీకి ఉపశమనం కలగబోతున్నప్పటికీ, అమెరికా తన జన్యుమార్పిడి పంటలను ముఖ్యంగా సోయాబీన్స్, మొక్కజొన్న పంట ఉత్పత్తులను భారత్లోకి ప్రవేశపెట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తోంది. యూఎస్ సోయాబీన్, మొక్కజొన్న ఎగుమతుల్లో ఎక్కువ భాగం జన్యుపరంగా మార్పు చెందినవే. కానీ భారతీయ నిబంధనలు ప్రస్తుతం జీఎం ఆహార పంటల దిగుమతిని నిషేధించాయి. ఇది చర్చల్లో ప్రతిష్టంభనను సృష్టిస్తుంది. కొన్ని పండ్లు, కూరగాయలు, కాయలపై రాయితీ ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కానీ ప్రస్తుత ఫ్రేమవర్క్ కింద జీఎం సోయా లేదా మొక్కజొన్న దిగుమతులను అనుమతించడానికి స్పష్టమైన చట్టపరమైన లేదా లాజిస్టిక్ అవకాశాలు లేవు.చైనా నుంచి డిమాండ్ పడిపోవడంతో..గతంలో అమెరికన్ సోయాబీన్స్, మొక్కజొన్నలను అత్యధికంగా కొనుగోలు చేసిన చైనా నుంచి డిమాండ్ పడిపోవడంతో అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. యూఎస్ సోయాబీన్ ఎగుమతుల్లో 55 శాతం, మొక్కజొన్న ఎగుమతుల్లో 26 శాతం చైనా వాటా కలిగి ఉంది. పరస్పర టారిఫ్ల వల్ల ఆ మార్కెట్ కుంచించుకుపోవడంతో యూఎస్ తన వ్యవసాయ ఎగుమతులను వైవిధ్యపరచాలని చూస్తోంది. దాంతో భారత్ను లక్ష్యంగా చేసుకుంది.పెరుగుతున్న ఎగుమతులుఅమెరికాకు భారత వ్యవసాయ ఎగుమతులు పెరుగుతున్నాయి. 2024-25లో ఇవి 6.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. భారతదేశానికి యూఎస్ వ్యవసాయ ఎగుమతులు 2023లో 373 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు మొత్తం 86.51 బిలియన్ డాలర్లు కాగా, అమెరికా నుంచి దిగుమతులు 45.69 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దాంతో భారత్లో మరింత వాణిజ్యం సాగించేందుకు యూఎస్ పావులు కదుపుతోంది.ఇదీ చదవండి: ఉద్యోగిని తొలగించారు సరే.. ఆధారాలేవి?జీఎం పంటలపై వ్యతిరేకతజీఎం పంట దిగుమతులపై భారత్లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఇరు దేశాల వాణిజ్య చర్చల్లో భాగంగా జీఎం ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తుండడంపట్ల దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వాణిజ్య ఒప్పందం ముసుగులో జీఎం సోయాబీన్, మొక్కజొన్నలను భారత్లోకి నెట్టేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని తెలియజేస్తున్నాయి. -
ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ ఇండియాలోనే..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 2025 సంవత్సరానికి గాను గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ నుంచి ‘ప్రపంచంలోనే అత్యుత్తమ కన్జూమర్ బ్యాంక్’ గుర్తింపు దక్కించుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 18న అమెరికా రాజధాని వాషింగ్టన్లో జరిగే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సులో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే తమ వృద్ధి వ్యూహానికి కీలకమని శెట్టి తెలిపారు. ఆన్–బోర్డింగ్ను సరళతరం చేయడం, ప్రాంతీయ భాషల్లో వాయిస్ బ్యాంకింగ్లాంటి కొత్త ఆవిష్కరణలతో 52 కోట్ల పైగా కస్టమర్లకు ప్రపంచ స్థాయి సర్వీసులు అందిస్తున్నామని పేర్కొన్నారు. 24/7 డిజిటల్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో సేవలను మరింత విస్తరిస్తున్నట్లు తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310.. ధర ఎంతంటే..కృత్రిమ మేధస్సుతో నడిచే హైపర్-పర్సనలైజ్డ్ ఆఫర్లతో బ్యాంక్ ఓమ్ని-ఛానల్ ఎంగేజ్మెంట్ మోడళ్లను రూపొందిస్తోంది. యోనో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎస్బీఐ మొబైల్ బ్యాంకింగ్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 8.77 కోట్ల మంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ గుర్తింపు కేవలం ఎస్బీఐకి మాత్రమే కాదు, ప్రపంచ వేదికపై భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులకు గర్వకారణమని శెట్టి తెలిపారు. -
భారత్లోకి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వెల్లువ
కోల్కతా: దేశీయంగా ప్రత్యామ్నాయ పెట్టుబడుల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈక్విటీలతో పోలిస్తే తక్కువ రిస్క్లు, ఒడిదుడుకులతో అత్యధిక రాబడులను కోరుకునే ఫ్యామిలీ ఆఫీస్లు, కార్పొరేట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పరిశ్రమ నిపుణులు తెలిపారు. దీనితో ఈ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీల్లాంటివి ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేటగిరీలోకి వస్తాయి. 2025 మార్చి నాటికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లోకి (ఏఐఎఫ్) రూ. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు హామీలు వచి్చనట్లు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్–టైమ్ సభ్యుడు అనంత నారాయణ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 1.7 లక్షల కోట్లు అధికమని వివరించారు. గత అయిదేళ్లుగా చూస్తే ఏఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ హామీలు, పెట్టుబడులు వార్షికంగా 30 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. భారత్లో ఈ విభాగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000–40,000 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 నాటికి పది రెట్లు పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న అథా గ్రూప్ ప్రెసిడెంట్ విశాల్ విఠ్లానీ తెలిపారు. సంప్రదాయ ఫిక్సిడ్ ఇన్కం సాధనాలతో పోలిస్తే అత్యధికంగా 16–18 శాతం ఈల్డ్లు అందిస్తూ, ఏఐఎఫ్లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
అమెరికాతో వాణిజ్య చర్చలు.. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయమై భారత్ ఎంతో జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు భారీగా సబ్సిడీలు ఇస్తున్న వ్యవసాయ రంగం విషయంలో అప్రమ్తతంగా ఉండాలన్నారు. భారత్లో ఈ రంగంలో సబ్సిడీలు తక్కువగా ఉన్నట్టు చెప్పారు. నియంత్రణల్లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్లోకి వచ్చి పడితే అప్పుడు స్థానిక ఉత్పత్తిదారులకు సమస్యలు మొదలవుతాయన్నారు. భారత వృద్ధి 6–7 శాతం స్థాయిలో స్థిరపడిందంటూ.. అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల ఫలితంగా ఒక శాతం లోపు వృద్ధి ప్రభావితం కావొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ దీర్ఘకాలంలో భారత్కు అనుకూలిస్తుందన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ‘‘ఉదాహరణకు వ్యవసాయం తదితర రంగాల్లో అభివృద్ధి చెందిన దేశాల నుంచి మరింతంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించొచ్చు. దీనివల్ల మన పాలు, పాల పొడి, చీజ్ తదితర ఉత్పత్తులకు అదనపు విలువ తోడవుతుంది. దీనివల్ల పాల ఉత్పత్తిదారులు ప్రయోజనం పొందుతారు’’అని రాజన్ పేర్కొన్నారు. కనుక ఎంతో జాగ్రత్తగా, తెలివిగా చర్చలు నిర్వహించాలంటూ.. భారత అధికారులు ఈ దిశగానే సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. రాజన్ ప్రస్తుతం అమెరికాలోని చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. భారత్ ముందు అవకాశాలు.. తమ దేశ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు రాయితీలు ఇవ్వాలంటూ అమెరికా ఎప్పటి నుంచో భారత్ను డిమాండ్ చేస్తోంది. తాజా వాణిజ్య ఒప్పందం విషయంలోనూ తమ వ్యవసాయ, పాడి ఉత్పత్తులకు ద్వారాలు పూర్తిగా తెరవాలంటూ పట్టుబడుతోంది. కానీ, ఈ విషయంలో భారత్ సుముఖంగా లేకపోవడంతోనే వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడం తెలిసిందే. మన దేశంలో కోట్లాది మంది పాడి, సాగు రంగంపై ఆధారపడి ఉండడంతో కేంద్ర సర్కారు ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో రాజన్ సూచనలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెట్టుబడులు, ఎగుమతులకు నష్టం కలిగిస్తాయని రాజన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో భారత్ ముందు అవకాశాలు కూడా ఉన్నట్టు చెప్పారు. చైనా, ఇతర ఆసియా దేశాలపై అమెరికా విధించిన టారిఫ్లు భారత్ కంటే ఎక్కువగా ఉండడాన్ని ప్రస్తావించారు. కనుక కొంత వరకు తయారీ అవకాశాలు భారత్కు రావొచ్చన్నారు. కానీ, అదే సమయంలో అమెరికాకు భారత్ తయారీ ఎగుమతుల గణనీయంగా లేవంటూ.. భారత్పై విధించే టారిఫ్లు ఎలాంటివి అయినా కొంత వరకు ప్రభావం చూపించొచ్చన్నారు. భారత్పై అమెరికా 26 శాతం అదనపు టారిఫ్లను (10 శాతం బేసిక్ సుంకానికి అదనం) విధించగా.. వాణిజ్య ఒప్పందానికి వీలుగా ఆగస్ట్ 1 వరకు అమలును వాయిదా వేయడం తెలిసిందే. -
అడుగు దూరంలో ట్రేడ్ డీల్
భారత్-యూఎస్ వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అడుగు దూరంలోనే ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్హౌజ్లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్తో ఒప్పందానికి తాము చాలా దగ్గరగా ఉన్నామని చెప్పారు. బ్రాడ్ కాస్టర్ రియల్ అమెరికాస్ వాయిస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోయే వాణిజ్య ఒప్పందాల గురించి అడిగినప్పుడు భారత్తో ఒప్పందం త్వరలో కొలిక్కి వస్తుందని తెలిపారు.భారీ సుంకాలు అమల్లోకి రాకముందే ఒక ఒప్పందానికి రావాలనే లక్ష్యంతో భారత్, అమెరికా కొన్ని నెలలుగా తీవ్ర చర్చలు జరుపుతున్నాయి. విస్తృత వాణిజ్య విధానంలో భాగంగా ఏప్రిల్ 2న భారత వస్తువులపై 27 శాతం సుంకాలను ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలుత జులై 9 వరకు సుంకాలను నిలిపివేయగా, ఆ తర్వాత అమెరికా ఆగస్టు 1 వరకు గడువును పొడిగించింది.యూఎస్లో ప్రత్యేక బృందంఈ ఒప్పందంపై చర్చల కోసం భారత ప్రతినిధి బృందం అమెరికాలో ఉందని భారత ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. గత నెలలో భారత అధికారుల బృందం మరో దఫా చర్చల కోసం వాషింగ్టన్ పర్యటనను పొడిగించడంతో ఈ ఒప్పందంపై ప్రశ్నలు తలెతుతున్నాయి. అయితే ఈ డీల్పై ఇరు పక్షాలు ఆశావహంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా యూఎస్ ఉత్పత్తులు కొన్ని భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు.ఇదీ చదవండి: ముగిసిన టీసీఎస్ బెంచ్ పాలసీ గడువుఇండోనేషియా తరహాలోనే?ఇండోనేషియాతో ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం తరహాలోనే భారత్తో ఒప్పందం ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇరు వర్గాల మధ్య చర్చలు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే, భారత్ డెడ్ లైన్ల ఆధారంగా మరిన్ని చర్చలు జరపదని, జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే ఒప్పందాలను మాత్రమే చేసుకుంటుందని ఆయన ఇటీవల చెప్పారు. ఇప్పటివరకు ద్వైపాక్షిక వాణిజ్యం 190 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఈ సంఖ్యను రెట్టింపు చేసి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ట్రంప్, మోదీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. -
వంట నూనెల కంపెనీలకు సవాళ్లు!
ముంబై: వంట నూనెల రిఫైనరీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో సవాళ్లను ఎదుర్కోనున్నాయి. ముఖ్యంగా వాటి ఆదాయం 2–3 శాతం మేర తగ్గి, రూ.2.6 లక్షల కోట్లుగా ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అమ్మకాలు మాత్రం 2024–25తో పోల్చి చూస్తే 2.8–3 శాతం మేర పెరగొచ్చని పేర్కొంది. అయినప్పటికీ నిర్వహణ మార్జిన్ 0.30–0.50 శాతం వరకు తగ్గి 3.3–3.5 శాతం మధ్య ఉంటుందని తెలిపింది. మూలధన అవసరాలు, వ్యయాలు తక్కువగా ఉండడం కారణంగా వాటి పరపతి ప్రొఫైల్ స్థిరంగా ఉంటుందని తన నివేదికలో క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. మన దేశ వంట నూనెల వినియోగంలో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటుండడం గమనార్హం. నూనెల దిగుమతుల్లో 50 శాతం పామాయిల్ కాగా, సోయాబీన్, సన్ఫ్లవర్ ఇతర నూనెల వాటా మిగిలిన 50 శాతంగా ఉంటోంది. సోయాబీన్ మినహా మిగిలిన ప్రధాన వంట నూనెలు అయిన సన్ఫ్లవర్, పామాయిల్ ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. దీంతో కంపెనీల ఆదాయం కొంత క్షీణతను చూడనున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. బయోడీజిల్ తయారీ డిమాండ్ కారణంగా సోయాబీన్ నూనెల ధరలు పెరిగినట్టు తెలిపింది. బ్రాండెడ్ కంపెనీల మార్జిన్లపై అధిక ప్రభావం‘‘ఈ ఏడాది అమ్మకాలు స్థిరంగా 2.8–3% మేర వృద్ధి చెందొచ్చు. 25.5–26 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండొచ్చు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో సగటు వృద్ధి 2.7 శాతం కంటే ఎక్కువే. గృహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కేటరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇతర విభాగాల నుంచి డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది’’అని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ జయశ్రీ నందకుమార్ పేర్కొన్నారు. అమ్మకాలు పెరగడం వల్ల ఆదాయ క్షీణత 2–3 శాతానికి పరిమితం కావొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. కంపెనీలు సాధారణంగా 40–50 రోజుల అవసరాలకు సరిపడా నిల్వలు నిర్వహిస్తుంటాయి కనుక, ధరలు తగ్గడం వాటి మార్జిన్లను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. నాన్ బ్రాండెడ్ కంపెనీలతో పోలి్చతే బ్రాండెడ్ కంపెనీలు ఎక్కువ ఇన్వెంటరీలు (నిల్వలు) కలిగి ఉంటాయని, కనుక వాటి మార్జిన్లపై ఎక్కవ ప్రభావం పడుతుందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం ఫలితంగా రవాణా వ్యయాలు అధికమైతే.. అది నూనెల ధరలు ఎగిసేందుకు దారితీయొచ్చని అంచనా వేసింది.చౌక దిగుమతుల నుంచి రక్షణ ముడి నూనెలు, రిఫైనరీ నూనెల (శుద్ధి చేసిన) దిగుమతులపై భిన్నమైన సుంకాలతో పరిశ్రమకు ప్రభుత్వం మద్దతుగా నిలిచినట్టు క్రిసిల్ నివేదిక గుర్తు చేసింది. ముడి పామాయిల్, ముడి సోయాబీన్ ఆయిల్, ముడి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించగా, అదే సమయంలో రిఫైనరీ నూనెలపై 35.75 శాతం కస్టమ్స్ డ్యూటీని కొనసాగించడాన్ని ప్రస్తావించింది. ఈ చర్య చౌక దిగుమతుల నుంచి దేశీ నూనె రిఫైనరీ సంస్థలకు రక్షణ నివ్వడమే కాకుండా, నూనెల ధరలు 5 శాతం వరకు తగ్గడానికి దారితీసినట్టు తెలిపింది. -
ఎరువుల కోసం రైతన్న పడిగాపులు
వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తోంది. దేశంలో అధిక జనాభా జీవనోపాధి వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, క్రిమిసంహారకాల వాడకం పెరుగుతుండడం వల్ల సాగుభూమి క్రమంగా సారం కోల్పోతుందని చాలా నివేదికలు చెబుతున్నాయి. పంటల దిగుబడి పెంచాలంటే సహజ ఎరువులు వాడాలని అధికారాలు ఎంత ఊదరగొడుతున్నా అందుకు సరిపడా బడ్జెట్ కేటాయించకపోవడంతో ఆ లక్ష్యం నీరుగారుతోంది. రైతులు ఏ పంట వేసినా దాదాపు యూరియా వాడకం తప్పనిసరైంది. కానీ సాగుకు సరిపడా యూరియా తయారీలో యాంత్రాంగాలు జాప్యం చేస్తున్నాయనే వాదనలున్నాయి. అందుకు కొన్ని కారణాలను కింద తెలియజేశాం.యూరియా పంట దిగుబడి పెంచడంలో, ఆహార భద్రతను నిర్ధారించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తరచు దీని తయారీ ప్లాంట్లను స్థాపించడంలో లేదా ఇప్పటికే ఉన్న వాటిలో ఉత్పాదకతను విస్తరించడంలో గణనీయమైన జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయి. దాంతో రైతులకు పంట సమయానికి ఎరువుల దుకాణాల ముందు పడిగాపులు తప్పడంలేదు. ఈ ఏడాది ఎంత మొత్తంలో ఎరువులు అవసరం అవుతాయో ముందే నిర్ధారించుకున్న ప్రణాళిక ప్రకారం ప్రభుత్వం ఎరువులు తయారు చేయాల్సి ఉంటుంది. లేదా దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ గోదాముల్లో ఎరువులు నిల్వ ఉంచి అవసరాలకు తగ్గట్టుగా వెంటనే సరఫరా చేసే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎరువుల తయారీలో, వాటి సరఫరాలో జాప్యానికి చాలానే కారణాలున్నాయి.ఆర్థిక పరిమితులుయూరియా తయారీ అనేది మూలధన ఆధారిత ప్రక్రియ. కొత్తగా ఎరువుల కర్మాగారాన్ని నిర్మించడానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. దాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులో తీసుకురావడానికి చాలా ఏళ్లు పట్టవచ్చు. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రభుత్వాలు ఇప్పటికే పరిమిత ఆర్థిక వసతులతో పోరాడుతున్నాయి. ఫలితంగా ఇటువంటి దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం కష్టమవుతుంది. అడపాదడపా బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయించిన మొత్తం నుంచి ఇలాంటి ప్రాజెక్ట్లకు నిధులు వెచ్చించడంలేదు.నిర్మాణ వ్యయంతోపాటు యూరియా తయారీకి భారీగా సబ్సిడీ ఇస్తున్నారు. భారత్ వంటి దేశాల్లో రైతులు యూరియాను దాని వాస్తవ ఉత్పత్తి వ్యయంలో కొంత ధరలకే కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ప్రభుత్వం రాయితీలతో పూడుస్తోంది. దేశీయంగా ఉత్పాదకతను పెంచితే అందుకు అనుగుణంగా ప్రైవేట్ కంపెనీలకు అధిక సబ్సిడీ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వాలకు భారం.పరిపాలనా, నియంత్రణ అవరోధాలుకొన్నిసార్లు నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ బ్యూరోక్రటిక్ నిబంధనల కారణంగా యూరియా ప్రాజెక్టుల అమలుకు చాలా ఆలస్యం అవుతుంది. భూసేకరణ, పర్యావరణ అనుమతులు పొందడం, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రావడం, కఠిన నిబంధనలు పాటించడం వంటి చర్యలతో ఏళ్లకుఏళ్లు ఈ ప్రక్రియ వాయిదా పడుతోంది. అంతేగాక రసాయనాలు, ఎరువులు, పర్యావరణం, పెట్రోలియం (గ్యాస్ సరఫరా కోసం), ఫైనాన్స్ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం లోపిస్తుంది. ఏదైనా విభాగంలో ఆలస్యం జరిగితే మొత్తం ప్రాజెక్టు పురోగతి ఆగిపోతుంది.దిగుమతులపై ఆధారపడటంస్వల్పకాలిక వ్యవసాయ అవసరాలను తీర్చడానికి అనేక ప్రభుత్వాలు దేశీయ ఉత్పాదకతపై పెట్టుబడులు పెట్టడానికి బదులుగా యూరియాను దిగుమతి చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఇది మరింత ఖర్చుకు దారితీస్తుంది. అయితే కొత్తగా ప్రాజెక్ట్ స్థాపించి సరఫరా చేయడానికి బదులుగా ఇది సరళమైన విధానంగా కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో అంతర్జాతీయ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మరింత పెరుగుతున్నాయి.అయితే, ఎరువుల దిగుమతిపై ఆధారపడటం దీర్ఘకాలిక బలహీనతలను సృష్టిస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆంక్షలు లేదా ధరల అస్థిరత కారణంగా ఏదైనా ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడినప్పుడు అసలు సమస్య గుర్తుకొస్తుంది. ఇది దేశీయ వ్యవసాయ ఉత్పాదకతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ముడిసరుకు సరఫరాలో హెచ్చుతగ్గులుయూరియా ఉత్పత్తి సహజ వాయువు లభ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీన్ని ఫీడ్స్టాక్గా ఉపయోగిస్తారు. అనేక దేశాల్లో సహజ వాయువు కొరత ఉంది. ఒకవేళ దిగుమతి చేసుకోవాలన్నా ఖరీదుతో కూడుకుంది. సహజవాయువు సమృద్ధిగా ఉంటే ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా యూరియా ఉత్పత్తిని ఆర్థికంగా లాభదాయకం చేయవచ్చు. గ్యాస్ సరఫరాలో అంతరాయాలు లేదా అననుకూల ధరల ఒప్పందాలు ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. కొత్త ప్లాంట్ ఏర్పాటును ఆలస్యం చేస్తున్నాయి.ఇదీ చదవండి: ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూప్రత్యామ్నాయాలుప్రభుత్వాలు సంప్రదాయ యూరియా వాడకానికి దూరంగా నేల ఆరోగ్యం, పర్యావరణ సుస్థిరతపై అవగాహన పెంపొందించే ప్రయత్నాలను మరింత పెంచాలి. నానో యూరియా, బయో ఫెర్టిలైజర్స్, సేంద్రియ ఎరువులు వాడకం వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించేలా రైతు సమావేశాలు ఏర్పాటు చేయాలి. యూరియా వాడకంతో పోలిస్తే ఖర్చులు తగ్గుతూ దిగుబడి స్థిరంగా ఉన్నా రైతులు ఇలాంటి ప్రత్యామ్నాయాలవైపు చూసే అవకాశం ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత సాయంతో సంప్రదాయ యూరియాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గాలేమిటో అధికారులు, పరిశోధకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. -
ఎస్బీఐకి డబ్బు అవసరం.. నిధుల సమీకరణ షురూ
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ నిధుల సమీకరణకు తెరతీసింది. షేరుకి రూ.811.05 ఫ్లోర్ ధరలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ని చేపట్టింది. తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. అయితే ఫ్లోర్ ధరకంటే 5 శాతం డిస్కౌంట్లో క్విప్ను పూర్తి చేసే వీలున్నట్లు తెలియజేసింది. షేరు తాజా ధర రూ. 831.55తో పోలిస్తే ఫ్లోర్ ధర సైతం 2.5 శాతం తక్కువకావడం గమనార్హం! వీటికితోడు రుణ సెక్యూరిటీల(బాండ్లు) జారీ ద్వారా మరో రూ. 20,000 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉన్నట్లు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.ఈ ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ ఇన్వెస్టర్లకు బాండ్లను ఆఫర్ చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి రూ.45,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. ఈ ఏడాది మే నెలలో ప్రయివేట్ ప్లేస్మెంట్ ద్వారా రూ.25,000 కోట్ల సమీకరణకు ఎస్బీఐ బోర్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జూన్లో బ్యాంక్ వాటాదారులు సైతం ఇందుకు ఆమోదముద్ర వేశారు. కాగా.. ఎస్బీఐ ఇంతక్రితం 2017–18లో క్విప్ ద్వారా రూ. 15,000 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే! భవిష్యత్తులో రుణ వృద్ధికి, మూలధన వ్యయానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు.రిలయన్స్ సంస్థలు సైతంరిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డు వివిధ మార్గాలలో రూ.9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్ లేదా క్విబ్ తదితరాల ద్వారా రూ.6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది. రిలయన్స్ పవర్ బోర్డు వివిధ మార్గాలలో రూ. 9,000 కోట్లు సమీకరించేందుకు తాజాగా అనుమతించింది. దీనిలో భాగంగా ఈక్విటీ షేర్లు లేదా ఈక్విటీ సంబంధ క్విప్ లేదా క్విబ్ తదితరాల ద్వారా రూ. 6,000 కోట్లు సమకూర్చుకోనుంది. అంతేకాకుండా ఒకేసారి లేదా దశలవారీగా మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా మరో రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఇందుకు ప్రయివేట్ ప్లేస్మెంట్ లేదా ఇతర విధానాలను ఎంచుకోనుంది. -
సాఫీగా రేట్ల కోత బదిలీ
న్యూఢిల్లీ: వ్యవస్థలో నగదు లభ్యత పెంపు దిశగా ఆర్బీఐ ఈ ఏడాది ఆరంభం నుంచి తీసుకున్న చర్యలు.. 100 బేసిస్ పాయింట్ల (ఒక శాతం) రేట్ల తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని బ్యాంక్లు బదిలీ చేసేందుకు అనుకూలిస్తుందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు రూపంలో ఆర్బీఐ రూ.5.6 లక్షల కోట్ల మేర లిక్విడిటీని పెంచినట్టు గుర్తు చేసింది. దీంతో మార్చి నుంచి నగదు లభ్యత మిగులు స్థాయికి చేరినట్టు తెలిపింది. సీఆర్ఆర్ను (నగదు నిల్వల నిష్పత్తి) 100 బేసిస్ పాయింట్లను తగ్గించడం రూపంలో మరో రూ.2.7 లక్షల కోట్ల నగదు దశల వారీగా వ్యవస్థలోకి చేరుతుందని పేర్కొంది. జనవరి నుంచి వ్యవస్థలో లిక్విడిటీని గణనీయంగా పెంచడమే కాకుండా, భవిష్యత్తులోనూ తగినంత లిక్విడిటీని కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం నిధుల పరమైన పరిస్థితులను సులభతరం చేసినట్టు వివరించింది. ‘‘పెరుగుతున్న మిగులు నిధులు, డిపాజిట్ రేట్లు తగ్గుతుండడం దీన్ని స్పష్టం చేస్తోంది. రుణ వృద్ధి మందగించడంతో ఈ రంగం రుణ/డిపాజిట్ రేషియో పెరుగుదల తిరోగమించడం డిపాజిట్ల పరంగా బ్యాంక్లపై ఒత్తిళ్లను తగ్గిస్తుంది’’అని ఫిచ్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. నిధుల వ్యయాలు దిగొస్తాయి.. ఈ ఏడాది వడ్డీ రేట్లను ఆర్బీఐ ఒక శాతం వరకు తగ్గించడం తెలిసిందే. ఫిబ్రవరిలో పావు శాతం, ఏప్రిల్లోనూ పావు శాతం, జూన్లో అరశాతం తగ్గింపు నిర్ణయాలు తీసుకోవడాన్ని ఫిచ్ రేటింగ్స్ నివేదిక గుర్తు చేసింది. ఈ చర్యలు ఆర్బీఐ లిక్విడిటీ విధానంలో గణనీయమైన మార్పునకు నిదర్శనమని పేర్కొంది. నిధుల పరంగా ఒత్తిళ్లు లేకుండా రుణ వృద్ధికి ఈ చర్యలు మద్దతునిస్తాయని తెలిపింది. ‘‘తగినంత లిక్విడిటీ వల్ల తాజా నిధుల సమీకరణ వ్యయాలు తగ్గుతాయి. 2025–26 సంవత్సరంలో బ్యాంకుల మార్జిన్లు 0.30 శాతం తగ్గుతాయన్నది మా అంచనా. 2026–27లో డిపాజిట్లపై వ్యయాలు తగ్గడం ఫలితంగా మార్జిన్ల ఒత్తిళ్లు దిగొస్తాయి. తక్కువ సీఆర్ఆర్ కూడా ఇందుకు అనుకూలిస్తుంది’’అని ఈ నివేదిక వివరించింది. జూన్ సమీక్షలో ఆర్బీఐ సీఆర్ఆర్ను సైతం ఒక శాతం తగ్గించి 3 శాతం చేయడం గమనార్హం. -
భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీ సులభతరం
న్యూఢిల్లీ: భారత్–సింగపూర్ మధ్య నిధుల బదిలీని మరింత సులభతరం చేస్తూ.. యూపీఐ–పేనౌ కిందకు మరో 13 బ్యాంక్లను చేర్చినట్టు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ ప్రకటించింది. ఈ నెట్వర్క్ పరిధిలోకి మొత్తం 19 భారత బ్యాంక్లు చేరినట్టయింది. ‘‘జూలై 17 నుంచి రెండు దేశాల్లోని యూజర్లు మరిన్ని బ్యాంకుల పరిధిలో నిధులను బదిలీని సులభంగా చేసుకోవచ్చు. ఈ సేవ మరింత సౌకర్యంగా, అందుబాటులోకి వస్తుంది’’అని ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (ఎన్ఐపీఎల్) తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కి ఎన్ఐపీఎల్ అనుబంధ సంస్థ కావడం గమనార్హం. ఆర్బీఐ, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ (ఎంఏఎస్) సంయుక్తంగా యూపీఐ–పేనౌ సేవలను లోగడ ప్రారంభించడం తెలిసిందే. -
వీధి వ్యాపారులకు జీఎస్టీ నోటీసులు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువవుతున్నాయి. ఒకప్పటిలాగా పర్సుల్లో క్యాష్ ఉంచుకోవడం గణనీయంగా తగ్గిపోయింది. అయితే చిరువ్యాపారుల పట్ల ఈ డిజిటల్ లావాదేవీలు శాపంగా మారుతున్నాయి. ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రభుత్వ వ్యవస్థల్లో రికార్డు అవుతుండడంతో రోజువారీ లావాదేవీలను పరిగణలోకి తీసుకుని చిరువ్యాపారులకు జీఎస్టీ నోటీసులు అందుతున్నాయి. గతంలో ఫిజికల్ క్యాష్ ద్వారా వస్తు మార్పిడి జరిగేదికాస్తా డిజిటల్ పేమెంట్స్ పుణ్యమా అని వారి చేతిలో జీఎస్టీ నోటీసులు దర్శనమిస్తున్నాయి. దాంతో చేసేదీమీ లేక యూపీఐ చెల్లింపులకు నో చెబుతూ.. కస్టమర్లను క్యాష్ ఇమ్మంటున్నారు.బెంగళూరులో ఈమేరకు చాలా మంది వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఇటీవల జీఎస్టీ నోటీసులు అందాయి. దాంతో యూపీఐ క్యూఆర్ స్కానర్లు పక్కన పడేసి, క్యాష్ ఇవ్వాలని కస్టమర్లను కోరుతున్నారు. చాలా షాపుల ముందు ‘నో యూపీఐ.. ఓన్లీ క్యాష్’ అనే బోర్డులు వెలుస్తున్నాయి. ‘రోజుకు సుమారు రూ.3,000 వ్యాపారం చేసి వచ్చే కొద్దిపాటి లాభంతో జీవిస్తున్నాను. నేను ఇకపై యూపీఐ చెల్లింపును అంగీకరించలేను’ అని హోరమావులోని ఓ దుకాణదారుడు తెలిపాడు.స్ట్రీట్ ఫుడ్ దుకాణాలు, తోపుడు బండ్లు, కార్నర్ షాపులు సహా అధికారికంగా నమోదు కాని వేలాది చిన్న వ్యాపారాలకు జీఎస్టీ నోటీసులు అందాయని వ్యాపారులు, న్యాయవాదులు, అకౌంటెంట్లు చెబుతున్నారు. కొందరికి రూ.లక్షల్లో డిమాండ్లు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ బెంగళూరు స్ట్రీట్ వెండర్స్ అసోసియేషన్స్ సంయుక్త కార్యదర్శి న్యాయవాది వినయ్ కె.శ్రీనివాస మాట్లాడుతూ..‘చాలా మంది విక్రేతలు జీఎస్టీ అధికారుల వేధింపులు, పౌర అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుందని భయపడుతున్నారు. దాంతో చాలామంది ఇప్పటికే కస్టమర్ల నుంచి నగదు కోరుతున్నారు’ అని చెప్పారు. ప్రస్తుత జీఎస్టీ ఫ్రేమ్వర్క్ ప్రకారం వస్తువులను సరఫరా చేసే వ్యాపారులు తమ వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లకు పరిమితి రూ.20 లక్షలుగా ఉంది.ఇదీ చదవండి: క్రెడిట్ కార్డే దిక్కు!ఈ వ్యవహారంపై వాణిజ్య పన్నుల శాఖ స్పందిస్తూ 2021-22 నుంచి యూపీఐ లావాదేవీల డేటా జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమయ్యే టర్నోవర్ స్థాయులను చేరిన వారికే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. అటువంటి వ్యాపారులు వెంటనే వివరాలు నమోదు చేసుకోవాలని, పన్ను పరిధిలోకి వచ్చే టర్నోవర్ను వెల్లడించాలని తెలిపింది. ఇదిలాఉండగా, జీఎస్టీ అధికారులు యాదృచ్ఛిక గణాంకాలను టర్నోవర్గా పేర్కొనలేరని కర్ణాటక వాణిజ్య పన్నుల మాజీ అదనపు కమిషనర్ హెచ్డీ అరుణ్ కుమార్ అన్నారు. -
సిటీలో పెరిగిన నిరుద్యోగ రేటు
జూన్లో నిరుద్యోగిత (నిరుద్యోగం రేటు) ఫ్లాట్గా నమోదైంది. ఈ ఏడాది మే నెలలో మాదిరే జూన్లోనూ 5.6 శాతం వద్దే (అన్ని వయసుల వారికి సంబంధించి) కొనసాగింది. ఏప్రిల్లో ఉన్న 5.1 శాతం కంటే కొంచెం ఎక్కువ. కానీ, పట్టణాల్లో నిరుద్యోగ రేటు వరుసగా మూడో నెలలోనూ పెరిగింది. జూన్లో 7.1 శాతంగా నమోదైంది. ఈ మేరకు పీరియాడిక్ లేబర్ఫోర్స్ సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. పనిచేయగల అర్హతలు ఉండీ, పనిదొరక్క ఖాళీగా ఉన్న వారి గురించి ఈ గణాంకాలు తెలియజేస్తాయి. ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులుపట్టణాల్లో అన్ని వయసుల వారికి సంబంధించిన నిరుద్యోగ రేటు 7.1 శాతానికి చేరింది. మేలో 6.9 శాతం, ఏప్రిల్లో 6.5 శాతం చొప్పున ఉండడం గమనార్హం. పట్టణాల్లో 15.29 సంవత్సరాల వారిలో నిరుద్యోగ రేటు జూన్లో 18.8 శాతానికి పెరిగింది. మే నెలలో ఇది 17.9 శాతంగా ఉంటే, ఏప్రిల్లోనూ 17.2 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మహిళలకు సంబంధించి నిరుద్యోగ రేటు జూన్లో 5.6 శాతానికి తగ్గింది. మేలో ఇది 5.8 శాతంగా ఉంది. 15–29 ఏళ్ల వయసు వారిలో నిరుద్యోగిత మే నెలలో 15 శాతంగా ఉంటే, జూన్లో 15.3 శాతానికి పెరిగింది. కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (15 ఏళ్లకు మించిన వారిలో) మే నెలలో ఉన్న 54.8 శాతం నుంచి జూన్లో 54.2 శాతానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో 56.1 శాతం, పట్టణ ప్రాంతాల్లో 50.4 శాతం చొప్పున జూన్లో నమోదైంది.పురుష కార్మికుల భాగస్వామ్య రేటు గ్రామీణ ప్రాంతాల్లో 78.1 శాతం, పట్టణాల్లో 75 శాతం చొప్పున ఉంది. మే నెలతో పోల్చి చూస్తే స్వల్పంగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జూన్లో 35.2 శాతానికి తగ్గింది.గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ, పురుషుల నిరుద్యోగ రేటు పెరగడానికి.. సొంత పనులపై ఆధారపడడం వల్లేనని ఈ సర్వే నివేదిక తెలిపింది. -
ఎగుమతులు కదల్లేదు..మెదల్లేదు!
వస్తు ఎగుమతులు జూన్ నెలలో 35.14 బిలియన్ డాలర్లుగా (రూ.2.99 లక్షల కోట్లు) నమోదయ్యాయి. 2024 జూన్ నెలలోనూ ఎగుమతులు 35.16 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. దిగుమతులు 3.71 శాతం క్షీణించి 53.93 బిలియన్ డాలర్లు (రూ.4.58 లక్షల కోట్లు)గా ఉన్నాయి. దీంతో వాణిజ్య లోటు నాలుగు నెలల కనిష్ట స్థాయిలో 18.78 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. పెట్రోలియం ఉత్పత్తులు, వ్రస్తాలు, రత్నాభరణాలు, లెదర్, ముడి ఇనుము, ఆయిల్ సీడ్స్, జీడి పప్పు, దినుసులు, పొగాకు, కాఫీ ఎగుమతులు క్రితం ఏడాది జూన్ నెలతో పోల్చి చూస్తే క్షీణించాయి. ఇదే కాలంలో ఇంజినీరింగ్, టీ, బియ్యం, రెడీ మేడ్ వ్రస్తాలు, కెమికల్స్, సముద్ర ఉత్పత్తులు, ఫార్మా ఎగుమతుల పరంగా సానుకూల వృద్ధి నమోదైంది. జూన్ త్రైమాసికంలో వస్తు, సేవల ఎగుమతులు 210 బిలియన్ డాలర్లుగా ఉంటాయని.. క్రితం ఏడాది ఇదే త్రైమాసికం కంటే 6 శాతం ఎక్కువని వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భత్వాల్ తెలిపారు. ఎగుమతులు–దిగుమతులు జూన్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 16 శాతం తగ్గి 4.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ జుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికంలో 15 శాతానికి పైగా తగ్గి 17.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల ఎగుమతులు జూన్లో 47 శాతం పెరిగి 4.14 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలోనూ ఎగుమతులు 47 శాతం వృద్ధితో 12.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వస్తు ఎగుమతులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2 శాతం పెరిగి 112 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు సైతం 4 శాతానికి పైగా పెరిగి 179 బిలియన్ డాలర్లకు చేరాయి. ఏప్రిల్–జూన్ కాలంలో వాణిజ్య లోటు 67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 62 బిలియన్ డాలర్లుగా ఉంది.ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లు ముడి చమురు దిగుమతులు 8 శాతం తగ్గి 25.73 బిలియన్ డాలర్లుగా, బంగారం దిగుతులు 26 శాతం తగ్గి 1.9 బిలియన్ డాలర్ల చొప్పున జూన్లో నమోదయ్యాయి. జూన్లో సేవల ఎగుమతుల విలువ 32.84 బిలియన్ డాలర్లుగా ఉంటుందని వాణిజ్య శాఖ అంచనా వేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 28.67 బిలియన్ డాలర్లుగా ఉంది. సేవల దిగుమతుల విలువ 15 బిలియన్ డాలర్ల నుంచి 17.58 బిలియన్ డాలర్లకు పెరిగింది. -
మధ్యతరగతి పాలిట శాపం.. విద్యా ద్రవ్యోల్బణం
లాభాపేక్ష లేని సంస్థలుగా పని చేయాల్సిన విద్యాసంస్థలు కార్పొరేట్ మాఫియాగా మారి తల్లిదండ్రుల నుంచి భారీగా దన్నుకుంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని యాజమాన్యాలు చెప్పినకాడికి ముట్టజెప్పుతున్నారు. దేశంలో ఏటా పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం కంటే నిశ్శబ్దంగా విద్యా ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతోందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ప్రైవేట్ విద్య ఆర్థిక సవాలుగా మారిందని, పెరుగుతున్న పాఠశాల ఫీజులతో మధ్యతరగతి కుటుంబాలు కుదేలవుతున్నట్లు విద్యావేత్త, చార్టర్డ్ అకౌంటెంట్ మీనాల్ గోయల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక్కో చిన్నారికి రూ.3.5 లక్షల వరకు..గోయల్ లింక్డ్ఇన్ పోస్ట్లోని వివరాల ప్రకారం.. ‘దేశంలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాల్లోని చాలా పాఠశాలల్లో ప్రైమరీ విద్య కోసం సుమారుగా అడ్మిషన్ ఛార్జీలు రూ.35 వేలు, ట్యూషన్ ఫీజు రూ.1.4 లక్షలు, వార్షిక ఛార్జీలు రూ.38 వేలు, రవాణా ఫీజు రూ.44 వేల నుంచి రూ.73 వేలు, పుస్తకాలు, యూనిఫామ్లకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు బాదుతున్నారు. అంటే ఒక్కో చిన్నారికి ఏడాదికి రూ.2.5-రూ.3.5 లక్షలు’ అని చెప్పారు.ఫీజుల కోసం ఈఎంఐలు..‘మిడ్ టైర్ స్కూళ్లు కనీసం రూ.లక్ష ఫీజుతో ప్రారంభిస్తున్నాయి. ఎలైట్ స్కూళ్లు ఈజీగా రూ.4 లక్షలతో అడ్మిషన్ మొదలు పెడుతున్నాయి. దేశంలో ఏటా పెరుగుతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుతున్నాం, కానీ విద్యా ద్రవ్యోల్బణం మధ్యతరగతి పాలిట శాపంగా మారుతోంది. ఫిన్టెక్ సంస్థలు ఇప్పుడు పాఠశాల ఫీజుల కోసం ఈఎంఐలను అందిస్తున్నాయి’ అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు అధ్వానంఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యామ్నాయం కాదు. అందులోనూ 8 లక్షల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క యూపీలోనే 5వేల పాఠశాలల్లో ఒకే ఒక్క ఉపాధ్యాయుడు ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వ సర్వేలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి విద్యార్థుల్లో 70 శాతం మంది పేరాగ్రాఫ్ చదవలేని పరిస్థితులున్నాయి. విద్యుత్ లేని లక్ష పాఠశాలలున్నాయి. మరుగుదొడ్లు లేని 46,000 పాఠశాలలు, తాగునీరు లేని పాఠశాలలు 39,000 ఉన్నాయి. భారతదేశం జీడీపీలో కేవలం 4.6% మాత్రమే విద్యపై ఖర్చు చేస్తుంది. వివిధ కమిటీలు సిఫార్సు చేసిన 6% కంటే ఇది చాలా తక్కువ.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఏం చేయాలంటే..‘చట్టపరంగా లాభాపేక్ష లేకుండా పనిచేయాల్సిన ప్రైవేటు పాఠశాలలు వ్యవస్థలోని చాలా లొసుగులను అన్వేషిస్తున్నాయి. డొల్ల కంపెనీల ద్వారా యజమానులు తమ సొంత పాఠశాలలకు ఆస్తులను లీజుకు ఇవ్వడం, అధిక అద్దెలు వసూలు చేయడం, బిల్లును ఫీజుల రూపంలో తల్లిదండ్రులకు పాస్ఆన్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల నుంచి తప్పించుకుని రూ.కోట్లు సంపాదిస్తున్నారు’ అని గోయల్ తెలిపారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ప్రైవేట్ విద్యా సంస్థల ఆర్థిక దోపిడిని కట్టడి చేయాల్సి ఉంది. కొందరు అధికారులు విద్యా సంస్థల యాజమాన్యాలు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తిపడి తల్లిదండ్రుల నెత్తిన భారం మోపుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన పరిస్థితులపై యంత్రాంగం దృష్టి సారించాలి. -
ట్రంప్ టారిఫ్లు.. మన ఎగుమతులకు మంచిదే
న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులు మరింత పోటీతత్వంగా మారినట్టు నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. చైనా, కెనడా, మెక్సికోలపై ట్రంప్ సర్కారు అధిక టారిఫ్లు విధించడం మనకు అనుకూలిస్తుందని పేర్కొంది. సంఖ్యా పరంగా, విలువ పరంగా అమెరికా మార్కెట్లో భారత ఎగుమతులకు గణనీయమైన అవకాశాలున్నట్టు తెలిపింది. ‘‘30కు గాను 22 విభాగాల్లో భారత పోటీతత్వం పెరగనుంది. ఈ విభాగాల మార్కెట్ పరిమాణం 2,285 బిలియన్ డాలర్లుగా ఉంది’’అని ఈ నివేదిక వెల్లడించింది. ఈ విభాగాల్లో అమెరికాకు చైనా, కెనడా, మెక్సికో ప్రధాన ఎగుమతిదారులుగా ఉన్నట్టు తెలిపింది. ఈ దేశాలపై 30 శాతం, 35 శాతం, 25 శాతం చొప్పున అధిక సుంకాల బాదుడుతో భారత ఎగుమతుల పోటీతత్వం పెరగనున్నట్టు అంచనా వేసింది. ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ తదితర విభాగాల్లో మార్కెట్ వాటా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక 30కు గాను 6 విభాగాల్లో భారత పోటీతత్వంలో ఎలాంటి మార్పు ఉండబోదని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతుల్లో వీటి వాటా 32.8 శాతంగా (26.5 బిలియన్ డాలర్లు) ఉంటుందని తెలిపింది. ‘‘ఆరు ఉత్పత్తుల విభాగాల్లో భారత్ 1–3 శాతం మేర అధిక టారిఫ్లను ఎదుర్కోనుంది. యూఎస్కు భారత ఎగుమతుల్లో 52 శాతం వాటా కలిగిన 78 ఉత్పత్తుల విభాగాల్లో పోటీతత్వం పెరగనుంది. 17 ఉత్పత్తుల విభాగాల్లో ఎలాంటి మార్పు ఉండదు’’అని వివరించింది. ఈ రంగాలకు సానుకూలం.. చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్లతో పోల్చి చూస్తే.. భారత మినరల్స్, ఇంధనాలు, వ్రస్తాలు, ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, ఫరి్నచర్, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకు ప్రయోజనం చేకూరనున్నట్టు నీతి ఆయోగ్ తన నివేదికలో విశ్లేషించింది. ఎంఎస్ఎంఈలకు మద్దతుగా నిలిచేందుకు, ఎగుమతుల పోటీతత్వాన్ని పెంచేందుకు వీలుగా ఉత్పత్తి అనుసంధాన ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించింది. లెదర్, ఫుట్వేర్, ఫరి్నచర్, హ్యాండిక్రాఫ్ట్స్కు సైతం పీఎల్ఐ కింద మద్దతు ఇవ్వాలని పేర్కొంది. అలాగే, విద్యుత్ టారిఫ్లను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించింది. దీనివల్ల తయారీ వ్యయాలు తగ్గుతాయని వివరించింది. ఐటీ, ఆర్థిక సేవలు, నైపుణ్య సేవలు, విద్యా రంగాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందానికి కృషి చేయాలని సూచించింది. -
ధరలు.. దిగొచ్చాయ్!
న్యూఢిల్లీ: కూరగాయలు, ఆహార ధరలు మరింత దిగొచ్చాయి. ఫలితంగా జూన్లో వినియోగ ధరల సూచీ (రిటైల్ ద్రవ్యోల్బణం/సీపీఐ) 2.1 శాతానికి దిగొచ్చింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.82 శాతం కాగా, గతేడాది జూన్లో 5.08 శాతంగా ఉంది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసింది. చివరిగా 2019 జనవరిలో నమోదైన 1.97 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం గత కనిష్ట స్థాయిగా ఉంది. కూరగాయలు, పప్పులు, మాంసం, చేపలు, ధాన్యాలు, చక్కెర, పాలు, పాల ఉత్పత్తులు, దినుసుల ధరలు దిగిరావడమే రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు వచ్చేందుకు సాయపడినట్టు ఎన్ఎస్వో తెలిపింది. ఆహార ధరల విభాగంలో ద్రవ్యోల్బణం మైనస్ 1.06 శాతానికి క్షీణించింది. ఈ ఏడాది మే నెలతో పోల్చి చూస్తే 2 శాతం దిగొచ్చింది. మైనస్లోకి టోకు ద్రవ్యోల్బణం...జూన్ నెలకు సంబంధించి టోకు ద్రవ్యోల్బణం (టోకు ధరల సూచీ/డబ్ల్యూపీఐ) ఏకంగా ప్రతికూల స్థాయికి పడిపోయింది. మైనస్ 0.13 శాతంగా నమోదైంది. 19 నెలల తర్వాత మళ్లీ ప్రతికూల స్థాయికి చేరింది. ఆహారోత్పత్తులు, మినరల్ ఆయిల్స్, ఇంధనాలు, బేసిక్ మెటల్స్, తయారీ ఉత్పత్తుల వ్యయాలు దిగిరావడం ఇందుకు దారితీసింది. ఈ ఏడాది మే నెలకు టోకు ద్రవ్యోల్బణం 0.39 శాతం కాగా, గతేడాది జూన్ నెలలో 3.43 శాతం చొప్పున ఉంది. -
ఐదేళ్ల ముందే 50 శాతం టార్గెట్ పూర్తి
పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ కీలక మైలురాయిని చేరుకుంది. శిలాజేతర ఇంధన శక్తి సామర్థ్యాన్ని నిర్దేశించిన ఐదేళ్ల ముందే 50% లక్ష్యాన్ని సాధించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం భారత్లో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 484.8 గిగావాట్లు. ఇందులో 242.8 గిగావాట్లు గ్రీన్ వనరుల నుంచే వస్తుందన్నారు. దాంతో స్థాపిత సామర్థ్యంలో 50 శాతం శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తి నమోదవుతోంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?దేశంలో 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన ఆధారిత విద్యుదుత్పత్తిని పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ‘ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గ్రీన్ ఎకోసిస్టమ్ను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకున్నాం. దేశం మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇప్పుడు 484.8 గిగావాట్లుగా ఉంది. అందులో శిలాజేతర ఇంధన వనరుల నుంచి 242.8 గిగావాట్లు సమకూరుతుంది’ అని జోషి ఎక్స్లో తెలిపారు. 2030 నాటికి భారత్ శిలాజేతర ఇంధన లక్ష్యంలో 50 శాతం ఐదేళ్లు ముందే సాధించింది. -
పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధుల కోసం ఎంతో మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు తదుపరి విడత పీఎం కిసాన్ నిధులను ఎకరాకు రూ.2,000 చొప్పున ఈ జులైలోనే విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పీఎం కిసాన్ నిధులను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. చివరి 19వ విడతను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియకముందే విడుదల చేశారు. అయితే ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది.త్వరలోనే జూన్ వాయిదాలను ఈ జులైలో విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతులు తమ అర్హతను తెలుసుకోవాలని, ఈ-కేవైసీని అప్డేట్ చేయాలని సూచిస్తున్నారు. రైతుల చిరునామా కూడా వ్యాలిడేట్ అయ్యేలా చూసుకోవాలని చెప్పారు. కొందరి చిరునామా, లొకేషన్ రికార్డుల్లో తప్పుల కారణంగా అనర్హులుగా మిగిలిపోతున్నట్లు తెలిపారు. కాబట్టి చిరునామాను అప్డేట్ చేయాలని చెప్పారు.పీఎం కిసాన్ భూమి చిరునామా అప్డేట్ చేయడం ఎలా?1. పీఎం కిసాన్ వెబ్సైట్.. https://pmkisan.gov.inలోకి వెళ్లాలి.2. హోమ్ పేజీలోని ఫార్మర్స్ కార్నర్ కింద ‘స్టేట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్’పై క్లిక్ చేయాలి.3. ‘రిజిస్ట్రేషన్ నంబర్’ లేదా ‘ఆధార్ నంబర్’ ఎంటర్ చేయాలి.4. కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.5. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.6. మొబైల్కు వచ్చిన ఓటీపీ అందులో ఫిల్ చేయాలి.7. మీ పేరు మీద సాగు భూమి రుజువు పత్రాలను అప్లోడ్ చేయాలి. (పట్టా పుస్తకాలు, భూ రికార్డులు..మొదలైనవి)8. మీరు చేసిన మార్పులను సమీక్షించి ఆన్లైన్లో ఫామ్ సబ్మిట్ చేయాలి.ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?ఈ పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ఈ-కేవైసీ, ఫేషియల్ అథెంటికేషన్ అనే మూడు సులువైన మార్గాల్లో ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.పీఎం-కిసాన్ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ను ఎలా తనిఖీ చేయాలి?https://pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ సందర్శించాలి.‘నో యువర్ స్టేటస్’పై క్లిక్ చేయాలి.మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి.లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.ఇదీ చదవండి: మరో 2,400 మంది ఉద్యోగాలు కట్!పీఎం కిసాన్ స్కీమ్2019లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. తర్వాత పీఎం కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకంగా నిలిచింది. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో ఏటా రూ.6,000 చొప్పున అందిస్తారు. -
క్యూ1 ఫలితాలే దిక్సూచి
(క్యూ1) ఫలితాలతోపాటు.. ఇటు ఆర్థిక గణాంకాల ఆధారంగా కదిలే వీలుంది. ఈ వారం పలు టెక్ దిగ్గజాల క్యూ1 పనితీరు వెల్లడికానుండగా.. టోకు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. వీటికితోడు అంతర్జాతీయ అంశాలు, మార్కెట్లపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం... గత వారం చివర్లో డీలా పడిన దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం కన్సాలిడేషన్ బాటలో సాగే అవకాశమున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసిక ఫలితాల సీజన్ ప్రారంభంకావడంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు ఆల్మండ్ గ్లోబల్ సీనియర్ ఈక్విటీ రీసెర్చ్ నిపుణులు సిమ్రన్జీత్ సింగ్ భాటియా తెలియజేశారు. గత వారం ఐటీ సేవల టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ క్యూ1 పనితీరుతో సీజన్కు తెరతీసింది. ఫలితాలు, అంచనాలు నిరాశపరచడంతో వారాంతాన టీసీఎస్సహా ఇతర ఐటీ కౌంటర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఈ వారం హెచ్సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, విప్రోతోపాటు.. ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్, మెటల్ రంగ బ్లూచిప్ జేఎస్డబ్ల్యూ స్టీల్ తదితరాలు క్యూ1 ఫలితాలు ప్రకటించనున్నాయి. దీంతో మార్కెట్ ఆటుపోట్ల మధ్య ఫలితాల ఆధారంగా కొన్ని కౌంటర్లు వెలుగులో నిలవవచ్చని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా పేర్కొన్నారు. ధరల గణాంకాలు.. గత(జూన్) నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) గణాంకాలు నేడు(14న) విడుదలకానున్నాయి. మే నెలకు డబ్ల్యూపీఐ 0.39 శాతం పెరిగింది. ఏప్రిల్లో నమోదైన 0.85 శాతంతో పోలిస్తే తగ్గింది. ఈ బాటలో జూన్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలను ప్రభుత్వం 15న ప్రకటించనుంది. మే నెలలో సీపీఐ 2019 ఫిబ్రవరి తదుపరి కనిష్టంగా 2.82 శాతానికి చేరింది. ఏప్రిల్లో నమోదైన 3.16 శాతంతో పోలిస్తే వెనకడుగు వేసింది. ధరల గణాంకాలు రిజర్వ్ బ్యాంక్ చేపట్టే పాలసీ సమీక్షలో వడ్డీ రేట్ల నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. దీంతో వీటికి ప్రాధాన్యత ఉన్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. దేశీయంగా క్యూ1 ఫలితాలు మార్కెట్లపై ప్రభావం చూపనుండగా.. ధరల గణాంకాలు సైతం సెంటిమెంటుకు కీలకంకానున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ట్రేడ్ డీల్పై దృష్టి యూఎస్, భారత్ మధ్య ఇటీవల ప్రారంభమైన వాణిజ్య టారిఫ్ల చర్చలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కెనడా తదితర పలు దేశాల దిగుమతులపై వివిధ స్థాయిల్లో టారిఫ్లను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్, భారత్ వాణిజ్య ఒప్పందంతోపాటు.. ఇతర దేశాలతో ట్రంప్ టారిఫ్ చర్చలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాలు యూఎస్సహా ప్రపంచ స్టాక్ మార్కెట్ల కదలికలు, ముడిచమురు ధరలు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐ) పెట్టుబడులు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ వారం యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు, చైనా జీడీపీ వివరాలు వెల్లడికానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య టారిఫ్ల అనిశి్చతులకుతోడు.. రాజకీయ, భౌగోళిక వివాదాలు కొనసాగుతుండటం సెంటిమెంటును దెబ్బతీయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. వెరసి మార్కెట్లు కన్సాలిడేషన్ బాటలో సాగవచ్చని అభిప్రాయపడ్డారు.సాంకేతికంగా చూస్తే..గత వారం ప్రధాన ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ కీలకమైన ఇంటర్మీడియెట్ మద్దతులను కోల్పాయాయి. నిజానికి మొదటి మూడు రోజులు స్థిరంగా కదిలినప్పటికీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఫలితాలు, టారిఫ్లపై అనిశి్చతి, ఎఫ్పీఐల అమ్మకాలు దెబ్బతీసినట్లు సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. ఇంతక్రితం అంచనా వేసినట్లు నిఫ్టీ బ్రేకవుట్ సాధించి 25,500కు చేరినప్పటికీ ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. వారాంతాన 25,150కు క్షీణించింది. దీంతో స్వల్ప కాలంలో 24,800–24,700కు నీరసించే వీలుంది. వెరసి 25,400–25,500 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. ఇదేవిధంగా సెన్సెక్స్ 82,500కు జారింది. దీంతో 81,500–81,000 స్థాయిలో సపోర్ట్ తీసుకునే అవకాశముంది. 82,800–83,050 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చునని నిపుణలు విశ్లేíÙంచారు.గత వారమిలా.. గత వారం(7–11) దేశీ స్టాక్ మార్కెట్లు తొలి అర్ధభాగంలో బలపడినప్పటికీ చివర్లో డీలా పడ్డాయి. వాణిజ్య టారిఫ్ వివాదాలు, నిరుత్సాహకర టీసీఎస్ ఫలితాలు ప్రభావం చూపాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 932 పాయింట్లు(1.1 శాతం) క్షీణించింది. 82,500 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ సైతం 311 పాయింట్లు(1.2 శాతం) నీరసించింది. 25,150 వద్ద స్థిరపడింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
స్వల్పంగా తగ్గిన నికర పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూలై 10 వరకు 1.34 శాతం తగ్గి రూ.5.63 లక్షల కోట్ల మేర ఉన్నాయి. రిఫండ్లు పెరిగిపోవడమే ఇందుకు కారణం. నికర కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్లు కాగా, నాన్ కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.3.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. రూ.17,874 కోట్లు సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను రూపంలో వసూలైంది. ఈ మొత్తం కలిపి రూ.5.63 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.70 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. నికర రిఫండ్లు (పన్ను చెల్లింపుదారులకు చెల్లించింది) 38 శాతం పెరిగి రూ.1.02 లక్షల కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లు చెల్లించకముందు చూస్తే స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.6.65 లక్షల కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన రూ.6.44 లక్షల కోట్ల కంటే 3.17 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. కేవలం రిఫండ్లు పెరిగిపోవడం నికర ఆదాయం తగ్గడానికి దారితీసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.25.20 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్లో కేంద్రం అంచనాలు ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూసినప్పుడు 12.7 శాతం అధికం. ముఖ్యంగా రూ.78,000 కోట్లు సెక్యూరిటీస్ లావాదేవీల రూపంలోనే సమకూర్చుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. -
ఇక దేశీయంగా రేర్ మాగ్నెట్స్ ఉత్పత్తి
న్యూఢిల్లీ: దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,345 కోట్ల స్కీముపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మాగ్నెట్స్ తయారీ కోసం ఎంపికయ్యే రెండు సంస్థలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి ఈ విషయాలు వెల్లడించారు. చర్చలు పూర్తయ్యాక ప్రతిపాదనను తుది ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్కు పంపే అవకాశం ఉంది. రేర్ ఎర్త్ ఆక్సైడ్లను మాగ్నెట్ల కింద మార్చే ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ సబ్సిడీలు ఉపయోగపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మాగ్నెట్స్ ఎగుమతులపై ప్రధాన సరఫరాదారు అయిన చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తున్న సంగతి తెలిసిందే. టెలికం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తదితర రంగాల్లో ఉత్పత్తికి ఇవి కీలకంగా ఉంటాయి. ఎలక్ట్రిక్ ట్రక్కులకు స్కీము.. పీఎం ఈ–డ్రైవ్ కార్యక్రమం కింద ఎలక్ట్రిక్ ట్రక్కులు కొనుగోలు చేసే వారికి రూ. 9.6 లక్షల వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చే పథకాన్ని కుమారస్వామి ఆవిష్కరించారు. సుమారు 5,600 ట్రక్కులకు వర్తించే ఈ పథకంతో పోర్ట్లు, లాజిస్టిక్స్, సిమెంట్, స్టీల్ తదితర పరిశ్రమలు లబ్ధి పొందనున్నాయి. మొత్తం వాహనాల్లో డీజిల్ ట్రక్కుల వాటా 3 శాతమే అయినప్పటికీ రవాణా సంబంధిత గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో 42 శాతం వాటా వాటిదే ఉంటోందని కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్గారాలను తగ్గించే, పర్యావరణహితమైన సరకు రవాణా విధానాలను అమలు చేసేందుకు ఈ స్కీము దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్ పరిమాణం రూ. 10,900 కోట్లు కాగా, ఇందులో ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు. -
గ్రామీణ రంగంలో పెట్టుబడులకు చేయూత
న్యూఢిల్లీ: గ్రామీణ రంగంలోకి మరిన్ని ప్రైవేటు పెట్టుబడులు తీసుకురావడానికే తమ ప్రాధాన్యతని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ) ప్రెసిడెంట్ అల్వారో లారియో తెలిపారు. మరే ఇతర రంగంతో పోల్చి చూసినా వ్యవసాయ రంగంలో పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా పేదరిక నిర్మూలనకు సాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. 1977లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీ, ఆర్థిక సంస్థగా ఏర్పాటైన ఐఎఫ్ఏడీ గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక, ఆకలి బాధల నిర్మూలన కోసం కృషి చేస్తుంటుంది. గ్రామీణ ప్రాంతాల కోసం దీర్ఘకాలిక రుణాలను సమీకరించడం, తద్వారా దీర్ఘకాల ఫలితాలను సాధించడం ఐఎఫ్ఏడీ ప్రాధాన్యతగా లారియో చెప్పారు. భారత్తో 50 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని, ఐఎఫ్ఏడీ వ్యవస్థాపక సభ్య దేశాల్లో భారత్ కూడా ఒకటని గుర్తు చేశారు. అతిపెద్ద రుణ గ్రహీతతోపాటు నిధుల విరాళంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొన్నారు. భారత్ ముందు మూడు కీలక ప్రశ్నలు.. ‘‘భారత్ ముందు మూడు ముఖ్యమైన ప్రశ్నలున్నాయి. రైతులకు వ్యవసాయం మరింత లాభదాయకంగా ఎలా మార్చగలం? వాతావరణపరమైన ఎన్నో సవాళ్ల మధ్య ఉత్పాదకతను పెంచడం ఎలా? ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రత దిశగా ఎలా ముందుకు వెళ్లాలి?’’అని అల్వారో లారియో ప్రశ్నలు సంధించారు. ఉష్ణోగ్రతలు పెరగడం, అసహజ వర్షపాతం తదతర వాతావరణపరమైన మార్పులు ప్రపంచ ఆహార భద్రతకు అతిపెద్ద ముప్పుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విధమైన మార్పులు పంట దిగుబడులు, ఉపాధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్టు తెలిపారు. భారత్లో సీజన్వారీ నీటి కరువు, ఉష్ణోగ్రతల పెరుగుదల, కరువు సమస్యలున్నట్టు చెప్పారు. భారత జీడీపీలో వ్యవసాయం 20 శాతం వాటాతో, 42 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికే వ్యవసాయ రంగంలో పురోగతి సాధించినప్పటికీ.. పేదలను సైతం ఆర్థిక సేవల్లో భాగం చేయడం, చిన్న ఉత్పత్తిదారులకు మార్కెట్ అనుసంధానత కల్పించడం కీలకమని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ప్రైవేటు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. -
‘ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదు’
బిహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కోసం ఆమోదయోగ్యమైన గుర్తింపు పత్రాల నుంచి ఆధార్ను మినహాయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈఓ భువనేష్ కుమార్ స్పష్టతనిచ్చారు. ఆధార్ పౌరుల తొలి గుర్తింపు కాదని చెప్పారు. ప్రభుత్వ సర్వీసులు సులువుగా పొందేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలిపారు.ఓ మీడియా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడిన కుమార్ నకిలీ ఆధార్ కార్డులను తనిఖీ చేసి వాటిని గుర్తించేందుకు యూఐడీఏఐ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. ఆధార్ కార్డులకు క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటర్నల్ భద్రతా యంత్రాంగం ఉందని పేర్కొన్నారు. జారీ చేసిన అన్ని కొత్త ఆధార్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉందని, యూఐడీఏఐ అభివృద్ధి చేసిన ఆధార్ క్యూఆర్ స్కానర్ యాప్ త్వరలో అందుబాటులో ఉంటుందన్నారు. ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డులోని వివరాలను క్యూఆర్ కోడ్లో పొందుపరిచిన వాటితో సరిపోల్చుకోవచ్చని చెప్పారు. ఎవరైనా నకిలీ ఆధార్ కార్డు చూపిస్తే దీని ద్వారా సులభంగా చెక్ చేయవచ్చని తెలిపారు.ఫొటోషాప్ లేదా ప్రింటెడ్ టెంప్లెట్లను ఉపయోగించి ప్రజలు నకిలీగా ఆధార్ కార్డులను సృష్టిస్తున్న సందర్భాలున్నాయని కుమార్ వివరించారు. కొత్త ఆధార్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందని వెల్లడించారు. ‘ఇప్పటికే ఈ యాప్కు డెమో నిర్వహించారు. ఇది పురోగతిలో ఉంది. అంతర్గతంగా దాన్ని చెక్ చేస్తున్నారు. ఈ యాప్ ప్రాథమికంగా ఆధార్ నంబర్ హోల్డర్ సమ్మతితో డిజిటల్ పద్ధతిలో ఐడెంటిటీని పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా ప్రజలు తమ ఆధార్ కార్డుల ఫిజికల్ కాపీలను షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో మాస్క్డ్ వెర్షన్ కూడా ఉంటుంది’ అన్నారు.ఇదీ చదవండి: అంతా ఫేక్.. నమ్మొద్దు!జూన్ 24న ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం జులై 25 నాటికి బిహార్లో దాదాపు 8 కోట్ల మంది ఓటర్లలో అనర్హుల పేర్లను తొలగించి, అర్హులైన పౌరుల జాబితానే సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వి యాదవ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రం అంతటా విస్తృతంగా ఉన్న ఆధార్, ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డులను గుర్తింపు రుజువుగా అంగీకరించకపోవడం వల్ల ఓటర్లు అసౌకర్యానికి గురవుతున్నారని రాష్ట్ర అసెంబ్లీలో ఆయన తెలిపారు. -
అంతా ఫేక్.. నమ్మొద్దు!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం కొత్త రకం గోల్డెన్ వీసా పథకాన్ని ప్రారంభించినట్లు వచ్చిన వార్తలపై అక్కడి ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొన్ని షరతులతో నామినేషన్ విధానంలో ఈ వీసాను త్వరలో జారీ చేయనున్నట్లు వచ్చిన కథనాల్లో వాస్తవం లేదని యూఏఈ ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఈ కథనాలు పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేశాయి.లక్ష అరబ్ ఎమిరేట్స్ దినార్లు (సుమారు రూ.23.3 లక్షలు) ఫీజు చెల్లిస్తే జీవితకాలం వర్తించే వీసా అందజేస్తున్నట్లు రాయద్ గ్రూప్ తెలిపింది. దాంతో చాలా అంతర్జాతీయ వార్తా సంస్థలు ఈమేరకు కథనాలు ప్రచురించాయి. ఇవికాస్తా వైరల్గా మారడంతో దుబాయ్ ప్రభుత్వమే రంగంలోకి దిగి స్పష్టతనిచ్చింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ (ఐసీపీ) విభాగాలు ఇలా వస్తున్న కథనాలను నమ్మకూడదని తేల్చి చెప్పాయి.UAE denies lifetime Golden Visa eligibility for Indians, Bangladeshis; dismisses ₹23 lakh reporthttps://t.co/FcxxTHOnpx— Hindustan Times (@htTweets) July 9, 2025ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఓఓ మనోడే..‘అన్ని గోల్డెన్ వీసా అప్లికేషన్లు అధికారిక యూఏఐ ప్రభుత్వ మార్గాలు, స్పష్టమైన విధానాల ద్వారానే ప్రాసెస్ అవ్వాలి. దరఖాస్తుదారులను నమ్మించేలా, వారి అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి లేదా నామినేట్ చేయడానికి ఏ బాహ్య కన్సల్టెన్సీకి లేదా ఏజెన్సీకి అధికారం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల ఆకాంక్షలను దుర్వినియోగం చేసే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపింది. ఖచ్చితమైన వివరాల కోసం దరఖాస్తుదారులు ఐసీపీ అధికారిక వెబ్సైట్ లేదా 600 522 222 హెల్ప్లైన్ను సంప్రదించాలని కోరింది. -
కీలక ఉత్పత్తిపై ట్రంప్ 50 శాతం సుంకం
ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికాలు, పవర్ గ్రిడ్లలో విరివిగా ఉపయోగించే కాపర్ దేశీయ ఉత్పత్తిని పెంచేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూఎస్ దిగుమతి చేసుకునే కాపర్పై 50 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్ కేబినెట్ సమావేశంలో వివరాలు వెల్లడించారు. టారిఫ్ రేటును ప్రకటించినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారో మాత్రం తెలియజేయలేదు.ఉక్కు, అల్యూమినియం, ఆటో విడిభాగాలపై ఇదే విధమైన సుంకాలను ఇప్పటికే విధించారు. ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాపర్ ధరలు రికార్డు గరిష్టాలకు పెరిగాయి. కమోడిటీ ఎక్స్చేంజీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ పౌండ్కు 10% పైగా పెరిగి 5.8955 డాలర్లకు చేరుకుంది. దిగుమతి సుంకం వల్ల యూఎస్లోని చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయనే అంచనాలతో యూఎస్ కాపర్ ఉత్పత్తిదారు ఫ్రీపోర్ట్ మెక్మోరాన్ షేర్లు 5% పెరిగాయి.ఫార్మాపై కూడా..అమెరికా ప్రస్తుతం తన కాపర్ వినియోగంలో దాదాపు సగం దిగుమతి చేసుకుంటుంది. వీటిలో ఎక్కువ భాగం చిలీ నుంచే సమకూరుతుంది. దాంతో రాబోయే రోజుల్లో ఈ దేశంలో తయారయ్యే కాపర్పై ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. కేబినెట్ సమావేశంలో ట్రంప్ అదనంగా మరిన్ని సుంకాల గురించి కూడా సంకేతాలు ఇచ్చారు. ఫార్మాస్యూటికల్ దిగుమతులపై 200% సుంకం రావచ్చని, అయితే కంపెనీలు తమ ఉత్పత్తిని తిరిగి అమెరికాకు తరలించడానికి 18 నెలల వరకు సమయం ఉండవచ్చని ఆయన సూచించారు.ఇదీ చదవండి: కుబేరులకు దేశాలు రెడ్కార్పెట్కాపర్పై సుంకాలతో కీలక రంగాలపై ప్రభావంఎలక్ట్రిక్ వాహనాలు: బ్యాటరీలు, మోటార్లు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు రాగి అవసరం.నిర్మాణం, విద్యుత్ రంగం: పవర్ గ్రిడ్, నిర్మాణ రంగం రాగి వైరింగ్, ట్యూబ్లపై ఎక్కువగా ఆధారపడుతాయి. ఇది భవన ఖర్చులను పెంచుతుంది.ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్: ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు, గృహోపకరణాల్లో గణనీయంగా రాగిని ఉపయోగిస్తారు.డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్: సైనిక పరికరాల్లో వైరింగ్, ఎలక్ట్రానిక్స్ కోసం రాగిని ఎక్కువగా వాడుతారు. -
దేశాలు పిలుస్తున్నాయ్..
మనలో చాలామంది ఇతర దేశాల పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడాలనుకుంటారు. అయితే ఇది మధ్యతరగతి వారికి కొంత కష్టం కావొచ్చుకానీ, ధనవంతులకు మాత్రం సులువే. అందుకు అనుగుణంగా ప్రస్తుతం చాలా దేశాలు వాటి సిటిజన్షిప్ నియమాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత మొన్నామధ్య ఆ దేశ పౌరసత్వం పొందాలంటే గోల్డ్కార్డు వీసా తీసుకోవాలని దాన్ని ప్రదర్శించారు. డబ్బు కడితే చాలా దేశాల పౌరసత్వం కార్డు మీ జేబులో ఉంటుంది. ఈ లిస్ట్లో కేవలం యూఎస్తోపాటు చాలా దేశాలే ఉన్నాయి. ప్రధానంగా ఏయే దేశాలు తమ పౌరసత్వం కోసం ఎలాంటి నిబంధనలు పెట్టాయో తెలుసుకుందాం.యూఎస్ఏఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు) విలువైన కొత్త గోల్డ్ కార్డు వీసాలు ప్రారంభించింది. సంపన్న విదేశీయులకు గోల్డ్ కార్డులను అందించడానికి ట్రంప్ ఈ కొత్త ప్రణాళికను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టారు. ఇది వారికి యూఎస్ రెసిడెన్సీ, పౌరసత్వానికి అవకాశం కల్పిస్తుంది. దాంతోపాటు అమెరికా ఖజానాకు ట్రిలియన్ల ఆదాయాన్ని సృష్టించగలదని, ఇది దేశ రుణాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుందని తెలిపారు. కొత్త గోల్డెన్ కార్డు కొంత వరకు గ్రీన్ కార్డు మాదిరి వెసులుబాటు అందిస్తున్నా ప్రధానంగా సంపన్నులపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని ట్రంప్ మార్చాలని యోచించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేశారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్ల(సుమారు రూ.44 కోట్లు)తో పొందాల్సి ఉంటుంది. యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ వీసాలను పొందారు.జన్మతః పౌరసత్వాన్ని గుర్తించరు..ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 8,00,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు. దాంతో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చి వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది.సింగపూర్ గోల్డెన్ వీసావ్యాపార అవకాశాలు, అధిక జీవన నాణ్యతను కోరుకునే అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు సింగపూర్ గమ్యస్థానంగా తోస్తుంది. సింగపూర్లో గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ (జీఐపీ) ద్వారా భారీ పెట్టుబడులు పెట్టేవారికి పౌరసత్వం కల్పిస్తున్నారు. దేశంలో శాశ్వత ఉనికిని చాటుకోవాలనుకునే అల్ట్రా-హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్ఎన్డబ్ల్యూఐ) కోసం ఈ వీసా ప్రోగ్రామ్ రూపొందించారు. ఈ వీసా ప్రాసెసింగ్ సమయం సాధారణంగా 9–12 నెలలుగా ఉంటుంది. జీఐపీలో పౌరసత్వం పొందాలంటే కనీసం 10 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ.67 కోట్లు) పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. జీఐపీకు అర్హత పొందాలంటే దరఖాస్తుదారులు బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్లో నిరూపితమైన ట్రాక్ రికార్డ్ కలిగి ఉండాలి. టెక్, హెల్త్కేర్, లాజిస్టిక్స్ లేదా ఫైనాన్స్ వంటి ఆమోదించబడిన రంగాల్లో ఒకదానిలో బిజినెస్ చేస్తుండాలి.పౌరసత్వం ఎప్పుడు వస్తుందంటే..గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ కింద పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) హోదా పొందిన రెండేళ్ల తర్వాత, దరఖాస్తుదారులు ప్రత్యేకంగా సింగపూర్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియలో కీలకమైన షరతు ఉంది. సింగపూర్ ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు. అందువల్ల ఆ దేశ పౌరసత్వం పొందడానికి దరఖాస్తుదారులు తమ ప్రస్తుత పౌరసత్వాన్ని వదులుకోవాలి.ప్రయోజనాలుసింగపూర్ గ్లోబల్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ పెట్టుబడిదారులకు అందించే వీసా ఉంటే 190కి పైగా దేశాలకు ప్రత్యేకంగా వీసా లేకుండా ప్రయాణించవచ్చు. సింగపూర్లో గరిష్టంగా 24% వరకు మాత్రమే వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచ స్థాయి వైద్యం, విద్య, ఉన్నత జీవన ప్రమాణాలకు సింగపూర్ కీలకంగా మారింది.ఇదీ చదవండి: పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభంయూకేయూకేలో ఈ గోల్డ్కార్డ్ వీసాను అధికారికంగా ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాగా పిలుస్తారు. పెట్టుబడిదారులను, ప్రతిభావంతులైన ఆకర్షించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి యూకే ప్రయత్నాల్లో భాగంగా 2020లో ఈ వీసాను ప్రవేశపెట్టింది. ఇది యూకేలో వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. ఈ వీసా 3 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. తర్వాత శాశ్వత నివాసానికి ఇండెఫినెట్ లీవ్ టు రిమేన్(ఐఎల్ఆర్) కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఐఎల్ఆర్ ప్రక్రియలో దరఖాస్తుదారులు కనీసం 5 సంవత్సరాలు (ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాపై గడిపిన సమయంతో సహా) యూకేలో నివసించినట్లు రుజువు చేయాలి. ఇతర నివాస, ఆదాయ ప్రమాణాలను చేరుకోవాలి. వ్యాపారంలో కనీసం 50000 పౌండ్లు(రూ.58,29,000) పెట్టుబడి పెట్టాలి.ఈ వీసాకు అర్హతలు..ఇన్నోవేటర్ ఫౌండర్ వీసాకు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఆమోదం పొందాలి. యూకే ప్రభుత్వం గుర్తించిన బిజినెస్ ఇంక్యుబేటర్, ఇన్వెస్టర్ ద్వారా ఆమోదం పొందాలి. మీ వ్యాపార ఆలోచన సృజనాత్మకమైనదని, ఆచరణీయమైనదని ఆ ఈ సంస్థ ధ్రువీకరించాలి. దరఖాస్తుదారులు బీ2 స్థాయి ఇంగ్లిష్ (సీఈఎఫ్ఆర్ స్కేల్) కలిగి ఉండాలి. ఇది అప్పర్ ఇంటర్మీడియట్ నైపుణ్యానికి సమానం. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా దీన్ని నిరూపించవచ్చు. -
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం
ఇటలీ ప్రస్తుతం కార్మిక కొరత, జనాభా క్షీణత సమస్యలతో సతమతమవుతోంది. వాటిని పరిష్కరించడానికి ఆ దేశం కొన్ని సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటలీ ప్రభుత్వం 2026-2028 మధ్య యురోపియన్ యూనియన్యేతర పౌరులకు దాదాపు 5,00,000 వర్క్ వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ జనాభాను స్థిరపరుస్తూ, ఆర్థిక భవిష్యత్తుకు ఊతం ఇచ్చేలా ఉంటుందని నమ్ముతుంది.వర్క్ వీసా విస్తరణకు సంబంధించిన కీలక వివరాలువచ్చే మూడేళ్లలో ఈయూయేతర పౌరులకు మొత్తం 4,97,550 వర్క్ పర్మిట్లు జారీ చేయాలని ఇటలీ యోచిస్తోంది. ఇది దేశంలోకి వచ్చే వలసదారులను గణనీయంగా పెంచుతుంది. స్థానికంగా లేబర్ మార్కెట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇది హైలైట్ చేస్తుంది. ఈ విధానం ద్వారా సంవత్సరాల వారీగా కింద తెలిపినట్లు వర్క్ పర్మిట్లు జారీ చేయనున్నారు.2026: 164,850 వర్క్ పర్మిట్లు2027: 166,350 వర్క్ పర్మిట్లు2028: 166,350 వర్క్ పర్మిట్లుసిబ్బంది అవసరమయ్యే రంగాలు..దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న వివిధ రంగాలకు ఈ వీసాలను పంపిణీ చేయనున్నారు. అందులోని కొన్ని పరిశ్రమలు కింద ఇస్తున్నాం.వ్యవసాయంనిర్మాణ రంగంఆరోగ్య సంరక్షణ (ముఖ్యంగా వైద్యులు, నర్సులు)టూరిజంతయారీ రంగంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్తో సహా డిజిటల్ సేవల రంగం.పైన తెలిపిన రంగాలు దేశీయ వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.ఎందుకు ఇలా చేస్తోందంటే..లేబర్ కొరతఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. వాస్తవానికి 70% కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత దేశీయంగా అనేక పరిశ్రమల్లో విస్తరించింది.రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సర్వీసుల్లో 2,58,000 ఖాళీలు45,000 మంది వైద్యులు, 65,000 మంది నర్సులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని ఎత్తి చూపుతోంది.ఇంజినీరింగ్, గ్రీన్ ఎకానమీలో 2,80,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. ఈ విభాగంలో ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతోంది.డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.జనాభా సంక్షోభంఇటలీ జననాల రేటు తగ్గుతోంది. దాంతో జనాభా కుంటుపడుతోంది. 2024లో జనాభా 37,000 తగ్గింది. జననాల కంటే 2,81,000 ఎక్కువ మరణాలు సంభవించాయి. 2050 నాటికి ఇటలీలో 34% మంది 65 ఏళ్లు పైబడి వయసు ఉంటారని అంచనా. స్థిరమైన శ్రామిక శక్తి, ఆర్థిక వ్యవస్థను కొనసాగించడానికి ఇటలీ 2050 నాటికి సుమారు 10 మిలియన్ల(ఒక కోటి) వలసదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన వర్క్ వీసా ప్రోగ్రామ్ ఈ లక్ష్యసాధనలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.భారత్ ఎలా అర్థం చేసుకోవాలంటే..వేగంగా పెరుగుతున్న శ్రామిక జనాభా ఉన్న భారతదేశం ఇటలీ వర్క్ వీసాలతో గణనీయంగా ప్రయోజనం పొందనుంది. భారత్లో ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి ‘ఇరు దేశాల మధ్య సమన్వయం’గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా హెల్త్ కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, ఐటీ వంటి రంగాల్లోని వారికి ఇటలీ లేబర్ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.ఏయే రంగాల్లో ఎవరికి అవకాశం..హెల్త్కేర్: డాక్టర్లు, నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్కు మంచి డిమాండ్ ఉంది.ఇంజినీరింగ్: ఇటలీ పారిశ్రామిక రంగాలకు, గ్రీన్ ఎకానమీకి నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం.హాస్పిటాలిటీ అండ్ టూరిజం: ఇటలీ గ్లోబల్ టూరిజం హబ్ కావడంతో ఆతిథ్య రంగంలోని కార్మికులకు గిరాకీ ఉంటుంది.డిజిటల్, ఐటీ: ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ భారతీయ టెక్ ప్రతిభావంతులకు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది.ఇటలీ ప్రభుత్వం చట్టపరమైన వలసదారుల హక్కులను సంరక్షించేదుకు కట్టుబడి ఉందని తెలిపింది. అదేసమయంలో అక్రమవలసలకు సహించబోమని తేల్చి చెప్పింది. సురక్షితమైన, నియంత్రిత వలసలను ప్రోత్సహించే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇటువంటి వలసలకు సహాయపడే దేశాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది.👉 వర్క్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే క్లిక్ చేయండివీసా అప్లికేషన్ కోసం కావాల్సిన ధ్రువపత్రాలుజాబ్ ఆఫర్ లెటర్ఆమోదం పొందిన నూలా ఓస్టా(వర్క్ పర్మిట్)వీసా దరఖాస్తు ఫారంపాస్పోర్ట్ఇటలీలో వసతి రుజువు కోసం అద్దె ఒప్పందం లేదా మీరు చేరబోయే సంస్థ లేఖలో అక్కడ ఉండటానికి వసతి ఉందని ధ్రువీకరించుకోవాలి.ఆర్థిక భరోసా: మీరు సంపాదించడం ప్రారంభించే వరకు ఇటలీలో మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి తగినంత ఆర్థిక వనరులు మీకు ఉన్నాయని ధ్రువపరిచేలా పత్రాలు ఉండాలి. ఇందులో బ్యాంక్ స్టేట్మెంట్ లేదా స్పాన్సర్ లెటర్ ఉండవచ్చు.హెల్త్ ఇన్సూరెన్స్: ఇటలీలో దరఖాస్తుదారుకు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి.ఇటలీలో డిమాండ్లో ఉన్న ఉద్యోగాలుస్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు: భవన నిర్మాణ కార్మికులు (మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్)ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లుమెకానికల్ హెల్పర్లుసేఫ్టీ ఆఫీసర్లుహెల్త్ కేర్: నర్సులు, వృద్ధుల సంరక్షణ సహాయకులు, మెడికల్ టెక్నీషియన్లుడిజిటల్, ఇంజినీరింగ్: సాఫ్ట్వేర్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, డేటా సైంటిస్టులు, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు, గ్రీన్ ఎనర్జీ టెక్నీషియన్లు.టూరిజం: హోటల్ సిబ్బంది, రెస్టారెంట్ కార్మికులు, గృహనిర్వహణ సిబ్బంది, రిటైల్ సిబ్బంది.ఇదీ చదవండి: టాటా మోటార్స్ నుంచి మినీ ట్రక్లు.. ధర ఎంతంటే..వీసా దరఖాస్తుదారులకు కొన్ని టిప్స్..బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో పని చేసేందుకు ఇటాలియన్ భాషలో ప్రావీణ్యం అవసరం లేనప్పటికీ, భాష ప్రాథమిక పరిజ్ఞానం అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆతిథ్యం, సంరక్షణ, నిర్మాణ రంగంలో పని చేస్తున్నవారికి ఎంతో తోడ్పడుతుంది.త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఇటలీ వర్క్ వీసా ప్రోగ్రామ్ కోటా ఆధారిత వ్యవస్థ (డెక్రెటో ఫ్లూస్సీ) కింద పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో అనుమతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవాలి.రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా ఎంప్లాయర్ టైఅప్లను పరిశీలించాలి. లైసెన్స్ పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు లేదా ఇటలీ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. -
ట్రంప్ అదనపు డ్యూటీల ప్రస్తావన.. రూపాయి నేలచూపు
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ తాజాగా 54 పైసలు పతనమైంది. దాంతో 85.94 వద్ద ముగిసింది. ఇంటర్బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 85.53 వద్ద ప్రారంభమైంది. తదుపరి 85.51–86.03 మధ్య ఆటుపోట్లను చవిచూసింది. ప్రపంచ కరెన్సీలతో డాలరు బలపడటం, యూఎస్ టారిఫ్ల గడువు దగ్గరపడటం తదితర అంశాలు రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి.బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఆయా దేశాలపై 10% అదనపు డ్యూటీలను విధించనున్నట్లు ప్రకటించడం సైతం రూపాయిపై ప్రభావం చూపినట్లు తెలియజేశారు. కాగా, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.25 శాతం పుంజుకుని 97.41కు చేరింది. రూపాయి విలువ ఎలాంటి సందర్భాల్లో ఎలా ఉంటుందో నిపుణులు అంచనా వేస్తున్నారు.ఇదీ చదవండి: ‘పాస్వర్డ్ సరైందే! ఎందుకు లాగిన్ అవ్వట్లేదు’టారిఫ్లు వేయడం రూపాయికి ప్రతికూలంగా మారుతుంది. ఎగుమతులు తగ్గిపోతాయి.కొత్తగా ఇతర దేశాలతో చేసుకునే కాంట్రాక్ట్లు రూపాయి విలువకు ఊతం ఇస్తాయి.భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు వాటి ధరలు పెరగడం నెగిటివ్గా ఉంటుంది.ఆర్బీఐ జోక్యం చేసుకొని రూపాయి విలువను స్థిరీకరిస్తుంది.గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా రూపాయి విలువను ప్రభావితం చేస్తుంది.ట్రంప్ టారిఫ్ వైఖరి మళ్లీ కఠినతరంగా మారితే లేదా భారత్ విస్తృత వాణిజ్య ఉద్రిక్తతల్లోకి వెళితే రూపాయి మరింత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు. -
జీఎస్టీ మూడు శ్లాబులకు తగ్గాలి
దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.4–6.7 శాతం మేర వృద్ధి చెందుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ అనిశి్చతుల రిస్క్ నెలకొన్పప్పటికీ, బలమైన దేశీ డిమండ్ వృద్ధికి మద్దతుగా నిలుస్తుందని సీఐఐ ప్రెసిడెంట్ రాజీవ్ మెమాని అభిప్రాయపడ్డారు. సీఐఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మెమానీ మీడియాతో మాట్లాడారు.రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు, వ్యవస్థలో నగదు లభ్యత పెంచే దిశగా ఆర్బీఐ రేట్ల తగ్గింపు నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని ఒక శాతం, రెపో రేటును అరశాతం తగ్గిస్తూ ఆర్బీఐ జూన్ మొదట్లో నిర్ణయం ప్రకటించడం తెలిసిందే. సీఆర్ఆర్ తగ్గించడం వల్ల వ్యవస్థలోకి రూ.2.5 లక్షల కోట్ల నిధుల లభ్యత పెరగనుంది. విదేశీ వాణిజ్యపరమైన రిస్క్లున్నాయంటూ.. అవి తటస్థం చెందుతాయని అంచనా వేస్తున్నట్టు మెమానీ చెప్పారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వృద్ధికి ప్రతికూలంగా మారినా దేశీ డిమాండ్ ఆదుకుంటుందన్నారు. జీఎస్టీ మరింత సరళం.. మూడు సులభతర శ్లాబులతో జీఎస్టీని మరింత సులభంగా మార్చాలని మెమానీ కోరారు. నిత్యావసరాలను 5 శాతం రేటు కింద, విలాసవంతమైన, హానికర వస్తువులను 28 శాతం రేటులో, మిగిలిన వస్తువులన్నింటినీ 12–18 శాతం మధ్య ఒక రేటు కిందకు తీసుకురావాలని సూచించారు. 28 శాతం రేటు అమలవుతున్న సిమెంట్ తదితర కొన్నింటిని తక్కువ రేటు కిందకు తీసుకురావాలన్నారు. అలా చేయడం ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు దేశవ్యాప్త ఏకాభిప్రాయం అవసరమన్నారు. -
‘జేన్ స్ట్రీట్’ స్కామ్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్ సంస్థ జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్ చేయకుండా గ్రూప్ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్టాక్ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్ గ్రూప్ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్ స్ట్రీట్ (జేఎస్) గ్రూప్లో భాగమైన జేఎస్ఐ ఇన్వెస్ట్మెంట్స్, జేఎస్ఐ2 ఇన్వెస్ట్మెంట్స్, జేన్ స్ట్రీట్ సింగపూర్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్ మార్కెట్లో గ్రూప్ పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్ గ్రూప్ సందేహాస్పద ట్రేడింగ్ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్ఎస్ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2025లో ఎన్ఎస్ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్ గ్రూప్ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్పీఐలు, మార్కెట్ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్ గ్రూప్ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్ గ్రూప్ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్ గ్రూప్ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్ గ్రూప్ ట్రేడింగ్ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్ ఆప్షన్లలో ట్రేడింగ్ ద్వారా జేఎస్ గ్రూప్ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్ ఫ్యూచర్స్లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్ ఫ్యూచర్స్లో రూ. 191 కోట్లు, క్యాష్ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఏం చేసింది.. ఎలా చేసింది..స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్స్ సెగ్మెంట్స్లో ట్రేడింగ్ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్ గ్రూప్పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్ గ్రూప్’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. ఉదాహరణకు.. జేఎస్ గ్రూప్ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్ ఆప్షన్స్ను షార్ట్ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్ షార్ట్ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి. దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్.. సాయంత్రానికి ఎకాయెకిన రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు. వాల్యూమ్స్పై ప్రభావం.. జేన్ స్ట్రీట్పై సెబీ చర్యలను మార్కెట్ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్ వాల్యూమ్స్పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్లో జేన్ స్ట్రీట్ లాంటి ట్రేడింగ్ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్–ఆస్క్ స్ప్రెడ్ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్ తెలిపారు. స్టాక్స్ కుదేలు.. జేఎస్ గ్రూప్పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్ఈలో నువామా వెల్త్ మేనేజ్మెంట్ షేరు 11.26%, స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఏంజెల్ వన్ షేరు 6%, బీఎస్ఈ షేరు 6.42%, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్ గ్రూప్పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్ మార్కెట్స్ డెస్క్ అనలిస్ట్ గౌరవ్ గర్గ్ తెలిపారు.ఏమిటీ జేన్ స్ట్రీట్.. ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్ స్ట్రీట్ గ్రూప్ 2000లో ట్రేడింగ్ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్లో ఇది భారత్లో కార్యకలాపాలు ఆరంభించింది. -
జోరు చూపించిన సేవల రంగం
సేవల రంగం జూన్ నెలలో బలమైన పనితీరు చూపించింది. ఇందుకు నిదర్శనంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజెనెస్ యాక్టివిటీ ఇండెక్స్ పది నెలల గరిష్ట స్థాయిలో 60.4 పాయింట్లకు చేరింది. మే నెలలో ఇది 58.8 పాయింట్ల వద్ద ఉంది. స్థానిక మార్కెట్ నుంచే కాకుండా ఎగుమతి మార్కెట్ల నుంచి కొత్త ఆర్డర్లు రావడం బలమైన పనితీరుకు దోహదం చేసింది. వ్యయాలు తగ్గడం మార్జిన్ల విస్తరణకు దోహదం చేసినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.2024 ఆగస్ట్ తర్వాత తొలిసారి కొత్త ఆర్డర్లు జూన్ నెలలో గణనీయంగా పెరిగాయి. దేశీ మార్కెట్లో కార్యకలాపాలు పెరగడం, ఎగుమతులు వృద్ధి చెందడం మెరుగైన పనితీరుకు సాయపడ్డాయి. ముఖ్యంగా ఆసియా, మధ్యప్రాచ్యం, యూఎస్ మా ర్కెట్ల నుంచి డిమాండ్ అధికమైందని భండారీ అంచనా వేశారు. వరుసగా 37వ నెలలోనూ జూన్లో ఉపాధి అవకాశాలు పెరిగినట్టు చెప్పారు. వచ్చే ఏడాది కాలంలో వృద్ధి పట్ల 18% సేవల రంగ సంస్థలు సానుకూలంగా ఉన్నాయి. 2022 తర్వాత చూస్తే ఇదే కనిష్ట స్థాయి.ఇదీ చదవండి: ‘జియో డేటా సెంటర్లలో వాడే జీపీయూలు మావే’61పాయింట్లకు కాంపోజిట్ ఇండెక్స్తయారీ, సేవల రంగ కార్యకలాపాలను ప్రతిబింబించే హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ జూన్లో 61 పాయింట్లకు పెరిగింది. మే నెలలో ఇది 59.3గా ఉంది. 14 నెలల్లోనే ఇది గరిష్ట స్థాయి కావడం గమనార్హం. -
బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి అనేలా బ్యాంకులు పట్టుబట్టకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వాడకం ప్రజల స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని తెలిపింది. బ్యాంకింగ్ వంటి సేవలకు ఆధార్ను తప్పనిసరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఉటంకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఆధార్ వివరాలు లేవనే కారణంతో ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు, ఓ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ తీర్పు వెలువడింది. కంపెనీ ప్రత్యామ్నాయంగా నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలను అందించినప్పటికీ బ్యాంకు ఆధార్ కోసం పట్టుబట్టింది. ఫలితంగా కొంతకాలం బ్యాంకు ఖాతా తెరవడం ఆలస్యం అయింది. ఇది కంపెనీ నిర్వహణ అంతరాయాలకు, ఆర్థిక నష్టానికి దారితీసిందని సంస్థ పేర్కొంది.బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధం..బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్ను స్వచ్ఛందంగా ఇవ్వగలిగినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయకూడదని నొక్కి చెప్పింది. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆధార్ వినియోగం నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. చట్టసభల మద్దతు లేకుండా ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది.The Bombay High Court has held that a bank could not have insisted on Aadhaar as a mandatory requirement for opening a bank account after the Supreme Court's verdict in Justice K.S. Puttaswamy v. Union of India (2018), and awarded ₹50,000 in compensation to a company whose… pic.twitter.com/aHDMMKuat3— Live Law (@LiveLawIndia) July 2, 2025ఇదీ చదవండి: భారత్లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలునష్టపరిహారం చెల్లింపుఖాతా తెరిచేందుకు జాప్యం జరిగిన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని గుర్తించిన బాంబే హైకోర్టు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేవైసీ నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని ఈ తీర్పు ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయ, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్ అందించినప్పుడు కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తెలుపుతుంది. -
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఫండ్స్కు డిమాండ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు మంచి డిమాండ్ నెలకొంది. ఈ విభాగంలో సుమారు 22 మ్యూచువల్ ఫండ్స్ పథకాలు సేవలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏడాది కాలంలో 37 శాతం వృద్ధితో రూ.48,000 కోట్లకు చేరుకున్నాయి. 2024 మే చివరికి వీటి నిర్వహణ ఆస్తులు రూ.34,971 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ విభాగంలోని పథకాలు మంచి పనితీరు చూపించడం ఏయూఎంలో బలమైన వృద్ధికి కారమైనట్టు తెలుస్తోంది. ఈ పథకాలు గత ఏడాది కాలంలో పెట్టుబడులపై 22 శాతం నుంచి 30 శాతం వరకు రాబడులను అందించడం గమనార్హం. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న దీర్ఘకాల విశ్వాసానికి నిదర్శనంగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీఎస్ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 14 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో ప్రధాన సూచీ సెన్సెక్స్ పెరుగుదల 10 శాతంగానే ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగంలో బీమా, ఫిన్టెక్, వెల్త్ మేనేజ్మెంట్, డిజిటల్గా రుణాలు అందించే అన్లిస్టెడ్ కంపెనీల్లోనూ ఈ తరహా ఫండ్స్ పెట్టుబడులు పెడుతుండడం ఇన్వెస్టర్లు ఆకర్షిస్తోంది. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితంగా మారుతుండడం, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం విస్తరిస్తుండడంతో ఈ విభాగంలో బలమైన కంపెనీల సంఖ్య పెరుగుతోంది. దీంతో దీర్ఘకాలంలో మంచి పెట్టుబడుల అవకాశాలను ఈ రంగం ఆఫర్ చేస్తోంది’’అని వెల్త్ మేనేజర్ అల్ఫాషా పేర్కొన్నారు. -
12 శాతం శ్లాబ్ను ఎత్తివేసే యోచనలో జీఎస్టీ?
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులను హేతుబద్ధీకరించాలనే వాదనలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు సమాచారం. కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం లేదా 12 శాతంగా ఉన్న శ్లాబ్ను పూర్తిగా తొలగించడం అనే కీలక ప్రతిపాదన చర్చలో ఉందని తెలుస్తుంది.ప్రస్తుతం 12 శాతం జీఎస్టీ విధించే వస్తువుల్లో చాలా వరకు సాధారణ పౌరులు దైనందిన జీవితంలో ఉపయోగించే వస్తువులే కావడం గమనార్హం. మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అధికంగా వినియోగించే ఉత్పత్తులు ఈ శ్లాబ్లో ఉన్నాయి. కేంద్ర పరిశీలనలో ఉన్న ప్రణాళికలో భాగంగా ఈ వస్తువులను తక్కువగా 5% పన్ను పరిధిలో వర్గీకరించాలని యోచిస్తోంది. తుది వినియోగదారులకు ఆయా వస్తువులను చౌకగా అందించాలనే లక్ష్యంతో ఈమేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.ప్రభుత్వం 12% శ్లాబ్ను పూర్తిగా రద్దు చేసి ఆయా వస్తువుల్లో కొన్నింటిని ప్రస్తుతం దాని కంటే తక్కువగా ఉన్న 5% శ్లాబ్, కొన్నింటిని ఎక్కువగా 18% శ్లాబులోకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉన్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలో జరగనున్న 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రొటోకాల్ ప్రకారం మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందు 15 రోజుల నోటీసు అవసరం. అయితే ఈ నెలాఖరులో సమావేశాలు జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్కు పన్ను రేట్లలో మార్పులను సిఫారసు చేసే అధికారం ఉంది.ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’12 శాతం జీఎస్టీ శ్లాబ్లోని వస్తువుల వివరాలు..ప్రాసెస్డ్ ఫుడ్: పాలు, జున్ను, వెన్న, నెయ్యి, ఫ్రోజెన్ మీట్.డ్రైఫ్రుట్స్, గింజలు: బాదం, పిస్తా, అంజీర, ఖర్జూరంనూనెలు: ఫిష్ ఆయిల్, లానోలిన్, పౌల్ట్రీ కొవ్వు.టెక్స్టైల్, దుస్తులు: రూ.1,000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు, సింథటిక్ నూలుఎలక్ట్రానిక్స్: మొబైల్ ఫోన్లు, ప్రింటర్లు, కంప్యూటర్ ఉపకరణాలుట్రావెల్ & హాస్పిటాలిటీ: బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం, నాన్ ఏసీ హోటళ్లునిర్మాణ సామగ్రి: సిరామిక్ టైల్స్, శానిటరీ వేర్ -
14 నెలల గరిష్టానికి తయారీ రంగం
తయారీ రంగం జూన్లో బలమైన పనితీరు చూపించింది. ఈ రంగంలో పనితీరును తెలియజేసే హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్ నెలలో 58.4 పాయింట్లుగా నమోదైంది. మే నెలలో ఇది 57.6గా ఉంది. డిమాండ్ బలంగా ఉండడంతోపాటు కొత్త ఎగుమతి ఆర్డర్లు రావడం ఉత్పత్తి విస్తరణకు, ఉపాధి కల్పనకు దారితీసినట్టు హెచ్ఎస్బీసీ భారత ముఖ్య ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ తెలిపారు.ఇదీ చదవండి: 11 మంది టాప్ ఎక్స్పర్ట్లతో మెటా కొత్త ల్యాబ్తయారీ రంగంలో విస్తరణ ఏడాది కాలంలోనే గరిష్టంగా ఉన్నట్టు చెప్పారు. కంపెనీల నిల్వలు తగ్గుతున్నట్టు పేర్కొన్నారు. మార్కెటింగ్ చర్యలకుతోడు, ఎగుమతులు పెరగడం ఇందుకు అనుకూలించినట్టు హెచ్ఎస్బీసీ ఇండియా ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. బలమైన అమ్మకాలు తయారీ కంపెనీల్లో నియామకాల పెరుగుదలకు దారితీసినట్టు, రికార్డు స్థాయిలో ఉపాధి కల్పనకు దోహదపడినట్టు పేర్కొన్నారు. పీఎంఐ సూచీ 50 పాయింట్లకు పైన ఉంటే విస్తరణగాను, ఆ దిగువన నమోదైతే తగ్గినట్టుగాను పరిగణిస్తారు. -
ఎస్బీఐ కస్టమర్లకు డిజిటల్ దన్ను!
న్యూఢిల్లీ: ఎస్బీఐ గత దశాబ్ద కాలంలో చేపట్టిన డిజిటల్ అభివృద్ధి (పూర్తి స్థాయిలో డిజిటల్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం) కస్టమర్లకు ఎంతో ప్రయోజనం చేకూర్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశానికి ఎస్బీఐ సేవలు అందించడం ప్రారంభించి 70 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా చేసే ప్రయాణంలో ఎస్బీఐ ఇకముందూ కొత్త ఆవిష్కరణలతో ప్రజా సాధికారతకు చేయూతనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.‘‘23,000కు పైగా శాఖలు. 78,000 కస్టమర్ సరీ్వస్ పాయింట్లు (సీఎస్పీలు), 64,000 ఏటీఎంలతో ఎస్బీఐ ఎంతో బలమైన స్థానంలో నిలిచింది. ప్రతి భారతీయుడికి అచ్చమైన బ్యాంక్’’అని ఎక్స్ ప్లాట్ఫామ్పై సీతారామన్ పోస్ట్ చేశారు. 1.5 కోట్ల మంది రైతులను ఆదుకోవడంలో, 1.3 కోట్ల మంది మహిళా స్వయం సహాయక గ్రూపులకు, పీఎం స్వనిధి కింద 32 లక్షల మంది వీధి వర్తకులకు, 23 లక్షల మంది ఎంఎస్ఎంఈలకు, చేతివృత్తుల వారికి వివిధ పథకాల కింద సహకారం అందించడంలో ఎస్బీఐ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. 15 కోట్ల జన్ధన్ ఖాతాలు, 14.65 కోట్ల పీఎం సురక్షా బీమా యోజన, 1.73 కోట్ల అటల్ పెన్షన్ యోజన, 7 కోట్ల పీఎం జీవన్జ్యోతి బీమా యోజన లబ్ధిదారులకు ఎస్బీఐ సేవలు అందిస్తున్నట్టు చెప్పారు. 40 లక్షల ఇళ్లకు సౌర కాంతులు 2027 మార్చి నాటికి 40 లక్షల గృహాలకు సౌర వెలుగులు అందించనున్నట్టు 70వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ప్రకటించారు. సిబ్బంది, టెక్నాలజీ, సదుపాయాలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని తెలియజేస్తూ.. తద్వారా కోట్లాది మంది కస్టమర్లకు వేగవంతమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించనున్నట్టు చెప్పారు. కేవలం విస్తరణ దృష్టితో కాకుండా దీర్ఘకాలంలో ప్రతి ఒక్క భాగస్వామికి విలువ చేకూర్చేందుకు, మరింత సమానత్వంతో కూడిన, బలమైన భవిష్యత్ దిశగా దేశం సాధికారత సాధించేందుకు ఎస్బీఐ కృషి చేస్తుందని ప్రకటించారు. రూ.66 లక్షల కోట్ల బ్యాలెన్స్ïÙటు, 52 కోట్లకు పైగా కస్టమర్లతో ఎస్బీఐ.. సుస్థిరత, డిజిటల్ ఆవిష్కరణలు, సమ్మిళిత వృద్ధిపై దృష్టితో ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెడుతున్నట్టు తెలిపారు. ఎస్బీఐ 1955 జూలై 1న సేవలు ప్రారంభించడం గమనార్హం. -
జీఎస్టీ వసూళ్లు భళా!
న్యూఢిల్లీ: స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జూన్లో రూ. 1.84 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్లో నమోదైన రూ. 1,73,813 కోట్లతో పోలిస్తే ఇది 6.2 శాతం అధికం. ఈ ఏడాది మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ. 2.01 లక్షల కోట్లు. ఏప్రిల్లో ఇవి రికార్డు స్థాయి గరిష్టమైన రూ. 2.37 లక్షల కోట్లకు ఎగిశాయి. ‘నిబంధనల భారాన్ని తగ్గించి, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు వ్యాపారాల నిర్వహణను గణనీయంగా మెరుగుపర్చేందుకు జీఎస్టీ దోహదపడింది.ఈ ప్రస్థానంలో సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేలా రాష్ట్రాలను కూడా సమాన భాగస్వాములుగా చేయడంతో పాటు ఆర్థిక వృద్ధికి శక్తివంతమైన చోదకంగా మారింది‘ అని జీఎస్టీని ప్రవేశపెట్టి ఎనిమిదేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.జూన్ గణాంకాల ప్రకారం .. ⇒ జూన్లో దేశీయ లావాదేవీలపై జీఎస్టీ వసూళ్లు 4.6 శాతం పెరిగి రూ. 1.38 లక్షల కోట్లకు, దిగుమతులపై రూ. 11.4 శాతం పెరిగి రూ. 45,690 కోట్లకు చేరాయి. ⇒ స్థూల కేంద్ర జీఎస్టీ ఆదాయాలు రూ. 34,558 కోట్లుగా, రాష్ట్ర జీఎస్టీ ఆదాయాలు రూ. 43,268 కోట్లుగా, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 93,280 కోట్లుగా, సెస్సుల నుంచి ఆదాయం రూ.13,491 కోట్లుగా నమోదయ్యాయి. ⇒ జూన్లో మొత్తం రిఫండ్లు 28 శాతం పెరిగి రూ. 25,491 కోట్లకు, నికర జీఎస్టీ వసూళ్లు 3.3 శాతం పెరిగి రూ. 1.59 లక్షల కోట్లకు చేరాయి.ఐదేళ్లలో డబుల్...⇒ 2024–25లో రూ.22.08 లక్షల కోట్లు ⇒ 2020–21లో ఇవి రూ.11.37 లక్షల కోట్లే ⇒ 150 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారులువస్తు సేవల పన్ను రూపంలో (జీఎస్టీ) ఆదాయం గత ఐదు ఆర్థిక సంవత్సరాల కాలంలో రెట్టింపైనట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద జీఎస్టీ రూపంలో రూ.22.08 లక్షల కోట్ల ఆదా యం సమకూరింది. అంతకుముందు ఆర్థి క సంవత్సరం (2023–24)లో ఆదాయం రూ.20.18 లక్షల కోట్లతో పోల్చితే 9.4 శాతం పెరిగింది. కాగా, 2017 జూలై 1న తొలిసారిగా ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల వ్యవధిలో జీఎస్టీ వసూళ్లు రూ.7.40 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం రూ.11.37 లక్షల కోటత్లో పోల్చితే రెట్టింపైంది.2022–23 సంవత్సరంలో రూ.18.08 లక్షల కోట్లు, 2021–22లో రూ.14.83 లక్షల కోట్ల ఆదాయం వసూలైంది. 2024–25 సంవత్సరంలో నెలవారీ సగటు ఆదాయం రూ.1.84 లక్షల కోట్ల చొప్పున ఉంది. 2023–24లో ఇది 1.68 లక్షల కోట్లుగా ఉంది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రాగా, 8 వసంతాలను పూ ర్తి చేసుకుంది. ఈ ఎనిమిదేళ్లలో జీఎస్టీ కింద పన్ను చెల్లింపుదారులు 65 లక్షల నుంచి 1.51 కోట్లకు పెరిగారు. 17 రకాల స్థానిక పన్నులు, 13 రకాల సెస్సుల స్థా నంలో 5 రకాల పన్ను శ్లాబులతో జీఎస్టీ ని తీసుకురావడం తెలిసిందే. 2025 ఏప్రిల్ నెలకు వసూలైన రూ.2.37 లక్షల కోట్లు నెలవారీ అత్యధిక రికార్డుగా ఉంది. -
ఆదుకున్న ఆర్బీఐ భారీ డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 0.8 శాతంగా (రూ.13,163 కోట్లు) ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రకటించింది. ఆర్బీఐ నుంచి రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ రావడం ఇందుకు అనుకూలించింది. డివిడెండ్, ప్రాఫిట్స్ కింద ప్రభుత్వం రూ.2.78 లక్షల కోట్లను అందుకున్నట్టు సీజీఏ తెలిపింది.2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ద్రవ్యలోటు జీడీపీలో 4.4 శాతం (రూ.15.69 లక్షల కోట్లు)గా ఉంటుందని బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. క్రితం ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 3.1 శాతంగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వరకే చూస్తే ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 11.9 శాతం (రూ.1.86 లక్షల కోట్లు)గా ఉండడం గమనించొచ్చు.ఏప్రిల్, మే నెలలకు కలిపి రూ.3.5 లక్షల కోట్ల పన్నుల రూపంలో, రూ.3.56 లక్షల కోట్లు పన్నేతర ఆదాయం రూపంలో సమకూరింది. నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ రూపంలో రూ.25,224 కోట్లు వచ్చింది. వ్యయాలు రూ.7.46 లక్షల కోట్లుగా ఉన్నాయి. -
వస్తు సేవల పన్ను విజయాల పరంపర
భారత్లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను జులై 1, 2017న ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక ఏకీకరణ దిశగా సాహసోపేతమైన అడుగు పడిందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల తరువాత 2025లో జీఎస్టీ విధానం దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పన్ను సంస్కరణల్లో ఒకటిగా నిలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, పారదర్శకతను పెంచడం, వృద్ధిని పెంపొందించేందుకు విలువ ఆధారిత పన్నులు(వ్యాట్) స్థానంలో జీఎస్టీని ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అప్పటి నుంచి నేటి వరకు జీఎస్టీ సాధించిన కొన్ని విజయాల గురించి తెలుసుకుందాం.ఒకే దేశం, ఒకే పన్నుజీఎస్టీ అమలు ద్వారా 17 వేర్వేరు పన్నులు, 13 సెస్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. దాంతో గతంలో రాష్ట్రాల్లో ఉన్న పరోక్ష పన్నుల భారం తొలగిపోయింది. ఈ సమన్వయం ఒక ఉమ్మడి జాతీయ విధానాన్ని సృష్టించింది. లాజిస్టిక్స్ ఖర్చులను గణనీయంగా తగ్గించింది. రాష్ట్రాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేసింది.రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 9.4 శాతం పెరిగి చరిత్రాత్మకంగా రూ.22.08 లక్షల కోట్లకు చేరుకున్నాయి. బలమైన యంత్రాంగాలు, భారతదేశం క్రమంగా విస్తరిస్తున్న ఆర్థిక కార్యకలాపాల కారణంగా నెలవారీ వసూళ్లు ప్రస్తుతం సగటున రూ.1.84 లక్షల కోట్లుగా ఉంది.ట్యాక్స్ నమోదులో పెంపుఏప్రిల్ 2025 నాటికి జీఎస్టీ 1.51 కోట్లకు పైగా యాక్టివ్ రిజిస్ట్రేషన్లను కలిగి ఉంది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్లు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్.. వంటివాటిని పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా దేశాన్ని మరింత పారదర్శక ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు.డిజిటల్ ఫైలింగ్జీఎస్టీ విధానం పన్ను సమ్మతిని మరింత సులభతరం చేసింది. కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్లు, క్యూఆర్ఎంపీ (క్వార్టర్లీ రిటర్న్స్ విత్ మంత్లీ పేమెంట్) వంటి పథకాలతో రిటర్నులను దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ముఖ్యంగా ఈ విధానాల ద్వారా చిన్న, మధ్యతరహా సంస్థలకు ఎంతో మేలు జరుగుతోంది.సహకార విధానంకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పన్నుల వ్యవస్థను నడిపించేలా జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటి వరకు 55కి పైగా సమావేశాలు నిర్వహించింది. ఉమ్మడి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వేదిక సహకారాన్ని పెంపొందించడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక అవసరాలను తీర్చేలా వీలు కల్పించింది.ఇదీ చదవండి: అత్యంత కుబేరులున్న నగరాల జాబితా విడుదలసవాళ్లు లేవా..జీఎస్టీ పన్ను వ్యవస్థలో పెనుమార్పులు తీసుకువచ్చినప్పటికీ రేట్ల సరళీకరణ, కాంప్లయన్స్ లోపాలను పరిష్కరించడం, ఐటీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి సవాళ్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, ఈ వ్యవస్థ మరింత సమర్థవంతమైన, ఏకీకృత, పారదర్శక పన్ను విధానానికి పునాది వేస్తుంది. -
భారత్-అమెరికా వాణిజ్యం ఒప్పందం కుదిరేనా?
అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఈ వారంలోనే ఖరారు చేసేందుకు భారత్ చొరవ చూపుతోంది. ఈమేరకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ డీల్ పూర్తయితే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికా-ఇండియా మధ్య కుదిరే తొలి కీలక ఒప్పందం అవుతుంది. ఇప్పటికే యూఎస్ చైనాతో వాణిజ్యం ఒప్పందంపై ముమ్మరంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇండియా- యూఎస్ మధ్య చర్చలు కీలక దశలో ఉన్నందున భారత సంధానకర్తలు జూన్ 27న ముగిసిన రెండు రోజుల పర్యటనను మరింతకాలం పొడిగించినట్లు తెలుస్తుంది.భారత వస్తువులపై అమెరికా 26% పరస్పర సుంకం విధించనున్న నేపథ్యంలో జులై 9 లోపు ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయాలని ఇరు పక్షాలు చూస్తున్నాయి. ఈ సుంకాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్లో మొదట ప్రకటించి 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇప్పటికే ఒప్పందంపై అనేక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ కీలకంగా కొన్నింటిపై విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. వ్యవసాయం, జన్యుమార్పిడి (జీఎం) పంటలు, పాల ఉత్పత్తుల్లో మార్కెట్ యాక్సెస్ సహా కొన్ని సున్నితమైన రంగాలపై రాజీపడే ప్రసక్తే లేదని భారత అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ‘ఇండియాలో సమయం విలువ తెలియని వారే ఎక్కువ’ఈ అంశాలు భారతీయ రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయి. వీరిలో చాలా మంది చిన్న, సన్నకారు రైతులున్నారు. భారత్కు భారీ నష్టం వాటిల్లే పనులు అధికారులు చేయబోరని, ఈ అంశాల్లో భారత్ వైఖరి స్పష్టంగా ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. జన్యుమార్పిడి పంటలు, పశువుల దాణా, పాడి, వ్యవసాయ ఉత్పత్తుల శ్రేణిలో భారత మరింత వెసులుబాటు కల్పించాలని యూఎస్ ఒత్తిడి తెస్తోంది. పారిశ్రామిక వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు, పెట్రోకెమికల్స్, వైన్లపై సుంకాలను తగ్గించాలని అమెరికా కోరుతోంది.లేబర్ ఇంటెన్సివ్ రంగాలకు ఉపశమనంమరోవైపు టెక్స్టైల్స్, లెదర్ గూడ్స్, జెమ్స్ అండ్ జువెలరీ, కెమికల్స్, ప్లాస్టిక్స్, రొయ్యలు, నూనెగింజలు, ద్రాక్ష, అరటి వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకం రాయితీల కోసం భారత్ చర్చలు జరుపుతోంది. ట్రంప్ ప్రకటించిన అదనపు 26% సుంకాల నుంచి పూర్తి మినహాయింపు కోసం భారతదేశం ఒత్తిడి తెస్తోంది. అయినప్పటికీ బేస్లైన్ 10% సుంకం అమలులో ఉంది. విస్తృత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ)లో భాగంగా తొలి విడత బహుళ రంగాలను కవర్ చేయాలని భావిస్తున్నారు. మరింత వివరణాత్మక చర్చలు అక్టోబర్ వరకు కొనసాగుతుండటంతో మధ్యంతర ఒప్పందాన్ని దశలవారీగా రూపొందించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.